Eoin Morgan
-
ఉత్కంఠ పోరులో.. ఇంగ్లండ్ మాస్టర్స్పై విండీస్ ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో (International Masters League 2025)లో వెస్టిండీస్ మాస్టర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా మాస్టర్స్ను ఓడించిన విండీస్ జట్టు.. తాజాగా ఇంగ్లండ్పై గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గేల్ బృందం గట్టెక్కింది.అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి రిటైర్ అయిన క్రికెటర్ల మధ్య ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ నిర్వహిస్తున్నారు. గతేడాదే మొదలుకావాల్సిన ఈ పొట్టి ఫార్మాట్ లీగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 22న IML మొదలైంది. భారత్తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ మాస్టర్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 24న తమ తొలి మ్యాచ్లో భాగంగా వెస్టిండీస్ మాస్టర్స్(West Indies Masters) ఆస్ట్రేలియా మాస్టర్స్తో తలపడింది. బ్రియన్ లారా(Brian Lara) కెప్టెన్సీలో ఆడిన విండీస్.. ఏడు వికెట్ల తేడాతో కంగారూ జట్టును ఓడించి తొలి విజయం నమోదు చేసింది. గేల్ మెరుపు ఇన్నింగ్స్ఇక గురువారం రాత్రి తమ రెండో మ్యాచ్ ఆడిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ను ఢీకొట్టింది. ఈసారి నవీ ముంబై వేదికగా క్రిస్గేల్ సారథ్యంలో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది.ఓపెనర్లలో డ్వేన్ స్మిత్ 25 బంతుల్లో 35 పరుగులు చేయగా.. గేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 39 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో నర్సింగ్ డియోనరైన్(23 బంతుల్లో 35 నాటౌట్), ఆష్లే నర్స్(13 బంతుల్లో 29) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ మాస్టర్స్ ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.ఇంగ్లండ్ మాస్టర్స్ బౌలర్లలో మాంటీ పనేసర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ షోఫీల్డ్ రెండు, క్రిస్ ట్రెమ్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మాస్టర్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇయాన్ బెల్ ఒక్క పరుగుకే నిష్క్రమించాడు.ఈ క్రమంలో కెప్టెన్, వన్డౌన్ బ్యాటర్ ఇయాన్ మోర్గాన్(13 బంతుల్లో 22)తో కలిసి మరో ఓపెనర్ ఫిల్ మస్టర్డ్(19 బంతుల్లో 31) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు అవుటైన తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు. టిమ్ ఆంబ్రోస్(3), డారెన్ మ్యాడీ(14), టిమ్ బ్రెస్నన్(5) పూర్తిగా విఫలమయ్యారు. 171 పరుగులకు పరిమితంఅయితే, క్రిస్ షోఫీల్డ్(26 బంతుల్లో 32) మాత్రం రాణించగా.. క్రిస్ ట్రెమ్లెట్(19 బంతుల్లో 27 నాటౌట్), స్టువర్ట్ మీకర్(10 బంతుల్లో 24) అతడికి సహకరించారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. View this post on Instagram A post shared by INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) ఇరవై ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ మాస్టర్స్ 171 పరుగుల వద్ద నిలిచిపోయింది. దీంతో వెస్టిండీస్ మాస్టర్స్ ఎనిమిది పరుగుల తేడాతో జయభేరి మోగించింది.విండీస్ బౌలర్లలో జెరోమ్ టేలర్, రవి రాంపాల్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. డ్వేన్ స్మిత్, ఆష్లే నర్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక వెస్టిండీస్ తదుపరి మార్చి 6న శ్రీలంక మాస్టర్స్తో తలపడనుండగా.. ఇంగ్లండ్ మాస్టర్స్ సోమవారం సౌతాఫ్రికా మాస్టర్స్ను ఢీకొట్టనుంది. టాప్లో ఇండియా మాస్టర్స్ఇక ఈ టీ20 లీగ్లో సచిన్ టెండుల్కర్ కెప్టెన్సీలోని భారత జట్టు తొలుత శ్రీలంక మాస్టర్స్పై.. తర్వాత ఇంగ్లండ్ మాస్టర్స్పై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్రేటు(+2.461) పరంగా మెరుగైన స్థితిలో నిలిచిన ఇండియా మాస్టర్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక వెస్టిండీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: IND vs NZ: కివీస్తో మ్యాచ్కు రోహిత్ దూరం.. కెప్టెన్గా అతడు! -
CWC 2023: ధోని, పాంటింగ్ సరసన చేరిన కమిన్స్
వన్డే వరల్డ్కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ కెప్టెన్గా తన తొలి వరల్డ్కప్ సాధించి, ఓ వినూత్న ఘనత సాధించాడు. పెళ్లైన మరుసటి ఏడాదే వన్డే ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా దిగ్గజాల సరసన చేరాడు. గతంలో రికీ పాంటింగ్ (2003), మహేంద్ర సింగ్ ధోని (2011), ఇయాన్ మోర్గన్లు (2019) పెళ్లైన మరుసటి ఏడాదే ప్రపంచకప్ సాధించిన ఆటగాళ్లుగా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా కమిన్స్ వీరి సరసన చేరి అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. Who should get married in 2026?🤔 pic.twitter.com/RtVJ8PGUuf — CricTracker (@Cricketracker) November 20, 2023 కాగా, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నామమాత్రపు స్కోర్కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్ హెడ్ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్ (58 నాటౌట్) సహకారంతో భారత్కు గెలుపును దూరం చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లి (54), కేఎల్ రాహుల్ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ (3/55), హాజిల్వుడ్ (2/60), కమిన్స్ (2/34), మ్యాక్స్వెల్ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. -
CWC 2023: ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్లో ఏదో జరుగుతుంది..!
ప్రస్తుత ప్రపంచకప్లో వరుస పరాజయాలు (6 మ్యాచ్ల్లో 5 అపజయాలు) ఎదుర్కొంటూ ఘోర నిష్క్రమణ దిశగా పయనిస్తున్న ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ మాజీ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ ఇయాన్ మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగి, ఇంత పేలవ ప్రదర్శన కనబర్చిన జట్టును నేనెప్పుడూ చూడలేదని ప్రస్తుత ఇంగ్లండ్ జట్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఏదో అస్థిరత స్పష్టంగా కనిపిస్తుంది.. డ్రెస్సింగ్ రూమ్లో ఏదో జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేశాడు. గెలుపు కోసం జట్టు అవలంబిస్తున్న పద్ధతి, మ్యాచ్లను వారు కోల్పోయిన తీరు చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతుందని బాంబు పేల్చాడు. 2019లో ఇంగ్లండ్కు ప్రపంచకప్ అందించి, ఆ దేశ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మోర్గాన్, సొంత జట్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. మోర్గాన్ చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలీదు కానీ, అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు సభ్యుడు లివింగ్స్టోన్ స్పందించాడు. జట్టు సభ్యులందరికీ మోర్గాన్పై అమితమైన గౌరవం ఉంది. అతను ఈ తరహా వ్యాఖ్యలు చేసి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. గుండెల పై చెయ్యి వేసుకుని చెప్పగలను అతను అన్న విధంగా జట్టులో ఎలాంటి మనస్పర్థలు లేవు. మోర్గాన్ ఊహించిన విధంగా డ్రెస్సింగ్ రూమ్లో ఏమీ జరగడం లేదు. జట్టులో అందరం కలిసికట్టుగా ఉన్నాం. ప్రతి మ్యాచ్లో వంద శాతం విజయాల కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే మాకేదీ కలిసి రావడం లేదంటూ మోర్గాన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చాడు. ఇదిలా ఉంటే, టీమిండియాతో నిన్న జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని (230) కూడా చేధించలేక 100 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్ల్లో కేవలం బంగ్లాదేశ్పై మాత్రమే గెలుపొందిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. బట్లర్ సేన తదుపరి జరిగే 3 మ్యాచ్ల్లో (ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్) రెండు మ్యాచ్ల్లో ఒడినా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత కోల్పోతుంది. కాగా, ప్రపంచకప్లో లీగ్ దశ తర్వాత టాప్-7లో నిలిచే జట్లు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. -
టీమిండియా మాజీ బౌలర్కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక కమిటీలో చోటు
లండన్: ప్రతిష్టాత్మక మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వరల్డ్ క్రికెట్ కమిటీలో భారత మాజీ పేసర్ జులన్ గోస్వామికి స్థానం లభించింది. ఆమెతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, హీతర్ నైట్లను కూడా కమిటీలోకి తీసుకున్నట్లు ఎంసీసీ చైర్మన్ మైక్ గ్యాటింగ్ వెల్లడించారు. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీలో భాగమైన వరల్డ్ క్రికెట్ కమిటీ కొత్తగా వచ్చే సాంకేతిక అంశాలను, వాటిని ఉపయోగించడానికి సంబంధించి తగిన సూచనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంసీసీ ప్రధాన కేంద్రం లార్డ్స్ మైదానంలో ఉంది. లార్డ్స్లోనే జరిగిన ఫైనల్ మ్యాచ్లలో 2019 వన్డే వరల్డ్ కప్, 2017 వన్డే వరల్డ్ కప్లలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఈ టీమ్లకు మోర్గాన్, హీతర్ నైట్ కెప్టెన్లుగా వ్యవహరించారు. గత ఏడాది ఇదే లార్డ్స్ మైదానంలో తన ఆఖరి వన్డే ఆడి జులన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. ఓవరాల్గా మూడు ఫార్మాట్లలో కలిపి 355 వికెట్లు పడగొట్టిన జులన్కు ఈ ఏడాదే ఎంసీసీ గౌరవ సభ్యత్వం దక్కింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
Eoin Morgan: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, ఆ దేశ పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్కు ఇదివరకే (2022 జూన్ 28) గుడ్బై చెప్పిన మోర్గాన్.. తాజాగా అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. మోర్గాన్.. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత మిడిల్సెక్స్ (ఇంగ్లండ్ కౌంటీల్లో), సౌతాఫ్రికా టీ20 లీగ్లో పార్ల్ రాయల్స్ జట్ల తరఫున కొనసాగుతున్నాడు. తాజాగా వీటి నుంచి కూడా వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. pic.twitter.com/1x1w0unGL2 — Eoin Morgan (@Eoin16) February 13, 2023 అయితే క్రికెట్తో తన అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా బ్రాడ్కాస్టర్లతో తన అనుబంధం కొనసాగుతుందని తెలిపాడు. తాను విడుదల చేసిన లేఖలో మోర్గాన్ ఇలా అన్నాడు. విశ్వవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల చాలా నేర్చుకున్నానని, ఈ క్రమంలో చాలామంది వ్యక్తులతో జీవితకాల పరిచయం ఏర్పరచుకున్నానని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత కుటుంబంతో ఎక్కువగా గడపగలుగుతున్నానని.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇంకాస్త అధిక సమయం వారికి కేటాయించే అవకాశం ఉంటుందని అన్నాడు. తన క్రికెట్ జర్నీలో తోడుగా, అండగా ఉన్న అభిమానులకు, సహచరులకు, కుటుంబానికి మోర్గాన్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా, ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మోర్గాన్.. ఇంగ్లండ్ తరఫున తన 13 ఏళ్ల కెరీర్లో 225 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు, అత్యధిక పరుగుల రికార్డులు మోర్గాన్ పేరిటే నమోదై ఉన్నాయి. 2019లో ఇంగ్లండ్కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన 36 ఏళ్ల మోర్గాన్.. గత సంవత్సరకాలంగా ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్తో కలుపుకుని) 16 టెస్ట్లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. -
కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు
''ఎక్కడ పారేసుకున్నావో.. అక్కడే వెతుకు కచ్చితంగా దొరుకుతుంది'' అని మన పెద్దలు అనడం వింటూనే ఉంటాం. ఈ సారాంశం ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్కు సరిగ్గా సరిపోతుంది. టి20 ప్రపంచకప్లో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో కెప్టెన్ బట్లర్తో కలిసి విధ్వంసం సృష్టించాడు. 86 పరుగులు నాటౌట్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైన అలెక్స్ హేల్స్ను టీమిండియా అభిమానులు అంత తొందరగా మరిచిపోలేరు. అసలు విషయమేంటంటే ముందు అలెక్స్ హేల్స్ అసలు ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టులోనే లేడు. స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో గాయపడడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు అలెక్స్ హేల్స్. అయితే హేల్స్ జట్టులోకి రావడం వెనుక ఉన్నది మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్. బట్లర్ తనపై పెట్టుకున్న నమ్మకానికి అలెక్స్ హేల్స్ పూర్తిశాతం న్యాయం చేశాడు. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్లతో జరిగిన మ్యాచ్లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్కు చేర్చాడు. ఇక అలెక్స్ హేల్స్ 2019 వన్డే వరల్డ్ కప్కు ముందు సరదాగా ప్రమాదకరం కాని ‘రిక్రియేషనల్ డ్రగ్స్’ తీసుకున్నాడు. దాంతో అతనిపై 3 వారాల నిషేధం విధించారు. అలా మూడు వారాలు కాస్త మూడు సంవత్సరాలైపోయాయి. హేల్స్ మూడేళ్ల పాటు క్రికెట్కు దూరమవ్వడానికి కారణం మరో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. మోర్గాన్ దృష్టిలో మాత్రం డ్రగ్స్ వ్యవహారం చిన్న తప్పుగా అనిపించలేదు. దీనిని ‘నైతికత’కు సంబంధించిన అంశంగా వాదించిన మోర్గాన్ వరల్డ్ కప్ జట్టులోంచి హేల్స్ను తీసేయించాడు. నిజానికి 2015 వరల్డ్కప్లో ఇంగ్లండ్ ఘోర వైఫల్యం తర్వాత జట్టు పునరుజ్జీవంలో హేల్స్ కూడా కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో ఇంగ్లండ్ రికార్డు స్కోర్లలో అతనిదే ప్రధాన పాత్ర. అయినా సరే మోర్గాన్ మాత్రం తగ్గలేదు. హేల్స్ను జట్టుకు దూరంగా ఉంచి తన మాట నెగ్గించుకున్నాడు. సరిగ్గా చెప్పాలంటే ‘నేను కెప్టెన్గా ఉన్నంత వరకు నువ్వు మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి రాలేవు’ అని సందేశం ఇచ్చాడు. చివరకు అదే జరిగింది. అలా మూడేళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు దూరమైన హేల్స్ మోర్గాన్ రిటైర్మెంట్ కాగానే మళ్లీ జట్టులోకి వచ్చాడు. బట్లర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాకా తన మార్క్ను చూపెట్టాలని అలెక్స్ హేల్స్ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చాడు. ఈ సెప్టెంబర్లో పాకిస్తాన్ టూర్లో హేల్స్ మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ అప్పటికే టి20 ప్రపంచకప్కు జట్టును ఎంపిక చేయగా అందులో హేల్స్ లేడు. కానీ బెయిర్ స్టో గాయపడడం హేల్స్కు కలిసి వచ్చింది. అలా ఒక వరల్డ్కప్ ఆడే చాన్స్ మిస్ అయింది. కానీ మరో వరల్డ్కప్ ఆడే అవకాశం వచ్చింది. వచ్చిన రెండో అవకాశాన్ని హేల్స్ వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకేముంది వెనక్కి తిరిగి చూస్తే హేల్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ నుంచి టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక టీమిండియాతో జరిగిన సెమీస్లో హేల్స్ ఇన్నింగ్స్ను మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా చూశాడు. వరల్డ్కప్లో స్కై స్పోర్ట్స్ కామెంటరీ టీమ్లో భాగంగా ఉన్న ఇయాన్ మోర్గాన్ హేల్స్ బ్యాటింగ్కు చప్పట్లు కొడుతూ అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అందుకే అంటారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మొన్న తిట్టినోడే ఇవాళ మెచ్చుకున్నాడు. అంటూ అభిమానులు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: ఆటలో లోపం లేదు.. టాలెంట్కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో! WC 2022: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’.. రేసులో 9 మంది! కోహ్లితో పాటు -
T20 World Cup 2022: అహో హేల్స్...
‘నేను మళ్లీ ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదు’... సెమీస్ ముగిసిన తర్వాత అలెక్స్ హేల్స్ వ్యాఖ్య ఇది. బహుశా భారత అభిమానులు కూడా అదే జరిగి ఉంటే బాగుండేదని అనుకొని ఉంటారు! మూడేళ్ల పాటు ఆటకు దూరమై పునరాగమనంలో మళ్లీ చెలరేగుతున్న హేల్స్ కథ కూడా ఎంతో ఆసక్తికరం. ► ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలలో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా మూడేళ్ల పాటు అతనికి టీమ్లో చోటు దక్కలేదు. ఆ బాధను అధిగమించి అతను ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్లలో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ ఏడాది జూన్లో మోర్గాన్ రిటైర్ అయ్యాడు... సెప్టెంబర్లో హేల్స్కు టీమ్లో స్థానం లభించింది. పాకిస్తాన్ పర్యటనలో ఆకట్టుకున్న అతను వరల్డ్ కప్లో కీలక ఇన్నింగ్స్లతో తానేంటో నిరూపించాడు. ► పాక్ టూర్ తర్వాత కూడా ఇంగ్లండ్ వరల్డ్ కప్ జట్టులో హేల్స్కు స్థానం దక్కలేదు. అయితే బెయిర్స్టో అనూహ్యంగా గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హేల్స్ను టీమ్లోకి తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత సరైన నిర్ణయమో ఇంగ్లండ్కు ఇప్పుడు తెలిసింది. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్లతో జరిగిన మ్యాచ్లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్కు చేర్చాడు. –సాక్షి క్రీడావిభాగం -
కొత్త కోచ్ వేటలో పంజాబ్ కింగ్స్.. కుంబ్లేకు మంగళం పాడనుందా!
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ షాకివ్వనున్నట్లు సమాచారం. పంజాబ్ కింగ్స్ కోచ్గా అనిల్ కుంబ్లే స్తానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ సెప్టెంబర్తో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కుంబ్లేతో ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ పదవికి ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ సహా హైదరాబాద్ మాజీ కోచ్ ట్రెవర్ బెలిస్ పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి పేరు కూడా పరిశీలినలో ఉంది. మరో వారంలో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ ఎవరనే దానిపై సందిగ్దం వీడనుందని ఫ్రాంచైజీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక కుంబ్లే హయాంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో 42 మ్యాచ్ల్లో 19 విజయాలు అందుకుంది. అనిల్ కుంబ్లే కోచింగ్లో వరుసగా నాలుగు సీజన్లలోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్. నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, ప్లేయర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు. అందుకే కుంబ్లేని సాగనంపి, కొత్త హెడ్ కోచ్ని నియమించుకునేందుకు పంజాబ్ కింగ్స ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఐపీఎల్ ప్రారంభం నుంచి పంజాబ్ కింగ్స్ 2014 మినహా ఒక్కసారి కూడా ఫైనల్ చేరిన దాఖలాలు లేవు. ఎంతమంది కెప్టెన్లు, కోచ్లు, ఆటగాళ్లు మారినా ఆ జట్టు ఆట తీరు మాత్రం మెరుగపడడం లేదు. అంతేకాదు జట్టు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మెగావేలంలోనూ దూకుడు కనబరిచింది పంజాబ్ కింగ్స్. వేలంలో శిఖర్ ధావన్, లియామ్ లివింగ్స్టోన్, జానీ బెయిర్ స్టో, కగిసో రబడా లాంటి పేరున్న ఆటగాళ్లను తీసుకుంది. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా వెళ్లిపోవడంతో.. శిఖర్ ధావన్ను కాదని మయాంక్ అగర్వాల్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్సీ ఒత్తిడిలో పడి మయాంక్ తన బ్యాటింగ్ను పూర్తిగా మరిచిపోయాడు. సీజన్లో కొన్ని మంచి విజయాలు అందుకున్నప్పటికి పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్ల్లో ఏడు విజయాలు.. ఏడు పరాజయాలతో ఆరో స్థానంలో నిలిచి మరోసారి లీగ్ దశకే పరిమితమయింది. మరి కొత్త కోచ్ రాకతో పంజాబ్ కింగ్స్ దశ వచ్చే సీజన్లోనైనా మారుతుందేమో చూడాలి. -
చెమటోడుస్తున్న యువీ.. ఇదంతా ఆ మ్యాచ్ కోసమేనా?
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నెట్స్లో త్రీవంగా చెమటోడుస్తున్నాడు. యువీ బ్యాటింగ్లో శ్రమిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి యువరాజ్ ఇంతకు దేనికోసం ఇంత ప్రాక్టీస్ చేస్తున్నట్లు.. అనే డౌట్ వచ్చిందా. అక్కడికే వస్తున్నాం.భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ ఒక స్పెషల్ మ్యాచ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ జట్టుకు గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, యూసఫ్ పఠాన్ సహా మరికొంత మంది ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. అయితే, యువీ పేరు ఇటీవల ప్రకటించిన జట్టులో లేనప్పటికీ ఈ మేరకు ఈ మాజీ డాషింగ్ ఆల్కరౌండర్ నెట్స్లో శ్రమించడం విశేషం. దీంతో ఆఖరి నిమిషంలోనైనా యువీ ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ జెయింట్స్కు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు. కాగా యువరాజ్ ప్రాక్టీస్కు ముందు ఒక అభిమాని.. ''మీ కార్లో క్రికెట్ కిట్ ఏం చేస్తోంది'' అని అడిగాడు. యువీ స్పందిస్తూ.. నాకు కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఏదైనా మ్యాచ్లో బరిలోకి దిగడానికి ప్రాక్టీస్ చేయడం అవసరం. పేర్కొన్నాడు. ఆ తర్వాత యువరాజ్ తన కిట్ ఓపెన్ చేసి తన ప్యాడ్లను చూపిస్తూ ''వారియర్ ఈజ్ బ్యాక్''.. రానున్న జరగబోయే మ్యాచ్కోసం నేను మంచి ఉత్సాహంతో ఉన్నా.. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్తున్నా అంటూ తెలిపాడు. ఇక ప్రాక్టీస్ ముగిసిన అనంతరం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి బాగా అలసిపోయా.. కొద్దిసేపు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమయింది. ఆల్ ది బెస్ట్.. ఇండియన్ మహరాజాస్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 19 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేశాడు. Didn’t do too bad, did I? 🤪 Super excited for what’s coming up! pic.twitter.com/MztAU5nyZJ — Yuvraj Singh (@YUVSTRONG12) August 16, 2022 Are you as excited about the special India@75 match between India @IndMaharajasLLC and World @WorldGiantsLLC? Announcing the full squads of #Legends in the next tweet! #LegendsLeagueCricket #AzadiKaAmritMahotsav@Souravganguly @Eoin16 @AmritMahotsav @cabcricket @DasSanjay1812 pic.twitter.com/oUZZQaOUFv — Legends League Cricket (@llct20) August 12, 2022 ఇండియా మహరాజాస్: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ సింగ్ జడేజా,ఆర్ పీ సింగ్ , జోగిందర్ శర్మ వరల్డ్ జెయింట్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, హెర్షెల్ గిబ్స్, జాక్వెస్ కల్లిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకద్జా, మష్రాఫ్ మోర్టాజా, అస్గ్హర్ మోర్టాజా, అస్గ్హర్ట్జాన్ అఫ్ట్సన్, , కెవిన్ ఓ'బ్రియన్, దినేష్ రామ్దిన్ చదవండి: ఇండియా మహరాజాస్ కెప్టెన్గా గంగూలీ.. పోటీకి సన్నద్ధం! LLC 2022: ఇండియా మహరాజాస్తో మ్యాచ్.. సనత్ జయసూర్య అవుట్! షేన్ వాట్సన్ ఇన్ -
Sourav Ganguly: ఇండియా మహరాజాస్ కెప్టెన్గా దాదా.. పోటీకి సై!
Sourav Ganguly- September 15th in Legends League Cricket Match: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 తాజా సీజన్ ఓ ప్రత్యేక మ్యాచ్తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం)లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్లో సెప్టెంబరు 15న జరిగే ఈ మ్యాచ్లో సుమారు 10 దేశాలకు చెందిన ఆటగాళ్లు భాగం కానున్నారు. కాగా టీమిండియా మాజీ సారథి, భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్లో ఆడనున్నాడనే సంగతి తెలిసిందే. అయితే, ఫండ్ రైజింగ్ మ్యాచ్లో ఇండియా మహరాజాస్కు దాదా కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు తాజాగా వెల్లడించారు. ఇక వరల్డ్ జెయింట్స్కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. దాదా జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ సహా మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇక వరల్డ్ జెయింట్స్లో వెస్టిండీస్ దిగ్గజం లెండిల్ సిమన్స్, ప్రొటిస్ మాజీ ప్లేయర్ హర్షల్ గిబ్స్, శ్రీలంక లెజెండ్ సనత్ జయసూర్య వంటి 17 మంది మాజీ క్రికెటర్లకు చోటు దక్కింది. ఇండియా మహరాజాస్ జట్టు: సౌరవ్ గంగూలీ(కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్,యూసఫ్ పఠాన్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా(వికెట్ కీపర్), అక్షశ్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగీందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి. వరల్డ్ జెయింట్స్ జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లెండిల్ సిమన్స్, హర్షల్ గిబ్స్, జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్(వికెట్ కీపర్), నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హోమిల్టన్ మసకజ్ద, మష్రాఫ్ మోర్తజా, అస్గర్ అఫ్గన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒ బ్రెయిన్, దినేశ్ రామ్దిన్(వికెట్ కీపర్). 6 పట్టణాల్లో 22 రోజులు.. 15 మ్యాచ్లు ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ తర్వాత సెప్టెంబరు 17 నుంచి అసలు పోటీ ఆరంభం కానుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్-2లో టైటిల్ కోసం నాలుగు జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్లు ఉంటాయి. ఆరు పట్టణాల్లో 22 రోజుల పాటు అక్టోబరు 8 వరకు లీగ్ సాగనుంది. జట్ల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక భారత 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఈ ఎడిషన్ను అంకితమిస్తున్నట్లు లీగ్ కమిషనర్ రవిశాస్త్రి తెలిపాడు.కాగా మొదటి సీజన్ను వరల్డ్ జెయింట్స్ గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: Asia Cup 2022: టీమిండియాతో తొలి మ్యాచ్.. పాకిస్తాన్కు భారీ షాక్! ఇక కష్టమే! View this post on Instagram A post shared by Legends League Cricket (@llct20) -
కొత్త అవతారమెత్తబోతున్న మోర్గాన్.. ఇండియాతో సిరీస్ నుంచి..?
ఇంగ్లండ్ తాజా మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. జూన్ 28న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేసిన మోర్గాన్.. కొద్ది నిమిషాల్లోనే తన ఫ్యూచర్ ప్లాన్ను వెల్లడించాడు. ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కామెంటేటర్గా మారబోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని మోర్గాన్తో ఒప్పందం కుదుర్చుకున్న ‘స్కై’ నెట్వర్క్ ధృవీకరించింది. మోర్గాన్ తమ కామెంటరీ టీమ్లో చేరబోతున్నడని ప్రకటన విడుదల చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్ ఆడబోయే తదుపరి సిరీస్ల నుంచి మోర్గాన్ స్కై నెట్వర్క్లో భాగస్వామిగా ఉంటాడని పేర్కొంది. మొత్తానికి ఇంగ్లండ్ తరఫున క్రికెటర్గా 13 ఏళ్ల కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే మోర్గాన్ మరో పనిని వెతుక్కున్నాడు. త్వరలో జరుగబోయే ఇండియా, సౌతాఫ్రికా సిరీస్ల నుంచి మోర్గాన్ కామెంటేటర్గా తన కెరీర్ మొదలుపెట్టనున్నాడు. ఐర్లాండ్ తరఫున కెరీర్ ప్రారంభించి ఇంగ్లండ్ క్రికెట్కు ఎనలేని సేవలనందించిన మోర్గాన్.. తన హయాంలో ఇంగ్లండ్కు వన్డే ప్రపంచకప్ (2019) అందించాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్తో కలుపుకుని) 16 టెస్ట్లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. చదవండి: Ind Vs Eng: ఇంగ్లండ్తో టెస్టుకు కెప్టెన్ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా? -
బాధాకరమే అయినా.. రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణమిదే.. ఇకపై!
లండన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక శకం ముగిసింది. వన్డే క్రికెట్లో ఆ జట్టు 44 ఏళ్ల కల నెరవేర్చిన నాయకుడు ఇయాన్ మోర్గాన్ ఆటకు గుడ్బై చెప్పాడు. అంతర్జాతీయ వన్డేలు, టి20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు 36 ఏళ్ల మోర్గాన్ ప్రకటించాడు. గత రెండేళ్లుగా బ్యాటింగ్లో ఫామ్ కోల్పోవడంతో పాటు గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో మధురానుభూతులు ఇటీవల నెదర్లాండ్స్తో జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో డకౌట్ అయిన మోర్గాన్... గాయంతో చివరి మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ‘రిటైర్మెంట్కు ఇదే సరైన సమయంగా భావించా. ఇది బాధాకరమే అయినా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. కెరీర్ ఆరంభం నుంచి 2019 ప్రపంచకప్ గెలవడం వరకు నా కెరీర్లో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ప్రస్తుత స్థితిలో జట్టు కూర్పు నుంచి నేను తప్పుకుంటే కొత్తగా వచ్చే కెప్టెన్కు జట్టును రాబోయే వరల్డ్కప్లలో సమర్థంగా నడిపించేందుకు తగినంత సమయం లభిస్తుందని భావించా. దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగుతా’ అని మోర్గాన్ వ్యాఖ్యానించాడు. ఒకదశలో తన దూకుడైన బ్యాటింగ్తో ఇంగ్లండ్కు వెన్నెముకలా నిలిచిన మోర్గాన్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు. 2021 జనవరి నుంచి 48 ఇన్నింగ్స్లో అతను ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్గా ప్రత్యేక అధ్యాయం... డబ్లిన్లో పుట్టిన మోర్గాన్ 16 ఏళ్ల వయసులో సొంత దేశం ఐర్లాండ్ తరఫున అరంగేట్రం చేసి 2007 వన్డే వరల్డ్కప్ ఆడాడు. మొత్తం 23 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఇంగ్లండ్ జట్టుకు మారాడు. మొదటి నుంచి దూకుడైన బ్యాటింగ్ శైలి కలిగిన మోర్గాన్ 2010 టి20 వరల్డ్కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో కూడా సభ్యుడు. అప్పటి నుంచి అతను రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో రెగ్యులర్గా మారిపోయాడు. అయితే అతని కెరీర్లో అసలు మలుపు కెప్టెన్గా వచ్చింది. 2015 వన్డే వరల్డ్కప్కు ముందు అనూహ్యంగా అలిస్టర్ కుక్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో మోర్గాన్ను ఈసీబీ ఎంపిక చేసింది. అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ప్రదర్శన పేలవంగా ఉన్నా... తర్వాతి నాలుగేళ్లలో అతను జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. అప్పటి వరకు వన్డేలను కూడా టెస్టుల తరహాలోనే ఆడుతూ వచ్చిన ఇంగ్లండ్... ఎన్నడూ లేని రీతిలో విధ్వంసకర జట్టుగా ఎదిగింది. వన్డేల్లో అతని హయాంలోనే ఇంగ్లండ్ ఐదుసార్లు 400కు పైగా పరుగులు సాధించగా, టాప్–3 ఆ జట్టు ఖాతాలోనే ఉన్నాయి. 2016 టి20 ప్రపంచకప్లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన మోర్గాన్ కెరీర్ లో 2019 వన్డే వరల్డ్కప్ విజయం అత్యుత్తమ క్షణం. బ్యాటర్గా కూడా పలు ఘనతలు సాధించిన మోర్గాన్ పేరిటే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్ల (17) రికార్డు ఉంది. 16 టెస్టుల తర్వాత తన వల్ల కాదంటూ 2012లోనే అతను ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇయాన్ మోర్గాన్ కెరీర్ ►248 వన్డేల్లో 39.29 సగటుతో 7,701 పరుగులు (14 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు). ►115 అంతర్జాతీయ టి20ల్లో 136.17 స్ట్రయిక్రేట్తో 2458 పరుగులు (14 అర్ధ సెంచరీలు). చదవండి: IND vs IRE: ఉత్కంఠపోరులో టీమిండియా విజయం.. సిరీస్ క్లీన్స్వీప్ "It's been the most enjoyable time of my life." Morgs' reflects on his incredible England career after announcing his international retirement 🏏#ThankYouMorgs — England Cricket (@englandcricket) June 28, 2022 -
రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిన ఇంగ్లండ్ కెప్టెన్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. తాను సాధించిన దాని గురించి గర్వపడుతున్నానని, గొప్ప వ్యక్తులతో తన జ్ఞాపకాలు చిరకాలం గుర్తుపెట్టుకుంటానని తెలిపాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మంగళవారం ట్విటర్ వేదికగా ధృవీకరించింది. You’ve changed English cricket forever. An innovator 🏏 A motivator 💪 A champion 🏆 Your legacy will live on...#ThankYouMorgs ❤️ pic.twitter.com/a32SSvCDXI — England Cricket (@englandcricket) June 28, 2022 మోర్గాన్.. ఇంగ్లీష్ క్రికెట్ రూపురేఖలను మార్చిన గొప్ప క్రికెటర్ అని కొనియాడింది. మోర్గాన్ ఓ ఇన్నోవేటర్, ఓ మోటివేటర్, ఓ ఛాంపియన్ అంటూ ఆకాశానికెత్తింది. నీ వారసత్వం ఇలానే కొనసాగుతుంది.. థ్యాంక్యూ మోర్గాన్ అంటూ ట్విట్లో పేర్కొంది. కాగా, మోర్గాన్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నాడని బ్రిటిష్ మీడియాలో గత కొన్ని రోజులుగా కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. "I'm hugely proud of what I have achieved, but what I will cherish and remember most are the memories I made with some of the greatest people I know."#ThankYouMorgs 👏 — England Cricket (@englandcricket) June 28, 2022 ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మోర్గాన్.. ఇంగ్లండ్ తరఫున తన 13 ఏళ్ల కెరీర్లో 225 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు, అత్యధిక పరుగుల రికార్డులు మోర్గాన్ పేరిటే నమోదై ఉన్నాయి. 2019లో ఇంగ్లండ్కు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన 35 ఏళ్ల మోర్గాన్.. గత సంవత్సరకాలంగా ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. తాజాగా నెదర్లాండ్స్తో జరిగిన వన్డే సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడిన అతను ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్ కెప్టెన్గా సేవలందించిన మోర్గాన్.. కెరీర్ మొత్తంలో (ఐర్లాండ్తో కలుపుకుని) 16 టెస్ట్లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, హాఫ్ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్ సెంచరీల సాయంతో 2458 పరుగులు చేశాడు. చదవండి: అతన్ని ఓపెనర్గా పంపండి.. సెహ్వాగ్లా సక్సెస్ అవుతాడు..! -
ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..!
టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలం పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్లు బ్రిటిష్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గార్డియన్ నివేదిక ప్రకారం.. జూలై తొలి వారంలో అంతర్జాతీయ క్రికెట్కు మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక మోర్గాన్ సారథ్యంలోనే 2019 వన్డే ప్రపంచకప్ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. కాగా తాజాగా నెదర్లాండ్స్తో జరిగిన వన్డే సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడిన మెర్గాన్ కేవలం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ మెర్గాన్ డకౌట్గా వెనుదిరిగాడు. గాయం కారణంగా అఖరి వన్డేకు మోర్గాన్ దూరమ్యాడు. మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ఒక వేళ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే అతడి స్థానంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అదే విధంగా 2015 నుంచి ఇంగ్లండ్ వైస్ కెప్టెన్గా బట్లర్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక ఇంగ్లండ్-భారత మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జూలై 7 న ప్రారంభం కానుంది. చదవండి: Ranji Trophy 2022: 'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను' -
నెదర్లాండ్స్ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. సిరీస్ కైవసం
ఆదివారం ఆమ్స్టెల్వీన్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 36.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాసన్ రాయ్(73), ఫిలిప్ సాల్ట్(77) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో మెర్గాన్ డకౌట్గా వెనుదిరిగాడు, ఇక డచ్ బౌలర్లలో ఆర్యన్ దత్ రెండు, టామ్ కూపర్, ప్రింగల్ తలా వికెట్ సాధించారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 41 ఓవర్లకు కుదించారు. అయితే తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 41ఓవర్లలలో 7 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, రషీద్ చెరో రెండు వికెట్లు, బ్రైడన్ కార్స్, లివింగ్ స్టోన్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్లు మధ్య అఖరి వన్డే బుధవారం జరగనుంది. చదవండి: ENG vs NED: ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. నెదర్లాండ్స్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! -
'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్
నెదర్లాండ్స్తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న చందంగా ఇంగ్లండ్ ఆటతీరు ఉంది. 50 ఓవర్లలో ఇంగ్లండ్ చేసింది 498 పరుగులు.. కోల్పోయింది నాలుగు వికెట్లు. మరో రెండు పరుగులు చేసి ఉంటే 500 పరుగుల మార్క్ అందుకునేదే. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొత్తం ఆడింది నలుగురు బ్యాటర్లు మాత్రమే. ఆ ముగ్గురు బ్యాటర్లు(జాస్ బట్లర్, సాల్ట్, డేవిడ్ మలాన్) సెంచరీలు చేస్తే.. లియామ్ లివింగ్ స్టోన్ అర్థ సెంచరీతో మెరిశాడు. మరి మిగతా ఇద్దరు బ్యాట్స్మెన్లో ఒకరు గోల్డెన్ డక్ అయితే.. మరొకరు ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. గోల్డెన్ డక్ అయింది కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కాగా.. ఒక్క పరుగుకే ఔటయ్యింది జేసన్ రాయ్. తాజాగా మోర్గాన్, రాయ్లను ఉద్దేశించిన టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ''ముగ్గురు సెంచరీలు.. ఒక అర్థసెంచరీ.. ఒక గోల్డెన్ డక్.. ఒక్క పరుగుకే ఔట్.. వారెవ్వా మోర్గాన్, జేసన్ రాయ్ ఏం ఎనర్జీ భయ్యా మీ ఇద్దరిది. వేగంగా ఆడిన నలుగురు క్రికెటర్లకు అంతే పోటీగా.. అదే ఎనర్జీతో అంతే తొందరగా పెవిలియన్ చేరారు. అంతా ఓకే కాని.. మీ ఇద్దరి పరిస్థితి(మోర్గాన్, రాయ్) తలుచుకుంటే త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుకువచ్చింది. అందులో తాము పరీక్షలో ఫెయిలయ్యామనే బాధలో మాధవన్, శర్మాన్ జోషిలు ''నీకు నేను.. నాకు నువ్వు'' అన్నట్లుగా అనుకుంటూ నడుస్తారు.. ఇక్కడ మోర్గాన్.. కూడా రాయ్ భుజం తడుతూ ''బాధపడకూ.. నీకు నేను తోడుగా ఉన్నా రాయ్'' అన్నట్లుగా మీమ్తో జాఫర్ సెటైర్ వేశాడు. Same energy 😅 #ENGvsNED pic.twitter.com/DrrfpT9lNm — Wasim Jaffer (@WasimJaffer14) June 17, 2022 చదవండి: ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి పాక్ బౌలర్కు ఖరీదైన కారు గిఫ్ట్గా.. ఒక్కదానికే! -
టి20 కెప్టెన్గా రోహిత్ శర్మ కొత్త రికార్డు
టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ టి20ల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా రోహిత్ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ టీమిండియా టి20 కెప్టెన్గా స్వదేశంలో 15 విజయాలు అందుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ విజయం రోహిత్కు కెప్టెన్గా 16వ విజయం. తద్వారా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్సన్లను(చెరో 15 విజయాలు) రోహిత్ అధిగమించడం విశేషం. ఇప్పటికే స్వదేశంలో టి20 కెప్టెన్గా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో కోహ్లి(13), ఎంఎస్ ధోని(10)లను రోహిత్ ఎప్పుడో దాటేశాడు. ఓవరాల్గా టి20ల్లో రోహిత్ శర్మకు కెప్టెన్గా 27 మ్యాచ్ల్లో.. ఇది 23వ విజయం కావడం విశేషం. ఇక టీమిండియాకు పొట్టి ఫార్మాట్లో వరుసగా 11వ విజయం. టి20 ప్రపంచకప్లో అఫ్గనిస్తాన్పై గెలుపుతో మొదలైన విజయాల పరంపరను టీమిండియా దిగ్విజయంగా కొనసాగిస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 75; 11 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. చివర్లో షనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది. అనంతరం భారత్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు), జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), సామ్సన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్లు జట్టును గెలిపించాయి. చదవండి: IPL 2022 CSK: అతనితో బ్యాటింగ్ చేయడంలో ఉన్న కిక్కే వేరప్పా.. Rohit Sharma: కోహ్లి రికార్డుకే ఎసరు పెట్టిన హిట్మ్యాన్ -
Ind Vs Wi 3rd T20: టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు
Ind Vs Wi T20 Series- India Clean Sweep Series 3-0: వెస్టిండీస్తో కోల్కతా వేదికగా మూడో టీ20 మ్యాచ్లో గెలుపుతో టీమిండియా సిరీస్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. పర్యాటక విండీస్ జట్టును 3-0తో వైట్వాష్ చేసి సత్తా చాటింది. సూర్యకుమార్ యాదవ్ సూపర్ హాఫ్ సెంచరీ(65)కి తోడు బౌలర్లు హర్షల్ పటేల్(3 వికెట్లు), దీపక్ చహర్(2), వెంకటేశ్ అయ్యర్(2), శార్దూల్ ఠాకూర్(2) అద్భుతంగా రాణించడంతో విజయం టీమిండియా సొంతమైంది. ఇక ఇప్పటికే వన్డే సిరీస్ను కూడా భారత జట్టు 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో మూడు లేదంటే అంతకంటే ఎక్కువ సిరీస్లను వైట్వాష్ చేసిన భారత కెప్టెన్గా హిట్మ్యాన్ చరిత్ర సృష్టించాడు. కాగా 2017లో కోహ్లి గైర్హాజరీలో రోహిత్ సారథ్యంలోని రోహిత్ సేన శ్రీలంకను క్లీన్స్వీప్ చేసింది. అదే విధంగా 2018లో వెస్టిండీస్ను వైట్వాష్ చేసింది. ఇక విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న క్రమంలో రోహిత్ శర్మ పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్(2021)తో సిరీస్ను వైట్వాష్(3-0) చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ జాబితాలో పాకిస్తాన్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్(5 విజయాలు), అఫ్గనిస్తాన్ ఆటగాడు అస్గర్ అఫ్గర్(4) రోహిత్ కంటే ముందు వరుసలో ఉన్నారు. కోహ్లిని దాటేశాడు... అదే విధంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును కూడా రోహిత్ ఈ మ్యాచ్ విజయం ద్వారా అధిగమించాడు. స్వదేశంలో అత్యధిక టీ20 మ్యాచ్లు గెలిచిన కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. సొంతగడ్డ మీద రోహిత్ సారథ్యంలో 15 మ్యాచ్లు ఆడిన టీమిండియా 14 మ్యాచ్లు గెలిచింది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్సన్ 15 విజయాలతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. చదవండి: Rahul Dravid-Wriddhiman Saha: సాహా వ్యాఖ్యలపై స్పందించిన ద్రవిడ్... అతడంటే నాకు గౌరవం ఉంది.. కానీ కాస్త.. 𝐓𝐇𝐀𝐓. 𝐖𝐈𝐍𝐍𝐈𝐍𝐆. 𝐅𝐄𝐄𝐋𝐈𝐍𝐆 ☺️ ☺️ What a performance this has been by the @ImRo45 -led #TeamIndia to complete the T20I series sweep! 🏆 👏#INDvWI | @Paytm pic.twitter.com/L04JzVL5Sm — BCCI (@BCCI) February 20, 2022 -
ఆర్సీబీ కెప్టెన్గా ఇయాన్ మోర్గాన్!
ఐపీఎల్-2022 మెగా వేలంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కోసం మూడు జట్లు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. వేలానికి ముందు కోల్కతా నైట్రైడర్స్ మోర్గాన్ను రీటైన్ చేసుకోలేదు. వేలంలో 1.5 కోట్ల బేస్ ఫ్రైజ్కు తన పేరును మోర్గాన్ నమోదు చేసుకున్నాడు. కాగా గత కొద్ది రోజులు నుంచి ఫామ్లో లేకపోయినా, అతడి కెప్టెన్గా అనుభవం ఉండడంతో అతడిని ఫ్రాంచైజీలు దక్కించుకోనేందుకు మక్కువ చూపుతున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ వేలంలో మోర్గాన్ను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్ అనంతరం విరాట్ కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోర్గాన్ను కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మోర్గాన్ను సొంతం చేసుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ మెగా వేలానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బీసీసీఐ వేలాన్ని నిర్వహించనుంది. ఈ మెగా వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గోనబోతున్నారు. చదవండి: IND vs WI 3rd ODI: మొన్న ప్రపంచ రికార్డు.. ఈరోజేమో మరీ ఇలా.. నిరాశపరిచావు కదా! -
ఇంగ్లండ్ కెప్టెన్గా మోయిన్ అలీ.. మోర్గాన్ దూరం
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మిగితా రెండు టీ20ల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం అధికారికంగా ధృవీకరించింది. "తొడ కండరాల గాయం కారణంగా మిగిలిన సిరీస్కు మోర్గాన్ దూరం కానున్నాడు" అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇక మోర్గాన్ దూరం కావడంతో మోయిన్ అలీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా మూడో టీ20 మ్యాచ్కు కూడా మోర్గాన్ దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో అలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో విండీస్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్లో ఘోర పరజాయం చెందిన ఇంగ్లండ్.. రెండో టీ20లో అనూహ్యంగా 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఇక మూడో టీ20లో ఇంగ్లండ్ ఓటమి చెందింది. కగా ఆడిన రెండు మ్యాచ్ల్లో మోర్గాన్ అంతగా రాణించలేకపోయాడు. కేవలం 30 పరుగులు మాత్రమే సాధించాడు. చదవండి: తెర మీదే అయినా... తగ్గేదే లే! -
Eng Vs WI T20 Series: 16 మంది సభ్యులతో కూడిన జట్టు ప్రకటించిన ఇంగ్లండ్.. కొత్తగా
England Tour OF West Indies- T20 Series Squad: వచ్చే ఏడాది ఆరంభంలో వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో లెఫ్టార్మ్ సీమర్ డేవిడ్ పైన్, జార్జ్ గార్టన్లకు చోటు దక్కింది. విండీస్ టూర్ సందర్భంగా వీరు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నారు. ఇక ఈ సిరీస్కు పాల్ కోలింగ్వుడ్ తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. మార్కస్ ట్రెస్కోథిక్ అసిస్టెంట్ కోచ్గా విధులు నిర్వర్తించనున్నాడు. ఈ విషయం గురించి కోలింగ్వుడ్ మాట్లాడుతూ... ‘‘పటిష్టమైన జట్టును ఎంపిక చేశాం. ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాన్ని సమతుల్యం చేసుకుంటూ ఆటగాళ్లను సెలక్ట్ చేశాం’’అని చెప్పుకొచ్చాడు. కాగా విండీస్ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో 11 మంది టీ20 ప్రపంచకప్-2021 ఈవెంట్లో పాల్గొన్న ఆటగాళ్లు ఉండటం గమనార్హం. వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ ప్రకటించిన జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, టామ్ బాంటన్, సామ్ బిల్లింగ్స్, లియామ్ డాసన్, జార్జ్ గార్టన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, సకీబ్ మహమూద్, టైమల్ మిల్స్, డేవిడ్ పైన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లే, జేమ్స్ విన్సే. ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్- టీ20 సిరీస్- షెడ్యూల్: ►తొలి మ్యాచ్- జనవరి 22 ►రెండో మ్యాచ్- జనవరి 23 ►మూడో మ్యాచ్- జనవరి 26 ►నాలుగో మ్యాచ్- జనవరి 29 ►ఐదో మ్యాచ్- జనవరి 30. చదవండి: Kapil Dev: కపిల్లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్ గెలుస్తారు! రోహిత్.. ఇంకా కోహ్లి... Justin Langer: మూడు ఫార్మాట్లలో కొనసాగుతా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడమే లక్ష్యం: హెడ్కోచ్ -
మేము ఆ పని చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం...
Eoin Morgan Reacts After Semifinal Loss vs New Zealand: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా తొలి సెమిఫైనల్లో ఇంగ్లండ్పై విజయం సాధించి న్యూజిలాండ్ తొలి సారిగా ఫైనల్లో అడుగు పెట్టింది. కాగా ఈ ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ఏమన్నాడంటే.. "ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే మాకు తెలుసు ప్రత్యర్ధి జట్టు అన్ని విధాలుగా పటిష్టంగా ఉందని.. ఈ మ్యాచ్లో పూర్తి క్రెడిట్ న్యూజిలాండ్ జట్టుకే ఇవ్వాలి.ఎందుకంటే వాళ్లు మా జట్టుకన్నా బాగా ఆడారు. కివీస్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. వాళ్ల స్పిన్నర్లు కూడా అద్బుతంగా రాణించారు. ఈ టోర్నీలో మేము కూడా చాలా కష్టపడ్డాం. ఆ క్రెడిట్ అంతా మా బాయ్స్కు ఇవ్వాలి. ఈ మ్యాచ్లో 17వ, 18వ ఓవర్ల వరకు విజయం మావైపే ఉందని అనుకున్నాం. కానీ ఒక్క ఓవర్లో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. సాధారణంగా మా జట్టు సిక్స్లు బాగా కొట్టగలదు. కానీ ఈ మ్యాచ్లో సిక్సర్లు కొట్టడానికి చాలా కష్టపడ్డాము. ప్రత్యర్ధి ముందు మేము మెరుగైన లక్ష్యాన్ని ఉంచాము. కానీ న్యూజిలాండ్ జట్టు మా కన్నా నిలకడగా, ఉత్తమంగా ఆడింది. ముఖ్యంగా జెమ్మీ నీషమ్ అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు" అని మ్యాచ్ అనంతరం మోర్గాన్ పేర్కొన్నాడు. మరో వైపు పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమిఫైనల్ మ్యాచ్ గురువారం(నవంబర్-11) జరగనుంది. చదవండి: Pak Vs Aus: ఆసీస్తో సెమీస్కు ముందు పాకిస్తాన్కు భారీ షాకులు.. వాళ్లు లేకుండా ఫైనల్ చేరడం కష్టమే?! We’re gutted, but we’re proud. One game will never define us. We’ll keep pushing our boundaries, keep entertaining and keep striving to make more history. In 2022, we will be right there again. pic.twitter.com/Mk37DR8ExH — England Cricket (@englandcricket) November 10, 2021 -
ENG vs NZ: మిచెల్ మెరుపులు.. ఫైనల్కు తొలిసారిగా న్యూజిలాండ్
మిచెల్ మెరుపులు.. ఫైనల్కు న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఓపెన్ డారెల్ మిచెల్(42 బంతుల్లో 72, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టును తొలిసారి ఫైనల్ చేర్చాడు. కాగా ఓపెనర్ మార్టిన్ గప్టిల్(4), కెప్టెన్ కేన్ విలియమ్సన్(5) తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ తర్వాత వచ్చిన డెవన్ కాన్వే 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో జేమ్స్ నీషమ్ 11 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్తో 27 పరుగులు కొట్టి కివీస్ను ఒత్తిడి నుంచి బయటపడేశాడు. ఇక ఓపెనర్ డారెల్ మిచెల్ ఇన్నింగ్స్ ఆధ్యంతం నిలకడైన ఇన్నింగ్స్ కొనసాగించి జట్టును గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లివింగ్స్టోన్ చెరో 2 వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ ఒక వికెట్ తీశాడు. ఇక టి20 ప్రపంచకప్ల్లో న్యూజిలాండ్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఇక గురువారం పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న సెమీఫైనల్ 2 విజేతతో ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. కాన్వే(46) ఔట్.. న్యూజిలాండ్ 102/3 ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ కాన్వే(46) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. డారిల్ మిచెల్, కాన్వేలిద్దరు కలసి మూడో వికెట్కు 82 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. ఈ దశలో కాన్వే లివింగ్స్టోన్ బౌలింగ్లో అనవసర షాట్కు యత్నించి స్టంప్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం మిచెల్ 44, ఫిలిప్స్ 1 పరుగుతో ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 27 పరుగులు, డెవన్ కాన్వే 26 పరుగులతో ఆడుతున్నారు. కేన్ విలియమ్సన్(5) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన కివీస్ క్రిస్ వోక్స్ బౌలింగ్లో కేన్ విలియమ్సన్(5) ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 12, డెవన్ కాన్వే 14 పరుగులతో ఆడుతున్నారు. గప్టిల్(4) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(4) రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్లో గప్టిల్ మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 1 ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 166/4.. న్యూజిలాండ్ టార్గెట్ 167 న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ వన్డౌన్లో వచ్చిన డేవిడ్ మలాన్(42) రాణించాడు. మలాన్ ఔటైన అనంతరం వచ్చిన మొయిన్ అలీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అలీ ఓవరాల్గా 51 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, ఇష్ సోధీ, ఆడమ్ మిల్నే, నీషమ్ తలా ఒక వికెట్ తీశారు. 16 ఓవర్లలో ఇంగ్లండ్ 119/3 సమయం:20:52.. 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. మొయిన్ అలీ 32, లివింగ్స్టోన్ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 42 పరుగులు చేసిన మలాన్ సౌథీ బౌలింగ్లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డేంజర్ మ్యాన్ బట్లర్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సమయం: 20:15.. ఓపెనర్ జాస్ బట్లర్(29) రూపంలో ఇంగ్లండ్ కీలక వికెట్ కోల్పోయింది. ఇష్ సోథీ బౌలింగ్లో బట్లర్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. మలన్ 10, మొయిన్ అలీ 2 పరుగులతో ఆడుతున్నారు. కేన్ మామ సూపర్ క్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సమయం: 20:00.. మిల్నే బౌలింగ్లో కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ క్యాచ్కు ఓపెనర్ బెయిర్ స్టో(13) వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. బట్లర్ 29, మలాన్ 5 పరుగుతో ఆడుతున్నారు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ 29/0 సమయం: 19:47.. న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. బట్లర్ 17, బెయిర్ స్టో 7 పరుగులతో ఆడుతున్నారు. అబుదాబి: టి20 ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ 12 దశలో ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించిన ఇంగ్లండ్ ఫెవరెట్గా కనిపిస్తుంది. ఇక గ్రూఫ్-2లో న్యూజిలాండ్ పాకిస్తాన్పై ఓటమి మినహా మిగతా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి సెమీస్కు అర్హత సాధించింది. అబుదాబి వేదికగా ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ మాత్రం ఒకదాంట్లో గెలిచి.. మరొకటి ఓడిపోయింది. ఇక ముఖాముఖి పోరులో టి20ల్లో 21సార్లు తలపడగా.. ఇంగ్లండ్ 13సార్లు.. న్యూజిలాండ్ 7 సార్లు గెలిచాయి. ఇక టి20 ప్రపంచకప్ల్లో ఐదుసార్లు తలపడగా.. ఇంగ్లండ్ మూడుసార్లు.. న్యూజిలాండ్ రెండుసార్లు విజయం సాధించాయి. ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంలో జాస్ బట్లర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అటు న్యూజిలాండ్ బ్యాటింగ్ అంతంతమాత్రంగానే కనిపిస్తుంది. ఇక చివరిసారి ఐసీసీ మేజర్ ఈవెంట్ పరంగా చూస్తే 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ : జోస్ బట్లర్(వికెట్ కీపర్), జానీ బెయిర్స్టో, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్స్టోన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్ -
ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా!
New Zeland May Take Revenge On England For 2019 ODI World Cup Final Loss.. టి20 ప్రపంచకప్-2021 నాకౌట్ పోరుకు వచ్చింది. ఫైనల్ బరిలో నిలిచేందుకు నాలుగు జట్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ముందుగా ‘కప్’ వేటలో నిలిచేదెవరో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో తేలుతుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య ఆసక్తికర సమరానికి అబుదాబి వేదిక కాగా... ఈ సారైనా ప్రపంచకప్ ముచ్చట తీర్చుకోవాలని న్యూజిలాండ్ తహతహలాడుతోంది. ఫైనల్లో ఆడుగుపెట్టేందుకు... ఇంగ్లండ్ అడ్డంకి తొలగించుకునేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ప్రధాన ఆటగాళ్లు జేసన్ రాయ్, టైమల్ మిల్స్ గాయాలతో దూరమవడాన్ని అనుకూలంగా మలచుకోవాలని, గత రెండు పరాజయాలకు గట్టి దెబ్బ కొట్టాలని న్యూజిలాండ్ చూస్తోంది. బట్లర్కు జోడీగా బెయిర్స్టో కీలక ఆటగాళ్లు గాయాలపాలవడం ఇంగ్లండ్ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. అయితే అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ముందడుగు వేయాలనే నిశ్చయంతో ఉంది. డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ కాలిపిక్క గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఫామ్లో ఉన్న బట్లర్కు జోడీగా బెయిర్స్టో ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. మరోవైపు ఐసీసీ ప్రపంచకప్ టోర్నీల్లోనే కాదు... గడిచిన 21 టి20 మ్యాచ్ల్లోనూ ఇంగ్లండ్దే పైచేయి. పొట్టి పోరులో కివీస్ ఏడు గెలిస్తే, ఇంగ్లండ్ 12 మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. రెండు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. జోరు మీదున్న కివీస్ లీగ్ దశలో ఇంగ్లండ్ అన్నీ గెలిచి ఆఖరి మ్యాచ్లో ఓడితే... కివీస్ తొలి మ్యాచ్ ఓడాక మిగతావన్నీ గెలుస్తూ ఆత్మవిశ్వాసంతో ఉంది. పైగా ప్రపంచకప్లకు అడ్డంకిగా మారిన ఇంగ్లండ్ను దెబ్బతీయాలనే లక్ష్యంతో విలియమ్సన్ బృందం ఉంది. కెప్టెన్ విలియమ్సన్ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ, ఇన్నింగ్స్ను కుదుటపరుస్తూ జట్టును నడిపిస్తున్నాడు. ఓపెనింగ్లో గప్టిల్, మిచెల్ మెరుపుదాడి చేస్తే ఆఖరి ఓవర్లలో అదరగొట్టేందుకు... తడబడితే ఆదుకునేందుకు ఫిలిప్స్, నీషమ్లతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్ తన పేస్ బౌలింగ్తో నిప్పులు చెరుగుతున్నాడు. సౌతీ కూడా రాణిస్తున్నాడు. వీరిద్దరు ఇంగ్లండ్ ఆరంభాన్ని చెదరగొడితే కివీస్ పట్టుబిగించడం ఖాయం. చదవండి: Virat Kohli: ఫెయిలయ్యుండొచ్చు.. కానీ కెప్టెన్ అంటే కోహ్లినే ఐసీసీ ఈవెంట్లలో ఇంగ్లండ్ , న్యూజిలాండ్ మద్య మ్యాచ్ అనగానే మొదటగా అందరికి గుర్తుకు వచ్చేది 2019 వన్డే వరల్డ్కప్ ఫైనల్. ఆ ఫైనల్లో ఇరు జట్లు సమానంగా స్కోర్లు చేయడంతో మ్యాచ్ టై అయింది. అలా సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు 15 పరుగులే చేయడంతో మరోసారి టై అయింది. దీంతో ఇన్నింగ్స్లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ను ఐసీసీ విజేతగా ప్రకటించింది. అలా న్యూజిలాండ్కు వన్డే వరల్డ్కప్లో నిరాశే మిగిలింది. తాజాగా టి20 ప్రపంచకప్ 2021లో సెమీస్లో మరోసారి ఈ ఇద్దరు తలపడుతుండడంతో కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. పిచ్, వాతావరణం బ్యాటింగ్ పిచ్ ఇది. అఫ్గాన్పై భారత్ టోర్నీలోనే అత్యధిక 210/2 స్కోరు ఇక్కడే చేసింది. అందుకేనేమో కివీస్ స్పిన్నర్ సాన్ట్నర్ బౌలర్లకు కష్టమే అన్నాడు. వాతావరణంతో ఇబ్బంది లేదు. వాన ముప్పేమీ లేదు. చదవండి: T20 WC 2021: క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్న్యూస్ -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్..
Eoin Morgan Becomes The Most Successful T20I Captain Of All Time: అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ సారధి ఇయాన్ మోర్గాన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిక కెప్టెన్గా (43 విజయాలు) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా శ్రీలంకపై గెలుపుతో మోర్గాన్ ఈ ఘనత సాధించాడు. మోర్గాన్కు ముందు ఈ రికార్డు(42 విజయాలు) అస్గర్ అఫ్గాన్ (అఫ్గానిస్తాన్), ఎంఎస్ ధోని (భారత్)ల పేరిట సంయుక్తంగా ఉండేది. శ్రీలంకపై ఇంగ్లండ్ గెలుపుతో మోర్గాన్ వారి రికార్డును బద్దలు కొట్టాడు. మోర్గాన్ ఈ ఘనతను సాధించేందుక 69 మ్యాచ్లు తీసుకోగా.. ధోని 72, అస్గర్ అఫ్గాన్ 52 మ్యాచ్ల్లో సాధించారు. ఇదిలా ఉంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విజయవంతమైన కెప్టెన్గా కొనసాగుతున్న మోర్గాన్.. ఇంగ్లండ్ జట్టును 2019 వన్డే ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లో మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఆడిన 4 మ్యాచ్ల్లో విజయాలు సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. చదవండి: Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్.. ఛీ ఇంతకు దిగజారుతారా? -
మ్యాచ్ గెలవడంతో పాటు రికార్డుల మోత మోగించింది
England Breaks Records Vs SL Match T20 World Cup 2021.. టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటవడంతో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి దర్జాగా సెమీస్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ విజయం సాధించడంతో పాటు పలు రికార్డులను బద్దలు కొట్టింది. జాస్ బట్లర్ సెంచరీతో మొదలుకొని.. విజయం సాధించడం వరకు ఇంగ్లండ్ సాధించిన రికార్డులు పరిశీలిద్దాం. చదవండి: టి20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్ ►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక విజయాలు సాధించిక కెప్టెన్గా ఇయాన్ మోర్గాన్ (43 విజయాలు) రికార్డు నెలకొల్పాడు. 42 విజయాలతో అస్గర్ అఫ్గాన్ (అఫ్గానిస్తాన్), ఎమ్మెస్ ధోని (భారత్) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును మోర్గాన్ బద్దలు కొట్టాడు. ►టి20 ప్రపంచకప్లలో ఇది 9వ సెంచరీ. బట్లర్కు ముందు గేల్ (2 సార్లు), మెకల్లమ్, అహ్మద్ షహజాద్, రైనా, హేల్స్, తమీమ్, జయవర్ధనే ఈ ఘనత సాధించారు. ►అంతర్జాతీయ పురుషుల క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా బట్లర్ రికార్డు సృష్టించాడు. మహిళల విభాగంలో గత ఏడాది హీథెర్ నైట్ ఇంగ్లండ్ తరఫున ఈ ఘనత సాధించింది. ►అంతర్జాతీయ టి20ల్లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన నాలుగో క్రికెటర్ బట్లర్. గతంలో అలెక్స్ హేల్స్ (116 నాటౌట్; శ్రీలంకపై 2014లో), డేవిడ్ మలాన్ (103 నాటౌట్; న్యూజిలాండ్పై 2019లో), లివింగ్స్టోన్ (103; పాకిస్తాన్పై 2021లో) ఈ ఘనత సాధించారు. ►టి20 ప్రపంచకప్లోని ఓ మ్యాచ్లో అత్యధిక బంతులు ఆడిన బ్యాటర్గా జోస్ బట్లర్ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్లో బట్లర్ 67 బంతులు ఎదుర్కొన్నాడు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ (66 బంతులు; భారత్పై 2010లో), మర్లోన్ సామ్యూల్స్ (66 బంతులు; ఇంగ్లండ్పై 2016లో) పేరిట సంయుక్తంగా ఉంది. చదవండి: T20 World Cup 2021 IND Vs NZ: కోహ్లి వ్యూహాలను ఏకి పారేసిన గంభీర్ -
T20 WC 2021: బట్లర్ ఊచకోత.. ఇంగ్లండ్ దర్జాగా సెమీస్కు
England Beat Sri Lanka By 26 Runs Enter Semifinal T20 WC 2021.. నాలుగు మ్యాచ్లలో నాలుగు విజయాలు... ఎదురులేని ఆటతో చెలరేగుతున్న ఇంగ్లండ్ మరో గెలుపుతో అధికారికంగా టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బట్లర్ మెరుపు శతకంతో ఇంగ్లండ్కు మంచి స్కోరు అందించగా... అనంతరం బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సమష్టిగా సఫలమయ్యారు. సోమవారం జరిగిన గ్రూప్–1 సూపర్–12 మ్యాచ్లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఈ టోర్నీలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలవగా... కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (36 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. అనంతరం లంక 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. హసరంగ (21 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, జోర్డాన్ రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. చదవండి: టి20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్ రాణించిన మోర్గాన్... పవర్ప్లేలో 36 పరుగులు... సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 47 పరుగులే... తర్వాతి 4 ఓవర్లలో 36 పరుగులు రాబట్టి కొంత ఊపు... ఆపై చివరి 6 ఓవర్లలో ఏకంగా 83 పరుగులు! ఇంగ్లండ్ బ్యాటింగ్ ఇలా వేర్వేరు దశలుగా సాగింది. ఆరు ఓవర్లలోపే ఆ జట్టు జేసన్ రాయ్ (9), మలాన్ (6), బెయిర్స్టో (0) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో బట్లర్, మోర్గాన్ కలిసి జట్టును ఆదుకున్నారు. లంక స్పిన్నర్లు హసరంగ, తీక్షణ కట్టుదిట్టమైన బంతులకు పరుగులు రావడం కష్టంగా మారిపోగా, ఇద్దరు బ్యాటర్లు కూడా అనవసరపు దూకుడు ప్రదర్శించకుండా సంయమనంతో ఇన్నింగ్స్ను నడిపించారు. సుదీర్ఘ కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న మోర్గాన్ కూడా తడబడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఒకదశలో 21 బంతుల్లో అతను 10 పరుగులే చేశాడు. ఎట్టకేలకు తాను ఎదుర్కొన్న 22వ బంతికి తొలి ఫోర్ కొట్టిన కెప్టెన్... ఆ తర్వాత కాస్త ధాటిని ప్రదర్శించి బంతులు, పరుగుల లెక్కను సమం చేశాడు. బట్లర్ సూపర్... గత మ్యాచ్లో ఆస్ట్రేలియాపై అజేయంగా 71 పరుగులు చేసిన బట్లర్ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. పరిస్థితిని బట్టి అతను కూడా ఆరంభంలో నెమ్మదిగా ఆడినా చివర్లో చెలరేగిపోయాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో జాగ్రత్తపడి పేసర్లపై సత్తా చాటాడు. కరుణరత్నే ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన బట్లర్ 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి హాఫ్ సెంచరీకి అతనికి కేవలం 22 బంతులే సరిపోయాయి. కుమార ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన బట్లర్, ఆపై షనక ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదాడు. ఇన్నింగ్స్ చివరి బంతి వేయడానికి ముందు 95 వద్ద నిలిచిన అతను... ఆఖరి బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ బాది టి20 కెరీర్లో తొలి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. లంక స్పిన్నర్లు హసరంగ, తీక్షణ బౌలింగ్లో 24 బంతులు ఆడి 12 పరుగులే చేసిన బట్లర్, పేసర్ల బౌలింగ్లో 43 బంతుల్లో 89 పరుగులు బాదాడంటే అతని వ్యూహం ఎలాంటిదో అర్థమవుతుంది. చదవండి: T20 WC 2021: కోహ్లికి జట్టు నుంచి సపోర్ట్ లేదా?! కీలక భాగస్వామ్యం... ఛేదనలో లంక కూడా తడబడింది. పవర్ప్లేలోనే ఆ జట్టు నిసాంక (1), అసలంక (21), కుశాల్ పెరీరా (7) వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ఆపై అవిష్క (13), రాజపక్స (26) కూడా అవుట్ కావడంతో 76 వద్దే సగం జట్టు పెవిలియన్ చేరింది. భారీ ఓటమి ఖాయమనుకున్న ఈ దశలో హసరంగ, షనక (26; 2 ఫోర్లు, సిక్స్) పోరాడారు. దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లోనే 53 పరుగులు జోడించడంతో లంక విజయంపై ఆశలు రేగాయి. అయితే రాయ్, బిల్లింగ్స్ ‘ర్యాలీ’ క్యాచ్తో హసరంగ అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. 14 బంతుల వ్యవధిలో 8 పరుగులకే చివరి 5 వికెట్లు కోల్పోయి లంక పరాజయంపాలైంది. -
AUS Vs ENG: బట్లర్ ఊచకోత.. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఘనవిజయం
ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఘనవిజయం.. సెమీస్ బెర్తు దాదాపు ఖరారు సమయం: 22:27.. టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 11.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ జాస్ బట్లర్ (32 బంతుల్లో 72 పరుగులు; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆసీస్ బౌలర్లను ఊచకోత కోయడంతో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకున్నట్లే. మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఒక్క విజయం సాధిస్తే సెమీస్లో అడుగుపెడుతుంది. అంతకముందు ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్స్ బెంబెలెత్తిపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేక నానా అవస్థలు పడింది. ఆరోన్ ఫించ్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగిలిన బ్యాటర్స్ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి ఐదుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3, టైమల్ మిల్స్, క్రిస్ వోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు. సమయం: 22:15.. జాస్ బట్లర్ మెరుపు అర్థశతకంతో మెరిశాడు. 25 బంతుల్లోనే 4 ఫోర్లు.. 4 సిక్సర్లతో అర్థశతకం మార్క్ను అందుకున్నాడు. కాగా 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ చేధిస్తుంది. ప్రస్తుతం 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. సమయం: 22:00.. జేసన్ రాయ్(22) రూపంలో ఇంగ్లండ్ 66 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సమయం: 21:55.. ఇంగ్లండ్ ఓపెనర్ జాస్ బట్లర్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించడంతో విజయానికి మరింత దగ్గరైంది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ప్రస్తుతం 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. రాయ్ 22 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. సమయం: 21:41.. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. రాయ్ 20, బట్లర్ 24 పరుగులతో ఆడుతున్నారు. ఆస్ట్రేలియా 125 ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ 126 సమయం: 21:15.. టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్స్ బెంబెలెత్తిపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేక నానా అవస్థలు పడింది. ఆరోన్ ఫించ్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగిలిన బ్యాటర్స్ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి ఐదుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3, టైమల్ మిల్స్, క్రిస్ వోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు. సమయం: 21:05.. ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. అంతకముందు ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. కష్టాల్లో ఆసీస్.. 51 పరుగులకే సగం వికెట్లు డౌన్ సమయం 20:21.. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తుండటంతో ఆసీస్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. 12 ఓవర్లలో కేవలం 51 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. లివింగ్స్టోన్ వేసిన 11.4వ ఓవర్లో జేసన్ రాయ్ క్యాచ్ పట్టడంతో మాథ్యూ వేడ్(18 బంతుల్లో 18; 2 ఫోర్లు) పెవిలియన్ బాట పట్టాడు. క్రీజ్లో ఆరోన్ ఫించ్(22), ఆస్టన్ అగర్ ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు పడగొట్టగా.. లివింగ్స్టోన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్లకు తలో వికెట్ దక్కింది. 9 ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. ఫించ్ 18, వేడ్ 9 పరుగులతో ఆడుతున్నారు. మ్యాక్స్వెల్(6) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా సమయం: 19:51.. 15 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. వోక్స్ బౌలింగ్లో మ్యాక్స్వెల్(6) ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ 7, స్టోయినిస్ క్రీజులో ఉన్నారు. సమయం: 19:41.. ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతికి వోక్స్ బౌలింగ్లో వార్నర్(1) బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత స్మిత్(1) జోర్డాన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 9 పరుగులు చేసింది. దుబాయ్: టి20 ప్రపంచకప్లో సూపర్ 12 గ్రూఫ్ 1లో నేడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఆసక్తికర పోటీ జరగనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు చెరో రెండు విజయాలతో మంచి ఫామ్లో ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు టాప్ ప్లేస్లో నిలుస్తారు. ఇక ఇరుజట్ల మధ్య టి20 ప్రపంచకప్లో రెండు మ్యాచ్లు జరగ్గా.. చెరో విజయాన్ని సాధించాయి. ఇందులో టి20 ప్రపంచకప్ 2010 ఫైనల్ ఉండడం విశేషం. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ విజేతగా నిలిచి టి20 చాంపియన్గా అవతరించింది. ఇక టి20ల్లో ఇరుజట్లు 19 సార్లు పోటీపడగా.. ఆస్ట్రేలియా 10సార్లు.. ఇంగ్లండ్ 8 సార్లు విజయాలు సాధించాయి. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్ ఇంగ్లండ్ : జాసన్ రాయ్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్స్టో, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్ -
T20 World Cup: తుది జట్టు నుంచి తప్పుకొనేందుకు సిద్ధం: కెప్టెన్
Eoin Morgan Comments Ahead T20 World Cup Journey: ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మ్యాచ్తో ఐసీసీ టీ20 వరల్డ్కప్ టోర్నీ అసలైన ఆట మొదలుకానుంది. అక్టోబరు 23న ఆసీస్- ప్రొటీస్ మ్యాచ్ తర్వాత.. అదే రోజు మరో రసవత్తర పోరు జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్తో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ తలపడనుంది. ఇక సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్లలో ఇంగ్లండ్- టీమిండియా చేతిలో, వెస్టిండీస్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాయి. ఇదిలా ఉండగా, కోహ్లి సేనతో తలపడే క్రమంలో జోస్ బట్లర్ సారథిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాను ఫామ్లోకి రాలేకపోతే తుది జట్టు నుంచి తప్పుకొనే అవకాశాలు ఉన్నాయన్నాడు. కాగా ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున 7 టీ20లు ఆడిన మోర్గాన్.. కేవలం 82 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్రైడర్స్ సారథిగా వ్యవహరించిన అతడు... జట్టును ఫైనల్ చేర్చి సమర్థవంతమైన కెప్టెన్ అనిపించుకున్నాడు. కానీ, బ్యాటర్గా మాత్రం విఫలమయ్యాడు. 16 ఇన్నింగ్స్లో అతడు.. 133 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్నకు ముందు మోర్గాన్ ఫామ్లేమితో సతమతమవడం ఇంగ్లండ్కు తలనొప్పిగా మారిన తరుణంలో కొంతమంది మాజీలు అతడిని తీవ్రంగా విమర్శించారు. ఈ విషయాలపై మోర్గాన్ తాజాగా స్పందిస్తూ... తాను గనుక ఫామ్లోకి రాకపోతే టీ20 జట్టు నుంచి తనను తాను డ్రాప్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ‘‘వరల్డ్కప్ గెలిచే జట్టులో నేను ఉంటానో లేదో తెలియదు. పరుగులు చేయలేకపోతున్నాను. కానీ.. నా కెప్టెన్సీ చాలా బాగుంది. బ్యాటర్గా, సారథిగా రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించేందుకు సిద్ధంగా ఉంటాను. అయితే, కెప్టెన్గా ఉండటం నాకు ఇష్టం’’ అని పేర్కొన్నాడు. మరి, జట్టు ప్రయోజనాల కోసం తుదిజట్టు నుంచి తప్పుకొనే అవకాశం ఉందా అని ప్రశ్నించగా... ‘‘కచ్చితంగా ఆ ఆప్షన్ ఉంటుంది’’ అని బీబీసీ స్పోర్ట్తో మోర్గాన్ వ్యాఖ్యానించాడు. చదవండి: T20 WC 2021: ఒమన్ బౌలర్ అద్బుతం.. సింగిల్ హ్యాండ్తో -
IPL 2021 Final: ‘కెప్టెన్’ డ్రాప్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు!
Don’t be surprised if Morgan drops himself: మరికొన్ని గంటల్లో ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ తుదిపోరుకు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ కేకేఆర్ జట్టు కూర్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ జట్టుతో చేరే అవకాశాలున్న వాన్... షకీబ్ అల్ హసన్ స్థానాన్ని అతడు భర్తీ చేసే ఛాన్స్ ఉందన్నాడు. ఒకవేళ అది కుదరకపోతే కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. రస్సెల్ కోసం తనను తాను తుదిజట్టు నుంచి డ్రాప్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. కాగా ఐపీఎల్-2021 రెండో అంచెలో అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్న మోర్గాన్... బ్యాటర్గా మాత్రం పూర్తిగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 129 రన్స్ మాత్రమే చేసిన అతడు... కీలకమైన క్వాలిఫైయర్-2లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ... ‘‘షార్జాలో వాళ్లు బాగా ఆడారు. అక్కడి పిచ్పై పూర్తి అవగాహన ఉంది. అయితే, దుబాయ్లో పిచ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆండ్రీ రస్సెల్తో నాలుగు ఓవర్లు వేయిస్తే బాగుంటుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అవసరం లేదనుకుంటే... షకీబ్ స్థానంలో అతడు జట్టులోకి రావొచ్చు. ఇక మోర్గాన్ విషయానికొస్తే... జట్టు ప్రయోజనాల కోసం తను ఎంతటి తాగ్యానికైనా సిద్ధపడతాడు. తనను తాను తుది జట్టు నుంచి తప్పించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తన పట్టుదల గురించి నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ -
DC Vs KKR: ఉత్కంఠ పోరులో కేకేఆర్ సూపర్ విక్టరీ.. ఢిల్లీ ఔట్
ఉత్కంఠ పోరులో కేకేఆర్ సూపర్ విక్టరీ.. ఢిల్లీ ఔట్ 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్(41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్మన్ గిల్(46 బంతుల్లో 46; ఫోర్, సిక్స్) శుభారంభాన్ని అందించినప్పటికీ కేకేఆర్ మిడిలార్డర్ దారుణంగా విఫలం కావడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయి ఆఖరి ఓవర్లో ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాట ఆడింది. అయితే మరో బంతి మిగిలుండగా రాహుల్ త్రిపాఠి అద్భుతమైన సిక్సర్ బాది కేకేఆర్ను ఫైనల్కు చేర్చాడు. దీంతో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి సగర్వంగా ఫైనల్కు చేరింది. కేకేఆర్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్లో చెన్నైతో పోరుకు అర్హత సాధించింది. రసవత్తరంగా మారిన మ్యాచ్.. కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్ కేకేఆర్ బౌలర్ రబాడ 18వ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి దినేశ్ కార్తీక్(0) వికెట్ను పడగొట్టడంతో మ్యాచ్ ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. 18 ఓవర్ల తర్వత కేకేఆర్ స్కోర్ 126/4. క్రీజ్లో రాహుల్ త్రిపాఠి(2), మోర్గాన్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. శుభ్మన్ గిల్(46) ఔట్ ఆవేశ్ ఖాన్ వేసిన 16.4 ఓవర్లో వికెట్ కీపర్ పంత్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్(46 బంతుల్లో 46; ఫోర్, సిక్స్) ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వత కేకేఆర్ స్కోర్ 125/3. క్రీజ్లో రాహుల్ త్రిపాఠి(1), దినేశ్ కార్తీక్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. నితీశ్ రాణా(13) ఔట్ కేకేఆర్ విజయానికి 25 బంతుల్లో 13 పరుగులు కావాల్సిన తరుణంలో నితీశ్ రాణా(12 బంతుల్లో 13; సిక్స్) రెండో వికెట్గా వెనుదిరిగాడు. నోర్జే బౌలింగ్లో హెట్మైర్కు క్యాచ్ ఇచ్చి రాణా ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వత కేకేఆర్ స్కోర్ 123/2. క్రీజ్లో గిల్(45), రాహుల్ త్రిపాఠి ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్(55) ఔట్ స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన అర్ధ శతకంతో రాణించి విజయం ముంగిట రబాడ బౌలింగ్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 98/1. క్రీజ్లో గిల్(32), నితీశ్ రాణా(1) ఉన్నారు. ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగుతున్న కేకేఆర్ పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ కేకేఆర్ ఓపెనర్లు ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. శుభ్మన్ గిల్(33 బంతుల్లో 31; ఫోర్), వెంకటేశ్ అయ్యర్(39 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒత్తిడికి లోను కాకుండా సింగల్స్ తీస్తూ స్కోర్ బోర్డును నెమ్మదిగా నడిపిస్తున్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 92/0. ధాటిగా ఆడుతున్న కేకేఆర్ ఓపెనర్లు.. 6 ఓవర్ల తర్వాత 51/0 136 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. శుభ్మన్ గిల్(16 బంతుల్లో 17; ఫోర్), వెంకటేశ్ అయ్యర్(20 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. కేకేఆర్ను లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. 6 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 51/0. Photo Courtesy: IPL ఢిల్లీ నామమాత్రపు స్కోర్.. కేకేఆర్ టార్గెట్ 136 కేకేఆర్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు 5 వికెట్ల నష్టానికి 135 పరుగుల నామమాత్రపు స్కోర్ మాత్రమే చేయగలిగింది. ధవన్(36), శ్రేయస్ అయ్యర్ (27 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్) ఓ మోస్తారుగా రాణించడంతో ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి(2/26), ఫెర్గూసన్(1/26), శివమ్ మావి(1/27), షకీబ్(0/28), సునీల్ నరైన్(0/27) తమ కోటా ఓవర్లు ముగించి ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. Photo Courtesy: IPL హెట్మైర్ రనౌట్.. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ ఒకసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హెట్మైర్ 17 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. నరైన్ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. సింగిల్ రిస్క్ అని తెలిసినప్పటికి నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న హెట్మైర్ సగం పిచ్ దాటేశాడు . అయితే అక్కడే ఉన్న వెంకటేశ్ అయ్యర్ త్రో వేయగా.. కార్తీక్ బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది ఢిల్లీకి బిగ్ షాక్.. పంత్(6) ఔట్ 15.2 ఓవర్లో ఢిల్లీ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్(6 బంతుల్లో 6; ఫోర్) ఫెర్గూసన్ బౌలింగ్లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఢిల్లీ 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్లో శ్రేయస్ అయ్యర్(9), హెట్మైర్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ధవన్(36) ఔట్ కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఢిల్లీ జట్టును మరో దెబ్బ కొట్టాడు. తొలుత ఓపెనర్ పృథ్వీ షాను ఔట్ చేసిన అతను..15వ ఓవర్ తొలి బంతికి ధవన్(39 బంతుల్లో 36; ఫోర్, 2 సిక్సర్లు)ను కూడా బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడే క్రమంలో షకీబ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో ధవన్ వెనుదిరిగాడు. 14.1 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 83/3. క్రీజ్లో శ్రేయస్ అయ్యర్(8), రిషబ్ పంత్ ఉన్నారు. స్టోయినిస్(18) క్లీన్ బౌల్డ్.. ఢిల్లీ 71/2 ఇన్నింగ్స్ 12వ ఓవర్లో శివమ్ మావి బౌలింగ్లో స్టోయినిస్(23 బంతుల్లో 18; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 11.3 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 71/2. క్రీజ్లో ధవన్(32), శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న ఢిల్లీ.. 11 ఓవర్ల తర్వాత 70/1 5వ ఓవర్లోనే ఓపెనర్ పృథ్వీ షా(18) వికెట్ కోల్పోయాక ఢిల్లీ జట్టు ఆచితూచి ఆడుతుంది. ధవన్(32 బంతుల్లో 31; ఫోర్, 2 సిక్సర్లు), స్టోయినిస్(22 బంతుల్లో 18; ఫోర్) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నారు. 11 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 70/1. Photo Courtesy: IPL తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా(18) ఔట్ టాస్ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న పృథ్వీ షా(12 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్) వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 4.1 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 32/1. క్రీజ్లో ధవన్(14), స్టోయినిస్ ఉన్నారు. Photo Courtesy: IPL షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 చివరి అంకానికి చేరుకుంది. క్వాలిఫయర్ 2లో భాగంగా నేడు జరగనున్న డూ ఆర్ డై మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. నేటి మ్యాచ్ విజేత అక్టోబర్ 15న జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుండగా, ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమించనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు నేటి మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఇక ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఇరు జట్లు 28 సార్లు హెడ్ టూ హెడ్ తలపడగా.. కేకేఆర్ 15 మ్యాచ్ల్లో, ఢిల్లీ 12 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ప్రస్తుత సీజన్ లీగ్ దశలో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచ్లో గెలుపొందాయి. తుది జట్లు: ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధవన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), హెట్మైర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, అన్రిచ్ నోర్జే, కాగిసో రబాడ, అవేష్ ఖాన్. కోల్కతా నైట్రైడర్స్: శుభ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), షకిబ్ ఉల్ హాసన్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, లుకీ ఫెర్గూసన్, శివమ్ మావి. -
DC Vs KKR: ఆ నలుగురి ముంగిట ఉన్న రికార్డులివే!
4 milestones to watch out for in Qualifier 2: ఐపీఎల్-2021 సీజన్లో బుధవారం ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్లో చెన్నైని ఢీకొట్టేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ సమాయత్తమవుతున్నాయి. క్యాష్ రిచ్ లీగ్లో ఇరు జట్లు 29 సార్లు ముఖాముఖి తలపడగా కోల్కతా 15 సార్లు గెలుపొంది పైచేయి సాధించింది. ఢిల్లీ 13 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. నేటి(అక్టోబరు 13) మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం! పంత్(Rishabh Pant) 8 పరుగులు చేస్తే.. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. ఈ సీజన్లో తొలి అంచెలో ఢిల్లీ అద్భుతంగా రాణించడంతో.. శ్రేయస్ జట్టులోకి తిరిగి వచ్చినా.. ఫ్రాంఛైజీ అతడినే సారథిగా కొనసాగించింది. యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగానే.. పంత్ జట్టును టేబుల్ టాపర్గా నిలిపాడు. బ్యాటర్గానూ తన వంతు సేవలు అందించాడు. ఐపీఎల్-2021లో 15 మ్యాచ్లలో పంత్ 413 పరుగులు సాధించాడు. ఇక క్వాలిఫైయర్-2 మ్యాచ్లో అతడు గనుక 8 పరుగులు చేస్తే.. ఐపీఎల్ కెరీర్లో 2500 రన్స్ మైలురాయిని చేరుకుంటాడు. అక్షర్ పటేల్(Axar Patel)... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో గేమ్ చేంజర్గా పలు కీలక మ్యాచ్ల విజయాల్లో భాగమయ్యాడు అక్షర్ పటేల్. బౌలర్గా, బ్యాటర్గా తన వంతు పాత్ర పోషించాడు. బుధవారం నాటి మ్యాచ్లో తుది జట్టులో గనుక అక్షర్ చోటు దక్కించుకుని... 5 వికెట్లు తీయగలిగితే ఐపీఎల్ 100 వికెట్ల క్లబ్లో చేరతాడు. ఇక ఈ సీజన్లో అతడు ఇప్పటి వరకు 15 వికెట్లు పడగొట్టాడు. మోర్గాన్(Eoin Morgan) పూర్తి చేస్తాడా? ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్-2021 రెండో అంచెలో అద్భుత విజయాలు సాధించింది. వరుస విజయాలతో టైటిల్కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. అయితే, బ్యాటర్గా మాత్రం మోర్గాన్ ఇంతవరకు మరీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే.. నేటి మ్యాచ్లో మోర్గాన్ 9 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్ కెరీర్లో వెయ్యి పరుగుల మార్కును చేరుకుంటాడు. డీకే(Dinesh Karthik) ముంగిట బౌండరీల రికార్డు కేకేఆర్ మాజీ కెప్టెన్ దినేశ్ కార్తిక్.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 214 పరుగులు చేశాడు. ఇందులో 22 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. నేటి మ్యాచ్లో డీకే ఒక్క బౌండరీ బాదితే చాలు.. ఐపీఎల్లో 400 ఫోర్లు తన పేరిట లిఖించుకోగలుగుతాడు. తద్వారా లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా నిలుస్తాడు. మరి వీళ్లందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా?! చదవండి: Aakash Chopra: ఈరోజు మీ కథ ముగుస్తుంది.. ఆ జట్టుదే విజయం -
రైనా సహా 'ఆ ముగ్గురి' ఖేల్ ఖతమైనట్టే..!
4 Players Who Might Go Unsold In IPL 2022 Auction: ప్రస్తుత ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫామ్ లేమితో సతమతమవుతున్న నలుగురు విధ్వంసకర ఆటగాళ్ల ఐపీఎల్ కెరీర్లు దాదాపుగా సమాప్తమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరంతా వచ్చేఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించే మెగా ఆక్షన్ అమ్ముడుపోని సరుకులుగా మిగిలిపోయే అవకాశం ఉందని వారు జోస్యం చెబుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు, సీఎస్కే డాషింగ్ ప్లేయర్ సురేశ్ రైనా సహా ముగ్గురు విదేశీ విధ్వంసకర బ్యాటర్లు ఉంటారని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. విదేశీ బ్యాటర్ల లిస్ట్లో యూనివర్సల్ బాస్, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ క్రిస్ గేల్ ముందువరుసలో ఉంటాడని, అతని వెనకాలే కోల్కతా నైట్రైడర్స్ సారధి, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆతరువాత రాయల్ ఛాలెంజర్స్ స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నలుగురితో పాటు గతేడాది ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన డానియల్ క్రిస్టియన్(ఆర్సీబీ-4.8 కోట్లు), రిలే మెరిడిత్(పంజాబ్ కింగ్స్-8 కోట్లు), జయ్దేవ్ ఉనద్కత్(రాజస్థాన్ రాయల్స్-3 కోట్లు), టామ్ కర్రన్(ఢిల్లీ క్యాపిటల్స్-5.25 కోట్లు), జై రిచర్డ్సన్(పంజాబ్ కింగ్స్-14 కోట్లు)లు కచ్చితంగా అమ్ముడుపోని జాబితాలో ఉంటారని అంచనా వేస్తున్నారు. పైన పేర్కొన్న ఆటగాళ్లనంతా ఆయా ఫ్రాంచైజీలు భారీ ధర వెచ్చింది కొనుగోలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో వారిపై వేటు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. చదవండి: మోదీపై అమిత్ షా ప్రశంసలు.. వ్యంగ్యంగా స్పందించిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ -
RCB Vs KKR : క్వాలిఫయర్ 2కు కేకేఆర్.. ఇంటిబాట పట్టిన ఆర్సీబీ
ఐపీఎల్ 2021లో భాగంగా ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటింగ్లో సునీల్ నరైన్ 26 పరుగులతో గేమ్ చేంజర్ కాగా.. గిల్ 29, వెంకటేశ్ అయ్యర్ 26, నితీష్ రాణా 23 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, హర్షల్, చహల్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో క్వాలిఫయర్ 2కు చేరుకున్న కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. మరోవైపు వరుసగా రెండో ఏడాది ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ ఇంటిబాట పట్టింది. ఇక కోహ్లి ఆర్సీబీ కెప్టెన్గా ఇదే చివరిదన్న సంగతి తెలిసిందే. అంతకముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్లో మెరవడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. పడిక్కల్ 21 పరుగులు చేశాడు. మ్యాక్స్వెల్, డివిలియర్స్, భరత్లు నిరాశపరిచారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 4, శివమ్ మావి 2 వికెట్లు తీశాడు. నితీష్ రాణా ఔట్.. కేకేఆర్ 120/4 23 పరుగులు చేసిన నితీష్ రాణా చహల్ బౌలింగ్లో డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 120పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి ఇంకా 19 పరుగుల దూరంలో ఉంది. వెంకటేశ్ అయ్యర్(26) రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్లో కీపర్ భరత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వికెట్తో హర్షల్ పటేల్ 32 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో హర్షల్ పటేల్ బ్రావోతో కలిసి తొలి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. నరైన్ 19, రాణా 18 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. 7 ఓవర్లలో 53/2 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన త్రిపాఠి చహల్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకముందు శుబ్మన్ గిల్(29) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ రెండో బంతిని గిల్ షాట్ ఆడే ప్రయత్నంలో డివిలియర్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. ►139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. కేకేఆర్ టార్గెట్ 139 కేకేఆర్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్లో మెరవడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. పడిక్కల్ 21 పరుగులు చేశాడు. మ్యాక్స్వెల్, డివిలియర్స్, భరత్లు నిరాశపరిచారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 4, శివమ్ మావి 2 వికెట్లు తీశాడు. మ్యాక్స్వెల్(15) రూపంలో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. నరైన్ బౌలింగ్లో ఫెర్గూసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 17 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 113/5 గా ఉంది. షాబాజ్ 9, క్రిస్టియన్(0) క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. 15 ఓవర్లలో 102/4 కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్లో సూపర్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతికి డివిలియర్స్(11)ను క్లీన్బౌల్డ్ చేశాడు. అంతకముందు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి(39) కూడా నరైన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ 13, షాబాజ్ అహ్మద్ 5పరుగులతో ఆడుతున్నారు. కేఎస్ భరత్ ఔట్.. ఆర్సీబీ 87/2 కేఎస్ భరత్(9) రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. నరైన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ నాలుగో బంతిని భరత్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ యత్నించినప్పటికీ బౌండరీ లైన్ వద్ద ఉన్న వెంకటేశ్ అయ్యర్ క్యాచ అందుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 87పరుగులు చేసింది. కోహ్లి 39, మ్యాక్స్వెల్ 9 పరుగుతో ఆడుతున్నారు. పడిక్కల్ క్లీన్బౌల్డ్.. ఆర్సీబీ 53/1 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ వేసిన 5వ ఓవర్ తొలి బంతికి 21 పరుగులు చేసిన పడిక్కల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. కోహ్లి 24, భరత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 36/0 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. పడిక్కల్ 19, విరాట్ కోహ్లి 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. షార్జా: ఐపీఎల్ 2021లో నేడు కేకేఆర్, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్, ఆర్సీబీలు మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక లీగ్ మ్యాచ్ల్లో రెండుసార్లు తలపడగా.. ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేశాయి. ప్లేఆఫ్స్లో కేకేఆర్, ఆర్సీబీ తలపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో 13 సార్లు ఆర్సీబీ నెగ్గగా.. 15 సార్లు కేకేఆర్ విజయాలు అందుకుంది. ఆర్సీబీ: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్ కేకేఆర్: శుబ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి -
MI Vs SRH: కేకేఆర్ కొట్టేసింది.. మరి.. ముంబై 171 పరుగులతో..!
KKR Beats RR... MI "Chances" To Enter Play Offs Explained: గత రెండు సీజన్లలో రన్రేట్లో వెనుకబడి ఐదో స్థానానికే పరిమితమైన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఈసారి తప్పు దిద్దుకుంది. విజయాలతో పాటు రన్రేట్ను కూడా కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు నాలుగో జట్టుగా దాదాపుగా ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 86 పరుగులతో భారీ విజయం సాధించడం ఆ జట్టుకు మరింతగా కలిసొచ్చింది. షార్జాలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వెంకటేశ్ అయ్యర్ (35 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం రాజస్తాన్ 16.1 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ తెవాటియా (36 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శివమ్ మావి (4/21), ఫెర్గూసన్ (3/18) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. చివర్లో జోరు... తొలి 10 ఓవర్లలో 69 పరుగులు... తర్వాతి 10 ఓవర్లలో 101 పరుగులు... కోల్కతా ఇన్నింగ్స్ ఇలా రెండు భిన్న పార్శ్వాలుగా సాగింది. నెమ్మదిగా ఆట ప్రారంభించిన గిల్, వెంకటేశ్... పవర్ప్లేలో కూడా మరీ దూకుడుగా వెళ్లకుండా వికెట్ను కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా 6 ఓవర్లలో జట్టు 34 పరుగులే చేయగలిగింది. ఎట్టకేలకు ఉనాద్కట్ వేసిన పదో ఓవర్లో వెంకటేశ్ రెండు భారీ సిక్సర్లు కొట్టి జోరు పెంచాడు. తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరగడంతో 79 పరుగుల (65 బంతుల్లో) భాగస్వామ్యానికి తెర పడింది. అయితే అక్కడి నుంచి కేకేఆర్ స్కోరు వేగంగా దూసుకుపోయింది. తర్వాతి బ్యాట్స్మెన్ నితీశ్ రాణా (12), రాహుల్ త్రిపాఠి (21), దినేశ్ కార్తీక్ (14 నాటౌట్), మోర్గాన్ (13 నాటౌట్) తలా ఓ చేయి వేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. సకారియా బౌలింగ్లో ఫోర్తో గిల్ 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోరిస్ వేసిన చివరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. రాజస్తాన్ 9 వైడ్లు సహా ఏకంగా 17 అదనపు పరుగులు ఇచ్చింది. టపటపా... సీజన్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చిన రాజస్తాన్ తమ చివరి లీగ్ మ్యాచ్లోనూ దానిని కొనసాగించింది. ఒక్క తెవాటియా పోరాటం మినహా...మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేయడంతో జట్టుకు భారీ పరాజయం ఎదురైంది. అవుటయ్యేందుకు ఒకరితో మరొకరు పోటీ పడటంతో తొలి ఓవర్ నుంచే జట్టు పతనం వేగంగా సాగింది. పవర్ప్లే ముగిసేసరికే జట్టు 4 వికెట్లు కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాతా అందరూ విఫలం కావడంతో కనీసం పోరాడేందుకు కూడా అవకాశం లేకపోయింది. ముంబై 171 పరుగులతో గెలిస్తేనే... ఇక కేకేఆర్ అనధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్నప్పటికీ... సాంకేతికంగా ముంబైకి ఇంకా అవకాశం ఉంది. అయితే, వాస్తవికంగా చూస్తే అది అసాధ్యమే. నేడు(శుక్రవారం) సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ముంబై ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 171 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఇక ఛేదన అయితే మాత్రం టాస్తోనే వారి ఆట ముగిసిపోతుంది. అంటే రెండోసారి బ్యాటింగ్ చేస్తే అంకెలకు అందని విధంగా ముంబై జట్టుకు ఏమాత్రం అవకాశం లేదు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) యశస్వి (బి) మోరిస్ 56; వెంకటేశ్ (బి) తెవాటియా 38; రాణా (సి) లివింగ్స్టోన్ (బి) ఫిలిప్స్ 12; త్రిపాఠి (బి) సకారియా 21; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 14; మోర్గాన్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 17, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–79, 2–92, 3–133, 4–145. బౌలింగ్: ఉనాద్కట్ 4–0–35–0, మోరిస్ 4–0–28–1, సకారియా 4–0–23–1, ముస్తఫిజుర్ 4–0–31–0, దూబే 2–0–18–0, తెవాటియా 1–0–11–1, ఫిలిప్స్ 1–0–17–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (బి) షకీబ్ 0; లివింగ్స్టోన్ (సి) త్రిపాఠి (బి) ఫెర్గూసన్ 6; సామ్సన్ (సి) మోర్గాన్ (బి) మావి 1; దూబే (బి) మావి 18; రావత్ (ఎల్బీ) (బి) ఫెర్గూసన్ 0; ఫిలిప్స్ (బి) మావి 8; తెవాటియా (బి) మావి 44; మోరిస్ (ఎల్బీ) (బి) వరుణ్ 0; ఉనాద్కట్ (సి) షకీబ్ (బి) ఫెర్గూసన్ 6; సకారియా (రనౌట్) 1; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 1, మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 85. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–12, 4–13, 5–33, 6–34, 7–35, 8–62, 9–85, 10–85. బౌలింగ్: షకీబ్ 1–0–1–1, శివమ్ మావి 3.1–0–21–4, నరైన్ 4–0–30–0, ఫెర్గూసన్ 4–0–18–3, వరుణ్ 4–0–14–1. చదవండి: Anshu Malik: భారత తొలి మహిళా రెజ్లర్గా సరికొత్త చరిత్ర! THAT. WINNING. FEELING! 👏 👏 The @Eoin16-led @KKRiders put up a clinical performance & seal a 86-run win over #RR. 💪 💪 #VIVOIPL #KKRvRR Scorecard 👉 https://t.co/oqG5Yj3afs pic.twitter.com/p5gz03uMbJ — IndianPremierLeague (@IPL) October 7, 2021 -
KKR Vs SRH: ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ ఘన విజయం
ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ విజయం.. ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖరారు ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 6 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్ శుబ్మన్ గిల్ 57 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నితీష్ రాణా 25 పరుగులతో రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హూల్డర్ 2, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఇక చివరి మ్యాచ్ను కేకేఆర్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. అంతకముందు ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అబ్దుల్ సమద్ 25, ప్రియమ్ గార్గ్ 21 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ మెరుపులు మెరిపించలేకపోయింది. దీనికి తోడూ మిగతా బ్యాట్స్మెన్ కూడా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. షకీబ్ ఒక వికెట్ తీశాడు విజయానికి 24 పరుగుల దూరంలో కేకేఆర్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ విజయం దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. గిల్ 57, నితీష్ రాణా 18 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 44 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గిల్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి. 9 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 42/2 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. గిల్ 24, నితీష్ రాణా 1 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు వెంకటేశ్ అయ్యర్ (8), రాహుల్ త్రిపాఠి(7) తక్కువ స్కోర్లకే ఔటై పెవిలియన్ చేరారు. కేకేఆర్ టార్గెట్ 116 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. అబ్దుల్ సమద్ 25, ప్రియమ్ గార్గ్ 21 పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ మెరుపులు మెరిపించలేకపోయింది. దీనికి తోడూ మిగతా బ్యాట్స్మెన్ కూడా విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. షకీబ్ ఒక వికెట్ తీశాడు. హోల్డర్(2) ఔట్.. ఎస్ఆర్హెచ్ 80/6 కేకేఆర్తో మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు తమ చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హోల్డర్(9 బంతుల్లో 2) వెంకటేశ్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 80 పరుగుల వద్ద ఆరో వికెట్ను కోల్పోయింది. క్రీజ్లో అబ్ధుల్ సమద్(12), రషీద్ ఖాన్ ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. ప్రియం గార్గ్(21) ఔట్ వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలానికి ఎస్ఆర్హెచ్ ఆటగాడు ప్రియం గార్గ్(31 బంతుల్లో 21; సిక్స్) బోల్తా పడ్డాడు. ఇన్నింగ్స్ 14.2 ఓవర్లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 79/5. క్రీజ్లో అబ్ధుల్ సమద్(12), హోల్డర్(1) ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 53/4 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఫేలవ ఆటతీరు కొనసాగిస్తుంది. తాజాగా షకీబ్ బౌలింగ్లో 6 పరుగులు చేసిన అభిషేక్ శర్మ స్టంప్ అవుట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. గార్గ్ 18, అబ్దుల్ సమద్ 5 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL షకీబ్ స్టన్నింగ్ త్రో.. విలియమ్సన్ రనౌట్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ షకీబ్ స్టన్నింగ్ త్రోకు రనౌట్ అయ్యాడు. 26 పరుగులతో మంచి టచ్లో కనిపించిన విలియమ్సన్ అనవసర పరుగుకు యత్నించి ఔటయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 38 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ప్రియమ్ గార్గ్ 8, అభిషేక్ శర్మ 6 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 35/2 జేసన్ రాయ్(10) రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ నాలుగో బంతికి సౌథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. విలియమ్సన్ 24, ప్రియమ్ గార్గ్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Courtesy: IPL సాహా గోల్డెన్ డక్.. ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్ కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. సౌథీ వేసిన ఓవర్ రెండో బంతికే సాహా ఎల్బీగా వెనుదిరిగాడు. సాహా రివ్యూ కోరకుండానే పెవిలియన్కు చేరాడు. అయితే రిప్లేలో బంతి వికెట్లపై నుంచి వెళ్లడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం 1 ఓవర్లో ఎస్ఆర్హెచ్ స్కోరు 4/1గా ఉంది. Photo Courtesy: IPL దుబాయ్: ఐపీఎల్ సెకండ్ఫేజ్లో భాగంగా కేకేఆర్, ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే లీగ్ నుంచి ఇంటిబాట పట్టిన ఎస్ఆర్హెచ్కు ఈ మ్యాచ్ గెలవడం వల్ల పెద్దగా ఒరిగేదేం లేదు.. ప్రత్యర్థి అవకావాలు దెబ్బతీయడం తప్ప. అయితే కేకేఆర్కు మాత్రం ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఎస్ఆర్హెచ్పై గెలిస్తే ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశం ఉంది. ఇక తొలి అంచె పోటీల్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ను విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 177 పరుగులకే పరిమితమైంది. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 20 సార్లు తలపడగా.. 13సార్లు కేకేఆర్.. ఏడుసార్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. కోల్కతా నైట్ రైడర్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా,షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, టిమ్ సౌతీ, వరుణ్ చాకరవర్తి సన్రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్ -
ఏంటి మోర్గాన్.. జట్టు మొత్తం ఓకే.. మరి నీ పరిస్థితి!
KKR Captain Eoin Morgan Failure As Batsman.. కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఐపీఎల్లో పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా మోర్గాన్ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఐపీఎల్ తొలి అంచె పోటీల్లో అంతంతమాత్రమే ప్రదర్శన నమోదు చేసిన కేకేఆర్.. రెండో ఫేజ్లో మాత్రం దుమ్మురేపుతుంది. సెకండ్ఫేజ్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించిన కేకేఆర్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. ఇదే సమయంలో మోర్గాన్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో వరుసగా 7,8,0,2 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉండడం కూడా విశేషం. చదవండి: IPL 2021: షమీ సూపర్ త్రో.. డెబ్యూ మ్యాచ్లోనే రనౌట్ Courtesy: IPL Twitter అంతేగాక అశ్విన్తో మోర్గాన్ గొడవ ఐపీఎల్లో హైలెట్గా మారింది. తప్పు ఎవరిదన్నది పక్కనపెడితే.. వీరిద్దరి గొడవపై ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. కాగా మోర్గాన్ ఆటతీరుపై క్రికెట్ ఫ్యాన్స్ విపరీతమైన ట్రోల్స్ చేశారు. ముందు గొడవల పడడం ఆపి నీ ఆటతీరుపై దృష్టి పెట్టు.. ఏంటిది మోర్గాన్.. జట్టుకు నాయకత్వం వరకు బాగానే ఉంది.. కానీ నీ ఆట పరిస్థితి ఏంటి.. అంటూ కామెంట్స్ చేశారు. కేకేఆర్ ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలు కేకేఆర్కు మెరుపు ఆరంభాలనిస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఆఖరిలో ఓడిపోయింది. చదవండి: KL Rahul: అది క్లియర్గా ఔట్.. థర్డ్ అంపైర్పై మండిపడ్డ గంభీర్! Eoin Morgan in IPL 2021: Innings - 11. Runs - 109. Average - 10.90. Strike Rate - 100.92. Fifty plus score - 0. Thirty plus score - 1. Double digit scores - 2. Single digit scores - 9. — Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2021 Eoin Morgan after facing one ball#KKRvsPBKS #IPL2021 pic.twitter.com/QhaF3PexM1 — King Soham 🇮🇳 (@Soham1706) October 1, 2021 -
PBKS Vs KKR: కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ కింగ్స్ విజయం
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. కేకేఆర్పై పంజాబ్ కింగ్స్ విజయం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్తో(67 పరుగులు) ఆకట్టుకున్నాడు. కాగా చివర్లో షారుక్ ఖాన్(22) పరుగులతో జట్టును గెలిపించాడు. అంతకముందు మయాంక్ అగర్వాల్ 40 పరుగులతో రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, సునీల్ నరైన్, శివమ్ మావి చెరో వికెట్ తీశారు. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(67 పరుగులు) హాఫ్ సెంచరీతో మెరవగా.. రాహుల్ త్రిపాఠి 34, నితీష్ రాణా 31 పరుగులతో అయ్యర్కు సహకరించారు. అయితే అయ్యర్, రాణాలు ఉన్నంతసేపు కేకేఆర్ భారీ స్కోరు చేస్తుందని భావించారు. కాగా ఆఖర్లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ పరుగులు చేయలేకపోయింది. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్.. 142/4 ఎయిడెన్ మక్రమ్ రూపంలో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన మక్రమ్ నరైన్ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ఫిప్టీ.. విజయానికి 38 పరుగుల దూరంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ క్లాస్ అర్థశతకంతో మెరిశాడు. 42 బంతుల్లో 2 ఫోర్లు.. 2 సిక్సర్లతో రాహుల్ అర్థశతకం మార్క్ను అందుకున్నాడు. పంజాబ్ విజయానికి ఇంకా 38 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 53, మక్రమ్ 18 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. 92/2 నికోలస్ పూరన్(12) రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. రాహుల్ 30, మక్రమ్ 0 పరుగులతో ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. 10 ఓవర్లలో 76/1 మయాంక్ అగర్వాల్(40) రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ను కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ ఐదో బంతిని మయాంక్ కవర్స్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న మోర్గాన్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 70 పరుగులు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 28, పూరన్ 5 పరుగులతో ఆడతున్నారు. 6 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 46/0 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 31, కేఎల్ రాహుల్ 14 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 166 పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(67 పరుగులు) హాఫ్ సెంచరీతో మెరవగా.. రాహుల్ త్రిపాఠి 34, నితీష్ రాణా 31 పరుగులతో అయ్యర్కు సహకరించారు. అయితే అయ్యర్, రాణాలు ఉన్నంతసేపు కేకేఆర్ భారీ స్కోరు చేస్తుందని భావించారు. కాగా ఆఖర్లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ పరుగులు చేయలేకపోయింది. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. Photo Courtesy: IPL 4 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు.. కేకేఆర్ 124/4 ఇన్నింగ్స్ 16వ ఓవర్లో మహ్మద్ షమీ వేసిన అద్బుతమైన యార్కర్కు కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(2) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో కేకేఆర్ 4 పరుగుల వ్యవధిలో 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 15. 5ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 124/4. క్రీజ్లో నితీశ్ రాణా(11), దినేశ్ కార్తీక్ ఉన్నారు. Photo Courtesy: IPL వెంకటేశ్ అయ్యర్ ఔట్(67).. కేకేఆర్ 121/3 ధాటిగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్ (49 బంతుల్లో 67; 9 ఫోర్లు, సిక్స్)ను రవి బిష్ణోయి బోల్తా కొట్టించాడు. బిష్ణోయి విసిరిన గూగ్లి బంతిని స్వీప్ షాట్ ఆడబోయి దీపక్ హూడాకు క్యాచ్ ఇచ్చి అయ్యర్ వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 121/3. క్రీజ్లో నితీశ్ రాణా(10), మోర్గాన్ ఉన్నారు. Photo Courtesy: IPL వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ.. కేకేఆర్ 104/2 కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ అర్థశతకంతో మెరిశాడు. 39 బంతుల్లో 50 పరుగుల మార్క్ను అందుకున్న అయ్యర్ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు.. ఒక సిక్సర్ ఉన్నాయి. ప్రస్తుతం కేకేఆర్ 13 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. అయ్యర్ 58, నితీష్ రాణా 3 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు దాటిగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠిని(34) రవి బిష్ణోయి ఔట్ చేసి పంజాబ్కు బ్రేక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మూడో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో త్రిపాఠి హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Courtesy: IPL దాటిగా ఆడుతున్న అయ్యర్.. కేకేఆర్ 73/1 కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ దాటిగా ఆడుతున్నాడు. 30 బంతులెదుర్కొన్న అయ్యర్ 42 పరుగులు చేయగా.. అందులో 7 ఫోర్లు ఉన్నాయి. అతనికి రాహుల్ త్రిపాఠి 22 చక్కగా సహకరిస్తున్నాడు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. అంతకముందు గిల్ 7 పరుగుల వద్ద ఔటయ్యాడు. 6 ఓవర్లలో కేకేఆర్ 48/1 పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్ నడిపిస్తున్నాడు. అయ్యర్ 27, త్రిపాఠి 10 పరుగలతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL శుబ్మన్ గిల్ ఔట్.. కేకేఆర్ 23/1 ఓపెనర్ శుబ్మన్ గిల్(7) రూపంలో కేకేఆర్ తొలి వికెట్ను కోల్పోయింది. అర్ష్దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ రెండో బంతికి గిల్ క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. అయ్యర్ 10, రాహుల్ త్రిపాఠి 4 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ రేసులో ఉన్న కేకేఆర్ను పంజాబ్ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. కాగా తొలి అంచె పోటీల్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్నే విజయం వరించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్ 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇక ముఖాముఖి పోరులో ఇప్పటివరకు 28 మ్యాచ్లు జరగ్గా.. 19 మ్యాచ్ల్లో కేకేఆర్ నెగ్గగా.. తొమ్మిది మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ను విజయం వరించింది. పంజాబ్ కింగ్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మక్రమ్, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, నాథన్ ఎల్లిస్, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ కేకేఆర్: శుబ్మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ , రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్( వికెట్ కీపర్),టిమ్ సీఫర్ట్ , సునీల్ నరైన్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి,శివమ్ మావి -
Gautam Gambhir: సోషల్ మీడియా యూజర్లను పెంచుకోవడానికేనా ఇలా?!
Gautam Gambhir Comments On Ashwin- Morgan Row: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్, కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కొంతమంది మోర్గాన్కు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు అశ్విన్కు అండగా నిలుస్తున్నారు. ఇక ఈ వివాదంపై టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ ఘటనలో అశ్విన్కు వంద శాతం తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు. నిబంధనలకు లోబడే అశ్విన్ అలా ప్రవర్తించాడని, అందులో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నాడు. ఈ మేరకు ఒకప్పటి ఢిల్లీ జట్టు సారథి గౌతీ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఈ విషయం గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు. వాళ్లకు ఇందులో అసలు ప్రమేయం ఎందుకు? బహుశా సోషల్ మీడియా యూజర్లను పెంచుకునే క్రమంలో ఇలా మాట్లాడుతున్నారేమోనని అనిపిస్తోంది. ఇలా చేయడంలో ఏమాత్రం అర్థం లేదు. అశ్విన్ కచ్చితంగా సరైన పనే చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని అశూకు మద్దతు తెలిపాడు. కాగా ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అశ్విన్దే తప్పంటూ వ్యాఖ్యానించిన విషయం విదితమే. courtesy: IPL ఇక సెప్టెంబరు 28న కేకేఆర్తో ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా సౌథీ, అశ్విన్ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్.. సౌథీకి అండగా నిలిచాడు. దీంతో అశ్విన్ సీరియస్ అయ్యాడు. ఈ క్రమంలో కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ జోక్యం చేసుకుని గొడవను ఆపాడు. అయితే, ఆ తర్వాత దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. బాల్ పంత్ను తాకిన తర్వాత కూడా అశ్విన్ పరుగు తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమనే ఉద్దేశంలో మోర్గాన్ అలా స్పందించి ఉంటాడని పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన అశ్విన్.. నిబంధనలకు లోబడే పరుగు తీశానని, ఇందులో తన తప్పేమీ లేదని కౌంటర్ ఇచ్చాడు. చదవండి: MS Dhoni: చాలు సామీ.. చాలు.. ఫినిషర్ ఇంకా బతికే ఉన్నాడు! -
'అశ్విన్ ఒక చీటర్'.. ఆసీస్ మీడియా సంచలన వ్యాఖ్యలు
Australian Media Called Ashwin Cheater.. మోర్గాన్- అశ్విన్ వివాదం చోటుచోటుచేసుకొని రెండు రోజులు కావొస్తున్నా.. ఇప్పటికీ విమర్శనాస్త్రాలు వస్తూనే ఉన్నాయి. కొందరు మోర్గాన్ది తప్పు అంటే.. మరికొందరు అశ్విన్కు మద్దతు పలుకుతూ మాట్లాడారు. తాజాగా ఆసీస్ మీడియా మోర్గాన్కు సపోర్ట్ చేస్తే.. అశ్విన్ ఒక చీటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మోర్గాన్పై అసహనం వ్యక్తం చేస్తూ అశ్విన్ ప్రదర్శించిన తీరు క్రీడాస్పూర్తిని దెబ్బతీసిందని అభిప్రాయపడింది. అశ్విన్ ప్రవర్తన మాకు ఆశ్చర్యం కలిగించిందని.. అతను చేసింది ముమ్మాటికి తప్పేనని తెలిపింది. ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్.. ''మోర్గాన్కు అశ్విన్ను అడ్డుకునే హక్కు ఉంది'' అని చేసిన వ్యాఖ్యలను మేము సమర్థిస్తున్నాం. ఘటన జరిగిన రెండు రోజులకు అశ్విన్ స్పందించడం హాస్యాస్పదం. అని చెప్పుకొచ్చింది. చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు కాగా సెప్టెంబరు 28న కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగా సౌథీ, అశ్విన్ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో కెప్టెన్ మోర్గాన్ దూరి సౌథీకి మద్దతు పలికాడు. దీంతో ఆశ్విన్ మోర్గాన్కు బ్యాట్ చూపిస్తూ సీరియస్గా కనిపించాడు. అంతలో.. వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ జోక్యం చేసుకోవడంతో అక్కడితో వివాదం సద్దుమణిగింది. అయితే, ఆ తర్వాత దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. బాల్ పంత్ను తాకిన తర్వాత కూడా అశ్విన్ పరుగు తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమనే ఉద్దేశంలో మోర్గాన్ అలా స్పందించి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. చదవండి: Virender Sehwag: మిస్టర్ మోర్గాన్.. లార్డ్స్ బయట ధర్నా చేయాల్సింది -
Ashwin Vs Morgan: గొడవ పడ్డానా... ఎట్టకేలకు మౌనం వీడిన అశ్విన్!
Ravichandran Ashwin Tweets Goes Viral: కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆటగాడు టిమ్ సౌథీతో జరిగిన గొడవ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఎట్టకేలకు మౌనం వీడాడు. వరుస ట్వీట్లతో సదరు ఘటన గురించి తన స్పందన తెలియజేశాడు. తప్పొప్పుల గురించి మాట్లాడేటపుడు కాస్త ఆలోచించాలని విమర్శకులకు హితవు పలికాడు. నిబంధనలకు లోబడి ఆడటం, మైదానం వీడిన తర్వాత గొడవల గురించి మర్చిపోవడం అసలైన క్రీడాస్ఫూర్తి అన్న విషయం పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని తల్లిదండ్రులకు సూచించాడు. ఈ మేరకు అశ్విన్ ...‘‘ఫీల్డర్ విసిరిన బంతి రిషభ్ తాకిందన్న విషయం నాకు తెలియదు. ఆ సమయంలో నేను మరో పరుగు కోసం వెళ్లాను. నిజంగా పంత్ను బంతి తాకిన విషయం నేను చూశానా? ఆ తర్వాత కూడా రన్ కోసం వెళ్తానా అంటే.. కచ్చితంగా..! మోర్గాన్ చెప్పినట్లు నాకు ఇతరులను గౌరవించడం రాదా? కానే కాదు! నిజంగా నేను గొడవకు దిగానా? లేదు.. అస్సలు లేదు.. నా పాటికి నేను అక్కడ నిల్చుని ఉన్నాను. నా తల్లిదండ్రులు, టీచర్లు చెప్పినట్లు బుద్ధిగా నిల్చుని ఉన్నా. మీరు కూడా మీ పిల్లలకు ఇదే చెప్పండి. మోర్గాన్, సౌథీ వారి క్రికెట్ ప్రపంచంలో వారికి నచ్చిందే సరైందని భావించవచ్చు. కానీ, మైదానంలో ఒకరిని తక్కువ చేసి మాట్లాడే హక్కు వారికి లేదు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఎవరు మంచివాళ్లు.. ఎవరు కాదు అన్న విషయాల గురించి కొంత మంది చర్చ మొదలెట్టేశారు. క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారు. ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. ఫీల్డర్ విఫలమైనపుడు అదనపు రన్ కోసం పరుగు తీయడం మీ కెరీర్ను బ్రేక్ చేస్తుందా? ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ను పరుగు వద్దని హెచ్చరించి, మనం కూడా వారి ప్రతిపాదన తిరస్కరిస్తేనే మంచి వ్యక్తి అని, లేదంటే చెడ్డవాళ్లు అంటూ ఇతరులను కన్ఫ్యూజన్లో పడేయకండి. మైదానంలో నిబంధనలకు అనుగుణంగా... పూర్తిస్థాయిలో మన శక్తి సామర్థ్యాలు ఒడ్డి జట్టుకు ప్రయోజనకరంగా ఉండటం మంచి విషయం. ఆట పూర్తైన తర్వాత చేతులు కలిపి మాట్లాడుకోవడం అనేదే క్రీడా స్ఫూర్తి అన్న విషయం నాకు అర్థమైంది’’అని సుదీర్ఘ పోస్టు పెట్టాడు. తన తప్పేమీ లేదని పరోక్షంగా మోర్గాన్, సౌథీకి కౌంటర్ ఇచ్చాడు. కాగా సెప్టెంబరు 28న కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగా సౌథీ, అశ్విన్ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో కెప్టెన్ మోర్గాన్ దూరి సౌథీకి మద్దతు పలికాడు. దీంతో ఆశ్విన్ మోర్గాన్కు బ్యాట్ చూపిస్తూ సీరియస్గా కనిపించాడు. అంతలో.. వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ జోక్యం చేసుకోవడంతో అక్కడితో వివాదం సద్దుమణిగింది. అయితే, ఆ తర్వాత దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. బాల్ పంత్ను తాకిన తర్వాత కూడా అశ్విన్ పరుగు తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమనే ఉద్దేశంలో మోర్గాన్ అలా స్పందించి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ ఈ మేరకు ట్వీట్లు చేయడం గమనార్హం. చదవండి: Harshal Patel: కోహ్లి తొడను గట్టిగా రుద్దేశాను.. సిరాజ్ కాలికి గాయం! 1. I turned to run the moment I saw the fielder throw and dint know the ball had hit Rishabh. 2. Will I run if I see it!? Of course I will and I am allowed to. 3. Am I a disgrace like Morgan said I was? Of course NOT. — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) September 30, 2021 -
మిస్టర్ మోర్గాన్.. లార్డ్స్ బయట ధర్నా చేయాల్సింది
Virender Sehwag Knocks Eoin Morgan.. ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో అశ్విన్- మోర్గాన్ మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. అశ్విన్దే తప్పు అని కొందరు విమర్శిస్తుంటే.. మోర్గాన్ది తప్పంటూ మరికొందరు పేర్కొంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అశ్విన్కు మద్దతిస్తూ మోర్గాన్పై ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ అశ్విన్- మోర్గాన్ విషయంలో జరిగిన గొడవ గురించి ప్రస్తావించాడు. రిషబ్ పంత్- అశ్విన్ జోడి రెండో పరుగు కోసం ప్రయత్నించడమే ఇక్కడ తప్పని.. అందుకే మోర్గాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చాడు. కార్తిక్ కామెంట్స్పై సెహ్వాగ్ స్పందించాడు. చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ తప్పు లేదు.. అశ్విన్ను అడ్డుకునే హక్కు ఉంది ''అది జూలై 14.. 2019 ప్రపంచకప్ ఫైనల్. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ఫైనల్ ఓవర్లో బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలి అదనంగా రెండు పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీయడం.. సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ విజయం సాధించడం జరిగిపోయాయి. మోర్గాన్ ప్రకారం న్యాయంగా ఉంటే ఓవర్ త్రోకు పరుగులు తీయకూడదు.. కానీ స్టోక్స్ రన్స్ తీశాడు. దీని ప్రకారం మోర్గాన్ స్టోక్స్కు వ్యతిరేకంగా లార్డ్స్ బయట ధర్నా చేయాలి.. అంతేగాక మోర్గాన్ ఒక కెప్టెన్గా ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించాలి.. న్యాయబద్ధంగా న్యూజిలాండ్కు ట్రోఫీ అందించాలి. మరి మోర్గాన్ అప్పుడు అలా ఎందుకు చేయలేదు.. పైగా ఇప్పుడేమో అశ్విన్ను తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి'' అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ప్రస్తుతం సెహ్వాగ్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2021: ఫామ్లో లేకపోతే అంతే.. మూలకు కూర్చోవాల్సిందే On July 14th , 2019 when it ricocheted of Ben Stokes bat in the final over, Mr Morgan sat on a Dharna outside Lord’s and refused to hold the World cup trophy and New Zealand won. Haina ? Bade aaye, ‘doesn’t appreciate’ waale 😂 pic.twitter.com/bTZuzfIY4S — Virender Sehwag (@virendersehwag) September 29, 2021 -
మోర్గాన్ తప్పు లేదు.. అశ్విన్ను అడ్డుకునే హక్కు ఉంది
Ravichandran Ashwin- Eoin Morgan Controversy.. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో విజయం ఎవరు సాధించారనే దానికంటే అశ్విన్- మోర్గాన్ గొడవ ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. సౌథీ బౌలింగ్లో ఔటై వెళ్తున్న అశ్విన్పై సౌథీ నోరు జారగా.. అతనికి కెప్టెన్ మోర్గాన్ మద్దతుగా నిలిచాడు. ఇది నచ్చని అశ్విన్ మోర్గాన్కు కోపంగా బ్యాట్ను చూపిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అశ్విన్ తన బౌలింగ్లోనే మోర్గాన్ను డకౌట్ చేయడం ద్వారా గట్టిగా అరుస్తూ పెవిలియన్ వెళ్లు అంటూ బదులు తీర్చుకున్నాడు. వీరి వివాదం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అంతకముందు రిషబ్- అశ్విన్ జోడి ఒక పరుగు అదనంగా తీయడమే ఈ గొడవకు మూల కారణం. కాగా దీనిపై పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు తాజాగా ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అశ్విన్- మోర్గాన్ వివాదంపై స్పందించాడు. క్రికెట్లో ఇలాంటివి జరగడం సాధారణం. దీనిపై రెండుగా చీలిపోయి చర్చ పెట్టడం కూడా వ్యర్థమే. నిన్న జరిగిన గొడవలో నా దృష్టిలో అశ్విన్దే తప్పు. ఒక పరుగు అదనంగా తీయడం పెద్ద నేరం కాకపోవచ్చు.. కానీ ఒక బౌలర్ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేస్తే.. అతనికి ధీటుగా బదులివ్వడం వరకు ఓకే. కానీ గొడవను ఆపుదామని వచ్చిన మోర్గాన్పై కోపం వ్యక్తం చేయడం ఏం బాలేదు. తన బౌలింగ్లో మోర్గాన్ డకౌట్ అయి వెళ్లేటప్పుడు గట్టిగా అరుస్తూ ఆవేశాన్ని వ్యక్తం చేసి తన గౌరవాన్ని కించపరుచుకున్నాడు. ముమ్మాటికి మోర్గాన్కు అశ్విన్ను అడ్డుకునే హక్కు ఉంది. అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్దిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కేకేఆర్ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చదవండి: IPL 2021: డెబ్యూ మ్యాచ్లోనే గొడవ.. మోర్గాన్ మద్దతు -
Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్ కార్తీక్
Dinesh Karthik On R Ashwin and Eoin Morgan Altercation: ‘‘రాహుల్ త్రిపాఠి బంతి విసిరాడు. అది రిషభ్ పంత్ను తాకి.. కిందపడింది. ఇంతలో అశ్విన్ పరుగు కోసం పంత్ను ఆహ్వానించాడు. ఇద్దరూ పరుగు తీశారు. అయితే మోర్గాన్కు ఇది నచ్చలేదు. నిజానికి... బాల్ బ్యాటర్ లేదంటే ప్యాడ్ను తాకిన తర్వాత.. పరుగు తీయడం సరికాదు. ఇది.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని అతడు భావిస్తాడు. అందుకే ఇదంతా’’ అని కోల్కతా నైట్రైడర్స్ క్రికెటర్ దినేశ్ కార్తిక్.. మంగళవారం నాటి మ్యాచ్కు సంబంధించిన గొడవ గురించి వివరించాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా పంత్సేన జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లయింది. అయితే, నిన్న షార్జాలో జరిగిన ఈ మ్యాచ్లో రెండు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండూ కూడా ఢిల్లీ ఆటగాడు అశ్విన్తో ముడిపడినవే కావడం గమనార్హం. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్.. ఢిల్లీని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్ వేసిన 19వ ఓవర్లో.. పంత్ను రనౌట్ చేసే అవకాశం చేజారింది. ఓవర్ ఐదో బంతిని పంత్ హిట్ చేసి పరుగు తీశాడు. అయితే, త్రిపాఠి వేసిన బంతిని.. అందుకోవడంలో అయ్యర్ విఫలం అయ్యాడు. అదే సమయంలో రెండో పరుగు కోసం అశ్విన్ పిలవడం.. ఈ క్రమంలో అనుకోకుండా అయ్యర్కు అడ్డురావడం జరిగింది. ఈ నేపథ్యంలో.. తదుపరి ఓవర్లో కేకేఆర్ పేసర్ టిమ్ సౌథీ అశ్విన్తో గొడవకు దిగడం గమనార్హం. ఇంతలో కెప్టెన్ మోర్గాన్ కూడా అతడికి మద్దతుగా ముందుకు వచ్చాడు. దీంతో.. గొడవ పెద్దదయ్యేలా కనిపించింది. అయితే, వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ వచ్చిన అశ్విన్ను దూరంగా తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. ఈ విషయాల గురించి దినేశ్ కార్తిక్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. 19వ ఓవర్లో బంతి పంత్ను తాకిన తర్వాత కూడా రెండో పరుగు తీయడం క్రీడాస్ఫూర్తిని విస్మరించడం వంటిదేనని భావించి, మోర్గాన్ కలుగజేసుకున్నాడని పేర్కొన్నాడు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్ చేసిన పని గురించి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. అయితే, కేవలం ఇది తన అభిప్రాయం మాత్రమే అని దినేశ్ కార్తిక్ స్పష్టం చేశాడు. ఏదేమైనా.. తన జోక్యం వల్ల గొడవ సద్దుమణిగినందుకు సంతోషంగా ఉందని, ఇప్పుడు అంతా సర్దుకుందని పేర్కొన్నాడు. చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు -
అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు
Ashwin Roars After Eoin Morgan Duck Out.. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు దెబ్బ తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సందర్భంగా సౌథీ, అశ్విన్ల మధ్య మాటలయుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలో మోర్గాన్ దూరి సౌథీకి మద్దతు పలుకుతూ మాట్లాడడంతో ఆశ్విన్ మోర్గాన్కు బ్యాట్ చూపిస్తూ కోపంగా వెళ్లిపోయాడు. అయితే అశ్విన్ తప్పు లేకపోయిన కావాలనే రెచ్చగొట్టడంతో తనను గెలికితే ఎలా ఉంటుందో మోర్గాన్కు రుచి చూపించాడు. చదవండి: IPL 2021: డెబ్యూ మ్యాచ్లోనే గొడవ.. మోర్గాన్ మద్దతు Courtesy: IPL Twitter కేకేఆర్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మోర్గాన్ క్రీజులోకి వచ్చాడు. ఆ ఓవర్ అశ్విన్ బౌలింగ్ చేశాడు. అశ్విన్ వేసిన ఓవర్ రెండో బంతిని మోర్గాన్ లెగ్సైడ్ ఆడగా.. స్లిప్లో ఉన్న లలిత్ యాదవ్కు క్యాచ్ తీసుకోవడంతో డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో అశ్విన్ మోర్గాన్పై కోపాన్ని చూపిస్తూ గట్టిగా అరుస్తూ పెవిలియన్కు వెళ్లు అని అరుస్తూ చెప్పాడు. ఇక మ్యాచ్లో కేకేఆర్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కేకేఆర్ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. -
మోర్గాన్లా చేయాల్సి వస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకునేవాడిని..
Gautam Gambhir Lashes Out At Eoin Morgan: ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా సెప్టెంబర్ 23న కోల్కతా నైట్రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. డగౌట్లో కూర్చున్న కేకేఆర్ వ్యూహకర్త(అనలిస్ట్) నాథన్ లీమన్ నుంచి ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కోడ్ భాషలో సూచనలు అందుకోవడం కనిపించింది. లీమన్.. మూడు, నాలుగు నంబర్ల ఫ్లకార్డులను ఫీల్డ్లో ఉన్న మోర్గాన్కు చూపిస్తూ అప్రమత్తం చేస్తున్నట్లు కనపించాడు. ఈ వీడియో నాటి నుంచి నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంది. దీనిపై తాజాగా కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. pic.twitter.com/T0g0Z4Bzzq— Jabjabavas (@jabjabavas) September 23, 2021 మోర్గాన్లా డగౌట్లో కుర్చున్న వ్యూహకర్త నుంచి సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చుంటే.. తానైతే కెప్టెన్సీ నుంచి తప్పుకునేవాడినంటూ వ్యాఖ్యానించాడు. డగౌట్లో కూర్చున్న వ్యక్తులను నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో కేకేఆర్ కెప్టెన్ ఉన్నాడంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో నిర్ణయాలు అప్పటికప్పుడు మైదానంలో ఉన్న ఆటగాళ్లే చర్చించి తీసుకోవాలని, ఇలా బయటి వ్యక్తుల సలహాలు తీసుకునే పద్ధతి కరెక్ట్ కాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఐపీఎల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గంభీర్.. సహచర కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అడిన ప్రశ్నపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. Nathan Leamon is back with those codes for Morgan from the dugout.Was done during the Eng SA series, now for #KKR. Should become a mainstream tactic!#SRHvKKR #IPL2021 pic.twitter.com/tvG3lBjTSQ— Rohit Sankar (@imRohit_SN) April 11, 2021 ఇదిలా ఉంటే, కేకేఆర్ జట్టుకు అనలిస్ట్గా వ్యవహరిస్తున్న నాథన్ లీమన్.. ఇంగ్లండ్ జట్టుకు కూడా అనలిస్ట్గా సేవలందిస్తున్నాడు. లీమన్, మోర్గాన్ కాంబినేషన్లో ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుంది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన లిమిటెడ్ ఓవర్స్ సిరీస్లోనూ వీరి జోడీ ఇలా కోడ్ నంబర్లతో సంభాషించుకుంటూ కనిపించింది. దీనికి సంబంధించిన సన్నివేశాలు అప్పట్లో వైరలయ్యాయి. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ జట్టు 10 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: ఇంగ్లండ్ అభిమానులకు షాకిచ్చిన మొయిన్ అలీ.. -
కేకేఆర్కు భారీ షాక్.. కెప్టెన్తో పాటు ఆటగాళ్లకు సైతం..
KKR skipper Eoin Morgan fined INR 24 lakh: గెలుపు జోష్లో ఉన్న కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్తో పాటు తుదిజట్టులోని ఆటగాళ్లకు జరిమానా విధించారు. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా సారథి మోర్గాన్కు రూ. 24 లక్షలు, ఆటగాళ్లకు కనీసం 6 లక్షల రూపాయలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. రెండోసారి ఈ తప్పిదం చేసినందుకుగానూ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ మేరకు ఫైన్ వేసింది. ఇందుకు సంబంధించి.. ‘‘ఐపీఎల్ నియమావళిని అనుసరించి.. కనీస ఓవరు రేటు మెయింటెన్ చేయని కారణంగా.. రెండోసారి ఈ తప్పు పునరావృతం చేసినందుకు కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్కు 24 లక్షల జరిమానా విధించాం. ఇక తుదిజట్టులో ఆడిన ప్లేయర్లకు ఒక్కొక్కరి ఫీజులో 25 శాతం కోత లేదంటే 6 లక్షల ఫైన్ వేశాం’’ అని ఐపీఎల్ ప్రకటన విడుదల చేసింది. Courtesy : PHOTO IPL Website కాగా ఈ సీజన్ ఆరంభంలో చెన్నై సూపర్కింగ్స్తో ఏప్రిల్ 21న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో.. ఇదే తరహాలో స్లో ఓవర్ రేటు కారణంగా కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్కు 12 లక్షల జరిమానా విధించారు. ఇక గురువారం అబుదాబిలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఏడు వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ సందర్భంగా మోర్గాన్ మాట్లాడుతూ.. ముంబై వంటి మేటి జట్టుపై విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నాడు. యువ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారని వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: IPL 2021: కోహ్లికి షాకివ్వనున్న ఆర్సీబీ యాజమాన్యం.. నిజమేనా?! -
జాతి వివక్ష: చిక్కుల్లో పడిన మోర్గాన్, బట్లర్
లండన్: సోషల్ మీడియా వేదికగా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు ఇంగ్లండ్ క్రికెట్ను కుదిపేస్తున్నాయి. ఇంగ్లండ్ యువ బౌలర్ ఓలీ రాబిన్సన్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివక్ష ట్వీట్లను సీరియస్గా తీసుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. అతని ట్వీట్స్పై విచారణ ప్రారంభించిన ఈసీబీ పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు గతంలో చేసిన పాత ట్వీట్లను వెలికితీస్తోంది. ఇప్పుడు ఈ వివాదం ప్రస్తుత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మెర్గాన్తో పాటు వికెట్ కీపర్ జోస్ బట్లర్లను చిక్కుల్లో పడేలా చేసింది. దీనిపై టెలిగ్రాఫ్ పత్రిక ఒక కథనం విడుదల చేసింది. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఐపీఎల్లో కోల్కతా కెప్టెన్గా ఉన్న ఇయాన్ మోర్గాన్, రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా గతంలో ఇండియన్స్ను వెక్కిరిస్తూ పలు ట్వీట్లు చేశారు. మోర్గాన్, బట్లర్ ఇద్దరూ సర్ అనే పదం పదే పదే వాడుతూ ఇండియన్స్ను వెక్కిరించారు. కావాలని తప్పుడు ఇంగ్లిష్ వాడుతూ చేసిన ఆ ట్వీట్లు ఇండియన్స్ను వెక్కిరించేలాగానే ఉన్నట్లు ఈసీబీ భావిస్తోంది. 2018 ఐపీఎల్ సందర్భంగా వీళ్లు ఈ ట్వీట్లు చేశారు. బట్లర్ ఆ ట్వీట్లను తొలగించినా.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ బయటకు వచ్చింది. విచారణ పూర్తయిన తర్వాత ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలో వద్దో నిర్ణయిస్తామని ఈసీబీ చెప్పినట్లు టెలిగ్రాఫ్ వెల్లడించింది. రాబిన్సన్ను సస్పెండ్ చేసిన తర్వాత వీళ్ల పాత ట్వీట్లు కూడా వైరల్ అయ్యాయి. మరోవైపు ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్పైనా విచారణ జరిగే అవకాశం ఉంది. 2010లో అతడు తన సహచర బౌలర్ బ్రాడ్ హెయిర్కట్పై స్పందిస్తూ.. 15 ఏళ్ల లెస్బియన్లా కనిపిస్తున్నాడంటూ అండర్సన్ ట్వీట్ చేశాడు. దీనిపై అండర్సన్ స్పందిస్తూ.. ఎప్పుడో పదేళ్ల కిందట అలా చేశానని, ఇప్పుడు తానో వ్యక్తిగా మారిపోయానని, తప్పులు జరుగుతూనే ఉంటాయని ఈ మధ్యే వివరణ ఇచ్చుకున్నాడు. చిలికి చిలికి గాలి వానలా మారుతున్న ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. మొదటి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టు జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. అనంతరం ఇంగ్లండ్ జట్టు టీమిండియాతో ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14వరకు ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: జాతి వివక్ష: మరో ఇంగ్లండ్ క్రికెటర్పై వేటు పడనుందా! కేన్ విలియమ్సన్ మోచేతికి గాయం.. కివీస్లో కలవరం -
దంచి కొట్టిన షా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
కేకేఆర్తో జరిగిన మ్యచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 16. 3 ఓవర్లలోనే చేధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 40 బంతుల్లోనే 11 ఫోర్లు.. 3 సిక్సర్లు బాది 82 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. శిఖర్ ధావన్ 46 పరుగులతో అతనికి సహకరించాడు. మొదటి వికెట్కు ఈ ఇద్దరు కలిసి రికార్డు స్థాయిలో 132 పరుగులు జోడించి విజయానికి బాటలు పరిచారు. విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో పృథ్వీ ఔట్ కాగా.. 16 పరుగులు చేసి పంత్ కూడా అవుట్ అయ్యాడు. అయితే మరో వికెట్ పడకుండా హెట్మైర్, స్టోయినిస్ లాంచనాన్ని పూర్తి చేశారు. కేకేఆర్ బౌలర్లలో కమిన్స్కు రెండు వికెట్లు దక్కగా.. మిగతా బౌలర్లు దారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. చివర్లో రసెల్(27 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. శుబ్మన్ గిల్ 43 పరుగులతో ఆకట్టుకోగా కేకేఆర్ బ్యాట్స్మెన్లలో ఇద్దరు డకౌట్గా వెనుదిరిగారు. ఢిల్లీ బౌలర్లలో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ఖాన్, స్టొయినిస్ చెరో వికెట్ తీశారు భారీ విజయం దిశగా ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్తో జరుగుతున్న మ్యచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం దిశగా సాగుతుంది. 13 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. పృథ్వీ షా 79, ధావన్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి ఇంకా 32 పరుగుల దూరంలో మాత్రమే ఉంద 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ లక్ష్యం దిశగా దూసుకుపోతుంది. 9 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 84/0 గా ఉంది.పృథ్వీ షా 55, ధావన్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక పృథ్వీ షా (18 బంతుల్లో 50) హాఫ్ సెంచరీ మార్క్ను అందుకొని ఢిల్లీ తరపున తక్కువ బంతుల్లో ఫిప్టీ సాధించి పంత్తో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో మోరిస్(17 బంతులు) ఉన్నాడు పృథ్వీ షా జోరు.. 7 ఓవర్లలో 71/0 ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతుండడంతో 7 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 71/0 గా ఉంది. ఈ సీజన్లో పవర ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. పృథ్వీ షా 49, ధావన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ దూకుడు.. 3 ఓవర్లలో 43/0 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడు కనబరుస్తుంది. శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో పృథ్వీ షా వైడ్ సహా మొత్తం 25 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన పృథ్వీ షా తాను ఎంత ప్రమాదకర ఆటగాడో చెప్పకనే చెప్పాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టాపోకుండా 43 పరుగులు చేసింది. షా 32, ధావన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వరుస విరామాల్లొ వికెట్లు కోల్పోతూ ఒక దశలో 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే చివర్లో రసెల్(27 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. శుబ్మన్ గిల్ 43 పరుగులతో ఆకట్టుకోగా కేకేఆర్ బ్యాట్స్మెన్లలో ఇద్దరు డకౌట్గా వెనుదిరిగారు. ఢిల్లీ బౌలర్లలో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ఖాన్, స్టొయినిస్ చెరో వికెట్ తీశారు. ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. 109/6 కేకేఆర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. 14 పరుగులు చేసిన కార్తిక్ అక్షర్ పటేల్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 17 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. కమిన్స్ 3, రసెల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. లలిత్ యాదవ్ దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు ఢిల్లీ బౌలర్ లలిత్ యాదవ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కేకేఆర్ను దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రెండో బంతికి మోర్గాన్ను డకౌట్ చేసిన లలిత్ నాలుగో బంతికి నరైన్(0) క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో 75 పరుగలకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. గిల్ 41, రసెల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ రాహుల్ త్రిపాఠి(19) రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 10 ఓవర్ల ఆట ముగిసేసరికి 2 వికెట్లు నష్టపోయి 73 పరుగులు చేసింది. 9 ఓవర్ల ఆట ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. గిల్ 34, త్రిపాఠి 19 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 15 పరుగులు చేసిన రానా అక్షర్ బౌలింగ్లొ స్టంప్ అవుట్గా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్.. 32/1 ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన నితీష్ రానా అక్షర్ పటేల్ బౌలింగ్లో పంత్ మెరుపు స్టంపింగ్కు వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. గిల్ 12, రాహుల్ త్రిపాఠి 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు కేకేఆర్తో తలపడనుంది. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైన ఢిల్లీ కేకేఆర్పై విజయం సాధించాలని చూస్తుంది. మరోవైపు వరుసగా నాలుగు పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు రుచి చూసిన కేకేఆర్ అదే జోరును కొనసాగించాలిన భావిస్తుంది. ఇక టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య ముఖాముఖి రికార్డుల్ని పరిశీలిస్తే.. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 26 మ్యాచ్ల్లో తలపడగా.. 14 మ్యాచ్ల్లో కేకేఆర్.. 11 మ్యాచ్ల్లో ఢిల్లీ గెలుపొంగా.. ఒక దాంట్లో మాత్రం ఫలితం రాలేదు. ఇక ఢిల్లీపై కోల్కతా చేసిన అత్యధిక స్కోరు 210 పరుగులు కాగా.. కోల్కతాపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 228 పరుగులుగా ఉంది. ఇక గత సీజన్లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ , కేకేఆర్ చెరో మ్యాచ్ను గెలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, ధవన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, షిమ్రోన్ హెట్మేయర్, స్టొయినిస్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, రబాడ, లలిత్ యాదవ్, ఆవేశ్ ఖాన్ కేకేఆర్: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), నితీశ్ రాణా, శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, దినేశ్ కార్తిక్, అండ్రీ రసెల్, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి, ప్రసిద్ధ కృష్ణ -
మోర్గాన్కు డగౌట్ నుంచి హెల్ప్.. అప్పుడు కూడా అంతే!
అహ్మదాబాద్: ఈ ఐపీఎల్లో సోమవారం(ఏప్రిల్ 26వ తేదీ) అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్కు డగౌట్ నుంచి కోడ్ లాంగ్వేజ్ సందేశాలు అందడం చర్చనీయాంశమైంది. కేకేఆర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోఓ ఆ జట్టు ఎనలిస్ట్గా పనిచేస్తున్న నాథన్ లీమన్ డగౌట్ నుంంచి ‘54’ కోడ్ను చూపించాడు. ఆ సంఖ్యను ప్లకార్డు రూపంలో చేతిలో పట్టుకుని ప్రదర్శించాడు. ఇది ఆఫ్సైడ్-లెగ్సైడ్ ఫీల్డింగ్కు సంబంధించిన కోడ్ కావొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. దీనిపై వివాదం చెలరేగకపోయినా హాట్ టాపిక్ అయ్యింది.. ఇది నియమావళిని ఉల్లంఘించడమా.. కాదా అనే చర్చ నడిచింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్దమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, ఇలా డగౌట్ నుంచి సంకేతాలు అందడంంలో ఎలాంటి తప్పు లేదని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఎవరైనా తమ జట్టును నడిపించడానికి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవచ్చన్నాడు. డగౌట్ నుంచి ఇలా చెప్పడానికి కెప్టెనే కావాల్సిన అవసరం లేదన్నాడు. అది కేకేఆర్ గేమ్ ప్లాన్లో భాగంగానే చూడాలన్నాడు. తనకు తెలిసినంతవరకూ 54 సంఖ్య అనేది గేమ్ ప్లాన్ అయ్యుంటుందని, ఈ చిన్న సాయంలో తప్పేమీ లేదన్నాడు. ఇటీవల కాలంలో డగౌట్ల నుంచి సంకేతాలు ఇవ్వడం జరగడం మనకు అప్పుడప్పుడు కనిపిస్తోంది. గతేడాది చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో కూడా ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్కు ఇలానే డగౌట్ నుంచి సందేశాలు వచ్చాయి. అప్పుడు మోర్గాన్ ఫీల్డింగ్ సెట్ చేసే క్రమంలో ఇంగ్లండ్ జట్టు అన్లిస్ట్గా ఉన్న నాథన్ లీమనే ఈ సందేశాలు పంపాడు. కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భాగంగా బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ కూర్పునకి సహాయపడేలా నాథన్ బోర్డుపై 3C, 4E అంటూ స్టేడియంలో ప్రదర్శించాడు. వాటిని చూస్తూ కెప్టెన్ మోర్గాన్ తన వ్యూహాల్ని మార్చుకుంటూ వెళ్లాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా మూడు టీ20ల సిరీస్ని 3-0తో చేజిక్కించుకుంది. దీన్ని మోర్గాన్ సమర్ధించుకున్నాడు. ఇది ఎంతమాత్రం తప్పుకాదన్నాడు. దీన్ని కూడా గేమ్ ప్లాన్లో భాగంగానే చూడాలన్నాడు. -
'ఇకపై ఏం చేసినా మరింత స్ట్రాంగ్గా ఉండాలి'
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో కేకేఆర్ నాలుగు పరాజయాల తర్వాత సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 16.4 ఓవర్లలోనే చేధించింది. మోర్గాన్ 47 పరుగులు నాటౌట్ చివరివరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఇక కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్లో ఏప్రిల్ 29న అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్తో మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ హెడ్కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఇచ్చిన స్పీచ్ వైరల్గా మారింది. '' ఈరోజు మ్యాచ్లో మీరు చూపిన ఆట అద్భుతం. మొదట బౌలింగ్ టీంను అభినందించాలి. ఆ తర్వాత ఫీల్డింగ్లో కూడా మెరవడం మనకు కలిసొచ్చింది. అయితే బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి 20 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందనుకున్నా.. కానీ మోర్గాన్, రాహుల్ త్రిపాఠిల కౌంటర అటాక్ సూపర్.. దీనిని రానున్న మ్యాచ్ల్లో కొనసాగించాలి. గేమ్ ఆడితే ఫోకస్ చాలా కీలకం. అది మనకు ఎవరు చెప్పరు.. ఆట ఆడేటప్పుడు మనకు ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకొని నిలబడి ఆడాలి. మోర్గాన్, త్రిపాఠిలు అదే చేసి చూపించారు. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత విక్టరీ సాధించాం. దీనికి ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఈ విజయంతో మీకు కాన్ఫిడెంట్ పెరిగిందని అనుకుంటున్నా. ఇకపై ఏం చేసినా మరింత స్ట్రాంగ్గా ఉండాలనేది నా నిర్ణయం అంటూ'' చెప్పుకొచ్చాడు. మెక్కల్లమ్ స్పీచ్ను కేకేఆర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కాగా పంజాబ్ కింగ్స్పై విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. చదవండి: అదృష్టం బాగుండి ఆ బ్యాట్ ఎవరిపై పడలేదు బయట భయంకర పరిస్థితులే ఉన్నాయి: మోర్గాన్ View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
బయట భయంకర పరిస్థితులే ఉన్నాయి: మోర్గాన్
అహ్మదాబాద్: కరోనా వైరస్ మళ్లీ విజృంభించడంతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భయంకర పరిస్థితులున్నాయని కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన అన్నాడు. తాము బయోబబుల్ వాతావరణంలో ఉన్నామని, బయట మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నాడు. దీనికి తమ వంతు సహకారాన్ని, మద్దతును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. ఎవరైనా బయటకు వెళుతుంటే సురక్షితంగా ఉండటానికి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గమన్నాడు. ఈ కరోనా వైరస్ను మొదటిసారి చూసినప్పుడు ఎంత వినాశనాన్ని సృష్టించిందో అందరికీ తెలుసన్నాడు. అంతిమంగా ఒకేతాటిపై ఉండి దీనిపై పోరాడాల్సిన సమయం ఇదన్నాడు. పంజాబ్ కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో విజయం తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన మోర్గాన్.. బయోబబుల్ను దాటి బయట పరిస్థితులు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితే ఉందన్నాడు. ఇక మ్యాచ్లో విజయం సాదించడంపై మాట్లాడుతూ..‘ విజయాలు అంత సులువుగా రావడం లేదు. మా వాళ్లు చాలా కష్టపడ్డారు. కొంచెం అదృష్టంతో పాటు బంతితో పంజాబ్ కింగ్స్న కట్టడి చేసిన తీరు బాగుంది. ఇక ఈ సీజన్లో రెండో మ్యాచ్ ఆడుతున్న శివం మావి.. చివర్లో బాగా బౌలింగ్ చేశాడు. అలాగే ఆరంభంలో కూడా మావి ఆకట్టుకున్నాడు. ఈ టోర్నమెంట్లో ముందుకు వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది’ అని తెలిపాడు. -
ఐపీఎల్ 2021: పంజాబ్పై కేకేఆర్ విజయం
ఐపీఎల్ 14వ సీజన్లో కేకేఆర్ వరుసగా నాలుగు పరాజయాల తర్వాత మరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ 47 పరుగులు నాటౌట్గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. త్రిపాఠి 41, కార్తీక్ 12 పరుగులు నాటౌట్ అతనికి సహకరించారు. పంజాబ్ బౌలర్లలో హెన్రిక్స్, షమీ, అర్షదీప్, హుడా తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కేకేఆర్ బౌలర్ల దాటికి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఒక దశలో వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే చివర్లో క్రిస్ జోర్డాన్(18 బంతుల్లో 30 పరుగులు; 3 సిక్సర్లు, 1 ఫోర్) వేగంగా ఆడడంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓపెనర్ మయాంక్ 31 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, కమిన్స్, నరైన్ చెరో 2, మావి, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు. రసెల్ రనౌట్.. కేకేఆర్ 115/5 కేకేఆర్ మరో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన ఆండ్రీ రసెల్ అర్షదీప్ వేసిన డైరెక్ట్ త్రోకు రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం కేకేఆర్ స్కోరు 16 ఓవర్లలో 115/5గా ఉంది. మోర్గాన్ 45, దినేష్ కార్తిక్ 2 పరుగులతో క్రీజలో ఉన్నారు. రాహుల్ త్రిపాఠి( 42) రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ చివరి బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. మోర్గాన్ 27, రసెల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లలో కేకేఆర్ 76/3 పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ లక్ష్యం దిశగా సాగుతుంది. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 36, మోర్గాన్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. స్కోరు 46/3 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. అర్షదీప్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ చివరి బంతికి సునీల్ నరైన్ డకౌట్గా వెనుదిరిగాడు. డీప్ మిడ్వికెట్ మీదుగా నరైన్ భారీ షాట్కు యత్నించాడు. అయితే రవి బిష్ణోయ్ చాలా దూరం ముందుకు పరిగెత్తుకు వచ్చి డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ను అందుకున్నాడు. ప్రస్తుతం కేకేఆర్ 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. 10 పరుగులకే రెండు వికెట్లు డౌన్ 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. హెన్రిక్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే నితీష్ రానా డకౌట్గా వెనుదిరగ్గా... షమీ వేసిన రెండో ఓవర్లో 9 పరుగులు చేసిన గిల్ ఎల్బీగా అవుటయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ స్కోరు 2 ఓవర్లలో 10/2 గా ఉంది. కేకేఆర్ టార్గెట్ 124 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కేకేఆర్ బౌలర్ల దాటికి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఒక దశలో వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే చివర్లో క్రిస్ జోర్డాన్(18 బంతుల్లో 30 పరుగులు; 3 సిక్సర్లు, 1 ఫోర్) వేగంగా ఆడడంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓపెనర్ మయాంక్ 31 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3, కమిన్స్, నరైన్ చెరో 2, మావి, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు. ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్ పంజాబ్ కింగ్స్ 7వ వికెట్ను కోల్పోయింది. 13 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్ ప్రసిధ్ బౌలింగ్లో మోర్గాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 17 ఓవర్లలో 95/7గా ఉంది. సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్.. 78/5 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో పరుగులు చేయలేక వరుస విరామాల్లో వికెట్లను చేజార్చుకుంటుంది. 10 ఓవర్లలో పంజాబ్ స్కోరు 56/3 పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ పంజాబ్ ఇన్నింగ్స్కు మయాంక్, పూరన్లు నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. మయాంక్ 29, పూరన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ పంజాబ్ కింగ్స్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతుంది. 1 పరుగు చేసిన దీపక్ హుడా ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో మోర్గాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ స్కోరు 8 ఓవర్లలో 44/3 గా ఉంది. మయాంక్ 20, పూరన 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. గేల్ గోల్డెన్ డక్.. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. పవర్ హిట్టర్ క్రిస్ గేల్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ మూడో బంతిని ఆడే ప్రయత్నంలో గేల్ బ్యాట్ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో కేకేఆర్ రివ్యుకు వెళ్లింది. రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ను తాకుతూ వెళ్లడంతో గేల్ ఔటయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ఔట్.. పంజాబ్ 37/1 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన రాహుల్ పాట్ కమిన్స్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి నరైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పవర్ ప్లే ముగిసేసరికి 6 ఓవర్లలో పంజాబ్ స్కోరు 37/1గా ఉంది. మయాంక్ 16, గేల్(0) క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లలో పంజాబ్ స్కోరు 20/0 కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ను నిలకడగా ఆరంభించింది. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 20/0గా ఉంది. రాహుల్ 6, మయాంక్ అగర్వాల్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో వరుస పరాజయాలతో ఢీలాపడిపోయిన కోల్కతా నైట్రైడర్స్ నేడు పంజాబ్ కింగ్స్తో తలపడతుంది. కాగా టాస్ గెలిచిన కేకేఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటికే ఐదు మ్యాచ్లాడిన కేకేఆర్ ఒక్కదాంట్లో గెలిచి.. మిగతా నాలుగింటిలో ఓడిపోయింది. ఇక పంజాబ్ కింగ్స్ ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడింట ఓడి.. రెండింటిలో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్కు కేకేఆర్ ఏ మార్పు చేయలేదు.. పంజాబ్ కింగ్స్ మాత్రం ఫాబియెన్ అలెన్ స్థానంలో క్రిస్ జోర్డాన్ను తుది జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, కేకేఆర్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఇరుజట్లు 27 మ్యాచ్ల్లో తలపడగా.. 18 మ్యాచ్ల్లో కేకేఆర్ విజయం సాధించగా.. మిగిలిన 9 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. కాగా పంజాబ్పై కోల్కతా చేసిన అత్యధిక పరుగులు 245కాగా.. కోల్కతాపై పంజాబ్ చేసిన అత్యధిక స్కోరు 214 పరుగులుగా ఉంది. కేకేఆర్: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), నితీశ్ రాణా, శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, దినేశ్ కార్తిక్, అండ్రీ రసెల్, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి, ప్రసిద్ధ కృష్ణ పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, పూరన్, దీపక్ హూడా, షారుఖ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, మెయిసిస్ హెన్రిక్స్, షమీ, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్ -
మోర్గాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా?
ముంబై: గత ఐపీఎల్లో గుర్తుండే ఉంటుంది. కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా వ్యవహరించిన దినేశ్ కార్తీక్ అర్థాంతరంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇందులకు కారణం కార్తీక్పై వచ్చిన విమర్శలు.. ఇంగ్లండ్కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ను కేకేఆర్ జట్టులో ఉంచుకొని కార్తీక్కు కెప్టెన్సీ ఎందుకని ప్రశ్నించారు. దాంతో తనకు సారథ్యం వద్దని కార్తీక్ తప్పుకున్నాడు. దినేశ్ కార్తీక్ స్వయంగా తప్పుకున్నాడనే దానికంటే తప్పించారంటేనే సబబు. ఆ రోజు కార్తీక్కు మేనేజ్మెంట్ అండ ఉంటే సారథ్య బాధ్యతల్ని వదులుకునే వాడు కాదు. అప్పుడు కేకేఆర్ యాజమాన్యం కార్తీక్ను అడిగి తర్వాత అతను తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మోర్గాన్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం, కార్తీక్తో తనకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పడం చకచకా జరిగిపోయాయి. అంతే చకచకా కేకేఆర్ కథ లీగ్ దశలోనే ముగిసింది. మరి ఈ సీజన్లో కేకేఆర్ ఐదు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది. వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో కొనసాగుతోంది., దాంతో కేకేఆర్ ప్లేఆఫ్స్కు చేరుతుందా అనే ప్రశ్న ఆ ఫ్రాంచైజీ అభిమానుల్లో మొదలైంది. అప్పుడు కార్తీక్ బ్యాటింగ్లో విఫలం అవుతున్నాడని అతను కెప్టెన్గా తప్పుకున్నాడని, ఇప్పుడు మోర్గాన్ కూడా జట్టుకు అద్భుత ఫలితాల్ని ఏమీ ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బ్యాట్స్మన్గా కూడా మోర్గాన్ విఫలం అవుతున్నాడని మరి కొత్త కెప్టెన్ కేకేఆర్ ట్రై చేస్తుందా అని అభిమానులు ప్రశ్నిస్తున్నాడు. ఐపీఎల్-14 సీజన్కు కామెంటేటర్లుగా పని చేస్తున్న మాజీలు కూడా ఇదే ప్రశ్న లేవదీయం గమనార్హం. రాజస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ దారుణంగా ఓడిపోయిన తర్వాత మోర్గాన్ సారథ్యాన్ని టార్గెట్ చేశారు.. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్తాన్ బ్యాటింగ్లో సామ్సన్ 42 పరుగులతో రాణించగా.. మిల్లర్ 24 పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. -
మేము కూడా బౌలింగ్ తీసుకోవాలనుకున్నాం: మోర్గాన్
ముంబై: రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిస్లే తాము కూడా ముందుగా బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. మేమంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నామని సరదాగా వ్యాఖ్యానించాడు. రాజస్థాన్తో మ్యాచ్లో టాస్కు వచ్చిన సమయంలో మోర్గాన్.. వాంఖడే స్టేడియంలో పరిస్థితుల్ని అర్థం చేసుకున్నామన్నాడు. ‘మేము గత మ్యాచ్ ఆడిన సందర్భంలో 220 పరుగుల స్కోరు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు సాధించింది. ఇది ఇక్కడ మాకు రెండో గేమ్. పరిస్థితులు అర్థమయ్యాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ థ్రిల్లింగ్గా అనిపించింది. మేము ఆటను ముగించిన విధానం అసాధారణమే. మా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ అంతా ఫామ్లోకి వచ్చారు. మేము ఆడే ఆటకు ఇక్కడ మైదానం సూట్ అవుతుంది. మా తప్పిదాల్ని నుంచి బయటపడతామని భావిస్తున్నాం’ అని తెలిపాడు. ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ సామ్సన్ మాట్లాడుతూ. .ఇక్కడ పరిస్థితులు బౌలర్లకు అనుకూలిస్తాయని ముందుగా బౌలింగ్కు వెళ్లామన్నాడు. తాము చాలా మంది కీలక ఆటగాళ్లు లేకుండా ఆడుతున్నా పాజిటివ్గా ముందుకు వెళుతున్నామన్నాడు. ఈ విషయంలో టీమ్ మెంబర్స్ను, మేనేజ్మెంట్ను అభినందిస్తున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఎత్తు పల్లాలు సహజమని, దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉండటమే మంచిదన్నాడు. తమ వాళ్లంతా మంచి క్రికెట్ ఆడతారని భావిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
ఐపీఎల్ 2021: కేకేఆర్పై రాజస్తాన్ విజయం
ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్తాన్ బ్యాటింగ్లో సామ్సన్ 42 పరుగులతో రాణించగా.. మిల్లర్ 24 పరుగులు సాధించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, మావి, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. డెత్ ఓవర్లలో మోరిస్ విజృంభించడంతో కేకేఆర్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.కేకేఆర్ బ్యాటింగ్లో రాహుల్ త్రిపాఠి 36 పరుగులతో టాప్స్కోరర్గా నిలవగా.. దినేశ్ కార్తిక్ 25 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4, సకారియా, ముస్తాఫిజుర్, ఉనాద్కట్లు చెరో వికెట్ తీశారు. విజయం దిశగా రాజస్తాన్ 134 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ విజయం దిశగా సాగుతుంది. సామ్సన్ 39, మిల్లర్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం రాజస్తాన్ స్కోరు 17 ఓవర్లలో 121/4గా ఉంది. అంతకముందు తెవాటియా(5) రూపంలో రాజస్తాన్ రాయల్స్ 100 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కాగా రాజస్తాన్ విజయానికి ఇంకా 33 బంతుల్లో 30 పరుగులు కావాల్సి ఉంది. సామ్సన్ 36, మిల్లర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం రాజస్తాన్ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఐదో బంతికి 22 పరుగులు చేసిన దూబే ప్రసిధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ స్కోరు 85/3గా ఉంది. 9 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 77/2 రాజస్తాన్ రాయల్స్ 9 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సామ్సన్ 27, దూబే 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 66 బంతుల్లో 57 పరుగులు కావాల్సి ఉంది. రాజస్తాన్ రెండో వికెట్ డౌన్ రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జైస్వాల్.. శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ ఐదో బంతికి నాగర్కోటికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ స్కోరు 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. సామ్సన్ (15), దూబే(13) క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్ 138 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ బట్లర్(5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. మిథున్ చక్రవర్తి బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ స్కోరు 36/1గా ఉంది. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ 134 రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. డెత్ ఓవర్లలో మోరిస్ విజృంభించడంతో కేకేఆర్ తక్కువ స్కోరుకు పరిమితమైంది. రెండు ఓవర్ల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బ్యాటింగ్లో రాహుల్ త్రిపాఠి 36 పరుగులతో టాప్స్కోరర్గా నిలవగా.. దినేశ్ కార్తిక్ 25 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4, సకారియా, ముస్తాఫిజుర్, ఉనాద్కట్లు చెరో వికెట్ తీశారు.అంతకముందు కేకేఆర్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. మోరిస్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మొదట రసెల్(9) మిల్లర్కు క్యాచ ఇచ్చి వెనుదిరగ్గా.. తర్వాత దినేశ్ కార్తిక్(25) చేతన్ సకారియాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కమిన్స్(5), మావి(4) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లలో కేకేఆర్ 93/4 15 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. త్రిపాఠి (36), దినేశ్ కార్తీక్(14)లు క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు గిల్, రానా, నరైన్, ఇయాన్ మోర్గాన్ వికెట్లను కేకేఆర్ నష్టపోయింది. ఈ వికెట్లలో రానా(22) ఫర్వాలేదనించగా మిగతా వారు విఫలమయ్యారు. మోర్గాన్ డైమండ్ డక్గా ఔట్ కావడంతో కేకేఆర్ ఒత్తిడిలో పడింది. త్రిపాఠి బంతిని ఫేస్ చేసి సింగిల్కు యత్నించగా, మోర్గాన్ రనౌట్ అయ్యాడు. నాన్ స్టైకింగ్ ఎండ్లో ఉన్న మోర్గాన్కు సింగిల్ తీద్దామని పిలిచాడు. కాగా, బంతి అక్కడే ఉందని గ్రహించిన త్రిపాఠి వద్దని వారించగా, అప్పటికే మోర్గాన్ క్రీజ్ను వీడి ముందుకొచ్చేశాడు. ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్ మోరిస్.. మోర్గాన్ను రనౌట్ చేశాడు. ఇయాన్ మోర్గాన్ డైమండ్ డక్ కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ డకౌట్ అయ్యాడు. నరైన్ మూడో వికెట్గా ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన మోర్గాన్.. కనీసం బంతిని కూడా ఆడకుండానే ఔటయ్యాడు. 11 ఓవర్ రెండో బంతికి పరుగు కోసం యత్నించి డైమండ్ డక్ అయ్యాడు. త్రిపాఠి బంతిని ఫేస్ చేసి సింగిల్కు యత్నించగా, మోర్గాన్ రనౌట్ అయ్యాడు. దాంతో 61 పరుగుల వద్ద కేకేఆర్ నాల్గో వికెట్ను కోల్పోయింది. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్ కేకేఆర్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను నష్టపోయింది. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద ఉండగా నితీష్ రానా(22) ఔట్ కాగా, ఆపై సునీల్ నరైన్(6) పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ 9 పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. ఉనాద్కత్ వేసిన 10 ఓవర్ ఐదో బంతికి జైస్వాల్కు క్యాచ్ నరైన్ ఔటయ్యాడు. దాంతో 54 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ను నష్టపోయింది. నితీష్ రానా(22) ఔట్, కేకేఆర్ 45/2 కేకేఆర్ రెండో వికెట్ను కోల్పోయింది. నితీష్ రానా(22) రెండో వికెట్గా ఔటయ్యాడు. సకారియా వేసిన 9 ఓవర్ తొలి బంతికి రానా ఔటయ్యాడు. దాంతో 45 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ను సష్టపోయింది. గిల్ రనౌట్.. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ కేకేఆర్ 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన గిల్ రనౌట్గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ నాలుగో బంతిని ఆడిన గిల్ లేని పరుగు కోసం ప్రయత్నించాడు. కవర్స్లో ఉన్న బట్లర్ బంతిని అందుకొని వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేశాడు. అప్పటికి గిల్ క్రీజుకు చాలా దూరంలో ఉండిపోవడంతో క్లియర్ రనౌట్ అని తేలింది. ప్రస్తుతం 8 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 45/1గా ఉంది. రానా 22, త్రిపాఠి 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 21/0 రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ నిలకడగా ఆడుతుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రానా 10, గిల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో నేడు రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా తొలి మ్యాచ్లోనే గెలిచిన కేకేఆర్ ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలను నమోదు చేసింది. అయితే సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో గెలిచినంత పని చేసిన కేకేఆర్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. మరోవైపు తొలి మ్యాచ్లో ఓడిన రాజస్థాన్ ఆ తర్వాత మ్యాచ్లో గెలిచినా వరుసగా రెండు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. కాగా ఈ మ్యాచ్కు కేకేఆర్ జట్టులో నాగర్ కోటి స్థానంలో శివమ్ మావి.. రాజస్తాన్ జట్టు నుంచి వోహ్రా స్థానంలో జైస్వాల్, శ్రేయాస్ గోపాల్ స్థానంలో ఉనాద్కట్ తుది జట్టులోకి వచ్చారు. ఇక ఐపీఎల్లో ఇరుజట్ల ముఖాముఖి పోరు చూసుకుంటే.. ఇప్పటి వరకూ 23 మ్యాచ్ల్లో తలపడగా.. 12 మ్యాచ్ల్లో కేకేఆర్ గెలవగా.. 10 మ్యాచ్ల్లో రాజస్తాన్ విజయం సాధించింది. ఒక్క మ్యాచ్లో మాత్రం ఫలితం తేలలేదు. ఇప్పటివరకు అన్ని సీజన్లు కలిపి చూసినా ఈ రెండు జట్లు తలపడిన ఏ మ్యాచ్లోనూ 200 పరుగుల స్కోరు నమోదు కాలేదు. కాగా ఐపీఎల్ 2020 సీజన్లో రాజస్థాన్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ కేకేఆర్నే విజయం వరించింది. తుది జట్లు: కేకేఆర్: నితీశ్ రాణా, శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, మోర్గన్, సునీల్ నరైన్, దినేశ్ కార్తిక్, అండ్రీ రసెల్, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి, ప్రసిద్ధ కృష్ణ రాజస్థాన్ రాయల్స్: సంజూ సామ్సన్(కెప్టెన్), బట్లర్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, మిల్లర్, రియాన్ పరాగ్, తెవాతియా, మోరిస్, ఉనాద్కట్, సకారియా, ముస్తాఫిజుర్ -
'మేం ఓడిపోయుండొచ్చు.. కానీ మనుసులు గెలిచాం'
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 18 పరుగులతో ఓడిపోయినా ఆకట్టుకుంది. చెన్నై విధించిన 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఒక దశలో 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో దినేష్ కార్తిక్, ఆండ్రీ రసెల్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా రసెల్ ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోగా.. కార్తిక్ కూడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. రసెల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కమిన్స్.. సిక్సర్లతో సీఎస్కే బౌలర్లను ఉతికారేస్తూ చుక్కలు చూపించాడు. ఆఖరి 2 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన దశలో టెయింలెండర్లు వికెట్లు సమర్పించుకోవడంతో కమిన్స్ పోరాటం వృథాగా మారింది. అలా మొత్తం ఓవర్లు కూడా ఆడకుండానే 19.1 ఓవరల్లో 202 పరుగులకు ఆలౌటై 18 పరుగులతో పరాజయం పాలైంది. అయితే నిన్నటి మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోయినా నెటిజన్ల మనుసులు మాత్రం గెలుచుకుంది. రసెల్, కార్తీక్, కమిన్స్ల ప్రదర్శనపై నెటిజన్లు తమ ప్రేమను ప్రదర్శిస్తూ కామెంట్లు చేశారు. కేకేఆర్ సహా యజమాని షారుఖ్ ఖాన్.. ''కేకేఆర్ బాయ్స్ మీరు సూపర్'' అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా కేకేఆర్ మ్యాచ్ ఓటమిపై ఆ ఫ్రాంచైజీ సహ యజమాని జూహి చావ్లా ట్విటర్ వేదికగా స్పందించారు. ' కేకేఆర్ టీమ్ను చూస్తే గర్వంగా ఉంది. మా కుర్రాళ్ల ప్రదర్శన నిజంగా అద్బుతం. ఈరోజు మ్యాచ్ ఓడిపోయిండొచ్చు.. కానీ మనసులు గెలవడంతో పాటు కొండంత ఆత్శవిశ్వాసాన్ని సాధించాం. థ్యాంక్యూ.. రసెల్, కార్తిక్ , కమిన్స్.. మీ హార్డ్వర్క్ సూపర్.. మీ ఆటకు ఫిదా' అంటూ కామెంట్ చేశారు. సీఎస్కేతో మ్యాచ్లో ఓటమితో.. కేకేఆర్ వరుసగా హ్యాట్రిక్ పరాజయాన్ని నమోదు చేసింది. కాగా కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్ను ఏప్రిల్ 24న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది. చదవండి: కేకేఆర్ బాయ్స్ మీరు సూపర్: షారుక్ రసెల్.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..! Proud of our team KKR .. after such a shaky start where we looked like we had collapsed 🙈🙈🙈🙈 ..!.!!!! our boys played strong and hard , and brought it to a close match ..!! Thank you Russell, DK, Pat ..!!! 💜💜💜💜💜💜 @Russell12A @DineshKarthik @patcummins30 @KKRiders — Juhi Chawla (@iam_juhi) April 22, 2021 -
ఇయాన్ మోర్గాన్కు షాక్.. ఎందుకంటే!
ముంబై: సీఎస్కేతో బుధవారం జరిగిన మ్యాచ్లో దుమ్ములేపిన కేకేఆర్ చివరకు పరాజయంతో సరిపెట్టుకుని షాక్లో ఉంటే ఇప్పుడు మరో షాక్ తగిలింది. కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్కు భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో మోర్గాన్కు రూ. 12లక్షల ఫైన్ విధించారు. ఇది కేకేఆర్ తొలి ఉల్లంఘన కావడంతో ఆ జట్టు కెప్టెన్ మోర్గాన్ ఫీజులో రూ. 12లక్షలను కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో ఈ సీజన్లో ఇప్పటివరకూ జరిమానా పడ్డ కెప్టెన్లలో మోర్గాన్ మూడోవాడు. ఇప్పటికే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ జరిమానా బారిన పడ్డ రెండో కెప్టెన్. ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం, తొలిసారి ఓవర్ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు కెప్టెన్కు రూ. 12 లక్షలు, మరోసారి అదే తప్పు పునరావృతం చేస్తే రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి గనుక ఇలాగే జరిగితే, కెప్టెన్కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్లో నిషేధం, అదే విధంగా తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ. 12 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు. ఇక్కడ చదవండి: అతను ఔటయ్యాక దూరంగా ఉంటా: మోర్గాన్ IPL 2021: ఇదేం నో బాల్ సైరన్.. క్రికెటర్ల అసహనం! -
అతను ఔటయ్యాక దూరంగా ఉంటా: మోర్గాన్
ముంబై: సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయినా తాము కడవరకూ పోరాడిన తీరుపై కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ను చూస్తున్నంతసేపు నరాలు తెగిపోయేంత ఉత్కంఠ కల్గిందన్న మోర్గాన్.. క్రికెట్ గేమ్ అంటే ఇది కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఒక రకంగా చూస్తే పవర్ ప్లేలో తాము ఆడిన తీరు చూసి ఓటమిని ముందే ఫిక్స్ అయ్యామని, అసలు గెలుపు అంచుల వరకూ వస్తామని కూడా అనుకోలేదన్నాడు. ఇంత దగ్గరగా వచ్చి ఓడిపోవడం ఒకింత నిరాశ కల్గించిందన్నాడు. ప్రధానంగా ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ల భాగస్వామ్యం చూసిన తర్వాత ఆశలు చిగురించాయన్నాడు. బ్యాటింగ్కు స్వర్గధామంలా ఉన్న ఈ పిచ్పై బ్యాట్స్మన్ ఒకసారి కుదురుకున్నాక ఆపడం కష్టమన్నాడు. వారిద్దరి భాగస్వామ్యం తర్వాత ప్యాట్ కమిన్స్ ఆడిన తీరు అద్భుతమన్నాడు. కమిన్స్ ఉన్నంతవరకూ తమకు గెలిచే చాన్స్ ఉందన్నాడు. మిడిల్, లోయర్ ఆర్డర్లో తమ బ్యాటర్స్ పోరాటం అద్వితీయమని మోర్గాన్ తెలిపాడు. తొలి ఐదు ఓవర్లు తమ బ్యాటింగ్ బాలేకపోవడమే ఓటమి కారణమన్నాడు. ఈ కొత్త గ్రౌండ్ పరిస్థితి, భిన్నమైన సవాళ్లు అర్థమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. తమ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో తమ ముందు భారీ లక్ష్యంం నిర్దేశించారని, అదే తమ కొంపముంచిందన్నాడు. ఇక రసెల్ గురించి మాట్లాడిన మోర్గాన్.. అతను ఫామ్లోకి రావడం సంతోషంగా ఉందన్నాడు. అతను బంతిని హిట్ చేసిన విధానం చాలా బాగుందన్నాడు. కచ్చితంగా రసెల్ మంచి ఆటగాడన్నాడు. తాను రసెల్ ఔటైన తర్వాత అతనికి దూరంగా ఉంటానన్న మోర్గాన్.. తమ నుంచి అతనికి ఎటువంటి సహకారం అందించలేకపోయమన్నాడు. అది రసెల్ను తప్పకుండా నిరాశకు గురి చేస్తుందన్నాడు. చదవండి: ఎంఎస్ ధోని లెక్క తప్పిందా? -
అక్కడ ఉన్నది ఏబీ.. బౌలింగ్ ఎవరికిచ్చావ్!
చెన్నై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఘోర పరాజయం చవిచూడటం ఒకటైతే, ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అనుసరించిన వ్యూహాలపై విమర్శల వర్షం కురుస్తోంది. నిన్న ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్.. మోర్గాన్ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు ఆ జాబితాలో మరో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా చేరిపోయాడు. అసలు మోర్గాన్ గేమ్ ప్లాన్ ఏమిటంటూ తన యూట్యూబ్ వేదికగా ధ్వజమెత్తాడు. ఈ క్రమంలోనే కొన్ని ప్రశ్నలను సంధించాడు. ప్రధానంగా ఆర్సీబీ ఇన్నింగ్స్లో కేకేఆర్ 19 ఓవర్ను వేయించే క్రమంలో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్కు బౌలింగ్ ఇవ్వడాన్ని చోప్రా నిలదీశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు ఒకే ఓవర్లో తీసిన తర్వాత అతని చేతికి బంతి ఇవ్వడానికి ఓవర్లు ఆలస్యం చేయడాన్ని వేలెత్తిచూపాడు. ‘ రెండు వికెట్లు సాధించిన తర్వాత వరుణ్ చక్రవర్తికి ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదు. ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ క్రీజ్లోకి వచ్చినప్పుడు వరుణ్ను బౌలింగ్ నుంచి తప్పించడమే పెద్ద పొరపాటు. మరొక ఆశ్చర్యకర విషయం హర్భజన్ సింగ్కు 19 ఓవర్ ఇవ్వడం. అక్కడ ఉన్నది ఏబీ డివిలియర్స్. అతను రైట్ హ్యాండ్స్ బ్యాట్స్మన్. అంతే కాదు చాలా ప్రమాదకర ఆటగాడు. మరొక ఆటగాడు జెమీసన్. ఇద్దరూ రైట్ హ్యాండర్లే కదా. మరి అప్పుడు ఆఫ్ స్పిన్నర్ అయిన భజ్జీకి బౌలింగ్ ఇవ్వడం తప్పిందం కాదా. అప్పటికి షకీబుల్కు ఇంకా కోటా పూర్తి కాలేదు. వారికి లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన షకీబుల్కు బౌలింగ్ ఇవ్వాల్సింది. అలా అయితే ఆ ఓవర్లో(18 పరుగులు) అన్ని పరుగులు వచ్చి ఉండేవి కావు. ఇక రసెల్ను దినేశ్ కార్తీక్ను ఔటైన వెంటనే పంపించి ఉంటే బాగుండేది. అలా చేసి ఉంటే రసెల్ మరిన్ని బంతులు ఆడే అవకాశం వచ్చేది. ఎప్పుడో 13-14 ఓవర్ల మధ్యలో వచ్చిన రసెల్ ఎలా గెలిపిస్తాడు. అక్కడ ఉన్న స్కోరు 150 కాదు.. 200కు పైగా ఉంది. ఈ పిచ్పై రెండొందల స్కోరు ఛేజ్ చేయాల్సి వచ్చినప్పుడు కేకేఆర్ ఓటమి ఖాయమైంది’ అని చోప్రా విమర్శించాడు. ఇక్కడ చదవండి: IPL 2021, RCB vs KKR: భళా... బెంగళూరు 14.25 కోట్లు: క్రేజీ అనుకున్నా.. కానీ తప్పని నిరూపించాడు! -
ఒక్క ప్లేయర్ కోసమే గేమ్ ప్లాన్ ఉండదు: మోర్గాన్ కౌంటర్
చెన్నై: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో తాము ఓడిపోయిన జట్టుగా తాము శ్రమించిన తీరు అభినందనీయమని కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పష్టం చేశాడు. తాము చేసిన చిన్నచిన్న తప్పిదాల్లో ప్రతీదాన్ని ఆర్సీబీ వినియోగించుకోవడంలో సఫలమైందన్నాడు. ఇక్కడ తమ జట్టు ప్రదర్శనను తక్కువ చేసి చూడటం లేదన్న మోర్గాన్.. ఆర్సీబీ భారీ పరుగులు చేయడంతోనే లక్ష్యం కష్టమైందన్నాడు. ఛేజింగ్లో తాము ఎంతవరకూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలో అంతా చేశామన్నాడు. మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన మోర్గాన్.. చెన్నై వికెట్ క్రమేపీ మెరుగ్గా కనిపిస్తుందన్నాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటింగ్ అద్భుతంగా సాగిందన్నాడు. ఇక వరుణ్ చక్రవర్తితో పవర్ ప్లేలో మరొక ఓవర్ వేయించకపోవడంపై మోర్గాన్ కౌంటర్ ఎటాక్ దిగాడు. దీనిపై ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన నిర్ణయాన్ని సమర్థించుకునే యత్నం చేశాడు. ‘ మేము వరుణ్ చేత పవర్ ప్లేలో మరొక బౌలింగ్ చేయించకపోవడానికి కారణం ఉంది. అప్పుడే మ్యాక్స్వెల్ వచ్చాడు. మ్యాక్సీ విధ్వంసకర ఆటగాడు కానీ అతనొకడే ఆర్సీబీ జట్టులో స్టార్ ప్లేయర్ కాదు కదా. ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. దాంతో బ్యాటింగ్లో ఆర్సీబీ బలోపేతమైంది. దాంతో వరుణ్ ఓవర్లను పవర్ ప్లేలో ఆపాల్సి వచ్చింది. ఒక్క ఆటగాడి కోసమే గేమ్ ప్లాన్ అనేది ఉండదు’ అని మోర్గాన్ చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ భారీ స్కోరు చేయడానికి ఇయాన్ మోర్గాన్ చేసిన తప్పిదాలేనని కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ వేలెత్తి చూపాడు. ప్రధానంగా కోహ్లి(5), రజత్ పాటిదార్(1)లను రెండో ఓవర్లోనే ఔట్ చేసిన వరుణ్ చక్రవర్తిని సరిగా వినియోగించుకోలేకపోవడమేనని గంభీర్ ధ్వజమెత్తాడు. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో గంభీర్ మాట్లాడుతూ.. మోర్గాన్పై చిందులు తొక్కాడు. ‘ నీ కెప్టెన్సీ నువ్వు.. నీలాంటి కెప్టెన్ను నా జీవితంలో చూడలేదు. ఒక బౌలర్ ఎవరైనా అతను వేసిన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు సాధిస్తే ఏం చేస్తాం. అతన్నే కొనసాగిస్తాం. అలా కోహ్లి, పాటిదార్లను ఔట్ చేసిన వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి షకీబుల్ హసన్ను ఎందుకు తీసుకొచ్చావ్. ఒక ఓవర్లో రెండు వికెట్లు తీసిన బౌలర్ను కాదని అతని స్పెల్నే మార్చేశావ్’ అంటూ మండిపడ్డాడు గంభీర్. ఇక్కడ చదవండి: నీలాంటి కెప్టెన్ను చూడలేదు.. చాలా విచిత్రంగా ఉన్నావ్! ఐపీఎల్ 2021: హ్యాట్రిక్ విజయంతో దుమ్మురేపిన ఆర్సీబీ -
నీలాంటి కెప్టెన్ను చూడలేదు.. చాలా విచిత్రంగా ఉన్నావ్!
చెన్నై: కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం మ్యాచ్లో ఆర్సీబీ 205 పరుగుల టార్గెట్ను బోర్డుపై ఉంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి మ్యాక్స్వెల్(78; 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు) అదిరిపోయే ఇన్నింగ్స్తో అలరించగా, ఆపై ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఏబీ డివిలియర్స్(76 నాటౌట్; 34 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్స్లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడి స్కోరు బోర్డును రెండొందల పరుగులు దాటించాడు. ఇందుకు కారణం కేకేఆర్ ఇయాన్ మోర్గాన్ చేసిన తప్పిదాలేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ వేలెత్తి చూపాడు. ప్రధానంగా కోహ్లి(5), రజత్ పాటిదార్(1)లను రెండో ఓవర్లోనే ఔట్ చేసిన వరుణ్ చక్రవర్తిని సరిగా వినియోగించుకోలేకపోవడమేనని గంభీర్ ధ్వజమెత్తాడు. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో గంభీర్ మాట్లాడుతూ.. మోర్గాన్పై చిందులు తొక్కాడు. ‘ నీ కెప్టెన్సీ నువ్వు.. నీలాంటి కెప్టెన్ను నా జీవితంలో చూడలేదు. ఒక బౌలర్ ఎవరైనా అతను వేసిన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు సాధిస్తే ఏం చేస్తాం. అతన్నే కొనసాగిస్తాం. అలా కోహ్లి, పాటిదార్లను ఔట్ చేసిన వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి షకీబుల్ హసన్ను ఎందుకు తీసుకొచ్చావ్. ఒక ఓవర్లో రెండు వికెట్లు తీసిన బౌలర్ను కాదని అతని స్పెల్నే మార్చేశావ్. వరుణ్తో రెండో ఓవర్ వేయించి, నాల్గో ఓవర్ను షకీబుల్కు చేత వేయించావు. నీలాంటి కెప్టెన్సీని నేను ఎక్కడా చూడలేదు. నా జీవితంలోనే ఈ తరహా కెప్టెన్సీ ఎరుగను. చాలా విచిత్రమైన కెప్టెన్సీ నీది. ఆపై వెంటనే వరుణ్ చక్రవర్తి చేతికి బంతి ఇచ్చి ఉంటే, మ్యాక్స్వెల్ వికెట్ను తీసే అవకాశం ఉండేది. అప్పుడు మ్యాచ్ కేకేఆర్ వైపు ఉండేది’ అని తీవ్రంగా విమర్శించాడు. ఈ మ్యాచ్లో తొలి ఓవర్ను హర్భజన్ సింగ్ వేయగా, రెండో ఓవర్ను వరుణ్ వేశాడు. ఇక మూడో ఓవర్ను షకీబుల్తో వేయించిన మోర్గాన్.. మళ్లీ ఎనిమిదో ఓవర్ వరకూ వరుణ్కు ఇవ్వలేదు. ఇది విషయాన్ని గంభీర్ తీవ్రంగా తప్పుపడుతున్నాడు. గాయాల బారిన ‘సన్రైజర్స్’ ఇక్కడ చదవండి: నా ప్లేయర్ ద ఆఫ్ మ్యాచ్ అవార్డు అతనికే: యువీ స్టోక్స్కు సర్ప్రైజ్ గిఫ్ట్ అందజేసిన రాజస్థాన్ రాయల్స్.. రోహిత్ షూపై ఈసారి ఏం రాసుకొచ్చాడో తెలుసా.. -
IPL 2021: కోహ్లి ఎట్టకేలకు సాధించాడు..
చెన్నై: ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్పై పైచేయి సాధించాడు. అదేంటి మోర్గాన్పై ఏ విషయంలో కోహ్లి పైచేయి సాధించాడనే అనుమానం వస్తుంది కదూ. అసలు విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 14వ సీజన్లో కేకేఆర్, ఆర్సీబీ మధ్య చెపాక్ మధ్య నేడు జరుగుతున్న మ్యాచ్లో కోహ్లి టాస్ గెలిచాడు. అయితే ఇప్పటివరకు ఇద్దరి మధ్య 8 టాస్లు వేయగా.. మోర్గాన్ 7 సార్లు గెలవగా.. కోహ్లి అన్నిసార్లు ఓడిపోయాడు. అయితే ఈ టాస్లు ఓడిపోయింది ఐపీఎల్లో అనుకుంటే పొరపాటు. వాస్తవానికి ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ భారత్లో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ ఎనిమిదింటిలో మొదటి వన్డే మినహా అన్నిసార్లు మోర్గాన్ టాస్ గెలవడం విశేషం. తాజాగా కేకేఆర్తో మ్యాచ్లో కోహ్లి టాస్ గెలవడం ద్వారా ఆ విషయాన్ని పేర్కొన్నాడు. ''ఎట్టకేలకు టాస్ విషయంలో మోర్గాన్పై విజయం సాధించాను. వరుసగా ఏడు మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయిన నేను ఈరోజు మోర్గాన్పై పైచేయి సాధించి 7-1 కి తగ్గించాను. ఇక కేకేఆర్తో మ్యాచ్కు ఒక మార్పుతో బరిలోకి దిగాం. డేనియల్ క్రిస్టియన్ స్థానంలో రజత్ పాటిధార్ తుది జట్టులోకి వచ్చాడు.''అని చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ-కేకేఆర్లు ఇప్పటివరకూ 27సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 15సార్లు విజయం సాధించగా, ఆర్సీబీ 12 మ్యాచ్లో గెలుపును అందుకుంది. ఇక ఇరుజట్లు తలపడిన గత ఐదు మ్యాచ్ల్లో ఆర్సీబీదే పైచేయిగా ఉంది. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆర్సీబీనే విజయం సాధించింది. చదవండి: ఆ రికార్డుపై వార్నర్ కన్నేస్తే.. రోహిత్ అతనిపై కన్నేశాడు చిన్న పిల్లాడిలా కోహ్లి.. ఏబీ, చహల్ మాత్రం -
చెన్నైలో అదొక ట్రెండ్: రోహిత్
చెన్నై: కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో చివరి వరకూ పోరాడి గెలవడంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఓడిపోవడం ఖాయమనుకున్న తరుణంలో తిరిగి రేసులోకి రావడం అసాధారణ పోరాటంగా రోహిత్ అభివర్ణించాడు. ఈ తరహా గేమ్లను చాలా అరుదుగా చూస్తామని పేర్కొన్న రోహిత్.. ఈ మ్యాచ్లో సాధించిన విజయంతో రెట్టించిన ఉత్సాహం జట్టు సభ్యుల్లో వచ్చిందన్నాడు. దీన్నే రానున్న మ్యాచ్ల్లో కూడా కొనసాగిస్తామని రోహిత్ తెలిపాడు మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్.. ఇది కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అని అన్నాడు. ప్రత్యేకంగా ఈ ఘనత బౌలర్లదేనని, ఇక బ్యాటర్స్గా తాము మంచి ప్రదర్శన చేయాల్సి ఉందన్నాడు. చెన్నైలో తొలి బంతి నుంచి హిట్ చేసే పరిస్థితులు ఉండటం లేదని, ఇది చెన్నైలోని చెపాక్లో ఒక ట్రెండ్లా కొనసాగుతోందన్నాడు. ఇక్కడ బ్యాటింగ్కు క్రీజ్లోకి వచ్చే ముందే ఎలా ఆడాలనేది ప్లాన్ చేసుకుని రావాలన్నాడు. అలా కాకుండా మొదటి బంతి నుంచి హిట్టింగ్కు దిగితే మాత్రం సక్సెస్ కావడం అంత ఈజీ కాదన్నాడు. తామింకా 15-20 పరుగులు చేయాల్సిందని, ఆఖరి ఓవర్లలో అనుకున్న పరుగులు రాలేదన్నాడు. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ ఎలా చేయాలనే దానిపై కూడా ఫోకస్ చేస్తామన్నాడు. ఇక ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్లో ఓటమి నిరుత్సాహ పరిచింది. ఈ గేమ్ మొత్తం మీద చూస్తూ మాదే పైచేయిగా కనిపించింది. మేము ఈజీగా స్కోరును ఛేజ్ చేస్తామనిపించింది. కొన్ని తప్పులు చేయడంతో మూల్యం చెల్లించుకున్నాడు. ముంబై చాలా స్ట్రాంగ్ టీమ్. వారు పుంజుకున్న తీరు అమోఘం. మేము కచ్చితమైన ఆటను ఆడలేకపోయాం. చివరి 10 ఓవర్లలో మ్యాచ్ మా చేతుల్లోంచి జారుపోతూ వచ్చింది. ఈ వికెట్పై సెకండ్ బ్యాటింగ్ చాలా కష్టంగా ఉంది. ఆర్సీబీ-ముంబై ఇండియన్స్ గేమ్లో కూడా దాదాపు ఇలానే జరిగింది. కానీ ఏబీ ఎదురుదాడికి దిగడంతో ఆర్సీబీ గెలిచింది. మేము మంచి పొజిషన్లో ఉండి కూడా దాన్ని కడవరకూ తీసుకురాలేకపోయాం. ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని మోర్గాన్ పేర్కొన్నాడు. ఇక్కడ చదవండి: కోల్కతా...చేజేతులా ‘వారివల్లే ఆర్సీబీకి..వేలానికి ముందు రోజు జరిగింది అదే’ -
‘తొలి ఓవర్ భజ్జీకి ఇచ్చాం.. మళ్లీ అందుకే ఇవ్వలేదు’
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ జట్టులోకి అరంగేట్రం చేసిన హర్భజన్ సింగ్పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. హర్భజన్లో ప్రస్తుతం తాను చూస్తున్న ఎనర్జీని తమ కేకేఆర్ క్యాంప్ మిగతా సభ్యులు ఎవరిలోనూ చూడలేదంటూ కొనియాడాడు. దీనిలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో హర్భజన్కు తొలి ఓవర్ ఇవ్వడానికి కారణాన్ని వెల్లడించాడు. డేవిడ్ వార్నర్, సాహాలను దృష్టిలో పెట్టుకునే భజ్జీకి తొలి ఓవర్ను వేయమని బంతిని చేతికి ఇచ్చానన్నాడు. ప్రత్యర్థి జట్టు ఓపెనింగ్కు దిగిన తర్వాత భజ్జీకే మొదటి ఓవర్ ఇవ్వాలని భావించామన్నాడు. ఇది తమ ప్రణాళికలో భాగమనేని మోర్గాన్ పేర్కొన్నాడు. తొలి ఓవర్లోనే వార్నర్ వికెట్ను కేకేఆర్ సాధించే అవకాశం వచ్చినా దాన్ని జారవిడిచామన్నాడు. తొలి ఓవర్ను హర్భజన్ చాలా గొప్పగా ఆరంభించాడని మ్యాచ్ తర్వాత కేకేఆర్ కెప్టెన్ వెల్లడించాడు. కాగా, ఆ తర్వాత ఒకే ఒక కారణంతో భజ్జీకి బౌలింగ్ ఇవ్వలేదన్నాడు. ఎప్పుట్నుంచో క్రికెట్ ఆడటం లేని కారణంగా భజ్జీని ఆపి మిగతా వారితో బౌలింగ్ చేయించామన్నాడు. ఇక్కడ భజ్జీ అనుభవాన్ని మిగతా బౌలర్లకు గైడ్ చేయడంలో ఉపయోగించుకున్నామన్నాడు. తాము ఆడే తదుపరి మ్యాచ్ల్లో హర్భజన్ బౌలింగ్ చేస్తాడని పేర్కొన్న మోర్గాన్.. అతను గతంలో ఏవిధంగా సత్తా చాటాడో అదే విధంగా కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. సన్రైజర్స్ ఇన్నింగ్స్ ఆరంభించిన తర్వాత మొదటి ఓవర్ నాల్గో బంతికి వార్నర్ క్యాచ్ ఇవ్వగా దాన్ని ప్యాట్ కమిన్స్ జారవిడిచాడు. ఒకవేళ అది కమిన్స్ పట్టుకుని ఉంటే కేకేఆర్ తరఫున భజ్జీ ఖాతాలో మెయిడిన్ వికెట్ చేరేది. గత ఐపీఎల్ సీజస్లో చెన్నై సూపర్ కింగ్స్కు హర్భజన్ ఆడిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సీజన్ ఆరంభానికి కొన్ని నెలల ముందే హర్భజన్ను సీఎస్కే వదిలేసుకుంది. దాంతో వేలంలోకి వచ్చిన హర్భజన్ను కేకేఆర్ అతన్ని కనీస ధరకే కొనుగోలు చేసింది. -
ఐపీఎల్ 2021: కోల్కతా నైట్రైడర్స్ ఘనవిజయం
ఐపీఎల్-2021లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్నే విజయం వరించింది. సన్రైజర్స్ కడవరకూ పోరాడినా ఓటమి పాలైంది. కేకేఆర్ నిర్దేశించిన 188 పరుగుల టార్గెట్ ఛేదనలో ఆరెంజ్ ఆర్మీ చివరి అంచుల వరకూ వచ్చి చతికిలబడింది. బెయిర్స్టో(55; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) మనీష్ పాండే(61 నాటౌట్)లు రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. డేవిడ్ వార్నర్(3) ఆదిలోనే నిష్రమించగా, ఆపై సాహా(7) కూడా నిరాశపరిచాడు. ఆ దశలో బెయిర్ స్టో-మనీష్ పాండేలు ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ జోడి 92 పరుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి స్కోరును గాడిలో పెట్టింది. కాగా, బెయిర్ స్టో ఔటైన తర్వాత మనీష్ పాండేపై భారం పడింది. పాండే అజేయంగా నిలిచినా పరాజయం తప్పలేదు. సన్రైజర్స్ 177 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ► మొహమ్మద్ నబీ ఔట్.. స్కోర్: 131/4 సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 131 పరుగుల వద్ద మొహమ్మద్ నబీ 11 బంతుల్లో 14 పరగులు చేసి ప్రసిద్ధ్ క్రిష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. ► బెయిర్ స్టో అవుట్.. మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ హాఫ్ సెంచరీ సాధించిన కాసేపటికే 55 పరుగులు చేసిన బెయిర్ స్టో కమిన్స్ బౌలింగ్లో నితీష్ రానాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 102 పరుగులు వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ► బెయిర్ స్టో హాఫ్ సెంచరీ.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగి 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో ధనాదన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. సిక్స్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బెయిర్ స్టో 32 బంతుల్లో అర్థశతకం మార్క్ను అందుకున్నాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. బెయిర్ స్టో 55, మనీష్ పాండే 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. ► రెండో వికెట్ డౌన్.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ రెండు వికెట్లు కోల్పోయింది. మొదట వార్నర్ అవుట్ కాగా.. ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతికే 7 పరుగులు చేసిన సాహా షకీబ్ ఆల్ హసన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బెయిర్ స్టో, మనీష్ పాండేలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ప్రస్తుత ఎస్ఆర్హెచ్ 8 ఓవర్లలో 60 పరుగులు చేసింది. ► తొలి వికెట్ డౌన్.. వార్నర్ అవుట్ 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన వార్నర్ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో కీపర్ కార్తీక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. ప్రస్తుతం సాహా 7, మనీష్ పాండే క్రీజులో ఉన్నారు. ► కార్తీక్ మెరుపులు.. కేకేఆర్ 187/6 దినేష్ కార్తీక్ (22; 9 బంతులు, 2 ఫోర్లు, ఒక సిక్సర్)తో ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అంతకముందు కేకేఆర్ ఓపెనర్ నితీష్ రానా 80 పరుగులతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాగా ఎస్ఆర్హెచ్ బౌలర్లలో రషీద్, నబీలు చెరో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, నటరాజన్లు తలా ఒక వికెట్ తీశారు. ► వెనువెంటనే వికెట్లు.. కేకేఆర్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. మహ్మద్ నబీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ మూడో బంతికి నితీష్ రానా(80) అవుట్ కాగా.. మరుసటి బంతికే రెండు పరుగులు చేసిన మోర్గాన్ క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 162 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయింది. ►రస్సెల్ అవుట్.. మూడో వికెట్ డౌన్ రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ రెండో బంతికి ఆండ్రీ రస్సెల్(5) మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేకేఆర్ 17 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అంతకముందు హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికే రాహుల్ త్రిపాఠి నటరాజన్ బౌలింగ్లో సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 146 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ► త్రిపాఠి 28 బంతుల్లోనే అర్థ శతకం రాహుల్ త్రిపాఠి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 28 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. ఇందులో ఐదు ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. గిల్ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన త్రిపాఠి విజృంభించి ఆడుతున్నాడు. అన్నివైపులకు షాట్లు ఆడుతూ సన్రైజర్స్కు పరీక్షగా నిలుస్తున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. రానా(77) క్రీజ్లో ఉన్నాడు. ► 14 ఓవర్లలో కేకేఆర్ 126/1 కేకేఆర్ వికెట్లను కాపాడుకుంటూనే దూకుడుగా బ్యాటింగ్ చేస్తోంది. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. రానా 72 పరుగులతో , రాహుల్ త్రిపాఠి 39 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఇప్పటివరకూ గిల్ వికెట్ను మాత్రమే సన్రైజర్స్ సాధించింది. రషీద్ ఖాన్ బౌలింగ్లో గిల్(15) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వా త క్రీజ్లోకి వచ్చిన త్రిపాఠి బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. చివరి ఐదు ఓవర్లలో కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ► సిక్స్తో హాఫ్ సెంచరీ చేసిన నితీష్ రానా కేకేఆర్ ఓపెనర్ నితీష్ రానా హాఫ్ సెంచరీ సాధించాడు. సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. విజయ్ శంకర్ వేసిన 10 ఓవర్ చివరి బంతిని భారీ షాట్గా మలిచి అర్థ శతకం నమోదు చేశాడు. 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ హాఫ్ సెంచరీ మార్కును చేరాడు రానా. పది ఓవర్ల ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. అతనికి జతగా రాహుల్ త్రిపాఠి క్రీజ్లో ఉన్నాడు. ► చెపాక్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. రషీద్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్ చివరి బంతికి గిల్(15 పరుగులు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కేకేఆర్ 53 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అంతకముందు కేకేఆర్ తన ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లుగా వచ్చిన రాణా, శుబ్మన్ గిల్లు ఎస్ఆర్హెచ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 6 ఓవర్లలో 50 పరుగులు జత చేశారు. ముఖ్యంగా రాణా 37 పరుగులుతో దూకుడు కనబరిచాడు. చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా మూడో మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ ఢీకొట్టబోతోంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్కు అర్హత సాధించగా.. కేకేఆర్ మాత్రం ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఆల్రౌండర్లతో కేకేఆర్ బలంగా కనిపిస్తుండగా.. సన్రైజర్స్ మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కాస్త పటిష్టంగా ఉంది. ఇరు జట్ల ముఖాముఖి పోరు చూసుకుంటే ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ ఆధిపత్యం కనబరిచింది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 19 మ్యాచ్ల్లో తలపడగా.. కోల్కతా 12 మ్యాచ్ల్లో విజయం సాధించగా... ఏడు మ్యాచ్ల్లో సన్రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. ఐపీఎల్లో కోల్కతాపై ఎస్ఆర్హెచ్పై చేసిన అత్యధిక స్కోరు 209 పరుగులు.. అత్యల్ప స్కోరు 128గా ఉంది. మరోవైపు హైదరాబాద్పై కేకేఆర్ సాధించిన అత్యధిక స్కోరు 183 పరుగులు ఉండగా.. అత్యల్ప స్కోరు 101గా ఉంది . గతేడాది సీజన్లో రెండింటి మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో కేకేఆర్నే విజయం వరించింది. ఇరు జట్ల బలబలాల విషయానికి వస్తే.. ఎస్ఆర్హెచ్ నుంచి వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్ లాంటి బ్యాట్స్మన్ ఉండడం సానుకూలాంశం.. వీరికి అదనంగా జేసన్ రాయ్ కలవడం బ్యాటింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసింది. ఇక బౌలింగ్లో భువీతో పాటు నటరాజన్, రషీద్ ఖాన్లాంటి నాణ్యమైన బౌలర్లు ఉండడం ఆ జట్టుకు అదనపు బలం. ఇక కేకేఆర్ చూసుకుంటే.. ఓపెనర్ శుభమన్ గిల్ మంచి టచ్లో కనిపిస్తుండగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, ఆండ్రీ రసెల్తో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. షకీబ్ అల్ హసన్ లాంటి నాణ్యమైన ఆల్రౌండర్ ఉండడం కేకేఆర్కు మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక బౌలింగ్ విభాగాన్ని పాట్ కమిన్స్ నడిపించనుండగా, శివమ్ మావి, ప్రసిధ్ కృష్ణ, స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, హర్భజన్ సింగ్, కుల్దీప్ యాదవ్లతో మెరుగ్గా కనిపిస్తుంది. తుది జట్టు: ఎస్ఆర్హెచ్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), మనీష్ పాండే, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, జానీ బెయిర్ స్టో, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టి నటరాజన్ కేకేఆర్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి -
ఆ జట్టు ప్లే ఆఫ్ చేరడం ఖాయం: ఆకాశ్ చోప్రా
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ప్లేఆఫ్కి అర్హత సాధిస్తుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. ''ఐపీఎల్ 2020 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. కాబట్టి.. ఈ ఏడాది ప్లేఆఫ్కి అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ.. పట్టికలో 1, 2 లేదా 3 స్థానాల్లో ఆ జట్టు నిలిచి ప్లేఆఫ్కి వెళ్తుందని నేను అనుకోవడం లేదు. నా అంచనా ప్రకారం నెం.4లో నిలవడం ద్వారా ప్లేఆఫ్లో అడుగు పెట్టొచ్చు. కోల్కతాకి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేసే బౌలర్లు లేరు. ముఖ్యంగా ఆల్రౌండర్లు ఉన్న జట్టుగా పేరున్న కేకేఆర్కు అదే బలం.. బలహీనంగా మారనుంది. లోకీ ఫెర్గూసన్, పాట్ కమిన్స్ ఆరంభ, మిడిల్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయగలరు. కానీ అదే సమయంలో యువ పేసర్లు కమలేష్ నాగర్కోటి, ప్రసిధ్ కృష్ణ గత ఏడాది తేలిపోయారు.'' అని చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లు జరగనుండగా.. కోల్కతా నైట్రైడర్స్ తన తొలి మ్యాచ్ని ఏప్రిల్ 11న సన్రైజర్స్ హైదరాబాద్తో చెన్నై వేదికగా ఆడనుంది. ఐపీఎల్ 2020 సీజన్లో 14 మ్యాచ్లాడిన కోల్కతా నైట్రైడర్స్ 7 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలవడం ద్వారా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. చదవండి: ఐపీఎల్ 2021: డేవిడ్ వార్నర్ను ఆటపట్టించిన రోహిత్ 'ఈసారి సీఎస్కే ఆఖరి స్థానానికే పరిమితం' -
ఐపీఎల్ 2021: ఆల్రౌండర్లే బలం.. బలహీనత
కోల్కతా నైట్రైడర్స్: కెప్టెన్: ఇయాన్ మోర్గాన్ విజేత: 2012, 2014 ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని కోల్కతా నైట్రైడర్స్ ఈ సీజన్లో తొలి మ్యాచ్ను ఏప్రిల్ 11న సన్రైజర్స్తో ఆడనుంది. ఐపీఎల్ జట్లలో అన్నింటిలోకల్లా ఆల్రౌండర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది కేకేఆర్లోనే. ఆ జట్టు బలం.. బలహీనత కూడా అదే. గతేడాది సీజన్లో దినేశ్ కార్తీక్ లీగ్ మధ్యలోనే కెప్టెన్ పదవి నుంచి వైదొలగడంతో మోర్గాన్ జట్టు బాధ్యతలు చేపట్టాడు. ఇక ఐపీఎల్ 13వ సీజన్లో 14 మ్యాచ్ల్లో 7 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. సీఎస్కే షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి అయితే నాలుగో స్థానం కోసం ఎస్ఆర్హెచ్తో చివరివరకు పోటీపడిన కేకేఆర్ రన్రేట్ తక్కువగా ఉండడంతో అర్హత సాధించలేకపోయింది. ఈసారి వేలంలో హర్భజన్ సింగ్, షకీబ్ ఆల్ హసన్, పవన్ నేగి, షెల్డన్ జాక్సన్, కరుణ్ నాయర్, బెన్ కటింగ్, వెంకటేశ్ అయ్యర్లను తీసుకుంది. ఇక కేకేఆర్ తాను ఆడనున్న 14 లీగ్ మ్యాచ్ల్లో.. 5 మ్యాచ్లు బెంగళూరు..4మ్యాచ్లు అహ్మదాబాద్.. 3 మ్యాచ్లు చెన్నై.. 2 మ్యాచ్లు ముంబై వేదికగా ఆడనుంది. కేకేఆర్ జట్టు: బ్యాట్స్మెన్: ఇయాన్ మోర్గాన్( కెప్టెన్)శుబ్మన్ గిల్, నితీష్ రానా, రింకు సింగ్ ,రారాహుల్ త్రిపాఠి, కరుణ్ నాయర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్)షెల్డన్ జాక్సన్(వికెట్ కీపర్), టిమ్ షీఫెర్ట్(వికెట్ కీపర్) ఆల్రౌండర్లు: ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్ ,బెన్ కట్టింగ్, వెంకటేష్ అయ్యర్ , సునీల్ నరైన్ బౌలర్లు : కమలేష్ నాగర్కోటి, కుల్దీప్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, ప్రసిధ్ కృష్ణ, సందీప్ వారియర్, శివం మావి,పాట్ కమిన్స్, పవన్ నేగి, వరుణ్ చక్రవర్తి, హర్భజన్ సింగ్, వైభవ్ అరోరా కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మ్యాచ్ల షెడ్యూల్: తేది జట్లు వేదిక సమయం ఏప్రిల్ 11 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చెన్నై రాత్రి 7.30 గంటలు ఏప్రిల్ 13 కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ చెన్నై రాత్రి 7.30 గంటలు ఏప్రిల్ 18 కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ చెన్నై సాయంత్రం 3.30 గంటలు ఏప్రిల్ 21 కేకేఆర్ వర్సెస్ సీఎస్కే ముంబై రాత్రి 7.30 గంటలు ఏప్రిల్ 24 కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ ముంబై రాత్రి 7.30 గంటలు ఏప్రిల్ 26 కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్ రాత్రి 7.30 గంటలు ఏప్రిల్ 29 కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ రాత్రి 7.30 గంటలు మే 3 కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అహ్మదాబాద్ రాత్రి 7.30 గంటలు మే 8 కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ సాయంత్రం 3.30 గంటలు మే 10 కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బెంగళూరు రాత్రి 7.30 గంటలు మే 12 కేకేఆర్ వర్సెస్ సీఎస్కే బెంగళూరు రాత్రి 7.30 గంటలు మే 15 కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ బెంగళూరు రాత్రి 7.30 గంటలు మే 18 కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ బెంగళూరు రాత్రి 7.30 గంటలు మే 21 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బెంగళూరు సాయంత్రం 3.30 గంటలు -
'ఐపీఎల్ మాకు మేలు చేసింది.. డబ్బుతో వెలకట్టలేం'
అహ్మదాబాద్: ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఐపీఎల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వల్ల మాకు లాభమే కలిగింది కానీ ఏనాడు నష్టం జరగలేదని తెలిపాడు. ఐపీఎల్ వల్ల కలిగిన అనుభవాన్ని తాము డబ్బుతో వెలకట్టలేమని మోర్గాన్ స్పష్టం చేశాడు. టీమిండియాతో కొన్ని గంటల వ్యవధిలో తొలి టీ20 మ్యాచ్ ఆరంభం కానున్న సమయంలో మోర్గాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగించింది. ''ఒక రకంగా మేము ఐపీఎల్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. 2019 ప్రపంచకప్ సాధించడం మొదలు.. టీ20ల్లో నంబర్వన్గా నిలబడ్డామంటే దానికి ఐపీఎల్ లాంటి లీగ్లే కారణమని చెప్పొచ్చు. రానున్న రెండు టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని మేము ఐపీఎల్ ఆడడం వల్ల మాకు ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఏర్పడనుంది.మా ఆటగాళ్లు ఐపీఎల్లో కంటిన్యూ అవడం వల్ల బ్యాటింగ్ ఎలా చేయాలనే దానిపై క్లారిటీతో పాటు ఆత్మవిశ్వాసాన్ని మెండుగా సంపాదించినట్లవుతుంది. అందుకే ఐపీఎల్ను దేనితో వెలకట్టలేం. డబ్బులు మాకు మొదటి ప్రాధాన్యం కాదు.. ఆటలో మరిన్ని మెళుకువలు నేర్చుకోవాలంటే ఐపీఎల్లో పాల్గొనాల్సి ఉంటుంది.''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇయాన్ మోర్గాన్ ప్రస్తుతం ఐపీఎల్లో కేకేఆర్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ఇప్పటివరకు 66 మ్యాచ్లాడిన మోర్గాన్ 1272 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్ తరపున 242 వన్డేల్లో 7598 పరుగులు, 97 టీ20ల్లో 2278 పరుగులు, 16 టెస్టుల్లో 241 పరుగులు సాధించాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న మొదలై.. మే 30న ముగియనుంది. చదవండి: త్రో వేయడంలో కన్ఫ్యూజన్.. అసలు మజా అక్కడే 'నేను నీలాగా కావాలంటే ఎన్ని ఆమ్లెట్స్ తినాలి' -
ఇంగ్లండ్ తొండాట.. మోర్గాన్కు సీక్రెట్ మెసేజ్లు
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో భాగంగా మైదానంలో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్కి డ్రెస్సింగ్ రూము నుంచి సందేశాలు రావడం వివాదాస్పదంగా మారింది. ఆ టీమ్ అనలిస్ట్ నాథన్ లీమన్ రహస్య సందేహాలు పంపడం వివాదస్పదమైంది. కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భాగంగా బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ కూర్పునకి సహాయపడేలా నాథన్ బోర్డుపై 3C, 4E అంటూ స్టేడియంలో ప్రదర్శించాడు. వాటిని చూస్తూ కెప్టెన్ మోర్గాన్ తన వ్యూహాల్ని మార్చుకుంటూ వెళ్లాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా మూడు టీ20ల సిరీస్ని 3-0తో చేజిక్కించుకుంది. దీన్ని మోర్గాన్ సమర్ధించుకుంటున్నాడు. ఇది ఎంతమాత్రం తప్పుకాదని అంటున్నాడు. ఇది కూడా గేమ్ స్పిరిట్లో భాగమేనని వాదిస్తున్నాడు. (ఫేవరెట్గా టీమిండియా.. టాప్లో కోహ్లి) ‘కెప్టెన్లగా ఉండటమంటే ఎప్పుడూ డిఫెరెంట్గానే ఉంటుంది. టైటిల్,పవర్ ఇలా అనేక విషయాల్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా నేను వ్యవహరించడం తప్పు ఎంతమాత్రం కాదు. ఇది ఒక సిస్టమ్. జట్టు ప్రయోజనాల కోసం మిగతా కెప్టెన్లు కూడా దీన్ని అనుసరించవచ్చు. దీన్ని మేము ప్రయత్నించాం. కొన్ని నిర్ణయాలను ఫీల్డ్లో తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలా ఫీడ్ తీసుకోవడంతో కెప్టెన్లగా మాకు లాభిస్తుంది. తొలి గేమ్లో ఇలా మూడు నిర్ణయాలు తీసుకుంటే, రెండో గేమ్లో రెండు నిర్ణయాలు తీసుకున్నాం. మూడో మ్యాచ్లు పలు నిర్ణయాలకు ఈ విధానాన్ని అనుసరించాం. ఇది ఎంతమాత్రం ఐసీసీ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు కాదు. టీమ్ స్పిరిట్ పరిథిలోనే ఉంది’ అని మోర్గాన్ పేర్కొన్నాడు.(విలియమ్సన్ 251) మైదానంలోని ఆటగాడికి ఇలా డ్రెస్సింగ్ రూము నుంచి సందేశాలు పంపడం ఇదేమీ కొత్త కాదు. 1999 ప్రపంచకప్ సందర్భంగా అప్పటి కోచ్ బాబ్ వూమర్.. దక్షిణాఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రానె, పేసర్ అలన్ డొనాల్డ్తో ఇయర్ ఫోన్లో మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. దీంతో మైదానంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంపై ఐసీసీ వెంటనే నిషేధం విధించింది. 2017లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్లో ఔటైన స్టీవ్స్మిత్ని డీఆర్ఎస్ కోరాల్సిందిగా డ్రెస్సింగ్ రూము నుంచి సహాయ సిబ్బంది సిగ్నల్స్ ఇచ్చారు. అయితే.. కోహ్లీ ఆ విషయాన్ని పసిగట్టి.. అంపైర్లకి ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పెద్ద దుమారం రేగింది. మాజీ క్రికెటర్లు, నెటిజన్లు చాలా మంది.. అనలిస్ట్ నాథన్ లీమన్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ చర్యను ఐసీసీ తీవ్రంగా పరిగణించాలని వారు కోరుతున్నారు. -
‘మేము మెరుగ్గా ఆడలేదు.. ఇక మా చేతుల్లో లేదు’
దుబాయ్: రాజస్తాన్ రాయల్స్తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ గెలిచి ప్లేఆఫ్స్ ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. , మోర్గాన్( 68 నాటౌట్; 35 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్లు) అవసరమైన సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, శుబ్మన్ గిల్(36; 24 బంతుల్లో 6 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి(39; 34 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్స్లు), ఆండ్రీ రసెల్(25; 11 బంతుల్లో 1 ఫోర్, 3సిక్స్లు)లు ఆకట్టుకున్నారు. కేకేఆర్ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దాంతో టోర్నీ నుంచి రాజస్తాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా కేకేఆర్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, తమ నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉన్నా అది రాలేదని అంటున్నాడు కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.(నాకైతే సంబంధం లేదు: రవిశాస్త్రి) మ్యాచ్ తర్వాత మోర్గాన్ మాట్లాడుతూ..‘ రాజస్తాన్తో మ్యాచ్లో మేము చేయాల్సింది పూర్తిగా చేశామని అనుకోవడం లేదు. మేము బాగా ఆడలేదని అనుకుంటున్నా. మేము సాధించిన స్కోరు ఛేదించే అవకాశం ఉన్న స్కోరే. నాకు ప్రతీ ఒక్కబ్యాట్స్మన్ వచ్చి వికెట్ బ్యాటింగ్కు చాలా బాగుందని చెప్పారు. దాంతో బ్యాటింగ్ ఫ్రీగా చేయొచ్చని అనుకుంటే అది రివర్స్ అయ్యింది. మేము ఆరంభంలో కీలక వికెట్లు చేజార్చుకున్నాం. మంచు ప్రభావం అనేది మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. మేము అనుకున్న ప్రయోజనమైతే పొందలేదు. కానీ చివరకు పోరాడే స్కోరును బోర్డుపై ఉంచాం. మేము ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాం. కానీ ఇక్కడ నుంచి మా చేతుల్లో లేదు. జరగబోయేది క్రికెట్ గాడ్స్ చేతుల్లోనే ఉంది’ అని మోర్గాన్ తెలిపాడు. -
కేకేఆర్ సంకట స్థితి.. గెలిస్తేనే ప్లేఆఫ్ అవకాశం
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో గురువారం చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోయిన చెన్నై ఈ మ్యాచ్లో గెలిచినా.. ఓడినా పెద్దగా ఒరిగేదేంలేదు. కానీ కేకేఆర్కు మాత్రం సంకట స్థితి అనే చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే కేకేఆర్కు ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన కేకేఆర్ 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కింగ్స్ పంజాబ్కు అన్నే విజయాలు ఉన్నా రన్రేట్ మెరుగ్గా ఉండడంతో నాలుగో స్థానంలో ఉండగా..ఎస్ఆర్హెచ్ ఆరో స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ కేకేఆర్కు కీలకం కానుంది. మరోవైపు 12 మ్యాచ్ల్లో 4 విజయాలు, 8 ఓటములతో చివరిస్థానంలో నిలిచిన సీఎస్కేకు ప్లేఆఫ్ దారులు ఎప్పుడో మూసుకుపోయాయి. కాగా తొలి అంచె పోటీలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 10 పరగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్లు జరగ్గా.. సీఎస్కే 13, కేకేఆర్ 8 విజయాలు నమోదు చేయగా.. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్లో చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, మోను కుమార్ స్థానంలో షేన్ వాట్సన్, లుంగి ఎంగిడి, కర్ణ్ శర్మ తుది జట్టులోకి రాగా.. మరోవైపు కేకేఆర్లో మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగింది. ప్రసిద్ కృష్ణ స్థానంలో రింకు సింగ్ ఆడనున్నాడు. చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(కెప్టెన్), ఎన్ జగదీషన్, సామ్ కరాన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, లుంగీ ఎన్గిడి కేకేఆర్ : శుభమన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ , ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), రింకు సింగ్, సునీల్ నరైన్, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేష్ నాగర్కోటి, వరుణ్ చక్రవర్తి -
ఆండ్రీ రసెల్ అవుట్..
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో బుధవారం ఆసక్తికర పోరు జరగనుంది. 39వ లీగ్ మ్యాచ్లో భాగంగా అబుదాబి వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ఆర్సీబీ తలపడనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె లీగ్ మ్యాచ్లో 82 పరుగులతో ఆర్సీబీ కేకేఆర్పై భారీ విజయం సాధించింది. లీగ్ ఆరంభంలో తడబడిన ఆర్సీబీ ఆ తర్వాత విజయాలతో ఫుంజుకుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 6 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. సరిగ్గా అన్నే మ్యాచ్లాడిన కేకేఆర్ మాత్రం 5 విజయాలు, 4 ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. ఇక లీగ్ ప్రారంభం నుంచి పడుతూ లేస్తూ వస్తున్న కేకేఆర్ సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ జట్టు విషయానికి వస్తే.. కెప్టెన్ కోహ్లి అంతా తానై నడిపిస్తుండగా... ఏబీ డివిలియర్స్ తన విధ్వంసం కొనసాగిస్తున్నాడు. దేవ్దూత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్లు కూడా బ్యాట్తో రాణిస్తుండడంతో బ్యాటింగ్ విభాగం దుర్బేద్యంగా ఉంది. ఇక కెప్టెన్ కోహ్లి ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 347 పరుగులు చేసి జట్టు తరపున టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. మిస్టర్ 360గా పేరు పొందిన ఏబీ 9మ్యాచ్ల్లో 285 పరుగులు చేసి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన గత మ్యాచ్లో 22 బంతుల్లోనే 55 పరుగులు చేసిన ఏబీ తన విధ్వంసంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక బౌలింగ్లో క్రిస్ మోరిస్ తన బౌలింగ్తో మోత మోగిస్తుండగా.. చహల్ కీలకంగా మారాడు. చహల్ 9 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీయగా.. మోరిస్ 4 మ్యాచ్ల్లో 9 వికెట్లతో ఆకట్టుకున్నాడు. కేకేఆర్ జట్టు విషయానికి వస్తే.. ఓపెనర్ శుభమన్ గిల్ 9 మ్యాచ్ల్లో 311 రన్స్తో జట్టు తరపున టాప్ స్కోరర్గా కొనసాగుతుండగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 248 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి 8 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీయగా.. శివమ్ మావి 7 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. ఇరు జట్లు ఇప్పటివరకు 25 మ్యాచ్ల్లో ముఖాముఖి పోరులో తలపడగా.. కేకేఆర్ 14 విజయాలు.. ఆర్సీబీ 11 విజయాలు సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ షహ్బాజ్ అహ్మద్ స్థానంలో సిరాజ్కు అవకాశం ఇవ్వగా.. కేకేఆర్ ఆండ్రీ రసెల్ స్థానంలో టామ్ బాంటన్, శివమ్ మావి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను బరిలోకి దించింది. ఆర్సీబీ జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, అరోన్ ఫించ్, దేవదూత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, గుర్కీరత్ మన్, మహ్మద్ సిరాజ్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదాన, నవదీప్ సైనీ, చహల్ కేకేఆర్ జట్టు : ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, శుబ్మన్ గిల్, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్, టామ్ బాంటన్ , ప్యాట్ కమిన్స్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ఫెర్గ్యూసన్, వరుణ్ చక్రవర్తి -
ఇలా అయితే కష్టం: మోర్గాన్
అబుదాబి: ముంబై ఇండియన్స్పై కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. తమతో జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ విజయం సాధించిందన్నాడు. ముంబైతో మ్యాచ్లో తాము ఏ దశలోనూ రేసులో లేమనే విషయం ఒప్పుకోవాలన్నాడు. ముంబై అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. ముంబై ఇలా ఆడితే వారిని ఆపడం చాలా కష్టమన్నాడు.మ్యాచ్ తర్వాత మోర్గాన్ మాట్లాడుతూ..‘ ముంబైతో మ్యాచ్లో మేము ఎక్కడా కూడా పైచేయి సాధించలేదు. మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. మ్యాచ్ ఆరంభం నుంచి కడవరకూ ముంబైకు ధీటుగా పోటీ ఇవ్వలేకపోయాం. ముంబై ఆటగాళ్లు ఇలా చెలరేగి ఆడితే వారిని ఆపడం చాలా కష్టం. 10 ఓవర్లు ముగిసే సరికి నాలుగు నుంచి ఐదు వికెట్లు కోల్పోతే పోటీలో నిలవడం కష్టం. (డీకాక్ డగౌట్ వైపు పరుగు.. రోహిత్ నవ్వులు!) పోటీలో ఉండాలంటే ఎక్కడో చోట మంచి భాగస్వామ్యం రావాలి. అసలు బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేయాలంటే బోర్డుపై మంచి స్కోరు ఉండాలి కదా. మా ఆరంభం బాగాలేకపోవడమే ఓటమికి కారణం.ఈ తరహా ఆరంభాన్ని ఎవరూ కోరుకోరు’ అని మోర్గాన్ తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ 149 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(39 నాటౌట్; 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), ప్యాట్ కమిన్స్(53 నాటౌట్; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు)లు ఆకట్టుకోవడంతో కేకేఆర్ ఈ మాత్రం స్కోరును బోర్డుపై ఉంచకల్గింది. అయితే ముంబై ఇండియన్స్కు సరిపోలేదు. ముంబై ఇండియన్స్ ఆడుతు పాడుతూ 16.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేరుకుంది. డీకాక్(78 నాటౌట్; 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించి ముంబైకు ఘనవిజయాన్ని అందించాడు. -
అదే నాకు దినేశ్ కార్తీక్ చెప్పాడు: మోర్గాన్
అబుదాబి: కోల్కతా నైట్రైడర్స్కు నయా సారథిగా ఇయాన్ మోర్గాన్ నియమించబడ్డ సంగతి తెలిసిందే. ఈరోజు(శుక్రవారం) కేకేఆర్ కెప్టెన్సీ పదవికి దినేశ్ గుడ్ బై చెప్పడంతో ఆ బాధ్యతల్ని మోర్గాన్కు అప్పచెప్పారు. తాను కెప్టెన్సీ పదవిని చేయలేకపోతున్నాననే కారణాన్ని దినేశ్ తెలపడంతో దాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ యాజమాన్యం గౌరవించింది. అయితే కెప్టెన్గా తప్పుకునే విషయాన్ని తనకు ముందుగానే చెప్పినట్లు మోర్గాన్ తెలిపాడు. ‘ నిన్న(గురువారం)నే కెప్టెన్సీ మార్పుపై చర్చ జరిగింది. కార్తీక్ నా వద్దకు వచ్చాడు. అప్పుడు కోచ్లు కూడా అక్కడే ఉన్నారు. నేను కెప్టెన్సీ పదవి నుంచి వైదొలుగుతానని కార్తీక్ చెప్పాడు. బ్యాటింగ్పై ఫోకస్ చేయాలనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నట్లు నాతో చెప్పాడు. కెప్టెన్సీ బాధ్యతలతో బ్యాటింగ్పై ఫోకస్ చేయలేకపోతున్నానని అందుకే తప్పుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అది జట్టు కూడా మంచిదని వివరించాడు. కార్తీక్ నిస్వార్థంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి’ అని ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో భాగంగా టాస్ వేయడానికి వచ్చినప్పుడు మోర్గాన్ స్పష్టం చేశాడు. (గెలిచారు కదా.. మొహం అలా పెట్టావేంటి?) తన కెప్టెన్సీపై వస్తున్న విమర్శలకు దినేశ్ కార్తీక్ ముగింపు పలికాడు. తాను కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించాడు. ఈ మేరకు శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇంగ్లండ్కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ను జట్టులో ఉంచుకొని కార్తీక్కు కెప్టెన్సీ ఎందుకని ప్రశ్నించారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం కార్తీక్పైనే నమ్మకం ఉంచింది. కోల్కతా విజయాల బాట పట్టాక.. కీలకమైన ప్లేఆఫ్స్ దశకు ముందు దినేశ్ కార్తీక్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. రెండన్నేళ్లుగా కేకేఆర్కు దినేశ్ కార్తీక్ కెప్టెన్గా ఉన్నాడు. దినేశ్ కార్తీక్ నిర్ణయం పట్ల కోల్కతా నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూరు స్పందించారు. దినేశ్ కార్తీక్ లాంటి నాయకుడు తమ జట్టులో ఉండటం అదృష్టమన్నారు. తనకు తానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం అవసరమన్నారు. దినేశ్ కార్తీక్ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యామని.. కానీ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. (ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి : గేల్) -
కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్ బై
అబుదాబి: ఈ ఐపీఎల్లో తన కెప్టెన్సీపై వస్తున్న విమర్శలకు దినేశ్ కార్తీక్ ముగింపు పలికాడు. తాను కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించాడు. ఈ మేరకు శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. బ్యాటింగ్పై ఫోకస్ పెట్టాలన్న దృష్టితో సారథ్యాన్ని వదలుచుకుంటున్నట్లు దినేశ్ వెల్లడించాడు. ఇక నుంచి ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గన్ చూసుకోనున్నాడు. ఈ సీజన్ ఆరంభంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు, నరైన్కు ఓపెనర్గా పదే పదే అవకాశాలు ఇవ్వడం.. తన బ్యాటింగ్ ప్రదర్శన సరిగా లేకపోవడంతో.. ఫ్యాన్స్ కార్తీక్ను కెప్టెన్సీ వదులుకోవాలని డిమాండ్ చేశారు.(అంతా ధోని వల్లే..: ఆర్సీబీ బౌలర్) ఇంగ్లండ్కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ను జట్టులో ఉంచుకొని కార్తీక్కు కెప్టెన్సీ ఎందుకని ప్రశ్నించారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం కార్తీక్పైనే నమ్మకం ఉంచింది. కోల్కతా విజయాల బాట పట్టాక.. కీలకమైన ప్లేఆఫ్స్ దశకు ముందు దినేశ్ కార్తీక్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. రెండన్నేళ్లుగా కేకేఆర్కు దినేశ్ కార్తీక్ కెప్టెన్గా ఉన్నాడు. దినేశ్ కార్తీక్ నిర్ణయం పట్ల కోల్కతా నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూరు స్పందించారు. దినేశ్ కార్తీక్ లాంటి నాయకుడు తమ జట్టులో ఉండటం అదృష్టమన్నారు. తనకు తానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం అవసరమన్నారు. దినేశ్ కార్తీక్ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యామని.. కానీ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. ఇవాళ ముంబై ఇండియన్స్తో కేకేఆర్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన ఫస్ట్ లెగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 49 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవాలి!
షార్జా: ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అనుసరించిన బ్యాటింగ్ ఆర్డర్పై భారత్ జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మండిపడ్డారు. 229 భారీ లక్ష్య ఛేదనలో ఇయాన్ మోర్గాన్ వంటి ఆటగాడిని 6వ స్థానంలో బ్యాటింగ్కు పంపడమేంటని కోల్కతా కెప్టెన్ దినేశ్ కార్తిక్, కోల్కతా జట్టు మానేజ్మెంట్ను ఆయన ప్రశ్నించారు. గత ఏడాది కాలంగా చూసుకుంటే మోర్గాన్ 170 స్ర్టైక్రేట్తో ఆడుతున్నాడని, ఐపీఎల్లో గత రెండు మ్యాచుల్లో కూడా అద్భుతంగా ఆడాడని ఆయన అన్నాడు. మోర్గాన్ ఈ మ్యాచ్లో 44 (18) పరుగులు చేయగా అందులో ఐదు సిక్సులు బాదాడు. షార్జాలో శనివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ చేతులో 18 పరుగుల తేడాతో కోల్కతా ఓడిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో మోర్గాన్ను ముందు పంపించి ఉంటే ఆ జట్టు గెలిచి ఉండేదని ఆకాశ్ చోప్రా అన్నారు. కుల్దీప్ స్థానంలో వచ్చిన రాహుల్ త్రిపాఠిని 8వ స్థానంలో పంపడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. సునిల్ నరైన్ ఓపనర్గా రాణించనప్పుడు రాహుల్ను ఓపెనర్గా పంపాలని సూచించాడు. రాహుల్ మంచి ఓపనింగ్ బ్యాట్స్మెన్ అని... శుభమన్ గిల్తో పాటు ఓపనింగ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఆకాశ్ చోప్రా గతంలో కోలకతా జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. (ఇదీ చదవండి: చెన్నై చిందేసింది) -
కేకేఆర్ అదరహో..
దుబాయ్: రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ అదరగొట్టింది. బ్యాటింగ్లో సమష్టిగా రాణించి పోరాడే స్కోరును బోర్డుపై ఉంచిన కేకేఆర్.. ఆపై బౌలింగ్లో ఇరగదీసింది. బ్యాటింగ్ లైనప్లో పటిష్టంగా ఉన్న రాజస్తాన్ను 137 పరుగులకే కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కేకేఆర్ బౌలర్లలో శివం మావి, నాగర్కోటి, ప్యాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తిలు రాణించి జట్టుకు మంచి విజయాన్ని అందించారు. మావి, నాగర్కోటి, వరుణ్లు తలో రెండు వికెట్లు సాధించగా, కమిన్స్, కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్లు తలో వికెట్ తీశారు. రాజస్తాన్ ఆటగాళ్లలో టామ్ కరాన్( 54 నాటౌట్; 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక రాజస్తాన్ ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఘోర ఓటమి తప్పలేదు. ఇది కోల్కతాకు రెండో విజయం కాగా, రాజస్తాన్కు తొలి ఓటమి.(చదవండి: ఐపీఎల్ 2020: అయ్యర్కు భారీ జరిమానా) కేకేఆర్ నిర్దేశించిన 175 పరుగుల టార్గెట్లో రాజస్తాన్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ స్టీవ్ స్మిత్(3) పరుగులకే ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. కేకేఆర్ కీపర్ దినేశ్ కార్తీక్ అద్భుతమైన క్యాచ్తో స్మిత్ పెవిలియన్కు చేరాడు. అనంతరం సంజూ శాంసన్(8) కూడా నిరాశపరిచాడు. ఆపై జోస్ బట్టర్(21), రాబిన్ ఊతప్ప(2)లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో రాజస్తాన్ కష్టాల్లో పడింది. రియాన్ పరాగ్(1), రాహుల్ తెవాటియా(14)లు ఆకట్టులేకపోవడంతో రాజస్తాన్ 66 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవడంతో తేరుకోలేకపోయింది. ఇక జోఫ్రా ఆర్చర్ వచ్చీ రావడంతోనే ఒక సిక్స్ కొట్టినా ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో నాగర్కోటి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఆర్చర్ ఇన్నింగ్స్ ముగిసింది. కాగా, టామ్ కరాన్ చివరి వరకూ క్రీజ్లో ఉండి మెరుపులు మెరిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఓటమి తప్పలేదు. అంతకుముందు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్ ఎక్కువగా మెరుపులు లేకుండానే కొనసాగింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.ఓపెనర్ గిల్ మరోసారి సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. చివర్లో మోర్గాన్ మెరుపులతో కేకేఆర్ 170 పరుగుల మార్కును దాటింది. కాగా 34 బంతుల్లో 47 పరుగులు చేసిన గిల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. హాఫ్ సెంచరీకి చేరువైన గిల్ను జోఫ్రా ఆర్చర్(6) బోల్తా కొట్టించాడు. పవర్ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. పవర్ప్లే ముగిసిన తర్వాత గిల్, రాణాలు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తెవాటియా వేసిన 10 ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నితీష్ రాణా క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రసెల్ 3 సిక్సర్లు కొట్టి 14 బంతుల్లో 22 పరుగులు చేసినా దానిని బారీ స్కోరుగా మలచలేకపోయాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ దినేష్ కార్తీక్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. చివర్లో ఇయాన్ మోర్గాన్(34 నాటౌట్; 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించాడు. ఇక కమిన్స్(12; 10 బంతుల్లో 1 ఫోర్), నాగర్కోటి(8 నాటౌట్; 5 బంతుల్లో 1 ఫోర్) ఫర్వాలేదనిపించడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు సాధించగా, రాజ్పుత్, ఉనాద్కత్, టామ్ కరాన్, రాహుల్ తెవాటియాలకు తలో వికెట్ దక్కింది. -
రాణించిన మోర్గాన్.. రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్ ఎక్కువగా మెరుపులు లేకుండానే కొనసాగింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.ఓపెనర్ గిల్ మరోసారి సాధికారిక ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. చివర్లో మోర్గాన్ మెరుపులతో కేకేఆర్ 170 పరుగుల మార్కును దాటింది. కాగా 34 బంతుల్లో 47 పరుగులు చేసిన గిల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. హాఫ్ సెంచరీకి చేరువైన గిల్ను జోఫ్రా ఆర్చర్ బోల్తా కొట్టించాడు. రిటర్న్ క్యాచ్ ద్వారా పెవిలియన్కు పంపాడు. మరో ఓపెనర్ నరైన్ మాత్రం మరోసారి పూర్తిగా విఫలమయ్యాడు. ఆరంభం నుంచి పెద్దగా మెరుపులు లేకుండా సాగిన కోల్కతా ఇన్నింగ్స్లో 36 పరుగులకు చేరుకోగానే ఉనాద్కట్ బౌలింగ్లో సునీల్ నరైన్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణాతో కలిసి గిల్ ఇన్నింగ్స్ను నిర్మించాడు. (చదవండి : హాఫ్ సెంచరీ ముంగిట గిల్ ఔట్!) పవర్ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. పవర్ప్లే ముగిసిన తర్వాత గిల్, రాణాలు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తెవాటియా వేసిన 10 ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నితీష్ రాణా క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రసెల్ 3 సిక్సర్లు కొట్టి 14 బంతుల్లో 22 పరుగులు చేసినా దానిని బారీ స్కోరుగా మలచలేకపోయాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ దినేష్ కార్తీక్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. ఆర్చర్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి అవుట్గా వెనుదిరిగాడు. అయితే చివర్లో ఇయాన్ మోర్గాన్ 23బంతుల్లో 34* పరుగులతో( ఫోర్, 2 సిక్స్లు) రాణించాడు. ఇక రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు తీయగా, అంకిత్ రాజ్పుత్, టామ్ కరన్, ఉనాద్కట్, తెవాటియాలు ఒక్కో వికెట్ తీశారు. (చదవండి : ఐపీఎల్ తర్వాత ధోని చేసేదేంటో తెలుసా?) ఇక ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు ఐపీఎల్లో 21 మ్యాచ్లు జరిగాయి. వీటిలో రాజస్తాన్ 10, కేకేఆర్ 10 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం తేలలేదు. రాజస్తాన్పై కేకేఆర్ అత్యధిక స్కోరు 190, అత్యల్ప స్కోరు 125గా ఉంది. కాగా కేకేఆర్పై రాజస్తాన్ అత్యధిక స్కోరు 199 పరుగులు, అత్యల్ప స్కోరు 81గా ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్ల్లో కోల్కతా 4 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. రాజస్తాన్ ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. -
కోల్కతాకు ‘శుబ్’మయం...
సన్రైజర్స్ హైదరాబాద్ మళ్లీ తేలిపోయింది. తొలి మ్యాచ్లో ఎదురైన ఓటమి నుంచి పాఠం నేర్చుకోని జట్టు మరోసారి పేలవ బ్యాటింగ్తో చతికిలపడింది. అందరూ అంతంత మాత్రంగానే ఆడటంతో సాధారణ స్కోరుకే పరిమితమైన జట్టు బౌలింగ్లోనూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేక వరుసగా రెండో పరాజయాన్ని ఆహ్వానించింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో హైదరాబాద్ పని పట్టిన నైట్రైడర్స్ సీజన్లో మొదటి విజయాన్ని అందుకుంది. యువ ఆటగాడు శుబ్మన్ గిల్ కోల్కతా బ్యాటింగ్కు వెన్నెముకలా నిలిచి జట్టును గెలుపుతీరం చేర్చాడు. ఈ మ్యాచ్ తర్వాత లీగ్లో ఇంకా విజయం నమోదు చేయని టీమ్గా రైజర్స్ నిలిచింది. అబుదాబి: ఐపీఎల్–2020లో కోల్కతా నైట్రైడర్స్ బోణీ చేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో కోల్కతా 7 వికెట్లతో సన్రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మనీశ్ పాండే (38 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ నమోదు చేయగా, డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (31 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్) మోస్తరుగా ఆడారు. అనం తరం కోల్కతా 18 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (62 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మోర్గాన్ (29 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 70 బంతుల్లో 92 పరుగులు జోడించారు. కనిపించని మెరుపులు...: సన్రైజర్స్ ఇన్నింగ్స్ మొత్తం సాదాసీదాగా సాగింది. వార్నర్తో పాటు ఒక్క బ్యాట్స్మన్ కూడా కావాల్సినంత దూకుడును ప్రదర్శించలేకపోయాడు. కోల్కతా పదునైన బౌలింగ్ కూడా అందుకు కారణం. నరైన్ ఓవర్లో వార్నర్ ఒక సిక్స్, ఫోర్ కొట్టినా... తర్వాతి ఓవర్లోనే కమిన్స్ చక్కటి బంతితో బెయిర్స్టో (5)ను క్లీన్బౌల్డ్ చేశాడు. పుట్టినరోజునాడు బెయిర్స్టోకు మైదానంలో కలిసి రాలేదు. ఆ తర్వాత కూడా కేకేఆర్ బౌలర్లు ప్రత్యర్థిపై బ్యాట్స్మన్పై ఒత్తిడిని కొనసాగించారు. వరుణ్ వేసిన తొలి బంతినే అర్థం చేసుకోవడంలో తడబడి వార్నర్ రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో రైజర్స్ కీలక వికెట్ కోల్పోయింది. నాలుగో స్థానంలో వచ్చిన సాహా సింగిల్స్కే పరిమితం కాగా, మరో ఎండ్లో మనీశ్ పాండే అప్పుడప్పుడు ఒక్కో బౌండరీతో స్కోరు బోర్డును నడిపించాడు. 35 బంతుల్లో పాండే అర్ధసెంచరీ పూర్తయింది. రసెల్ బౌలింగ్లో పాండే రిటర్న్ క్యాచ్ ఇవ్వగా, కొద్ది సేపటికే సాహా రనౌటయ్యాడు. ఐపీఎల్లో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఒక జట్టు ఇంతకంటే తక్కువ స్కోరు నమోదు చేయడం గతంలో రెండుసార్లు మాత్రమే జరిగింది. గాయంతో ఐపీఎల్కు దూరమైన మిచెల్ మార్‡్ష స్థానంలో నబీని, వెన్నునొప్పితో బాధపడుతున్న విజయ్ శంకర్ స్థానంలో సాహాను తుది జట్టులోకి తీసుకున్న సన్రైజర్స్... పేసర్ సందీప్ శర్మకు బదులుగా ఖలీల్కు అవకాశం ఇచ్చింది. కీలక భాగస్వామ్యం...: ఖలీల్ వేసిన రెండో ఓవర్లోనే నరైన్ (0) వెనుదిరగడంతో కోల్కతా తొలి వికెట్ కోల్పోయింది. మూడో స్థానంలో వచ్చిన నితీశ్ రాణా (13 బంతుల్లో 26; 6 ఫోర్లు) ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. తొమ్మిది బంతుల వ్యవధిలో అతను ఐదు బౌండరీలు బాదాడు. ఇందులో ఖలీల్ బౌలింగ్లో వరుస బంతుల్లో కొట్టిన మూడు ఫోర్లు ఉన్నాయి. అయితే నటరాజన్ అతడిని వెనక్కి పంపగా, కెప్టెన్ దినేశ్ కార్తీక్ (0)ను రషీద్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కార్తీక్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. మరోవైపు గిల్ మాత్రం చూడ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఆడుతూ తన బ్యాటింగ్ పదును చూపించాడు. 42 బంతుల్లో గిల్ అర్ధ సెంచరీ పూర్తయింది. మరోవైపు మోర్గాన్ నుంచి అతనికి చక్కని సహకారం లభించింది. లక్ష్యం కూడా చిన్నది కావడంతో వీర్దిదరికి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. నటరాజన్ వేసిన 18వ ఓవర్ చివరి రెండు బంతులకు మోర్గాన్ సిక్స్, ఫోర్ బాదడంతో మ్యాచ్ కోల్కతా వశమైంది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి అండ్ బి) వరుణ్ 36; బెయిర్స్టో (బి) కమిన్స్ 5; పాండే (సి అండ్ బి) రసెల్ 51; సాహా (రనౌట్) 30; నబీ (నాటౌట్) 11; అభిషేక్ శర్మ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–24; 2–59; 3–121; 4–138. బౌలింగ్: నరైన్ 4–0–31–0; కమిన్స్ 4–0–19–1; శివమ్ మావి 2–0–15–0; కుల్దీప్ 2–0–15–0; వరుణ్ 4–0–25–1; నాగర్కోటి 2–0–17–0; రసెల్ 2–0–16–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (నాటౌట్) 70; నరైన్ (సి) వార్నర్ (బి) ఖలీల్ 0; రాణా (సి) సాహా (బి) నటరాజన్ 26; కార్తీక్ (ఎల్బీ) (బి) రషీద్ ఖాన్ 0; మోర్గాన్ (నాటౌట్) 42; ఎక్స్ట్రాలు 7; మొత్తం (18 ఓవర్లలో 3 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–6; 2–43; 3–53. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–29–0; ఖలీల్ 3–0–28–1; నటరాజన్ 3–0–27–1; రషీద్ ఖాన్ 4–0–25–1; నబీ 4–0–23–0; అభిషేక్ శర్మ 1–0–11–0.