England vs West Indies
-
సామ్ కుర్రాన్ విధ్వంసం.. విండీస్పై ఇంగ్లండ్ ఘన విజయం
సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. 2019 తర్వాత కరేబియన్ గడ్డపై టీ20 సిరీస్ను ఇంగ్లండ్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.ఇక వర్షం కారణంగా 50 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత విండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రావ్మన్ పావెల్(54) టాప్ స్కోరర్గా నిలవగా..షెఫర్డ్(30) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్, జెమ్మీ ఓవర్టన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 146 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది.ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కుర్రాన్(26 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 41) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. లివింగ్ స్టోన్(39), విల్ జాక్స్(32) పరుగులతో సత్తాచాటారు. విండీస్ స్పిన్నర్ 4 వికెట్లతో చెలరేగినప్పటకి తన జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. ఇక నాలుగో టీ20 ఇరు జట్ల మధ్య నవంబర్ 16న సెయింట్ లూసియా వేదికగా జరగనుంది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్కు గుడ్ బై! -
జోస్ బట్లర్ విధ్వంసం.. విండీస్పై ఇంగ్లండ్ ఘన విజయం
బ్రిడ్జిటౌన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్లో ఇంగ్లీష్ జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది.విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రావ్మన్ పావెల్(43) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. షెఫార్డ్ 22 పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, మౌస్లీ, మహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అర్చర్, రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.జోస్ బట్లర్ విధ్వంసం..అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 83 పరుగులు చేశాడు.అతడితో పాటు విల్ జాక్స్(38) రాణించాడు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు, అకిల్ హోస్సేన్ ఓ వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 నవంబర్ 14న సెయింట్ లూసియా వేదికగా జరగనుంది.చదవండి: IND vs SA: సంజూ శాంసన్ అత్యంత చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు
స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న వెస్టిండీస్.. ఇప్పుడు అదే జట్టుతో టీ20 సిరీస్కు సిద్దమైంది. ఇంగ్లీష్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో విండీస్ తలపడనుంది. బార్బోడస్ వేదికగా నవంబర్ 9 (శనివారం) నుంచి జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ సిరీస్లో మొదటి రెండు టీ20లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్,షిమ్రాన్ హెట్మెయర్లు తిరిగి జట్టులో చేరారు. వీరు ముగ్గురు గత నెలలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు.మరోవైపు ఫాబియన్ అలెన్, అలిక్ అథానాజ్, ఆండ్రీ ఫ్లెచర్, షమర్ స్ప్రింగర్లు ఈ జట్టులో చోటు దక్కించలేకపోయారు. అదేవిధంగా స్టార్ పేసర్ జోషఫ్పై నిషేధం పడడటంతో తొలి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.ఇంగ్లండ్తో తొలి రెండు టీ20లకు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, టెరెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రోథర్ఫోర్డ్,వెస్టిండీస్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ -
కెప్టెన్తో గొడవ.. జోసెఫ్నకు బిగ్ షాకిచ్చిన విండీస్ క్రికెట్
వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్నకు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాకిచ్చింది. అతడిపై రెండు మ్యాచ్ల నిషేధం వెస్టిండీస్ క్రికెట్ విధించింది. దీంతో స్వదేశంలో ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు జోషఫ్ దూరం కానున్నాడు. బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి వన్డేలో జోసెఫ్ బోర్డు విధానాలు, క్రమశిక్షణ ఉల్లఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.అసలేం జరిగిందంటే?బుధవారం(నవంబర్ 6) ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి వన్డేలో జోసెఫ్ తమ కెప్టెన్ షాయ్ హోప్తో వాగ్వాదానికి దిగాడు. జోషఫ్ వేసిన నాలుగో ఓవర్లో ఇంగ్లండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్కు ఇద్దర్ స్లిప్ ఫీల్డర్లను హోప్ సెట్ చేశాడు. కానీ ఈ ఫీల్డింగ్ సెటప్ జోసెఫ్నకు నచ్చలేదు.దీంతో హోప్తో జోసెఫ్ గొడవ పడ్డాడు. అతడితో వాగ్వాదం చేస్తేనే ఓవర్ను కొనసాగించాడు. ఆ ఓవర్లో కాక్స్ను ఔట్ చేసిన జోసెఫ్నకు కనీసం సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. అయితే తన ఓవర్ను పూర్తి చేసిన అనంతరం తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోసెఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అతడిపై వెస్టిండీస్ క్రికెట్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.సారీ చెప్పిన జోషఫ్ఇక ఈ మ్యాచ్ అనంతరం తన తప్పును తెలుసుకున్న జోసెఫ్ కెప్టెన్ హోప్తో పాటు జట్టు మేనెజ్మెంట్కు క్షమాపణలు తెలిపాడు. ‘‘ఏదేమైనప్పటికీ ఆఖరి వన్డేలో నేను కొంచెం మితిమీరి ప్రవర్తించాను. ఇప్పటికే కెప్టెన్ షాయ్ హోప్, నా సహచరులు ,మేనేజ్మెంట్కు నేను వ్యక్తిగతంగా సారీ చెప్పాను. వెస్టిండీస్ అభిమానులకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని ఓ ప్రకటనలో జోసెఫ్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్-విండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ నవంబర్ 9న జరగనున్న తొలి మ్యాచ్తో ప్రారంభం కానుంది. -
WI Vs ENG: కెప్టెన్తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్
బ్రిడ్జ్టౌన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయ భేరి మ్రోగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోషఫ్ కెప్టెన్ షాయ్ హోప్తో విభేదాల కారణంగా మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి డగౌట్కు వెళ్లిపోయాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు.అసలేం జరిగిందంటే?ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోప్ తొలుత ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్హనించాడు. బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు మంచి ఆరంభం దక్కలేదు. 3 ఓవర్లోనే విల్ జాక్స్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ఫస్ట్డౌన్లో యువ ఆటగాడు జోర్డాన్ కాక్స్ క్రీజులోకి వచ్చాడు. కాక్స్కు ఇద్దర్ స్లిప్ ఫీల్డర్లను విండీస్ కెప్టెన్ సెట్ చేశాడు. అయితే ఈ ఫీల్డ్ ప్లేస్మెంట్ నాలుగో ఓవర్ వేసేందుకు వచ్చిన జోషఫ్కు నచ్చలేదు. దీంతో హోప్తో జోషఫ్ వాగ్వాదానికి దిగాడు. అతడితో గొడవ పడుతూనే ఓవర్ను జోషఫ్ కొనసాగించాడు.ఆ ఓవర్లో నాలుగో బంతికి కాక్స్ను జోషఫ్ ఔట్ చేశాడు. జోషఫ్ వికెట్ సాధించినప్పటకి కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. సహచర ఆటగాళ్లు తన దగ్గరకి వచ్చినప్పటకి జోషఫ్ మాత్రం సీరియస్గా హోప్తో తన వాగ్వాదాన్ని కొనసాగించాడు.అంతటితో ఆగని జోషఫ్ తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోషఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా?Gets angry! 😡Bowls a wicket maiden 👊Leaves 🤯An eventful start to the game for Alzarri Joseph! 😬#WIvENGonFanCode pic.twitter.com/2OXbk0VxWt— FanCode (@FanCode) November 6, 2024 -
కింగ్, కార్టీ విధ్వంసకర సెంచరీలు.. ఇంగ్లండ్పై విండీస్ ఘన విజయం
బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.ఇంగ్లీష్ జట్టు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(74) టాప్ స్కోరర్గా నిలవగా.. మోస్లీ(57), సామ్ కుర్రాన్(40), ఆర్చర్(38) పరుగులతో రాణించారు. కరేబియన్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే 3 వికెట్లు పడగొట్టగా.. జోషఫ్, షెఫార్డ్ తలా రెండు వికెట్లు సాధించారు.కింగ్, కార్టీ ఊచకోత.. అనంతరం 264 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 43 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ ఆటగాళ్లు కార్టీ(114 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్లు, 128 నాటౌట్), బ్రాండెన్ కింగ్(117 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్తో 102) విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ, ఓవర్టన్ తలా వికెట్ మాత్రమే సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ నవంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా? -
లివింగ్స్టోన్ విధ్వంసకర సెంచరీ.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో ఇంగ్లండ్ సమం చేసింది. 329 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 47.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.లక్ష్య చేధనలో ఇంగ్లండ్ స్టాండింగ్ కెప్టెన్ లైమ్ లివింగ్ స్టోన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. లివింగ్ స్టోన్ 85 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్తో పాటు సాల్ట్(59), బెతల్(55), సామ్ కుర్రాన్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 3 వికెట్లు పడగొట్టగా, జోషఫ్, ఛేజ్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ కెప్టెన్ హోప్(117) విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు కార్టీ(71), రుథర్ఫర్డ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో టర్నర్, రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, అర్చర్, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే నవంబర్ 6న బార్బోడస్ వేదికగా జరగనుంది. -
ఇంగ్లండ్ కెప్టెన్గా లియామ్ లివింగ్స్టోన్
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్ గైర్హాజరీలో ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్గా లియామ్ లివింగ్స్టోన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సిరీస్ కోసం బట్లర్ ప్రత్యామ్నాయ ఆటగాడిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేయలేదు.కాగా, ఈ ఏడాది జూన్లో జరిగిన టీ20 వరల్డ్కప్ సందర్భంగా బట్లర్ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను వన్డే, టీ20 జట్లకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని విండీస్తో సిరీస్కు బట్లర్ను తొలుత ఎంపిక చేశారు. అయితే బట్లర్ పూర్తిగా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈసీబీ అతన్ని జట్టు నుంచి తప్పించింది. బట్లర్ విండీస్తో తదుపరి జరుగబోయే టీ20 సిరీస్ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ అక్టోబర్ 31, నవంబర్ 2, నవంబర్ 8 తేదీల్లో జరుగనుంది. అనంతరం నవంబర్ 9, 10, 14, 16, 17 తేదీల్లో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్లు విండీస్ వేదికగా జరుగనున్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రస్తుతం పాక్తో మూడు మ్యాచ్ల సిరీస్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.విండీస్తో వన్డే, టీ20 సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు..లియామ్ లివింగ్స్టోన్ (వన్డే జట్టు కెప్టెన్), విల్ జాక్స్, డాన్ మౌస్లీ, జేకబ్ బేతెల్, జేమీ ఓవర్టన్, సామ్ కర్రన్, ఫిలిప్ సాల్ట్, జాఫర్ చోహాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లే, జాన్ టర్నర్చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్ -
విండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్లు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ రీఎంట్రీ
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ పర్యటన అక్టోబర్ 31న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ తొలుత వన్డే సిరీస్ ఆడుతుంది. మూడు వన్డే మ్యాచ్లు అక్టోబర్ 31 (ఆంటిగ్వా), నవంబర్ 2 (ఆంటిగ్వా), నవంబర్ 6 (బార్బడోస్) తేదీల్లో జరుగనున్నాయి. అనంతరం నవంబర్ 9 (బార్బడోస్), 10 (బార్బడోస్), 14 (సెయింట్ లూసియా), 16 (సెయింట్ లూసియా), 17 (సెయింట్ లూసియా) తేదీల్లో ఐదు టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్ల కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇవాళ (అక్టోబర్ 3) ప్రకటించారు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్లకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ జోస్ బట్లర్ విండీస్తో సిరీస్లతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు అన్ క్యాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కింది. వీరిలో జాఫర్ చోహాన్ తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోగా.. జాన్ టర్నర్, డాన్ మౌస్లీ జాతీయ జట్టుకు మరోసారి ఎంపికయ్యారు. విండీస్తో సిరీస్లకు ఈ 14 మందితో పాటు మరో ఇద్దరిని కూడా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేయనుంది. ఆ ఇద్దరు పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్తో ముగిసిన అనంతరం (అక్టోబర్ 28) జట్టుతో చేరతారు. బట్లర్ గైర్హాజరీలో ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టిన హ్యారీ బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బ్రూక్తో పాటు మరో ఆటగాడు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టులో చేరతాడు.వెస్టిండీస్ వన్డే మరియు టీ20 సిరీస్ల కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహాన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్చదవండి: ధోని కంటే రోహిత్ బెటర్ కెప్టెన్: భారత స్పిన్ దిగ్గజం -
కేన్ విలియమ్సన్కు షాక్.. వరల్డ్ నంబర్ వన్గా రూట్
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. కేన్ విలియమ్సన్ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో అదరగొట్టిన రూట్.. మరోసారి నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్నాడు.సొంతగడ్డపై మూడు మ్యాచ్ల సిరీస్లో మొత్తంగా 291 పరుగులతో రాణించిన రూట్.. ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో మొత్తంగా 872 రేటింగ్ పాయింట్లు సాధించి ప్రథమ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో మరోసారి వరల్డ్ నంబర్ వన్గా నిలిచాడు.కాగా ఈ 33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ తొలిసారిగా 2015 ఆగష్టులో అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. గతేడాది కూడా మొదటి ర్యాంకు సంపాదించాడు. ఇక తాజా టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో బాబర్ ఆజం, డారిల్ మిచెల్, స్టీవెన్ స్మిత్ టాప్-5లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకులో నిలిచాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.ఐసీసీ మెన్స్ టెస్టు తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5 ప్లేయర్లు1. జో రూట్(ఇంగ్లండ్)- 872 రేటింగ్ పాయింట్లు2. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు3. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు4. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు5. స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు. -
బెన్ స్టోక్స్ ఊచకోత.. టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. విండీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (జులై 28) ముగిసిన మూడో టెస్ట్లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టును చిత్తుగా ఓడించింది. మార్క్ వుడ్ (14-1-40-5) సెకెండ్ ఇన్నింగ్స్లో విండీస్ను కకావికలం (175 ఆలౌట్) చేశాడు. అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 7.2 ఓవర్లలో ఛేదించింది. బెన్ స్టోక్స్ ఓపెనర్గా బరిలోకి దిగి విండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్ తరఫున టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు చేశాడు. గతంలో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు ఇయాన్ బోథమ్ (28 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్గా టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు పాక్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ (21) పేరిట ఉంది. BEN STOKES - Fastest fifty in England Test history. 🔥🥶 pic.twitter.com/Lphj1mAap5— Johns. (@CricCrazyJohns) July 28, 2024మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో స్టోక్స్కు జతగా బెన్ డకెట్ (16 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) కూడా చెలరేగాడు. ఓవర్నైట్ స్కోర్ 33/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్.. మరో 142 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది (175 పరుగులకు ఆలౌట్). మార్క్ వుడ్ ఐదేసి విండీస్ను కుప్పకూల్చాడు. అట్కిన్సన్ 2, వోక్స్, షోయబ్ బషీర్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ బ్యాటర్లలో మికైల్ లూయిస్ (57), కవెమ్ హాడ్జ్ (55) హాఫ్ సెంచరీలు చేశాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. -
టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా.. టీ20 అనుకున్నావా.. ఇంతలా బాదితే ఎలా..?
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (జులై 28) ముగిసిన మూడో టెస్ట్లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటిన ఇంగ్లండ్ కేవలం రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ను ముగించింది. ఆట మూడో రోజు విండీస్ను 175 పరుగులకే ఆలౌట్ (సెకెండ్ ఇన్నింగ్స్) చేసిన ఇంగ్లండ్.. 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 7.2 ఓవర్లలోనే ఛేదించింది. ఛేదనలో ఓపెనర్గా బరిలోకి దిగిన స్టోక్స్.. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. స్టోక్స్ వీరబాదుడు ధాటికి విండీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యం కళ్లు మూసుకుని తెరిచే లోగా హాం ఫట్ అయ్యింది. స్టోక్స్కు జతగా బరిలోకి దిగిన బెన్ డకెట్ (16 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) సైతం మరో ఎండ్లో చెలరేగాడు. స్టోక్స్ బజ్బాల్ గేమ్ను చూసిన వారు "టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా లేక టీ20 అనుకున్నావా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓవర్నైట్ స్కోర్ 33/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్.. మరో 142 పరుగులు జోడించి మిగిలిన ఎనిమిది వికెట్లు కోల్పోయింది. మార్క్ వుడ్ (5/40) ఐదేసి విండీస్ను కుప్పకూల్చాడు. అట్కిన్సన్ 2, వోక్స్, షోయబ్ బషీర్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ బ్యాటర్లలో మికైల్ లూయిస్ (57), కవెమ్ హాడ్జ్ (55) హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు. -
రాణించిన రూట్, స్టోక్స్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న స్మిత్
బర్మింగ్హమ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ టెయిలెండర్లు సత్తా చాటారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 3, మార్క్ వుడ్ 0, ఓలీ పోప్ 10, హ్యారీ బ్రూక్ 2 నిరాశపర్చగా.. పదో నంబర్ ఆటగాడు గస్ అట్కిన్సన్ 21 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఆలౌటైన అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. క్రెయిగ్ బ్రాత్వైట్ (0), కిర్క్ మెక్కెంజీ (8) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (18), అలిక్ అథనాజ్ (5) క్రీజ్లో ఉన్నారు. క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్ల్లో విజయం సాధించి, సిరీస్ను ఇదివరకే కైవసం చేసుకుంది. -
జో రూట్ అరుదైన ఘనత.. లారా ఆల్టైమ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఏడో బ్యాటర్గా జో రూట్ రికార్డులకెక్కాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 143 మ్యాచ్ (261 టెస్టు ఇన్నింగ్స్లు) లు ఆడిన రూట్ 11954 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. లారా 131 మ్యాచ్ల్లో 11953 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో లారా ఆల్టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15,921) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానాల్లో రికీ పాంటింగ్(13,378), జాక్వెస్ కల్లిస్(13, 289), రాహుల్ ద్రవిడ్(13,288), అలిస్టర్ కుక్(12,472), కుమార్ సంగక్కర(12,400) ఉన్నారు. ఇక విండీస్తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రూట్ 87 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ టెస్టు కెరీర్లో 32 సెంచరీలు కూడా ఉన్నాయి. -
Eng Vs WI: మరోసారి మెరిసిన అట్కిన్సన్
England vs West Indies, 3rd Test Day 1: ఇంగ్లండ్తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్లు బ్రాత్వైట్ (61; 8 ఫోర్లు), హోల్డర్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన కరీబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 75.1 ఓవర్లలో 282 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్లో జొషువా సిల్వా (49; 3 ఫోర్లు) కూడా రాణించాడు.ఒక దశలో 76/1గా ఉన్న విండీస్ 115/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. అనంతరం జొషువా, హోల్డర్లు ఆరో వికెట్కు 109 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. వోక్స్ (3/69) ఈ జోడీని విడగొట్టి విండీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. అట్కిన్సన్ (4/67) కీలకమైన వికెట్లు తీసి విండీస్ ఆట కట్టించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్.. తొలి రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లకు 38 పరుగులు చేసింది. 2-0తో సిరీస్ కైవసంకాగా మూడు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయభేరి మోగించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మూడో టెస్టులోనైనా గెలిచి క్లీన్స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది. అందుకు అనుగుణంగానే బర్మింగ్హాంలో అడుగులు వేస్తోంది.తుదిజట్లుఇంగ్లండ్జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.వెస్టిండీస్క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాసన్ హోల్డర్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్. -
తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
బర్మింగ్హమ్ వేదికగా వెస్టిండీస్తో ఇవాల్టి నుంచి (జులై 26) మొదలయ్యే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. రెండో టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ జయకేతనం ఎగురవేసింది. తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో.. రెండో టెస్ట్లో 241 పరుగుల తేడాతో విజయం సాధించింది.విండీస్తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్ -
Eng vs WI: గాయపడ్డ బౌలర్.. ‘వికెట్ల వీరుడి’కి పిలుపు
ఇంగ్లండ్తో మూడో టెస్టు నేపథ్యంలో వెస్టిండీస్ తమ జట్టులో ఓ మార్పు చేసింది. పేసర్ జెరెమా లూయీస్ స్థానంలో అకీం జోర్డాన్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటన విడుదల చేసింది.కాగా విండీస్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్తో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూలై 10న ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభమైంది. లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన మొదటి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.చిత్తు చిత్తుగా ఓడిపర్యాటక వెస్టిండీస్ను ఏకంగా ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. ఇక నాటింగ్హామ్లో జూలై 18- 22 వరకు జరిగిన రెండో టెస్టులోనూ వెస్టిండీస్కు పరాభవమే ఎదురైంది. 241 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ను 0-2తో ఇంగ్లండ్కు కోల్పోయింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జూలై 26 నుంచి నామమాత్రపు మూడో టెస్టు జరుగనుంది. బర్మింగ్హాంలోని ఎడ్జ్బాస్టన్ ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్లోనూ సత్తా చాటి సిరీస్ను క్లీన్స్వీప్ చేసి.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్లో ముందడుగు వేయాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది.దురదృష్టంమరోవైపు.. ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. అయితే, ఇంతవరకూ టెస్టులాడని జెరెమీ లూయిస్కు విండీస్ ఈ సిరీస్ ద్వారా పిలుపునివ్వగా.. తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉన్నాడు. కానీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.అయితే, మూడో టెస్టుకు ముందు అతడు గాయపడినట్లు విండీస్ బోర్డు తెలిపింది. తొడ కండరాల గాయం కారణంగా జెరెమా జట్టుకు దూరమైనట్లు తెలిపింది. అయితే, అతడు జట్టుతో పాటే ఉంటూ చికిత్స తీసుకుంటాడని తెలిపింది. జెరెమా స్థానంలో అకీమ్ జోర్డాన్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొంది.లైన్ క్లియర్!కాగా 29 ఏళ్ల అకీమ్ జోర్డాన్ ఇంతవరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. బార్బడోస్కు చెందిన ఈ ఫాస్ట్బౌలర్ ఫస్ట్క్లాస్ రికార్డు మెరుగ్గా ఉంది. 19 మ్యాచ్లు ఆడి ఏకంగా 67 వికెట్లు తీశాడు. ప్రస్తుతం యూకేలోనే ఉన్న జోర్డాన్ జట్టుతో చేరినట్లు సమాచారం.ఇక విండీస్ పేస్ దళంలో అల్జారీ జోసెఫ్, జేడన్ సీల్స్, షమార్ జోసఫ్ అందుబాటులో ఉన్నారు. అయితే, తదుపరి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో వీరిలో ఒకరికి బోర్డు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అలా అయితే, జోర్డాన్ అరంగేట్రానికి మార్గం సుగమమవుతుంది. -
టెస్టుల్లో సచిన్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: వాన్
నాటింగ్హామ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో 122 పరుగులు చేసిన రూట్.. ఇంగ్లండ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. రూట్కు ఇది 32వ టెస్టు సెంంచరీ కావడం విశేషం.ఈ నేపథ్యంలో రూట్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడని వాన్ అభిప్రాయపడ్డాడు."జో రూట్ మరి కొద్ది రోజుల్లోనే టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. అంతేకాదు టెస్టు క్రికెట్ హిస్టరీలో లీడింగ్ రన్స్కోరర్ అయిన సచిన్ టెండూల్కర్ను కూడా అధిగమించే సత్తా రూట్కు ఉంది. ఇప్పటికే సచిన్ రికార్డుకు రూట్ చేరవయ్యే వాడు. కానీ ఆ మధ్య కాలంలో రూట్ తన ఫామ్ను కోల్పోయి కాస్త ఇబ్బంది పడ్డాడు. నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ తన వికెట్ను కోల్పోయేవాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతడు అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు మాత్రం అతడు తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దూకుడుగా ఆడుతున్నాడు. ఇదే కొనసాగితే సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేసే అవకాశముందని" ది టెలిగ్రాఫ్ కోసం తన కాలమ్లో వాన్ రాసుకొచ్చాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ ప్రస్తుతం 8వ స్ధానంలో కొనసాగుతున్నాడు.260 ఇన్నింగ్స్లలో రూట్ ఇప్పటివరకు 11,940 పరుగులు చేశాడు. కాగా సచిన్ 329 టెస్టు ఇన్నింగ్స్లలో 15921 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(13378) ఉన్నాడు. -
బెన్ స్టోక్స్ డూప్.. వైరల్ వీడియో
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను పోలిన ఓ వ్యక్తి స్టాండ్స్లో తారసపడ్డాడు. సదరు వ్యక్తిని చూసి బెన్ స్టోక్స్ ఆశ్చర్యపోయాడు. గడ్డం, హెయిర్ స్టయిల్, ముఖ ఆకృతి తనలాగే ఉండటంతో స్టోక్స్ కళ్లప్పగించి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.TWO BEN STOKES IN THE TEST MATCH....!!!! 🤯 pic.twitter.com/qU3kQm9Zyy— Johns. (@CricCrazyJohns) July 21, 2024ఇదిలా ఉంటే, రెండో టెస్ట్లో వెస్టిండీస్పై ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్లో 425 పరుగులు చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 457, రెండో ఇన్నింగ్స్లో 143 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఓలీ పోప్ (121), హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122).. విండీస్ ఆటగాడు కవెమ్ హాడ్జ్ (120) సెంచరీలు చేశారు. సిరీస్లో నామమాత్రపు మూడో టెస్ట్ జులై 26న మొదలవుతుంది. -
ENG VS WI: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ 241 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్ల్లో 400కు పైగా స్కోర్ చేసింది. 147 ఏళ్ల ఇంగ్లీష్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి. ఇదే మ్యాచ్లో విండీస్ సైతం తొలి ఇన్నింగ్స్లో 400కు పైగా స్కోర్ చేసింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి..ఓ టెస్ట్ మ్యాచ్లో ఒకటి, రెండు, మూడు ఇన్నింగ్స్ల్లో 400కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్లో 425 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 457, సెకెండ్ ఇన్నింగ్స్లో 143 పరుగులు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. 385 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఐదేయడంతో (5/41) 143 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 400కు పైగా స్కోర్ చేయడంతో పాటు 41 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన విండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్లో చేతులెత్తేసింది. బషీర్తో పాటు క్రిస్ వోక్స్ (2/28), అట్కిన్సన్ (2/49), మార్క్ వుడ్ (1/17) విండీస్ పతనాన్ని శాశించారు. విండీస్ ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ (47), జేసన్ హోల్డర్ (37), మికైల్ లూయిస్ (17), జాషువ డసిల్వ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.ఈ మ్యాచ్లో గెలుపుతో ఇంగ్లండ్.. మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (121), సెకెండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (51) చేసిన ఓలీ పోప్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. విండీస్ తొలి ఇన్నింగ్స్లో కవెమ్ హాడ్జ్ (120) సెంచరీతో ఆకట్టుకోగా.. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122) సెంచరీలతో సత్తా చాటారు. -
ENG vs WI: భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్
నాటింగ్హామ్: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (78 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు), బెన్ డకెట్ (92 బంతుల్లో 76; 11 ఫోర్లు), ఒలీ పోప్ (67 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా...జో రూట్ (33 నాటౌట్) రాణించాడు. అంతకు ముందు వెస్టిండీస్కు తొలి ఇన్నింగ్స్లో 41 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 351/5తో ఆట కొనసాగించిన విండీస్ 457 పరుగులకు ఆలౌటైంది. జోషువా డి సిల్వా (122 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు), షామర్ జోసెఫ్ (27 బంతుల్లో 33; 5 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడారు. వీరిద్దరు పదో వికెట్కు 78 బంతుల్లో 71 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లండ్ 207 పరుగులు ముందంజలో ఉంది. -
నిప్పులు చెరిగిన మార్క్ వుడ్.. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఓవర్
ఇంగ్లండ్ స్పీడ్ గన్ మార్క్ వుడ్ వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్ తొలి ఓవర్లో వుడ్ బుల్లెట్ లాంటి బంతులతో నిప్పులు వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలోనే ఇది ఫాస్టెస్ట్ ఓవర్గా (సగటున గంటకు 94.40 మైళ్ల వేగం) రికార్డైంది. ఈ ఓవర్లో (93.9, 96.1, 95.2, 92.2, 96.5, 95.2) వుడ్ ప్రతి బంతిని 90 మైళ్లకు పైగా వేగంతో సంధించాడు.Mark Wood is steaminnnnggg fireeeee 🔥 pic.twitter.com/DlQTEQFZ11— CricTracker (@Cricketracker) July 19, 2024వుడ్ తన మరుసటి ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో ఓ బంతిని ఏకంగా 97.1 మైళ్ల వేగంతో సంధించాడు. వుడ్ ఈ ఓవర్లోనూ (95, 93, 95, 96, 97.1, 94) ప్రతి బంతిని 90 మైళ్లకు పైగా వేగంతో విసిరాడు. వుడ్ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఇంచుమించు ఇలాంటి వేగంతో ఓ ఓవర్ వేశాడు. 2023 జులై 19న ఆస్ట్రేలియాతో జరిగిన హెడింగ్లే టెస్ట్లో వుడ్ 92.8, 90.2, 92.5, 92.5, -, 91.6 మైళ్ల వేగంతో బంతులను సంధించాడు.M A R K W 🔥🔥Dpic.twitter.com/fJB1SdSpqI— CricTracker (@Cricketracker) July 19, 2024ప్రస్తుతం తరం బౌలర్లలో ఫాస్టెస్ట్ బౌలర్గా గుర్తింపు ఉన్న వుడ్.. తన కెరీర్లో ఫాస్టెస్ట్ బాల్ను 2022లో పాకిస్తాన్పై విసిరాడు. నాడు ముల్తాన్ టెస్ట్లో వుడ్ గంటకు 98 మైళ్ల వేగంతో బంతిని సంధించాడు. ఇదే అతని కెరీర్లో ఫాస్టెస్ట్ డెలివరీ. ఓవరాల్గా క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు పాక్ మాజీ స్పీడ్స్టర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2003 వరల్డ్కప్లో అక్తర్.. సౌతాఫ్రికాపై ఓ బంతిని 100.23 మైళ్ల వేగంతో సంధించాడు.19th July 2023: Mark Wood bowled one of the fastest overs at Old Trafford against Australia19th July 2024: Mark Wood bowled the fastest over ever by an England bowler at home.He's just unbelievable 🔥 pic.twitter.com/dR8Qv9m0cW— CricTracker (@Cricketracker) July 19, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (121) సెంచరీ.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, కవెమ్ హాడ్జ్ తలో 2, షమార్ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు.రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. 46 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్వైట్ 48, మికైల్ లూయిస్ 21, కిర్క్ మెక్కెంజీ 11 పరుగులు చేసి ఔట్ కాగా..అలిక్ అథనాజ్ 48, కవెమ్ హాడ్జ్ 37 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, అట్కిన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 246 పరుగులు వెనుకపడి ఉంది. -
విండీస్ ప్లేయర్ క్రేజీ సెలెబ్రేషన్స్
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (121) సెంచరీ.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, కవెమ్ హాడ్జ్ తలో 2, షమార్ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. లంచ్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్వైట్ 48, మికైల్ లూయిస్ 21, కిర్క్ మెక్కెంజీ 11 పరుగులు చేసి ఔట్ కాగా..అలిక్ అథనాజ్ 5, కవెమ్ హాడ్జ్ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, అట్కిన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 327 పరుగులు వెనుకపడి ఉంది.The Crazy Celebration of Kevin Sinclair.🤯- ONE OF THE BEST CELEBRATION IN CRICKET. 🔥 pic.twitter.com/o9OZOwhSWu— Tanuj Singh (@ImTanujSingh) July 19, 2024సింక్లెయిర్ క్రేజీ సెలెబ్రేషన్స్ఈ మ్యాచ్ తొలి రోజు విండీస్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్.. హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన ఆనందంలో వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్న వైనం సోషల్మీడియాలో వైరలవుతుంది. సింక్లెయిర్.. బ్రూక్ ఔట్ అవ్వగానే గాల్లోకి పల్టీలు కొడుతూ క్రేజీగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సింక్లెయిర్కు ఇలాంటి సెలబ్రేషన్స్ కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి మ్యాచ్లోనూ ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు. -
ఓలీ పోప్ సూపర్ సెంచరీ.. 416 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
నాటింగ్హమ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ అదరగొట్టింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 88.3 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్ ఓలీ పోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.121 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో 121 పరుగులు చేశాడు. అతడితో పాటు బెన్ డకెట్ (71; 14 ఫోర్లు), స్టోక్స్ (69; 8 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోషఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సింక్లైర్, సీల్స్, హోడ్జ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇంగ్లండ్ 4.2 ఓవర్లలో 50 పరుగులు చేసి టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన జట్టుగా తమ పేరిటే ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 1994లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో 50 పరుగులు సాధించింది. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (జులై 18) మొదలైన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. కేవలం 4.2 ఓవర్లలో 50 పరుగుల మార్కును తాకింది. టెస్ట్ల్లో అత్యంత వేగవంతమైన టీమ్ ఫిఫ్టి ఇదే. గతంలోనూ ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిటే ఉండింది. 1994లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో 50 పరుగుల మార్కును తాకింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-3 టీమ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టిలు ఇంగ్లండ్ పేరిటే నమోదై ఉన్నాయి. 2002లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు 5 ఓవర్లలో ఫిఫ్టి కొట్టింది. టెస్ట్ల్లో ఇది మూడో వేగవంతమైన టీమ్ ఫిఫ్టి.Fifty-up in five overs!PS: First innings in a Test match 🤯pic.twitter.com/lPQnv883iv— CricTracker (@Cricketracker) July 18, 2024ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున ఇది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. 1981-82లో ఇండియాతో జరిగిన మ్యాచ్లో ఇయాన్ బోథమ్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ జానీ బెయిర్స్టో పేరిట రికార్డై ఉంది. 2022లో న్యూజిలాండ్పై బెయిర్స్టో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పేరిట ఉంది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మిస్బా కేవలం 21 బంతుల్లోనే అర్ద సెంచరీ బాదాడు.26 ఓవర్లలో 134/2ఈ మ్యాచ్లో డకెట్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ భారీ స్కోర్కు పునాది వేసుకుంది. డకెట్ ఓవరాల్గా 59 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ (జాక్ క్రాలే డకౌట్).. డకెట్, ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 26 ఓవర్ల తర్వాత (లంచ్ బ్రేక్) ఇంగ్లండ్ స్కోర్ 134/2గా ఉంది. పోప్ (47), రూట్ (13) క్రీజ్లో ఉన్నారు. క్రాలే వికెట్ అల్జరీ జోసఫ్కు.. డకెట్ వికెట్ షమార్ జోసఫ్కు దక్కింది. -
బెన్ డకెట్ మెరుపు హాఫ్ సెంచరీ
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (జులై 18) మొదలైన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున ఇది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ. 1981-82లో ఇండియాతో జరిగిన మ్యాచ్లో ఇయాన్ బోథమ్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ జానీ బెయిర్స్టో పేరిట రికార్డై ఉంది. 2022లో న్యూజిలాండ్పై బెయిర్స్టో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పేరిట ఉంది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మిస్బా కేవలం 21 బంతుల్లోనే అర్ద సెంచరీ బాదాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. డకెట్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో భారీ స్కోర్కు పునాది వేసుకుంది. డకెట్ ఓవరాల్గా 59 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ (జాక్ క్రాలే డకౌట్).. డకెట్, ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 26 ఓవర్ల తర్వాత (లంచ్ బ్రేక్) ఇంగ్లండ్ స్కోర్ 134/2గా ఉంది. పోప్ (47), రూట్ (13) క్రీజ్లో ఉన్నారు. క్రాలే వికెట్ అల్జరీ జోసఫ్కు.. డకెట్ వికెట్ షమార్ జోసఫ్కు దక్కింది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇది రెండో మ్యాచ్. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్కు చివరి మ్యాచ్.ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఏడు, సెకెండ్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన ఆండర్సన్ పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్లో ఒకటి, సెకెండ్ ఇన్నింగ్స్లో మూడు వికెట్లు పడగొట్టాడు.ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్వెస్టిండీస్ ప్లేయింగ్ XI: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్కీపర్), జేసన్ హోల్డర్, గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్ -
ఇటీవలే రిటైర్మెంట్: తిరిగి ఇంగ్లండ్ జట్టుతో చేరిన ఆండర్సన్
ఇంగ్లండ్ మాజీ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. మళ్లీ ఇంగ్లిష్ జట్టుతో మమేకం కానున్నాడు. ఈ దిగ్గజ పేసర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.సొంతగడ్డపై వెస్టిండీస్తో తొలి టెస్టు అనంతరం(శుక్రవారం) ఆండర్సర్ ఆటగాడిగా తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించాడు. లార్డ్స్ వేదికగా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు.. అదే మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు.కొత్త పాత్రలో ఆండర్సన్ఇరవై ఒక్క సుదీర్ఘ టెస్టు కెరీర్లో ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఏకంగా 704 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు ఆండర్సన్.ఇక అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందిన జేమ్స్ ఆండర్సన్ సేవలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావించింది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ మెంటార్గా వ్యవహరించనున్నాడు.అప్పటి వరకేనా?వెస్టిండీస్తో మిగిలిన రెండు టెస్టులు ముగిసే వరకు అతడు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. కాగా నాటింగ్హాం వేదికగా జూలై 18- 22 వరకు రెండో టెస్టు, జూలై 26- 30 వరకు ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లండ్ 1-0తో సిరీస్లో ఆధిక్యంలో ఉంది. కాగా రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది. ఆండర్సర్ స్థానంలో మార్క్వుడ్ జట్టులోకి వచ్చాడు.వెస్టిండీస్లో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్. -
21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు ఘనంగా వీడ్కోలు పలికిన ఆండర్సన్
దిగ్గజ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్ ప్లేయర్ జిమ్మీ ఆండర్సన్ 21 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఆండర్సన్ కెరీర్లో చివరిది. తన చివరి మ్యాచ్ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.JIMMY ANDERSON FINAL MOMENTS ON THE FIELD IN INTERNATIONAL CRICKET. 🫡🌟pic.twitter.com/24uSZqeBOK— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024ఆండర్సన్.. మైదానంలో తన చివరి క్షణాల్లో చాలా ఎమోషనల్ అయ్యాడు. సహచరులు అతన్ని ఘనంగా పెవిలియన్కు సాగనంపారు. లార్డ్స్ స్టేడియం మొత్తం లేచి నిలబడి ఆండర్సన్ను చప్పట్లతో అభినందించింది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆండర్సన్ భార్య, సంతానం కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆండర్సన్ చివరి వికెట్ జాషువ డసిల్వ.THE FINAL WALK OF JIMMY ANDERSON IN INTERNATIONAL CRICKET. 🥹pic.twitter.com/N2GFFDgYYT— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 202441 ఏళ్ల ఆండర్సన్ తన టెస్ట్ కెరీర్లో 188 మ్యాచ్లు ఆడి 26.45 సగటున 704 వికెట్లు పడగొట్టాడు. 2003లో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన ఆండర్సన్ ఆంతకుముందు ఏడాదే వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వన్డేల్లో జిమ్మీ 194 మ్యాచ్లు ఆడి 269 వికెట్లు పడగొట్టాడు. ఆండర్సన్ ఇంగ్లండ్ తరఫున టీ20లు కూడా ఆడాడు. పొట్టి ఫార్మాట్లో కేవలం 19 మ్యాచ్లు ఆడిన జిమ్మీ 18 వికెట్లు పడగొట్టాడు. The final Test wicket of Jimmy Anderson.21 Years. 704 Wickets. Legend. 🫡pic.twitter.com/3iK85SYxBO— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024సుదీర్ఘ కెరీర్ లెక్కలేనన్ని మైలురాళ్లను అధిగమించిన ఆండర్సన్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్గా కీర్తించబడతాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఆండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) మాత్రమే ఆండర్సన్ కంటే ఎక్కువ టెస్ట్ వికెట్లు పడగొట్టారు. మూడు ఫార్మాట్లలో చూసినా మురళీథరన్ (1347), షేన్ వార్నే (1001) మాత్రమే ఆండర్సన్ (987) కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. దిగ్గజ బౌలర్ రిటైర్మెంట్ సందర్భంగా యావత్ క్రికెట్ ప్రపంచం అభినందనలు తెలుపుతుంది.A lovely tribute video by England Cricket for Jimmy Anderson. 🐐❤️pic.twitter.com/AAHXj4zTJx— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 12 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసిన అట్కిన్సన్.. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో విజృంభించాడు. అట్కిన్సన్ ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్లో 136 పరుగులకు కుప్పకూలింది.GUARD OF HONOUR FOR JIMMY ANDERSON. 🐐- The greatest ever of England cricket!pic.twitter.com/5ks2Iz8oEy— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అట్కిన్సన్ (7/45), ఆండర్సన్ (1/26), క్రిస్ వోక్స్ (1/29), స్టోక్స్ (1/14) ధాటికి 121 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్లో మికైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 371 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. జాక్ క్రాలే 76, ఓలీ పోప్ 57, జో రూట్ 68, హ్యారీ బ్రూక్ 50, జేమీ స్మిత్ 70 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, గుడకేశ్ మోటీ, జేసన్ హోల్డర్ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు.LORD'S AND FAMILY OF JIMMY ANDERSON GIVING HIM ONE FINAL STANDING OVATION. 🥹❤️ pic.twitter.com/HD3mG7MYK0— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2024250 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ను అట్కిన్సన్ మరోసారి దెబ్బకొట్టాడు. ఈ సారి అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/61) విజృంభించడంతో విండీస్ 136 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్తో పాటు ఆండర్సన్ (3/32), స్టోక్స్ (2/25) రాణించారు. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో మోటీ (31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
12 వికెట్లతో చెలరేగిన అట్కిన్సన్.. విండీస్కు ఘోర పరాభవం
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 12 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసిన అట్కిన్సన్.. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో విజృంభించాడు. అట్కిన్సన్ ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్లో 136 పరుగులకు కుప్పకూలింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అట్కిన్సన్ (7/45), ఆండర్సన్ (1/26), క్రిస్ వోక్స్ (1/29), స్టోక్స్ (1/14) ధాటికి 121 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్లో మికైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 371 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. జాక్ క్రాలే 76, ఓలీ పోప్ 57, జో రూట్ 68, హ్యారీ బ్రూక్ 50, జేమీ స్మిత్ 70 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, గుడకేశ్ మోటీ, జేసన్ హోల్డర్ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు.250 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ను అట్కిన్సన్ మరోసారి దెబ్బకొట్టాడు. ఈ సారి అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/61) విజృంభించాడు. అట్కిన్సన్తో పాటు ఆండర్సన్ (3/32), స్టోక్స్ (2/25) రాణించడంతో విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 136 పరుగులకు కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్లో మోటీ (31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆండర్సన్ తన సుదీర్ఘ కెరీర్ను గెలుపుతో ముగించాడు. -
చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డు
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ ఇంగ్లిష్ ఆటగాడికీ సాధ్యం కాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్ ప్రస్తుతం వెస్టిండీస్తో సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది.తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులకేఆతిథ్య జట్టు ఆది నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ ఇన్నింగ్స్ విజయంపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులకే వెస్టిండీస్ను ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. 371 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్ జట్టుకు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్, అరంగేట్ర బౌలర్ గుస్ అట్కిన్సన్, కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేసి వికెట్లు కూల్చారు.ఇన్నింగ్స్ ఓటమి దిశగా విండీస్ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికే వెస్టిండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా.. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే వెస్టిండీస్ మరో 171 పరుగులు చేయాలి. అయితే, ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.ఇదిలా ఉంటే.. విండీస్ రెండో ఇన్నింగ్స్లో స్టోక్స్ ఓపెనర్ మిక్లే లూయీస్(14), వన్డౌన్ బ్యాటర్ కిర్క్ మెకాంజీ(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్లోనూ మిక్లే లూయీస్(27) స్టోక్సే అవుట్ చేయడం విశేషం.చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. అరుదైన రికార్డుఈ క్రమంలో స్టోక్స్ టెస్టుల్లో అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇంగ్లండ్ తరఫున ఆరు వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు రెండు వందలకు పైగా వికెట్లు తీసిన తొలి ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు.ఓవరాల్గా.. వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్, సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా నిలిచాడు.కాగా 103 టెస్టుల్లో స్టోక్స్ ఇప్పటి వరకు 6320 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 258. ఇక టెస్టుల్లో తీసిన వికెట్లు 201.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో తొలి టెస్టులో పేస్ ఆల్రౌండర్ స్టోక్స్ బంతితో రాణించినా.. బ్యాట్తో మ్యాజిక్ చేయలేకపోయాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం నాలుగు పరుగులే చేసి గుడకేశ్ మోటీ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. చదవండి: KKR: ద్రవిడ్ కాదు.. కోల్కతా కొత్త మెంటార్గా దిగ్గజ బ్యాటర్?Kallis. Sobers. Stokes. Legends only, please. #EnglandCricket | #ENGvWI pic.twitter.com/zQADWlbOnJ— England Cricket (@englandcricket) July 11, 2024 -
శెభాష్ ఆండర్సన్.. వీడ్కోలు మ్యాచ్లో వరల్డ్ రికార్డు
తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నిప్పులు చేరుగుతున్నాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆండర్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తొలి ఇన్నింగ్స్లో ఓ కీలక వికెట్ పడగొట్టిన ఆండర్సన్.. రెండో ఇన్నింగ్స్లో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బతీశాడు. అయితే తన విడ్కోలు టెస్టులో ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో 40,000 బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌలర్గా ఆండర్సన్ రికార్డులెక్కాడు. ఈ మ్యాచ్లో తన 10వ ఓవర్ వేసిన అనంతరం ఆండర్సన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 188 టెస్టులు ఆడిన ఆండర్సన్.. 6666. 5(40000 బంతులు) ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆండర్సన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్లు ఆండర్సన్ కంటే ముందు అనిల్ కుంబ్లే(44039), షేన్ వార్న్(40850), ముత్తయ్య మురళీధరన్(40705) ఉన్నారు.అదేవిధంగా ఆండర్సన్ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో విండీస్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా ఆండర్సన్ నిలిచాడు. ఆండర్సన్ ఇప్పటివరకు వెస్టిండీస్పై 90 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(89) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కపిల్ దేవ్ రికార్డును ఆండర్సన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో గ్లెన్ మెక్గ్రాత్(110) తొలి స్ధానంలో ఉన్నాడు. Jimmy Anderson, there are no words 🤯 pic.twitter.com/bBRCS1uykD— England Cricket (@englandcricket) July 11, 2024 -
ఆల్టైమ్ టాప్-10 జాబితాలోకి రూట్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల టాప్-10 జాబితాలోకి చేరాడు. లార్డ్స్ వేదికగా విండీస్తో జరుగుతున్న మ్యాచ్లో అర్ద సెంచరీతో రాణించిన రూట్.. ఈ జాబితాలో పదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (15921 పరుగులు) టాప్లో ఉండగా.. రికీ పాంటింగ్ (13378), కల్లిస్ (13289), ద్రవిడ్ (13288), అలిస్టర్ కుక్ (12472), సంగక్కర (12400), బ్రియాన్ లారా (11953), చంద్రపాల్ (11867), జయవర్దనే (11814), రూట్ (11804) రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నారు.Joe Root has moved up to 10th on the all-time list of Test run-scorers 👏👑 An incredible achievement by one of England's greatest-ever players! pic.twitter.com/fSUOhqJt1N— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 11, 2024మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 371 పరుగులకు ఆలౌటై, 250 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఐదుగురు (క్రాలే (76), పోప్ (57), రూట్ (68), బ్రూక్ (50), జేమీ స్మిత్ (70)) అర్ద సెంచరీలు సాధించారు.విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, జేసన్ హోల్డర్, గుడకేశ్ మోటీ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ అరంగేట్రం బౌలర్ గస్ అట్కిన్సన్ (7/45) విండీస్ పతనాన్ని శాశించాడు. ఆండర్సన్, వోక్స్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో మిఖైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
Viral Video: మోటీ మాయాజాలం.. స్టోక్స్కు ఫ్యూజులు ఔట్
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 371 పరుగులకు ఆలౌటై, 250 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఐదుగురు (క్రాలే (76), పోప్ (57), రూట్ (68), బ్రూక్ (50), జేమీ స్మిత్ (70)) అర్ద సెంచరీలు సాధించారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, జేసన్ హోల్డర్, గుడకేశ్ మోటీ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ అరంగేట్రం బౌలర్ గస్ అట్కిన్సన్ (7/45) విండీస్ పతనాన్ని శాశించాడు. ఆండర్సన్, వోక్స్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో మిఖైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్గా నిలిచాడు.AN ABSOLUTE CHERRY FROM MOTIE. - The reaction of Ben Stokes says all. 😲pic.twitter.com/NTnSvRQXhJ— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024మోటీ మాయాజాలంఈ మ్యాచ్లో విండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ రెండు వికెట్లే తీసినా రెండూ హైలైట్గా నిలిచాయి. మోటీ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు స్టోక్స్, రూట్లను బోల్తా కొట్టించాడు. ఈ ఇద్దరిని మోటీ అద్భుతమైన బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా స్టోక్స్ బౌల్డ్ అయిన బంతి నమ్మశక్యంకాని రితీలో టర్నై మిడిల్ స్టంప్ను గాల్లోకి లేపింది. ఈ బంతికి స్టోక్స్ వద్ద సమాధానం లేక నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. -
Eng Vs WI: తొలిటెస్దులోనే బౌలర్ సంచలనం.. ఇంగ్లండ్కు ఆధిక్యం
England vs West Indies, 1st Test Day 1: వెస్టిండీస్తో తొలి టెస్టులో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. సొంతగడ్డపై సత్తా చాటుతూ బ్రాత్వైట్ బృందంపై పైచేయి సాధించింది.మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య బుధవారం (జూలై 10) మొదటి మ్యాచ్ లండన్ వేదికగా ఆరంభమైంది.లార్డ్స్ మైదానంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆతిథ్య జట్టు పేసర్ గుస్ అట్కిన్సన్ 7 వికెట్లతో అదరగొట్టాడు.ఈ క్రమంలో అట్కిన్సన్ (7/45) ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 41.4 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది.మికైల్ లూయిస్ (27; 4 ఫోర్లు, 1 సిక్స్), కావెమ్ హాడ్జ్ (24; 3 ఫోర్లు, 1 సిక్స్), అథనాజ్ (23; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ అండర్సన్కు ఒక వికెట్ దక్కింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు సాధించింది. 68 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ఇంగ్లండ్ ఆటగాళ్లలో జాక్ క్రాలీ (76; 14 ఫోర్లు), ఒలీ పోప్ (57; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. జో రూట్ (15 బ్యాటింగ్), హ్యారీ బ్రూక్ (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ బౌలర్.. చరిత్రపుటల్లో చోటు
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (జులై 10) మొదలైన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా అరంగేట్రంలో ఇంగ్లండ్ తరఫున మూడో అత్యుత్తమ గణాంకాలను.. ఓవరాల్గా తొమ్మిదో అత్యుత్తమ గణాంకాలను (అరంగేట్రం) నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అట్కిన్సన్ ఓ ఓవర్లో నాలుగు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. అట్కిన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 121 పరుగులకే కుప్పకూలింది. అట్కిన్సన్.. క్రెయిగ్ బ్రాత్వైట్ (6), కిర్క్ మెకెంజీ (1), అలిక్ అథనాజ్ (23), జేసన్ హోల్డర్ (0), జాషువ డసిల్వ (0), అల్జరీ జోసఫ్ (17), షమార్ జోసఫ్ (0) వికెట్లు పడగొట్టాడు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న జిమ్మీ ఆండర్సన్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో మిఖైల్ లూయిస్ అత్యధికంగా 27 పరుగులు చేయగా.. అలిక్ అథనాజ్ (23), కవెమ్ హాడ్జ్ (24) 20 పరుగుల మార్కును దాటారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆదిలోనే బెన్ డకెట్ (3) వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత కుదురుగా ఆడుతుంది. 14 ఓవర్ల అనంతరం ఆ జట్టు వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. జాక్ క్రాలే (30), ఓలీ పోప్ (29) క్రీజ్లో ఉన్నారు. డకెట్ వికెట్ జేడన్ సీల్స్కు దక్కింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి విండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఇది తొలి టెస్ట్ మ్యాచ్. రెండో మ్యాచ్ జులై 18న, మూడో మ్యాచ్ జులై 26న మొదలుకానున్నాయి.ఇంగ్లండ్ తరఫున అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలు..జాన్ ఫెర్రిస్-సౌతాఫ్రికాపై 7/37డొమినిక్ కార్క్-వెస్టిండీస్పై 7/43గస్ అట్కిన్సన్-వెస్టిండీస్పై 7/45ఓవరాల్గా టెస్ట్ అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలుఆల్బర్ట్ ట్రాట్-ఇంగ్లండ్పై 8/43రాబర్ట్ మెస్సీ- ఇంగ్లండ్పై 8/53నరేంద్ర హిర్వాని- వెస్టిండీస్పై 8/61లాన్స్ క్లూసెనర్- ఇండియాపై 8/64నరేంద్ర హిర్వాని- వెస్టిండీస్పై 8/75రాబర్ట్ మెస్సీ- ఇంగ్లండ్పై 8/84ఆల్ఫ్రెడ్ వాలెంటైన్- ఇంగ్లండ్పై 8/104జేసన్ క్రేజా- ఇండియాపై 8/215కైల్ అబాట్- పాకిస్తాన్పై 7/29డొమినిక్ కార్క్- వెస్టిండీస్పై 7/43గస్ అట్కిన్సన్-వెస్టిండీస్పై 7/45 -
విండీస్తో తొలి టెస్ట్కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. చివరి మ్యాచ్ ఆడబోతున్న ఆండర్సన్
ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ దిగ్గజ పేసర్ జిమ్మీ ఆండర్సన్ కెరీర్లో చివరి మ్యాచ్. ఈ టెస్ట్ అనంతరం ఆండర్సన్ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్గా పని చేస్తాడు. ఈ సిరీస్లో మిగతా రెండు టెస్ట్లు ట్రెంట్బ్రిడ్జ్ (జులై 18-22), ఎడ్జ్బాస్టన్ (జులై 26-30) వేదికగా జరుగనున్నాయి.విండీస్తో తొలి టెస్ట్కు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.వెస్టిండీస్ తుది జట్టు (అంచనా): క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్కీపర్), జాసన్ హోల్డర్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, గుడకేష్ మోటీ. -
7 వికెట్లతో చెలరేగిన అండర్సన్.. ఇక విండీస్కు చుక్కలే!
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరగనున్న తొలి టెస్టు అనంతరం ఆండర్సన్ తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు విడ్కోలు పలకనున్నాడు. అయితే తన ఆఖరి టెస్టుకు ముందు ఆండర్సన్ నిప్పలు చేరిగాడు. కౌంటీ చాంపియన్షిప్లో లాంక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అండర్సన్.. నాటింగ్హమ్షైర్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆండర్సన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 6 వికెట్ల పైగా అండర్సన్ పడగొట్టడం ఇది 16వ సారి కావడం గమనార్హం. అండర్సన్ నిప్పులు చేరగడంతో నాటింగ్హమ్షైర్ 126 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాంక్షైర్ 353 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక ఆండర్సన్కు వరల్డ్క్రికెట్లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్గా 400 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు. -
ఫిల్ సాల్ట్ ఊచకోత.. ఒకే ఓవర్లో 30 పరుగులు! వీడియో వైరల్
టీ20 వరల్డ్కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. 181 పరుగుల లక్ష్య చేధనలో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కరేబియన్ బౌలర్లకు సాల్ట్ చుక్కలు చూపించాడు.ముఖ్యంగా విండీస్ ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ను ఊచకోత కోశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన షెపర్డ్ బౌలింగ్లో సాల్ట్ 4,6,4,6,6,4 బాది ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 7 ఫోర్లు, 5 సిక్స్లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా విండీస్పై టీ20ల్లో సాల్ట్కు ఘనమైన రికార్డు ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో సాల్ట్ ఇప్పటివరకు 26 ఇన్నింగ్స్ల్లో 844 పరుగులు చేయగా అందులో 50 శాతానికి పైగా విండీస్పై బాదినవే కావడం విశేషం.విండీస్పై ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్లు ఆడిన సాల్ట్ 487 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో విండీస్పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.చదవండి: T20 WC: అఫ్గాన్తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు! సిరాజ్కు నో ఛాన్స్ View this post on Instagram A post shared by ICC (@icc) -
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. వెస్టిండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8 దశలో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. సెయింట్ లూసియా వేదికగా ఆతిథ్య వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు ఊదిపడేసింది.ఇంగ్లండ్ 17.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 7 ఫోర్లు, 5 సిక్స్లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు జానీ బెయిర్ స్టో(48 నాటౌట్), కెప్టెన్ జోస్ బట్లర్(25) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక విండీస్ బౌలర్లలో రస్సెల్, ఛేజ్ తలా వికెట్ సాధించారు.కాగా అంతకముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో చార్లెస్(38) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. పూరన్(36), పావెల్(36), రుథర్ఫార్డ్(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అర్చర్, కుర్రాన్, మొయిన్ అలీ తలా వికెట్ సాధించారు.చదవండి: T20 WC: రోహిత్ను గుర్తు చేసిన కింగ్.. స్టేడియం బయటకు బంతి! వీడియో -
చెలరేగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.విండీస్ ఓపెనర్లు చార్లెస్, కింగ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ వికెట్కు వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 23 పరుగులు చేసిన కింగ్ గాయం కారణంగా రిటైర్డ్హట్గా వెనుదిరిగాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్.. చార్లెస్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చార్లెస్ ఔటయ్యాక కెప్టెన్ రావ్మెన్ పావెల్ సైతం తన బ్యాట్కు పని చెప్పాడు.విండీస్ బ్యాటర్లలో చార్లెస్(38) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. పూరన్(36), పావెల్(36), రుథర్ఫార్డ్(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అర్చర్, కుర్రాన్, మొయిన్ అలీ తలా వికెట్ సాధించారు.చదవండి: T20 WC: రోహిత్ను గుర్తు చేసిన కింగ్.. స్టేడియం బయటకు బంతి! వీడియో -
ఇంగ్లండ్ వెన్ను విరిచిన మోటీ.. సిరీస్ విండీస్దే..!
ట్రినిడాడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. గుడకేశ్ మోటీ (4-0-24-3), ఆండ్రీ రసెల్ (4-0-25-2), అకీల్ హొసేన్ (4-0-20-2),హోల్డర్ (3.3-0-24-2) ధాటికి 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఫిలిప్ సాల్ట్ (38) టాప్ స్కోరర్గా నిలువగా.. లివింగ్స్టోన్ (28), మొయిన్ అలీ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. జాన్సన్ ఛార్లెస్ (27), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (30) సాయంతో షాయ్ హోప్ (43 నాటౌట్) విండీస్ను గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, సామ్ కర్రన్ తలో వికెట్ దక్కించుకున్నారు. 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ వెనువిరిచిన మోటీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన (వరుసగా రెండు సెంచరీలు) ఫిలిప్ సాల్ట్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. కాగా, 3 వన్డేలు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం కరీబియన్ దీవుల్లో పర్యటించిన ఇంగ్లండ్.. వరుసగా రెండు సిరీస్లను కోల్పోయింది. వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్.. టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించినప్పటికీ సిరీస్ను చేజార్చుకుంది. -
వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్లతో విధ్వంసం
ఐపీఎల్-2024 వేలంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆన్సోల్డ్గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. రెండు రౌండ్లలో కూడా సాల్ట్ను సొంతం చేసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో అమ్ముడుపోకపోయిన కోపాన్ని సాల్ట్ వెస్టిండీస్పై చూపించాడు. మంగళవారం వెస్టిండీస్తో జరిగిన నాలుగో వన్డేలో సాల్ట్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో కరేబియన్ బౌలర్లను సాల్ట్ ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లతో 119 పరుగులు చేశాడు. సాల్ట్కు ఈ సిరీస్లో ఇది వరుసగా రెండో సెంచరీ. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా సాల్ట్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు అలెక్స్ హేల్స్(116) పేరిట ఉండేది. ఈ మ్యాచ్తో హేల్స్ రికార్డును సాల్ట్ బ్రేక్ చేశాడు. ఇక సాల్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్ను చూసిన నెటిజన్లు.. ఫ్రాంచైజీలు అతడిని తీసుకోక తప్పు చేశాయని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా 2022, 23 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్కు సాల్ట్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2024 సీజన్కు ముందు అతడిని ఢిల్లీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన సాల్ట్ ఆన్సోల్డ్గా మిగిలిపోయాడు. Stunning victory to level the series! 🦁 Scorecard: https://t.co/C5Ns5auLYY#EnglandCricket | 🏝️ #WIvENG 🏴 pic.twitter.com/OXkPqGoA9r — England Cricket (@englandcricket) December 19, 2023 చదవండి: IPL 2024: టెన్త్ క్లాస్తో చదువు బంద్.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్ మింజ్? -
ఇదేమి విధ్వంసం.. ఏకంగా 267 పరుగులు! పాపం విండీస్
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన నాలుగో టీ20లో 75 పరుగులతో ఇంగ్లండ్ ఘన విజయం అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 2-2 సమం చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్లు విధ్వసంం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి ఏకంగా 267 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లతో 119 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో సాల్ట్కు వరుసగా ఇది రెండో సెంచరీ. అతడితో పాటు కెప్టెన్ జోస్ బట్లర్(29 బంతుల్లో 55, 6 ఫోర్లు, 3 సిక్స్లు), లివింగ్ స్టోన్(21 బంతుల్లో 54) మెరుపు సెంచరీలతో చెలరేగారు. విండీస్ బౌలర్లలో అకిల్ హోస్సేన్, రస్సెల్, హోల్డర్కు చెరో వికెట్ దక్కింది. అనంతరం 268 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 15.10 ఓవర్లలో ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో ఆండ్రీ రస్సెల్(51) టాప్ స్కోరర్గా నిలవగా.. పూరన్(39),రూథర్ ఫర్డ్(36) తమ వంతు ప్రయత్నం చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ 3 వికెట్లతో చెలరేగగా.. కుర్రాన్, రెహన్ అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు. వీరితో పాటు మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఐసీసీ ఫుల్మెంబర్ జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. -
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడికి బిగ్ షాక్..
విధ్వసంకర ఆటగాడు షిమ్రాన్ హెట్మైర్కు వెస్టిండీస్ సెలక్టర్లు బిగ్ షాకిచ్చారు. ఇంగ్లండ్ సిరీస్లో మిగిలిన రెండు టీ20లకు ప్రధాన జట్టు నుంచి హెట్మైర్ను సెలక్టర్లు తప్పించారు. ఇంగ్లండ్తో తొలి రెండు మ్యాచ్లు ఆడిన హెట్మైర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలోనే ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న హెట్మైర్పై సెలక్షన్ కమిటీ వేటు వేసింది. ఇక అతడి స్ధానాన్ని మరో డేంజరస్ ఆటగాడు జాన్సెన్ చార్లెస్తో విండీస్ క్రికెట్ భర్తీ చేసింది. అదేవిధంగా స్టార్ పేసర్ అల్జారీ జోషఫ్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన రెండు మ్యాచ్లకు జోషఫ్ స్ధానంలో ఓషానే థామస్ జట్టులోకి వచ్చాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐదు మ్యాచ్ల సిరీస్లో విండీస్ 2-1 అధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 ట్రినిడాడ్ వేదికగా డిసెంబర్ 20న జరగనుంది. మిగిలిన రెండు టీ20లకు విండీస్ జట్టు: రోవ్మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్ -
ఎస్ఆర్హెచ్ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే
వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విధ్వంసర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 7 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 31 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ విజయానికి ఆండ్రీ రస్సెల్ వేసిన ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమయ్యాయి. అయితే పెద్దగా ఫామ్లో లేని బ్రూక్ స్ట్రైక్లో ఉండడంతో విండీస్ విజయం లాంఛనమే అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను బ్రూక్ తలకిందులు చేశాడు. ఆఖరి ఓవర్లో మూడు సిక్స్లు, ఓ ఫోర్ బాది ఇంగ్లండ్కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్రూక్తో పాటు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆజేయశతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్లతో 109 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్ఆర్హెచ్ తప్పు చేసింది..!? ఐపీఎల్-2023 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున హ్యారీ బ్రూక్ ఆడాడు. గత సీజన్ వేలంలో రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ బ్రూక్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఐపీఎల్-2024 సీజన్కు ముందు హ్యారీని ఎస్ఆర్హెచ్ విడిచిపెట్టింది. ఈ క్రమంలో విండీస్పై బ్రూక్ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు ఎస్ఆర్హెచ్ అతడిని వదిలి తప్పు చేసింది అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అతడికి మరోక ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. 𝗧𝗵𝗲 𝗛𝗜𝗚𝗛𝗘𝗦𝗧 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀𝗳𝘂𝗹 𝗿𝘂𝗻 𝗰𝗵𝗮𝘀𝗲 𝗮𝗴𝗮𝗶𝗻𝘀𝘁 𝘁𝗵𝗲 𝗪𝗲𝘀𝘁 𝗜𝗻𝗱𝗶𝗲𝘀! 🏏 Just watch this final over... Harry Brook take a bow! 👏#WIvENG pic.twitter.com/raErDRlvTZ — Cricket on TNT Sports (@cricketontnt) December 16, 2023 -
చివరి ఓవర్లో 21 పరుగులు.. ఇంగ్లండ్ సంచలనం! పాపం రస్సెల్
గ్రెనిడా వేదికగా వెస్టిండీస్తో ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. విండీస్ కెప్టెన్ పావెల్ బంతిని సీనియర్ ఆండ్రీ రస్సెల్ను బంతిని అందించాడు. అయితే స్ట్రైక్లో ఉన్న హ్యారీ బ్రూక్ తొలి బంతినే బౌండరీగా మలిచాడు. అనంతరం రెండు, మూడు బంతులను సిక్స్లు బాది మ్యాచ్ను ఇంగ్లండ్ వైపు మలుపు తిప్పాడు. ఈ క్రమంలో చివరి మూడు బంతుల్లో 5 పరుగులు అవసరమవ్వగా.. బ్రూక్ ఐదో బంతికి సిక్స్ బాది ఇంగ్లండ్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బ్రూక్తో పాటు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆజేయశతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్లతో 109 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో పూరన్(82) పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్, అదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 డిసెంబర్ 19న జరగనుంది. చదవండి: రింకూ సిక్సర్ సింగ్ -
ఇంగ్లండ్కు ఏమైంది..? విండీస్ చేతిలో మరో ఘోర పరభావం
వెస్టిండీస్ గడ్డపై ఇంగ్లండ్కు మరో పరాభావం ఎదురైంది. గ్రెనడా వేదికగా విండీస్తో జరిగిన రెండో టీ20లో 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో బట్లర్ సేన వెనకంజలో ఉంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లీష్ జట్టు బ్యాటర్లలో సామ్ కుర్రాన్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక కరేబియన్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 3వికెట్లతో అదరగొట్టగా.. అకేల్ హోసేన్ రెండు, హొల్డర్, మోటీ తలా వికెట్ పడగొట్టారు. బ్రాండెన్ కింగ్ విధ్వంసం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండెన్ కింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ పావెల్(28 బంతుల్లో 52) అద్భుత ఇన్నింగ్స్తో అలరించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్, మిల్స్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వోక్స్, కుర్రాన్, అహ్మద్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 డిసెంబర్ 16న గ్రెనిడా వేదికగానే జరగనుంది. అయితే టీ20ల్లో అద్బుత రికార్డు ఉన్న ఇంగ్లండ్ ఈ తరహా ప్రదర్శన కనబరుస్తుండడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం మూడో టీ20లో అయినా గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా ఇప్పటికే విండీస్తో వన్డే సిరీస్ను ఇంగ్లండ్ కోల్పోయిన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
క్రికెట్లో కొత్త రూల్.. రేపటి నుంచే అమల్లోకి..!
పరిమిత ఓవర్ల క్రికెట్కు ఉన్న ఆదరణను కాపాడుకుంటూనే ఈ ఫార్మాట్లలో వేగం పెంచే దిశగా అడుగులు వేస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. డిసెంబర్ 12 నుంచి పొట్టి ఫార్మాట్లో కొత్త రూల్ను అమల్లోకి తేనుంది. విండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ నుంచి ఐసీసీ "స్టాప్ క్లాక్" అనే నిబంధనను ఆచరణలోకి పెట్టనుంది. ఈ నిబంధన వచ్చే ఏడాది (2024) ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ ఇటీవల వెల్లడించింది. స్టాప్ క్లాక్ రూల్ పురుషుల వన్డే, టీ20 ఫార్మాట్లలో అమల్లో ఉంటుంది. స్టాప్ క్లాక్ నిబంధన ఏంటంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓవర్కు ఓవర్కు మధ్య అధిక సమయం వృధా అవుతుందని భావిస్తున్న ఐసీసీ.. ఈ ఫార్మాట్లలో మరింత వేగం పెంచేందుకు ఓవర్కు ఓవర్కు మధ్య 60 సెకెన్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ టైమ్గా ఫిక్స్ చేసింది. బౌలింగ్ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్ వేసేందుకు బౌలర్ను దించాల్సి ఉంటుంది. రెండుసార్లు ఈ నిర్దిష్ట వ్యవధి దాటితే మూడోసారికి బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. ఈ పరుగులు బ్యాటింగ్ టీమ్ స్కోర్కు యాడ్ అవుతాయి. ఫీల్డ్ అంపైర్లు స్టాప్ క్లాక్తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. నవంబర్ 21న అహ్మదాబాద్లో జరిగిన బోర్డు సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది. -
WI VS ENG 2nd ODI: అరుదైన క్లబ్లో చేరిన జోస్ బట్లర్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన క్లబ్లో చేరాడు. వెస్టిండీస్తో నిన్న (డిసెంబర్ 6) జరిగిన రెండో వన్డేలో మెరుపు అర్ధసెంచరీ (45 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 3సిక్సర్లు) సాధించిన బట్లర్.. వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున 5000 పరుగుల మార్కును దాటిన ఐదో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. బట్లర్కు ముందు ఇయాన్ మోర్గన్ (6957), జో రూట్ (6522), ఇయాన్ బెల్ (5416), పాల్ కాలింగ్పుడ్ (5092), జోస్ బట్లర్ (5022) ఇంగ్లండ్ తరఫున ఐదు వేల పరుగుల మార్కును దాటారు. బట్లర్ మెరుపు అర్ధసెంచరీతో రాణించడంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ వెస్టిండీస్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తొలి వన్డేలో విండీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రన్, లివింగ్స్టోన్ చెరో 3 వికెట్లు.. అట్కిన్సన్, రెహాన్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ షాయ్ హోప్ (68), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి వన్డేలో మెరుపు శతకంతో విండీస్ను గెలిపించిన హోప్ ఈ మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. విల్ జాక్స్ (73), కెప్టెన్ జోస్ బట్లర్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్, బట్లర్లతో పాటు హ్యారీ బ్రూక్ (43 నాటౌట్) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీకి రెండు, రొమారియో షెపర్డ్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్లకు తలో వికెట్ దక్కింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 9న జరుగనుంది. -
వెస్టిండీస్ టూర్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్గా జోస్ బట్లర్
వన్డే వరల్డ్కప్-2023లో దారుణ ప్రదర్శన ప్రదర్శనతో ఇంటుముఖం పట్టిన ఇంగ్లండ్.. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ కరేబియన్ టూర్లో భాగంగా ఆతిథ్య విండీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ సిరీస్ల కోసం రెండు వేర్వేరు జట్లను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డే సిరీస్కు స్టార్ ఆటగాళ్లు బెన్స్టోక్స్, రూట్, మొయిన్ అలీలకు ఇంగ్లండ్ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ పేసర్లు జోస్ టాంగ్వే, జాన్ టర్నర్కు తొలిసారి ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టులో చోటు దక్కింది. అదే ఈ రెండు సిరీస్లలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్గా జోస్ బట్లర్ వ్యవహరించనున్నాడు. వన్డే ప్రపంచకప్-2023లో విఫలమకావడంతో బట్లర్ను ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇంగ్లండ్ సెలక్షన్ కమిటీ మాత్రం యథావిధిగా జోస్నే తమ సారథిగా కొనసాగించింది. డిసెంబర్ 3న ఆంటిగ్వా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఇంగ్లండ్ జట్టు కరేబియన్ టూర్ ప్రారంభం కానుంది. విండీస్తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జాక్ క్రాలే, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, ఆలీ పోప్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, జాన్ టర్నర్. విండీస్తో టీ20లకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్, క్రిస్ వోక్స్ చదవండి: World Cup 2023: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్.. వర్షం పడితే పరిస్థితి ఏంటి? -
నువ్వొక చెత్త కెప్టెన్వి.. వేస్ట్.. ఇంకా ఎందుకు? దయచేసి దిగిపో!
West Indies Vs England Test Series- Fans Trolls Joe Root Captaincy: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాల్సిన సమయం వచ్చిందంటూ ఇంగ్లండ్ మాజీ సారథులు, అభిమానులు అతడిని ఏకిపారేస్తున్నారు. ఇదేం కెప్టెన్సీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఘోర పరాభవం(4-0), ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఓటమి నేపథ్యంలో రూట్పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ వెస్టిండీస్ టూర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి రెండు టెస్టులు డ్రా కాగా... నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో స్ఫూర్తిదాయక ఆటతో ఆతిథ్య విండీస్ విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను మట్టి కరిపించి సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో మరోసారి ఇంగ్లండ్కు చేదు అనుభవం మిగిలింది. ఇక యాషెస్ సహా గత ఐదు సిరీస్లలో ఇంగ్లండ్కు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఆడిన 17 మ్యాచ్లతో కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జో రూట్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైఖేల్ వాన్ తదితరులు రూట్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ జట్టు అభిమానులు సైతం రూట్పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నువ్వొక చెత్త కెప్టెన్వి. వేస్ట్.. చాలు ఇంక.. దయచేసి కెప్టెన్ పదవి నుంచి దిగిపో! మరీ ఇంత దారుణ ప్రదర్శనా!? అస్సలు ఊహించలేదు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్! మొదటి తప్పిదం కాబట్టి.. World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! #MaroonMagic.✨ That's the caption. #WIvENG pic.twitter.com/oE8qDumyQ6 — Windies Cricket (@windiescricket) March 27, 2022 -
WI Vs Eng: 2019 తర్వాత సొంతగడ్డపై తొలిసారిగా విండీస్..
WI Vs Eng Test Series: మీడియం పేసర్ కైల్ మేయర్స్ (5/18) చెలరేగడంతో... ఇంగ్లండ్తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్ల సిరీస్ను 1–0తో ఆతిథ్య జట్టు సొంతం చేసుకుంది. మేయర్స్ ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 64.2 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. ఇక ఇంగ్లండ్ నిర్దేశించిన 28 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ క్రమంలో 2019 తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ను దక్కించుకుంది. ఇక వంద పరుగులతో అజేయంగా నిలిచిన జాషువా డ సిల్వా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. #MaroonMagic.✨ That's the caption. #WIvENG pic.twitter.com/oE8qDumyQ6 — Windies Cricket (@windiescricket) March 27, 2022 ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా అత్యంత చిరాకు తెప్పించిన టెస్టు మ్యాచ్. తొలి ఇన్నింగ్స్లో మేము అద్భుతంగా ఆడాం. అప్పటికి మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. నిజంగా ఇది చాలా చాలా విసుగు తెప్పించిన మ్యాచ్. ముఖ్యమైన సమయంలో సరిగ్గా రాణించలేకపోయాం. అయితే, కచ్చితంగా ఈ మ్యాచ్లో క్రెడిట్ వెస్టిండీస్కు ఇవ్వాల్సిందే. వాళ్లు బాగా ఆడారు. ఏదేమైనా మాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు. వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ స్కోర్లు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 204 రెండో ఇన్నింగ్స్- 120 వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్- 297 రెండో ఇన్నింగ్స్- 28/0 చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! -
WI VS Eng: బ్రాత్వైట్ అద్భుత ఇన్నింగ్స్.. రెండో టెస్టు కూడా..
వెస్టిండీస్- ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. విండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ మారథాన్ ఇన్నింగ్స్తో ఆతిథ్య జట్టు ఓటమి నుంచి గట్టెక్కింది. కాగా బ్రిడ్జ్టౌన్ వేదికగా మార్చి 16న ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ జో రూట్, బెన్ స్టోక్స్ అద్భుత సెంచరీల నేపథ్యంలో 9 వికెట్ల నష్టానికి 507 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందుకు బదులుగా 6 వికెట్ల నష్టానికి 185 పరుగుల వద్ద పర్యాటక ఇంగ్లండ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్రాత్వైట్ మారథాన్ ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచి జట్టును ఓటమి నుంచి తప్పించాడు. 184 బంతులు ఎదుర్కొన్న అతడు 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 216 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సైతం డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు స్కోర్లు: ఇంగ్లండ్- 507/9 డిక్లేర్డ్ & 185/6 డిక్లేర్డ్ వెస్టిండీస్- 411 & 135/5 చదవండి: ఏడు వందల నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్.. Resilience and discipline! The WI Skipper takes the #MastercardPricelessMoment of the match! #WIvENG pic.twitter.com/YlNj8B43Il — Windies Cricket (@windiescricket) March 21, 2022 -
ఏడు వందల నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్.. సాహో విండీస్ కెప్టెన్
నాయకుడనే వాడు జట్టును నడిపించడమే కాదు.. అవసరమైనప్పుడు తన విలువేంటో చూపించాలి. అందరిలా ఉంటే అతన్ని ఎందుకు కెప్టెన్ చేస్తారు. మరి అలాంటి కెప్టెన్ అనే పదానికి సరైన అర్థం చెప్పాడు వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్. సంప్రదాయ క్రికెట్పై మోజు తగ్గుతున్న వేళ తన మారథాన్ ఇన్నింగ్స్తో అందరిని ఆకట్టుకున్నాడు. 700 నిమిషాల(దాదాపు 12 గంటలు) పాటు క్రీజులో గడిపి 489 బంతులెదుర్కొని 17 ఫోర్ల సహాయంతో 160 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో బ్రాత్వైట్ విండీస్ దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. ఇంతకముందు టెస్టు క్రికెట్లో విండీస్ తరపున మారథాన్ బ్యాటింగ్ చేసిన వాళ్లలో బ్రియాన్ లారా, రామ్నరేశ్ శర్వాన, వోరెల్లు ఉన్నారు. తాజాగా వీరి సరసన బ్రాత్వైట్ చోటు దక్కించుకున్నాడు. కాగా బ్రియాన్ లారా టెస్టుల్లో రెండుసార్లు మారథాన్ ఇన్నింగ్స్లతో మెరిశాడు. 1994లో ఇంగ్లండ్పై 375 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన లారా దాదాపు 766 నిమిషాల పాటు క్రీజులో గడిపాడు. ఆ తర్వాత మళ్లీ 2004లో అదే ఇంగ్లండ్పై చారిత్రాత్మక 400 పరుగులు నాటౌట్ (క్వాడప్రుల్ సెంచరీ) సాధించాడు. ఈ సమయంలో లారా 778 నిమిషాల పాటు క్రీజులో ఉండి ప్రపంచరికార్డు సాధించాడు. ఇక రామ్నరేశ్ శర్వాన్ 2009లో ఇంగ్లండ్పై 698 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 291 పరుగులు సాధించాడు. 1960లో ఎఫ్ఎమ్ వోర్రెల్ బ్రిడ్జ్టౌన్ వేదికగా 682 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 197 పరుగులు నాటౌట్గా నిలిచాడు. తాజాగా క్రెయిగ్ బ్రాత్వైట్ 710 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 160 పరుగులు సాధించి ఆ జాబితాలో రెండో స్థానాన్ని సంపాదించాడు. చేసింది తక్కువ స్కోరైనప్పటికి.. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అతను ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్భుతమనే చెప్పాలి. అందుకే బ్రాత్వైట్ ఆటకు యావత్ క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు.''సాహో బ్రాత్వైట్.. నీ ఇన్నింగ్స్కు.. ఓపికకు సలాం''..''టెస్టు క్రికెట్లో ఉండే మజాను రుచి చూపించావు''..''అటు కెప్టెన్గా.. ఇటు బ్యాటర్ బ్లాక్బ్లాస్టర్ మార్కులు సాధించావు''అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 21, అలెక్స్ లీస్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్లో విండీస్ 411 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ ఇప్పటివరకు తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 136 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: ENG vs WI: డెబ్యూ టెస్టులోనే ఇంగ్లండ్ బౌలర్కు వింత పరిస్థితి 150* up for Captain @K_Brathwaite 👏🏾👏🏾. Bat on Skip! 🌴🏏#WIvENG #MenInMaroon pic.twitter.com/Zzr88snbwH — Windies Cricket (@windiescricket) March 19, 2022 Maneuvered for four more! #WIvENG pic.twitter.com/dSU0VPVMfQ — Windies Cricket (@windiescricket) March 19, 2022 -
డెబ్యూ టెస్టులోనే ఇంగ్లండ్ బౌలర్కు వింత పరిస్థితి
ఒక బౌలర్ తాను ఆడుతున్న తొలి మ్యాచ్లోనే వికెట్ తీసి అరంగేట్రంను గొప్పగా మలుచుకోవాలని అనుకుంటాడు. అలాంటి అవకాశం కోసం ప్రతీ బౌలర్ ఎదురుచూస్తుంటాడు. కొందరిని ఆ అదృష్టం వరిస్తుంది.. మరికొందరికి అవకాశం రాకపోవచ్చు. కానీ ఒక బౌలర్కు తన తొలి మ్యాచ్లోనే వికెట్ వచ్చినప్పటికి.. అది నోబాల్ అవడంతో వికెట్లెస్ బౌలర్గా మిగిలిపోవడం అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఆ జాబితాలో చేరిపోయాడు ఇంగ్లండ్కు చెందిన సాకిబ్ మహమూద్. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ద్వారా సాకిబ్ మహమూద్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్ను ఇంగ్లండ్ 507 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన విండీస్ 3 వికెట్ల నష్టానికి 229 పరుగులతో ధీటుగానే బదులిస్తుంది. క్రీజులో కెప్టెన్ బ్రాత్వైట్తో పాటు జెర్మన్ బ్లాక్వుడ్ 65 పరుగులతో ఆడుతున్నాడు. అప్పటికే ఈ ఇద్దరి మధ్య 128 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. మహమూద్ అప్పటికే 14 ఓవర్లు వేసినప్పటికి ఒక్క వికెట్ దక్కలేదు. కాగా మరోసారి బౌలింగ్కు వచ్చిన మహమూద్ 136 కిమీవేగంతో పర్ఫెక్ట్ యార్కర్ను వదిలాడు. అంతే బంతి క్రీజులో ఉన్న బ్లాక్వుడ్ను దాటుకుంటూ మిడిల్స్టంప్ను పడగొట్టింది. ఇంకేముంది సాకిబ్ తొలి టెస్టు వికెట్ అందుకున్నాననే ఆనందంలో మునిగిపోయాడు. ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. అంపైర్ నో బాల్గా ప్రకటించాడు. దీంతో షాకవడం సాకిబ్ వంతైంది. అలా తాను ఆడుతున్న తొలి టెస్టులో వికెట్ సాధించే అవకాశం కోల్పోయాడు. బెన్ స్టోక్స్ కానీ సాకిబ్ మాత్రం ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. తొలి టెస్టు ఆడుతూ వికెట్ తీసినప్పటికి అది నోబాల్ అవడంతో ఆ అవకాశం కోల్పోయిన క్రికెటర్గా సాకిబ్ నిలిచాడు. ఇంతకముందు ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్( 2013లో బ్రాడ్ హడిన్), మార్క్ వుడ్(మార్టిన్ గప్టిల్, 2015లో), టామ్ కరన్( డేవిడ్ వార్నర్, 2017లో), మాసన్ క్రేన్( ఉస్మాన్ ఖవాజా, 2018లో).. ఇలాగే తమ తొలి టెస్టు వికెట్ను సాధించే ప్రయత్నంలో నోబాల్ వేసి ఆ అవకాశాన్ని కోల్పోయాడు. తాజాగా వీరి సరసన సాకిబ్ మహమూద్ కూడా చేరిపోయాడు. మార్క్ వుడ్ కాగా తొలి వికెట్ నోబాల్గా తేలినప్పటికీ.. ఈ మ్యాచ్లో సాకిబ్ నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. టామ్ కరన్ చదవండి: Yastika Bhatia: 'క్రికెట్లో రాణించేందుకు ఇష్టమైనవి వదులుకున్నా' PAK vs AUS: ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా Mason Crane denied his maiden Test wicket by a no ball. ✅ Mark Wood denied his maiden Test wicket by a no ball. ✅ Ben Stokes denied his maiden Test wicket by a no ball. ✅ Tom Curran denied his maiden Test wicket by a no ball. ✅#Ashes pic.twitter.com/l3DZ5xD4fz — Seam Up Cricket (@SeamUp) January 6, 2018 -
WI Vs Eng 2nd Test: జో రూట్, స్టోక్స్ అద్భుత సెంచరీలు.. ఇంగ్లండ్దే పైచేయి
WI Vs Eng 2nd Test- బ్రిడ్జ్టౌన్: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ జో రూట్ (316 బంతుల్లో 153; 14 ఫోర్లు), బెన్ స్టోక్స్ (128 బంతుల్లో 120 బ్యాటింగ్; 11 ఫోర్లు, 6 సిక్స్లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 129 పరుగులు జోడించారు. డాన్ లారెన్స్ (150 బంతుల్లో 91; 13 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో భారీ స్కోరు సాధించిన పర్యాటక ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 507 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 27 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రెత్వైట్ (28 పరుగులు), వన్డౌన్లో వచ్చిన బ్రూక్స్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా 128 బంతుల్లో 120 పరుగులు చేసిన బెన్ స్టోక్స్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘‘అద్భుతమైన ఇన్నింగ్స్.. 114 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ. పూర్తిస్థాయి ఆధిపత్యం. నువ్వు సూపర్ స్టోక్స్’’ అంటూ కొనియాడుతున్నారు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. చదవండి: Ranji Trophy 2022: ధోని హోం టీమ్ ప్రపంచ రికార్డ్.. ఏకంగా 1008 పరుగుల ఆధిక్యం Ben Stokes completing 5,000 Test runs landmark in style. pic.twitter.com/AuKZ72dCwU — Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2022 -
WI Vs Eng 2nd Test: జో రూట్ అరుదైన సెంచరీ.. దిగ్గజాలను వెనక్కి నెట్టి..
WI Vs Eng 2nd Test- Joe Root: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 25వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్తో బార్బడోస్లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో 24 సెంచరీలు నమోదు చేసిన గ్రెగ్ చాపెల్, వివియన్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు, మహ్మద్ యూసఫ్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి క్రికెటర్లను వెనక్కి నెట్టాడు. వీరి కంటే రూట్ ఒక అడుగు ముందు వరుసలో నిలిచాడు. ఈ క్రమంలో బ్యాట్తో అభివాదం చేస్తూ మైదానంలోని అభిమానులతో రూట్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా అతడి పేరును పాటగా ఆలపిస్తూ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. కాగా విండీస్తో మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాక్ క్రాలే డకౌట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వనౌడౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ రూట్ 246 బంతుల్లో 119 పరుగులు(నాటౌట్) సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మరో ఓపెనర్ అలెక్స్ లీస్ 30 పరుగులు చేసి నిష్క్రమించగా.. క్రీజులోకి వచ్చిన డానియెల్ లారెన్స్ 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. చదవండి: MS Dhoni: నెంబర్-7 మిస్టరీ వెనుక మనం ఊహించని ట్విస్ట్ IPL 2022- Suresh Raina: రైనా ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఎట్టకేలకు ఐపీఎల్లో ఎంట్రీ! అయితే.. An incredible reception 👏 For our incredible leader 🙌 Scorecard: https://t.co/d2gy5BUkWH 🏝 #WIvENG 🏴 | @Root66 pic.twitter.com/eCLdTVXba2 — England Cricket (@englandcricket) March 16, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) An incredible reception 👏 For our incredible leader 🙌 Scorecard: https://t.co/d2gy5BUkWH 🏝 #WIvENG 🏴 | @Root66 pic.twitter.com/eCLdTVXba2 — England Cricket (@englandcricket) March 16, 2022 -
7.5 కోట్లు కుమ్మరించిన ఆటగాడికి గాయం.. ఉలిక్కిపడిన కేఎల్ రాహుల్ టీమ్
Mark Wood: ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే కొత్త ఫ్రాంచైజీల్లో ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)కు తలనొప్పులు మొదలయ్యాయి. వేలంలో కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్న కీలక ఆటగాడు, ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయం బారిన పడ్డాడు. ఊహించని ఈ పరిణామంతో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని ఎల్ఎస్జీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలే నాణ్యమైన పేసర్ లేడని కుమిలిపోతున్న ఎల్ఎస్జీని మార్క్ వుడ్ గాయం మరింత కలవరపాటుకు గురి చేస్తుంది. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్తో పోటీపడి మరీ సొంతం చేసుకున్న ఆటగాడు లీగ్కు ముందు గాయపడటంతో లక్నో శిబిరంలో ఆందోళన మొదలైంది. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో బౌలింగ్ చేస్తుండగా మార్క్ వుడ్ మోచేతికి గాయమైంది. దీంతో మైదానం వీడిన అతను తిరిగి బౌలింగ్కు రాకపోగా, డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యాడు. అతని గాయంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా, ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్న మార్క్ వుడ్ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా ఏడున్నర కోట్లు కుమ్మరించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 28న వాంఖడే వేదికగా లక్నో, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఈ మ్యాచ్తోనే ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాయి. చదవండి: తన చర్యతో కట్టిపడేసిన క్రికెటర్.. వీడియో వైరల్ -
పదేళ్ల క్రితమే ఎంట్రీ.. అరుదైన క్రికెటర్ల జాబితాలో చోటు
పదేళ్ల క్రితం జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. రెండు, మూడేళ్లలో సదరు క్రికెటర్కు గుర్తింపైనా వచ్చుండాలి.. లేదంటే జట్టులోకి వస్తూ.. పోవడం జరిగి ఉండాలి. మ్యాచ్లు ఎక్కువ ఆడితే సూపర్ స్టార్ అవడం.. లేదంటే కనుమరుగవడం జరుగుతుంది. కానీ పదేళ్ల క్రితమే జట్టులోకి ఎంట్రీ ఇచ్చి.. మళ్లీ మధ్యలో ఒక్క మ్యాచ్ ఆడకుండా.. తాజా రీఎంట్రీలో సెంచరీతో మెరిసిన క్రికెటర్లు అరుదుగా ఉంటారు. ఆ కోవకు చెందినవాడే వెస్టిండీస్ క్రికెటర్ న్క్రుమా బోనర్. బోనర్ వెస్టిండీస్ తరపున 2011లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన టి20 సిరీస్కు బోనర్ను బోర్డు ఎంపిక చేసింది. ఆ సిరీస్లో ఒక మ్యాచ్ ఆడిన బోనర్ మూడు పరుగులు మాత్రమే చేసి.. బౌలింగ్లోనూ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఆ తర్వాత ఆరు నెలలకు గాని మళ్లీ తలుపు తట్టలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన ఒక మ్యాచ్లో 30 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అంతే మళ్లీ అప్పటినుంచి పదేళ్ల పాటు విండీస్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ పదేళ్ల గ్యాప్లో అతనికి బోర్డు నుంచి ఒక్కసారి పిలుపు రాలేదు. ఇక కెరీర్ ముగిసినట్లే అని భావిస్తున్న దశలో 2019లో జమైకా జట్టుకు ఎంపికయ్యాడు. బార్బడోస్తో జరిగిన మ్యాచ్లో 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కరోనా గ్యాప్ వల్ల రెండేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు డిసెంబర్ 2020లో బంగ్లాదేశ్తో సిరీస్కు బోనర్ను ఎంపిక చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన బోనర్.. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో చారిత్రక విజయంలో భాగమయ్యాడు. 395 పరుగులు లక్ష్య చేధనతో బరిలోకి దిగిన విండీస్ను కైల్ మేయర్స్(245 నాటౌట్) సూపర్ డబుల్సెంచరీతో గెలిపించాడు. ఇదే మ్యాచ్లో బోనర్ 85 పరుగులతో మేయర్స్కు అండగా నిలబడ్డాడు. ఒక రకంగా బోనర్ కెరీర్కు ఇదే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఆగస్టులో పాకిస్తాన్తో జరిగిన ఒక టెస్టులో వెస్టిండీస్ ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్లోనూ బోనర్ కీలకపాత్ర పోషించాడు. తాజగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బోనర్ 123 పరుగులతో కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. దాదాపు తొమ్మిది గంటలపాటు ఓపికగా ఆడిన బోనర్ 355 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 123 పరుగులు సాధించాడు. అతని కళాత్మక ఇన్నింగ్స్తో వెస్టిండీస్ 62 పరుగుల ఆధిక్యంలో ఉంది. అలా పదేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చి తాజాగా సెంచరీతో వెలుగులోకి వచ్చిన అరుదైన క్రికెటర్ల జాబితాలో బోనర్ చేరిపోయాడు.ఇక తొలి టెస్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 157 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: Inzamam-ul-Haq: 'పనికిమాలిన పిచ్లు తయారు చేయకండి' -
పక్షిలా గాల్లోకి ఎగిరి.. సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఫీల్డర్ డియాండ్రా డాటిన్ స్టన్నింగ్ క్యాచ్తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన షామిలియా కన్నెల్ బౌలింగ్లో.. లారెన్ విన్ఫీల్డ్ హిల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడింది. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న డాటిన్ జంప్ చేస్తూ సింగిల్ హ్యండ్ క్యాచ్ అందుకుంది. దీంతో ఒక్క సారిగా బ్యాటర్తో పాటు, తోటి ఫీల్డర్లు షాక్కు గురయ్యారు. ఇక 16 పరుగులు చేసిన విన్ఫీల్డ్ నిరాశతో పెవిలియన్కు చేరక తప్పలేదు. ప్రస్తుతం డాటిన్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ ఒక్క క్యాచ్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. విన్ఫీల్డ్ ఔటయ్యాక ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను విండీస్ మట్టికరిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డియాండ్రా డాటిన్(31),హేలే మాథ్యూస్(45), కాంప్బెల్(66) పరుగులతో రాణించారు. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 218 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టామీ బీమౌంట్(46), ఎక్లెటన్ (33), క్రాస్ (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IPL 2022- RCB New Captain: అప్డేట్ ఇచ్చిన కోహ్లి.. వావ్ మళ్లీ భయ్యానే కెప్టెన్! Diving Deandra Dottin takes a screamer in West Indies' 7 run win over England at the World Cup.@abcsport #CWC22 #ENGvWI vision: Fox Sports pic.twitter.com/GFL4yctvtZ — Duncan Huntsdale (@duncs_h) March 9, 2022 -
తన చర్యతో కట్టిపడేసిన క్రికెటర్.. వీడియో వైరల్
ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం కరీబియన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు నేపథ్యంలో ఆట రెండోరోజు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్ మార్కవుడ్ తన చర్యలతో ఆకట్టుకోవడమేగాక అభిమానులను కట్టిపడేస్తోంది. విషయంలోకి వెళితే.. రెండోరోజు ఆటలో విండీస్ ఇన్నింగ్స్లో భాగంగా బ్రేక్ సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లంతా ఒకదగ్గర చేరి గేమ్ స్టా్రటజీని చర్చించుకున్నారు. రూట్ ఆధ్వర్యంలోని జట్టు మొత్తం ఒక దగ్గర ఉంటే.. బౌలర్ మార్క్ వుడ్ మాత్రం ఫైన్లెగ్లో ఉన్నాడు. అతను వారి దగ్గరకు రాలేకపోయాడు. తన సహచరులంతా ఒకచోట చేరి వారి సలహాలను పేర్కొంటున్న సమయంలో మార్క్ వుడ్ ఉన్న స్థానంలో అలాగే నిల్చుండిపోయాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో తెలియదు కాని.. వెంటనే తన రెండు చేతులతో సహచరులతో కలిసి గేమ్ప్లాన్ చర్చలో పాల్గొన్నట్లు ఒక సిగ్నేచర్ ఇచ్చాడు. అది తాను ఉన్న స్థానం నుంచే.. ఇది చూసిన అభిమానులు నవ్వుకోవడమేగాక.. మార్క్ వుడ్ చర్యను అభినందిస్తూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 66.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. జాసన్ హోల్డర్ 43, క్రుమ్హా బొనర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులు వద్ద ఆలౌటైంది. జానీ బెయిర్ స్టో 140 పరుగులు చేసి ఔట్ కాగా.. క్రిస్ వోక్స్ 2, ఫోక్స్ 42 పరుగులు సాధించారు. విండీస్ బౌలర్లలో జైడెన సీల్స్ 4, కీమర్ రోచ్, హోల్డర్, అల్జారీ జోసెఫ్ తలా రెండు వికెట్లు తీశారు. చదవండి: ధోనికి అవమానం.. గరం అవుతున్న అభిమానులు! Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు Joe Root wanted a team huddle, but there was one player missing... Classic Mark Wood 😂#WIvENG pic.twitter.com/RRUlBwoOGW — Cricket on BT Sport (@btsportcricket) March 9, 2022 -
బంతి అంచనా వేసేలోపే క్లీన్బౌల్డ్.. షాక్ తిన్న ఇంగ్లండ్ కెప్టెన్
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తాను ఔటైన విధానంపై షాక్ తిన్నాడు. కీమర్ రోచ్ వేసిన బంతిని అంచనా వేసేలోపే రూట్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. వాస్తవానికి తొలి బంతికే రూట్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్యాట్ ఎడ్జ్ను తాకుతూ థర్డ్స్లిప్లో పడింది. అయితే ఫీల్డర్ క్యాచ్ వదిలేయడంతో బౌండరీ వెళ్లింది. ఈ అవకాశాన్ని రూట్ సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఆరంభం నుంచే ఇబ్బందిగా గడిపిన రూట్ 13 పరుగులు చేసి తర్వాతి బంతికే బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 268 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్మన్ జానీ బెయిర్ స్టో(109 నాటౌట్) సూపర్ సెంచరీతో ఆకట్టుకోగా.. బెన్ ఫోక్స్ 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకముందు ఓపెనర్లు అలెక్స్ లెస్ (4), క్రాలే (8), జో రూట్ (13), డాన్ లారెన్స్ (20), స్టోక్స్ (36) పరుగులు చేసి ఔటయ్యారు. విండీస్ బౌలర్ కీమర్ రోచ్ రెండు వికెట్లు పడగొట్టాడు. Kemar Roach Clean Bowled England Captain Joe Root on just 13 runs.#WIvENG pic.twitter.com/bIk92mjA3X — Over Thinker Lawyer 🇵🇰 (@Muja_kyu_Nikala) March 8, 2022 -
ఇంగ్లండ్ హెడ్ కోచ్గా పాల్ కాలింగ్వుడ్..
ECB Named Collingwood As Interim Head Coach: విండీస్తో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్ హెడ్ కోచ్గా ఆ దేశ మాజీ ఆల్రౌండర్ పాల్ కాలింగ్వుడ్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సోమవారం ప్రకటించింది. కాలింగ్వుడ్ నియామకం తాత్కాలిక ప్రాతిపదికన జరిగినట్లు ఈసీబీ పేర్కొంది. తాజాగా విండీస్తో జరిగిన టీ20 సిరీస్ కోసం ఇంచార్జ్ కోచ్గా వ్యవహరించిన కాలింగ్వుడ్.. సెలవు నిమిత్తం కరీబియన్ దీవుల్లోనే ఉన్నాడని, ఫిబ్రవరి 25న ఇంగ్లండ్ జట్టు అక్కడి చేరుకోగానే అతను బాధ్యతలు చేపడతాడని ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ వెల్లడించాడు. ఈ పర్యటనలో ఇంగ్లండ్ ఓ వార్మప్ మ్యాచ్తో పాటు 3 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. మార్చ్ 1 నుంచి విండీస్ టూర్ ప్రారంభంకానుంది. కాగా, తాజాగా జరిగిన టీ20 సిరీస్లో కాలింగ్వుడ్ ఆధ్వర్యంలోని ఇంగ్లీష్ జట్టు విండీస్ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2021-22లో ఆసీస్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి(0-4) బాధ్యున్ని చేస్తూ ఇంగ్లండ్ హెడ్ కోచ్ సిల్వర్వుడ్కు ఈసీబీ ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు ఖరారు..! -
జేసన్ రాయ్ విధ్వంసం.. 36 బంతుల్లోనే శతకం
వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో శతక్కొట్టాడు. బార్బడోస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో జేసన్ ఈ ఫీట్ను సాధించాడు. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొత్తం 47 బంతులను ఎదుర్కొన్న జేసన్.. 115 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను పొట్టి ఫార్మాట్లో పదో వేగవంతమైన శతకాన్ని సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ప్రత్యర్ధి కేవలం 137 పరుగులకే చేతులెత్తేయడంతో పర్యాటక జట్టు విజయం సాధించింది. ఈ సునామీ ఇన్నింగ్స్తో జేసన్ రాయ్ ఐపీఎల్ జట్లకు ఛాలెంజ్ విసిరాడు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్ అతనికి భారీ ధర సమకూర్చి పెట్టే అవకాశం ఉంది. కాగా, రాయ్.. గత ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా క్రికెటర్లకు మరో అవమానం.. పాక్ ఆటగాళ్లకే అందలం -
Eng Vs WI T20 Series: 16 మంది సభ్యులతో కూడిన జట్టు ప్రకటించిన ఇంగ్లండ్.. కొత్తగా
England Tour OF West Indies- T20 Series Squad: వచ్చే ఏడాది ఆరంభంలో వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో లెఫ్టార్మ్ సీమర్ డేవిడ్ పైన్, జార్జ్ గార్టన్లకు చోటు దక్కింది. విండీస్ టూర్ సందర్భంగా వీరు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నారు. ఇక ఈ సిరీస్కు పాల్ కోలింగ్వుడ్ తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. మార్కస్ ట్రెస్కోథిక్ అసిస్టెంట్ కోచ్గా విధులు నిర్వర్తించనున్నాడు. ఈ విషయం గురించి కోలింగ్వుడ్ మాట్లాడుతూ... ‘‘పటిష్టమైన జట్టును ఎంపిక చేశాం. ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాన్ని సమతుల్యం చేసుకుంటూ ఆటగాళ్లను సెలక్ట్ చేశాం’’అని చెప్పుకొచ్చాడు. కాగా విండీస్ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో 11 మంది టీ20 ప్రపంచకప్-2021 ఈవెంట్లో పాల్గొన్న ఆటగాళ్లు ఉండటం గమనార్హం. వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ ప్రకటించిన జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, టామ్ బాంటన్, సామ్ బిల్లింగ్స్, లియామ్ డాసన్, జార్జ్ గార్టన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, సకీబ్ మహమూద్, టైమల్ మిల్స్, డేవిడ్ పైన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లే, జేమ్స్ విన్సే. ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్- టీ20 సిరీస్- షెడ్యూల్: ►తొలి మ్యాచ్- జనవరి 22 ►రెండో మ్యాచ్- జనవరి 23 ►మూడో మ్యాచ్- జనవరి 26 ►నాలుగో మ్యాచ్- జనవరి 29 ►ఐదో మ్యాచ్- జనవరి 30. చదవండి: Kapil Dev: కపిల్లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్ గెలుస్తారు! రోహిత్.. ఇంకా కోహ్లి... Justin Langer: మూడు ఫార్మాట్లలో కొనసాగుతా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడమే లక్ష్యం: హెడ్కోచ్ -
T20 World Cup 2021: విండీస్ విలవిల.. చెత్త రికార్డు
T20 World Cup 2021: ఐదేళ్ల క్రితం 2016 టి20 ప్రపంచకప్ అంటే ఠక్కున గుర్తొచ్చేది వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్. టైటిల్ గెలిచేందుకు చివరి ఓవర్లో వెస్టిండీస్ 19 పరుగులు చేయాల్సి ఉండగా... బ్రాత్వైట్ నాలుగు వరుస సిక్సర్ల విన్యాసం ప్రతి క్రికెట్ అభిమానికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఐదేళ్లు గడిచాయి. ఆ ఫైనల్కు కొనసాగింపు అన్నట్లు ప్రస్తుత టి20 ప్రపంచకప్లో ఇరు జట్లు మరోసారి తలపడ్డాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన వెస్టిండీస్ ఈసారి పూర్తిగా తడబడింది. చెత్త ఆటతీరుతో 55 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా జరిగే టి20 లీగ్ల్లో ఆడే ప్రముఖ ఆటగాళ్లు... ఎనిమిదో వరుస ఆటగాడి వరకు ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించే సత్తా... పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర జట్టుగా పేరు... అయితేనేం టి20 ప్రపంచకప్లోని తమ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ బోల్తా పడింది. గ్రూప్–1లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. టి20 ప్రపంచ కప్లో వెస్టిండీస్కిదే అత్యల్ప స్కోరు కాగా... ఓవరాల్గా రెండోది. 2019లో ఇంగ్లండ్పైనే చేసిన 45 పరుగుల తొలి స్థానంలో ఉంది. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (4/2)తో తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. క్రిస్ గేల్ (13 బంతుల్లో 13; 3 ఫోర్లు) మాత్రమే విండీస్ జట్టులో రెండంకెల స్కోరును సాధించాడు. ఛేజింగ్లో ఇంగ్లండ్ 8.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టపోయి 56 పరుగులు చేసి గెలుపొందింది. జోస్ బట్లర్ (22 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు) లాంఛనం పూర్తి చేశాడు. రషీద్ మ్యాజిక్ ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మ్యాజిక్ స్పెల్తో వెస్టిండీస్ పని పట్టాడు. కేవలం 2.2 ఓవర్లు (14 బంతులు) వేసిన అతడు రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో విధ్వంసకర కీరన్ పొలార్డ్ (6), ఆండ్రీ రసెల్ (0)లతో పాటు మెకాయ్ (0), రవి రాంపాల్ (3) వికెట్లు ఉన్నాయి. రషీద్కు మొయిన్ అలీ (2/17), టైమల్ మిల్స్ (2/17) సహకరించడంతో వెస్టిండీస్ కోలుకోలేకపోయింది. జట్టులో గేల్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా... మిగిలిన పది మంది సింగిల్ డిజిట్కే పరిమితయ్యారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ను అకీల్ తన బౌలింగ్తో ఇబ్బంది పెట్టాడు. అయితే లక్ష్యం మరీ చిన్నదిగా ఉండటం... బట్లర్ నిలవడంతో ఛేదనలో ఇంగ్లండ్ కాస్త తడబడినా విజయాన్ని అందుకుంది. విండీస్ ఇన్నింగ్స్లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు స్కోర్లు: వెస్టిండీస్ ఇన్నింగ్స్: సిమన్స్ (సి) లివింగ్స్టోన్ (బి) మొయిన్ అలీ 3; ఎవిన్ లూయిస్ (సి) మొయిన్ అలీ (బి) వోక్స్ 6; గేల్ (సి) మలాన్ (బి) మిల్స్ 13; హెట్మైర్ (సి) మోర్గాన్ (బి) మొయిన్ అలీ 9; బ్రావో (సి) బెయిర్స్టో (బి) జోర్డాన్ 5; పూరన్ (సి) బట్లర్ (బి) మిల్స్ 1; పొలార్డ్ (సి) బెయిర్స్టో (బి) ఆదిల్ రషీద్ 6; రసెల్ (బి) ఆదిల్ రషీద్ 0; అకీల్ హోసీన్ (నాటౌట్) 6; మెకాయ్ (సి) రాయ్ (బి) ఆదిల్ రషీద్ 0; రవి రాంపాల్ (బి) ఆదిల్ రషీద్ 3; ఎక్స్ట్రాలు 3; మొత్తం (14.2 ఓవర్లలో ఆలౌట్) 55. వికెట్ల పతనం: 1–8, 2–9, 3–27, 4–31, 5–37, 6–42, 7–44, 8–49, 9–49, 10–55. బౌలింగ్: మొయిన్ అలీ 4–1–17–2, వోక్స్ 2–0–12–1, మిల్స్ 4–0–17–2, జోర్డాన్ 2–0–7–1, ఆదిల్ రషీద్ 2.2–0–2–4. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) గేల్ (బి) రవి రాంపాల్ 11; బట్లర్ (నాటౌట్) 24; బెయిర్స్టో (సి అండ్ బి) అకీల్ 9; మొయిన్ అలీ (రనౌట్) 3; లివింగ్స్టోన్ (సి అండ్ బి) అకీల్ 1; మోర్గాన్ (నాటౌట్) 7, ఎక్స్ట్రాలు 1; మొత్తం (8.2 ఓవర్లలో 4 వికెట్లకు) 56. వికెట్ల పతనం: 1–21, 2–30, 3–36, 4–39. బౌలింగ్: అకీల్ 4–0–24–2, రవి రాంపాల్ 2–0–14–1, మెకాయ్ 2–0–12–0, పొలార్డ్ 0.2–0–6–0. -
T20 WC Eng Vs WI: మళ్లీ విధ్వంసం చూస్తామా!
T20 World Cup 2021 Eng Vs WI: 2012, 2016 టీ20 వరల్డ్కప్లో రెండుసార్లు చాంపియన్గా నిలిచింది వెస్టిండీస్. టీ20 ప్రపంచకప్-2021లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న విండీస్... మళ్లీ తమ భీకర బ్యాటింగ్నే నమ్ముకుంది. సూపర్-12లో భాగంగా శనివారం ఇంగ్లండ్తో తమ తొలి మ్యాచ్లో తలపడుతోంది. ఇక ఫాబియన్ అలెన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో.. అతడి స్థానంలో అకీల్ హొసేన్ను చివరి నిమిషంలో జట్టులోకి తీసుకున్నారు. జట్టు బలాబలాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఫామ్లో లేకపోయినా గేల్ ఎప్పుడైనా చెలరేగిపోగలడు. లూయిస్, పొలార్డ్, పూరన్, హెట్మైర్, రసెల్ బాదడం మొదలు పెడితే వారిని ఆపతరం కాదు. అయితే రెండు ప్రాక్టీస్ మ్యాచ్లలోనూ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ చేతుల్లో ఓడటం కొంత ఆందోళనపరిచే అంశం. వెస్టిండీస్: సూపర్ 12, గ్రూప్ 1 కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, డ్వేన్బ్రావో, రాస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, క్రిస్ గేల్, షిమ్రన్ హెట్మెయిర్, ఇవిన్ లూయిస్, ఒబెడ్ మెకాయ్, లెండిల్ సిమన్స్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్, ఒషేన్ థామస్, హెడెన్ వాల్ష్ జూనియర్, అకీల్ హుసేన్. రిజర్వు ప్లేయర్లు: డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, జేసన్ హోల్డర్. ఇంగ్లండ్ పరిస్థితి ఏంటి? మాజీ చాంపియన్ ఇంగ్లండ్ జట్టులో కూడా పెద్ద సంఖ్యలో ఆల్రౌండర్లు ఉన్నారు. తొమ్మిదో స్థానం ఆటగాడి వరకు కూడా భారీ షాట్లు ఆడగల సమర్థులు. ఇటీవల ఘోరంగా విఫలమవుతున్న కెపె్టన్ మోర్గాన్ దారిలో పడితే ఇంగ్లండ్కు సమస్యలన్నీ తీరినట్లే. అయితే స్పిన్నర్లు ఈ జట్టు బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఇంగ్లండ్- సూపర్ 12, గ్రూప్-1 ఇయాన్ మోర్గాన్, మొయిన్ అలీ, జొనాథన్ బెయిర్స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జేసన్రాయ్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్వుడ్. రిజర్వు ప్లేయర్లు: లియామ్ డాసన్, జేమ్స్ విన్స్, రీస్ టోప్లే. చదవండి: T20 World Cup 2021: కోహ్లి సేన బలబలాలు ఏంటి.. ఏ ఆటగాడి రికార్డు ఎలా ఉంది? -
ఆ మ్యాచ్కు ముందు 10.. ఇప్పుడు 3
మాంచెస్టర్ : వెస్టిండీస్తో జరిగిన మూడో టెస్టులో పది వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకిగ్స్లో మూడో స్థానంలో నిలిచాడు.బ్రాడ్ మొదటి ఇన్నింగ్స్లో ఆరు, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ మూడో టెస్టును 269 పరుగుల తేడాతో గెలవడంలో బ్రాడ్ కీలకపాత్ర పోషించాడు. రెండు టెస్టుల్లో కలిపి మొత్తం 16 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తో గెలిచి విస్డెన్ ట్రోఫీని తిరిగి కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ ప్రారంభానికి ముందు బ్రాడ్ టెస్ట్ ర్యాంకింగ్స్లో పదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఏడుస్థానాలు ఎగబాకి మూడోస్థానంలో నిలిచాడు. అలాగే, బ్రాడ్ టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు నమోదు చేసిన ఏడో బౌలర్గా అవతరించాడు. మొదటి ఇన్నింగ్స్లో 45 బంతుల్లో 62 పరుగులు చేసి, ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్లో 11 వ స్థానానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఐసీసీ టెస్టు బౌలర్ల టాప్ 10 ర్యాంకింగ్స్ లిస్ట్ను ట్విటర్లో విడుదల చేసింది.ఈ జాబితాలో ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. కమిన్స్ ఖాతాలో 904 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.తర్వాత వరుసగా నీల్ వాగ్నర్ (843), స్టువర్ట్ బ్రాడ్ (823), టిమ్ సౌథీ (812), జాసన్ హోల్డర్ (810) వరుసగా టాప్-5లో ఉన్నారు. (అప్పుడు ఆరు సిక్సర్లు.. ఇప్పుడు ప్రశంసలు) It just keeps getting better for @StuartBroad8! After becoming the latest entrant in the highly exclusive 500 Test wicket club, he has jumped seven spots to go to No.3 in the @MRFWorldwide ICC Test Rankings for bowlers 👏👏👏 pic.twitter.com/XgX4YRdZLh — ICC (@ICC) July 29, 2020 -
అదరగొట్టిన బ్రాడ్.. సిరీస్ ఇంగ్లండ్దే
మాంచెస్టర్ : నాలుగు నెలల కరోనా విరామం తర్వాత జరిగిన క్రికెట్లో శుభారంభం అదిరింది. ఇంగ్లండ్- వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్టు సిరీస్లో ఆతిథ్య జట్టు 2-1 తేడాతో విజ్డెన్ ట్రోపీని సొంతం చేసుకుంది. కాగా ఇరు దేశాల మధ్య జరిగే సిరీస్లో విజేతగా నిలిచిన జట్టుకు విజ్డెన్ ట్రోపీని అందించడం ఆనవాయితీగా వస్తుంది. మూడో టెస్టులో భాగంగా 390 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన విండీస్ జట్టు 129 పరుగులకే కుప్పకూలింది. దీంతో 269 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టు బారీ విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 5 వికెట్లతో రాణించగా, బ్రాడ్ మరోసారి 4 వికెట్లతో రాణించాడు.(అయ్యో బ్రాత్వైట్.. రెండుసార్లు నువ్వేనా) అంతకముందు తొలి ఇన్నింగ్స్లోనూ స్టువర్ట్ బ్రాడ్ 6 కీలక వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 10 వికెట్లు తీయడం బ్రాడ్కు ఇది మూడోసారి. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. కాగా విండీస్ మొదటి ఇన్నింగ్స్లో 197 పరుగులకే ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్లో 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి 129 పరుగులకే కుప్పకూలింది. కరోనా నేపథ్యంలో మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరిగిన ఈ సిరీస్ విజయవంతం కావడంతో క్రికెట్కు సరికొత్త ఊపునిచ్చింది. అసలే టెస్టు సిరీస్.. దీనిని ఎవరు పట్టించుకుంటారులే అన్న సందేహాలకు తావివ్వకుండా ఇరు జట్లు విజయం కోసం(మూడో టెస్టు మినహాయించి) పోరాడాయి.మొదటి టెస్టులో పర్యాటక జట్టు విండీస్ అద్భుతమైన విజయం సాధించి ఇంగ్లండ్కు గట్టి షాక్ ఇచ్చింది. అయితే రెండో టెస్టులో ఫుంజుకున్న ఆతిథ్య జట్టు విండీస్పై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మకంగా మారిన మూడో టెస్టుకు వరుణుడు అడ్డు తగిలినా ఇంగ్లండ్ బౌలర్ల అద్భుత బౌలింగ్తో ఆతిథ్య జట్టు ట్రోపీని ఎగరేసుకుపోయింది.('భవిష్యత్తులో ధావన్కు అవకాశం కష్టమే') ఈ సిరీస్ క్రికెట్కు ఊతమివ్వడమేగాక పలు రికార్డులుకు వేదికయింది. జో రూట్ గైర్హాజరీలో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్టార్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్కు ఈ సిరీస్ మధురానుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటిటెస్టులో తనను పక్కన పెట్టడం పట్ల బ్రాడ్ తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే బ్రాడ్ను పక్కన పెట్టి తప్పుచేశామా అని భావించిందేమో రెండో టెస్టులోకి అతన్ని జట్టులోకి తీసుకువచ్చింది. జట్టుకు దూరమయ్యానన్న కసితో బ్రాడ్ చెలరేగిపోయాడు. రెండో టెస్టులో 6 వికెట్లు, మూడో టెస్టులో ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీతో పాటు 10 వికెట్లు పడగొట్టి సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేగాకకెరీర్లో 500 వికెట్లు సాధించిన రెండో ఇంగ్లండ్ బౌలర్గా, ప్రపంచంలో 7వ బౌలర్గా నిలిచాడు. -
అయ్యో బ్రాత్వైట్.. రెండుసార్లు నువ్వేనా
మాంచెస్టర్ : ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో 500వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో మంగళవారం ఐదో రోజు ఆటలో భాగంగా క్రెయిగ్ బ్రాత్వైట్ను ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు. కాగా క్రికెట్ ప్రపంచంలో 500 వికెట్లు తీసిన 7వ బౌలర్గా నిలవడంతో పాటు ఈ రికార్డును సాధించిన ఫాస్ట్ బౌలర్లలో నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు జేమ్స్ అండర్సన్(589), గ్లెన్ మెక్గ్రాత్ (563), కౌట్నీ వాల్ష్( 519) వరుసగా ఉన్నారు. కాగా ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 140 టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బ్రాడ్ నిలిచాడు. కాగా ఈ ఘనత సాధించిన ఇంగ్లీష్ మొదటి బౌలర్గా జేమ్స్ అండర్సన్ నిలిచాడు. (ఆల్టైమ్ గ్రేట్లలో వారు కూడా..) అంతేగాక టెస్టుల్లో 500 వికెట్లు తీసిన ఇద్దరు ఆటగాళ్లు ఒకే జట్టులో ఒకే మ్యాచ్లో ఉండడం విశేషం. అంతేగాక యాదృశ్చికంగా జేమ్స్ అండర్సన్ 500వ వికెట్, బ్రాడ్ 500వ వికెట్గా విండీస్ బ్యాట్స్మెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ లభించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక బౌలర్ తన మైల్స్టోన్ వికెట్ను సాధించడంలో బ్రాత్వైట్ మూడు సార్లు బలయ్యాడు. లార్డ్స్ వేదికగా 2017లో జరిగిన టెస్టు మ్యాచ్లో అండర్సన్(500 వ) వికెట్, అదే ఏడాది సెడాన్పార్క్లో కివీస్తో జరిగిన టెస్టులో ట్రెంట్ బౌల్ట్( 200వ) వికెట్తో పాటు తాజాగా బ్రాడ్ తన 500వ వికెట్ మైలురాయిని బ్రాత్వైట్ను ఔట్ చేసి సాధించడం విశేషం. కాగా టెస్టుల్లో బౌలర్లు మైల్స్టోన్ అందుకోవడంలో అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆల్రౌండర్ జాక్ కలిస్ ఐదుసార్లు ఔటయ్యాడు. వారిలో వరుసగా అండర్సన్( 100వ), ఆండీ కాడిక్(100వ), షేన్ వార్న్ (300వ), జహీర్ ఖాన్(300వ), వాల్ష్( 500వ) కలిస్ను ఔట్ చేసి మైలురాళ్లను సాధించారు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ట్విటర్ వేదికగా బ్రాడ్ను ప్రశంసిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ ఘనత సాధించిన వారిలో బ్రాడ్ ఉండడం మాకు గర్వంగా ఉంది అంటూ క్యాప్షన్ జత చేసింది. ('నన్ను ఎందుకు పక్కనబెట్టారో అర్థం కాలేదు') An England great 🦁 A legend of the game 👑 So proud that @StuartBroad8 is one of ours! 🏴🏏 pic.twitter.com/W69G9CI9SR — England Cricket (@englandcricket) July 28, 2020 కాగా విండీస్తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో జట్టు మేనేజ్మెంట్ తనను పక్కన పెట్టడం పట్ల బ్రాడ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫామ్లో ఉన్న తనను కాదని వేరొకరికి అవకాశం ఇవ్వడం తనను బాధకు గురి చేసిందని బ్రాడ్ పేర్కొన్నాడు. అయితే రెండో టెస్టుకు జట్టులోకి వచ్చిన బ్రాడ్ తన సత్తాను చాటాడు. రెండో మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి ఆరు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నిర్ణయాత్మకమైన మూడో టెస్టులో బ్రాడ్ మరింత రెచ్చిపోయాడు. మొదట బ్యాటింగ్ 45 బంతుల్లోనే 62 పరుగులు చేసి ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ నమోదు చేయగా.. బౌలింగ్లో 6 వికెట్లు తీసి 18వ సారి 5కంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు సాధించాడు. కాగా కీలకమైన రెండో ఇన్నింగ్స్లోనూ బ్రాడ్ రెండు వికెట్లు తీసి ఇప్పటికే 14 వికెట్లతో సిరీస్లో లీడింగ్ వికెట్టేకర్గా నిలిచాడు.('భవిష్యత్తులో ధావన్కు అవకాశం కష్టమే') మరోవైపు కీలకమైన మూడో టెస్టులో 390 పరుగులు విజయలక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన విండీస్ ఓటమి అంచున నిలిచింది. ఇప్పటికే 82 పరుగులకే 6 వికెట్లు కోల్పయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే వరుణుడు అడ్డు తగలడంతో ఆటకు విరామం లభించింది. ఇంకా ఒక సెషన్ మిగిలే ఉండడంతో విండీస్ ఓటమి అంచుల్లో ఉంది. అయితే వర్షంతో చివరి సెషన్ తుడిచిపెట్టుకుపోతే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా విరామం తర్వాత జరుగుతున్న మొదటి టెస్టు సిరీస్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ను గెలుచుకున్నాయి. -
ఇంగ్లండ్ పర్యటనకు ఆసీస్ రెడీ
సిడ్నీ: ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటనలో వెస్టిండీస్ జట్టు మూడు టెస్టు సిరీస్లు ఆడతున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి నేపథ్యంలో బయో సెక్యూర్ పద్ధతిలో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్ తొలి టెస్టులో విండీస్ విజయం సాధించగా, రెండో టెస్టు మాత్రం ఆసక్తిని తలపిస్తోంది. కాగా, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడానికి ఆసీస్ సిద్ధమైంది. తాము మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి సీఏ ప్రపోజల్ పంపింది. బయో సెక్యూర్ పద్ధతిలో జరిగే ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొనడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తమ ప్రతిపాదనలో సీఏ పేర్కొంది. దీనిపై ఇప్పటికే ఈసీబీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. (బయో సెక్యూర్ క్రికెట్ సాధ్యమేనా?) ఇదే జరిగితే సెప్టెంబర్ నెలలో ఇరు జట్ల మధ్య సిరీస్ జరుగనుంది. సెప్టెంబర్ 4-8 వరకూ టీ20లు, 10 నుంచి 15 వరకూ వన్డేలు నిర్వహించడానికి ఇరు బోర్డులు సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం. సౌతాంప్టాన్, మాంచెస్టర్లోని వేదికలకు హోటళ్లు అనుసంధానం చేయడంతో మ్యాచ్లు బయో సెక్యూర్ పద్ధతిలో నిర్వహించడానికి ఈసీబీ సునాయమవుతోంది. ఇదే సూత్రాన్ని వెస్టిండీస్తో సిరీస్కు సైతం అవలంభిస్తోంది ఇంగ్లండ్. విండీస్తో తొలి టెస్టు సౌతాంప్టాన్లో జరగ్గా, రెండు, మూడు టెస్టులు మాంచెస్టర్ వేదిక కానుంది. ఇక గతవారం 26 మందితో కూడిన జట్టును సీఏ ఎంపిక చేయగా ఫైనల్ స్క్వాడ్ను ఎంపిక చేయడానికి సీఏ సెలక్టర్లు సన్నద్ధమయ్యారు. -
అలవాటులో పొరపాటు.. అంపైర్లకు తిప్పలు
మాంచెస్టర్: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రపంచ క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)అనేక కొత నిబంధనలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా బంతిని లాలాజలంతో(సలైవా) రుద్ద కూడదనే నిబంధనను కచ్చితత్వం చేసింది. కాగా, ఈ నిబంధనలను తొలిసారి ఇంగ్లండ్ క్రికెటర్ డామ్ సిబ్లీ అతిక్రమించాడు. ఇంగ్లండ్-వెస్టిండీస్ల రెండో టెస్టులో భాగంగా నాల్గో రోజు సిబ్లీ రూల్స్ బ్రేక్ చేశాడు. బంతిని అందుకున్న మరుక్షణమే అనుకోకుండా చేతితో లాలాజలాన్ని బంతిపై రుద్ది నిబంధనలను ఉల్లంఘించాడు. నాలుగో రోజు లంచ్కు ముందు క్రిస్ ఓక్స్ ఓవర్ పూర్తవగానే బంతి సిబ్లీ చేతికొచ్చింది. బంతిని అందుకున్న సిబ్లీ అనుకోకుండా చేతి వేళ్లను నోటి దగ్గరకు పోనిచ్చాడు. వెంటనే లాలాజలాన్ని బంతిపై రుద్ది నాలుక కరుచుకున్నాడు. ఈ విషయం అంపైర్లకు తెలియడంతో బంతిని తీసుకుని శానిటైజర్ టవల్తో శుభ్రం చేశారు. సలైవా నిబంధనను మొదటిసారి బ్రేక్ చేసిన సిబ్లీ చర్యకు అంపైర్లకు తిప్పలు తప్పలేదు. ఏం చేయాలో తెలియక బంతిని శానిటైజ్ చేశారు. (‘జస్ప్రీత్ బుమ్రాతో చాలా డేంజర్’) తొలి టెస్టులో ఓడిపోయిన ఇంగ్లండ్ రెండో టెస్టులో ఫలితాన్ని శాసించే స్థితిలో నిలిచింది. నాలుగోరోజు ఆదివారం ఓవర్నైట్ స్కోరు 32/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ జట్టు 99 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు బ్రాడ్ (3/66), వోక్స్ (3/42), స్యామ్ కరన్ (2/70) రాణించారు. విండీస్ జట్టులో బ్రాత్వైట్ (75; 8 ఫోర్లు), బ్రూక్స్ (68; 11 ఫోర్లు), చేజ్ (51; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. 182 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 37 పరుగులు చేసింది. మరి ఇంగ్లండ్ లక్ష్యాన్ని నిర్దేశించి విజయం కోసం పోరాడుతుందో.. లేక డ్రాతోనే సరిపెట్టుకుంటుందో చూడాలి. (టి20 ప్రపంచకప్ భవితవ్యం తేలేది నేడే) -
అండర్సన్.. మొన్ననేగా పొగిడాం ఇంతలోనే
సౌతాంప్టన్ : కరోనా విరామం తర్వాత ఇంగ్లండ్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్తో క్రికెట్ సందడి షురూ అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో భౌతిక దూరం పాటిస్తూనే సహచర ఆటగాళ్లతో కేవలం భూజాలతోనే విషెస్ చెప్పడం చూశాం. అండర్సన్ చేసిన పని క్రికెట్ అభిమానులకు తెగ నచ్చేసింది. అలాగే ఇతర క్రికెటర్లు కూడా ఈ విధంగా పాటిస్తే బాగుంటుందని ఐసీసీ పేర్కొంది.(అండర్సన్.. ఎంతైనా నీకు నువ్వే సాటి) అలా అందరిచేత మెప్పించబడ్డ అండర్సన్ తాజాగా సౌతాంప్టన్లో వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ 3వరోజు ఆటలో భాగంగా ఐసీసీ నిబంధనలను గాలికొదిలేశాడు. రోస్టన్ చేజ్ వికెట్ తీసిన ఆనందంలో కనీస భౌతిక దూరం పాటించకుండా సహచరుల వద్దకు వెళ్లి హగ్ చేసుకున్నాడు. అండర్సన్ వేసిన బంతి చేజ్ మొకాళ్లకు తాకుతూ వెళ్లింది. దాంతో అండర్సన్ ఎల్బీ అప్పీల్కు వెళ్లగా అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. దీంతో కెప్టెన్ స్టోక్స్ డీఆర్ఎస్కు వెళ్లాడు. డీఆర్ఎస్ రివ్యూ ఇంగ్లండ్కు అనుకూలంగా రావడంతో ఆ సంతోషంలో అండర్సన్ తన సహచర ఆటగాళ్ల దగ్గరికి వెళ్లి ఆనందంతో హత్తుకున్నాడు.('నన్ను ఎందుకు పక్కనబెట్టారో అర్థం కాలేదు') Jimmy makes the breakthrough! 👏 Scorecard & Videos: https://t.co/ldtEXLDT8V#ENGvWI pic.twitter.com/rtzmfzV8WS — England Cricket (@englandcricket) July 10, 2020 'అండర్సన్.. మొన్ననే కదా నిన్ను మెచ్చుకుంది.. ఇంతలోనే ఐసీసీ నిబంధనలు గాలికొదిలేస్తావా' అంటూ ఐసీసీ తన ట్విటర్లో పేర్కొంది. అయితే దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసిర్ హుసేన్ స్పందించాడు. 'వికెట్ తీశానన్న ఆనందంలో అలా చేసి ఉంటాడు. ఎంతైనా పాత పద్దతులు అంత తొందరగా జీర్ణం కావుగా' అంటూ తెలిపాడు. కాగా తొలి టెస్టులో ఇప్పటివరకైతే విండీస్దే పైచేయిగా నిలిచింది. మూడోరోజూ ఆతిథ్య ఇంగ్లండ్ బౌలర్లపై బ్యాట్స్మెన్ కూడా రాణించడంతో విండీస్ ఆధిక్యం దక్కింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్వైట్ (125 బంతుల్లో 65; 6 ఫోర్లు), వికెట్ కీపర్ డౌరిచ్ (115 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 102 ఓవర్లలో 318 పరుగుల వద్ద ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 114 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ (4/49), అండర్సన్ (3/62) ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి గండికొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. బర్న్స్ 10 పరుగులతో, సిబ్లీ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 99 పరుగుల వెనుకంజలో ఉంది. -
'నన్ను ఎందుకు పక్కనబెట్టారో అర్థం కాలేదు'
సౌతాంప్టన్ : దాదాపు 116 రోజుల కరోనా విరామం తర్వాత ఇంగ్లండ్- విండీస్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్తో క్రికెట్ సందడి మొదలైంది. ఈ సిరీస్లో మొదటి టెస్టుకు ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ జోరూట్ గైర్హాజరీలో బెన్ స్టోక్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విండీస్తో జరుగుతున్న మొదటిటెస్టుకు నలుగురు ఫాస్ట్ బౌలర్లు చాలనే ఉద్ధేశంతో స్టోక్స్ ఫామ్లో ఉన్న స్టువర్ట్ బ్రాడ్ను కాదని జోఫ్రా ఆర్చర్, మార్క్ఉడ్లను జట్టులోకి తీసుకున్నాడు. తనతో పాటు అండర్సన్ కలిపితే జట్టుకు నలుగురు ఫాస్ట్ బౌలర్లు సరిపోయారని అందుకే బ్రాడ్ను తీసుకోలేదని స్టోక్స్ ఒక ప్రకటనలో తెలిపాడు. ఈ నిర్ణయం బ్రాడ్నే కాదు ఇంగ్లండ్ అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది.(భారత అభిమానుల గుండె పగిలిన రోజు) తాజాగా తనను ఎంపిక చేయకపోవడంపై బ్రాడ్ స్పందించాడు.' దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత మైదానంలోకి దిగబోతున్నా అనే ఉత్సాహం ఉండేది. కానీ విండీస్తో జరుగుతున్న మొదటిటెస్టుకు నన్ను ఎంపికచేయకపోవడంతో చాలా బాధేసింది. అసలు నన్ను ఎందుకు పక్కన పెట్టారన్నది ఇప్పటికి అర్థం కావడం లేదు .నేను చాలా నిరాశలో కూరుకుపోయా. మంచి ఫామ్లో ఉన్నప్పుడు నన్ను ఇలా చేయడం నచ్చలేదు. మ్యాచ్కు ఒకరోజు ముందు బెన్ స్టోక్స్ నా దగ్గరికి వచ్చాడు. సౌంతాప్టన్ పిచ్ పేసర్లకు బాగా అనుకూలిస్తుంది.. అందుకే అదనపు పేస్ బౌలర్ అవసరం పడుతుంది అని చెప్పాడు. కానీ అనూహ్యంగా నన్ను పక్కనబెట్టి జోఫ్రా ఆర్చర్కు అవకావమిచ్చారు. జోఫ్రా ఎంపికపై నేను తప్పు బట్టను.. ఎందుకో కానీ ఈ విషయాన్ని నేను జీర్ణంచుకోలేకపోతున్నా. దశాబ్ద కాలంగా జట్టుతో పాటు కొనసాగుతున్నా.. ఈ దశాబ్ద కాలంలో ఇంగ్లండ్ను ఎన్నో మ్యాచ్ల్లో గెలిపించా. కరోనాకు ముందు జరిగిన యాషెస్ సిరీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో అద్భతంగా బౌలింగ్ చేశా. కానీ ఫామ్లో ఉన్న బౌలర్ని పక్కన బెట్టడం నచ్చలేదు. అందుకే ఈ విషయంలో నాకు కోపంతో పాటు విసుగు వచ్చింది.' అంటూ ఇంగ్లండ్ వెటెరస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డారెన్ గాఫ్ స్పందించాడు. విండీస్తో టెస్టుకు బ్రాడ్ను ఎంపికచేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని గాఫ్ పేర్కొన్నాడు. నిజానికి స్టువర్ట్ బ్రాడ్ కరోనాకు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో మంచి ప్రదర్శననే నమోదు చేశాడు. ప్రొటీస్తో జరిగిన సిరీస్లో 14 వికెట్లతో రాణించాడు. అంతకముందు 2019 యాషెస్ సిరీస్లో పాట్ కమిన్స్(28 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బ్రాడ్(23 వికెట్లు) నిలిచాడు. కాగా స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్లో 138 టెస్టులాడి 485 వికెట్లు పడగొట్టాడు.('కెప్టెన్గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు') -
'కెప్టెన్సీ కంటే జట్టు గెలుపే ముఖ్యం'
సౌతాంప్టన్ : 'నాకు తొలిసారి జట్టుకు నాయకత్వం వహించడం కంటే జట్టును గెలిపించడంపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు ' ఇంగ్లండ్ టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ అంటున్నాడు. కరోనా నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత క్రికెట్లో ఇంగ్లండ్- విండీస్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు సౌతాంప్టన్ వేదికగా నిలిచింది. కాగా మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ సందర్భంగా ఇరు జట్ల మధ్య బుధవారం (జూలై 8న) మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ గైర్హాజరీలో తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన స్టోక్స్ లండన్ దినపత్రిక మిర్రర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని పంచకున్నాడు. ('అదే నన్ను ధోని అభిమానిగా మార్చింది') 'రేపు(బుధవారం).. నా జీవితంలో గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత క్రికెట్లో మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే నాకు కెప్టెన్సీ కన్నా జట్టు గెలుపే ముఖ్యం.రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించడం నా కర్తవ్యం.. కానీ దృష్టి మొత్తం మ్యాచ్ గెలవాలనే దానిపైనే ఉంది. ఎందుకంటే ఇంగ్లండ్- విండీస్ల మధ్య జరిగే టెస్టు సిరీస్లో గెలుపొందిన జట్టుకు ప్రఖ్యాత విజ్డెన్ ట్రోపీ అందిస్తారు. 2019లో విండీస్ ఆ ట్రోపినీ ఎగరేసుకపోయింది. అప్పుడు జట్టులో సభ్యునిగా ఉన్నా.. కానీ ఇప్పుడు మాత్రం కెప్టెన్గా ఉన్నా. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లండ్కు కప్ను సాధించి పెట్టాలి.(నువ్వు బహుమతులకు లొంగని వ్యక్తివి) ఈ సమయంలో నేను కోరుకునేది ఒక్కటే.. అదేంటంటే మొదటి మ్యాచ్లో జట్టు గెలుపుకోసం మా ఆటగాళ్లంతా వంద శాతం నిబద్ధతను ప్రదర్శిస్తారని ఆశిస్తున్నా. ప్రస్తుతం నేను ఒక్క మ్యాచ్కే కెప్టెన్గా ఉన్నా.. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్లో ఆధిక్యంలో నిలుస్తాం.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రేపు జరగనున్న మొదటి టెస్టు మ్యాచ్కు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. గ్యాలరీలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరగనుంది.. దీనికి బదులుగా ఆడియెన్స్ రికార్డింగ్ సౌండ్స్ ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో మైదానం నలువైపులా శానిటైజర్ స్టాండ్లను ఉంచారు. -
బయో సెక్యూర్ క్రికెట్ సాధ్యమేనా?
సౌతాంప్టన్: కరోనా సంక్షోభం.. యావత్ ప్రపంచాన్ని నేటికీ అతలాకుతలం చేస్తూనే ఉంది. ఇప్పటికీ కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో ఇక అది తమ జీవన విధానంలో భాగంగానే ప్రపంచం భావిస్తోంది. కరోనా వైరస్కు వ్యాక్సిన్ వచ్చే వరకూ ప్రతీ షెడ్యూల్ను వాయిదా వేస్తూ ముందుకు సాగడం కష్టసాధ్యంగా మారిన క్రమంలో ఎక్కువ శాతం మంది జాగ్రత్తులు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక క్రీడా ఈవెంట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. క్రీడలు జరగాలంటే తప్పనిసరిగా ప్రేక్షకులు ఉండాలి. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్లు జరపడానికి ఆయా క్రీడా సమాఖ్యలు సిద్ధమవుతున్నా అసలు ప్రజలే స్టేడియాలకు వెళ్లే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. ఇప్పటికే క్రికెట్ టోర్నీలు నిర్వహించడానికి సలైవా(లాలాజలాన్ని బంతిపై రద్దడాన్ని)ను బ్యాన్ చేసిన ఐసీసీ.. ఇంకా పకడ్భందీగా మ్యాచ్లు జరపాలని చూస్తోంది. ఇక నుంచి క్రికెట్ మ్యాచ్లు జరిగే వేదికల్లో బయో సెక్యూర్ విధానాన్ని అవలంభించాలని చూస్తోంది. ఇందుకు ఇంగ్లండ్-వెస్టిండీస్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్ను ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి సిద్ధమైంది. క్రికెట్లో బయో సెక్యూర్ ఏమిటి? ప్రాణాంతకమైన ఒక వైరస్ను విస్తరించకుండా చేయడం లేదా.. అసలు అక్కడ వైరస్ ఉనికే లేకుండా చేయడం. దీని కోసం బయో సెక్యూర్ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ వాతావరణాన్ని సృష్టించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)తో పాటు ఐసీసీ కట్టుదిట్టంగా ప్రణాళికలు రచిస్తోంది. ముందు సాధ్యమైనంత వరకూ వేదికల్ని కుదించడం. అంటే ఆటగాళ్లను ఎక్కువ ప్రయాణాలు చేయకుండా నివారించడం ఒకటి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్-వెస్టిండీస్ల తొలి టెస్టు సౌతాంప్టన్లో జరుగుతుండగా, రెండు, మూడు టెస్టులు మాంచెస్టర్లో నిర్వహించనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు లార్డ్స్లో జరగాల్సి ఉండగా దానిని మాంచెస్టర్కు పరిమితం చేశారు. ఈ స్టేడియాలకు అనుబంధంగా హోటళ్లు ఉన్నాయి. దాంతో ఇతరులు హోటళ్లకు రాకుండా చర్యలు తీసుకుంటారు. కేవలం ఆటగాళ్లు మాత్రమే ఉండే విధంగా చూస్తారు. ఆటగాళ్లు సైతం క్రికెటర్లు హోటళ్లు దాటి బయటకు వెళ్లకూడదు. మరొకవైపు మ్యాచ్ జరిగేటప్పుడు ఆటగాళ్లు ఒకరినొకరు తాకకూడదు. సెలబ్రేషన్స్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. కేవలం ఇలా క్రికెట్ మ్యాచ్ బయో సెక్యూర్ వాతావరణంలో జరగాలన్న మాట. జూలై 8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. (‘ఎంతో మెరుగయ్యా.. కానీ నా వైపు చూడలేదు’) ఇది సాధ్యమేనా? మరి బయో సెక్యూర్ విధానం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇంగ్లండ్ వంటి దేశాల్లో దీనికి అనుకూలంగా ఉన్నా వేరే దేశాల్లో మాత్రం ఇది కష్టమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారం అందరికీ అది సాధ్యపడదని అంటున్నారు. ఆటగాళ్లను హెటళ్ల నుంచి బయటకు వెళ్లకుండా చేయడం వరకూ ఓకే కానీ, క్రికెట్ స్టేడియాలకు ఆనుకుని హోటళ్లు అన్ని చోట్ల ఉండవనేది వారి వాదన. మరొకవైపు ఇతరులను హోటళ్లకు అనుమతి లేకుండా చేయాలంటే అందుకు అయ్యే ఖర్చులను క్రికెట్ బోర్డులే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రేక్షకులు లేకండా క్రికెట్ టోర్నీలు నిర్వహించి బోలెడంత నష్టం చూడటానికి సిద్ధమైన బోర్డులు.. అదనపు ఖర్చును భరించడం అంటే తలకు మించిన భారమే అవుతుందని అంటున్నారు. ఈ విధానం అన్ని చోట్లా వర్కౌట్ కాదని రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలు సైతం అభిప్రాయ పడటం ఇక్కడ గమనించాల్సిన అంశం. -
సెంచరీ కొట్టకపోతే వేస్ట్!
సౌతాంప్టాన్: త్వరలో ఇంగ్లండ్తో ఆరంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్లో కనీసం సెంచరీ కొట్టాల్సిందేనని వెస్టిండీస్ ఆల్ రౌండర్ రోస్టన్ ఛేజ్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో బ్యాటింగ్పై సీరియస్గా దృష్టిపెట్టిన ఛేజ్.. ఆ జట్టుపై వారి దేశంలో సెంచరీ చేయాలని తాను ఎప్పుడూ కోరుకుంటానన్నాడు. ఇప్పటివరకూ 32 టెస్టులు ఆడి ఐదు సెంచరీ సాయంతో 1,695 పరుగులు సాధించిన ఛేజ్.. ఒక ఉన్నతస్థాయి బ్యాట్స్మన్గా ఎదగడానికి ఇంగ్లండ్తో సిరీస్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ‘ ఇంగ్లండ్లో సెంచరీ చేయడమంటే అది కచ్చితంగా ప్రత్యేకంగానే నిలుస్తుంది. దాంతో కనీసం సెంచరీ కొట్టడంపై దృష్టి పెట్టా. ఒకవేళ సెంచరీ చేయకపోతే మాత్రం అది నాలో నిరాశనే మిగులుస్తుంది. ఇంగ్లండ్లో ఒక్క సెంచరీ చేస్తే చాలు. ఇక్కడ శతకం సాధిస్తే ఆల్ రౌండర్గా నాకు మరింత ప్రూవ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దాంతో పాటు బ్యాట్స్మన్గా రేటింగ్ కూడా పెరుగుతుంది. (‘నీకు అబ్బాయిలు ఇష్టమా’ వివాదం ముగిసింది!) మా మధ్య ఒక మంచి సిరీస్ జరుగుతుందని, అందులో నేను బ్యాట్తో మెరవాలని కోరుకుంటున్నా. సాధ్యమైనన్ని పరుగులు సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం మా టాపార్డర్ అంత బాలేదు. మా జట్టులోని సభ్యులు 30, అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడటంతో వారి అనుభవం పనికొస్తుంది. మేము ఎప్పుడూ మెరుగు పడటంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. ఈ సిరీస్లో కరీబియన్కు చెందిన జోఫ్రా ఆర్చర్తో పోటీ పడాలని విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నా’ అని ఛేజ్ తెలిపాడు. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్తో సిరీస్కు గురించి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెనాల్ గాబ్రియెల్ మాట్లాడాడు. ప్రధానంగా గతేడాది కరీబియన్ దీవుల్లో జోరూట్ను ‘ నీకు అబ్బాయిలు ఇష్టమా’ అని స్లెడ్జింగ్ చేసి నిషేధానికి గురైన అంశాన్ని ప్రస్తావించాడు. అది ఒక ముగిసిన అధ్యాయమని, ఆ తరహా కామెంట్లు ఇక చేయదలుచుకోలేదన్నాడు. వ్యక్తిగత పరిహాసంలో భాగంగానే రూట్ను ఆ రకంగా స్లెడ్జ్ చేసినట్లు తెలిపాడు. ఇంగ్లండ్తో సిరీస్పై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. ఒకవేళ తనకు తుది జట్టులో చోటు దక్కితే ఓవరాల్గా ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానన్నాడు. జూలై8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. తొలి టెస్టుకు సౌతాంప్టాన్ వేదిక కానుంది. -
అదే రూల్ ఫాలో అవుదామా?
దుబాయ్: ఈ కరోనా కాలంలో ఏదైనా ఒక సంస్థలో తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు వైరస్ సోకితే ఆ వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయడానికి మరొక రిప్లేస్మెంట్ ఉండాలి. ఆ వైరస్ బారిన పడిన వ్యక్తికి బ్యాకప్ ఉండాలి, చాలా సంస్థల్లో ఇదే పద్ధతిని అవలంభిస్తున్నారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, మరి కొందరు సంస్థల్లో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా సోకిన వ్యక్తిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించడమే కాకుండా పనికి ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు. ఇది కత్తి మీద సాము చేసేనట్లే కానీ తప్పడం లేదు. మరి మైదానాల్లో క్రీడా ఈవెంట్లో నిర్వహించాలంటే చాలా పెద్ద సాహసమే చేయాలి. దీనిలో భాగంగా ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్ను ఎలా నిర్వహించాలనే దానిపై ఐసీసీ తర్జన భర్జనలు పడుతోంది. (డబ్బులు వద్దు... భారత్తో టెస్టును చూస్తాం! ) మైదానంలో మ్యాచ్లు జరిగే క్రమంలో ఒక క్రికెటర్కు కరోనా సోకితే పరిస్థితి ఏమిటి అనే దానిపై ఆలోచనలు చేస్తోంది. ఇందుకు కాంకషన్ సబ్స్టిట్యూట్ విధానాన్ని అవలంభించడమే ఉత్తమం అని యోచిస్తోంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక ఆటగాడు గాయపడిన క్రమంలో కాంకషన్ సబ్స్టిట్యూట్(ఆటగాడి స్థానంలో మరొక ఆటగాడు) రూల్ను తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇది అమలవుతుండగా కరోనాకు ఇదే రూల్ను ఫాలో అవ్వడమే ఉత్తమం అని ఐసీసీ పెద్దలు ఆలోచన. ఈ విషయంపై ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ స్టీవ్ ఎల్వర్తీ మాట్లాడుతూ.. ఈ కరోనా కాలంలో కాంకషన్ సబ్స్టిట్యూట్ నిబంధనను ఫాలో అవ్వడమే మంచిదని అంటున్నారు. దీనిపై ఇప్పటికే ఐసీసీతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకంగా టెస్టు మ్యాచ్లకు ఈ విధానాన్ని అవలంభిస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో దీని అవసరం ఉండకపోవచ్చని స్టీవ్ ఎల్వర్తీ పేర్కొన్నారు. వచ్చే నెలలో ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య టెస్టు సిరీస్ జరపడానికి గ్రీన్ సిగ్నల్ పడిన నేపథ్యంలో కరోనా వైరస్పై విస్తృతంగా చర్చిస్తున్నారు. (అక్తర్ వివాదం.. మాకు సంబంధం లేదు!) -
డబ్బులు వద్దు... భారత్తో టెస్టును చూస్తాం!
సౌతాంప్టన్: ఏడాది తర్వాత జరిగే భారత్– ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్పై అభిమానుల్లో ఆసక్తి ఎలా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. పాత షెడ్యూల్ ప్రకారం ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య గురువారంనుంచి తొలి టెస్టు జరగాల్సి ఉంది. తొలి నాలుగు రోజుల టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. అయితే ఇప్పు డు ఈ మ్యాచ్ వేదికను సౌతాంప్టన్కు మార్చారు. దాంతో టికెట్ డబ్బులు వంద శాతం వాపస్ ఇవ్వాలా...లేక వచ్చే ఏడాది ఇక్కడ జరి గే భారత్–ఇంగ్లండ్ టెస్టు కోసం వాటిని అలాగే అట్టిపెట్టాలా అని ఫ్యాన్స్ను కోరింది. వీరిలో 85 శాతం మంది తమకు డబ్బులు వద్దు, సంవత్సరం తర్వాతైనా సరే మ్యాచ్ చూసేందుకు వస్తాం అంటూ అంగీకారాన్ని తెలియజేయడం విశేషం. ఇంగ్లండ్లో టెస్టు క్రికెట్కు ఉండే ఆదరణ ఎలాంటిదో ఇది చూపిస్తోంది. (అందుకే సోషల్ మీడియాకు ధోని దూరంగా!) -
మరీ ఇంత నిర్లక్ష్యమా: హోల్డర్ ఫైర్
సౌతాంప్టన్: వన్డే వరల్డ్కప్లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంపై వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇలా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడానికి తమ బ్యాట్స్మెన్ కారణమని విమర్శించాడు. నిలకడైన ఆట తీరుతో జట్టును మంచి స్థితిలో నిలవడానికి బదులు, నిర్లక్ష్యపు షాట్లతో ఔట్ కావడాన్ని ప్రధానంగా తప్పుబట్టాడు. మరి ఇంత దారుణమైన షాట్ల ఆడితే ఈ తరహా వైఫల్యాలే చూడాల్సి వస్తుందంటూ సహచరులకు చురకలు అంటించాడు. రాబోవు మ్యాచ్ల్లోనైనా నిర్లక్ష్యపు షాట్లను వదిలి మంచి భాగస్వామ్యాలను నమోదు చేయాలని సూచించాడు. ‘స్కోరు బోర్డుపై పోరాడటానికి సరిపడా పరుగులు లేవు. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూనే ఉన్నాం. స్కోరు బోర్డుపై సరైన భాగస్వామ్యమే లేదు. ఇందుకు కారణం తమ ఆటగాళ్లు నిర్లక్ష్యపు షాట్లే. ప్రధానంగా మధ్య ఓవర్లలో మ్యాచ్ మా చేతుల్లోంచి జారిపోయింది. ప్రతీ ఒక్క బ్యాట్స్మన్ మరింత బాధ్యతగా ఆడాలి. ఈ వరల్డ్కప్లో రెండు మ్యాచ్ల్లో బ్యాట్స్మన్ నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనబడింది’ అని హోల్డర్ మండిపడ్డాడు. వెస్టిండీస్తో మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ నిర్దేశించిన 213 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది.