dangerous
-
ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు
మీరు సముద్రంలో ఎప్పుడైనా చతుర్భుజాకారపు అలలను(Square Waves) గమనించారా? వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారా? అయితే ఆ అలల గురించి తెలిస్తే వణికిపోతారు. సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన అలలలో చదరపు అలలు ప్రధానమైనవి. వీటిని స్క్వేర్ వేవ్స్, క్రాస్ సీ లేదా గ్రిడ్ వేవ్స్ అని కూడా అంటారు. ఇవి అత్యంత అరుదుగా ఏర్పడినప్పటికీ, ఎంతో శక్తివంతమైనవి. సముద్రంలో చాలావరకూ అలలు ఒడ్డుకు చేరుకున్నాక తీరప్రాంతానికి అడ్డంగా , సమాంతరంగా వీడిపోతాయి. అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలోని సముద్రాలలో నీటి ఉపరితలంపై చదరంగం బోర్డు లాంటి అలలు ఏర్పడటం అరుదుగా జరుగుతుంటుంది. పై నుండి ఈ అలను చూస్తే, చతురస్రాకారపు అలలను ఏర్పరిచేవిధంగా నీటి అడుగున ఏదో గ్రిడ్ ఉన్నట్లు అనిపిస్తుంది. సముద్ర తీరంలోని లైట్హౌస్(Lighthouse) లేదా కొండప్రాంతాల నుంచి సముద్రంపైకి డ్రోన్ను ఎగురవేసినపపుడు సముద్రంలో ఇటువంటి అలలను గుర్తించవచ్చు. One of the most dangerous wave in ocean the Square Waves. These are also known as cross-sea or grid waves. If you see them, get out of the water. Though rare, they are associated with strong and powerful rip tides. pic.twitter.com/davAmfTNbZ— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 2, 2025సముంద్రంలోని నీటి అడుగున జరుగుతున్న ఏ పరిస్థితుల కారణంగానూ ఈ అలలు ఏర్పడవు. సముద్రంలోని నీరు కదులుతున్న తీరుతెన్నులను అనుసరించి ఈ స్క్వేర్ వేవ్స్ ఏర్పడతాయి. రెండు సముద్రాల ఖండన సమయంలో ఈ విధమైన చదరపు తరంగాలు ఏర్పడతాయి. ఆ ప్రాంతంలోని వాతావరణ స్థితిగతుల(Weather conditions) కారణంగానూ ఇలాంటి అలలు ఏర్పడతాయి. రెండు వ్యతిరేక అలలు ఢీకొన్నప్పుడు, ఒక ప్రత్యేకమైన నమూనాలో అల ఉద్భవిస్తుంది. చతురస్రాకార అలల రూపం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఆ అలులు ఎంతో ప్రమాదకరమైనవి.సముద్రంలో చతురస్రాకారను అలలు కనిపిస్తే, వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు. అనుభవజ్ఞులైన ఈతగాళ్లు కూడా ఇటువంటి అలలకు దూరంగా ఉండాలి. ఈ అలలు పడవ ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ అలలు ప్రపంచవ్యాప్తంగా పలు బీచ్లలో కొద్ది నిమిషాల్లో కనిపించి అదృశ్యమవుతుంటాయి. చతురస్రాకార అలలు ఫ్రాన్స్లోని ఐల్ డి రేలో తరచూ కనిపిస్తుంటాయి. దక్షిణ పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా ఇవి కనిపిస్తుంటాయి.ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ -
హెచ్ఎంపీవీ వైరస్ అంత ప్రమాదకరమైనదేమీ కాదు
సుల్తాన్బజార్: హ్యూమన్ మెటాప్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ ఒక ఫ్లూ వంటిదని, సాధారణ నియమాలు పాటిస్తే తగ్గిపోతుందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్రనాయక్ పేర్కొన్నారు. ఈ వైరస్ చిన్నపాటి లక్షణాలతో వచ్చే వైరస్ అన్నారు. దానిని నియంత్రిస్తే ఎలాంటి ప్రమాదం లేదన్నారు. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపే ఒక రకమైన వైరస్ అన్నారు. హెచ్ఎంపీవీని మొదట 2001లోనే గుర్తించారని, ఇదేమీ కొత్త వైరస్ కాదన్నారు. అధిక జనాభా ఉన్న ప్రాంతాలలో ఇది సోకుతుందని.. మన రాష్ట్రంలో ఈ లక్షణాలు ఏమీ లేవన్నారు. హెచ్ఎంటీవీ లక్షణాలు తేలికపాటి జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల వరకు ఉంటాయని రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బందుల్లాంటి సాధారణ లక్షణాలు ఉంటాయని ఆయన వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్ఎంపీవీని గుర్తించడానికి పీసీఆర్ పరీక్ష, యాంటిజెన్ డిటెక్షన్, సిరాలజికల్ పరీక్షలు చేయవచ్చన్నారు. దీని నివారణ కోసం తరచుగా చేతులు కడుక్కోవడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలును ఉపయోగించడం, అస్వస్థతగా ఉన్న వారి నుంచి దూరంగా ఉండడం లాంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ కాలంలో అన్ని వసతులు సౌకర్యాలతో సమర్థంగా ఉందన్నారు. ఈ వ్యాధి అంత ప్రమాదకరమైనది కాదని, చలికాలంలో వచ్చే చిన్నపాటి ప్లూగా ఉంటుందని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని రవీంద్ర నాయక్ సూచించారు. -
మరి చైనా వైరస్ సార్!
-
ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్లు.. కరోనాకు ముందే..
చైనాలో పుట్టిన హ్యూమన్ మెటా నిమో వైరస్(హెచ్ఎంపీవీ) ఇప్పుడు భారత్ను తాకింది. కరోనాను మరచిపోకముందే హెచ్ఎంపీవీ కేసులు భారత్లో నమోదవుతుండటంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వైరస్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ వైరస్కు ముందే ప్రపంచంలో ఎన్నోవైరస్లు ఉన్నాయి. అవి వివిధ కాలాల్లో జనాలను వణికించాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు ఆ వైరస్ల కట్టడికి పలు చర్యలు చేపట్టాయి.ప్రపంచంలో దాదాపు 3 లక్షల 20 వేల రకాల వైరస్లున్నాయి. ఈ వైరస్లలో అత్యంత ప్రమాదకరమైనవి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కరోనా వైరస్ కంటే ముందు ఏఏ వైరస్లు ప్రపంచాన్ని వణికించాయనే విషయానికొస్తే..రోటా వైరస్రోటా వైరస్ను చైల్డ్ కిల్లర్ వైరస్(Child killer virus) అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పిల్లల ప్రాణాలను హరిస్తోంది. ఇది నవజాత శిశువులు, 6 నుండి 8 ఏళ్ల వయసు గల పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.స్మాల్ పాక్స్దీనిని మశూచి అని అంటారు. ప్రపంచంలోని ఇతర వైరస్లకు మించి 30 నుండి 50 కోట్ల మంది మరణాలకు ఇది కారణంగా నిలిచింది. ఈ వైరస్ పునరుత్పత్తి సంఖ్య 3.5 నుండి 6 మధ్య ఉంటుంది. అంటే ఈ వైరస్ సోకిన వ్యక్తి నుంచి మూడు నుంచి ఆరుగురికి తిరిగి వైరస్ సోకుతుంది. ఈ వైరస్ మరణాల రేటు(Mortality rate) 90 శాతం. అయితే టీకా ద్వారా, ఈ వైరస్ను సమూలంగా నిర్మూలించారు.తట్టుదీనిని మీజిల్స్ అని కూడా అంటారు. ఇది గత 150 ఏళ్లలో దాదాపు 20 కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. గతంలో ఈ వ్యాధి ప్రతి ఏటా సుమారు 2 లక్షల మందిని బలితీసుకుంది. అయితే ఈ వైరస్ను వ్యాక్సినేషన్ ద్వారా నియంత్రించారు. మీజిల్స్ వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఈ వైరస్ 18 మందికి సోకే అవకాశముంది.డెంగ్యూదోమల వల్ల డెంగ్యూ వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్ను ప్రపంచంలోని 110 దేశాలలో కనుగొన్నారు. ఇది ప్రతి సంవత్సరం సుమారు 10 కోట్ల మందికి సోకుతోంది. వారిలో 20 వేల మంది మరణిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంటారు.ఎల్లో ఫీవర్(Yellow fever)ఈ వైరస్ సోకిన బాధితుడు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. బాధితుని ముక్కు, కళ్ళు, నోటి నుంచి రక్తస్రావం జరుగుతుంది. ఈ స్థితికి చేరుకున్న రోగులలో 50 శాతం మంది 7 నుండి 10 రోజుల్లో ప్రాణాలు కోల్పోతారు. ఇప్పటి వరకూ ఎల్లోఫీవర్ ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మందికి సోకింది. ఈ వైరస్ కారణంగా 30 వేల మంది మృతిచెందారు.ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా)ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఫ్లూ కారణంగా మరణిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన స్పానిష్ ఫ్లూ 10 కోట్ల మందిని బలితీసుకుంది.రేబిస్పురాతన కాలం నుండి రాబిస్ను ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణిస్తున్నారు. గబ్బిలం లేదా కుక్క కాటు వల్ల రేబిస్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది మరణిస్తున్నారు. రేబిస్ మరణాలు ఎక్కువగా ఆఫ్రికా, ఆగ్నేయాసియాలలో సంభవిస్తున్నాయి.హెపటైటిస్-బీ అండ్ సీహెపటైటిస్ బీ వల్ల ఏటా 7 లక్షల మంది మృతిచెందుతున్నారు. ప్రస్తుతం ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటిగా నిలిచింది. ఈ వైరస్ తొలుత శరీరంలోని కాలేయంపై దాడి చేస్తుంది. దీనికి తగిన చికిత్స అందుబాటులో లేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది హెపటైటిస్ సీ కారణంగా మరణిస్తున్నారు.ఎబోలా- మార్బర్గ్ వైరస్ఎబోలా- మార్బర్గ్ వైరస్లు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్లుగా గుర్తించారు. ఈ వైరస్ల నియంత్రణకు ఇంకా చికిత్స గానీ, వ్యాక్సిన్ను గానీ అభివృద్ధి చేయలేదు. అయితే ఈ వైరస్ల మరణాల రేటు 90 శాతం వరకు ఉంది. ఈ రెండు వైరస్ల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. వీటి బారిన పడిన బాధితుడు రక్తస్రావ జ్వరం, అవయవ వైఫల్యం లాంటి సమస్యలను ఎదుర్కొంటాడు.హెచ్ఐవీ, ఎయిడ్స్నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది హెచ్ఐవి వైరస్తో బాధపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం గత 30 ఏళ్లలో ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మంది ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2.5 కోట్ల మంది ఎయిడ్స్ కారణంగా మృతిచెందారు.ఇది కూడా చదవండి: ‘చొరబాట్ల’కు మూడు రూట్లు.. వివిధ రేట్లు.. ఏజెంట్ల మాయాజాలం ఇదే -
ప్రపంచ విషపూరిత నదుల్లో 23వ స్థానంలో మూసీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విషపూరిత నదుల్లో హైదరాబాద్లోని మూసీ 23వ స్థానంలో ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మూసీ చుట్టుపక్కల ఉన్న బోర్ వాటర్ కూడా కలుíÙతమైందని, అందుకే దాని పక్కన ఉన్న ప్రజలను తరలించాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. సోమవారం గాం«దీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ పక్కన ఉంటున్న వాళ్ల శరీరంలో హెవీ మెటల్స్ ఉన్నట్లు తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పక్కన తాను నివాసం ఉన్నానని, ఆ బాధలు ఏంటో తనకు తెలుసునని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. మూసీ, హైడ్రాపై కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ చేయలేని పనిని సీఎం రేవంత్రెడ్డి చేస్తున్నారన్నారు. కేటీఆర్ ఫామ్హౌస్ కట్టుకొని హాయిగా ఉండొచ్చునని, ఇటలీ నుంచి వచ్చే నీళ్లు కేటీఆర్ తాగుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు శనిలాగా దాపురించారని శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. -
రీల్స్ పిచ్చి.. బావి అంచున కూర్చొని పిల్లాడితో మహిళ వేషాలు
యువతతోపాటు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో రీల్స్పిచ్చి రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో పాపులర్ కావాలని వింత చేష్టలతో రెచ్చిపోతున్నారు. అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేసి ప్రాణాలను సైతం ప్రమాదంలో నెట్టేస్తున్నారు. తాజాగా ఓ మహిళ సైతం రీల్స్ కోసం తన ప్రాణాలే కాకుండా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టింది.బావి అంచున ప్రమాదకరంగా కూర్చొన్న మహిళ.. ఒక చేతితో పిల్లాడిని పట్టుకొని రీల్ చేసింది. పాటకు అనుగుణంగా డ్యాన్స్ కదలికల కోసం బాలుడిని నిర్లక్ష్యంగా పలుమార్లు చేతులు మార్చింది. బావిలోకి ప్రమాదకరంగా వేలాడిన ఆ బాలుడు ఆమెను గట్టిగా పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అతడి శరీరం బావి పైన గాలిలో వేలాడుతూ ఉంది.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. పిల్లవాడి రిస్క్ గురించి పట్టించుకోని ఆ మహిళ రీల్ పిచ్చిపై నెటిజన్లు మండిపడున్నారు. పిల్లవాడి గురించి పట్టించుకోని ఆమె రీల్కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్ వ్యామోహంలో బాలుడి ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు.Family court in custody case: Only mother can love child more. Even more than father.Le mother:#ParentalAlienation pic.twitter.com/mc1kl5ziFj— Raw and Real Man (@RawAndRealMan) September 18, 2024 -
వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్కు మించి బ్యాక్టీరియా
వంట చేయడం ఒక ఎత్తయితే...అంట్ల గిన్నెలను తోమడం, కడగడం అంతకు రెండింతలు. శుభ్రంగా తోమాలి. ఎలాంటి మరకలు లేకుండా కడగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆరోగ్యానికి చేటే. మన ఇంటిల్లు ఎంత శుభ్రంగా ఉంటే మన ఇంటికి, ఒంటికీ అంత మంచిది. కానీ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే వంట గిన్నెల్ని శుభ్రం చేసే స్క్రబ్బర్, స్పాంజ్ల కారణంగా ప్రాణాంతక వ్యాధులు సోకవచ్చని తాజా పరిశోధనలో తేలింది. ప్రస్తుతం కాలంలో వంట పాత్రల్ని శుభ్రం చేసేందుకు ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్ని, లేదా స్పాంజ్ని వాడుతూ ఉంటాం కదా. ఈ డిష్ స్క్రబ్బింగ్ స్పాంజ్ హానికరమైన బాక్టీరియాకు హాట్స్పాట్ అంటే నమ్ముతారా? ఇది టాయిలెట్ బౌల్ కంటే ఎక్కువ ప్రమాదాలను కలిగిస్తుందని తాజా స్టడీ తేల్చింది. కిచెన్ స్పాంజ్లు ఎందుకు ప్రమాదకరం?డ్యూక్ యూనివర్శిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీర్లు స్పాంజ్లు తేమతో కూడిన నిర్మాణం కారణంగా సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని అందిస్తాయని ధృవీకరించారు. ఒక చిన్న క్యూబిక్ సెంటీమీటర్ స్క్రబ్బర్లో 54 బిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. 5 శాతం వరకు సాల్మొనెల్లాను కలిగి ఉండవచ్చు. దీంతో తేలికపాటి గ్యాస్ట్రోఎంటెరిటిస్ మాత్రమే కాకుండా మెనింజైటిస్, న్యుమోనియా, అధిక జ్వరాలు, బ్లడీ డయేరియా, ప్రాణాంతక బ్లడ్ పాయిజిన్లాంటి తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయి. ఫుడ్ పాయిజనింగ్తో ఆహార సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటికి చికిత్స చేయకపోతే ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అంతేకాదు అందులో ఉండే రకరకాల బ్యాక్టీరియాలతో కిడ్నీ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఈ స్పాంజ్లలో వృద్ధి చెందే ఈ-కొలి కారణంగా మూత్రపిండ వైఫల్య ప్రమాదం కూడా ఉంది. దీన్నే హిమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ అంటారు. ఇది ఆహార కాలుష్యం వల్ల వస్తుంది. స్టెఫిలోకాకస్ అనేది స్పాంజ్లలో కనిపించే మరొక వ్యాధికారకం. చర్మ వ్యాధులకు, ఇంపెటిగో, సెల్యులైటిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. పరిష్కారం ఏమిటి? ఏం చేయాలి. పాత్రలను శుభ్రం చేసే స్పాంజ్లు,స్క్రబ్బర్లు తరచుగా మారుస్తూ ఉండాలి. అలాగే ఏరోజుకారోజు శుభ్రంగా క్లీన్ చేయాలి. తడి లేకుండా బాగా పిండేసి, తర్వాత వాటిని గాలిలో ఆరనివ్వాలి. మాంసం కంటైనర్లు, ఇతర పాత్రలు..ఇలా అన్నింటికి ఒకటే కాకుండా వేరు వేరువస్తువులను శుభ్రం చేయడానికి వేరు వేరు స్పాంజిని ఉపయోగించాలి. బాక్టీరియా ప్రమాదాన్ని నివారించేందుకు స్పాంజ్లను తడిపి రెండు నిమిషాలు మైక్రోవేవ్లో ఉంచాలి.డిష్ గ్లోవ్స్ ధరించడం వల్ల కలుషితమైన స్పాంజ్లతో వచ్చే చర్మ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించు కోవచ్చు. స్పాంజ్లకు ప్రత్యామ్నాయాలుప్లాస్టిక్ స్పాంజ్లను తరచుగా వాడి పారేయడం పర్యావరణ అనుకూలమైనది కాదు, కాబట్టి సెల్యులోజ్ ఆధారిత స్పాంజ్ లాంటి ప్రత్యామ్నాయాలుఎంచుకోవాలని పరిశోధకులు సూచించారు. స్పాంజ్లను ఉపయోగించడంలో అసౌకర్యంగా ఉన్నవారు, స్క్రబ్ బ్రష్లు, సిలికాన్ బ్రష్లు, సింగిల్ యూజ్ మెటల్ స్క్రబ్బీలు, డిష్వాషర్లు లాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలింటున్నారు. -
ప్రమాదకరంగా మారనున్న జలపాతాలు
ఉత్తరాఖండ్... దేశంలోనే అత్యంత అందమైన రాష్ట్రంగా పేరొందింది. ఇక్కడి ప్రకృతి రమణీయత ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకుల మదిని పులకింపజేస్తాయి. వేసవిలో ఇక్కడికి వచ్చి, జలపాతాల్లో జలకాలాటలు ఆడినవారు వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రుతుపవనాలు ఉత్తరాఖండ్ను తాకాయి. వేసవిలో ఎండ వేడిమి నుండి తప్పించుకునేందుకు ఉత్తరాఖండ్లోని నైనిటాల్, దాని పరిసర ప్రాంతాలకు వచ్చి, ఇక్కడి జలపాతాలలో స్నానం చేసినవారు ఇకపై ఈ జలపాతాలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి.ఉత్తరాఖండ్లోని ధోకనే జలపాతం నైనిటాల్కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వారు ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో ఇక్కడ నీరు అత్యధిక స్థాయిలో జాలువారుతుంది. అలాంటప్పుడు ఇక్కడ స్నానం చేయకూడదు. ఒడ్డున కూర్చుని స్నానం చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.ఉడ్ల్యాండ్ జలపాతం నైనిటాల్-కలాధుంగి రోడ్డులో ఉంది. స్థానికులు దీనిని మిల్కీ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. వర్షాకాలంలో ఇక్కడ నీటి ప్రవాహం వేగంగా ఉంటుంది. ఈ జలపాతం ఒక వాలులో ఉన్నందున పర్యాటకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జలపాతం కిందకు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని స్థానికులు చెబుతుంటారు.జిమ్ కార్బెట్ జలపాతం కలదుంగి-రామ్నగర్ రహదారిలో ఉంది. ఈ జలపాతం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ స్నానం చేయడం నిషిద్ధం. వర్షాకాలంలో ఇక్కడ నీటి పరిమాణం మరింతగా పెరుగుతుంది. జలపాతం సమీపంలోకి వెళ్లడం ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.భాలుగాడ్ జలపాతం నైనిటాల్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని అడవుల మధ్య అందమైన పర్వత మార్గాల్లో ట్రెక్కింగ్ ద్వారా ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. వేసవిలో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ జలపాతం ఎంత అందంగా కనిపిస్తుందో అంతే ప్రమాదకరంగా మారుతుంది. వర్షాకాలంలో ఈ జలపాతంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. ఈ జలపాతంలో స్నానానికి దూరంగా ఉండటం ఉత్తమం.దట్టమైన అడవుల మధ్య హిడెన్ జలపాతం ఉంది. వేసవిలో ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు. వర్షాకాలంలో ఈ జలపాతం అసాధారణ నీటిమట్టంతో ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. అందుకే వర్షాకాలంలో ఇటువైపు రాకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. -
ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే?
చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. అలాగని అన్ని చేపలూ తినడానికి పనికొచ్చేవి కాదు. చేపల్లో కొన్ని రకాలు విషపూరితమైనవి కూడా ఉంటాయి. ప్రపంచంలోని విషపూరితమైన చేపల్లోకెల్లా అత్యంత విషపూరితమైన చేప ‘స్టోన్ఫిష్’. ఇది ఎక్కువగా సముద్రం అడుగున ఉంటుంది. చూడటానికి అచ్చంగా రాయిలా కనిపిస్తుంది.సముద్రగర్భంలో డైవింగ్ చేసేవారికి తప్ప ఒడ్డున ఉన్నవారికి ఇది కనిపించడం చాలా అరుదు. డైవింగ్ చేసేవారు దీనిని చూస్తే చేప అనుకోరు. సముద్రం అడుగున ఉండే ఎన్నో రాళ్లలో ఇది కూడా ఒక రాయేనని పొరబడుతుంటారు. పొరపాటున దీనిపైన అడుగు వేసినా, తాకినా ప్రమాదం తప్పదు. స్కార్పియన్ఫిష్ జాతికి చెందినది ఈ స్టోన్ఫిష్.ఇది ఎక్కువగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూగినీ, ఆస్ట్రేలియా పరిధిలోని సముద్ర జలాల్లో కనిపిస్తుంది. దీని కాటు అత్యంత విషపూరితమైనది. ఇది కాటు వేస్తే గంటల తరబడి నొప్పితో విలవిలలాడాల్సి వస్తుంది. దీని కాటుకు విరుగుడు మందు కూడా ఇంతవరకు లేదు. ఒక్కోసారి దీని కాటు మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంది.ఈ సంగతి గురించి మీకు తెలుసా?‘మర్డర్’ అంటే హత్య అనే అర్థమే అందరికీ తెలుసు. అయితే, కాకుల గుంపును కూడా ‘మర్డర్’ అనే అంటారు.ఇవి చదవండి: ఇదేం చేప కాదు.. నీటిలో దిగితే దానికంటే తక్కువేం కాదు! -
ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటీ? ఇది ప్రమాదకరమా..?
స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో పలు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలను వాటికి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు కూడా. కానీ ఇప్పుడు ఏకంగా వాటి వాడకం వల్లే వేళ్ల సంబంధ సమస్యలొస్తున్నాయంటూ పలువురు ఊదరగొడుతున్నారు. నిపుణులు మాత్రం అది సాధారణ సమస్య అని కొట్టిపారేస్తున్నారు. ఈస్మార్ట్ ఫోన్లను అలా ఉపయోగిస్తేనే సమస్యలు వస్తాయంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు వైద్యులు. మరీ ఇంతకీ ఏంటీ ఐఫోన్ ఫింగర్..ఐఫోన్ ఫింగర్ అంటే..ఐఫోన్ ఫింగర్"ని "స్మార్ట్ఫోన్ పింకీ" అని కూడా అంటారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు పెద్దపెద్ద సైజుల్లో వస్తున్నాయి. వాటిని అరచేతిలో పట్టుకునేటప్పుడు ఫోన్ కింద చిటికెన వేలుతో నొక్కి పట్టుకోవడం సహజం. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోతోందని ఆందోళన చేస్తున్నారు కొందరూ. దీన్నే 'స్మార్ట్ ఫోన్ పింకీ' లేదా 'ఐఫోన్ ఫింగర్' అని అంటారు. ఈ ఆపిల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నప్పుడు భారం చిటికెన వేలుపై పడటంతో ఉంగరం వేలుకి దీనికి గ్యాప్ రావడం లేదా వంకరపోవడం వంటివి జరుగుతున్నాయని పలువురు టెక్ ఔత్సా హికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇది సాధారణ సమస్యే అని కొట్టిపారేస్తున్నారు. క్లీవ్ల్యాండ్ క్లినిక్కి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీటర్ ఎవాన్స్ చిటికెన వేళ్ల మధ్య గ్యాప్లు, వంకరపోవడానికి అదే కారణమని చెప్పలేమని అన్నారు. దీన్ని సాధారణ పింకీ అనాటమీ(చిటికెన వేలు సమస్య)గా చెబుతున్నారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఏప్రిల్ హిబ్బెలర్, రోలినాకు చెందిన హ్యాండ్ సర్జన్ డాక్టర్లిద్దరు సదరు సర్జన్ డాక్టర్ ఎవాన్స్ మాటలతో ఏకీభవించారు. ఐఫోన్, స్మార్ట్ పోన్ల వల్లే ఇది వస్తుందని అధికారిక నిర్థారణ కాలేదని అన్నారు. కానీ వారంతా ఫోన్కు సంబంధించిన కొన్ని అనారోగ్య పరిస్థితుల గురించి హెచ్చరించారు. అవేంటంటే..ఫోన్ సంబంధిత వైద్య పరిస్థితులుస్మార్ట్ వాడకం వల్ల "స్మార్ట్ఫోన్ ఎల్బో" వస్తుందని అన్నారు. వైద్యపరంగా దీన్ని క్యూబిటల్ టన్నెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. టక్స్ట్ టైప్ చేయడానికి ఎక్కువ వ్యవధిలో మోచేతిని 90 డిగ్రీలకు మించి వంచితే ఇది వస్తుందని వివరించారు. బహుశా ఇదే చిటికెన వేలుపై వస్తున్న మార్పులకు సంకేతాలు కూడా కాడొచ్చని అన్నారు. అందువల్లే నరాలు దెబ్బ తిని ఇలా చిటికెన వేలు వంకరపోవడం లేదా గ్యాప్ రావడం జరగుతుండవచ్చు అని అన్నారు. విపరీతంగా బొటనవేలుతో టెక్స్టింగ్ చేసేవాళ్లు మెడ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కోరారు. రోజంతా బొటనవేలుతో స్వైపింగ్, టైప్ చేయడం వంటివి చేస్తే ఈ సమస్యలు అధికమవుతాయని, పైగా అంతర్గతంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలను తీవ్రతరం చేసి బొటనవేలు స్నాయువులలో కొత్త సమస్యలను కలిగిస్తుందని తెలిపారు. ఇక్కడ మనిషి తల బరువు కనీసం 10 నుంచి 12 పౌండ్లు వరకు ఉంటుంది. స్మార్ట్ఫోన్ చూసేందుకు ఎప్పుడైతే తలను వంచుతామో అప్పుడు ఆ భారం అంతా మెడ కండరాలపై పడుతుంది. ఈ అదనపు ఒత్తిడి కండరాల నొప్పికి దారితీసి ఆర్థరైటీస్ వంటి సమస్యల్లో పెడుతుందని వివరించారు సర్జన్ ఎవాన్స్. (చదవండి: ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!) -
అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏది?
కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతిని చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది? ఎందుకు ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది? అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచు గాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు రెండు కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంది. రక్తాన్ని గడ్డకట్టే చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో వేసవి కాలంలో ఆరు నెలల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4,892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారత జెండాను ఎగురవేశారు. ఈ శిఖరం పర్వతారోహకులను అమితంగా ఆకర్షిస్తుంది. అంటార్కిటికాలో సౌత్ షెట్లాండ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సౌత్ షెట్లాండ్ దీవుల్లోని పరిశోధనా కేంద్రాలకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు వస్తుంటారు. ఈ ఖండంలో డ్రేక్ పాసేజ్, ఫాక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా పరిగణిస్తారు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడానికి వేసవి కాలం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. -
గ్రీన్ టీ మంచిదని తాగేస్తున్నారా?
ఇటీవల కాలంలో ఆరోగ్య స్ప్రుహ బాగా ఎక్కువయ్యంది. అందులో భాగంగా పాల ఉత్పత్తులకు సంబంధించిన కాఫీ, టీలను దూరంగ ఉంచుతున్నారు. మంచి ఫిట్నెస్ కోసం అని గ్రీన్ టీ, లెమన్ టీ వంటి వాటిని తెగ సేవించేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని ఇలా మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అదేంటీ గ్రీన్టీ చెడు కొలస్ట్రాల్ని కరిగించేస్తుంది కదా! మరీ ఇదేంటి అని సందేహిస్తున్నారా?. ఐతే ఇలా ఎందుకన్నారో సవివరంగా తెలుసుకోండి.! ఎదురయ్యే దుష్పలితాలు.. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే దీనిలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఫలితంగా కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలకు దారితీయొచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది. గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు కూడా పెరుగుతాయి. మితిమీరిన గ్రీన్ టీ మీ జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల మీ రక్తపోటు కూడా తగ్గిపోతుంది రోజూ 6 కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం తగ్గిపోతుంది. ఇది కడుపులో ఎసిడిటీ సమస్యను పెంచి కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దారితీస్తుంది. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే. అనుసరించే ముందు వీ వ్యక్తిగత వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా బాస్మతి రైస్!) -
Supreme Court Of India: బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుంది
న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు నిర్ణయించడం ప్రమాదకరమైన బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీలు, ఎస్టీల్లో ఉప వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా అనే అంశంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందజేసే క్రమంలో రాష్ట్రాలు ఇతరులను వదిలేయరాదని తెలిపింది. ఎస్సీలు, ఎస్టీలు సజాతీయ సమూహాలు అయినందున వీరిలో వెనుకబడిన, బలహీన కులాలకు కోటా కోసం వారిని మళ్లీ వర్గీకరించలేమంటూ 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. -
Kerala CM Pinarayi Vijayan: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: కేంద్రం పెత్తందారీ పోకడలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ కేరళలోని వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్) గురువారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన చేపట్టింది. కేంద్రం తీరుతో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సమస్యలతోపాటు, పరిపాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఇబ్బందికరంగా మారిందని విజయన్ చెప్పారు. రుణాలను, గ్రాంట్లను సరిగా ఇవ్వడం లేదన్నారు. తమది రాజకీయ పోరాటమెలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాలకు సమాన గౌరవాన్ని, న్యాయమైన వాటాను ఇవ్వాలన్న పోరాటానికి ఇది ఆరంభమని విజయన్తో పాటు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్మాన్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కార్యక్రమంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాజ్యసభ సభ్యుడు సిబల్, డీఎంకే నేతలు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల ఆర్థిక సమస్యలకు కేంద్రమే కారణమన్న ఎల్డీఎఫ్ వాదనను తాము అంగీకరించడం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
‘బట్’ అనే మాట ఉంది చూశారూ.. బహు కంత్రీది.. కానీ!
మనిషి మనసులోని భావాలను తెలుసుకోవడానికి భాషే మార్గం. ఆ భాషను సక్రమంగా, తెలివిగా ఉపయోగించేవాళ్లు, ఉపయోగించగలిగేవాళ్లు ఉన్నత స్థానాలకు చేరతారు. ఉపయోగించలేని వాళ్లు మామూలు మనుషులుగా మిగిలిపోతారు. భాషలో కొన్ని వేల, లక్షల పదాలుంటాయి. వాటిలో ఒక ప్రమాదకరమైన పదం ‘కానీ’. అదేంటీ... ‘కానీ’ అనే పదం ఎలా ప్రమాదకరం? అనే డౌట్ మీకు రావచ్చు. ' ఇంట్రస్టింగ్ కథనం మీకోసం.... ‘‘కానీ’’ ఒక కంత్రీ పదం.../ మీరు తెలివైనవారు, కానీ... ♦ మీ డ్రెస్ బాగుంది, కానీ (but)... ♦ మీరు బాగా పాడుతున్నారు, కానీ (but)... ♦ మీ హెయిర్ స్టైల్ బాగుంది, కానీ (but)... ♦ ఒక ఫ్రెండ్ గా మీరంటే చాలా ఇష్టం... కానీ (but)... ♦ మీ సెన్స్ ఆఫ్ హ్యూమరంటే ఇష్టం.. కానీ (but)... ♦ చంపడం, చంపించడం తప్పే... కానీ (but)... ఇలా ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు మీరెలా ఫీలవుతారు? ఆ సమయంలో మీ మనసులో ఏమనిపిస్తుంది? ఈ విషయంపై మీరెప్పుడూ పెద్దగా ఆలోచించి ఉండరు. కానీ ఆ ‘కానీ’ అనే ఒక్క పదం ఆ వ్యక్తి ఇంటెన్షన్ ను పట్టిస్తుంది. అతను లేదా ఆమె నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పకనే చెప్పేస్తుంది. ‘కానీ’ ఒక లాండ్ మైన్... ‘కానీ’' అనే పదం ఒక లాంగ్వేజ్ ల్యాండ్ మైన్ లాంటిది. ఎందుకంటే... ఈ పదం దానికి ముందు ఉన్న వాక్యాన్ని తిరస్కరిస్తుంది. ఆ వాక్యంలో అతి ముఖ్యమైన విషయం ఆ తర్వాత వస్తుందనీ, దాన్ని అంగీకరించాలనీ చెప్తుంది. ఉదాహరణకు... ‘‘మీ డ్రెస్ బాగుంది, కానీ రెడ్ అయితే ఇంకా బాగుండేది..’’ అని ఎవరైనా చెప్పారంటే, మీ మనసు డ్రెస్ బాగుందనే విషయాన్ని తిరస్కరిస్తుంది, రెడ్ అయితే బాగుంటుందనే విషయాన్నే అంగీకరిస్తుంది. అంటే... మీ డ్రెస్ బాగుంది అని చెప్పడం అబద్ధమన్నమాట. ఆ మాట చెప్పలేక, బాగుందని చెప్పి, 'కానీ' అని సన్నాయి నొక్కులు నొక్కుతారన్నమాట. అలా తమకు కావాల్సిన, తమకు నచ్చిన అభిప్రాయాన్ని మీ మనసుపై రుద్దుతారన్నమాట. మీరు, మీ మనసు ఆ మోసాన్ని గ్రహించలేరు. అలా 'కానీ' అనే ఈ చిన్న పదం దుర్వినియోగమవుతుంది. ఎవరెలా వాడతారంటే... అనుభవజ్ఞులైన కార్పొరేట్ మేనేజర్లు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చినప్పటికీ, ఆపై 'కానీ' జోడించడం ద్వారా ప్రభావాన్ని దెబ్బతీస్తారు. ♦ మొత్తం మీద మీ పనితీరు బాగుంది, కానీ మీరు టైం పాటించాలి. ♦ మీరు ఆ ప్రాజెక్ట్ బాగా హేండిల్ చేశారు, కానీ కొంచెం స్పీడ్ పెంచాలి. కపుల్స్ తమ జీవిత భాగస్వాములను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పి, ఆపై 'కానీ' అనడంతో మొత్తం నాశనం చేస్తారు. ♦ ఇలా నీతో ఉండటం చాలా బాగుంది, కానీ నువ్వు శుభ్రంగా కనిపించాలి. ♦ నువ్వన్నా, నీ మాటలన్నా నాకు చాలా ఇష్టం, కానీ చాలా ఎక్కువ మాట్లాడతావు. తల్లిదండ్రులు వారి 'BUTs' ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల పిల్లల్లో ప్రతికూల స్పందనల్ని ప్రేరేపిస్తారు. ♦ నీ చేతిరాత బాగుంది, కానీ ఇంకా మార్కులు రావాలి. ♦ నీ స్పెల్లింగ్ బాగుంది, కానీ చేతిరాత బాగోలేదు. ఇలా వారు మెచ్చుకుంటున్నా, ‘కానీ’ మొత్తం అర్థాన్ని మార్చేస్తుంది. మీ మనసు ఆ 'కానీ..' ముందు ఉన్న ప్రశంసను తిరస్కరించి, దాని తర్వాత ఉన్న నెగెటివ్ నే స్వీకరిస్తుంది. 'అయితే' అనే పదం కూడా దాదాపు ఇలాంటి ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది. మరేం చెయ్యాలి? 'కానీ'ని 'అలాగే' అనే పదంతో భర్తీ చేయండి! ఇలా ఒక వారం రోజులు మీరు ప్రయత్నిస్తే... 'కానీ' బారినుంచి తప్పించుకోవచ్చు. ♦ ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, కానీ మీరు టీమ్ తో కలిసిపోవాలని కోరుకుంటున్నాను...’’ అనే వాక్యానికి బదులుగా ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, అలాగే మీరు టీమ్ తో కలిసిపోవాలని ఉండాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పండి. ♦ ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, కానీ ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పడానికి బదులుగా ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, అలాగే ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పండి. అయితే ఈ 'అలాగే' వాడకంతో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు దీన్ని ఎక్కువగా నొక్కిచెప్పినా, దానిని ఉపయోగించటానికి ముందు, తరువాత పాజ్ చేసినా, ఇది 'కానీ'లాంటి దుష్ప్రభావాన్నే చూపిస్తుంది. ‘కానీ’ ఉపయోగించాల్సిన పద్ధతి వాస్తవానికి, 'కానీ' అనే పదం ఎదుటి వ్యక్తి ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటే దాన్ని ఉపయోగించడంలో తప్పేమీ లేదు. అందువల్ల నెగెటివ్ విషయం స్థానంలో పాజిటివ్ ప్రత్యామ్నాయాన్ని నొక్కి చెప్పేటప్పుడు ఉపయోగించండి. ఉదాహరణకు... ♦ ‘‘మనం ఈ ప్రాజెక్టులో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నాము, కానీ మనం విజయం సాధించగలమని నాకు తెలుసు.’’ ♦ ‘‘మనం పూర్తిగా ఫెయిలయ్యాం, కానీ మన తప్పుల నుండి నేర్చుకొని ముందుకు సాగాలి.’’ ఇలా చెప్పినప్పుడు మనసు ఆ వాక్యాల్లోని మొదటి భాగాన్నిన తిరస్కరించి, ‘కానీ’ తర్వాతి భాగాన్ని స్వీకరిస్తుంది. మీరు చెప్పాలనుకున్నది నేరుగా వారి మనసును చేరుతుంది. కాబట్టి మీ 'కానీ' ఎక్కడుందో, ఎలా ఉపయోగిస్తున్నారో గమనించుకోండి. 'కానీ' ఉపయోగం గురించి బాగా తెలుసుకోవడం ద్వారా, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా, 'అలాగే' తో భర్తీ చేయడం ద్వారా మీరు కోరుకున్న ఫలితాలు సాధించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. -సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 -
చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే!
ప్రపంచంలో ఎక్కడైనా చాయ్ తాగాలంటే జేబులో డబ్బులుంటే సరిపోతుంది. చైనాలోని హువాషాన్ టీహౌస్లో చాయ్ తాగాలంటే మాత్రం జేబులో డబ్బులే కాదు, తగినంత గుండెధైర్యం, సాహసం కూడా ఉండాలి. ఎందుకంటే, ఇక్కడ చాయ్ తాగాలంటే, కొండ ఎక్కాల్సిందే! చైనాలోని షాంగ్జి ప్రావిన్స్లో ఉన్న హువా పర్వతం మీదకు వెళ్లే దారి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కొండ దారుల్లో ఒకటిగా పేరుమోసింది. ఈ కొండ మీద ఉన్న హువాషాన్ ఆలయానికి అనుబంధంగా చాయ్ హోటల్ ఉంది. తావో మతస్థులకు ఇది పవిత్ర ఆలయం. భక్తితో పాటు ధైర్యసాహసాలు ఉన్న తావో మతస్థులు ఈ కొండపైకెక్కి, ఇక్కడ వేడి వేడి చాయ్ సేవించి, సేదదీరుతుంటారు. సముద్ర మట్టానికి 2,154 మీటర్ల ఎత్తున ఉన్న పర్వత శిఖరం మీద వెలసిన ఈ చాయ్ హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న హోటల్గా ప్రసిద్ధి పొందింది. (చదవండి: దెయ్యాలు కట్టిన గుడి కాకన్మఠ్ టెంపుల్ !..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!) -
13 అడుగుల గిరినాగు అలజడి
ఎస్.కోట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో రాత్రి 7.30 గంటల సమయంలో సుమారు 13 అడుగుల పొడవు ఉన్న గిరినాగు హల్చల్ చేసింది. దీనిని స్థానికులు గుర్తించి స్నేక్క్యాచర్ వానపల్లి రామలింగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాటిపూడి రిజర్వాయర్ అటవీప్రాంతంలో పామును విడిచిపెడతానని స్నేక్క్యాచర్ తెలిపాడు. -
భూకంపం ఎన్ని రకాలు? ఏది అత్యంత ప్రమాదకరం?
మీకు తెలుసా? భూమిపై వేర్వేరు చోట్ల రోజూ కనీసం 55 భూకంపాలు సంభవిస్తూంటాయని! ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవమే. భూమి పొరల్లో నిత్యం జరిగే కదలికలు ఒక దశ దాటినప్పుడు పుట్టే భూకంపం విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణమవుతోంది. నేపాల్ శనివారం తెల్లవారుజామున 6.4 తీవ్రతతో ఏర్పడ్డ భూకంపం కూడా వందల మందిని బలితీసుకుంది. ఈ నేపధ్యంలో భూకంపం అంటే ఏమిటి? ఇవి ఎన్ని రకాలు? ఆసక్తికరమైన ఈ వివరాలు మీ కోసం... మన భూమి మొత్తం మూడు పొరలుగా ఉంటుందని..పై భాగాన్ని క్రస్ట్, రెండో పొరను మాంటెల్.. మధ్యభాగంలోని భాగాన్ని కోర్ అంటారని భౌగోళిక శాస్త్రం చెబుతుంది. క్రస్ట్ భాగానికి వస్తే.. ఇది జిగ్సా పజిల్ మాదిరిగా ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఈ ముక్కలనే మనం టెక్టానిక్ ప్లేట్లు అంటాం. పైగా ఈ ముక్కలు చాలా నెమ్మదిగా కదులుతూంటాయి కూడా. ఈ కదలికల కారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొంటూంటాయి. కొన్నిసార్లు ఒక ప్లే ఇంకోదాని కిందకు జరిగిపోతూంటాయి. ఈ క్రమంలో అక్కడ పేరుకుపోయిన ఒత్తిడి అకస్మాత్తుగా విడుదలైతే దాన్ని మనం భూకంపం అని పిలుస్తాం. స్థూలంగా ఈ భూకంపాలు నాలుగు రకాలు... భూమి పైపొరలు కదిలితే... భూమి పైపొర క్రస్ట్లోని టెక్టానిక్ ప్లేట్ల ఒరిపిడి కారణంగా వచ్చేవి ఇవి. ఈ పలకలు కదిలే సమయంలో కొన్నిసార్లు ఒకదానికిందకు ఒకటి వెళ్లిపోతాయి. లేదా దూరంగా జరుగుతాయి. ఇంకొన్నిసార్లు దగ్గరకు వస్తూంటాయి. ప్లేట్లు వేగంగా కదిలినప్పుడు ఒకదానితో ఒకటి ఢీకొని ప్రెషర్ విడుదలవుతుంది. అంటే భూకంపం వస్తుందన్నమాట. వీటిని టెక్టానిక్ భూకంపాలని పిలుస్తారు. భూకంపాలు చాలా వరకు ఈ రకమైనే. సాధారణ భూకంపాలు అని కూడా అంటారు. టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ఎక్కువ వేగం ఉంటే వచ్చే భూకంపం క్షణాల్లో ఎంతటి నగరాన్నయినా ధ్వంసం చేస్తుంది. జనావాసాలు లేని, సముద్రాల్లో వచ్చే భూకంపాలతో నష్టం తక్కువ. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న చోట్ల వస్తే మాత్రం ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. అగ్నిపర్వత ప్రాంతాల్లో ఒత్తిడి తీవ్రమైతే... అగ్నిపర్వతాలకూ టెక్టానిక్ ప్లేట్లకూ మధ్య కొంత సంబంధం ఉంది. టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దుల వద్ద అంటే రెండు ప్లేట్లు కలుసుకునే చోట భూమి లోపలి పొరల్లో ఉండే లావా వంటి పదార్థం బయటకు వచ్చే మార్గాలీ అగ్ని పర్వతాలు. భూమ్మీద ఉన్న అత్యధిక శాతం అగ్ని పర్వతాలు ప్లేట్ల సరిహద్దుల్లోనే ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్లు కదులుతూ ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా... ఆ కదలికల కారణంగా అగ్నిపర్వతాల దిగువన కూడా ఒత్తిడి, రాపిడి పెరిగిపోతుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు భూమి పై పొర (క్రస్ట్) చిరిగిపోయి లోపలి లావా, కరిగిన రాయి పైకి ఎగజిమ్ముతుంది. దాన్నే మనం అగ్నిపర్వత భూకంపం అని పిలుస్తాం. 18వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు భూకంపాలకు అగ్నిపర్వతాలు ప్రధాన కారణమని అనుకునేవారు. కానీ ఇది సరికాదని నిరూపించడానికి, శాస్త్రవేత్తలు ప్రయత్నించి అసలు విషయం తెలుసుకున్నారు. అగ్నిపర్వతం పేలినప్పుడు భూమి లోపలి భాగంలో శూన్యత ఏర్పడుతుందని, ఈ శూన్యతను పూరించడానికి, అంతర్గత శిలలు లోనికి జారుతాయని తెలిపారు. అప్పుడు భూకంపం ఏర్పడుతుందని తేల్చారు. అయితే సాంకేతిక అభివృద్ధి ఈ భావన నిరాధారమని నిరూపించింది. హిమాలయ ప్రాంతంలో గత వందేళ్లలో అగ్నిపర్వత విస్ఫోటన సంకేతాలు లేనప్పటికీ ఈ ప్రాంతంలో భూకంపాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇది అగ్ని పర్వతాల కారణంగా భూకంపాలు సంభవిస్తాయనే వాదనను తోసిపుచ్చింది. అయితే అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సంభవించే భూకంప ప్రభావిత ప్రాంతం చాలా పరిమితంగా ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. కుప్పకూలినా... భూకంపమే! భూమిలోపలి నిర్మాణాలు (గుహలు, గనులు సొరంగాలు) కుప్పకూలినప్పుడు పుట్టే భూకంపాలు ఇవి. వీటి తీవ్రత తక్కువే. ప్రభావం కూడా తక్కువ ప్రాంతంలో కనిపిస్తుంది. కొలాప్స్ భూకంపాలు చాలా వరకూ మానవ చర్యల ఫలితంగానే వస్తూంటాయి. 2010లో కోపియాపో గనుల వద్ద, 2019లో రిడ్జ్క్రెస్ట్ (కాలిఫోర్నియా, అమెరికా) ఇలాంటి భూకంపాలు నమోదయ్యాయి. అణ్వస్త్ర, రసాయన ఆయుధాల పేలుళ్లు కూడా భూకంపాలకు కారణమవుతాయి. భారీ స్థాయి గని పేలుళ్లు కూడా! వీటిని పేలుళ్లకు సంబంధించిన భూకంపాలు ఇంగ్లీషులో చెప్పాలంటే ఎక్స్ప్లోషన్ ఎర్త్క్వేక్స్ అని పిలుస్తారు. వీటితో విధ్వంసం తక్కువ. కాకపోతే ప్రకపంపలు చాలా దూరం ప్రయాణించగలవు. 1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమాపై అణుబాంబు పడినప్పుడు, లెబనాన్లో 2020లో జరిగిన పేలుడు ఓ మోస్తరు స్థాయిలో భూకంపాలు పుట్టించాయి. ఇది కూడా చదవండి: నేపాల్లో భారీ భూకంపం.. 128 మంది మృతి -
భూమిపై అత్యంత విషపూరిత జంతువులు ఫోటో గ్యాలరీ
-
అడవిలో ఉండాల్సినవి.. ఇంట్లో పెంచుకుంటున్నారు
-
ఈ బుజ్జి పక్షులు ఎంత ప్రమాదకరమో తెలుసా..?
-
అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!
ఖాళీ గ్యాస్ సిలిండర్ అయినా సరే, నెత్తి మీద పెట్టుకోవడం కష్టం. అలాంటింది డ్యాన్స్ చేయాలాంటే ‘అయ్ బాబోయ్’ అంటాం. దుర్గ అనే ఈ మహిళ మాత్రం ‘అయామ్ ఓకే’ అంటూ నెత్తి మీద గ్యాస్బండ పెట్టుకొని చిన్న స్టీలు బిందె ఎక్కి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో 23 లక్షల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘ఇలాంటి డేంజరస్ స్టంట్లు చేయవద్దు’ అంటూ నెటిజనులు ఆమెను హెచ్చరించారు. కొందరు మాత్రం ఆమె ‘బ్యాలెన్సింగ్ స్కిల్స్’కు భేష్ అన్నారు. ‘ఈ డేంజరస్ డ్యాన్స్ను పొరపాటున కూడా అనుకరించవద్దు’ అంటూ కొందరు హెచ్చరిక కామెంట్లు పెట్టారు. -
స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..
మంచి కండలు తిరిగే బాడీ కావాలని ఎవరికి ఉండుదు. యువకులు దీని గురించి జిమ్ సెంటర్లలో గంటల తరబడి నానా హైరానా పడుతుంటారు. కండలు తిరిగిన దేహదారుఢ్యం రావాలంటే టైం పడుతుంది. అందులో ఎలాంటి డౌంట్ లేదు. కానీ కొందరూ ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా కండల వంటి దేహం కోసం పక్కదారుల్లో ప్రయాణిస్తారు. అందుకోసం స్టెరాయిడ్స్ను వాడతారు. ముందు బాగానే ఉన్నా రానురాను దాని దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సినితారలు దగ్గర నుంచి కాలేజ్ కుర్రాళ్ల వరకు కండలు తిరిగే దేహం కోసం స్టెరాయిడ్లు వాడి లేనిపోని అనారోగ్య సమస్యల బారిన పడిన ఉదంతాలు కోకొల్లలు. ఈ స్టెరాయిడ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించే ఈ కథనం. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ సైతం తాను కూడా ఈ స్టెరాయిడ్లు వాడానని, ఏమాత్రం సంకోచించకుండా చెప్పడమే కాకుండా వాడొద్దని హెచ్చరిస్తున్నాడు. తాను 'జానే తు యా జానే' సినిమాలోని ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ దీని గురించి వివరించాడు. తాను సన్నగా ఉండటంతో అందరూ ఎగతాళి చేసేవారని, బాడీ బిల్డర్లాగా దేహాన్ని తయారుచేయమని ఒత్తిడి చేసేవారేని చెప్పుకొచ్చాడు. కానీ తాను ఎంత తిన్న.. సన్నగా కనబడే బాడీ తత్వం కారణంగా లావు అవ్వడం కష్టంగా ఉండేది. మొదట్లో ఎస్ సైజు దుస్తులే తనకు చాలా లూజ్గా ఉండేవని చెప్పుకొచ్చాడు. అంతేగాదు తన తొలి సినిమా జానే తులో సన్నగా కనిపంచకుండా ఉండటం కోసం రెండు షర్ట్లు వేసుకుని నటించినట్లు తెలిపాడు ఆ తర్వాత బాడీ పెంచడం కోసం స్టెరాయిడ్లు వాడి తన దుస్తుల సైజుని పెంచానని నిర్మొహమాటంగా చెప్పాడు. దీని వల్ల తాను చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను వాడటం లేదని, కేవలం సహజసిద్ధమైన వాల్నట్స్, పసుపు వంటి వాటినే తీసుకుంటున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు. స్టెరాయిడ్స్ అంటే.. అనాబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లు(ఏఏఎస్) లేదా కండరాలను పెంచడానికి ఉపయోగించే టెస్టోస్టెరాన్ సింథటిక్ రూపం. నిపుణుల అభిప్రాయం ప్రకారం..స్టెరాయిడ్స్ శరీరంలోని కండరాలు, వెంట్రుకలు, కుదుళ్లు, ఎముకలు, కాలేయం,మూత్రపిండాలు వంటి వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. మగవాళ్లలో ఉండే హార్మోన్ అయినా ఇది మహిళల్లో కూడా 15-70 ఎన్జీ/డీఎల్ వరకు ఉంటాయి. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. ఎదురయ్యే దుష్పరిణామాలు.. వ్యాయమం చేయక్కర్లే కుండా మంచి దేహ సౌష్టవం రావడం కోసం వాడినప్పడు ఇది శరీరంలో రక్తపోటు తోపాటు గుండె ఎడమ జఠరిక పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు బారిన పడి ఆకస్మిక మరణాల సంభవించే అవకాశం ఉంది. ఇది దూకుడుగా ప్రవర్తించేలా లేదా ఉద్రేకతను పెంచుతుంది. కాలేయానికి హాని కలిగించొచ్చు నిరంతరంగా ఉపయోగించడం వల్ల హైపోగోనాడిజమ్కు కారణమవుతుంది. వృషణాల పనితీరు తగ్గిపోయాల చేసి చివరకు వంధ్యత్వానికి దారితీస్తుంది. ఇది నెమ్మదిగా స్పెర్మ్ కౌంట్ని తగ్గించేస్తుంది. ఫలితంగా పిల్లలను కనే సామర్థ్యం తగ్గిపోతుంది. View this post on Instagram A post shared by Imran Khan (@imrankhan) (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా) -
ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!
క్యాన్సర్ అంటే అందరూ హడలిపోతారు. అలాంటిది దానికి మించి ప్రాణాంతకమైన మరొక వ్యాధా అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే కనీసం క్యాన్సర్కి స్టేజ్లను బట్టి చికిత్స దొరకుతుంది. ఇదొచ్చిదంటే బతకడం కష్టం. పైగా చికిత్స చేయడం కూడా కష్టం. ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స కూడా లేదంట. క్యాన్సర్ కంటే ఈ వ్యాధి వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటి? ఎందువల్ల వస్తుంది?.. తదితరాల గురించే ఈ కథనం.! ఇవాళ ప్రపంచ సెప్సిస్ దినోత్సవం. ఇది క్యాన్సర్ కంటే ప్రాణాంతకమైంది. ప్రతి ఏడాది సెప్టంబర్ 19 సెప్సిస్ దినోత్సవాన్ని జరుపుతూ..ఆ వ్యాధి ప్రజల్లో అవగాహన కల్సిస్తున్నారు అధికారులు. అసలు సెప్సిస్ అంటే ఏంటీ.. ఎలా ప్రాణాంతకం అంటే..ఇది ఏమి ఇన్ఫెక్షన్ కాదు. శరీరలో కలిగే ప్రాణాంతక పరిస్థితిని సెప్సిస్ అంటారు. అధిక రోగనిరోధక ప్రతిస్పందన, బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లు ఈ సెప్టిక్ షాక్కి కారణం కావొచ్చు. రక్తంలో, ఎముకల్లో, పిత్తాశయం, కాలేయం, ఉదరకుహరం, అపెండిక్స్, ఊపిరితిత్తుల్లో న్యూమోనియా, తదితర భాగాలు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సెప్సిస్ షాక్కి కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మెదడు, వెన్నుపాము ఇన్ఫెక్షన్లు కూడా సెప్సిస్ ప్రమాదానికి కారణం కావొచ్చని చెబుతున్నారు. లక్షణాలు తీవ్ర జ్వరం అధిక రక్తపోటు హృదయ స్పందనల్లో క్రమరాహిత్యం శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు హృదయ స్పందనలలో క్రమరాహిత్యం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మూత్రవిసర్జనలో ఇబ్బందులు మానసిక స్థితిలో ఆకస్మిక మార్పులు వ్యాధి సోకిన ప్రాంతాల్లో చర్మం రంగు మారడం ప్లేట్లెట్ కౌంట్లో తగ్గుదల చెప్పలేనంత చలి స్పృహ కోల్పోవడం ఎలాంటి వారు ఈ వ్యాధిబారిన పడతారంటే.. 65 ఏళ్లు పైబడిన పెద్దలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధి, క్యాన్సర్, మూత్రపిండాలు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సెప్సిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్నివిపత్కర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులు, పరిమిత వనురులు ఉన్న ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉంటుంది. ఇంతవరకు అధికా ఆదాయ దేశాల్లోని ఆస్పత్రుల్లో ఈ కేసులు వచ్చినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇది లెక్కలేనన్ని మరణాలకు దారి తీసినట్లు పేర్కొంది. సెప్సిస్ కారణంగా వచ్చే సమస్యలు... తగిన సమయంలో చికిత్స తీసుకోనట్లయితే మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, మెదడు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. రక్తగడ్డకట్టడం, అవయవాలు, వేళ్లు, కాలివేళ్లు చచ్చుపడిపోయి ప్రాణాంతకంగా మారే ప్రమాదం లేకపోలేదు. నిర్ధారణ దీని కారణంగా గడ్డకట్టే సమస్యల, అసాధారణంగా కాలేయం, మూత్రపిండాల పనితీరు ఉండటం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, రక్తంలో ఆమ్లత్వం పెరిగిపోవటం తదితరాలను బట్టి ఈ వ్యాధిని గుర్తిస్తారు వైద్యులు. చికిత్స: రోగుల వైద్య చరిత్ర ఆధారంగా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలో మాత్రం యాంటీబయాటిక్స్ని ఇస్తారు. రోగి పరిస్థితి విషమంగా ఉంటే వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ వ్యాధి సోకిన కణజాలాన్ని తీసేయాల్సి ఉంటుందని వైద్యుల చెబుతున్నారు. ముందుగా ఈ వ్యాధిని గుర్తిస్తే మందులతో నయం చేయొచ్చని అంటున్నారు. ఈ వ్యాధి పూర్తి స్థాయిలో ఎలాంటి చికిత్స లేదని వెల్లడించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వ్యక్తిగ శుభ్రత పాటించాలి. అలాగే ఆహారాన్ని స్వీకరించటంలో నిర్లక్ష ధోరణి పనికిరాదు. నిల్వ ఆహారం కలుషితమైనవి తీసుకోకూడదు. ముఖ్యంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వ్యాధి వచ్చినప్పుడైనా రోగులు ఇలాంటి పరిశుభ్రతను పాటించినా సులభంగా బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయి. క్యాన్సర్ కంటే సెప్సిస్ ఎందుకు ప్రమాదకరం? ఈ వ్యాధి వేగవంతంగా ఇతర అవయవాలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా అన్ని అవయవాలు ప్రభావితమవుతాయి. శరీరం పని తీరు సామర్థ్యం క్షీణిస్తుంది. రోగ నిర్థారణ ఆలస్యం కారణంగా మరణాలు సంభవించే రేటు 30% నుంచి 50% ఉంటుంది. సంక్రమణకు కారణమయ్యే బ్యాక్టీరియాలను గుర్తించి త్వరితగతిన యాంటీబయోటిక్ మందులు ఇవ్వడంపై వ్యాధి తగ్గుదల ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు ఇతర సాధారణ అనారోగ్యాల మాదిరిగా ఉండటంతో అంత సులభంగా వైద్యులు గుర్తించడంలో విఫలమవుతుంటారు. అందువల్ల ఈ కేసులు ఎక్కువగా ప్రాణాంతకంగా మారినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మరొకటి ఆ వ్యాధికి తగ్గ స్థాయిలో యాంటీ బయోటిక్స్ మోతాదు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్సిస్ ఇప్పటికి క్యాన్సర్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలికి వ్యాధులతో పోల్చితే తీవ్రమైన వ్యాధిగా ప్రపంచ ఆరోగ్యానకి సవాలు విసురుతోంది. మరణాలు సంభవించకుండా ఉండేలా వినూత్న రీతిలో వ్యాధికారక వేగాన్ని తగ్గించి నయం చేసేలా చికిత్స విధానాలు అభివృద్ధి చేయాల్సి ఉంది. (చదవండి: క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే సౌకర్యాల వేర్!) -
చట్టానికి ఎవ్వరు చుట్టం కాదు: పండుగాయల రత్నాకర్
సాక్షి, అమరావతి: పాప భీతి, నైతిక విలువలు ఏమాత్రం లేని వ్యక్తి రాజకీయాల్లో ఉండడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి బాబే ఉదాహరణ అని ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అన్నారు. బాబు 45 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిందే సులువుగా సంపాదించుకోవడం కోసం, అక్రమంగా ప్రజల డబ్బును దోచుకుని తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసంమేనని ఆయన అన్నారు. ప్రజలపై, ప్రజాధనం పై ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. అధికారం, డబ్బు, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తప్పుడు పనులు చేయడం, సొంతమనుషులకు దోచిపెట్టడం ఇవే చంద్రబాబు లక్ష్యాలని విమర్శించారు. 'స్కిల్ డెవెలప్ మెంట్ స్కాం జరిగిన తీరు రాష్ట్రమే సిగ్గుపడేలా ఉంది. 2014లో ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు యువతను నమ్మించి నిలువునా మోసం చేశాడు. అంతటితో ఆగకుండా యువతకు నైపుణ్యాన్ని అందించి సుశిక్షితులు చేసే పేరుతో రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. బాధ్యత మర్చిపోయి నైతిక విలువలు గాలికొదిలి ఇలాంటి దారుణమైన దోపిడీకి చంద్రబాబు పాల్పడ్డాడు.' అని రత్నాకర్ వెల్లడించారు. No more StayBN ….#SkillDevelopmentScam #CorruptionKingCBN #ScamsterChandrababu pic.twitter.com/1maEQJi1ho — Kadapa Rathnakar (@KadapaRathnakar) September 9, 2023 'ప్రజల కళ్లుగప్పి అవినీతి చేద్దామనుకున్న బాబు ఇవాళ అడ్డంగా దొరికిపోయి దబాయిస్తున్నాడు. చట్టం చంద్రబాబుకు చుట్టం కాదు. తప్పు చేస్తే చట్టం ఎంతటివారినైనా ఉపేక్షించదు. ప్రజాధనం ఇష్టమొచ్చినట్టు దోపిడీ చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకోదు. అందులో భాగంగానే ఈ రోజు బాబు అరెస్ట్ జరిగింది. ప్రభుత్వానికి కక్ష సాధించాలని ఉంటె ఎప్పుడో అరెస్ట్ అయ్యేవాడు. చంద్రబాబు అవినీతి చేసాడని రుజువయ్యాకే సీఐడీ అరెస్ట్ చేసింది.' అని రత్నాకర్ పేర్కొన్నారు. బాబు బరితెగించి చేసిన అవినీతి ఇది: 'ఏమాత్రం నియమనిబంధనలు పాటించకుండా, చట్టానికి భయపడకుండా బాబు బరితెగించాడు. సీమెన్స్ సంస్థకు తెలియకుండా ఆ సంస్థ పేరు వాడుకున్నారు. రూ. 3,350 కోట్ల ప్రాజెక్టులో 90% డబ్బు ప్రైవేట్ సంస్థ గ్రాంట్ ఇస్తుందన్నారు. ఎక్కడైనా ప్రైవేట్ సంస్థ 90% గ్రాంట్ ఇస్తుందా ? డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు ఒకే చేశారు. తేదీలు లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఎంవోయూ కుదుర్చుకునే సమయానికి 90% గ్రాంట్ నిబంధన ఎత్తేశారు. షెల్ కంపెనీల ద్వారా చట్టం తన చుట్టం, వ్యవస్థలను మేనేజ్ చేయగలమన్న ధీమాతోనే బాబు దిగజారి ప్రవర్తించాడు. బాబుకు ఈ కేసులో కఠినమైన శిక్ష పడకతప్పదు.' అని రత్నాకర్ చెప్పారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన చంద్రబాబు: '2014- 2019 వరకు బాబు అవినీతికి అడ్డుఅదుపూ లేకుండా పోయింది. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అడుగడుగునా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. రాజధాని లక్షకోట్ల కుంభకోణం, పోలవరం దోపిడీ, నీరు-చెట్టు, జన్మభూమి కమిటీల లంచాలు, చంద్రన్న కానుకల పేరుతొ దోపిడీ, ఎన్నికలకు 6 నెలల ముందు అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి ఇష్టమొచ్చిన రేటుకు కాంట్రాక్టులు.. ఇలా బాబు పాలన అవినీతిమయంగా సాగింది.' అని రత్నాకర్ చెప్పారు. 'దోపిడీయే ఏకైక లక్ష్యంగా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసాడు. 75 ఏళ్ళ చరిత్రలో ఇలాంటి చెత్తపాలన మరెక్కడా జరగలేదు. ఆ ఐదేళ్లు ప్రజలను వేధించి తాను మాత్రం జేబులు నింపుకున్నాడు. బాబు పాలనపై విసుగెత్తిన రాష్ట్రప్రజలు సరైన సమయంలో బాబుకు గుణపాఠం చెప్పారు. బాబు అవినీతికి సరైన శిక్షగా 23 సీట్లకు పరిమితం చేశారు. 2024లో బాబుకు 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితిలేదని జాతీయ సర్వేలే చెబుతున్నాయి. బాబుకు చట్టం ఎన్ని సంవత్సరాలు శిక్ష వేస్తుందో తెలియదు గానీ.. రాష్ట్ర ప్రజలు మాత్రం బాబుకు జీవితకాలం శిక్ష వేశారు.' అని పండుగాయల రత్నాకర్ అన్నారు. ఇదీ చదవండి: ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు -
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవి! అడుగుపెట్టారో అంతే..!
మయాన్మార్లోని రామ్రీ దీవిలో అడుగుపెట్టాలంటే ఇప్పటికీ జనాలకు హడలే! ఆ దీవిలో ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా మొసళ్లు సంచరిస్తుంటాయి. ఉప్పునీటిలో బతికే ఈ మొసళ్లకు చిక్కితే వాటికి పలారమైపోవడం తప్ప బతికి బట్టకట్టడం అసాధ్యం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవుల్లో ఒకటిగా పేరుమోసిన ఈ రామ్రీ దీవికి ఒక చరిత్ర ఉంది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో ఇక్కడ మోహరించిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ బలగాలపై దాడి చేసేందుకు జపాన్ సైన్యం ఈ దీవికి చేరుకునే ప్రయత్నం చేసినప్పుడు వందలాది మంది జపాన్ సైనికులు ఈ దీవిలోని మొసళ్లకు పలారమైపోయారు. యుద్ధ సమయంలో అత్యధికులు జంతు దాడిలో మరణించిన సంఘటనగా ఇది గిన్నిస్బుక్లో చోటు పొందింది. (చదవండి: అక్కడ అడుగుపెడితే ప్రమాదమే!) -
ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!
అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్ జీవిత గాథ హాలీవుడ్ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్ ఆక్రమిస్తోంది... అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒప్పెన్హీమర్ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్ చేంజర్గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. అణు వర్సెస్ సౌర విద్యుత్ 1970 దశకంలో అణు విద్యుత్ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్ 1.04 టెరావాట్స్ కాగా, ప్రపంచ అణు విద్యుత్ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్ కంటే సౌర విద్యుత్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్ ప్యానెల్ డివిజన్ మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ చెప్పారు. సౌర విద్యుత్తో లాభాలు... ► సౌర విద్యుత్కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు. ► సోలార్ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు. ► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు. ► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం. ► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి. ► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. ► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు. ► అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మినహా మరే దేశాలు అణు విద్యుత్పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్! ► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి. ► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది. ► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అణు విద్యుత్ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది – డాక్టర్ నితేంద్ర సింగ్, ఇండియన్ యూత్ న్యూక్లియర్ సొసైటీ వ్యవస్థాపకుడు -1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): వర్షాల కారణంగా హసనపర్తి–కాజీపేట సెక్షన్ మధ్యలో ట్రాక్లపై ప్రమాదకర స్ధాయిలో నీటి ప్రవాహం చేరుకోవడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరి కొన్నింటిని అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్–సిర్పుర్ కాగజ్నగర్ (17233) రైలును ఈ నెల 27, సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్(17223) రైలును ఈ నెల 28న పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్–ధనాపూర్ (12791)రైలును గురువారం కాజీపేట, విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ (12656) రైలును వరంగల్లు, సికింద్రాబాద్, వాడి, సోలాపూర్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. చైన్నె సెంట్రల్–మాత వైష్ణోదేవి కాత్ర రైలును గుంటూరు, సికింద్రాబాద్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. రామేశ్వరం–బెనారస్ (22535) రైలును విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. హెల్ప్ డెస్క్ల ఏర్పాటు వర్షాల నేపథ్యంలో రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా విజయవాడ, ఒంగోలు, తెనాలి, సామర్లకోట, ఏలూరు, రాజమండ్రి స్టేషన్లతో పాటు గూడురు స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు విజయవాడ 0866–2576924, గూడూరు 7815909300 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు గురువారం చెప్పారు. -
పిల్లల ఫేమస్ కోసం తల్లి తాపత్రయం.. ఊహకందని చేదు అనుభవం ఎదురయ్యేసరికి..
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలామంది తమకు లభించే ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. తమ వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ కూడా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు తమ పిల్లలను ఫేమస్ చేసేందుకు తపన పడుతుంటారు. పిల్లలు పుట్టినది మొదలు వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చాలామంది తమకు పిల్లలకు పుట్టగానే వెంటనే ఫొటోతీసి, దానిని తమ చిన్నారి తొలి ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పిల్లలు పుట్టిన వెంటనే వారి పేరుతో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో అకౌంట్ క్రియేట్ చేసి, వారి ఫొటోలు షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్స్గా చూడాలనుకుని.. న్యూయార్క్ పోస్టులోని ఒక రిపోర్టు ప్రకారం కత్రీనా స్ట్రోడ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తమకు పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్చేస్తూ వస్తోంది. తమ పిల్లలను సోషల్ మీడియా స్టార్స్గా చూడాలనుకుంది. కత్రీనాకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు 4 ఏళ్లు, కుమారునికి 3 ఏళ్లు. ఆమె తన ఇద్దరు పిల్లలను టిక్టాక్, ఇన్స్టాగ్రమ్లోఫేమస్ చేసింది. టిక్టాక్ యూజర్ చేసిన పనికి.. తమ పిల్లలను ఆడుకుంటున్నప్పటి ఫొటోలు, వీడియోలు, స్విమ్మింగ్ చేస్తున్నప్పటి వీడియోలను కత్రీనా తరచూ పోస్టు చేస్తుంటుంది. అయితే కత్రీనా 2022లో ఉన్నట్టుండి తమ పిల్లల ఫొటోలను, వీడియోలను షేర్ చేయడం మానివేసింది. టిక్టాక్ యూజర్ ఒకరు కత్రీనా కుమారుని ఫోటోను ఉపయోగించి, ఒక పోస్టు క్రియేట్ చేసి, ఆ పిల్లాడు తన కుమారుడు అని పేర్కొన్నాడు. చిన్నారుల ఫొటోలను సేవ్ చేసుకుని.. అమెరికాలోని కరోలినాలో ఉంటున్న కత్రీనా తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడుతూ ‘మా పిల్లల మాదిరిగానే చాలామంది పిల్లలకు ఇలాంటి ముప్పు ఎదురవుతోంది. చాలామంది సోషల్ మీడియాలో షేర్ అయ్యే చిన్నారుల ఫొటోలను సేవ్ చేసుకుని దుర్వినియోగం చేస్తున్నాన్నారని’ తెలిపింది. ఈ విషయాన్ని తన భర్తకు కూడా తెలియజేశానని పేర్కొంది. కత్రీనా తాను ఇన్నాళ్లూ చేస్తూ వచ్చిన పనికి పశ్చాత్తాప పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించి.. ఈ చేదు అనుభవం ఎదురైన తరువాత ఆమె సోషల్ మీడియాలోని తమ పిల్లల ఫొటోలను, వీడియోలను తొలగించింది. 2021లో అమెరికాకు చెందిన ఒక రిపోర్టు ప్రకారం 77శాతం తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. పలువురు కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించి చిన్నారుల ఫొటోలను, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారని పలు ఉదంతాలు నిరూపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: సీమా, సచిన్ల స్టోరీని తలపించే ఇక్రా, ములాయం లవ్ స్టోరీ.. చివరికి? -
బాత్రూమ్లో బీకేర్ఫుల్.. ఇళ్లల్లో రెండో అత్యంత ప్రమాదకర ప్రదేశం
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 ఏళ్లు పైబడిన వారిలో 2.35 లక్షల మంది బాత్రూమ్లో గాయపడుతున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక చెబుతోంది. ఇంట్లో అతి చిన్న గదే అయినప్పటికీ.. వంటగది తరువాత బాత్రూమ్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. బాత్రూమ్లో సంభవించే ప్రమాదాల కారణంగా ఒక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే నిత్యం 370 మంది మరణిస్తున్నారు. మన దేశంలో ఎముకల చికిత్స కోసం వెళుతున్న వారిలో దాదాపు 35నుంచి 45 శాతం మంది బాత్రూమ్లో జారిపడి గాయాల పాలైనవారే. ప్రముఖ సినీ నటి శ్రీదేవి దగ్గర్నుంచి తాజాగా చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు వరకూ అనేక మంది ప్రముఖుల మరణాలు బాత్రూమ్లోనే సంభవించాయి. ఈ జాగ్రత్తలు పాటించాలి వదులుగా ఉన్న టాయిలెట్ బౌల్ రిమ్పై కూర్చోవడం వల్ల అది అటూ ఇటూ కదిలి శరీరానికి గాయం చేయవచ్చు. ప్లాస్టిక్ సీట్లు పగిలిపోవడం, వ్యక్తి బరువు వల్ల కూలిపోవడం కూడా గాయాలు కలిగించవచ్చు. టాయిలెట్లలో సిగరెట్లు వంటివి పడేయడం వల్ల అవి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. కోసుకుపోవటం, ఎముకలు విరగటం, వెన్నెముకకి గాయాలు, ఫ్రాక్చర్లు, వంటివి మామూలే. సాధారణంగా బాత్రూమ్ ప్రమాదాలు మనం టబ్లోంచి బయటకు వస్తున్నప్పుడో, టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడో, తువ్వాలు తీసుకుంటున్నప్పుడో లేదా జారుడు నేలపై నడిచినప్పుడో జరుగుతాయి. ఇలాంటివి ఆపాలంటే బాత్రూమ్ వాడుతున్నప్పుడు లైట్లు, డోర్ మ్యాట్లు వేయాలి. బాత్రూమ్ నేలను పొడిగా ఉండేలా చూసుకోవడంతో పాటు, పట్టుకోడానికి హ్యాండిల్స్ పెట్టించాలి. పాశ్చాత్య టాయిలెట్లో కూర్చుని లేచే సమయంలో హ్యాండిల్ పట్టుకుని లేవాలి. బాత్రూమ్కి వెళ్లినప్పుడు లోపల గట్టిగా గడియపెట్టుకోవకపోవడం వృద్ధులకు మంచిది. షవర్ కింద స్నానం చేసే సమయంలో స్టూల్ వాడాలి. చల్లని నీటితో స్నానం చేసినప్పుడు ముందుగా తలపై కాకుండా పాదాలపై నీటిని పోసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చరిత్రలో కొన్ని దుర్ఘటనలు ♦ చైనాలోని జిన్ రాష్ట్ర పాలకుడు క్రీస్తు పూర్వం 581లో టాయిలెట్ పిట్లో పడి మరణించాడు. ♦చరిత్రలో మర్చిపోలేని దుర్ఘటన ఒకటి 1184 జూలై 26న సంభవించింది. ‘ఎర్ఫర్ట్ లెట్రిన్ విపత్తు’గా పిలిచే ఈ ప్రమాదం రోమన్ చక్రవర్తి హెన్రీ అనధికార సమావేశం నిర్వహిస్తుండగా.. దానికి హాజరైన వారి బరువు కారణంగా చెక్క భవనం రెండవ అంతస్తు నేల కూలిపోయింది. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడి మునిగిపోవడంతో 60 మంది మరణించారు. ♦ 1760లో గ్రేట్ బ్రిటన్కు చెందిన కింగ్ జార్జ్ అక్టోబర్ 25న టాయిలెట్లో మరణించాడు. ♦1945లో జర్మన్ జలాంతర్గామి ఒక టాయిలెట్ ప్రమాదంలో మునిగిపోయింది. ♦1983 జూన్ 2న ఎయిర్ కెనడా విమానం–797 వెనుక లావెటరీలో మంటలు చెలరేగి విమానం మొత్తం కాలిపోయింది. ప్రమాదంలో 23 మంది మరణించారు. ♦ బ్రిటిష్ వ్యాపారవేత్త, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు క్రిస్టోఫర్ షేల్ జూన్ 26, 2011న గ్లాస్టన్బరీ ఫెస్టివల్లో పోర్టబుల్ టాయిలెట్లో గుండెపోటుతో చనిపోయాడు. ♦ టాయ్లెట్ల ఫిట్టింగ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఏటా దాదాపు 10 వేల ఓడలు ప్రపంచవ్యాప్తంగా మునిగిపోతున్నాయి. వృద్ధుల ప్రాణాలు తీస్తున్నాయ్ ఇంట్లో 65 ఏళ్లు పైబడిన పెద్దవారు ఉంటే.. బాత్రూమ్ ప్రమాదాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి నలుగురిలో ముగ్గురు వృద్ధులు ఏడాదికి ఒకసారైనా బాత్రూమ్లో జారిపడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల్లో 65 శాతం చిన్న గాయాలతో సరిపెట్టినా.. మిగతా 35 శాతం మాత్రం ప్రాణాలు తీస్తున్నాయి. మన దేశంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలో 42 శాతం మంది టాయిలెట్లలో 7 నుంచి 10 సార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. 58 శాతం మంది 11 నుంచి 15 సార్లు పడిపోతున్నారు. సరైన తలుపులు లేకపోవడం ప్రమాదానికి వంద శాతం కారణమవుతుండగా, జారే ఫ్లోర్ 91.9 శాతం, బాత్రూమ్ పరిమాణం 80.3 శాతం, ఎత్తైన తలుపు థ్రెషోల్డ్ 53.5 శాతం, నాన్–స్కిడ్ మ్యాట్ లేకపోవడం 99.5 శాతం, గ్రాబ్ బార్లు లేకపోవడం 97 శాతం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోవడం 96.6 శాతం, బాత్రూమ్లో వెలుతురు సరిపోకపోవడం వల్ల 94.4 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. వేడి నీటి వినియోగం 89.9 శాతం, సీట్ ఉపరితలం 55.6 శాతం, ప్రవేశ ద్వారం వద్ద లైట్ స్విచ్ లేకపోవడం 53 శాతం, చిందరవందరగా ఉన్న మార్గం వంటివి 39.4 శాతం కారణమవుతున్నాయి. ఎన్సీబీఐ మార్కెటింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 11 శాతం హార్ట్ అటాక్లు బాత్రూమ్లోనే వస్తున్నాయి. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లేదా స్నానం చేస్తున్న సమయంలో ఇవి సంభవిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి బాత్రూమ్లో మరణించే వారిలో ఎక్కువ శాతం హార్ట్ అటాక్ వల్లే సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చల్లని నీటితో తలస్నానం చేసినప్పుడు.. ఆ నీటిని తలపై పోసుకుంటే శరీరంలో ఆ భాగం చల్లగా మారుతుంది. దీంతో రక్తనాళాలు వెంటనే అలర్ట్ అయ్యి రక్తాన్ని ఒక్కసారిగా పైకి పంపిస్తాయి. దీనివల్ల తల భాగం వైపు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది. కొన్నిసార్లు పక్షవాతం కూడా రావచ్చు. జారి పడిపోయినప్పుడు తల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వెన్నుపూస కూడా విరగవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సుధాకర్ కనపర్తి, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణుడు, విజయవాడ -
Suicide Plant: మొక్కే కదా అని ముట్టుకుంటే ప్రాణాలు పోతాయి..
పచ్చని చెట్లు చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చెట్ల మధ్య కాసేపు గడిపితే చాలు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. స్వచ్చమైన గాలిని అందిస్తూ మేలు చేసే చెట్ల గురించే ఇప్పటివరకు మనకు తెలుసు.. కానీ కొన్ని మొక్కలు మనుషుల ప్రాణాలను తీయగలవని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్కలు ఈ భూమ్మీద కొన్ని ఉన్నాయి. మొక్కే కదా కని పొరపాటున వాటిని ముట్టుకున్నా ప్రాణాలను తీసేస్తుంది. స్వయంగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. ఇంత భయంకరమైన మొక్కలు ఎక్కడ ఉంటాయి? వాటి కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్కలుగా గింపీ-గింపీ (Gympie-Gympie)ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉర్టికేసి రేగుట జాతికి చెందిన ఈ మొక్కలు ఎక్కువగా ఆస్త్రేలియా, ఇండోనేషియా అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. పొరపాటున వీటి ఆకులను తాకినా భయంకరమైన నొప్పి కలుగుతుందట. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకునేలా ఇవి మనల్ని ప్రేరేపిస్తాయట. అందుకే ఈ మొక్కలను ‘సూసైడ్ ప్లాంట్ ’(Suicide Plant)అంటారు. వీటి వల్ల మనుషులకే కాదు, జంతువుకలకు కూడా హానీ కలుగుతుందట. 1886లో ఓ గుర్రం ఈ మొక్కను తాకిన కాసేపటికే మతిస్థిమితం కోల్పోయి 2గంటల్లోనే మరణించినట్లు పరిశోధకులు తెలిపారు. గింపీ-గింపీ ఆకులపై సన్నని సూదుల్లాంటి ఉంటాయట. వీటిని ముట్టుకుంటే ఆ నొప్పి భరించలేక చనిపోవడమే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుందట. ఈ ఆకులను ముట్టుకున్న 30 నిమిషాల్లోనే దద్దుర్లు, వాపులు వచ్చి నొప్పి తీవ్రంగా మారుతుందట. దీంతో నిద్రపోవడం కూడా కష్టమే అంటున్నారు ఎక్స్పర్ట్స్.పొరపాటున ఆ మొక్కలను ముట్టుకొని తక్షణం చికిత్స తీసుకున్నా పెద్దగా ఫలితం ఉండదట. చాలా సంవత్సరాల పాటు ఆ నొప్పి శరీరంలో అలాగే ఉంటుందట. కాబట్టి గింపీ జోలికి వెళ్లకపోవడమే బెటర్. -
అటు వైపు వెళ్లొద్దు సుమా.. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ప్లేసేస్
-
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 సముద్ర జీవులు
-
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్లు, మినీ గేమ్లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్స్టాల్ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్స్టాల్ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్ని ఇతర సోషల్మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
ప్రపంచంలోని టాప్ 10 విషపూరిత పాములు
-
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్టులు, ఇవే (ఫోటోలు)
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రమాదకరమైన రోడ్లు
-
NIA: ముంబైలో 'డేంజర్ మ్యాన్'... పోలీసుల హై అలర్ట్..
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎన్ఐఏ హై అలర్ట్ ప్రకటించింది. పోలీసులు సహా మహారాష్ట్రలోని అన్ని దర్యాప్తు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మెయిల్స్ పంపింది. ఇండోర్కు చెందిన ఓ ప్రమాదకర వ్యక్తి మంబైలోని ప్రవేశించాడని, అతడు చైనా, పాకిస్థాన్, హాంకాంగ్లో శిక్షణ తీసుకుని వచ్చాడని హెచ్చరించింది. ఈ డేంజర్ మ్యాన్ పేరు సర్ఫరాజ్ మిమాన్. ఇతనికి సంబంధించిన ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ కాపీలను ఎన్ఐఏ అన్ని దర్యాప్తు సంస్థలకు పంపింది. కొద్ది రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి సర్ఫరాజ్ మిమాన్ గురించి ఎన్ఐఏకు మెయిల్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో సర్ఫరాజ్ను అరెస్టు చేసేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి అతని కోసం గాలిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఫిబ్రవరి 25న ఢిల్లీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరు ఆయుధాల శిక్షణ తీసుకునేందుకు పాకిస్తాన్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించి చాకచక్యంగా అరెస్టు చేశారు. ఇద్దరిలో ఒకరు థానే వెస్ట్కు చెందిన ముబారక్ ఖాన్ కాగా.. మరొకరు తమళనాడుకు చెందిన అబ్దుల్లా అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. చదవండి: సీబీఐ అరెస్ట్పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. -
RGV తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
ద్యావుడా.. ఒకే రోజు 17 సినిమాలు...ఎందుకిలా?
ఒకే వారంలో నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడం టాలీవుడ్కి కొత్తేమి కాదు. ఒక్కోసారి 7-8 సినిమాలు కూడా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వారంతం ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి 17 సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. టాలీవుడ్లో ఇదో రికార్డు అని చెప్పొచ్చు. సాధారణంగా పండుగ సీజన్స్లో పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదలవుతాయి కాబట్టి చిన్న చిత్రాలు వెనక్కి తగ్గి.. పోటీలేని టైమ్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో చిన్న చిత్రాల మధ్య బాక్సాఫీస్ వార్ మొదలవుతుంది. ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఒకేసారి ఐదారు బరిలోకి దిగుతాయి. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు సేఫ్ జోన్లోకి వెళ్లిపోతాయి. కానీ నెగెటివ్ టాక్ వస్తే.. మరుసటి రోజే థియేటర్స్ నుంచి బయటకు వెళ్లాల్సిందే. అందుకే పోటీగా ఎక్కువ చిత్రాలు ఉన్నా.. విడుదలకు వెనక్కి తగ్గరు చిన్న నిర్మాతలు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!) అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ పోరు మాములుగా లేదు. ఈ ఏడాది చివరి మాసం కావడం.. సంక్రాంతి బరిలో వరుసగా పెద్ద చిత్రాలు ఉండడంతో.. డిసెంబర్ 9న ఏకంగా 17 చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని థియేటర్స్ దొరికాయి.. ఎక్కడెక్కడ దొరకలేదు అనే విషయాన్ని పట్టించుకోకుండా.. మన సినిమా విడుదలైతే చాలు..అదే పదివేలు అన్నట్లుగా చిన్న నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల జాబితాలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, ముఖచిత్రం, ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్జీ, ప్రేమదేశం(ఈ ఓల్డ్ చిత్రం మళ్లీ థియేటర్స్లో విడుదలవుతుంది), రాజయోగం, డేంజరస్, విజయానంద్, ఏపీ 04 రామపురం, ఐ లవ్ యు ఇడియట్, మనం అందరం ఒక్కటే, ఆక్రోశం, ఏయ్ బుజ్జి నీకు నేనే, సివిల్ ఇంజనీర్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, డేంజరస్తో పాటు మరో రెండు, మూడు చిత్రాలు మాత్రమే ప్రచారం ప్రారంభించాయి. మిగతా చిత్రాలన్ని కేవలం పోస్టర్, ట్రైలర్ విడుదల చేసి నేరుగా థియేటర్స్లోకి వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి విజయం సాధిస్తాయో చూడాలి. -
అందుకే ‘డేంజరస్’ సినిమా తీశా: రామ్గోపాల్ వర్మ
‘‘హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ నేపథ్యంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. కానీ, ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? అనే కొత్త ఆలోచనతో ‘డేంజరస్’ సినిమా తీశా. ఈ ప్రేమకథ సరికొత్తగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ వర్మ అన్నారు. నైనా గంగూలీ, అప్సరా రాణి లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘డేంజరస్’. రామ్గోపాల్ వర్మ స్వీయ దర్వకత్వంలో నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్, క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ వంటి అంశాలతో ‘డేంజరస్’ తెరకెక్కింది. అబ్బాయిల వల్ల చేదు అనుభవాలు ఎదుర్కొన్న ఇద్దరు అమ్మాయిలు, ఆ అమ్మాయిల మధ్య చిగురించే ప్రేమ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మంచి హీరోయిన్ డేట్స్ దొరికి హీరో డేట్స్ కుదరకపోయినా ఇద్దరు హీరోయిన్లతో కూడా సినిమాలు చేయొచ్చనే ఆలోచనతో ఈ సినిమా తీశాను. హిందీలో అమితాబ్ బచ్చన్గారితో, కన్నడలో ఉపేంద్రతో నా దర్శకత్వంలో చేయనున్న సినిమాలు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయి . ►ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయాలపై తొలి భాగం ‘వ్యూహం’, రెండవ భాగం ‘శపథం’ టైటిల్తో సినిమాలు చేయనున్నాను. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిగారు చనిపోయాక జరిగిన ఘటనలు, వ్యూహాల నేపథ్యంలో ‘వ్యూహం’ ఉంటుంది.. ఏపీ రాజకీయాల్లో ఉన్న డ్రామా తెలంగాణలో లేదు. అందుకే ఏపీ పాలిటిక్స్ పై సినిమాలు తీస్తున్నాను. పైగా వైసీపీ, టీడీపీ పార్టీల్లో నాకు ఫ్రెండ్స్ ఉండడం కూడా మరో కారణం. -
డేంజరస్ ట్రైలర్.. ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు?
అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో కంపెనీ పతాకంపై రామ్గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేంజరస్’. ‘మా ఇష్టం’ అనేది క్యాప్షన్. ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. రామ్గోపాల్ వర్మ, నట్టి కుమార్, ఏబీ శ్రీనివాస్ రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నా సినిమాల్లో మరో కొత్త కోణం ఈ సినిమా. మగవాళ్లతో ఇద్దరు అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు. ఈ కార్య క్రమంలో నిర్మాత– డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్, నిర్మాత ఏబీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మేము డేంజరా? మరి అణ్వాయుధాలున్న భారత్ ప్రమాదం కాదా?
ఇస్లామాబాద్: అణ్వాయుధ సమన్వయం లేని పాకిస్థాన్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బైడెన్ వాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఇస్లామాబాద్లోని అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్కు సమన్లు పంపింది. పాకిస్థాన్ తన సమగ్రత, భద్రత విషయంలో మొండిగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు. ఒకవేళ ప్రశ్నలు లేవనెత్తాల్సి వస్తే భారత్లో అణ్వాయుధాలపై కూడా ప్రశ్నించాలని పేర్కొన్నారు. బైడెన్ కామెంట్లు తనను షాక్కు గురిచేశాయని భుట్టో అన్నారు. సమన్వయ లోపం వల్లే బైడెన్ పొరబడి ఉంటారని చెప్పారు. లాస్ ఏంజెల్స్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్థాన్ అత్యంత ప్రమాదకర దేశమని బైడెన్ అన్నారు. పాక్ ప్రధాని అమెరికాతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: పాకిస్తాన్పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు -
పాకిస్తాన్పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అణ్వాయుధాల సమన్వయం లేని పాకిస్తాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఈ మేరకు బైడెన్ లాస్ ఏంజిల్స్లో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా రష్యా తీరుపై కూడా విమర్శలు కురింపించారు. బైడెన్ చైనా, రష్యాలతో గల యూసెస్ విదేశాంగ పాలసీ విధానం గురించి చెబుతూ పాకిస్తాన్పై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి తనకు కావల్సిన దానిపై పూర్తి క్లారిటీ ఉందని, కానీ పలు వివాదాలను ఎదుర్కొంటున్నాడని అన్నారు. ఈ 21వ శతాబ్దంలో రెండో త్రైమాసికంలో అమెరికాను మరింత శక్తివంతంగా మార్చేందుకు పలు అపారమైన అవకాశాలు ఉన్నాయని నమ్మకంగా చెప్పారు. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా వ్యూహాం విదేశాంగ పాలసీ సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. ఐతే అమెరికా విడుదల చేసిన 48 పేజీల ఈ డాక్యుమెంట్లలో పాకిస్తాన్కి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఆ డాక్యుమెంట్లో... హద్దులేని భాగస్వామ్యంతో చైనా, రష్యాలు కలిసిపోతున్నాయని హెచ్చరించారు. ఆ రెండు దేశాలు విసిరే సవాళ్లు చాలా విభిన్నంగా ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాలతో యూఎస్కి ఎదురయ్యే ముప్పు గురించి నొక్కి చెప్పారు. రష్యా ఆగడాలకు అడ్డుకట్టవేస్తూ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాపై శాశ్వతమైన పోటీని కొనసాగించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో చైనాతో పోటీ ఎక్కువగా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. (చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్) -
‘104’ మృత్యు మార్గాలు.. ఈ రోడ్లు యమడేంజర్ గురూ!
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో 104 మార్గాలు ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది. ఈ మార్గాల్లోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రత్యేక బృందం పరిశీలనలో వెలుగు చూసింది. ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రత్యేక కార్యచరణపై దృష్టి పెట్టారు. చెన్నై రోడ్లు నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతుంటాయి. ట్రాఫిక్ పోలీసులు అతి వేగంపై దృష్టి పెడుతున్నా, జరిమానాలు విధిస్తున్నా, అతి వేగంగా దూసుకెళ్లే వాళ్లల్లో మాత్రం మార్పు రావడం లేదు. జాతీయ స్థాయి నేర పరిశోధ రికార్డుల మేరకు దేశంలో అత్యధిక ప్రమాదాలు జరిగే జాబితాలో మొదటి మూడు నగరాల్లో చెన్నై కూడా ఉంది. ఆ మేరకు ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందం నెల రోజుల క్రితం రంగంలోకి దిగింది. ఐపీఎస్ అ«ధికారి వినిత్ మన్కోడో నేతృత్వంలో ఐఐటీ నిపుణులు, చెన్నై కార్పొరేషన్, రహదారుల శాఖ వర్గాలతో కూడిన బృందం గత నెల రోజులుగా చెన్నైలోని రోడ్లపై సుదీర్ఘ పరిశీలన జరిపింది. కమిషనర్ సమాలోచన ఈ బృందం జరిపిన పరిశీలనలో 104 మార్గాలు మృత్యుమార్గాలు, ప్రమాదాలకు నెలవుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మార్గాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, మరణాలతో పాటు గాయాలపాలయ్యే వారి సంఖ్య అధికంగా ఉన్నట్టు తేలింది. చిన్న ప్రమాదాలు సైతం పై మార్గాల్లో జరుగుతున్నట్టు తేల్చారు. దీంతో ఈ మార్గాల్లో ప్రమాదాల నివారణకు చర్యలపై దృష్టి పెట్టారు. శుక్రవారం కమిషనర్ శంకర్ జివ్వాల్తో ఈ బృందం సమావేశమైంది. ప్రమాదాలు అధికంగా జరిగే మార్గాల గురించి చర్చించారు. ఈ మార్గాల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కార్యచరణకు సిద్ధమయ్యారు. ఈ విషయంగా కమిషనర్ శంకర్జివ్వాల్ మాట్లాడుతూ.. నగరంలో ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. 2021తో పోల్చితే ఈ 8 నెలలు చెన్నైలో ప్రమాదాలు 20 శాతం తక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు. అయినా, ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా వాహనదారులను అప్రమత్తం చేసే విధంగా ప్రత్యేక కార్యచరణపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. ఈ బృందం పేర్కొంటున్న 104 మార్గాల్లో పరిశీలన జరపనున్నామని, ఇక్కడ నివారణ లక్ష్యంగా చేపట్టాల్సిన పనులపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. -
ఉచిత పథకాలు దేశానికి ప్రమాదకరం
జలౌన్: ఉచిత పథకాల ద్వారా ఓట్లు దండుకునే సంస్కృతి దేశం అభివృద్ధికి చాలా ప్రమాదకరమని ప్రధాని మోదీ అన్నారు. ఇటువంటి తాయిలాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన హెచ్చరించారు. యూపీలో రూ.14,850 కోట్లతో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను జలౌన్ జిల్లా కైతెరి గ్రామం వద్ద శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ రహదారితో వాహనాల వేగం మాత్రమే కాదు, బుందేల్ఖండ్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని చెప్పారు. చిత్రకూట్– ఢిల్లీ మధ్య ప్రయాణ కాలం మూడు నుంచి నాలుగు గంటలు తగ్గుతుందని కూడా చెప్పారు. ‘‘మన దేశంలో రేవడీ(ఉత్తర భారతంలో ఒక స్వీట్ పేరు)లు పంచుతూ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవడీలతో ప్రజలను కొనుగోలు చేయవచ్చని అనుకుంటున్నారు. ఈ సంస్కృతి దేశం అభివృద్ధికి ప్రమాదకరం. రేవడీ సంస్కృతితో కొత్త ఎక్స్ప్రెస్ వేలు, ఎయిర్పోర్టులు, డిఫెన్స్ కారిడార్లు రావు. ఈ సంస్కృతిని దేశ రాజకీయాల నుంచి పారదోలినప్పుడే కొత్త రహదారులు, కొత్త రైలు మార్గాలు నిర్మించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవచ్చు’’అంటూ ఎన్నికల సమయంలో ఉచిత పథకాలను ప్రకటించే రాజకీయ పార్టీలపై పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు సులువైన రేవడీ సంస్కృతిని వదిలి, రాష్ట్రాభివృద్ధికి తీవ్రంగా పాటుపడుతున్నాయని ప్రధాని చెప్పారు. దేశ అభివృద్ధికి పునాదులు: కేజ్రీవాల్ ఉచిత పథకాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇస్తున్న విద్య, ఆరోగ్యం, విద్యుత్ సౌకర్యాలు ఓట్లు గుంజే తాయిలాలు కావని తెలిపారు. మన దేశం ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలిచేందుకు పునాది వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలని పేర్కొన్నారు. -
అత్యంత ప్రమాదకరమైన ఈ మూడు పాముల గురించి తెలుసా?
పశ్చిమ గోదావరి (బుట్టాయగూడెం): వర్షాకాలం మొదలైంది. పాములు ఎక్కడపడితే కనిపిస్తుంటాయి. అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టమైన పొదల సమీపంలో పాములు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. రైతులు పొలాలకు నీరుపెట్టేందుకు వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఈ సమయంలో అప్రమత్తంగా లేకపోతే పాముల రూపంలో కాలయముడు కాచుకుని ఉంటాడు. గత వారం రోజుల్లో పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో గల ప్రభుత్వాస్పత్రుల్లో పాము కాటు కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బుట్టాయగూడెం మండలంలో గత మూడు రోజుల్లో ఇద్దరు పాముకాటుకు గురై మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా మండ్రకప్ప, తేలు కాటుకు గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఉంటుంది. వీటి బారిన పడకుండా తప్పించుకోవడానికి అప్రమత్తతే ప్రధానమని వైద్యులు చెబుతున్నారు. అన్ని పాములు ప్రమాదకరం కాదు మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాముల వల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధారణంగా 50 శాతంపైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు. పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. రక్తపింజర ఎక్కువగా అటవీప్రాంతంలో తిరుగుతుంది. ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుందని చెబుతున్నారు. రక్తపింజర కాటువేసిన వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రులకు వెళ్లి వైద్యం పొందాలి. నాగుపాము నాగుపాము అత్యంత ప్రమాదకరమైంది. ఈ పాము కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుందని అంటారు. ముందుగా పాముకాటు వేసిన చోట వెంటనే కట్టు కట్టాలి. తదుపరి పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కట్లపాము కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి. కట్లపాము విషం రక్తంలోకి చేరకముందే వైద్యం చేయిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటించాలి ► పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ► పాము కాటువేయగానే గాయాల పైభాగంలో కట్టుకట్టాలి. ► ఏ పాము కాటు వేసిందో తెలుసుకొని యాంటీ వీనమ్(విషానికి విరుగుడు) తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ► రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్ళేప్పుడు కాళ్ళకు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్దాలు చేసే పరికరాన్ని వెంట తీసుకుని వెళ్ళడం వల్ల పాముకాటు నుంచి రక్షించుకోవచ్చు. అన్ని ఆస్పత్రుల్లో యాంటివీనమ్ పాముల నుంచి రక్షించుకునేందుకు అప్రమత్తత అవసరం. పాముకాటుకు గురైతే యాంటివీనమ్ మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ఉంటాయి. కాటుకు గురైన వ్యక్తి శరీరంలో మార్పులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. – జె. సురేష్, వైద్యుడు, పులిరామన్నగూడెం -
ఒకే రోజు నాలుగు సినిమాలు, ప్రేక్షకుడి ఓటు ఎవరికో?
డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ నేటితరం ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఆయన.. దేశంలోనే తొలిసారిగా 'మా ఇష్టం' సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను మే 6న రిలీజ్ చేయనున్నారు. ఇక అదే రోజు అశోకవనంలో అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ, భళా తందనాన సినిమాలు రిలీజవుతున్నాయి. మరి వీటిలో ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటు వేస్తారు? ఏ మూవీ హిట్ అందుకోనుందనేది వేచి చూడాల్సిందే! View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_771247577.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: నోరా ఫతేహితో డేటింగ్పై స్పందించిన కొరియోగ్రాఫర్ పెళ్లిపీటలెక్కబోతున్న రీల్ లైఫ్ జంట -
గ్యాస్ సిలిండర్కి ఎక్స్పైరీ తేదీ ఉంటుంది!..గడువు దాటితే ప్రమాదమే
బలిజిపేట: గ్యాస్ కనెక్షన్ కొనుగోలు చేసి వినియోగించడం ప్రస్తుతం ఎంత అవసరమో, దాని వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం. జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అందులో అత్యంత ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్కూ కాలపరిమితి ఉంటుందని తెలియకపోవడమే. గ్యాస్ సిలిండర్కు ఉండే కాలపరిమితిని సాధారణంగా ఎవరూ గమనించరని, కాలపరిమితి దాటితే పెనుప్రమాదం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ తేదీ ముగిసినా వినియోగిస్తే గ్యాస్ లీయయ్యే ప్రమాదం ఉందంటున్నారు. సరఫరా చేసే ప్రతి సిలిండర్పై ఎక్స్పైరీ సంవత్సరాన్ని, నెలను కోడ్ విధానంలో మెటల్ ప్లేట్పై వంటగ్యాస్ కంపెనీలు ముద్రిస్తాయి. సిలిండర్ మారుతున్నప్పుడల్లా ఎక్స్పైరీ గడువును చూసుకుని తీసుకోవడం, వినియోగించుకోవడం ఎంతో అవసరమని హితవు పలుకుతున్నారు. కాలపరిమితిని ఎలా గుర్తించాలంటే.. సిలిండర్ మెటల్ ప్లేటుపై ఆంగ్ల అక్షరంతో సంవత్సరం, నెల ఉంటుంది. దాని ప్రకారం అది ఏసంవత్సరం, ఏనెల తరువాత ఎక్స్పైరీ అవుతుందో తెలుస్తుంది. ఉదాహరణగా ఎ–24అని ఉంటే ఆ సిలిండర్ 2024 మార్చిలో ఎక్స్పైర్ అవుతుందని అర్థం. ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ఎ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు, బి అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సి అక్షరం జూలై నుంచి సెప్టెంబరు వరకు, డి అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబరు వరకు అని గుర్తించాలి. గడువును గుర్తించాలి సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేట్పై కోడ్ విధానంలో ఉండే ఎక్స్పైరీ గడువును గుర్తించి తీసుకోవాలి. అది నెల రోజులకు సమీపంలో ఉంటే అటువంటి సిలిండర్ను తీసుకోకూడదు. చిన్నచిన్న కుటుంబాలవారు, అతి తక్కువ వేతనం సంపాదించేవారు గ్యాస్ వినియోగం ఎక్కువ రోజులు చేస్తుంటారు. కనుక ఎక్స్పైరీ తేదీ లోపల వారి సిలిండర్ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అటువంటి సిలిండర్లతో ప్రమాదం సంభవించే ఆస్కారం ఉంది. అందుకు గడువును గుర్తించి సిలిండర్ తీసుకోవాలి. దానిస్థానంలో వేరే సిలిండర్ అడిగే హక్కు వినియోగదారునికి ఉంది. సిలిండర్కు పదేళ్ల గడువు సిలిండర్ తయారైన నాటి నుంచి పదేళ్ల వరకు దానికి గడువు ఉంటుంది. సిలిండర్ను ప్రత్యేకమైన ఉక్కుతో, లోపల భాగం సురక్షితమైన కోటింగ్తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(బీఐఎస్) ప్రమాణాలతో తయారుచేస్తారు. బీఐఎస్ అనుమతుల తరువాతే సిలిండర్ మార్కెట్లోకి వస్తుంది. గడువు ముగిసేవి ఉండవు గ్యాస్ సిలిండర్లు గడువు ముగిసేవి ఉండవు. ముందే వాటిని కండెమ్ సరుకుగా తీసివేస్తారు. తయారై వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తారు. పకడ్బందీగా చర్యలు ఉంటాయి. హర్ష, గ్యాస్ ఏజెన్సీ యజమాని, పలగర, బలిజిపేట మండలం (చదవండి: రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యం) -
డేంజరస్ మూవీకి వరుస షాక్లు.. ఫైనల్గా ఆర్జీవీ కీలక నిర్ణయం!
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘డేంజరస్’(తెలుగులో ‘మా ఇష్టం’) విడుదల వాయిదా పడింది. శుక్రవారం ( ఏప్రిల్ 8) విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ట్విటర్ ద్వారా ఆర్జీవీ వెల్లడించారు. ‘లెస్బియన్ నేపథ్యం కారణంగా చాలా థియేటర్లు సహకరించకపోవడంతో సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాం. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియజేస్తాను’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. మరోవైపు ఆర్జీవీ ‘మా ఇష్టం’ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాత నట్టి కుమార్ సివిల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని, ఇవ్వాల్సిన ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడ నిర్మాత నట్టి కుమార్ కోర్ట్ లో పిటిషన్ వేశారు. దీంతో ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ ను ఆపాలని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా వరుస వివాదాలు చుట్టుముట్టడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదల కాబోతోంది. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. I regret to inform that we are postponing the film KHATRA DANGEROUS due to non cooperation of many theatres due to its lesbian theme ..We will proceed in all ways to fight this injustice and come at a later date — Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022 -
‘మా ఇష్టం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
అలాంటి సినిమాలు తీయడం నాకు చేతకాదు : రామ్ గోపాల్ వర్మ
‘నా నుంచి పెద్ద బడ్జెట్ మూవీలు వస్తాయని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయద్దు. దానికి సంబంధించిన ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి సినిమాలు తీయడం నాకు చేతకాదు. తీయలేను’ అన్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘డేంజరస్’(తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదలవుతోంది). అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఏప్రిల్7న వర్మ బర్త్డే. ఈ సందర్భంగా బుధవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ‘మా’ ఇష్టం కథేంటి? ‘మా ఇష్టం’అనేది ఓ క్రైమ్ డ్రామా మూవీ. ఇద్దరు అమ్మాయిలు ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు. ఆ క్రైమ్ నుంచి బయటపడే క్రమంలో వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేదే ఈ మూవీ కథ. ఇందులో లెస్బియన్స్ గా లీడ్ పెయిర్ లలో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు అద్భుతంగా నటించారు. కాంట్రవర్సీ అయితే? నేను ఎలాంటి కాంట్రవర్సీస్ ను పట్టించుకోను. నేను తీసే సినిమా నాకు నచ్చినట్టుగా నా కోసమే తీసుకుంటాను. మంచి ఫాలోయింగ్ ఉన్న మీరు ఇలాంటి సినిమాలు తీస్తే ఎలా? నేను ఒక కాన్సెప్ట్ అనుకోని సినిమా తీస్తాను. నాకు నచ్చినట్టుగా సినిమా తీస్తాను . నచ్చితే చూడండి నచ్చకపోతే లేదు .అంతే తప్ప ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను. పెద్ద సినిమాలు ఎక్స్పెక్ట్ చేయ్యొచ్చా? నా నుంచి పెద్ద బడ్జెట్ సినిమాలు వస్తాయని ఆశించొద్దు. పెద్ద సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ముఖ్యం. అందరూ చూస్తేనే ఆ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. నాకు అలాంటి సినిమాలు చేయడం చేతకాదు. నేను ఇప్పడు తీయలేను. ‘మా ఇష్టం’లో బోల్డ్ కంటెంట్ ఎంతవరకు ఉంటుంది ? ఇందులో బోల్డ్ కంటెంట్ కంటే యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇందులో నావల్టీ తక్కువగా ఉంటుంది. అయితే ప్రేక్షకులు ఈ మధ్య నావల్టీ ఎక్కువ చూస్తున్నందున పోస్టర్స్ ను చూసి దానికే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఇద్దరి హీరోయిన్స్ మధ్య రొమాన్స్, యాక్షన్ తీయడానికి గల కారణం? ప్రపంచంలో ఇప్పటివరకు ఇద్దరి హీరోయిన్స్ లతో రొమాంటిక్ పాట షూట్ చేయడం జరగలేదు. ఇలాంటి కథ ఈ మధ్య ఎవ్వరూ తీయలేదు. హీరో,హీరోయిన్స్ మధ్య ప్రేమ అనేది కామన్ అది రెగ్యులర్ గా అందరూ తీసేదే..కానీ ఇలా తీయడం నేనే మొదటిసారి . మీ తదితర ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పటి వరకు నేను అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వచ్చాయి. ఇండో,చైనా మీద మార్షల్ ఆర్ట్స్ మీద ఒక సినిమా తీశాం. జూన్ లో రిలీజ్ అవుతుంది , కొండ సినిమా రెడీ గా ఉంది, దహనం వెబ్ సిరీస్ ఇవి కాక ఇంకా 20 స్క్రిప్ట్స్ రెడీ గా ఉన్నాయి. -
ఆర్ఆర్ఆర్ మూవీపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
ఆర్ఆర్ఆర్ మూవీపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి షాకింగ్ కామెంట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లిప్లాక్ పెట్టుకోలేదని, అందుకే అది ఫ్రెండ్షిప్ అయిందని, ఒకవేళ లిప్లాక్ పెట్టుకొని ఉంటే.. అది గే ఫిలిం అవుతుందని వర్మ చెప్పుకొచ్చాడు. లిప్లాక్ ఉన్నా లేకున్నా స్టోరీ మాత్రం మారదన్నారు. తాజాగా ఆయన తెరకెక్కించిన మూవీ ‘డేంజరస్’(తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదలవుతోంది). అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘డేంజరస్ ’ రెగ్యులర్ కథే.. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఉండడమే కొత్తదనం’ అన్నారు. అప్సర, నైనా వారి పెరెంట్స్ తో మాట్లాడిన తర్వాతే ఈ సినిమా చేశమని తెలిపారు. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తన సినిమా ప్రమోషన్స్కు వాడుకోవడం ఇది మొదటిసారేం కాదు. ఆ మధ్య ఎన్టీఆర్, చరణ్లతో.. ‘డేంజరస్’ హీరోయిన్లు నైనా గంగూలి, అప్సర రాణిలతో పోల్చారు. ‘రాజమౌళి.. మీకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి డేంజరస్ బాయ్స్ ఉంటే.. నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు’అంటూ ట్వీట్ చేస్తూ.. ఎన్టీఆర్, చరణ్లతో ఉన్న జక్కన్న ఫోటోకు ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఉన్న తన ఫోటోని జతచేశాడు. ఇప్పుడు మళ్లీ అదే సినిమా ప్రమోషన్స్లో ఆర్ఆర్ఆర్ని వాడేశాడు. ట్రెండింగ్లో ఉంది కాబట్టే ఆర్ఆర్ఆర్ని వాడేస్తున్నానని స్వయంగా ఆర్జీవే చెప్పడం గమనార్హం. -
తారక్, చరణ్ డేంజరస్ బాయ్స్.. ‘ఆర్ఆర్ఆర్’ని అలా వాడేసిన ఆర్జీవీ
సినిమాలను ప్రచారం చేయడంలో రామ్గోపాల్ వర్మ స్టైలే వేరు. ట్రెడింగ్లో ఉన్న ప్రతి అంశాన్ని ఆయన సినిమా ప్రమోషన్ల కోసం వాడేస్తాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘డేంజరస్’(తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదలవుతోంది) మూవీ కోసం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వాడేశాడు. ‘రాజమౌళి.. మీకు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి డేంజరస్ బాయ్స్ ఉంటే.. నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు’అంటూ ట్వీట్ చేస్తూ.. ఎన్టీఆర్, చరణ్లతో ఉన్న జక్కన్న ఫోటోకు ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఉన్న తన ఫోటోని జతచేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీపై ఆర్జీవీ ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ‘బాహుబలి-2 అనేది చరిత్ర.. ఆర్ఆర్ఆర్ అనేది చారిత్రాత్మకం’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇప్పుడేమో ఇలా తన సినిమా ప్రమోషన్స్కి వాడుకోవడం గమనార్హం. ఇక డేంజరస్ సినిమా విషయానికొస్తే..అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో రిలీజ్ కాబోతుంది. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. Well sirrr @ssrajamouli sir, if u have ur DANGEROUS men like @AlwaysRamCharan and @tarak9999 ,I also have my DANGEROUS women like @NainaGtweets and @_apsara_rani pic.twitter.com/XWDkb9ufSH — Ram Gopal Varma (@RGVzoomin) March 30, 2022 -
ఆర్జీవీ ‘మా ఇష్టం’ వచ్చేస్తుంది
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘మా ఇష్టం’. తెలుగు-తమిళ-కన్నడ-మలయాళం-హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం హక్కులను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ మిగతా భాషల్లో ‘డేంజర్’ పేరుతో విడుదలవుతుంది. గతంలో భీమవరం టాకీస్ బ్యానర్ లో ఆర్జీవితో ఐస్ క్రీమ్ సినిమా నిర్మించిన రామ సత్యనారాయణ తాజాగా ఈ చిత్రం తెలుగు రైట్స్ దకించుకున్నారు. ఏప్రిల్ 8 వ తేదీన తెలుగు-హిందీ-తమిళ్-కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రంగా ‘మా ఇష్టం’ రావడం గమనార్హం. అప్సర-నైనా గంగోలి ఈ క్రేజీ చిత్రంలో ముఖ్యపాత్రలలో నటించారు. . @NainaGtweets SHUTTING UP @_apsara_rani in DANGEROUS..Film releasing in theatres on APRIL 8th pic.twitter.com/XbXlPUDZfE — Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2022 -
వాసాలతిప్పలో ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేప!
సాక్షి, తూర్పుగోదావరి: ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పలో మనిషి ముఖంతో పోలిన రూపంతో ఉన్న అరుదైన చేప మత్స్యకారులకు చిక్కింది. సోషల్ మీడియాలో ఈ చేప వైరల్గా మారింది. విచిత్రం ఏమిటంటే.. తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్లా ఉబ్బుతుంది. అందుకే దీన్ని బెలూన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేపను బొంక చేప, బెలూన్ ఫిష్, గ్లోబ్ ఫిష్ తదితర పేర్లతోనూ పిలుస్తారు. ఇది చూసేందుకు మూములుగానే ఉంటుంది. కానీ తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్లా (ఉబ్బుతుంది)మారిపోతుంది. అందుకే బెలూన్ ఫిష్ అంటారు. చేప అలా ఉబ్బిపోగానే.. దాన్ని తినడానికి వచ్చిన జీవులు వెంటనే అక్కడి నుంచి భయంతో పారిపోతాయి. టెట్రాడాంటిడీ జాతికి చెందిన ఈ చేప శాస్త్రీయ నామం టెట్రాడాన్ ఇది ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేపగా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. జపాన్కు చెందిన ‘ఫుగు’ లేదా ‘బ్లో ఫిష్’. జపాన్లోని షిమోనోసెకి అనే ప్రాంతంలో దీన్ని ఎక్కువగా వండుకుని తింటారు. జపాన్, కొరియాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్లు ఈ చేపలతో టేస్టీ ఆహారం సిద్ధం చేస్తారు. ఈ చేపను వండాలంటే సుమారుగా పదేళ్ల అనుభవం, లైసెన్స్ ఉన్న వాళ్లే చేయాలి. ఎందుకంటే ఈ చేప చాలా విషపూరితమైనది. కట్ చేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే ఆ విషం వల్ల ప్రాణాలకే ప్రమాదకరం. -
ఉక్రెయిన్పై యుద్ధం: భారతీయ విద్యార్థి మృతి తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
Live Updates: ►మరో సారి రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు.. రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండవ రౌండ్ చర్చలు మార్చి 2 న జరగనున్నాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అయితే ఈ చర్చలకు సంబంధించి ఎక్కడ జరగనున్నాయి, దీనికి ఎవరు హాజరుకానున్నారన్న పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ►భారతీయ విద్యార్థి మృతి తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం ఉక్రెయిన్లో ఖార్కివ్ కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి చెందడంతో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత రెండు రోజుల్లో ప్రధాని ఇలా నిర్వహించడం ఇది నాలుగోసారి. ఈ సమావేశంలో ఉక్రెయిన్లోని పరిస్థితులతో పాటు భారత విద్యార్థులను త్వరగతిన స్వదేశానికి రప్పించే ప్రక్రియ మరింత వేగవంతం చేసే చర్యలు గురించి చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ► 660,000 కంటే ఎక్కువ మంది శరణార్థులు పొరుగు దేశాలలో ఆశ్రయం పొందేందుకు ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయారని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ తెలిపింది. ►మా లక్ష్యాలు పూర్తయ్యే వరకు దాడిని కొనసాగుతుంది: రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ రష్యా తన లక్ష్యాలను సాధించే వరకు ఉక్రెయిన్పై దాడిని కొనసాగిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా దాదాపు వారం రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోంది. ►2022 వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇవ్వకుండా రష్యాపై నిషేధం 2022లో వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు రష్యా అతిధ్యం ఇవ్వనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రష్యా అతిధ్యాన్ని నిషేదిస్తున్నట్లు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ ప్రకటించింది. ►ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు ఏపీ విద్యార్థులు విమానాశ్రయం నుంచి నేరుగా వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు ►ఉక్రెయిన్పై రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి ఖార్కీవ్లో రష్యన్ బలగాలు కాల్పుల్లో విద్యార్థి మృతి కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్గా గుర్తింపు With profound sorrow we confirm that an Indian student lost his life in shelling in Kharkiv this morning. The Ministry is in touch with his family. We convey our deepest condolences to the family. — Arindam Bagchi (@MEAIndia) March 1, 2022 ► ఖార్కివ్, చెర్నిహివ్(ఉక్రెయిన్)పై రష్యా బలగాల దాడులు. ఒకిట్రికా ఎయిర్బేస్పై దాడిలో 70మంది దుర్మరణం. ► భారతీయ విద్యార్థుల బృందం ఒకటి పోల్యాండ్లోకి ప్రవేశించింది. A group of Indian students stranded in Ukraine has entered Poland, to undertake the onward journey to India pic.twitter.com/Rm3YvumzoC — ANI (@ANI) March 1, 2022 ► వాయుసేనను రంగంలోకి దించిన కేంద్ర ప్రభుత్వం.. భారతీయుల తరలింపు వేగవంతం చేయాలని చూస్తోంది. ► కీవ్లోని భారతీయులు అర్జెంట్గా నగరం వీడాలని భారత ఎంబసీ కీలక సూచన చేసింది. ► రష్యా బలగాలు కీవ్ నగరంవైపు వేగంగా కదులుతున్నాయి. దీంతో ఏం జరుగుతుందా? అనే టెన్షన్ నెలకొంది. ► ఓఖ్టిర్కా (ఉక్రెయిన్) సైనిక స్థావరంపై రష్యా ఫిరంగిదళం దాడి చేయడంతో 70 మందికి పైగా ఉక్రేనియన్ సైనికులు మరణించినట్లు సమాచారం. ► రష్యాకు అమెరికా ఊహించని దెబ్బ: ఆంక్షల మీద ఆంక్షలతో రష్యా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ తరుణంలో తాజాగా అమెరికా.. రష్యాకు ఊహించని షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలో రష్యా దౌత్య మిషన్లోని 12 మంది సభ్యులను యునైటెడ్ స్టేట్స్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా విలేకరుల సమావేశంలో తెలిపారు. అమెరికా చేష్టల్ని ఖండిస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన. #WATCH 12 members of Russia's diplomatic mission to the UN have been expelled by the United States, said Russia's Permanent Representative to the United Nations Vassily Nebenzia during a press conference (Source: UN Web TV) pic.twitter.com/0JVT66C3nu — ANI (@ANI) March 1, 2022 ► కీవ్ నుంచి 64 కిలోమీటర్ల మేర రష్యన్ దళాల మోహరింపు. శాటిలైట్ చిత్రాలు వైరల్. ► ఉక్రెయిన్లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్లోని అనేక నివాస ప్రాంతాలపై రష్యన్ ఫిరంగిదళం దాడి చేసింది. ఖార్కివ్లో జరుగుతున్న షెల్లింగ్లో కనీసం 11 మంది పౌరులు మరణించినట్లు సమాచారం. ► ఉక్రెయిన్ సంక్షోభం.. ఆపరేషన్ గంగలో భాగంగా ముంబైకి చేరిన ఏడో విమానం. సురక్షితంగా 182 మంది స్వదేశానికి రాక. ► ఆరవ రోజు యుద్ధంలో భాగంగా.. జనావాస ప్రాంతాల్లో రష్యా దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. దాడుల్లో 350 మంది పౌరులు మరణించినట్లు చెబుతోంది. చర్చలు అసంపూర్తిగా ముగిసిన వేళ .. ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ కొనసాగుతోంది. ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటుండటంతో ఆరో రోజు రష్యా దళాలు ముందుకు సాగలేకపోతున్నాయి. అయితే కీలక పట్టణాలను మాత్రం సమర్థవంతంగా చుట్టుముట్టగలిగాయి రష్యా బలగాలు. ఈ క్రమంలో.. ► రష్యా తమపై వాక్యూమ్ బాంబ్ ప్రయోగించినట్లు ఆరోపిస్తోంది ఉక్రెయిన్. ఈ మేరకు అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మరకరోవా సోమవారం అమెరికా కాంగ్రెస్(చట్ట సభ)లో ప్రకటించారు. జెనీవా కన్వెక్షన్ నిషేధించిన వాక్యూమ్ బాంబ్ను దురాక్రమణలో భాగంగా రష్యా మాపై(ఉక్రెయిన్) ప్రయోగించింది అని పేర్కొన్నారు. ఉక్రెయిన్లో రష్యా పెను విధ్వంసం చేయాలనుకుంటోంది అని ఆమె ఆరోపించారు. వాక్యూమ్ బాంబు అనేది ఒక రకమైన పేలుడు పదార్థం. ఇది అధిక-ఉష్ణోగ్రత పేలుడును ఉత్పత్తి చేయడానికి చుట్టుపక్కల గాలి నుండి ఆక్సిజన్ను ఉపయోగించుకుంటుంది. ఆ ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించి.. లక్క్ష్యం తునాతునకలు అయిపోతుంది. ఇదిలా ఉండగా.. రష్యా వాక్యూమ్ బాంబ్ను ప్రకటించినట్లు ధృవీకరణ రావాల్సి ఉంది. అయితే శనివారం మధ్యాహ్నాం ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో థర్మోబారిక్ బహుళ రాకెట్ లాంచర్ను గుర్తించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రకటించింది. -
వార్తల్లో అభిప్రాయాలను జొప్పించొద్దు: సీజేఐ
ముంబై: సొంత అభిప్రాయాలతో కూడిన వార్తలు ప్రమాదకరమైనవని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హెచ్చరించారు. ఆరోగ్యవంతమైన పజ్రాస్వామ్యానికి నిర్భయమైన, స్వతంత్య్రమైన పత్రికా వ్యవస్థ అవసరమని, అయితే వార్తలను ఊహలతో నింపడం వ్యవస్థకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. సొంత ఆలోచనలను వార్తాకథనాల్లోకి చొప్పించడం కూడదని, స్వీయ అభిప్రాయాలను నిజ నివేదికలకు దూరంగా ఉంచాలని జర్నలిస్టులకు సూచించారు. రెడ్ ఇంక్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అవార్డు పొందిన విజేతలను ఆయన అభినందించారు. స్వీయ భావాలు వార్తలను ప్రభావితం చేయకుండా పనిచేయాలని, ఒకరకంగా జర్నలిస్టులు సైతం న్యాయమూర్తులేనని ఆయన అన్నారు. నిజాలను మాత్రమే రిపోర్టు చేయాలని కోరారు. జడ్జిలను విలన్లుగా చూపడం వంటి విషయాలపై పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, జాతీయ ప్రయోజనాల కోసం అంతా కలిసిపనిచేయాలని కోరారు. 2020 జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు మరణానంతరం సిద్ధిఖీని ఎంపిక చేశారు. అఫ్గాన్లో రిపోర్టింగ్ చేస్తూ సిద్ధిఖీ తాలిబన్ కాల్పుల్లో మరణించారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు రమణ నివాళులర్పించారు. -
సూపర్బగ్స్ పెనుప్రమాదం.. యాంటీ బయోటిక్ ఎప్పుడు వాడాలంటే
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఏ మందునైనా అవసరమైనప్పుడు నిర్ణీత మోతాదులో వాడితేనే మంచి ఫలితం వస్తుంది. అనవసరంగా వాడితే మంచి జరగకపోగా దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఒకప్పుడు కలరా తదితర అంటువ్యాధులు ప్రబలినప్పుడు పెన్సిలిన్ వంటి యాంటీబయోటిక్స్ ప్రజల ప్రాణాలు నిలిపాయి. ఇప్పుడు పలు రకాల యాంటీబయోటిక్స్ను మితిమీరి వాడటం వల్ల తీవ్ర దుష్ఫలితాలు కనిపిస్తున్నాయని ఫార్మకాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నేడు ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా యాంటీబయోటిక్స్ వాడేస్తున్నారు. విచ్చలవిడిగా ఈ మందులను వినియోగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. దీంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. జలుబు చేసినప్పుడు సిట్రజెన్ వంటి ఎలర్జిక్ డ్రగ్ వాడితే తగ్గిపోతుంది. దానికి కూడా యాటీబయోటిక్స్ వాడుతున్నారు. పంటి నొప్పి వంటి సమస్యలకు యాంటీబయోటిక్స్ వినియోగం మంచిది కాదని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. ఈ మందులను అవసరం మేరకు మాత్రమే వినియోగించి, విచ్చలవిడితనాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు సైతం ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నాయి. యాంటీ బయోటిక్ ఎప్పుడు వాడాలంటే.. మనకు ఏదైనా జబ్బు చేసినప్పుడు వైరల్ ద్వారా వ్యాప్తి చెందిందా? లేక బ్యాక్టీరియా కారణమా అన్నది నిర్ధారించుకోవాలి. బ్యాక్టీరియా కల్చర్ పరీక్ష ద్వారా నిర్ధారించుకుని అవసరం మేరకు మూడు నుంచి ఐదు యాంటీబయోటిక్స్ వాడాలి. మన శరీరంలో మంచి, చెడు బ్యాక్టీరియాలు ఉంటాయి. చెడు బ్యాక్టీరియా నివారణకు అతిగా యాంటీబయోటిక్స్ వాడటం వల్ల వాటి ప్రభావం మంచి బ్యాక్టీరియాపై పడుతుంది. ఫలితంగా శరీరంలోని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి తీవ్రమైన నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. యాంటీబయోటిక్స్ రెండు రకాలుగా ఉంటాయి. నేరో స్ప్రెక్టమ్ యాంటీబయోటిక్స్ ఒకే రకమైన బ్యాక్టీరియాకు పనిచేస్తాయి. బ్రాడ్ స్ప్రెక్టమ్ యాంటీబయోటిక్స్ రెండు మూడు రకాల బ్యాక్టీరియాల నివారణకు పనిచేస్తాయి. సూపర్బగ్స్ పెనుప్రమాదం యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా వాడటం వల్ల శరీరంలో బ్యాక్టీరియాకు డ్రగ్ రెసిస్టెన్స్ (ఔషధ నిరోధకత) ఏర్పడుతుంది. ఔషధ నిరోధకతను సంతరించుకున్న బ్యాక్టీరియా నుంచి వచ్చే తరువాతి తరాల బ్యాక్టీరియాలను సూపర్ బగ్స్ అంటారు. ఇవి సాధారణ యాంటీ బయోటిక్స్కు లొంగవు. ఎక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం కొందరిలో సూపర్ బగ్స్ను గుర్తిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాధిని గుర్తించడం ముఖ్యం నిమోనియా వ్యాధి వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి మూడు కారణాలుగా వస్తుంది. వైరల్ నిమోనియా చాలా వేగంగా వ్యాప్తి చెంది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధికి మందులు వాడేటప్పుడు సరైన నిర్ధారణ చేసి యాంటీబయోటిక్స్ వాడాలి. లేకుంటే నివారించడం కష్టం. నిమోనియానే కాదు ఏ వ్యాధినైనా యాంటీబయోటిక్స్ వినియోగించే సమయంలో బ్యాక్టీరియా కల్చర్, అవసరమైతే డ్రగ్ కల్చర్ పరీక్షలు చేయడం ఉత్తమం. గర్భిణుల విషయంలో జాగ్రత్తలు అవసరం గర్బిణులకు కొన్ని రకాల యాంటీబయోటిక్స్ వాడటం చాలా ప్రమాదకరమని ఫార్మకాలజీ నిపుణులు చెపుతున్నారు. వారు వైద్యుల సూచన లేకుండా యాంటీబయోటిక్స్ వాడటం వలన గర్భస్థ శిశువులో అవయవలోపాలు ఏర్పాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. -
ప్రమాదకరంగానే ‘రాయలచెరువు’
తిరుపతి రూరల్/రామచంద్రాపురం: చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని సుమారు 500 ఏళ్లనాటి రాయలచెరువు పరిస్థితి ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉంది. 1,050 ఎకరాల్లో 0.9 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ చెరువు నిండుకుండను తలపిస్తోంది. భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో చెరువు కట్టకు లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, జిల్లా అధికారయంత్రాంగం క్షేత్రస్థాయిలో కట్ట బలోపేతం చేసే పనులను పర్యవేక్షిస్తున్నారు. సమీపంలోని 17 గ్రామాలకు చెందిన దాదాపు 20వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన, వసతులు కల్పించారు. నిపుణుల పరిశీలన రాయలచెరువు కట్టను సోమవారం తిరుపతి, చెన్నై ఐఐటీల సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు జానకీరామయ్య, రోషన్ శ్రీవాస్తవ, మైనర్ ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, సోమశిల ప్రాజక్టు సీఈ హరినారాయణరెడ్డి, జలవనరుశాఖ ఎస్ఈ విజయకుమార్రెడ్డి పరిశీలించారు. లీకేజీలను త్వరితగతిన అరికట్టాలని, అవుట్ఫ్లోను 3వేల కూసెక్కులకు పెంచాలని సూచించారు. చెరువు పటిష్టతకు కనీసం 35వేల ఇసుక మూటలు అవసరమవుతాయన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చొరవతో భారతీ సిమెంట్స్ యాజమాన్యం పంపిన 50వేల సంచుల్లో ఇసుక, కంకర నింపి కట్ట పనులను అధికారులు వేగవంతం చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన చెరువు కట్టను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఉన్నారు. -
అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!!
These 5 Delicious But Deadly Foods That Could Kill You: భోజన ప్రియులకు ఇది చేదు వార్తే! ఎందుకంటే వీటిని తినాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి మరి. ఆలోచించి తినడమేంటి..? ఇదే కదా మీ అనుమానం. అవును.. అత్యంత విషపూరితమైన వంటకాలు గురించే మనం చర్చిస్తుంది. వీటిని తినడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే! అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఇష్టంగా తింటారట. ఈ విశేషాలు మీ కోసం.. ఫూగు పఫర్ ఫిష్తో తయారు చేసే ఫూగు వంటకం.. జపాన్లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇది. పఫర్ ఫిష్ అత్యంత విషపూరితమైనది. దీనితో వంటలు చేయడానికి జపాన్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారట. షెఫ్ (వంట చేసేవారు) ఏ మాత్రం ఏమరుపాటుగా వండినా దాన్ని తిన్నవారు ప్రాణాలు కోల్పోవటం ఖాయం! బ్లడ్ క్లామ్ (నత్త గుల్లలు) చైనాలో బ్లడ్ క్లామ్లను తరచుగా తింటారు. ఐతే వీటిని తగు జాగ్రత్తలతో తినకపోతే టైఫాయిడ్, హెపటైటిస్ బారీన పడే ప్రమాదం ఉంది. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. పచ్చి కిడ్నీ బీన్స్ రెడ్ కలర్లో ఉండే పచ్చి కిడ్నీ బీన్స్లో భిన్న రకాలైన విష కారకాలు ఉంటాయి. వీటిని వండకుండా పచ్చిగానే తింటే ఆసుపత్రిలో అడ్మిషన్ తీసుకోక తప్పదు. అంతేకాకుండా పచ్చి కిడ్నీ బీన్స్ కంటే కూడా సరిగ్గా ఉడికించకుండా వీటిని తింటేనే అధికంగా హాని కలుగుతుందట. ఫ్రై చేసిన మెదడుతో శాండ్విచ్ (ఫ్రైడ్ బ్రెయిన్ శాండ్విచ్) ఆవు వంటి పశువుల మెదడుతో తయారు చేసిన శాండ్విచ్ల వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న కారణంగా వీటి తయారీని నిషేధించారు కూడా. బర్డ్స్ నెస్ట్ సూప్ పక్షి గూడుతో తయారు చేసే ఈ సూప్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదట. ఒక కప్పు బర్డ్స్ నెస్ట్ సూప్ సుమారు పది వేల డాలర్లు ఉంటుంది. పక్షుల లాలాజలంతో తయారు చేసే చైనీయుల పురాతన వంటకం ఇది. ఏది ఏమైనప్పటికీ దీనిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది. చదవండి: Amudham Oil Benefits In Telugu: ఆముదంతో చర్మం, జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చిలా! -
ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం
-
Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు..
ఈ మధ్య మనుషులకి వెర్రెక్కిందేమోననే అనుమానం వస్తుంది. ప్రాణాలను పెట్టుబడిగాపెట్టి ఎంతటి రిస్కుకైనా తెగిస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటనకు చెందిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. పడగ విప్పి ఉన్న పామును ముద్దాడుతున్న యువకుడు ఈ వీడియోలో కనిపిస్తాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో లక్షల మంది ఆసక్తిగా ఈ వీడియోను వీక్షిస్తున్నారు. విష సర్పాలతో సెల్పీలు దిగడం, ముద్దాడటం... ఆ క్షణానికి థ్రిల్లింగ్గా అనిపించినా.. ఒక్కోసారి స్టంట్ బెడిసికొట్టి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని నెటిజన్లు సదరు వ్యక్తిపై మండిపడుతున్నారు. ఐతే మరికొందరేమో ఇది ఫేక్.. పాముకు కోరలు లేవేమోనని సరదాగా కామెంట్ చేశారు. చదవండి: Crime Story: ప్రమాదం అంచున..! View this post on Instagram A post shared by ┈┉━❀👑 🅖🅞🅖🅐 🅝🅘 🅓🅐🅨🅐 👑❀━┉┈ (@_goga_ni_daya_) -
అదొక అందమైన తోట.. ముచ్చటపడి ఏది ముట్టుకున్నా ప్రాణాలకు ముప్పే..
సువిశాలమైన ఉద్యానవనాల్లో విహరించడం ఒక అద్భుతమైన అనుభూతి. తోటల్లో తిరుగుతూ ఉంటే, ప్రకృతికి దగ్గరగా సంచరిస్తున్నట్లుంటుంది. తోటల్లోని మొక్కలకు పూచే పువ్వులను చూస్తే పూజ కోసమో, సరదాగా తలలో తురుముకోవడం కోసమో కోయాలనిపిస్తుంది. తోటల్లోని చెట్లకు కాసే కాయలను, పండే పండ్లను కోసుకు తినాలనిపిస్తుంది. ప్రభుత్వాల అధీనంలో ఉండే కొన్ని తోటల్లో పూలు, పండ్లు కోయడంపై ఆంక్షలుంటాయి. ముచ్చటగా పెంచుకునే ప్రైవేటు తోటల్లో అలాంటి ఆంక్షలేమీ ఉండవు. మనసుకు నచ్చిన మొక్కలను పెంచుకోవచ్చు. వాటికి పూసిన పూలు, కాసిన కాయలు యథేచ్ఛగా కోసుకోవచ్చు. కానీ, బ్రిటన్లోని ఆ తోటలో పూలు, కాయలు కోసుకోవడం సంగతి అటుంచితే, అక్కడి మొక్కలను తాకినా ప్రమాదమే! తాకితే శిక్షలు ఏవైనా పడతాయని కాదు గానీ, అవి అత్యంత విషపూరితమైనవి. ప్రపంచంలోని అత్యంత అరుదైన, విషపూరితమైన వృక్షజాతులన్నీ ఈ తోటలో కనిపిస్తాయి. ఈ తోట బ్రిటన్లో నార్త్అంబర్లాండ్లోని ఆన్విక్ కేసిల్లో ఉంది. ఈ తోటకు ఏర్పాటు చేసిన నల్లని ఇనుప ప్రవేశ ద్వారంపైన ప్రమాద సంకేతాలుగా పుర్రె, ఎముకల గుర్తులు కనిపిస్తాయి. తోట లోపల కూడా ఇలాంటి ప్రమాద సంకేతాలు దాదాపు అడుగడుగునా కనిపిస్తాయి. నిపుణులైన గైడ్ల పర్యవేక్షణలో మాత్రమే సందర్శకులు దీని లోపలకు వెళ్లవలసి ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణ లేకుండా యథేచ్ఛగా వెళితే, లేనిపోని అనర్థాలు తప్పకపోవచ్చు. ఈ తోటలోని మొక్కలు, పొదలు, చెట్లు, వాటికి పూసే రంగు రంగుల పూలు, కాయలు, పండ్లు కళ్లను కట్టిపడేస్తాయి. అలాగని, వాటిని తాకడానికి ప్రయత్నించినా, మొక్కలకు పూసే పూలను కోయకుండానే, వాటిని వాసన చూసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో ఊహించడం కష్టం. గైడ్ల సూచనల మేరకు సురక్షితమైన దూరంలో నిలుచుని వీటిని చూడటమే అన్నివిధాలా క్షేమం. నార్త్అంబర్లాండ్ డ్యూషెస్ జేన్ పెర్సీ 2005లో ఈ తోటను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో పదకొండో శతాబ్దినాటి కేసిల్ శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పునరుద్ధరించి, ప్రపంచంలోని అరుదైన విషపు మొక్కలను ఏరికోరి తీసుకొచ్చి ఈ తోటను పెంచారు. ఇందులోని విషపు మొక్కలు కొన్ని ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. అందుకే ‘మీ ప్రాణాలు తీసేసే మొక్కలే మీ ప్రాణాలను కాపాడతాయి’ అంటారు పెర్సీ. ఈ తోటలో బెల్లడోనా, పాయిజన్ ఐవీ, హెన్బేన్, జెయింట్ హాగ్వీడ్ సహా వందలాది విషపు మొక్కలు ఉన్నాయి. వీటిలో కొన్నింటి పూల వాసన చూస్తే కళ్లు బైర్లు కమ్మడం, వాంతులవడం వంటి లక్షణాలు మొదలవుతాయి. కొన్ని మొక్కలను తాకితే చాలు ఒళ్లంతా దద్దుర్లు రేగి, చర్మం మంట పెడుతుంది. కొన్నింటి కాయలు, పళ్లు తింటే మైకం కమ్ముకు రావడమే కాకుండా, ప్రాణాంతక పరిస్థితులు సైతం ఎదురవుతాయి. ఈ తోటలోని మొక్కలు ప్రకృతిలోని జీవవైవిధ్యానికి అద్దంపడతాయి. చదవండి: ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు -
చైనా బొమ్మలతో డేంజర్!
Dangerous Chemicals In China Toys: మేడ్ ఇన్ చైనా బొమ్మలకు అమెరికా చెక్ పోస్ట్ వేసింది. చైనా నుంచి నౌకల్లో చేరిన బొమ్మలను దేశంలోకి రాకుండా అడ్డుకుంది. తాజాగా పోర్ట్లోనే సుమారు ఏడు బాక్స్ల బొమ్మలను అధికారులు సీజ్ చేయడం విశేషం. ఇందుకు కారణం.. బొమ్మల్లో ప్రమాదకరమైన కెమికల్స్ను గుర్తించడం!. చైనా నుంచి వచ్చిన బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాల ఆనవాళ్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు షిప్లో వచ్చిన మేడ్ ఇన్ చైనా బొమ్మల్ని అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. భారత్లో బాగా ఫేమస్ అయిన లగోరి(స్వీట్, పల్లీ.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు) తరహా చైనా మేడ్ బొమ్మలూ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 16న చేపట్టిన కన్జూమర్ ప్రొడక్ట్స్ సేఫ్టీ కమిషన్(CPSC), సీబీపీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న బొమ్మల్ని గుర్తించారు. కొన్ని బొమ్మలకు సీసం, కాడ్మియం, బేరియం పూత పూస్తున్నారని, దానివల్ల పిల్లల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని పేర్కొంటున్నారు వైద్యులు. అంతేకాదు ఆగష్టు 24న చైనా నుంచి షిప్ ద్వారా వచ్చిన కొన్ని బొమ్మల్లోనూ ఈ కెమికల్స్ ఆనవాళ్లను నిర్ధారించారు. ఈ తరుణంలో అక్టోబర్ 4న అమెరికాకు చేరుకున్న చైనా బొమ్మల్ని సీజ్ చేయడం విశేషం. మరోవైపు హాలీడే షాపింగ్ సీజన్ నేపథ్యంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీపీబీ) అప్రమత్తమైంది. అంతేకాదు ఆన్లైన్ షాపింగ్ చేసేప్పుడు పిల్లల బొమ్మల విషయాల్లో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎఫెక్ట్తో చైనా బొమ్మల వర్తకంపై భారీ ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. చదవండి: చైనాలో భారీ కార్పొరేట్ పతనం తప్పదా? -
ట్రైన్ జర్నీలో యువకుడి డేంజరస్ ఫీట్లు.. ఒళ్లు గగుర్పుడిచే దృశ్యాలు
ముంబై: యువత తమ నైపుణ్యాలను, సాహసాలను ప్రదర్శించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. సమయం చిక్కినప్పుడల్లా స్టంట్లు, విన్యాసాలు ప్రయత్నిస్తుంటారు. బైక్, కారు, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు అస్సలు కుదురుగా ఉండరు. హద్దు మీరి సాహసాలు చేసి ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలో ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు చేసిన విన్యాసాల వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. వాస్తవానికి ఇది 2015లో చోటుచేసుకోగా తాజాగా ఓ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఇందులో ప్రమాదకరమని తెలిసినా కదులుతున్న రైలు డోర్ వద్ద తన స్నేహితులతో కలిసి నిలబడిన ఓ యువకుడు విన్యాసాలు చేశాడు. ముందుగా రైలు వెనక నుంచి పరుగెత్తకుంటూ వచ్చి రైలు ఎక్కాడు. తరువాత ట్రైన్ డోర్ హ్యాండిల్ను పట్టుకొని మరోవైపు ఊగుతూ కనిపిస్తున్నాడు. అంతటితో ఆగకుండా పదేపదే కిందకు మీదకు దూకడం, దారిలో వచ్చే స్తంభాలను తాకుతూ డేంజరస్ ఫీట్లు చేశాడు. మధ్యలో రైలు నుంచి దూకి గోడపై నడిచి మళ్లీ రైలులోకి రావడం చేశాడు. ఇదంతా తన స్నేహితులతో వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిని చూసిన నెటిజన్లు యువకుడి అజాగ్రతను చూసి షాక్కు గురవుతున్నారు. ఇలాంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరమని, స్టంట్ ప్రయత్నాలు చేసే సమయంలో గాయలు, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చదవండి: షాకింగ్: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా రూ. 900 కోట్లు జమ! వైరల్: బాబోయ్.. బైకుపై 13 మంది.. ఏంటీ వెర్రి పని! Wow #OMG #Madness #trains #Travel @ladbible @HldMyBeer @CrazyFunnyVidzz @Viralmemeguy #Lol #funny @LockerRoomLOL @YoufeckingIdiot @LovePower_page @DailyViralPro @DailyViralPro pic.twitter.com/Tl8nEY9xfn — Cazz inculo (@InculoCazz) September 14, 2021 -
డేంజర్ కీటకాలు.. వాహనాలపై ముప్పేట దాడి
కరీంనగర్: రాత్రిపూట కీటకాలు ప్రమాదకరంగా మారాయి. ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని కాకతీయ కాలువ వంతెనపై ప్రమాదంగా మారింది. రోజు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఆ వంతెనపై వాహనదారులు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ఈ సమయంలో కీటకాలు వేలాదిగా వచ్చి చేరుతుంటాయి. దీంతో మూడు గంటల పాటు బీభత్సం సృష్టించాయి. రాజీవ్ రహదారిపై కీటకాలు ముసురుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కీటకాలు ఏ రకం కీటకాలో తెలుసుకునేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కీటకాల నమూనాలను సేకరించి అధికారులు ల్యాబ్కి పంపారు. -
ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త మాల్వేర్..!
మీరు వాడేది ఆండ్రాయిడ్ ఫోనా..! అయితే మీరు ఈ వార్తను కచ్చితంగా చదవాల్సిందే. గత కొన్నిరోజులుగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్పై కొత్త మాల్వేర్ దాడి చేయడానికి ప్రయత్నిస్తోందని సెక్యూరిటీ నిపుణులు కనుగొన్నారు. ఈ కొత్త మాల్వేర్ ఇతర మాల్వేర్కన్నా మరింత భయంకరంగా తన ప్రభావాన్ని చూపనుంది. సిస్టమ్ ఆప్డేట్ ముసుగులో గోప్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలలో కనిపించకుండా ఉంటుంది. ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ కంపెనీ ‘జింపెరియం’ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ కొత్త మాల్వేర్ సిస్టమ్ ఆప్డేట్గా చూపిస్తుందని తెలిపారు. ఈ మాల్వేర్ను గుర్తించడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఒకసారి ఈ మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యాక మొత్తం మొబైల్ ఫోన్ను తన కంట్రోల్లోకి తీసుకొని, కేవలం డేటానే కాకుండా ఇతర సమాచారాన్ని , ఫోటోలను , మెసేజ్లను తస్కరిస్తుంది. ఒకసారి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యాక హ్యాకర్లుడేటాను తమ అదుపులోనికి తెచ్చుకుంటారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ కాల్ డేటా, మెసేజ్లు , డిఫాల్ట్ గా ఉన్న బ్రౌజర్ సమాచారాన్ని , జీపీఎస్ లోకేషన్ను హ్యాకర్లు ట్రాక్చేయనున్నారు. జింపెరియం కంపెనీ సీఈవో శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ మాల్వేర్ మిగతా వాటికంటే చాలా ప్రమాదకారమని తెలిపారు. ప్రస్తుతం ఈ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్లో లేకపోవడం ఒకింతా ధైర్యానిచ్చినా, ఇతర థర్డ్ పార్టీ ఆండ్రాయిడ్ యాప్లను ఇన్స్టాల్ చేస్తే ఫోన్లలోకి వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. చదవండి: గూగుల్పే, జీమెయిల్ క్రాష్ అవుతోందా? ఇలా చేయండి! -
చెరువులు ఎప్పడు తెగుతాయోననే భయం
జీవన గమనానికి కల్పతరువులుగా ఉండాల్సిన చెరువు లు వరదనీటితో వణికిస్తు న్నాయి. బతుకుదెరువుకు బాటలు వేయాల్సిన తటాకాలు ప్రజలు తల్లడిల్లేలా పరిణమిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో నిండుకుండల్ని తలపిస్తున్నాయి. కట్టలు తెంచుకుంటున్నాయి. ముంపు ప్రాంతాల కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో నిండిన మహానగర పరిధిలోని పలు చెరువులు ఎప్పడు తెగుతాయోననే భయంతో సిటీజనులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఇప్పటికే కొన్ని చెరువులు తెగి బస్తీలను, కాలనీలను వరద ముంచెత్తాయి. ఆ భయానక పరిస్థితి నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరోసారి భారీ వర్షా లు కురిస్తే మాత్రం చాలా చెరువులు తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా చెరువుల పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్. మూసీతో.. ముప్పే ఇరువైపులా గోడల నిర్మించాలి సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మూసీ నది ప్రమాదకర స్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జనావాసాల మధ్య ప్రవహించే మూసీ ప్రదేశాల్లో ఎత్తయిన గోడలు లేకపోవడంతో నీటిలో మునుగుతున్నాయి. 1908లో వచ్చిన వరదల అనంతరం నీటిలో మునిగిన, కొట్టుకుపోయిన బస్తీల వద్ద మూసీ ఇరువైపులా ఎత్తయిన గోడలు నిర్మించారు. అప్పటి వరదలకు పూరానాపూల్ నుంచి చాదర్ఘాట్ వరకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో మూసీ ప్రవహించే ఈ ప్రదేశంలో దాదాపు 60– 70 అడుగులో ఎత్తులో రెండువైపులా గోడలు నిర్మించారు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కొన్ని బస్తీలు సేఫ్గా ఉన్నాయి. అదే మూసీ ప్రహించే ప్రదేశాల్లో పురానాపూల్కు అటు వైపు. చాదర్ఘాట్కు ఇటువైపు ఉన్న బస్తీలన్నీ నీటిలో మునిగాయి. మరోవైపు ఈ ప్రాంతాల వద్ద గోడలు లేకపోవడంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో ఎక్కువ నష్టం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. మొదటి వంతెన పురానాపూల్. ఇక్కడి నుంచి మూసీ ఉగ్రరూపం దాలుస్తోంది. చాదర్ఘాట్ దాటే వరకు ఇలాగే కొనసాగుతోంది. నిజాం హయాలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మూసీ నిర్వహణ చేసేవారు. 1963 వరకు మూసీ నీరు చాలా పరిశుభ్రంగా ఉండేది. అప్పట్లో వేసవి కాంలో మూసీలో పూడిక తీసేవారు. నీటి ప్రవాహంతో కొట్టుకువచ్చిన ఇసుకను తీసేవారు. మూసీ శుద్ధీకరణ కోసం ప్రత్యేక ప్రతి ఏటా నిజాం హయాంలో బడ్జెట్ కేటాయింపులు ఉండేవి. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లోని మురికివాడల్లో సుమారు 20 వేల మందికిపైగా ప్రజలు నివసిస్తున్నారని అంచనా. బిక్కుబిక్కున.. 15 కాలనీలు దిల్సుఖ్నగర్: మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ మండల పరిధిలో సుమారు 20 వరకు చెరువులు, కుంటలు నీటితో నిండి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మంత్రాల చెరువు,పెద్ద చెరువు, సందె చెరువుల నుంచి టీఎస్ఆర్ నగర్, జనప్రియ మహానగర్, ఎంఎల్ఆర్ కాలనీ, లక్ష్మీనర్సింహపురి కాలనీ, మిథిలానగర్, సత్యసాయినగర్, వివేక్నగర్ పరిసర 15 కాలనీలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ఎల్బీనగర్ పరిధిలో.. చంపాపేట: ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్గూడ, సరూర్నగర్ చెరువు, నాగోల్ డివిజన్లోని బండ్లగూడ చెరువు, నాగోల్ చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువు మన్సురాబాద్ పెద్ద చెరువు, హయత్నగర్ డివిజన్లోని కుమ్మరికుంట చెరువు, బీఎన్రెడ్డి డివిజన్లోని కప్పల చెరువు, బతుకమ్మకుంట చెరువు నిండు కుండలను తలపిస్తున్నాయి. వీటి కట్టలు తెగిపోతే దిగువనున్న కాలనీలు నీటమునిగే ప్రమాదం ఉంది. పొంగిపొర్లితే ప్రమాదకరమే.. గోల్కొండ: భారీ వర్షాలతో గోల్కొండ కోట ప్రహరీని ఆనుకుని ఉన్న శాతం చెరువు ప్రమాదకరంగా మారింది. ఈ చెరువు కట్ట తెగితే సుమారు 15 కాలనీలు నీట మునుగుతాయి. షేక్పేట్ అంబేడ్కర్ నగర్లోని కొత్త చెరువు సైతం వర్షాలకు నిండుకుండలా మారింది. ఈ చెరువు కట్ట నుంచి నీరు పొంగిపొర్లితే సుమారు 10 బస్తీలు నీట మునుగుతాయి. మారుతీనగర్లోని ఎర్రకుంట చెరువులో వరద నీరు నిండుతోంది. దీని కట్ట తెగితే లేదా పొంగిపొర్లితే దీని దిగువన ఉన్న 5 కాలనీలు నీట మునిగే పరిస్థితి. కుత్బుల్లాపూర్లో నిండుకుండలు.. కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నిజాంపేట్లోని తుర్క చెరువు, బాచుపల్లిలోని భైరవుని చెరువు, మేడికుంట, మద్దెల కుంటలు పూర్థిస్థాయిలో నిండాయి. ప్రగతినగర్లోని అంభీర్ చెరువులో సగం మేర నీళ్లు ఉన్నాయి. సూరారంలోని కట్టమైసమ్మ చెరువులో పూర్తిస్థాయిలో నీటి మట్టం చేరుకుంది. ఫాక్స్ సాగర్ చెరువు ఇప్పటికే నిండిపోగా నీటిని బయటకు వదులుతున్నారు. కేవలం నిజాంపేట్లోని తుర్క చెరువు నిండితేనే బండారి లేఅవుట్లోని మొత్తం ప్రాంతం నీట మునుగుతోంది. జీడిమెట్ల ఫాక్స్ సాగర్ తూము తెరిస్తే సుభాష్నగర్ నుంచి పాపయ్య యాదవ్నగర్ దాకా నాలాకు ఇరువైపులా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పల్లె చెరువు మళ్లీ తెగితే ప్రమాదమే.. చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట పరిధిలో ఇప్పటికే రెండు చెరువులు తెగి బస్తీలను ముంచెత్తాయి. గత వారం తెగిన పల్లె చెరువు కట్టను అధికారులు పూడ్చివేశారు. ఈ చెరువు మళ్లీ తెగితే దిగువన ఉన్న అలీ నగర్, హాషామాబాద్, అల్జుబేల్ కాలనీ, జీఎం కాలనీ, జీఎం చావునీ, ఉప్పుగూడ నీట మునిగే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం తెగిన గుర్రం చెరువు కట్టను ఇంకా పూడ్చలేదు. ప్రస్తుతం వచ్చిన నీరు వచ్చినట్లుగా దిగువకు వెళుతోంది. ఈ చెరువుకు ఎగువన ఉన్న బురాన్ఖాన్ చెరువు తెగితే పాతబస్తీని ముంచెత్తే ప్రమాదం ఉంది. హిమాయత్సాగర్కు కొనసాగుతున్న వరద సాక్షి, హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు హిమాయత్సాగర్ జలాశయంలోనికి 1,300 క్యూసెక్కుల వరద నీరు చేరిందని.. రెండు గేట్లు ఎత్తి మూసీలోకి 1372 క్యూసెక్కుల నీటిని వదిలి పెట్టినట్లు జలమండలి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ జలాశయం పూర్తిస్థాయిలో 1763.5 అడుగుల నీటి నిల్వ ఉంది. ఉస్మాన్సాగర్ జలాశయంలోనికి 833 క్యూసెక్కుల వరద నీరు చేరిందన్నారు. ఈ జలాశయం గరిష్టమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.848 అడుగుల మేర నిల్వలున్నాయన్నారు. భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాలు.. కంటోన్మెంట్: కంటోన్మెంట్ పరిధిలోని, ఎగువన ఉన్న చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. చెరువుల్లోకి కొత్తగా ఏమాత్రం వరద వచ్చినా లోతట్టు ప్రాంతాలు మళ్లీ మునిగే ప్రమాదం ఉంది. బోయిన్ చెరువు అలుగు (హస్మత్పేట నాలా) ఉప్పొంగితే బోయిన్పల్లి పరిధిలోని 40కి పైగా కాలనీలు మళ్లీ నీటమునిగే ప్రమాదముంది. రామన్నకుంట చెరువులో వరద నీరు ఎక్కువైతే బ్యాక్ వాటర్ వల్ల సీతారాంపూర్ పరిధిలోని ఐదారు కాలనీలు నీట మునిగి ఇళ్లలోకి నీరు చేరుతుంది. హస్మత్పేట నాలా, పికెట్ నాలాలు కలిసి ప్రవహించే రసూల్పురా ప్రాంతంలో వందలాది నివాసాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. వరదలా.. మొయిన్ చెరువు అంబర్పేట: ఉస్మానియా యూనివర్సిటీ అటవీ ప్రాంతంలో ఉన్న మొయిన్ చెరువు అంబర్పేట నియోజకవర్గాన్ని వరద ప్రవాహంతో ముంచెత్తుతుంది. ఈ చెరువు నుంచి వచ్చే వరద ప్రవాహంతో పరీవాహక ప్రాంతాలకు సమస్య లేకుండా ఉండాలంటే నాలాల విస్తరణే పరిష్కారం. అనూహ్యమైతే.. భారీ నష్టమే.. ఉప్పల్: ఉప్పల్ జోన్ పరిధిలో దాదాపు చెరువులు, కుంటలు కలిపి మొత్తం 14 ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి, రామంతాపూర్ పెద్ద చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, నాచారం హెచ్ఎంటీ చెరువు, ఎర్రకుంట చెరువు, కాప్రా చెరువులు ముఖ్యమైనవి. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులన్నీ నిండు కుండల్లా ఉన్నాయి. ఏదైనా అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉంది. రామంతాపూర్ పెద్ద చెరువు: ఈ చెరువుకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం నుంచి నీరు వస్తుంది. చెరువు స్థలం కోర్టు వివాదంలో ఉంది. దీంతో ఎఫ్టీఎల్ పరిధిలో సైతం అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చెరువు తెగే పరిస్థితి లేకపోయినప్పటికీ అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటే ఈ చెరువు కిందే ఉన్న చిన్న చెరువుపై కూడా ఆ ప్రభావం పడుతుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రామంతాపూర్ చిన్న చెరువు: విస్తీర్ణం 19.9 ఎకరాలు. ప్రస్తుతం ఉన్నది 11 ఎకరాలు. రామంతాపూర్ పెద్ద చెరువు నుంచి వరద నీరు చిన్న చెరువులోకి వెళ్తుంటాయి. అనుకోని సంఘటనలు జరిగితే చెరువు దిగువ భాగంలో ఉన్న దాదాపు 20 బస్తీలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. వరద వస్తే ముప్పే.. నాచారం హెచ్ఎంటీ నగర్ చెరువు: నాలాలతో పాటు నాచారం ఎర్రకుంట చెరువులోని నీరు ఇందులోకి వస్తోంది. చెరువు నాచారంలో ఉన్నా.. చెరువు కింది భాగం చెరువు కట్టగాని, మత్తడిగాని పూర్తిగా ఉప్పల్ వైపు ఉంటుంది. భారీగా వరద వస్తే చెరువు వు కింది 20 కాలనీలు ముంపునకు గురవుతాయని అంచనా. అలుగు లేక నాలాలోకి.. నాచారం పటేల్ కుంట చెరువు: ఈ చెరువుకు ఎలాంటి అలుగు లేదు. నీరు అధికంగా వస్తే అలుగు ప్రాంతంలో నిర్మించిన వంతెనపై నుంచి నీరు పారుతూ నాలాలోకి వెళ్తుంది. అనుకోని సంఘటనలు జరిగితే 10 కాలనీలు. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం పోలీస్ స్టేషన్ పూర్తిగా నీటి మునుగుతాయి. కట్ట తెగితే ఇక్కట్లే.. కాప్రా చెరువు: దీనికి రెండు తూములు ఉన్నా యి. వర్షాలకు వరద నీరు ఎక్కువగా వస్తే చెరువు ఒక వైపు మత్తడి పోస్తుంది. మత్తడి నీరు పోవడానికి నాలా ఉంది. చెరువుకట్ట తెగితే దీనికింద ఉన్న 8 కాలనీలు ముంపునకు గురవుతాయి. ముంచెత్తిన వరద నీరు ఉప్పల్ నల్ల చెరువు: ఒక వైపు పూర్తిగా వరద నీరు వెళ్లేందుకు గండి కొట్టి ఉంది. ప్రస్తుతం వచ్చిన వరద నీరు సైతం వెళ్లిపోతోంది. చెరువు మధ్యలో బండ్ ఏర్పాటు చేయడం వల్ల వరద నీరు డైవర్ట్ అయి కాలనీలను ముంచెత్తింది. ప్రమాదకరంగా పరికి చెరువు కూకట్పల్లి: కూకట్పల్లి జంట సర్కిళ్లు, బాలానగర్, కూకట్పల్లి మండలాల పరిధిలో 14 చెరువులు ఉన్నాయి. వీటిలో 5 చెరువులు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. పరికి చెరువుకు భారీ స్థాయిలో నీరు చేరింది. రంగధాముని చెరువు మత్తడి పడుతోంది. మూసాపేటలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులు ప్రమాదకర స్థాయిలో నిండిపోయాయి. -
తాగితే నిప్పు.. ప్రాణానికే ముప్పు
మద్యానికి బానిసలైన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, వేల్పూరు గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మార్చి 30న శానిటైజర్లో ఉప యోగించే ఐసోప్రోపిల్ ఆల్కహాల్ను కూల్డ్రింక్లో కలుపుకుని తాగారు.ఈ ఘటనలో యువకులు మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లా, కురిచేడు మండల కేంద్రంలో శానిటైజర్ తాగి ఆరోగ్యం విషమించి గురు, శుక్రవారాల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో గుంటూరుకు చెందిన మాతంగి పెదసుబ్బారావు కూడా ఉన్నాడు. ఇతను కురిచేడులో ఓ ఫంక్షన్కు హాజరై అక్కడి వ్యక్తులతో కలసి శానిటైజర్ తాగాడు. శనివారం మరో ఇద్దరు మృతి చెందారు. 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాక్షి, గుంటూరు: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న కంటైన్మెంట్ ప్రాంతాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి. దీంతో మద్యం లభించక తాగుడుకు బానిసలైన కొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో కిక్ను వెతుక్కుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో 239 ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. వీటిలో ప్రస్తుతం 116 దుకాణాల్లో మాత్రమే విక్రయాలు నడుస్తున్నాయి. మిగిలినవి కంటైన్మెంట్ జోన్లలో ఉండటంతో మూతపడ్డాయి. గుంటూరు నగరం, నరసరావుపేట, బాపట్ల, తెనాలి, పొన్నూరు, మాచర్ల పట్టణాలు సహా జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు నెలలకు పైగా మద్యం షాపులు తెరుచుకోలేదు. ప్రత్యామ్నాయం వైపు మందుబాబుల చూపు.. మూడు, నాలుగు నెలలకు పైగా మద్యం షాపులు మూతపడటం, దీనికి తోడు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు, పేదలు శానిటైజర్లు, స్పిరిట్, నాటుసారా తాగడం, నిద్ర మాత్రలు వేసుకోవడం, గంజాయి పీల్చడం వంటి మార్గాల్లో కిక్ పొందుతున్నారు. బీర్లో తొమ్మిది శాతం, మద్యంలో సుమారు 24.3 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అయితే, శానిటైజర్లో కంపెనీని బట్టి 80–90శాతం వరకూ ఉంటుంది. ఆల్కహాల్ శాతం అధికంగా ఉన్న శానిటైజర్ను మద్యానికి బానిసలైన కొందరు నీళ్లు, కూల్ డ్రింక్స్లోకి పోసుకుని తాగుతున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమని, ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కిక్ కోసం ఈ మార్గాన్నే కొందరు ఎంచుకుంటున్నారు. స్టువర్టుపురం, వెల్దుర్తి, బొల్లాపల్లి, దిండి, నిజాంపట్నం సహా మరికొన్ని ప్రాంతాల్లో నాటు సారా వినియోగం అధికంగా ఉంటోంది. దిండి పరిసర ప్రాంతాల్లో తయారవుతున్న నాటు సారా భట్టిప్రోలు, పొన్నూరు, బాపట్ల, రేపల్లె ఇలా డెల్టా ప్రాంతాల్లో సరఫరా అవుతోంది. గుంటూరు నగరంలో అయితే కొందరు మద్యం దొరక్క నిద్రమాత్రలు వేసుకుంటూ కిక్ పొందుతున్నారు. మందుబాబులు కిక్ కోసం వెతుక్కుంటున్న ప్రత్యామ్నాయ మార్గాలన్నీ ప్రాణాల మీదకి తెచ్చేవేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం జిల్లా, కురిచేడు ఘటనను గుణపాఠంగా తీసుకుని ఇప్పటికైనా మందుబాబులు మత్తు కోసం అడ్డదార్లు తొక్కవద్దని సూచిస్తున్నారు. మానడానికి ఇదే అవకాశం ఓ వైపు కరోనా ఆంక్షలు, మద్యం షాపులు మూతపడటం అంశాలు మద్యం మానడానికి ఇదే సరైన అవకాశం అని మానసిక నిపుణులు చెబుతున్నారు.తాగుడును ఒకేసారి మానడం కష్టం. మద్యానికి ప్రత్యామ్నాయంగా ప్రమాదకరమైన శానిటైజర్, నాటుసారా వంటివి తాగకుండా జ్యూస్లు, కూల్ డ్రింక్లు తాగడం, ఖాళీగా ఉండకుండా ఏదోక పనిలో నిమగ్నం అవ్వడం, మద్యం నుంచి ఇతర అంశాలపై దృష్టి సారించడం చేయాలని సూచిస్తున్నారు. మార్పు తేవచ్చు మద్యానికి బానిసలైన వారిని డీ అడిక్షన్ సెంటర్లో చేర్చి చికిత్స అందించడం ద్వారా మార్పు రాబట్టవచ్చు. మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, ఉచితంగా మందులు అందిస్తాం. కుటుంబ సభ్యులు వారితో ఎలా మెలగాలి అనేదానిపై కౌన్సెలింగ్ ఇస్తాం. తల్లిదండ్రులు పిల్లల్ని ఓ కంట కనిపెట్టాలి. ప్రస్తుతం యువతే ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసవుతోంది. – పబ్బతి లోకేశ్వరరెడ్డి, డీ అడిక్షన్ సెంటర్ నోడల్ ఆఫీసర్, గుంటూరు జీజీహెచ్ స్వచ్ఛమైన ఇథైల్ ఆల్కహాల్ తాగితే చనిపోతారు మద్యానికి అలవాటు పడిన వారిలో కొంతమంది శానిటైజర్, స్పిరిట్ తాగి చనిపోతున్నారు. సాధారణంగా తాగే మద్యంలో ఇథైల్ ఆల్కహాల్ 40 శాతం వరకూ మాత్రమే ఉంటుంది. కాని శానిటైజర్, స్పిరిట్లో 100శాతం ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. అంతేకాకుండా వాటి స్వచ్ఛత కోసం ఇథైల్ ఆల్కహాల్తో పాటుగా గ్లిజరిన్, ఐసోప్రొఫెల్ ఆల్కహాల్ ఇతర రసాయనాలను కలుపుతారు. స్పిరిట్, శానిటైజర్లు శరీరంపైన బ్యాక్టీరియాలను నిర్మూలించేందుకు మాత్రమే వినియోగించాలి. వాటిని తాగటం వల్ల రక్తాన్ని శుద్ధి చేసే వ్యవస్థ దెబ్బతినిపోతుంది. రక్తంలో ఆక్సిజన్ను పూర్తిగా నిర్వీరం చేస్తుంది. దీంతో రెస్పిరేటరీ సిస్టం దెబ్బతిని ఊపిరి తిత్తులు పాడై ఊపిరి తీసుకోలేక మనిషి చనిపోతాడు. కొన్ని సందర్భాల్లో కళ్లు పోతాయి. –డాక్టర్ తిరుమలశెట్టి వెంకట ఆదిశేషుబాబు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ -
వైరల్: ఈ టిక్టాక్ చాలెంజ్ వీడియో ప్రమాదకరం
న్యూఢిల్లీ: టిక్టాక్లో తమ ప్రతిభను వీడియోల రూపంలో బయటపెట్టడానికి యువత చాలా ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. టిక్టాక్లో ఫన్నీ వీడియోలు చేయటంతోపాటు.. పాటలు, డైలాగ్లు, డాన్స్లు కూడా చేస్తున్నారు. దీంతోపాటు టిక్టాక్లో చాలెంజ్ వీడియోల ట్రెండ్ కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. టిక్టాక్ చాలెంజ్ వీడయోలకోసం యువత ఎంతకైనా తెగిస్తోంది. ఫన్నీగా మొదలైన టిక్టాక్ చాలెంజ్ వీడియోలు ప్రస్తుతం ప్రమాదకరస్థాయికి చేరుకోవటం గమనార్హం. ఆ కోవలోకి చెందిందే ఈ టిక్టాక్ కొత్త వీడియో చాలెంజ్.. అది ఎలా చేస్తారంటే.. మోబైల్ చార్జర్ అడాప్టర్ను, ఎలక్ట్రిక్ సాకెట్కి అమర్చాలి. కానీ, సాకెట్కి, మోబైల్ చార్జర్ అడాప్టర్కి మధ్య కొంత గ్యాప్ ఉండెలా చూడాలి. ఆ గ్యాప్లో ఒక నాణెంను నెమ్మదిగా జారవిడువాలి. దీంతో ఒక్కసారిగా మంటలు వచ్చి సాకెట్ కాలిపోతుంది. పెద్దగా మంటలు కూడా వస్తాయి. కానీ, జారవిడచేటప్పుడు ఆ నాణెం కింద పడుకుండా చేయటమే ఈ చాలెంజ్ విశేషం. కాని, ఈ టిక్టాక్ కొత్త చాలెంజ్ చాలా ప్రమాదకరమైందని ప్రయత్నించిన పలువురు వాపోతున్నారు. అదేవిధంగా ఈ చాలెంజ్ను ఎట్టిపరిస్థితుల్లో చేయడానికి ప్రయత్నించవద్దని మరికొంతమంది టిక్టాక్ వినియోగదారులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. అయితే ఈ ప్రమాదకర టిక్టిక్ చాలెంజ్ వీడియో తాజాగా సోషల్ మీడియోలో వైరల్గా మారింది. దీన్ని చేయడానికి ప్రయత్నించిన టిక్టాక్ వినియోగదారులు.. ఆ చాలెంజ్ వీడియో చేసే క్రమంలో వారు ఎదుర్కొన్న అనుభవాలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోల్లో చార్జింగ్ అడాప్టర్లు, సాకెట్లు మంటల్లో కాలిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
వెంటాడే పామును చూశారా?
న్యూఢిల్లీ : వీడియోలో వెంటాడుతూ వస్తోన్న పాము అత్యంత ప్రమాదకరమైనది. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే ఈ పామును ‘ఈస్టర్న్ బ్రైన్ స్నేక్’ అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ విషమున్న సర్పాల్లో ఇది రెండో జాతికి చెందినది. ఇది కరచిన వ్యక్తి ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోతాడని వెంటాడుతున్న ఈ పామును వీడియో తీసిన 52 ఏళ్ల టోరి హారిసన్ తెలిపారు. ఈ పాము కాటు వల్లనే ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది మరణిస్తున్నారు. పాము కాటు వల్ల మరణించిన వారిలో 60 శాతం మంది ఈ పాము విషయం వల్లనే మరణించినట్లు తేలింది. పడగ లేకున్నా తలెత్తి బార్లా నోరు తెరచి మనుషుల మీదికి, జంతువుల మీదికి వెంటాడుతూ రావడం దీన్ని ప్రత్యేక లక్షణమని, తన ప్రాణ రక్షణలో భాగంగా మనల్సి భయపెట్టడానికే ఈ పాము ఎక్కువగా వెంటాడుతున్నట్లు వస్తుందని టోరి తెలిపారు. మన మానాన మనం వెళుతుంటే ఈ పాము ఏమనదని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్కు చెందిన టోరి హారిసన్కు పాములు పట్టడంలో ఎంతో నేర్పరి. గోల్డ్ కోస్ట్ సిటీ శివారులోని పింపామ వద్ద శనివారం నాడు తనకు ఈ పాము కనిపించిందని దాన్ని వీడియో తీస్తూనే పట్టుకున్నానని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వదిలేశానని ఆయన చెప్పారు. సమాజంలో ఇంతకన్నా విష పూరితులను మనం చూస్తుంటామని, అలాంటప్పుడు దీన్ని ఎందుకు చంపాలని వదిలేశానని ఆయన అన్నారు. -
వెంటాడే పామును చూశారా?
-
మోస్ట్ డేంజరస్ ల్యాప్టాప్ ఇదే
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్టాప్ ఒకటి ఆన్లైన్ వేలంలో భారీ ధర పలుకుతోంది. ఆరు భయంకరమైన వైరస్లు ఈ ల్యాప్టాప్ తిష్టవేశాయి. అందుకే 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ ల్యాప్టాప్గా పేరు తెచ్చుకుంది. అత్యంత ప్రమాదకరమైన, ప్రపంచానికి భారీ నష్టాన్ని మిగిల్చిన ఆరు వైరస్లు ఇందులో పొంచి వున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో సుమారు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందట. అలాంటి ల్యాప్టాప్ వేలమా? పైగా అంత భారీ ధర పలకడమా? విచిత్రంగా ఉంది కదూ.. సెక్యూరిటీ సంస్థ డీప్ ఇన్స్టింక్ట్ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్నెట్ ఆర్టిస్ట్ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అతి ప్రమాదకరమైన ఆరు వైరస్లను లైవ్లీగా ఉంచి మరీ, ఈ డివైస్ను వేలానికి వుంచారు. డిజిటల్ ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును భౌతికంగా ప్రజలకు తెలియ చెప్పేందుకే ఈ ప్రయత్నమని గ్వో చెప్పారు. కంప్యూటర్లోని భయంకరమైన వైరస్లు మనల్ని భౌతికంగా ప్రభావితం చేయలేవని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ అవి ఆర్థికంగా ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో గమనించలేక పోతున్నారన్నారు. అందుకే ఆర్థికంగా భారీ నష్టాన్ని కలుగ జేసిన ఈ ఆరు భయంకరమైన వైరస్లను ఎంచుకున్నట్టు తెలిపారు. విండోస్ ఎక్స్పీ ఆధారిత శాంసంగ్ ఎన్సీ10 దీని పేరు.10.2 అంగుళాల 14జీబీ (2008) డివైస్ ఇది. వైఫై, ఫ్లాష్డ్రైవ్కి కనెక్ట్ చేయనంత వరకూ దీన్నుంచి మిగతా పీసీలకు ఈ వైరస్లకు వ్యాపించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు చెప్పారు. ఐ లవ్యూ, మైడూమ్, సోబిగ్, వాన్నా క్రై, డార్క్ టెక్విలా బ్లాక్ఎనర్జీ అనే ఆరు వైరస్లు ఈ ల్యాప్టాప్లో దాగి వున్నాయి. 'ది పెర్సిస్టెన్స్ ఆఫ్ ఖోస్' అనే శీర్షికతో, గ్వోఓ ఓ డోంగ్ దీన్ని సృష్టించారు. ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న ప్రైవేట్ వేలంలో ఇది ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.8 కోట్ల, 34 లక్షలు) ధర పలుకుతోంది. అద్భుతమైన ఈ ఆర్ట్పీస్పై ఆసక్తి వున్నవారు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు. -
హంతక పక్షి.. ఎంత పని చేసింది!
గైయినెస్విల్లే: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షిగా గుర్తింపుగా పొందిన ‘కాసోవారీ’ తన యజమాని ప్రాణం తీసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న గైయినెస్విల్లే నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది. స్థానిక మీడియా కథనం ప్రకారం... కాసోవారీ శుక్రవారం తన యజమానిపై దాడి చేసి చంపేసింది. మృతుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. ‘ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టుగా కనబడుతోంది. తనకు సమీపంలో జారిపడిన యజమానిపై కాసోవారీ దాడి చేసివుండొచ్చ’ని పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఏం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చూడటానికి ఈము పక్షిలా కనబడే కాసోవారీ దాదాపు 6 అడుగుల ఎత్తు, 60 కేజీల బరువు పెరుగుతుంది. ఎగరలేని ఈ భారీ పక్షి ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూగినియాలో కనిపిస్తుంది. శాన్డియాగో జూ వెబ్సైట్ ప్రకారం... ఇవి చాలా ప్రమాదకరమైన పక్షి. దీని కాళ్లకు దాదాపు 10 సెంటీమీటర్లు పొడవుండే కత్తుల్లాంటి గోళ్లుంటాయి. ముప్పు వాటిల్లినప్పుడు వేగంగా స్పందించి ఒక్క దెబ్బతో సత్తా చూపగలదు. దట్టమైన అడవుల్లోనూ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అమెరికాలో వీటిని మంసాహారం కోసం పెంచరు. అరుదైన జాతికి చెందిన కాసోవారీని కాపాడాలన్న ఉద్దేశంలో పక్షి ప్రేమికులు వీటిని సంరక్షిస్తున్నారు. -
వారికి ఇల్లే అతి ప్రమాదకరం : షాకింగ్ రిపోర్టు
మహిళలు,ఆడపిల్లలపై పెరుగుతున్న హింస, అత్యాచారాలు, హత్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రోజురోజుకు ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి అధ్యయనం దిగ్భ్రాంతికరమైన అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ నేలపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం మహిళలకు ఇల్లేనట. అవును..షాకింగ్గా ఉన్నా.. మీరు విన్నది నిజమే సొంత ఇల్లే ఆమె పాలిట యమపాశమవుతోంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కుటుంబ సభ్యులు, సన్నిహిత జీవిత భాగస్వాములే చేతుల్లో అత్యధిక మహిళలకు హత్యకు గురవుతున్నారని యూఎన్ సర్వే తేల్చింది . మహిళలపై లైంగిదాడులు, గృహహింస, హత్యాచారాలు నిత్యకృత్యంగా మారిపోయాయి.ఆడవారిగా పుట్టిన పాపానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు, ఆడపిల్లలు దారుణ హత్యలకు గురవుతున్నారని ‘మహిళలపై హింస- అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం' సందర్భంగా నిర్వహించిన యూఎన్ఓడీసీ సర్వే తేల్చింది. 2018 నివేదిక ప్రకారం 2017లో హత్యకు గురైన మహిళల్లో మూడోవంతు భర్తల చేతుల్లో పథకం ప్రకారం హతమవుతున్నారు. రోజుకు 137 మందిని సొంత కుటుంబ సభ్యులే హత్యగావిస్తున్నారు. 2017లో ప్రపంచవ్యాప్తంగా 87వేలమంది హత్యకు గురయ్యారు. వీరిలో 58శాతం అంటే దాదాపు 50వేలమంది కుటుంబ సభ్యులు, సన్నిహిత భాగస్వాములు చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 30 వేలమంది ఒక పథకం ప్రకారం చంపబడుతున్నారు. ప్రపంచవ్యాప్తగా ప్రతి లక్షమంది జనాభాలో 1.3 శాతం మంది పుట్టకముందే గర్భంలోనే హత్యకు గురవుతున్నారు. భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల ద్వారా హత్యకు గురవుతున్న మహిళలు : ఆసియా - 20,000 ఆఫ్రికా - 19,000 అమెరికా - 8,000 యూరోప్ - 3,000 ఓసియానా - 300 ఎందుకు జరుగుతుంది? వివిధ కారణాల వలన అన్ని సమాజాల్లో లింగ-సంబంధిత హత్యలు జరుగుతున్నాయని సమితి నివేదించింది. ముఖ్యంగా భ్రూణ హత్యలు, జీవిత భాగస్వామి హింస, గృహ హింస, పరువు హత్యలు, వరకట్న సంబంధిత హత్యలున్నాయని నివేదిక పేర్కొంది. వీటితోపాటు వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్య ముఠాలు, భారీ వలసలు, డ్రగ్స్, ట్రాఫికింగ్ ఉదంతాల్లో హింసాత్మక హత్యలు చోటు చేసుకుంటున్నాయని సర్వే తెలిపింది. అలాగే చేతబడి, మంత్రగత్తెల ఆరోపణలతో కూడా హత్యలు జరుగుతున్నాయని నివేదించింది. సాయుధ ఘర్షణ సందర్భాల్లో మహిళలపై లైంగిక హింసను ప్రదాన ఆయుధంగా ప్రయోగించబడుతోందని పేర్కొంది. అనేక సందర్భాల్లో మహిళలపై హింస హత్యలకు దారితీస్తోందని, అయితే మహిళలకు, బాలికలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసకు పాల్పడుతున్న నేరస్తులు నేరాలు నిరూపితం కావడంలలేదని, దీంతో వారు శిక్షలనుంచి తప్పించుకుంటున్నారని తెలిపింది. మహిళలపై హింస నిర్మూలించేందుకు చట్టాలు, పథకాలు ఉన్నప్పటికీ సన్నిహిత భాగస్వామి / కుటుంబ సంబంధిత హత్యలు ఆగడం లేదనీ, ఇటీవల సంవత్సరాల్లో భ్రూణ హత్యల నిరోధంలో ఎలాంటి పురోగతి లేదని స్పష్టం చేసింది. మానవహత్యల్లో మెజారిటీ బాధితులుగా పురుషులు కూడా ఉంటున్నప్పటికీ లింగ అసమానత, వివక్ష, మూఢాచారాల ఫలితంగా మహిళలు మరింత ప్రభావితమవుతున్నారని యూఎన్ఓడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యూరీ ఫిడోటోవ్ సెడ్ పేర్కొన్నారు. మహిళలపై హింస నిరోధంపై అంతర్జాతీయ దినోత్సవం సందర్బంగా నవంబరు 25 ఆదివారం ఈ అధ్యయనాన్ని విడుదల చేసింది. మహిళలు, బాలికలపై లింగ సంబంధిత హత్యలు, దాడులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు, దర్యాప్తు, విచారణకు, శిక్షలు తదితర అనేక ఆచరణాత్మక చర్యలను ఇందులో సిఫార్సు చేసింది. అలాగే న్యాయనిర్ణేతలు, పాలకులు, ప్రభుత్వ సంస్థలతోపాటు ఐక్యరాజ్యసమితి సంస్థలు, సిబ్బంది, పౌర సమాజాల మధ్య అవగాహన కోసం అధ్యయనాన్ని వెల్లడించినట్టు తెలిపింది. మహిళలపై హింస నిరోధానికి పోలీసులకు న్యాయవ్యవస్థలు, ఆరోగ్యం,సామాజిక సేవలకు మధ్య సమన్వయం చాలా అవసరమని ఈ నివేదిక నొక్కి చెప్పింది. ప్రాథమిక విద్య, అవగాహనతో పాటు ఈ సమస్యల పరిష్కాల్లో ఎక్కువ పురుషులు పాల్గొనడం చాలా ముఖ్యమని యూఎన్ నివేదిక స్పష్టం చేసింది. -
దెయ్యం చెట్టు..!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏడాకుల పాల.. ఈ చెట్టు శాస్త్రీయ నామం ఆల్సో్టనియా స్కాలరీస్. వరంగల్ జిల్లాలో 50 లక్షలకు పైగానే పెరుగుతున్నాయి. అడవుల్లో పుట్టిన ఈ వృక్షాన్ని ఆదిమ జాతి గిరిజనులు దెయ్యం చెట్టు అని పిలుస్తారు. చెట్టు వైపు కన్నెత్తి కూడా చూడరు. దాని నీడను తాకడానికి కూడా భయపడుతారు. ఎందుకంటే ఈ వృక్షం మీద దెయ్యాలు ఉంటాయంటారు. ఇటీవల పరిశోధనల్లో ఇది నిజంగా దెయ్యపు వృక్షమే అని తేలింది. దీని పుప్పొడి రేణువులు మానవాళికి అత్యంత ప్రమాదకరమని, శ్వాస కోశ వ్యాధులు, అస్తమా, అలర్జీ వస్తుందని తేలింది. అదే పనిగా చెట్టు కింద ఉండేవారి ఊపిరితిత్తుల్లో పుప్పడి రేణువులు పేరుకపోయి స్పృహ కోల్పోతారని తేలింది. ప్రధానంగా చెట్టు సమీపంలో నివసించే వారికి, మార్నింగ్ వాక్ చేసే వాళ్లు, వృద్ధులు, పిల్లల మీద ప్రభావం ఉంటుందని అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ హరితహారంలో ఈ మొక్కలను నాటొద్దని అటవీ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆరోగ్యంపై ప్రభావం.. నీళ్లు లేకపోయిన ఏపుగా, అత్యంగా వేగంగా పెరిగే ఏడాకుల పాల చెట్టును హరితహారంలో భాగంగా వరంగల్ నగరంతోపాటు సమీప ప్రాంతంలో భారీ ఎత్తున నాటారు. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం 50 లక్షలకు పైగానే మొక్కలను నాటినట్లు తెలుస్తోంది. ఈ పొడవైన, సొగసైన వృక్షం కఠినమైన బూడిదరంగు బెరడును కలిగి ఉంటుంది. ఈ చెట్టు కొమ్మలు వలయంగా, ఆకులు ఒకే చోట అనేకం వస్తాయి. ఈ ఆకులు కొంచెం గుండ్రంగా, తోలు వలె ముదురు ఆకుపచ్చగా గుచ్ఛంలా ఉంటాయి. దాదాపుగా ఒక్కో గుచ్ఛానికి ఏడు ఆకులే ఉంటాయి, ఈ ఆకులను గిల్లుతే పాలు కారుతాయి. అందువలనే ఈ చెట్టును ఏడాకుల పాల అని పిలుస్తారు. ఇప్పుడా మొక్కలు పెరిగి పెద్దవి అయ్యాయి.. పుష్పిస్తున్నాయి. ఇవి వెదజల్లుతున్న పుప్పడితో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అక్టోబరులో అంటే చలికాలం సీజన్లో ఈ చెట్టు కొమ్మలకు ఉన్న పుష్పాలు అన్నీ ఒకే సారి పుష్పిస్తాయి. లక్షల కొద్ది పుప్పడిని బయటికి వెదజల్లుతాయి. చలి మంచుకు çపుప్పడి రేణువులు బరువుగా మారి వాతావరణంతో మనుషుల శ్వాసకు అందే ఎత్తులో వాతావరణంలో తేలియాడుతూ ఉంటాయి. దీంతో మనుషుల్లో అలర్జీ, అస్తమా, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. వచ్చే హరితహారంలో వీటిని నాటం ఏడాకుల పాల చెట్లతో అస్తమా రోగులకు ఇబ్బంది అనేది కొంత మేరకు వాస్తవమే. ఇప్పటివరకు 50 లక్షల మొక్కల వరకు నాటాం. వచ్చే హరితహారం నుంచి ఆ మొక్కలను పెట్టం. నీడనిచ్చే మొక్కలు కాబట్టి వీటి పెంపకాన్ని చేపట్టాం. ఆరోగ్యపరంగా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతంలో తొలగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. – కె.పురుషోత్తం, అర్బన్ జిల్లా ఇన్చార్జి అటవీ శాఖాధికారి ఊపిరితిత్తులపై ప్రభావం.. ఏడాకుల పాల చెట్ల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇవి ప్రమాదరకమని తెలియక నాటడంతో పెరిగాయి. పుప్పడి రేణువులతో మనుషులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. లక్షలాది పుప్పొడి రేణువులు గాలిలో కలిసిపోతాయి, వాటిని పీల్చడం వల్ల మనుషులకు అలర్జీ, అస్తమా, కళ్లమంటలు వస్తాయి. అంతేగాకుండా ఊపిరితిత్తులకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. – వి.కృష్ణారెడ్డి, కేయూ బాటనీ ఆచార్యులు కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఏడాకుల పాలతో ప్రమాదకరమే. కిడ్నీ, ఊపిరితిత్తులు, చర్మ, కంటి సంబంధిత వ్యాధులు వస్తాయి. నా దగ్గరకు వచ్చే పేషెంట్లను చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించమని సలహా ఇస్తాను, ఏడాకుల పాల చెట్టు సమీపంలో ఉన్న వాళ్లకు సీజన్ ముగిసే వరకు దానికి దూరంగా ఉండడం మంచిదని సలహా ఇస్తున్నాను. – డాక్టర్ శ్రీనివాసవర్మ, చెస్ట్ ఫిజీషియన్ -
మందులేని మహమ్మారి
గత కొన్నేళ్లనుంచి క్రమం తప్పకుండా వచ్చి బెంబేలెత్తిస్తున్న వైరస్ల జాబితాలో నిపా కూడా చేరింది. కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో బయటపడి ఆ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తూ మరణించిన ఒక నర్సుతోసహా ఇంతవరకూ పదకొండుమంది ప్రాణాలు కోల్పోయారు. నిపా వైరస్ను ఈ ఏడాది అత్యవసరంగా పరిశోధించదగిన 10 వ్యాధికారకాల్లో ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం వల్లనైతేనేమి...సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతుండటం వల్లనైతేనేమి ఆ వ్యాధి పేరెత్తితే జనం బెంబేలు పడిపోతున్నారు. పరిశోధించదగిన వ్యాధికారకమని చెప్పడమంటే ఈ వైరస్కు ప్రస్తుతం మందు లేదని ప్రకటించడమే. అది కేరళలోని రెండు జిల్లాల్లో రెండు ప్రాంతాల్లో బయటపడింది తప్ప వేరెక్కడా దాని జాడ లేదని... వెంటనే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాం గనుక భయాందోళనలు అనవసరమని కేరళ ప్రభుత్వం ప్రకటించాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈలోగానే పొరుగునున్న కర్ణాటకలోని మంగళూరులో దాని ఛాయలు కనబడ్డాయని వార్తలు రావడంతో మళ్లీ వణుకు మొదలైంది. జ్వరంతో మొదలై శ్వాసకోశ ఇబ్బందులు, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు వగైరాలన్నీ చుట్టుముట్టి రోగిని ఊపి రాడకుండా చేస్తాయని... పది పన్నెండు రోజులకు అపస్మారక స్థితికి తీసుకెళ్తుందని వైద్యులు చెప్పే మాట. చివరిగా బ్రెయిన్ ఫీవర్తో మరణం సంభవిస్తుందని చెబుతున్నారు. వ్యాధి సోకినవారిలో 70 శాతంమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు నిపా వైరస్ కావొచ్చు... రెండేళ్లక్రితం జికా వైరస్ కావొచ్చు...అంతకు రెండేళ్ల ముందు ఆఫ్రికాను వణికించిన ఎబోలా కావొచ్చు... మధ్యమధ్యన అడపా దడపా కనిపిస్తూనే ఉన్న స్వైన్ఫ్లూ కావొచ్చు–ఇవన్నీ కొత్త వ్యాధులు కావు. కానీ కొత్తగా శక్తి సంతరించుకుని మళ్లీ మళ్లీ వస్తున్న మహమ్మారులు. నిపా కూడా మొదటగా 1999లో మలేసియాలోని కాంపంగ్ సుంగై నిపా అనే పట్టణంలో వెల్లడైంది. అప్పట్లో 300మందికి ఇది సోకగా వారిలో వందమంది చనిపోయారు. ఆ తర్వాత 2001లో పశ్చిమబెంగాల్లోని సిలిగుడిలో దీని జాడ వెల్లడైంది. దాన్ని నిపా వైరస్గా గుర్తించేసరికే ఆర్నెల్లు పట్టింది. ఈలోగా 45మంది ఆ వ్యాధితో మృత్యువాత పడ్డారు. అప్పటితో పోలిస్తే వ్యాధిని వెనువెంటనే గుర్తించగలిగారు. దాని నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయంలో కేరళ ప్రజారోగ్య సిబ్బందిని ప్రశంసించాలి. రెండో వ్యాధిగ్రస్తుడి తోనే ఈ వైరస్ ఉనికిని అక్కడి వైద్యులు పసిగట్టగలిగారు. అయితే గతంతో పోలిస్తే ఒకచోటు నుంచి మరోచోటుకు రాకపోకలు కూడా బాగా పెరిగాయి గనుక ఒకచోట నియంత్రణకు పూనుకునే లోగానే మరోచోట అది కనబడే ప్రమాదం కూడా లేకపోలేదు. అందువల్లే ఇటువంటి వ్యాధుల విషయంలో తక్షణ స్పందన అత్యవసరం. ఆ ఉద్దేశంతోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. వ్యాధి నిరోధక వైద్య సంస్థ(ఐపీఎం)ను నోడల్ ఏజెన్సీగా ఉంచి ప్రధాన ఆసుపత్రులన్నిటా ప్రత్యేక వార్డులు నెలకొల్పామని చెబుతోంది. దీంతోపాటు వ్యాధి లక్షణాలపై బాగా ప్రచారం చేసి, అవి కనబడిన వెంటనే తగిన వైద్య పరీక్షలు చేయించాలన్న అవగాహన పెంచాలి. ఒకరి నుంచి మరొకరికి నేరుగా వ్యాపించే లక్షణం నిపా వైరస్కు లేకపోవడం ఉన్నంతలో ఉపశమనమనే అనుకోవాలి. లేనట్టయితే అధిక జనాభా, అరకొర పారిశుద్ధ్యం ఉన్న మనలాంటి దేశాల్లో అది ఉగ్రరూపం దాల్చడం తేలిక. నిపా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ గనుక అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులంటున్నారు. ఈ రకం వైరస్లలో ఆకస్మిక పరివర్తనం అధికంగా ఉండటమే అందుకు కారణం. అందువల్లే నిపా మనిషి శరీరంలో వేగంగా, అపరిమితంగా విస్తరిస్తుంది. వ్యాధిగ్రస్తుల్లో ఏకకాలంలో అనేక రకాల లక్షణాలు కనబడటానికి, మరణాల రేటు అధికంగా ఉండటానికి కారణం ఇదే. అయితే అంటు వ్యాధి కాకపోవడంవల్ల ఇతరులకు వేగంగా సోకే అవకాశం లేదు. ఇప్పుడు గబ్బిలాలు కొరికి పడే సిన పండ్లు తిన్నవారికి ఈ వ్యాధి వ్యాపిస్తోంది. అలాగే వ్యాధిగ్రస్తులకు పరిచర్యలు చేసే ఆసుపత్రి సిబ్బందికి, ఆ వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా మెలిగే బంధువులకు తగిన ముందస్తు చర్యలు తీసు కోనట్టయితే సోకే ప్రమాదం ఉన్నదని గుర్తించారు. కేరళలో మరణించిన 11మందిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం వెనక ఇలాంటి కారణమే ఉండొచ్చని అంచనా. అలాగే ఆ కుటుంబం నివసించే ఇంటి ఆవరణలో ఉన్న బావిలోని గబ్బిలాల వల్ల అక్కడ వ్యాధికారక వైరస్కు అవకాశం ఏర్పడిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. వ్యాధులకు ఔషధాలున్నా వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడం మన దేశంలో ప్రధాన సమస్య. వ్యాధి వ్యాప్తిని అరికట్టడం, వ్యాధిని నిర్మూలించడం వంటి అంశాలపై శ్రద్ధ పెట్టడానికి బదులు దాన్నుంచి ఎంత లాభం తీయొచ్చన్నదే ప్రధానమైనప్పుడు ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించడం అసాధ్యమవుతుంది. ఇప్పుడు నిపాతో వచ్చిపడిన సమస్యే మంటే దానికి ఇంతవరకూ మందే లేదు. వ్యాధిగ్రస్తుల్లో కనబడే వేర్వేరు లక్షణాలకు వేర్వేరు ఔషధాలు అందించడం ద్వారా దాన్ని అదుపు చేస్తున్నారు. ఈ వైరస్ విషయంలో ప్రభుత్వాలన్నీ అత్యంత అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. ఆసుపత్రులను అప్రమత్తం చేయాలి. జంతువులు, పక్షులు కొరికి వదిలేసిన పండ్లు తినకూడదని, పరిశుభ్రత అతి ముఖ్యమని జనంలో అవగాహన కల్పించాలి. అల్లోపతిలో ఔషధాలు లేవు గనుక హోమియో, ఆయుర్వేదం, యునాని రంగాల్లోని వైద్య నిపుణుల సేవలు కూడా ప్రభుత్వాలు వినియోగించుకోవాలి. -
సెలవు దినాల్లోనూ పని.. కారణమేంటంటే?
సాక్షి, న్యూఢిల్లీ : ఎంత తక్కువ పని గంటలుండి, అంత ఎక్కువ జీతమిస్తే ఆనందపడే వారు ఎందరుంటారోగానీ తక్కువ పని గంటలుండి ఎక్కువ సెలవులుంటే ఆనంద పడేవారు ఎక్కువే ఉంటారు. ఒకప్పుడు ఫ్యాక్టరీలలో 15, 18 గంటలు పని చేయించుకునేవారు. శారీరకంగా, మానసికంగా అన్ని గంటలు పనిచేయడం కష్టమవడంతో అమెరికాలో మేడే ఉద్యమం ద్వారా అంతర్జాతీయంగా కార్మికులకు 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. రాను, రాను సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందడంతో కొన్ని రంగాల్లో పని దినాలు తగ్గుతూ సెలవు దినాలు పెరుగుతూ వచ్చాయి. కార్మికులు లేదా ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఉత్పత్తి పెరుగుతుందని భావించిన ఐటీ లాంటి కంపెనీలు ఉద్యోగులకు క్రీడల లాంటి అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తూ వచ్చాయి. రానురాను సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరగడం వల్ల 2030 సంవత్సరానికి పని గంటలు వారానికి 15 గంటలకు చేరుకుంటుందని జాన్ మేనర్డ్ కీనెస్ వంటి ఆర్థిక వేత్తలు ఆశించారు. ఉద్యోగల నుంచి అధిక దిగుబడిని రాబట్టేందుకు పెట్టుబడుదారులు వారి పని గంటలను తగ్గించి, సెలవుదినాలను పెంచుతారని వారు అంచనా వేశారు. ఎందుకంటే తక్కువ పని వల్ల ఉద్యోగులు ఎక్కువ ఆరోగ్యంతో ఉంటారని వారు భావించారు. ఎక్కువ పని గంటల వల్ల ఎక్కువ మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి ఎక్కువై కార్మికులు అస్వస్థులవడం చూసి వారు అలా భావించారు. ఎక్కువ పని ఒత్తిడి వల్ల అనారోగ్యం పాలవడం నిజమేగానీ తక్కువ పని గంటల వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెప్పలేం. ఆరోగ్యంపై ఇతర సామాజిక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. ఎక్కువ పని గంటల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువేనని కూడా అధ్యయనాల్లో తేలింది. ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుదారులు కార్మికుల నుంచి వీలైనంత ఎక్కువ పనిని రాబట్టేందుకే ప్రయత్నిస్తూ వచ్చారు. ఫలితంగా కార్మికులు సెలవుల్లో కూడా పనిచేయడం, అస్వస్థతతో ఉండి కూడా పనిచేయడం ఎక్కువైంది. ఈ అస్వస్థతతో పనిచేసే వారి సంఖ్య 2010 సంవత్సరంలో 26 శాతం ఉండగా, ఇప్పుడు 86 శాతం ఉందని ‘చార్టెట్ ఇనిస్టిట్యూడ్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్మెంట్’ అనే సంస్థ వెల్లడించింది. ఆశ్చర్యకరంగా సెలవు దినాల్లో పనిచేసేందకు ఎక్కువ మంది సిద్ధపడుతున్నారని, అందుకు పనిపట్ల ఉన్న అంకిత భావం కాదని, సెలవుల్లో కూడా పనిచేస్తున్నారనే గుర్తింపు కోసమని ఈ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. అయితే ఈ మనస్థత్వం ఎక్కువగా మధ్యతరగతి ఉద్యోగుల్లోనే ఉందని తెలిపింది. పని పట్ల అంకిత భావం ఉన్నట్లు కనపడకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో కూడా ఎక్కువ మంది సెలవుల్లో, అనారోగ్యంతో ఉన్నప్పుడు విధులకు హాజరవుతున్నారని తెల్సింది. ఏదేమైనా ఈ పద్ధతి మారక పోతే ఎక్కువ గంటల పని వల్ల అనారోగ్యానికి గురై, మత్యువాత పడక తప్పదని ఆ నివేదిక హెచ్చరించింది. -
జీవితం.. టెక్మయం
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో టెక్నాలజీ లేని జీవితాన్ని అసలు ఊహించుకోలేం. ప్రపంచంలో ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటున్న టెక్నాలజీ.. మానవ జీవితాన్ని ఓ వైపు అత్యంత శోభాయమానంగా, సుఖవంతంగా తీర్చిదిద్దుతూనే మరో వైపు దుర్భర సమస్యల సుడిగుండలోకి నెడుతోంది. దీన్ని సమన్వయం చేసుకుని నైతికత పాటిస్తే.. వ్యక్తి, సమాజం, దేశం అభివృద్ధికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తిరుపతి ఎడ్యుకేషన్ : రోజురోజుకూ వాయువేగంతో అభివృద్ధి చెందున్న టెక్నాలజీ వాడకంలో విచక్షణ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సమస్యలను మరింత సౌకర్యవంతంగా వేగంగా పరిష్కరించుకునే వీలుంటుందని చెబుతున్నారు. విద్యావిధానంలోనూ ఆధునిక టెక్నాలజీ.. టెక్నాలజీ విద్యావిధానంలోనూ పెను మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు నల్లబోర్డుపై తెల్లటి రాతలు. బట్టీ పట్టే విద్య. నేడు తెల్ల బోర్డుపై డిజిటల్ విద్య. ఆన్లైన్, ఆఫ్లైన్లో డిజిటల్ తరగతుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. బట్టీకి స్వస్తి పలుకుతూ ప్రాక్టికల్గా విద్యనభ్యసించేలా అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ అవసరాన్ని గుర్తిస్తూ ప్రభుత్వాలు సైతం విద్యావిధానంలో విప్లవాత్మక సాంకేతిక మార్పులు తీసుకొస్తూ నూతన విద్యావిధానానికి శ్రీకారం చుడుతోంది. సెల్ఫోన్లు వినియోగంతో.. డెస్క్టాప్(కంప్యూటర్), ల్యాప్టాప్లానే మనం నిత్యం ఇతరులతో సంభాషించడానికి వినియోగించే సెల్ఫోన్లూ(స్మార్ట్ఫోన్) విజ్ఞాన కేంద్రాలయ్యాయి. సెల్ఫోన్లు వచ్చిన తరువాత అరచేతిలో ప్రపంచాన్ని బంధించి అంతులేని విజ్ఞానాన్ని అందిస్తోంది. ప్రస్తుత ప్రాక్టికల్ విద్యావిధానంలో ఇదొక మంచి సాధనం. విద్యాపరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త యాప్లు వస్తున్నాయి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి, పాఠ్యాంశాల్లోని అంశాలను తరవుగా నేర్చుకుని మేథస్సును పదును పెట్టడానికి దోహదపడుతున్నాయి. అయితే సక్రమ మార్గంలో వినియోగించుకోకుంటే సమయాన్ని తినేసే కిల్లర్గా సెల్ఫోన్ మారిపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సరైన పద్ధతిలో వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు సృష్టించడమే కాకుండా విద్యాపరమైన అభివృద్ధి సాధించొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. విపరీత పరిణామాలు అతిగా సాంకేతికతపై ఆధారపడడం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానిసిక రుగ్మతలు, శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. సాంకేతికతకు బానిస అవ్వడం, అనారోగ్యకరమైన, అసాంఘిక సైట్లను వీక్షించే దురలవాట్లకు లోనై సమయాన్ని వృథా చేసుకోవడం జరుగుతుంది. తగిన విచక్షణ, విజ్ఞతతో వ్యవహరించి, అవసరం మేరకు కావాల్సిన విజ్ఞానాన్ని సమకూర్చుకోవడం వరకే సాంకేతికతను వినియోగించుకోవాలి. ప్రస్తుతం పిల్లలు సెల్ఫోన్లు, కంప్యూటర్లతో అధిక సమయం వెచ్చిస్తున్నారు. చెడుదోవ పట్టకుండా సక్రమ మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండడం ఉత్తమం. – ఓంప్రకాష్ కోటపాటి, స్టేట్ రిసోర్స్ పర్సన్, విద్యారంగ విశ్లేషకులు తల్లిదండ్రులు గుర్తించాలి.. తమ పిల్లాడు కంప్యూటర్లో గేమ్లు, సెల్ఫోన్ను పొద్దస్తమానం ఆపరేట్ చేస్తుంటాడని ఆవేదనతో చెబుతున్న తల్లిదండ్రులు కొందరైతే.. ‘మా పిల్లాడు చాలా గ్రేటండి... కంప్యూటర్, సెల్ఫోన్లో తెలియని అంశాలే లేవు’ అని గర్వంగా చెప్పే తల్లిదండ్రులు మరి కొందరు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తదనం పిల్లలకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. సృజనాత్మకత కలిగిన విద్యార్థులు కొత్తదనం శోధించాలనే తపనతో నిరంతరం కుస్తీ పడుతుంటారు. అవధులు దాటనంత వరకు ఇది మంచి విషయమే. విచ్చలవిడి అయితేనే ప్రమాదం. తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని చెబుతున్నారు. -
ఒక్కసారి ఆలోచించరూ..
గజపతినగరం రూరల్ : మండల పరిధిలోని పురిటిపెంట రైల్వే గేట్ వద్ద విద్యార్థులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తుండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న వారే ఇలా చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పురిటిపెంట వద్ద రైల్వే గేట్ ఉంది. రైళ్లు వచ్చేటప్పుడు సిబ్బంది ఠంచన్గా గేట్ వేస్తుంటారు. అయితే గేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు గేట్ వేసినా ఆగకుండా ట్రాక్పై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతిరోజూ కళాశాలల ప్రారంభ సమయంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ట్రాక్పై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్కోసారి రెండు ట్రాక్లపై కూడా రైళ్లు వస్తుంటాయి. ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరగరాని ప్రమాదం జరిగితే విద్యార్థుల కుటుంబాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కళాశాలల సిబ్బంది అయినా విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
భద్రం.. బీ కేర్ఫుల్ సిస్టరు..!
నమ్య! చెన్నై బ్లాగర్. ఉద్యోగం కోసం నెట్లో సెర్చ్ చేస్తోంది. తెలిసిన వాళ్లకు కూడా తన ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఇటీవలే, ఆమెకు ‘ఎయిర్ ఫ్రాన్స్’ నుంచి కాల్ వచ్చింది! ‘‘ఇంతక్రితమే మా ఎగ్జిక్యూటివ్ మీ వివరాలు చెప్పాడు. ఫార్మాలిటీస్ ఏమీ లేవు. వాట్సాప్ వీడియో కాల్లో ఇంటర్వ్యూ ఉంటుంది’ అని చెప్పాడు. వీడియో కాల్ ఇంటర్వ్యూ మొదలైంది. మీ ఎత్తు, బరువు చూపించండి. మీ ఒంటిమీద పుట్టు మచ్చలు చూపించండి. మీ పొట్టభాగం చూపించండి.. ఇలా ఉన్నాయి ప్రశ్నలు. నమ్యకు డౌట్ వచ్చింది. ‘సారీ.. నేనలా చేయలేను’ అంది నమ్య. ‘‘ఇప్పుడున్న బట్టలతో పొట్టను చూపించడానికి వీలుకాకపోతే టీషర్ట్ వేసుకోండి’’ అన్నాడు! నమ్యకు ఇందంతా సవ్యంగా సాగుతున్నట్లేం అనిపించలేదు. వెంటనే కాల్ కట్ చేసింది. ఆమెకు అర్థమైంది. అది ఎయిర్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన కాల్ కాదు, ఎవరో ఆ పేరుతో తనని ట్రాప్ చేస్తున్న కాల్ అని. వెంటనే ఆ వాట్సాప్ చాట్ని ఫేస్బుక్లో పెట్టింది నమ్య. ఆగంతకుడి కోసం హంట్ మొదలైంది! ఇక్కడితో ఆగిపోలేదు నమ్య. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎలాంటి ప్రమాదాలు ఎదురౌతాయో తెలుపుతూ జనవరి 3న ఒక లెటర్ పోస్ట్ చేసింది. ‘గర్ల్స్.. మనం డేంజర్లో ఉన్నాం. నాకు జరిగినట్లు మీకెవరికీ జరగకూడదు. ఫోన్లో కేర్ఫుల్గా ఉండండి’ అని రాసింది. సో.. అమ్మాయిలూ.. జాగ్రత్త! మీ చేతిలోని స్మార్ట్ఫోనే ఒక్కోసారి మీ శత్రువు అవుతుంది. -
చెట్టుంది జాగ్రత్త
ఉద్యాననగరిలో చీటికిమాటికీ కూలుతున్న వృక్షాలు ♦ ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు ♦ పర్యవేక్షణ లేని పాలికే చల్లని నీడనిచ్చే చెట్టు ప్రాణాలను తీస్తుందా.. ఏమిటీ జోక్, ఎవరైనా వింటే నవ్విపోతారు అని అనుకోవచ్చు. కానీ బెంగళూరులో తరచూ పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడం, అవి వాహనాలు, ప్రజల మీద పడి ప్రాణనష్టం జరగడం తరచూ జరుగుతోంది. అంతర్జాతీయంగా బెంగళూరు నగరానికి గార్డెన్సిటీగా పేరుప్రఖ్యాతులు రావడానికి ప్రధాన కారణమైన పచ్చని చెట్లు గత కొద్ది కాలంగా ప్రజల పాలిట మృత్యు పాశాలవుతున్నాయి. మొత్తం 800 చదరపు కిలోమీటర్ల విస్తరించిన బీబీఎంపీ పరిధిలో సుమారు 14 లక్షల చెట్లు ఉండగా వాటి నిర్వహణపై బీబీఎంపీ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో చాలా ప్రాంతాల్లో చెట్లు చెదలు పట్టి కూలిపోతున్నాయి. సాక్షి, బెంగళూరు : ఉద్యాననగరంలో చెట్ల వల్ల పెద్ద చిక్కొచ్చిపడింది. శిథిలమైన, ప్రమాదకరంగా ఉన్న చెట్లు, కొమ్మలు కూలిపోతూ అనేక రకాలుగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి చెట్లను తొలగించి ప్రమాదాలు నివారించడానికి బీబీఎంపీ కాంట్రాక్ట్ పద్ధతిన 168 మందితో 21 బృందాలు నియమించింది. చెట్ల సంఖ్యతో పోలిస్తే ఈ సిబ్బంది ఏ మూలకూ చాలడం లేదు. సిబ్బంది కొరత కారణంగా చెట్ల తొలగింపు చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ బృందాలు కూడా కేవలం వర్షాకాలంలో మాత్రమే చెట్ల తొలగింపు చర్యల్లో పాల్గొంటూ మిగిలిన కాలాల్లో గాలికొదిలేస్తుండడం కూడా సమస్య జఠిలమవడానికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు. విదేశీ చెట్లు పెంచడం కారణమా? బెంగళూరు పాలికే భౌగోళిక పరిస్థితి, మృత్తిక స్వభావానికి విరుద్ధంగా విదేశాల్లో పెరిగే చెట్లను ఇక్కడ కూడా పాలికే అధికారులు పెంచుతున్నారు. తబూబియా, గుల్మొహర్, రైన్ ట్రీ, కాపర్వుడ్ తదితర జాతి చెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. అందం కోసం ఖర్చుకు వెనకాడకుండా ఈ చెట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వారు చెబుతున్నారు. వీటి వేర్లు భూమితి గట్టిగా పట్టుకోవు. అంతేకాకుండా ఈ జాతి చెట్లు వయస్సు కేవలం 25 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. అయితే సదరు చెట్లను ఎప్పుడు నాటారు, వాటిని ఎప్పుడు తొలగించాలి అనే రికార్డులు బీబీఎంపీ వద్ద లేవు. దీంతో వర్షం వచ్చిన ప్రతిసారి ఎక్కడో ఒకచోట ఇటువంటి చెట్లు కూలి ప్రాణ, భారీ ఆస్తినష్టం సంభవిస్తోంది. చెట్లకు ముప్పు ఇలా వివిధ కారణాలతో నగరవ్యాప్తంగా ఉన్న భారీ చెట్ల చుట్టూ సిమెంటు గోడలు, సిమెంటు కుర్చీలను నిర్మించడంతో చెట్ల వేర్లు,కాండాలకు గాలి,నీరు అందకపోవడంతో అనేక చెట్లు నిర్జీమవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపారసంస్థలు తమ ప్రకటనల హోర్డింగులకు అడ్డుగా ఉన్నాయనే నెపంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల వేర్లలో విషపూరిత రసాయనాలు చల్లుతూ వాటిని నిర్వీర్యం చేస్తుంటారు. మురికికాలువల నిర్మాణాలు, తాగునీటి పైపులైన్లు, విద్యుత్ కేబుళ్లు, ఓఎఫ్సీ కేబుళ్ల తదితర వాటి కోసం రోడ్లపై, రోడ్లకు ఇరువైపులా ఉన్న వేర్లు, కొమ్మలు తొలగిస్తుండడంతో చెట్లు సమతౌల్యాన్ని కోల్పోతున్నాయి. ఇలాంటి చెట్లు ఈదురు గాలులకు, వర్షాలకు ప్రజలపై కూలిపడుతూ ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. గత ఐదేళ్లలో చెట్లు కూలి జరిగిన ప్రాణనష్టం ⇔ 2012 మే1న సంజయ్నగర్లోని నాగశెట్టిహళ్లిలో రావిచెట్టు కూలి రవి(45) వ్యక్తి మృతి. ⇔ 2012 జూన్6న సంపిగేహళ్లి సమీపంలోని టెలికాం లేఅవుట్లో కొబ్బరిచెట్టు కూలి వీరణ్ణ(50) మృతి. ⇔ 2013 మే8న బసవేశ్వరనగర్లోని మోదీ ఆసుపత్రి రోడ్లో ఆటోపై చెట్టు కూలి ఆటోలో ప్రయాణిస్తున్న గీత (52)మృతి. ⇔ 2015 మే 29 హొసూరు రోడ్లోని ఆనేపాళ్య బస్టాప్పై చెట్టు కూలడంతో మాధవరెడ్డి (50)మృతి, ఐదుగురికి గాయాలు. ⇔ 2015 జూన్10 ఆడుగోడిలోని సీఎస్ఆర్ వసతి సముదాయంపై చెట్టు కూలడంతో పుట్టగంగప్ప (80)మృతి. ⇔ 2015 సెప్టెంబర్18 గరుడామాల్ సమీపంలోని డిసౌజా సర్కిల్లో చెట్టు కూలి యల్లయ్య (35) కార్మికుడు మృతి. ⇔ 2015 డిశెంబరు 10 విజయనగర్లోని ఎంసీ లేఅవుట్లో బైకుపై చెట్టు కూలి మంజునాథ్ (35) మృతి. ⇔ 2016 జూన్27 వివేక్నగర్లోని 7వ క్రాస్రోడ్లో చెట్టు కూలి జీవన్ (7) మృతి.ఇదే రోజు మల్లేశ్వరంలోని 18వ క్రాస్లో బైక్పై చెట్టు కూలి పాషా(50) మృతి.. ⇔ 2016 జులై 10 బసవనగుడిలోని కే.ఆర్.రోడ్లో ఆటోపై కొబ్బరి చెట్టు కూలి ఇంతియాజ్(45)మృతి. ⇔ 2017 సెప్టెంబర్ 8 జే.సీ.రోడ్లోని డిస్పన్సరీ రోడ్లోని కారుపై నీలగిరి చెట్టు కూలి భార్యభర్తలు భారతి, రమేశ్, బంధువు జగదీశ్ మృతి. -
యోగాతో కూడా డేంజరే
ఆయురారోగ్యాలతోపాటు మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో మంచిదని నమ్ముతున్న భారతీయులు దాదాపు ఐదువేల సంవత్సరాల నుంచి యోగాను అభ్యాసం చేస్తున్న విషయం తెల్సిందే. అందుకనే భరత దేశం ఇచ్చిన పిలుపు మేరకు ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని ప్రపంచయోగా దినోత్సవంగా కూడా ప్రకటించింది. హాలివుడ్ సెలబ్రిటీలు బెయాన్స్, లేడీ గగాలు, బ్రెజిల్ సూపర్ మోడల్ గిస్లీ బుండ్చెన్లతోపాటు డేవిడ్, విక్టోరియా బెకమ్లు యోగాను ప్రమోట్ చేస్తున్నారు. యోగావల్ల శరీర అవయవాలకు, ముఖ్యంగా చేతులకు ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. యోగా చేస్తున్న పది మందిలో ఒకరికన్నా ఎక్కువ మందికి ‘మస్క్యులోస్కెలెటల్’ పెయిన్స్ అంటే కండస్థ ఎముకలకు సంబంధించిన నొప్పులు వస్తాయని వెల్లడైంది. ఇంతకు ముందే అవయవ నొప్పులు ఉన్నవారు యోగా చేస్తే అవి మరింత పెరిగే అవకాశం ఉందని సిడ్నీ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఎవాంజలస్ పప్పాస్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. యోగా వల్ల భుజాలు, మోచేతులు, ముంచేతులకు నొప్పులు వస్తాయని, కొన్ని సార్లు కాళ్లకు కూడా నొప్పులు వస్తాయని ఆయన చెప్పారు. ఇతర క్రీడల వల్ల శరీరానికి ఎలా గాయాలయ్యే అవకాశం ఉందో, యోగా వల్ల కండరాలకు గాయాలయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. యోగా వల్ల తాము ఇంతకుముందు అంచనావేసిన ముప్పు కంటే ఇప్పుడు ముప్పు పదింతలు ఎక్కువని స్పష్టమైందని ఆయన చెప్పారు. ఈ యోగా అధ్యయన వివరాలను ‘బాడీ వర్క్ అండ్ మూవ్మెంట్ థెరపీస్’ అనే పుస్తకంలో ప్రచురించారు. న్యూయార్క్లో రెండు వేర్వేరు యోగా క్లాసులకు హాజరవుతున్న 350 మందిపై అధ్యయనం జరపడం ద్వారా ఈ వివరాలను సేకరించినట్లు ఆయన చెప్పారు. వారిలో మొత్తం 26 శాతం మంది యోగాభ్యాసకులు సమస్యలు తలెత్తాయి. కొందరిలో పాత నొప్పులు తిరగతోడగా లేదా ఎక్కువకాగా, కొంత మందికి కొత్తగా నొప్పులు మొదలయ్యాయి. తమకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని మిగతా 76 శాతం మంది అభ్యాసకులు తెలిపారు. కండస్థ ఎముక నొప్పులతో బాధపడుతున్న తమకు ఆ నొప్పులు తగ్గాయని కూడా కొంత మంది చెప్పారు. రక్తపోటును, గుండెపోటు, మానసిక ఒత్తిడిని అరికట్టడంలో యోగా నిర్వహిస్తున్న పాత్రను విస్మరించలేమని, కానీ కండర సంబంధిత సమస్యలు యోగా వల్ల ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. సంక్లిష్టమైన, కఠినమైన యోగాసనాలకు బదులుగా సులభమైన యోగాసనాలే మంచిదని వారంటున్నారు. యోగా శిక్షణ ఇచ్చే టీచర్లు కూడా తమ విద్యార్థులకు ఏమైనా నొప్పులతో బాధపడుతున్నారా?, యోగాభ్యాసం వల్ల కొత్తగా నొప్పులు వచ్చాయా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటే వాటిని ముందుగానే అరికట్టవచ్చని ప్రొఫెసర్ ఎవాంజలస్ అభిప్రాయపడ్డారు. తమ అధ్యయనాలు కూడా ఎక్కువగా యోగా శిక్షకులకు ఉపయోగపడేవేనని ఆయన చెప్పారు. -
సెల్ వాడుతున్నారా అయితే!
– రేడియేషన్తో గుండెజబ్బుల ప్రమాదం – వాడకాన్ని తగ్గించాలంటున్న నిపుణులు వరికుంటపాడు: ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మానవ అభివృద్దికి ఎంతగా తోడ్పడుతుందో అంతే వేగంగా అనర్ధాలకు దారితీస్తోంది. ప్రధానంగా సెల్ఫోన్. సాంకేతి రంగంలో ఓ భాగమైన సెల్ఫోన్ మానవుని తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణభూతమవుతున్నాయి. సెల్టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో గుండెజబ్బులకు దారితీస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, టవరుకు టవరుకు మధ్య రెండు కి.మీ దూరం, గ్రామాలలో అయితే పది కి.మీ దూరంలో ఉండాలన్న నిబంధనలు అమలు కావడం లేదు. ప్రైవేటు సెల్టవర్లు పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేస్తుండడంతో వీటి ప్రభావం జీవరాశులపై తీవ్రంగా చూపుతున్నాయి. ఇప్పటికే సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావంతో పిచ్చుకలతో పాటు పలురకాల జాతుల పక్షులు కనుమరుగయ్యాయి. రేడియేషన్తో ఏర్పడే సమస్యలు: రేడియేషన్ ప్రభావం గర్భిణుల ఆరోగ్యంపై తీవ్రంగా చూపుతుంది. మానసిక, శారీరక వికలాంగులుగా పిల్లలు పుట్టే అవకాశముంది. అలాగే మానవ శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గుండె, మూత్రపిడాలు దెబ్బతినే అవకాశంవుందని వైదనిపుణులు చెపుతున్నారు. రకరకాల చర్మవ్యాధులు సంభవిస్తాయి. గుండెజబ్బులకు రేడియేషన్ కారణమని పలు అధ్యయనాల్లో తెలుస్తోంది. జన్యుపరంగా మనిషి ఎదుగుదలను నిరోధిస్తుంది. మూత్రపిండాలపై కూడా తీవ్ర ప్రబావం చూపుతాయి. వినికిడి లోపం ఏర్పడుతుంది. ప్రైవేటు టవర్ల యజమానులు మెరుగైన సేవలందించేందుకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్ పెంచడం ద్వారా రేడియేషన్ ప్రభావం ఎక్కువగా జీవరాశులు, మానవులపై చూపుతుంది సెల్ఫోన్ వాడే విధానం: సెల్ఫోన్ను వీలైనంత తక్కువగా వాడడం మంచిది. చొక్కా జేబులో సెల్ఫోన్ పెట్టుకోకుండా వీలైనంత ప్యాంటు బెల్టుకు దీనిని అమర్చుకోవాలి. కాల్ అనుసంధానం అయ్యేటప్పుడు చెవి దగ్గరగా పెట్టుకోకూడదు. వీలైనంత వరకు స్పీకరు ఆన్చేసి మాట్లాడడం కొంతమేర మేలని నిపుణులు తెలుపుతున్నారు. -
ఆ మృత్యు దారికి మోక్షం ఎప్పుడు ?
-
ప్రపంచంలో అత్యంత డేంజర్ రోడ్స్
-
అందే ఎత్తులో ‘ప్రమాదం’
ప్రమాదకరంగా విద్యుత్ తీగలు మనూరు: మండలంలోని ముక్టాపూర్ శివారులో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. దీంతో స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలను సరి చేయాలని గతంలో సంబంధిత అధికారులను కోరినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ తీగలు చేతికి అందేంత ఎత్తులో ఉన్నాయని వెంటనే వాటిని సరి చేయాలని ముక్టాపూర్ ప్రజలు డిమాండ్ చేశారు. -
పడిపోవాల్సిందేనా?
బ్రిడ్జిని కూల్చేశారు.. అలా వదిలేశారు.. అంతే.. ఆ మార్గంలో వెళ్లేవారి పరిస్థితేంటి.. దానిని దాటుకుంటూ ఎలా గమ్యం చేరతారు.. పట్టుజారితే అంతే..నాలాలో కొట్టుకుపోవాల్సిందే.. చివరికి అదే జరిగింది.. అభం శుభం తెలియని ఓ నిండుప్రాణం అధికారుల నిర్లక్ష్యానికి గాలిలో కలిసిపోయింది.. కంటోన్మెంట్ పరిధిలో కూల్చేసిన ఫిలిప్స్బ్రిడ్జి ప్రాంతంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. బ్రిడ్జి కూల్చేసిన ప్రాంతంలో నాలా మీద ఉన్న పైప్లైన్ దాటుతూ బోయిన్పల్లి చిన్నతోకట్టాకు చెందిన రాకేశ్ (29) ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు. – కంటోన్మెంట్ ముందు చూపు లేకుండా ప్రణాళికలు రూపొందించడం... తీరా పనులు ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో మళ్లీ మొదటికి వెళ్లడం కంటోన్మెంట్ బోర్డు అధికారులకు అలవాటుగా మారింది. కంటోన్మెంట్ పరిధిలో చేపట్టి అర్ధంతరంగా ఆగిపోయిన పనులకు తోడు సెంటర్పాయింట్– పుల్లారెడ్డి చౌరస్తా మార్గంలో ‘ఫిలిప్స్ బ్రిడ్జి’ని నాలుగు నెలల క్రితం (ఏప్రిల్ 17) కూల్చేసి ఇప్పటికీ విస్తరణ పనులు ప్రారంభించలేదు. తాడ్బంద్ చౌరస్తా నుంచి నేరుగా బోయిన్పల్లి చెక్పోస్టు, మేడ్చల్ హైవేకు వెళ్లేందుకు అనువైన ఈ మార్గంలో ఫిలిప్స్ గోడౌన్ వద్ద బ్రిడ్జి కేవలం 20 అడుగుల వెడల్పు మాత్రమే ఉండేది. పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా ఈ బ్రిడ్జిని విస్తరించాలన్న డిమాండ్తో స్థానిక బోర్డు సభ్యులు ఎప్పటికప్పుడు బోర్డులో ప్రతిపాదిస్తూ వచ్చారు. అయితే ఈ బ్రిడ్జి విస్తరణకు గ్యారిసన్ ఇంజనీరింగ్ (జీఈ) అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, డిజైన్ మార్చాలని ఇలా పలు మార్లు వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి 2013లో బ్రిడ్జి విస్తరణ పనులకు బోర్డు ఆమోదం లభించింది. అదే సమయంలో తాడ్బంద్– బాలంరాయి మార్గంలో జైకా ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులు మొదలవడంతో ఈ మార్గాన్ని వన్వేగా మార్చారు. దీంతో అదే సమయంలో ఫిలిప్స్ బ్రిడ్జి విస్తరణ చేపడితే ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని భావించి ఈ పనులు చేపట్టేందుకు ట్రాఫిక్ అధికారులు అనుమతించలేదు. గత డిసెంబర్లోనే జైకా పనులు పూర్తికావడంతో బ్రిడ్జి విస్తరణకు అడ్డంకులు తొలగిపోయినప్పటికీ, కాంట్రాక్ట్ కాలపరిమితి ముగింపు, బ్రిడ్జి విస్తరణ సమయంలో ట్రాఫిక్ మళ్లింపునకు నాలా మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుకు తోడు భూ సార పరీక్షలు, బ్రిడ్జి డిజైన్లో మార్పులు అంటూ అధికారులు తాత్సారం చేయడంతో మరింత ఆలస్యమైంది. తాజాగా మూడు నెలల్లో పనులు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఏప్రిల్ 16 నుంచి జూలై 16వ తేదీ వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకల్ని నిషేధించి, దారి మళ్లింపు చేపట్టారు. నిర్దేశిత గడువు ముగిసిపోయినప్పటికీ విస్తరణ పనులు ఒక్క అడుగుకూడా ముందుకు సాగకపోవడం గమనార్హం. వాహనదారుల ఇక్కట్లు.. ఓల్డ్ బోయిన్పల్లి, న్యూబోయిన్పల్లి పరిధిలోని సుమారు 100కు పైగా కాలనీల ప్రజలతో పాటు సికింద్రాబాద్ నుంచి సుచిత్ర–కొంపల్లి, మేడ్చల్ మార్గాలకు వెళ్లే వాహనదారులు సెంటర్పాయింట్ మార్గాన్నే వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ దారిలో వాహనాల రాకపోకల్ని నిషేధించడంతో ద్విచక్ర వాహనదారులు సమీపంలోని కాలనీ మార్గాలను ఆశ్రయిస్తుండగా, మెజారిటీ వాహనాలను దుబాయ్గేట్– బోయిన్పల్లి మార్కెట్, డైమండ్ పాయింట్ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గాల్లో ట్రాఫిక్జామ్లు నిత్యకృత్యమయ్యాయి. దుబాయ్ గేట్ చౌరస్తాలో సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ సమస్య కొనసాగుతోంది. నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి కంటోన్మెంట్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి బలైపోయాడు. బోయిన్పల్లి చిన్నతోకట్టాకు చెందిన రాకేశ్ (29) బుధవారం మధ్యాహ్నం సెంటర్పాయింట్ చౌరస్తా సమీపంలో కూల్చేసిన ‘ఫిలిప్స్ గోడౌన్’ దాటుతూ ప్రమాదవశాత్తు నాలాలో పడి మరణించాడు. డ్రైవర్గా పనిచేసే రాకేశ్ బాలాజీనగర్లోని అత్తగారింటికి బాపూజీనగర్ మీదుగా సెంటర్పాయింట్కు వెళ్లే క్రమంలో నాలాపైనున్న మంచినీటి పైపులైను దాటుతూ వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కాలుజారి నాలాలో పడిపోయి ప్రవాహంలో మునిగిపోయాడు. ఓ సెక్యూరిటీ గార్డు గమనించి స్థానికులకు చెప్పగా దాదాపు గంటన్నర సేపు ప్రవాహంలో వెతికారు. 108 సిబ్బంది, పోలీసులు సైతం వెతికి ప్రయోజనం లేకపోవడంతో వెనుతిరిగారు. తరువాత ఇద్దరు స్థానిక యువకులు నాలాలోకి దిగి ప్రవాహంలో కొంతదూరం వెళ్లి వెతగ్గా మృతదేహం కనిపించింది. దీంతో జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ ఘటనకు కంటోన్మెంట్ బోర్డు అధికారులే బాధ్యత వహించాలని స్థానిక నేతలు నేతలు భానుక మల్లికార్జున్, ముప్పిడి మధుకర్ సీఈఓ వచ్చే వరకు శవాన్ని తరలించడకుండా అడ్డుకున్నారు. బోర్డు సభ్యులు పాండుయాదవ్, జక్కుల మహేశ్వర్రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేందర్ను నిలదీశారు. ఎమ్మెల్యే సాయన్న చేరుకొని మృతుడు గతంలో తన వద్ద డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిగా గుర్తించాడు. దహన సంస్కారాల నిమిత్తం ఎమ్మెల్యే రూ.5వేలు అందజేయగా, బోర్డు సభ్యులు మరో రూ.25వేలు అందజేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మన్నె కృషాంక్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జెల నాగేశ్ మృతదేహాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మృతదేహాన్ని గాంధీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి భార్య అనిత, మూడేళ్ల కుమారుడు శ్రవణ్ ఉన్నారు. -
ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
ఇళ్లపై నుంచి యమపాశాలు వర్షం వస్తే షాక్ తినాల్సిందే భయం గుప్పిట్లో హౌసింగ్బోర్డు ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు అభివృద్ధికి అడ్డు తగులుతున్న అధికారులు మెదక్:పట్టణంలోని ప్రజలు విద్యుత్ తీగలతో బెంబేలు చెందుతున్నారు. ప్రమాదకరమైన విద్యుత్వైర్లు పదుల సంఖ్యలో ఇళ్లపై నుంచి వెళుతున్నాయి.అవి తరుచూ ప్రజలను కరెంట్ షాక్లకు గురిచేస్తున్నాయి. పట్టించుకోవలసిన విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్షంగా ప్రవర్తిస్తు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు చూస్తున్నారు తప్పితే ఎలాంటి పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... మెదక్ పట్టణంలోని 1వ వార్డులో హౌసింగ్బోర్డు, ఆర్టీసి కాలనీ , ఎంఐజి, ఎల్ఐజి కాలనీలున్నాయి. ఈ కాలనీల్లో పదుల సంఖ్యలో ఇళ్లపై నుంచి ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు వెళుతున్నా వాటిని సరి చేయకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు.వర్షం వస్తే వర్షానికి విద్యుత్ వైర్లు తడిసి షాక్ కొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఇటాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా అధికారులకు చీమ కుట్టిన్నట్లు కూడా లేదని అదికారుల వల్లే తమ కాలనీ పరిస్థితి ఘోరంగా తయారైందని కాలనీ వాసులు వాపోయారు. నిరసన వ్యక్తం చేస్తే తమ కాలనీకి పోలీసులను పంపించి వారిస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా ప్రజాప్రతినిధులు వారిని వారించాల్సింది పోయి వారికి సపోర్టుగా నిలవడం ఎంత వరకు సమంజసమన్నారు.ప్రజా ప్రతినిధులు కరక్ట్గా ఉంటే తమ కాలనీకి ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావన్నారు. ఒకపక్కన సర్కారు అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చెపడుతుంటే తమ కాలనీ అభివృద్ధికి నోచుకోకుండా అధికారులు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వీటి బారీన ఎంతో మంది పడ్డారన్నారు. అంతేకాకుండా ఈ కాలనీలో పలు చోట్ల విద్యుత్ తీగలు వేలాడుతుండటంతో గాలి దూమారం వస్తే ఒకటి కొకటి తగిలి ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్లు, ఇతర ఎలక్టాన్రిక్ వస్తువులన్నీ కాలిబూడిదవుతున్నాయి.గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగిన అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని ఆర్టీసీ కాలనీ వారు వాపోయారు. ఈ కాలనికి చెందిన రవి అనే వ్యక్తి ఇంటిపై ఇంటిపై నుంచి విద్యుత్ తీగలు వెళ్లాడంతో విద్యుత్ షాకుకు గురయ్యాడు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం వాటిని సరిచేయడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే కాలనీలోని తన ఇంటిపై నుంచి కరెంట్ తీగలుండటంతో వర్షం పడిన ప్రతిసారి కరెంట్షాక్ వస్తుందని హౌసింగ్బోర్డులోని సత్యవతి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైన అధికారులు స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. ఆందోళన చేస్తే అరెస్ట్లా? గతంలో గాలి దూమారం వచ్చిన సందర్భంగా హౌసింగ్బోర్డులో వేలాడుతున్న విద్యుత్ తెగిపోవడంతో పాటు స్తంభాలు విరిగిపోయి, ఇళ్లలోని ఎలక్టాన్రిక్ వస్తువులన్నీ కాలిపోయాయని ప్రస్తుత వార్డు కౌన్సిలర్ అనిల్కుమార్ తెలిపారు. కాగా వాటిని సరిచేసే క్రమంలో అధికారులు తీవ్ర జాప్యం చేశారు. దీనిపై కాలనీలోని కొంతమంది ఆందోళనకు దిగితే 7గురిని అరెస్ట్చేసి జైలుకు పంపించారు. నాటి నుంచి నేటి వరకు హౌసింగ్బోర్డు కాలనీలో కరెంట్ వ్యవస్థ అస్తవ్యస్తగానే ఉంది. ఈ కాలనీలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లకు కనీసం కంచె కూడా వేయలేదు. రెండుచోట్ల పార్కుల పక్కనే కంచె లేని ట్రాన్స్పార్మర్లు ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైన అధికారులు స్పందించి కాలనీలోని ఇళ్లపై ఉన్న తీగలతోపాటు వేలాడుతున్న వాటిని సరిచేసి, ట్రాన్స్ఫార్మర్ల చుట్టు కంచె వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనతోపాటు కాలనీకి చెందిన పలు కమిటీల నాయకులు కిష్టయ్య, రాజయ్య, పెంటయ్య, శ్రీధర్,రమేష్లు ఉన్నారు. -
ఘాట్కో గండం
కొల్లిపర : పుష్కరఘాట్ల వద్ద ప్రమాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. పిడపర్రు లాకుల వద్ద పుష్కరఘాట్కు వెళ్లే అప్రోచ్రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు నిర్మాణంలో మట్టి, ఇసుక వాడారు. అప్రోచ్ రోడ్డు పక్కనే ఉన్న రేపల్లె బ్యాంకు కెనాల్ స్లూయిస్ బాగా పల్లంగా ఉండటంతో ఇది భయపెడుతోంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణం వెంట బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మున్నంగి వద్ద అప్రోచ్ రోడ్డు మున్నంగి పుష్కర ఘాట్కు వెళ్లే అప్రోచ్రోడ్డు ప్రమాదకరంగా ఉంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి తవ్వారు. ఎక్కువ లోతుగా తవ్వకాలు జరపటంతో రోడ్డు వెంట పల్లంగా మారింది. ఒక వేళ పట్టుజారిందా గోతిలో పడాల్సిందే. ఇక్కడ అప్రోచ్రోడ్డు వెంట సైడ్ వాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వల్లభాపురం ఘాట్కు బారికేడ్లు తప్పనిసరి? భక్తులు స్నానాలు చేసే చోట తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలి. వల్లభాపురం తిరుపతమ్మ గుడి వద్ద భక్తుల స్నానాల కోసం అక్కడ ఉన్న ర్యాంప్ వద్ద రెండు పుష్కర ఘాట్లను నిర్మిస్తున్నారు. ఒక ఘాట్ ర్యాంపునకు ఎదురుగా, మరో ఘాట్ ర్యాంపునకు ఎడమవైపు ఉంది. ఆ రెండింటి మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. రెండు ఘాట్ల వద్ద రెండున్నర అడుగుల మేర మాత్రమే సైడ్ వాల్స్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో భక్తులు స్నానమాచరిస్తారు. కావున బారికేడ్లు తప్పనిసరి. వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద గుండం వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న ఘాట్కు సమీపంలో గుండం ఉంది. అక్కడ అధికారులు నిర్దేశించిన ఘాట్ ప్రాంతంలోనే స్నానం చేయడం మంచిది. గుండం వద్దకు భక్తులు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇక్కడ కచ్చితంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. జారుడు బల్లగా పుష్కర ‡ఘాట్ వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న పుష్కరఘాట్ జారుడు బల్లగా కనిపిస్తుంది. పుష్కరాల సమయంలో వర్షం వస్తే భక్తులకు ఇబ్బందే. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే భద్రతా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీతానగరంలో.. సీతానగరం(తాడేపల్లి రూరల్): స్థానిక కృష్ణా రివర్ బెడ్లో ఉన్న రిటైనింగ్ వాల్, పుష్కరఘాట్ల వద్ద స్వాగతద్వారం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి పుష్కరఘాట్ల వరకు 800 మీటర్లపైన ఉన్న రిటైనింగ్ వాల్ ఇప్పటికే రెండుచోట్ల కూలింది. మరో నాలుగు చోట్ల కూలేందుకు సిద్ధంగా ఉంది. భారీ వర్షం కురిస్తే విజయకీలాద్రి పర్వతంపై నుంచి వచ్చే వర్షపునీరు ఈ వాల్లోకి ప్రవేశిస్తాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న ఈ గోడల్లోకి నీరు చేరితే ప్రమాదమేనని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. పుష్కరఘాట్ల వద్ద గతంలో ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి స్వాగతద్వారం పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతోంది. నాలుగో ఘాట్లో భక్తుల సేద తీర్చేందుకు గతంలో షెడ్డును ఏర్పాటు చేశారు. ఈ షెడ్డు పైకప్పు లేచి ప్రమాదభరితంగా మారింది. -
పొగాకు వాడకం ప్రమాదకరం
ప్రొద్దుటూరు క్రైం: పొగాకు వాడకంతో ఏటా లక్షల కుటుంబాలు క్యాన్సర్ బారిన పడుతున్నాయని అదనపు డీఎంఅండ్హెచ్ఓ అరుణసులోచన అన్నారు. జాతీయ పొగాకు నియంత్రణలో భాగంగా గురువారం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పొగాకు ఉత్పత్తుల వాడకం, అలవాట్లు మాన్పించే కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొగాకు ఉత్పత్తులు వాడిన కారణంగా ప్రపంచంలో ప్రతి ఏడాది సుమారు 60 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. మన దేశంలో అయితే 10 లక్షల మంది ప్రతి ఏడాది మృత్యువాత పడుతున్నారని చెప్పారు. బీడీ, గుట్కా, సిగరెట్లకు బానిసలైన వారిని ఇక్కడికి తీసుకొని వస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మాన్పించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా ధూమ పానం చేస్తుంటే ధైర్యంగా తాగవద్దని చెప్పాలన్నారు. అవసరమైతే వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.ధూమపానం చేసేవారు 40 శాతం మాత్రమే పొగతాగి మిగతా 60 శాతం బయటికి వదులుతున్నారని చెప్పారు. దీనివల్ల పొగతాగని వారు కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని వివరించారు. నోడల్ ఆఫీసర్ మహ్మద్బాషా మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో 100 జిల్లాలు ఈ కార్యక్రమానికి ఎంపిక కాగా అందులో వైఎస్సార్ జిల్లా కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డేవిడ్ సెల్వరాజ్, హెల్త్ఎడ్యుకేషన్ ఆఫీసర్ గంగరాజు, వైద్యులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
ఫేమస్ పిచ్చితో ఏం చేశాడో తెలుసా..!
-
ఫేమస్ పిచ్చితో ఏం చేశాడో తెలుసా..!
లండన్: ఫేమస్ అవ్వాలనే పిచ్చిలో ఒక్కొక్కరు ఒక్కో విన్యాసం చేస్తుంటారు. ఆ విన్యాసాలు చేసే క్రమంలో తమ ప్రాణాలు సైతం ఫణంగా పెడతారు. అయితే, తీవ్రమైన బాధ ఉంటుందని తెలిసి ఫేమస్ కోసం ఎవరూ ఏ స్టంట్ చేయలేరు. కానీ, లండన్ లో ఓ వ్యక్తి ఈ వింత కోరిక కోరుకున్నాడు. ప్రజలందరి దృష్టి ఎలాగైన తనపై పడాలన్న ఉద్దేశంతో కాస్పర్ నైట్ అనే వ్యక్తి తనను తాను కాల్చుకున్నాడు. తన చెంపకు గన్ పెట్టి ట్రిగ్గర్ నొక్కి గాయం చేసుకున్నాడు. అనంతరం నోటి నిండా రక్తాన్ని పట్టుకొని బయటకు ఉమ్మేస్తూ ఆ వీడియోను రికార్డు చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. త్వరలో తాను మ్యూజిక్ కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఆ మ్యూజిక్ వీడియోలో భాగంగా ఓ స్టంట్ చేయాలని అనుకున్నాడు. అయితే, అతడు ఎవరికీ తెలియదు. తన కెరీర్ కంటే ముందు తాను అందరికీ తెలిసిపోవడం ఎలా అని ఆలోచించి ఈ చెత్త పని చేశాడు. చిన్న సూదితో గుచ్చుకోవాలంటేనే గుండెలు ఎగిసి పడతాయి. అలాంటిది ఏకంగా, చెంపకు తుపాకీ గురిపెట్టి టపీమని కాల్చుకోవడం చేయగలమా.. కానీ అతడు అదే పని చేశాడు. ఓ కెమెరా మెన్ సమక్షంలో ఈ స్టంట్ చేసేందుకు ప్రయత్నించినా రికార్డు చేసేందుకు ఎవరూ ఒప్పుకోలేదంట. దీంతో తన వీడియోను తానే తీసుకుని ఫేస్ బుక్ లో పెట్టాడు. -
సాహసం చేయాలి మరి!
సీతానగరం: మండలంలోని వివి ధ గ్రామాలకు చెందిన దాదా పు 850 మంది పిల్లలు రోజూ సమీప పట్టణాల్లో చదువుకోసం వెళ్తుంటారు. అయితే వీరు ప్రయాణించాల్సిన సమయాల్లో ఒకటి, అరా బస్సులు మాత్రమే ఉండటంతో వారంతా బస్సు ల్లో కిక్కిరిసి ప్రయాణించడమేగాదు... ఏకంగా బస్ టాప్పైకి ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. ఇది ఈ ప్రాంత విద్యార్థులకు రోజువారి దినచర్యగా మారిపోయింది. ఇది ప్రమాదమని తెలిసినా అధికారులు వారికి అదనపు బస్సులు సమకూర్చేందుకు ముందుకు రావడం లేదు. దాదాపు అన్ని గ్రామాలనుంచీ అదే పరిస్థితి మక్కువ రూట్నుంచి సీతానగరం, బొబ్బిలి, పార్వతీపురం వంటి ప్రాంతాలకు దాదాపు 400మంది, పి.చాకరాపల్లి, అజ్జాడ తదితర గ్రామాల నుంచి 450 మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. సకాలంలో విద్యాలయాలకు చేరాలంటే... వచ్చే ఒక్కబస్సునే ఇంతమందీ ఆశ్రయించాల్సి వస్తోంది. మక్కువ నుంచి, పి.చారాపల్లినుంచి ఉదయం పూట 8 గంటల సమయంలో వచ్చే బస్సులు చాలక పోవడంతో కొయ్యానపేట, బగ్గం దొరవలస, బళ్ళకృష్ణాపురం నుంచి విద్యార్థులు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టాప్పైనే ప్రయాణం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అలాగే పి.చాకరాపల్లి బస్సులో బూర్జ, పెదంకలాం, కృష్ణరాయపురం, చెల్లంనాయుడువలస, లక్షీపురం గ్రామాల విద్యార్థులు బస్సు టాప్పైనే రోజూ ప్రయాణం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇలా ఉదయం, సాయంత్రం ప్రయాణిస్తుండటంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం స్టూడెంట్స్ బస్సును ఉదయం-సాయంత్రం పూట బస్సు తిరుగాడేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాలేజీకి వెళ్లాలంటేనే భయమేస్తోంది నేను తామరఖండి నుంచి సీతానగరం ప్రభుత్వ జూనియర్ కాలేజీకి 9గంటలకు వెళ్లాలి. తామరకండిలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి రోడ్డుకు వస్తున్నాను. బస్సులు ఆపక పోవడంతో చివరిక్షణంలో సైకిలుపై వెళ్ళాల్సి వస్తోంది. తక్షణమే అదనంగా బస్సు వేయ్యాలి. సురాపాటి లావణ్య, విద్యార్థిని పెదంకలాంలో బస్సులు ఆపట్లేదు రోజూ వందలాదిమంది ప్రయాణించే అజ్జాడ రూటులో బస్సులు చాలక టాప్పైనే కాలేజీకి వస్తున్నాను. అదనంగా బస్సువెయ్యాలని కోరినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఒక్కోసారి పెదంకలాంలో ఆ బస్సుకూడా ఆపట్లేదు. - అలజంగి సాయి, ఇంటర్విద్యార్థి, పెదంకలాం. -
ప్రాణం కోసం చెయ్యి..
కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు మనిషిని మృత్యువు అంచులవరకూ తీసుకెళ్తాయి. ఈ స్థితిలో బతికేందుకు ప్రయత్నించిన వారిలో కొందరే చావును జయిస్తారు. అలాంటివారి గాథలు ఎప్పుడూ ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలా పట్టువదలకుండా ప్రయత్నించి, మృత్యువును జయించిన కొందరి కథల గురించి తెలుసుకుందాం.. ఆహారం లేకుండా 42 రోజులు.. ఏ మనిషైనా ఆహారం లేకుండా మూడు, నాలుగు వారాలకు మించి జీవించలేడు. అదికూడా వారి శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కానీ కెనడాకు చెందిన హెలెన్ కెల్బెన్ మాత్రం ఆహారం లేకుండా 42 రోజులు జీవించింది. అమెరికాకు చెందిన కెలెన్ ఫెయిర్ బ్యాంక్స్ నగరం నుంచి సీటిల్కు వెళ్లాలనుకుంది. అప్పుడు ఆమె వయసు 21 సంవత్సరాలు. 1963 ఫిబ్రవరి 4న రాల్ఫ్ ఫ్లోర్స్తో కలిపి, ప్రత్యేక విమానంలో సీటిల్కు బయలుదేరింది. అయితే మంచు తుపాను కారణంగా మధ్యలోనే కెనడా సమీపంలోని ఓ మంచు పర్వతం వద్ద వారి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వారికి కొన్ని చోట్ల ఎముకలు విరగడంతోపాటు, చిన్నచిన్న గాయాలు కూడా అయ్యాయి. వారి వద్ద అత్యవసర స్థితిలో రక్షణకు ఉపయోగపడే పూర్తిస్థాయి సామగ్రి కూడా లేదు. కానీ అగ్గిపెట్టెతోపాటు, వారం రోజులకు సరిపడా ఆహారం మాత్రం ఉంది. విమానం కూలిపోయిన ప్రాంతంలో మంచు ఉండడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం చాలా తక్కువగా (-41 డిగ్రీలు) ఉన్నాయి. ఈ స్థితిలో వారు ప్రాణాలు నిలుపుకొనేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. విమానం క్యాబిన్లోంచి ఓ బ్లాంకెట్ను తయారు చేసుకుని, ఇంధనంతో మంట వెలిగించుకున్నారు. వారం తర్వాత ఆహారం అయిపోయింది. మంచుకరగసాగింది. ఈ సమయంలో వారికి నీళ్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా మంచును కరిగించడం వల్ల లభించినవే. అలా నీటితోనే ఒకటి, రెండూ కాదు.. ఏకంగా 42 రోజులపాటు జీవించారు. చివరకు ఓ విమానం వారి జాడను కనిపెట్టడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. సాధారణంగా ఆహారం లేకుండా అన్ని రోజులు జీవించడం కష్టమే. కానీ వారిరువురూ చాలా లావుగా ఉండడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వే వారిని రక్షించిందని వైద్యుల విశ్వాసం. ప్రాణం కోసం చెయ్యి.. అమెరికాకు చెందిన ఆరన్ రాల్స్టన్కు పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. ఎప్పటిలాగే ఏప్రిల్ 2003లో ఉతాహ్ ప్రాంతంలోని బ్లూజాన్ పర్వతారోహణకు వెళ్లాడు. పర్వతం పైకి ఎక్కుతున్న సమయంలో 360 కిలోల బరువున్న ఓ రాయి అతడి కుడి చేయిపై పడింది. దీంతో అతడి చేయి రాయి కింద ఇరుక్కుపోయి, నలిగిపోయింది. ఆ రాయిని పక్కకు జరిపేందుకు అతడు ఎంతగానో ప్రయత్నించాడు. అయినప్పటికీ అది సాధ్యపడలేదు. ఒంటరిగా చిక్కుకుపోయిన అతడిని రక్షిచేవారెవరూ అక్కడలేరు. అలా ఆరు రోజులపాటు చేయి రాయికింద ఇరుక్కుపోయి అలాగే ఉంది. ఆ చేయి అలాగే రాయికింద ఉంటే, ఇంక కొద్ది రోజులకు అతడి ప్రాణాలు పోవడం ఖాయం. పైగా ఆ చేయినరాలు పూర్తిగా నలిగిపోయి, చేతికి స్పర్శ కూడా లేకుండా పోయింది. చివరకు ఈ సమస్య నుంచి బయపడేందుకు అతడు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రాతికింద ఇరుక్కున్న భాగాన్ని కోసేసుకోవాలనుకున్నాడు. వెంటనే తన దగ్గరున్న ఓ చిన్న కత్తి సాయంతో అక్కడివరకు చేయిని కోసేసి, ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి కథతో ‘127 అవర్స్’ అనే మూవీ కూడా రూపొందింది. సముద్రంలోనే 133 రోజులు.. 1942 నవంబర్లో బెన్లోమాండ్ అనే ఓ బ్రిటన్ నౌక దక్షిణాఫ్రికా నుంచి డచ్ ప్రాంతమైన గియానాకు బయలు దేరింది. అట్లాంటిక్ సముద్రం మీదుగా దక్షిణ అమెరికా తీరానికి దాదాపు 1,207 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఓ జర్మన్ బోటు ఢీకొనడంతో రెండు పడవలూ మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఒకేఒక వ్యక్తి పూన్ లిమ్. చైనాకు చెందిన ఈ నావికుడు ప్రమాద సమయంలో నౌకలోని ఒక చిన్న తెప్పపైకి చేరుకున్నాడు. ఇదే ప్రమాద సమయయంలో అతడు ఓ చిన్న ట్యాంకు నిండా మంచినీరు, ఆహారాన్ని కూడా సంపాదించుకోగలిగాడు. ఉన్న ఆహారం సరిపోదు కాబట్టి, చేపలు పడుతూ మరికొంత ఆహారాన్ని సంపాదించేవాడు. అలా అతడి ప్రయాణం సముద్రంలో ఒంటరిగానే సాగింది. అలా దాదాపు 133 రోజులు అంటే నాలుగు నెలలకు పైగా ఆ చిన్న తెప్పపైనే ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో పూన్ చాలా అనారోగ్యానికి గురై, దాదాపు 14 కిలోల బరువు కోల్పోయాడు. చివరకు బ్రెజిల్కు చెందిన నావికులు అతడిని గుర్తించి, రక్షించారు. ఒక వ్యక్తి సముద్రంలో అత్యధిక రోజులు ఒంటరిగా ప్రయాణించి, ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ఇతడే. -
ఊబకాయం మరణాలు తగ్గుముఖం
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో స్థూలకాయం ఒకటి. పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లోనూ ఈ సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. అయితే స్థూలకాయుల సంఖ్య పెరుగుతున్నా దీని కారణంగా సంభవిస్తున్న మరణాలు గతంతో పోలిస్తే 30 శాతం తగ్గాయని కొపెన్హాగన్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. డెన్మార్క్లో స్థూలకాయం బారిన పడిన లక్షమందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం రుజువైంది. ‘1976-78 ప్రాంతంలో సాధారణ బరువున్న వ్యక్తులతో పోలిస్తే స్థూలకాయంబారిన పడినవారి మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 2003-13 ల్లో ఈ మరణాలు 30% తగ్గాయ’ని అధ్యయన బృందం సభ్యుడైన షోయబ్ అఫ్జల్ తెలిపారు. స్థూలకాయం ప్రాణాంతకం కాదని చెప్పడం తమ ఉద్దేశం కాదని, అయితే దీనిబారిన పడినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడం కోసమే అధ్యయన ఫలితాలను వివరిస్తున్నామన్నారు. -
లిక్విడ్ డిటర్జెంట్లతో పిల్లలకు ప్రమాదం!
అమెరికాః లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ లతో పిల్లలకు ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. లిక్విడ్ డిటర్జెంట్ల లో భారీగా రసాయనాలను వినియోగిస్తారని అందుకే ఆ లిక్విడ్స్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు చూపించడమే కాక మరణానికి కూడ దారితీస్తాయని చెప్తున్నారు. డిటర్జెంట్ లిక్విడ్స్ వినియోగం పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులను వ్యాపింపజేయడంతోపాటు.. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆన్ లైన్ జనరల్ పిడియాట్రిక్స్ లో ప్రచురించిన తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. లిక్విడ్ డిటర్జెంట్లు పిల్లలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని అమెరికాలో నిర్వహించిన సర్వేలు చెప్తున్నాయి. జనవరి 2013 నుంచి డిసెంబర్ 2014 వరకు అమెరికాలోని పాయిజన్ కంట్రోల్ సెంటర్లు అందుకున్న సుమారు 62,254 ఫోన్ కాల్స్ ద్వారా ఎక్కువ శాతం లాండ్రీ, డిష్ వాష్ డిటర్జెంట్ ప్యాకెట్లతో ఆరేళ్ళలోపు పిల్లలకు తీవ్ర ఆనారోగ్యాలు చేకూరుతున్నట్లు తెలుసుకున్నారు. రెండేళ్ళ అధ్యయన కాలంలో ఈ సమస్య 17 శాతం పెరిగినట్లుగా కూడ చెప్తున్నారు. పాయిజన్ కంట్రోల్ సెంటర్లకు డిటర్జెంట్ లిక్విడ్లతో పిల్లలకు కలుగుతున్న నష్టాలపై రోజుకు 30 కన్నా ఎక్కువ కాల్స్ వచ్చేవని, లిక్విడ్ డిటర్జెంట్ లకు ఎక్స్పోజ్ అయిన పిల్లల్లో కనీసం రోజుకు ఒక్కరైనా ఆస్పత్రిలో చేరే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అంతేకాదు డిటర్జెంట్ల వల్ల ఏకంగా ఇద్దరు పిల్లల మరణాలు కూడ నమోదైనట్లు అధ్యయనకారులు కనుగొన్నారు. అయితే లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్లలో ప్రమాదకర రసాయనాలు ఉంటాయని, అవి పిల్లలకు హాని కలిగిస్తాయన్న విషయాన్ని చాలా కుటుంబాలు గుర్తించలేకపోయాయని, నేషన్వైడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ స్టడీ సహ రచయిత, టాక్సాలజీ ఛీఫ్ మార్సెల్ కాస్వెంట్ సూచించారు. ఆరేళ్ళ లోపు వయసున్న పిల్లలు ఇంట్లో ఉంటే వారు లాండ్రీ డిటర్జెంట్లకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఆయా కుటుంబాలు శ్రద్ధ వహించాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు. అంతేకాక తక్కువ టాక్సిక్ వినియోగించే సంప్రదాయ డిటర్జెంట్లను వినియోగించాలని సలహా ఇస్తున్నారు. అయితే డిటర్జెంట్లను మాత్రం పిల్లలకు సాధ్యమైనంత దూరంగానే ఉంచాలని హెచ్చరిస్తున్నారు. -
హెచ్చరిక బోర్డులు లేక నిత్యం ప్రమాదాలు
జాతీయ రహదారిపై భద్రత కరువు పటాన్చెరు: జాతీయ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది. ప్రధానంగా కూడళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన కూడళ్లు ప్రమాదాలకు నిలయంగా తయారవుతున్నాయి. లింగంపల్లి చౌరస్తా నుంచి సంగారెడ్డి వరకు పదేళ్ల క్రితం జాతీయ రహదారిని విస్తరించారు. రోడ్డు వెడల్పు చేసినా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. పలు చోట్ల రోడ్లు గుంతలుగా ఉండటం, మరికొన్ని చోట్ల రోడ్డు మధ్యలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా డివైడర్లు, వర్షపు నీరు పోయే కాలువలు ఉండటంతో రాత్రి వేళలో అవి కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇస్నాపూర్ చౌరస్తాలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ దగ్గరికి వెళ్లే వరకు కనిపించదు. అదేవిధంగా ఇక్రిశాట్ సమీపంలోని ఐలా కార్యాలయం సమీపంలో రోడ్డు మధ్యలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా వర్షపు నీరు పోయే కాలువ ఉండటంతో వాహనదారులు దానిపై వెళ్తూ తీవ్ర గాయాలబారిన పడుతున్నారు. ఇది ప్రమాదకరంగా ఉందని అనేక మార్లు అధికారులకు స్థానికులు మొరపెట్టుకున్నా వారు పట్టించుకున్న పాపానపోవడం లేదు. దీంతో నిత్యం భారీ వాహనాలు డివైడర్లపైకి దూసుకుపోతూ ప్రాణాలతో చలగాటం ఆడుతున్నాయి. పలు చౌరస్తాల్లో హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనాలు వేగంగా వెళ్తున్న సమయంలో కొంత మంది యూ టర్న్ తీసుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రి వేళల్లో కనిపించడం లేదు రాత్రి వేళల్లో వాహనాలు నడిపించేప్పుడు జాతీయ రహదారిపై డివైడర్లు కనిపించడం లేదు. దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటే వాహనదారుల ప్రాణాలను కాపాడిన వారవుతారు. - అబ్బు -
మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్
సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయడానికైనా, బరువు పెరగడానికైనా సిద్ధపడిపోతారు కొంతమంది హీరోలు. అలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనుకునే హీరోల్లో మనోజ్ ఒకరు. దశరథ్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘శౌర్య’ నేడు విడుదలవుతోంది. మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం కోసం మనోజ్ బొద్దుగా తయారయ్యారు. ఇక... మనోజ్ ముచ్చట్లు తెలుసుకుందాం... ♦ ‘శ్రీ’ నుంచి నాకు దశరథ్ గారు తెలుసు. ఆయన కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంది. ఒకరోజు ఫోన్ చేసి, కథ చెబుతానంటే ఇంటికి రమ్మన్నాను. 30 నిముషాల్లో కథ చెప్పారాయన. ఆ కథ నచ్చింది. ఆ తర్వాత గెటప్ ఎలా ఉండాలనే విషయం గురించి చర్చించుకున్నాం. మామూలుగా నా సినిమాలంటే ఫైట్లు, డ్యాన్సులు కామన్గా ఉంటాయనుకుంటారు. అలాగే నేను కొంచెం రఫ్ లుక్లో కనిపిస్తాను. కానీ, తనకలా వద్దనీ, కొంచెం బొద్దుగా, క్యూట్గా ఉండాలనీ దశరథ్ చెప్పారు. దాంతో బాగా తినడం మొదలుపెట్టాను. కానీ, నా మజిల్ పవర్ మాత్రం తగ్గలేదు. అందుకని పప్పు-ఆవకాయ్-నెయ్యి బాగా తినడం మొదలుపెడితే, అప్పుడు బుగ్గలు వచ్చాయి. ప్యాంటు, షర్ట్ టక్ చేసుకుని, పక్క పాపిడి తీసి, నున్నగా దువ్వుకుని, ప్లెయిన్ షర్ట్స్ వేసుకుని లుక్ని సెట్ చేసుకున్నాం. ఈ సినిమా కోసం మొత్తం ఎనిమిది కిలోలు బరువు పెరిగాను. ♦ ఈ చిత్రకథ విషయానికొస్తే.. మొదటి పది నిమిషాల్లో ఇది ఎలాంటి సినిమా? అనేది తెలిసిపోతుంది. అక్కణ్ణుంచి ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు దశరథ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. దశరథ్ తనను తాను ఊహించుకుని క్రియేట్ చేసిన పాత్రలో నేను నటించాను. మొత్తం క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఇది పక్కా దర్శకుడి సినిమా. మొన్ననే మా ఫ్యామిలీ అంతా సినిమా చూశాం. సంగీత దర్శకుడు వేదాకి ఇది తొలి సినిమా అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగదీసేశాడు. ♦ నేనే సినిమా ఒప్పుకున్నా మా ఇంట్లోవాళ్లతో, ఇతరులతో షేర్ చేసుకోను. నాకు కథ, పాత్ర నచ్చితే ఒప్పేసుకుంటాను. ఫైనల్గా అవుట్పుట్ చూపిస్తాను. జయాపజయాల గురించి అస్సలు ఆలోచించను. ఎందుకంటే, మా నాన్నగారు కెరీర్లో శిఖరాగ్రంలో ఉన్నప్పుడూ చూశాను. డౌన్లో ఉన్నప్పుడూ చూశాను. అందుకే మాకు జయాపజయాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. మా నాన్నగారు ఈ సినిమా చూసి, ‘చాలా సటిల్గా చేశావ్’ అని అభినందించారు. ♦ పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పు ఒక్కటే. ఐదు సంవత్సరాల క్రితం నుంచే మాకు పరిచయం ఏర్పడింది. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఐదేళ్లు ఎవరి కంటా పడకుండా తిరిగి, మ్యానేజ్ చేశాం. పెళ్లి తర్వాత అందరి కంటా పడేలా తిరుగుతున్నాం. అదే తేడా (నవ్వుతూ)! ♦ ‘కులం, డ్రగ్స్... ఈ రెండూ చాలా ప్రమాదకరం. దయచేసి ఈ రెండింటినీ దగ్గరకు చేరనివ్వద్దు’ అని ఈ మధ్య యూత్కి చెబుతున్నాను. నా సినిమాను ఫలానా కులం వాళ్లే చూస్తారు... వేరే హీరోల సినిమాలు వాళ్ల కులం వాళ్లు చూస్తారు.. అనే పిచ్చి ఫిలాసఫీని నేను నమ్మను. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. ♦ ఈరోజు మూడు సినిమాలు విడుదలవుతున్నాయ్. నాకు పోటీల్లాంటివి ఉండవు. ‘మనం ముగ్గురం పార్టీ చేసుకుందాం’ అని ఆ మిగతా రెండు సినిమాల వాళ్లతో నేను అన్నాను. ఇండస్ట్రీ ప్రస్తుతానికి చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా ప్రేక్షకులను నేను కోరుకునేది ఒక్కటే. అందరూ కలిసి నా సినిమాను థియేటర్లో చూడండి. పైరసీ చేయొద్దు. -
ఒలంపిక్ ఫీట్లు చేయించిన ’అతివేగం’
-
ప్రమాదకరంగా బెల్లంపల్లి రైల్ఓవర్ బ్రిడ్జి
-
విద్య ప్రైవేటీకరణతో పెనుప్రమాదం
సందర్భం అనేక దేశాలలో ఆహారం, నీరు వంటి ప్రకృతి సహజమైన అంశాలు కూడా ప్రైవేటుపరమౌతున్నాయి. మన దేశంలోనూ, నేటివరకూ దేశ ప్రజలకు చాలా మేరకు ఒక హక్కుగా ఉన్న ఉన్నత విద్యారంగం తలుపులను కూడా నేడు ప్రపంచ, దేశీయ ప్రైవేటు పెట్టుబడుల లాభార్జనకు తెరిచేస్తున్నారు. మన దేశంలోని విద్యారంగం గత రెండు దశాబ్దాలుగా మరింతగా పేదలకు దూరం అయిపోయింది. ప్రైవేటు విద్య ప్రాధాన్యత శృతిమించి పెరిగిపోయి, విద్య నేడు సామాన్య జనానికి అందని ద్రాక్షే అయిపోయింది. ఈ నేప థ్యంలోనే నేడు తెలుగు రాష్ట్రా లలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన యత్నాలను మనం చూడాలి. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 2004 నాటికల్లా పలు విశ్వవిద్యాలయాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరిట, ఉన్నత విద్యారంగంలో డబ్బు పాత్ర పెరిగిపోయింది. అయితే, అనంతరం ముందుకు వచ్చిన ‘ఫీజ్ రీయింబర్స్మెంట్’ పథకం వలన విద్యా రంగం పేదలూ, సామాన్యులకు అందుబాటులోకి తిరిగి వచ్చింది. తద్వారా, తెలుగు రాష్ట్రాలలోని ఆర్థిక స్థోమత లేని లక్షలాది మందికి విద్యార్జన అవకాశాలు ఏర్పడ్డాయి. కానీ నేడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆలోచనలతో ప్రభుత్వాలు ముందుకు వస్తోన్న తీరు ముందుముందు ప్రమాదక రంగా పరిణమించగలదు. ప్రపంచంలో మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న అన్నీ దేశాలలోనూ ఆర్థిక అసమానతలు సుదీర్ఘకాలంగా ఉన్నవే. కానీ, ఆ వ్యవస్థల పునాదులను కుదిపివేయకుండా కాపాడింది ఆయా దేశాలలోని విద్యా రంగాలే. అమెరికా, యూరప్ దేశాలు, జపాన్, చైనా, దక్షిణ కొరియాల వంటి అన్నీ మార్కెట్ ఆధారిత దేశాల లోనూ తొలి నుంచీ విద్యారంగంలో ప్రభుత్వానికి పెద్ద పాత్ర ఉంది. నేడు, దీనిని ‘సబ్సిడీల వ్యవస్థ’ అని కొం దరు విమర్శించవచ్చు. కానీ, ఈ ‘సబ్సిడీల’ వ్యవస్థే, నిజానికి మన దేశంలో కూడా పలు దశాబ్దాలుగా దేశంలోని మెజారిటీ అట్టడుగు వర్గాలకూ, మధ్యతర గతికీ ఆసరా అయ్యింది. తద్వారా అన్నీ దేశాలలోనూ సామాజిక చలన శీలతకు రక్షణ ఏర్పడింది. అంటే, మెజారిటీ కింది వర్గాల ప్రజలకు వారి పేదరికం, కష్టాలు, అణచివేతలు శాశ్వత స్థితిగా గాక, విద్య ద్వారానూ, ప్రజాస్వామిక అవకాశాల ద్వారానూ అధిగ మించ వీలయ్యేవిగా ఉన్నాయి. దీనివలన మాత్రమే, ఈ దేశాలు అన్నింటిలోనూ తీవ్ర సామాజిక విస్ఫోటనా లను చాలా మేరకు నివారించగలిగారు. గత కొద్ది దశాబ్దాలుగా పలు ధనిక దేశాలతో సహా, మనవంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలలో కూడా, వివిధ రంగాలలో భారీగా ప్రైవేటీకరణ జరిగిన నేపథ్యం లోనే, 2008లో ప్రపంచ ఫైనాన్స్, ఆర్థిక సంక్షోభాలు మొదలయ్యాయి. ఈ సంక్షోభం నేడు మరింత లోతుగా వ్యవస్థల మూలాలను తొలిచేస్తోంది. ప్రపంచంలోని ధనిక దేశాలతో సహా అన్నిచోట్లా ప్రజలలో, ముఖ్యంగా యువజనులలో ఇది తీవ్ర అసంతృప్తికీ, వ్యవస్థపట్ల వ్యతిరేకతకూ ఇది దారితీస్తోంది. ఈ క్రమంలోనే బ్రిటన్, అమెరికా వంటి దేశాలే కాకుండా దరిదాపు అన్నీ ధనిక దేశాలలోనూ కూడా జనసామాన్యం వామ పక్ష భావాలు ఉన్న నేతలూ, పార్టీల దిశగా మళ్లక తప్పని స్థితి నేడు ఉంది. ఈ పరిణామాలు అన్నింటి వెనుకనా ఉన్నది గత 3-4 దశాబ్దాలుగా పెట్టుబడి దారీ దేశాలు అన్నింటి లోనూ అమలు జరిగిన ప్రైవేటీకరణ, నయా ఉదార వాద విధానాలే. ఈ విధానాలవలన విద్యారంగం వం టివి కూడా ప్రైవేటు పరం అయిపోయి, ఆయా దేశా లలో డబ్బులు చెల్లించి ఉన్నత విద్యను పొందలేనివారు ఇక్కట్ల పాలు అవుతున్నారు. అమెరికా వంటి దేశాలలో నేడు చదువుకునేందుకు తీసుకున్న విద్యారుణాలను కూడా చెల్లించలేని దుస్థితిలో యువతరం పడిపోతోంది. ఈ నేపథ్యంలోనే, నేడు ఈ దేశాలలోని ప్రజలూ, పాలక వర్గాలలో వివిధ విధానాల పట్ల పునరాలోచన జరుగు తోంది. గతంలో ప్రైవేటీకరణ పాలై, నేడు తిరిగి ప్రభు త్వపరం అయ్యే దిశగా సాగుతోన్న బ్రిటన్లోని రైల్వే రంగం తీరులోనే, పలు దేశాలలో ప్రాథమిక రంగాలను తిరిగి ప్రభుత్వపరం చేయాలనే డిమాండ్ వినపడుతోం ది. నిజానికి హార్వర్డ్, కేంబ్రిడ్జి వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు కొన్నివందల ఏళ్లుగా ఆయా దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. కాగా, మన పాలకుల విధానాలు దీనికి విరుద్ధ దిశలో సాగుతున్నాయి. వివిధ ప్రపంచదేశాలలోని ‘‘పెట్టుబడి’’కి, వివిధ రంగాలలోకి అది విస్తరించిన అనంతరం, నేడు తన లాభాలను ఇనుమడింప చేసు కునేందుకూ, కాపాడుకొనేందుకు మరిన్ని జీవన రంగా లను కబళించాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఈ క్రమం లోనే అనేక దేశాలలో ఆహారం, నీరు వంటి ప్రకృతి సహజమైన అంశాలు కూడా ప్రైవేటు పెట్టుబడిదారుల పరమౌతున్నాయి. దీనిలో భాగంగానే మనదేశంలో కూడా, నిన్నా మొన్నటివరకూ దేశ ప్రజలకు చాలా మేరకు ఒక హక్కుగా ఉన్న ఉన్నత విద్యారంగం తలుపు లను కూడా నేడు ప్రపంచ, దేశీయ ప్రైవేటు పెట్టు బడు ల లాభార్జనకు తెరిచేస్తున్నారు. రానున్న కాలంలో, రెం డు తెలుగు రాష్ట్రాలలో కూడా యువజనులూ, విద్యా ర్థులూ, జనసామాన్యం, రైతాంగ వర్గాలలో మరింతగా పెరిగిపోనున్న సామాజిక అశాంతి, అలజడులకు ఇది ఆరంభం అవుతుంది...! ప్రయాణం ఇదే దిశగా సాగితే అంతిమంగా అది చేరేది అశాంతి, అలజడుల తీరాన్ని మాత్రమే...! - డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక విశ్లేషకులు మొబైల్: 9866179615 -
తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం.
-
తిరుమలలో ప్రమాదకరంగా మారిన ఘాట్ రోడ్లు
-
హెల్ ఫోన్
* హస్తభూషణంగా మారిన సెల్ఫోన్ * సైబర్ నేరాలకు ఇదే ప్రధాన ఆధారం * వంచకులకూ కలిసి వస్తున్న వైనం * పరిజ్ఞానంతో పాటే పెరుగుతున్న ముప్పు బంగారు భవిష్యత్తు పేరుతో దాదాపు ఐదు వేల మందిని సంప్రదించి... మాటలు నమ్మిన 300 మంది యువతులను వంచించిన మాయగాడు మధు పోలీసులకు చిక్కాడు. నాచారంలో పిజ్జా డెలివరీ బాయ్గా పని చేస్తున్న లక్ష్మణ్... ఉద్యోగం నేపథ్యంలో తెలిసిన యువతుల ఫోన్ నెంబర్లకు అసభ్యకర సందేశాలు పంపించి అరెస్టయ్యాడు. మాట్రిమోనియల్ సైట్స్లో రిజిస్టర్ చేసుకున్న 700 మంది మహిళలు... యువతులకు ఎర వేసి... 30 మందిని ముంచిన శశి కుమార్ కటకటాల్లోకి చేరాడు. పేట్ బషీరాబాద్ పరిధిలో నివసించిన కనకవ్వకు భర్త నర్సింహతో స్పర్థలు ఉండేవి. ఓ వ్యక్తి నుంచి ఆమె సెల్కు వచ్చిన మిస్డ్ కాల్ను అపార్థం చేసుకున్న భర్త విచక్షణా రహితంగా కొట్టడంతో కనకవ్వ మరణించింది. ...ఈ నేరాలన్నింటికీ మూలం సెల్ఫోన్... దాని నెంబర్. ప్రస్తుతం ఫోను లేనిదే రోజు గడవని పరిస్థితులు తలెత్తాయి. మొబైల్స్లో పెరుగుతున్న టెక్నాలజీతో పాటు దాని సంబంధిత నేరాలూ పెరుగుతున్నాయి. సెల్ఫోన్ నెంబర్లకు గోప్యత లేకపోవడం... పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడడం... నానాటికీ తెలివి మీరుతున్న నేరగాళ్లు/కీచకులు ఫోన్ ఆధారిత నేరాలు పెరగడానికి కారణమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. నెంబర్ల సేకరణకు మార్గాలెన్నో... అనేక నేరాలకు సెల్ఫోన్ నెంబర్ సేకరించడమే నాందిగా మారింది. ఇలా ఫోన్ నెంబర్లు తీసుకోవడానికి నేరగాళ్లకు అనేక మార్గాలు ఉంటున్నాయి. వ్యాపార సముదాయాల్లో కూపన్లు నింపడం... ఆన్లైన్లో షాపింగ్స్ చేయడం... సోషల్ మీడియాలో రిజిస్ట్రేషన్లు... ఇలాంటి మార్గాల్లో సెల్ఫోన్ నెంబర్లు/ఈ-మెయిల్స్ డేటాబేస్ ఇంటర్నెట్లో అమ్మకానికి ఉంటున్నాయి. ఆన్లైన్లో కేవలం రూ.వెయ్యి చెల్లిస్తే చాలు 30 వేల మంది వివరాలు అందించే సైట్లు కోకొల్లలు. 'డీఎన్డీ'(డునాట్ డిస్ట్రబ్) సదుపాయం లేని ఫోనుకు వచ్చే వాణిజ్య ప్రకటనల ఫోన్లు... ఎస్సెమ్మెస్లకూ ఇలాంటి డేటాబేస్లే కారణం. ఈ రకంగా ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న నేరగాళ్లు మోసాలకు తెర తీస్తున్నారు. అత్యధిక శాతం 'ఫోన్'తోనే ప్రారంభం దేశ వ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో అత్యధికం బాధితుల ఫోన్లను టార్గెట్గా చేసుకుని ప్రారంభమవుతున్నవే. సంక్షిప్త సందేశం పంపడం... కాల్ చేయడంతోనే నేరగాళ్లు వీటికి శ్రీకారం చుడుతున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 60 శాతం సైబర్ నేరాలకు ఫోనే మూలమని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ-మెయిల్ ద్వారా ఎరవేసే 'ఫిష్షింగ్'స్థానంలో ఇప్పుడు సెల్ఫోన్లను టార్గెట్గా చేసుకుని ప్రారంభించే ‘విష్షింగ్’ పెరుగుతోందని స్పష్టం చేస్తున్నారు. వేధింపులు, వంచనలు, లాటరీ ఫ్రాడ్స్... ఇలా ఒకటేమిటి... 'విష్షింగ్'తో సాధ్యం కానిదంటూ లేదన్నట్లు పరిస్థితుల్లో మార్పు వచ్చిందని నిపుణులు వివరిస్తున్నారు. 'ఎండ్'పెరిగే కొద్దీ ముప్పే... ఒకప్పుడు బేసిక్ సెల్ఫోన్లు ఉండేవి. వీటిలో సౌకర్యాలు తక్కువైనా భద్రత ఎక్కువ. రానురాను ఆండ్రాయిడ్, విండోస్ ఇలా వివిధ రకాలైన హైఎండ్ టెక్నాలజీ సెల్ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇలా ‘ఎండ్’ పెరిగే కొద్దీ అందులో సదుపాయాలతో పాటు హ్యాకింగ్ ముప్పూ ఎక్కువైందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో వినియోగంలో ఉన్న ఫోన్లలో 64 శాతం ఆండ్రాయిడ్తో కూడినవని ఓ సర్వే నిర్థారించింది. వీటికి ఎస్సెమ్మెస్, వాట్సాప్ మెసేజ్, కొత్త అప్లికేషన్లలో ఏదో ఒక రూపంలో సైబర్ నేరగాళ్లు 'ర్యాట్స్'(రియోట్ యాక్సిస్ ట్రోజన్స్) పంపిస్తున్నారు. వీటిని ఓపెన్ చేస్తే చాలు మన ఫోన్ వారి ఆధీనంలోకి వె ళ్లిపోతుంది. కాంటాక్ట్స్ నుంచి కెమెరా వరకు అన్నీ సైబర్ నేరగాళ్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఈ-మెయిల్ హ్యాకింగ్ కంటే మొబైల్ హ్యాకింగ్ చాలా తేలికని ఆ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రక్షణ రంగంలో పని చేస్తున్న వారికి హైఎండ్ ఫోన్ల వినియోగం తగ్గించాలంటూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 'ప్రీ-పెయిడ్'నెంబర్లు శాశ్వతం కాదు... వినియోగంలో ఉన్న సెల్ఫోన్ నెంబర్లలో అత్యధికంగా ప్రీ-పెయిడ్ కేటగిరీకి చెందినవే. వీటి 'మార్పిడి'విషయం తెలియక కొందరు చిక్కుల్లో పడుతున్నారు. ఓ వ్యక్తి ప్రీ-పెయిడ్ కనెక్షన్ తీసుకున్న తరవాత నిర్ణీత కాలం దాన్ని వినియోగించకపోతే... సర్వీస్ ప్రొవైడర్ ఆ కనెక్షన్ను రద్దు చేస్తారు. ఆపై అదే నెంబర్ను మరొకరికి కేటాయించేస్తారు. ఈ విషయం తెలియక అనేక మంది తన స్నేహితుడే అని భావించి ప్రీ-పెయిడ్ నెంబర్లకు అభ్యంతరకర, అశ్లీల సందేశాలు పంపిస్తుంటారు. ఆ ప్రీ-పెయిడ్ నెంబర్ యువతులు, మహిళలకు కేటాయించి ఉంటే... పంపిన వ్యక్తి చిక్కుల్లో పడ్డట్టే. ఇటీవల ఇదే తరహా కేసు సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చింది. విషయం తెలియడంతో పోలీసులు వాటిని పంపిన వ్యక్తికి కౌన్సెలింగ్ చేసి వదిలిపెట్టారు. వాట్సాప్, ఫేస్బుక్లతో... సెల్ఫోన్లలో వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఎంత ఉపయోగం ఉందో... అదే స్థాయిలో చేటు జరుగుతోంది. టీనేజర్లకూ తల్లిదండ్రులు హైఎండ్ ఫోన్లు అందిస్తుండటంతో వాటి ద్వారా ఈ అప్లికేషన్లను యాక్సెస్ చేస్తూ పెడదారి పడుతున్నారు. ఒకప్పుడు ఇంట్లోనో, నెట్ కేఫ్కో వె ళ్లి కంప్యూటర్ ద్వారా చేయాల్సినవన్నీ చేతిలో ఉన్న ఫోన్తో చేసే సౌలభ్యం ఏర్పడింది. ఇదే అపరిపక్వ ప్రేమాయణాలు... అశ్లీలానికి బానిసలు కావడం, సైబర్ వేధింపులకు మూలంగా మారుతోంది. అనేక మంది యువతీ యువకులు ఇంట్లో ఉన్నా గేమ్స్ పేరు చెబుతూ అర్థరాత్రి వరకు చాటింగ్స్ చేస్తున్నారని... ఇవే కొన్నిసార్లు విపరీత ధోరణులకు కారణంగా మారుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు. పూర్తి స్థాయిలో 'ట్రూ' కాదు... ఫోన్ కాంటాక్ట్స్లో లేని... కొత్తగా వచ్చే ఫోన్లు ఎవరు చేస్తున్నారో గుర్తించడానికి ఇటీవల అనేక మంది 'ట్రూ కాలర్'యాప్ను ఆశ్రయిస్తున్నారు. ఫోన్ వచ్చినప్పుడు వాటిని వినియోగిస్తున్న వారి పేర్లు డిస్ప్లే చేయడం దీని ప్రత్యకత. ఈ యాప్లో వచ్చే వివరాలు సైతం పూర్తి స్థాయిలో నమ్మదగ్గవి కాదని సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు వివరిస్తున్నారు. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో సదరు వ్యక్తి ఏ పేరు నమోదు చేస్తే... అతడు కాల్ చేసిన వారికి అదే పేరు డిస్ప్లే అవుతుంది. ఈ చిట్కానూ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని మరువకూడదని సూచిస్తున్నారు. -
ఔషధ రంగంలో ఆన్లైన్ విక్రయాలు ప్రమాదకరం
ఇ-ఫార్మసీ విధానం ద్వారా ఆన్లైన్లో ఔషధాల విక్రయానికి అనుమతి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఈ నెల 14న ఆలిం డియా స్థాయిలో ఔషధ దుకాణాల బంద్ పాటించి, ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని ఆలిం డియా కెమిస్ట్ డ్రగ్గిస్టుల సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయంలో ఔషధ దుకాణదారుల ప్రయోజనాలతో పాటు, ప్రజాప్రయోజనాలు కూడా ఇమిడి ఉండ డంతో ఈ అంశం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. బహుళజాతి కంపెనీలు పట్టణ పొలిమేరలు దాటి, మారుమూల పల్లెల్లోని సామాన్యుల వంటగదిలోకి కూడా ప్రవేశించి, గ్రామీణ జీవనాన్ని కలుషితం చేస్తున్న విషయం ఎవరికీ తెలియనిదికాదు. ఇప్పుడు ఈ కంపెనీల దృష్టి ఔషధ రంగంపై కూడా పడింది. దానికనుగుణంగా బహుళజాతి కంపెనీల ప్రయోజ నాలు కాపాడడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న కంపెనీలు ఔషధ రంగంలోకి కూడా ప్రవేశిస్తే ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆన్లైన్ విధానం అమల్లో ఉన్న దేశాల్లో ఔషధ వినియోగం దుర్వినియోగం అవుతోందన్న వార్తలు ఒకవైపు కలవరపెడుతుంటే, భారతదేశంలో ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలనుకోవ డం ఎవరి ప్రయోజనాలు కాపాడడానికో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిషాకు, మత్త్తుకు అలవాటు పడిన కొందరు ఇప్పటికే ఆన్లైన్ విధానం ద్వారా ఔషధాలు తెప్పిం చుకొని ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కోల్పోతున్నారు. ఐపిల్, ఎంటీపీ కిట్స్, డైజిపామ్, కొడిన్ లాంటి మందులు క్వాలిఫైడ్ డాక్టరు సిఫారసు మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. కాని ఆన్లైన్ విధా నంలో ఎవరి ఇష్టానుసారం వారు వాడితే ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవైపు ప్రభు త్వం క్వాలిఫైడ్ డాక్టర్ సిఫారసు లేకుండా మందులు అమ్మవద్దని కెమిస్టులపై ఒత్తిడి చేస్తూ, మరోవైపు దొడ్డిదారిన ఆన్లైన్ విధానాన్ని చట్టబద్ధం చేయాల నుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. మనదేశంలో ఎనిమిది లక్షల ఔషధ దుకాణాలు న్నాయి. కోటి ఇరవై లక్షల మంది ప్రజలు ఈ దుకా ణాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇ-ఫార్మసీ విధానానికి పచ్చజెండా ఊపి ఆన్లైన్లో ఔషధాల అమ్మకానికి అనుమతిస్తే,పెద్ద ఎత్తున ప్రజ లకు నష్టం జరగడంతోపాటు, లక్షలాది దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్న కోటి ఇరవై లక్షల మంది ఉపాధి కోల్పోయి వీధినపడే దుస్థితి దాపురిస్తుంది. కనుక ప్రభుత్వం తక్షణమే ఆన్లైన్లో ఔషధాల అమ్మకం ఆలోచనను విరమించుకొని, ఔషధ రంగం లో బహుళజాతి సంస్థల ప్రవేశాన్ని నిరోధించాలి. నాణ్యమైన మందులు చవక ధరకు లభించే పకడ్బం దీ ఏర్పాట్లు చేయకుండా, ఔషధ రంగాన్ని బహుళ జాతి సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే ప్రజా రోగ్యం ప్రమాదంలో పడినట్లే. అందుకని పాలక వర్గాలు విజ్ఞతతో వ్యవహరించాలి. (అక్టోబర్ 14న దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ సందర్భంగా) యండి.ఉస్మాన్ ఖాన్, అక్షర సాహితి అధ్యక్షులు, సీనియర్ కెమిస్ట్: మొబైల్: 99125 80645 -
భయానకమైన రాజకీయ మలుపు
జాతిహితం బీజేపీ ప్రధాన జాతీయ పార్టీగా ఎదగడాన్ని నేను అతి దగ్గరగా పరిశీలించాను. అయినా, ‘‘అంచున ఉండే శక్తులు’’ అనే పదం ఎప్పుడు ఎలా పుట్టుకొచ్చిందో కచ్చితంగా చెప్పలేను. బహుశా 1992 చలికాలంలో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందు అది వాడుకలోకి వచ్చి ఉండొచ్చు. మధ్యేవాద శక్తులు ఆ అంచున ఉండే శక్తులను సవాలు చేయలేక పోతే, అవి రూపాలను మార్చుకుని విస్తరిస్తాయి. ప్రధాన స్రవంతినే అవి మింగేస్తాయి. వీహెచ్పీ, బజరంగ్దళ్లు ఒకప్పుడు అంచున ఉండే శక్తులు, నేడవి బీజేపీ ‘‘సోదర’’ సంస్థలు. సనాతన సంస్థ, సమాధాన సేన, అభినవ్ భారత్ నేటి శివారు సంస్థలు. దాద్రీ ఘటన మన రాజకీయాల్లోని భయానకమైన మలుపును సూచిస్తోంది. బీజేపీ నిర్ద్వంద్వంగా ఖండించలేని లేదా తమకు సంబంధం లేదని ప్రకటించలేని హిందూ దురహంకార మూకల మిలిటెన్సీ పెరగడాన్ని అది సూచిస్తోంది. ఆ హత్యను అది విమర్శిస్తుందేగానీ మరో అరడజను విధాలుగా దాన్ని తక్కువ చేసి చూపుతోంది. అదెలాగో చూడాలంటే మీరు నా మిత్రుడు, బీజేపీ ఎంపీ, ఆర్ఎస్ఎస్ మేధావి తరుణ్ విజయ్ శుక్రవారం ‘‘ఇండియన్ ఎక్స్ప్రెస్’’లో రాసిన వ్యాసాన్ని చూడండి. మహమ్మద్ అఖ్ లాక్ను ‘‘కేవలం అనుమానంతోనే’’ మూకుమ్మడిగా కొట్టి చంపేయడాన్ని హిందుత్వ స్ఫూర్తి, భారతీయత అంగీకరించదు. నా తండ్రి గోమాంసం తినలేదని రుజువైతే అప్పుడు ఆయన్ను ఎవరైనా తిరిగి తెస్తారా? అని ఆయన కుమార్తె అడగడం సరైనదే. అంటే, అతను ఒకవేళ నిజంగానే గోమాంసాన్ని తిని ఉంటే, అలా అని ఆ గుంపు వద్ద స్పష్టమైన ఆధారం ఉంటే, దానికి ప్రతీకారం తీర్చుకోవడం న్యాయమేనని అంతరార్థం. కానీ అసలు ప్రశ్న అతను గోమాంసం తింటే మాత్రం ఏం? అనేదే. ఉత్తరప్రదేశ్లో అది చట్టవిరుద్ధమేమీ కాదు. దాన్ని నిషేధించిన చోట అలాంటి నేరాలతో వ్యవహరించడానికి కఠిన చట్టాలున్నాయి. సమస్యను తగ్గించి చూపే ప్రయత్నాలు విడివిడిగా ఉన్న ఈ చుక్కలన్నిటినీ కలిపి చూద్దాం. మత (హిందూ) విశ్వాసులంతా గోమాంస భక్షణకు ప్రతీకారం తీర్చుకోడానికి సమీకృతం కావాలని పిలుపునివ్వడానికి గుడి లౌడ్ స్పీకర్ను ఉపయోగించుకున్నారు. స్థానిక ఎంపీ, కేంద్ర సాంస్కృతిక మంత్రితోపాటూ ఇతర బీజేపీ నేతలు కూడా ఆ ఘటనను ఖండించడంలో తరుణ్ విజయ్ చూపినంతగానూ తగ్గించి చూపే ప్రయత్నం చేశారు. మంగళూరులో ప్రేమ జంటలను చావ బాదడంపైనా, మహారాష్ట్ర, కర్ణాటకలలో హేతువాదులను హత్య గావించడంపైనా, ‘‘రామ్జాదే-హరామ్జాదే’’ (అక్రమ సంతానాన్ని గాక రాముని పుత్రులనే ఎన్నుకోవాలనే నినాదం), ‘‘ముస్లిం అయినా గానీ’’, ‘‘పాకిస్తాన్కు పొండి’’ వంటి వ్యాఖ్యలపైనా బీజేపీ ప్రతిస్పందనలు బాగా ఆలోచించి, విస్పష్టంగా ప్రకటించినవే. హిందు రాడికల్ శక్తుల ప్రమేయమున్న ఉగ్రవాద కేసులు నత్తనడక సాగడాన్ని వీటికి జోడించి మరీ చూడండి. అభినవ్ భారత్ నిజంగానే ఓ చిన్న అంచులోని బృందమే అయినట్టయితే, మరి అదేదో బాధిత సంస్థ అయినట్టు దాన్ని ఎందుకు కాపాడుతున్నట్టు? దాద్రీ ఘటన మన రాజకీయాల్లో మలుపు అన్నాను. దేశ విభజన అల్లర్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక గుడి లౌడ్ స్పీకర్ను జనాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగించినందువల్ల మాత్రమే నేను అలా అనలేదు. అదీ ఒక ప్రాముఖ్యతగల విషయమే. అయినా దేవాలయాలు తమ మత విశ్వాసులను పిలవడం హిందూ సంప్రదాయమే. కానీ లౌకికశక్తులుగా తమకు తాము గొప్పలు చెప్పుకునే వారంతా ఈ ఘటనపై సాపేక్షికంగా మౌనంగా స్పందించడం అంతకంటే ముఖ్యమైన అంశం. దాద్రీ ఢిల్లీకి కేవలం 40 నిమిషాల దూరంలోనే ఉంది. అయినా కాంగ్రెస్ అగ్ర నేతలెవరూ ఆ గ్రామానికి ఓ పాదయాత్రనో లేదా నిజనిర్ధారణ కార్యక్రమాన్నో సైతం చేపట్ట లేదు. లాలూ, నితీశ్, మమత అంతా లౌకికవాదుల ఓట్లను కోరుకునేవారే. అయినా ఆవుతో ముడిపడి ఉన్న విషయంలో జోక్యం చేసుకోవడానికి భయపడ్డారు. ఆవు పవిత్రత ఇప్పుడు పాకిస్తాన్ పట్ల శత్రుత్వమంత బహుముఖ పక్షపాత అంశంగా మారింది. హిందువులు అత్యధికంగా ఉండే రాష్ట్రమైన హరియాణా గోవధ చరిత్ర లేనిది. ఇప్పటికే అక్కడ గోసంరక్షణ చట్టం ఉన్నా, ఈ ఏడాది మార్చిలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరింత కఠిన పదజాలంతో కూడిన గోసంరక్షణ, గోవ్యాప్తి చట్టాన్ని చేశారు. ముందుకు జరిగిన హిందుత్వ గోల్ పోస్ట్ ముందుగా గుర్తించాల్సింది, గోవధ నిషేధం నుంచి గోల్ పోస్టును గోవులను పెంపొందింపజేయడం వద్దకు జరిపారనేది. తద్వారా ఆ జంతువుకు పవిత్రతను మాత్రమేగాక, పరిపాలనలో చట్టబద్ధ హోదాను కూడా ఇచ్చారు. రెండు, దిగుమతి చేసుకున్న, క్యాన్లలోని గోమాంసాన్ని తినడాన్ని, గోవులను ‘‘వధించడానికి’’ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చెయ్యడాన్ని (దాన్ని నిరూపించేదెవరు?) కూడా నిషేధించారు. ఆ చ ట్ట ఉల్లంఘనకు జైలు శిక్షను 10 ఏళ్లకు పెంచారు. అంతేకాదు, కఠోరమైన నూతన అత్యాచార చట్టంలో లాగా దోషులుగా ఆరోపణకు గురైన వారిపైనే నిర్దోషులమని నిరూపించుకునే బాధ్యతను ఉంచారు. కనికరించి ఆవు వాంగ్మూలాన్ని మాత్రం ఆమోదనీయం చేయకుండా వదిలేశారు. అంతేకాదు మరింత అసంబద్ధంగా స్వాధీనం చేసుకున్న మాంసాన్ని పరీక్షించడానికి రాష్ట్ర వ్యాప్తంగా లేబొరేటరీల నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని కూడా ఆ చట్టం నిర్దేశించింది. నేనేమైనా అతిశయోక్తులు చెబుతున్నానేమో అనుకుంటే ఆ చట్టం పూర్తి పాఠాన్ని మీరే చదవండి. ఏ గురుగావ్లోనో నివసిస్తున్న ఓ అత్యున్నత స్థాయి జపనీయ లేదా కొరియన్ ఎమ్ఎన్సీ ఎగ్జిక్యూటివ్ ఇంటిపై ఒక కానిస్టేబుల్ దాడి చేసి, అతని ప్రిజ్ నుంచి మాంసం ముక్కను తీసుకుని లేబొరేటరీలకు పంపే సన్నివేశం కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నాను. దయచేసి నవ్వేయకండి. అలాంటివి నిజంగానే జరుగుతాయి. అప్పుడు మోదీ కోరుకోని విధంగా ఓ మొట్టమొదటి స్థాయి దౌత్య సంక్షోభం తలెత్తడం, అది ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కడం మీరు చూడాల్సి వస్తుంది. ఎదురులేని గో రాజకీయాలు ఈ చట్టాన్ని, దానిలోని అసంబద్ధతలన్నిటితో సహా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడమే ఇక్కడ ముఖ్యమైన అంశం. కాంగ్రెస్ ఎంఎల్ఏలు దానికి అనుకూలంగా ఓటు చేశారు. ఆ పార్టీ అత్యంత సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుదా ముఖ్యమంత్రిని అభినందించారు. గో రాజకీయాలకు ఎదురే లేదని హిందుత్వ గ్రూపులు కనిపెట్టాయి. ములాయం-అఖిలేశ్ ప్రభుత్వం దాద్రీ ఘటనపై స్పందించిన తీరు అన్నిట్లోకీ అత్యంత దిగ్భ్రాంతికరమైనది. వారి పోలీసులు ఆ మాంసాన్ని పరీక్షకు పంపారు. ఎక్కడికో నాకు తెలియదు. పొరుగు రాష్ట్రమైన హరియాణాలో అలాంటి ల్యాబ్లను ఇంకా నిర్మించనే లేదు. సునంద థరూర్ మరణించిన రెండేళ్లకు ఆమె విసెరా శాంపుల్స్ను అమెరి కాకు పంపాల్సి వచ్చింది! ఫోరెన్సిక్ సైన్స్ అలాంటి స్థితిలో ఉన్న దేశంలో మనం జంతు మాంసం ఏ జాతికి చెందినదో తెలుసుకోవాల్సి వస్తోంది. ఇది, ఏప్రిల్ 2007 చివర్లో 43 డిగ్రీల ఎండలో మిట్టమధ్యాహ్నం వేళ నేను ఉత్తరప్రదేశ్లోని ధరంపూర్ గ్రామానికి వెళ్లినప్పటి సంగతిని గుర్తుకు తెస్తోంది. ఆ గ్రామం పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బింజోర్కు వెలుపల ఉన్నది. ఆ ప్రాంతం కూడా దాద్రీ, ముజఫర్నగర్లతో కూడిన మతపరంగా సున్నితమైన అర్థచంద్రాకార ప్రాంతంలో భాగం. అది శాసనసభ ఎన్నికల కాలం. బీజేపీ యువ మోర్చాలో సాపేక్షికంగా జూనియర్ కార్యకర్తగా ఉన్న అశోక్ కటారియా జనాన్ని ఉత్సాహపరిచే పాత్ర పోషిస్తున్నాడు. హిందూ మహిళల అభ ద్రత గురించి, ఐఎస్ఐ సెల్స్ చురుగ్గా ఉండటం, ఆ జిల్లాలో ముస్లింల జనాభా 41 శాతానికి చేరడం వల్ల జాతీయ భద్రతకు ఏర్పడిన ముప్పు గురించి అతడు మాట్లాడాడు. ఇక ఆ తదుపరి మాంసం తినడంపైకి వెళ్లాడు. ‘‘వాళ్లప్పుడు కుక్కలు, పిల్లులు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు, పాములను, భగవంతుడు, ప్రకృతి సృష్టించిన ఏ జంతువునైనా తినొచ్చు. కానీ ఒక్క గోమాంసం తినడం మాత్రం మానుకోవాలి. ఎందుకంటే గోవు మాకు మాతృమూర్తి. ఎవడైనా ఆవును చంపాడంటే ఆ లం.......కును మేం చంపిపారేస్తాం’’ అంటూ విరుచుకుపడ్డాడు. అప్పటికి అక్కడికి రాజ్నాథ్ సింగ్ కొంత అసమ్మతిపూర్వకంగా తల పంకిస్తూ వచ్చాడు. ‘‘యువ రక్తం కదా, ఒక్కోసారి వేడెక్కిపోతూ ఉంటుంది’’ అంటూ ఆయన తర్వాత దాన్ని తక్కువ చేసి చూపారు. ఆయన ఈ వారం జరిగిన దానికి కూడా అసమ్మతి చూపుతారనే ఆశిస్తున్నాను. అయితే కటారియా ఇప్పుడు, సాధ్వీ నిరంజన్ జ్యోతితోపాటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులలో ఒకరు. ఒబామాను చూసి నేర్చుకోండి శుక్రవారం తెల్లారి నేనిది రాస్తుండగా టీవీలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఓరెగాన్ కాల్పులపై మాట్లాడుతున్నారు. అది ప్రపంచంలోనే అత్యంత ఫెడరల్ దేశం. శాంతిభద్రతల విషయంలో ఆయన మాట చెల్లదు. అయినా ఆయన కేవలం రెండు గంటల్లోనే సాహానుభూతితో, ఉద్వేగంతో బహిరంగంగా మాట్లాడుతున్నారు. పదిహేను రోజుల క్రితమే ‘‘కూల్ క్లాక్ అహ్మద్’’ సమస్యలో జోక్యం చేసుకున్నారు. ఆయన ఎవర్నీ సంతృప్తి పరచడం లేదు, తిరిగి భరోసానిస్తూ రాజధర్మాన్ని నిర్వర్తిస్తూ చాలా చిన్నదైన మైనారిటీ అయిన, భారత్లో కంటే చాలా ఎక్కువ అనుమానాస్పదంగా చూసే ముస్లింలకు చేయి చాస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి మీడియా సలహాలు నచ్చవు. కనీసం ఆయన తన మిత్రుడు బరాక్ను చూసైనా నేర్చుకోవాలి. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
‘ప్రమాద’ భారతం
నిత్యమూ నెత్తుటి చరిత్రను రచిస్తున్న రోడ్డు ప్రమాదాల గురించి ఆదివారం ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించి ప్రధాని నరేంద్ర మోదీ మంచి పని చేశారు. ఉగ్రవాదాన్ని మించిన పెను రక్కసిగా మారిన రోడ్డు ప్రమాదాల గురించి అవసరమైనంతగా చర్చ జరగడం లేదు. ఉన్నత స్థానాల్లోనివారు ఇలాంటి సమస్యలను ప్రస్తావిస్తే వాటిపై అందరి దృష్టీ పడుతుంది. వాటి పరిష్కారానికి ఒక దోవ దొరుకుతుంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే దుర్మరణం పాలైనప్పుడు రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణమే సమగ్రమైన చట్టం తీసుకురావాలని కేంద్రం భావించింది. నెలరోజుల్లోనే ఆ పని చేస్తామని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఏడాదిన్నర కావస్తుండగా త్వరలోనే బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్టు తాజాగా మోదీ తెలిపారు. మరోపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడాన్ని గమనించాక నిరుడు సుప్రీంకోర్టు జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ మొన్న ఫిబ్రవరిలో సమర్పించిన నివేదిక చూస్తే రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కళ్లకు కడుతుంది. దేశంలో కేరళ, యూపీ, నాగాలాండ్ మినహా మరే రాష్ట్రమూ రహదారి భద్రతా విధానాన్ని రూపొందించుకోలేదని కమిటీ తెలిపింది. డ్రైవింగ్ లెసైన్స్ల జారీలో, భద్రతకు సంబంధించిన నిబంధనలను అమలుపర్చడంలో ప్రభుత్వాలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని చెప్పింది. రహదారి భద్రతకు సంబంధించి ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రభుత్వాలు శాశ్వతమైన, శాస్త్రీయమైన వ్యవస్థ ఏర్పర్చుకోలేదని వివరించింది. ప్రమాదాల్లో గాయపడినవారిని తరలించేందుకు అంబులెన్స్లుగానీ, వారికి సత్వర చికిత్స అందించేందుకు అవసరమైన కేంద్రాలు గానీ లేవని తేల్చింది. ప్రమాదం జరిగినప్పుడు తొలి గంటలో చికిత్స ప్రారంభిస్తే 50 శాతం మరణాలను నివారించవచ్చునని వైద్యులు చెప్పినట్టు 201వ లా కమిషన్ నివేదిక తెలిపింది. ఇలాంటి సమయాల్లో బాధితులను వెనువెంటనే సమీపంలోని ఆస్పత్రులకు చేర్చడానికి కూడా చాలామంది భయపడతారు. పోలీసులు అనుమానితులుగా చూస్తారని, కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుందని వెనుకంజ వేస్తారు. ప్రమాదాల సమాచారం చేరేయడానికి 1033 నంబర్తో ఫోన్లైన్ ప్రారంభించబోతున్నట్టు ప్రధాని చెప్పారు. ఇలాంటి సమయాల్లో సాయపడేవారికి వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటామని, ఆస్పత్రులు సైతం వెనువెంటనే చికిత్స ప్రారంభించేలా నగదు రహిత వైద్యానికి వీలుకల్పిస్తామని ప్రధాని ఇచ్చిన హామీ గాయపడినవారి ప్రాణాలను కాపాడటానికి వీలు కలిగిస్తుంది. ‘మన్ కీ బాత్’లో నరేంద్రమోదీ వెల్లడించిన గణాంకాలు విస్తుగొలుపుతాయి. మన దేశంలో ప్రతి నిమిషమూ ఒక రోడ్డు ప్రమాదం, ప్రతి నాలుగు నిమిషాలకూ ఒక మరణమూ సంభవిస్తున్నాయని ఆ గణాంకాలు చెబుతున్నాయి. రోజుకూ దాదాపు 380మంది మరణిస్తుంటే అందులో 16మంది పిల్లలు. 2013లో రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 1,37,000మంది మరణించగా... నిరుడు ఆ సంఖ్య 1,45,526కు చేరుకుంది. మొత్తంగా ఇలాంటి ప్రమాదాల్లో మృతుల సంఖ్య 3 శాతం పెరిగింది. ఇదే సమయంలో గాయపడినవారి సంఖ్య 4,80,000! వీరిలో అత్యధికులు జీవితాంతం వికలాంగులుగా వెళ్లదీస్తున్నారు. గడపదాటి బయటకెళ్లి పనిచేయలేని స్థితికి చేరుకుని ఉపాధి కోల్పోతున్నారు. పర్యవసానంగా ఆ కుటుంబాలన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రమాదాల్లో అధికభాగం ద్విచక్ర వాహనాలవల్లనే జరుగుతున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాలు వివరిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలోనూ, తెలంగాణ తొమ్మిదో స్థానంలోనూ ఉన్నాయని బ్యూరో తెలిపింది. సాధారణంగా గణాంకాలు సమస్య తీవ్రతను తెలియజెబుతాయి. సమస్యకు గల కారణాలేమిటో తెలుసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. మన దేశంలో కార్ల మార్కెట్ పెను వేగంతో పెరుగుతున్నది. ఏటా 20 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడవుతాయని ఒక అంచనా. నిరుడు కోటీ 40 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయని వాహన తయారీదారులు చెబుతున్నారు. ఏటా వెల్లువలా వచ్చిపడుతున్న ఈ వాహనాలవల్ల ఒక చోటునుంచి మరో చోటుకు వెళ్లడం ఒక సాహసయాత్రలా మారుతోంది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వాలు అసమర్థంగా నడపడంవల్ల కావొచ్చు...వాహనాలు సమకూర్చుకోవడం తేలికవడంవల్ల కావొచ్చు ప్రతి నెలా వేలాది వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. బ్యాంకుల్లో రైతులకు పంట రుణాలు రావడం సమస్య కావొచ్చుగానీ...వాహన కొనుగోళ్లకు మాత్రం రుణాలు సులభంగా దొరుకుతాయి. అసలు వాహనాల డిజైన్, వాటి నిర్మాణం ఇక్కడి రోడ్లకు అనుగుణంగా ఉంటున్నాయా...లేదా, ప్రమాదాలు జరిగితే అవి తట్టుకునే స్థితిలో ఉంటాయా అనే సంగతిని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. బ్రిటన్లోని ఒక సంస్థ వివిధ బ్రాండ్ల కార్లపై భద్రతా పరీక్షలు నిర్వహించినప్పుడు ఓ మాదిరి ప్రమాదాలను తట్టుకోగల స్థితిలో కూడా అవి లేవని వెల్లడైంది. అలాంటి బ్రాండ్లన్నీ మన మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఇక రోడ్ల డిజైన్గానీ, వాటి నిర్మాణంగానీ పాదచారులుంటారన్న సంగతినే విస్మరించినట్టు కనబడతాయి. కనీసం సైకిళ్లకు కూడా అందులో చోటుండదు. కొత్తగా తీసుకొస్తున్న రహదారి భద్రతా బిల్లు వాహనాల డిజైన్ మొదలుకొని వాటి నిర్వహణ వరకూ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, వాహనాలకు ‘క్రాష్ టెస్టుల’ నిర్వహణ తప్పనిసరి చేస్తాయని చెబుతున్నారు. దీంతోపాటు రోడ్ల నిర్మాణం, నిర్వహణపైనా గురిపెడతారని అంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి విషయంలో కఠినంగా వ్యవహరించేలా నిబంధనలున్నాయని ఆమధ్య గడ్కరీ వివరించారు. అయితే ఇవి మాత్రమే సరిపోవు. ప్రభుత్వాలు తమ వంతుగా చేయ వలసినవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు, రోడ్ల సక్రమ నిర్వహణ, ఫుట్పాత్ల ఏర్పాటు ఎంతో అవసరం. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులుంటే, అవి సమయానికొస్తుంటే వాహనాల జోలికి వెళ్లేవారుండరు. దిద్దుబాటు చర్యలు తమతో ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలిస్తేనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని పాలకులు గుర్తించాలి. -
లో బీపీ రోగులకు సర్జరీ ప్రాణాంతకం
లోబీపీతో బాధ పడుతున్న రోగులకు శస్త్రచికిత్స నిర్వహిస్తే అది వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చని పరిశోధకులు అంటున్నారు. అధిక రక్తపోటు కూడా ప్రాణానికి హాని కరమే అయినా, దానివల్ల శస్త్రచికిత్స తరువాత ప్రాణానికి పెద్దగా హాని కలగదని నాటింగ్హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శస్త్రచికిత్స చేయడానికి ముందు నుంచి అది పూర్తై కొంతకాలం వరకు రోగుల్లో ఉండే ఇబ్బందుల్ని అనేక అంశాల ఆధారంగా పరిశోధకులు విశ్లేషించారు. వివిధ శస్త్రచికిత్సలు చేసుకున్న దాదాపు రెండున్నర లక్షల మంది రోగుల్ని పరిశీలించి నివేదిక వెలువరించారు. ఈ నివేదిక ప్రకారం... శస్త్రచికిత్స అనంతరం రోగులపై అధిక రక్తపోటు ప్రభావం పెద్దగా లేదు. అయితే తక్కువ రక్తపోటు ఉన్నవారిలో 40 శాతం మందికి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. మరీ తక్కువ రక్తపోటు ఉన్నవారికి 2.5రెట్లు ఎక్కువగా ప్రాణహాని ఉంది. అందువల్ల శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగులు రక్తపోటును సరైన స్థాయిలో నియంత్రణలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
'గే'లకు వాటితో డేంజరే..
వాషింగ్టన్: అమెరికా ఖండంలోని పలు దేశాల్లో 'గే' (స్వలింగ సంపర్కుల)లకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు చాలా అపాయకరంగా ఉన్నాయని ఆపిల్ కంపెనీ చీఫ్ టిమ్ కుక్ అన్నారు. ఇలాంటి చట్టాలు స్వలింగ సంపర్కుల విషయంలో పూర్తి పక్షపాతం చూపేలా చేస్తాయని, సమానత్వాన్ని హరిస్తాయని ఆయన ఓ ఎడిటోరియల్కు రాసిన వ్యాసంలో తెలిపారు. ఆపిల్ సంస్థలో అత్యంత ముఖ్యమైన కార్యవర్గంలో చీఫ్గా పనిచేస్తున్న టిమ్ కుక్ తాను స్వలింగ సంపర్కుడినని స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ పోస్ట్కు ఆయన ఒక వ్యాసం రాస్తూ గేల హక్కులను ప్రస్తావించారు. మతపరమైన స్వేచ్ఛ పేరుతో పలు దేశాలు స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, వారికి ప్రతికూల చట్టాలు చేస్తున్నాయని, దీనివల్ల అత్యంత ముఖ్యమైన సమానత్వం సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ నిర్మాణం సమయంలో ఎలాంటి నిబంధనలు పెట్టుకున్నారో వాటన్నింటిని తుంగలో తొక్కుతున్నారని, ఇండియానా వంటి దేశాల్లో స్వలింగ సంపర్కులతో ఆర్థిక లావాదేవీలు కొనసాగించబోమని చెప్పడం.. పాశ్చాత్య దేశాలు ఎంతటి అపాయకరమైన స్థితిని ఆహ్వానిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి చర్యలు అమెరికాలోని పలు దేశాల్లో జరగడం చాలా దురదృష్టకరం అని వాపోయారు. -
స్మశానంలో చిన్నారులు !
-
భారీ జీవాల్ని సైతం కబళించే చిన్న కీటకం
-
బలి తీసుకుంటున్న క్రాసింగులు
బాల్కొండ, న్యూస్లైన్ : మండలంలోని పోచంపాడ్ కూడలి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందగా, నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రహదారిని దాటుతూ రోడ్డు ప్రమాదాలకు గురైనవారి వివరాలు చూస్తే భయమేస్తోంది. 2009 సంవత్సరంలో 14 మంది, 2010లో 8 మంది, 2011లో 13మంది, 2012లో 15 మంది 2013లో ఇప్పటి వరకు 8 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. అసలే ట్రాఫిక్ నియమాలు తెలియక సతమతమవుతున్నవారు రోడ్డు ఎలా దాటాలో తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. హైవే అథారిటీ అధికారులూ ప్రయాణికుల యోగ క్షేమాలను పట్టించుకున్న దాఖాలాలు లేవు. నాలుగు లైన్ల రహదారి అయిందని సంతోషపడాలో, రోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూసి బాధపడలో తెలియని స్థితిలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అతి ప్రమాద కరం ముప్కాల్ క్రాసింగ్ మండలంలోని ముప్కాల్ బైపాస్వద్ద ఉన్న జాతీయ రహదారి క్రాసింగులో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. పొలాలకు వెళ్లేందుకు వేరే దారి లేక రైతులు జాతీయ రహదారిని దా టుతూ ప్రమాదలకు గురవుతున్నారు. ఆ క్రాసింగ్ నుంచి మం డలంలోని పలుగ్రామాలకు దూరభారం తగ్గేలా మరో దారి ఉండటంతో ప్రయాణికులు సైతం రోడ్డును క్రాస్ చేస్తున్నా రు. క్రాసింగ్ల వద్ద వాహనాల వేగం తగ్గించేందుకు ఎలాంటి నిరోధకాలు లేకపోవడంతో వాహనాలు అతివేగంగా వచ్చి ఢీకొడుతున్నాయి. హైవే క్రాసింగుల వద్ద ప్రమాదాలు నివారించడానికి ఆర్డీఓతో పరిశీలన చేయించి, గతంలో జిల్లా యంత్రాంగం హైవే అథారిటీకి పలు సూచనలు చేసింది. క్రాసింగుల వద్ద స్టాపర్లు పెట్టాలని అప్పటి ఆర్మూర్ డీఎస్పీ నర్సింహా సూచించినా హైవే అధికారులు పట్టించుకోలేదు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడే అధికారులు ఇది చేయాలి, అది చేయాలని మాట్లాడుతారు. తర్వాత ఊసెత్తరని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పం దిం చి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలంటున్నారు. చాకిర్యాల్ వద్దా అంతే మండలంలోని చాకీర్యాల్ వద్ద గల క్రాసింగ్ సైతం ప్రమాదాలకు నిలయంగా మారింది. అక్కడ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రైతులకు అప్రోచ్ రోడ్డు లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రెండు క్రాసింగ్ల వద్ద వెంటనే అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. తాజాగా పోచంపాడ్ క్రాసింగ్ తాజాగా పోచంపాడ్ క్రాసింగ్ ప్రమాదాలకు నిలయంగా మారిం ది. మంగళవారం జరిగిన ప్రమాదంలో విద్యార్థినితో పాటు, ఆమె తండ్రి మృతి చెందడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైవే పై ఉన్న నిబంధనలు తెలియక కొందరు, హైవే అధికారులు నిర్లక్ష్యంతో మరి కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు.