Delhi University
-
మోదీ డిగ్రీ సర్టిఫికెట్ను అపరిచితులకు చూపించలేం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభ్యసించిన బ్యాచిలర్ డిగ్రీని ఢిల్లీ హైకోర్టుకు చూపించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీ యూనివర్సిటీ వెల్లడించింది. అయితే, సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈ డిగ్రీని అపరిచితులకు చూపించలేమని తేల్చిచెప్పింది. దీంతో మోదీ డిగ్రీకి సంబంధించిన కేసుపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ పరీక్ష ఉత్తీర్ణులైన వారి వివరాలు ఇవ్వాలంటూ నీరజ్ అనే వ్యక్తి కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)ని కోరారు. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు. నరేంద్ర మోదీ 1978లో బీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. నీరజ్ వినతిపై సీఐసీ సానుకూలంగా స్పందించింది. 1978లో బీఏ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన విద్యార్థుల రికార్డులను తనిఖీ చేసుకోవడానికి అంగీకారం తెలిపింది. అందుకు సహకరించాలని ఢిల్లీ యూనివర్సిటీని ఆదేశించింది. ఈ మేరకు 2016 డిసెంబర్ 21న ఆదేశాలు జారీ చేసింది. సీఐసీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సీఐసీ ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీఐసీ ఆదేశాలపై హైకోర్టు 2017 జనవరి 23న స్టే విధించింది. సీఐసీ ఇచ్చిన ఆదేశాలు న్యాయబద్ధమేనని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి చదువుకు సంబంధించిన వివరాలు తెలుసుకొనే హక్కు ఆర్టీఐ చట్టం కింద దేశ ప్రజలకు ఉందని స్పష్టంచేశారు. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా గురువారం విచారణ జరిపారు. ఢిల్లీ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘తెలుసుకొనే హక్కు’ కంటే ‘గోప్యత హక్కు’ మిన్న అని వెల్లడించారు. ప్రధానమంత్రికి ఉన్న గోప్యత హక్కు దృష్ట్యా ఆయన డిగ్రీని ఆర్టీఐ చట్టం కింద అపరిచితులకు చూపించడం సాధ్యం కాదని చెప్పారు. హైకోర్టుకు చూపించడానికి అభ్యంతరం లేదన్నారు. కొందరు వ్యక్తులు రాజకీయపరమైన ఉద్దేశాలతో ప్రధానమంత్రి సర్టిఫికెట్ను కోరుతున్నారని ఆక్షేపించారు. సీఐసీ ఉత్తర్వులను తిరస్కరించాలని విన్నవించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ..
న్యూఢిల్లీ: దేశంలో పేరెన్నికగన్న విద్యాలయాల్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(డీయూ) ఒకటి. ఈ వర్శిటీ అనుబంధ కళాశాలల్లో చదివిన పలువురు పెద్ద రాజకీయ నేతలుగా ఎదిగారు. వీరిలో చాలామంది క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీ(Delhi University) పరిధిలోని వివిధ కళాశాల్లో చదివి బడా నేతలుగా ఎదిగిన వారి జాబితాలో అరుణ్ జైట్లీ, శశి థరూర్ మొదలుకొని మొన్ననే ఢిల్లీ పీఠమెక్కిన రేఖాగుప్తా కూడా ఉన్నారు. మరి.. వీరిలో ఎవరెవరు ఏ కాలేజీలో చదివారనే వివరాల్లోకి వెళితే..శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్అరుణ్ జైట్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(Arun Jaitley) 1973లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బి.కామ్ ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు. 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ లా నుండి ఎల్ఎల్బీ పట్టా పొందారు.విజయ్ గోయెల్: కేంద్ర మాజీ మంత్రి విజయ్ గోయెల్ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎం.కామ్ పట్టా పొందారు.జితిన్ ప్రసాద్: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ ప్రసాద్.. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి వాణిజ్యంలో డిగ్రీ పట్టా పొందారు.సెయింట్ స్టీఫెన్స్ కళాశాలశశి థరూర్: కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ 1975లో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.మణిశంకర్ అయ్యర్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్(Mani Shankar Iyer) సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బీ.ఎ. పట్టా పొందారు.వీరభద్ర సింగ్: మాజీ కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి బీ.ఎ. ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు.ఖుష్వంత్ సింగ్: ఖుష్వంత్ సింగ్ రచయితగా, న్యాయవాదిగా, పాత్రికేయునిగా, దౌత్యవేత్తగా పేరొందారు. ఈయన సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకున్నారు.హిందూ కళాశాలడాక్టర్ సుబ్రమణియన్ స్వామి: రాజకీయవేత్త, ఆర్థికవేత్త, క్యాబినెట్ మాజీ మంత్రి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.రావు ఇంద్రజిత్ సింగ్: భారత ప్రభుత్వ మాజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ హిందూ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.మీనాక్షి లేఖి: భారత ప్రభుత్వ మాజీ విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఢిల్లీలోని హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ (బీఎస్సీ) పూర్తి చేశారు.రాంజస్ కళాశాలచౌదరి బ్రహ్మ ప్రకాష్: ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రి చౌదరి బ్రహ్మ ప్రకాష్, ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంజస్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.సోమనాథ్ భారతి: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతి, రాంజస్ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.సరూప్ సింగ్: 1990లో మొదట కేరళ గవర్నర్గా, ఆ తర్వాత గుజరాత్ గవర్నర్గా పనిచేసిన సరూప్ సింగ్, రాంజస్ కళాశాల నుండి బీ.ఎ. ఇంగ్లీష్ చదివారు.కిరోరి మాల్ కళాశాలనవీన్ పట్నాయక్: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.మదన్లాల్ ఖురానా: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, మదన్లాల్ ఖురానా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ప్రవేశ్ వర్మ: ప్రవేశ్ వర్మ ప్రస్తుత ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివారు.హన్స్రాజ్ కళాశాలకిరణ్ రిజిజు: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. హన్స్రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అజయ్ మాకెన్: ప్రస్తుత ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ హన్స్రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్అనుప్రియ పటేల్: పార్లమెంటు సభ్యురాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ సహాయ మంత్రి అనుప్రియ పటేల్(Anupriya Patel) లేడీ శ్రీరామ్ మహిళా కళాశాల నుండి బీ.ఎ. పట్టా పొందారు.మేనకా గాంధీ: మాజీ ఎంపీ, మహిళా, శిశు అభివృద్ధి మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త, పర్యావరణవేత్త మేనకా గాంధీ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.దయాల్ సింగ్ కళాశాలపంకజ్ సింగ్: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు, నోయిడా ఎమ్మెల్యే పంకజ్ సింగ్ 1999లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దయాళ్ సింగ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా పొందారు. ఆయన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు.అల్కా లాంబా: జాతీయ కాంగ్రెస్ మహిళా నేత అల్కా లాంబా 1996లో దయాళ్ సింగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.దౌలత్ రామ్ కళాశాలరేఖ గుప్తా: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా అందుకున్నారు.ఇది కూడా చదవండి; Mahakumbh: 75 జైళ్లలో ఖైదీల పవిత్ర స్నానాలు -
ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
-
డీయూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీ.ఎన్ సాయిబాబా కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నక్సల్స్తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో గతంలో సాయిబాబాను అరెస్టు చేశారు. దాదాపు 9 ఏళ్లపాటు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలపై 2014లో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్ట్ చేశారు. సాయిబాబా కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. 2017లో గడ్చిరోలి కోర్టు నిందితులకు జీవితఖైదు విధించగా.. ఆయన నాగ్పూర్ జైల్లో శిక్ష అనుభవించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. సాయిబాబాను నిర్ధోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది. మార్చి నెలలో నాగ్పూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన పోలియో కారణంగా ఐదేళ్ల వయస్సు నుంచి వీల్ చైర్ను ఉపయోగిస్తున్నారు. ఆయన జైలులో ఉన్న సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా ఏళ్లు ఇంగ్లీష్ బోధించారు. ఆయన మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే కేసులో జైలుకు వెళ్లారు. దీంతో ఫిబ్రవరి 2021లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుండి తొలగించబడ్డారు.మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్లాల్ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్షీట్ నమోదు చేశారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది.సెషన్స్కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది.చదవండి: డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్ సర్కార్ -
మన వర్సిటీలు ప్రపంచంలో మేటి
న్యూఢిల్లీ: విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో అమల్లోకి తీసుకొచి్చన విధానాలు, తీసుకున్న నిర్ణయాలతో భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన వర్సిటీలు ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో కేవలం 12 భారతీయ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య 45కు చేరుకుందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్ఐటీల సంఖ్య పెరిగిందని చెప్పారు. నవ భారత నిర్మాణంలో అవి విశిష్టమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన తన అమెరికా పర్యటనను మోదీ ప్రస్తావించారు. మన దేశ యువత పట్ల ప్రపంచానికి విశ్వాసం పెరిగిందన్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటివల్ల అంతరిక్షం, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ వంటి కీలక రంగాల్లో మన దేశ యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. మన విద్యా వ్యవస్థకు ఘన చరిత్ర మైక్రాన్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారత్లో పెట్టుబడులు భారీగా పెట్టబోతున్నాయని, మనదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక సూచిక అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ యూనివర్సిటీ అంటే కేవలం ఒక విద్యాలయం కాదని, ఒక ఉద్యమమని వ్యాఖ్యానించారు. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు సంతోషానికి, సౌభాగ్యానికి వనరులుగా నిలిచాయని చెప్పారు. భారతీయ విద్యావ్యవస్థకు ఘన చరిత్ర ఉందన్నారు. విదేశీయుల నిరంతర దాడుల వల్ల భారతీయ విద్యావ్యవస్థ కుప్పకూలిందని, తద్వారా అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం అనంతరం వర్సిటీలు నైపుణ్యం కలిగిన యువతను దేశానికి అందించాయని, అభివృద్ధికి పాటుపడ్డాయని మోదీ ప్రశంసించారు. ‘యుగే యుగే భారత్’ మ్యూజియం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గిరిజన ప్రదర్శనశాలలు(మ్యూజియమ్స్) ఏర్పాటు చేశామని, ఢిల్లీలోని ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’ ద్వారా స్వతంత్ర భారత్ అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకోవచ్చని నరేంద్ర మోదీ చెప్పారు. ‘యుగే యుగే భారత్’ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని ఢిల్లీలో నిర్మిస్తున్నామని తెలిపారు. మన స్టార్టప్ కంపెనీల సంఖ్య లక్ష మార్కును దాటిందన్నారు. 2014లో కేవలం వందల సంఖ్యలోనే స్టార్టప్లు ఉండేవన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ భవనాలు, నార్త్ క్యాంపస్ అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి ప్రధాని పునాదిరాయి వేశారు. ఢిల్లీ యూనివర్సిటీ 1922 మే 1న ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ వర్సిటీలో 86 డిపార్ట్మెంట్లు, 90 కాలేజీలు ఉన్నాయి. మెట్రో రైలులో మోదీ ప్రయాణం ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన మెట్రో రైలులో వచ్చారు. రైలులో విద్యార్థులతో సరదాగా సంభాíÙంచారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన మెట్రో రైలు ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. ఓటీటీల్లో ప్రసారమవుతున్న కొత్త వెబ్ సిరీస్ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఏ వెబ్ సిరీస్ బాగుంది? ఏ రీల్స్ బాగున్నాయో వారు చెప్పగలరని పేర్కొన్నారు. మాట్లాడేందుకు విద్యార్థుల వద్ద ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. సైన్స్ నుంచి ఓటీటీల్లోని కొత్త వెబ్ సిరీస్ల దాకా చాలా విషయాలను వారితో మాట్లాడొచ్చని వెల్లడించారు. ఏ ఒక్క అంశాన్నీ వారు వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. భూగోళంపై ఉన్న అన్ని అంశాలను విద్యార్థులు చక్కగా చర్చించగలరని ట్వీట్ చేశారు. -
ఏదీ వదలకుండా మాట్లాడారు: ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ ప్రయాణికుడిలా ఢిల్లీ మెట్రో రైలులో సందడి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల కోసం ఇవాళ లోక్ కల్యాణ్ మార్గ్ నుంచి విశ్వ విద్యాలయా మెట్రో స్టేషన్ మధ్య రైలులో ప్రయాణించారు. ప్రధాని మోదీ మెట్రోరైలులో సందడి చేసిన ఫొటోలు, వీడియోలు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి. యువ ప్రయాణికులతో ప్రయాణం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారాయన. On the way to the DU programme by the Delhi Metro. Happy to have youngsters as my co-passengers. pic.twitter.com/G9pwsC0BQK — Narendra Modi (@narendramodi) June 30, 2023 PM Shri #NarendraModi interacts with passengers in #Delhi Metro during his ride to Delhi University.#Viralvideo pic.twitter.com/PkojngLPEe — Akshara (@Akshara117) June 30, 2023 ► ఇక ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. మెట్రో ప్రయాణ అనుభవాన్ని సైతం వివరించారు. విద్యార్థులు మెట్రో ప్రయాణంలో ఎన్నో మాట్లాడారు. ఓటీటీ నుంచి సైన్స్ అంశాల దాకా దేన్ని వదలకుండా చర్చించారు అని తెలిపారాయన. ► ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో భాగంగా.. పలు విభాగాలకు శంకుస్థాపనలు.. పలు సెక్షన్లను ప్రారంభించారాయన. ► సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టం ప్రకారం.. ఢిల్లీ యూనివర్సిటీకి 1922లో స్థాపన జరిగింది. ► 2022, మే 1వ తేదీన ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాళ్టి ప్రధాని మోదీ హాజరు కార్యక్రమంతో ఆ వేడుకలు ముగిశాయి. ► ప్రధాని రాక నేపథ్యంలో విద్యార్థులు నల్ల దుస్తులు(నిరసన తెలిపే అవకాశం ఉన్నందునా) వేసుకురావొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే 10 నుంచి 12 గంటల నడుమ ప్రధాని మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు వీక్షించే ఏర్పాట్లు చేశారు. Prime Minister #NarendraModi on Friday travelled on the metro to attend the closing ceremony of the Delhi University's centenary celebrations as the chief guest.#delhiuniversity #Delhi #india pic.twitter.com/RoTeFQi04X — Kashmir Local News (@local_kashmir) June 30, 2023 -
బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం.. దేశవ్యాప్తంగా బీసీ పోరు!
సాక్షి, హైదరాబాద్: బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మండల్ కమిషన్ నిర్దేశించినట్టుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో, పదోన్నతుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సూరజ్ మండల్ డిమాండ్ చేశారు. దేశంలో బీసీలు సహా కులాల వారీగా జనాభా ఎంత ఉందన్న స్పష్టత వచ్చేలా జనగణన చేయాలని.. ఈ రెండు అంశాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ఆ దిశగానే ఈ నెల 11న హైదరాబాద్లో బీసీ సదస్సును నిర్వహించి, అందులో లేవనెత్తిన అంశాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని.. వచ్చే నెలలో హైదరాబాద్లో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. హైదరాబాద్లో బీసీ సదస్సు కోసం వచి్చన సూరజ్ మండల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బిహార్ సీఎంగా పనిచేసి బీసీల కోసం ఉద్యమించిన నేత బిందేశ్వర్ ప్రసాద్ మండల్ (బీపీ మండల్) మనవడిగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను కృషి చేస్తున్నట్టు చెప్పారు. సూరజ్ మండల్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఏపీ తరహా స్ఫూర్తిని అనుసరించాలి.. ‘‘చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నా ఆచరణలోకి రాలేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లో వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. బీసీ ల్లోని పలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తానని, బీసీలకు ప్రత్యేక ప్రాధా న్యత ఇస్తానని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించడం శుభపరిణామం. ఇదే స్ఫూర్తిని దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది. బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం బీసీల పాలిట శాపంలా మారబోతోంది. ఆ పాలసీ పేరిట ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫీజులను అడ్డగోలుగా పెంచేశారు. అరకొర ఆదాయ కేటగిరీలో ఉన్న బీసీలు ఈ పెరిగిన ఫీజులతో కేంద్ర విద్యా సంస్థల్లో చదువుకోవడంకష్టమే. ఆ సీట్లు చివరికి అగ్రవర్ణాలకే అందుతాయి. అందుకే ఎన్ఈపీలో మార్పులు చేయాలని, ఫీజులు తగ్గించాలని కోరినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అత్యంత మూర్ఖంగా నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీలు అన్ని విధాలా నష్టపోయారు. కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఎన్సీబీసీ చైర్మన్, సభ్యులను సకాలంలో నియమించకుండా కాలయాపన చేసి బీసీల హక్కులతో ఆటలాడుతున్నారు. కులాల వారీగా జనగణన అవసరం జనగణనలో కులాల వారీగా లెక్కలు తేల్చాలని ఏళ్లుగా ఉద్యమిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి ఈ డిమాండ్ వస్తుండటంతో కేంద్రం జనగణన ప్రక్రియనే వాయిదా వేసింది. జనాభాలో కులాల వారీగా సంఖ్య తేలితే రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు మార్గం సుగమం అవుతుంది. ఈ అంశం కేంద్ర ప్రభుత్వానికి నచ్చడం లేదు. జనాభాలో అగ్రవర్ణాల సంఖ్య ఎంతో తేల్చకుండానే 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసింది. బీజేపీ పాలనలో అగ్రవర్ణాలకు ఒక విధంగా, అణగారిన వర్గాలకు ఒక విధంగా న్యాయం ఉంటుందనిపిస్తోంది. -
బెంగళూరులో నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం
దొడ్డబళ్లాపురం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాఙ్మయి వివాహం బెంగళూరులో గురువారం నిరాడంబరంగా జరిగింది. ఉడుపి అదమారు మఠం బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వాఙ్మయి– ప్రతీక్ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ అనే ఓ హోటల్లో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి అతి కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న వాఙ్మయి ఒక ప్రముఖ పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. -
'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగింపు
ప్రసిద్ధ గేయం 'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్ కౌన్సిల్ శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని చట్టసభ్యులు ధృవీకరించారు. భారత్ విభజనకు ముందు ఉన్న సియోల్కోట్లో 1877లో జన్మించిన పాక్ కవి అల్లామా ఇక్బాల్గా పిలిచే ముమహ్మద్ ఇక్బాల్ ఈ ప్రముఖ గేయం 'సార్ జహాన్ సే అచ్ఛా'ని రాశారు. ఆయన గురించి ఉన్న పాఠ్యాన్ని బీఏలోని పొలిటికల్ సిలబస్ నుంచి తొలగించారు. దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏపీవీపీ) స్వాగతించింది. పొలిటికల్ సైన్స్ సిలబస్లో మార్పుకు సంబంధించి తీర్మానం తీసుకురావడమే గాక ఆ పార్యాంశాన్ని తొలగించినట్లు కౌన్సిల్ సభ్యుడు తెలిపారు. వాస్తవానకి 'మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్' అనే సబ్జెక్టు బీఏలోని ఆరవ సెమిస్టర్ పేపర్లో బాగం. దీన్ని ఇప్పుడూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాజకీయా ఆలోచనలోని గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది యూనివర్సిటీ. ఈ కోర్సులో భాగంగా సిలబస్లో రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు భీమ్రావ్ అంబేద్కర్ తదితరులు గురించి ఉంది. అంతేగాదు ఆధునిక భారతీయ ఆలోచనలపై విమర్శనాత్మక అవగాహనతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ఈ కోర్సును ఏర్పాటు చేశారు. ఆయా ప్రముఖుల ఆలోచనల నేపథ్య అన్వేషణ తోపాటు చారిత్రక పథంలో ముఖ్యమైన విషయాలపై సమయోచిత చర్చలను గుర్తించడం సంబంధిత వారి రచనలలో ప్రదర్శించబడిన విభిన్న అవకాశాలను విద్యార్థులకు తెలుసుకోవాలనే లక్ష్యంతో పాఠ్యాంశాల్లో భాగం చేశారు. సిలబస్లో మొత్తం ఆయా ప్రముఖుల గూర్తి మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ఇదిలా ఉండగా, భారత రాజకీయ ఆలోచనలను గూర్చి తెలసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీఏ ఆరవ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు చేర్చిన దీనిలో ఆ మతోన్మాద పండితుడు మొహమ్మద్ ఇక్బాల్ని గూర్చి పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించింది అకడమిక్ కౌన్సిల్. నిజానికి ఇక్బాల్ని పాకిస్తాన్ తాత్విక తండ్రిగా పిలుస్తారు. అతను ముస్లిం లీగ్లో జిన్నాను నాయకుడిగా స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడని, ఇక్బాల్ కూడా జిన్నా వలే భారతదేశ విభజనకు కారణమని యూనివర్సిటీ ఆరోపించింది. (చదవండి: ఆక్రమణ నిరోధక డ్రైవ్లో షాకింగ్ దృశ్యాలు..పోలీసులు మహిళ జుట్టు పట్టి లాగి, తన్ని..) -
రాహుల్కి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు: ఇది మీ హోదాకి తగ్గ పని కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇలా సడెన్గా యూనివర్సిటీలో పర్యటించడం కరెక్ట్ కాదని నోటీసులు పంపుతామని హెచ్చరింది. అన్నట్లుగానే ఢిల్లీ యూనివర్సిటీ రాహుల్ గాంధీకి బుధవారం నోటీసులు పంపించింది. జెడ్ప్లస్ భద్రతతో ఓ జాతీయ పార్టీ నాయకుడి హోదాలో ఉన్న రాహుల్కి ఇది తన స్థాయికి తగ్గ పని కాదని చురకలంటిస్తూ..రెండు పేజీల నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనను అతిక్రమణ, బాధ్యతరాహిత్యమైన ప్రవర్తనగా పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. ఆ నోటీసులో హాస్టల్ ప్రవేశ నిర్దేశిత నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ఏ నాయకుడు యూనివర్సిటీలో మూడు వాహానాలతో యూనివర్సిటీలోకి ప్రవేశించేటప్పుడు ఆ నిబంధనలను అనుసరించాలని తెలిపింది. అలాగే హాస్టల్ ప్రాంగణంలో అకడమిక్ అండ్ రెసిడెంట్స్ కౌన్సిల్ కార్యకలాపాల్లో తప్ప మరే ఏ ఇతర కార్యకలాపాల్లో పాల్లొనకూడదని పేర్కొంది. హాస్టల్ యూనివర్సిట్ ఆఫ్ ఢిల్లీ చట్టం ప్రకారం కొన్ని కార్యకలాపాల్లో పాల్గొనేందుకు దానికంటూ కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయని తెలిపింది. నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఏ కార్యక్రమాన్నైనా ఆపే హక్కు మాకు ఉందన్నారు. ఇది హాస్టల్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రూల్కి సంబంధించిన క్రమశిక్షణలో భాగమని తెలిపారు. హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, ఇతర సభ్యులు దీన్ని బాధ్యతరాహిత్యమైన చర్యగా పేర్కొంటూ తీవ్రంగా ఖండిస్తున్నామని నోటీసులో పేర్కొంది. అలాగే ఇలాంటి చర్య హాస్టలోని విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, అందువల్ల ఇలాంటి ఆకస్మిక చర్యలను మానుకోవాలని రాహుల్కి సూచిస్తూ యూనివర్సిటీ నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండగా గత శుక్రవారం రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో మెన్స్ పురుషుల హాస్టల్ని సందర్శించి..అక్కడ వారితో సంభాషించడమే గాక కలిసి భోజనం చేశారు. ఇదికాస్త సీరియస్ అంశంగా మారీ డీల్లీ యూనివర్సిటీ అధికారులు ఫైర్ అవ్వుతూ నోటీసులు పంపేందుకు దారితీసింది. (చదవండి: ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ ఆకస్మిక పర్యటన! నోటీసులు పంపుతామని వార్నింగ్) -
ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ సడెన్ ఎంట్రీ! నోటీసులు పంపుతామని వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ క్యాంటిన్లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. దీంతో మండిపడ్డ ఢిల్లీ యూనివర్సిటీ ఆయనకు నోటీసులు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి రాహుల్ గాంధీకి ఈ విషయమై మంగళవారం లేదా బుధవారం నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న మెన్స్ హాస్టల్ను రాహుల్ శుక్రవారం సందర్శించి, అక్కడ కొంతమంది విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడే వారితోపాటు ఆయన భోజనం కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దీన్ని సహించం.. అంటూ రాహుల్కి నోటీసులు పంపుతామని చెప్పారు. ఆయన క్యాంపస్లో అనధికారికంగా పర్యటించారని, ఆయన లోపలికి ప్రవేశించేటప్పుడూ చాలామంది విద్యార్థులు భోజనం చేస్తున్నారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అన్నారు. ఇలాంటి ఘటనను పునరావృతం చేయకుండా ఉండాలని, అలాగే విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దని చెప్పారు. నిజానికి ఈ ఘటన విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, ఇలాంటి విషయాల్లో నాయకులు కచ్చితంగా ప్రోటోకాల్ అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలాఉండగా రాహుల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం యూనివర్సిటీపై ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ విద్యార్థి విభాగం స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఆరోపించింది. ఐతే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేదని, ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయమని అన్నారు. -
సాయిబాబా కేసును మరోసారి విచారించండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రోఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాను నిర్ధోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టును బుధవారం ఆదేశించింది. ఈ మేరకు నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఎమ్ ఆర్ షా, సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. గతంలో నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు ఇప్పటికే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నందున సముచిత ప్రయోజనాల దృష్ట్యా మరో బెంచ్ అన్ని కోణాల్లో ఒకే విధంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు దాఖలైన అప్పీల్ను విచారించిన సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. గతేడాది అక్టోబర్ 15న చట్ట వ్యతిరే కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) కింద.. సాయిబాబా ఇతరులపై ప్రాసిక్యూషన్ చెల్లుబాటు కాదని కొట్టేసిన బాంబే హైకోర్టు.. వాళ్లను తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ట్రయల్ కోర్టుల తీర్పు ప్రకారం దోషులుగా నిర్థారించిన వారి నేరాల తీవ్రతను బాంబే హైకోర్టు పరిగణలోనికి తీసుకోలేదని అభిప్రాయపడింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా హైకోర్టు అభ్యంతరకరమైన తీర్పు ఇచ్చిందని, దీనిపై సమగ్ర పరిశీలన అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, ఈ కేసుకి సంబంధించిన యూఏపీఏ కింద గడ్చిరోలి కోర్టులోని విచారణ ప్రకియను చెల్లదని పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ అక్టోబర్ 14న ఈ కేసులో జీవిత ఖైదు పడిన సాయిబాబాను విడుదల చేసింది. అలాగే ఈ కేసుకి సంబంంధించిన మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఆరో నిందితుడు 2022లో చనిపోయాడు. (చదవండి: బీజేపీ యువనేత దారుణ హత్య.. వాళ్ల పనే అని కమలం పార్టీ ఎంపీ ఫైర్..) -
ఐదు దశాబ్దాల తర్వాత డిగ్రీ పట్టా అందుకున్న సీఎం.. కారణం ఏంటో తెలుసా?
సాధారణంగా డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు పట్టాను అందుకుంటారు. ఇది మూమూలు విషయమే కానీ అదే పట్టాను డిగ్రీ పూర్తి చేసిన 50 ఏళ్ల తర్వాత అందుకుని వార్తల్లో నిలిచారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆయన డిగ్రీ పట్టాను అందుకోవడం వెనుక ఓ కారణం కూడా ఉందంటున్నారు హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఆయన తన గ్రాడ్యుయేషన్ ఢిల్లీ యూనివర్శిటిలో ఐదు దశాబ్దాల క్రితమే (1972) పూర్తి చేశారు. అయితే ఇటీవలే ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ నుంచి డిగ్రీ పట్టాను అందుకున్నారు ఖట్టర్. దీనిపై ఆయన మాట్లాడుతూ.. "నేను మఖ్యమంత్రి అయిన తర్వాత నా ప్రాథమిక పాఠశాల, హైస్కూల్, రోహ్తక్లో ఉన్న కాలేజీకి వేళ్లాను. కానీ ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లడం మాత్రం కుదరలేదు. అందుకే ఇన్నేళ్లుగా పట్టాను తీసుకోలేకపోయాను. ఈ యూనివర్శిటీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది, ఇక్కడి నుంచే దేశానికి సేవ చేయాలని స్ఫూర్తి పొందాను" అని సీఎం వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు సందేశం ఇస్తూ.. బాల్యంలోనే విద్యార్థులు సరైన దిశను ఎంచుకోవాలని.. భవిష్యత్లో ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవాలని సూచించారు. యువత లక్ష్యాలు చిన్నవిగా కాకుండా పెద్దవిగా ఉండాలని, తద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఆయుధాలను ఎలా తయారు చేయాలో సైన్స్ నేర్పుతుందని, అయితే వాటిని తెలివిగా ఉపయోగించకపోతే వినాశనానికి కారణమవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కల్చరల్ కౌన్సిల్ చైర్పర్సన్, పీఆర్ఓ అనూప్ లాథర్ రచించిన “కాల్ ఔర్ తాల్” పుస్తకాన్ని సీఎంకు అందజేశారు. ఈ పుస్తకంలో హర్యాన్వి జానపద సంస్కృతికి సంబంధించిన 150 పాటలు ఉన్నాయి. చదవండి: ఐటీ జాబ్ కూడా తక్కువే!.. ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం నిషేధించిన మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు ప్రయత్నించడం టెన్షన్ వాతావరణానికి దారితీసింది. ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం, పోలీసు అధికారులు నిరాకరించారు. అయినా ఎన్ఎస్యూఐకి చెందిన విద్యార్థులు దీన్ని స్క్రీనింగ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో క్యాంపస్కు కరెంట్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. ఫలితంగా విద్యార్థులు యూనివర్సిటీ బయట ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా యువత భారీగా తరలివచ్చారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. 24 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. తాము స్కీనింగ్కు ఏర్పాట్లు చేశామని, ల్యాప్టాప్లు, ప్రొజెక్టర్లను ధ్వసం చేశారని విద్యార్థులు ఆరోపించారు. Students gathered for screening of BBC’s documentary, India: The Modi Question, at Arts Faculty, DU were stopped by police and security personnel.#BBC #BBCDocumentary #IndiaTheModiQuestion #DU #ArtsFaculty #NorthCampus #DelhiUniversity pic.twitter.com/WwJQEGebS3 — Chirag Jha (@iChiragJha) January 27, 2023 అటు అంబేడ్కర్ యూనివర్సిటీలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు విఫలయత్నం చేశారు. దీనికి కూడా కరెంటు సరఫరా నిలిపివేశారు. ఫలితంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ రెండు యూనివర్సిటీల్లో ఎలాంటి వీడియోలు ప్రదర్శించడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. అయినా వారు మెబైల్ ఫోన్లలో చూడాలనుకుంటే వారి విచక్షణకే వదిలేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు వీడియోల డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఇది దురుద్ధేశపూర్వకంగా ఉందని కేంద్రం బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్లో ఈ వీడియో లింకులను బ్లాక్ చేసింది. అయినా కొన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థులు ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ జేఎన్టీయూ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఈ వీడియో స్క్రీనింగ్కు ప్రయత్నించగా.. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చదవండి: రాహల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్! కేవలం కిలోమీటర్ తర్వాతే.. -
ఫిమేల్ ఆర్జే: అహో... అంబాలా జైలు రేడియో!
అక్కడ ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతోంది. ‘మీ ముందు మైక్ ఉన్నట్లు పొరపొటున కూడా అనుకోకూడదు. మీ స్నేహితులతో సహజంగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలి! భవ్యా... ఇప్పుడు నువ్వు ఆర్జేవి. నీకు ఇష్టమైన టాపిక్పై మాట్లాడు...’ భవ్య మైక్ ముందుకు వచ్చింది. ‘హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవ్యను. ప్రతి ఒక్కరికీ జ్ఞాపకాలు ఉంటాయి. నాకు ఎప్పుడూ నవ్వు తెచ్చే జ్ఞాపకం ఒకటి ఉంది. మా గ్రామంలో సంగ్రామ్ అనే ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఎవరికో ఒకరికి జాగ్రత్తలు చెబుతూనే ఉండేవాడు. అయితే అందరికీ జాగ్రత్తలు చెబుతూనే తాను పొరపాట్లు చేసేవాడు. ఒకరోజు వర్షం పడి వెలిసింది. ఎటు చూసినా తడి తడిగా ఉంది..కాస్త జాగ్రత్త సుమా! అని ఎవరికో చెబుతూ ఈ సంగ్రామ్ సర్రుమని జారి పడ్డాడు. అందరం ఒకటే నవ్వడం! ఒకరోజు సంగ్రామ్ ఏదో ఫంక్షన్కు వచ్చాడు. ఎవరికో చెబుతున్నాడు... వెనకా ముందు చూసుకొని జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇది అసలే కలికాలం...అని చెబుతూ, తన వెనక కుర్చీ ఉందన్న భ్రమలో కూర్చోబోయి ధబాలున కిందపడ్డాడు!’ ....ఆ ఆరుగురు మహిళా ఆర్జేలు, హాస్యసంఘటనలను ఆకట్టుకునేలా ఎలా చెప్పాలనే విషయంలో కాదు, శ్రోతలు కోరుకున్న పాట ప్లే చేసేముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ‘సత్యమైన జ్ఞానమే ఆత్మజ్ఞానం’లాంటి ఆధ్యాత్మిక విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఎలా సులభంగా చెప్పాలి... ఇలా ఎన్నో విషయాలలో ఒక రేడియోకోసం ఆ ఆరుగురు మహిళలు శిక్షణ తీసుకున్నారు. అయితే ఆ రేడియో మెట్రో సిటీలలో కొత్తగా వచ్చిన రేడియో కాదు, ఆ మహిళలు జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు అంతకంటే కాదు. అది అంబాల జైలు రేడియో. ఆ ఆరుగురు మహిళలు... ఆ జైలులోని మహిళా ఖైదీలు. హరియాణాలోని అంబాల సెంట్రల్ జైలులో ఖైదీల మానసిక వికాసం, సంతోషం కోసం ప్రత్యేకమైన రేడియో ఏర్పాటు చేశారు. ఆరుగురు మగ ఆరేజే (ఖైదీలు)లు ఈ రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిక మహిళల వంతు వచ్చింది. రేడియో కార్యక్రమాల నిర్వహణ కోసం ఆరుగురు మహిళా ఖైదీలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో ‘ఆర్జే’గా విధులు నిర్వహించనున్నారు. దిల్లీ యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తిక నందా ఈ ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. ‘ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టడానికి, మనం ఒక కుటుంబం అనే భావన కలిగించడానికి ఈ రేడియో ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది నందా. ఈ మాట ఎలా ఉన్నా మహిళా ఆర్జేల రాకతో ‘అంబాల జైలు రేడియో’కు మరింత శక్తి, కొత్త కళ రానుంది! -
నియామకాల వివాదం : వర్సిటీ వీసీపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : వర్సిటీ నియామకాల్లో వివాదానికి సంబంధించి ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ యోగేష్ త్యాగిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులపై సస్సెండ్ చేసినట్టు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. యూనివర్సిటీ నియామకాలకు సంబంధించి వివాదంపై వీసీపై దర్యాప్తునకు అనుమతించాలని గతవారం విద్యామంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై మంత్రిత్వ శాఖ ఆరోపణల నేపథ్యంలో వీసీపై విచారణకు రాష్ట్రపతి మంగళవారం రాత్రి ఆమోదం తెలిపారు. పదవిలో ఉండగా విచారణను ప్రభావితం చేస్తారని పేర్కొంటూ విచారణ ముగిసే వరకూ వీసీని సస్సెండ్ చేస్తున్నట్టు విద్యామంత్రిత్వ శాఖ వర్సిటీ రిజిస్ర్టార్కు రాసిన లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ప్రొఫెసర్ పీసీ జోషీ వీసీగా బాధ్యతలు చేపడతారని తెలిపింది. కాగా ఆరోగ్య సమస్యలతో ఈ ఏడాది జులైలో వీసీ యోగేష్ త్యాగి ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సెలవులో ఉన్నారు. త్యాగి తిరిగి విధుల్లో చేరేవరకూ ప్రొఫెసర్ పీసీ జోషీని ఇన్చార్జ్గా జులై 17న ప్రభుత్వం నియమించింది. ఇక గతవారం జోషీని ప్రో వీసీగా తొలగించి ఆయన స్ధానంలో గీతా భట్ను త్యాగి నియమించడంతో వివాదం నెలకొంది. మరోవైపు ప్రొఫెసర్ జోషి ఇటీవల నూతన రిజిస్ర్టార్గా వికాస్ గుప్తాను నియమించగా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించింది. అయితే అదే రోజు తాత్కాలిక రిజిస్ర్టార్గా పీసీ ఝాను నియమిస్తూ త్యాగి ఉత్తర్వులు జారీ చేశారు. వీసీ, ప్రో వీసీల మధ్య అధికార వివాదంలో విద్యా మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని త్యాగి సెలవులో ఉన్నందున ఆయన చేపట్టిన నియామకాలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. చదవండి : గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు -
ఇంతకీ తన్మే నివేదిత, కళ్యాణీ ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్లో అరారియా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి ఇద్దరు సామాజిక కార్యకర్తల సహకారంతో జూలై 7న పోలీసు స్టేషన్కు వెళ్లి, కొన్ని రోజుల క్రితం నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపారని ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన కనిపించక పోవడంతో ఆ యువతి, సామాజిక కార్యకర్తలు తన్మే నివేదిత, కల్యాణిలతో కలిసి దిగువ కోర్టును జూలై పదవ తేదీన ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం గురించి కోర్టులో ఆమె, జడ్జీకి వివరించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు ఉద్యోగి ఆమె వద్దకు వచ్చి, ఆ వాంగ్మూలంపై సంతకం చేయాల్సిందిగా కోరారు. తనకు చదువు రాదని, ఆ వాంగ్మూలాన్ని చదివి వినిపించాల్సిందిగా ఆమె నేరుగా జడ్జీనే కోరారు. అందుకు ఆగ్రహించిన ఆ జడ్జీ ఆమెను దూషించినట్లు ఆమె మీడియా ముఖంగా ఆరోపించారు. ఇదంతా జరిగిన అరగంటకు కోర్టు ఆదేశం మేరకు మూకుమ్మడి అత్యాచారం బాధితురాలిని, ఆమెకు అండగా నిలిచిన ఇద్దరు సామాజిక కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, అరారియాకు 240 కిలోమీటర్ల దూరంలోని సమస్థిపూర్ జైలుకు తరలించారు. వారిపై కోర్టు కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని, ప్రభుత్వాధికారుల విధుల నిర్వహణకు అడ్డు తగిలారంటూ వారిపై నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేశారు. ఆ యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు యువకులను అరెస్ట్ చేసేందుకుగానీ, కనీసం వారెవరో గుర్తించేందుకుగానీ పోలీసులు నేటి వరకు ప్రయత్నించలేదు. దానికి సంబంధించి కోర్టు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఈ యువతి ఉదంతంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో జూలై 18వ తేదీన మరో దిగువ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తన్మే నివేదిత, కల్యాణిలు మాత్రం నేటి వరకు కూడా విడుదల కాలేదు. వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని వారి మిత్రులు మీడియా ముఖంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకు వారెవరు ? తన్మే నివేదిత, కళ్యాణీ ఈ యువతీ యువకులు ‘జన్ జాగారణ్ శక్తి సంఘటన్’కు చెందిన సామాజిక కార్యకర్తలు. వారివురు మరో ముగ్గురితో కలిసి అరారియా ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. జన్ జాగారణ్ శక్తి సంఘటన్ ఉత్తర బీహార్లో కార్మికుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం కషి చేస్తోంది. నిమ్న వర్గాల అభ్యున్నతి, వారికి మెరుగైన వైద్య సదుపాయంతోపాటు మహిళా సాధికారికత కోసం కృషి చేస్తోన్న వారిగా తన్మే, కల్యాణీలకు మంచి గుర్తింపు ఉంది. 30 ఏళ్ల తన్మే కేరళలో పుట్టి పెరిగారు. ఆయన అమెరికాలో ‘ఎకాలోజీ అండ్ సోసియాలోజీ’లో పట్టభద్రలు. ఆయన భారత్కు వచ్చి గత పదేళ్లుగా వివిధ సామాజిక రంగాల్లో పనిచేశారు. ఆయన ‘క్రాంతి’ సంఘంలో చేరి ముంబైలోని వేశ్య పిల్లల సాధికారికత కోసం పాటుపడ్డారు. 2014లో ఢిల్లీ వెళ్లి అక్కడి అంబేడ్కర్ యూనివర్శిటీలో ‘డెవలప్మెంట్ స్టడీస్’లో పీజీలో చేరారు. ఆయన ఎమ్మే చదువుతోనే కొంత మంది యువతీ, యువకులతో బిహార్లోని అరారియాకు వచ్చి గ్రామీణ మహిళల అభ్యున్నతి కోసం వర్క్షాపులు నిర్వహించారు. 2016లో ఆయనకు జన్ జాగారణ్ శక్తి సంఘటన్తో సానిహిత్యం ఏర్పడి అందులో చేరారు. సంగీతం, సాహిత్యం, చిత్రకళలో మంచి ప్రావీణ్యం ఉన్న తన్మే తన పాటలతో జనాన్ని ఆకట్టుకుంటారు. కళ్యాణీ పరిచయం ఢిల్లీ యూనివర్శిటీలో ‘మ్యాథ్స్, అంతర్జాతీయ సంబంధాలు’లో డిగ్రీ చదివిన కల్యాణి రెండేళ్ల క్రితం జన్ జాగారణ్లో చేరారు. ఆరోగ్య కార్యక్రమాల్లో ఆమెకు అమితాసక్తి పేదలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆమె తన్మేతో పాటు మరో ముగ్గురితో కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. వారి ఇద్దరి ప్రాణాలకు ముప్పుందని, వారి విడుదల కోసం పట్నా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశామని జన్ జాగారణ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కామయాని స్వామి మీడియాకు తెలిపారు. రేపటి వరకు పట్నా హైకోర్టుకు సెలవులు అవడం వల్ల అప్పీలు ఎప్పుడు విచారనకు వస్తుందో తెలియడం లేదని ఆయన చెప్పారు. -
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: కోమల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనతో తనకు సంబంధం లేదని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని కోమల్ శర్మ పేర్కొన్నారు. దాడికి సంబంధించిన వీడియోలో కనిపించింది తాను కాదంటూ జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించారు. జనవరి 5న జేఎన్యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్తో పాటు మరో 37 మందిని అనుమానితులుగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీసీటీవీ పుటేజీలు, వాట్సప్లో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా మరికొంతమందిని పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా.. ముసుగులు ధరించి హాస్టల్లో దాడికి పాల్పడిన ఓ యువతిని.. ఢిల్లీ యునివర్సిటీకి చెందిన విద్యార్థిని కోమల్ శర్మగా పోలీసులు ధృవీకరించారు. ఇందుకు సంబంధించిన వార్తలు, సదరు విద్యార్థిని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.(జేఎన్యూ హింస: ముసుగు ధరించింది ఆమేనా!?) ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించిన కోమల్ మాట్లాడుతూ.. ‘ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. నన్ను కావాలనే అందులో ఇరికించారు. దురుద్దేశంతో.. నన్ను చెడుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా పరిస్థితి అధ్వానంగా తయారైంది. బంధువులు, స్నేహితుల నుంచి అధిక సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ వీడియోలో మాస్క్ ధరించి ఉన్నది నేనే అని.. నా గురించి చెడుగా అనుకుంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జేఎన్యూ ఘటనపై ఓ జాతీయ మీడియా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఏబీవీపీకి చెందిన విద్యార్థులే దాడి చేసినట్టు వెల్లడయిన విషయం తెలిసిందే. అక్షత్ ఆవాస్థీ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ఆరోజు రాత్రి జరిగిన ఘటనకు నాయకత్వం వహించింది తానేనని వీడియో ముందు ఒప్పుకున్నాడు. అంతేకాదు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై ప్రతీకారం తీర్చుకునేందుకు హాస్టల్ బయట నుంచి కొంతమంది వ్యక్తులను లోపలికి తీసుకెళ్లి ఈ దాడికి పాల్పడ్డటు కూడా అంగీకరించాడు. ఆయితే అవాస్థీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏబీవీపీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
ఆ నలుగురే.. ఈ నలుగురు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చరిత్రలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కళాశాలలో లా విద్యను అభ్యసించే రోజుల్లో క్లాస్మేట్స్గా ఉన్న నలుగురు విద్యార్థులు నేడు దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమితులై సరికొత్త రికార్డును సృష్టించారు. ఈనెల 19న సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులైన విషయం తెలిసిందే. వీరిలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్రాయ్లు ఉన్నారని న్యాయశాఖ ప్రకటించింది. వీరు త్వరలోనే ప్రమాణం చేయనున్నారు. అయితే ఎస్ఆర్ భట్, జస్టిస్ హృతికేశ్రాయ్లు.. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న డీవై చండ్రచూడ్, ఎస్కే కౌల్లు కాలేజీ నాటి స్నేహితులు. ఒకే ఏడాది లా పట్టా పుచ్చుకున్నారు. వీరి స్నేహ ప్రయాణం 37 ఏళ్ల నాటి నుంచి కొనసాగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీలో వీరు నలుగురు 1982లో నుంచి ఒకే ఏడాది లా పరీక్షలో ఉత్తీర్ణులైనారు. వీరిలో డీవై చండ్రచూడ్, ఎస్కే కౌల్ ముందుగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కాగా.. తాజాగా ఎస్ఆర్ భట్, జస్టిస్ హృతికేశ్రాయ్లకు కొంత ఆలస్యంగా ఈ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని వీరి నలుగురికి కామన్ ఫ్రెండ్ అయిన శివరామ్ సింగ్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఈ పరిణామం చాలా అరుదైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు యూనివర్సిటీ రోజుల్లో వీరంతా ముందే బెంచ్లోనే కూర్చునేవారని.. తాజాగా సుప్రీంకోర్టు బెంబ్లోనూ (న్యాయమూర్తులుగా) సీట్లు పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వీరిలో డీవై చండ్రచూడ్ 1959లో జన్మించగా.. 2000లో తొలిసారి ముంబై హైకోర్టు అడిషనల్ జడ్జ్గా నియమితులైనారు. ఆ తరువాత 2013లో ఆలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించి అనంతరం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టాపొందిన జస్టిస్ ఎస్ఆర్ భట్ 1958లో జన్మించారు. 1982లో ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2004లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. జస్టిస్ హృతికేరాయ్ 1960లో జన్మించి.. 1980లో లా పట్టా పొందారు. 2006లో గుజరాత్ అడీషనల్ జడ్జ్గా నియమితులై.. 2008లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం గౌహతి, కేరళ హైకోర్టులకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2018లో కేరళ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. జస్టిస్ సజయ్ కృష్ణకౌల్.. తొలుత ఢిల్లీ హైకోర్టులో అడీషనల్ జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. అక్కడి నుంచి 2013లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు. 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. దీంతో నాటి స్నేహితులు నేడు సుప్రీంకోర్టు బెంచ్కు ప్రాతినిథ్యం వహించనున్నారు. -
కాలేజి పాపల బస్సు...
రద్దీ బస్స్టాప్. ఆ బస్స్టాప్లో హీరో, తన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు. అమ్మాయిలు ఎక్కువగా ఉన్న బస్ వచ్చినా, లేడీస్ కాలేజీకు వెళ్లే బస్లు వచ్చినా ఎక్కి సరదా వేషాలు వేస్తుంటారు. ఇది చాలా సినిమాల్లో కనిపించే సన్నివేశమే. ‘విక్రమార్కుడు’ సినిమాలో అయితే ఏకంగా ‘కాలేజి పాపల బస్సు..’ అనే పాట కూడా ఉంది. ఇలా బస్సులో మిస్సుల కోసం అమితాబ్ బచ్చన్ ఎదురు చూసేవారట. ‘‘అందమైన అమ్మాయిల కోసం బస్స్టాప్లో ఎదురు చూసేవాళ్లం’’ అని యవ్వనం తాలూకు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు అమితాబ్. ‘‘నేను ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్న రోజులవి. కాలేజీకి రోజూ బస్లో వెళ్లేవాణ్ణి. మా ఏరియా నుంచి నా కాలేజీకి వెళ్లే దారిలో కొన్ని లేడీస్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ బస్ ఎక్కే అమ్మాయిల్ని చూడటానికి బాగా ఎదురుచూసేవాళ్లం. ఆ స్టాప్ తొందరగా రావడానికైనా బస్ ఫుల్ స్పీడ్గా వెళ్లాలి అనుకునేవాళ్లం’’ అని గతాన్ని షేర్ చేసుకున్నారు. అంతేకాదు యూనివర్శిటీ చదువు పూర్తయిన తర్వాత ఆ ఏరియాకు చెందిన ఓ అమ్మాయిని కలుసుకున్నట్టు తెలిపారు. ఆమె చెప్పిన విషయం విని అమితాబ్ ఆశ్చర్యపోయారట. ‘‘మీరు కాలేజీకి వెళ్లే దార్లోనే ఓ బస్ స్టాప్లో మీ కోసం ఎదురుచూసేదాన్ని. నేను, మా ఫ్రెండ్ ప్రాణ్ అక్కడే వేచి చూసేవాళ్లం. మీరు వచ్చినప్పుడల్లా మనసులో ఒకటే ఆలోచన.. ‘ప్రాణ్ (ప్రాణం) పోయినా ఫర్వాలేదు. బచ్చన్ వెళ్లిపోకూడదు’ అనుకునేదాన్ని’’ అంటూ ఆమె ఫ్లాష్బ్యాక్ని గుర్తు చేసుకున్నారని అమితాబ్ పేర్కొన్నారు. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవితోపాటు మరో రెండు పదవులు కైవసం చేసుకుంది. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో ఏబీవీపీకి చెందిన అశ్విత్ దాహియ ఎన్ఎస్యూఐ అభ్యర్థి చెత్న త్యాగిపై 19వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత కొన్ని సంవత్సరాల ఎన్నికలు పరిశీలిస్తే ఇదే అత్యధిక మెజార్టీ అని ఏబీవీపీ జాతీయ మీడియా కన్వీనర్ మోనికా చౌదరి తెలిపారు. మహిళా సాధికారత కోసం ‘మిషన్ సాహసి’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏబీవీపీకి చెందిన ప్రదీప్ తన్వార్ ఉపాధ్యక్షుడిగా, శివాంగి ఖర్వాల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలో ఆ సంస్థ మద్దతుదారులు భారీ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఒక సెక్రటరీ పదవిని గెలుచుకుంది. ఆ సంస్థ అభ్యర్థి అశిష్ లంబా ఏబీవీపీ అభ్యర్థి యోగి రతీపై విజయం సాధించారు. రామ్జాస్ కాలేజ్లో అల్లర్లు జరిగినపుడు యోగి అధ్యక్షుడిగా ఉన్నారని, అల్లర్లకు తాము వ్యతిరేకమని ఈ తీర్పుతో విద్యార్థులు స్పష్టం చేశారని ఎన్ఎస్యూఐ తెలిపింది. గురువారం జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో 39.90 శాతం ఓటింగ్ నమోదైంది. గత సంవత్సరం ఓటింగ్ శాతం (44.46)తో పోలిస్తే ఇది దాదాపు నాలుగు శాతం తక్కువ. మొత్తం నాలుగు స్థానాలకు 16 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో నలుగురు మహిళా అభ్యర్థులున్నారు. 1.3లక్షల మంది ఓటర్లున్నారు. వామపక్ష పార్టీల మద్దతు సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఒక్క సీటూ గెలవలేకపోయింది. గతంతో పోలిస్తే తమ ఓటింగ్ శాతం పెరిగినందుకు ఆ సంస్థ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. -
ఏపీ విద్యార్థులకు న్యాయం చేయండి...
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటర్బోర్డు గ్రేడింగ్ విధానంతో ఢిల్లీ యూనివర్సీటీలో ఏపీ విద్యార్థులు పడుతున్న కష్టాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీ ప్రవేశాల్లో ఏపీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన శనివారం ఆ వర్సిటీ ఉపకులపతికి లేఖ రాశారు. ఏపీలో మార్కుల విధానానికి బదులు పర్సంటేజీ ప్రకారం గ్రేడింగ్ పాయింట్లు ప్రవేశపెట్టారన్నారు. ఈ విధానంలో వచ్చిన గ్రేడ్లను 10తో కాకుండా వర్సిటీ కేవలం 9.5తో గుణిస్తుండడంతో ఏపీ విద్యార్థులు సీట్లు కోల్పోతారని పేర్కొన్నారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని వీసీని మంత్రి కోరారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీ వర్సిటీ, దాని అనుంబంధ కళాశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంటర్లో మార్కులకు బదులుగా రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన సీజీపీఏ గ్రేడ్ల విధానం వల్ల ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో యూజీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొనే ఏపీ విద్యార్థుల గ్రేడ్ పాయింట్లను 10తో గుణించి వచ్చే శాతాన్ని అడ్మిషన్ల ప్రక్రియలో పరిగణించాలని ఇంటర్ బోర్డు విద్యార్థులకు జారీ చేసిన మెమోలో స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ వర్సిటీ మాత్రం తమకు ఏపీ ఇంటర్ బోర్డు నుంచి సమాచారం లేదంటూ విద్యార్థుల గ్రేడ్ పాయింట్లను 10తో కాకుండా 9.5తోనే గుణిస్తామంటూ స్పష్టం చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతామని, కోరుకున్న కాలేజీలో ఎంచుకున్న కోర్సులో సీటు దక్కదని వాపోతున్నారు. సోమవారం మధ్యాహ్నంతో మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని అడ్మిషన్ల కోసం ఢిల్లీ వచ్చిన సుమారు 550 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై శనివారం ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ను కలసి సమస్యను వివరించారు. దీంతో ఆయన ఢిల్లీ వర్సిటీ తీరును వివరిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. -
కోటా కోసం 16,000 సీట్ల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కోటా అమలు కోసం ఢిల్లీ యూనివర్సిటీ కసరత్తు చేపట్టింది. ఈబీసీ కోటాను వర్తింపచేసేందుకు 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో అదనంగా 16,000 సీట్లను పెంచాలని ఢిల్లీ యూనివర్సిటీ నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మొత్తం సీట్లలో 25 శాతం పెరుగుదల ఉండాలని కేంద్ర మానవ వనురుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ అడ్మిషన్లు 56,000 కాగా, పీజీ అడ్మిషన్ల కింద 9500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పది శాతం కోటాను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ధేశించడంతో ఆయా విద్యాసంస్ధలు మౌలిక వసతులను మెరుగుపరచకుండానే సీట్ల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక ఐఐటీ ఢిల్లీ, జేఎన్యూలు ఇప్పటికే తమ సీట్ల సంఖ్యను వరుసగా 590, 346 సీట్లకు పెంచాయి. ఈ విద్యా సంస్ధల్లో హాస్టల్ వసతి పరిమితంగా ఉండటంతో పెరిగే విద్యార్ధులకు వసతి కల్పించడంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్ధల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే జనరల్ కేటగిరీలో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ను అమలు చేస్తామని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సిలబస్ నుంచి ఐలయ్య పుస్తకం తొలగింపు?
సాక్షి, న్యూఢిల్లీ: పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి ప్రొ.కంచ ఐలయ్య రాసిన పుస్తకాలను తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ సిఫార్సుచేసింది. విద్యాపర విషయాల్లో దళిత్ అనే పదం స్థానంలో ‘షెడ్యూల్డ్ కులం’ను వాడాలని పేర్కొంది. విద్యా విషయాలపై వర్సిటీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా 9 పీజీ కోర్సుల సిలబస్పై చర్చించామని ప్రొ.హన్స్రాజ్ సుమన్ తెలిపారు. ప్రొ.కంచ ఐలయ్య రాసిన ‘వై ఐ యామ్ నాట్ ఎ హిందు’, ‘పోస్ట్-హిందూ ఇండియా’లో వివాదస్పద విషయాలు ఉన్నందునే వాటిని సిలబస్ నుంచి తప్పించాలని వర్సిటీకి సూచించినట్లు చెప్పారు. అంబేడ్కర్ రచనల్ని సిలబస్లో చేర్చాలని సిఫార్సు చేశారు. స్టాండింగ్ కమిటీ సిఫార్సు దురదృష్టకరమని ఐలయ్య వ్యాఖ్యానించారు. తన పుస్తకాలు పలు విదేశీ, దేశీ యూనివర్సిటీల సిలబస్లలో భాగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. -
డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) అధ్యక్ష పదవితోపాటు మరో రెండు కీలక పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ ఒక్క స్థానానికి పరిమితం కాగా, వామపక్ష ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఐ) బలపరిచిన ఆప్ అనుబంధ ఛాత్ర విద్యార్థి సంఘర్‡్ష సమితి ఖాతా తెరవలేదు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్గా ఏబీవీపీకి చెందిన అంకివ్ బసోయా, వైస్ప్రెసిడెంట్గా ఏబీవీపీకే చెందిన శక్తి సింగ్, జాయింట్ సెక్రటరీగా జ్యోతి విజయం సాధించారు. సెక్రటరీగా ఎన్ఎస్యూఐకి చెందిన ఆకాశ్ చౌదరి 9,199 ఓట్లతో గెలుపొందగా.. ఈ పోస్టుకు గాను నోటాకు 6,810 మంది విద్యార్థులు ఓటేయడం గమనార్హం. ఈ నెల 13వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో 23 మంది బరిలో నిలవగా పోలైన ఓట్లు 44.46 శాతం మాత్రమే. -
జామర్లతో అక్రమాలకు ఢిల్లీ వర్సిటీ చెక్
సాక్షి, హైదరాబాద్ : ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశ పరీక్షలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు ఈ ఏడాది పరీక్ష గదుల్లో ఫోన్ జామర్స్ను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఎంట్రన్స్ పరీక్షల్లో అవకతవలకు సంబంధించి ఎనిమిది ఎఫ్ఐఆర్లను వర్సిటీ నమోదు చేసిన క్రమంలో ఈ ఏడాది అత్యంత పకడ్బందీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు సాంకేతిక సమస్యలతో సరైన సమాధానాలు రాయలేదని అభ్యర్ధులు చెప్పేందుకు అవకాశం లేకుండా పరీక్ష అనంతరం ఆన్లైన్ టెస్ట్ల్లో తాము రాసిన సమాధానాలను రాసేలా రెస్పాన్స్ షీట్స్ను ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 89 కేంద్రాల్లో ప్రత్యేక పరిశీలకులను ఢిల్లీ యూనివర్సిటీ నియమించింది. ఇక జామర్లను ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ నుంచి తెప్పించామని, వీటి గురించి తాము ముందస్తుగా వెల్లడించలేదని, పరీక్షలు నిర్వహించే ముందే ప్రణాళికాబద్దంగా వీటిని పరీక్షించామని వర్సిటీ అధికారి వెల్లడించారు. కాగా గత ఏడాది అభ్యర్ధులు సరైన సమాధానాలు రాబట్టేందుకు పరీక్ష హాల్ వెలుపల కొందరితో వాట్సాప్ ఫీచర్తో కనెక్ట్ అయినట్టు తమ విచారణలో వెల్లడైందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. కొందరు దళారులు విద్యార్ధులను రూ 50,000 నుంచి రూ లక్ష వరకూ డిమాండ్ చేస్తూ పరీక్షలు పాసయ్యేలా తాము పూర్తిగా సహకరిస్తామని ప్రలోభపెడుతున్నారని, ఇలాంటి మోసాలకు జామర్ ద్వారా చెక్ పెట్టామని అధికారులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ చేపట్టామని ఢిల్లీ వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ వినయ్ గుప్తా చెప్పారు. జామర్లను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల్లో పర్మనెంట్ లెక్చరర్లను నియోగించారు. -
కాఫీకి రా.. లేకపోతే ఫెయిల్ చేస్తా..!
సాక్షి, న్యూఢిల్లీ : భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీల్లో అడుగుపెట్టిన విద్యార్థినిలకు వేధింపులు తప్పడం లేదు. దేశంలో అత్యన్నత విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)లో విద్యార్థినిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో డీయూలో 28 లైంగిక వేధింపుల కేసులు నమోదైయ్యాయి. ఈ కేసులన్నీ కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లపై నమోదు కావడం గమన్హారం. విద్యాబుద్దులు నేర్పించి విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చాల్సిన అధ్యాపకులే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యవతి తనపై ప్రొఫెసర్ వేధింపులకు పాల్పడున్నారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో కాఫీకి రాకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేసి, హాజరుశాతం తగిస్తానంటూ వేధిస్తున్నారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునేందుకు అంతర్గత ఫిర్యాదులు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ కమిటీలో ముగ్గురు అధ్యాపకులు, ఓ మహిళ ఫ్రొఫెసర్, ముగ్గురు విద్యార్థులు ఉండాలనేది నిబంధన. కానీ అధికారులు అవేవీ పట్టించుకోవట్లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. కాగా గతంలో కూడా అనేక యూనివర్సిటీల్లో లైంగిక వేధింపుల కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు బాలికలపై అనేక దాడులు జరుగుతున్నాయని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యాపకులను తీవ్రంగా శిక్షించాలని విద్యార్ధినులు డిమాండ్ చేస్తున్నారు. -
పాపులారిటీలో ఎల్పీయూకు 5వ ర్యాంకు
జలంధర్: పాపులారిటీ పరంగా దేశంలో ఢిల్లీ యూనివర్సిటీ అన్ని విద్యా సంస్థల్లోకెల్లా అగ్రస్థానంలో నిలిచింది. జలంధర్ కేంద్రంగా పనిచేస్తున్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి ఐదో స్థానం దక్కింది. ప్రముఖ విద్యా సంస్థలు, వర్సిటీలకు ర్యాంకులు ప్రకటించే అంతర్జాతీయ సంస్థ ‘యూనిర్యాంక్’ 2018 ఏడాదికి తాజాగా జాబితాను విడుదల చేసింది. 878 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులిచ్చింది. కాన్పూర్, మద్రాస్, బాంబే ఐఐటీలు వరుసగా 2, 3, 4 స్థానాలు పొందాయి. ఐఐటీ ఖరగ్పూర్కు ఆరు, ఐఐటీ ఢిల్లీకి 8వ ర్యాంకులు దక్కాయి. -
తండా బిడ్డ.. హస్తిన గడ్డ..!
హైదరాబాద్: ఇప్పటి వరకు ఢిల్లీని మ్యాప్లో చూడడమే గానీ.. ఎప్పుడూ వెళ్లని నిరుపేద విద్యార్థులు వారు. అలాంటిది అక్కడే ఉన్నత విద్య చదువుకునే అవకాశం రావడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. వీరంతా మారుమూల గ్రామాలు, తండాల్లో నివాసముండేవారే. వీరిలో చాలా మంది తల్లిదండ్రులు రోజు కూలీలే. 2018–19 విద్యా సంవత్సరానికి గాను ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ చదివేందుకు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 94 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత ఏడాది కేవలం 12 మందే సీట్లు సాధించగా ఈసారి 94 మందికి అవకాశం రావడం విశేషం. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల నుంచి ఎంపికైన 62 మందిలో 30 మంది బాలికలు కాగా, 32 మంది బాలురు ఉన్నారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలల నుంచి 32 మంది ఎంపిక కాగా అందులో 17 మంది బాలురు, 15 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఢిల్లీ వర్సిటీ అనుబంధ కళాశాలలైన హన్స్రాజ్, హిందూ, రామ్జాస్, మిరండా హౌజ్, కేశవ మెమోరియల్, కాలేజ్ ఆఫ్ ఒకేషనల్, ఎస్ఆర్సీసీ, శ్రీవెంకటేశ్వర, దౌలత్రామ్ వంటి ప్రఖ్యాత కళాశాల్లో సీట్లు పొందడం విశేషం. మాకెంతో గర్వంగా ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకులాల పుణ్యమా అని, ప్రవీణ్సార్ చలవతో మా పాప మానసకు ఢిల్లీలోని హిందూ కళాశాలలో చదువుకునే అవకాశం వచ్చింది. మాది ఖమ్మం జిల్లా టి.పాలెం మండలంలోని పిండిపోలు గ్రామం. రోజువారీ కూలీ చేసే మాకు ఇది ఎంతో గర్వంగా ఉంది. – ఉపేందర్ ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం బాగా చదివి ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. రామ్జాస్ కళాశాలలో బీఎస్సీ హానర్స్ మ్యాథ్స్లో సీటు సాధించా. నేను బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయాలన్నది నా తల్లిదండ్రుల కల. దాన్ని నెరవేరుస్తా. – సురేశ్నాయక్ చాలా సంతోషంగా ఉంది.. ఐఏఎస్ అధికారినై పేదలకు సేవ చేయాలన్నదే లక్ష్యం. మాది సూర్యా పేట జిల్లా కపూరియాతండాకు చెందిన నిరుపేద కుటుంబం. మిరండా హౌజ్లో బీఎస్సీ హానర్స్ బాటనీ కోర్సులో సీటు సాధించా. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా గురుకులాల చలవే. – స్వాతి -
వెంటపడ్డ విద్యార్థులపై చార్జ్షీటు
సాక్షి, న్యూఢిల్లీ : మద్యం సేవించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కారును వెంబడించిన నలుగురు ఢిల్లీ వర్సిటీ విద్యార్థులపై సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో విమానశ్రయం నుంచి ఇంటికి వెళ్తున్న ఇరానీని నలుగురు వెంబడించారు. దీంతో పోలీసులకు ఫోన్ చేసిన స్మృతి, తనను కొందరు యువకులు వెంబడిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించగా వారందరూ మద్యం సేవించినట్లు తేలింది. రిపోర్టుల నేపథ్యంలో నలుగురు విద్యార్థులపై పోలీసులు చార్జ్షీటు దాఖలు చేశారు. -
కిడ్నాపైన విద్యార్థి దారుణ హత్య
సాక్షి,ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీ యూనివర్సీటీకి చెందిన ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు వారం రోజుల తర్వాత హత్య చేశారు. విద్యార్థి కుటుంబాన్ని 50లక్షలు డిమాండ్ చేసిన దుండగులు.. డబ్బులు ఇవ్వకపోవడంతో అతడిని హత్య చేసి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని పడేశారు. పోలీసుల వివరాల ప్రకారం..21 ఏళ్ల ఆయుష్ నౌటియల్ ఢిల్లీలోని రామ్లాల్ ఆనంద్ కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత గురువారం ఇంటి నుంచి కాలేజీ వెళ్లిన అతడిని దుండగులు కిడ్నాప్ చేశారు. సాయంత్రం అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే ఆయుష్ తండ్రికి వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఆయుష్ కిడ్నాప్ చేశామని, 50 లక్షలు ఇస్తే వదిలేస్తామని డిమాండ్ చేయడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం దుండగులకు 10 లక్షలు ఇస్తామని చెప్పి వారు ఉండేచోటు కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆయుష్ ఆచూకీని కనుక్కోలేకపోయారు. చివరికి బుధవారం రాత్రి ద్వారకాలోని ఓ కాలువ వద్ద అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. తాము పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు దుండగుల ఆచూకీ కనిపెట్టలేకపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
మద్యం మత్తులో డ్రైవింగ్, ఇద్దరు మృతి
న్యూఢిల్లీ : మద్యం మత్తులో వాహనం నడిపి ఓ యువతి .... ఇద్దరు యువకుల మరణానికి కారణమయింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులు కూడా గాయపడ్డారు. వాయువ్య ఢిల్లీలోని ముఖర్జీనగర్లో ఆదివారం తెల్లవారు జామున 2.45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. నోయిడాలోని అమేథీ యూనివర్సిటీలో జరిగిన ఫెస్ట్లో పాల్గొన ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు, కారులో ఢిల్లీ యూనివర్సిటీకి బయలుదేరారు. కారు ఉడ్సన్ లైన్లోని సెంట్రల్ వెర్జ్కు చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి, పక్కనే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పోల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మరణించగా, గాయపడిన ముగ్గురు యువతుల్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారు అధిక వేగంతో ప్రయాణించడంతో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. యువతి మద్యం సేవించి వాహనం నడపటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకులను రితేశ్, సిదార్థ్లుగా గుర్తించారు. ఇద్దరు మృతికి కారణమైన యువతిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు
-
హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు
సాక్షి, న్యూఢిల్లీ : హోలీ వేడుకల పేరుతో విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటనలు దేశ రాజధానిలో చోటు చేసుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థినులపై కొందరు ఆగంతకులు వీర్యంతో నింపిన బెలూన్లను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి కథనం ప్రకారం... ఫిబ్రవరి 24వ తేదీన ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ యువతి అమర్ కాలేనీ మార్కెట్లోని ఓ కేఫ్కు వెళ్లింది. బైకులపై వచ్చిన ఐదుగురు యువకులు ఆమెపై బెలూన్లను విసిరారు. ఆపై హోలీ శుభాకాంక్షలు చెబుతూ అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయారు. హస్టల్కు వచ్చిన యువతి దుస్తులను పరిశీలించిన యువతికి అవి రంగులు కావని అర్థమైంది. ఈ వికృత చేష్టలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇక ఢిల్లీ యూనివర్సిటీకే చెందిన మరో యువతికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. హస్టల్ బయట నడుచుకుంటూ వెళ్తున్న తనపై కొందరు వ్యక్తులు బెలూన్లు విసిరారని... ఆపై రంగులు పూస్తూ అసభ్యంగా తాకినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యూనివర్సిటీ వద్ద పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. మరోవైపు హోలి వేడుకల నేపథ్యంలో ఢిల్లీలోని కాలేజీలు, హాస్టళ్ల వద్ద సెక్యూరిటీని అప్రమత్తంగా ఉండాలంటూ యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. -
యూనివర్సిటీలో వేధింపుల కలకలం
-
'అర్థం మారిన వందేమాతరం పేరు మాకొద్దు!'
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్శిటీకి అనుబంధంగా పనిచేస్తున్న దయాళ్ సింగ్ ఈవినింగ్ కళాశాల పేరును మార్చాలని నవంబర్ 17వ తేదీన కాలేజీ గవర్నింగ్ బాడీ నిర్ణయించింది. కాలేజీ పేరును 'వందేమాతరం మహా విద్యాలయం'గా మార్చాలని కాలేజీ గవర్నింగ్ బాడీ చైర్పర్సన్, లాయర్, బీజేపీ సభ్యుడు అమితాబ్ సిన్హా సూచించారు. కొంత మంది మాత్రమే ఈ పేరును వ్యతిరేకించారని, ఎక్కువ మంది సభ్యులు సమర్థించారని కళాశాల ప్రిన్సిపాల్ పవన్ కుమార్ శర్మ తెలిపారు. ఆయనతోపాటు కాలేజీ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు దివాకర్ యాదవ్లు పేరు మార్పు పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. వందేమాతరం లౌకికవాదమేనని వారు వాదిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందుకు, ఇప్పటికీ వందేమాతరం నినాదంకు అర్థం మారిపోయిందని, స్వాతంత్య్రానికి ముందు వందేమాతర గీతాన్ని అన్ని మతాల వారు గౌరవించారని, ఇప్పుడు దానికి అర్థమే మారిపోయిందని, మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఈ పదాన్ని, ఈ గీతాన్ని హిందూ శక్తులు ఉపయోగిస్తున్నాయని కాలేజీ గవర్నింగ్ బాడీలోని కొంత మంది సభ్యులు, అధ్యాపకులు, వామపక్ష విద్యార్థులు, విద్యావంతులు విమర్శిస్తున్నారు. పైగా పేరు మార్చడమంటే ప్రముఖ లౌకికవాది, విద్యావేత్త దయాళ్ సింగ్ను అవమానించడమేనని వారు వాదిస్తున్నారు. 'దయాళ్ సింగ్ లౌకిక వాది. ఆయన వద్ద ముస్లిం, క్రైస్తవ మతానికి చెందిన వంటవాళ్లు పనిచేసే వారు. ఆయన సిక్కు, హిందూ, క్రిస్టియన్, పార్శియన్ మిత్రులతో కలిసి డైనింగ్ టేబుల్పై కలసి భోంచేసేవారు. వారు కలిసి వైన్ కూడా సేవించేవారు. ఆయన కుటుంబానికి చెందిన వారిలో కొందరు అమృత్సర్లోని స్వర్ణదేవాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహించేవారు. అమృత్సర్లోనే క్రైసవ మిషనరీ స్కూల్లో చదువుకున్న దయాళ్ సింగ్ భగవద్గీతలోపాటు బైబిల్, ఖురాన్లను కూడా క్షుణ్ణంగా చదువుకున్నారు. ఆయనకు క్రైస్తవ గురువులకన్నా క్రైస్తవం గురించి ఎక్కువగా తెలుసు. ఫిరోజ్పూర్కు చెందిన ఓ సంస్కత పండితుడి సహకారంతో ఆయన గీతను అధ్యయనం చేశారు' అని 1998లో దయాళ్ సింగ్ శతజయంతి (1849-1898) సందర్భంగా ప్రముఖ విద్యావేత్త మదన్ గోపాల్ రాశారు. దాన్ని 'ది ట్రిబ్యూన్' మ్యాగజైన్లో ప్రచురించారు. పాకిస్థాన్లోని లాహోర్ కేంద్రంగా ఏర్పాటైన దయాళ్ సింగ్ కాలేజ్ ట్రస్ట్ సొసైటీ తమ తొలి కాలేజీని 1910లో లాహోర్లో ఏర్పాటు చేశారు. దేశ విభజన జరగడంతో ఆ ట్రస్ట్ భారత్కు తరలి వచ్చింది. ఆ ట్రస్ట్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత అంటే, 1956లో ఢిల్లీలో దయాళ్ సింగ్ పేరిట ఈవెనింగ్ కాలేజీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సంవత్సరానికి డే కాలేజీని కూడా ఏర్పాటు చే సింది. ఢిల్లీ యూనివర్శిటీ 1978లో రెండు కాలేజీల నిర్వహణ బాధ్యతలను ట్రస్ట్ నుంచి స్వీకరించింది. ఇటీవలి కాలంలో ఆదరణ తగ్గిపోతుండడంతో ఈవెనింగ్ కాలేజీని డే కాలేజీగా మార్చాలని ఐదు నెలల క్రితం ఢిల్లీ యూనివర్శిటీ నిర్ణయం తీసుకొంది. డే కాలేజీలో ఆరువేల మంది విద్యార్థులు, ఈవెనింగ్ కాలేజీలో రెండున్నర వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు కాలేజీలకు మొదటి నుంచి ప్రిన్సిపాల్ సహా సిబ్బంది అంతా వేర్వేరుగానే ఉన్నారు. అలాగే ఇప్పుడు నైట్ కాలేజీని డేకు మార్చినప్పటికీ ప్రత్యేక సిబ్బందిని అలాగే కొనసాగించాలని ఢిల్లీ యూనివర్శిటీ నిర్ణయించింది. దాంతో కాలేజీ పేరును మార్చాల్సిన అవసరం ఏర్పడింది. 11 ఎకరాల ఆవరణలో కొనసాగుతున్న రెండు కాలేజీలను డే కాలేజీలుగా మార్చడం వల్ల మౌలిక సదుపాయాల కొరత ఏర్పడుతోందని, వాటిని కల్పించేందుకు 11 ఏకరాల స్థలం సరిపోదని కాలేజీ గవర్నింగ్ బాడీలో, టీచర్లలో, ఇటు విద్యార్థుల్లో ఒక వర్గం వాదిస్తోంది. పేరు మార్పుకన్నా ఈ సౌకర్యాలపైనే దష్టిని కేంద్రీకరించడం మంచిదని వారంటున్నారు. ప్రస్తుతం ఉన్న కాలేజీ పేరునే ఉంచాలనుకుంటే 'దయాళ్ సింగ్ కాలేజీ-1, -2 అని పెట్టుకోవచ్చని, పూర్తిగా పేరు మార్చాల్సిన అవసరమే లేదని ఆ వర్గం సూచిస్తోంది. పేరేదైనా సౌకర్యాలు కల్పిస్తే చాలని మరో వర్గం వాదిస్తోంది. ఇప్పటికే డేకి కాలేజీని మార్చినందున పెద్ద ఇబ్బందులేవీ లేవని, ఉన్న ఆవరణలోనే అదనపు భవనాలు నిర్మిస్తే సరిపోతుందని వందేమాతరం పేరును కోరుకుంటున్న వర్గం భావిస్తోంది. -
దుర్గా మాతపై దారుణమైన కామెంట్
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల ఆరాధ్య దైవం పై దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేసి ఓ ప్రొఫెసర్ చిక్కుల్లో పడ్డారు. దుర్గాదేవిని వేశ్యతో పోలుస్తూ కామెంట్ చేయటంతో పలువురు మండిపడ్డారు. ఈ మేరకు ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది. ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) పరిధిలోని దయాల్ సింగ్ కాలేజీలో కేదార్ కుమార్ మండల్ అసిస్టెంట్ ప్రోఫెసర్గా విధులు నిర్వహిస్తున్నాతో. ఈ నెల 22వ తేదీన తన ట్విట్టర్ పేజీలో ‘పురాణాల ప్రకారం దుర్గాదేవి ఓ వేశ్య’ అంటూ ఓ వ్యాఖ్యను పోస్ట్ చేశారు. అది చూసిన వారంతా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ మనోభావాలను కేదార్ దెబ్బతీశాడంట ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ విద్యాసంస్థలు ఆయనపై లోధీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తక్షణమే ఆయన్ను విధుల్లోంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నవరాత్రుల సమయంలోనే కేదార్ మండల్ ఇలాంటి కామెంట్లు చేయటంతో ఆ ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. -
డూసూ ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ విజయం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) విజయకేతనం ఎగురవేసింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. ఇక ఏబీవీపీ కేవలం కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు దక్కించుకుంది. కాగా డూసూ ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు దక్కడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. -
మూడు యూనివర్శిటీల వెబ్సైట్లు హ్యాక్
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. దేశంలోని మూడు ప్రతిష్టాత్మక యూనివర్శిటీల వెబ్సైట్లను హ్యాక్ చేశారు. ఢిల్లీ యూనివర్శిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ, ఐఐటీ ఢిల్లీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ) అధికారిక వెబ్సైట్ల మంగళవారం హ్యాకింగ్కు గురయ్యాయి. హ్యాకింగ్కు పాల్పడిన గ్రూప్ తనను తాను ‘పీహెచ్సీ’గా పేర్కొంటూ... తాము ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరించారు. ఆ వెబ్సైట్లలో 'పీహెచ్సీ' అని ప్రో కాశ్మీర్ స్లోగ్లన్లను హ్యాకర్స్ పోస్ట్ చేశారు. కశ్మీర్లో సో కాల్డ్ జవాన్లు ఏం చేస్తున్నారో తెలుసా అంటూ... సైనికుల హింసాకాండను నిరసిస్తూ హ్యాకర్లు నేరుగా భారత ప్రభుత్వానికి, ప్రజలను సంభోదిస్తూ మెసేజ్లు పెట్టారు. అలాగే ’ మీ సోదరుడు, సోదరి, తల్లీదండ్రులను చంపితే మీకెలా అనిపిస్తుంది. మిమ్మల్ని, మీ కుటుంబాలను నాశనం చేస్తే మీరేం చేస్తారంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హ్యాకర్లు పోస్ట్ చేశారు. కాగా చాలావరకూ సెంట్రల్ యూనివర్శిటీ వెబ్సైట్లను నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ నిర్వహిస్తోంది. మరోవైపు హ్యాక్ అయిన కొద్ది గంటల అనంతరం వెబ్సైట్లను పునరుద్దరించారు. -
వీడియోలు లీక్ చేసిన లవర్.. యువతి ఆత్మహత్య
ఢిల్లీ యూనివర్సిటీలో చదివే 21 ఏళ్ల అమ్మాయి ఉత్తరఢిల్లీలోని రూప్నగర్ ప్రాంతంలోగల తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తామిద్దరం కలిసున్న వ్యక్తిగత వీడియోలను తన ప్రేమికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తట్టుకోలేని ఆ యువతి.. ప్రాణాలు తీసుకుంది. స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్లో బీకాం చదువుతున్న ఆ యువతి.. తన చావుకు ప్రేమికుడే కారణమని చెబుతూ సూసైడ్ నోట్ రాసింది. ఇటీవలే ఆమె మోడల్ టౌన్ పోలీసు స్టేషన్లో తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసిందని, అయితే పోలీసులు దానిపై చురుగ్గా స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అందుకు ప్రేరేపించాడంటూ నిందితుడు పట్నాకు చెందిన వేద్ ప్రకాష్ మీద పోలీసులు కేసు పెట్టారు. అతడిని అరెస్టు చేయడానికి ఓ బృందాన్ని పంపామని డీసీపీ జతిన్ నర్వాల్ తెలిపారు. యువతి కుటుంబం మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఆమె చదువుకోడానికి ఢిల్లీ వచ్చి తోటి విద్యార్థి అయిన ప్రకాష్తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉండేవారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు గానీ, తర్వాత ఎందుకోగానీ ఇద్దరికీ చెడిపోయింది. ఇద్దరూ మూడేళ్ల పాటు సహజీవనం చేసినట్లు తెలిసిందని, అయితే వాళ్ల కుటుంబాలు అంగీకరించలేదని పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులను వదిలేసి తనతో పాటు బిహార్ వచ్చేయమని ప్రకాష్ అడిగేవాడని, అయితే అందుకు ఆమె నిరాకరించిందని అన్నారు. అలా రాకపోతే వ్యక్తిగత వీడియోలు బయట పెడతానంటూ అతడు బెదిరించేవాడని తెలిసింది. కొంతకాలం తర్వాత అతడు బిహార్ వెళ్లిపోయాడని, ఆమె ఫోన్లు ఆన్సర్ చేయకపోవడంతో పాటు ఆమెను కలవడం కూడా మానేశాడని చెప్పారు. దాంతో ఆమె ఏప్రిల్ 8వ తేదీన తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసిందని, తాము దానిపై విచారణ జరుపుతుండగానే ఆమె ప్రాణాలు తీసుకుందని పోలీసులు చెప్పారు. -
టైపింగ్లో తప్పిదం.. పరారీలో హంతకుడు
న్యూఢిల్లీ: టైపింగ్లో తప్పు దొర్లడంతో ఓ హంతతకుడు జైలు నుంచి విడుదల అయ్యాడు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో టైపింగ్ తప్పిదంతో రెండు హత్య కేసుల్లో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఢిల్లీ వర్సిటీ మాజీ విద్యార్థి అయిన జితేందర్ 1999 మార్చి 10న ఓ విద్యార్థి సంఘ నాయకుడ్ని హత్య చేశాడు. ఆ మరుసటి రోజు ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చిన ఓ సాక్షి ఇంటికి వెళ్లి అతని తండ్రిని చంపేశాడు. జితేందర్కు మొదటి కేసులో 30 ఏళ్ల జైలు శిక్ష, మరో కేసులో జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై జితేందర్ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం జితేందర్ ఇప్పటికే 16 ఏళ్ల 10 నెలల పాటు జైలు శిక్ష అనుభవించినందున అతన్ని విడుదల చేస్తూ 2016 డిసెంబర్ 24న తీర్పు వెలువరించింది. దీనిపై సాక్షులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు డిసెంబర్ 24న వెలువరించిన తీర్పులో టైపింగ్ తప్పిదం దొర్లిందని పేర్కొంది. అంతకుముందు తీర్పులో పేర్కొన్న.. ఇప్పటికే 16 ఏళ్ల 10 నెలల పాటు శిక్ష పూర్తయ్యింది. ఇతర కేసుల్లో దోషి అవసరం లేకుంటే విడుదల చేయొచ్చు.. అన్న వాక్యాలను తొలగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ తీర్పునిచ్చింది. అలాగే, జితేందర్ను అరెస్టు చేయాలని, సాక్షులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. కాగా, జితేందర్ విడుదలైనప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. -
‘హోలీ కూడా జరుపుకోనివ్వరా.. బయటకు నో’
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో కొత్త వివాదం రాజుకుంది. యువత ఎంతో సంబురంగా జరుపుకునే హోలీలో తమను పాల్గొనకుండా అడ్డుకున్నారంటూ ఢిల్లీ వర్సిటీ యువతులు వర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిరంకుశత్వ చర్య అని, తమ స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పాలన వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ మహిళల అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహ(ఐఎస్హెచ్డబ్ల్యూ) అధికారులు మాత్రం విద్యార్థినుల మంచి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ‘వర్సిటీలో ఉంటున్నవారు బయటకు వెళ్లేందుకుగానీ, బయట నుంచి అతిథులుగా వచ్చే మహిళా స్నేహితులు లోపలికి వచ్చేందుకుగానీ మార్చి 12 రాత్రి 9గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 6గంటల వరకు నిషేధం. మార్చి 12 రాత్రి ఆలస్యంగా వచ్చినవారికి లోపలికి అనుమతి ఉండదు. కేవలం హాస్టల్ గదుల ముందు ప్రాంగణంలో మాత్రమే హోలీ ఆడుకునేందుకు అనుమతిస్తున్నాం’ అని ఐఎస్హెచ్డబ్ల్యూ ఒక నోటీసులో తెలిపింది. దీనిపై వర్సిటీ విద్యార్థునులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బర్నింగ్ వర్శిటీస్.
-
సోషల్ ‘వార్’కు గుర్మెహర్ స్వస్తి
తనను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి ► ఢిల్లీ వర్సిటీలో ఏబీవీపీ వ్యతిరేక ర్యాలీ.. న్యూఢిల్లీ: ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని విరమిస్తున్నట్లు లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని, కార్గిల్ అమరుడి కుమార్తె గుర్మెహర్ కౌర్ మంగళవారం స్పష్టంచేసింది. ప్రచారంపై తీవ్ర వ్యతిరేకతతోపాటు అత్యాచార, హత్య బెదిరింపులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రచారాన్ని విరమించుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నా ధైర్యసాహసాలను ప్రశ్నించేవారికి అవసరమైనదానికంటే ఎక్కువే సమాధానమిచ్చా’ అని ట్వీట్ చేసింది. తన కుటుంబంతో కలసి ఉండేందుకు ఆమె జలంధర్కు వెళ్లింది. ఆమెకు రక్షణ కల్పించాలని అక్కడి పోలీసులను ఢిల్లీ పోలీసులు కోరారు. మరోవైపు.. ఢిల్లీ వర్సిటీ నార్త్ క్యాంపస్లో ఏబీవీపీకి వ్యతిరేకంగా మంగళవారం జేఎన్ యూ, డీయూ, జామియా వర్సిటీలకు వందలాది విద్యార్థులు, అధ్యాపకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి గుర్మెహర్ కౌర్ గైర్హాజరైంది. కౌర్కు వచ్చిన బెదిరింపులకు సంబంధించి ఢిల్లీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై.. లైంగిక వేధింపులు, బెదిరింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ర్యాలీలో ఇద్దరు ఏఐఎస్ఏ విద్యార్థులపై దాడి చేశారనే ఆరోపణలపై ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌర్ వ్యాఖ్యలపై తాను చేసిన ట్వీట్ సరదా కోసమేనని, దాన్ని అపార్థం చేసుకున్నారని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు. అయితే కౌర్ వ్యాఖ్యలను ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్ ఖండించారు. కౌర్, హిట్లర్, లాడెన్ ల ఫొటోలను జతచేసి దత్ పోస్ట్ చేశారు. ‘తండ్రి ఆత్మ క్షోభిస్తోంది’ కౌర్పై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు విమర్శలు ఆపడం లేదు. ‘మన జవాన్లు విధుల్లో చనిపోతే వేడుక చేసుకునే వారు కౌర్ను తప్పుదారి పట్టిస్తున్నారు.. ఆమె తండ్రి ఆత్మ తప్పకుండా క్షోభిస్తూ ఉంటుంది’ అని అన్నారు. ‘జవాన్లు చనిపోతే లెఫ్టిస్టులు పండగ చేసుకుంటారు. వర్సిటీల్లో్ల యువతను తప్పుదారి పట్టిస్తున్నారు’ అని ఆరోపించారు. రిజిజు విమర్శలను సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ‘‘గాంధీని చంపాక ఎవరు పండుగ చేసుకున్నారు? ‘గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్ కార్యకర్తలు సంతోషంతో స్వీట్లు పంచారు’ అని పటేల్(తొలి హోం మంత్రి)..గోల్వార్కర్(ఆరెస్సెస్)కు 11–09–1948న చెప్పా రు’’ అని ఏచూరి ట్వీట్ చేశారు. -
ఢిల్లీ యూనివర్సిటిలో టెన్షన్
-
’రాంజాస్’ ఘర్షణలపై కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కళాశాలలో జరిగిన ఘర్షణలపై విచారణకు కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ విద్యార్థుల పాత్రపై విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా రాంజాస్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులందరూ సంయమనం పాటించాలని సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విద్యార్థులకు లేఖ రాశారు. కాగా రాంజాస్ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడిన విషయం తెలిసిందే. విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 20మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. పలువురు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే....దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలిద్ను రాజాంస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో వివాదం రాజుకుంది. ఉమర్ ఖలీద్ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్ ఖలీద్, షెహ్లా రషీద్ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది. అయితే, ఏబీవీపీ ఉద్దేశపూరితంగా ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్, డీయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏఐఎస్ఏ నేతృత్వంలో మౌలిస్నగర్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అప్పటి నుంచి రాంజాస్ కళాశాలలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కళాశాలలో జరిగిన ఘర్షణలపై కమిటీ ఏర్పాటు అయింది. -
నందిని సుందర్
-
అయానిక్ యాసిడ్స్తో గాయాలకు మందు
తెలుగు శాస్త్రవేత్త పి.వెంకటేశ్కు ప్రధానమంత్రి ప్రత్యేక పురస్కారం తిరుపతి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మీ శరీరంలో ప్రొటీన్లు తగ్గాయా? తద్వారా ఏమైనా రుగ్మతలు వస్తున్నాయా? ఇకపై దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వాటికో పరిష్కార మార్గం కనిపెట్టానంటున్నారు ఢిల్లీ వర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ పి.వెంకటేశ్. శరీరంలో ప్రొటీన్లు తగ్గినా, పెరిగినా నష్టమే. శరీరంపై గాయాలు ఏర్పడి నప్పుడు అవి మానడం కష్టమవుతుంది. అయానిక్ యాసిడ్స్ (ఓ రకమైన లవణ ద్రావణం)తో గాయాలను తగ్గించవచ్చని ఆయన చెబుతున్నారు. ఈ అంశంపై తాను చేసిన పరిశోధనతో ఆయన ప్రధానమంత్రి ప్రత్యేక పురస్కారానికి ఎంపికయ్యారు. తిరుపతిలో జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. డెంటీస్ట్రరీలో వినూత్న ప్రయోగాలకు పురస్కారం పశ్చిమ బెంగాల్కు చెందిన డాక్టర్ బిశ్వజిత్ పాల్ కోల్కతా యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్త. దంతాలకు సంబంధించిన వ్యాధులు, కట్టుడు పళ్లతో వచ్చే రుగ్మతలపై చేసిన పరిశోధనలకు గాను ఆయనకు ప్రధానమంత్రి అవార్డు లభించింది. కట్టుడు పళ్లకు ఉపయోగించే సిరామిక్స్, సిల్వర్ మెటల్స్ వంటి వాటితో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని కనిపెట్టినట్టు తెలిపారు. -
స్మార్ట్ చోరీ
జాగ్రత్త! అది.. ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోని విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్. యూనివర్సిటీ విద్యార్థులు భుజానికి బ్యాగ్లు తగిలించుకుని, చేతిలో సెల్ఫోన్ పట్టుకుని, ఇయర్ఫోన్స్ చెవిలో అమర్చుకుని ఎవరికి వారు ఎక్కడో ఉన్న మిత్రులతో కబుర్లలో ఉన్నారు. అంతలో వారి ఎదురుగా ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి అత్యాధునికంగా కనిపిస్తోందో మహిళ. ఆమె కారు ఆపి, అద్దాలు దించి చక్కటి ఇంగ్లిష్లో తన ఫోన్ చార్జ్ అయి పోయి డెడ్ అయిందని, అర్జంటుగా ఓ కాల్ చేయాల్సి ఉందని, దయచేసి ఓ సారి ఫోన్ ఇస్తే అర్జంటు కాల్ చేసుకుంటాను అని దివ్య కుమారి అనే స్టూడెంట్ని ఎంతో సంస్కారవంతంగా అడిగింది. దివ్య వెంటనే తన ఫోన్ని కారులో ఉన్నామెకిచ్చింది. ఆమె ఏదో నంబర్ డయల్ చేయడం చూసి ఫోన్ వినడం సభ్యత కాదన్నట్లు కొద్దిగా పక్కకు జరిగింది. ఆమె ధ్యాస పక్కకు మళ్లడం గమనించిన కారులోని నవనాగరికురాలు కారును ఒక్కసారిగా కదిలించింది. ఫోన్తోపాటు పారిపోయింది! స్మార్ట్ ఫోన్, బర్త్డే కానుకగా అమ్మానాన్నలను బతిమిలాడి మరీ కొనిపించుకున్న ఫోన్... కళ్ల ముందే మాయం కావడంతో గుండె గుభేలుమందా అమ్మాయికి. వెంటనే అలర్ట్ అయి, ‘దొంగ దొంగ’ అని అరుస్తూ సహాయం కోసం చూసింది. అక్కడే ఉండి అంతా గమనిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నరేశ్కుమార్ రంగంలోకి దూకాడు. బైక్తో కారును వెంబడించాడు. అప్పటికే కొద్దిదూరం వెళ్లిన కారును ఓవర్టేక్ చేసి ఆపాడు. మరికొద్ది సేపట్లో దివ్య కుమారి ఎదురుగా పోలీస్ నరేశ్కుమార్, ఆయన పక్కనే హెడ్ కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్. వాళ్లిద్దరి పక్కన ఆ కిలాడీ లేడి. ఆ లేడీ చేతిలో దివ్య దగ్గర దొంగిలించిన స్మార్ట్ ఫోన్. ఆ లేడీ పేరు గురుదీప్ కౌర్. ఆమె సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్! ఢిల్లీలో గత గురువారం ఈ సంఘటన జరిగింది. ఇదంతా ఢిల్లీ పోలీసులు చేసిన మాక్డ్రిల్. సెల్ఫోన్ దొంగల బారిన పడకుండా ఢిల్లీ టీనేజర్లను అప్రమత్తం చేయడానికి చేసిన ప్రయత్నమిది. సెల్ఫోన్ దొంగలు అనుసరిస్తున్న పద్ధతినే ఢిల్లీ పోలీసులు చేసి చూపిస్తూ టీనేజర్లలో అవేర్నెస్ తెస్తున్నారు. ఈ సంఘటనలో పోలీసులు యూనిఫామ్ లేకుండా మఫ్టీలో ఎవరికీ సందేహం రాని విధంగా కథ నడిపారు. ఎందుకిలా అంటే... గత కొంతకాలంగా ఢిల్లీలో సెల్ఫోన్ దొంగతనాలు ఎక్కువయ్యాయి. దాదాపుగా నూటికి తొంభై మంది సెల్ఫోన్ని చేతిలోనే పట్టుకుంటూ ఉంటారు. దుండగులు బైక్, కార్లలో వచ్చి చేతిలో ఫోన్ ఉన్న వారి పక్కనే ఆగుతారు. అదికూడా ఖరీదైన ఫోన్ ఉన్న వారి దగ్గరే ఆగుతారు. తమ ఫోన్ చూపిస్తూ చార్జింగ్ లేక ఆఫ్ అయిపోయిందని చెప్తారు. ఒక్కసారి ఫోన్ ఇస్తే కాల్ చేసుకుని ఇచ్చేస్తామని రిక్వెస్ట్ చేసి, ఫోన్ చేతికి రాగానే ఉడాయిస్తున్నారు. ఈ టైపు మోసాల గురించి అవగాహన లేకపోవడంతో చాలామంది, ముఖ్యంగా టీనేజర్లు మోసపోతున్నారు. ‘అందుకే ఈ అవేర్నెస్ డ్రైవ్’ అంటున్నారు ఢిల్లీ మోరిస్నగర్ పోలీసులు. మోసగాళ్లు ఎలా మోసాలు చేస్తున్నారో తెలిస్తే, ప్రజలు అమాయకంగా మోసపోకుండా జాగ్రత్తపడతారని చెప్తూ... ‘ఎవరైనా వచ్చి చార్జింగ్ లేక తమ ఫోన్ ఆగిపోయిందనే కారణం చెప్పి ఫోన్ అడిగితే... తమ ఫోన్ కూడా ఆగిపోయిందని తప్పించుకోవడమే సులువైన మార్గం’ అంటున్నారు. మరో ప్రత్యామ్నాయంగా ఫోన్ను పైకి కనిపించనివ్వకుండా బ్యాగ్లోనో, జేబులోనో పెట్టుకుని ఇయర్ ఫోన్ ద్వారా మాట్లాడుకోమని చెప్తున్నారు. ఇది వరకు అమ్మాయిలకు అబ్బాయిల నుంచి ఓ బెడద ఉండేది. అదేంటంటే... ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటానని అడిగి తీసుకుని, అమ్మాయి ఫోన్ నుంచి తన ఫోన్కి రింగ్ చేసుకునే వారు. అలా ఆ అమ్మాయి నంబరును సంపాదించి, ఆ తర్వాత తరచూ ఫోన్ చేసి వేధించేవాళ్లు. పైన చెప్పుకున్న ఢిల్లీ తరహా సెల్ఫోన్ దొంగతనం ఫోన్ పోవడంతో ఆగకపోవచ్చు. ఆ ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్న అందరినీ ఆ ఫోన్ కొట్టేసినవారు వేధింపులకు గురిచేసే ప్రమాదమూ లేకపోలేదు. టీనేజర్లూ జాగ్రత్త. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికలలో ఏబీవీపీ హవా
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) యూనియన్ విజయకేతనం ఎగురవేసింది. ఢిల్లీ వర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలలో ఏబీవీపీ యూనియన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. విద్యార్థి సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలతో పాటు కార్యదర్శి సీటును ఏబీవీపీ కైవసం చేసుకోగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) సంయుక్త కార్యదర్శి సీటు మాత్రమే దక్కించుకోగలిగింది. దీంతో రేండేళ్ల తర్వాత ఎన్ఎస్యూఐకి ఒక్క పదవి దక్కింది. వర్సిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోలతో ఏబీవీపీ ప్రచారం చేసిందని ఆరోపణలున్నాయి. ఏబీవీపీ యూనియన్ తరఫున ఉపాధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థి ప్రియాంక చౌరీ తన పేరు కలిసొచ్చేలా ప్రియాంక పోస్టర్లతో వర్సిటీలో ప్రచారం నిర్వహించారు. 2014 వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ సెక్రటరీ అభ్యర్థి నౌహీద్ సైరసీ పోస్టర్లతో ప్రచారం చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. -
కాలేజీలో హీరోయిన్ ఫొటోల హల్ చల్!
యూనివర్సిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు ఈ నెల 9న నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ వర్గానికి చెందిన స్టూడెంట్ యూనియన్ తమ ఎన్నికల ప్రచార పోస్టర్లపై ప్రియాంక చోప్రా ఫొటోలను వినియోగించారు. అసలు విషయం ఏంటంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కు చెందిన విద్యార్థి సంఘం నాయకుడు ప్రియాంక చౌరీ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) యూనియన్ తరఫున ఉపాధ్యక్ష రేసులో ఉన్నాడు. ప్రియాంక పేరు కలిసొస్తుందని ప్రియాంక చౌరీ తమ ప్రచారం పోస్టర్లపై హీరోయిన్ ఫొటో వాడుతున్నారు. గతంలోనూ వర్సిటీ ఎన్నికల్లో భాగంగా సెలబ్రిటీల ఫొటోలతో వాల్ పోస్టర్లు అంటించారు. 'ఆల్ ద బెస్ట్ ప్రియాంక 4 ఇమ్మీస్' అని ప్రియాంక చౌరీ బ్యాలెట్ నెంబర్ 4ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయంపై ఏబీవీపీ జాతీయ మీడియా కన్వినర్ సాకేత్ బహుగుణను ప్రశ్నించగా.. తాము హీరోయిన్ పోస్టర్లతో ప్రచారం చేయలేదన్నారు. 68వ ఇమ్మీ అవార్డుల్లో ప్రియాంక చోప్రా పాల్గొననున్న సందర్భంగా హీరోయిన్ ఫ్యాన్స్ వాల్ పోస్టర్స్ అంటించారని, ప్రియాంక 4 ఇమ్మీస్ అంటే ప్రియాంక ఫర్ ఇమ్మీస్ అనే అర్థమని వివరణ ఇచ్చారు. యాధృచ్ఛికంగా తమ అభ్యర్థి బ్యాలెట్ నెంబర్ 4 కావడంతో తమపై దుష్రచారం జరిగిందని ఆరోపించారు. 2014 వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ సెక్రటరీ అభ్యర్థి నౌహీద్ సైరసీ పోస్టర్లతో ప్రచారం చేసి విజయం సాధించడం గమనార్హం. -
డిగ్రీ కోర్సులకు లక్షకు పైగా దరఖాస్తులు
ఢిల్లీ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న వివిధ డిగ్రీ కోర్సులకు లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం సాయంత్రానికి 1,14,152 దరఖాస్తులు వచ్చాయని, అందులో సుమారు 40 వేల మంది ఫీజులు కూడా కట్టేశారని ఢిల్లీ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫీజు కట్టినవారిలో 20 వేల మంది అబ్బాయిలు, 20 వేల మంది అమ్మాయిలతో పాటు ఒక హిజ్రా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకాగా, మొదటిరోజే 39వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఓఎంఆర్ ఫారాలు కూడా యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్నాయని, ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చని అన్నారు. రావడానికి లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినా, వివిధ కోర్సులలో కలిపి ఉన్న మొత్తం సీట్లు 60వేలు మాత్రమే. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు జూన్ 19వరకు గడువు ఉంది. మొదటి కటాఫ్ను జూన్ 27న ప్రకటిస్తారు. ఇంతకుముందు వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు పద్ధతుల్లో దరఖాస్తులు స్వీకరించగా, ఈసారే పూర్తిగా ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే తీసుకుంటున్నారు. -
ఆ మోదీ.. ఈ మోదీ కాదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శల పర్వం కొనసాగిస్తోంది. మోదీ డిగ్రీ పట్టాపై మరోసారి సందేహం వ్యక్తం చేసింది. 1975 నుంచి 80 వరకు ఢిల్లీ యూనివర్శిటీ రికార్డులను పరిశీలించామని, ప్రధానికి బీఏ డిగ్రీ పట్టా అందజేసినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని ఆప్ నేతలు వెల్లడించారు. అయితే నరేంద్ర కుమార్ మహావీర్ ప్రసాద్ మోదీ అనే వ్యక్తికి వర్శిటీ అధికారులు డిగ్రీ ప్రదానం చేశారని, ప్రధాని నరేంద్ర దామోదర్దాస్ మోదీకు కాదని చెప్పారు. 'యూనివర్శిటీ రికార్డులను మా స్థాయిలో పరిశీలించాం. డిగ్రీ పట్టా అందుకున్నవారిలో నరేంద్ర దామోదర్దాస్ మోదీ పేరు ఎక్కడా లేదు. 197-78 మధ్య నరేంద్ర కుమార్ మహావీర్ ప్రసాద్ మోదీ అనే వ్యక్తి గ్రాడ్యుయేషన్ చేశారు. ఆయనది రాజస్థాన్లోని అల్వార్' అని ఆప్ నేత ఆశీష్ కేతన్ చెప్పారు. మోదీ విద్యార్హతలను తెలియజేయాల్సిందిగా ఆప్ నేతలు సమాచార హక్కు చట్టం కింద కోరిన సంగతి తెలిసిందే. ఓ పత్రికలో మోదీ డిగ్రీ పట్టాకు సంబంధించి రాసిన వివరాలు, ఢిల్లీ యూనివర్శిటీ రికార్డులతో సరిపోలలేదని చెప్పారు. తమ పరిశీలిన ప్రకారం మోదీ డిగ్రీ నకిలీదని ఆశీష్ కేతన్ ఆరోపించారు. ఇది తీవ్రమైన నేరమని, ఫోర్జరీ లాంటిదని అన్నారు. నకిలీ డిగ్రీ ఆరోపణలపై వైదొలిగిన ఆప్ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కేసు లాంటిదే మోదీ వ్యవహారమని చెప్పారు. -
ప్రధాని డిగ్రీలు ఎందుకు చూపించరు: సీఎం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిగ్రీల అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. ప్రధాని డిగ్రీల రికార్డులు చూపించడానికి ఢిల్లీ యూనివర్సిటీ నిరాకరిస్తోందని.. అది ఎందుకని ప్రశ్నించారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన అక్కడి నుంచి బీఏ చేయలేదని అన్నారు. కొన్ని పత్రికలు ప్రచురించిన డిగ్రీలు ఫోర్జరీవని కూడా సీఎం ఆరోపించారు. ఐఐటీ ఖరగ్పూర్లో తన డిగ్రీల గురించి కొంతమంది ప్రశ్నించారని, వెంటనే తాను దాన్ని రుజువు చేసుకున్నానని అన్నారు. తనకు అక్కడి నుంచి డిగ్రీ ఉందని కూడా తెలిపారు. సుర్బజిత్ రాయ్ అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్పూర్ను సమాచార హక్కు చట్టం ప్రకారం కేజ్రీవాల్ విద్యార్హతల గురించి ప్రశ్నించగా అక్కడి నుంచి వచ్చిన లేఖను కూడా ఆయన తన ట్వీట్తో పాటు జతపరిచారు. తన డిగ్రీల గురించి ఖరగ్పూర్ ఐఐటీ ఇంత స్పష్టంగా చెబుతోందని, కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిగ్రీల గురించి ఢిల్లీ యూనివర్సిటీ ఎందుకు దోబూచులు ఆడుతోందని ప్రశ్నించారు. ఎందుకంటే, ఆయనకు డిగ్రీలు లేవని కూడా కేజ్రీవాల్ సూత్రీకరించేశారు. ఆయన యూనివర్సిటీలో చేరడం, ఆయన డిగ్రీ, మార్కుల జాబితా, స్నాతకోత్సవం.. ఇలాంటి వాటికి సంబంధించిన రికార్డులు ఏవీ ఢిల్లీ యూనివర్సిటీలో లేవని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. DU refuses to show records of PM's degree. Why? My info- he did not do BA from DU. No records in DU. Degree published by some papers forged — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 Someone asked info abt my degree from IIT Kgp. They immediately provided it. Becoz I have a degree from there(1/2) pic.twitter.com/2LMzmZasxS — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 Why is DU refusing info abt PM's degree? Becoz he does not have it (2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 No records in DU related to his enrolment, his degree, his marksheets and convocation — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 -
తాకట్టులో సార్వభౌమత్వం ప్రొఫెసర్ సాయిబాబా విమర్శ
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఆదీవాసీల కోసం పాటుపడేవారికి దేశవ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని, జైళ్లలో పెడుతున్నారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై జైలుశిక్ష అనుభవించి గతవారమే బెయిల్పై విడుదలైన సాయిబాబా.. ప్రభుత్వ దమనకాండ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మనకు నచ్చిన విషయాలు బహిర్గతంగా మాట్లాడలేం. ప్రతిచోటా బెదిరింపు వాతావరణమే కనబడుతోంది. ఇదే నియంతృత్వ ధోరణి’ అని సాయిబాబా అన్నారు. అధికారంలో ఉన్నవారు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరిస్తున్నారన్నారు. దళితులు, ఆదీవాసీలకు సంబంధించిన కొన్ని కనీస అంశాలపై విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రశ్నలు లేవనెత్తారని.. జేఎన్యూ, హెచ్సీయూ, నిట్ శ్రీనగర్, ఐఐటీ మద్రాస్ గొడవలు అన్నింటికీ కారణం ఒకటేనన్నారు. రాజ్యాంగపరంగా దేశభక్తుడు అనే దానికి సరైన నిర్వచనం లేదని.. దేశంలోని చాలా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే ‘దేశవ్యతిరేకం’ అనే చర్చను తెరపైకి తెచ్చారన్నారు. ప్రభుత్వాలు దేశ సార్వభౌమత్వాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ సహజవనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని సాయిబాబా విమర్శించారు. -
తెరుచుకున్న భగత్ గది
న్యూఢిల్లీ: బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించిన విప్లవయోధుడు భగత్సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీ వర్సిటీలో అప్పట్లో ఆయన్ను నిర్బంధించిన గదిలోకి బుధవారం విద్యార్థులను అనుమతించారు. వైస్ రీగల్ లాడ్జ్ ఎస్టేట్గా పిలిచే ఆ భవంతిలోని ఓ గదిలో 1931లో భగత్సింగ్ను ఒకరోజుపాటు బ్రిటిష్ప్రభుత్వం నిర్బంధించింది. అనంతరం ఇప్పటి పాక్లో ఉన్న లాహోర్ జైలులో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను మార్చి 23న ఉరితీశారు. 1933లో ఎస్టేట్ను ఢిల్లీవర్సిటీకి అప్పగించగా అనంతరకాలంలో దీనిని వైస్చాన్స్లర్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఐదు స్కూళ్లకు చెందిన మొత్తం 100 మంది విద్యార్థులను గదిలోకి అనుమతించారు. భగత్సింగ్ స్వయంగా రాసిన ఉత్తరాలను గదిలో ప్రదర్శనకు ఉంచారు. ఆ గదిని ప్రజల సందర్శనార్ధం తెరిచే ఉద్దేశంలేదని వర్సిటీ వీసీ యోగేశ్ త్యాగి స్పష్టంచేశారు. పోరాటంచేసే ప్రతి ఒక్కరూ భగత్సింగ్ నుంచి స్పూర్తిపొందుతారన్నారు. -
ప్రొఫెసర్ గిలానీని విడుదల చేయాలి
దేశద్రోహం అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ఎస్ఏఆర్ గిలానీని విడుదల చేయాలని డీయూ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. గిలానీపై దేశద్రోహం అభియోగాన్ని మోపి చట్టాన్ని దుర్వినియోగపరచారని ఆరోపించింది. అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ప్రెస్ క్లబ్లో జరిగిన వివాదాస్పద కార్యక్రమంలో మాట్లాడినందుకు గిలానీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తక్షణం ఆయన్ని విడుదల చేసి విధుల్లో చేరేందుకు అనుమతించాలని డీయూ ఉపాధ్యాయసంఘం కోరింది. ఇటువంటి వివాదాస్పద చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేసింది. దేశద్రోహ చట్టం ప్రయోగించడానికి సంబంధించి పరిమితులను సుప్రీం కోర్టు స్పష్టంగా వెల్లడించిందని, శాంతియుత వాతావరణంలో చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తి తన అభిప్రాయాలను వెల్లడిస్తే అటువంటి సందర్భాల్లో దేశద్రోహ చట్టం ప్రయోగించరాదని స్పష్టం చేసినట్లు తెలిపింది. -
అగ్నిగుండం దండకారణ్యం
‘‘భారతదేశంలో 12 రాష్ట్రాల్లో దండకారణ్యం విస్తరించి ఉంది. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరేలా ప్రభుత్వాలు చేపడుతున్న బాక్సైట్, గనుల తవ్వకాల వల్ల అడవులు సర్వనాశనమైపోతున్నాయి. దీనిద్వారా అడవి బిడ్డలైన ఆదివాసీయుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. మందుపాతరలు, ఎన్కౌంటర్లతో దండకారణ్యం అగ్నిగుండంగా మారుతోంది. అక్కడ ఎలాంటి మారణహోమం జరగకుండా, ఆది వాసీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాపాడాలన్నదే ‘దండకారణ్యం’ కథ’’ అని దర్శక-నిర్మాత ఆర్. నారాయణమూర్తి తెలిపారు. ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘దండకారణ్యం’ ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడారు. ‘‘బాక్సైట్ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీలో ఆదివాసీయులు ఉద్యమం చేస్తున్నారు. పోలీసులు, మిలటరీ దళాలు అక్కడ కాల్పులు జరుపుతుండడంతో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన సంఘటనపై పార్లమెంట్లో ప్రస్తావించిన ప్రజా ప్రతినిధులు ఆదివాసీయుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి దండకారణ్యంలో మారణహోమం జరగకుండా శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలి. ప్రజాకవులు గద్దర్, గోరటి వెంకన్న, యశ్పాల్, పి.తిరుపతి, కాశీపతి ఈ చిత్రానికి మంచి పాటలు రాశారు. ‘వందేమాతరం’ శ్రీనివాస్, గద్దర్ పాటలు ప్రధాన ఆకర్షణ. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. నా గత చిత్రాలను ఆదరించినట్లే ఈ చిత్రాన్నీ ప్రేక్షకులు ఆదరించి, మరిన్ని చిత్రాలు తీసే ప్రోత్సాహం ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం గద్దర్ స్వయంగా 3 పాటలు రాసి, పాడి, నటించడం విశేషం. సమకాలీన దండకారణ్య చరిత్రకు దర్పణమైన ఈ చిత్రానికి సెన్సార్ దాదాపు 80 ఆడియో కట్స్ విధించడం సంచలనమైంది. -
స్నేహితుడి నివాసంలో శవమై..
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని తన స్నేహితుడి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతి ఇప్పుడు సంచలనం రేకిత్తిస్తోంది. ప్రస్తుతం చనిపోయిన ఆ అమ్మాయి గత రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిందని, ఇప్పుడామె చనిపోయిందని తెలియడం తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అర్జూ సింగ్ అనే యువతి థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు రెండు రోజులగా కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఢిల్లీలోని శక్తినగర్ లో ఆమె విగత జీవి తన స్నేహితుడు నవీన్ నివాసంలో కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నవీన్ ను అరెస్టు చేశారు. దీంతో నవీన్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోవాలని, వారి తమ కూతురు ఏదో చేసి ఉండొచ్చని అర్జూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రముఖ పాత్రికేయుడు అరిందమ్ సేన్గుప్తా మృతి
న్యూఢిల్లీ : ప్రముఖ పాత్రికేయుడు అరిందమ్ సేన్గుప్తా కేన్సర్తో గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. గత 33 ఏళ్లుగా ఆయన పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. గతంలో అరిందమ్ సేన్గుప్తా ది పేట్రియాట్, ది సండే అబ్జర్వర్, ది ఎకనామిక్ టైమ్స్లో పని చేశారు. ఎస్టీ స్టిఫెన్స్ కాలేజీలో ఎంఏ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత పాత్రికేయ వృత్తిలో ప్రవేశించారు. అరిందమ్ సేన్గుప్తా ప్రస్తుతం టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అరిందమ్ మృతిపై ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. -
బలవంతంగా చేపట్టబోం
♦ అయోధ్యలో రామ మందిరంపై సుబ్రమణ్యం స్వామి ♦ ఢిల్లీ వర్సిటీ సదస్సులో ప్రసంగం న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో పెల్లుబికిన నిరసనలను లెక్కచేయకుండా రామ మందిర నిర్మాణం అంశంపై జరిగిన సదస్సులో బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ప్రసంగించారు. మన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలంటే అయోధ్యలో మందిర నిర్మాణం అవసరమని చెప్పారు. ‘మందిర నిర్మాణాన్ని బలవంతంగా చేపట్టబోం, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించబోం. దీనిపై కోర్టులో నెగ్గుతామన్న పూర్తి విశ్వాసం మాకుంది’ అని స్పష్టంచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో ‘రామజన్మభూమి’ అంశంపై శనివారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పూర్తి మద్దతిస్తామని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 40 వేలకుపైగా ఆలయాలను ధ్వంసం చేశారని, అయితే వాటన్నింటినీ పునర్నిర్మించాలని తాము అడగడం లేదని, వాటిలో మూడు ఆలయాలైన రామ జన్మభూమి, మథురలో కృష్ణుడి ఆలయం, కాశీ విశ్వనాథ్ మందిరాల విషయంలో రాజీపడబోమని సుబ్రమణ్యం స్వామి అన్నారు. వివాదాస్పద భూమిలో రామాలయాన్ని నిర్మించాలని, ముస్లింలకు మసీదు కోసం సరయు తీరంలో స్థలం కేటాయిస్తారని చెప్పారు. వర్సిటీ క్యాంపస్లో ఈ సదస్సు నిర్వహించడాన్ని ఎన్ఎస్యుఐ, తదితర విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నిరసన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టుచేశారు. -
'రామజన్మభూమి'పై వర్సిటీలో ఆందోళనలు
న్యూఢిల్లీ: ఆందోళనలు, ఉద్రిక్తతల మధ్య ఢిల్లీ యూనివర్సిటీలో రామజన్మభూమి అంశంపై శనివారం సెమినార్ ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభమైన ఈ సెమినార్కు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలైన ఆలిండియా స్టూడెంట్ అసొసియేషన్ (ఏఐఎస్ఏ), క్రాంతికారి యువసంఘటన్ (కేవైఎస్)తోపాటు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. డీయూలోని ఆర్ట్స్ ఫాకల్టీ ప్రాంగణం ఎదుటు వారు ఆందోళన చేస్తుండగా.. రైట్ వింగ్ విద్యార్థులు కాన్ఫరెన్స్ సెంటర్ ఎదురుగా గుమిగూడి 'జై శ్రీరాం', 'భారత్ మాతాకీ జై' నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దివంగత నేత అశోక్ సింఘాల్ స్థాపించిన అరుంధతి వశిష్ఠ అనుసంధాన్ పీఠం నిర్వహిస్తున్న ఈ సెమినార్ను బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రారంభించారు. సెమినార్కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులు 'అసహనం'గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
మాజీ ప్రొఫెసర్పై కేసు నమోదు
ఉదయ్పూర్: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ఫిలాసఫీ ప్రొఫెసర్ అశోక్ వోహ్రాపై రాజస్థాన్లోని ఉదయ్పూర్ పోలీసులు కేసు నమోదుచేశారు. మోహన్ లాల్ శుక్లా యూనివర్సిటీలో 'రెలిజియస్ డైలాగ్' అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో వోహ్రా మాట్లాడుతూ హిందూ దేవతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఏబీవీపీ కార్యకర్త దేవేంద్రసింగ్ ఫిర్యాదు మేరకు ఓ మతాన్ని కించపరిచినందుకు సెక్షన్ 295, ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించే చర్యకు పాల్పడినందుకు సెక్షన్ 153(ఎ) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో వోహ్రా.. 'ఈ వ్వాఖ్యలు నావి కావు. నేను కేవలం విదేశీ రచయితల అభిప్రాయాలను మాత్రమే వెల్లడించాను. నా ప్రసంగానికి సంబంధించిన అంశాలను పరిశీలించడానికి ఓ ప్యానల్ను నియమించాల్సిందిగా కోరుతున్నాను' అని ముఖ్యమంత్రి వసుంధర రాజేకు లేఖ రాశారు. -
ఉద్యోగ సమాచారం
వ్యాప్కోస్లో ఇంజనీర్లు హైదరాబాద్లోని వ్యాప్కోస్ లిమిటెడ్.. సీనియర్ ఇంజనీర్ (ఖాళీలు-2), ఇంజనీర్(ఖాళీలు -2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 28. వివరాలకు www.wapcos.gov.inచూడొచ్చు. ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో ఇంటర్వ్యూలు హైదరాబాద్లోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అగ్రిక ల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ ఫెలో (ఖాళీలు-2), డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 28. వివరాలకు www.zpd5hyd.nic.inచూడొచ్చు. ఢిల్లీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఢిల్లీ వర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ లా.. అసిస్టెంట్ ప్రొఫెసర్, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 81. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 3. వివరాలకు www.du.ac.in/duచూడొచ్చు. పశ్చిమ బెంగాల్లో లెక్చరర్లు పశ్చిమ బెంగాల్లోని సాంకేతిక విద్య, శిక్షణ విభాగం.. ప్రభుత్వ పాలిటెక్నిక్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికనలెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 146. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.webscte.orgచూడొచ్చు. చెన్నై పోర్ట ట్రస్ట్లో వివిధ పోస్టులు చెన్నై పోర్ట ట్రస్ట్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 14 (టగ్ మాస్టర్-7, పైలట్-4, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్-1, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్-1, చీఫ్ మెడికల్ ఆఫీసర్-1). వివరాలకు www.chennaiport.gov.inచూడొచ్చు. సీడీఆర్ఐలో అసిస్టెంట్లు సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ (సీడీఆర్ఐ).. వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.cdriindia.orgచూడొచ్చు. బెనారస్ వర్సిటీ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిధిలోని వసంతా కాలేజ్ ఫర్ ఉమెన్.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మ్తొతం ఖాళీలు 6. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 13. వివరాలకు www.vasantakfi.comచూడొచ్చు. ‘వివేకానంద ఇన్స్టిట్యూట్’లో వివిధ పోస్టులు స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ.. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 16. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 15. వివరాలకు www.svnirtar.nic.inచూడొచ్చు. 25న ‘మనూ’ క్యాంపస్లో జాబ్ ఫెయిర్ హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలీలో ఉన్న మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ)లో ఈనెల 25వ తేదీన ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్/ జాబ్ ఫెయిర్ను నిర్వహిస్తామని మనూ స్కూల్ ఆఫ్ సీఎస్ అండ్ ఐటీ స్కూల్ డీన్ ప్రొఫెసర్ అబ్దుల్ వాహెద్ శుక్రవారం తెలిపారు. మనూ ప్లేస్మెంట్ అండ్ కెరియర్ గెడైన్స్ సెల్, స్కూల్ ఆఫ్ సీఎస్ అండ్ ఐటీ, పాత్వే హ్యూమన్ రీసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్లో పాల్గొనదలచిన విద్యార్థులు 23వ తేదీ లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ జాబ్ ఫెయిర్లో ఐటీ, బీపీఓ, హెచ్ఆర్, ఫార్మసీ, కామర్స్, ఐటీఐ, డిప్లొమో కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తారన్నారు. 2015, 2016లో ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్, సీఎస్ అండ్ ఐటీ, ఎంబీఏ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇతర డిగ్రీలు పూర్తి చేసిన వారే అర్హులన్నారు. ఎంసీఏ, బీటెక్ పూర్తి చేసిన వారు బొంత కోటయ్య(9666995969), మహ్మద్ ఒమర్ (9160407677)ను సంప్రదించాలి, ఎంబీఏ, ఎంకామ్ విద్యార్థులు కమరుద్ధీన్( 7207973873), రసీద్ ఫారూఖీ(9700911532)ను సంప్రదించాలి. పాలిటెక్నిక్, ఇతర డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారు ఫసియుద్ధీన్(9703131787)ను సంప్రదించాలి. ఇతర మనూయేతర విద్యార్థులు సునీల్(8121366633/11/22)ను సంప్రదించాలి. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్
-
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొపెసర్ సాయిబాబాతో ఫేస్ టూ ఫేస్
-
కొన్ని అదృశ్య శక్తులు నాపై కుట్ర పన్నాయి
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపల్ వాల్సన్ తంపూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను మొదట్నించి ఖండిస్తున్న ఆయన తనకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతోందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. లైంగిక ఆరోపణల కేసు విచారణ నిమిత్తం మానవ వనరుల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగిన నేపథ్యంలో తంపూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్నిశక్తులు తనకు వ్యతిరేకంగా పీహెచ్డీ విద్యార్థినిని వాడుకుంటున్నాయని తంపూ ఆరోపిస్తున్నారు. నిగూఢమైన ప్రయోజనాల కోసం ఆమెను వాడుకుంటున్నారనీ, ఈ విషయం ఆమెకు ఆర్థం కావడంలేదని అన్నారు. ఇదంతా చివరకు నాశనానికి దారి తీస్తుందంటూ తన అసహనాన్ని ప్రదర్శించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలో ఆడియో టేపుల నిజాలు నిగ్గుతేలతాయని తంపూ వ్యాఖ్యానించారు. అయితే ఆ కొంతమంది ఎవరనేది వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ పీహెచ్డీ విద్యార్థిని తనను గైడ్ వేధిస్తున్నాడంటూ కేసు నమోదు చేసింది. కాలేజీ హెడ్గా తనకు అండగా నిలవాల్సిన ప్రిన్సిపల్ తంపూ , నిందితుడికి వత్తాసు పలుకుతూ కేసు వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నాడంటూ కొన్ని ఆడియో టేపులను ఆమె విడుదల చేసింది. ఈ టేపులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో వివాదం రగులుకుంది. ఈ నేపథ్యంలోనే మానవవనరుల శాఖ రంగంలోకి దిగింది. దీనిపై విచారణ చేయాల్సిందిగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశించింది. మరోవైపు మహిళా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ..పీహెచ్డీ విద్యార్థినికి మద్దతుగా న్యాయ పోరాటానికి దిగాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులకు కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. -
ప్రొ.సాయిబాబాకు బెయిల్ మంజూరు
-
ప్రొ.సాయిబాబాకు బెయిల్ మంజూరు
ముంబై: ఏడాదిగా జైల్లో గడుపుతున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం బాంబే హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏడాది క్రితం మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సాయిబాబాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నాగ్పూర్ సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. సాయిబాబాకు బెయిల్ మంజూరు చేసేందుకు గతంలో న్యాయస్థానాలు తిరస్కరించాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్ ఇవ్వాలని సాయిబాబా చేసుకున్న విన్నపాన్ని మన్నించి బాంబే హైకోర్టు మంజూరు చేసింది. -
వాట్సప్ లో క్వశ్చన్ పేపర్ లీక్
న్యూఢిల్లీ: పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందు ప్రశ్నాపత్రం లీకైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఓపెన్ లెర్నింగ్(ఎస్ఓఎల్) బీకాం ఫైనల్ ఇయర్ ఎకనామిక్స్ పేపర్ వాట్సప్ మెసేజ్ ద్వారా బయటకు వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సివుండగా 2 గంటలకు పేపర్ వాట్సప్ లో వచ్చింది. అయితే పేపర్ లీకైనట్టు వచ్చిన వార్తలను ఎస్ఓఎల్ చైర్ పర్సన్ సీఎస్ దూబే తోసిపుచ్చారు. పరీక్ష పేపర్ ను పరిశీలకుల ముందే బయటకు తీశామని, ప్రశ్నాపత్రం లీకైయ్యే ఛాన్స్ లేదన్నారు. అయితే వాట్సప్ మెసేజ్ లోని పేపర్ కు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నాపత్రం సేమ్ టు సేమ్ ఉండడంతో అధికారులు ఖంగుతిన్నారు. దీనిపై స్పందించేందుకు పరిశీలకుల ప్యానల్ ఇన్ చార్జి రమేష్ గౌతమ్ నిరాకరించారు. -
మెట్రో గాలితో కరెంట్
ఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. జీనుగాలి(వాహనం ప్రయాణించేటప్పుడు వచ్చే వేగమైన గాలి) సాయంతో విద్యుత్ను ఉత్పత్తి చేసేలా గొప్ప ప్రయోగం చేసి విజయం సాధించారు. ఈ ప్రయోగాన్ని ఢిల్లీ మెట్రో రైలు సాయంతో చేశారు. ఢిల్లీ వర్సిటీకి చెందిన కాలింది కాలేజీలో భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ శాఖల్లో చదువుతున్న విద్యార్థులు ఢిల్లీ మెట్రో అధికారులను సంప్రదించారు. మెట్రో రైలు వెళ్లే భూఅంతర్భాగ మార్గంలో టర్బైన్లు పెట్టాలనుకుంటున్నామని, రైలు వెళ్లే సమయంలో వచ్చే గాలి వేగం ద్వారా అవి పనిచేసి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఈ ప్రయోగానికి తమకు అనుమతివ్వాల్సిందిగా కోరారు. దీనిపట్ల ఆసక్తి చూపిన అధికారులు అందుకు సమ్మతించారు. దీంతో ఢిల్లీలో సొరంగ మార్గాల్లో రైలు వెళ్లే చోట్ల ప్రవేశ ద్వారం వద్ద ముందుగా మూడు బ్లేడ్ల టర్బైన్లను, అనంతరం ఐదు బ్లేడ్ల టర్బైన్లను ఏర్పాటు చేశారు. అది మెట్రో సర్వీసులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం రైలు వెళ్లే వేగానికి వస్తున్న గాలి ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసి చూపించి అందరి మన్ననలు పొందారు. 'ఒక రోజు మెట్రో స్టేషన్లో నిలుచున్న విద్యార్థులు మెట్రో వేగానికి టన్నెల్లోకి చొచ్చుకొచ్చేగాలి వృధా అయిపోతుంది కదా అని ఆలోచించారు. దానిని ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచించి ఈ ఆవిష్కరణ చేశారు' అని కళాశాల ప్రిన్సిపాల్ పునితా వర్మ తెలిపారు. ఈ ప్రయోగం చేసేందుకు సదరు విద్యార్థులకు 2013లో విశ్వవిద్యాలయం రూ.15లక్షలు కేటాయించింది. -
ఢిల్లీ వర్సిటీలో పెరుగుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించడానికి వచ్చే విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం వర్సిటీలో పెరిగిన విదేశీ విద్యార్థుల అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. 2012 డిసెంబర్ 16న నగరంలో జరిగిన మహిళ గ్యాంగ్ రేప్ సంఘటన ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. అంతేకాక ఉన్నతవిద్య చదవడానికి సురక్షిత ప్రాంతంగా ఢిల్లీ ఉంటుందని విదేశీ మహిళలు భావిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ఫారిన్ స్టూడెంట్ రిజర్వేషన్ ఆఫీస్(ఎఫ్ఎస్ఆర్ఓ) డాటా ప్రకారం 2014-15 సంవత్సరంలో 1,184 మంది విదేశీ విద్యార్థులు వర్సిటీలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మహిళా విద్యార్థుల సంఖ్య 492 నుంచి 546కు పెరిగింది. 2011-12లో విదేశీ విద్యార్థుల సంఖ్య 952గా, 2012-13లో 1,007గా ఉంది. 2011-12లో మహిళా విద్యార్థుల సంఖ్య 434గా ఉంది. దక్షిణాసియా, దక్షిణ తూర్పు ఆసియా నుంచే ఎక్కువ: ముఖ్యంగా దక్షిణ ఆసియా, దక్షిణ తూర్పు ఆసియా, యూరోపియన్, ఆఫ్రికా దేశాల విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లు ఎఫ్ఎస్ఆర్ఓ అధికారి అమ్రిత్ కుమార్ బస్రా వెల్లడించారు. యూనివర్సిటీలో జరిగిన అంతర్గత సమావేశంలో....రేప్ సంఘటన ప్రభావం విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై పడలేదనే విషయం అర్థమైందని ఆమె చెప్పారు. ‘వారిలో కచ్చితంగా ఆందోళన ఉంటుంది. కానీ భయపడటం లేదు. ప్రస్తుత విద్యాసంవత్సరం దక్షిణాసియా, దక్షిణ తూర్పు ఆసియాలోని నేపాల్ నుంచి 311, ఆఫ్ఘనిస్థాన్ నుంచి 55, మాల్దీవుల నుంచి 36, శ్రీలంక నుంచి 23, వియాత్నం నుంచి 23, భూటాన్ నుంచి 22, బంగ్లాదేశ్ నుంచి 10, ఇండోనేషియా నుంచి 7 మంది విద్యార్థులు ఢిల్లీ వర్సిటీలో అడ్మిషన్లు పొందారు. అలాగే మధ్య ప్రాచ్య, యూరోపియన్, ఆఫ్రికా దేశాల నుంచి కూడా క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇరాన్ నుంచి 11, ఇరాక్ నుంచి 7, నైజీరియా నుంచి 11, కాంగో నుంచి 10, జింబాబ్వే నుంచి 10, సోమాలియా నుంచి ఇద్దరు వర్సిటీలో చేరారు’ అని బస్రా తెలిపారు. నాణ్యమైన విద్య, తక్కువ జీవన వ్యయమే కారణం: నాణ్యమైన విద్య, తక్కువ జీవన వ్యయమే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని అమ్రిత్ కుమార్ బస్రా చెప్పారు. అదేవిధంగా వారు వర్సిటీలోనే ఉండేలా కచ్చితమైన నియమాలను పాటిస్తున్నామన్నారు. ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసర్చ్ ప్రోగ్రామ్స్ విభాగాల్లో విదేశీ విద్యార్థులకు 5 శాతం సీట్లు రిజర్వ్ చేసినట్లు ఆమె తెలిపారు. వర్సిటీ నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు తక్కువగా అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే తప్ప, ఆ సీట్లను ఇతర కేటగిరీలకు మార్చడానికి అవకాశం ఉండదు. అదే విధంగా వర్సిటీలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా అంతర్జాతీయ హాస్టల్ సదుపాయాలు, వేర్వేరు బస్ సదుపాయం అందుబాటులో ఉందని ఆమె పేర్కొన్నారు. -
ఎవ్వరికైనా ఉచిత న్యాయ సలహాలు
ఆస్తి వివాదాల్లాంటివాటి విషయంలో ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. గతంలో కేవలం వర్సిటీకి చెందిన వారికి మాత్రమే ఈ సేవలు అందించిన విశ్వవిద్యాలయం తాజాగా ఆ సేవలు బయటవారికి కూడా విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వర్సిటీలోని గాంధీ భవన్, క్యాంపస్ లా సెంటర్లో ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సాయంతో (డీఎస్ఎల్ఎస్ఏ) సాయంతో వర్సిటీకి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మాత్రమే న్యాయ సలహాల విషయంలో ఉచిత శిక్షణను ఇస్తుంది. తాజాగా ఎవరికైనా ప్రతి శుక్రవారం మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఉచితంగా న్యాయ సలహాలు, శిక్షణను ఇస్తామని పేర్కొంది. -
డీయూ విద్యార్థుల ఆందోళన
- మానవ వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట - 40 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూఢిల్లీ: తమ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సమీపంలోని మానవ వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరిలో అత్యధిక శాతం మంది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (ఎస్ఓఎల్) విభాగానికి చెందినవారే. ఈ విషయమై ఎస్ఓఎల్ కు చెందిన దినేశ్ వర్మ అనే విద్యార్థి ఒకరు మాట్లాడుతూ ‘ మొత్తం 20 తరగతులు ఉంటాయని మాకు ఇచ్చిన క ర్కిక్యులంలో ఉంది. అయితే ఇప్పటిదాకా 13 తరగతులే జరిగాయి. పరీక్షలు సమీపిస్తున్నాయి. కోర్సు ఇంకా పూర్తికాలేదు. దీంతోపాటు అపరిషృ్కత సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని ఎస్ఓఎల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా అనుమతి తీసుకోకుండానే ఆందోళనకు దిగారనే కారణంతో ఆందోళనకు దిగిన విద్యార్థుల్లో 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోయినా తమను అదుపులోకి తీసుకున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. తమను నిర్బంధంలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. కాగా ఈ ఆందోళనకు క్రాంతికారీ యువ సంఘటన్ సంస్థ సారథ్యం వహించింది. -
పది రోజుల్లో పంజాబీ..!
పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కరీనా కపూర్కి చాలా సులువైన విషయం. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. ఓ ఉదాహరణ ‘తషాన్’. ఆ చిత్రంలో స్టయిలిష్గా కనిపించడం కోసం జీరో సైజ్కి మారిపోయారు కరీనా. ఇప్పుడు ‘ఉడ్తా పంజాబీ’ చిత్రం కోసం పంజాబీ అమ్మాయిలా శారీరక భాషను మార్చుకుంటున్నారు. అలాగే, పంజాబీ భాష కూడా నేర్చుకుంటున్నారు. ముందుగా 30 రోజుల్లో పంజాబీ భాష నేర్చేసుకోవచ్చనే పుస్తకం మీద ఆమె ఆధారపడాలనుకున్నారట. కానీ, దానికి బదులు ఓ మంచి టీచర్ని నియమించుకుంటే బాగుంటుందని అనుకున్నారు. దాంతో ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన రజత్ సింగ్ అనే ప్రొఫెసర్ దగ్గర పంజాబీ పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఈ పాఠాలు ఆరంభించకముందు తన స్నేహితులతో ‘చూస్తూ ఉండండి.. పది రోజుల్లో పంజాబీ భాష నేర్చేసుకుంటా’ అని సవాల్ కూడా విసిరారట. కరీనా అన్నంత పని చేస్తుందనీ, తనకంత ప్రతిభ ఉందని ఆ స్నేహితులు అంటున్నారు. ఆ సంగతలా ఉంచితే.. తన మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ సరసన కరీనా ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ జంట తెరపై కనిపించి దాదాపు ఏడెనిమిదేళ్లవుతుంది. సో.. ఈ చిత్రానికి భారీ ఎత్తున క్రేజ్ ఏర్పడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
మరో వివాదంలో డీయూ వీసీ దినేష్సింగ్
న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ఉపకులపతి దినేష్సింగ్ మళ్లీ మరో వివాదంలో చిక్కుకుపోనున్నారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక కుంభకోణాల్లో సింగ్ ప్రమేయం ఉందంటూ సీపీఎం నేత సీతారాం ఏచూరి రాసిన లేఖను కేంద్ర మానవ వనరుల శాఖ... రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి పంపనుంది. కాగా నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సుపై గత ఏడాది చెలరేగిన వివాదంలో దినేష్సింగ్ కూరుకుపోయిన సంగతి విదితమే. రాష్ట్రపతి ఆమోదముద్ర లేనందువల్ల ఆ కోర్సును ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. అప్పట్లో వీసీని ఆదేశించిన సంగతి విదితమే. తన కార్యాలయాన్ని వీసీ దుర్వినియోగం చేసిన కారణంగా విద్యార్థులు ఇబ్బందులకు గురవడమే కాకుండా, పాలనాపరంగా కూడా అనేక సమస్యలు తలెత్తాయంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ...సీపీఎం నేత సీతారాం ఏచూరి తన లేఖకు జత చేశారు. -
కొత్త సభ్యుణ్ణి చేర్చుకో.. టికెట్ దక్కించుకో
* అనుబంధ సంఘాల నాయకులకు పిలుపు * పార్టీ బలోపేతం చేయడానికి బీజేపీ కొత్త ఎత్తుగడ న్యూఢిల్లీ: ఢిల్లీ పీఠాన్ని దక్కించుకొనేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వప్రయాత్నాలు చేస్తోంది. ప్రచారం ఉధృతం చేయడంతోపాటు పార్టీలోకి కొత్త సభ్యులను చేర్పించడానికి బీజేపీ రాష్ర్టశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదు పెంచేందుకు అనుబంధ సంఘాల సెల్స్ను సమాయత్తం చేస్తోంది. ‘పార్టీలో నూతనంగా సభ్యులను చేర్పించిన సెల్ నాయకులకు అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నాయకుడు వెల్లడించారు. పార్టీ అనుబంధ సంఘాలివే.. యువ మోర్చా, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా, పూర్వాం చల్ మోర్చాలు ఇప్పటికే ఈ మేరకు కొత్త సభ్యులను పార్టీలో చేర్పించాలని పార్టీ నిర్ణియించింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆయా సెల్లకు పార్టీ నిర్ణయాలను తెలియజేశారు. కొత్త సభ్యులను చేర్పించిన వారికే ప్రాధాన్యత ఉంటుందనే విషయానికి కట్టుబడి ఉండాలని, తద్వారా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేలా పాటుపడాలని పిలుపు ఇచ్చారు. ‘పార్టీలో కొత్త సభ్యులను చేర్చుకోవాలని సెల్లకు ఇచ్చిన టార్గెట్స్ను పూర్తి చేయకుంటే అసెం బ్లీ ఎన్నికల టికెట్ కేటాయింపులో ఆయా సెల్ నాయకులకు ప్రాధాన్యత ఉండదని’ కూడా హెచ్చరించినట్లు బీజేపీ ఢిల్లీ శాఖ ఆఫీస్బేరర్ తెలియజేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్లో 16 లక్షల మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించినట్లు చెప్పారు. వివిధ మోర్చాలకు టార్గెట్లిలా.. వివిధ సెల్లకు పార్టీ టార్గెట్లు నిర్ణయించింది. పూర్వాంచల్ మోర్చా జనవరి 15వ తేదీ వరకు 10 లక్షల కొత్త సభ్యులను చేర్పించాలని సూచించింది. ఇప్పటి వరకు కేవలం సభ్యత నమోదు క్యాంపెయిన్ నిర్వహించి 1 లక్ష మంది కొత్త సభ్యులను చేర్పిం చింది. మైనార్టీ మోర్చా టార్గెట్ 2లక్షల మందిని చేర్పించాల్సి ఉండగా, కేవలం 40 వేల మందిని మాత్రమే చేర్పించింది. అనధికార కాలనీల్లో పట్టుసాధించడానికి పూర్వాంచల్ మోర్చా కృషి చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అక్కడ కూల్చివేతలను నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఇక్కడ బీజేపీకి పట్టు లభించే అవకాశం ఉండడంతో కొత్త సభ్యత్వాలను ముమ్మరం చేయాలని పార్టీ నిర్ణయించింది. మహిళా మోర్చాకు ఇచ్చిన టార్గెట్ 1.5 లక్షలు కాగా, ఇప్పటి వరకు 80,000 మందిని మాత్రమే పార్టీలో చేర్పించింది. కాలేజీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశాలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంలో భాగంగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, సాయంత్రం షిప్టులను నడిపించుకోవడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోపై టీచర్ల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకొంటున్నారు. వారి డిమాండ్లను పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ తూర్పు, పశ్చిమ ప్రాంగణాలను ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నరెలా, నజాఫ్ఘర్లో కాలేజీలు ఏర్పాటు చేయాలని అధ్యాపకులు సూచించారు. కొత్త హాస్టల్స్, డిజిటల్ లైబ్రరరీ ఏర్పాటు చేయాలని కోరారు. విదేశీ వర్సిటీలతో తమ కాలేజీలు అనుబంధంగా ఉండడానికి అనుమతి ఇవ్వాలని ప్రిన్సిపాళ్లు ఆయనకు సూచించారు. -
నాకూ ప్రేమకథ ఉంది!
అర్జున్.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో చురుకైన స్టూడెంట్. రూపాలీ.. మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఉద్యమించే యువతి. వీరిద్దరూ ప్రేమలో పడతారు. వారి కథే ‘యువర్ డ్రీమ్స్ ఆర్ మైన్ నౌ’. దీని రచయిత రవీందర్సింగ్. ఇటీవల సిటీలో జరిగిన ఈ పుస్తకావిష్కరణకు వచ్చిన ఆయనను సిటీప్లస్ పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. - వాంకె శ్రీనివాస్ హైదరాబాద్లోనే ఎంబీఏ.. నేను పుట్టింది కోల్కతా. పెరిగింది ఒడిశాలోని బుర్లా. కర్ణాటకలోని బీదర్లో ఇంజనీరింగ్ చదివా. హైదరాబాద్లోని ఐఎస్బీ నుంచి ఎంబీఏ చేశా. పుణేలోని ఓ ఐటీ కంపెనీలో నా జాబ్ కెరీర్ను మొదలెట్టా. అప్పుడే మాట్రిమోనియల్ వెబ్సైట్ షాదీ.కామ్ ద్వారా ‘ఖుషీ’తో పరిచయం ప్రేమగా మారింది. 2007, ఫిబ్రవరి 9న చివరి రోజు ఉద్యోగం చేసిన ఆమె ఇంటికి బయలుదేరిన క్యాబ్ను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఫిబ్రవరి 14న మా ఎంగేజ్మెంట్. ఆ టైంలో ఇలా జరగడం నన్ను కోలుకోనివ్వలేదు. భువనేశ్వర్లో ఫ్రెండ్తో కలిసి ఉన్న సమయంలో ఓ పుస్తకం చదువుతుండగా...నాకూ బుక్ రాయాలనిపించింది. ఫ్రెండ్తో చెప్పా. అలా నా తొలి పుస్తకం ‘ఐ టూ హడ్ ఏ లవ్స్టోరీ’ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత... కెన్ లవ్ హాపెన్ టై్వస్, లైక్ ఇట్ హంపెండ్ యెస్టర్డే పుస్తకాలు కూడా భారీగానే అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇదే కోవలో...కాస్త విభిన్నంగా ‘యువర్ డ్రీమ్స్ ఆర్ మైన్ నౌ’ పుస్తకాన్ని తీసుకొచ్చా. ఢిల్లీ యూనివర్సిటీలో జరిగే స్టూడెంట్ రాజకీయాలను వివరిస్తూనే.. ఓ యువకుడు, యువతి మధ్య సాగిన ప్రేమాయణాన్ని కథాంశంగా ఎంచుకొని ముందుకెళ్లా. అర్జున్, రూపాలీ పేర్లను కామన్గా ఎంచుకున్నా. ఫేస్బుక్లో చివరి ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరి పేర్లను ఈ కథకు ఎన్నుకున్నా. దేశాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉద్యమమే నన్ను ఈ కథవైపు మళ్లించింది. నా తొలి మూడు పుస్తకాల మాదిరే ఈ బుక్కీ ఆదరణ లభిస్తుందనుకుంటున్నా. సిటీ బ్యాక్డ్రాప్తో త్వరలో పుస్తకం హైదరాబాద్లో నా కథలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సిటీతో నాకు మంచి అనుబంధం ఉంది. భవిష్యత్లో సిటీని వేదికగా చేసుకొని పుస్తకం తీసుకొస్తాను. ఉద్యోగం చేస్తూనే పుస్తకాలు రాసేంత తీరిక ఎలా దొరుకుతుందని చాలామంది నన్నడుగుతుంటారు. మహిళలు ఉద్యోగాలు చేస్తూనే ఇంటికెళ్లి పిల్లలు, కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వాళ్లనే స్ఫూర్తిగా తీసుకొని రచనకు సమయం వెచ్చిస్తున్నా. అయితే నా తొలి పుస్తకం ‘ఐ టూ హాడ్ ఏ లవ్స్టోరీ’ రాస్తున్నప్పుడు ఏడ్చిన సందర్భాలున్నాయి. ఆ కథ ఎన్నో లక్షల మంది హృదయాలను తాకింది. రాజకీయాలపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. వీలు చిక్కితే క్రికెట్ ఆడుతుంటా. సినిమాలూ చూస్తుంటా. -
రేపిస్టుకు రెండేళ్లపాటు శిక్ష తగ్గింపు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన దౌలాఖాన్ సామూహిక లైంగిక దాడికేసులో నిందితులకు రెండేళ్లపాటు శిక్షను తగ్గిస్తూ ఢీల్లీ హైకోర్టు శనివారం తీర్పు చెప్పింది. 2005లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినిపై నడుస్తున్న కారులో నిందితులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ట్రయల్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించగా, ఈ శిక్షను 12 ఏళ్లకు తగ్గించింది. ఈ కేసులో నిందితుడు అజిత్ సింగ్ కత్యార్కు జైలు శిక్షతోపాటు రూ. 20,000లను విధిస్తూ డిసెంబర్ 9, 2005లో ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రతిభా రాణి కేసు పూర్వాపరాలను పరిశీలించి శిక్షను తగ్గించాలని ఆదేశించింది. ఈ కేసులో నేరస్తుడు క్రూరంగా ప్రవర్తించినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొన్నారు. అంతేగాక సహనిందితులైన మరో ముగ్గురిని పోలీసులు ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. ఒకే నిందితుడికి ఈ శిక్షను ఎలా అమలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. -
కులాంతర వివాహం చేసుకుందని.. పీక పిసికేశారు!
దేశరాజధాని ఢిల్లీలో అత్యంత ఘోరమైన ఘటన జరిగింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రతిష్ఠాత్మక వెంకటేశ్వర కాలేజిలో చదువుతున్న తమ 21 ఏళ్ల కూతురిని కన్న తల్లిదండ్రులే పీక పిసికి చంపేశారు. ఇందుకు వాళ్ల బంధువు కూడా సహకరించారు. తర్వాత మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లి అక్కడ కప్పెట్టేశారు. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్థానిక కాంగ్రెస్ కార్యకర్త అయిన జగ్మోహన్, ఆయన భార్య సావిత్రిలను పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల కూతురు భావన (21) ఈనెల 12వ తేదీన ఆర్యసమాజంలో అభిషేక్ సేఠ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అతడు కేబినెట్ సెక్రటేరియట్లో అసిస్టెంట్ ప్రోగ్రామర్గా పనిచేస్తున్నాడు. భావన రాజస్థానీ యాదవ కులానికి చెందినది కాగా, అభిషేక్ పంజాబీ. ఆమెను క్షమించేశామని, పద్ధతిగా పెళ్లి చేస్తామని పిలిపించి మరీ భావనను చంపేశారని పోలీసులు తెలిపారు. వారిపై పక్కా సాక్ష్యాలు ఉండటంతో తల్లిదండ్రులను అరెస్టు చేశామన్నారు. -
ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని ఆత్మహత్య
న్యూఢిల్లీ: నడుస్తున్న రైలు కిందపడి ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని (20) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానిక రేస్ కోర్సు మెట్రో స్టేషన్లో ఎల్లో మార్గం మంగళవారం సాయంత్రం గం. 3.45 నిమిషాలకు చోటుచేసుకుంది. రెండో నంబర్ ప్లాట్ఫాంకు చేరుకున్న విద్యార్థిని అప్పుడే స్టేషన్కు వచ్చిన విద్యార్థిని హుడా సిటీ సెంటర్ స్టేషన్ నుంచి జహంగీర్పుర దిశగా వెళుతున్న రైలును గమనించి వెంటనే పట్టాలపైకి దూకింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని సమీపంలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారని రైల్వే శాఖ డీసీపీ సంజయ్ భాటియా తెలిపారు. అయితే ఈ చర్యకు గల కారణాలను నిర్ధారించాల్సి ఉందన్నారు. ఘటనాస్థలిలో తమకు ఎటువంటి సూసైడ్ నోటూ లభించలేదన్నారు. మృతురాలిని నైరుతి ఢిల్లీలోని నజఫ్గఢ్కు చెందిన మూర్తజాగా గుర్తించామన్నారు. కాళింది కళాశాలలో బీఏ చివరి సంవత్సరం చదువుతోందన్నారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు కార్డు మృతురాలి దుస్తుల్లో లభించిందన్నారు. కాగా ఈ ఘటన కారణంగా ఎల్లో మార్గంలో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
యువ, విద్యార్థి విభాగాలను ప్రారంభించిన ఆప్
న్యూఢిల్లీ: స్వాంతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ 107వ జయంతిని పురస్కరించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ యువ, విద్యార్థి విభాగాలను ప్రారంభించింది. ఆప్ యువ విభాగం(ఏవైడబ్ల్యూ), ఛాత్రా యువ సంఘర్ష్ సమితి(సీవైఎస్ఎస్)గా రెండు విభాగాలకు నామకరణం చేశారు. పార్టీని అట్టడుగుస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఈ రెండు విభాగాలు పనిచేస్తాయని ఆప్ నేత ఒకరు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేకపోవడంతో ముందుగా పార్టీని బలోపేతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావించింది. అందుకోసం మిషన్ విస్తార్ను ప్రారంభించింది. మిషన్ విస్తార్లో భాగంగానే ఈ రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. యువ వలంటీర్లను సమీకరించేందుకు, వారిద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ రెండు విభాగాలు ఎంతగానో ఉపకరిస్తాయని పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రచారం కోసం యువత అవసరం ఎంతైనా ఉందని, అందుకోసం ఇటువంటి విభాగాలు ఉండడం అవసరమని, అయితే మిగతా పార్టీల్లాగా యువశక్తిని తాము దుర్వినియోగం చేయబోమని పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన రెండు విభాగాలు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువకుల ముందు ఉన్న మంచి వేదికలని, దేశం కోసం పనిచేసే యువకులకు స్వాగతం పలికేందుకు ఈ వేదికలు రెండూ సిద్ధంగా ఉంటాయని కేజ్రీవాల్ చెప్పారు. ప్రతిఒక్కరూ భగత్సింగ్లాంటివాళ్లు పుట్టాలని చెబుతారని, అయితే పుట్టే బిడ్డ తమ ఇంట్లో కాకుండా పక్కింట్లో పుట్టాలని కోరుకుంటారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇటువంటి వ్యవస్థను, ప్రజల ఆలోచన తీరును మార్చేందుకే తాము ఈ రెండు విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ‘నేను ఐఐటీ ఉత్తీర్ణుడినైనప్పుడు దేశానికి ఎలా సేవ చేయాలా? అని ఆలోచించేవాడిని. కానీ ఇవాళ నేనో స్థితిలో ఉన్నాను. యువకులకు కూడా దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాను. ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీ వల్లే సాధ్యమైంది. అందుకే యువతకు చెబుతున్నా... మీరు దేశానికి సేవ చేయాలని భావిస్తే అందుకు ఏవైడబ్ల్యూ, సీవైఎస్ఎస్లను ఎంచుకోండి. మీలాంటి వారికి ఇవి మంచి వేదికలవుతాయన్నారు. వచ్చే ఏడాది ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిల్లియా యూనివ ర్సిటీల్లో జరిగే విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆప్ విద్యార్థి విభాగం కూడా పోటీ చేస్తుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. -
విద్యార్థి సంఘాల రాజకీయాల్లో పెను నాటకీయ మార్పులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎంతోపేరుగాంచిన ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ), జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ)లలో విద్యార్థి రాజకీయాలు ఈ పర్యాయం అనేకమందిని తీవ్ర సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశాయి. విద్యార్థి సంఘాల రాజకీయాల్లో పెను నాటకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జేఎన్యూలో తన పట్టును పెంచుకోగా మరోవైపు వామపక్షాల మద్దతుతో ముందుకు సాగుతున్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (ఏఐఎస్ఏ)... ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన ఓటు వాటాను పెంచుకుంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (ఏఐఎస్ఏ)...1990లో ఆవిర్భవించింది. సీపీఎంకు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థ అప్పటినుంచి జేఎన్యూలో బలంగా ఉంది. అయితే క్రమేణా దీని ఓటువాటా తగ్గుతోంది. ఇక ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విషయానికొస్తే ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) విజయం కోసం ఆఖరి నిమిషందాకా హోరాహోరీగా పోరాడాయి. విజయం ఎవరిని వరించిందనే విషయాన్ని పక్కనబెడితే ఈ ఎన్నికల్లో ఏఐఎస్ఏ మంచి ఫలితాలను సాధించింది. తనకు కంచుకోటగా భావించే ఢిల్లీ విశ్వవిద్యాలయం డీయూ విద్యార్థి సంఘం (డూసూ)కు తాజాగా జరిగిన ఎన్నికల్లో 18 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఏబీవీపీ... నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. అయితే జవహర్లాల్ నెహ్రూ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్)కి జరిగిన ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంది. ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శ పదవులకు ఈ సంస్థ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు తృతీయ స్థానంలో నిలిచారు. ఈ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల చరిత్రలో ఈ తరహా ఫలితాలు గతంలో ఏనాడూ రాలేదు. అంతేకాకుండా ఏబీవీపీ కౌన్సిలర్ల వాటా కూడా బాగా పెరిగింది. గత ఏడాది వీరి సంఖ్య 12 కాగా అది ఈసారి 26కు చేరుకుంది. 1970లో ఆవిర్భవించిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ)లో వామపక్షాలకు ఆదినుంచి పట్టు ఉంది. ఈ విశ్వవిద్యాలయం నుంచే అనేకమంది కమ్యూనిస్టు నాయకులు పుట్టారు. జాతీయ రాజకీయాల వరకూ ఎదిగారు. అయితే ఆ స్థాయి ప్రభావం కాలక్రమేణా తగ్గుతున్న సూచనలే కనిపిస్తున్నాయి. విసిగిపోయి ఉండొచ్చు: రోహిత్ ఈ విషయమై ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రోహిత్ చాహల్ మాట్లాడుతూ వామపక్ష పార్టీల రాజకీయాలపట్ల విద్యార్థులు విసిగిపోయి ఉండొచ్చన్నారు. వామపక్ష గ్రూపులు విద్యార్థుల సమస్యలపై అంత ఆసక్తి చూపకపోవచ్చని అనుకుంటున్నాను. కేరళ, పశ్చిమబెంగాల్ వామపక్ష పార్టీలకు గతంలో ఎంతో పట్టు ఉంది. అయితే అది కాలక్రమేణా తగ్గిపోతోంది. అదే పరిస్థితి ఇక్కడ కూడా పునరావృతమవుతోందని నాకు అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా 1948లో ఆవిర్భవించిన ఏబీవీపీకి ఢిల్లీతోపాటు హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్ విశ్వవిద్యాలయాల్లోనూ గట్టి పట్టు ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న కారణంగానే ఏబీవీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించగలిగిందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ఆరోపించింది. ఈ విషయమై ఆ సంస్థ తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన పిండిగ అంబేద్కర్ మీడియాతో మాట్లాడుతూ సైన్సు విభాగాల్లో ఏబీవీపీకి గట్టి పట్టు ఉందన్నారు. దీనికితోడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇదివారికి కలిసొచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కంటే ఈ పర్యాయం జరిగిన ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించామన్నారు. తమ ఓటుశాతం పెరిగిందన్నారు. గత ఏడాదికంటే 600 ఓట్లు ఎక్కువగా వచ్చాయన్నారు. తమకు కూడా ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారన్నారు. 2012లో తమ సంస్థలో చీలికలు వచ్చాయని, దాని వల్ల కొంతమేర దెబ్బతిన్నామని అన్నారు. త్వరలోనే తాము కూడా కోలుకుంటామన్నారు. కాగా సీపీఎంకి అనుబంధంగా ఎస్ఎఫ్ఐ పనిచేస్తోంది. -
డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
అనుకున్నట్లే అయ్యింది. ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఘన విజయం సాధించింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పోస్టులు నాలుగింటినీ భారీ ఆధిక్యంతో చేజిక్కించుకుంది. ఈ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సు నాలుగేళ్ల పాటు కొనసాగించాలని జరిగిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో ఏబీవీపీ ఇటీవలే విజయం సాధించింది. అది చాలామంది విద్యార్థుల దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 50 కళాశాలల్లో చదువుతున్న దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారు. -
ఢిల్లీ వర్సిటీపై కాషాయ నజర్!
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు మొదలయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ యూనివర్సిటీలో పాగా వేసేందుకు కాషాయ వర్గాలు సిద్ధంగా కనిపిస్తున్నాయి. ఏబీవీపీయే ఇక్కడ జెండా ఎగరేస్తుందని గట్టిగా చెబుతున్నారు. ఈ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సు నాలుగేళ్ల పాటు కొనసాగించాలని జరిగిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో ఏబీవీపీ ఇటీవలే విజయం సాధించింది. అది చాలామంది విద్యార్థుల దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఏబీవీపీయే తీయించేసిందని, ఇది తమలాంటివాళ్లకు చాలా ఉపయోగపడిందని బీఏ ఎకనమిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉజ్వల్ కుమార్ అనే విద్యార్థి చెప్పాడు. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని మూడో సంవత్సరం పొలిటికల్ సైన్స్ చదువుతున్న ఆచల్ కూడా విశ్వాసం వ్యక్తం చేసింది.ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 50 కళాశాలల్లో చదువుతున్న దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారు. -
‘డూసూ’.. ధూంధాం..!
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి యూనియన్ల ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. పోటీలో ఉన్న అన్ని విద్యార్థి యూనియన్లు ప్రచార కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. ఈ నెల 12 వ తేదీ ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డీయూఎస్యూ) ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతున్నట్లు డీయూ ప్రధాన ఎన్నికల అధికారి డీఎస్ రావత్ తెలిపారు. విద్యార్థి ఎన్నికల్లో దేశంలోనే మొదటిసారి ఈవీఎంలను వాడుతున్నట్లు ఆయన వివరించారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద వీలైనన్ని ఎక్కువగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. దీంతో పాటు ఎన్నికల ప్రక్రియను రికార్డ్ చేసేందుకు ప్రైవేట్ వీడియోగ్రాఫర్లను సైతం నియమిస్తున్నట్లు ఆయన వివరించారు. కాగా, ఎన్నికల పోటీచేస్తున్న వివిధ విద్యార్థి సంఘాలు గత శుక్రవారమే ఆయా పోస్టులకు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ అనుబంధ సంఘమైన నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) తమ సంఘం తరఫున మోతీలాల్ నెహ్రూ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న తుషార్ను అధ్యక్ష పదవికి, లా కళాశాల విద్యార్థిని మోనా చౌదరిని ఉపాధ్యక్ష పదవికి, ఆర్ట్స్కు చెందిన అమిత్ సింగ్ తిమ్మా, అభిషేక్ చౌదరీలను కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు తమ అభ్యర్థులుగా ప్రకటించింది. అలాగే బుద్ధిస్ట్ స్టడీస్ విద్యార్థులైన మోహిత్ నగర్, పర్వేష్ మాలిక్లను తమ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రకటించింది. కాగా, పర్వీష్ మాలిక్ అభ్యర్థిత్వంపై అధికారులతోపాటు ఇతర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గత ఏడాది ఫిబ్రవరిలో వర్సిటీలో జరిగిన ఒక గొడవలో మరో 14 మందితోపాటు పర్వీష్పై కేసు నమోదైంది. దానిపై అతడికి షోకాజ్ నోటీస్ కూడా అందిందని, ఈ విషయాలన్నీ పరిశీలించిన మీదట అతడి అభ్యర్థిత్వంపై తగిన నిర్ణయం తీసుకుంటామని రావత్ తెలిపారు. అలాగే ఏఆర్ఎస్డీ కళాశాల విద్యార్థి కనిక షెకావత్ను కార్యదర్శి పదవికి, జాకీర్ హుస్సేన్ కళాశాల విద్యార్థి అశుతోష్ మాథుర్ను సంయుక్త కార్యదర్శి పదవికి రంగంలోకి దించింది. తమ ఉద్యమం వల్లే నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చేశారని ఏబీవీపీ ప్రచారం చేసుకుంటోంది. అలాగే, డీయూలో ప్రధాన నాలుగు సీట్లను తామే గెలుచుకుంటామని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రోహిత్ చాహల్ ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు తగిన వసతి కల్పించాలని ఎన్ఎస్యూఐ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా హిందూ కళాశాలలో చదువుతున్న మధురిమ కుందును అధ్యక్ష బరిలో, దయాళ్ సింగ్ కళాశాల విద్యార్థి అమన్ నవాజ్ను ఉపాధ్యక్ష బరిలో దించుతున్నట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) తెలిపింది. అలాగే కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు అమన్ గౌతమ్, విక్రమాదిత్యలను రంగంలోకి దింపింది. ఇంతకుముందు డూసూ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ మధ్యే పోటీ నెలకొనేదని, ఈసారి ఆ పరిస్థితి మారుతుందని ఏఐఎస్ఏ ప్రతినిధి సన్నీకుమార్ వ్యాఖ్యానించాడు. కాగా, ఈసారి విద్యార్థి సంఘాల ఎన్నికల్లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ), ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఏఐడీఎస్ఓ), అరుణాచల్ స్టూడెంట్స్ ఫెడరేషన్(ఏఎస్ఎఫ్) కలిసి లెఫ్ట్ స్టూడెంట్స్ ఫ్రంట్(ఎల్ఎస్ఎఫ్)గా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఈ కూటమి తరఫున విక్రమ్ సింగ్, ప్రశాంత్ ముఖర్జీ, శ్రేయ, దీపక్ షా బరిలో ఉన్నారు. ఈ ఏడాదే కొత్తగా ఏర్పడిన విద్యార్థి సంఘం చాణక్య పరిషత్ తరఫున ఆదిత్య పాండే, షహ్రాజ్, దివ్యాంశు ప్రియం, అంతరిక్ష్ రాణా లను రంగంలోకి దింపింది. ఇదిలా ఉండగా, డూసూ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3వ తేదీనే ముగిసింది. ఒక విద్యార్థి దరఖాస్తు రద్దు చేశామని, మరో 115 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని రావత్ తెలిపారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత అధ్యక్ష పదవికి ఏడుగురు, ఉపాధ్యక్షుడి పదవికి ఆరుగురు, కార్యదర్శికి ఎనిమిది మంది, సంయుక్త కార్యదర్శి పదవికి ఏడుగురు బరిలో మిగిలారు. 12వ తేదీన రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, 13వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల కమిటీ ప్రకటించింది. గత ఏడాది డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ ప్రధాన పోస్టుల్లో మూడింటిని గెలుచుకుని విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఒక్క కార్యదర్శి పదవిని మాత్రం ఎన్ఎస్యూఐ కైవశం చేసుకోగలిగింది. ఇదిలా ఉండగా, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్, బీజేపీ నేత విజయ్ గోయల్ తదితరుల రాజకీయ జీవితం వర్సిటీ నుంచే ప్రారంభమైంది. -
ప్రచారానికి డూసూ రేడియో సిద్ధం
న్యూఢిల్లీ: యూనివర్సిటీ రేడియోను ప్రచారం నిమిత్తం విద్యార్థి సంఘాలు వాడుకోవచ్చని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు వర్సిటీతోపాటు అనుబంధ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను సైతం కలుసుకోవాల్సి ఉంది. అయితే వీరు ఆయా కళాశాలలకు వెళ్లి విద్యార్థులందరినీ ముఖాముఖి కలిసేందుకు ఉన్న అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు రేడియో ద్వారా విద్యార్థులకు చేరువయ్యేందుకు అనుమతిస్తున్నట్లు డూసూ ప్రధాన ఎన్నికల కమిషనర్ డీఎస్ రావత్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కమ్యూనిటీ రేడియో 90.4 ఎంహెచ్జెడ్ను అభ్యర్థులు తమ ప్రచారానికి వాడుకోవచ్చని ఆయన తెలిపారు. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా 5 నిమిషాలు సమయం ఇస్తామని చెప్పారు. ముఖ్య ఎన్నికల అధికారి, ముఖ్య రిటర్నింగ్ అధికారి, రిటర్నింగ్ అధికారి సభ్యులుగా ఉన్న కమిటీకి సదరు అభ్యర్థుల ప్రసంగాలను ఎడిట్ చేసే హక్కు ఉంటుందన్నారు. కాగా రేడియో ద్వారా తమ ప్రసంగాన్ని వర్సిటీ విద్యార్థులందరికీ వినిపించడం అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, కమ్యూనిటీ రేడియో ద్వారా తమ ప్రసంగం వినిపించడానికి అభ్యర్థులకు కేటాయించిన 5 నిమిషాల సమయం చాలా తక్కువని ఎన్ఎస్యూఐ అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే అభిప్రాయపడ్డారు. ‘అభ్యర్థులు వర్సిటీ అనుబంధ కళాశాలన్నింటికీ వెళ్లి విద్యార్థులను కలిసి ప్రచారం చేయడం కొంత కష్టంతో కూడుకున్న పనే.. అలాగే ప్రైవేట్ ఎఫ్ఎం చానళ్ల ద్వారా ప్రచారానికి నిబంధనలు ఒప్పుకోవడం లేదు.. ఇటువంటి సమయంలో కమ్యూనిటీ ఎఫ్ఎం ద్వారా అభ్యర్థులకు ప్రచారానికి అవకాశం కల్పించడం మంచిదే..’ అని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి రోహిత్ చహల్ అన్నారు. ఇదిలా ఉండగా, అభ్యర్థులనుంచి వచ్చే అభ్యర్థనలబట్టి వారికి కేటాయించే సమయంలో కొంత మార్పులుచేర్పులు చేసే అవకాశముందని సీఈవో స్పష్టం చేశారు. కాగా, కమ్యూనిటీ రేడియో 2007లో ప్రారంభమైంది. విద్యార్థి సంఘాల ఎన్నికల ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి. డూసూ నామినేషన్లు పూర్తి ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డూసూ) ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో పూర్తయినట్లు ప్రధాన ఎన్నికల అధికారి డి.ఎస్.రావత్ తెలిపారు. నాలుగు పదవులకు గాను మొత్తం 144 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన చెప్పారు. వీటిలో అధ్యక్ష పదవికి 37, ఉపాధ్యక్ష పదవికి 32 దరఖాస్తులు చెల్లుబాటయ్యాయని రావత్ తెలిపారు. అలాగే కార్యదర్శికి 41, సంయుక్త కార్యదర్శి పదవికి 34 దరఖాస్తులు చెల్లుబాటయ్యాయని చెప్పారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని రావత్ తెలిపారు. -
డీయూ విద్యార్థులకు త్వరలో ప్రత్యేక బస్సు సేవలు
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) విద్యార్థులకు శుభవార్త. ఉత్తర, దక్షిణ ప్రాంగణాల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు త్వరలో ప్రత్యేక బస్సు సేవలు అందనున్నాయి. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రతినిధుల బందం కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయమంత్రి కిషన్పాల్ గుజ్జార్ను కలిసింది. విద్యార్థులకోసం ప్రత్యేక బస్సు సేవలు అందించాలని కోరుతూ ఆయనకు ఓ వినతిపత్రం సమర్పించింది. ఇందుకు మంత్రి కి షన్పాల్ సానుకూలంగా స్పందించారు. త్వరలో సేవలను ప్రారంభిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఏబీవీపీ కార ్యదర్శి రోహిత్ చహాల్ వెల్లడించారు. కాగా నగరంలోని ఆయా మెట్రో స్టేషన్ల వద్దనుంచి ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ)కి చెందిన మూడు బస్సులు ఉత్తర ప్రాంగణానికి విద్యార్థులను చేరవేస్తున్నాయి. కాగా డీయూకి అనుబంధం గా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 78 అనుబంధ కళాశాలలు ఉన్నాయి. -
ఇవేమి ఆంక్షలు?
ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేయకుండా అడ్డుకునేందుకు లింగ్డో కమిటీ చేసిన సిఫారసులు అమల్లోకి రావడం విద్యార్థి సంఘం నాయకులతోపాటు అభ్యర్థులకు గొంతులో వెలక్కాయ పడినట్టయింది. ఈ ఆంక్షలపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వ్యయాన్ని కేవలం రూ.5,000లకే పరిమితం చేశారని, ప్రస్తుత ధరల నేపథ్యంలో ఈ మొత్తం తో ప్రచార పర్వాన్ని ముగించడం అత్యంత కష్టమని వారంటున్నారు. న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికలకు సంబంధించి జె.ఎం.లింగ్డో కమిటీ చేసిన సిఫారసులపై పలు రాజకీయ పార్టీలకు చెందిన అనుబంధ సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కండ బలం, ధనబలాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఎన్నికల వ్యయాన్ని రూ. 5,000లకే పరిమితం చేయాలంటూ లింగ్డో కమిటీ గతంలో చేసిన సిఫారసును డీయూ అమలుచేసింది. ఈ ఆంక్షలపై ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషన ర్ నేతృత్వంలోని కమిటీ... ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని రూ. 5,000లకే పరిమితం చేయాలంటూ 2005లో సిఫారసు చేసింది. ఈ సిఫారసులను అమలు చేయాలంటూ 2006లో అత్యున్నత న్యాయస్థానం డీయూని ఆదేశించింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అనుబంధ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అమ్రిష్ వాదనను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యదర్శి రోహిత్ చాహల్ సమర్థించారు. ‘దాదాపు 50 కళాశాలల్లో ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ రూ. 5,000 పెట్రోలు ఖర్చులకు కూడా సరిపోవు. అందువల్ల పూర్తిస్థాయిలో ప్రచారం చేయడం సాధ్యపడదు. డీయూ మార్గదర్శకాల ప్రకారం కరపత్రాలను కూడా పంపిణీ చేయకూడదు. ప్రచారం కోసం చేతితో చేసిన పోస్టర్లనే వినియోగించుకోవాల్సి ఉంటుంది’ అని అన్నారు. ఇదే విషయమై ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ నాయకుడొకరు మాట్లాడుతూ ‘డబ్బు ఖర్చు చేయకూడదు. విరాళాలు స్వీకరించకూడదు.50 క ళాశాలల్లోనూ కరపత్రాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇన్ని ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు ప్రచారం ఏవిధంగా చేయగలుగుతాం’ అని ప్రశ్నించారు. కాగా ఈ నెల 12వ తేదీన ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు ఆయా విద్యార్థి సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. అదే నెల మూడో తేదీలోగా అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐదో తేదీలోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది డూసూకి జరిగిన ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయదుందుభి మోగించింది. అప్పటి ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి రాజు సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అమన్ అవానా, ఉత్కర్ష్ చౌదరి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఇక భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) కేవలం ఒక్కస్థానంలోనే జయకేతనం ఎగురవేసింది. ఆ సంఘం తరఫున బరిలోకి దిగిన కృష్ణ ఠాకూర్ కార్యదర్శిగా ఎన్నికైన సంగతి విదితమే. గట్టి నిఘా ఉంచుతాం ఇదే విషయమై ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల వ్యయానికి సంబంధించి గట్టి నిఘా ఉంచుతామన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే జరిమానా విధిస్తామన్నారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. -
ఢిల్లీ వర్సిటీలో ఎన్నికల సందడి
న్యూఢిల్లీ బ్యూరో: ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్నికల సందడి నెలకొన్నది. యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డూసూ) ఎన్నికల ప్రచారం మొదలైంది. సెప్టెంబర్ 12వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు తమ ఎజెండాలతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ ఆయా విద్యార్థి సంఘా లు క్యాంపస్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సెప్టెంబర్ 12వ తేదీన డూసూ ఎన్నికలు జరగనున్నా యి. అదే నెల 3వ తేదీలోగా అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. 5వ తేదీ లోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ప్రచారంలో మాతృసంస్థల నాయకులు విద్యార్థి ఎన్నికల ప్రచారంలో ఆయా మాతృ సంస్థ లు కూడా పాలుపంచుకొంటున్నాయి. ఈసారి కేం ద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. అదే ఉత్సాహంతో దాని అనుబంధ సంస్థ అయిన సంస్థ అఖిల భార త విద్యార్థి పరిషత్( ఏబీవీపీ) యూనివర్సిటీ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్, బీజేపీల సూచనల మేరకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలనే ఆలోచనలో పడింది. బీజేపీ సీనియర్ నేతలు విద్యార్థి విభాగం ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినాయువ నేతలు మాత్రం ప్రచారంలోకి దిగుతున్నారు. శుక్రవార బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నార్త్ కేంపస్లోని ఎస్ఆర్సీసీ కళాశాలను సందర్శిం చారు. కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, అస్కార్ ఫెర్నాండెజ్, అర్విందర్ సింగ్ లవ్లీ తదిత రులు ఎన్ఎస్యూఐ విజయం కోసం రంగంలోకి దిగారు. క్యాంపస్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వయంగా విద్యార్థులను కలుస్తూ ఎన్ఎస్యూఐకు అండగా ఉండాలని కోరుతున్నారు. ఎన్ఎస్యూ కార్యకర్తలు పలు విద్యార్థి సమస్యలపై వీథి నాటకాలను ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రత, ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల భద్రత, వసతులు, క్రీడల మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై విద్యార్థులను చైతన్యం చేస్తున్నారు. ఎన్ఎస్యూఐ ఒక అడుగు ముందుకేసి క్యాంపస్లో వసతి సదుపాయాలపై రైట్టు అకామిడేషన్ ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. రాను న్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో ఆప్ నాయకత్వం తలమునకలై ఉంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) అనుబంధ విద్యార్థి విభాగం డుసూ ఎన్నికల్లో పోటీచేయరాదని ఆ పార్టీ విద్యార్థి విభాగం చాత్ర యువ సంఘర్ష్ సమితి ( సీవైఎస్ఎస్) నిర్ణయించింది. 12న జెఎన్యూ ఎన్నికలు న్యూఢిల్లీ: సెప్టెంబర్ 12న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(జేఎన్యూఎస్ఐ) ఎన్నికలు జరుగుతాయని విశ్వవిద్యాలయం ఎన్నికల విభాగం ప్రకటించింది. 3వ తేదీ మంగళవారం నాటికి నామినేషన్ల దాఖలు చేయాలని, బుధవారం నుంచి ప్రచారాన్ని నిర్వహించాలని ఎన్నికల విభాగం అధికారి పేర్కొన్నారు. ఒకేసారి ఎన్నికలు ఈసారి జేఎన్యూఎస్ఐ, ఢిల్లీ యూనివర్సిటీల విద్యార్థి విభాగం ఎన్నికలు ఒకేసారి వ చ్చాయి. గత సంవత్సరం జరిగిన జేఎన్యూఎస్ఐ ఎన్నికల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఐ) కీలక పదవులను గెలుచుకొంది. సీపీఎం అనుబంధ స్టూడెంట్స్ యూనియన్ ( ఎస్ఎఫ్ఐ), డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(డీఎస్ఎఫ్) ఈ సారి కూటమిగా ఎన్నికల బరిలో దిగు తున్నాయి. -
త్వరలో ఎఫ్ఓపీ విధానం బ్లాక్ బోర్డుకిక గుడ్బై!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ప్రవేశాలకు ఈ ఏడాది వచ్చిన స్పందనతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) అనుబంధ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (ఎస్ఓఎల్) తన బోధనా విధానాలను మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించింది. పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రాం కింద ‘ఫ్లిప్డ్ క్లాస్రూం టెక్నాలజీ (ఎఫ్సీటీ)’ని అందుబాటులోకి తీసుకురానుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేరకు బ్లాక్ బోర్డు బోధనా విధానానికి వీలైనంతమేర స్వస్తి పలకనుంది. ‘ఫ్లిప్డ్ క్లాస్రూం టెక్నాలజీ’ విధానంలో విద్యార్థి తమకు అనుకూలమైన సమయంలో బోధనా తరగతులకు హాజరు కావొచ్చు. ఈ విషయమై ఎస్ఓఎల్ సంచాలకుడు సీఎస్ దూబే మాట్లాడుతూ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ ఏడాది విశేష స్పందనలభించిందన్నారు. మొత్తం లక్షమంది విద్యార్థులు చేరారని, అందులో సగం మంది ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందినవారేనన్నారు. ఆన్లైన్ద్వారానే తాము ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను కూడా అందజేస్తున్నామన్నారు. ఎస్ఓఎల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు విశ్వవిద్యాలయానికి చెందిన సహవిద్యార్థుల మాదిరిగా ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారన్నారు. వారు ఏదో ఒక పాక్షిక సమయ ఉద్యోగం చేస్తుండడమో లేదా పరిమితులు ఉండడమో జరుగుతోందన్నారు. తాము అందుబాటులోకి తీసుకురానున్న అత్యాధునిక సాంకేతిక విధానం వల్ల ఎస్ఓఎల్ విద్యార్థులు తమ తమ అధ్యయన కేంద్రాలకు వచ్చే అవసరాన్ని తగ్గించేస్తుందన్నారు. వీరంతా తమ ఇంటి వద్దనుంచే అంతర్జాలాన్ని వినియోగించుకుని వీడియో తరగతులకు హాజరవుతారన్నారు. లేదా తమకు అనుకూలమైన సమయంలో లెక్చరర్ల బోధనలను ఆలకిస్తారన్నారు. కాగా ఈ ఏడాది చివరినాటికల్లా ఆయా కోర్సులకు సంబంధించిన సామగ్రి/వీడియోలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎస్ఓఎల్ యోచిస్తోంది. అదే సమయానికల్లా ‘ఫ్లిప్డ్ క్లాస్రూం టెక్నాలజీ (ఎఫ్సీటీ)’ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే ఎస్ఓఎల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులందరికీ ఇంటర్నెట్ వెసులుబాటు ఉండకపోవడంగానీ లేదా వారికి దానిపై ఆసక్తి లేకపోవడంగానీ జరగకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ విధానం కింద చేరిన విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఉంటాయన్నారు. వారికి సాఫ్ట్కాపీగానీ లేదా హార్డ్ కాపీనిగానీ అందజేస్తామన్నారు.ఈ అంశంపై శనివారంనాటి ఎస్ఓఎల్ పాలకమండలి సమావేశంలో చర్చ జరిగిందని, పాఠ్యపుస్తకాల కంటే విద్యార్థులకు డీవీడీలు ఇవ్వడమే ఉత ్తమమని ఆ సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయిం చారని ఆయన వివరించారు. -
ఆవరణలు అద్దెకి..!
నిర్వహణకు అవసరమైన వనరులపై ఢిల్లీ విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. ఇందులోభాగంగా తన పరిధిలో పనిచేస్తున్న కళాశాలలు, ఎన్జీఓలతోపాటు ఇతర సంస్థలకు మౌలిక వసతులను కిరాయి ప్రాతిపదికన ఇవ్వనుంది. ఇటీవల జరిగిన విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ: మౌలిక వసతుల నిర్వహణ నానాటికీ పెరిగిపోతుండడంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) వనరుల అన్వేషణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం 2010 నాటి కామన్వెల్త్ క్రీడల సమయంలో నిర్మించిన రెండు స్టేడియంలతోపాటు తన ప్రాంగణంలోని కొన్ని మౌలిక వసతులను అద్దెకు ఇవ్వనుంది. అయితే వీటి లో వాణిజ్యేతర అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలనే నిబంధనను విధించనుంది.ఈ విషయాన్ని డీయూ మీడియా సమన్వయకర్త, విద్యార్థి సంక్షేమ సంఘం జాయింట్ డీన్ మలయ్ నీరవ్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలకు అవసరమైన నిధులను సమీకరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచనకు తెర తీశామన్నారు. ఇటీవల జరిగిన విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి సమావేశంలో పైవిధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. రగ్బీ స్టేడియం, పోలో మైదానం, కాన్ఫరెన్స్ సెంటర్, అకడమిక్ రీసెర్చి సెంటర్, యాక్టివిటీ సెంటర్, శంకర్లాల్ కన్సర్ట్ హాల్, ఠాగూర్ హాల్ తదితరాలను అడిగినవారికి అద్దె ప్రాతిపదికన కేటాయిస్తామన్నారు. ఒకవేళ డీయూ అనుబంధ కళాశాలలే తీసుకుంటే కూడా ఎందుకు అద్దె చెల్లించాలని ప్రశ్నించగా ప్రతిరోజూ జరిగే కార్యక్రమాలకు అవసరమైన వసతులు ఆయా కళాశాలల్లో ఉన్నాయని, అయితే భారీఎత్తున ఏదైనా కార్యక్రమం నిర్వహించదలుచుకున్నప్పుడు ఇటువంటి వసతులను వినియోగించుకోవచ్చని, ఎయిర్ కండిషన్, దీపాలు తదితరాలను వాటిని వినియోగించుకున్నందుకుగాను వారు కొంతమొత్తాన్ని నిర్వహణ వ్యయం కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు. రూ. 100 కోట్లు వెచ్చించి కామన్వెల్త్ క్రీడల సమయంలో పునర్నిర్మించిన పోలో మైదానాన్ని ఎవరైనా కిరాయి ప్రాతిపదికన తీసుకుంటే అందుకుగాను రోజుకు రూ. పదివేల నుంచి రూ. 3 లక్షల దాకా చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని కిరాయికి తీసుకునేందుకు ఎస్టేట్ డిప్యూటీ రిజిస్ట్రార్ నుంచిఅనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. అయితే ఇతరులు మాత్రం రిజిస్ట్రార్ వద్ద ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. స్టేడియాలను కిరాయికి తీసుకునే ముందు ఆయా సంస్థలు డీయూ క్రీడామండలి చైర్మన్ వద్ద నుంచి సిఫారసు లేఖను పొందాల్సి ఉంటుందన్నారు. డీయూలోని కాన్ఫరెన్స్ సెంటర్ను ఒక్కరోజు కిరాయికి తీసుకోవాలంటే అందుకోసం రూ. మూడు వేలనుంచి రూ. 30 వేలదాకా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంగణంలోని కమ్యూనిటీ సెంటర్ నుకూడా కిరాయి ప్రాతిపదికన పొందవచ్చన్నారు. వీటి ని వివాహాలు, విందులు తదితర కుటుంబ కార్యక్రమాలకోసం వినియోగించుకోవచ్చన్నారు. -
ఎర్రకోటకు పోటెత్తిన యువతరం
ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న విద్యార్థులు న్యూఢిల్లీ: నగరంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థిలోకం శుక్రవారం ఎర్రకోటకు తరలింది. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వినేందుకు తామంతా ఎర్రకోటకు వచ్చినట్లు ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, ఐపీ యూనివర్సిటీ విద్యార్థులు తెలిపారు. మువ్వన్నెల జెండాను ప్రధాని ఎగురవేస్తున్న సందర్భంలో విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. తమ కరతాళ ధ్వనులతో స్వాతంత్య్రోత్సవ సంబరాలను మార్మోగించారు. జై జవాన్, జైకిసాన్ అంటూ దేశానికి వెన్నెముక అయిన రైతును, కంటికి రెప్పలా కాపాడుతున్న జవానును స్మరించుకున్నారు. పతావిష్కరణ తర్వాత మోడీ ప్రసంగాన్ని ఆసాంత ఆసక్తిగా విన్నారు. ప్రసంగంలో మోడీ చమక్కులకు అనుగుణంగా విద్యార్థుల నుంచి స్పందన కనిపించింది. దేశభక్తి ఉప్పొంగేలా మోడీ ప్రసంగించారంటూ కొనియాడారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల జాకీర్ హుసేన్ కాలేజీలో రాజనీతి శాస్త్రాన్ని అభ్యసిస్తున్న కృష్ణన్ ప్రతాప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘నా స్నేహితులు పదిమందితో కలిసి ఇక్కడికి వచ్చాను. మోడీ ప్రసంగం అద్భుతంగా అనిపించింది. సాధారణ జనాన్ని కూడా అనుమతిస్తున్నారని తెలియగానే మోడీ ప్రసంగం వినాలని నిర్ణయించుకున్నాం. మేము మాత్రమే కాకుండా మా కాలేజీకి చెందిన వందల మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర సంబరాలను చూస్తుంటే గర్వంగా అనిపించింది. పతాకావిష్కరణ కోసం ప్రధాని వస్తున్నప్పుడు వేలాది మంది నిల్చోవడం దేశ ప్రజలు మోడీకి ఇచ్చే గౌరవానికి నిదర్శనంగా అనిపించింద’న్నాడు. అదే కళాశాలకు చెందిన జర్నలిజం విద్యార్థి రుక్సానా మాట్లాడుతూ... ‘గతంలో స్వాతంత్య్రోత్సవాలను తిలకించేందుకు ఎర్రకోట వద్దకు ఎప్పుడూ రాలేదు. యువతకు ఆరాధ్యుడైన మోడీ ఇక్కడ జాతినుద్దేశించి చేసే ప్రసంగాన్ని వినేందుకే ఈసారి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను. ఆయనతో మాట్లాడాలని, చూడాలని భావించాను. అయితే మాట్లాడలేకపోయినా ఎర్రతివాచీపై మోడీ నడుచుకుంటూ వస్తుండడం చూశాను. ఆయన ప్రసంగం మొత్తం విన్నాను. అద్భుతంగా అనిపించింద’ని సంబరపడింది. ఇలా వేలాదిమంది విద్యార్థులు మోడీ ప్రసంగం పూర్తయ్యేవరకు ఎర్రకోట వద్దే గడిపారు. ఆ తర్వాత కూడా వారంతా మోడీ గురించి మాట్లాడుకోవడమే కనిపించింది. -
హాస్టళ్లు లేక అవస్థలు
న్యూఢిల్లీ: ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుంటే తప్ప ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో సీటు సంపాదించడం సాధ్యం కాదు. అంతగా శ్రమించి అడ్మిషన్ సంపాదించిన విద్యార్థులకు కనీస వసతి కల్పించడంలో డీయూ విఫలమయింది. హాస్టళ్లలో తగినన్ని సీట్లు లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు పీజీ హాస్టళ్లు లేదా గదులు కిరాయికి తీసుకుంటున్నారు. డీయూకు 15 ఆఫ్-క్యాంపస్ హాస్టళ్లు ఉండగా, తొమ్మిది కాలేజీల్లో వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఐదు కాలేజీల్లో మాత్రమే మహిళలకు వసతి ఉంటుంది. డీయూలో 1.8 లక్షల మంది అండర్గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులు ఉండగా, వీరందరికీ అందుబాటులో ఉన్న హాస్టల్ సీట్లు తొమ్మిది వేలు మాత్రమే. డీయూ ఏటా కొత్తగా 55 వేల మంది విద్యార్థులు చేరుతుంటారు. హాస్టళ్లలో సీటు దొరకడం సాధ్యం కాకపోవడంతో మెజారిటీ విద్యార్థులు ప్రత్యామ్నాయ వసతి వెతుక్కోక తప్పదు. ఫలితంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావడమే గాక, భద్రత కూడా సరిగ్గా లేని ప్రదేశంలో ఉండాల్సి వస్తోందని. ‘భారీగా ఉన్న కటాఫ్ జాబితాల్లో సీటు సంపాదించుకొని కాలేజీలో అడుగుపెడితే హాస్టల్ వసతి లేదు. దాదాపు పక్షం రోజులుగా ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ కిరాయికి గది దొరకలేదు’ అని ఈ ఏడాది డీయూలో చేరిన ఖ్యాతిశర్మ చెప్పింది. డీయూ హాస్టళ్లు కూడా ప్రతిభ ఆధారంగానే సీట్లు ఇస్తాయి. మంచి కాలేజీలోనే కాదు, హాస్టల్ సీటు రావాలన్నా సదరు విద్యార్థులకు భారీగా మార్కులు రావాల్సిందే. అయితే కిరాయి గదులు/హాస్టళ్లలో ఉండే యువతులకు భద్రత ప్రధాన సమస్యగా మారింది. అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థినులు హాస్టల్ వసతి కోసం తక్కువ కటాఫ్లు ఉన్న కాలేజీల్లో చేరాల్సి వస్తోందని ఇషానీ బెనర్జీ అనే యువతి తెలిపింది. విజయ్నగర్, హడ్సన్లేన్, బంగ్లారోడ్డు, కమలానగర్ ప్రాంతాల్లో ప్రైవేటు హాస్టళ్లలో ఒక్కొక్కరికి నెలకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.తొమ్మిది వేల దాకా వసూలు చేస్తున్నారు. ‘మేం వై-ఫై, లాండ్రీ, వంటమనిషి వంటి అన్ని సదుపాయాలూ కల్పిస్తాం కాబట్టి రేట్లు ఎక్కువగానే ఉంటాయి. మేం వ్యాపారం కొనసాగించాలంటే ఈ మాత్రం వసూలు చేయకతప్పదు’ అని హడ్సన్లేన్లో పీజీ హాస్టల్ నిర్వహించే శివానంద్ ఖేరా అన్నారు. డీయూ మరిన్ని హాస్టళ్లు నిర్మించాలనే డిమాండ్తో విద్యార్థులు గత ఏడాది ఆందోళనలకు దిగారు. డీయూ యాజమాన్యం హామీ మేరకు ఉద్యమాన్ని విరమించినా, ఇప్పటి వరకు హాస్టళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం లేదని ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థిసంఘం నాయకుడు అన్నారు. డీయూ విద్యార్థుల సంఘం (డూసూ), డీయూ అధ్యాపకుల సంఘం (డూటా), యూనివర్సిటీ విభాగాలు కూడా నూతన హాస్టళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘డీయూలో ఉన్న ఐదుశాతం మంది విద్యార్థులకు కూడా హాస్టళ్లు సరిపోవడం లేదు. వసతి కల్పించాలంటూ విద్యార్థులు ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. కొత్తగా ఒకటిరెండు హాస్టళ్లు నిర్మించినా అవి ఏ మూలకూ చాలవు’ అని డూటా అధ్యక్షురాలు నందితా నారాయణ్ అన్నారు. ఈ విషయమై డీయూ వర్గాలు స్పందిస్తూ కొత్త హాస్టళ్ల కోసం ఇది వరకే ప్రతిపాదనలు పంపామని, ఈ విషయంలో యూనివర్సిటీ నిర్లక్ష్యం ఏదీ లేదని చెప్పాయి. కొత్త హాస్టళ్లు నిర్మించడానికి డీడీఏ, ఉద్యానవనశాఖ వంటి విభాగాల అనుమతి తప్పనిసరని అధికారులు అంటున్నారు. తాము నిధులు కేటాయించినా, నిర్మాణ పనులు మొదలు కావడానికి చాలా సమయం పడుతుందని డీయూ విద్యార్థుల సంక్షేమ విభాగం డీన్ జె.ఎం.ఖురానా అన్నారు. -
కౌమారాం వద్దు!
న్యూఢిల్లీ: యువత దేశానికి వెన్నుముక అన్నారు పెద్దలు. దేశ భవిష్యత్ను తీర్చి దిద్దేది యువతరం. అలాంటి యువకులు పాశ్చాత్య పోకడలను అనుకరిస్తూ పెడ మార్గం పడుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీనేజ్లోనే మద్యం సేవించడం, ధూమపానం అలవాటు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. అందుకే.. అలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్న ఆరోగ్య, మానసిక నిపుణులు. మద్యపానం.. ధూమపానం వద్దు.. కౌమార దశ రాగానే పెద్దవారం అయిపోయామనే ఫీలింగ్తో యువత మద్యం, సిగరేట్కు అలవాటు పడడం సాధారణం. చెడు చెలిమితో.. నూనుగు మీసాల వయసులోనే ఇలాంటి వ్యసనాల బారినపడుతున్నారు. అలా చేయడం వల్ల భవిష్యత్ నాశనం అవడమే కాకుండా.. కన్నవారిని మోసం చేసినట్లే అవుతుంది. గత ఆదివారం ఏసీసీలో జరిగిన క్వారీ జాతరలో యువకులు తాగి నానా హంగామా చేయడం తాజా ఉదాహరణగా పేర్కొనవచ్చు. మద్యం మత్తులో గొడవలు, యువతులకు అసభ్యకరమైన మెసేజ్లు పంపడంలాంటివి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. పాన్షాప్లు, హోటళ్ల వద్ద యువకులు రింగ్రింగ్లుగా సిగరేట్ పొగ వదులుతూ.. ఇదే స్వర్గలోకమంటూ తన్మయత్వం చెందుతున్నారు. ఇలాంటి వాటికి దూరం ఉండడం చాలా మంచిది. దూకుడు డ్రైవింగ్కు దూరంగా ఉండాలి.. యువత చేత బైక్పట్టి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఆ బైక్ ఎంత స్పీడ్లో పోతుందో వారికే తెలియదు. అలాంటి సమయంలో జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే నష్టం తప్పదు. కన్నవారికి కడుపుకోతా తప్పదు. ముఖ్యంగా కౌమార దశలోనే ద్విచక్ర వాహనాల జోలికి పోకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కొద్దోగొప్పో స్పీడ్లో డ్రైవ్ చేయడం మంచిది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు, నలుగురు కూర్చోని రయ్మంటూ దూసుకెళ్లకుండా ఉంటే మంచిది. అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలి.. కౌమార దశ యువకులు సినిమాల పోకడలను అనుకరిస్తూ యువతులను వేధించడం ఫ్యాషన్గా భావిస్తుంటారు. కళాశాలలో చదివే సహచర విద్యార్థినులను వేధించడం, వారికి ప్రేమ లేఖలు రాయడం చేస్తుంటారు. అలాంటి వాటికి మొత్తంగా దూరంగా ఉండడం భవిష్యత్తుకు మేలు. మహిళలను వేధిస్తే కఠిన చట్టాలున్నాయి. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తే భవిష్యత్ అంధకారమవుతుంది. అందుకే.. యువత ఉన్నత భావాలను అలవర్చుకుని.. ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజం గౌరవించే స్థాయికి ఎదగాలి. తల్లీదండ్రుల బాధ్యత కీలకం విద్యార్థుల భవిష్యత్ తల్లిదండ్రుల చేతుల్లోనూ ఉంది. పిల్లల మీద ప్రేమ కంటే వారి దిన చర్యలను, చెడు నడవడికను బాగా పరిశీలించాలి. విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి వాహనాల దొంగలుగా, చైన్స్నాచర్గా మారుతూ పట్టుబడి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే.. పిల్లలు ఏం చేస్తున్నారో నిశితంగా పరిశీలించాలి. సెల్ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ రెండూ అందుబాటులో లేకుండా చూడాలి. సెల్ఫోన్ల వల్లనే విద్యార్థుల జీవితాలు గాడి తప్పుతున్నాయి. చెడు స్నేహాలూ చేయకుండా చూడాలి. బంగారు భవిష్యత్ ఎలా సాధ్యమవుతుందో ఎప్పటికప్పుడు వారికి వివరించాలి. మానవతా విలువలు తెలియజేయాలి యుక్త వయస్సు వారి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి అధ్యాపకు లు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మానవతా విలువలు తెలియజేయాలి. జాతీయ నాయకులు, దేశ భక్తుల చరిత్రను తెలియజేయాలి. మంచి పుస్తకాలు చదివేలా వారిని ప్రోత్సహించాలి. పాశ్చాత్య సంస్కృతికి బానిసలు కాకుండా చూడాలి. అమానవీయ సినిమాలు, సీరియల్స్ను చూడనీయొద్దు. తరగతి గదులే వారికి మార్గ నిర్దేశం కావాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి... ఆత్మ విశ్వాసం.. ఇది లేకపోతే మానవుడు జీవితంలో ముందుకు సాగలేడు. ఎదుగూబొదుగు ఉండదు. కష్టాల కడలిని ఎదురీదడానికి ఆత్మ విశ్వాసం ఎంతో అవసరం. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉండాలి. నిర్వేదం, నిరుత్సాహం, నిరాశను సమాధి చేయాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. ఆత్మవిశ్వాసం లేకపోతే చంద్ర మండలానికి చేరుకునే వారమా..? తమిళనాడుకు చెందిన సుధారామచంద్రన్ ప్రమాదంలో కాలు కోల్పోయినా కఋత్రమ (పెట్టుడు కాలు)తో నాట్యం చేసి ప్రపంచాన్ని నివ్వెర పరచలేదా..? అంతెందుకు తాజాగా రాష్ట్రానికి చెందిన ఆనంద్, పూర్ణ అనే విద్యార్థులు హిమాలయ పర్వతాలను అతిచిన్న వయస్సులోనే అధిరోహించి చరిత్ర సృష్టించ లేదా..? శాస్త్ర, సాంకేతిర రంగాల్లో అనేక మంది చరిత్రలో నిలిచిపోయారంటే అందుకు ఆత్మవిశ్వాసమే ప్రధాన కారణమనే విషయాన్ని ఎలా విస్మరించ గలం. ఆత్మ విశ్వాసం వెంట ఉంటే చదువులో, వ్యాపారంలో ఏ రంగంలోనైనా రాణించగలమని నిరూపించొచ్చు. అందుకే.. యుక్త వయస్సుల్లోకి అడుగు పెట్టే యువతీ, యువకులు ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. ఆత్మన్యూనతా భావాన్ని దరికి చేరనివ్వ వద్దు. మానసికంగా ఎప్పుడూ కుంగిపోవద్దు. కుటుంబ పెద్దలపై ఆధారపడి సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామనే నిర్వేదం చెందొద్దు. దృఢ సంకల్పం కలిగి ఉండాలి. అప్పుడే విద్యలోనూ, జీవితంలోనూ అగ్రస్థానాలకు చేరుకుంటారు. సాహసం చేయరా డింభకా.. సాహసం చేయరా డింభకా... ఈ డైలాగ్ తెలుగునాట ఇప్పటికీ పాపులరే. సాహసం చేస్తే ఏదైనా సాధించవచ్చు. చదువులో, వ్యాపారం, ఆటల్లో, పాటల్లో, మార్షల్ ఆర్ట్స్లో ఇలా అన్నింట్లో ప్రావీణ్యత సాధిం చాలి. ధైర్యంతో పోటీలో పాల్గొని విజయలక్ష్మిని అక్కున చేర్చుకోవాలి. ‘నాకు ఏదీ రాదు, ఏమి చేయలేననే’ సంకుచిత భావాన్ని త్యజించాలి. ధై ర్యంగా ముందుకు సాగితే ఎలాంటి కష్టాలనైనా ఇ ష్టంగా అధిగమించవచ్చు. ముఖ్యంగా విద్యా రంగంలో కఠినం అనుకునే పాఠ్యాంశాలను సులువుగా నేర్చుకుని ధైర్యంగా పరీక్షలు రాయాలి. నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి.. యుక్త వయస్సు విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరం. చదువు, క్రమ శిక్షణ, సభ్యతా, సంస్కారంతోపాటు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. కళాశాల స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకుంటే సమాజానికి మేలు చేసే స్థాయికి ఎదుగుతారు. కళాశాల స్థాయిలోనే నాయకత్వ లక్ష ణాలకు శ్రీకారం చుట్టి ఎందరో రాజకీయాలు, చట్టసభల్లో అడుగుపెట్టి రాణిస్తున్నారు. ఒకప్పుడు అస్సాం రాష్ట్రంలో కళాశాల విద్యార్థులు అస్సాం గణ పరిషత్ స్థాపించి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. తాజా ఉదాహరణకు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యారంగ సమస్యలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై గళమెత్తిన బాల్క సుమన్ ఏకంగా పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మంచి నాయకుడు కావాలంటే యుక్త వయస్సులోనే నాయకత్వం బీజం పడాలి. ఉపకారం.. అందరికీ సహకారం.. ‘పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని..’ అంటారు ఓ సినీ కవి. పరోపకార గుణం లేని మనిషి జీవితం దండగ ంటారు పెద్దలు. పాశ్చాత్య సంస్కృతి ప్రజ్వరిల్లుతున్న నేటి రోజుల్లో ఉపకారం, సహకారం అనేవి సామెతగానే మిగిలాయి. అందుకే.. మానవ సంబంధాలు మరుగునపడిపోకుండా కష్టాల్లో ఉన్న వారికి ఉపకారం, ఆపదలో ఉన్న వారికి సహకారం అందించే గుణాన్ని టీనేజర్లు అలవర్చాలి. బలం- బలహీనతలు.. మనిషికి బలం, బలహీనతలు రెండూ ఉంటాయి. బలం మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తే బలహీనత తిరోగమనం వైపునకు పంపిస్తుంది. బలమంటే శారీరక బలం కాదు. ఆలోచనా అనే శక్తి బలం. ఆ ఆలోచనలు బలంగా ఉంటే భవిష్యత్ ఎంతో ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ‘దేనికైనా నేను వెంటనే నిర్ణయాలు తీసుకోలేను. అదే నా బలహీనత’ అని అంటుంటారు కొందరు. అలాంటి బలహీనతకు బానిసలు కావద్దు. బలాన్నే నమ్ముకోవాలి. -
డీయూలో కొత్త విద్యాసంవత్సరం నేటి నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో కొత్త విద్యాసంవత్సరం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ యూనివర్సిటీలో నాలుగు సంవత్సరాల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్వైయూపీ) ఓ చరిత్రగా మిగిలిపోయిన సంగతి విదితమే. దాని స్థానంలో మూడేళ్ల కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చేసేందుకుగాను డీయూ పరిధిలోని కళాశాలలు ఇప్పటికే కొత్తగా చేరే విద్యార్థులకు పునశ్చరణ కార్యక్రమం నిర్వహించాయి. ఈ విషయమై శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్రిన్సిపల్ ఎస్కే జైన్ మాట్లాడుతూ వివిధ కోర్సులకు సంబంధించి తాము మొత్తం 800 మంది విద్యార్థులను చేర్చుకున్నామన్నారు. ఇవాళకూడా వారికి పునశ్చరణ తరగతులను నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కోర్సు, టైంటేబుల్, నిబంధనావళి తదితరాలపై వారికి అవగాహన కల్పించామన్నారు. ఈ నెల 21వ తేదీనుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. టైంటేబుల్ తదితర వివరాలను తమ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. తాత్కాలిక ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. ఇదే విషయమై మిరండా హౌస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతిభా జాలీ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం సజావుగా సాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు రద్దు వివాదం ఇటీవల కొంతకాలంపాటు తల్లిదండ్రులతోపాటు విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసిన సంగతి విదితమే. అనేక తర్జనభర్జనలు, చర్చలు, కమిటీల నియామకం తదితరాల తర్వాత డీయూ ఈ కోర్సును రద్దుచేసి దాని స్థానంలో మూడేళ్ల కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ విద్యాసంవత్సరం ఎటువంటి ఆటంకాలు లేకుండాసోమవారం ప్రారంభమ వుతుందని దీన్దయాళ్ ఉపాధ్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఎస్కే గార్గ్ వెల్లడించారు. కాగా ఎఫ్వైయూపీ వివాదం నేపథ్యంలో ఈ నెల రెండో తేదీన ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం 19 రోజులమేర ఆలస్యమైంది. ఎఫ్వైయూపీ వివాదం కారణంగా అనేకమంది విద్యార్థులు తీవ్ర ఆందో ళనకు గురయ్యారు. దీనిపై ఏడాదికాలంగా అనేక విద్యార్థి సంఘాలు ఆందోళనలను నిర్వహి స్తూనే ఉన్నాయి. చివరికి ఈ వివాదం ముగి యడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
నిబంధనలకు విరుద్ధం
న్యూఢిల్లీ: శాఖాధిపతుల నియామకం విషయంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) నిబంధనలను ఉల్లంఘించిందని ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (డ్యూటా) ఆరోపించింది. వాస్తవానికి నియామకాలు జరిపే సమయంలో రొటేషన్ పద్ధతిని అనుసరించాలని, అయితే అటువంటిదేమీ జరగలేదని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డ్యూటా అధ్యక్షురాలు నందితా నారాయణ్ ఆరోపించారు. ఆర్డినెన్స్ 13(1) ప్రకారం పరిశీలన తర్వాత ఉపకులపతి నియామకాలు జరపాల్సి ఉంటుందని, అయితే అటువంటిదేమీ జరగలేదని అన్నారు. ఇందుకు ఉదాహరణ భూభౌతిక శాస్త్ర విభాగం అధిపతిగా జెపీ శ్రీవాస్తవను నియమించకపోవడమేనన్నారు. ఆయన ఈ పదవి కోసం ఇప్పటికి రెండు పర్యాయాలు ప్రయత్నించారన్నారు. 2011, జూన్ రెండో తేదీన ఆచార్య సీఎస్ దూబేను ఈ పదవిలో నియమించారని, ఆర్డినెన్సులో ఎటువంటి వెసులుబాటు లేకపోయినప్పటికీ ఇప్పటికి రెండు పర్యాయాలు ఆయన పదవీకాలాన్ని పొడిగించారని ఆరోపించారు. షెడ్యూల్ ప్రకారమే కాగా విద్యాసంవత్సరం ఆరంభంపై ఉత్కంఠకు ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) తెరదించింది. షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమవుతుందని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డీయూ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్వైయూపీ)ని ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో విద్యాసంవత్సరం ఆరంభంలో జాప్యమవుతుందేమోనని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఉత్కంఠకు గురయ్యారు. ఈ నెల 21వ తేదీన కళాశాలలు ప్రారంభమవుతాయని డీయూ రిజిస్ట్రార్ అభయమిచ్చారు. అందువల్ల అధ్యాపకులతోపాటు విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి టైంటేబుల్ తెచ్చుకోవాలని సూచించారు. కాగా నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్వైయూపీ)ని రద్దు చేసిన నేపథ్యంలో మూడేళ్ల కోర్సును రీస్ట్రక్చరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని డీయూ ఆయా కళాశాలలను కోరింది. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు మళ్లీ చేపట్టాలి
న్యూఢిల్లీ: బుద్ధిస్ట్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను మళ్లీ చేపట్టాలని ఢిల్లీ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఈ పోస్టుల భర్తీకి చేపట్టిన ప్రక్రియను రద్దుచేసి కొత్తగా నియామకపు ఉత్తర్వులు జారీచేయాలని పేర్కొంది. రెండు నెలల కాల పరిమితిలో పోస్టులను భర్తీచేయాలని ఆదేశించింది. దీనిపై కొందరు వేసిన రిట్ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. వివరాలిలా ఉన్నాయి. యూనివర్సిటీలోని పలు విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 2012, జనవరి 11వ తేదీన యాజమాన్యం ప్రకటన ఇచ్చింది. అన్ని విభాగాలకు కలిపి 50 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు అందులో పేర్కొంది. వీటిలో తొమ్మిది పోస్టులను బుద్ధిస్ట్ విభాగానికి కేటాయించింది. అయితే ఆ విభాగంలో ఎన్నో ఏళ్ల నుంచి అడ్హక్ పద్ధతిపై నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వారు ఈ ఏడాది చేపట్టిన పరీక్షలో అర్హతకు కావాల్సిన 50 శాతం మార్కులు సాధించలేదని స్క్రీనింగ్ కమిటీ వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. అయితే స్క్రీనింగ్ కమిటీ ఎంపిక విధానంలోనే తప్పులు దొర్లినట్లు కోర్టు గుర్తించింది. కార్యనిర్వాహక మండలి (ఈసీ) ఆమోదించిన ఎంపిక ప్రక్రియను మార్చే అధికారం స్క్రీనింగ్ కమిటీ (ఎస్సీ)కి లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అభ్యర్థి 50 శాతం మార్కులు సాధించనంత మాత్రాన అతడిని ఇంటర్వ్యూకు పిలవకుండా ఆపే హక్కు ఎస్సీకి లేదంది. ఈసీ నియమావళి ప్రకారం అతడు ఉద్యోగానికి కావాల్సిన అన్ని స్థాయిలను ప్రదర్శించే అవకాశం ఇచ్చేందుకైనా ఇంటర్వ్యూకు పిలవాల్సి ఉందని పేర్కొంది. ఈ విభాగంలో భర్తీ ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని పేర్కొన్న పిటిషనర్ల వాదనతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని కోర్టు తెలిపింది. ఇంతకుముందు బుద్ధిస్ట్ విభాగంలో చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను రద్దు చేసి, తిరిగి ఎంపిక ప్రక్రియనుప్రారంభించాలని ఆదేశించింది. అయితే విద్యార్థుల సంక్షేమార్థం ఇప్పటికే ఉద్యోగాల్లో చేరినవారిని కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంతవరకు తొలగించవద్దని సూచించింది. అలాగే భర్తీ విషయంలో ఎటువంటి వివాదాలు లేని పాతవారిని అలాగే కొనసాగించవచ్చని పేర్కొంది. -
నవతరానికి కొత్తబాట
న్యూఢిల్లీ: పది మంది నడిచిన దారి కాకుండా, మీకంటూ కొత్త మార్గం ఏర్పరుచుకొని కెరీర్ను తీర్చిదిద్దుకోవాలని ఉందా ? అయితే ఢిల్లీలోని వివిధ యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్న నూతన కోర్సులను తప్పకుండా పరిశీలించాలి. విద్యార్థులను సామాజిక వ్యాపార, వైద్యం, విపత్తుల నిభాయింపు రంగంలో నిపుణులుగా మార్చేందుకు ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మాస్టర్స్స్థాయిలో సోషల్ ఎంటర్ప్రిన్యూర్షిప్, విపత్తుల నిభాయింపులో ఎంబీఏ, ఎర్లీ చైల్డ్కేర్, బ్యాచులర్స్థాయిలో రిహాబిలిటేషన్ థెరపీ, ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, విదేశీ భాషలు తదితర కోర్సులను ప్రవేశపెట్టారు. ‘ఉదాహరణకు చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కోర్సును తీసుకుంటే దీనికి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. శిశుసంరక్షణ కోసం గత ఏడాది ప్రభుత్వం జాతీయ విధానాన్ని ప్రకటించింది. దీని అమలు చేసేందుకు ఈ కోర్సు చేసిన నిపుణులు చాలా మంది అవసరం’ అని ఢిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీ (ఏయూడీ) డీఎన్ వెనితా కాల్ అన్నారు. ఈ విధానం అమలు చేయడానికి ప్రభుత్వం జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఉద్యోగులను నియమిస్తారని తెలిపారు. ‘శిశుసంరక్షణ, విద్యావిభాగం కోర్సు నిపుణుల కోసం ప్రపంచబ్యాంకు, యూనిసెఫ్, ప్లాన్ ఇండియా వంటి పేరొందిన సంస్థలూ వెతుకుతున్నాయి. స్కూళ్లకు కూడా వీరి సేవలు ఎంతో అవసరం’ అని కాల్ అన్నారు. సోషల్ ఎంటర్ ప్రిన్యూర్షిప్ ఎం.ఎ., ఎం.ఫిల్ కోర్సులు కూడా ఏయూడీలో ఉన్నాయి. ‘సామాజిక రంగంలో వ్యాపార నిపుణులను తయారు చేసేందుకు ఈ కోర్సును ప్రవేశపెట్టారు. వీళ్లు విద్యార్థులకు ప్రాథమిక వ్యాపార నైపుణ్యాలను బోధిస్తారు’ అని ఏయూడీ అధికారి ఒకరు అన్నారు. శిశుసంరక్షణలో ఎం.ఫిల్ చేసే విద్యార్థులైతే ఎనిమిది నెలలపాటు వెనుకబడ్డ రాష్ట్రాల్లోని గ్రామాల్లో పనిచేయాల్సి ఉంటుంది. రెండేళ్లపాటు ఈ కోర్సును అధ్యయనం చేయాలి. ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన 25 మందికి సీట్లు కేటాయిస్తారు. ఏయూడీతోపాటు గురు గోబింద్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ (జీజీఐయూ) కూడా బ్యాచులర్స్థాయిలో రిహాబిలిటేషన్ థెరపీ, ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, విపత్తుల నిభాయింపు (ఎంబీయే) వంటి నవతరం కోర్సులను అందజేస్తోంది. మనదేశంలో స్పీచ్ థెరపిస్టుల కొరత చాలా ఉందని ఈ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. జీజీఐయూతోపాటు ఎయిమ్స్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. రిహాబిలిటేషన్ థెరపీ కోర్సుకు డిమాండ్ పెరుగుతోందని ఒక అధకారి అన్నారు. జిల్లాస్థాయి ఆస్పత్రుల్లో రిహాబిలిటేషన్ థెరపీ నిపుణుల అవసరం ఎంతగానో ఉంద ని తెలిపారు. గ్రామస్థాయిల్లో పనిచేసే సామాజిక సేవకులకు వీళ్లు శిక్షణ ఇస్తారు. వినికిడి, దృష్టి లోపం, మానసిక వైకల్యం గ ల వారికి చికిత్స చేసే నైపుణ్యాలను కూడా ఈ కోర్సు అభ్యర్థులకు నేర్పిస్తారు. విపత్తుల నిభాయింపు (ఎంబీయే) కోర్సు తరగతులను వారానికోసారి నిర్వహిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, వాటి నిభాయింపు, సహాయక చర్యల గురించి విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కలిగిస్తారు. కేంద్ర, రాష్ట్రస్థాయిల్లోనూ విపత్తుల నిభాయింపు ప్రాధికారసంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అత్యవసర ప్రణాళిక, నష్టం మదింపు, సామాజిక అభివృద్ధి, సామర్థ్యం పెంపు తదితర రంగాల్లో విస్తరించిన కంపెనీలకు కూడా ఈ కోర్సు అభ్యర్థుల అవసరం అధికంగా ఉంది. దక్షిణ మధ్య ఆసియాలోని పలు దేశాల్లో మాట్లాడే పష్తో భాష అధ్యయనంపై జామియా మిలియా యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టారు. ఏ యూనివర్సిటీలో ఏ కోర్సు ? అంబేద్కర్ యూనివర్సిటీ (ఏయూడీ) : మాస్టర్స్స్థాయిలో సోషల్ ఎంటర్ ప్రిన్యూర్షిప్, చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురు గోబింద్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ (జీజీఐయూ): బ్యాచులర్స్థాయిలో రిహాబిలిటేషన్ థెరపీ, ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, విపత్తుల నిభాయింపు (ఎంబీయే) జామియా మిలియా యూనివర్సిటీ : పష్తో భాష అధ్యయనంపై అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు -
ఎఫ్వైయూపీపై ప్రొఫెసర్ విశ్లేషణ ఎందుకిలా జరిగిందంటే...
డీయూ వైస్చాన్స్లర్లు దీపక్ పెంటల్, దినేశ్ సింగ్ నిరంకుశత్వం, అస్తవ్యస్త విధానం వల్లే ఎఫ్వైయూపీ, సెమిస్టర్ విధానం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని డీయూ భౌతికశాస్త్ర అధ్యాపకురాలు అభాదేవ్ హబీబ్ చెబుతున్నారు. ప్రజాస్వామిక వాతావరణంలో చర్చలు నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఆమె విశ్లేషించారు. న్యూఢిల్లీ:నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఎఫ్వైయూపీ) ప్రవేశపెట్టినప్పటి నుంచి ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థులు, వీరి తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తల ఆందోళనలు, కోర్టు కేసులు, యూజీసీ జోక్యం.. ఈ సమస్యలన్నింటితో డీయూ తలపట్టుకుంది. చివరికి యూజీసీ జోక్యం తో కోర్సు రద్దయింది. ఎఫ్వైయూపీ ప్రవేశపెట్టేముందు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని డీయూ భౌతికశాస్త్ర అధ్యాపకురా లు అభాదేవ్ హబీబ్ అంటున్నారు. ఈ వివాదంపై విశ్లేషణ ఆమె మాటల్లోనే... ఎఫ్వైయూపీపై డీయూలో నెలకొన్న ఆందోళన, ప్రతిష్టంభన మన ముందు ఎన్నో ప్రశ్నలను ఉంచింది. ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకొనే సమయంలో విద్యావేత్తలు, విధానకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీయూ ఉదంతం సూచిస్తోంది. ఈ ఘటన మనకు రెండు విషయాలను నేర్పుతోంది. 1. అన్ని మార్పులనూ సంస్కరణలుగా భావించలేం 2. సంస్కరణల అమలుకు విధానాలు, కాలపరిమితి చాలా ముఖ్యం. ‘డీయూలో ఎఫ్వైయూపీ వివాదాన్ని అడ్డుకోవడం సాధ్యమయ్యేదా ?’ అనే ప్రశ్నకు క్యాంపస్లో ఇటీవలి పరిణామాల ను అధ్యయనం చేయడం ద్వారానే తగిన జవాబు వస్తుంది. డీయూలో సెమిస్టర్ విధానం ప్రవేశంపై 2010లో ఆందోళనలు కొనసాగుతున్న సమయం లో దినేశ్ సింగ్ వైస్ చాన్స్లర్ అయ్యారు. సెమిస్టర్ విధానాన్ని దినేశ్కు ముందున్న వీసీ దీపక్ పెంటల్ హ డావుడిగా విద్యార్థులపై రుద్దారు. కొత్త వీసీ అన్ని విషయాలపై తమతో చర్చిస్తారని ప్రొఫెసర్లు, విద్యార్థులు భావించారు. సెమిస్టర్ విధానంలో బోధించేందుకు తిరస్కరించే ప్రొఫెసర్ల జీతాలు నిలి పివేస్తామని బాధ్యతలు చేపట్టిన రెండోరోజే సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన సమస్యలను పరి ష్కరించే విధానం ఏమిటో అదేరోజు అర్థమయిం ది. సింగ్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందని అప్పటి మంత్రి కపిల్ సిబాల్ ఆయనను సన్మానించినప్పుడే తేలింది. సెమిస్టర్ విధానాన్ని వ్యతిరేకించిన ప్రొఫెసర్లు, అధ్యాపక సంఘాలను యాజమాన్యం ఇబ్బందిపెట్టింది. అంటే చర్చలపై ఆయనకు కొంచెం కూడా నమ్మకం లేదని భావిం చాల్సి ఉంటుంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏది చెబితే దానిని అమలు చేశారు. సులువుగా పరిష్కరించగలిగే చిన్న విషయాలను కూడా పెద్దవి చేశా రు. ఉదాహరణకు 2012లో సెమిస్టర్ విధానం లో పరీక్షలు రాసిన వారికి ఊహించనంత భారీగా మార్కులు వచ్చాయి. ఈ విషయాన్ని అధ్యాపకులు ప్రశ్నించినా వీసీ పట్టించుకోలేదు. పరీక్షల మూ ల్యాంకన విధానాన్ని సమీక్షించేందుకు ఆయన ససేమిరా అన్నారు. ఆయన పరిష్కార విధానం చాలా ‘సులువు’గా ఉంటుంది. విద్యార్థుల మార్కుల సమాచారం ఎవరికీ దొరక్కుండా చేశారు. విద్యార్థులు, ప్రొఫెసర్ల నిజమైన సమస్యలపై ఎన్నడూ స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వమే చేయించింది.. సెమిస్టర్, ఎఫ్వైయూపీ విధానాలను విద్యాసంస్కరణల్లో భాగంగా ప్రవేశపెట్టారని అనుకోవడం సాధ్యం కాదు. వీటి ప్రవేశం ద్వారా కొత్త పాలనా విధానం అమలయింది. ఎలాంటి చర్చా లేకుండా వీసీ నిర్ణయం తీసుకునే పద్ధతి వచ్చింది. విధివిధానాలు, నియమాల గురించి ఎవరితోనూ మాట్లాడకుండానే మీడియాను పిలిచి అధికారికంగా ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య హక్కులు, భావజాలంపై దాడి జరిగింది. డీయూ అధ్యాపక సంఘం (డూటా) వంటివి సమావేశాలకు రాకుండా అడ్డుకున్నారు. వీసీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించలేదు. యూజీసీ, ఇతర విభాగాలను లెక్క చేయకుండా వీసీ తనకు వ్యతిరేకంగా వ్యవహరిం చిన వారందరిపైనా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా ఏమైనా అంటే ‘నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ?’ అంటూ హెచ్చరించారు. అప్పటి మంత్రి కపిల్ సిబాల్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, అశోక్ ఠాకూర్.. వీసీ వెనక ఉండి ఇదంతా నడిపించారు. ఓబీసీ విద్యార్థులకు కేటాయించిన నిధులను దారి మళ్లించి ఎఫ్వైయూపీ విద్యార్థులకు ల్యాప్టాప్లు కొనిచ్చారు. దీంతో డీయూలో అక్రమాలు, కుంభకోణాలు రాజ్యమేలాయి. దేనికైనా వీసీ సింగ్పై ఆధారపడే దుస్థితి వచ్చింది. కోర్సుల్లో ఇష్టమొచ్చినట్టు మార్పులు చేశారు. ఎఫ్వైయూపీ విధానం సక్రమంగా లేదంటూ మొదటి ఏడాది విద్యార్థులు ఎంత మొత్తుకున్నా, వీసీ వినలేదు. అయితే ప్రజాస్వామ్యవాదుల ఒత్తిడి ఫలితంగా వీసీ నిరంకుశత్వానికి తెరపడింది. -
డీయూ ప్రవేశాలు శరవేగంగా సీట్ల భర్తీ ప్రక్రియ
న్యూఢిల్లీ: తొలి కటాఫ్ జాబితాకు గురువారమే చివరిరోజు కావడంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరిధిలోని పలు కళాశాలలు విద్యార్థుల తో కిటకిటలాడాయి. దరఖాస్తుల కోసం విద్యార్థులు పెద్దసంఖ్యలో రావడంతో వారు నిలబడిన క్యూలు చాంతాళ్లను తలపింపజేశాయి. కాగా కొన్ని కళాశాలలు తమ సీట్ల సంఖ్యకు మించి ప్రవేశాలను స్వీకరించాయి. ఇదిలాఉంచితే డీయూ ఉత్తర ప్రాంగణంలోని కిరోరి మాల్ కళాశాలలో సాధారణ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయమై ఈ కళాశాలలో ప్రవేశం కోసం వచ్చిన రసిక శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘అడ్మిషన్ కోసం మూడు రోజుల క్రితం నేను, మా నాన్న ఇక్కడికి వచ్చాం. అయినప్పటికీ ఇంకా అడ్మిషన్ ఖరారు కాలేదు. పరీక్షల్లో 97 శాతం మార్కులు సాధించా. బుధవార ం అందరికంటే ముందు దరఖాస్తును కళాశాలకు అందజేసింది కూడా నేనే’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కళాశాల యాజమాన్యం తీరుపై రసిక శర్మ మండిపడ్డారు. ‘ప్రవేశ ప్రక్రియ అంతా గందరగోళంగా ఉంది. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్లు తమ తమ కార్యాలయాల్లో హాయిగా, తీరిగ్గా కాలక్షేపం చేస్తున్నారు. విద్యార్థుల సమస్య లను గాలికొదిలేశార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస తప్ప మరో మార్గమే లేదు న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) కటాఫ్ మార్కులను విపరీతంగా పెంచడంపై బీజేపీ నాయకుడు విజయ్ గోయల్ మండిపడ్డారు. కటాఫ్ మార్కుల పెంపు వల్ల ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోవడం తప్ప మరో మార్గమే లేదన్నారు. సగటు విద్యార్థి నష్టపోక తప్పదన్నారు. ‘డీయూలో సీట్ల సంఖ్య 54 వేలు. 2.7 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సగటు విద్యార్థి పరిస్థితి ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. -
డీయూ కళాశాలల్లో ప్రవేశాలు మళ్లీ మొదలు
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) పరిధిలోని కళాశాలల ప్రాంగణాలు మంగళవారం కళకళలాడాయి. తొలి కటాఫ్ జాబితాను సోమవారం రాత్రి ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు ఉదయం నుంచే కళాశాలల వద్దకు చేరుకున్నారు. దీంతో డీయూలోని ఉత్తర, దక్షిణ ప్రాంగణాలు కిటకిటలాడాయి. అన్ని కళాశాలల్లోనూ బీకామ్, ఎకనామిక్స్ ఆనర్స్, కంప్యూటర్సైన్స్ కోర్సులకు పోటీ ఎక్కువగా ఉంది. 100 శాతం మార్కులు ఉంటే గానీ కంప్యూటర్సైన్స్ (ఆనర్స్)లో ప్రవేశం సాధ్యం కాదంటూ ఆత్మారామ్ సనాతన్ ధర్మ,ఆచార్య నరేంద్ర దేవ్ కళాశాలలు ప్రకటించాయి. ఆచార్య నరేంద్ర దేవ్ కళాశాలలో సాధారణ కేటగిరీలోనే కాకుండా వికలాంగ విద్యార్థులకు కూడా కటాఫ్ మార్క్ 100 శాతంగానే ఉంది. డీయూ క్యాంపస్ కళాశాలల్లో 100 శాతం కటాఫ్ గతంలో రెండు విద్యా సంవత్సరాల్లో విద్యార్థులకు అనుభవంలోకి వచ్చింది, అయితే క్యాంపస్ వెలుపలి కళాశాలల్లో కటాఫ్ మార్క్ 100 శాతంగా ఉండడం ఇదే మొదటిసారి.మొదటి కటాఫ్ జాబితా ఆధారంగా ఈ నెల మూడో తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయి. తొలి కటాఫ్ జాబితాలో ప్రవేశం లభించనిరాని వారు నిరాశకు గురికానవ సరం లేదు. ఈ ఏడాది మొత్తం ఎనిమిది టాఫ్ జాబితాలను విడుదల చేయనున్నట్లు డీయూ ప్రకటించింది. కాగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి కూడా విద్యార్థులు ప్రవేశాల కోసం డీయూకి వచ్చారు. అయితే తగిన వసతి లేకపోవడంతో వారంతా నానాయాతనకు గురయ్యారు. ఇక ఉద్యోగాలు చేస్తూ తమ పిల్లలకు ప్రవేశాలకోసం వచ్చిన తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. మరి కొన్ని రోజుల పాటు ఉండాల్సి రావడంతో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. విధులకు మళ్లీ హాజరు కావాల్సి ఉండడం, ఇతర పనులు ఉండడం, తమ పిల్లలకు ప్రవేశం ఏమవుతుందనే ఆందోళనతో వారు గందరగోళానికి గురవుతున్నా రు. ఈ విషయమై బహ్రెయిన్ నుంచి నగరానికి వచ్చిన నైనికా దినేశ్ మాట్లాడుతూ ‘జూన్ 24వ తేదీనే ప్రవేశాలు ఉంటాయనే ఆశతో ఇక్కడికి వచ్చా. అయితే మధ్యలో నెలకొన్న పరిణామాల కారణంగా ఇక్కడే ఉండక తప్పలేదు’ అన ఆవేదన వ్యక్తం చేసింది. ఇక బెంగళూర్ నుంచి నగరానికి వచ్చిన కుల్వంత్ కిన్హా మాట్లాడుతూ ‘ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమవడంతో హోటల్లో బస చేయా ల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు మొదలవడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టయింది. మా నాన్న కూడా నా వెంబడి వచ్చాడు. ఆయన ఉద్యోగి. విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. వాస్తవానికి మేమిద్దరం ఇక్కడే వారం రోజులపాటు ఉండాల్సి వస్తుందనుకోలేదు’ అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. కటాఫ్పై విద్యార్థుల ఆందోళన న్యూఢిల్లీ: కటాఫ్ మార్కులను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ క్రాంతికారీ యువ సంఘటన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢి ల్లీ విశ్వవిద్యాలయంలోని ఉత్తర ప్రాంగణంలోగల ఆర్ట్ ఫ్యాకల్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ‘కటాఫ్ తగ్గించండి-సీట్ల సంఖ్య తగ్గించండి’ అంటూ నినదించారు. కాగా డీయూ లో మొత్తం 54 వేల సీట్లు ఉండగా, దాదాపు 2.7 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడంతో వారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కళాశాలల్లో ప్రవేశం లభించలేదు. ఇటువంటి వారందరూ స్కూల్ ఆఫ్ లెర్నింగ్లో చేరడమే తప్ప మరో మార్గం లేదు. -
నేటినుంచి అడ్మిషన్లు షురూ
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్వైయూపీ) రద్దయిన నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) మంగళవారం నుంచి అడ్మిషన్ ప్రక్రియ ఆరంభించనుంది. ఈ మేరకు సోమవారం రాత్రి వరకు మొదటి కటాఫ్ జాబితాలను విడుదల చేశాయి. మొదటి కటాఫ్ జాబితా ఆధారంగా జూలై మూడు వరకు అడ్మిషన్లు జరుగుతాయి. ఎఫ్వైయూపీపై చెలరేగిన వివాదం కారణంగా డీయూలో అడ్మిషన్ ప్రక్రియ వారం రోజులు ఆలస్యమయింది. గత మంగళవారం ప్రారంభం కావలసిన ప్రవేశాలు ఈ మంగళవారం మొదలవుతున్నాయి. ఇదిలాఉండగా 2014-15 విద్యాసంవత్సరానికి బీ.టెక్ కోర్సును (ఎఫ్వైయూపీ) రద్దుచేయాలన్న డీయూ నిర్ణయాన్ని ప్రస్తుత బీ.టెక్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. నాలుగేళ్ల బీటెక్ కోర్సును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కార్యాలయం ఎదుట బీ.టెక్, బీఎంఎస్ విద్యార్థులు ఆదివారం ఆందోళన నిర్వహించడం తెలిసిందే. యూజీసీ నిర్లక్ష్యం చేస్తే న్యాయస్థానానికి వెళ్లేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఇరానీ నివాసంలోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయమై ఆందోళనలో పాల్గొన్న రేఖ అనే విద్యార్థిని మాట్లాడుతూ బీఎంఎస్ను మూడేళ్ల కోర్సుగా మారిస్తే ఎన్నో ఇబ్బందులు వస్తాయంది. మంగళవారం నుంచి పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని పేర్కొంది. బీఎంఎస్ విద్యార్థుల ఆందోళన డీయూలో బీఎంఎస్ (బ్యాచిలర్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్) నాలుగేళ్ల కోర్సుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వైఖరిపై ఆందోళన వ్యక్తమవుతోంది. బీఎంఎస్ మూడేళ్లే ఉంటుందని ఇది వివరణ ఇచ్చింది. తమ కోర్సును నాలుగేళ్లుగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలువురు బీఎంఎస్ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలను ఆరంభించారు. దీనిపై స్పందించిన యూజీసీ సాయంత్రం ఒక ప్రకటన చేసింది. 2013-14 విద్యాసంవత్సరంలో నాలుగేళ్ల బీ.టెక్ కోర్సులో చేరిన వారికి అదే కోర్సును కొనసాగించాలని ఇది డీయూను ఆదేశించింది. యూనివర్సిటీలో 840 మంది బీఎంఎస్ కోర్సు చదువుతుండగా, వీరికి కూడా ఇదేవిధానం అమలవుతుంంది. మిగతా కోర్సులను మూడేళ్ల వాటిగా మార్చి, బీఎంఎస్పై అనిశ్చితి కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు బీఎంఎస్ విద్యార్థులు యూజీసీ సీనియర్ అధికారులకు వినతిపత్రం సమర్పించా రు. బీఎంసీ కోర్సు భవితవ్యంపై చర్చించేందుకు యూజీసీ ఒక సమావేశం నిర్వహిస్తుందని సోమవారం కథనాలు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం మాత్రం అధికారులు విద్యార్థులతో చర్చలు నిర్వహించారు. భవిష్యత్లోనూ బీఎంఎస్ను ఎఫ్వైయూపీగానే ఉంచాలనే డిమాండ్తో ఆందోళనలను కొనసాగిస్తామని నిడా సైఫీ అనే బీఎంఎస్ విద్యార్థి అన్నాడు. బీ.టెక్ కోర్సును భవిష్యత్లో ఎఫ్వైయూపీగానే కొనసాగిస్తామని డీయూ వైస్చాన్స్లర్ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఈ కోర్సు విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు. బీఎంఎస్ కాలపరిమితిపై చర్చించేందుకు స్థాయీ సలహాసంఘం సమావేశం నిర్వహిస్తామని యూజీసీ వైస్ చైర్మన్ హెచ్.దేవరాజ్ సోమవారం ప్రకటించారు. బీ.టెక్ మాదిరిగానే బీఎంఎస్ ఎఫ్వైయూపీని కూడా రద్దు చేయాలని నిర్ణయించిన డీయూ, ఇక నుంచి వీటిని మూడేళ్ల కోర్సులుగానే పరిగణించి అడ్మిషన్లు ఇస్తామని ప్రకటించింది. బీఎంఎస్, బీ.టెక్ విద్యార్థులు మాత్రం తమ కోర్సులను ఎఫ్వైయూపీ పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ డిగ్రీలకు ఎటువంటి విలువా ఉండబోదని వాదిస్తున్నారు. యూజీసీ మాత్రం ఈ వాదనను పట్టించుకోలేదు. బీఎంఎస్ కోర్సు మూడేళ్లే! బీఎంఎస్ విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన యూజీసీ ఈ విషయమై సోమవారం సాయంత్రానికి స్పష్టత ఇచ్చింది. 2013-14 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పొందిన వారికి కూడా మూడేళ్ల కోర్సునే అమలు చేయాలని డీయూను ఆదేశించింది. ఈ మేరకు మార్పులు చేయాలని స్పష్టం చేసింది. కోర్సును నాలుగేళ్లకు పొడగించాలని బీఎంఎస్ విద్యార్థులు డిమాండ్ చేసినా, యూజీసీ మాత్రం మూడేళ్లకే పరిమితం చేసింది. విద్యార్థులతో పలుసార్లు భేటీ అయిన చర్చలు నిర్వహించిన యూజీసీ అధికారులు చివరికి సాధారణ కోర్సుకే మొగ్గుచూపారు. దీనిపై పలువురు బీఎంఎస్ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఎఫ్వైయూపీ రద్దు
నాలుగు రోజుల ఎడతెగని అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. యూజీసీ ఆదేశాల మేరకు మూడేళ్ల కోర్సులోనే ప్రవేశ ప్రక్రియ చేపడతామని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ప్రకటించింది. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బీటెక్ విద్యార్థులు మాత్రం శుక్రవారం కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇక ప్రవేశాలు మూడేళ్ల డిగ్రీ కోర్సులోనే సాక్షి, న్యూఢిల్లీ : నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుపై నెలకొన్న వివాదం సమసిపోయింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేర కు ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను రద్దుచేసింది. గతంలో బోధించిన మూడేళ్ల డిగ్రీ కోర్సు ప్రకారమే ప్రవేశాలు జరపనున్నట్లు ప్రకటి ంచింది. యూనివర్సిటీ కిందనున్న కళాశాలలన్నింటిలో ప్రవేశ ప్రక్రియను ప్రారంభించాలని డీయూ వైస్చాన్స్లర్ దినేశ్సింగ్... ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశా రు. యూజీసీ ఆదేశాల మేరకు యూనివర్సిటీ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను రద్దు చేయాలని నిర్ణయించామని దినేశ్సింగ్ ప్రకటించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలు 2012-13 విద్యాసంవత్సరంలో పాటించిన ప్రక్రి య ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని ఆయన సూచించారు. యూజీసీ, డీయూల మధ్య నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంపై వివాదం కారణంగా అడ్మిషన్ ప్రక్రియపై నెలకొన్న అనిశ్చితి వీసీ తాజా ప్రకటనతో తొలగిపోయింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దినేశ్ ప్రకటించారు. డీయూ పరిధిలోని 64 కళాశాలల్లో 54 వేల సీట్ల కోసం 2.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో అడ్మిషన్ ప్రక్రియ సోమవారం మొదలవుతుందని భావిస్తున్నారు. అడ్మిషన్ ప్రక్రి య ఇప్పటికే వారం రోజులు ఆలస్యమైంది. నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సును రద్దు చేస్తూ డీయూ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కోర్సును వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు జరుపుతున్న విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి. కాగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును రద్దు చేయడంతో పాత పదధతి ప్రకారం అడ్మిషన్ ప్రకియను నిర్వహించే మార్గాలను చర్చించడం కోసం డీయూ కాలేజీల ప్రిన్సిపాల్స్ దినేశ్సింగ్ను కలిశారు. అడ్మిషన్ ప్రక్రియను సజావుగా నిర్వహిం చేందుకు తగు సూచనలకోసం 12 కాలేజీల ప్రిన్సిపాల్స్తో కమిటీని నియమించారు. -
ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ దినేశ్ సింగ్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. వివాదస్పద నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సు రద్దు చేయాలంటూ యూజీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దినేశ్ రాజీనామా చేయడం వార్తల్లోకి ఎక్కింది. దినేష్ సింగ్ తన రాజీనామాను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖకు పంపారని వర్సిటీ జాయింట్ డీన్ మలయ్ నీరవ్ మీడియాకు తెలిపారు. నాలుగేళ్ల కోర్సును రద్దు చేయాలంటూ యూజీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న 2.7 లక్షల మంది పరిస్థితి గందరగోళంలో పడింది. గత సంవత్సరం ప్రారంభించిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సును రద్దు చేయాలంటూ ఢిల్లీ యూనివర్సిటీకి యూజీసీ నోటీసలు జారీ చేసింది. అలాగే నాలుగేళ్ల కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులను మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు మళ్లించాలని యూజీసీ ఆదేశించింది. -
ఢిల్లీ వర్సిటీ కాలేజీల అడ్మిషన్లు వాయిదా
వర్సిటీ, యూజీసీ మధ్య వివాదం ఎఫెక్ట్ న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ల మధ్య చినికి చినికి గాలివానగా మారిన నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేషన్ కోర్సు(ఎఫ్వైయూపీ) వివాదం కొత్త మలుపు తిరిగింది. ఢిల్లీ వర్సిటీ అనుబంధ కాలేజీలు 2014-15 విద్యాసంవత్సం అడ్మిషన్లను సోమవారం వాయిదా వేశాయి. అర్హత గల సంస్థ ఈ వ్యవహారంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేంతవరకు అడ్మిషన్లను వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి. అడ్మిషన్లు మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. వీటి వాయిదా కారణంగా 60 వేల మంది విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. గత ఏడాది ప్రవేశపెట్టిన ఎఫ్ఐయూపీ కింద కాకుండా మూడేళ్ల డిగ్రీ కోర్సు కిందే అడ్మిషన్లు నిర్వహించాలని, దీన్ని అమలు చేస్తున్నట్లు నివేదిక పంపాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని వర్సిటీకి యూజీసీ ఆదివారం విధించిన గడువు సోమవారంతో ముగిసింది. అయితే ఎఫ్ఐయూపీపై పట్టుదలతో ఉన్న వర్సిటీ యూజీసీ ఆదేశాలను ధిక్కరించింది. కోర్సుపై అస్పష్టతతోపాటు యూజీసీ గడువు ముగియడంతో అడ్మిషన్లు వాయిదా వేయాలని కాలేజీల ప్రిన్సిపాళ్లు అత్యవసరంగా సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. -
నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు కొనసాగుతున్న ప్రతిష్టంభన
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ)లో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యేయేట్ కోర్సు (ఎఫ్వైయూపీ)పై అయోమయం సోమవారం కూడా కొనసాగింది. ఈ కోర్సుపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తొలి జాబితా మంగళవారం వెలువడాల్సి ంది. ఈ కోర్సును రద్దు చేసినట్లయితే ప్రవేశ ప్రక్రియను మళ్లీ కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుందని, జూలై నుంచి తరగతులు మొదలయ్యే అవకాశాలు లేవని, కనీసం నాలుగైదు వారాలు ఆలస్యం కావొచ్చని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ కోర్సుపై స్పష్టత కోరుతూ ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ, ఐసా విద్యార్థులు విశ్వవిద్యాలయం క్యాంపస్తోపాటు మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యాలయం వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. ఢిల్లీ యూనివర్సిటీలో నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును గత ఏడాది ప్రవేశపెట్టారు. బీఏ పాస్ , బీకామ్ పాస్, బీఎస్సీ లైఫ్ సెన్సైస్ వంటి కోర్సులను రద్దు చేసి వాటి కింద ఉన్న సీట్లను నాలుగేళ్ల అనర్స్ కోర్సుల్లో పంచారు. ఇప్పుడు నాలుగేళ్ల కోర్సును రద్దు చేస్తే మళ్లీ మూడేళ్ల కోర్సు కోసం సీట్లను కేటాయించాల్సి ఉంటుందని వివిధ కళాశాలల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చేదాకా అడ్మిషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రకటించింది. విద్యార్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగించినప్పటికీ అడ్మిషన్ కోసం ఎంపిక చేసిన విద్యార్థుల తుది జాబితా, వెయిటింగ్ లిస్టులను వివాదం తేలిన తరువాతే ప్రకటిస్తామని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల యాజమాన్యం. ఢిల్లీ విశ్వవిద్యాలయం కింద ఉన్నప్పటికీ మైనారిటీ విద్యాసంస్థ అయిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అడ్మిషన్ నియమాలు మిగతా కాలేజీలకు భిన్నంగా ఉంటాయి. అయోమయంలో విద్యార్థులు అయితే ఏడాదిగా నాలుగేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులు యూజీసీ ప్రకటనతో మరింత అయోమయంలో పడ్డారు. నాలుగేళ్ల కోర్సును చట్టవిరుద్ధంగా ప్రవేశపెట్టారని, దానికి గుర్తింపు కూడా లేదంటూ వచ్చిన వార్తలు మరింత అయోమయానికి గురిచేశాయి. భవిష్యత్తు ఏమిటనే విషయమై అందరినీ ఆరా తీస్తూ కనిపించారు. నాలుగేళ్ల బీటెక్ కోర్సును కొనసాగించాలని కోరుతూ బీటెక్ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. స్వతంత్ర ప్రతిపత్తిని హరించడమే నాలుగేళ్ల కోర్సు కింద అడ్మిషన్లు జరపరాదంటూ యూజీసీ ఆదేశించడం డీయూ స్వయంప్రతిపత్తిని హరించడమేనని ఉపాధ్యాయుల్లో ఓ వర్గం అభిప్రాయపడింది. నాలుగు సంవత్సరాల కోర్సు కింద అడ్మిషన్లు చేపట్టరాదని, అలా చేసిన కళాశాలలకు నిధులు నిలిపివేస్తానని హెచ్చరిస్తూ యూజీసీ లేఖ రాయడాన్ని ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డ్యూటా) మాజీ అధ్యక్షుడు ఆదిత్య నారాయణ్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. కోర్సు స్వరూపాన్ని నిర్ణయించే హక్కు యూనివర్సిటీకి ఉందని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇదేవిధంగా ప్రభుత్వం.. డీయూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పోతే రేపు ప్రభుత్వ విధానాలనే పాఠ్యాంశాలలో చేర్చాలంటారని ఆయన హెచ్చరిం చారు. యూజీసీ... మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృ తి ఇరానీ ఆదేశాల మేరకు నడుస్తోందని ఆయన ఆరోపించారు. నాలుగు సంవత్సరాల కోర్సుకు రాష్ట్రపతికి ఆమోదం పొందలేదనే ఆరోపణలను ఆయన ఖండించారు. నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం కోర్సు ఆర్డినెన్స్ను రాష్ట్రపతికి పంపారని, దానిపై రాష్ట్రపతి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని. అందువల్ల దానికి ఆమోదం లభించినట్లేనని ఆయన చెప్పారు. సాధారణంగా ఆర్డినెన్స్పై అభ్యంతరాలు కనుక ఉన్నట్టయితే నెల రోజుల్లోగా రాష్ట్రపతి దానిపై నెగెటివ్ రిమార్క్లు పంపుతారని, ఒకవేళ అలా పంపనట్లయితే ఆర్డినెన్స్ను ఆమోదించినట్లుగా భావిస్తారని ఆయన చెప్పారు. నాలుగు సంవత్సరాల కోర్సు ఆర్డినెన్స్పై రాష్ట్రపతి ఎలాంటి నెగెటివ్ రిమార్కూ పంపలేదని ఆయన చెప్పారు. నాలుగు సంవవత్సరాల కోర్సు కేవలం డీయూలోనే కాకుండా అలహాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఉందన్నారు. కేంద్రం నిధులతో నడిచే దేశంలోని ఆరు సంస్థలు కూడా నాలుగేళ్ల కోర్సును అందిస్తున్నాయని, వాటి విషయంలో ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం చేయ ని యూజీసీ.. ఢిల్లీ యూనివర్సిటీ నాలుగేళ్ల కోర్సు పై అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. నాలుగేళ్ల కోర్సును ఉపసంహరించాలని డీయూపై ఒత్తిడి చేయడం యూనివర్సిటీ అస్తిత్వాన్ని సవాలు చేయడమేనని, దాని స్వయంప్రతి పత్తిని హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నో అభ్యంతరాల మధ్య ఢిల్లీ యూనివర్సిటీ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రవేశపెట్టిందని, అయితే దానిని అమలు చేస్తున్నప్పుడు వ్యతిరేకించని యూజీసీ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ప్రశ్నించారు. ఈ వివాదం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడడమే కాకుండా డీయూ ప్రతిష్ట నవ్వులాటగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి గల వైఖరికి ఈ వివాదం అద్దం పడుతోందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే యూజీసీ ఆదేశంపై ఆప్ హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయంగానీ లేదా దానికింద ఉన్న కళాశాలల్లోగానీ ఎఫ్వైయూపీ కింద అడ్మిషన్లు జరపరాదంటూ యూజీసీ జారీ చేసిన అల్ట్లిమేటం కొందరు విద్యార్థులు, టీచర్లకు ఆనందం కలిగించగా, మరికొందరిని నిరసన ప్రదర్శనలకు పురికొల్పింది. యూజీసీ అల్టిమేటం పట్ల హర్షం ప్రకటి స్తూ ఏబీవీపీ విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. యూజీసీ ఆదేశంతో డీయూలో నాలుగుసంవత్సరాల కోర్సు అంతం కావడం తథ్యమంటూ వారు ధీమా వ్యక్తం చేశారు. దీనిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని వారు డిమాం డ్ చేశారు. నాలుగేళ్ల కోర్సును సమర్థిస్తున్న ఎన్ఎస్యూఐ సభ్యులు కూడా కోర్సును కొనసాగించాలని ప్రదర్శన నిర్వహించారు. ఎఫ్వైయూపీపై నిర్వహించిన ఓ సమావేశంలో ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ కార్యకర్తలు ఘర్షణకు కూడా దిగారు. నాలుగేళ్ల కోర్సును వ్యతి రేకిస్తున్న ఐసా కార్యకర్తలు మానవ వనరుల మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడమే కాకుం డా వైస్ చాన్స్లర్ దీపక్ సింగ్ను తొల గించాలని డిమాండ్ చేశారు. దీపక్ సింగ్ దిష్ట్టిబొమ్మను వారు దహనం చేశారు. -
వారిపై సస్పెన్షన్ ఎత్తివేయండి: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ : సస్పెన్షన్కు గురైన అయిదుగురు ఢిల్లీ యూనివర్శిటీ అధికారులపై వేటు ఎత్తివేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం వర్శిటీ వైస్ చాన్సులర్ను కోరారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని తాను వ్యక్తిగతంగా కోరుతున్నట్లు ఆమె ట్విట్ చేశారు. కాగా స్మృతి ఇరానీ విద్యార్హత ధ్రువ పత్రాలను లీక్ చేశారంటూ అధికారులను నిన్న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 2004 ఎన్నికల సమయంలో స్మృతి ఇరానీ ఎన్నికల అఫిడవిట్లో తాను 1996లో ఢిల్లీ యూనివర్సిటీ దూరవిద్యా విభాగం నుంచి బీఏ పూర్తి చేశానని పేర్కొన్నారు. తాజాగా జరిగిన ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం తాను 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూరవిద్యా విభాగం ద్వారా బీకామ్ ప్రథమ సంవత్సరం మాత్రమే చదివినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. -
సాయిబాబా అరెస్ట్ అప్రజాస్వామికం
విజయవాడ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా అరెస్ట్ అప్రజాస్వామికమని విరసం నేత కల్యాణరావు అన్నారు. సాయిబాబా విడుదల కోరుతూ దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ ప్రపంచం గుర్తించిన మేధావి సాయిబాబాకు నక్సల్స్తో సంబంధాలు ఉన్నాయంటూ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. అంగవైకల్యంతో బాధపడే వ్యక్తిని అరెస్ట్ చేసి చీకటి గదిలో నిర్బంధించడం అమానవీయ చర్యగా అభివర్ణించారు. అరెస్ట్ సమయంలో కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా గోప్యంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రొఫెసర్ సాయిబాబాపై సస్పెన్షన్ వేటు!
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలెదుర్కోంటున్న ఫ్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను సస్సెన్షన్ వేటు వేసినట్టు ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సాయిబాబాపై సస్పెన్షన్ వేటు వేయాలని రామ్ లాల్ ఆనంద్ కాలేజి పాలన యంత్రాంగం సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ యూనివర్సిటీ జాయింట్ డీన్ మలయ్ నీరవ్ తెలిపారు. రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో సాయిబాబా ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. మావోలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను మే 9 తేదిన అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన సాయిబాబాను సస్పెండ్ చేయాలంటూ విద్యార్ధులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్ధుల ఒత్తిడి మేరకు కళాశాల యాజమాన్యం సాయిబాబాపై చర్య తీసుకుంది. సామాన్య కుటుంబంలో జన్మించిన సాయిబాబా వికలాంగుడు. ఆయన అమలాపురం పట్టణానికి సమీపంలోని నల్లమిల్లి గ్రామానికి చెందిన వాడు. -
సాయిబాబా అరెస్ట్కు నిరసనగా ఆందోళన
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు డీయూ విద్యార్థులు, అధ్యాపకులు శనివారం ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ వద్ద వారు ధర్నా చేశారు. మహారాష్ట్ర పోలీసులు అక్రమంగా సాయిబాబాను అరెస్టు చేశారని ఆరోపించారు. ఢిల్లీ స్టూడెంట్ యూనియన్, జేఎన్యూఎస్యూతోపాటు క్రాంతి కారీ యువ సంఘటన్కి చెందిన 100 మందికిపైగా విద్యార్థి సంఘాల నాయకులు, డీయూ ప్రొఫెసర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మహారాష్ట్ర పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టయిన ప్రొఫెసర్ సాయిబాబా వికలాంగుడని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. పోలీసులు బేషరుతుగా ప్రొఫెసర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న డీయూ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డి సుకుమార్ మాట్లాడుతూ సాయిబాబా 90 శాతం వికలాంగుడని, ఒకవేళ ఆయనపై అభియోగాలుంటే పోలీసులు ఆయనను ఇంటివద్దే విచారించొచ్చని చెప్పారు. దళితులు, ఆదివాసీయులకు న్యాయం చేయాలని పోరాడుతున్న వ్యక్తులను ప్రభుత్వం ఇలా అరెస్టు చేయడం అనైతికం, అప్రజాస్వామికం అన్నారు. సాయిబాబాపై అభియోగాలున్నాయని పోలీసులు చెబుతున్నారే కానీ అది నిజమా కాదా చట్టం నిర్ణయిస్తుందన్నారు. అన్ని విధాలుగా సహకరిస్తానని సాయిబాబా చెప్పినా పోలీసులు ఇలా వ్యహరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. దాదాపు రెండు గంటలపాటు విద్యార్థులు, అధ్యాపకులు శాంతియుతంగా ఆందోళన చేసిన అనంతరం సాయిబాబా అరెస్టు, మహారాష్ట్ర పోలీసుల తీరును వివరిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చౌహాన్కి వారు ఒక లేఖ రాశారు. దానిని మహారాష్ట్ర సదన్ రెసిడెంట్ కమిషనర్ ద్వారా మహారాష్ట్ర సీఎంకి పంపుతున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని నల్లమిల్లి గ్రామానికి చెందిన సాయిబాబా హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేశారు. సీఫెల్ నుంచి డాక్టరేట్ పొందిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. -
'మావోయిస్టులతో నాభర్తకు సంబంధాలు లేవు'
న్యూఢిల్లీ: మావోయిస్టులతో నా భర్తకు సంబంధాలు లేవు అని ఢిల్లీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భార్య వసంత తెలిపారు. మావోయిస్టులతో సంబంధముందనే ఆరోపణలతో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివాసుల హక్కుల కోసం సాయిబాబా పోరాటం చేస్తున్నారని సాక్షి టెలివిజన్ కిచ్చిన ఇంటర్వ్యూలో వసంత తెలిపారు. గ్రీన్హంట్కు వ్యతిరేకంగా నా భర్త పోరాడారు. ప్రభుత్వం కక్ష కట్టి వేధిస్తోంది. మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది అని వసంత అన్నారు. నా భర్తకు ఆరోగ్యం సరిగా లేదని, వెంటనే నా భర్తను విడుదల చేయాలని ప్రభుత్వానికి వసంత విజ్ఞప్తి చేశారు. పోలీసులు అక్రమంగా ఆయన్ను తీసుకెళ్లారని వసంత అరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం చెందిన జీఎన్ సాయిబాబాను విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. -
బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో మరో ఎఫ్ఐఆర్!
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో ముంబైకి చెందిన టాప్ వర్త్ ఉర్జా అండ్ మెటల్ లిమిటెడ్ కంపెనీపై తాజాగా ఎఫ్ఐఆర్ ను సీబీఐ దాఖలు చేసింది. ఈకేసులో ముంబైకి చెందిన కంపెనీ డైరెక్టర్, ఇంకా గుర్తు తెలియని వ్యక్తులను దోషులగా చేర్చింది. 1993-2005లో జరిగిన బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్ సురేంద్ర లోధా, మరో డైరెక్టర్ ఓంప్రకాశ్ నెవాతియాలపై ఇండియన్ పీనల్ కోడ్ 120, 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలో ఈ కంపెనీని విరంగణ స్టీల్ గా పిలువబడేది. ఇటీవల ఈ కంపెనీకి చెందిన నాగపూర్, యవత్మల్, ముంబైలోని కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. -
ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా అరెస్ట్తో ఢిల్లీ వర్సిటీలో కలకలం రేగింది. మావోయిస్టులతో సంబంధాలపై ఆయనను పోలీసులు ప్రశ్నించే అవకాశముంది. ఎంతకాలం నుంచి మావోయిస్టులతో ఆయనకు సంబంధాలున్నాయనే దానిపై దర్యాప్తు చేయనున్నారు. -
విద్యార్థిపై జాతివివక్ష: ఇద్దరు యువకులు అరెస్టు
న్యూఢిల్లీ: జాతివివక్ష చూపిస్తున్న ఆరోపణలపై ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈశాన్య రాష్ట్ర విద్యార్థిపై జాతివివక్ష చూపిస్తున్నారన్న ఆరోపణపై ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. బీహార్కు చెందిన ఛప్రా ప్రాంత వాసులైన అమిత్కుమార్, ఆకాశ్కుమార్లు తనపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని శనివారం అర్ధరాత్రి ఈశాన్య రాష్ట్రవాసి అయిన హేమాంగ్ హూకూప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తర ఢిల్లీలో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ఉత్తర క్యాంపస్ సమీపంలో మౌరీస్ నగర్లో బాధితుడు, నిందితులు పక్కపక్క నివాసాల్లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రశాంతంగా జేఈఈ
ఖమ్మం, న్యూస్లైన్ : జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఏఐఈఈఈ ప్రవేశ పరీక్షలు జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాల్లో మొత్తం 10 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. పేపర్-1, పేపర్-2 విభాగాల్లో మొత్తం 6,379 మందికి గాను 6,145 మంది హాజరు కాగా 234 మంది గైర్హాజరయ్యారని పరీక్షల జిల్లా సమన్వయకర్త పార్వతీరెడ్డి తెలిపారు. ఇందులో పేపర్ -1 పరీక్షల్లో 4,659 మంది విద్యార్థులకు 4,540 మంది హాజరు కాగా, 119 మంది గైర్హాజరయ్యారని, పేపర్-2 విభాగంలో 1720 మందికి గాను 1605 మంది హాజరయ్యారని వివరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్ సనా బృందం జిల్లాలోని అన్ని కేంద్రాలను పర్యవేక్షించి పరీక్షల తీరును గమనించారు. ఈ సందర్బంగా పార్వతీరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు ఇన్విజిలేటర్లకు, స్క్వాడ్ బృందాలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. జిల్లాలోని అన్ని సెంటర్లలో పరీక్షలు సజావుగానే జరిగాయని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఆర్టీసీతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు బస్సు సౌకర్యం కల్పించారన్నారు. అయితే పరీక్ష కేంద్రాల వద్ద సరైన వసతి లేకపోవడంతో పరీక్షలు అయ్యేంత వరకు ఎండలోనే ఉండాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైద్య కోర్సుల్లో జాట్లకు రిజర్వేషన్పై డీయూకు నోటీస్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల ప్రవేశాల్లో జాట్ కేటగిరికి రిజర్వేషన్పై ప్రభుత్వానికి, ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)కి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీచేసింది. వర్సిటీలో ఇప్పటికే సీట్లు పొందిన నలుగురు ఓబీసీ విద్యార్థులు వేసిన వ్యాజ్యం మంగళవారం విచారణ కు వచ్చింది. 2014 విద్యా సంవత్సరానికిగాను డీయూలో వివిధ వైద్య కోర్సులకు సంబంధించి 229 డిగ్రీ, 29 డిప్లొమా సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో రిజ ర్వేషన్ ప్రకారం డిగ్రీలో 62, డిప్లొమాలో 8 సీట్లు ఓబీసీకి కేటాయించింది. కాగా, గత ఫిబ్రవరి 25వ తేదీన డీయూ మెరిట్లిస్ట్ను ప్రకటించింది. ఇదిలా ఉండగా మార్చి 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం జాట్లను ఓబీసీలో చేరుస్తూ జీవో జారీ చేసింది. దీనిప్రకారం డీయూ జాట్ కేటగిరిని ఓబీసీలో చేర్చి తిరిగి మెరిట్లిస్ట్ను సవరించింది. దాంతో మొదట ప్రకటించిన మెరిట్లిస్ట్లో సీట్లు వచ్చిన నలుగురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. మొదటిసారి ప్రకటించిన మెరిట్లిస్ట్ను పక్కన బెట్టి జాట్లతో కలిపి తిరిగి మెరిట్లిస్ట్ను ప్రకటించడం అన్యాయమని వారు వాదించారు. కాగా, దీనిపై తమ సమాధానాన్ని ఫైల్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, డీయూకు ఢిల్లీకోర్టు నోటీసులు జారీచేసింది. -
వాళ్లది ‘కామ్’ లవ్స్టోరీ
ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు... మరి స్త్రీ విజయం వెనక ఓ మగాడు ఉండి తీరాలి కదా... లాజిక్ ప్రకారమే కాదు... వాస్తవం కూడా అదేనంటోంది మేరీకామ్. భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత మహిళా బాక్సర్ మేరీకామ్... తన విజయాలన్నీ వాళ్లాయన ఓన్లర్ పుణ్యమేనంటోంది. మేరీకామ్ది కూడా ప్రేమ వివాహం. అది 2000వ సంవత్సరం... ఓన్లర్కామ్... ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు. తమ ప్రాంతానికి చెందిన వాళ్లందరికీ సాయం చేస్తాడని మంచి పేరు. మేరీ 19 ఏళ్ల బాక్సర్. మణిపూర్ నుంచి భవిష్యత్లో వెలుగులోకి వస్తుందని బాక్సింగ్ కమ్యూనిటీ నమ్మిన అమ్మాయి. బెంగళూరులో జరిగే జాతీయ బాక్సింగ్ శిబిరం కోసం ట్రెయిన్లో వెళుతుండగా మేరీ సూట్కేస్ పోయింది. డబ్బు, పాస్పోర్ట్ అందులో ఉన్నాయి. నెల రోజుల్లోనే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనాలి. ఎలా? అన్యమస్కంగా క్యాంప్ను ముగించుకుని ఢిల్లీ చేరింది. అక్కడెవరో చెప్పారు. ‘ఓన్లర్ అని మన ప్రాంతం వ్యక్తే. అందరికీ సాయం చేస్తాడు. ప్రస్తుతం ఇక్కడే ఢిల్లీలో ఉన్నాడు. ఓసారి కలువు’. నెహ్రూ స్టేడియంలో మేరీ ప్రాక్టీస్ చేస్తోంది. ఓ స్నేహితుడిని కలవడానికి ఓన్లర్ అక్కడకి వచ్చాడు. మేరీకామ్ ప్రాక్టీస్ చేస్తుంటే చూశాడు. ఆమె పంచ్ పవర్ని గమనించాడు. ‘ఫర్వాలేదు... భవిష్యత్ ఉంది’ అనుకున్నాడు. పది నిమిషాల తర్వాత మేరీ ఓన్లర్ దగ్గరకి వచ్చింది. ‘నా పాస్పోర్ట్ పోయింది. కాస్త తొందరగా తెచ్చుకోవడానికి సహాయం చేస్తారా?’ అని అడిగింది. ఆ రోజు స్నేహం మొదలైంది. ఐదేళ్లు గడిచాయి. ఈలోగా ఎప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందో తెలియదు. ఒక రోజు ఓన్లర్ వచ్చి ‘మేరీ... విల్ యూ మ్యారీ మీ’ అని అడిగాడు. అప్పటికే తన గుండెల్లో ఉన్న వ్యక్తి నుంచి ఈ ప్రతిపాదన వస్తే ఎవరైనా ఏం చేస్తారు..? మేరీ కూడా అదే చేసింది. మార్చి, 2005... ఓన్లర్ కామ్, మేరీకామ్ల పెళ్లయింది. బాక్సింగ్ కమ్యూనిటీ పెదవి విరిచింది. ‘ఇక ఓ గొప్ప బాక్సర్ కెరీర్ ముగిసిపోయింది. పెళ్లయ్యాక మహిళలు బాక్సింగ్లో రాణించడం కష్టం’... ఇదీ నాటి అభిప్రాయం. కానీ ఆ అభిప్రాయం తప్పు అని ఈ జంట నిరూపించింది. మేరీకామ్ జీవితంలో అతి పెద్ద విజయాలన్నీ పెళ్లయ్యాకే వచ్చాయి. కవల పిల్లలకు జన్మనిచ్చాక... బాక్సింగ్ రింగ్లోకి దిగి పతకాలు గెలవడం... అది కూడా ఒలింపిక్ పతకం గెలవడం... వాహ్ మేరీకామ్.. హ్యాట్సాఫ్..! కవలలతో సహా ముగ్గురు పిల్లల్ని పెంచడం... భార్య కెరీర్కు సహకరించడం... ఓన్లర్ కామ్... డబుల్ హ్యాట్సాఫ్..! -ఎల్లా రమేష్ (సాక్షి స్పోర్ట్స్) ‘మేరీలో చాలా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మాది లవ్ అనడం కంటే... ఆమెను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని అనడం కరెక్ట్. ఆమె విషయంలో బాధ్యత తీసుకోవాలని అనిపించింది. కెరీర్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ తనలోని తపన చూస్తే ముచ్చటేస్తుంది. పిల్లల విషయంలో తను నన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది. కానీ తను రింగ్లో ఉన్నంతసేపు ఇంటి సమస్యలు, బాధ్యతలు తనకు గుర్తు రాకూడదు. అందుకే నేను పిల్లల గురించి ఎక్కువ కేర్ తీసుకుంటాను’ - ఓన్లర్కామ్ ‘ఓన్లర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన గురించి ఆగకుండా వారం రోజులు చెప్పమన్నా చెబుతా. మా పెళ్లయిన కొత్తలో నా కెరీర్ అయిపోయిందని అందరూ అన్నారు. కానీ నన్ను నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి ఓన్లర్. నా కెరీర్ కోసం తను చాలా త్యాగాలు చేశాడు. తను పరిచయమైనప్పటి నుంచి ఎందుకో తనంటే తెలియని ప్రేమ. పెళ్లి చేసుకుందాం అనగానే ఎగిరి గంతేశాను. పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కవలల్ని పెంచడం మరీ కష్టం. కానీ అలాంటి ఇబ్బందీ నాకు మాత్రం ఇప్పటిదాకా తెలియదు. ఓన్లర్ మొత్తం చూసుకుంటాడు. నా విజయాల్లో... ఓన్లర్ త్యాగం, తను ఇచ్చిన స్ఫూర్తిదే అగ్రస్థానం’ - మేరీకామ్ -
లైంగికంగా వేధించి.. ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్పై కేసు
మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని భీమ్ రావు అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపాల్ జి.కె.అరోరా.. అదే కాలేజీలో పనిచేసే పవిత్ర భరద్వాజ్ (35)ను వేధించేవాడు. విసిగిపోయిన పవిత్ర గత నెల 30న ఢిల్లీ సెక్రటేరియట్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడింది. నిప్పంటించుకున్న పవిత్ర వారం రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఈ నెల 7న కన్నుమూసింది. అరోరాతో పాటు మరికొందరు ఉద్యోగులు తనను లైంగికంగా, మానసికంగా వేధించారని, వారి ఆగడాలను భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు వాంగ్మూలమిచ్చింది. ఈ సంఘటనపై ఢిల్లీ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. 11న ఢిల్లీ యూనివర్సిటీ అరోరాను విచారణ ముగిసే వరకు సస్పెండ్ చేసింది. ఈ కేసు విచారణ చేస్తున్నట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ చెప్పారు. -
లైంగిక వేధింపులకు బలైన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ఉద్యోగిని!
ఓ కళాశాల ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో గత ఏడు రోజుల క్రితం ఒంటిపై కిరొసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన డిల్లీ యూనివర్సిటీలో పనిచేసిన లాబ్ అసిస్టెంట్ పవిత్ర భరద్వాజ్ సోమవారం ఉదయం మరణించారు. గత ఏడు రోజుల క్రితం ఢిల్లీ సచివాలయం గేట్ నంబర్ 6 వద్ద కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకోవడంతో పవిత్రను ఎల్ఎన్ జేపీ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం గాయాలైన పవిత్ర చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస వదిలారు. యమునా విహార్ లోని బీమ్ రావ్ అంబేద్కర్ కాలేజి ప్రిన్స్ పాల్ జీకే అరోరా, మరో ఉద్యోగి శారీరకంగా, మానసికంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తన సూసైట్ నోట్ లో వెల్లడించింది. పోలీసులు సంఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర మృతి సమాచారం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ప్రిన్స్ పాల్ ను విధులనుంచి తొలగించాలని విద్యార్థులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. సూసైడ్ నోట్ లో స్పష్టంగా నిందితుల పేర్లు ఉన్నప్పటికి.. ఢిల్లీ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడంలేదని విద్యార్థులు ఆరోపణలు చేశారు. రెండేళ్ల క్రితం బాధితురాలిని విధుల నుంచి యూనివర్సిటీ యాజమాన్యం తొలగించగా.. పోలీసులు ఆమెపై ఆత్మహత్య కేసును నమోదు చేశారు. ఆరోరాపై బాధితురాలు ఫిర్యాదు చేసినా.. ప్రిన్స్ పాల్ కు యూనివర్సిటి మేనేజ్ మెంట్ క్లీన్ చిట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'మావోనేత గణపతితో లెక్చరర్ కు సంబంధాలున్నాయి'
రామ్ లాల్ ఆనంద్ కాలేజి లెక్చరర్ జీన్ సాయిబాబాకు నిషేధిత నక్సలైట్లతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై సాక్ష్యాలు సమర్పించేందుకు భద్రతా సంస్థలు ఢిల్లీ యూనివర్సిటీ వైఎస్ చాన్స్ లర్ కు నివేదిక ఇవ్వనున్నారు. సీపీఐ(మావోయిస్ట్) నాయకుడు, ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల గణపతి అలియాస్ గణపతితో ప్రత్యక్ష సంబంధాలు జరిపాడని నిఘా సంస్థలు సాక్ష్యాలను సేకరించినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. సాయిబాబా నివాసంలో ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు సోదాలు జరిపి.. కొన్ని వ్యాసాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, కొంత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీపీఐ (మావోయిస్ట్) పోలిట్ బ్యూరో సభ్యుడు కోబాడ్ గాంధీని విచారించగా.. సాయిబాబా పేరు బయటకు వచ్చిందని.. మావోయిస్ట్ పార్టీకి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ గా సాయిబాబా వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలిపారు.