False propaganda
-
స్నానం, ఆచమనం నిరభ్యంతరంగా ఆచరించవచ్చు
లక్నో: మహా కుంభమేళాపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, పవిత్రమైన కార్యక్రమాన్ని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడుతున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. మహాకుంభమేళాను, సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కుంభమేళా కేవలం ఒక మతపరమైన కార్యక్రమం కాదని చెప్పారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని స్పష్టంచేశారు. మన ప్రాచీన గ్రంథాల్లో కూడా కుంభమేళా ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. మహా కుంభమేళాలో ఇప్పటిదాకా 56 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వివరించారు. కుంభమేళా ప్రాధాన్యతను తగ్గించడానికి విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. భారతీయ ఆత్మ అయిన సనాతన ధర్మం గౌరవాన్ని మరింత పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలోని నీళ్లు స్నానానికి పనికిరావంటూ కొన్ని సంస్థలు, వ్యక్తులు చేస్తున్న వాదనను యోగి ఆదిత్యనాథ్ ఖండించారు. త్రివేణి సంగమంలో నీళ్లు కలుషితమయ్యాయంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కుంభమేళా గురించి అసలేమీ తెలియని వాళ్లే ఇలాంటి దుష్ప్రచారానికి తెరతీశారని ధ్వజమెత్తారు. అక్కడి నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని స్పష్టంచేశారు. కేవలం స్నానాలకే కాదు, తాగడానికి సైతం ఆ నీళ్లు పనికొస్తాయని తేల్చిచెప్పారు. కుంభమేళాలో స్నానం, ఆచమనం నిరభ్యంతరంగా ఆచరించవచ్చని ఉద్ఘాటించారు. ఇటీవల కొన్ని అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని నిర్ధారించాయని గుర్తుచేశారు. గంగ, యమున నదుల్లో వ్యర్థాలు చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. మృత్యుకుంభ్ అనడం దారుణం దేశం యావత్తూ ఘనంగా నిర్వహించుకుంటున్న పవిత్రమైన వేడుకపై ప్రతిపక్షాలు బురదజల్లడం హిందువుల మనోభావాలను గాయపరుస్తోందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మహాకుంభ్ను వ్యతిరేకిస్తున్న వాళ్లే రహస్యంగా త్రివేణి సంగమానికి వెళ్లి పవిత్ర స్నానాలు చేస్తున్నారని విపక్ష నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహాకుంభ్ కాదు...మృత్యుకుంభ్ అనడం దారుణమని విపక్ష నేతలపై మండిపడ్డారు. కుంభమేళాలో తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వెల్లడించారు. బాధ్యతల నుంచి తాము తప్పించుకోవడం లేదన్నారు. తొక్కిసలాట ఘటనలో 30 మంది మరణించగా, 36 మంది గాయపడినట్టు తెలియజేశారు. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి వస్తూ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన భక్తుల కుటుంబాలను కూడా ఆదుకుంటామని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. -
తప్పుడు చానళ్లపై కేసులు వేస్తా: ఆర్జీవీ
సాక్షి, హైదరాబాద్: తనపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలిగించిన టీవీ5, ఏబీఎన్, మహాటీవీ సహా మరికొన్ని చానళ్లపై పరువు నష్టం కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సినీ దర్శకుడు రాంగోపాల్వర్మ (ఆర్జీవీ) తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ తనపై, తన భాగస్వామి రవివర్మపై దుష్ఫ్రచారాన్ని సహించేది లేదని అన్నారు. వ్యూహం సినిమాకు దాసరి కిరణ్కుమార్ నిర్మాత కాగా, శ్రీకాంత్ ఫైనాన్స్ సహకారం అందించారని, భాగస్వామి రవివర్మ సొంతంగా శ్రీకాంత్ నుంచి ఏపీ ఫైబర్నెట్ ప్రసార హక్కులను కొనుగోలు చేశారని, రవి వర్మ నుంచి ఏపీ ఫైబర్నెట్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసి, కోటి రూపాయలు మాత్రమే ఇచ్చిందని ఆర్జీవీ తెలిపారు. 60 రోజులపాటు ఏపీ ఫైబర్నెట్కు హక్కులు ఇస్తే, లక్షన్నర వరకు వ్యూస్ వచ్చాయని చెప్పారు. టీడీపీ ఎన్నికల కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసారాలు నిలిపేశారని, కానీ తనకు రావాల్సిన మిగిలిన మొత్తం కోసం రవివర్మ సివిల్ కోర్టులో దావా వేశారని ఆర్జీవీ చెప్పారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ తనతో పాటు రవి వర్మపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్లను చట్టప్రకారం ఎదుర్కొంటానని ఆర్జీవీ తన ప్రకటనలో హెచ్చరించారు. -
ప్రపంచంలోనే ఏఆర్ అత్యుత్తమ వ్యక్తి: సైరా భాను
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారంపై రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 29 ఏళ్లు అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగించిన ఈ జంట విడిపోవాలనుకోవడానికి గల కారణాలను నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. ఏఆర్ రెహమాన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న గిటారిస్ట్ మోనికా దేను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు.దీంతో తన గురించి అసత్య ప్రచారాన్ని చేస్తున్న సామాజిక మాధ్యమాలకు రెహమాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆదివారం సైరా భాను ‘నేను సైరా రెహమాన్ మాట్లాడుతున్నా’ అంటూ ఓ వీడియో వాయిస్ను విడుదల చేశారు. అందులో ‘‘ఏఆర్ గురించి దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి ఆయన. అలాంటి అద్భుతమైన మనిషిని చూడలేం. నా శారీరక అనారోగ్యం కారణంగా కొన్ని నెలలుగా ముంబైలో ఉంటూ, చికిత్స పొందుతున్నాను.అందువల్లే ఏఆర్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలనుకున్నా. విడిపోవాలనుకోవడానికి కారణం నా అనారోగ్యమే. ఏఆర్ రెహమాన్ ఎంతో బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నా పిల్లలనూ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఏఆర్పై నాకున్న నమ్మకం నా జీవితానికంటే పెద్దది. నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. నన్ను కూడా ఆయన అంతే ప్రేమించారు. ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మా స్వేచ్ఛను గౌరవించండి. చికిత్స పూర్తయ్యాక త్వరలోనే చెన్నైకి తిరిగి వస్తాను. ఏఆర్ రెహమాన్ పేరుకు దయచేసి కళంకం ఆపాదించకండి’’ అని సైరా భాను కోరారు. – సాక్షి చెన్నై, తమిళ సినిమా -
మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా భాను పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వారి ప్రకటన అనంతరం వస్తున్న వార్తలపై వారి తనయుడు అమీన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మా నాన్న ఓ లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి.దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ కుమార్తె రహీమా కూడా ఇన్స్టాగ్రామ్లో ఓ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘మనల్ని ద్వేషించే వాళ్లే వదంతులు సృష్టిస్తారు. తెలివితక్కువ వాళ్లు వాటిని వ్యాప్తి చేస్తారు. పనికి రానివాళ్లు వాటిని అంగీకరిస్తారు. దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి’’ అంటూ పోస్ట్ చేశారామె.ఇక ఈ నెల 19న ఏఆర్ రెహమాన్, సైరాల విడాకుల ప్రకటన వచ్చిన అనంతరం రెహమాన్ బృందంలోని మోహినీ దే అనే అమ్మాయి కూడా తన భర్త, తాను విడిపోతున్నట్లు ప్రకటించారు. దాంతో రెహమాన్, మోహినీ ఒకేసారి విడాకుల గురించి ప్రస్తావించడం వెనక ఏదో కారణం ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఉద్దేశించే అమీన్, రహీమా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా స్పందించి ఉంటారని ఊహించవచ్చు. -
బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్
దీని అర్థమేంటి చంద్రబాబూ..ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు కేసులో మనీలాండరింగ్కు పాల్పడిన నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల స్థిర, చర ఆస్తులను అటాచ్ చేశాం. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్, భారత్లో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్చంద్ అగర్వాల్, సురేశ్ గోయల్ బోగస్ ఇన్వాయిస్లతో నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించినట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. వారి బ్యాంకు ఖాతాలు, షేర్లు, స్థిరాస్తు లను జప్తు చేశాం. గతంలోనే డిజైన్టెక్కు చెందిన రూ.31.20 కోట్లను జప్తు చేశాం. వికాస్, సుమన్, ముకుల్, సురేశ్లను అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది. – ఈడీసాక్షి, అమరావతి: అడ్డంగా దొరికిన ప్రతిసారి తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడం చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడ అని మరోసారి రుజువైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చడంతో మరోసారి ఫేక్ ప్రచారం చీప్ ట్రిక్ను టీడీపీ తెరపైకి తెచ్చింది. ఈడీ జారీ చేసిన అధికారిక ప్రకటననే ట్యాంపర్ చేస్తూ మరీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతోపాటు కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేలా చేశారు. తద్వారా అబద్ధపు ప్రచారానికి రెక్కలు తొడిగుతూ తిమ్మినిబమ్మి చేసేందుకు యత్నించారు. అయితే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు ఈడీ స్పష్టం చేయడంతోపాటు, చంద్రబాబుతోపాటు తాము ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ తేల్చి చెప్పడంతో టీడీపీ ఎత్తుగడ బెడిసికొట్టింది. బోగస్ ఇన్వాయిస్లతో ప్రజాధనం కొల్లగొట్టారు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట భారీ అవినీతికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ ఓ ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. అంతేకాదు అసలు ఆ ప్రాజెక్ట్నే చేపట్టలేదని, పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టు బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేసినట్టు గుర్తించామని తెలిపింది. ఆ నిధులను సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్.. తమ సన్నిహితులు ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా అక్రమంగా దారి మళ్లించినట్టు వెల్లడించింది. ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించి.. అక్కడి నుంచి తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయాన్ని గుర్తించామని తెలిపింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్షీట్ను దాఖలు చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ గతంలోనే అటాచ్ చేసింది. తాజాగా రెండో విడతగా మరో రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను మంగళవారం అటాచ్ చేసింది. దాంతో ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టైంది.టీడీపీ ఫేక్ ట్రిక్ ఇదీ..⇒ స్కిల్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచేసరికి చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ఆయన అవినీతిని సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. దాంతోనే చంద్రబాబును గతేడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. సిట్ నివేదికతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ⇒ ప్రస్తుతం ఈడీ కూడా దర్యాప్తు వేగవంతం చేసి స్కిల్ స్కామ్లో నిధులు కొల్లగొట్టిన తీరును నిరూపిస్తోంది. తాను నిధులు కొల్లగొట్టడంలో పాత్రధారులుగా చేసుకున్న షెల్ కంపెనీల ప్రతినిధులు వికాస్ ఖన్విల్కర్, సుమన్బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్లను ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇక రెండో విడతలో వికాస్ ఖన్విల్కర్, సుమన్ బోస్ ఆస్తులను అటాచ్ చేసింది. అదీ టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పటికీ.. ఆ కుట్రలో తన భాగస్వాముల ఆస్తులను అటాచ్ చేయడం చంద్రబాబును బేంబేలెత్తిస్తోంది. ⇒ ఇక ఈడీ తదుపరి చర్యలు తనపైనే అని ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ తనకు అలవాటైన రీతిలో తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఓ ఫేక్ ప్రకటనను సోషల్ మీడియాలో మంగళవారం రాత్రి నుంచి వైరల్ చేసింది. ఏకంగా ఈడీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలకు ముందు వెనుకా రెండు వాక్యాలు జోడించడం ద్వారా ట్యాంపర్ చేసి ఈ ప్రచారం చేయడం గమనార్హం. ⇒ ఈడీ పేరుతో రూపొందించిన ఆ ఫేక్ ప్రకటనను టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా కొన్ని ఇంగ్లిష్ పత్రికల్లోనూ ఆ తప్పుడు సమాచారం ప్రచురితమయ్యేట్టు చేయడం చంద్రబాబు మార్కు మీడియా మేనేజ్మెంట్కు నిదర్శనం.ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఈడీ చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు టీడీపీ చేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. తాము చంద్రబాబుతోపాటు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఈడీ హైదరాబాద్ విభాగం అధికారులు మీడియాకు తేల్చి చెప్పారు. షెల్ కంపెనీల ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా పూర్తి కాలేదని కూడా ఈడీ తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. దీంతో ఫేక్ ట్రిక్తో తాము చేసిన తప్పుడు ప్రచార ఎత్తుగడ బెడిసి కొట్టడంతో బుధవారం ఉదయం నుంచి టీడీపీ మౌన ముద్ర దాల్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. గతంలో సీఐడీ సిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రాతిపదికగా చేసుకునే ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రబాబును ఏ–1గా సీఐడీ పేర్కొంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఇప్పటికే నిగ్గు తేల్చింది. స్కిల్ స్కామ్ కేసులో సిట్ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షీట్ను ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపించింది. అంటే చంద్రబాబు.. ఏ–1గా ఉన్న ఎఫ్ఐఆర్, చార్జిషీట్ ఆధారంగానే ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని స్పష్టమవుతోంది. మరో వైపు ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు అందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఈడీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. అటువంటిది ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిందని, టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరం. స్కిల్ కేసులో ఇప్పటికే పాత్రధారులైన షెల్ కంపెనీల ప్రతినిధుల బండారాన్ని బయటపెట్టిన ఈడీ.. ఇక అసలు సూత్రధారి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చేందుకు ఉద్యుక్తమవుతున్నట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. -
సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం: కమలా హారిస్
వాషింగ్టన్: మిల్టన్, హెలెన్ హరికేన్ల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమలా హారిస్ మండిపడ్డారు. నార్త్ కరోలినాలో వారం రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన ఆదివారం ఆమె.. పలు చర్చిలకు వెళ్లి నల్లజాతీయులను కలిశారు. కోయినోనియా క్రిస్టియన్ సెంటర్లో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయం చేస్తున్న వారు నిజమైన హీరోలని కొనియాడారు. కానీ ఒక కీలక వ్యక్తి సహాయం చేయకపోగా, సొంత ప్రయోజనాలకోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు చేయాల్సింది అది కాదని హితవు పలికారు. హెలెన్ తుఫాను అనంతరం ఫ్లోరిడాలో పర్యటించిన ట్రంప్.. రిపబ్లికన్ల సహాయాన్ని ప్రభుత్వం కావాలనే నిలిపేస్తోందని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్న వలసదారుల కోసం ఖర్చు చేయడంతో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి ఇవ్వడానికి నిధులు లేకుండా పోయాయయని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై హారిస్ పైవిధంగా స్పందించారు. కమలా హారిస్ ప్రసంగానికి ముందు బైడెన్ గల్ఫ్ తీరంలోని టంపా, సెయింట్ పీట్ బీచ్ మధ్య హెలికాప్టర్లో హరికేన్ నష్టాన్ని సర్వే చేశారు. మిల్టన్ ఊహించినంత నష్టం చేయలేదని, చాలామంది సర్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఫస్ట్ రెస్పాండర్లను బైడెన్ ప్రశంసించారు. ఇలాంటి సమయాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లుగా కాకుండా అమెరికన్లుగా పరస్పరం సహాయం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకోసం నిధులను మంజూరు చేశారు. పోలింగ్కు ఇంకా మూడు వారాల సమయమే ఉన్న నేపథ్యంలో వరుస తుఫానులు ఎన్నికలకు మరో కోణాన్ని జోడించాయి. -
నాకు యూట్యూబ్ ఛానల్ లేదు.. వారికి ఆర్కే రోజా వార్నింగ్
సాక్షి, విజయవాడ: తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి యూ ట్యూబ్ ఛానల్ లేదని.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మాత్రమే వాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు. ‘‘నా పేరుతో ఎవరో ఫేక్ యూట్యూబ్ ఛానళ్లు నడుపుతున్నారు. వాటి ద్వారా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. తక్షణమే వాటిని తొలగించకపోతే చర్యలు తీసుకుంటా’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు.అందరికీ నమస్కారం!!నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు.నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి #facebook #Instagram , #twitter మరియు #threads మాత్రమే వాడుతున్నాను,నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు దయచేసి గమనించగలరు. నా పై…— Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2024 ఇదీ చదవండి: ‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది -
వల్లభనేని వంశీ అరెస్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారం
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు.. గత రాత్రి సర్నాల రమేష్, ఈ రోజు ఉదయం యూసఫ్ను అరెస్ట్ చేశారు. అయితే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది. వంశీ అరెస్ట్పై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. -
‘సాక్షి’పై ఇన్ని అబద్ధాలా?.. కూటమి కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు అదే పనిగా అబద్ధాలు చెబుతూ... వైఎస్ జగన్ ప్రభుత్వం ‘సాక్షి’ పత్రికకు అడ్డగోలుగా దోచిపెట్టేసిందని ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ల కూటమి ఇపుడు అసెంబ్లీలో నిజాలు చెప్పక తప్పటం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఏ పత్రికకూ అడ్డగోలుగా ప్రకటనలివ్వటం వంటివి జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పటంతో... మరి ‘సాక్షి’ విషయంలో చేసిన ఆరోపణలన్నీ తప్పేనా? ఇలాంటి అబద్ధాలు ఇంకెన్ని చెప్పారో...!! అని ముక్కున వేలేసుకోవటం జనం వంతవుతోంది... ఇవిగో నిజానిజాలు...ఐదేళ్లలో‘సాక్షి’కిచ్చిన ప్రకటనల వివరాలివీ... వాస్తవానికి సమాచార శాఖ నిబంధనలు, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) గణాం కాలను పరిగణనలోకి తీసుకునే వైఎస్సార్సీ ప్రభుత్వం వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్ తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి పార్థసారథి ఇదే విషయాన్ని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల సమయంలో సమాచార శాఖ ద్వారా సాక్షి పత్రికకు రూ.293 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.78 కోట్లు. మొత్తం రూ.371 కోట్ల మేర ప్రకటనలు ఇచ్చినట్టు తెలిపారు.నిజానికి ఇక్కడే వాస్తవ సమాచారాన్ని కాస్త వక్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సాక్షికి రూ.371 కోట్ల విలువైన ప్రకటనలిచ్చినా ‘ఈనాడు’ పత్రికకు తక్కువగా ఇచ్చారని. వాస్తవానికి ‘సాక్షి’ పత్రికలో ఐదేళ్లూ ప్రభుత్వ ప్రకటనలు ప్రచురితమయ్యాయి. కానీ ‘ఈనాడు’లో మూడున్నరేళ్లు మాత్రమే ప్రచురితమయ్యాయి. ఈ వాస్తవాన్ని మాత్రం కాస్తంత గోప్యంగా ఉంచారు మంత్రి పార్థసారథి. ఈ మూడున్నరేళ్ల వ్యవధిలోనే... ఈనాడుకు సమాచారశాఖ ద్వారా రూ.190 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.53 కోట్లు.. మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలు ఇచ్చింది. మూడున్నరేళ్ల తరువాత ఈనాడు యాజమాన్యం తమకు ప్రభుత్వ ప్రకటనలు తాము ప్రచురించబోమని అధికారికంగా సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటనలు ఇవ్వలేదు. అదీ.. ఈనాడు పత్రిక యాజమాన్యం స్వచ్ఛందంగా వద్దని లేఖ రాయడంతోనే, ఆ ఏడాదిన్నర కూడా ఈనాడు పత్రిక యాజమాన్యం ప్రకటనలు తీసుకొని ఉంటీ ప్రభుత్వం మరో రూ.125 కోట్ల వరకు విలువైన ప్రకటనలు ఇచ్చేది. దాంతో సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడాప ప్రకటనల బడ్జెట్ కేటాయించినట్లు అయ్యేది.‘సాక్షి’కి బకాయిలు ‘ఈనాడు’కన్నా ఎక్కువే...బాబు ప్రభుత్వం మరో అబద్ధాన్ని కూడా తెరమీదికి తేబోయింది. అదేంటంటే ‘ఈనాడు’ పత్రికకు ప్రకటనల బిల్లులు పూర్తిగా చెల్లించకుండా ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని, అందుకే ‘ఈనాడు’ మూడున్నరేళ్ల తరవాత ప్రకటనలు తీసుకోలేదని. నిజానికి ‘ఈనాడు’కు ప్రభుత్వ ప్రగతిని తన పత్రికలో ప్రకటనల రూపంలో కూడా ప్రచురించటం ఇష్టం లేదు. అందుకే ప్రకటనలు వెయ్యలేమని లిఖితపూర్వకంగా చెప్పేసింది. వాస్తవానికి ‘ఈనాడు’కే కాదు. ‘సాక్షి’ పత్రికకు కూడా ప్రకటనల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.ఈనాడు పత్రికకు చెల్లించాల్సిన ప్రకటన బకాయిలు రూ.51 కోట్లు ఉండగా, వైఎస్సార్సిపీ ప్రభుత్వం అయినప్పటికీ సాక్షి పత్రికకు రూ.104.85 కోట్ల యాడ్స్ బకాయిలు పెండింగులో ఉన్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రయత్నించబోయి బొక్కబోర్లా పడింది. నిజానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో ప్రచురితమయ్యే 22 పెద్ద పత్రికలతో పాటు ఎన్నో చిన్న పత్రికలు, మేగజైన్లకు కూడా ప్రకటనలు ఇచ్చింది. మార్గదర్శకాలను ఏమాత్రం ఉల్లంఘించకుండా, వివక్షకు తావు లేకుండా ప్రకటనలు ఇచ్చింది. -
అసెంబ్లీ సాక్షిగా బాబు తప్పుడు లెక్కలు
-
KSR Live Show: బాబుది రోత పత్రం... జగన్ ది ఫ్యాక్ట్ పత్రం
-
‘ఎల్లో’ విష ప్రచారం.. పులివెందులలో ఎలాంటి రాళ్ల దాడి జరగలేదు: డీఎస్పీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విష ప్రచారానికి ఒడిగట్టింది. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని పోలీస్ అధికారులు ఖండించారు. పులివెందులలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తుండగా, కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయని.. ఎటువంటి రాళ్లదాడి జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదని.. కేవలం వైఎస్ జగన్ను చూడడానికి ప్రజలు తరలిరావడంతో తోపులాట జరిగిందని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. -
సిగ్గు విడిచి.. చిలవలు పలవలు
సింగరాయకొండ/ఒంగోలు టౌన్: ఎక్కడ చిన్న గొడవ జరిగినా అది వైఎస్సార్సీపీకి అంటగట్టడం ఎల్లో బ్యాచ్కు అలవాటుగా మారింది. జరిగిన ఘటనపై టీడీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. వెనువెంటనే వారి అనుకూల ఛానల్స్లో అసత్య కథనాలు మొదలైపోతాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జరిగిన కారు దహనం ఘటన దానికి నిదర్శనంగా నిలిచింది. మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్లో టీడీపీ నేత చిగురుపాటి శేషగిరిరావు నివాసముంటున్నాడు.శుక్రవారం అర్ధరాత్రి అతని ఇంటి ఆవరణలోని కారుపై కొందరు పెట్రోలు పోసి తగలబెట్టారు. అయితే ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిందని, రాజకీయాలకు సంబంధంలేదని బాధితుడితోపాటు పోలీసులు చెబుతున్నా పచ్చ నేతలు దానికి రాజకీయ రంగు పులిమి శిలవలు పలవలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఒంగోలులో ఏఎస్పీ (క్రైం) శ్రీధర్రావు మీడియాకు వివరించారు. వ్యక్తిగత విద్వేషాలతోనే శేషగిరిరావును భయభ్రాంతులకు గురిచేసేందుకు కారు దహనానికి పాల్పడ్డారని, ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. అసలు జరిగింది ఇదీ.. సింగరాయకొండ లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శేషగిరిరావుకు అదే గ్రామానికి చెందిన లాడ్జి యజమాని కనసాని ఈశ్వర్రెడ్డికి మధ్య భూ వివాదం ఉంది. ఈశ్వర్రెడ్డికి, అశోక్ అనే వ్యక్తికి మధ్య ఒక భూ వివాదానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన శేషగిరిరావు అందుకు సంబంధించిన సెటిల్మెంట్ పత్రాలను తన వద్దనే ఉంచుకొన్నాడు. అయితే ఆ పత్రాలను తనకు ఇవ్వవలసిందిగా ఈశ్వర్రెడ్డి కొద్ది రోజులుగా అడుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా ఈశ్వర్ రెడ్డి మీద శేషగిరిరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు.దీంతో కక్ష పెంచుకున్న ఈశ్వర్ రెడ్డి తన వద్ద పనిచేసే పాలేటి అభిõÙక్ అతడి మిత్రుడైన ఒక మైనర్ సహాయంతో శేషగిరిరావు ఇంటివద్ద ఉన్న కారుపై పెట్రోలు పోసి తగలబెట్టించాడు. శేషగిరిరావు ఫిర్యాదు చేసిన వెంటనే ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్పందించారు. ఈ కేసును ఛేదించేందుకు అడిషనల్ ఎస్పీ (క్రైం) శ్రీధర్ రావు, ఒంగోలు డీఎస్పీ కిశోర్ కుమార్ల ఆధ్వర్యంలో 6 టీంలను రంగంలోకి దించారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం సింగరాయకొండ బైపాస్ వద్ద ఈశ్వర్రెడ్డితో పాటు మరో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వైఎస్సార్ సీపీపై నింద వేసేందుకు ఒత్తిడి ఇందులో వ్యక్తిగత కక్షలు తప్ప రాజకీయ నేపథ్యం లేదు. అయితే ఈ ఘటనకు వైఎస్సార్సీపీయే కారణం అని ఫిర్యాదు చేయాలంటూ శేషగిరిరావుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. వాస్తవానికి ఈశ్వరరెడ్డి వైఎస్సార్సీపీ నాయకుడు కాదు. ఆయనకు టీడీపీ నాయకులతో సంబంధాలున్నాయి. వాస్తవాలను కప్పిపుచ్చుతూ టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య వివాదంగా చిత్రీకరించాలని చూడడంపై స్థానికులు విస్మయం చెందారు. -
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేవిధంగా వ్యవరిస్తున్నారన్నారు. ‘‘ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతం’’ అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు.అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా?. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు. ఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదు. ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం. చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ. టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్ ల్యాండ్ పోర్టల్లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులోకి నెట్టారు. సీఆర్డీఏ పరిధిలోని భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారు. సాదా బైనామా పేరుతో భూములు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.తన అనుయాయులకు భూములు చంద్రబాబు కట్టబెట్టారు. లీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. కబ్జాలకు అలవాటు పడిన వాళ్లకి సంస్కరణలు నచ్చవు. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కబ్జాలు,అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు’’ అని సజ్జల చెప్పారు.‘‘భూముల వివరాలను ఏ కంపెనీకి ఇస్తున్నాం. అర్థరహితమైన ఆరోపణలు చేస్తారా. 190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే 154 స్థానంలో ఉన్నాం. కన్నాలు వేసే వాళ్లకి ఇటువంటి చర్యలు నచ్చవు. భూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యింది. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు.’’ అని సజ్జల నిప్పులు చెరిగారు.‘‘చంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారు. పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేశాం. పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి?. రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా?. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు అంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక మాత్రమే ఈ చట్టం అమలవుతుంది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపాం. చట్టం అమలు అవ్వాలంటే మరో రెండు నుంచి మూడేళ్లు పడుతుంది’’ సజ్జల వివరించారు.‘‘కోవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని సజ్జల పేర్కొన్నారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
సాక్షి, విజయవాడ: టీడీపీపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. విచారణకు సీఐడీని ఆదేశించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది: ఎమ్మెల్యే మల్లాది విష్ణుమార్కాపురం, ఒంగోలు సభల్లో సీఎం జగన్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబుకు జగన్పై అసూయ తారా స్థాయికి చేరిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై బాబు అండ్ కో విషం చిమ్ముతోంది. ఐటీడీపీ సైట్లో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ విలువలు, విశ్వసనీయత కోల్పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. చర్యలకు సీఐడీకి సిఫారసు చేసింది. చంద్రబాబు, పవన్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’’ అని విష్ణు కోరారు.ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బాబు, పవన్ దుష్ప్రచారం: మనోహర్ రెడ్డిల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న విషప్రచారంపై ఈసీకి ఫిర్యాదు చేశామని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మోదీ సభలో మాట్లాడే ధైర్యం బాబు, పవన్లకు ఉందా?. అబద్దాల ప్రచారానికి టీడీపీకి ఓ యూనివర్సిటీ నే ఉంది’’ అని మనోహర్రెడ్డి వ్యాఖ్యానించారు.కాగా, అమల్లో లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతో పాటు తగిన ఆధారాలను అందజేశారు. -
ఆత్మలనూ వాడుకుంటున్న రామోజీ
ఎల్లోమీడియా అధినేత రామోజీరావు తన జీవితపు అంతిమ ఘడియల్లోనూ తన తన క్షుద్ర బుద్ధినిపోనిచ్చుకోవడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా దాన్ని ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అంటగట్టేందుకు ఎంతగానో తాపత్రయపడిపోతున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు కుటుంబం విషాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టే ప్రయత్నం చేసిన ఈనాడు. వాస్తవానికి ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని టీడీపీ హయాంలో రికార్డులను తారుమారు చేసే అధికారులను పట్టుకుని 2015 లో తన తండ్రిపేరు రికార్డ్ చేయించారు. తరువాత ప్రభుత్వం రికార్డులనుంచి ఆయన పేరును తొలగించింది. అంతేకాకుండా ఆ భూమి గతంలో ఎన్నడూ. ఎవరికీ ఎసైన్ చేయలేదు. రాళ్ళూ, రప్పలతో ఉన్న ఆ భూమి కనీసం సాగుకు కూడా పనికిరాదు.. గతంలో ఎన్నడూ ఎవరూ అధికారికంగా అనధికారికంగా కూడా అక్కడ సాగు చేయలేదు. ఆ భూమి తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి సుబ్బారావు కూడా ఎన్నడూ అర్జీ కూడా పెట్టుకోలేదు.. ఏ అధికారిని కలవలేదు. జూదం.. క్రికెట్ బెట్టింగులు.. ఇతర వ్యసనాలతో ఇరవై లక్షల వరకు అప్పులు చేసి.. ఇటు కులవృత్తిని సైతం వదిలేసి ఇబ్బందులు పాలయ్యాడు.. దీంతో భార్యకుమార్తెను అయన హత్య చేసి తరువాత తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తోంది. ఇలాంటి ఘటనలను సైతం ప్రభుత్వానికి అంటగట్టే కుట్రలకు ఎల్లో మీడియా తెగబడుతోంది. -
ఏది సత్యం? ఏదసత్యం?
‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అనేది ఉపనిషత్ వాక్యం. ఉన్నది ఒకటే సత్యం. దానినే పండితులు అనేక రకాలుగా చెబుతారని దీని అర్థం. వెలుతురు ఉన్న లోకంలో చీకటి ఉన్నట్లే,వసంతం ఉన్న ప్రకృతిలో శిశిరం ఉన్నట్లే సత్యం ఉన్న ప్రపంచంలో అసత్యం కూడా ఉనికిలో ఉంటుంది. అది సహజం. ‘సత్యమేవ జయతే’– ఇది కూడా ఉపనిషత్ వాక్యమే! మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజున ఈ వాక్యాన్ని జాతీయ ఆదర్శంగా స్వీకరించాం. ‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్/ నబ్రూయాత్ సత్యమప్రియం/ ప్రియంచ నానృతం బ్రూయాత్/ ఏష ధర్మ స్సనాతనః’– ఇది సుభాషిత శ్లోకం. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. సత్యాన్ని ప్రియంగా పలకాలి. సత్యమే అయినప్పటికీ అప్రియంగా పలుకరాదు. ప్రియమైనదే అయినంత మాత్రాన అసత్యాన్ని పలుకరాదు. ఇదే సనాతన ధర్మం అని ఈ శ్లోకానికి అర్థం. అనాదిగా ప్రచారంలో ఉన్న ఉపనిషత్ వాక్యాలను, సుభాషిత శ్లోకాలను గమనిస్తే, అవన్నీ సత్యం పట్ల నిబద్ధతకు అద్దం పడతాయి. సత్యం కోసం సర్వస్వాన్నీ వదులుకున్న సత్యహరిశ్చంద్రుడి కథ మన జాతిపిత మహాత్మా గాంధీ సహా ఎందరికో ఆదర్శప్రాయం. మరి సత్యసంధతపై ఇంత కట్టుదిట్టమైన పునాదులు ఉన్న మన దేశం నలుచెరగులా నిరంతరం సత్య వాక్కులే వినిపిస్తూ ఉండాలి కదా! సత్యమే వర్ధిల్లుతూ ఉండాలి కదా! అలా అనుకుంటే అది అమాయకత్వమే! దీపం కింద నీడలా సత్యాన్ని అంటిపెట్టుకుని అసత్యమూ ఉంటుంది. సత్యానిదే అంతిమ విజయం కావచ్చు గాక, కాని అప్పుడప్పుడు అసత్యం బలం పుంజుకుని లోకంలో అనర్థాలకు కారణమవుతుంది. అసత్యం తెచ్చిపెట్టే అనర్థాలకు ఉదాహరణలు మన రామాయణ, మహాభారతాల్లో దొరుకు తాయి. రామబాణం తాకినప్పుడు మాయలేడి రూపంలోని మారీచుడు ‘హా సీతా! హా లక్ష్మణా!’ అంటూ రాముడి గొంతుతో ఆర్తనాదాలు చేసి, సీతాపహరణానికి కారకుడయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు ‘అశ్వత్థామ హతః’ అని బిగ్గరగా పలికి, భేరీనాదాలు మోగే సమయంలో ‘కుంజరః’ అని గొణిగి ద్రోణాచార్యుడి మరణానికి కారకుడయ్యాడు. అబద్ధం చేసే అలజడి మార్మోగే సమయంలో మనకు మెదడు పనిచేయదు. వెనువెంటనే నిజాన్ని తెలుసుకోగల వ్యవధి ఉండదు. నిజాన్ని తెలుసుకునే వ్యవధిలోగానే అబద్ధం నానా అనర్థాలను కలిగిస్తుంది. అసత్య ప్రచారం అట్టహాసంగా సాగుతున్నప్పుడు సత్యమేదో, అసత్యమేదో తేల్చుకోవడం దుస్సాధ్యంగా మారుతుంది. పత్రికలు మొదలయ్యాక ఆధునిక ప్రపంచంలో అసత్య ప్రచారం బలం పుంజుకోవడం మొదలైంది. అబద్ధాలకు పత్రికలు ఊతమివ్వగల అవకాశాలను తొలి తరాల్లోనే కొందరు రాజకీయవేత్తలు గుర్తించారు. పత్రికల ద్వారా అబద్ధాలను ప్రచారం చేయడాన్ని హిట్లర్ అనుయాయి గోబెల్స్ ఒక కళలా సాధన చేశాడు. ‘ప్రజాభిప్రాయాన్ని మలచే కార్యక్రమాన్ని పర్యవేక్షించే పూర్తి అధికారం రాజ్యానికి ఉంది’ అనేది గోబెల్స్ జ్ఞానగుళిక. రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీ నిరంకుశ రాజ్యానికి గొంతునిచ్చిన గోబెల్స్ను ఆరాధించేవారు ప్రపంచంలో నేటికీ ఉన్నారు. నిజానికి ఇప్పుడు గోబెల్స్కు బాబుల్లాంటి వాళ్లు పుట్టుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులను చూడటం వల్లనే కాబోలు ‘ఏది పుణ్యం, ఏది పాపం/ ఏది సత్యం, ఏదసత్యం? / ఏది నరకం, ఏది నాకం?/ ఓ మహాత్మా, ఓ మహర్షీ!’ అని వాపోయాడు మహాకవి. ఇది హైటెక్కు టమారాల యుగం. ఇది సమాచార విప్లవశకం. స్మార్ట్ఫోన్ల ఆవిష్కరణతో ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయిన కాలం. క్షీరనీర న్యాయంగా అబద్ధాల నుంచి నిజాలను వేరు చేయగల హంసలు బొత్తిగా కరవైపోతున్న రోజులివి. నిజం వేషాన్ని ధరించిన అబద్ధాన్ని గుర్తించడం అగ్నిపరీక్షగా మారిన రోజులివి. సమాచార ప్రచారానికి ఒకప్పుడు వార్తాపత్రికలు, రేడియో మాత్రమే ఆధారంగా ఉండేవి. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ప్రసారాలతో ఊదరగొడుతున్న టీవీ చానళ్లు, నిరంతర కథనాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వార్తా వెబ్సైట్లు, వీటికి తోడుగా సామాజిక మాధ్యమ సాధనాలు అనుక్షణం జనాల మీదకు పుంఖాను పుంఖాలుగా సమాచారాన్ని వదిలిపెడుతున్నాయి. వరద ఉద్ధృతి ఉప్పొంగినప్పుడు జలప్రవాహంతో పాటు చెత్తా చెదారం కొట్టుకొస్తుంటాయి. నిర్విరామంగా సాగే నిరంతర సమాచార ప్రవాహంలో సత్యంతో పాటు అర్ధసత్యాలు, అసత్యాలు కూడా అలాగే కొట్టుకొస్తుంటాయి. గుట్టలు గుట్టలుగా పోగుపడుతున్న అసత్యాలు, అర్ధసత్యాల అడుగున సత్యం కనుమరుగుగా ఉంటుంది. సత్యాన్ని మరుగుపరచేలా సాగుతున్న అసత్యాల, అర్ధసత్యాల సమాచార ప్రవాహం సమాచార కాలుష్యాన్ని పెంచుతోంది. సమాచార కాలుష్యం ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమిస్తోంది. అబద్ధాల రణగొణల మధ్య నిజాల గొంతు వినిపించకుండా పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు ప్రమాదకరంగా మారుతోందని ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక తన ‘గ్లోబల్ రిస్క్ రిపోర్ట్–2024’లో వెల్లడించింది. అసత్యాలు, అర్ధసత్యాలతో హోరెత్తిస్తున్న తప్పుడు సమాచారం ప్రపంచ దేశాల్లో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమే కాకుండా, రాజకీయ అస్థిరతకు, అశాంతికి, హింసకు, ఉగ్రవాదానికి దారితీస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక సమర్పించిన ఈ నివేదిక హెచ్చరించింది. ‘సత్యమేవ జయతే’ అని జాతీయ ఆదర్శంగా చెప్పుకుంటున్న మన భారతదేశమే తప్పుడు సమాచారం వ్యాప్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం వర్తమాన విషాదం. -
Yellow Media: ఈ పత్రికలు చదవడానికా? సైకిల్ తుడవడానికా?
కోరల నిండా విషం నింపుకున్న పాములకన్నా.. వాళ్ళిద్దరూ ఇంకా ప్రమాదకరం.. వాళ్ళు చిమ్మే ఎల్లో పాయిజన్ పాము విషం కంటే అత్యంత ప్రమాదకరం. తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలతో ఎల్లో మీడియా జగన్పై, జగన్ సర్కార్పై విషం చిమ్ముతోంది.. మొదట్లో ఒకటి రెండు డోస్ మాత్రమే పాయిజన్ కనిపించేది. ఇప్పుడు లీటర్ల కొద్దీ విషం కక్కుతున్నారు. ప్రతిరోజూ తప్పుడు వార్తలు, అసత్య కథనాలతో తమ పత్రికల్ని నింపేస్తున్నారు. వాటిని పత్రికలు అనడం కటంటే.. విష పుత్రికలు అనడమే కరెక్ట్.. క్రమంగా విషపు రాతల డోస్ పెంచుతూ వచ్చారు. ఎంతలా అంటే మన ఊహలకు అందనంతలా ఇప్పుడు డోస్ పెంచారు. ఒక్కో పత్రిక రోజుకు 50కి పైగా విషపు వార్తలు రాస్తోంది. అంటే ఆ రెండు ఎల్లో పత్రికలు రోజుకు వందకు పైగా విషపు రాతలు రాసి జనాలపైకి వదులుతున్నాయి. సీఎం జగన్ ప్రభుత్వంపై పూర్తిగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతకీ ఎందుకు ఇంతలా విషం చిమ్ముతున్నారు? పనికట్టుకుని మరీ ఎందుకిలా రోత పుట్టించే రాతలు రాస్తున్నారు ? ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? జర్నలిజం అనే సీసా ఒక ఇజంతో ఒక నిజంతో నిండి ఉంటుంది. అందులో ఉన్న ఆ ఇజాన్ని నిజాన్ని పక్కన పడేసి పూర్తిగా అందులో విషాన్ని నింపి... రాజకీయాల్లో దాన్ని శత్రువులపై అస్త్రంగా వాడుకోవచ్చని మూడు దశాబ్దాల క్రితమే గుర్తించిన దొంగ విజన్ వున్నోడు నారా రూప చంద్రబాబు నాయుడు. మీడియా ఏం చెప్పినా జనం నమ్ముతారు.. మీడియా ఏం చెప్పినా జనం వింటారని అప్పట్లోనే గుర్తించి మెల్లగా కొన్ని పత్రికలను తన విష పుత్రికలుగా మార్చుకుని స్లో పాయిజన్ మాదిరిగా తప్పుడు వార్తలు జనంలోకి తీసుకెళ్లిన ఘనత పచ్చ బాబుకే దక్కుతుంది. జర్నలిజం విలువలు పూర్తిగా దిగజార్చిన ఖ్యాతి కూడా ఆయనదే..! అతను విసిరే బిస్కెట్ల కోసం ఆశపడే శునక జాతి.. జర్నలిజాన్ని అమ్ముడుపోయే వస్తువుగా మార్చేసింది. జాతి జనుల కంటే..తమ జాతి గాడి ప్రయోజనాల కోసం మీడియా విలువల్ని కిలో మీటర్ లోతులో గొయ్యి తీసి పాతి పెట్టిన క్రెడిట్ మాత్రం మన ఎల్లో తాతగారికి, అందరి కుర్చీ కింద కూర్చుని, బాత్ రూముల్లో దాక్కుని రహస్య వార్తలు సేకరించే కృష్ణయ్యగారికే దక్కుతుంది. అసలు ఎందుకీ విషపు రాతలు? వీళ్లు చేస్తున్నది జర్నలిజమా ? చంద్రబాబుకు ఊడిగమా ? ఇవి పత్రికలా.. పత్రికలకు పట్టిన పీడా ? ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? అడ్డగోలు రాతలు రాసి అడ్డంగా బుక్కై పోయామా.. అయినా డోంట్ కేర్. పట్టపగలు నట్ట నడివీధిలో నగ్నంగా పట్టుబడ్డామా.. అయినా డోంట్ కేర్. పచ్చి అబద్ధాలు చెప్పి పక్కా ఆధారాలతో పచ్చిగా దొరికిపోయామా...అయినా డోంట్ కేర్. అందరి ముందు ముసుగు తొలగిపోయి నిజస్వరూపం బయట పడిపోయిందా...అయినా డోంట్ కేర్. ప్రతిరోజూ వందకు పైగా తప్పుడు వార్తలు రాసేద్దాం.. ప్రజల మధ్యకు వదిలేద్దాం..! జగన్ చేస్తున్న సంక్షేమాన్ని, అబివృద్దిని పచ్చ పత్రికలతో కప్పేద్దాం ...ఇలానే ఉంది ఈ విష పత్రికల తీరు. ఒక్క మాటలో చెప్పాలంటే బాబుగారి కూలి పత్రికలు.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు పోటీ పడతాయి.. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడంలో ముందుంటాయి.. మంత్రులు, వైఎస్ఆర్ సీపీ నేతలపై విమర్శలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తాయి.. ప్రభుత్వం చేసే మంచి పనులపై తప్పుడు రాతలు రాయడంలో మేమే ఫస్ట్ అంటాయి. పేదలపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తాయి. మంచి చేసే వ్యవస్థలను నోటికొచ్చిన ఆరోపణలు చేయడంలో పోటీ పడతాయి. వీటి పనేంటో తెలుసా.. ప్రజలకు నిజాలు చెప్పడం కాదు. అందంగా అబద్ధాలను వండి వార్చడం. ప్రభుత్వంపై లేని వ్యతిరేకతను సృష్టించడం. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం. బాబుగారి కూలి పత్రికలు అదే పనిగా అబద్ధాలను అచ్చేసి వదిలేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. అవేంటో ఒక్కసారి చూద్దాం... 1. ప్రభుత్వంపై ఎందుకిలా విషం చిమ్ముతున్నారు? 2. ప్రతిరోజూ వందకు పైగా తప్పుడు కథనాలు ఎందుకు వండి వారుస్తున్నారు ? 3. ఈ పత్రికలు చదవడానికా ? సైకిల్ తుడవడానికా ? 4. వీళ్లు చేస్తున్నది జర్నలిజమా ? చంద్రబాబుకు ఊడిగమా ? పదే పదే బాబుగారి విషపు పత్రికలు అబద్ధాలను అచ్చేస్తున్న వేళ వినిపిస్తున్న ప్రశ్నలివే! ఎల్లో తాతగారి పత్రిక, కుర్చీ కింద కృష్ణయ్య గారి పత్రిక ఒక్కసారి ఓపెన్ చేసి తీక్షణంగా చూడండి. మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఓసారి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు లెక్క పెట్టి చూడండి. ఒక్కో పత్రికలు సుమారుగా 50కి పైగా వార్తలు మీకు కనిపిస్తాయి. అంటే ఈ రెండు పత్రికల్లో రోజుకు సుమారుగా వందకు పైగా తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారన్న మాట. ఈ లెక్కన ఏడాదికి 365 రోజులు అంటే.. 36 వేల 500 తప్పుడు వార్తలు. అవును ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఇది నిజంగా నిజం. ఇంకా డౌట్ ఉంటే ఓ వారం రోజులు ఆ దిక్కుమాలిన పేపర్లు దగ్గర పెట్టుకుని.. విషపు వార్తలు ఎన్ని వున్నాయో లెక్క పెట్టి చూడండి... నేను చెప్పిన లెక్క తక్కువ కాదు ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. వీటి పనంతా ప్రభుత్వంపై బురద జల్లడం ప్రభుత్వాన్ని బద్నాం చేయడం. దీనికోసం బాబుగారి నుంచి సెపరేట్ పేమెంట్లు ఉంటాయ్. ఇటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు, ఇంచార్జీల మార్పులు చేర్పులు చేస్తుంటే దానిపైనా విషం కక్కుతున్నారు. ముందు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు మాకొద్దు బాబోయ్ మాకొద్దు అంటున్నారని ఓ వార్త రాస్తారు. మరుసటి రోజు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో టికెట్ కోట్లు పలుకుతోందని రాస్తారు. ఆ వార్తకు ఈ వార్తకు అసలు సంబంధమే లేదు. ఏదేమైనా జనాల మెదళ్లలోకి విషాన్ని నింపడమే వీళ్ల టార్గెట్. మరి టీడీపీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటిస్తే మాత్రం ఆ వార్త జోలికి పోరు. వాటిని మెయిన్ పేజీల్లో అచ్చేయరు. అలా చేస్తే బాబుకు డ్యామేజీ కాబట్టి. ఈసారి ఎన్నికల్లో గెలిచే దారి బాబుకు కనిపించడం లేదు. కొడుకుతో పాదయాత్ర చేయించాడు కుదర్లేదు. జైల్లో ఉండగా భార్యతో చెక్కులు పంపిణీ చేశాడు పావుకిలో సింపతీ రాలేదు. పీకేను తెచ్చేకున్నాడు ఉపయోగం లేదు. మరో పీకేతో చర్చలు జరిపాడు.. అయినా నమ్మకం కుదర్లేదు. ఎయిర్ పోర్టులో డీకేను కలిశాడు.. అయినా ఐసీయూలో ఉన్న పార్టీని బతికించే దారి కనిపించ లేదు. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాడు.. అయినా జగన్ అదరలేదు బెదరలేదు. ఇక చేతిలో ఉన్న అన్నీ అస్త్రాలు వాడేసిన బాబు.. మిగిలిన ఒకే ఒక్క విషపు అస్త్రాన్ని మరింత బలంగా వాడుతున్నాడు. అదే ఎల్లో మీడియా. ఆంధ్రాలో జనరంజక పాలన నడుస్తుంటే.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతుంటే.. అభివృద్ధి పరుగులు పెడుతుంటూ.. చూసి ఓర్వలేక అబద్ధాలను అచ్చేసి ఆనందిస్తున్నారు చంద్రబాబు, ఆయన కూలి మీడియా. నిజం చెప్పకపోవడం అబద్ధం.. అదే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం..! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు చేస్తోంది పచ్చి మోసం. దానికి తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకోక తప్పదు. సార్ ఒక్క విషయం చెప్పనా.. 700 సంవత్సరాల క్రితం బద్దెన ఓ పద్యం రాసారు శార్.. తలనుండు విషము ఫణికిని....వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్...తలతోక యనక యుండును.. ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! పాముకి తలలో, తేలుకు తోకలో విషం వుంటుంది...కానీ శరీరమంత విషం నిండిన వారు ఈ భూలోకంలో ముగ్గురే ముగ్గురు వున్నారు.. కుప్పం, ఎల్లో తాత, బాత్ రూం క్రిష్ణయ్య.. చెప్పాను కదా 700 సంవత్సరాల క్రితమే ఈ ముగ్గురు గురించి... బద్దెన ఊహించారు. అందుకే ఈ పద్యం రాశారు. చదవండి: రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ -
ఏయూ వీసీ ప్రసాద్రెడ్డిపై ఎల్లో మీడియా ఏడుపునకు కారణాలెన్నో..!
ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. వీసీ ప్రసాద్రెడ్డిపై విషం చిమ్ముతోంది. ప్రైవేటు వర్సిటీల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీని తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోవడంతో మసకబారిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో కొత్త ఊపిరులందుకుంది. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మరలా ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి నియామకంపై ఎల్లో ఏడుపులు మాములుగా లేవు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల మూలంగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులను ఎల్లో గ్యాంగ్ ఎదుర్కొంది. ఎల్లో మీడియా ఏడుపునకు కారణాలు చాలానే ఉన్నాయి. నారా లోకేష్ తోడల్లుడుకి చెందిన గీతం సంస్థకు పోటీగా ఏయూలో సౌకర్యాలను మెరుగుపరిచి, క్యాంపస్ రూపురేఖలు మార్చి, తరగతి బోధన విధానాలను మెరుగుపరిచి, హాస్టళ్లను ఆధునీకరించి, 150కి పైగా ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్లను మొదలుపెట్టి ఏయూని దేశంలోనే ఒక ప్రఖ్యాత సంస్థగా మార్చారు. దీనికి రుజువు ఈమధ్యనే ఏయూని సందర్శించిన NAAC (National Assessment Accreditation Council) టీమ్ ఏయూకి 4 మార్కులకుగాను 3.74 మార్కులను వేసి ఏయూకి ప్రతిష్టాత్మక NAAC A++ ర్యాంక్ ప్రకటించింది. నగరం నడిబొడ్డున ఏయూని ఆనుకుని ఏయూ చుట్టూ ఉన్న భూములను దశాబ్దాలుగా ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించి వ్యవహారాలు నడిపిన కుహనా ఖద్దరు చొక్కాల చెర నుంచి వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను విడిపించి ఆక్రమణదారుల పీచమనిచారు. దీంతో ఎల్లోగ్యాంగ్ గుక్కపట్టి ఏడ్చారు. యూనివర్శిటీ గ్రౌండ్, చుట్టూ ఉండే పరిసరాలను పూర్తిగా ప్రక్షాళించి తుప్పలు పొదలు లేకుండా పరిశుభ్రం చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు ఏ చిన్న అవకాశం లేకుండా కట్టడి చేయడంతో ఎల్లో గ్యాంగ్ ఆపసోపాలు పడ్డారు. ఇంతకుముందు ప్రభుత్వాన్నో, ఏయూ ఉన్నత అధికారులనో ఇబ్బందులు పెట్టాలంటే ఏయూ క్లాసుల్లోకి వెళ్లి బలవంతంగా విద్యార్థులను బయటకు తీసుకొచ్చి ధర్నాలు చేయించి పబ్బం గడుపుకునే కుహనా యువ రాజకీయ విద్యార్థి లీడర్స్ తోకలను కత్తిరించి వారిని క్యాంపస్ నుంచి బయటకు పంపారు. ఎల్లోగ్యాంగ్ హాహాకారాలు చేశారు. రాజకీయ మీటింగ్లకు కుల సంఘాల మీటింగ్లకు బలవంతంగా ఏయూ ఉద్యోగులు విద్యార్థుల నుంచి చందాలు వసూలు చేసే కుల విద్యార్థి సంఘాల కుహనా వ్యక్తులను క్యాంపస్ లోకి అడుగుపెట్టకుండా కట్టడి చేయడంతో ఎల్లోగ్యాంగ్ పెడబొబ్బలు పెట్టారు. హాస్టళ్లలో మత్తు పదార్థాలను చొప్పిస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగించే బేవర్స్లను మెడ పట్టుకుని బయటకు గెంటి ఏయూ ప్రశాంతతని కాపాడటంతో ఎల్లోగ్యాంగ్ విలవిల్లాడిపోయారు. ఒకప్పుడు దెయ్యాల కొంపగా ఎల్లో గ్యాంగ్తో అభివర్ణించిబడిన ఏయూ నేడు ప్రభుత్వ విధి విధానాలు, ప్రసాద్రెడ్డి అకుంఠిత దీక్ష మూలంగా అత్యంత సుందరంగా రూపుదిద్దుకోవడంతో రాబోయే పరిణామాలను ముందుగానే బేరీజు వేసుకుని లెక్కలు వేసుకుంటూ, తర్జనభర్జనలు పడుతూ పచ్చ గ్యాంగ్ ఉడికిపోతుంది. ఏం చెయ్యాలో పాలుపోక, ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. ప్రసాద్ రెడ్డిపై విషం చిమ్ముతోంది. ఇదీ చదవండి: భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్! -
కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్: నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు!
ఎన్నికల టైమ్లో ప్రత్యర్థుల లోపాలు వెతికి నెగిటివ్ ప్రచారం చేయడం మామూలే. కాని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందని టాక్. మూడు పార్టీల ప్రధాన నేతలు ఎదుటివారి మైనస్లను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచారాలను ఆపడానికి ఏకంగా పోలీసుల ఫిర్యాదుల వరకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రత్యర్థి నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చ రచ్చగా మారుతోంది. ఈ నాయకులు చేస్తున్న ఆరోపణలేంటి? ఆ నేతలు ఎవరు? గులాబీ పార్టీ తరపున కరీంనగర్ లోక్సభ స్థానానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయనైతే ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే..వినోద్కుమార్కు సమీప బంధువు ఒకరికి జెన్కోలో ఉద్యోగం ఇప్పించారంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ... ఆ మాజీ ఎంపీ మనస్సును తీవ్రంగా గాయపర్చింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. వినోద్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే జెన్కోలో ఉద్యోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి ఇంటి పేరు.. తన ఇంటి పేరూ ఒకటైనంత మాత్రాన తన బంధువని ఎలా అంటారంటూ ఫైరయ్యారు వినోద్. బండి సంజయ్ తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్లు ఏకమై తన మీద దుష్ప్రచారం చేస్తున్నాయన్నది బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాదన. అయితే ఈ రచ్చ అంతటితో ఆగలేదు. వినోద్ విమర్శలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం పార్లమెంట్ ఎన్నికల ముంగిట కరీంనగర్ లో పొలిటికల్ హీట్ను బాగా పెంచాయి. బంధుప్రీతి లేకుంటే కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ఎలా అయ్యాడని.. కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో చెప్పాలంటూ బీజేపీ నేతలు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. వినోద్ ప్రమేయం లేకుంటే ఆయనెందుకంత ఉలికి పడుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలన్న తలంపుతో అందరికంటే ముందస్తుగానే బండి సంజయ్ తన వ్యూహాల్ని తాను రచించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటివరకూ వినోద్ పేరే వినిపిస్తుండటం.. ఆయనే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కలియ తిరుగుతుండటంతో.. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబుతో పాటు.. ఈటల రాజేందర్ పేరు కూడా ప్రచారంలోకొస్తున్నాయి. బరిలోకి దిగే అభ్యర్థిని బట్టి కరీంనగర్లో జరగబోయేది ముఖాముఖీ పోటీనా.. లేక, ముక్కోణపు పోటీనా అన్నది తేలుతుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్లు మరోసారి తలపడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎవరో తేలితే ఇక కరీంనగర్ హీట్ మామూలుగా ఉండదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్ -
మా వ్యూహం మాకుంది
‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ–‘‘వ్యూహం’ చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదు. దీంతో ప్రస్తుతానికి సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా ‘వ్యూహం’ను రిలీజ్ చేసుకుంటాం. ఈ సినిమా విడుదల ఆపాలని నారా లోకేశ్ సెన్సార్కు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే అదెంత నిజమో చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పినట్లే ‘వ్యూహం’ ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. అది ఎవరైనా వింటారా? లేదా అన్నది అర్థం లేని ప్రశ్న. సినిమా ఇవ్వడం వరకే నా బాధ్యత’’ అన్నారు. ‘‘మా సినిమాను రివైజింగ్ కమిటికీ పంపినా నష్టం జరగదు. మేము అనుకున్నట్లే అన్నీ సకాలంలో జరుగుతాయని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తాం’’అన్నారు దాసరి కిరణ్ కుమార్. -
ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: విద్యా శాఖపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్ తొలి ప్రాధాన్యత అయిన విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ‘‘బైజూస్ కంటెంట్ ఫ్రీగానే ఇచ్చారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చాం. అందులోనూ బైజూస్ కంటెంట్ పెట్టి ఇచ్చాం. దానికి కూడా బైజూస్కి ఒక రూపాయి చెల్లించలేదు. అతని వ్యాపారాలతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పిల్లలకు మంచి ఇంగ్లీష్ నేర్పడం కోసం టోఫెల్ను తీసుకొచ్చాం. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు టోఫెల్కి ఇచ్చేస్తున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ నిప్పులు చెరిగారు. టోఫెల్లో శిక్షణ కోసం పెట్టే టెస్ట్కి ఒక్కో విద్యార్థికి రూ.7.50 పైసలు మాత్రమే ఫీజు. 20 లక్షల 75 వేల మందికి ప్రభుత్వం ఆ ఫీజు కట్టింది. ఆ టెస్ట్లో పాస్ అయిన వారికి మాత్రమే టెస్ట్కి రూ.600 ఫీజు తీసుకుంటారు. మొత్తం కలిపి రూ.6 కోట్లు మాత్రమే టోఫెల్ టెస్ట్ల కోసం పెడితే రూ.వందల కోట్లు పెడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేద పిల్లలకు మంచి విద్య అందించడానికి ఖర్చు చేయడం తప్పా?’’ అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. చదవండి: బాబు లాయర్ల అతి.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ.. ‘‘డీఎస్సీపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుంది. డీఎస్సీపై సీఎం దగ్గర చర్చ జరుగుతోంది. ముందు టెట్.. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తాం. యూనివర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,200కి పైగా పోస్టులు భర్తీ చేస్తాం. నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. 18 ఏళ్ల నుండి యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ జరగలేదు. పాఠశాలల్లో ఖాళీలన్నింటిని గుర్తించాం’’ అని మంత్రి వెల్లడించారు. -
మద్యంపై పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు.. వాస్తవాలు ఇవిగో
మద్యంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుమతిచ్చినవేనని తెలిసినా ఆ విషయాన్ని పురంధేశ్వరి దాటవేశారు. మద్యం నిధులు మళ్లించింది చంద్రబాబేనని తేలుతున్నా నోరెత్తని ఆమె.. పైపెచ్చు కాకిలెక్కలు చెబుతూ.. ఈ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మద్యం వినియోగం తగ్గిందని కేంద్ర శాఖ తేల్చిచెప్పిన కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ‘ఈనాడు’ రూట్లోనే ఏపీ బీజేపీ చీఫ్ వెళ్తున్నారు. ఏపీలో మద్యం వ్యాపారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించండి’ అంటూ ఈ నెల 9న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవంగా తేలింది. 8వ తేదీన పురంధేశ్వరి చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారం. ఆమె చేసిన ఆరోపణలు, వాస్తవాలు... ఇవిగో. ఆరోపణ: ఏపీలో చీప్ లిక్కర్ అమ్మకాలు వేలాది ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మద్యం పేరిట భారీ అవినీతికి తెరలేపి వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు. వాస్తవం: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం. సమాజంపై మద్యం వినియోగం ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను ఈ ప్రభుత్వం తగ్గించింది. గత ప్రభుత్వంలో 4,380 మద్యం దుకాణాలుండగా ఈ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. మద్యం, బీరు గరిష్ట స్వాధీన పరిమితి కూడా ఈ ప్రభుత్వమే తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను ఈ ప్రభుత్వమే తొలగించింది. మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచేందుకు అదనపు ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్ఈటీ) విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. మద్యం దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మద్య విమోచన ప్రచార కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. గత ప్రభుత్వంలో ఐఎమ్ఎల్ (మద్యం), బీరు విక్రయాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాకే గణనీయంగా తగ్గాయి. గత ప్రభుత్వంలో 2017–18లో అంటే 360.85 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగితే, 2018–19లో ఆ సంఖ్య 384.36 లక్షల కేసులకు పెరిగింది. అలాగే 2017–18లో బీర్ల అమ్మకాలు 227.26 లక్షల కేసులుంటే.. 2018–19లో ఆ సంఖ్య 277.16 లక్షల కేసులకు పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం, బీర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. కేంద్ర ప్రభుత్వమే. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో రాష్ట్రంలో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం మద్యం సేవించేవారు. 2019–21 నాటికి రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. దీనికి సంబంధించిన టేబుల్ కూడా చూడవచ్చు. ఆరోపణ: వైయస్సార్సీపీలోని కీలక నేతలే మద్యం తయారీ పరిశ్రమలను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. వైయస్సార్సీపీ నాయకులకు తన కంపెనీని అప్పగించడానికి ఒక వైఎస్సార్సీపీ ఎంపీ నిరాకరిస్తే.. ఏపీఎస్బీసీఎల్ ఆ కంపెనీ నుంచి మద్యం కొనుగోలును ఆపేసింది. వాస్తవం: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం, అవాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చాక అంటే 2019 మే తరవాత... ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. ఈ ప్రభుత్వం రాకముందు ఏ డిస్టిలరీలు ఉన్నాయో అవే.. మద్యం తయారీ, సరఫరా చేస్తున్నాయి. ఆరోపణ: మద్యంలో నాణ్యత లేదు. విషపు అవశేషాలు ఉన్నాయి. ముడి పదార్థమైన రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచి హానికారక అవశేషాలను తొలగించడం లేదు. మద్యం తయారీ ధర లీటరుకు రూ.15 కాగా.. విక్రయ ధర లీటరుకు రూ.600–రూ.800 మధ్య ఉంది, వాస్తవం: రాష్ట్రంలో మద్యం తయారీలో డిస్టిలేషన్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందనడం పూర్తిగా అవాస్తవం. ఏపీ డిస్టిలరీ (బీర్, వైన్ కాకుండా మద్యం తయారీ), 2006 నియమాలకు అనుగుణంగానే రాష్ట్రంలో మద్యం తయారవుతోంది. మద్యంలో ఎలాంటి హానికారక అవశేషాలు ఉండకూడదని రూల్ 34 చెబుతోంది. మద్యం తయారయ్యే ప్రతి ఫ్యాక్టరీలోనూ మద్యం నాణ్యతను పరీక్షించేందుకు ఒక రసాయన ల్యాబొరేటరీ కూడా ఉంది. మద్యం తయారీ ప్రక్రియను, నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రతి డిస్టిలరీ పరిధిలోనూ ఒక డిస్టిలరీ ఆఫీసర్ ఉన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం వారు రాష్ట్రంలో 5 ప్రాంతీయ ఎక్సైజ్ ల్యాబొరేటరీలు ఏర్పాటుచేశారు. ఇవి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరుల్లో ఉన్నాయి. ఇవి మద్యం నాణ్యతను పరిశీలించి మద్యం నమూనాల్లో అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో సర్టిఫికెట్లను కూడా ఇస్తాయి. ఇవి కోర్టుల్లో కూడా చెల్లుబాటు అవుతాయి. ఆధునిక పరీక్షా పద్ధతులు సాధ్యమయ్యేలా అత్యాధునిక పరికరాలతో ఈ ల్యాబొరేటరీలను ఆధునికీకరించింది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం. ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత వేగంగా, కచ్చితంగా పరీక్షలు చేసేలా ఈ ల్యాబొరేటరీలు తయారయ్యాయి. ఈ అత్యాధునిక పరికరాల కోసం రూ.12.5 కోట్లు ఖర్చు చేశారు. ఎసిటల్ డీహైడ్, ఇథైల్ ఎసిటేట్, మెథనాల్ వంటి వాటిని నిశితంగా పరిశీలించే వీలు ఇప్పుడు డిస్టిలరీల్లోని ల్యాబొరేటరీల్లోనూ, ప్రాంతీయ ల్యాబొరేటరీల్లోనూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో విశ్లేషించిన శాంపిళ్ల వివరాలను టేబుల్లో చూడొచ్చు. ఇక మద్యం ఎమ్మార్పీ విలువ విషయానికొస్తే... అందులో15 శాతం తయారీ ఖర్చు కాగా, మిగిలిన 85 శాతం ఏపీఎస్బీసీఎల్, ప్రభుత్వ ఆదాయం. ఆరోపణ: రాష్ట్రంలో 80 శాతం మద్యం అమ్మకాలు నగదు లావాదేవీల ద్వారానే నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. వాస్తవం: వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు అమ్మకాలే కాదు.. డిజిటల్ చెల్లింపుల విధానాన్నీ బెవరేజెస్ కార్పొరేషన్ అమలు చేస్తోంది. రోజువారీ వేతనాలు తీసుకునే కూలీలు నగదు ద్వారానే మద్యం కొంటున్నారు కనుక ఆ విధానాన్నీ కొనసాగిస్తోంది. మద్యం విక్రయాల మొత్తాన్ని ఏ రోజుకా రోజు సమీపంలోని ఎస్బీఐ శాఖలో జమ చేసి చలానాలు అందజేస్తోంది. మద్యం నిల్వలు, విక్రయాలు, బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం అన్నింటిపై బెవరేజెస్ కార్పొరేషన్ పకడ్బందీగా రికార్డులు నిర్వహిస్తోంది. ఆరోపణ: రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారు. ఆ విధంగా మద్యం అమ్మకాల మొత్తం రూ.57,600 కోట్లు అయితే అందులో రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లించేస్తున్నారు. వాస్తవం: రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక(ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2019–21లో రాష్ట్రంలో 18.7 శాతం మంది అంటే దాదాపు 40 లక్షల మంది మాత్రమే మద్యం సేవిస్తున్నారు. అలాంటప్పుడు రూ.25వేల కోట్లు అక్రమంగా మళ్లిస్తున్నారు అనేది కూడా అసంబద్ధం, అవాస్తవం. ఆరోపణ: లంచాలిచ్చే కంపెనీల నుంచే ఏపీఎస్బీసీఎల్ మద్యం కొనుగోలు చేస్తోంది. వాస్తవం: రాష్ట్రంలో 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ను అనుసరించే ప్రస్తుతం బెవరేజస్ కార్పొరేషన్ మద్యం కొంటోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరవాత అంటే 2019 తరువాత ఆ విధానంలో ఎలాంటి మార్పూ జరగలేదు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే ఉన్నాయని 19–09–2022న నివేదిక ఇచ్చింది. ఆరోపణ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్ డ్యూటీ (పన్ను) వసూలు చేస్తున్నారు. కానీ ఆ మొత్తం ఎక్కడికి వెళ్తోందో తెలియడం లేదు. వాస్తవం: వాస్తవానికి అది స్పెషల్ డ్యూటీ (పన్ను) కాదు. అది స్పెషల్ మార్జిన్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు కోసం ప్రభుత్వం 2021 నవంబరు 9న ప్రత్యేక జీవో జారీ చేసి ఆ స్పెషల్ మార్జిన్ వసూలు చేస్తోంది. ఆ నిధుల్ని సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తోంది. అందువల్ల ఆ స్పెషల్ మార్జిన్ రాష్ట్ర ఖజానాకు వెళ్లదు. ఆరోపణ: రాష్ట్రంలో గడచిన రెండేళ్లలో కాలేయ సంబంధ వ్యాధులతో మరణించిన వారు 25 శాతం పెరిగారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అవినీతికి పాల్పడుతున్నారు. వాస్తవం: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాన్ని ప్రతి మద్యం సీసాపైనా స్పష్టంగా కనిపించేలా చేస్తోంది ప్రభుత్వం. అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా కాలేయం వంటివి దెబ్బతింటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతేతప్ప, ప్రభుత్వం విక్రయించే మద్యంలో నాణ్యత లేకపోవడం వల్లనో, విషపూరిత అవశేషాలు ఉండటం వల్లనో కాదు. విశాఖపట్నంలోని కేజీహెచ్లో గత పదేళ్లలో నెలకు సగటున 20 మంది మాత్రమే కాలేయ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిలో చేరారు. వారిలో కూడా 95 శాతం మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదిక కూడా ఇచ్చారు. దీన్నిబట్టి ఈ ఆరోపణ పూర్తిగా అవాస్తవమని అర్థమవుతోంది. అందువల్ల పురంధేశ్వరి రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే. మద్యం విక్రయాలను నిరుత్సాహపరచడమే ఈ ప్రభుత్వ విధానం. పూర్తిగా నాణ్యమైన మద్యాన్ని తయారుచేసి, ఎలాంటి అవినీతికీ ఆస్కారం లేకుండా అమ్మకాలు జరిపేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. చదవండి: Fact Check: కళ్లు తెరిచి చూడు రామోజీ.. -
ఏసీబీ జడ్జిపై అసత్య ప్రచారం.. టీడీపీ నేత అరెస్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్ను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును మచిలీపట్నం సైబర్ బ్రాంచ్కు పోలీసులు అప్పగించారు. కాగా, చంద్రబాబుకు రిమాండ్ తర్వాత జడ్జిని కించపరుస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నిన్న(బుధవారం) నంద్యాల జిల్లాకు చెందిన ఐటీడీపీ కార్యకర్త ఖాజా హుస్సేన్పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పరాకాష్టకు టీడీపీ శవ రాజకీయం
సాక్షి నెట్వర్క్ : చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రాణాలు విడుస్తున్నట్లుగా ప్రజలను నమ్మించడానికి టీడీపీ విఫలయత్నం చేస్తోంది. అభూత కల్పనలు, అసత్య ప్రచారాలతో సహజ మరణాలను సైతం చంద్రబాబు అరెస్టు, జైలుకు ముడిపెట్టి శవ రాజకీయం కొనసాగిస్తోంది. ఈ విషయానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి, సానుభూతి పొందేందుకు పచ్చ బ్యాచ్ తెగతాపత్రయ పడుతోంది. నిజానికి.. ‘పచ్చ’ మీడియా పేర్కొన్న వారంతా అనారోగ్య కారణాలతో మరణిస్తున్నా ‘బాబు అరెస్టును తట్టుకోలేక..’ అంటూ నానా హడావుడి చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా భజనతో గ్రామాల్లో ప్రజలు నివ్వెరపోతున్నారు. మొత్తానికి ‘సాక్షి’ పరిశీలనలో తేలిన వాస్తవాలివి. -
సిగ్గులేని రామోజీ, చివరికి ఇందులో కూడా విష ప్రచారమా!
-
Fact Check: వీఆర్ఏలకు వెన్నుపోటు పొడిచింది బాబే
సాక్షి, అమరావతి: నిజాలకు పాతరేసి అబద్ధాలను అచ్చేయడంలో అందెవేసిన చెయ్యి అయిన రామోజీ తాజాగా వీఆర్ఏల డీఏపై పడ్డారు. టీడీపీ పాలనలో చేసిన నిర్వాకాలను మరిచిపోయినట్లుగా నటిస్తున్నారు. వీఆర్ఏల డీఏను తొలగించి వారిని నిండా ముంచింది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలిసిన విషయమైనా రామోజీ అదేమీ తెలీనట్లు ఉంటూ సొల్లు పురాణం అందుకున్నారు. నిజానికి.. చంద్రబాబు అధికారంలో ఉండగానే 2018లో వీఆర్ఏలకు డీఏ వర్తించదని జీఓ ఇచ్చారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది. కానీ, ఈ నిజాలకు ముసుగేసి వీఆర్ఏలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడుతున్న ఈనాడు.. బరితెగించి మరీ అడ్డగోలు కథనం రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదీ నిజం.. వీఆర్ఏలకు నెలకు రూ.300 చొప్పున ఇచ్చే కరువు భత్యాన్ని (డీఏ)ను కేవలం 5 నెలలకు మాత్రమే పరిమితం చేస్తూ 2019 జనవరి 29న టీడీపీ ప్రభుత్వం జీఓ–14 జారీచేసింది. 2018 జూన్ 1 నుంచి వీఆర్ఏలకు డీఏ వర్తించదని ప్రకటించింది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో కోరాయి. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓను మార్చి కరువు భత్యాన్ని పునరుద్ధరించాలని కోరుతుండగా ఉద్యోగ సంఘాల సమస్యలను పరిశీలించి, పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరచూ నిర్వహించే సమావేశాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. ఈ విషయాలను మరచిపోయి ఉద్యోగుల్లో భయాందోళనలు కలిగించే ఉద్దేశంతో అబద్ధాలను అచ్చోసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,359 మంది వీఆర్ఏలు సేవలు అందిస్తున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా వారిలో ఎంతమంది ఏవిధంగా డీఏ డ్రా చేశారని తెలుసుకునేందుకే ఖజానా, అకౌంట్స్ శాఖ మెమో ఇచ్చింది. రాష్ట్రంలో ఒక్క వీఆర్ఏ నుంచి కూడా అదనంగా డ్రా చేసిన డీఏను రికవరీ చేయలేదు. ఈ విషయం తెలిసి కూడా ఈనాడు నిస్సిగ్గుగా వీఆర్ఏల నుంచి డీఏలను రికవరీ చేస్తున్నట్లు అబద్ధాలు రాసిపారేసింది. కానీ, డీఏలు రికవరీ లేకుండా చేయడంతోపాటు ప్రతినెలా డీఏను కొనసాగించేలా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై అతి త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముంది. వీఆర్ఏలకు మేలు జరిగింది ఈ ప్రభుత్వంలోనే.. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీఆర్ఏలకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సుమారు 3,795 మంది వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించింది. ఈ సంవత్సరమే 66 మంది వీఆర్ఏలకు గ్రేడ్–2 వీఆర్ఓలుగా పదోన్నతులిచ్చింది. ఇవన్నీ మర్చిపోయి.. అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా ఉద్యోగులు, ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే ఈనాడు కంకణం కట్టుకుని వార్తలు ప్రచురిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
ఏది నిజం?: ‘ఈనాడు’ వంకర రాతలు.. రామోజీ ఇవన్నీ సాధ్యమయ్యాయిగా?
నిజాలకు పాతరేసి.. అబద్ధాలు అందంగా అచ్చు వేయటంలో ‘ఈనాడు’ దిట్ట. ఏలినవారు కావాల్సిన వారైతే... ఏమీ చేయకపోయినా సాహో.. అంటూ పొగడ్తలు కురిపిస్తుంది. అదే అధికారం తమవారి చేతుల్లో లేకపోతే మాత్రం... ‘ప్రతిపక్ష’ పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ఒకనాడు కోర్టుకే నేరుగా చెప్పారు ఘనత వహించిన రామోజీరావు. ఇదంతా ఎందుకంటే... ఉన్నత విద్యా వ్యవస్థలో తీసుకు రావాల్సిన మార్పులను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన విజన్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలతో సమావేశమై భవిష్యత్తులో చేపట్టాల్సిన మార్పులను చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న టెక్నాలజీలను మన పిల్లలు ఒడిసి పట్టుకోవటానికి యూనివర్సిటీలు ఏం చేయాలో ఆయన చెప్పారు. ఆ వార్త యథాతథంగా వేస్తే... ముఖ్యమంత్రి విజన్ అందరికీ తెలుస్తుందని, చదువుకున్న వారిలోను, విద్యార్థుల్లోను సానుకూలత వస్తుందని భయపడిన రామోజీరావు... ‘సీఎంగారూ! ఇదెలా సాధ్యం?’ అంటూ తన పైత్యం మొత్తాన్ని జోడించి ఒక కథనాన్ని వండేశారు. యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టలేదని, నిధులు మళ్లించేస్తున్నారని, వైస్చాన్స్లర్లుగా, పాలకమండలి సభ్యులుగా అధికార పారీ్టకి కావాల్సిన వారిని నియమించారని... ఇలా చేతికొచ్చినంత రాసిపారేశారు. మరి ఇందులో నిజమెంత? ఏది నిజం? నిజమే! ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ కావటం లేదు. కాకపోతే అది గడిచిన నాలుగేళ్లుగా కాదు. చాలా సంవత్సరాలుగా!!. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుంచీ యూనివర్సిటీ వైస్చాన్స్లర్లుగా, పాలక మండలి సభ్యులుగా తన బంధువులనే నియమించుకున్నారు. వారు అడ్డగోలుగా అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కేసి తమకు కావాల్సిన వారిని, ముడుపులిచ్చిన వారిని నియమించుకోబోయారు. ఆ పోస్టులను ఆశిస్తున్న పలువురు నిరుద్యోగులు, వారి తీరు నచ్చన ఆయా వర్సిటీల్లోని సిబ్బంది ఈ వ్యవహారంపై కోర్టులకెళ్లారు. దీంతో రిక్రూట్మెంట్లు నిలిచిపోయాయి. ఆ పోస్టులన్నీ అలానే ఖాళీగా ఉండిపోయాయి. మరి అలా వర్సిటీల్లో తమ బంధువుల్ని నియమించుకున్నందుకు చంద్రబాబును ఎన్నడూ ప్రశి్నంచలేదెందుకు రామోజీరావు గారూ? వారు అడ్డగోలుగా పోస్టుల భర్తీ చేయబట్టే కదా... కోర్టుల్లో కేసులు పడి రిక్రూట్మెంట్లు నిలిచి పోయాయి. దాన్ని కూడా ఎన్నడూ ప్రశ్నించలేదెందుకు? ఇవన్నీ పక్కనబెడితే... కనీసం ఆ కోర్టు కేసుల్ని త్వరగా పరిష్కరించి పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే వార్తలు సైతం ‘ఈనాడు’ రాస్తే ఒట్టు!. ఇప్పుడేమో ఆ కేసులన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ పోస్టుల భర్తీ చేపడుతున్న ప్రభుత్వాన్ని మాత్రం ప్రశి్నంచటం మొదలెట్టారు రామోజీ!!. నాలుగేళ్లూ ఊరుకుని ఇప్పుడెందుకంటూ సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు. అసలు ఐదేళ్లూ ఏమీ చేయని చంద్రబాబును... కోర్టు కేసులకు కారకుడైన చంద్రబాబును మాత్రం వెనకేసుకొస్తూనే ఉన్నారు. పైపెచ్చు ఈ ప్రభుత్వం యూనివర్సిటీల పాలక మండళ్లలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో 50% మహిళలకే అవకాశమిస్తోంది. దాన్ని కూడా పక్కనబెట్టి అంతా అధికార పారీ్టవారే అంటూ దుర్మార్గపు రాతలకు దిగింది ‘ఈనాడు’. అదీ రామోజీరావు తీరు!!. ఇదీ నిజం. నిధులు మళ్లించిందెవరు రామోజీ? వర్సిటీల నిధులను దారిమళ్లించినట్లు ‘ఈనాడు’ అవాస్తవాలను వండి వార్చేసింది. మరి ఇందులో నిజమెంత? టీడీపీ ప్రభుత్వ హయాంలోనే యూనివర్సిటీలకు ఉరి వెయ్యటానికి చంద్రబాబు నిధుల దుబారా పథకాన్ని అమలు చేశారు. అంటే... ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారాల కోసం యూనివర్సిటీల్లో సమావేశాలు నిర్వహించారు. సమావేశం వర్సిటీలో కనక దానికయ్యే ఖర్చు మొత్తాన్ని వర్సిటీల నుంచే చేయించారు. ఇందుకోసం ఆయా యూనివర్సిటీలు ఒక్కొక్కటి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేశాయి. కానీ అప్పట్లో ‘ఈనాడు’ పెన్నెత్తితే ఒట్టు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పనులకోసం స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయించింది. వర్సిటీలు సహా ఇతర సంస్థలు తమ వద్ద అదనంగా ఉన్న నిధులను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే వచ్చే వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ చెల్లిస్తూ కార్పొరేషన్లో డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకున్నారు. వర్సిటీల నిధులకు అధిక వడ్డీ చెల్లిస్తూ తిరిగి వారికి అవసరమైనప్పుడు ఇస్తున్నారు. బాబు దుబారాపై కళ్లు మూసుకుని... డిపాజిట్లను నిధులు మళ్లించటమని అంటున్నారంటే రామోజీని ఏమనుకోవాలి? ఎంతైనా రామోజీ.. రామోజీనే!! సాక్షాత్తూ యూజీసీ చైర్మన్ చెప్పారు జూలై 1న సాక్షాత్తూ యూజీసీ ౖచైర్మన్ కాకినాడలో జరిగిన సమావేశంలో... ఉన్నత విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పలు అంశాల్లో ముందున్నదని వ్యాఖ్యానించారు. కానీ ‘ఈనాడు’ మాత్రం ఉన్నత విద్యపై బురద చల్లుతూ విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో భయాందోళనలను కలిగించడానికి ప్రయత్నిస్తోందన్నది నిజం. గడిచిన నాలుగేళ్లలో దేశంలోనే తొలిసారిగా ఏపీలోని పలు యూనివర్సిటీల్లో సంస్కరణలు తెచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు, రీజనల్ క్లస్టర్ గ్రూపులు, 10 నెలల తప్పనిసరి ఇంటర్న్షిప్, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులు, నైపుణ్య కోర్సులు వంటి అనేక సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఇదే క్రమంలో ప్రపంచ స్థాయిలోని మేటి వర్సిటీల్లో ఉన్న నాలుగేళ్ల కోర్సును నూతన జాతీయ విద్యా విధానంతో అనుసంధానం చేసి విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలన్నీ ‘ఈనాడు’కు అసాధ్యమైనవిగా కనిపించటం విచిత్రమే మరి. ఎందుకంటే చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదు కాబట్టి ‘ఈనాడు’కు సహజంగానే అవన్నీ అసాధ్యమైనవిగా కనిపిస్తాయి. ఒక కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టే ముందు దానిపై లోతుగా అధ్యయనం చేయటం, ప్రణాళికాబద్ధంగా అమలుకోసం సన్నద్ధమవటం వంటివి చేస్తున్నపుడు ఏదో ఒకరకంగా బురద జల్లాలనే లక్ష్యంతో ‘ఈనాడు’ వరుస కథనాలు రాస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే నిన్న జరిగిన వైస్చాన్సలర్ల సమావేశం.. ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన మొదటి సమావేశం కాదు. 2021 అక్టోబర్ 25న తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ ఉపకులపతులతో సమావేశమై ఉన్నత విద్యపై దిశానిర్దేశం చేశారు. ఈ నాలుగేళ్లలో దాదాపుగా 10 సార్లు ఉన్నత విద్యపై అధికారులతో సమీక్షలు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యపై ఇన్ని సమీక్షలు, సమావేశాలు నిర్వహించలేదు. వీటన్నిటినీ విస్మరించిన ‘ఈనాడు’... నాలుగేళ్ల తరవాత తొలిసారిగా వీసీలతో సమావేశం నిర్వహిస్తున్నారన్న తరహాలో కథనాన్ని వండిందంటేనే.. రామోజీ దుర్బుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఆరంభం నుంచే పటిష్ట పునాదులు ఒక్క ఉన్నత విద్యలోనే కాకుండా పునాది స్థాయి నుంచే విద్యార్ధులను తీర్చిదిద్దేలా రాష్ట్రంలో పలు సంస్కరణలను సీఎం జగన్ తొలిరోజు నుంచీ అమలు చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకోవడమే కాకుండా పలు రాష్ట్రాలకు ఆదర్శంగానూ నిలిచాయి. పాఠశాల విద్యలో నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలు యూపీ, అస్సాం, బీహార్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. గతంలో ప్రయివేటుకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమాన్ని వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టించారు. దీనిపైనా చంద్రబాబు, రామోజీ విషం చిమ్మి అడ్డుపడే ప్రయత్నం చేశారు. నూతన విద్యావిధానం కన్నా ముందే రాష్ట్రంలో ఫౌండేషన్ విద్యావిధానాన్ని తీసుకువచ్చి శిశుస్థాయి నుంచే పిల్లల్లో అక్షరజ్ఞానానికి సీఎం శ్రీకారం చుట్టారు. నాడునేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, సీబీఎస్ఈ విధానం వంటి విధానాలను తెచ్చి పాఠశాల విద్యను బలోపేతం చేశారు. 6వ తరగతి నుంచి అన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను నెలకొల్పి డిజిటల్ బోధన చేయిస్తున్నారు. ప్రతి ఏటా 8వ తరగతికి వచ్చే విద్యార్ధులకు, టీచర్లకు ట్యాబులను కూడా అందిస్తూ... దిగ్గజ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ పాఠాలను కూడా అందులో అందజేస్తున్నారు. ఉన్నత విద్య భారం పూర్తిగా ప్రభుత్వానిదే... ఉన్నత విద్యలో చేరే ప్రతి విద్యార్థికీ పూర్తి ఫీజురీయింబర్స్మెంటుతో పాటు వారి వసతి ఖర్చులనూ ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నారు. దీనికోసం గత నాలుగేళ్లలో రూ.15వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచి్చంచింది. గత ప్రభుత్వంలో 35వేలు మాత్రమే ఫీజు ఇవ్వడంతో మిగతా మొత్తాన్ని విద్యార్ధులే కట్టుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం పూర్తిభారం ప్రభుత్వానిదే కావటంతో ఇంటర్ తరవాత డ్రాపవుట్లు గత ప్రభుత్వంలో 21 శాతం ఉండగా ఇపుడు 6 శాతానికి తగ్గారు. ఉన్నత విద్యలోనూ నేటి అవసరాలకు తగ్గట్టుగా కరిక్యులమ్ అభివృద్ధి చేయించారు. బెంగళూరు ఐఐఎస్సీ ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిటీని వేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టించారు. డిగ్రీలో ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేసి నాలుగేళ్ల హానర్ కోర్సులను ఏర్పాటు చేయించారు. 27 వేల పరిశ్రమలు, సంస్థల అనుసంధానంతో ఇంటర్న్షిప్. విద్యార్ధులకు ఇంటర్న్íÙప్కోసం కాలేజీలను జిల్లాల వారీగా 27వేల పరిశ్రమలతో అనుసంధానం చేయించారు. చదువులు పూర్తి చేసేనాటికే విద్యార్ధులకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు సమకూరేలా చేశారు. విద్యార్ధులలో నైపుణ్యాలకోసం 553 ఎంటర్ప్రెన్యూర్íÙప్, ఇంక్యుబేషన్, స్టార్టప్ కేంద్రాల ఏర్పాటుచేయించారు. మైక్రోసాఫ్ట్ ద్వారా రూ.32 కోట్లతో 1.62 లక్షల మందికి సర్టిఫికేషన్ కోర్సులు అందించారు. మరో 1.95 లక్షల మందికి వివిధ కంపెనీలతో వర్చువల్ ఇంటర్న్íÙప్ అందించారు. నాస్కామ్ ఫ్యూచర్స్కిల్స్, ఎడ్యుస్కిల్స్, బీఎస్ఎన్ఎల్, సేల్స్ఫోర్సు, పాల్ ఆల్టో, బ్లూప్రిజమ్, ఫుల్స్టేక్, ఏడబ్ల్యూఎస్, ఎంప్లాయిమెంటు ఎక్స్ప్రెస్ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలతో వర్చువల్ శిక్షణ ద్వారా నైపుణ్యాలను మెరుగుపర్చారు. సాఫ్ట్వేర్, ఐటీ రంగాల్లోనే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్సియల్, క్స్టైల్స్, అపెరల్, లైఫ్సైన్సెస్, అగ్రికల్చర్, హెల్త్కేర్ తదితరాల్లో ఇంటర్న్íÙప్ వల్ల విద్యార్ధులకు అవగాహన పెరుగుతోంది. బాబు హయాంలో 37వేలు మాత్రమే ప్లేస్మెంట్లు ఉండగా గత ఏడాదికి ఈ సంఖ్య 85వేలకు చేరింది. ఈ ఏడాదిలో 1.20 లక్షల మందికి ప్లేస్మెంట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతా ‘పచ్చ’గానే ఉండాలనుకునే రామోజీరావు కళ్లకు ఇవేవీ ఎన్నటికీ కనిపించకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. బాబు హయాంలో ఒక్కపోస్టూ భర్తీ చేయలేదే.. మన పిల్లలని ప్రపంచస్థాయి లీడర్లుగా ఎదగకుండా ఆపింది ఎవరు? అనేది ‘ఈనాడు’ ప్రశ్న. దీనికి సమాధానం చంద్రబాబే. ఎందుకంటే విశ్వవిద్యాలయాలలోని ఖాళీలు భర్తీ కాకపోవడానికి కారణం ఆయనే. చంద్రబాబు అధికారంలో ఉన్న తొలి తొమ్మిదేళ్ళూ... అంటే 1995 నుంచి 2004 వరకు, ఆలాగే, ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయాక 2014 నుండీ 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఆచార్యుడినీ నియమించలేదు. దీన్ని రామోజీరావు ఎప్పుడూ ప్రశ్నించలేదు కూడా!. విశ్వవిద్యాలయాల్లో 71 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ఆయా కోర్సుల్లో పిల్లలకు పాఠాలు చెప్పేవారు లేకుంటే కృత్రిమ మేధ వంటి కొత్త కోర్సుల వల్ల ఉపయోగం ఏమిటనేది ‘ఈనాడు’ ప్రశ్న. వాస్తవానికి మారుతున్న సమకాలీన సామాజిక అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు వస్తుంటాయి. వాటికి అవసరమైన నిపుణులను వర్సిటీల్లో నియమించుకోవాలి. అంతేకానీ, ప్రస్తుతం నిపుణులు లేరు కాబట్టి కొత్త కోర్సులను తేవొద్దని చెప్పటం ఏ రకమైన పాత్రికేయం? వర్సిటీల్లో ర్యాంకులు పడిపోతున్నాయనీ, ఈ సమయంలో కొత్త కోర్సులు అవసరమా? అనేది ‘ఈనాడు’ కథనంలో ప్రధానమైన అంశం. ర్యాంకులు పడిపోవడానికి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఆచార్యులు లేకపోవడమే కారణం. దీనికి ప్రధాన బాధ్యుడు చంద్రబాబే. నియామకాలు చేపట్టకపోవటం, కోర్టు కేసులపై దృష్టిపెట్టకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ర్యాంకులను పునరుద్ధరించుకోవడానికి ముఖ్యమంత్రి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి విశ్వవిద్యాలయాల అభివృద్ధి నమూనాలను తీసుకోవాలని దార్శనికతతో వివరించారు. రాబోయే కొద్ది రోజుల్లో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టాలని సూచించారు. తద్వారా విశ్వవిద్యాలయాలను శక్తివంతమైన సాంకేతిక, ఆధునిక విద్యా కేంద్రాలుగా మారాలన్నారు. కార్యాచరణ మొదలుపెట్టి విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయాలని పేర్కొన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అంశాలు, ఏ నిరుద్యోగినీ బాధించవు. అవకాశాలు పెంచుకోవడానికి, మరికొంత మందిని ఉపాధికి చేరువ చేయడానికి కృత్రిమ మేధ ఉపయోగ పడుతుంది. బహుశా, ఇలాంటి విధానం ‘ఈనాడు’కు నచ్చి ఉండకపోవచ్చు. లేకపోతే ఇలా చెప్పింది చంద్రబాబు కాదు కాబట్టి నచ్చి ఉండకపోవచ్చు. విశ్వవిద్యాలయాల్లో పోస్టులు త్వరలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు సిద్ధమవుతుండటాన్ని గమనించి... ఎలాగైనా నియామకాలు జరగకూడదనే కుట్ర ఈ కథనంలో స్పష్టంగా కనబడుతోంది. -
‘ఫెర్రో ఎల్లాయ్స్’ సమస్యలు ఏనాటివో..! ఆ ఇబ్బందులు దశాబ్దాలుగా ఉన్నవే రామోజీ..
సాక్షి, అమరావతి: రాసిందే పదే పదే రాస్తే పాఠకులు నమ్మేస్తారన్నది రామోజీరావు భ్రమ. ప్రతీ అంశాన్నీ అటుతిప్పి ఇటు తిప్పి చివరికి ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కేలా ఉంటున్నాయి ఆయన రాతలు. గత టీడీపీ ప్రభుత్వంలోనే కుదేలైన ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమల సమస్యలను ప్రస్తుత ప్రభుత్వంపై రుద్దేందుకు తెగ ఆయాసపడుతూ ఎప్పటిలాగే మరో తప్పుడు కథనాన్ని అచ్చోశారు. అసలు రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల పరిస్థితులే లేవన్నట్లు ఆ కథనానికి కలరింగ్ ఇచ్చారు. ‘కరెంటు షాక్తో అల్లాడుతున్న ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమల మూత’ శీర్షికతో మంగళవారం ఈనాడు అసత్యాలతో ఓ వంటకాన్ని వండి వార్చింది. దీని వెనకనున్న అసలు వాస్తవాలను ఇంధన, పరిశ్రమల శాఖలు వెల్లడించాయి. అవి.. ఆరోపణ: జగన్ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, బెదిరింపులు, దాషీ్టకానికి భయపడి ఇప్పటికే చాలా పరిశ్రమలు వెళ్లిపోయాయి.. వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలవల్ల రాష్ట్రంలో అనేక కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా.. వైఎస్సార్ జిల్లాలో సెంచరీ ప్లైవుడ్స్ పరిశ్రమ ఏర్పాటవుతోంది. జపాన్కు చెందిన ‘యెకోమా’ సంస్థ ఏటీజీ టైర్ల తయారీ పరిశ్రమను గత ఏడాది ఉత్పత్తి ప్రారంభించింది. మరో రూ.1,000 కోట్లతో రెండోదశ కర్మాగారం నిర్మాణానికి సీఎం జగన్ ఇప్పటికే శంకుస్థాపన చేయడంతో శరవేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ వేధిస్తేనే వచ్చాయా? ఆరోపణ: రాష్ట్రంలో ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమలు.. అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలూ మూతపడుతున్నాయి.. వాస్తవం: అనేక కారణాలవల్ల ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమలు గత కొన్ని దశాబ్దాలుగా ఆరి్థక ఇబ్బందుల్లో ఉన్నాయి. అందువల్లే అవి మూతపడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమీ జరగడంలేదు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇవి అనేకం మూతపడ్డాయి. గత ఇరవై ఏళ్లుగా ఈ విభాగంలో అమలులో ఉన్న టారిఫ్కు ఎలాంటి డిమాండు ఛార్జీలు, స్థిర ఛార్జీలు, సమయానుసార ఛార్జీలు (టీఓడీ), తప్పనిసరి వినియోగం ఛార్జీలు విధించలేదు. కానీ, ఖర్చులు 54శాతం పెరిగాయి. ఇతర వినియోగదారులకు అవలంబిస్తున్నట్లుగానే ఈ పరిశ్రమలకూ డిస్కంలు చార్జీలను అమలుచేస్తున్నాయి. వీటి ప్రకారం చూసినా.. రాష్ట్రంలో వీటికి యూనిట్ ఛార్జి దాదాపు రూ.0.50 తక్కువే. ఆరోపణ: ‘అమరరాజా’పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతో ఆ సంస్థ విస్తరణ ప్రాజెక్టుల్ని తెలంగాణ, తమిళనాడులో చేపట్టింది. వాస్తవం: కాలుష్య కారకాలైన వాయు, ద్రవ పదార్థాలను నేరుగా వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యావరణ ప్రమాణాలను పాటించాలని ‘అమరరాజా’కు నోటీసులివ్వడం, కోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది? ప్రజారోగ్యాన్ని గుల్లచేస్తున్నా ఊరుకోవాలా డ్రామోజీ? ఆరోపణ: కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో టీడీపీ నిర్ణయించిన భూముల ధరల్ని వైఎస్సార్సీపీ అధి కారంలోకి వచ్చాక ఐదురెట్లు పెంచింది. వాస్తవం : ఏపీఐఐసీ వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని భూముల ధరలను సవరించడం సర్వసాధారణం. ఆరోపణ: విక్రయ ఒప్పందానికి రాలేదన్న కారణాలతో 74 మందికి స్థల కేటాయింపులను రద్దుచేసింది.. వాస్తవం: ఇందులో తప్పేముంది? భూముల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేటాయిస్తే నిరీ్ణత కాలంలో డబ్బు చెల్లించి రిజి్రస్టేషన్ చేయించుకోవాల్సిన బాధ్యత పారిశ్రామిక సంస్థలది కాదా? ఆరోపణ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చిత్తూరు జిల్లాలో రూ.13 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.. వాస్తవం: ఇది పూర్తిగా అవాస్తవం. రకరకాల వివాదాల్లో ఉన్న భూమిని గత టీడీపీ ప్రభుత్వం రిలయన్స్కు కేటాయించింది. అందుకే విరమించుకుంది. కానీ, రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడతామని ముఖేష్ అంబానీ విశాఖ సదస్సులో ప్రకటించిన విషయం గుర్తులేదా!? -
ఇంతకాలం బాబు డ్రామాలు.. కేసు తప్పలేదు.. జగన్ వచ్చాక సీన్ రివర్స్
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తనను సమర్ధించుకోలేని దశలోకి వెళుతున్నారు. ప్రత్యేకించి రెండు, మూడు అంశాలలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అమరావతి రాజధాని భూముల స్కామ్ లో చంద్రబాబు ఏ1 అంటే మొదటి నిందితుడుగా సీఐడి కేసు నమోదు చేసింది. ఇంతకాలం తాను ఎన్ని అక్రమాలు చేసినా ఎక్కడా కేసు రాకుండా జాగ్రత్తపడ్డ నేర్పరిగా పేరొందారు. ఉదాహరణకు ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిపోయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన మేనేజ్ చేసుకోగలిగారు. కానీ ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయన పప్పులు ఉడకడం లేదు. అయినా ఏదో రకంగా ఎల్లో మీడియాను, ఆయా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి, తన తప్పులేవీ లేవన్న ప్రొజెక్షన్ ఇచ్చుకోవాలని తంటాలు పడుతున్నారు. ఆయన తరపున ఈనాడు, ఆంధ్రజ్యోతి ,టివి 5 వంటి మీడియా సంస్థలు శక్తివంచన లేకుండా జగన్ పై పచ్చ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి. అమరావతి భూ కుంభకోణంలో ప్రత్యేకించి ఆయనకు, ఆయన కంపెనీ హెరిటేజ్కు లబ్ది జరిగిందన్న విషయం సీఐడీ విచారణలో తేటతెల్లమయింది. అందువల్లే కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడం జప్తునకు గురైంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కోర్టు కూడా మొత్తం స్టడీ చేసి అమరావతి భూ స్కామ్ లో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, రియల్ ఎస్టేట్ యజమాని లింగమనేని రమేష్ తదితరుల పాత్ర ఉందని అభిప్రాయపడి, కొన్ని ఆస్తుల జప్తునకు ఓకే చేసింది. ఆ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. చంద్రబాబు తీరును కోర్టు తప్పుపట్టింది. ఎల్లో మీడియా ఆ విషయాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడింది. ఈ తీర్పు తర్వాత దానిని ఎలా సమర్ధించుకోవాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారు. కాకపోతే ఈ కేసులో క్విడ్ ప్రోకో జరగలేదని చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాని అందులో అంత పస ఉన్నట్లుఅనిపించదు. రాజధాని రింగ్ రోడ్డు అలైన్ మెంట్లో లింగమనేని రమేష్ భూములు మాత్రం భూ సమీకరణలో ఎలా పోకుండా ఉండగలిగాయన్నదానికి సమాధానం లేదు. అలాగే హెరిటేజ్ సంస్థ రమేష్ నుంచి కొనుగోలు చేసిన భూముల పక్కనుంచే రింగ్ రోడ్డును ప్రతిపాదించడంలో దురుద్దేశం లేదని చెప్పడం టీడీపీకి కష్టంగా మారింది. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని సీఐడీ జప్తు చేయడానికి కోర్టు అనుమతించింది. ఇందులో క్విడ్ ప్రోకో ఉందని ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి కోర్టు వచ్చిందన్నమాట. ఇందుకు వేరే వారి సాక్షాధారాలు అవసరం లేకుండా చంద్రబాబు, రమేష్ ల వీడియోలే రుజువుగా మారాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో హైదరాబాద్ నుంచి హుటాహుటీన విజయవాడకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన రమేష్కు చెందిన కరకట్ట ఇంటిలో చేరి నివాసం ఉంటున్నారు. అది నిబంధనలను ఉల్లంఘించి కట్టారని ఎందరు చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా ఇది ప్రభుత్వ భవనమని, లింగమనేని రమేష్ ప్రభుత్వానికి ఇచ్చేశారని, ఇది తప్ప కృష్ణానది కరకట్టపై ఏ భవనాన్ని ఉండనివ్వబోమని, ఆ ప్రాంతం అంతా టూరిజం కింద అభివృద్ది చేస్తామని చెప్పేవారు. అవేవి ఆయన చేయలేదు. పైగా ప్రజా వేదిక పేరుతో మరో అక్రమ నిర్మాణం నిర్మించారు. అది వేరే సంగతి. ఈ క్రమంలోనే రమేష్ కూడా తనకు ఆ భవంతితో సంబంధం లేదని దానిని ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పిన వీడియో కూడా ఉంది. 2019లో అధికారం కోల్పోయాక సీన్ రివర్స్ అయింది. వారి అంచనాలు తలకిందులు అయ్యాయి. అసలు విషయాలన్నీ బయటకు వచ్చేశాయి. సీఐడీ పూర్తి స్థాయి విచారణ జరిపి కొన్ని వ్యవస్తల ద్వారా ఎంత ఆటంకం వచ్చినా, అక్రమాలను తవ్వి తీసింది. ఇది క్విడ్ ప్రోకోగా ఉందని సీఐడీ నిర్దారించడంతో చంద్రబాబు, రమేష్లు మాట మార్చారు. అసలు ఆ నివాసంతో తనకు సంబంధం ఏముందని చంద్రబాబు వాదించారు. ఆయన కేవలం ఒక అద్దె ఇంటిలో ఉన్నారని తెలుగుదేశం నేతలు చెబుతూ వస్తున్నారు. రమేష్ కూడా అది తన ఇల్లని, జప్తు ఎలా చేస్తారని కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు తొలుత చెప్పినట్లు ప్రభుత్వ భవనం అయితే, రమేష్ ఆ మేరకు ఎందుకు డాక్యుమెంట్లు ఇవ్వలేదన్న ప్రశ్నకు సమాధానం రాలేదు. పోనీ చంద్రబాబు అద్దెకు తీసుకున్నారని అనుకుందామనుకుంటే అందుకు సంబంధించిన రశీదులుకాని పన్ను చెల్లింపు కాని జరగలేదు. చంద్రబాబు అద్దె చెల్లించినట్లు ఆధారాలు లేవట. తనకు జరిగిన వ్యాపార లబ్ది కి గాను రమేష్ ఈ ఇంటిని చంద్రబాబుకు ఇచ్చేశారన్నది అభియోగంగా మారింది. దీంతో టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ బల్లి మాదిరి అయింది. అందువల్లే చంద్రబాబు దీనిపై గట్టిగా స్పందించలేకపోతున్నారు. కాకపోతే తన కంపెనీ తరపున ఒక రీజాయిండర్ ఇప్పించి ఊరుకున్నారు. చదవండి: మార్గదర్శిపై సీఐడీ విచారణకు రామోజీరావు, శైలజా కిరణ్ గైర్హాజరు ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్కు సంబంధించి ఇలాంటి విషయం ఏదైనా ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎంతగా రెచ్చిపోయి రోజువారి కథనాలు ఇచ్చేవి. కాని అవి ఇప్పుడు తేలుకుట్టిన దొంగల మాదిరి ఈ స్కామ్ జోలికి వెళ్లడం లేదు. ఈ కేసులో లింగమనేని రమేష్ అప్పీల్ కు వెళ్లవచ్చు. సీఐడీ తదుపరి చర్య ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరమే. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణ బినామీలుగా భావిస్తున్న ఆయన బంధువుల పేరుతో ఉన్న భూములను కూడా జప్తు చేయడానికి సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం ప్రక్రియలో వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే గతంలో అమరావతిలో భూదందా జరగలేదన్నట్లుగా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఎంతవరకు హేతుబద్దంగా ఉందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యాయ వ్యవస్థకు చెందిన కొందరు ప్రముఖుల బంధువుల ప్రమేయం కూడా ఈ స్కామ్ లో ఉన్నట్లు ఆరోపణ రావడం ,దానిపై కోర్టు తోసిపుచ్చడం అప్పట్లో సంచలనం అయింది. కాని ఇప్పుడు చంద్రబాబు, లింగమనేని రమేష్, నారాయణ ల ఆస్తుల జప్తునకు ఏసీబి కోర్టు అనుమతించడం ద్వారా అమరావతిలో స్కామ్ జరిగిందన్న విషయాన్ని నిర్దారించినట్లు అవుతుందా? మరో అంశం గురించి కూడా చెప్పుకోవాలి. చిత్తూరులో మూతపడ్డ సహకార డెయిరీని ముఖ్యమంత్రి జగన్ తిరిగి తెరిపించగలగడంలో కృతకృత్యులవుతున్నారు. ఆయన దానికి సంబంధించిన 180 కోట్ల రూపాయల బకాయిలు తీర్చేసి, సంస్థను అమూల్ కంపెనీకి అప్పగిస్తున్నారు. తద్వారా సుమారు 350 కోట్ల పెట్టుబడులు పెట్టించి రైతులకు మేలు చేయ సంకల్పించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ కోసం ఈ చిత్తూరు డెయిరీ మూతపడేలా చేశారన్న ఆరోపణ ఉండేది.ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి గల్లా అరుణ అప్పట్లో కాంగ్రెస్లో ఉండేవారు. ఆమె హెరిటేజ్ పై తీవ్ర విమర్శలు చేసేవారు. చదవండి: టైమ్స్ నౌ సర్వే: ఇప్పటివరకు ఒక లెక్క.. వైఎస్ జగన్ వచ్చాక మరో లెక్క! తన సొంత కంపెనీ కోసం చిత్తూరు డెయిరీని దెబ్బతీస్తున్నారని ఆరోపించేవారు. సరిగ్గా అలాగే చంద్రబాబు ప్రభుత్వ టైమ్లోనే ఆ డెయిరీ మూతపడింది. ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం అమూల్ ద్వారా దానిని తిరిగి తెరిపించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దీనిపై కూడా చంద్రబాబు స్పందించలేని పరిస్థితి. హెరిటేజ్ సంస్థ మాత్రం ఈ విషయంలో కూడా చంద్రబాబు తరపున ఖండన ఇచ్చింది. దీనిని బట్టే చంద్రబాబు ఎంత ఆత్మరక్షణలో పడింది అర్దం చేసుకోవచ్చు. చిత్రం ఏమిటంటే ఒక పక్క చంద్రబాబు టైమ్లో మూతపడ్డ పరిశ్రమలను జగన్ తిరిగి తెరిపిస్తుంటే, దానిపై కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి లు దారుణమైన అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు డిఫెన్స్ లో పడినప్పుడల్లా ఏదో ఒక అబద్దపు వార్త వేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో ఈ ఎల్లో మీడియా ఉంటోంది. కాని వాటిని జనం నమ్మే రోజులు పోయాయని వారు తెలుసుకోలేకపోతున్నారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు పార్టీ న్యాయ విభాగం క్రియాశీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్, అనుబంధ విభాగాల ఇంచార్జ్ విజయసాయిరెడ్డి సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ పంచాయతీ రాజ్, న్యాయ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్, పార్లమెంటరీ పోలింగ్ బూత్ ఇంచార్జిలతో వేర్వేరుగా ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కొన్ని పత్రికలు మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నాయని, ప్రజల దృష్టిలో పార్టీని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుంది.. న్యాయ పరంగా దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చదవండి: ‘ఈనాడు’ రిపోర్టర్లపై కేసు నమోదు చేయండి.. నెల్లూరు కోర్టు ఆదేశం గతంలో మాదిరిగానే ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసే పత్రాలు నుంచి ప్రతి విషయంలోనూ న్యాయ విభాగం సహాయ సహకారాలు అందించాలని కోరారు. వైఎస్సార్ లా నేస్తం పేరిట జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం నెలకు 5000 రూపాయలు స్టైపండ్ ఇస్తుందని, అలాగే ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. వివిధ విభాగాలకు సంబంధించి కమిటీల నియామకం త్వరగా పూర్తి చేయాలన్నారు. పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి నేతృత్వంలో న్యాయవిభాగ సమావేశం జరిగింది. చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకే.. -
స్క్రిప్ట్ చంద్రబాబుది.. స్పీచ్ పవన్ కల్యాణ్ది: మంత్రి అమర్నాథ్
సాక్షి, అమరావతి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ ఏపీ వైపు చూడని సంస్థలు ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ‘‘రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. వాస్తవాలు కనిపిస్తున్నా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ అవాస్తవాలు చెబుతున్నారు. సీఎం జగన్ బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ఫస్ట్ప్లేస్లో ఉంది’’ అని మంత్రి అన్నారు. ‘‘స్క్రిప్ట్ చంద్రబాబుది.. స్పీచ్ పవన్ కల్యాణ్ది. ఉపవాసాలు చేస్తే సీఎం కాలేరు. ప్రజల మన్ననలు పొందాలి. తాను ఓడిపోతానని పవన్కు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. చంద్రబాబు, పవన్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. ‘‘పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు పేరు సార్ధకం చేసుకున్నాడు. ఒకే రోజు రెండు పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందుకే సీఎం జగన్ ఆయనకి దత్తపుత్రుడు అని పేరు పెట్టారు. హైదరాబాద్ పారిపోయింది చంద్రబాబు, పవన్ కల్యాణ్లే. సింపతి కోసం పవన్ కల్యాణ్ ప్రాణహాని ఉందని ఆరోపణ చేస్తున్నాడు. చంద్రబాబు వల్లే పవన్కి ప్రాణ హాని ఉండొచ్చు’’ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకే.. ‘‘ముద్రగడ పద్మనాభంను చంపేద్దాం అనుకున్న వ్యక్తి చంద్రబాబు. బాబు బిస్కెట్ల కోసం కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. భూముల ధరలు కోసం కేసీఆర్ ఎందుకు మాట్లాడారో తెలియదు. మా విశాఖలో కూడా ఎకరం కొంటె.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు. హైదరాబాద్ కాకుండా బయటకు వెళితే ధర ఎక్కడుంది. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడితే కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరు’’ అని మంత్రి అమర్నాథ్ అన్నారు. -
వాస్తవాలు కనలేరా.!
సాక్షి, అమరావతి: పసలేని కథనాలకు ఈనాడు కేరాఫ్గా మారింది. లేని వాటిని ఉన్నట్లుగా అవాస్తవాల అచ్చుతో పబ్బం గడుపుకుంటోంది. అలాంటి పనికిరాని కథనాల్లో ఒకటి ఈ విద్యుత్ కోతల కథనం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఏ విధమైన విద్యుత్ కోతలు అమలులో లేవు. అయినా ప్రతి రోజూ 2 – 3 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఈనాడు పదే పదే అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజలు నవ్వుతారనే కనీస ఇంగితం కూడా లేకుండా గత ప్రభుత్వంలో ఐదేళ్లూ విద్యుత్ కోతలే లేవని మరో అబద్ధం చెబుతోంది. వేసవి కారణంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రోజూ రూ.కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ను కొని మరీ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సరఫరా చేస్తుంటే, కరెంటు కొనలేరా? అంటూ కళ్లుండీ గుడ్డిరాతలు అచ్చేసింది. అసలు వాస్తవాలను ఇంధన శాఖ ‘సాక్షి’కి వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. ఆరోపణ: డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులో లేనప్పుడు మార్కెట్లో కొనాలి. అలా కాకుంటే ఉత్పత్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ లేని కోతలు ఇప్పుడెందుకు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం: ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రూ.3059.4 కోట్లు వెచ్చించి 3,633.81 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసింది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వంద శాతం కరెంటు ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 40 నుంచి 45 శాతం ఏపీజెన్కో నుంచే సమకూరుతోంది. రోజూ దాదాపు 105 మిలియన్ యూనిట్లు జెన్కో అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో ఏ ఒక్క రోజూ విద్యుత్ కోతలు విధించాలి్సన అవసరమే రావడంలేదు. ఆరోపణ: షెడ్యూల్ వేసి సరఫరా నిలిపివేస్తున్నారు. డిమాండ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత పెడుతున్నారు. వాస్తవం: విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోల్చితే భారీగా పెరిగింది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ యూనిట్ పది రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అంతరాయాల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సర్దుబాటు అవసరమే లేదు. ఈనాడు చెబుతున్న 0.24 మిలియన్ యూనిట్లు, 0.19 మిలియన్ యూనిట్లు అనేది కేవలం గ్రిడ్ ఫ్రీక్వెన్సీని నిర్దిష్ట స్థాయిలో నిలిపి ఉంచడానికి చేసిన డిమాండ్ సర్దుబాటు మాత్రమే. విద్యుత్ కొరతో లేక కోతో కాదు. ఆరోపణ: రాత్రి వేళ అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్ను నియంత్రించలేని పరిస్థితి. ఆ సమయంలో కోతలకు సాంకేతిక కారణాలను సాకుగా చెబుతున్నారు. వాస్తవం: వేసవి కారణంగా రాత్రి వేళ అనూహ్యంగా విద్యుత్ వినియోగం పెరిగి 11 కె.వి. పంపిణీ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. 33 కె.వి. లైన్లపై, సబ్స్టేషన్లపై కూడా అధిక లోడు ప్రభావం ఉంటోంది. దీంతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంపిణీ సంస్థ (డిస్కం)లలో క్షేత్ర స్థాయిలో 33/11 కె.వి. సబ్స్టేషన్ పరిధిలో 24 గంటలు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అధిక లోడు, అధిక ఉష్ణోగ్రతలు, అకాల గాలివానల వల్ల కొన్ని చోట్ల స్వల్పకాలం ఏర్పడే విద్యుత్ అంతరాయాలను భూతద్దంలో చూపిస్తూ రాష్ట్రమంతటా పరిస్థితి ఇలానే ఉందని ఈనాడు కట్టు కథలు అల్లుతోంది. ఆరోపణ: ప్రకాశం జిల్లాలో 2, 3 గంటలు, విజయనగరం జిల్లాలో 2 నుంచి 4 సార్లు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవం: వేసవి ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, విజయనగరం జిల్లా గజపతినగరం, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, గాలులు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ స్తంభాలు విరగడం, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడం జరుగుతోంది. వాటిని పునరుద్ధరించే క్రమంలో ఆ ప్రాంతాల్లో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంతే తప్ప విద్యుత్ కోతలు విధిస్తున్నారనేది అవాస్తవం. ఆరోపణ: లోడ్ అంచనా వేసి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. కానీ డిస్కంలు అలా చేయలేకపోయాయి. వాస్తవం: వేసవి కాలంలో రాత్రి వేళ ఏసీలు, కూలర్ల వినియోగం బాగా పెరిగింది. తద్వారా పెరిగే డిమాండ్కు తగినట్టుగా విద్యుత్ సరఫరా కూడా జరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో లోడును అంచనా వేసి దానికి తగ్గట్టుగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వాడుకునేలా మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లు డిస్కంల వద్ద సిద్ధంగా ఉన్నాయి. -
‘విజయ్కుమార్ స్వామి.. రామోజీ వియ్యంకుడి విమానంలోనే వచ్చారు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కొన్ని పత్రికలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వంపైన, దేవుళ్లపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్లో మీడియా దుర్మార్గపు రాతలు ఎల్లోమీడియా పత్రికలు, ఛానెళ్లు విజయకుమార్ స్వామి గురించి రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నాయి. విజయకుమార్ స్వామిని లాబీయిస్టుగా పోలుస్తూ, లాబీయింగ్కు వాడుకుంటున్నామని దుర్మార్గమైన రాతలు రాస్తున్నారు. అంటే, స్వామిజీలను, దేవుళ్లను వారి స్వార్థ రాజకీయాలకు వాడుకునే దిగజారుడు కార్యక్రమానికి ఎల్లోమీడియాతో పాటు, ఆ పత్రికలు ఎవరినైతే కొమ్ముకాస్తున్నాయో వారే ఈ కథనాలను రాయిస్తున్నారనేది అందరూ గమనిస్తున్నారు. వీరి రాతల యొక్క ముఖ్య ఉద్దేశమేమంటే, జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నపళంగా దిగిపోవాలని కలలు కంటూ, చంద్రబాబును అర్జెంట్గా అధికారంలోకి తీసుకురావాలని.. ఆ తర్వాత దోచుకోవచ్చు, పంచుకోవచ్చనేది వారి ఆరాటంగా కనిపిస్తుంది. ఎల్లోమీడియా నీచమైన రాతల్ని ఖండిస్తున్నాం. ఆ ప్రత్యేక విమానం రామోజీ బంధువుదే కదా.. ఈ సందర్భంగా ఈ అంశంపై నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. అసలు విజయకుమార్ స్వామి ఎవరిద్వారా విజయవాడకు వచ్చారు..? ఇక్కడకు ఎందుకు వచ్చారు..? ఆయన ప్రత్యేక విమానంలో వచ్చారు కదా.. ఆ విమానం ఎవరిది..? ఆయన వచ్చిన విమానం రామోజీరావు బంధువు (వియ్యంకుడు) నవయుగ విశ్వేశ్వరరావుదే కదా.. ఆయనతో పాటు విశ్వేశ్వరరావు కొడుకు శశిధర్, విజయకుమార్ స్వామి ఉంది నిజం కాదా..? మరి మీరు.. మార్గదర్శి కేసుల నుంచి బయటపడేందుకే స్వామీజీని పిలిపించారా..? అసలు, రామోజీరావు బంధువు విమానంలో విజయకుమార్స్వామిని ఎందుకు ఇక్కడకు తెచ్చుకున్నారనేది మాకు తెలియదు. కానీ, ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు అందజేయడాన్ని.. లాబీయింగ్ అని పేరుపెట్టి అదే రామోజీ మీడియాలో కథనాలు రాయడం ఎంత దుర్మార్గమో అందరూ ఆలోచించాలి. అసలు, మీరు విజయకుమార్ స్వామిని విజయవాడకు ఎందుకు తీసుకొచ్చారు..?. మీ మార్గదర్శి కేసుల నుంచి బయట వేయించుకునే కార్యక్రమానికి తెచ్చుకున్నారా..?. ఇదే రామోజీరావు బంధువులు 2017–18లో హైదరాబాద్లో గృహప్రవేశం జరిగితే, విజయకుమార్స్వామి కూడా వచ్చారు. అప్పుడు కూడా నవయుగ విశ్వేశ్వరరావు, శశిధర్తో వచ్చారు కదా..? మరి, అప్పుడు ఎందుకు వచ్చారనుకోవాలి. - మీరు చేసేవన్నీ దైవకార్యాలనుకోవాల్నా..? దానికి సమాధానం చెప్పండి..? ఇంత నిసిగ్గుగా కథనాలు రాస్తారా..? ముఖ్యమంత్రికి స్వామీజీల ఆశీస్సులు ఇప్పిస్తే తప్పేంటి..? నాకు 2007 నుంచి విజయ్కుమార్ స్వామితో పరిచయం ఉంది. నాకు చాలామంది స్వామీజీలు తెలుసు. ఈ విజయకుమార్ స్వామి అంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన మంచి భక్తిపరులు. ఎల్లోమీడియా ప్రచురించినట్లు ఆ స్వామివారితో మాజీ రాష్ట్రపతులు, ప్రస్తుత రాష్ట్రపతితోనూ పరిచయాలున్నట్లు అందరికీ తెలిసిందే కదా.. ఆ విధంగా నాకున్న పరిచయంతో మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా కలపాలని తీసుకెళ్లాను. ముఖ్యమంత్రికి స్వామివారి ఆశీస్సులు ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుందని భావించాను. దానికోసమే నేను ఎంతోమంది స్వామీజీలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి కలిపిన సందర్బాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగానే చినజీయర్స్వామిని, స్వరూపానంద స్వామివారిని, మంత్రాలయం రాఘవేంద్ర మఠం స్వాములను, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, కనదుర్గమ్మ దేవస్థానం వేదపండితుల్ని పిలిపించి ఆశీర్వచనాలు ఇప్పించాను. విజయకుమార్ స్వామి గారు విజయవాడకు వస్తున్నారని తెలిసి.. నేను ప్రత్యేకంగా ఆయన్ను రిక్వెస్టు చేసిన మీదట వారు అందుకు అంగీకరించారు. నేను ఆరోజు విజయవాడలో లేనప్పటికీ, ఏర్పాట్లు అన్నీ చేయడంతో స్వామివారు వచ్చి ముఖ్యమంత్రికి ఆశీస్సులు అందించి వెళ్లారు. మీకైతే ఆశీస్సులు.. మాకైతే లాబీయింగా..? స్వామీజీలపై వాళ్లకు నమ్మకం ఉందో లేదో మాకు తెలియదు. మాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుందనే నమ్మకంతోనే.. మేం స్వామీజీల ఆశీస్సులు తీసుకుంటాం. మేమేదో లాబీయింగ్ చేస్తున్నామంటున్నారు కదా.. మరి, ఈ రామోజీరావులాంటి వాళ్లు ఏం చేయడానికి విజయకుమార్ స్వామిని రప్పించుకున్నారు. మేము స్వామివారి ఆశీస్సులు తీసుకుంటే.. దానికి లాబీయింగ్ అని పేరెట్టి దుర్మార్గపు రాతలు రాస్తారా..?. అదే, మీ కోసం స్వామీజీలు వస్తే.. దానికి దైవాశీస్సులు అని పేరుపెట్టి చెప్పుకుంటారా..?. ఎల్లో మీడియా వక్రభాష్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టకముందే.. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోండి. విజయకుమార్ స్వామి వారు చాలా సింపుల్గా ఉండే వ్యక్తి. ఎవరి అవసరాలకు తగ్గట్టు వారు ప్రత్యేక విమానాల్లో ఆయన్ను తెచ్చుకుంటూ ఉంటారు గానీ అది మాకు సంబంధంలేదు. ఆయన మైసూరులో ఉంటారు. 2007 నుంచి ఆయనపై నమ్మకంతో నేను కలుస్తూ ఉంటాను. విజయకుమార్ స్వామి వారంటే ఒక దైవాంశసంభూతులుగా మాకు నమ్మకం. కనుక, ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రిక రాసిందని, తర్వాతి రోజు మరో పత్రిక కథనాలు రాయడాన్ని ఖండిస్తున్నాను. రాజకీయలబ్ధి కోసం నీచకార్యక్రమాలకు పాల్పడవద్దని ఎల్లోమీడియా పత్రికలకు, టీడీపీ నేతలకు హితవు పలుకుతున్నాను. వ్యక్తుల టార్గెట్ గా దర్యాప్తు వివేకానందరెడ్డి హత్యకేసులో ఒక పక్షపాత ధోరణితో సీబీఐ విచారణ జరుగుతున్నట్లు కొన్ని ఆధారాలు, పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ముందునుంచీ అవినాశ్రెడ్డి చెప్పే వాదనలను సీబీఐ పట్టించుకోకపోవడం.. ఎల్లోమీడియా కథనాల ప్రకారం సీబీఐ నడుస్తుందనే అభిప్రాయం ఉంది. ఇది కళ్లముందు జరుగుతున్న వాస్తవం. రాజకీయకోణంలో ఒకరిద్దరు వ్యక్తుల్ని టార్గెట్ చేసినట్లే సీబీఐ వ్యవహరిస్తుందనేది ఇప్పటికే అవినాశ్రెడ్డి కోర్టు దృష్టికి కూడా తెచ్చారు. ఏదిఏమైనా ఈ కేసులో నిజనిజాలు నిగ్గుతేలాలి. న్యాయవ్యవస్థపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది. చదవండి: మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
Fact Check: పోలవరంపై మళ్లీ విషం.. ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత?
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై అభూత కల్పనలు, వక్రీకరణలు, అవాస్తవాల విషపు రాతలతో ‘ఈనాడు’ మళ్లీ రెచ్చిపోయింది. ‘ఏడాదిలోపు 3% పనులే’ అంటూ రాసిన ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత? ఒకసారి చూద్దాం.. ఈ అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్.. గత ప్రభుత్వ విధానాలు, ప్రణాళిక లోపం వలన పోలవరం ప్రాజెక్టుకు కలిగిన సరిదిద్దలేని నష్టాలు, వారి అవినీతి, స్వార్థ ప్రయోజనాలు, తప్పిదాలతో ప్రాజెక్టుపై పడిన 2 వేల కోట్ల రూపాయల అదనపు భారం, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం హెడ్ వర్క్స్, ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో అవినీతి చర్యలకు పాల్పడింది. 2013 నుంచి 2016 వరకు పనులు నత్తనడకన నడిచాయి. ఈ లోగా ట్రాన్స్స్ట్రాయ్ సంస్థ తమకు రేట్లు గిట్టుబాటు కావడంలేదని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రతిపాదించగా, ఆ ప్రభుత్వం చేతికి ఎముకలేదనట్లుగా వారు అడిగిందే తడవుగా 2015-16 రేట్లకు ఆమోదం తెలుపుతూ అగ్రిమెంట్ విలువని రూ.4054 కోట్ల నుండి రూ.5386 కోట్లకు పెంచింది. ఈసీపీ నిబంధనలకు విరుద్ధంగా 2015-16 రేట్లకు పెంచి రూ.1332 కోట్ల అనుచిత లబ్ధిని వారికి చేకూర్చుతూ 29.09.2016 న ఉత్తర్వులు జారీ చేసింది. 2015-16 రేట్లు ఇచ్చినా, పనులు నత్తనడకన కొనసాగడంతో అప్పటి ప్రభుత్వం మిగిలిన పనులు చేయడానికి 2015-16 రేట్లతో టెండర్ పిలిచారు. ఈలోగా ఏమి జరిగిందో తెలియని రహస్యం.. కానీ టెండర్ రద్దు చేసి 3 దఫాలుగా మిగిలిన పనులను నామినేషన్ పద్దతిలో నవయుగ కంపెనీకి అప్పగించారు. 1. 27.02.2018 తేదీన రూ. 1244.36 కోట్లు 2. 28.05.2018 తేదీన రూ. 921.87 కోట్లు 3. 11.01.2019 తేదీన రూ. 751.55 కోట్లు మొత్తం రూ. 2917.78 కోట్లు నామినేషన్ పద్ధతిలో నవయుగకి పెంచిన రేట్ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 3000 కోట్ల రూపాయల పనిని ఎల్ఎస్ కాంట్రాక్ట్ కింద అప్పగించింది. పై రెండు కంపెనీలు కూడా అస్మదీయులవే. నవయుగ అధికంగా లాభం ఉండే మాస్ కాంక్రీట్ పనులను మాత్రం (స్పీల్ ఛానెల్ కాంక్రీట్, స్పీల్ వే పౌండేషన్ వంటివి) దాదాపు రూ. 1675 కోట్ల పని చేశారు. క్రిటికల్ కాంపొనెంట్లు అయిన రెండు కాఫర్ డ్యామ్ పనులు మాత్రం నత్తనడకన జరిగాయి. ఈలోగా బావరు సంస్థ డీ-వాల్ పూర్తి చేసింది.. కానీ నవయుగ సంస్థ కాఫర్ డ్యామ్ను మాత్రం కట్టలేదు. u/s కాఫర్ డ్యామ్ మధ్యలో వదిలేశారు. తరువాత వచ్చిన వరదలకు ఏం జరిగిందో తెలిసిన విషయమే. గత ప్రభుత్వ హయాంలో ఎడమ కాలువ ప్యాకేజీ-5లో మిగిలిన పనిని అప్పటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కంపెనీ అయిన పీఎస్కే కంపెనీకి రూ.71 కోట్ల విలువ చేసే పనులను రూ.182 కోట్లకు నామినేషన్ పద్దతిలో అప్పగించారు . పోలవరం డ్యామ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు గత ప్రభుత్వ అవినీతి, అనాలోచిత విధానాల వలన ప్రధాన డ్యామ్ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలు, డీ వాల్ దెబ్బ తినడం, ఈ పాపం టీడీపీదే అనేది జగమెరిగిన సత్యం. ఇది ఖండించలేని వాస్తవం. మరొక ప్రధాన కారణం.. ప్రాజెక్టును సరియైన రీతిలో ఆర్ధిక వనరులు అందక పోవడం.. ఈ పాపం కూడా గత ప్రభుత్వానిదే. 2017-18 రేట్లకు అంచనాల ఆమోదం విషయంవలో 2016లో అప్పటి ప్రభుత్వం గాలికి వదిలేసింది. గత ప్రభుత్వ హయాంలో 2017 కేంద్ర క్యాబినెట్ నోట్లో పోలవరానికి నిధులను మూడు సంవత్సరాల కిందటి 2013-14 ధరల ప్రకారం కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్కు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ఆర్థిక, జల శక్తి శాఖలు ప్రతిపాదించినప్పుడు అప్పటి ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందా? దాని వలనే కదా 20,398.61 కోట్లు ఇస్తే సరిపోతుంది అనే నిర్ణయానికి వచ్చి ఆ ప్రకారమే కేంద్ర ఆర్ధిక శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇందులో కూడా రాష్ట విభజనకు ముందు పెట్టిన ఖర్చు 4730.71 కోట్లను మినహాయించి 15,667.90 కోట్లు మాత్రమే వారు ఇస్తున్నారు. ఈ రాబోయే నేటి విపత్తును ముఖ్యమంత్రి.. ఆనాడు ప్రతి పక్ష నేత హోదాలో అసెంబ్లీ వేదికగా అప్పటి ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ఆ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి దీనిపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం జరిగిన తప్పిదాన్ని అప్పుడే అడిగి ఉంటే సరి చేసి ఉండటం జరిగేది అని కూడా వాఖ్యానించారు. ఇప్పుడు పై విషయాలన్ని సీఎం జగన్ అభ్యర్దన మేరకు ప్రధాని చొరవతో ఆర్ధిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పరిశీలనలో ఉన్నాయి. కొంత పురోగతి కూడా సాధించాం. సీఎం జగన్ ఎన్నో సార్లు ప్రధాని, ఇతర ముఖ్యులను కలిసి ఒత్తిడి తేవడం వలన, కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా డీపీఆర్లో వున్న క్వాంటిటీలకు అదనంగా చేసిన కొత్త నిర్మాణాలకు సంబంధించి పెట్టిన ఖర్చులో రూ. 826.18 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పుకు ఎంతో పోరాటం చేసి ఈ నిధులు 2015-16 ధరల ప్రకారం (రెండు సంవత్సరముల తరువాతి ధరలతో) ఈ ప్రభుత్వం తెచ్చుకోగలిగింది. ఈ దిశగా ఇది తొలి విజయం మాత్రమే. 2017-18 ధరలతో అన్నీ కాంపొనెంటులకూ రీయింబర్స్ మెంటు నిధులు పొందే దానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రణాళికా ఫలితం: ఈనాడు పత్రిక హెడ్ వర్క్స్లో సీడబ్ల్యూసీ ఆమోదం పొందిన ఏ పనిని ఈ ప్రభుత్వం చేపట్టలేదో బాధ్యతతో చెప్పాలి. ఈ ప్రభుత్వం సీడబ్ల్యూసీ వారిచే డిజైన్ ఆమోదించబడిన ప్రతి పనిని పూర్తి చేసింది. కానీ గత ప్రభుత్వం కాఫర్ డ్యామ్లు, స్పిల్ వే డిజైన్లు సిడబ్ల్యూసి చాలా ముందుగానే ఇచ్చినా వారు కట్టలేక, ఎంత నష్టం వాటిల్లిందో తెలిసిందే. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం అత్యంత ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందడుగు వేసి కొన్ని కీలకమైన పనుల్ని ఇప్పటికే పూర్తి చేసింది. స్పిల్ వేను పూర్తి చేయడంతో పాటు దానికి 48 గేట్లు పెట్టింది. గత ఏడాది గోదావరి చరిత్రలో రెండో అతి పెద్ద వరద వచ్చినా సరే, సమర్థవంతంగా వరదను నియంత్రించగలిగింది. స్పిల్ వే పైన అప్రోచ్ ఛానెల్ను, దిగువన వున్న స్పిల్ చానెల్ను, పైలట్ చానెల్ను దాదాపుగా పూర్తి చేసింది. ఎగువ కాఫర్ డ్యామ్ లో 2 గ్యాప్లను పూర్తి చేసింది. ప్రధాన డ్యామ్ లోని గ్యాప్ 3 కాంక్రీటు పనులను పూర్తి చేసింది. 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించి చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇటీవల వచ్చిన అనూహ్య వరదల కారణంగా ఎగువ కాఫర్ డ్యామ్ దెబ్బ తినకుండా అప్పటికప్పుడు మంత్రితో సహా అధికారులు అందరూ డామ్ సైటులోనే ఉండి ముఖ్యమంత్రితో అనుక్షణం సంప్రదిస్తూ ఒక మీటరు ఎత్తు కూడా పెంచి ఎటువంటి నష్టం జరగకుండా నివారించింది. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రళిణాకా బద్ధంగా ప్రభుత్వం పూర్తి చేసింది. 2. పునరావాసం : పునరావాసం గురించి మాట్లాడే అర్హత గత ప్రభుత్వానికి గాని, వారి పత్రికలకు గాని లేనే లేదు అనే విషయాన్ని ఈ గణాంకాలు తేట తెల్లం చేస్తాయి. పునరావాసానికి మొత్తం అంచనా : 21,374 కోట్లు పునరావాస పనులు +41.15 కాంటురు వరకు వేగంగా జరుగుతున్నాయి. జూన్ 2023 లోగా మిగిలిన 9269 పీడీఎఫ్ఎస్ని కూడా పునరావాసం పూర్తి అవుతుంది. దీనికి దాదాపుగా 525 కోట్ల నిధులు కూడా కేటాయించడం జరిగింది. పునరావాసంలో వైఫల్యం అని గగ్గోలు పెడుతున్నారే? అసలు వైఫల్యం ఎవరిది. ఐదు సంవత్సరాలలో 484 కోట్లు ఖర్చు పెట్టి 3110 మందికి పునరావాసం కల్పించిన టీడీపీ ప్రభుత్వానిదా, లేక మూడు సంవత్సరాలలో 1677 కోట్లు ఖర్చు పెట్టి 8567 మందికి పునరావాసం కల్పించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదా వైఫల్యం?.. టీడీపీ ప్రభుత్వం పునరావాసం కనీస స్థాయిలో కూడా చేపట్టపోవడంలో ఒకే ఒక కారణం కనిపిస్తోంది. కాలువల పనులు జరగడంలేదంటూ ఆరోపణలు.. ఇక్కడ కొంచెం వివరంగా గత ప్రభుత్వ వైఫల్యం చెప్పుకోవాలి. కుడి కాలువ సామర్ధ్యం మొదటగా 330 క్యూమేక్స్గా డీపీఆర్లో ప్రతిపాదించారు. దివంగత మహానేత వైఎస్సార్ మొదటిగా చేసిన పని ఏమిటంటే, భవిష్యత్తు అవసరాలు మరియు కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ ఇవన్నీ ముందుగానే యోచన చేసి, కాలువ సామర్థ్యాన్ని 499 క్యూమేక్స్ కు పెంచుతూ G.O.Rt No. 765 Dt:- 07-10-2004 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 230 క్యూమేక్స్ నుండి 497 క్యూమేక్స్కు అదే జీవో ద్వారా పెంచారు. ముఖ్యంగా విశాఖపట్నం తాగునీరు, పారిశ్రామిక, వెనుకబడిన ఉత్తరాంధ్ర అవసరాలకై ప్రతిపాదిత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని దృష్టి లో పెట్టుకుని వైఎస్సార్ కాలువ సామర్ధ్యాన్ని పెంచారు. 2014 ముందే రెండు కాలువల సామర్ధ్యాలు 499/497 క్యూసెక్కులకు పెంచి పనులు కొనసాగించినా, 2017వ సంవత్సరంలో రెండోపెట్టుబడి అనుమతికి ప్రతిపాదనలు 2010 2011 ధరలతో 16,010 కోట్లకు పొందటం ఒక వైఫల్యం అయితే, కాలువల సామర్ధ్యాలను 2005 డీపీఆర్ ప్రకారం పాత సామర్ధ్యాలకు మాత్రమే అంచనాలు వేయడం గత ప్రభుత్వం ఘోర వైఫల్యంగా పేర్కొనవచ్చు. దీని వలన ఇప్పటికి కూడా కాలువల మీద 499/497 క్యూమేక్స్లకు పెట్టిన ఖర్చును 2005 డీపీఆర్ సామర్ధ్యానికి మాత్రమే కేంద్ర జలవనరుల శాఖ చెల్లించడం వలన ప్రాజెక్టు ఆర్ధిక వనరుల కూర్పు దెబ్బతిని, నిధుల లభ్యత సమస్యగా మారింది ఈ లోగా ప్యాకేజీలలో పని చేసే చాలా ఏజన్సీలు గత ప్రభుత్వ ప్రణాళిక వైఫల్యం, సహకార లోపం వలన దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ రేట్లకు చేయడానికి అంతగా ఆసక్తి ఎవరూ చూపడం లేదు. పైగా కాలువ పనుల మీద జరిగిన ఖర్చును పీపీఏ రియింబర్స్మెంట్ చేయడం లేదు. దీనికి కూడా ప్రధాన కారణం గత ప్రభుత్వం వారి నిర్వాకం వలనే. 2017 లో కేంద్ర క్యాబినెట్ 2013-14 రేట్లతో ఇరిగేషన్ కాంపొనెంట్కు మాత్రమే నిధులు ఇస్తామని చెప్పినా, వారు నోరు మెదప కుండా ఉండటం ప్రధాన కారణం. చదవండి: తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం మిగిలి పోయిన ఎడమ కాలువ పనులు ఏవిధంగా పూర్తి చేయాలి అన్న దాని మీద ఆర్ధిక, జలవనరుల శాఖలు కూలంకుషంగా చర్చిస్తున్నాయి. తొందరలోనే ఒక నిర్ణయం దీని మీద తీసుకుంటారు. ముందుగా హెడ్ వర్క్స పూర్తి చేయడం మీదనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. దీనికి ఒక రెండు సంవత్సరాలు సమయం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పడుతుంది మిగిలిన ఎల్ఎంసీ పనులు 6 నుండి 12 నెలలోపు పూర్తి చేయవచ్చు అనే ప్రణాళికలో ప్రభుత్వం ఉంది. ఈలోగా 2017-18 ధరల తో ప్రొజెక్టు అంచనాలను ఆమోదం పొందితే, కేంద్ర నిధుల లభ్యత అందుబాటు లోనికి వస్తుంది. హెడ్ వర్క్స్ పనులు పూర్తి అయ్యే లోపుగానే, మిగిలిన కాలువ పనులు పూర్తి చేయగలం 4. ఈ ప్రభుత్వ ధృడ సంకల్పం : ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా PPA/CWC/DDRPలతో నిరంతరం సంప్రదింపులు జరిపి, జరిగిన తప్పిదాలను సరిచేసే ప్రణాళికను PPA/CWC/DDRPని ఒప్పించి ఆమోదింప చేసింది. ఇది ప్రాజెక్టు పురోగతిలో ఒక కీలక పరిణామం. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ఈ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం పూర్తి చేసింది. రెండి డ్యామ్ల మధ్య ఇప్పుడు వరద నీరు చేరదు కాబట్టి , వరదల సమయంలో కూడా ప్రాజెక్టు పనులు అనగా అగాధాలు పూడ్చటం, డయాఫ్రమ్ గోడలు దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతర డయాఫ్రమ్ గోడలు నిర్మించి మెయిన్ డయాఫ్రమ్ వాల్తో అనుసంధానించడం వంటి పనులు నిరాటంకంగా చేసుకునే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. తాత్కాలిక అవరోధాలు తొలగి ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూల పరిస్తితులు ఏర్పడినవి. అన్ని నిర్మాణాలు చురుకుగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎం జగన్, మంత్రులు అనేక సందర్భాల్లో గత ప్రభుత్వ పెద్దలు, వారి అస్మదీయుల జేబులోకి అవినీతి వరద ఎలా ప్రవహించినదో అలాగే ప్రాజెక్టును, దాని ఫలితాలతో కలిగే ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టిన విషయాలను అన్ని సాక్ష్యాధారాలతో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ విషయాన్ని ఈనాడు పత్రిక జీర్ణించుకోలేక, ఓర్వలేక ఇంకోసారి విషం చిమ్మి, బురద చల్లే విధంగా ఈ కథనం ప్రచురించింది. -
తన్నారు.. తిన్నారు.. చంద్రబాబు, రామోజీరావు అసలు బండారం
పోలవరం ప్రాజెక్టును తానే నిర్మిస్తానని కేంద్రం చెబితే.. వద్దు మాకు ప్యాకేజీ చాలన్నారు చంద్రబాబు. అలా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగబోమని హామీనిచ్చేశారు. కేంద్రం సరేనని ప్యాకేజీలో భాగంగా పోలవరాన్ని అప్పగిస్తే.. రామోజీరావు వియ్యంకుడి కంపెనీ నవయుగకు ఎలాంటి టెండర్లూ లేకుండా నామినేషన్పై రూ.3,302 కోట్ల విలువైన పనులు కట్టబెట్టేశారు బాబు. పనిలోపనిగా యనమల రామకృష్ణుడి బావ మరిదికీ కొంత పంచారు. ఇక అందిన ప్యాకేజీలో దత్తపుత్రుడు, తోక పత్రికకు వాటా చేరిపోయింది. కాబట్టే... ఎందుకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వాళ్లు ప్రశ్నించలేదు. ఒక్క ఒక్కరం ముక్కా రాయలేదు. ఇదీ.. దోచుకో– పంచుకో–తినుకో అంటే! మూసేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ గానీ, నడుస్తున్న మార్గదర్శి చిట్స్ గానీ ఏ నిబంధననూ పాటించవు. కోట్లకు కోట్లు డిపాజిట్లు తీసుకున్నాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నందుకు క్రిమినల్ కేసులు నడుస్తుండగా.. రూ.2వేల కోట్లు ఫైన్ కట్టాల్సిన పరిస్థితుల్లో తప్పించుకునేందుకు ఏకంగా సంస్థనే మూసేశారు. ఇక చిట్స్ సంస్థ బిడ్ పాడుకున్న వాళ్లనూ ష్యూరిటీల పేరిట నెలలకు నెలలు తిప్పుతుంది. అక్రమంగా డిపాజిట్లూ తీసుకుంటోంది. ఇలా ఏం చేసినా... చంద్రబాబు ప్రశ్నించరు. ముఖ్యమంత్రిగా ఉన్నా దాని జోలికెళ్లరు. ఇది కాదూ.. డీపీటీ అంటే!! ముఖ్యమంత్రిగా షాపుర్జీపల్లోంజీ సంస్థకు వేల కోట్ల నిర్మాణ కాంట్రాక్టులు కట్టబెట్టారు నారా వారు. ఆ సంస్థను పిలిచి... పార్టీకి కాదు, మా ‘బాబు’ గారికి ఫండ్ కావాలన్నారు బాబు పీఏ శ్రీనివాస్. డొల్ల కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో వందల కోట్లు ప్రవహించాయి. వాటిలో కొంత రామోజీ తనయుడి వియ్యంకుడి కంపెనీకీ (ఆర్వీఆర్ ఇన్ఫ్రా) చేరాయి. అక్కడి నుంచి చంద్రబాబు జేబులోకీ కొంత మళ్లాయి. దుబాయ్లో ఆస్తులు కూడబెట్టిన బాబు... అక్కడా కొంత క్యాష్ తీసుకున్నారు మరి!. ఇదంతా సంబంధిత వ్యక్తులు స్వయంగా సంతకం చేసిన ఇన్కమ్ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్లోనిదే!. కానీ దీని గురించి రామోజీ, ఆయన తోకపత్రిక పెన్నెత్తితే ఒట్టు. ఇదీ.. తోడు దొంగల డీపీటీ అంటే!!. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉండగా స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఫైబర్నెట్ వరకూ దోచుకో– పంచుకో– తినుకో పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన దుష్ట చతుష్టయం... ఇపుడో కొత్త రాగం ఎంచుకుంది. అధికార పారీ్టయే ఇసుక తవ్వకాల్లో ‘దోచుకో, పంచుకో, తినుకో’ అన్నట్లుగా వ్యవహరిస్తోందనే కథనాలకు దిగింది. మరి ఇందులో నిజం వీసమెత్తయినా ఉందా? బాబు హయాంలో ఇసుక విషయంలో జరిగిందేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఎవరి హయాంలో దోపిడీ జరిగింది? ఎవరు పంచుకున్నారు? ఎవరు తిన్నారు? ఒకసారి చూద్దాం.. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు.. పేరుకే ఇసుక ఉచితం!!. కానీ సామాన్యులు ఒక్కరికైనా ఫ్రీగా అందితే ఒట్టు!. అంతా బాబు కనుసన్నల్లోనే. అంతా టీడీపీ నేతల చేతుల్లోనే. ఉచితం పేరిట ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాకుండా వేల కోట్లు దోచేసి.. పంచుకుతినేశారు. సామాన్యులకు ఉచితంగా ఇవ్వకుండా... ప్రభుత్వానికి కూడా రూపాయి రాకుండా ఇసుకను తవ్వేయటం దారుణమని భావించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అందుకే జాతీయస్థాయిలో టెండర్లు పిలిచారు. అలా టెండర్లు పిలిచే బాధ్యతను ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీకి అప్పగించారు. బహిరంగ టెండర్లలో ఇసుక తవ్వి, విక్రయించే కాంట్రాక్టును జయప్రకాశ్ గ్రూపునకు చెందిన ‘జేపీ పవర్ వెంచర్స్’ దక్కించుకుంది. దీనికోసం ఇది ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు చెల్లించాలి. అంటే... ఐదేళ్లలో దాదాపు రూ.4వేల కోట్లు. గతంలో ఇందులో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాలేదు. మరి ఈ సొమ్ము ఎక్కడికి పోయింది? ప్రజలకు కూడా ఇసుక ఫ్రీగా దొరకనప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది? ఇంకెవరు... చంద్రబాబు, రామోజీ, తోకపత్రిక యజమాని, దత్తపుత్రుడు. ఈ చతుష్టయమే మొత్తం ఇసుక వ్యాపారాన్ని శాసించింది. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు కట్టిన ఇంటి వెనకాల... రాత్రీపగలూ విరామం లేకుండా ఇసుక లారీలు తిరిగేవంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు! అక్రమంగా తవ్వేస్తున్నారని, ఉచితం పేరిట తినేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అడ్డుకోబోయిన నాటి ఎమ్మార్వో వనజాక్షిని... ఏకంగా జుట్టుపట్టుకుని ఈడ్చేశాడా ఎమ్మెల్యే. అంత దారుణం జరిగినా ‘ఈనాడు’ వ్యతిరేకించలేదు. మనవాడే కదా అని కిమ్మనకుండా ఊరుకున్నారు రామోజీ, ఆయన తోక మీడియా. ఇక చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ఆ ఎమ్మార్వోను పిలిచి, ఎమ్మెల్యేపై ఎలాంటి ఫిర్యాదూ చేయకుండా ‘రాజీ’ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇదీ.. బాబు, ఆయన బృందం స్థాయి. ఇసుకను ఉచితంగా ఇస్తూ రామోజీరావు చెప్పినట్లుగా చంద్రబాబు మహా యజ్ఞమే చేసి ఉంటే... ఈ దౌర్జన్యాలెందుకు? ఈ దొంగ తవ్వకాలెందుకు? ఒకవేళ ఇసుక తవ్వకాలు తమ చేతుల్లోనే ఉండాలనుకుంటే జాతీయ స్థాయి టెండర్లలో రామోజీరావు కూడా పాల్గొని ఉండొచ్చుగా? ఎందుకు పాల్గొనలేదు?!. మరి ఇప్పుడెందుకీ కడుపు మంట? తమ అక్రమాలకు ఇపుడు ఫుల్స్టాప్ పడిందనేనా? వాళ్ల జేబుల్లోకి పోయిన సొమ్ము ఇపుడు నేరుగా ప్రభుత్వానికి అందుతోందనా? ఇసుక తవ్వకాలపై మరీ పనిగట్టుకుని అపోహలు రేకెత్తించేలా తరచూ రామోజీ రాస్తున్న కథనాల్లో నిజమెంత? ఒకసారి సబ్కాంట్రాక్టరుగా టర్న్కీని తప్పించారంటూ బాధ!. మరోసారి టర్న్కీ సంస్థ దోచేస్తోందని శివాలు. ఇంకోసారి ఇసుక దొరకటం లేదని బాధ! మరోసారి ఇసుక విచ్చలవిడిగా విక్రయంచేస్తున్నారని బాధ!. వీటన్నిటి వెనకా అసలు బాధ మాత్రం... తమ డీపీటీకి అడ్డుకట్ట పడిందనే!. 2 కోట్ల టన్నుల ఇసుకతో... రూ.1800 కోట్లు ఎలా సాధ్యం? ‘ఈనాడు’ వాదన ఎంత ఘోరమంటే... రాష్ట్రంలో ఇసుకను ఎడాపెడా తవ్వేస్తున్నారని... ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని శుక్రవారంనాటి వార్తలో రామోజీ మండిపడ్డారు. కానీ అదే వార్తలో... తూర్పు గోదావరి జిల్లాను సబ్కాంట్రాక్టుగా తీసుకున్న వ్యక్తి... వ్యాపారం సరిగా జరగటం లేదని, తాను చెల్లించాల్సింది తగ్గించమన్నాడట. కుదరదనటంతో ఆత్మహత్య చేసుకున్నాడని కూడా రాసేశారు. ఎడాపెడా తవ్వేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నపుడు... వ్యాపారం జరగకుండా డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంటుందా? ఏమనుకోవాలి రామోజీ మీ తెలివిని? మరో వాదన చూద్దాం. ఇసుకపై రూ.1800 కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి రూ.765 కోట్లు కట్టి మిగిలిన సొమ్ము వైఎస్సార్సీపీ నేతలు దోచుకుంటున్నారనేది ‘ఈనాడు’ కథ. నిజానికి రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక అవసరం. దీనికి అనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక టన్ను ఇసుకను ఓపెన్ రీచ్లలో రూ.475కి విక్రయిస్తున్నారు. అంటే.. మొత్తంగా రూ.900 కోట్లు వస్తాయి. రాష్ట్రంలో లభ్యమయ్యే ఇసుకే 2 కోట్ల టన్నులైతే దానికి రెండు రెట్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తెలిసి కూడా జేపీ సంస్థ నుంచి అంతకన్నా ఎక్కువ మొత్తం చెల్లించి వైఎస్సార్ సీపీ నాయకులెందుకు సబ్కాంట్రాక్టులు తీసుకుంటారు? ఒకటీఅరా చోట్ల తీసుకున్నా అంత ఎక్కువ మొత్తం ఎలా చెల్లిస్తారు? ఇవన్నీ కాస్త ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే అర్థమవుతాయి కదా రామోజీ? అక్రమ రవాణాపైనా అబద్ధాలేనా? యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకు తరలించేస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అబద్ధాలన్నిటినీ రాసి పారేసింది ‘ఈనాడు’. వాస్తవానికి పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీనికోసమే ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడా ఇసుక ఎక్కువ రేట్లకు విక్రయించరాదన్న ఉద్దేశంతో ప్రతి వారం పత్రికల్లో స్థానికంగా విక్రయించే రేటును ప్రకటనల రూపంలో ప్రచురిస్తోంది. అక్కడే... ఒకవేళ ఎక్కువ ధరకు విక్రయిస్తే ‘సెబ్’ నెంబరుకు కాల్ చెయ్యవచ్చంటూ ఆ ఫోన్ నెంబరు కూడా ఇస్తున్నారు. ఇక వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఒకవేళ ఎక్కడైనా అక్రమంగా తరలిస్తున్న వ్యవహారాలు, ఎక్కువ ధరలకు విక్రయించిన ఘటనలు జరిగితే సెబ్ తక్షణం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కేసులు కూడా పెడుతోంది. ఇదిగో... ఈ చర్యల ఫలితంగానే ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతోపాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందుతోంది. మరి ఇసుక విధానం ఇంత పారదర్శకంగా ఉన్నపుడు ‘దోచుకో.. పంచుకో.. తినుకో’ ఎలా అవుతుంది రామోజీ? అబద్ధమైనా అతికినట్లుండాలి కదా? బాబు అక్రమాలకు... ఎన్జీటీ 100 కోట్ల జరిమానా చంద్రబాబు హయాంలో ఇసుక విధానం ఎంత దారుణంగా ఉందో సాక్షాత్తూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునలే తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు.. సాక్షాత్తూ తన ఇంటి పక్కనే కృష్ణా నదిని తొలిచేస్తూ టీడీపీ నేతలు ఇసుకను తరలించడాన్ని ప్రోత్సహించారంటే దోపిడీ స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ వందల లారీలు తన ఇంటి మీదుగానే అక్రమంగా తరలిపోతున్నా... వాటా వచి్చందో లేదో చూసుకున్నారు తప్ప పర్యావరణానికి జరుగుతున్న డ్యామేజీని ఆయన పట్టించుకోలేదు. దీనిపై ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ జరిపి... అక్రమాలు ముమ్మాటికీ నిజమని తేల్చింది. టీడీపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. విచిత్రమేంటంటే జాతీయ స్థాయిలో బాబు ఇసుక మాఫియా గురించి బట్టబయలైనా... కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ ఒక్క అక్షరం కూడా రాయటానికి పూనుకోలేదు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరిగినా... వినియోగదారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఇసుకను కొనుక్కోవాల్సి వచి్చనా ఇప్పుడు రాసిన తరహాలో రామోజీ ఎన్నడూ ఒక్క వార్త కూడా రాయలేదెందుకు? ఇసుక లారీలు పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా... టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా ఎందుకు ప్రశి్నంచలేదు? తమ వాటా తమకు అందేసిందనా? అది కదా... అసలైన డీపీటీ!! సబ్ కాంట్రాక్టులు ఎవరికివ్వాలో చెప్పగలమా? వాస్తవానికి టెండర్లలో పాల్గొని దక్కించుకున్న కాంట్రాక్టరు... ఆ తరవాత టెండరు నిబంధనలను పాటిస్తూ ఎవరికి సబ్కాంట్రాక్టుకు ఇచ్చుకున్నా, తనను అలా చేయకుండా నిలువరించటం కష్టం. సబ్కాంట్రాక్టు ఎవరికివ్వాలన్నది కాంట్రాక్టరు ఇష్టం. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఇదే పద్ధతి. పోనీ చంద్రబాబు హయాం చూసుకున్నా ఇదే తీరు కదా? కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్కు ఇస్తే... ఆ శ్రీనివాస్ సదరు పనులను సీఎం రమేష్ కంపెనీకి సబ్ కాంట్రాక్టుకిచ్చాడు. మరి అప్పుడెందుకు కలమెత్తలేదు రామోజీరావు గారూ? అసలు నిజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే ఇసుక తవ్వకాలు, తరలింపులు చేస్తుంటే ప్రభుత్వం ఎస్ఈబీని ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అక్రమంగా తరలించిన వారిపై కేసులెందుకు పెడుతుంది? ఇదంతా రామోజీరావు బుర్రకు తట్టదా? తట్టకేం... కావాలని నాలుగు రాళ్లు్ల విసిరితే సరి అనుకునే పాత్రికేయం మరి. చదవండి: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా?
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక దోపిడీకి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఇసుక పాలసీపై మరోసారి 'ఈనాడు' పత్రిక అసత్యాలు, అభూత కల్పనలతో తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 'దోచుకో... పంచుకో... తినుకో...’ అనే శీర్షికతో ‘ఈనాడు’ పత్రిక పూర్తి అవాస్తవాలతో కూడిన కథనం రాశారని, వాస్తవాలను వక్రీకరిస్తూ... అబద్దాలతో కూడిన ఆరోపణలను తమ పత్రికలో ప్రచురించారన్నారు. గతంలో జేపీ, టర్న్కీ సంస్థలపై పదేపదే తప్పుడు వార్తలు ప్రచురించిన ఈనాడు పత్రిక ఇప్పుడు అధికార పార్టీ ముఖ్య నేతలు, సిండికేట్లు అంటూ మరోసారి ఊహాత్మక ఆరోపణలతో, కట్టుకథలతో వార్తను ప్రచురించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగింది ఇదే.. గత ప్రభుత్వంలో ప్రారంభంలో మహిళా సంఘాలకు ఇసుక ఆపరేషన్స్ను అప్పగించి, ఇసుక మాఫియా ధాటికి వారు పనిచేయలేని పరిస్థితిని కల్పించింది. తరువాత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానంతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంది. వినియోగదారులు బ్లాక్ మార్కెట్ నుంచి అధిక ధరలకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు వ్యక్తుల జేబులు నింపేందుకే ఉచిత ఇసుక విధానం ఉపయోగపడింది. అటు ప్రభుత్వానికి ఐదేళ్లలో రావాల్సిన దాదాపు రూ.3825 కోట్ల ఆదాయానికి గండి పడింది. ఈ సొమ్ము ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే మరోవైపు ప్రజలు అధిక ధరల్లో బ్లాక్ మార్కెట్లో ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే అప్పటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటన ఇసుక మాఫియా ఆగడాలకు అద్దం పట్టింది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇసుక లారీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. లెక్కా పత్రం లేకుండా విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ఈ మొత్తం విధానాన్ని మార్చేందుకు సీఎం జగన్ నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చారు. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఇసుక టెండర్లను నిర్వహింపచేయడం, పారదర్శక విధానం, సులభతరంగా ఇసుక లభ్యత, అందుబాటు ధరల్లో వినియోగదారులకు చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ జరిగేలా చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటి ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తం చేస్తూ, గత ప్రభుత్వం తప్పిదాల వల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దు చేసింది. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా.. టెండర్ల ద్వారా రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ను దక్కించుకున్న జేపీ సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సదరు సంస్థ ప్రతి ఏటా ప్రభుత్వానికి రూ.765 కోట్లు రెవెన్యూగా చెల్లిస్తోంది. టన్ను ఇసుక ఓపెన్ రీచ్లలో రూ.475 కి విక్రయిస్తున్నారు. అలాగే రీచ్లు, డిపోల వద్ద రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను కూడా ప్రతివారం పత్రికల ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంతకన్నా ఎక్కువకు ఎవరు విక్రయించినా, ఇసుక కొనుగోళ్లు రవాణాలో ఎటువంటి సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించాము. వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్ ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించాం. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా సులభతర విధానాన్ని తీసుకువచ్చాం. ఎప్పటికప్పుడు తనిఖీలు ప్రతినెలా జేపీ సంస్థ తమకు అప్పగించిన రీచ్లకు గానూ ఎంత పరిమాణంలో పర్యావరణ అనుమతులు పొందింది, ఎంత మేర ఇసుక తవ్వకాలు చేసింది, ఎంత మేర విక్రయాలు చేసిందో గనులశాఖకు నివేదిస్తుంది. గనులశాఖ అధికారులు దీనిని పరిశీలించిన తరువాతే తరువాత తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రం దాటి ఇసుకను పొరుకు రాష్ట్రాలకు రవాణా చేసేందుకు వీలు లేకుండా ప్రభుత్వం జిఓ నెం.71 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసింది. గనులశాఖ రీజనల్ స్వ్కాడ్స్, ఎస్ఇబి కూడా దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పనికట్టుకుని తప్పుడు కథనాలు.. ఇంత పకడ్భందీగా ఇసుక విధానాన్ని అమలు చేస్తుంటే... ఈనాడు పత్రిక పనికట్టుకుని వరుసగా తప్పుడు కథనాలను ప్రచురించడం బాధాకరం. ఈ ప్రభుత్వంపై ఏదో ఒక రీతిలో బుదరచల్లే ఉద్దేశంతోనే ఇటువంటి అసత్య కథనాలను ఈనాడు పత్రిక వండి వారుస్తోంది. నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతలే సిండికేట్లుగా మారి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఏ సమాచారంతో ఈనాడు పత్రిక ఆరోపిస్తోంది? రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక వినియోగం ఉంది. దానికి అనుగుణంగానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఇసుక కొరత అనేది లేదు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు.. వర్షాకాలం కోసం కూడా ముందుగానే డిపోల్లో ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నాం. 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకు గానూ రూ.765 కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా. ఈనాడు పత్రిక మాత్రం ఏకంగా ఏడాదికి రూ.1800 కోట్లు ఆదాయం వస్తోందని ఏ లెక్కల ప్రకారం చెబుతోంది? పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం జిఓ 71 ని జారీ చేసి, దానిని అమలు చేస్తోంది. అటువంటప్పుడు పొరుకు రాష్ట్రాలకు భారీగా అక్రమ రవాణా జరుగుతోందని ఏ ఆధారాలతో ఈనాడు పత్రిక ఆరోపణలు చేస్తోంది ఈనాడు పత్రిక చేసిన ఆరోపణల ప్రకారం పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోతే, రాష్ట్రంలో అవసరాలకు ఇసుక కొరత ఏర్పడి ఉండేది కాదా? ఏ రీచ్లో అయినా కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉంది. అంటే ఈనాడు పత్రిక తన కథనంలో రాసినదంతా అసత్యాలు అని అర్థమవుతోంది. ‘ఈనాడు’ రాతలకు అర్థం ఉందా? ప్రతి రీచ్ లోనూ పర్యావరణ అనుమతులు పొందిన తరువాత ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతున్నాయి. ఇసుక పరిమాణం, రేటు కూడా ఖరారు అయిన తరువాత దానిపై వచ్చే ఆదాయం కూడా ముందుగానే నిర్ణయించడం జరిగింది. ఇవ్వన్నీ తెలిసి కూడా జిల్లాల్లో రీచ్ ల వారీగా అత్యధిక రేట్లకు ఇసుక తవ్వకాలు చేస్తామని ఎవరైనా ముందుకు వస్తారా? జిల్లాల వారీగా కోట్ల రూపాయల రేట్లను ఖరారు చేసి, అధికార పార్టీ నేతలకు ఇచ్చారు. వారి నుంచి ముఖ్య నేతలు లక్ష్యాలు విధించి మరీ కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నారనే రాతలకు అర్థం ఉందా? జేపీ సంస్థ నిబంధనల ప్రకారం తాను చెల్లించాల్సిన మొత్తాలను నేరుగా ప్రభుత్వానికి జమ చేస్తోంది. అన్ని రీచ్ లు వారి ఆధీనంలోనే ఉన్నాయి. అలాంటప్పుడు బయటి వ్యక్తులు ఇసుక ఆపరేషన్స్ ఎలా చేస్తారు? నెలకు జిల్లాకు రూ.150 కోట్లు ఎలా వసూలు చేస్తారు? దానిని హైదరాబాద్ లోని ముఖ్య నేతలకు ఏ విధంగా చెల్లిస్తారు? ఊహలను వార్తలుగా రాస్తూ... ఈనాడు పత్రిక తమ ఊహలను వార్తలుగా రాస్తూ.... రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగించాలనే ఉద్దేశంతోనే ఇసుక పేరుతో పదేపదే తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. దీనిపై వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులను కూడా కనీసం వివరణ కూడా కోరలేదు. ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తే ఈనాడు పత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. -
అసెంబ్లీ సాక్షిగా వీడియోలతో వాస్తవాలను బయటపెట్టిన మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తిప్పికొట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. పయ్యావుల బండారాన్ని మంత్రి బుగ్గన బయటపెట్టారు. గవర్నర్కు సీఎం స్వాగతం పలకలేదనే టీడీపీ తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను మంత్రి బయటపెట్టారు. టీడీపీవి అన్నీ తప్పుడు ఆరోపణలు. గవర్నర్కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదని మంత్రి బుగ్గన వివరించారు. గవర్నర్కు స్వాగతం పలికిన వీడియోను ఆయన ప్రదర్శించారు. గవర్నర్ పట్ల గౌరవ సభ పట్ల అమర్యాదగా ప్రవరిస్తున్నారని, టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. ‘‘అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలి. ఎల్లో మీడియా కూడా బాధ్యతరహితంగా వార్తలు రాసింది. టీడీపీ వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘనే. తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు అవాస్తవాలు ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలి. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలి’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పీకర్ను కోరారు. చదవండి: జెండా పవన్ది.. అజెండా టీడీపీది: మంత్రి అమర్నాథ్ -
చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు: సీదిరి అప్పల రాజు
సాక్షి, శ్రీకాకుళం/విశాఖపట్నం: టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్ చెక్ అనే పుస్తకం విడుదల చేయడంపై మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైజాగ్లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న గొప్ప సందర్బంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడు బుక్లెట్స్తో ప్రచారం చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 'సత్యం రామలింగ రాజు, కోనేరు ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్ను వేదించామంటున్నారు. వారికి మాకు సంబంధం ఏంటి? చంద్రబాబు హయాంలోనే కదా వారిని వేధించింది. మా మనిషి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అబద్ధాలు ప్రచారం చేస్తాం అన్నట్లుగా ఉంది. అదానీ లాంటి వ్యక్తి రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. అంబానీ, టాటా, బిర్లా, జిందాల్ వంటి వారు రాష్ట్రం వైపు చూస్తున్నారు. రిలయన్స్ని వెనక్కి పంపామంటున్నారు. చంద్రబాబు హయాంలో లిటిగేషన్ ఉన్న ల్యాండ్ని రిలయన్స్కి కేటాయించారు. కోర్టు కేసులతో ఇబ్బందులు పడి రిలయన్స్ వెనక్కి వెళ్లింది. ఇది మీ తప్పిదం కాదా..? జాకీ సైతం మాకు మార్కెట్ లేదంటూ వెనక్కి తగ్గారు. చంద్రబాబు హయాంలోనే లేఖ రాసి వెళ్లిపోయారు. ప్రాంక్లిన్ టెంపుల్ టేన్ దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీ. అమర్ రాజా వారు ఏపీలోనే పెట్టుబడి పెట్టాలని రూల్ ఉందా..? విస్తరణలో బాగంగానే తెలంగాణకు వెళ్లారు. అమరాజా కంపెనీ లెడ్ వల్ల ప్రజలకు ఇబ్బందులు అని పీసీబీ నోటీస్ ఇస్తే.. మేం ఇబ్బందులు కు గురి చేసారంటారా? అన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ వారి క్యాంపస్.. మొదలుపెడుతోంది. అనేక దిగ్గజ కంపెనీలు విశాఖ కేంద్రంగా వస్తున్నాయి. ఏడు నెలల్లో 40 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని కేంద్రం స్వయంగా చెప్పింది. ఎక్స్ పోర్ట్స్ లో 4వ ర్యాంక్ లో ఉన్నాం. చంద్రబాబు హయాంలోని పారిశ్రామిక బకాయిలు రూ.3,675 కోట్లు సైతం మేం చెల్లించాం , తిరిగి పారిశ్రామిక రాయితీ ఇచ్చాం. విపత్కర పరిస్థితులను తట్టుకుని 11.4% గ్రోత్ సీఎం జగన్ పరిపాలనతో సాధ్యం అయ్యింది. 108 భారీ పరిశ్రమలు మా హయాంలో వచ్చాయి చంద్రబాబుకి సిగ్గు లజ్జాలేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉండుంటే .. ఇలా రాసుకునే బాధ ఉండేది కాదు. డబ్బులు కోసం ఒప్పుకుని వచ్చి నంగవాచి వేషాలు వేశారు. అందుకే ప్రజలు గూబమిద కొట్టి పక్కకు తోశారు. సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా? చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు అని ప్రజలు అనుకుంటున్నారు. 4 వారాల్లో భావనపాడు పోర్టుకు సీఎం జగన్ శంఖుస్థాపన చేస్తారు. భావన పాడు-మూలపేట పోర్టుతో శ్రీకాకుళం దిశ దశ మారనుంది. మెడలు వంచించుకునే స్థితిలో బీజేపీ లేదు. మేం మాటతప్పాం అనే నైతిక బాధ్యత వహించే స్థితిలో కూడా బీజేపీ లేదు. చంద్రబాబు ఏ ఓక్క సమయంలో కూడా హోదాా గురించి అడగలేదు. ఐపాక్ మాకు సలహాదారు అని ఓపెన్ గా చెప్పాం. ఐప్యాక్ మా పార్టీలో భాగం. పవన్ చెప్పగలరా తన స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో. వారికి కూడా సలహాదారులు ఉన్నారు కదా? రోడ్లు ఏవి వేయాలో ఐపాక్ టీం ఏలా డిసైడ్ చేస్తుంది. ఇది అసత్య ప్రచారం' అని సీదిరి అప్పలరాజు టీడీపీపై ఫైర్ అయ్యారు. స్టాల్స్ను పరిశీలించిన విడదల రజిని.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పరిశీలించారు. టిీడీపీ హయాంలో జరిగిన సదస్సులో పెట్టుబడులు కాగితాల పైనే జరిగాయాని ఎద్దేవా చేశారు. ఈ సదస్సు ఏపీ లో భారీ పెట్టుబడులకు అనువైన సమయమన్నారు. పారిశ్రామిక పెట్టుబడుల్లో ఏపీ నెంబర్ వన్ కాబోతోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. చదవండి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు -
గతం గుర్తుందా రామోజీ?.. ఆ విషయం ‘ఈనాడు’కు తెలియదా!
ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఈనాడు మీడియా ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. ఏపీ అభివృద్దికి పెద్ద శత్రువుగా ఈ మీడియా మారిందంటే ఆశ్చర్యం కాదు. ఒక వైపు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు తేవడానికి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం విశాఖపట్నంలో భారీ స్థాయిలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 3,4 తేదీలలో ఈ సదస్సు జరగబోతోంది. దీనికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలను రప్పించడానికి మంత్రులు, ఐఎఎస్ అధికారులు విశేష కృషి చేస్తుంటే దానిని ఎలా చెడగొట్టాలా అని ఈనాడు మీడియా ఆలోచన చేస్తోంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్ తదితరులు బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలలో పర్యటించి సన్నాహక సదస్సులు పెడుతున్నారు. వారి సమావేశాలకు ప్రముఖులు హాజరువుతున్నారు. ఏపీకి ఉన్న అపార అవకాశాలను మంత్రులు తెలియచేస్తున్నారు. విశాఖ సమ్మిట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో ఈనాడు మీడియా పుల్లలు వేయడం ఆరంభించింది. అందులో భాగంగా శనివారం నాడు ఒక కథనాన్ని ఇచ్చింది. పారిశ్రామిక రాయితీ జాడేది అని హెడింగ్ పెట్టి మొదటి పేజీలో పరిచారు. ప్రభుత్వం ప్రోత్సహాకాలను సకాలంలో చెల్లించలేదట. తీరా చూస్తే అదంతా కలిపి 728 కోట్లేనని ఆ మీడియాలోనే తెలిపారు. పైగా అది కూడా గత ఆగస్టునుంచే ఉన్న బకాయి. నిజానికి ఏ ప్రభుత్వంలో అయినా పారిశ్రామిక ఇన్సెంటివ్లు ఒకసారిగా చెల్లింపులు జరగవు. క్రమేపీ విడతల వారీగా ఇస్తుంటారు. గతంలో నాలుగైదేళ్ల పాటు కూడా పరిశ్రమలకు బకాయిలు చెల్లించని ఘట్టాలు చాలానే ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో ఈ బకాయిలు ఎలా ఉన్నాయో మాత్రం ఈ మీడియా రాయలేదు. అప్పుడంతా బకాయి లేకుండా చెల్లించారా?. టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 3400 కోట్ల రూపాయల బకాయి ఉందట. ఆ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు చెల్లించవలసిన సుమారు వెయ్యి కోట్ల రూపాయల పైగా బకాయిలను జగన్ ప్రభుత్వం చెల్లించిందన్న సంగతి ఈనాడు మీడియాకు తెలియదా! ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఆంద్రకు రావాలని అనుకుంటే,వారిని చెడగట్టడానికి గాను ఇక్కడ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం సరిగా చెల్లించడం లేదన్న సంకేతం ఇవ్వడానికి, ఇలా దురుద్దేశపూరితంగా కథనం రాసిన సంగతి అర్దం అవుతూనే ఉంది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈనాడు వారు ఇలాంటి దిక్కుమాలిన కథనాలు ఎన్ని వండి వార్చారో! కియా పరిశ్రమ వెళ్లిపోతోందని తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలు విపరీత ప్రచారం చేశాయి. కాని ఆ సంస్థ వారు అదనంగా 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడాతమని ప్రకటించారు. ఏపీకి ఎన్నడూ రాని ఆదిత్య బిర్లా వచ్చి పరిశ్రమలు పెడుతున్నారు. అయినా ఇక్కడకు పరిశ్రమలు రావడం లేదని దుష్ప్రచారం చేస్తుంటారు. విశాఖలో ఎల్జి పాలిమర్స్ సంస్థ నుంచి గ్యాస్ వెలువడడంతో పదమూడు మంది మరణించారు. ఆ సంస్థ తిరిగి తెరవడానికి వీలు లేదని టీడీపీ, ఎల్లో మీడియా వాదించాయి. అదే చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎంపికి చెందిన సంస్థలో పొల్యూషన్ సమస్య సృష్టిస్తుంటే, వారికి నోటీసు ఇవ్వగానే నానా యాగి చేశాయి. ఇదే ఎంపీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటిస్తే, ఇంకే ముంది ఏపీకి రానివ్వడం లేదని అన్నారు. తదుపరి ఆయనే ఏపీలో కూడా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటిస్తే ఈ మీడియా నోరుమూసుకుంది. కాకినాడ వద్ద ఫార్మా హబ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపితే, అది వద్దని టీడీపీ ఏకంగా లేఖ రాస్తే, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా తందాన అంటూ వంతపాడాయి. గతంలో శ్రీసిటీకి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూమి సేకరిస్తుంటే, రాష్ట్రంలో పారిశ్రామక సెజ్ లకు ఏర్పాట్లు చేస్తుంటే ఈనాడు రామోజీరావు దానిని వ్యతిరేకిస్తూ ఏకంగా సంపాదకీయం రాశారు. అదంతా ప్రజా వంచనగా వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016 లో ఒక వార్త రాస్తూ అదంతా భాగ్యసీమ అయిపోయిందని రాసింది. అసలు ఆ పారిశ్రామికవాడ రావడానికి కృషి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మాత్రం ప్రస్తావించకుండా జాగ్రత్తపడింది. అదే పద్దతిలో ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకువస్తుంటే వ్యతిరేక కథనాలు రాయడానిక నానా పాట్లు పడుతోంది. నెల్లూరు జిల్లా రాపూరు వద్ద సోలార్ ప్రాజెక్టుల కోసం పారిశ్రామికవాడను ఏర్పాటు చేస్తుంటే దానిని ఫలానా వారికి ఇస్తున్నారు.. అది ముఖ్యమంత్రి జగన్ సన్నిహితులది అంటూ దిక్కుమాలిన రాతలకు పాల్పడింది. అంతే తప్ప ఆ పారిశ్రామికవాడ వస్తే వేలాది మందికి ప్రయోజనం కలుగుతుందని మాత్రం రాయడానికి వారికి మనసు ఒప్పలేదు. తెలంగాణకు గత ఏడాదికాలంలో సుమారు రెండువేల కోట్ల పెట్టుబడులే వచ్చినా, చాలా గొప్పగా వచ్చాయని, అదే ఏపీకి సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చినా, ఏమీ రాలేదని ఉన్నవిలేనట్లు, లేనివి ఉన్నట్లు ఈనాడు ప్రచారం చేయడం దుర్మార్గంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ ఒన్ స్థానంలో ఉన్నా, వీరు మాత్రం గుర్తించరు. ఇలాంటి దుష్టచతుష్టయాన్ని ఎదుర్కుంటూ జగన్ ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చాలా కృషి చేయవలసి వస్తోంది. చంద్రబాబు టైమ్లో విశాఖలో సదస్సులు పెట్టి దారిపోయేవారితో ఒప్పందాలు చేసుకున్నా, ఆహా, ఓహో అంటూ వీరే ఊదరగొట్టారు. వాటిలో పదో వంతు కూడా వాస్తవరూపం దాల్చకపోయినా, ఎన్నడూ వీరు ఆ విషయాలను ప్రజలకు చెప్పలేదు. మాల్ ఏర్పాటుకు విశాఖలో అత్యంత విలువైన స్థలాన్ని లూలూ అనే కంపెనీకి కేటాయిస్తే, వారు ఏళ్ల తరబడి దానిని నిర్మించలేదు. ఈ ప్రభుత్వం ఆ స్తలాన్ని వెనక్కి తీసుకుని వేరే అవసరాలకు కేటాయిస్తే తప్పు పడుతుంది. అమరావతి పేరుతో ఉన్న పల్లెల్లలో బిఆర్ షెట్టి అనే ఆయనకు వంద ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఆస్పత్రి తదితర నిర్మాణాలు చేస్తారని తెలిపింది. కాని అలాంటివి ఏమీ చేయకపోయినా ఆ ప్రభుత్వ పట్టించుకోలేదు.పైగా బిఆర్ షెట్టిపై దుబాయిలో కేసులు వచ్చాయన్న సంగతి ఆ తర్వాత వార్తలలో వచ్చింది. అప్పట్లో బోగస్ కంపెనీలతో హడావుడి చేస్తే, ఇప్పుడు నిజమైన కంపెనీలు వస్తుంటేనే ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. జిందాల్ స్టీల్స్ జమ్మలమడుగులో 8800 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అంతా సిద్దం అయ్యాకే అక్కడ జగన్ శంకుస్థాపనకు వెళ్లారు. అయినా ఒక్కోసారి కొన్ని పరిశ్రమలు అనుకున్నట్లు రావచ్చు. రాకపోవచ్చు. అది ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతుంటుంది. కాని టీడీపీ ప్రభుత్వంలో అలాంటివాటిని కప్పిపుచ్చి, ఈ ప్రభుత్వంలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చిలవలు, పలవులు చేసి వార్తలు ఇవ్వడం ఈనాడుకు రివాజుగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని గతంలో చంద్రబాబును కలిస్తే గొప్ప విషయంగా ప్రాజెక్టు చేశారు. అదే జగన్ను కలిస్తే రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని దుర్మార్గపు రాతలకు టీడీపీ మీడియా పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. వచ్చే పరిశ్రమలను ఏదో రకంగా అడ్డుకుని, మళ్లీ ఆ నెపాన్ని ప్రభుత్వంపైనే నెట్టే ప్రమాదం ఉంది. చదవండి: రామోజీ తప్పు చేస్తే ఉద్యోగులు బలిపశువులా? ఏ మీడియా అయినా ప్రభుత్వంలోని లోటుపాట్లు రాయడం తప్పుకాదు. కాని నిర్మాణాత్మక విధానంలో కాకుండా, రాష్ట్ర అభివృద్దిని ఎలా చెడగొట్టాలన్న ధ్యేయంతో ఈ మీడియా పనిచేస్తోంది. సరిగ్గా విశాఖ సమ్మిట్కు ముందు ఇలాంటి దారుణమైన కథనాలు రాయడం ఆరంభించారంటేనే వారి దుష్ట తలంపు తెలుస్తూనే ఉంది. పరిశ్రమల మంత్రి అమరనాథ్ మీడియా సమావేశంలో చెప్పిన వాటికి తన పైత్యం జోడించి మళ్లీ రాశారు. అందుకే ఈనాడు, తదితర టీడీపీ మీడియా అంతా ఇప్పుడు ఏపీ పాలిట విలన్గా మారాయని ఒకటికి పదిసార్లు చెప్పవలసి వస్తోంది. చివరిగా ఒక మాట!. ఆంగ్ల దినపత్రిక అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని ప్రముఖంగా రాస్తే, ఏపీలో పుట్టి పెరిగిన తెలుగు దినపత్రిక అయిన ఈనాడు ఆ పెట్టుబడులు రాకుండా ఎలా చేయాలా అన్న యావతో కథనాలు ఇస్తోంది. దీనినే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమని అంటారు. -హితైషి -
Fact Check: అది రోత రాతల వంటకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై పనిగట్టుకుని ఈనాడు వండి వారుస్తున్న అసత్య కథనాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. తాజాగా.. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థల డైట్ చార్జీలపై ఆ పత్రిక వండిన రాతల వంటకం రోత పుట్టించేలా ఉంది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించే ఆ క్షుద్ర పత్రిక ‘మాటల వంటకమే’ అంటూ అవాస్తవాలతో ఒక కథనాన్ని అచ్చోసింది. నిజానికి.. ఆ వసతి గృహాలపై చంద్రబాబు సవతి ప్రేమ గత పరిస్థితిని గమనించిన వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పైగా బోలెడు బకాయిలు తన హయాంలో చెల్లించలేదు. నిజానికి.. ఈ డైట్ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఇవి ఆమోదించే దశలో ఉండగా ఈనాడు ఈ వాస్తవాలన్నింటినీ మరుగునపరిచి ఉద్దేశపూర్వకంగా, ఎప్పటిలాగే తన కడుపుమంటను తీర్చుకుంది. దీనిని ఖండిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె. హర్షవర్థన్ శుక్రవారం వాస్తవాలు వెల్లడించారు. అవి ఏమిటంటే.. ►2012లో ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు పెంచారు. ►2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు 2018 వరకు వాటిని పెంచాలనే ఆలోచన చేయలేదు. ►కానీ, 2019లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2018 జూలై నుంచి పెంచింది. అంటే.. ఈ చార్జీలు పెంచింది కేవలం ఎనిమిది నెలలు మాత్రమే. పైగా ఇందుకు అవసరమైన బడ్జెట్ను విడుదల చేయలేదు. ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ►2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. బాబు మిగిల్చిన బకాయిల మొత్తం రూ.132 కోట్లను క్లియర్ చేసింది. ►ఆ తర్వాత డైట్ ఛార్జీలు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని 2022 ఆగస్టులో సీఎం జగన్ అధికారులను ఆదేశించగా వారు పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. ► దీని ద్వారా 5.92 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే, డైట్ ఛార్జీల కోసం రూ.755 కోట్లు బడ్జెట్ కేటాయించారు. తాజా పెంపు ప్రతిపాదనలతో ప్రభుత్వంపై అదనపు ఆరి్థక భారం రూ.110 కోట్లకు పైగానే ఉంటుంది. ఆరి్థకపరమైన భారంతో కూడుకున్న ఈ అంశంపై ఆయా విభాగాల వివరణాత్మక పరిశీలన, సంప్రదింపులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆ ఫైలు ఆమోదించే దశలో ఉంది. ►ఇవేకాక.. నాడు–నేడు కింద రాష్ట్రంలో వివిధ రకాల 3,013 సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థలను మూడు దశల్లో రూ.3,300 కోట్ల అంచనాతో అభివృద్ధి చేసేందుకు చేసిన ప్రతిపాదనలు ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి. ►ఇందులో ప్రధానంగా టాయిలెట్లలో నీటి సరఫరా, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ఎల్ఈడీ లైట్లు, మంచినీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, వంటగది ఆధునీకరణ, ప్రహారీ గోడలు, దోమల మ్యాట్లు, స్మార్ట్ టీవీ, క్రీడా సామగ్రి, లైబ్రరీ పుస్తకాలు, డ్రైనేజీ వ్యర్థ జలాలను సురక్షితంగా పారవేయడంతో పాటు పరిసరాల సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ►ఈ సమయంలో డైట్ ఛార్జీల పెంపుదల ఫైల్ క్లియరెన్స్ అవకాశం ఉందనే విషయాన్ని మరుగున పరిచి ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం సరికాదు. బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో బురదజల్లే రాతలు రాయడం దుర్మార్గం. -
బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ?
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులు, పెండింగ్ బిల్లులు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులపై ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలను ప్రచురిస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మండిపడ్డారు. నిపుణుల పేరుతో అంతులేని అబద్ధాలు అచ్చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరా నిపుణులు? పేర్లు వెల్లడించే ధైర్యం ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ లెక్కలను గణాంకాల సహితంగా వెల్లడిస్తోందని, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నివేదికలే ఇందుకు సాక్ష్యమని గుర్తు చేశారు. లేని అప్పులు, పెండింగ్ బిల్లులు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు ఉన్నట్లు తప్పుడు గణాంకాలు ఎలా ప్రచురిస్తారని నిలదీశారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో స్పష్టంగా చెప్పినప్పటికీ రూ. 9.16 లక్షల కోట్లు అంటూ ఏ గణాంకాలు, ఆధారాలు ప్రకారం ఈనాడు కథనాలను ప్రచురించింది? వాటిని పట్టుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారు? బడ్జెట్ లోపల అప్పులతో పాటు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన కార్పొరేషన్ అప్పుల గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజెంటేషన్తో సవివరంగా తెలియచేసినా ఈనాడు ఊహాగానాలతో, నిపుణులు అంచనాల పేరుతో అవాస్తవ కథనాలను ఎలా ప్రచురిస్తుంది? రాష్ట్ర అప్పులకు సంబంధించి ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా అవే తప్పుడు వార్తలను పథకం ప్రకారం పదేపదే ప్రచారం చేస్తోంది. ♦ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు రెట్టింపు అయ్యాయంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పులు రెట్టింపు అయినట్లుగా ఇప్పుడు అందుకు ఏమాత్రం ఆస్కారం లేదు. రాష్ట్ర అప్పులపై టీడీపీ ఎంపీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరి్థక శాఖ ‘‘స్టేట్ ఫైనాన్సెస్– ఏ స్టడీ ఆఫ్ స్టేట్ బడ్జెట్’’ అర్బీఐ నివేదికతో స్పష్టమైన సమాధానం ఇవ్వడంతో తట్టుకోలేక దు్రష్పచారానికి పాల్పడుతున్నారు. ♦ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో అప్పులు 62.78 శాతం మాత్రమే పెరిగాయి. అప్పులు రెట్టింపు కావాలంటే ఒక్క 2023–24లోనే రూ.1,01,150 కోట్ల మేర అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 7.5 శాతానికి సమానం. కేంద్ర నిబంధనల ప్రకారం జీఎస్డీపీలో 3.5 శాతానికి మించి అప్పులు చేయడానికి వీలుండదు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత సర్కారు పాలనలో మాదిరిగా అప్పులు రెట్టింపు అయ్యేందుకు ఆస్కారమే లేదు. ♦చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇప్పటి మాదిరిగా ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయకున్నా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు లేనప్పటికీ అప్పులు మాత్రం రెట్టింపు అయ్యాయి. కోవిడ్తో ఆరి్థక ఇబ్బందులు ఎదురైనా సమర్థంగా అధిగమించి సీఎం జగన్ ప్రభుత్వం రూ.1.92 లక్షల కోట్లను పేదలకు నేరుగా పారదర్శకంగా అందించి ఆదుకుంది. ♦విభజన తర్వాత 2014 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1,13,797 కోట్లు ఉండగా చంద్రబాబు దిగిపోయే నాటికి 2019 మే నాటికి రూ.2,71,797.56 కోట్లకు ఎగబాకాయి. టీడీపీ పాలనలో అప్పులు ఏకంగా 138.84 శాతం అంటే 2.38 రెట్లు పెరిగాయి. సగటున ఏటా అప్పుల్లో 19.02 శాతం వృద్ధి నమోదైంది. ♦వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2,71,797.56 కోట్లుగా ఉన్న అప్పులు 2022 – 23 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరుకున్నాయి. నాలుగేళ్లలో అప్పుల్లో 62.78 శాతం వృద్ధి నమోదైంది. అంటే సగటున 13.55 శాతమే. ఇది టీడీపీ సర్కారు సగటు 19.02 శాతంతో పోలిస్తే తక్కువే. ♦గత సర్కారు ఎన్నికలకు ముందు రెండు నెలల్లో ఓట్ల కోసం భారీగా అప్పులు చేసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా 2019 ఏప్రిల్ 9న ఒకే రోజు రూ.5,000 కోట్లు అప్పులు చేసింది. నాడు నోరు మెదపని టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు నిబంధనల ప్రకారం అప్పులు తీసుకుంటున్నా ఏదో ఘోరం జరిగిపోతున్నట్లు విషం చిమ్ముతున్నాయి. వీటిని పట్టుకుని విషయంపై అవగాహన లేని పవన్కళ్యాణ్ లాంటి వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ♦వాస్తవానికి టీడీపీ సర్కారు నిబంధనలకు మించి ఐదేళ్లలో రూ.48,128.70 కోట్లు ఎక్కువ అప్పులు చేసింది. దీనిపై ఈనాడు కలం కదల్లేదు ఎందుకో మరి? ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలో నిబంధనలకు లోబడి రూ.2,696.76 కోట్లు తక్కువ అప్పులు చేసినా, ఇంత మెరుగ్గా ద్రవ్య నిర్వహణ చేస్తున్నా ప్రశంసించకపోగా బురద చల్లడం ఏమిటి? ♦పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.1.85 లక్షల కోట్లు ఉన్నట్లు ఈనాడు పచ్చి అబద్ధాలను ప్రచురించింది. వీటికి ఆధారాలున్నాయా? మొత్తం పెండింగ్ బిల్లుల వివరాలను వెల్లడించే ధైర్యం ఉందా? పెండింగ్ బిల్లులపై గత ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన అసెంబ్లీ వేదికగా ఆరి్థక మంత్రి స్పష్టంగా చెప్పారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే సరికి పెండింగ్ బిల్లులు రూ.40,172 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.21,673 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రకటించారు. గత సర్కారు పెండింగ్ బిల్లుల గురించి ఒక్క ముక్క రాయకుండా తప్పుడు వార్తలు ఎందుకు? ఇదేనా ఈనాడు పాటించే జర్నలిజం, మీడియా విలువలు? ♦ రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు రాష్ట్ర అప్పులు ఎలా అవుతాయి? నాన్ గ్యారెంటీ రుణాలు రూ.87,233 కోట్లు అంటూ ఈనాడు ప్రచురించిన కథనం అవాస్తవం. ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు చేసే రుణాలు ప్రభుత్వ అప్పుల కిందకు రావు. ఆమాత్రం కనీస అవగాహన లేకుండా కథనాలు ప్రచురించారు. ఉదాహరణకు ఎన్టీపీసీ తీసుకునే రుణాలు కేంద్ర ప్రభుత్వ అప్పుల కిందకు రావు. టీటీపీ హయాంలో ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లు రూ.55,108.94 కోట్లు నాన్ గ్యారెంటీ రుణాలు తీసుకుంటే వాటి గురించి ఈనాడు ఎప్పుడైనా రాసిందా? నాన్ గ్యారెంటీ రుణాలను కేంద్రం అప్పులుగా ఎప్పుడైనా చూపించిందా? ♦ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పుల్లో ఎక్కడా దాపరికం లేకుండా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) ప్రకారం అసెంబ్లీకి వెల్లడించాం. 2021 డిసెంబర్ 31 నాటికి పూచీకత్తు రుణాలు రూ.1.17,730 కోట్లు ఉన్నట్లు అసెంబ్లీకి వెల్లడించాం. 2022లో మరికొన్ని గ్యారెంటీ రుణాలు పెరిగినా రూ.1.27 లక్షల కోట్లకు మించదు. అలాంటిది రూ.1.78 లక్షల కోట్లు ఉన్నట్లు ఈనాడు ఏ ఆధారాలతో రాసింది? ♦ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకే గ్యారెంటీ రుణాలున్నాయి. ఆర్బీఐ, 15వ ఆర్థిక సంఘం నిర్థారించిన మేరకే రాష్ట్ర అప్పులున్నాయి. కంపెనీల యాక్ట్ కింద ఆడిట్ లేకుండా లెక్కలను ఎవరైనా రిలీజ్ చేస్తారా? ఆడిట్ పూర్తయ్యాక వాటిని వెల్లడిస్తారు. ఈలోగా తమ ఇష్టానుసారంగా లెక్కలు గట్టి రాసుకుంటామనే ధోరణిలో టీడీపీ అనుకూల మీడియా వ్యవహరిస్తోంది. ♦నిపుణుల అంచనాల పేరుతో వాస్తవాలను వక్రీకరించి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. నా బ్యాంకు ఖాతాల్లో ఎన్ని డబ్బులున్నాయో నిపుణులకు ఎలా తెలుస్తుంది? ఊహాగానాలతో, ఇష్టం వచి్చన అంకెలతో తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు?
చంద్రబాబు నాయుడు ఏం చేసినా... అది బంగారు బాటే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో తనకెవ్వరూ సాటిలేరని పదేపదే నిరూపిస్తున్నా... ఆయన మాటలన్నీ నీటిమూటలే. వయసు మీదపడుతున్న కొద్దీ రామోజీరావులోని ఈ దృష్టిలోపం మరింత తీవ్రమవుతోంది. ఎందుకంటే 2016, సెపె్టంబరు 2న అనంతపురం జిల్లాలో అప్పటి సీఎం చంద్రబాబు కరవుపై యుద్ధానికి వెళ్లారు. అది కూడా ‘రెయిన్గన్’లతో!!. ఈ పిట్టలదొర విన్యాసానికి పరవశించిపోయారు రామోజీరావు. ‘ఈనాడు’లో కరువుపై యుద్ధమంటూ పతాక శీర్షికల్లో అచ్చేశారు. ఒక్క చుక్క వర్షం పడకపోయినా... దుర్భిక్ష రాయలసీమ సస్యశ్యా మలమైపోయినట్లు కథనాలు వండి వార్చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక గడిచిన మూడున్నరేళ్లుగా ఏటా హంద్రీ–నీవా సామర్థ్యం కంటే ఎక్కువగా కృష్ణా జలాలను తరలిస్తున్నారు. ప్రధాన కాలువ, ఉప కాలువల ద్వారా వేలాది చెరువులను నింపుతున్నారు. భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయి. బోరు బావులతో పాటు చెరువులు, హంద్రీ–నీవా ప్రధాన కాలువలు, ఉప కాలువల కింద లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. డిస్ట్రిబ్యూటరీలను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేస్తూ ఆయకట్టుకు నీళ్లందించేలా అడుగులేస్తున్నారు. దీంతో రాయలసీమ పచ్చగా కళకళలాడుతోంది. ఇక చంద్రబాబుకు పుట్టగతులుండవనే భయం రామోజీలో అంతకంతకూ పెరుగుతోంది. ‘ఈనాడు’లో దు్రష్పచారపు రాతలూ పెరుగుతున్నాయి. ఆ కోవలోనిదే... శుక్రవారం నాటి ‘జగనన్న మాట.. నీటి మూట’ కథనం. మరి దీన్లో నిజానిజాలేంటి? ఒకసారి చూద్దాం... బహుశా! ఒకే ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసిందెవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చాక... 1996 లోక్సభ ఎన్నికలకు ముందు 40 టీఎంసీల సామర్థ్యంతోనూ హంద్రీ–నీవాకు శంకుస్థాపన చేశారు చంద్రబాబు. 1999 ఎన్నికలకు ముందు దాని సామర్థ్యాన్ని 35 టీఎంసీలకు తగ్గించి మరోసారి కూడా శంకుస్థాపన చేశారు. రెండు సార్లు శంకుస్థాపన చేసినా... 1995 నుంచి 2004 మధ్య హంద్రీ–నీవా కోసం ఖర్చుపెట్టింది మాత్రం కేవలం రూ.13.57 కోట్లు. అది కూడా ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల నిర్వహణ కోసమే తప్ప ప్రాజెక్టు కోసం కాదు. అది బాబు ఘనతయితే... ఈ నిర్వాకాన్ని ఆ తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా ప్రశ్నించకపోవటం రామోజీరావు ఘనత. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి.. ఉమ్మడి కర్నూల్, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 40 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా 2004లో హంద్రీ–నీవాను చేపట్టారు. 2009 నాటికల్లా హంద్రీ–నీవా తొలి దశను పూర్తి చేయటంతో పాటు... రెండో దశ పనులనూ సింహభాగం పూర్తి చేశారు. కానీ వైఎస్సార్ ఆకస్మిక మరణం తరవాత... టీడీపీ మద్దతుతో కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వం హంద్రీ–నీవా పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి అటకెక్కించేసింది. జీవో 22, జీవో 63లతో చంద్రబాబు దోపిడీ.. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా అదనపు బిల్లులు చెల్లించడం) తెచి్చ, వాటి ద్వారా హంద్రీ–నీవా అంచనా వ్యయాన్ని రూ.6,850 కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు పెంచేశారు. అంతేకాక 60–సీ కింద పాత కాంట్రాక్టర్లను తప్పించి, అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. భారీ ఎత్తున ఖజానాను దోచేశారు. హంద్రీ–నీవా ద్వారా అరకొరగా నీళ్లను తరలించి.. అరకొరగా పంపిణీ చేసి సీమ ప్రజల మధ్య జలయుద్ధాలు సృష్టించారు. చివరకు హంద్రీ– నీవాలో అంతర్భాగమైన కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను కూడా రూ.477 కోట్ల అంచనాతో ప్రారంభించి.. ఆ తర్వాత వ్యయాన్ని రూ.622 కోట్లకు పెంచేశారు. చివరకు పనులు చేయకుండానే... అస్మదీయ కాంట్రాక్టర్తో కలిసి సులువైన మట్టి పనులు చేసి, కమీషన్లు వసూలు చేసుకుని చేతులు దులిపేసుకున్నారు చంద్రబాబు. హంద్రీ–నీవా జలాలు అందక... వర్షాలు కురవక రాయలసీమ.. అందులోనూ అనంతపురం జిల్లా కరవుతో తల్లడిల్లుతుంటే 2016, సెపె్టంబరు 2న కరవుపై యుద్ధం... అంటూ ట్యాంకర్లతో నీటిని తెప్పించారు చంద్రబాబు నాయుడు. పిట్టలదొరలా రెయిన్ గన్లు చేతబట్టి.. నాలుగు బొట్లు విదిల్చి... కరవును జయించేసినట్లు ప్రకటించారు. రైతులకు ఏమాత్రం పనికిరాని ఈ రెయిన్ గన్ల నిర్వహణ పేరుతో రూ.105 కోట్లను కాజేశారు. అదీ రామోజీరావు తెగ మెచ్చుకున్న బాబుగారి బాగోతం!!. కృష్ణా జలాలను గరిష్ఠంగా తరలిస్తూ.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక హంద్రీ–నీవా సామర్థ్యమైన 40 టీఎంసీల కంటే ఏటా అధికంగా కృష్ణా జలాలను తరలిస్తున్నారు. ప్రధాన కాలువ, ఉప కాలువల ద్వారా వేల చెరువులను నింపుతూ.. వాటి కింద లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తున్నారు. చెరువుల్లో నీటి నిల్వ వల్ల భూగర్భ జలాలు గరిష్ఠ స్థాయికి చేరాయి. 2019, మే నాటికి రాయలసీమ జిల్లాల్లో సగటున భూగర్భ జలమట్టం 26 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం కేవలం 4.8 అడుగుల్లోనే భూగర్భ జలాలు పుష్కలంగా దొరుకుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనివల్లే బోరు బావుల కింద రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రధాన కాలువ, ఉప కాలువల కింద కూడా భారీగా సాగు చేస్తూ... ఉద్యానవన పంటల సాగులో రాయలసీమను అగ్రగామిగా మార్చారు. సత్యసాయి, అనంతపురం జిల్లాలు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా అవతరించాయంటే దానివెనక ఈ ప్రభుత్వం చేసిన కృషిని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఈనాడు’కు ఈ చర్యలు కనపడవా..? ► దుర్భిక్ష రాయల సీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సత్యసాయి జిల్లాలో పేరూరు (అప్పర్ పెన్నార్) ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ 2020లోనే హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలతో నింపారు. అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్టును హంద్రీ–నీవా జలాలతో నింపే పనులను వేగవంతం చేశారు. ► ధర్మవరం నియోజకవర్గంలో 2.18 టీఎంసీల సామర్థ్యంతో జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మాణ పనులను సీఎం జగన్ చేపట్టారు. ఈ రిజర్వాయర్ కింద 23 వేల ఎకరాలకు నీళ్లందించనున్నారు. ► సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో హంద్రీ–నీవా ద్వారా 3 టీఎంసీలు తరలించి.. 195 చెరువులను నింపి, 10,834 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం, 2.43 లక్షల మంది దాహార్తి తీర్చే పనులు సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. ► మడకశిర నియోజకవర్గానికి నీళ్లందించేందుకు హంద్రీ–నీవా రెండో దశలో మడకశిర బైపాస్ కెనాల్ పనులను చేపట్టారు. ► కర్నూల్ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని 9 దుర్భిక్ష మండలాల్లో 10,130 ఎకరాలకు నీళ్లందించేందుకు హంద్రీ–నీవా నుంచి 1.238 టీఎంసీలను ఎత్తిపోసే పథకం పనులను రూ.180.67 కోట్లను ఖర్చు చేసి, దాదాపుగా పూర్తి చేశారు. ► హంద్రీ–నీవా.. గాలేరు–నగరి అనుసంధానం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసే పనులను సీఎం వైఎస్ జగన్ చేపడితే.. టీడీపీ నేతలతో ఎన్జీటీలో కేసులు వేయించి, సైంధవుడిలా అడ్డుపడే దుస్సాహసానికి చంద్రబాబు ఒడిగట్టారు. విచిత్రమేంటంటే ఈ దౌర్భాగ్యపు పనులను ‘ఈనాడు’ ఏనాడూ ప్రస్తావించదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని చెప్పదు. ► టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీనే గెలిపిస్తూ వచ్చిన హిందూపురం నియోజకవర్గ ప్రజల దాహార్తిని సైతం చంద్రబాబు తీర్చలేదు. ఆ నియోజకవర్గ ప్రజల దాహార్తిని మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీర్చితే. చంద్రబాబు చేతులెత్తేసిన హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను జూన్కు పూర్తి చేసి ఆ నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించి.. సస్యశ్యామలం చేసే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. -
Fact Check: ఎస్సీ, ఎస్టీలకు నిజంగా మేలు చేసిందెవరు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధిపరంగా నిజంగా మేలు చేసిందెవరు? అని ఆ వర్గాల వారిని ఎవరైనా ప్రశ్నిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఠక్కున సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో జరగని మేలు జగన్ నేతృత్వంలో మూడున్నరేళ్లలో అంతకుమించి జరిగిందన్నది జగమెరిగిన సత్యం. అప్పట్లో బాబు కేటాయించిన నిధులు.. నేడు సీఎం జగన్ ఖర్చుచేస్తున్న మొత్తం గణాంకాలను గమనిస్తే గతానికన్నా ఎంతో మేలు జరిగిందన్నది స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ, ఇవేమి పరిగణలోకి తీసుకోని ఈనాడు విషపత్రిక ఎప్పటిలాగే వాస్తవాలను వక్రీకరించింది. ఈసారి ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ (సబ్ప్లాన్)పై తన కడుపుమంటను ప్రదర్శించింది. సబ్ప్లాన్ను మరో పదేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్పై ఆ వర్గాలకు చెందిన నేతలు, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తంచేస్తుంటే రామోజీ మాత్రం ఎప్పటిలాగే తన అక్కసును వెళ్లగక్కారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘పేరుకే చట్టం.. ఎన్నేళ్లున్నా ఏం లాభం?’ అంటూ ఈనాడు మరో అభూతకల్పనను వండివార్చింది. వాస్తవానికి.. 2017–18 నుంచి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం కారణంగా బడ్జెట్లో ప్రణాళిక, ఉపప్రణాళిక అన్న పదాలేలేవు. సబ్ప్లాన్ను కాంపొనెంట్గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. దీంతో ఎస్సీ కాంపొనెంట్, ఎస్టీ కాంపొనెంట్గా కేటాయింపులు జరుగుతున్నాయి. అలాగే, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, వారి కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తోంది. బాబు చేస్తే ఒప్పు.. జగన్ చేస్తే తప్పు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏ రకంగా చూసినా ఎస్సీ, ఎస్టీలు గత మూడున్నరేళ్లుగా అత్యధిక లబ్ధిపొందరానేది సుస్పష్టం. అర్హతే ప్రామాణికంగా అత్యంత పారదర్శకంగా పథకాలను అమలుచేస్తోంది. వివిధ సామాజిక పెన్షన్ల కోసం ఎస్సీ, ఎస్టీలకు చేస్తున్న ఖర్చును ఉప ప్రణాళికలో చూపించడాన్ని తప్పు అంటూ ‘ఈనాడు’ గుండెలు బాదుకుంది. కానీ, నిజమేమిటంటే.. 2019 జూన్కు ముందున్న టీడీపీ ప్రభుత్వం కూడా సామాజిక పెన్షన్లు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు, మధ్యాహ్న భోజనం కోసం చేసిన ఖర్చులన్నింటినీ ఎస్సీ, ఎస్టీల ఉపప్రణాళికలో ఒక భాగంగానే చూపించిన విషయాన్ని పాపం వృద్ధ రామోజీకి గుర్తున్నట్లులేదు. అంతేకాదు.. మా ఇంటిమహాలక్ష్మి, పిల్లలకు–తల్లులకు ఇచ్చే పౌష్టికాహారం, అన్న అమృతహస్తం, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్ సుజలస్రవంతి, డ్వాక్రా మహిళలకు ఇచ్చే శానిటరీ నాప్కిన్స్, చంద్రన్న రైతు క్షేత్రాలు, పొలంబడి, జవహర్ నాలెడ్జ్ సెంటర్ మెంటార్లకు ఇచ్చే గౌరవ వేతనాలు సైతం గత ప్రభుత్వం సబ్ప్లాన్లో భాగంగానే చూపిన విషయం మర్చిపోతే ఎలా రామోజీ.. అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు అంటే ఎలా? మూడున్నరేళ్లలోనే ఐదేళ్లకు మించిన మేలు ఇక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును గమనిస్తే చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో కేటాయించిన నిధులకు మించి ఈ మూడున్నరేళ్లలోనే జరిగిందన్నది గణాంకాలే చెబుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వీరికోసం చేసిన ఖర్చు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గత ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు ఎస్సీ ఉపప్రణాళిక కోసం రూ.33,625.49 కోట్లు కేటాయిస్తే... ప్రస్తుత ప్రభుత్వం 2019–20 నుంచి 2022 డిసెంబర్ వరకు మూడున్నరేళ్లలో రికార్డు స్థాయిలో రూ.48,899.66 కోట్లు ఖర్చుచేసింది. అంటే.. టీడీపీ కేటాయించిన మొత్తానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే ఏకంగా రూ.15,274.17 కోట్లు అదనంగా కేటాయించింది. ఇక ఎస్టీల కోసం చేసిన ఖర్చుచూస్తే.. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12,487.48కోట్లు ఖర్చుచేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.15,589.38 కోట్లు వెచి్చంచింది. ఇవేమి పరిశీలించకుండానే రామోజీ మనసు 20 శాతం నిధులు కోత అంటూ తెగ బాధపడిపోయింది. ఎస్సీలకు లబ్ధిలో మనమే నెంబర్–1 ►ఎస్సీ కాంపొనెంట్ అమలులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ►దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఏపీలోనే 35.92లక్షల మందికి లబ్ధిచేకూరింది. ►అలాగే, ఎస్సీ కాంపొనెంట్ ద్వారా కొత్తగా దేశంలో 12.41 లక్షల స్వయం సంఘాలు ఏర్పాటుచేస్తే ఒక్క ఏపీలోనే ఏకంగా 8.54 లక్షల సంఘాలు ఏర్పాటయ్యాయి. ►ఇది మనం చెబుతున్నది కాదు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టంచేసింది రామోజీ.. గిరి బిడ్డలపైనా ప్రత్యేక శ్రద్ధ.. ►మరోవైపు.. ఎస్టీ సబ్ప్లాన్ను కూడా వైఎస్సార్సీపీ సర్కారు పటిష్టంగా అమలుచేస్తూ గిరిజనులపైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ►రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనలో గిరిజనులకు రెండు జిల్లాలు కేటాయించి అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం జిల్లాలను ఏర్పాటుచేసింది. ►ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం మొత్తం 4.49 లక్షల ఎకరాల భూమిని 2.22 లక్షల మంది ఎస్టీ రైతులకు అందించింది. ►దీంతోపాటు 39,272 ఎకరాల డీకేటీ భూమిని 26,287 మంది ఎస్టీ పేద రైతులకు పంపిణీ చేశారు. ►అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి కనీసం రెండెకరాల భూమి ఉండేలా చూడాలని భావించిన సీఎం జగన్ ఆ దిశగా విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ►ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఒక్కటిగా ఉంటే ఇబ్బందని భావించి షెడ్యూల్డ్ తెగల కోసం ప్రత్యేక రాష్ట్ర కమిషన్ను ఏర్పాటుచేసింది. ►ఏఎస్ఆర్ జిల్లా పాడేరులో గిరిజన వైద్య కళాశాలను రూ.500 కోట్లతో మంజూరు చేసి సీఎం ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ►పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం వద్ద రూ.153.85 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కళాశాలకూ శంకుస్థాపన చేశారు. -
ఎందుకీ వెకిలి రాతలు.. ‘ఈనాడు’ ఎవరి కోసం పనిచేస్తోంది?
ఈనాడు దినపత్రిక తన అక్షరాన్ని తెలుగుదేశం పార్టీకి అమ్ముకోవడమో, లేక తాకట్టు పెట్టినట్లో చేసేసినట్టుగా ఉంది. గతంలో విలువలు అంటూ పెద్ద,పెద్ద లెక్చర్లు ఇచ్చిన ఈనాడు అధినేత రామోజీరావు వలువలు వదిలేసి విలువలను మూసినదిలో కలిపేస్తున్నారన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది. రోడ్ షో లు, నడి రోడ్డుపై బహిరంగ సభల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ పై ఈనాడు పత్రికలో వచ్చిన తుగ్లక్ పాలన సంపాదకీయం చదివితే ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. ఈ జీవో పై అభ్యంతరం ఉంటే సంపాదకీయం రాయవచ్చు. తప్పుకాదు. రాసిన తీరు చూస్తే, అక్షరక్షంలో విద్వేషం, విషం తప్ప మరొకటి కనిపించదు. ఇలా రోత రాతలను కూడా సంపాదకీయం అని చెప్పుకుంటోందన్నమాట. తేలుకు పెత్తనమిస్తే తెల్లార్లు కుట్టి చంపిందన్న సామెతను ఈనాడు వాడింది. నిజానికి ఈ సామెత ఆ పత్రికకే వర్తిస్తుంది. తెలుగుదేశం పెత్తనం పోతే, తన పెత్తనం పోయినంతగా లబలబలాడుతూ రోజూ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన ఏడుపుగొట్టు వార్తలు రాస్తూ ఈనాడు ఆత్మవంచన చేసుకుంటోంది. జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను కాల్చుకు తింటోందట. ఏమి రాశారండి. చెత్త, చెదారం రాసి ప్రజలపై రుద్ది వేధించుకు తింటున్నది ఈనాడు మీడియానే. ఆ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించారు. పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే రాష్ట్రాన్ని కాల్చుకు తినడమట. పాలనను ప్రజల గడప వద్దకు తీసుకువెళ్లడం కాని, చివరకు వృద్దులకు పెన్షన్లు ఇళ్లకు ఇవ్వడం కాని ఇవేవీ ఈనాడుకు జీర్ణం కావడం లేదు. గతంలో వృద్దులు గంటల తరబడి మండల ఆఫీస్ల వద్ద నిలబడి నానా యాతనలు పడితే అది ఈనాడు వారికి స్వర్గంగా కనపడిందన్నమాట. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ క్లినిక్లు, స్కూళ్లలో నాడు-నేడు, ఇలా ఒకటేమీటి అనేక విప్లవాత్మక మార్పులు తెస్తే హర్షించకపోతే పోనీ, ఇలా దిక్కుమాలిన రాతలు రాస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని ప్రతిపక్షనేతగా జగన్ మొసలి కన్నీరు కార్చారని ఈనాడు ఆరోపించింది. చివరికి కనీస ఇంగితం లేకుండా ఇలాంటి సంపాదకీయం రాశారంటే ఏమనుకోవాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను నడిబజారులో అంగడి సరుకు కొన్నట్లు కొనుగోలు చేస్తే, టీడీపీ పాలన చూసి వారంతా ఎగబడి పార్టీ మారారన్నట్లుగా రాసిన ఈనాడుకు అది ప్రజాస్వామ్యం అనిపించింది. దానిపై జగన్ చేసిన విమర్శకు, ఇప్పుడు రోడ్డుపై సభలు పెట్టుకోవడంపై నిబంధనలు విధించినదానికి లింక్ పెట్టి రాశారంటే వీరు అజ్ఞానంతో రాశారా? లేక విద్వేషంతో రాశారా? పోలీసులను ఉసికొల్పుతున్నారట. రూల్స్ పాటించమని పోలీసులు చెబితే చంద్రబాబుకే కాదు.. ఈనాడుకు కోపం వస్తోంది. ఎందుకంటే మార్గదర్శి చిట్ ఫండ్స్లోని లొసుగులను ప్రభుత్వ అధికారులు ఎత్తి చూపారన్న దుగ్దతో ఈ పత్రిక ఇలా రాసిందన్న విషయం అర్దం అవుతూనే ఉంది. తాము రాజ్యాంగానికి, చట్టానికి అతీతులం అన్నట్లుగా రామోజీరావు రాతలు ఉన్నాయి. పోలీసులను అంతు చూస్తానని చంద్రబాబు బెదిరిస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించి, చట్టాన్ని గౌరవించినట్లు ఈనాడు భాష్యం చెబుతోంది. ఎంత నిస్సిగ్గుగా ఒక విషయం రాశారో చూడండి. కందుకూరు, గుంటూరు విషాద ఘటనలు పోలీసుల వైఫల్యంతో జరిగాయని అన్నారంటే ఇంతకంటే దిగజారుడు తనం ఏమి ఉంటుంది?. కందుకూరులో ఇరుకు రోడ్డులో టీడీపీ సభ పెడితే ఈనాడు కళ్లకు కనబడలేదా?. డ్రోన్లతో పెద్ద సభ జరిగినట్లు ప్రజలను మభ్య పెట్టడానికి తెలుగుదేశం చేసిన ప్రయత్నాలను ఈనాడు ఎంత దారుణంగా సమర్దించిందో చూడండి. ఇక గుంటూరులో టోకెన్లు పంచి చంద్రన్న కానుకలు ఇస్తాం రండి అని టీడీపీ సభ నడిపితే ఈనాడుకు గొప్ప విషయం అనిపించింది. ఎప్పటికప్పుడు శవరాజకీయాలకు వంత పాడుతున్నది ఈనాడు. ఎక్కడైనా ఇద్దరు ఘర్షణపడి మరణిస్తే, అది రాజకీయ ఘర్షణ కాకపోయినా, దానికి రాజకీయ రంగు పులిమి వైసీపీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ బానర్ కథనాలు ఇచ్చిన ఈనాడుకు గుంటూరులో తొక్కిసలాటలో ముగ్గురు మరణిస్తే ఏదో చిన్న వార్తగా కనిపించింది. కేవలం మొక్కుబడిగా మొదటి పేజీలో ఒక ముక్కపెట్టారు. రహదారి ప్రమాదాలలో ఎవరైనా మరణిస్తున్నారు కనుక, రోడ్లపై సభలు జరిగి జనం చస్తే మాత్రం ఏమిటనే స్థాయికి ఈనాడు పతనం అవుతుందని ఊహించలేకపోయాం. సరిగ్గా ఇది చంద్రబాబు నాయుడు మాట మాదిరే ఉంది. ఆయన గతంలో పుష్కరాలలో 29 తన సినిమా ప్రచార యావ కారణంగా మరణిస్తే, రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో మృతి చెందడం లేదా అని ప్రశ్నించారు. అప్పట్లో ఈనాడు కూడా పుష్కర మరణాలను కప్పిపుచ్చడానికి ఎన్ని తంటాలు పడింది అందరికి తెలుసు. పోలీసులు వైసీపీ పెంపుడు మనుషులుగా ఉన్నారంటూ నీచంగా రాసిన ఈనాడుకు గతంలో చంద్రబాబు టైమ్లో ప్రతిపక్ష వైసీపీకి పోలీసులు అండగా ఉన్నారా? లేక ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకున్నారా?. ఒక మండల ఎన్నికలో వైసీపీ వారిని అడ్డుకుంటున్న నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లేయత్నం చేసిన ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే ముస్తాఫాలను రోడ్డు మీదే నిలిపివేసిన సంగతి జనానికి తెలియదని అనుకుంటున్నారు. ప్రత్యేక హోదాపై ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్ విశాఖ వెళితే విమానం వద్దే నిలిపివేసిన చరిత్ర టీడీపీది కాదా? అప్పుడు పోలీసులు ఎవరి కొమ్ముకాశారు? నంద్యాల ఉప ఎన్నికలో పోలీసులు డబ్బు పంపిణీ చేసినప్పుడు, చివరికి దొంగ ఓట్లు వేయించారన్న ఆరోపణలు వచ్చినప్పుడు ఈనాడుకు పోలీసులు ప్రజలకు విధేయులుగా కనిపించారని అనుకోవాలి. సామాజిక మాధ్యమాలలో విమర్శిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారట. వారు చేస్తున్నవి విమర్శలా? రాస్తున్నవి బూతులా అన్న విషయంలో తేడా లేకుండా ఈనాడు ప్రస్తావిస్తోందంటే వారు ఎవరి కోసం పనిచేస్తున్నది అర్ధం చేసుకోవచ్చు. అమరావతి పేరుతో భ్రమరావతి సృష్టించే క్రమంలో ఆ ప్రాంతంలో ఎవరిని నిరసన చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్భంధ కాండ అమలు చేసినప్పుడు, రైతుల పంటలు తగులపెట్టినప్పుడు ఎన్నడైనా ఒక్క వార్త రాశారా? ఒక ఎడిటోరియల్ ప్రజల పక్షాన రాశారా? ఇప్పుడు మాత్రం ఉన్నవి, లేనివి రాసి జగన్పై కక్షతో బురద చల్లాలనుకునే ప్రయత్నం అందరికి కనిపిస్తూనే ఉంది. అందుకే జగన్ ఈనాడును దుష్టచతుష్టయంలో భాగంగా చేశారు. సీఎం కాన్వాయి వెళుతుంటే ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని రాసే ఈ పత్రిక, నడి రోడ్డుపై సభలు పెట్టుకోవడానికి అనుమతించాలని చెప్పడం దారుణం. చంద్రబాబు ,రామోజీరావుల ధైర్యం ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలమన్నదే. పత్రికను అడ్డు పెట్టుకుని ఏమైనా చేయగలమన్నదే వారి ధీమా! పిల్ల ఫాసిస్టు జగన్ రెడ్డి అంటూ రామోజీ రాసిన చండాలపు సంపాదకీయం చదివితే ఈనాడు నగ్నంగా బజారులో నిలబడడానికి కూడా ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అర్ధం అవుతూనే ఉంది. చదవండి: డేంజర్ గేమ్.. చంద్రబాబు ప్లాన్ అదే..? ఇదిగో రుజువులు.. మహా నియంతలే నేలమట్టం అయ్యారట జగన్కు తద్బిన్నంగా భవిష్యత్తు ఉండదట. రామోజీరావు తద్వారా ఉత్తిత్తి పిట్ట మాదిరి శాపనార్దాలు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఈనాడు విలన్గా మారింది. తన విలనిజానికి పరాకాష్టగా ఈనాడు వెకిలి రాతలు రాసి ఆత్మానందం పొందుతోంది. జగన్ గెలిస్తే తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవని, తన ఎదుట కూర్చుని డిక్టేషన్ తీసుకునే చంద్రబాబు ఓడితే తన ప్రభ మసకబారుతుందన్న బాధ తప్ప మరొకటి కనిపించదు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్షరాన్ని తాకట్టు పెట్టి, ఆంధ్ర ప్రజలను మోసం చేయాలనుకుంటున్న ఈనాడుకు ప్రజలు గుణపాఠం చెప్పకుండా ఉంటారా! -హితైషి -
గుంటూరు తొక్కిసలాట.. టీడీపీ అబద్ధాల బాగోతం మరోసారి బట్టబయలు
గుంటూరు: టీడీపీ తప్పుడు రాజకీయం, అబద్ధాల బాగోతం మరోసారి బట్టబయలైంది. ఆదివారం తొక్కిసలాట జరిగిన గుంటూరు సభకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమారే దరఖాస్తు చేయగా, ఈ లేఖతోనే పోలీసులు సభకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సభ నిర్వహించుకునేందుకు వీలు కల్పించారు. అయితే సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయాక టీడీపీ ప్లేటు ఫిరాయించింది. ఈ సభతో తమకు సంబంధమే లేదని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఉయ్యూరు ఫౌండేషనే ఈ సభకు అనుమతి తీసుకుందని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఇలాంటివారిని ఎంకరేజ్ చేయాలనే సభకు హాజరయ్యానన్నారు. అసలు టీడీపీ దరఖాస్తులో చంద్రన్న కానుకల ప్రస్తావనే లేదు. కానీ జనాలు భారీగా రావాలని కానుకలు ఇస్తామంటూ చెప్పి టీడీపీ నేతలు పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో కానుకలకు ఆశపడి జనం తరలివెళ్లారు. అయితే కానుకలు కొందరికే ఇచ్చి మిగతావాళ్లను వెళ్లగొట్టారు. తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. తన సభలో ఇంత విషాదం జరిగినా బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా చంద్రబాబు వెళ్లలేదు. గుంటూరు ఘటనకు నాలుగు రోజుల ముందే కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలోనూ తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు. చదవండి: గుంటూరు తొక్కిసలాట ఘటన: ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్ -
సాయంత్రం కాగానే వారికి బాబే గుర్తొస్తారట! అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారుగా!
ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోటి వెంట ఆణిముత్యాలు వస్తున్నాయి. ఆయన చెబుతున్న ఈ సుభాషితాలు విన్నవారు ముక్కున వేలేసుకోవల్సిందే. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన ప్రసంగాలు చేస్తూ, మీడియాతో మాట్లాడుతూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. వాటిలో అన్నిటికన్నా ఆసక్తికరమైనది ఏమిటంటే .. తమ్ముళ్లూ ..సాయంత్రం అయ్యేసరికి మందుబాబులకు నేనే గుర్తుకు వస్తాను.. అని ఆయన గర్వంగా చెప్పుకోవడం. తాగినప్పుడు బూతులు తిడతారు.. తర్వాత మర్చిపోతారు.. అన్నారు. అంటే మద్యం బాబులు బ్రాందీ, విస్కి వంటివి తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను తిట్టుకుని, ఆ తర్వాత వారు మర్చిపోతున్నారట. ఇది ఆయన బాధ. జగన్ మద్యం రేట్లు పెంచేశారని, మంచి బ్రాండ్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. దాదాపు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక వ్యక్తి మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఎవరైనా పెద్ద నాయకుడు ప్రజలకు మద్యం తాగవద్దని చెప్పాలి. అది మంచిదికాదని వారించాలి. కాని చంద్రబాబు ఏమంటున్నారు! సాయంత్రం అయితే పెగ్గు వేసుకోవాలని గతంలో అన్నారు. ఇప్పుడేమో సాయంత్రం అయితే తానే గుర్తుకు వస్తానని చెబుతున్నారు. అవును నిజమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో నలభై వేలకు పైగా బెల్ట్ షాపులు నడిపారు. ఇళ్లకు కూడా మద్యం సరఫరా చేశారు. మహిళలంతా తమ భర్తలను తాగుబోతులుగా చంద్రబాబు ప్రభుత్వం మార్చుతోందని మండిపడి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాని ఆయన మాత్రం మారలేదు. మద్యం ఏదో అత్యవసర వస్తువుగా ఆయన భావిస్తున్నారు. దానిని చౌకగా అందుబాటులోకి తేవాలట. జగన్ ఏవేవో బ్రాండ్లు తెచ్చారట. వాటికి నాణ్యత లేదట. ఇంతవరకు ఆ బ్రాండ్ల వల్ల ఏమైనా హానీ కలిగిందా? అంటే లేదు. పోనీ ఆ బ్రాండ్లు ఏమైనా జగన్ ప్రభుత్వం ఇచ్చిందా అంటే అదీకాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ బ్రాండ్ లన్నీ ఇచ్చారని స్వయంగా జగన్ అసెంబ్లీలో పేర్లు చదివి మరీ వినిపించారు. అయినా చంద్రబాబు మాత్రం అదే అసత్యాన్ని వల్లె వేస్తుంటారు. దీనివల్ల రాజకీయంగా చంద్రబాబుకు ఎంత ప్రయోజనం చేకూరుతుందంటే అనుమానమే. మరో మాట చెబుతున్నారు. రాష్ట్రం కోసం అందరూ కలిసిరావాలట. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవారు. అప్పుడు జగన్ ను విమర్శించేవారు. ఇప్పుడు కూడా జగన్ నే దూషిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా ఆయనకు మద్దతు ఇవ్వాలి. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదికార వైసిపిపై పోరాటానికి అంతా మద్దతు ఇవ్వాలి. అంతా డబుల్ స్టాండర్డే. చంద్రబాబు నిజంగానే అంత బాగా చేసి ఉంటే జనం ఎందుకు అంత దారుణంగా ఓడిస్తారు? అదేదో జనం చేసిన తప్పు మాదిరిగా ఆయన ఊహించుకుంటూ , శుద్దిమంతుడి మాదిరి గా ఉపన్యాసాలు చెబుతుంటారు. మీడియా వారిని బాగున్నారా? అని అడిగితే బాగున్నాం అంటే ఆయనకు నచ్చలేదట. దానిని గమనించిన ఒకరిద్దరు బాగోలేదని అనగానే మళ్లీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు అందుకున్నారట. ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు పెడతారని, ఇంకా ఏవేవో అన్నారు. ఏ జర్నలిస్టుపై ప్రశ్నిస్తే కేసు పెట్టారు. తప్పుడు పోస్టింగ్ లు పెట్టిన ఒక రిటైర్డ్ జర్నలిస్టుపై చర్య తీసుకుంటే కోర్టు ద్వారా రక్షణ పొందారు కదా! ఇప్పుడు ఎవరు జగన్ ను విమర్శించినా, అధికారికంగా ఎవరిపైనా చర్య తీసుకోలేకపోతున్నారు. అదే ప్రధాని మోదీనో, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నో అని చూడమనండి .. తమాషా ఏమిటో తెలుస్తుంది. న్యాయ వ్యవస్థను జగన్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తున్నదని అన్నారట. నిజానికి న్యాయ వ్యవస్థ అయినా మరో వ్యవస్థ అయినా అన్నిటి సమస్యలు ఎదుర్కొంటున్నది జగన్ ప్రభుత్వం. అయితే ఈయన ఎదురుదాడి చేస్తుంటారు. అసలు ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని కదా చంద్రబాబుకు పేరు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఎదురుదాడి చేస్తుంటారు. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించిన కోర్టు, చంద్రబాబు ఆస్తుల విషయంలో ఎన్ని మలుపులు తిప్పింది అందరూ గమనించారు కదా? చాలామందికి నాట్ బిఫోర్ అన్న పదం న్యాయ వ్యవస్థలో ఉంటుందన్న సంగతి తెలియదు. కాని చంద్రబాబు కేసులో మాత్రం అది బాగా పాపులర్ అయింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. చంద్రబాబు ఎంతసేపు జగన్ ను ఆడిపోసుకోవడమే కాని, తాను ప్రజలకు ఏమి చేస్తారో చెప్పలేక నోటికి వచ్చిన దూషణలతో కాలం గడుపుతున్నారు. అదే రాజకీయం అని, తనకు అండగా ఉండే మీడియాను అడ్డం పెట్టుకుని ఆ దూషణలతో ప్రజలను ప్రభావితం చేయాలని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. మరి అది సాద్యమేనా? -హితైషి -
స్మార్ట్ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
‘స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు.. అది తప్పుడు ప్రచారం’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్ పంపిణీలో అత్యాధునిక విధానాలు ప్రవేశపెడుతున్నామన్నారు. స్మార్ట్ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐఆర్డీఏ మీటర్లకు, స్మార్ట్ మీటర్లకు వ్యత్యాసం ఉండదన్నారు. మారుతున్న సాంకేతికని ఇంధనశాఖ అంది పుచ్చుకుంటోందని విజయానంద్ అన్నారు. ‘‘ట్రాన్స్కోలో ప్రతీ జిల్లాలో 400 కేవీ సబ్ స్టేషన్స్ అందుబాటులోకి తీసుకువచ్చాం. వినియోగదారులకి త్వరితగతిన సేవలు అందించడానికే స్మార్ట్ మీటర్లు. స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ దేశమంతా ఒకేలా ఉంటుంది. మొదటి ఫేజులో 27 లక్షల మీటర్లు స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. ఇందులో 4.72 లక్షలు మాత్రమే గృహావసరాల కనెక్షన్స్ ఉన్నాయి. అమృత్ సిటీలోని జిల్లా హెడ్ క్వార్టర్స్లో 200 యూనిట్లు దాటిన 4.72 లక్షల కనెక్షన్స్కి మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. రాష్ట్రం మొత్తం 1.80 కోట్లు వినియోగదారులు ఉన్నారు. 1.80 కోట్ల కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లనేది అవాస్తవం’’ అని విజయానంద్ స్పష్టం చేశారు. ‘‘13.54 లక్షల మందికి సెకండ్ ఫేజులో స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాం. ఇంకా టెండర్లు పిలవలేదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్ తదితర 15 రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచాయి. ఏపీ 16వ రాష్ట్రంగా టెండర్లు పిలుస్తోంది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు ముందుకువచ్చాయి. ఇందుకు కేంద్రం నుంచి 5,484 కోట్లు గ్రాంటుగా వస్తాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులకి అదనపు భారం పడదు. రైతులకి భారం పడకుండా ప్రభుత్వమే స్మార్ట్ మీటర్ల భారాన్ని భరిస్తోంది’’ అని ఆయన అన్నారు. ‘‘స్మార్ట్ మీటర్ల విషయంలో స్పష్టమైన విధానంతో ఇంధనశాఖ ముందుకు వెళ్తోంది. ఇంధన శాఖకి ఇష్టం లేదనేది అవాస్తవం. అన్ని డిస్కమ్లతో చర్చించిన తర్వాతే ఇంధన శాఖ ఈ నిర్ణయం. ఈ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఇంధన వ్యయ వినియోగం నేషనల్ మీటరింగ్ మోనిటరింగ్ సిస్టం పరిధిలోకి వెళ్తాయి. ఇంధన శాఖకి వ్యవసాయ, గృహావసరాల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకి ఎక్కువ బిల్లులు వస్తాయనేది అపోహ మాత్రమే’’ అని విజయానంద్ వివరించారు. చదవండి: టీడీపీ నేతల అమానుష చర్య.. చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం -
పెన్షన్లపై విష ప్రచారం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: పెన్షన్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్లను సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలి. ఆడిట్ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ మాత్రమే చేస్తారు. అర్హులందరికీ పెన్షన్లు అందాలన్నదే మా లక్ష్యం. మంచి పనులను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. తప్పుడు ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వంలో పెన్షన్ బిల్లు కేవలం రూ.400 కోట్లు మాత్రమే. ఇప్పుడు నెలనెలా పెన్షన్ బిల్లు రూ.1770 కోట్లు. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్ రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో పెన్షన్ రూ.2750కి పెంచుతూ ఉన్నాం. మనం విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. విష ప్రచారం చేసే వారిని దేవుడే శిక్షిస్తాడు.’’ అని సీఎం అన్నారు. తమది రైతులు, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని.. ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమని సీఎం అన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందని వారికి అవకాశం ఇచ్చాం. పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులు జమ చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈ మాదిరిగా సంక్షేమ పథకాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని సీఎం అన్నారు. చదవండి: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్ ‘‘లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మూడున్నరేళ్లలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.85 లక్షల కోట్లు జమ చేశాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తం రూ.3.30 లక్షల కోట్లు అందించాం. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ల పాత్ర చాలా కీలకం. గత ప్రభుత్వంలో ఏ పార్టీ అని అడిగి పథకాలు ఇచ్చేవారు. లంచాలు లేకుండా గత ప్రభుత్వం ఏ పథకం ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయి’’ అని సీఎం జగన్ అన్నారు. -
పప్పులు ఉడకలేదా?.. ‘ఈనాడు’ తన పరువు తానే తీసుకుందా?
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన వినూత్న పథకాలు ఎంతగా సఫలం అయింది ప్రతిపక్షనేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి, ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చే ఈనాడు వంటి దినపత్రికల కథనాలను బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం గెలిస్తే జగన్ తీసుకు వచ్చిన పథకాలను రద్దు చేస్తారని వలంటీర్లు ప్రచారం చేస్తున్నారని ఈనాడు ఒక కథనంలో ఆందోళన చెందింది. అలాగే చంద్రబాబు కూడా ఇప్పుడు సంక్షేమ రాగం ఆలపిస్తూ, తాను అధికారంలోకి వస్తే ఇంకా అధికంగా సంక్షేమం అమలు చేస్తానని, ఆ మాటకు వస్తే, తాను అమలు చేసిన వివిధ స్కీములను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని, వాటన్నిటిని వడ్డీతో సహా అమలు చేస్తామని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు స్కీములు అంత గొప్పవి అయితే, వాటిని నిజంగానే పేదలకు ఉపయోగపడేలా అమలు చేసి ఉంటే, 2019 ఎన్నికలలో అంత ఘోరంగా టీడీపీని ప్రజలు ఎలా ఓడించారు?. ఇప్పుడు జగన్ స్కీములను అమలు చేస్తామని వీరంతా చెబుతున్నారు. అంతదానికి జగన్ ప్రభుత్వాన్ని వదులుకునే అవసరం ప్రజలకు ఎందుకు వస్తుంది? ఇంతకాలం ఏమని వాదించారు. జగన్ స్కీముల వల్ల రాష్ట్రం నాశనం అవుతోందని, అప్పుల పాలు అవుతోందని జనంలో భయం రేకెత్తించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆ విషయంలో వారి పప్పులు ఉడకకపోవడంతో స్వరం మార్చి కొత్త ప్రచారం మొదలు పెట్టారు. అందులో భాగంగానే జగన్ ప్రభుత్వంపై విషపూరిత కథనాలు, విద్వేషపూరిత స్టోరీలు ఇచ్చే పనిలో ఈనాడు మీడియా పడింది. ఒక పక్క కొత్త పరిశ్రమలు వస్తుంటే, మరిన్ని పరిశ్రమల కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే, వాటిని కనిపించకుండా చేయాలన్న తాపత్రయంలో పరిశ్రమలను వెళ్లగొడుతున్నారంటూ పచ్చి అబద్దాలు రాశారు. ఇలా రోజుకోక అబద్దాన్ని జనంలోకి తీసుకు వెళ్లే యత్నం చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఒక కథనంలో వలంటీర్లు కాదు.. వైకాపా వేగులు అంటూ వలంటీర్లపై విమర్శలు ఎక్కుపెట్టారు. అది చదివితే ఈనాడు మీడియా బాధ, ఆందోళన అంతా తెలిసిపోతుంది. వలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వం జనంలో పాతుకుపోతోందన్న భయం కనబడుతుంది. ఏ వ్యవస్థ అయినా ఎవరు అధికారంలో ఉంటే వారి ఆదేశాలను బట్టి నడచుకుంటుంది. ప్రజలకు వివిధ సేవలను అందిస్తుంటుంది. ఆ క్రమంలో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేదా అది ప్రజలకు ఉపయోగపడకపోతే ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తుంది. ఎక్కడైనా వలంటీర్లు తప్పు చేస్తే వార్తలు ఇవ్వవచ్చు. అందుకోసం ఈనాడు కాని, టీడీపీ మీడియా కాని డేగ కళ్లు వేసుకుని పనిచేస్తున్నదన్న సంగతి బహిరంగ రహస్యమే. దానిని తప్పు పట్టనక్కర్లేదు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటనలో వలంటీర్ల పాత్ర ఉందన్న ఫిర్యాదు వచ్చినా, దానిని మొదటి పేజీలో హైలైట్ చేయడానికి యత్నిస్తోంది. నిజానికి వలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో అతి చిన్న స్థాయి వారు. కేవలం స్వచ్చందంగా ప్రభుత్వం తరపున ప్రజలకు వివిధ స్కీములు చేరవేసేవారు. కాని వారిని అత్యంత పవర్ పుల్ వ్యక్తులుగా ఈనాడు మీడియా భావిస్తున్నట్లుగా ఉంది. వారు ప్రజలపై నిఘా ఉంచుతున్నారట. ఏకంగా రాజ్యంగం ప్రసాదించిన భావస్వేచ్చ ప్రకటనకు ఆటంకంగా ఉన్నారట. ఏమైనా అర్ధం ఉందా?. వీరివల్ల ప్రజల భావస్వేచ్చ ఎలా పోతుంది. అదే నిజమైతే ప్రజలలో అలజడి రాదా? ప్రభుత్వానికి నష్టం రాదా?. వచ్చే ఎన్నికలలో దాని ప్రభావం పడదా?. నిజంగానే వలంటీర్లకు ప్రజలు భయపడుతున్నారనుకుందాం. వచ్చే ఎన్నికలలో ప్రజలు వైసీపీకి ఓటు వేస్తారా?. ఆ మాత్రం లాజిక్ లేకుండా వార్తలు ఇవ్వడం ద్వారా మొత్తం వ్యవస్థనే దెబ్బతీసే యత్నం చేశారు. ఆ క్రమంలో ఈనాడు తన పరువు తానే తీసుకుంటోంది. వలంటీర్లు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారట. అసలు వారు రాజకీయాలలోకి రారాదని ఎక్కడైనా నిషేధం ఉందా?. ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర అధికారులు రాజీనామాలు చేసి మరీ రాజకీయాలలోకి వస్తున్నారు కదా? తెలుగుదేశం పార్టీ అలాంటి పలువురికి టిక్కెట్లు ఇచ్చింది కదా? అంటే అంతకుముందు పదవులలో ఉంటూ రాజకీయాలపై ఆసక్తి కనబరిచినట్లా? కాదా? అంతెందుకు గతంలో ఇంటెలెజెన్స్ ఛీప్ గా ఉన్న ఒక అధికారి తెలుగు యువత అధ్యక్షుడిని నియమిస్తారని, స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడుకున్న వీడియోనే ఉంది కదా?. ఆ స్థాయిలో వారు రాజకీయం చేసినప్పుడు, తెలుగుదేశం పార్టీని తమ భుజస్కందాల మీద మోసినప్పుడు ఈనాడు మీడియా కళ్లు మూసుకుందా? లేక ఆహా అంతటి పెద్ద అధికారి టీడీపీకి అండగా నిలబడ్డారని చంకలు గుద్దుకుందా?. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని అంటారు. ఈనాడు పరిస్థితి అలాగే ఉంది. టీడీపీ హయాంలో జరిగిన తప్పులన్నిటీని కప్పి పుచ్చి ఆ పార్టీని రక్షించాలని పాటు పడి, చివరికి దానిని గోతిలో పడేశారు. ఇప్పుడు వైసీపీపై అక్కసుతో ఉన్నవి, లేనివి రాసి మరోసారి టీడీపీని ప్రజల నుంచి దూరం చేస్తున్నారనిపిస్తుంది. వలంటీర్లు ప్రతి నెల మొదటి తేదీన వృద్దులకు పెన్షన్లు ఇస్తున్నారా? లేదా? దానిని రాజకీయ యాక్టివిటిగా ఈనాడు భావిస్తోందా? ఆయా స్కీములకు సంబంధించి ప్రజలకు వివరించి అర్హులైనవారితో దరఖాస్తులు చేయించడం రాజకీయాలలో పాల్గొన్నట్లు అవుతుందా?. ప్రజలను నిరంతరం కలిపి వారి అవసరాలు తెలుసుకుని, సంబంధిత దరఖాస్తులను సచివాలయానికి ఇస్తున్నది నిజం కాదా?. చదవండి: ఎల్లో బ్యాచ్ విష ప్రచారం.. ఘాటుగా స్పందించిన మంత్రి అమర్నాథ్ పోనీ గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సేవా మిత్రలు ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారా? వారితోనే గెలిచిపోతామని అప్పట్లో టీడీపీ నేతలు భావించేవారా?. కాదా? అయినా ఎందుకు టీడీపీ ఓడిపోయింది. అంతేకాదు.. అన్నదాత సుఖీభవ, పసుపు -కుంకుమ వంటి స్కీములను చివరి నిమిషంలో తీసుకు వచ్చినా టీడీపీకి ఎందుకు ఫలితం దక్కలేదు? జబ్బు ఒకటైతే మందు మరొకటి ఇస్తున్నట్లుగా ప్రస్తుతం ఈనాడు మీడియా కాని, తెలుగుదేశం కాని వ్యవహరిస్తూ తమకు అంటిన ఈర్ష్య వ్యాధిని గుర్తించలేకపోతున్నాయి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాస్తవాల ఆధారంగా విమర్శలు చేయడంలో టీడీపీ విఫలం అవుతుంటే, నిజాలు రాయడానికి సిగ్గుపడే పరిస్థితిలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఉండడం దురదృష్టకరం. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు తప్పుడు కథనాలు
-
వాలంటీర్ల వ్యవస్థపై ‘ఈనాడు’ తప్పుడు కథనాలపై నిరసనల వెల్లువ
సాక్షి, అనకాపల్లి/అనంతపురం: వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు తప్పుడు కథనాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో రామోజీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. మేం వేగులం కాదు.. ప్రజా సేవకులమని వాలంటీర్లు తెలిపారు. సేవకుల పట్ల అవాస్తవ కథనాలు ప్రచురించడం సబబు కాదని, బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. చదవండి: ఏది నిజం?: పింఛన్లిచ్చే వారు గూఢచారులట? -
ఆనాడు ఏం చేశావో గుర్తుందా చంద్రబాబూ?
కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రికలలో ఒక కథనం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తప్పుడు ప్రచారం చేసిన ఒక రాజకీయ నేతను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ నేత. గుజరాత్లో జరిగిన వంతెన ప్రమాదం నేపథ్యంలో మోదీ పర్యటనకు అయిన ఖర్చుపై ఆయన ఒక మెస్సేజ్ని పార్వర్డ్ చేశారు. పోలీసులకు ఆ విషయమై ఒక ఫిర్యాదు అందింది. తదుపరి ఆ నేత గురించి పోలీసులు వాకబ్ చేసి రాజస్థాన్లోని జైపూర్లో పట్టుకున్నారు. న్యాయ వ్యవస్థ కూడా ఆయనను రిమాండ్కు పంపించింది. అలాగే మరి కొంతకాలం క్రితం గుజరాత్కు చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధాని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై అసోంలో అరెస్టు చేశారు. ఆయనను వారం రోజులకు పైగానే జైలులో ఉంచారు. మరి అదే పరిస్థితి ఇతర రాష్ట్రాలలో ఉంటుందా?. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని పరిణామాలను గమనిస్తే భిన్నమైన అంశాలు గోచరిస్తాయి. ఈ మధ్య ఒక రిటైర్డ్ పాత్రికేయుడు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై ఒక అసత్యపు ప్రచారాన్ని పార్వర్డ్ చేశారు. ఒక బంగారం సగ్మింగ్ కేసులో సీఎంవో పాత్ర ఉందని ఆ ప్రచారం సారాంశం. దానిపై చర్య తీసుకోవాలని అధికారులు సూచించగా, పోలీసులు ఆ పాత్రికేయుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశ పెట్టింది. అయితే చట్టంలోని సెక్షన్ 41 సి ప్రకారం నోటీసు ఇవ్వలేదు కనుక ఆయనను బెయిల్పై వదలి వేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత హైకోర్టు సంబంధిత సెక్షన్లు ఈ కేసులో చెల్లవని పేర్కొంది. కోర్టు వారు సాంకేతిక కారణాలతో నిర్ణయాలుచేసి ఉండవచ్చు. కాని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈ అంశాన్ని కూడా తన ప్రచారానికి వాడుకుని ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి కృషి చేస్తున్నారు. అంతే తప్ప, ఎవరూ అభ్యంతరకరంగా వ్యవహరించరాదని ఒక సీనియర్ నేతగా చెప్పడం లేదు. మరి ఇదే చంద్రబాబు హయాంలో ఎంత మంది సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారో గుర్తుకు తెచ్చుకోండి. హైదరాబాద్లో ఉన్నవారిని సైతం రాత్రికి, రాత్రి పట్టుకువెళ్లి అనేక మందిని జైలులో పెట్టారు. కొందరిని విజయవాడలో, మరికొందరిని విశాఖ పట్నంలో కోర్టులలో ప్రవేశపెట్టేవారు. అప్పట్లో ఈ ముందస్తు విచారణలు జరిగిన సందర్భాలు కూడా చాలా తక్కువేనని చెప్పాలి. ఏప్రభుత్వం అయినా ఎవరి స్వేచ్చను హరించరాదు. ప్రత్యేకించి పాత్రికేయుల విషయంలో మరింత ఉదారంగా ఉండాలి. కాని ఆ స్వేచ్ఛను పాత్రికేయుల ముసుగులో దుర్వినియోగం చేయడం కూడా తగదు. చదవండి: చినబాబు మూడు ముక్కలాట.. ‘గో ఎహెడ్.. నీకే టిక్కెట్..’ కేవలం ఒక రాజకీయ పార్టీ కోసం తప్పుడు ప్రచారం చేయడం పద్దతి కాదు. ఒక పార్టీకి మద్దతు ఇస్తే ఇవ్వవచ్చు. ఆ క్రమంలో అబద్దపు, దారుణమైన అభియోగాలను ప్రచారం చేయడం, వాట్సాప్లో పార్వార్డ్ చేయడం అంటే దురుద్దేశంతోనే అని అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనల విషయంలో దేశ వ్యాప్తంగా ఒక విధానం లేకపోతే, ఒక్కో కేసులో ఒక్కో రకంగా పోలీసులు, కోర్టులు వ్యవహరిస్తే అది సమాజానికి మంచి సంకేతం ఇవ్వదేమో! -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా?.. బాబూ నెక్ట్స్ఏంటి?
విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ విజయవంతం అవడం సహజంగానే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలకు జీర్ణం కాని విషయమే. ఈ సభకు సంబంధించి రెండు అంశాలను గమనించాలి. ఒకటి సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల కోసం ఎజెండాను సెట్ చేస్తున్నారు. రెండు సభ జరిగిన తీరు, దానిని మీడియా కవర్ చేసిన వైనం. ముందుగా జగన్ స్పీచ్ను గమనిస్తే ఆయన తన సంక్షేమ కార్యక్రమాల ఆధారంగానే మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీముల వల్ల అత్యధిక లబ్ధి పొందింది బీసీలేనని ఆయన తెలిపారు. నా బిసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ వర్గాలు అంటూ ఆయన ఉచ్చరించడం ద్వారా వారిని సొంతం చేసుకోవడానికి యత్నించారు. ఇప్పటికే ఆ వర్గాలలో మెజార్టీ తనవైపు ఉన్న నేపథ్యంలో ఆయన వారిని మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నారు. జయహో బీసీ పేరుతో జరిగిన ఈ సభలో బీసీ వర్గాలకు చెందిన సుమారు 80 వేల మంది వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దీని ద్వారా బీసీ వర్గాలలో వైసీపీ ఎంత పట్టు సాధించింది పరోక్షంగా చెప్పారన్నమాట. బీసీ వర్గాల ఆదరణ మళ్లీ పొందడానికి గాను తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలకు ఇది ప్రతి వ్యూహం అనుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయన పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్దం జరగబోతోందని, 18 నెలల్లో జరిగే ఈ యుద్దంలో అంతా తనకు మద్దతు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. యుద్ధం అన్న పదం వినడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా, రాజకీయంగా ఆయన దానిని అంత సీరియస్గా తీసుకున్నారని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పన్నుతున్న వ్యూహాలను ఆయన తిప్పికొట్టడానికి, తన వాదనను ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి బలంగా వినిపించారు. గతంలో ఏ సీఎం చెప్పని విధంగా తన పాలన వల్ల మేలు జరిగిందనుకుంటేనే తనకు ఓటు వేయాలని, అదే విషయం ప్రజల ఇళ్లకు కూడా తెలియచేయాలని ఆయన కోరారు. బీసీల సమాజానికి వెన్నుముక వంటి వారని, వారి కోసం తాను ఏఏ స్కీములను ప్రవేశపెట్టింది. వాటిని అడ్డుకోవడానికి టీడీపీ ప్రయత్నాలు ఏమి చేసింది.. మొదలైన విషయాలను ఆయన వివరించారు. ఇక మీడియా కవరేజీ విషయానికి వస్తే ఈనాడు, జ్యోతి వంటి పత్రికలు పత్రికా ప్రమాణాలతో సంబంధం లేకుండా వార్తలు ఇస్తున్నాయి. అదే పద్దతిని ఇప్పుడు కూడా కొనసాగించాయి. ఈనాడు అయితే కనీసం ఒక వార్తకు అయినా ప్రాముఖ్యత ఇచ్చారు. జ్యోతి అయితే మొదటి పేజీలోనే తీవ్ర వ్యతిరేకతను కనబరుచుతూ కథనాలను ఇచ్చింది. కర్నూలులో ఒక ప్రధాన వీధిలో చంద్రబాబు సభ జరిగితే జనం ఫోటోలను ప్రచురించిన ఈనాడు.. జగన్ సభకు సంబంధించి వేదికను మాత్రమే ఫోటోగా ఇచ్చింది. అక్కడితో ఆగకుండా.. ఈనాడు, జ్యోతి కూడబలుక్కుని రాసినట్లుగా జగన్ మాట్లాడుతుండగా వెళ్లిపోయారని ఎప్పటి మాదిరి రాశాయి. అయితే ఆంధ్రప్రభ తదితర కొన్ని పత్రికలు సభ విజయవంతం అయిందని, బీసీ ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారని ప్రముఖంగా ఇచ్చాయి. ఆంధ్రప్రభలో మొదటి పేజీలోనే సభ సక్సెస్ అన్న శీర్షికను కథనం ఇచ్చారు. టీడీపీతో పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కలిసి ప్రయాణిస్తున్న సిపిఐకి చెందిన విశాలాంధ్ర మాత్రం బీసీ సభ వార్తను మొదటి పేజీలోనే వేయలేదు. చివరి పేజీకి పరిమితం అయింది. సిపిఎంకు చెందిన ప్రజాశక్తి బానర్గా కథనం ఇచ్చింది. ఆ సందర్భంగా భారీగా ట్రాపిక్ జామ్ అయిన విషయాన్ని ప్రస్తావించింది. ఇక జ్యోతి పత్రిక జనం లేరని ఒక వార్త, సభ వల్ల మొత్తం నగరం అంతా నరకంగా మారిందని మరో వార్త రాసింది. నిజంగానే జనం పెద్దగా రాకపోతే నగరంలో ట్రాఫిక్కు ఇబ్బంది ఎందుకు వస్తుందన్న సంగతి మర్చిపోయింది. విశేషం ఏమిటంటే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దీగా ఉండే బెంజ్ సెంటర్ నడి రోడ్డులో నవనిర్మాణ దీక్షలని కార్యక్రమం నిర్వహించినప్పుడు అహా, ఓహో అంటూ వార్తలు ఇచ్చాయి. నిజానికి అప్పుడు ఆ రోడ్డులో వచ్చిన జనమే తక్కువ. దాని కోసం ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది టీడీపీ మీడియా మర్చిపోయి ఉండవచ్చు. అంతేకాదు.. పోలవరం సందర్శన అని, లేని అమరావతి విజిట్ అని, ఇలా రకరకాల ప్రచార యాత్రలకు జనాన్ని ఆర్టీసీ బస్లలో తిప్పినందుకుగాను ఆర్టీసీ వారికి 78 కోట్ల మేర టీడీపీ చెల్లించనేలేదట. చదవండి: ఆర్టీసీకి ‘చంద్రన్న భజన’ బకాయి రూ.78.36 కోట్లు మరి వైసీపీ మాత్రం ఈ సభకు బస్ల ఏర్పాటు నిమిత్తం అయిన 3.8 కోట్ల రూపాయలను చెల్లించినట్లు వెల్లడైంది. అయినా ఈనాడు అసత్య కథనాలు రాసింది. ఏది ఏమైనా ప్రతి నిత్యం తెలుగుదేశం పార్టీతోనే కాకుండా, ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ మీడియాతో యుద్దం జరుగుతూనే ఉంది. జగన్ చెప్పినట్లు ఎన్నికల యుద్దం కాదు.. ఇప్పటికే అది ఆరంభం అయిందని అనుకోవచ్చు. అందుకే జగన్ తన మద్దతుదారులను అప్రమత్తం చేస్తున్నారు. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బద్దలైన పవన్ అబద్ధాలు
-
ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో..
ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? ‘ఆక్వా జోన్– నాన్ ఆక్వా జోన్’ అనే పరిమితులు లేకుండా... ఆక్వా రైతులు అందరికీ యూనిట్ విద్యుత్తు రూ.1.50కే ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం... అదో మహా ప్రసాదంలా ‘ఈనాడు’ భజంత్రీలు కొడుతూ అచ్చేయటం!!. అసలు ఆక్వా రైతుల పాలిట విలన్ ఎవరు రామోజీ? సీడ్ నుంచి ఫీడ్ వరకూ... చివరకు రొయ్యల ఎగుమతిదారుల వరకూ ఒకే వర్గానికి చెందిన వారు సిండికేట్గా ఏర్పడి... రైతుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న ముఠాగా మారటం అబద్ధమా? తన వర్గానికి చెందిన వ్యాపారుల దారుణాలకు వత్తాసు పలికింది చంద్రబాబు కాదా? ఫీడ్, సీడ్ ధరలు ఆకాశాన్నంటుతున్నా... రొయ్యల ధరలు పతనమవుతున్నా ఏనాడన్నా బాబు హయాంలో ప్రభుత్వం జోక్యం చేసుకుందా? ఇప్పటి మాదిరిగా కనీస మద్దతు ధరలు నిర్ణయించి వ్యాపారుల చేత కొనిపించే సాహసం చేసిందా? అప్పుడెందుకు పెన్నెత్తలేదు రామోజీ మీరు? బాబు అధికారంలో ఉంటే ఎన్ని దారుణాలు జరిగినా మీకు ‘సమ్మ’తమేనా? మరీ ఈ స్థాయి పాత్రికేయమా? అసలు ఆక్వా – నాన్ ఆక్వా జోన్లను తెచ్చిందే చంద్రబాబు నాయుడు కదా? ఆక్వా జోన్లలోని వారికే విద్యుత్తు, ఇతర సబ్సిడీలని నిబంధనలు పెట్టిందే చంద్రబాబు నాయుడు కదా? అప్పుడెందుకు ఈ నిబంధనలు పెట్టారు... ఇప్పుడెందుకు తొలగిస్తామంటున్నారని అడిగే బాధ్యత ‘ఈనాడు’కు లేదా? తాను అధికారంలో ఉంటూ ఏకంగా నాలుగున్నరేళ్ల పాటు యూనిట్ విద్యుత్తు ఆక్వా జోన్ల రైతులకు కూడా రూ.3.86 చొప్పున ఇచ్చింది చంద్రబాబు కాదా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో మాయ చేయాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ల్లకు 6 నెలల ముందు దాన్ని యూనిట్ రూ.2కు తగ్గించాడు. అది కూడా ఆక్వా జోన్లలోని రైతుల వరకే!!. ఆ నాలుగున్నరేళ్లూ యూనిట్కు రూ.3.86 చొప్పున చెల్లిస్తూ ఆక్వా రైతులు పడ్డ బాధలు ‘ఈనాడు’కు కనిపించలేదు... వినిపించలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు మరి!!. కానీ అప్పట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తూ ఆక్వా రైతుల వెతలు చూశారు. తాను అధికారంలోకి వస్తే ఆక్వా జోన్లలోని రైతులకు విద్యుత్తు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. దీంతో బాబుకు గుబులు పెరిగి... ఎన్నికల ముందు ధర తగ్గించి తన జబ్బలు తానే చరుచుకున్నారు. రామోజీ కూడా శక్తివంచన లేకుండా చంద్రబాబు నిర్ణయాన్ని శ్లాఘించారు. కానీ... ఈ ఎన్నికల గిమ్మిక్కును ఆక్వా రైతులు అర్థం చేసుకున్నారు. ‘ఇదేం ఖర్మరా బాబూ..’ అనుకునేట్టుగా బాబుకు బుద్ధి చెప్పారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా జోన్లలోని రైతులకు యూనిట్ రూ.1.50కే అందించటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. జోనింగ్ నిబంధనలకు అర్థమేంటి? అసలు చంద్రబాబు ఆక్వా జోనింగ్ నిబంధనలు తెచ్చిందెందుకు? ఆక్వా సాగును కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాలని కదా? అలా కాక ఎక్కడ పడితే అక్కడ కాలువ నీరు పారిన చోటల్లా చేపల చెరువులు వెలిస్తే మామూలు వ్యవసాయానికి భవిష్యత్తు ఉంటుందా? రాయలసీమలోని కడప జిల్లా మైదుకూరులో సైతం కాలువల వెంబడి చేపల చెరువులు తవ్వే ప్రయత్నాలు చేశారంటే ఏమనుకోవాలి? అలాంటి నాన్ –ఆక్వా ప్రాంతాల్లో కూడా రొయ్యల చెరువుల్ని విద్యుత్తు సబ్సిడీలిచ్చి ప్రోత్సహించాలన్న చంద్రబాబు ఆలోచన ఏ మేరకు సమంజసం? అలా రాయితీలిస్తే కాస్తో కూస్తో లాభసాటి కాబట్టి అంతా అటువైపే వెళతారు. అలా ఆక్వా సాగు చేసిన ప్రాంతాలన్నీ ఉప్పు నీటి కయ్యలుగా మారి మామూలు వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయి. ఒకవేళ ఎప్పుడైనా... ప్రస్తుతం మాదిరిగా అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు తలెత్తి ఆక్వా సాగు దెబ్బతింటే... ఆ భూముల్ని మళ్లీ మామూలు సాగులోకి తీసుకురావటం అసాధ్యం. ఆ ఉద్దేశంతోనే జోనింగ్–నాన్ జోనింగ్ నిబంధనలొచ్చాయని ఎవరైనా చెబుతారు. మరిప్పుడు చంద్రబాబుకు ఏమైంది? రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నేను అధికారంలోకి వస్తే చాలన్న దుర్బుద్ధి స్పష్టంకావటం లేదూ? ఈయన్ని... ఈయన తానా అంటే... తందానా అంటూ తయారయ్యే రామోజీరావును ఏం చెయ్యాలి? అంతా బాబు మనుషులు కాదా? ఫీడ్ తయారు చేసే కంపెనీలూ వారివే. రొయ్యల్ని ఎగుమతి చేసే కంపెనీలూ వారివే. అంటే రైతుకు పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించేదీ వారే... ఉత్పత్తి ధరను నిర్ణయించేదీ వారే. వీళ్లు ఈ స్థాయిలో ముఠాలా మారి అన్నీ శాసించినపుడు గత ప్రభుత్వం ఏం చేసింది? ఆక్వా కార్య కలాపాల్లోని అవంతి ఫీడ్స్, దేవి సీఫుడ్స్, దేవి ఫిషరీస్, నెక్కంటి సీఫుడ్స్, సంధ్య ఆక్వా, గ్రోవెల్ ఫీడ్స్, వాటర్ బేస్ లిమిటెడ్... ఇవన్నీ ఎవరివి? చంద్రబాబు సన్నిహితులవి కావా? అసలు రాష్ట్రంలో వనామీ రొయ్యల పెంపకం 2009లో మొదలైనపుడు... 2014 వరకూ నాటి ప్రభుత్వాలు 2–3 సార్లు రేట్లు పెంచాయి. కిలో రేటు దాదాపుగా రూ.20 వరకూ పెరిగింది. మరి 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు కేవలం 70 పైసలు మాత్రమే ఎందుకు పెంచారు? ఎందుకు రైతులకు సరైన ధర రాకుండా వారి పొట్టగొట్టారు? 2019లో ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటిదాకా దాదాపు కిలోకు రూ.27 వరకూ పెరగటం అబద్ధమా? కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అండగా నిలవటం అబద్ధమా? ఈ నిజాలు ఎన్నడూ ఎందుకు చెప్పరు రామోజీ? బాబు అబద్ధాలను మాత్రమే అచ్చేసే మీదీ ఒక పత్రికేనంటారా? ప్రతి ఏటా దోచుకోవటం... పచ్చి నిజం ఆక్వా ఎగుమతిదారుల మెడపై ప్రభుత్వం కత్తిపెట్టిందంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు... తన హయాంలో వారందరికీ ఇష్టారీతిన దోచుకోవటానికి లైసెన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఏటా తొలిసారి రొయ్యల పంట చేతికొచ్చినపుడు ఏ రైతూ ఎక్కువ ధరను కళ్ల జూసేవాడు కాదు. 200 కౌంట్ ధర రూ.170–180 రూపాయలకు మించి పలికేది కాదు. ఎందుకంటే కంపెనీలన్నీ సిండికేట్గా ఏర్పడి ఈ మాయాజాలాన్ని కొనసాగించేవి. దానికి బాబు, రామోజీల అండ ఎటూ ఉంది. ‘ఈనాడు’ సైతం వీరి పక్షమే కనక... రైతుల వెతలను రాస్తే ఒట్టు!. అలా 170–180కి వీళ్లంతా రైతుల దగ్గర కొనుగోలు చేసిన తరవాత... అకస్మాత్తుగా ధర పెరిగిపోయేది. కానీ అలా పెరిగేటప్పటికి రైతుల చేతిలో రొయ్యలుండేవి కావు. ఇలాంటి పరిస్థితులుండకూడదనే చట్ట సవరణలు చేసి మరీ ఈ ప్రభుత్వం రైతుల్లో భరోసా కల్పించింది. అదే రామోజీరావు దృష్టిలో పెద్ద నేరమైపోయింది. ఆక్వా రైతుల గురించి ‘ఈనాడు’ రాసే ప్రతి రాతలో ప్రభుత్వంపై విషం చిమ్మటానికి... ఈ సిండికేట్లను బ్రేక్ చేయటమన్నదే ప్రధాన కారణమని వేరే చెప్పాల్సిన పని లేదు కూడా. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఈ సిండికేట్లు దోచుకోవటానికి చంద్రబాబు సాయపడితే... ఎన్నికలు వచ్చినపుడు వీళ్లంతా కలిసి చంద్రబాబుకు ఆర్థికంగా సాయపడతారు. అదీ వీళ్ల లెక్క. అందుకే వీళ్లకు సాధారణ రైతులంటే లెక్క ఉండదు. ఇక్కడ గమనించాల్సిందొకటుంది. బాబు హయాంలో ముడిపదార్థాల ధరలు తగ్గినా.... ఫీడ్పై మాత్రం కిలోకు రూ.7 అధికంగా దోచుకున్నారు. కానీ బాబు పట్టించుకుంటే ఒట్టు!!. అదే ఈ ప్రభుత్వ హయాంలోకి వచ్చేసరికి ముడిపదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ఇదే కారణంతో ఈ ఏడాది జూన్ నుంచి సెపె్టంబరు మధ్య 6 సార్లు కంపెనీలు ఫీడ్ ధరలు పెంచాయి. కానీ ప్రభుత్వం జోక్యం చేసుకుని 3 సార్లు తగ్గించింది. అంతేకాకుండా ముగ్గురు సీనియర్ మంత్రులు, సీనియర్ అధికారులతో ఆక్వా సాధికార కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ అందరితో చర్చించి... కిలోకు రూ.2.60 చొప్పున ఫీడ్ ధరలు తగ్గించింది. ఇలా ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచకుండా ఏకంగా చట్టాన్ని సైతం సవరించింది ప్రభుత్వం. అలా.. ఫీడ్ ధరలను నియంత్రించే వ్యవస్థను తేవటంతో పది ఎకరాల్లోపు ఉన్న రైతులకు దాదాపు రూ.10 లక్షల మేర ప్రయోజనం కలిగింది. కాకపోతే ఇలాంటి నిజాలను ‘ఈనాడు’ ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే ఇవి బాబు చేయలేని... కనీసం చేయాలనుకోని పనులు కాబట్టి!. జగన్ హామీ... బాబు జీవో.. బకాయిలు చెల్లించిన జగన్!! వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నపుడు... తాను అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తు రూ.1.50కే ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో కలత చెందిన బాబు... అప్పటికప్పుడు ఆక్వా జోన్లలోని రైతులకు రూ.2కే యూనిట్ ఇస్తానని జీవో ఇచ్చారు. అది కూడా 2018 సెప్టెంబర్లో. అంటే 6 నెలల్లో ఎన్నికలున్నాయనగా!!. చిత్రమేంటంటే జీవో ఇచ్చినా ఆ మేరకు సబ్సిడీ నిధుల్ని విద్యుత్తు కంపెనీలకు మాత్రం ఇవ్వలేదు బాబు. అధికారంలోకి వచి్చన వెంటనే... 2019 జూలై 2 నుంచి వీరికి విద్యుత్తు యూనిట్ రూ.1.50కే ఇస్తున్నట్లు వైఎస్ జగన్ జీవో ఇచ్చారు. ఈ మూడున్నరేళ్లలో ఏకంగా రూ.2,687.47 కోట్ల రూపాయలు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ రూపంలో ఖర్చు చేశారు. బాబు చెల్లించకుండా వదిలేసిన బకాయిలనూ చెల్లించారు. అదీ చిత్తశుద్ధి అంటే. ధరలెందుకు తగ్గాయి? అసలిప్పుడు రొయ్యల ధరలెందుకు పతనమయ్యాయి? ప్రధానంగా చైనా, అమెరికాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈక్వెడార్ లాంటి చిన్న దేశం నాణ్యమైన రొయ్యల్ని ఉత్పత్తి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో సవాల్ విసిరింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లేక... ధరలు పతనమయ్యాయి. ఇక దేశీయంగా పరిస్థితులెలా ఉన్నా రాష్ట్రం మాత్రం నాణ్యమైన విద్యుత్తును సబ్సిడీ ధరకే అందించటంతో ఇక్కడ ఉత్పత్తి పెరిగింది. ఎగుమతిలో పోటీ పెరిగింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలోనూ ఆక్వా పరిశ్రమ దెబ్బతినకుండా దానికి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సాహసమే చేసింది. మత్స్య రంగంలో ఏపీ ఉత్తమ రాష్ట్రం.. కేంద్రం కితాబు మత్స్య రంగానికి సంబంధించి అన్ని అంశాలలో ఆంధ్రప్రదేశ్ను భారత ప్రభుత్వం 2021లో ఉత్తమ రాష్ట్రంగా గుర్తించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా అదే ఏడాది నవంబర్ 21న బహుమతి ప్రదానం చేసింది. మత్స్య ఉత్పత్తిలో రాష్ట్రం.. దేశంలోనే 30 శాతం వాటా కలిగి అగ్రగామిగా ఉంది. స్థూల విలువ జోడింపులో 2014–15లో 4.6 శాతంగా ఉన్న వాటా, 2020–21 నాటికి 9 శాతానికి అభివృద్ధి చెందింది. మొత్తం దేశ సముద్ర ఆహార ఎగుమతుల విలువలో రాష్ట్ర వాటా 2014–15 లో 28 శాతం ఉండగా, 2020–21 నాటికి అది 35 శాతానికి పెరిగింది. ఎగుమతుల విలువ 2014–15లో రూ.9,671 కోట్లు ఉండగా, 2020–21 నాటికి అది రూ. 20,019 కోట్లకు పెరిగింది. 2014–15లో 19.78 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న మత్స్య ఉత్పత్తి.. 2021–22లో ఏకంగా 48.13 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, మత్స్య రంగం వృద్ధి చెందలేదని చెప్పడం ఎవరి బాగు కోసం? -
ముసుగు తీస్తే లొసుగులే..చెప్పడానికి మాత్రమే వారికి నీతులు.!
తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అని శతక కారుడి ఊవాచ. కొన్ని మీడియా సంస్థలు ఇలాగే ప్రవర్తించి తాము అంతేనని రుజువు చేసుకుంటున్నాయి. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా, శల్య పరీక్షలు చేసి, తామే అంతా కనిపెట్టేశామంటూ కథనాలు ఇచ్చే ఈ మీడియా తమ వరకు వచ్చేసరికి మాత్రం అమ్మో.. మా జోలికి వస్తారా .. అని గగ్గోలు పెడుతోంది. ఎవరిపైన ఐటి లేదా సీబీఐ, లేదా ఈడీ వంటి సంస్థలు సోదాలు నిర్వహిస్తే, విచారణ జరిపితే సంబంధిత వ్యక్తులు ఇలా అన్నారు.. జవాబు ఇవ్వకుండా తప్పించుకున్నారు.. అంటూ కథనాలు రాసే ఈ మీడియా తను కూడా అతీతం కాదు అని ఆచరణలో తెలియజేస్తోంది. భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? ఈనాడు మీడియాకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలలో రిజిస్ట్రేషన్ అధికారులు సోదాలు జరిపితే అదంతా కక్ష అంటూ తమ పత్రికలలో, టీవీ చానళ్లలో ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. నిజంగానే వీరు ఏ తప్పు చేయకుండా ఉంటే, మొత్తం తెరచిన పుస్తకం అయి ఉంటే ఉలిక్కిపడవలసిన అవసరం ఏమి ఉంటుంది. శంషేర్ గా మొత్తం రికార్డులన్నీ అధికారుల ముందు పెట్టి ఇంకేమైనా కావాలా అని అడిగి ఉండేవారు. అంతే తప్ప అధికారులు ఏది అడిగినా, తమ వద్ద ఆ సమాచారం లేదని, అదంతా హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్ లో ఉందని ఎందుకు చెప్పి తప్పించుకుంటారు? మార్గదర్శి మేనేజర్లు పంచనామా కాగితాలపై ఎందుకు సంతకం పెట్టకుండా నిరాకరించారు? నిజానికి ఒక్క మార్గదర్శిపైనే అధికారులు సోదాలు జరపలేదు. చాలా చిట్ ఫండ్ సంస్థలలో జరిగాయి. అయినా వారెవ్వరూ కక్ష అంటూ ఎందుకు ఆరోపించలేదు. కేవలం మార్గదర్శి పక్షాన ఈనాడు మీడియా మాత్రమే ఎందుకు గోల చేసింది? అదే ఇంకేదైనా సంస్థపై ఏ దర్యాప్తు సంస్థ అయినా సోదా చేసి ఉంటే ఈనాడు ఇలాగే రాసేదా? ఉండవల్లి ప్రశ్నలకు బదులేదీ? 2006లోనే తాము డిపాజిట్ల సేకరణ ఆపేశామని మార్గదర్శి అధినేత రామోజీరావు రిజర్వు బ్యాంకుకు తెలియజేసిన తర్వాత కూడా మరో రూపంలో డిపాజిట్లు తీసుకుంటున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన ఆరోపణకు ఎందుకు స్పందించలేదో అర్ధం చేసుకోవచ్చు. డిపాజిట్ అన్న పదం బదులు రిసీట్ అన్న పేరు పెట్టి చిట్ పాడిన వారి డబ్బు తీసుకోవచ్చా? ఇవన్ని చట్ట విరుద్దమా?కాదా? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చెప్పారు కాబట్టి తీసుకున్నామని చెప్పిన రామోజీ.. ఇంతకీ ఆ జడ్జి ఎవరో ఎందుకు చెప్పలేదు? చేసింది తప్పని గమనించి మాట మార్చేశారా? చిట్లు కట్టిన వారి వివరాలు ఇవ్వడానికి కూడా మార్గదర్శి నిరాకరించడం గమనించదగిన అంశం. అంటే ఇందులో ఏమైనా మతలబు ఉందా? మార్గదర్శి డబ్బును ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారా? లేదా? ఉండవల్లి దీనికి సంబంధించి స్పష్టమైన ఆరోపణ చేశారు. అయినా జవాబు ఇవ్వలేదు. డబ్బులెలా మళ్లించారు? మార్గదర్శి కేసు సుప్రింకోర్టులో విచారణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఉమ్మడి ఏపీ హైకోర్టులో కొట్టివేసిన తీరుపై ఉండవల్లి ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఏడాది తర్వాత ఆ సంగతి తెలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. ఇందులో ఏదో మతలబు వ్యవహారం లేకపోతే రామోజీరావు ఇలా ఎందుకు చేశారన్న సందేహం వస్తుంది. సుప్రీంకోర్టులో కేసు కోసం రామోజీ హడావుడి పడ్డారన్న విమర్శలు వచ్చాయి. కానీ సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు తీసుకుంది. మార్గదర్శి ఎవరికి బకాయి పడలేదు కదా అని కొందరు వాదిస్తుంటారు. అయితే చట్టాన్ని ఉల్లంఘించవచ్చని చెబుతారా? ప్రభుత్వ సంస్థలలో ఏదైనా చిన్న ఉల్లంఘన జరిగినా కావ్..కావ్ .. అని రాసే ఈ మీడియా తాను మాత్రం ఎలాంటి అతిక్రమణలనైనా చేయవచ్చని భావిస్తోందా? అది తన హక్కుగా అనుకుంటోందా? గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిధుల దారి మళ్లింపు వ్యవహారం బయటపడింది. అనేక సంస్థలు ఇలా నిధులు మళ్లించే దెబ్బతిన్నాయి. రామోజీకి సంబంధించిన పలు సంస్థలు కూడా నష్టాలు చవిచూశాయి. అందువల్లే ఆయన తన టివి చానళ్లను ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థకు విక్రయించిన సంగతి అందరికి గుర్తు ఉంది కదా! అబ్బో ఏం మేనేజ్మెంటో! విజయ్ మాల్యా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలా నిధుల మళ్లింపు కేసును ఎదుర్కొంటున్నారు. ఆయనే కాదు. అనేక సంస్థలు కూడా ఈ కేసుల్లో చిక్కుకున్నాయి. వారికి మీడియా సంస్థలు ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండి ఉండేదేమో! ఒకవేళ వచ్చినా తమ పైన కక్ష సాధింపు అని ఆరోపణ చేసి ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రభుత్వానికి సహకరించకుండా ఉండడానికి యత్నించేవారేమో! ఈ నేపధ్యంలోనే ఉండవల్లి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రామోజీరావుకు దేశంలోని బ్యాంకులను అప్పగిస్తే అద్బుతంగా నడిపి భారతరత్న పొందేవారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. పత్రిక ముసుగులో తప్పులను రామోజీ కప్పి పుచ్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. నిజమే. చివరికి కాపురాలను బజారు కీడుస్తారా? రామోజీ వద్దకు కేంద్ర హోం మంత్రి వంటివారు సైతం వెళితే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు వెళ్లి డిక్టేషన్ తీసుకుంటే ఇలాంటి ధైర్యం వస్తుందేమో! ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వ అధికారులు జరిపిన సోదాలతో ఈనాడు మీడియా మరింతగా రెచ్చిపోతోంది. చివరికి ఏ స్థాయికి దిగజారిందంటే గత మూడేళ్లుగా అంటే జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలు సంసారాలు కూడా చేయడం లేదన్న అర్ధం వచ్చేలా పిచ్చి కధనాలు రాసి ప్రజల చేత అపహాస్యానికి గురి అవుతోంది. ఏపీలో అమరావతి నిర్మాణం జరగడం లేదని యువత ఇక్కడ సంసారం చేయకుండా వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారట.! ఇక్కడ ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే కాపురాలు చేస్తున్నారట. ఇది నిజమే అయితే చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు చేసిన పాలనలో వచ్చిన పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా ఉండి ఉంటే ఇక్కడే యువత ఉండి సంసారాలు చేస్తుండాలి కదా? ఆ మాటకు వస్తే రామోజీరావు కుటుంబం ఎప్పుడో ఎందుకు హైదరాబాద్ వెళ్లిపోయింది? చంద్రబాబు మొత్తం ఏపీని అభివృద్ది చేసి ఉంటే ఇక్కడే సంసారాలు చేసి తెగ పిల్లలను కనేసి ఉండేవారు కదా? ముఖ్యమంత్రి జగన్పై కోపంతో పిచ్చి వార్తలు రాసి ఈనాడు పరువు తీసుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ కధనంపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలు చూస్తే దానిని రాసినవారు సిగ్గుతో తలవంచుకోవల్సిందే. కనుక కేవలం కక్ష కట్టి అర్ధం పర్దం లేని వార్తలు రాసి ప్రజల చీత్కారానికి గురి కావద్దని హితవు చెప్పడం మినహా ఏమి చేయగలుగుతాం? -హితైషి, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పేదల ఇళ్లపై ఇవీ నిజాలు.. బాబూ పవనూ అర్థమవుతుందా?
ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని కార్యకమాలు చేపట్టడం ప్రభుత్వానికి మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ స్కీమ్ను విమర్శించడానికి ప్రయత్నిస్తారో దానిపై ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆపై, ప్రజలలో ఆ స్కీమ్ గురించి మంచి చర్చ జరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. పవన్ కల్యాణ్ సినిమా నటుడు కావడం, ఆయన ఎక్కడకు వెళ్లినా కొంతమంది అభిమానులు అక్కడకు వెళ్లడం, ఆయనను తెలుగుదేశం పార్టీ మీడియా భుజాన వేసుకోవడంతో కనీసం ఇప్పుడైనా ఆ స్కీమ్ గురించి ప్రజలకు మరింతగా తెలియచేసే అవకాశం వస్తోంది. చదవండి: అబద్ధాలపై పేటేంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. పేదలకు ఇళ్లు ఇస్తే అక్కసా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు 31లక్షల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం సంకల్పించారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా ఈ స్థాయిలో పేదలకు స్థలాలు మంజూరు చేయలేదన్నది వాస్తవం. ఆ స్థలాలలో కేంద్ర ప్రభుత్వం స్కీంను కొంత వాడుకుని, తద్వారా వచ్చే నిధులకు తోడు రాష్ట్ర నిధులను జత చేసి ఇళ్లనిర్మాణం చేపడుతోంది. జగనన్న కాలనీల పేరుతో సాగుతున్న ఈ నిర్మాణాలు ఒకరకంగా చరిత్ర సృష్టిస్తున్నాయని చెప్పాలి. దీంతో ప్రతిపక్ష తెలుగుదేశంకు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు తేళ్లు, జెర్రులు పాకుతున్నట్లయింది. ఇది జగన్కు మంచి పేరు తెచ్చే స్కీమ్ కావడంతో దానిని ఎలా బదనాం చేయాలా అని ప్లాన్ చేసి రకరకాల ప్రచారాలు చేపట్టారు. ఆవ భూములని, స్కామ్లని, వర్షం పడితే నీళ్లు నిలుస్తాయని, కాలనీలపై ఒకటి కాదు.. అనేక రకాలుగా విషం కక్కుతూ తెలుగుదేశం మీడియా వార్తా కథనాలు ఇచ్చింది. టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేస్తూ కథ నడిపారు. కాని దానివల్ల తమకు నష్టం కలుగుతుందని భావించారో,లేక మరే కారణమో తెలియదు కానీ, ఇళ్ల స్థలాలపై విమర్శల జోరు తగ్గించినట్లు అనిపించింది. రెడీ.. కెమెరా.. యాక్షన్ అదే సమయంలో తమకు పరోక్ష మిత్రుడుగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ బాధ్యత అప్పగించినట్లు ఉన్నారు. ఆయన ఒక రకంగా అమాయకుడు, అంత పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి కావడంతో, లేచిందే లేడీకి ప్రయాణం అన్నట్లుగా ఈ స్కీమ్ స్థలాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఆయా కాలనీలలోకి వెళ్లి లబ్ధిదారులను పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి విమర్శల వర్షం కురిపించాలని భావించారు. కానీ వారికి విధి వక్రీకరించిందన్నట్లుగా వారు వెళ్లిన ఎక్కువ చోట్ల లబ్ధిదాదారులు నిలదీశారు. దీనికి సంబంధించి వచ్చిన కథనాలు, ప్రత్యేకించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు ఆసక్తి కలిగించాయి. కొందరు మహిళా లబ్దిదారులను జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ, తమకు వస్తున్న సదుపాయాన్ని చెడగొట్టవద్దని నిర్మొహమాటంగా చెప్పారు. ఒక్కో చోట పట్టణాన్ని బట్టి లబ్ధిదారులకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు విలువైన స్థలాలు దక్కాయి. ఆ విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. చివరికి పవన్ కల్యాణ్ ప్రోగ్రాంలో సైతం ఆయన ఊదరకొట్టిన ఉపన్యాసం తప్ప, లబ్దిదారులు ఎవరూ వచ్చి ఫిర్యాదు చేయలేదట. దాంతో ఆయన పార్టీ నేతలను తప్పు పట్టి వెళ్లిపోయారు. జనసేన నేతలు సరిగా ఆర్గనైజ్ చేయలేకపోయారన్నది ఆయన బాధ కావచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకుని ఆయన వ్యవహరించకపోతే ఇలాగే చేదు అనుభవాలే మిగులుతాయి. ఇళ్ల స్థలాల స్కీము ఆలోచన చేయడమేపూర్తి సాచ్యురేషన్ మోడ్లో జగన్ చేశారు. అందువల్లే 31 లక్షల మంది పేదలకు ఈ స్కీమ్ను అమలు చేయడానికి ఆయన సిద్దమయ్యారు. దీనిని మెచ్చుకోకపోతే, పోనీ మొత్తం కుంభకోణం అంటూ ప్రచారం చేయడానికి తెగించారు. ఎక్కడైనా ఒకటి, రెండు చోట్ల ఎవైనా అవకతవకలు జరిగి ఉంటే వాటిని ప్రస్తావిస్తే తప్పు కాదు. కానీ అసలు స్కీమ్ కింద తీసుకున్న భూముల విలువకన్నా ఎక్కువ మొత్తం స్కామ్ జరిగిందని ఆరోపిస్తే ఎవరు నమ్ముతారు? మొత్తం 71 వేల ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తే, అందులో ప్రభుత్వ భూమి పోను మిగిలిన 25 వేల ఎకరాల కొనుగోలుకు 11 వేల కోట్ల రూపాయల వ్యయం అయిందట. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఏకంగా పదిహేనువేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇలాంటి ప్రకటనలే పవన్ అజ్ఞానాన్ని బయటపెడుతున్నాయని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఇక్కడ 40 ఇయర్స్ అబద్దాలు ఈ ధోరణి రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం ప్రవేశం తర్వాత బాగా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడుతో పాటు, ముద్దుకృష్ణమనాయుడు వంటివారు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో సిద్దహస్తులుగా పేరొందారు. నిజంగానే ఏ అంశంపైన అయినా పరిశీలన చేసి విమర్శ చేయదలిస్తే, క్షుణ్ణంగా అధ్యయనం చేసి వెళ్లాలి. కానీ ఎక్కువ సందర్భాలలో పవన్ అరకొర పరిజ్ఞానంతో వెళ్లి అభాసుపాలు అవుతున్నట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈనాడులో వచ్చిన విషపూరిత కథనాల ఆధారంగా ఆయన ఇలాంటి యాత్రలు పెట్టుకుంటున్నారు. ఒక కుట్ర ప్రకారం ముందుగా ఈనాడు, తదితర తెలుగుదేశం మీడియాలలో సంబంధిత ఆరోపణలతో కథనాలు ఇవ్వడం, ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ప్రకటనలు చేయడం నిత్యకృత్యం అయింది. పింగళి గారు.. గమనించారా? జనసేన అధినేత వీకెండ్ షూటింగ్ లేని సమయంలో ఇలాంటి యాత్రలు పెట్టుకుని తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మీడియా అయితే పూర్తి అయిన ఇళ్ల గురించి వార్తలు ఇవ్వదు. పూర్తి కానీ ఇళ్ల గురించే వ్యతిరేక కథనాలు ఇస్తూ, అసలేమీ జరగడం లేదేమో అన్న భావన క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజ్, నీటి సదుపాయం వంటివాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంటే టీడీపీ మీడియా మాత్రం ప్రతిదానిని తప్పుపడుతూ, నిందలు మోపుతూ ప్రజలను గందరగోళం చేయడానికి తంటాలు పడుతోంది. ఆ సంగతి పక్కన బెడితే సోషల్ మీడియాలో పవన్ గురించి ఒక వీడియో వచ్చింది. ఆయన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతున్నట్లుగా ఉంది. అందులో జాతీయ పతాకాన్ని తయారు చేసింది జవహర్ లాల్ నెహ్రూ అన్నట్లుగా ఉంది. అది ఆయన వీడియోలాగే ఉంది. దీనిని బట్టే పవన్ కల్యాణ్ రాజకీయాలలోనే కాదు.. చరిత్ర విషయంలో కూడా అంత పరిజ్ఞానంతో మాట్లాడడం లేదన్నది అర్థం అవుతుంది. రాజకీయాలలో ముఖ్యమైన భూమిక పోషించాలని అనుకుంటే, అందుకు తగ్గట్లుగా విషయ పరిజ్ఞానం పంపొందించుకోవాలన్న సంగతి పవన్ కల్యాణ్కు ఎప్పటికి అర్ధం అవుతుందో! -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తెలంగాణలో ఒకలా.! ఏపీలో మరోలా.! ఎందుకలా..?
అప్పులపై ఈనాడు ఎన్ని సార్లు వార్తలు ఇచ్చిందో చెప్పలేం. చివరికి ఓడరేవుల అభివృద్దికి అప్పు ప్రతిపాదన చేసినా తప్పు పడుతున్నారు. ఓడరేవులు అభివృద్ధి చెందితే అది రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దానిని చెడగొట్టడానికి ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలు ఇలాంటి వార్తలు ఇస్తున్నాయని ప్రజలు అర్ధం చేసుకోలేరనుకుంటే అది వారి భ్రమే అవుతుంది. హంద్రీనీవాలో నీరున్నా రైతుకు కన్నీరే అంటూ మరో విషపూరిత కథనాన్ని ఈనాడు ఇచ్చింది. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? నిజంగానే ఎక్కడైనా పొలాలకు సరిగా నీరు అందకపోతే వార్త ఇవ్వవచ్చు. అలా కాకుండా రాయలసీమలో హైకోర్టు పెట్టాలని ఆత్మగౌరవ ర్యాలీలు జరుగుతున్న వేళ ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చే లక్ష్యంతో ఇలాంటి కథనాలు ఇస్తున్నారు. ఈ వార్త అబద్దమని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి సోదాహరణంగా వివరించారు. తప్పుదారి పట్టించే యత్నం ఒకవేళ నిజంగానే లక్ష ఎకరాల పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఉరుకుంటుందా? ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతిపక్షం ఎంత గొడవ చేసేది? ఈనాడు మాత్రం ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసింది. ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. రిజర్వాయిర్లు, చెరువులు అన్నిటా నీరు ఉంది. అలాంటప్పడు నీటి సమస్య ఎక్కడ వస్తుంది? విద్యుత్ బకాయిల చెల్లించలేదంటూ రాసిన ఈ పత్రిక తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్టులు, ఇతర లిఫ్టుల విద్యుత్ బకాయిల గురించి ఎన్నడైనా వార్తలు ఇచ్చిందా అంటే అదేమీ చేయలేదు. ఇక్కడ ఆ మీడియాకు ఉన్న భయం ఏమిటో వారే చెప్పాలి. నిజం తెలిసినా వక్రభాష్యమే.! అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని కూడా వ్యతిరేకిస్తూ మాస్టర్ ప్లాన్ మార్చేస్తున్నారు అంటూ వార్త ఇచ్చింది. ఆయువు తీస్తున్న విద్యుత్ తీగలు అంటూ అప్పుడెప్పుడో జరిగిన ఘటనల ఆధారంగా ఒక స్టోరీ వండారు. ఇది కూడా నిజంగా సమస్య పరిష్కారం కోసం కాకుండా, ఏపీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఉద్దేశంతోనే చేశారన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. మరో వైపు గ్రామాలలో విద్యుత్ బకాయిలు చెల్లించకూడదన్నట్లుగా వార్తలు ఇస్తూ సర్పంచ్లపై కత్తీ అంటూ మరో అధ్వాన్నపు వార్త ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కరోనా సంక్షోభం సమయంలో ఉద్యోగులకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వలేకపోయాయి. కాని ఏపీలో మాత్రం ఉద్యోగులను రెచ్చగొట్టే రీతిలో కధనాలు ఇచ్చాయి. అప్పు తెచ్చి జీతాలు ఇస్తే అదిగో అప్పు చేశారని రాశారు. అంతేకాదు .. ఈనాడు ఒకసారి అసలు ఏపీ ప్రభుత్వ ఆదాయం పెరిగిందని కూడా వార్త ఇచ్చింది. రాతలు కావవి.. పచ్చ కామెర్లు.! కరోనా సమయంలో పేదలకు సాయం చేసినప్పుడు ఎలాంటి పాజిటివ్ వార్తలు ఇవ్వలేదు. పైగా అమ్మో అప్పులు చేసేశారు అంటూ వ్యతిరేక ప్రచారం చేశారు. పోనీ ప్రభుత్వం వ్యయం తగ్గించుకోవడానికి, స్కీములలో వృధా అరికట్టడానికి ప్రయత్నిస్తే, వెంటనే ఆ స్కీములో కోత పెట్టారు! ఈ స్కీములో కోత పెట్టారు అంటూ అప్పుడు కధనాలు ఇచ్చారు. విశాఖలో టిడిపి ఆందోళనకు దిగితే పోలీసులు కట్టడి చేస్తే నిర్భంధ కాండ అంటూ తాటికాయంత అక్షరాల హెడింగ్ ఇచ్చారు. మరి అదే అమరావతిలో భూముల సమీకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేసినప్పుడు, విపక్షాలు ఆ ప్రాంతం వైపు వెళ్లకుండా ఆంక్షలు పెట్టినప్పుడు ఎప్పుడైనా ఇలా రాశారా? ఆనాటి ప్రభుత్వమే రైతుల పంటలను కూడా తగుల పెట్టించదన్న ఆరోపణ వచ్చినప్పుడు ఈ మీడియా ఏనాడైనా ఇది దారుణం అని రాసిందా? మీరా విలువలా గురించి వల్లించేది? ఎప్పుడైనా ఒకసారి ఏడిస్తే ఎవరైనా ఓదార్చుతారు. కాని రోజు ఏడ్చేవారిని ఎవరు ఓదార్చుతారన్నది నానుడి. సరిగ్గా ప్రస్తుతం ఈనాడు, ఇతర టీడీపీ మీడియా సంస్థల పరిస్థితి అలాగే ఉంది. రోజూ ప్రభుత్వంపై ఏదో ఒక చెత్తరాసి, ఇంత బురద పోసి ఈ మీడియా ఆనందపడుతోంది. వీరి బాధ అల్లా ఎన్ని రాసినా ప్రజలలో ప్రభుత్వంపై తాము ఆశించిన వ్యతిరేకత రావడం లేదనే. అందుకే మరింత ప్రస్టేషన్ తో ఈనాడు, టీడీపీ మీడియా ఇలా చేస్తున్నాయి. ఒకప్పుడు ఈనాడు అధినేత రామోజీరావు సమాజ విలువల గురించి, పత్రిక ప్రమాణాలు, విలువల గురించి సంపాదకీయాలే కాదు.. ఉపన్యాసాలు కూడా ఇచ్చేవారు. ఏదైనా నిజమైతేనే రాయండి.. అబద్దమైతే రాయవద్దని సుద్దులు చెప్పేవారు. ఏ ఆరోపణపైన అయినా రెండో వెర్షన్ తీసుకోవాలని చెప్పేవారు. కాని ఇప్పుడు ఆయన సారధ్యంలోని ఈనాడు ఇంత ఘోరంగా విలువలకు పాతర వేస్తున్న తీరు చూస్తే, ఆనాటి మాటలన్నీ ఒట్టి మాటలేనా అన్న భావన ఏర్పడుతుంది. చివరికి ఈనాడు సైతం కులం ఊబిలో చిక్కుకుందన్న విమర్శలు రావడం అత్యంత శోచనీయం. వీటన్నిటిని గమనిస్తే వచ్చే 2024 ఎన్నికల వరకు జగన్ ప్రభుత్వం ఈ దుష్టచతుష్టయాన్ని ఎదుర్కోకతప్పదని అర్థం అవుతుంది. దీనికి తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా ప్లాన్ చేసుకోవలసి ఉంటుంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అన్నీ ఏడుపుగొట్టు వార్తలే.. పచ్చమీడియా ఆ విశ్లేషణ చేయదు.. ఎందుకంటే?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తప్పుబడుతున్న పచ్చమీడియా.. ఆచరణలో అంత కంటే ఘోరంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో వారు అనుసరిస్తోన్న తీరును ప్రజలు తరచుగా గమనించినా.. పచ్చమీడియా ధోరణిలో మాత్రం మార్పు రావడం లేదు. వైఎస్సార్సీపీ ఇచ్చిన మానిఫెస్టోపై ఈ మీడియా ఎన్నడూ విశ్లేషణ చేయదు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లేదా? అన్న జోలికి వెళ్లదు. ఎందుకంటే వాటి గురించి ప్రస్తావిస్తే వైఎస్ జగన్ హామీలు అమలు చేశారని చెప్పవలసి వస్తుంది కనుక. అంతకుముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 400 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినా, చంద్రబాబు ప్రభుత్వం అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవి. లక్షకోట్ల రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు చెబితే ఈ మీడియా అదెలా సాధ్యమైని ఏనాడు ప్రశ్నించలేదు. పైగా చంద్రబాబు అనుభవజ్ఞుడు కనుక రుణమాఫీ చేస్తారని ప్రచారం చేశాయి. బాబు ఓడగానే అసలు రూపం ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే సంస్థలే అయినా గతంలో మరీ ఇంత నీచంగా ఉండేవికావు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆ సంస్థలు ఓర్చుకోలేకపోతున్నాయి. ఆ మీడియా యాజమాన్యాలు చంద్రబాబు ఓడిపోతే తామే ఓడిపోయినట్లు భావించడం ఆరంభించాయి. అంతే.. ఇక జగన్పై ఉన్నవి, లేనివి రాయడం ఆరంభించారు. ఆ క్రమంలో ఉచ్ఛనీచాలు వదలివేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇవి బట్టలు ఊడదీసుకుని తిరగడానికి కూడా సిగ్గుపడడం లేదేమో అనిపిస్తుంది. ఈనాడు మీడియాకు కాని, మిగిలిన టిడిపి మద్దతుదారులైన మీడియా వారికి గాని, ఈ మూడున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని కూడా కనిపించలేదు. వీళ్లు కళ్లున్న కబోదుల్లా మారిపోయారు. (చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా?) అన్నీ ఏడుపుగొట్టు వార్తలే ఉదాహరణకు ఈనాడు మీడియా గత కొద్దిరోజులుగా రాస్తున్న ఏడుపుగొట్టు వార్తలను పరిశీలించండి. ఎవరికైనా విషయం ఇట్టే బోధపడుతుంది. ఏపిలో విద్యా వ్యవస్థ మెరుగుదలకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అంతా భావిస్తారు. యుపి తదితర రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి ప్రభుత్వ స్కూళ్లను చూసి వెళ్లాయి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో పాటు స్కూళ్లను నాడు-నేడు కింద తీర్చిదిద్దుతున్నారు. వాటిని మెచ్చుకోకపోతే మాని, ఈనాడు ఏమని రాసిందో చూడండి. పిల్లలపై పిడుగు అన్న శీర్షికతో తరగతి బోధన, అభ్యసన గాలికి వదలివేశారంటూ ప్రచారం చేశారు. ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయని రాస్తున్నారు. ఇలాంటి వార్తనే ఒక ఇరవై రోజుల కిందట ఈ పత్రిక రాసింది. దానిపై అధికారులు వివరణ ఇచ్చారు. గతంలో కన్నా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగిన వైనాన్ని తెలిపారు. అయినా ఈ పత్రిక మళ్లీ పిల్లలపై పిడుగు అంటూ ఏడుపుగొట్టు వార్త ఇచ్చింది. ఎల్లో ఎజెండాలో నెగెటివ్ వార్తలే స్కూళ్లలో కనీస సంఖ్యలో విద్యార్ధులు లేకపోతే వాటిని వేరే స్కూల్ లో కలిపితే, అమ్మో ఇంకేముంది పిల్లలకు అన్యాయం జరిగిపోయిందని రాస్తున్నారు. ప్రభుత్వం ఈ చర్య తీసుకోకపోతే, పిల్లలు లేకపోయినా, టీచర్లకు జీతాలు ఇస్తున్నారని అప్పుడు రాస్తారు. ఈ పత్రిక ఎన్నడైనా స్కూళ్ల ఆధునీకరణపై ఒక్క పాజిటివ్ వార్త అయినా ఇచ్చిందా? ప్రభుత్వ స్కూళ్ల టీచర్లను రెచ్చగొట్టేలా మాత్రం స్టోరీలు ఇస్తుంటారు. అందుకే విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పత్రికలు విద్యారంగంపై విషం కక్కుతున్నాయని విమర్శించారు. కళ్లు తెరిచి చూడండయ్యా, జరుగుతున్న మంచిని! చిత్తశుద్దితో విద్యా వ్యవస్థలో తెస్తున్న మార్పులలోని మంచిని, ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని చెప్పడం తప్పుకాదు. కాని నిత్యం విషపూరిత కథనాలు ఇవ్వడంతో ఈనాడు, ఇతర టిడిపి మీడియా సంస్థలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ఉత్తరాంద్రపై ప్రేమ ఉంటే భూముల తాకట్టా అంటూ మరో ఏడుపు వార్త ఇచ్చారు. భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పు తీసుకోవడాన్ని వీరు తప్పు పట్టారు. మరి గత ప్రభుత్వం అమరావతి భూములను తాకట్టుపెట్టినప్పుడు, అధిక వడ్డీకి బాండ్లను జారీ చేసినప్పుడు ఎందుకు ఇలాంటి స్టోరీలు ఇవ్వలేదు? అప్పుడు చంద్రబాబు మొహం చూసి అప్పులు ఇచ్చారని ప్రచారం చేశారే. పోనీ భూముల తాకట్టుపెట్టకుండా రుణాలు వచ్చే అవకాశం ఉంటే దాని గురించి రాయవచ్చు. అలాకాకుండా విశాఖ కార్యనిర్వహాక రాజధాని అయితే ఉత్తరాంద్ర అంతటా జగన్ కు మంచి పేరు వస్తుందన్న కారణంగా ఈనాడు కుళ్లుబుద్దితో ఇలాంటి వార్త ఇచ్చింది. విశాఖ రాజధాని కాకుండా చేయాలని తన వంతు విషాన్ని ఈ మీడియా చిమ్ముతోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచుగా ఒక మాట అంటుంటారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ట చతుష్టయం విషం కక్కుతోందని, ప్రజలకే మంచి చేసినా, చెడుగా ప్రచారం చేస్తోందని ఆయన వ్యాఖ్యానిస్తుంటారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 మీడియా సంస్థలను కలిపి దుష్టచతుష్టయం అని పేరు పెట్టారు. వీరికి తోడుగా దత్తపుత్రుడు అంటూ పవన్ కల్యాణ్ తీరును ఆయన ఎండగడుతుంటారు. ఆయన వ్యాఖ్యలు కరెక్టేనా? కాదా అన్న విశ్లేషణ చేస్తే మాత్రం ఒక పచ్చి నిజం బయటపడుతుంది. మీడియా ముసుగులో పచ్చ కుట్ర చంద్రబాబు టీడీపీ అధినేతగా, మళ్లీ అధికారంలోకి రావాలన్న తాపత్రయం ఉన్న వ్యక్తిగా ప్రభుత్వంపై ఏవైనా ఆరోపణలు చేయవచ్చు. అందులో నిజాలు ఉండవచ్చు. ఉండకపోవచ్చు. ఆయన చేసే రాజకీయ విమర్శలకు వైసీపీ కూడా రాజకీయంగానే సమాధానం ఇస్తుంది. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 మీడియా సంస్థలు విలువలకు పాతరేసి నిత్యం విషం కక్కుతున్న తీరు బాధ కలిగిస్తుంది. అవి ఒక రకంగా ఏపీ ప్రజలపై పగపట్టినట్లు వ్యవహరిస్తున్నాయన్న సంగతి విశ్లేషణలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లను, తప్పు ఒప్పులను మీడియా వార్తలుగా ఇవ్వడం తప్పు కాదు. నిజానికి అలాంటి వార్తలు ఇవ్వాలి కూడా. కానీ అబద్దాలతో రోజూ దిక్కుమాలిన కథనాలు ఇవ్వడం ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలని నానా తంటాలు పడుతున్నాయి. ఏపీ ప్రజలు విజ్ఞులు కనుక వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదనుకోవాలి. పదేళ్ల నుంచి ఇవే కుట్రలు 2019 ఎన్నికలకు ముందు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతుగా ఎన్ని స్టోరీలు ఇచ్చినా, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ను అప్రతిష్టపాలు చేయాలని ఎన్ని విషపు రాతలు రాసినా ప్రజలు వాటిని పట్టించుకోలేదు. వైసీపీకి 151 సీట్లు ఇచ్చి జగన్ను ముఖ్యమంత్రిని చేశారు. దానిని ఈ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. జగన్ సీఎం అయిన మరుసటి రోజునుంచే ఏదో ఒక తప్పుడు కథనం వండి వార్చడం ఆరంభించారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నాయి. అయినా ఆయన ధైర్యవంతుడు కనుక తను ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని అమలు చేయడానికి ముందుకు వెళ్లారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
AP: ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాన్ని ఖండించిన పౌరసరఫరాల శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై–7) కింద నవంబర్ నుంచి జనవరి వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ వెల్లడించారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఉచిత బియ్యం ఊసెత్తరేం’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. రేషన్ డోర్ డెలివరీ విధానం ద్వారా ఇంటి వద్దకే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం పంపిణీచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. చదవండి: చిన్న పరిశ్రమలతో లక్షలాది ఉద్యోగాలు.. ఎంఎస్ఎంఈలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహం అయితే, కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవై కింద నాన్–సార్టెక్స్ బియ్యాన్ని మాత్రమే ఇస్తోందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీకి నాన్ సార్టెక్స్ నిల్వలు లేనందున మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ద్వారా అందించాలని, అక్టోబర్ నుంచి కాకుండా నవంబర్ నుంచి పంపిణీ చేసేలా అనుమతించాలంటూ ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం రాష్ట్రానికి 3.24 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని ఎఫ్సీఐని ఆదేశించిందన్నారు. ప్రస్తుతం ఎఫ్సీఐ నుంచి జిల్లాల్లోని మండల స్టాక్ పాయింట్లకు బియ్యం రవాణా జరుగుతోందన్నారు. వచ్చేనెల నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారుల్లోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం అందజేయనున్నట్లు ఆయన వివరించారు. గతంలో బియ్యం ఇవ్వని కేంద్రం.. ఇక ఆరో విడత ఉచిత బియ్యం పంపిణీని ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు కేంద్ర పొడిగించగా రాష్ట్రానికి అవసరమైన బియ్యం పంపిణీని విస్మరించిందన్నారు. నాన్ సార్టెక్స్ నిల్వలు లేనందున, అందుబాటులో ఉన్న సార్టెక్స్ బియ్యం కేవలం రెగ్యులర్ పీడీఎస్లో పంపిణీ చేసేందుకు సరిపోతాయని, ఎఫ్సీఐ నుంచి బియ్యం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వమే నాన్ సార్టెక్స్ బియ్యాన్ని సొంతంగా సేకరించి ఆగస్టు, సెపె్టంబర్లో పంపిణీ చేసిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆరు విడతల్లో 25 నెలల పాటు ఉచిత బియ్యం ఇస్తే.. రాష్ట్రం సొంతంగా 19 నెలల పాటు మానవతా దృక్పథంతో కేంద్రంతో సమానంగా స్టేట్ కార్డుదారులకు కూడా బియ్యాన్ని అందించిందన్నారు. ఇందుకోసం ఏకంగా రూ.5,700 కోట్లు ఖర్చుచేసిందని అరుణ్కుమార్ పేర్కొన్నారు. ఉచిత బియ్యం పంపిణీ ఇలా.. రాష్ట్రంలో 4.23 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉంటే కేంద్రం కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే ప్రతినెలా బియ్యం అందిస్తోందని అరుణ్కుమార్ తెలిపారు. మిగిలిన కార్డులకు రాష్ట్రమే సొంతంగా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. ఉచిత బియ్యం పంపిణీలోనూ కేంద్రం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే బియ్యాన్ని కేటాయిస్తోందన్నారు. ఇందులో భాగంగా గతంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుల మేరకు తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లలో మినహా ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 1.67 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరితో పాటు మిగిలిన జిల్లాల్లోని 89.20 లక్షల ఎస్సీ, ఎస్టీలకు, 24.60 లక్షల మంది అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు, ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో అక్కడి లబ్ధిదారులకు ఉచిత రేషన్ను అందజేయనున్నట్లు అరుణ్కుమార్ వివరించారు. -
Daspalla Lands: ఆ అగ్రిమెంట్లో తప్పేముంది?
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని దసపల్లా భూములకు సంబంధించి కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని.... పుంఖానుపుంఖాలుగా ఎల్లో మీడియా వెలువరిస్తున్న పొంతనలేని కథనాల్ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్లాట్ల యజమానులు, డెవలపర్లు ఖండించారు. ఇది పూర్తిగా కొందరు వ్యక్తుల ప్రయివేటు వ్యవహారమైనా... ఆ వ్యక్తులకు– డెవలపర్కు మధ్య జరిగిన ఒప్పందం పూర్తిగా వారికి సంబంధించినదే అయినా... దాన్ని కూడా తప్పుబడుతూ కథనాలు వెలువరించటంపై వారు విస్మయం వ్యక్తంచేశారు. నిజానికి భూ యజమానితో డెవలప్మెంట్ ఒప్పందం చేసుకున్నపుడు డెవలప్ చేసే నిర్మాణంలో తనకు ఎంత వాటా ఇవ్వాలనేది డెవలపర్ ఇష్టం. దానికి అంగీకరించాలా? వద్దా? అనేది భూ యజమానుల ఇష్టం. ఈ వాటా ఒకో ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. డెవలపర్ నిరి్మంచబోయే బిల్డింగ్ స్థాయిని బట్టి ఈ వాటా మారుతుంటుంది. మరీ హైఎండ్ నిర్మాణాలైతే భూ యజమానికి తక్కువ వాటా ఇవ్వటం, సాధారణ నిర్మాణాలైతే కొంత ఎక్కువ వాటా ఇవ్వటం పరిపాటి. ఎందుకంటే హైఎండ్ నిర్మాణాలకు ఎక్కువ ఖర్చవుతుంది. దాన్ని డెవలపరే భరించాల్సి ఉంటుంది కనక. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే తాము ఒప్పందం చేసుకున్నా... అందులో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందని, ప్రభుత్వం తప్పు చేసిందనే రీతిలో దారుణమైన కథనాలు వెలువరిస్తూ చేస్తున్న దు్రష్పచారాన్ని వారు ఖండించారు. దీనిపై తమ వాదన కూడా వినాలంటూ శనివారమిక్కడ వాస్తవాలను వారు మీడియా ముందుంచారు. ఆ వివరాలివీ... దసపల్లా భూముల విషయంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని ఆ భూములను డెవలప్మెంట్కు తీసుకున్న అష్యూర్ డెవలపర్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూ 20 ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం వల్ల ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి కనక తాము 65 మందీ కలిసి ఇష్టపూర్వకంగా డెవలప్మెంట్ కోసం ఒప్పందం చేసుకున్నామని భూ యజమానులు స్పష్టంచేశారు. సుప్రీం కోర్టు దాకా తాము చేసిన న్యాయ పోరాటాన్ని... సుప్రీం కోర్టు తీర్పునిచ్చినా అమలు చేయకపోవటంతో చివరకు ప్రభుత్వం కోర్టు ధిక్కారం ఎదుర్కోవాల్సి రావటాన్ని, ఆ నేపథ్యంలో విధిలేక కోర్టు నిర్ణయాన్ని అమలు చేయటాన్ని ఈ సందర్భంగా వారు పరోక్షంగా గుర్తుచేశారు. శనివారమిక్కడ ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి వాస్తవాలు వివరించారు. ఇటీవల కొందరు చేస్తున్న ఆరోపణలను, దు్రష్పచారాన్ని ఇకనైనా ఆపాలని కోరారు. భూములు కొనుగోలు చేసినప్పటి నుంచి.. ఇటీవల జరిగిన అగ్రిమెంట్ వరకూ ప్రతి అంశం అందరి ఆమోదయోగ్యంతో, పారదర్శకంగా నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే... అందరం ఇష్టపూర్వకంగానే ఒప్పందం చేసుకున్నాం: జాస్తి బాలాజీ, భూ యజమాని మా కుటుంబ సభ్యులకు ఇందులో ప్లాట్లున్నాయి. మా 65 మందిలో చాలా మంది బిల్డర్లు ఉన్నారు. ఈ ప్రాజెక్టు చేసేందుకు అందులో కొందరు ముందుకొచ్చారు కూడా. కాకపోతే మాలో మాకు విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు బయటవాళ్లకు డెవలప్మెంట్కు విశాఖలో సిగ్నేచర్ భవనమైన ఆక్సిజన్ టవర్స్ను నిరి్మంచిన లాన్సమ్ ఉమేష్ మాకు ముందు నుంచీ పరిచయం ఉన్నారు. కాబట్టి వారిని సంప్రదించగా ప్రాజెక్టు డిజైన్తో ముందుకొచ్చారు. 20 ఫ్లోర్స్ కడతామని చెప్పారు. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తరహాలో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. భూములు 22ఏలో ఉన్నప్పటికీ.. పెండింగ్ రిజి్రస్టేషన్లో ఉన్నా ఫర్వాలేదనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరితో మాట్లాడి అగ్రిమెంట్కు వెళ్లాం. సుప్రీంకోర్టు... కోర్టు ధిక్కార పిటిషన్లో కూడా ఆదేశాలిచి్చంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కచి్చతంగా 22ఏ నుంచి తొలగిస్తుందనే నమ్మకంతో అడుగులు వేశాం. అందరి ఇష్టపూర్వకంగానే అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం తప్ప దీన్లో ఎవ్వరి బలవంతమూ లేదు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి ఒక్కరం ఆనందంగా ఉన్నాం: కంకటాల మల్లిక్, భూ యజమాని 1996 నుంచి దసపల్లా హిల్స్లో నివాసముంటున్నాం. దసపల్లా ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు కార్యవర్గ సభ్యుడిగా కూడా ఉన్నా. గడిచిన 22 సంవత్సరాలుగా కోర్టు వివాదం వల్ల క్రయ విక్రయాలకు సంబంధించి దసపల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. 1990లో మా ఇల్లు పడగొట్టి కొత్తది కట్టేందుకు కూడా చాలా అవస్థలు పడ్డాం. అప్పట్లో మేం హైకోర్టుకు వెళ్లి అనుమతి తీసుకుని కట్టుకున్నాం. రెండు దశాబ్దాలకు పైగా వీటిని అమ్మలేక పోతున్నాం.. కొనలేకపోతున్నాం.. వీలునామా రాసినా ఇబ్బందులు తప్పటం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నుంచి ఈ భూముల్ని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం వల్ల దసపల్లాలో నివాసముంటున్న ప్రతి ఒక్కరూ సంతోషపడ్డాం. గత ప్రభుత్వ హయాంలో 70 వరకూ రిజి స్ట్రేషన్లు జరిగాయి: సుబ్బరాజు, భూ యజమాని, రాణి కమలాదేవి అడ్వకేట్ భూముల టైటిల్ కోసం సుప్రీం కోర్టు వరకూ వెళ్లాం. ప్రతి కోర్టులోనూ, ప్రతి కేసులోనూ మాకే అనుకూలంగా తీర్పు వచ్చింది. 22ఏ నుంచి తొలగించాలని 2014లోనే సుప్రీం కోర్టు ఆదేశాలిచి్చంది. కానీ కలెక్టర్ అమలు చేయలేదు. కోర్టు ఆయనకు నెల రోజుల జైలు శిక్ష కూడా విధించింది. దసపల్లా భూముల్లో చాలా వరకూ రాణి కమలాదేవి విక్రయించేశారు. 22ఏ నుంచి వీటిని తొలగించాలని 65 మంది ప్లాట్ ఓనర్స్ కోర్టుకి వెళితే... అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే.. రిజిస్టర్ చేసి.. 22ఏ నుంచి డాక్యుమెంట్లు రిలీజ్ చేయాలని కోర్టు స్పష్టం చేసినా.. సబ్ రిజిస్ట్రార్లు మాత్రం చెయ్యలేదు. దీంతో మరోసారి కోర్టుకి వెళ్లాం. 22ఏలో ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్లు ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో 60 నుంచి 70 వరకూ ఈ తరహా రిజిస్టర్లు జరిగాయి. ఇప్పుడు అదే పద్ధతిలో మేం చేసుకుంటున్నాం. విశాఖ, హైదరాబాద్లో ఇదే మాదిరిగా ఎన్నో ప్రాజెక్టులు: ఉమేష్, అష్యూర్ డెవలపర్స్ భాగస్వామి దసపల్లా భూముల అభివృద్ధికి సంబంధించి ఒక చదరపు గజానికి 12 అడుగులు భూ యజమానికి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాం. అంటే 30: 70 నిష్పత్తిలో భూ యాజమానులకు, డెవలపర్లుకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నిష్పత్తి కొత్తదేమీ కాదు. విశాఖపట్నం, హైదరాబాద్ ఇతర నగరాల్లో 30 కంటే తక్కువ శాతం కూడా భూ యజమానులకు ఇచ్చిన సందర్భాలున్నాయి. హైదరాబాద్లో నేను చేసిన రెండు ప్రాజెక్టుల్లో 25:75 నిష్పత్తిలో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే.. మొత్తం 1500 నుంచి 1800 అపార్ట్మెంట్స్ కట్టాలి. ఇందుకు ఎనిమిదేళ్లుకి పైగా అవుతుంది. ఈ సమయంలో అన్ని ధరలూ పెరుగుతాయి. పైగా.. దసపల్లా భూములు కొండ ప్రాంతంలో ఉన్నాయి. పైపెచ్చు నగరం నడి»ొడ్డున ఉన్నాయి కాబట్టి కంట్రోల్డ్ బ్లాస్ట్ చేసి రాళ్లని తొలగించలేం. రోప్ కటింగ్ లేదా కెమికల్ బ్లాస్ట్ చెయ్యాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా భారీ ప్రాజెక్టుల్లో ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ రావడం, అపార్ట్మెంట్స్ సేల్స్ అవ్వడం మొదలైనవి చాలా ఆలస్యమవుతాయి. దీనివల్ల బిల్డర్లకు ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉంటాయి. నాణ్యత, మౌలిక సదుపాయాలు.. ఇలా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ తరహా ఒప్పందం చేసుకున్నాం. దీనికి ప్లాట్ల యజమానులందరూ అంగీకరించిన తర్వాతే అగ్రిమెంట్ జరిగింది తప్ప.. రాజకీయ ఒత్తిడుల వల్లనేనంటూ వస్తున్న ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు. గతంలో ఎన్టీఆర్ ట్రస్టుకి పనిచేశాను. కానీ రాజకీయాల్లో లేను. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నాకు 25 సంవత్సరాలుగా తెలుసు. ఆయన ప్రగతి భారతి ట్రస్టు స్థాపించిన నేపథ్యంలో... ఎనీ్టఆర్ ట్రస్టు మాదిరిగానే ఇక్కడా ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా. అంతే తప్ప.. ఈ భూముల విషయంలోగానీ, రాజకీయం, బిజినెస్ విషయంలో గానీ ఆయన ప్రమేయం ఏమాత్రం లేదు. ఏ సంస్థ నుంచి ఒక్క రూపాయి రాలేదు: గోపినాథరెడ్డి, అష్యూర్ డెవలపర్స్ భాగస్వామి ఇటీవల వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు. అవ్యాన్ రియల్టర్ల నుంచి నిధులు వచ్చాయన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధం. అవ్యాన్ డెవలపర్స్ నుంచి అష్యూర్ డెవలపర్స్కి ఈ ప్రాజెక్టు విషయంలో ఒక్క రూపాయి కూడా రాలేదు. కోవిడ్ సమయంలో ఇతర అవసరాల కోసం వచి్చన మొత్తాన్ని దసపల్లా భూముల కోసం వచి్చనట్లుగా చూపిస్తూ దు్రష్పచారం చేస్తున్నారు. దసపల్లా భూముల అభివృద్ధి ఒప్పందం విషయంలో ఏ విధమైన అవకతవకలు గానీ, రాజకీయ ప్రమేయం కానీ లేదు. పూర్తిగా బిజినెస్ పద్ధతిలోనే జరిగిన డీజీపీఏ అగ్రిమెంట్ ఇది. అంచనాల ప్రకారం సుమారు 29 లక్షల చదరపుటడుగులు నిర్మించవచ్చు. ఇందులో 9 లక్షల అడుగుల వరకూ భూ యజమానులకు ఇస్తున్నాం. -
సీఐడీ విచారణకు హాజరుకాని చింతకాయల విజయ్
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్.. సీఐడీ విచారణకు హాజరుకాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐ–టీడీపీ దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీని వెనుక ఐ–టీడీపీ విభాగ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న చింతకాయల విజయ్ పాత్ర ఉన్నట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. చదవండి: వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం దీంతో ఆయనపై క్రైమ్ నంబర్ 14/2022 ఐపీఎసీ సెక్షన్లు 419, 469, 153–ఎ, 505(2), 120–బి రెడ్విత్ 34, ఐటీ చట్టం సెక్షన్ 66(సి) కింద కేసు నమోదు చేశారు. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో గురువారం విచారణకు హాజరుకావల్సిందిగా ఈ నెల 1న హైదరాబాద్లోని విజయ్ నివాసానికి వెళ్లి సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. కానీ విజయ్ మాత్రం విచారణకు హాజరుకాకపోవడం గమనార్హం. కాగా, ఆ కేసు ఎఫ్ఐఆర్ కాపీతో పాటు, ఇతర వివరాలు ఇవ్వాలని కోరుతూ ఓ లేఖను విజయ్ తరఫు న్యాయవాదులు సీఐడీ కార్యాలయంలో అందించారు. -
అబద్ధాలపై క్షమాపణ కోరే ధైర్యం కూడా లేదు.. కిషన్రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేంద్ర ప్రభు త్వం 9 మెడికల్ కాలేజీలు ఇచ్చిందంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘కిషన్రెడ్డి గారూ.. సోదరుడిగా మిమ్ములను గౌరవిస్తున్నా. తెలంగాణకు కేంద్రం మెడికల్ కాలేజీలు ఇచ్చిందనడం పచ్చి అబద్ధం. మీలా తప్పుడు సమాచారం ఇచ్చే అభాగ్య కేంద్ర కేబినెట్ మంత్రిని నేను చూడలేదు. మీరు చెప్పిన అబద్ధాలకు కనీసం క్షమాపణ చెప్పే ధైర్యం కూడా మీకు లేదు’’అని వ్యాఖ్యానించారు. ‘‘సగం వండిన అసత్య ప్రచారానికి కొనగింపుగా ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న రీతిలో బయ్యారం సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని చెప్తున్నారు. గుజరాత్లోని మీ బాస్ల మన్ననలు పొందేందుకు అర్ధసత్యాలు, అబద్దాలు చెప్పే వారిలో మీరూ ఒకరని స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందో ప్రధాని మోదీ అధికారిక ప్రకటన చేయాలి. పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని ఇటు తెలంగాణలో, అటు ఏపీలో నెరవేర్చకపోవడం సిగ్గుచేటు’’అని కేటీఆర్ విమర్శించారు. తప్పుడు ప్రకటనలతో తప్పుదోవ.. ‘‘హైదరాబాద్లో ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ కేంద్రం ఏర్పాటు చేస్తోందని మీరు ఇటీవల ప్రకటించారు. కానీ మీ గుజరాత్ బాస్లు తమ రాష్ట్రానికి తరలించుకుపోయారు. అయినా మీ అబద్ధాన్ని సరిచేసుకోకుండా తప్పుడు ప్రకటనలతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని కేటీఆర్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరదల నియంత్రణకు చేపట్టిన ఎస్సార్డీపీ కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన ఖర్చును పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వం రూ.985 కోట్లతో వరద నియంత్రణ చర్యలను చేపట్టింది. పనులు పూర్తికావొచ్చాయి. కానీ ఇది కిషన్రెడ్డి ప్రజలకు చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
ఓటర్ల జాబితాపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్లో ఓటర్ల జాబితా విషయంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) చేసిన ప్రకటనపై కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఈఓ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ శనివారం స్థానిక దినపత్రికల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో ఓటర్ల జాబితా రివిజన్ తర్వాత కొత్తగా 25 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని సీఈఓ ఆగస్టు 17న విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనిపై రాజకీయంగా అలజడి రేగింది. బయటి వ్యక్తులను తీసుకొచ్చి, ఓటు హక్కు కల్పించేందుకు కుట్ర పన్నారని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఈ అంశంపై చర్చించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా సోమవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు. -
ప్రాణం ఉన్నంతవరకు వైఎస్ఆర్ సీపీలోనే ఉంటాను : బాలినేని
-
నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్సీపీతోనే: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావాలనే కొంతమంది వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి ఘటనలు బాధాకరమని తెలిపారు. తనకు ఊసరవెల్లి రాజకీయాలు చేయడం చేతకాదని రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంతోనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: దూషించిన నోటితోనే పులకింతా? చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని.. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కు రెస్పాండ్ అయ్యానని అన్నారు. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం జగన్తో మాట్లాడతానని బాలినేని తెలిపారు. గోరంట్ల మాధవ్ విషయంలో విచారణ చేపట్టడం జరుగుతుందని తదనగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలు సమసిపోయాయని తెలిపారు. -
సంక్షేమ రాజ్య స్థాపనే రాజ్యాంగ లక్ష్యం
రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా మరో విష ప్రచారానికి తెరలేచింది. పేదవాళ్లకు అందుతున్న నగదు బదిలీలు, సంక్షేమ పథకాలకు అడ్డుకట్ట వేయకపోతే కొన్ని రాష్ట్రాల్లో శ్రీలంక ఆర్థిక సంక్షోభం తరహా పరిణామాలు ఉత్పన్నం అవుతాయట. అందువల్ల కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు... ఇత్యాది ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలు తక్షణం జోక్యం చేసుకొని ఆయా రాష్ట్రాలకు ముకుతాడువేసి సంక్షేమ పథకాలను నిలుపుదల చేసి పేదవాణ్ణి శిక్షించాలని కోరుతున్నారు కొందరు. చదవండి: ఇవి అనుచితం ఏమీ కాదు! ఎంత దుర్మార్గం ఇది! శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అక్కడి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆ ప్రభుత్వం అందించిన రాయితీలు, సంక్షేమ పథకాలు ఎంతమాత్రం కాదు. ఈ వాస్తవం శ్రీలంక ప్రజలకు తెలుసు. అధికారంలో ఉన్న వారు అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే తమ దేశం దివాళా తీసిందని అక్కడి ప్రతిపక్ష పార్టీలు విమర్శించడాన్ని ఏవరైనా చూశారా, చదివారా? మోకాలికీ, బోడి గుండుకూ ముడిపెట్టే చందంగా శ్రీలంక దేశంలోని సంక్షుభిత రాజకీయ పరిణామాలను మన దేశంలోని ఆంధ్రప్రదేశ్తోసహా మరికొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి ముడిపెడుతున్నారు కొందరు కుహనా మేధావులు. ప్రజల ఆదరణ పొందిన ప్రభుత్వాలపై పనిగట్టుకొని బురద జల్లేందుకు అల్లిన ఇటువంటి కథనాలలో వాస్తవం లేదు. శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని బూచిగా చూపి ఇక్కడి పేదవాడి కంచంలోని అన్నం ముద్దను లాగేయాలనీ, పేద విద్యార్థులకు అందే నాణ్యమైన విద్యను దూరం చేయాలనీ, మధ్యతరగతి వర్గాలకు అందిస్తున్న నగదు బదిలీ వంటి పథకాలను రద్దు చేయాలనీ గగ్గోలు పెడుతున్నారు. న్యాయస్థానాలకు ఎక్కుతున్నారు. తాము కట్టే పన్నులన్నీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికే ఖర్చు చేసి... అభివృద్ధి పనుల్ని అటకెక్కిస్తున్నారనే వాదనతో సంపన్న వర్గాలను పేద వర్గాల వారిపై ఎగదోసి, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏపీ లాంటి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల వల్ల ఖర్చు తప్ప సంపద పెరగదని కొందరు పెదవి విరుస్తున్నారు. వారి దృష్టిలో అసలు సంపద అంటే ఏమిటి? సంపద అంటే పేదవర్గాల ఆర్థికాభివృద్ధే సంపద. అందుకే, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవాభివృద్ధి, కుటుంబ సంక్షేమమే నిజమైన సంపద అని మనసా వాచా నమ్ముతూ ఆ దిశలోనే నవరత్నాలను ప్రకటించి అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా ఆపలేదు. ప్రముఖ ఆర్థిక చరిత్ర కారుడు డేవిడ్ రాండెస్ 21వ శతాబ్దిలో ప్రపంచం ఎదుర్కొనే ఏకైక ప్రమాదం ‘ధనిక పేద ప్రజలను విడదీసే సంపద, ఆరోగ్యాల మధ్య ఏర్పడే అంతరం మాత్రమే’ అని పేర్కొన్నాడు. సమాజంలో సంపద పెరగాల్సిందే. అందులో రెండో అభిప్రాయం ఎవరికీ ఉండదు. సగటు జాతీయోత్పత్తి పెరిగితే దానిని అభివృద్ధికి కొలమానంగా గుర్తించే ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ తదితర ఆర్థిక సంస్థలు వేసే లెక్కలు తప్పని తేలింది. పేదరిక నిర్మూలనకూ, దిగువ మధ్య తరగతి వర్గాల జీవన ప్రమాణాల మెరుగుదలకూ జాతీయ ఆదాయాన్ని పెంచడం ఒక్కటే మార్గం కాదని అంతర్జాతీయంగా రుజువైంది. పేదరికాన్ని సూటిగా ఎదుర్కోవడానికి ఆర్థిక, సామాజిక సంస్కరణలు చేపట్టి ఆయా వర్గాలను సాధికారులను చేయడం అనివార్యమని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, మరో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త మక్బూన్ ఉల్హక్ వంటి వారు చాలా కాలం క్రితమే చెప్పారు. అందుకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యావిధానాలలో పూర్తిస్థాయిలో సంస్కరణలు చేయాలనీ; ఆరోగ్య రంగంలో రోగ నివారణ, వైద్యం, తల్లుల పౌష్టికాహారం, పర్యావరణ పరిరక్షణ, వృద్ధుల సంక్షేమం వంటివి అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశాలనీ పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ చర్యలు చేపట్టింది. రైతులు, అసంఘటిత కార్మికులు, చేతివృత్తులపై ఆధారపడిన వారి ఆదాయాల్ని పెంచడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఢిల్లీలో ఆవ్ుఆద్మీ ప్రభుత్వంగానీ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగానీ ఆ బాటలోనే నడుస్తున్నాయి. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం సైతం కొన్ని వినూత్న సంక్షేమ పథకాలతోపాటు ‘దళితబంధు’ వంటి ప్రయోగాత్మక పథకాలను అమలు చేస్తోంది. నిజానికి, ప్రభుత్వాలకు భారత రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం సంక్షేమ రాజ్యస్థాపనే. ఈ ఏడు దశాబ్దాల కాలంలో కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ, అభివృద్ధి రంగాలపై ఖర్చు చేశాయి. అయినప్పటికీ దేశంలో వ్యవసాయ రంగం తిరోగమనంలో ఉంది. నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరింది. ఖర్చు చేసిన నిధుల వల్ల అధికంగా ప్రయోజనం పొందిన వర్గాలేమిటి? ఎందుకు ఆర్థిక అంతరాలు అంతకంతకూ పెరిగాయి? సంపద పెంచామని చెప్పుకొంటున్న వారి పాలనలో ఎవరు బాగుపడ్డారు? ఏ ప్రాంతాలు అభివృద్ధి సాధించాయి? ఏ మేరకు ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గాయి? విద్య, వైద్యం ఖరీదుగా మారి పేద, మధ్యతరగతి వర్గాలకు అందని ద్రాక్షగా మారిపోవడానికి కారణం ఏమిటి? ఇందుకు అవలంభించిన విధానాలను సమీక్షించాల్సిన అవసరం లేదా? అధికారంలో ఉండగా పేద వర్గాలను సాధికారులుగా చేయకుండా వారి సంక్షేమాన్నీ, అభివృద్ధినీ నిర్లక్ష్యం చేసినవారు... ఇపుడు ఆ వర్గాలు అభివృద్ధిబాటలో పయనిస్తూ తమను ఆదరించిన పార్టీకి కృతజ్ఞతాపూర్వకంగా మళ్లీ ఎన్నికలలో ఎక్కడ ఓట్లు వేస్తారేమోనని భయపడుతున్నారు. ఇపుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఢిల్లీలో అమలు జరుగుతున్న వినూత్న సంక్షేమ కార్యక్రమాల్ని ఎలాగైనా నిలుపుదల చేయించాలని కొన్ని విఫల యత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే, ఆ పార్టీల్ని ప్రజలు క్షమిస్తారా?! సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
నకిలీ వీడియోపై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్
సాక్షి, ఢిల్లీ: తనను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. నకిలీ వీడియోపై స్పందించిన ఆయన.. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఓ వీడియోలో తాను ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారని.. ఏ విచారణకైనా, ఫోరెన్సిక్ టెస్టుకైనా సిద్ధమన్నారు. ఆ వీడియో నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఈనాడు వండివార్చిన వట్టి మాటల స్టోరీ! అసలు విషయం ఇదే.. కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ ఉన్నారన్నారు. ఇప్పటికే ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎంపీ తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే నన్ను స్ట్రయిట్గా ఎదుర్కోవాలన్నారు. ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘నేను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారు. బాధ్యులపై పరువు నష్టం దావా వేస్తాను’’ అని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. -
ఏది నిజం?: తడబాటు కాదు... అధికారపు ఎడబాటు
ఒక వ్యవస్థను చక్కదిద్దాలంటే ఒక్క రోజులో సాధ్యమా? పునాదుల నుంచే చెదలు పట్టేసి... నారాయణలు, చైతన్యలు ఆక్రమించేసి... ప్రభుత్వ స్కూళ్లంటేనే భయపడుతూ... చచ్చో చెడో నిరుపేదలు సైతం ప్రయివేటు స్కూళ్లకే పిల్లలను పంపిస్తున్న వ్యవస్థ ఇది. అలాంటి వ్యవస్థను మార్చడానికి నిబద్ధతతో అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ అడుగుల్ని సైతం సరిగా పడనీయకుండా సవాలక్ష అడ్డంకులు. రాష్ట్రంలో సర్కారీ విద్యను సర్వనాశనం చేసేసిన చంద్రబాబు నాయుడు... ఆ బాబుతోనే తమ మనుగడ అని భావించే ముగ్గురు మీడియాధిపతులు!!. రాష్ట్రం సర్వనాశనమైపోయినా సరే... తామే ఏలాలనుకునే ఈ చతుష్టయం ఇప్పుడు సర్వశక్తులూ ఒడ్డుతోంది. రాష్ట్రంలో విద్యారంగంలో జరుగుతున్న మేలుకు ప్రజలంతా ఆకర్షితులవుతున్నా... వీళ్లు మాత్రం లేనిపోని రాతలతో విషం కక్కడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘తడబడిన విలీనం’ అంటూ సోమవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో అచ్చేసిన కథనం ఇలాంటిదే. అసలిందులో నిజం ఏ కోశానైనా ఉందా? అంగన్వాడీల నుంచి మొదలుపెడితే చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థను చూసినంత హీనంగా ఏ వ్యవస్థనూ చూడలేదనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన దృష్టంతా కార్పొరేట్ స్కూళ్లపైనే. ఏకంగా కార్పొరేట్ డాన్ నారాయణను తెచ్చి కేబినెట్లోనే పెట్టుకున్న చరిత్ర బాబుది. అంగన్వాడీల్లో ప్రత్యేక కిచెన్ గానీ, ప్లేగ్రౌండ్ గానీ ఉండేవి కాదు. సిబ్బందే సరిగా లేని దుస్థితి. ఇక 1 నుంచి 5 వరకు నడిచే స్కూళ్లకు ఒకరిద్దరు ఎస్జీటీలే దిక్కు. విద్యార్థులకు సదుపాయాలు దేవుడెరుగు. తరగతి గదులూ కొరతే. 18 సబ్జెక్టుల్ని ఆ ఒకరిద్దరు టీచర్లే బోధించేవారు. అప్పర్ ప్రయిమరీ స్కూళ్లు, హైస్కూళ్లదీ అదే గతి. అనేక యాజమాన్యాల పరిధిలో ఉండటంతో హై స్కూళ్ల నడుమ సంబంధాలూ ఉండేవి కాదు. ఈ చదువుల దెబ్బకు పిల్లలు తమ తరగతి పుస్తకాల సంగతి అటుంచి... కింది తరగతుల పుస్తకాలనూ చదవలేని దుస్థితికి జారిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే నేషనల్ అకడమిక్ సర్వే (న్యాస్), ప్రథమ్ సంస్థ చేసిన ‘అసర్’ సర్వే... అన్నీ తేల్చింది ఇదే. విచిత్రమేంటంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా... మేకప్ వేసి, తమ కార్పొరేట్ స్కూళ్ల కడుపు నింపడానికే ప్రయత్నించారు చంద్రబాబు. కార్పొరేట్ కాలేజీల్లోకి విద్యార్దుల చేరికలను పెంచడానికి టార్గెట్లు పెట్టి... కాపీయింగ్ను ప్రోత్సహించి మరీ టెన్త్లో కృత్రిమ ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్ కాలేజీల్లో చేరి... ఆ తరవాత సరైన నైపుణ్యాలు లేక... జీవితాలనే కోల్పోయిన ఎంతో మంది ... బాబు బ్రెయిన్ చైల్డ్లే!. కాకపోతే ఇంతటి ఘోరమైన పరిస్థితుల్ని ‘ఈనాడు’ ఏనాడూ ప్రశ్నించలేదు. రామోజీ ఒక్క అక్షరమూ రాయలేదు. ఇపుడు మాత్రం పునాదుల నుంచి జరుగుతున్న మార్పును తట్టుకోలేకపోతుండటమే అన్నిటికన్నా దారుణం. మొత్తం వ్యవస్థకే చికిత్స...! ఇదేదో ఒక రోడ్డో, ఒక వంతెన సమస్యో కాదు. విద్యా వ్యవస్థ. పునాదుల నుంచీ కుళ్లిపోయింది. అందుకే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కాయకల్ప చికిత్స మొదలెట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చూపించనంత శ్రద్ధతో నెలకు రెండు సార్లు సమీక్షిస్తూ... ఫౌండేషన్ విద్య నుంచే శ్రీకారం చుట్టారు. దాదాపు 56వేల స్కూళ్లను ‘నాడు–నేడు’ పథకంతో సమూలంగా మార్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో 15,715 స్కూళ్లను సమగ్ర మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు. మిగిలిన స్కూళ్లలోనూ 2వ, 3వ విడతల్లో ఈ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ మూడేళ్లలో 70కి పైగా సమీక్షలు విద్యారంగంపైనే నిర్వహించారంటే సీఎం చిత్తశుద్ధి చెప్పకనే తెలుస్తుంది. మంచిని ఏమాత్రం గుర్తించని చతుష్టయం... నిజానికి పాఠశాల విద్యలో కనీవినీ ఎరుగని సంస్కరణలు మొదలయ్యాయి. దీనికి పొరుగు రాష్ట్రాలే కాదు... కేంద్ర సంస్థలూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. కానీ చంద్రబాబుతో కూడిన చతుష్టయం... తమ రాతల్లో ఏనాడూ ఒక్క మంచి పనిని ప్రస్తావిస్తే ఒట్టు. దేనిపైనయినా బురద చల్లటమే. నాడు–నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చటంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని జగనన్న గోరుముద్దగా అందిస్తూ... పిల్లల్ని స్కూళ్లకు పంపించే తల్లులకు బాసటగా ‘అమ్మ ఒడి’ పేరిట నగదు జమచేస్తున్న ప్రభుత్వం... జగనన్న విద్యాకానుకగా పుస్తకాలు, యూనిఫామ్, షూస్, డిక్షనరీ తదితర వస్తువుల్ని స్కూళ్లు మొదలుకాకముందే ఉచితంగా అందిస్తోంది. గతంలో స్కూళ్లు ఆరంభమై 6 నెలలు గడిచినా పుస్తకాలే చూడని విద్యార్థులకు ఆరంభం కాకముందే అన్నీ ఉచితంగా అందించటమనేది ఈ దుష్ట చతుష్టయానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. తమ పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదవాలన్న ఉద్దేశంతో చివరికి కోర్టులకు కూడా వెళ్లి ఆంగ్ల విద్యను రకరకాల మార్గాల్లో వ్యతిరేకించిన తీరు వీళ్లది.. రెండు భాషల్లో ప్రచురించిన పుస్తకాలు... ఏకంగా ఎన్సీఈఆర్టీ ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఇక పెద్దపెద్ద కార్పొరేట్ స్కూళ్లకే సాధ్యమైన ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ ఆన్లైన్ పాఠాలను రాష్ట్ర సర్కారీ స్కూళ్ల 8వ తరగతి విద్యార్థుల ట్యాబ్లెట్లలోకి తెచ్చిన ఘనత కూడా సీఎం జగన్దే. దశల వారీగా అన్ని ప్రభుత్వ స్కూళ్లనూ సీబీఎస్ఈకి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) అనుసంధానిస్తున్నారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధతో... విద్యార్థులకిస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లను స్వయంగా చూస్తున్నారు సీఎం. గోరుముద్దను ఆయనే రుచిచూస్తున్నారు. పిల్లల పొట్టలు నిండితేనే అక్షరాలు బుర్రకెక్కుతాయని గట్టిగా విశ్వసిస్తూ రుచికరమైన మెనూను తనే రూపొందిస్తున్నారు. ఇదిగో... వీటన్నిటి ఫలితమే... పొరుగు రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలల్లో పిల్లలు తగ్గి... ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయి. సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిక్కూడా పచ్చ రంగు పులుముతూ... ప్రజల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయి కనక ప్రయివేటు స్కూళ్లు వదిలి ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్నారని వక్రభాష్యాలు చెబుతున్న చరిత్ర రామోజీరావుది. ఏం! పక్క రాష్ట్రాల్లో కరోనా రాలేదా? అక్కడ జనం ఆర్థిక పరిస్థితులు దెబ్బతినలేదా? వాళ్లెందుకు ప్రభుత్వ స్కూళ్లలోకి మారలేదు? ప్రయివేటు స్కూళ్లలో అడ్మిషన్లెందుకు పెరుగుతున్నాయి? ఇక్కడ సర్కారీ స్కూళ్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నందుకే కదా... జనం వాటికి మారుతున్నారు? ఆ మాత్రం తెలుసుకోలేరా రామోజీరావు గారూ..? అసలు 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను తేవాలన్న ఆలోచన మీకు గానీ, మీ బాబుకు గానీ ఏనాడైనా వచ్చిందా? ఇలాంటి ప్రయత్నాల్ని అభినందించటం మీకిష్టం లేకపోతే కనీసం వ్యతిరేకించకుండా అయినా ఉండాలి కదా? మీరొక పత్రికాధిపతి అని, మీ పత్రికను చదివేది తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే కాదని ఇంకెప్పుడు తెలుసుకుంటారు? మీ పాఠకులను గౌరవించటం ఎప్పుడు నేర్చుకుంటారు? ఇదీ... స్కూళ్ల మ్యాపింగ్ తీరు ► వీలున్న చోట అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలకు అనుసంధానించి వారికి స్కూలు వాతావరణాన్ని అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ► 8 ఏళ్లలోపు పిల్లల్లోనే బ్రెయిన్ అభివృద్ధి ఎక్కువ కనక... ప్రాథమిక పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాల్ని అనుసంధానించి ఫౌండేషన్ స్కూళ్లుగా మారుస్తున్నారు. ► తరగతులను ఇతర స్కూళ్లకు అనుసంధానం చేసేటప్పుడు విద్యార్ధులకు ఇబ్బందిలేకుండా ఉండేలా 250 మీటర్ల నుంచి 1 కి.మీ. పరిధిలో ఉండే వాటిని మాత్రమే విలీనం చేసేలా విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. నెలల తరబడి కసరత్తు.. క్షేత్రస్థాయి పరిశీలన చేశాకే చర్యలు చేపట్టారు. – దశల వారీగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో.. 820 వరకు స్కూళ్లకు సంబంధించి సమస్యలు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి రాగా... వాటిపై జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి... వాటికి పరిష్కార బాధ్యతలు అప్పగించారు. కాకపోతే ఇవేవీ రామోజీరావుకు పట్టవు. విలీనంపై గాలి వార్తలు రాయటం ద్వారా తల్లిదండ్రుల్లో లేనిపోని అనుమానాలు సృష్టించి... ఏదో ఒకరకంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నది ఆయన దింపుడుకళ్లం ఆశ. మిగిలిన స్కూళ్లు సైతం... శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీహైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూళ్లు ప్లస్గా వర్గీకరించి... అన్నిటా విద్యార్ధులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అవసరమైన చోట నాడునేడు రెండో విడతలో ప్రత్యేకంగా అదనపు తరగతి గదుల నిర్మాణాన్నీ చేపట్టారు. కాకపోతే ఈ నిర్మాణాలన్నీ ఒక్కరాత్రిలో పూర్తయ్యేవి కావు. వేల కోట్ల నిధులతో పాటు పక్కా ప్రణాళిక, పర్యవేక్షణ అవసరం. వేగంగా అడుగులేస్తూ ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వెళుతున్న జగన్ ప్రభుత్వానికి... అసలు ఈ దిశగా జీవితంలో ఎన్నడూ ఆలోచించని చతుష్టయం నుంచి వ్యతిరేకత రావటమే ఘోరాతిఘోరం. ► ఇక మ్యాపింగ్ పూర్తయిన స్కూళ్లలోని విద్యార్ధులకు సబ్జెక్టు టీచర్ల ద్వారా బోధనకు వీలుగా అదనపు స్కూల్ అసిస్టెంటు టీచర్లను విద్యాశాఖ ఏర్పాటు చేయిస్తోంది. ఇందుకోసం 8,233 మంది ఎస్జీటీ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి ఏర్పాట్లు చేసింది. కొన్ని చోట్ల పలు పోస్టులను స్కూల్ అసిస్టెంటు స్థాయికి అప్గ్రేడ్ చేపట్టింది. ఆ ఫోటోల వెనక ఎన్నో అర్థసత్యాలు... సోమవారంనాడు ప్రచురించిన ఫోటోల్లో ‘ఈనాడు’ చెప్పని నిజాలివీ... ► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పంచాయతీ పెద్దపేట స్కూల్కు వెళ్లాలంటే 35 ఎకరాల చెరువు దాటి వెళ్లాల్సి వస్తోందనేది ‘ఈనాడు’ కథనం సారాంశం. స్కూలు వెనుక భాగాన చెరువు ఉంది. దాన్ని దాటే పనిలేదు. ఆ స్కూలుకు రెండు వైపులా రోడ్లున్నాయి. కేవలం అరకిలోమీటర్ పరిధిలోని స్కూలులోని పిల్లలను ఈ స్కూలుకు మ్యాపింగ్ చేయడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఆహ్వానించారు. ► ఏలూరు జిల్లా ఉంగుటూరులోని మ్యాపింగ్ అయిన స్కూల్లో విద్యార్దులకు సరిపడే ఫర్నీచరు వేసి విద్యార్థులు ఉపాధ్యాయులు కూర్చోబెట్టారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నాడు– నేడు పనులు చేస్తున్న కారణంగా రెండు రోజులుగా గదులు సర్దుబాటు చేసున్నారు. తాత్కాలికంగా కూర్చోబెట్టిన ఫోటోను తీసి... శాశ్వతంగా వసతులు లేవన్నట్లు రాయటమే ‘ఈనాడు’ పైత్యానికి పరాకాష్ట. ► రాచూరు హైస్కూల్లో 3,4,5 తరగతుల విధ్యార్దులను కలిపి కూర్చొబెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా అబద్ధమే. నాడు నేడు పనులు జరుగుతున్న కారణంగా తాత్కాలికంగా ఇలా సర్దుబాటు చేశారు తప్ప గదులుపూర్తవ్వగానే ఆయా గదుల్లోకి తరగతులను మారుస్తారు. ఇక్కడ ఒక్కోగదికి 12 లక్షలు చొప్పన రెండు అదనపు గదులను ప్రభుత్వం నిర్మిస్తోంది. -
పోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది: మంత్రి అంబటి
-
చంద్రబాబు ఏం చేశాడో తెలుసా?.. వాస్తవాలు చెప్పిన మంత్రి అంబటి
సాక్షి, విజయవాడ: పోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ గురించి మ్యాప్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలను వివరించారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబు నిర్ణయాలే కారణమన్నారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. చదవండి: వరద బాధితుల సహాయార్థం ఏపీఎండీసీ రూ.5 కోట్ల విరాళం ‘‘నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టర్లను తీసుకొచ్చిన ఘనుడు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకత పాటించాం. పనుల్లో నాణ్యత పెంచేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోంది. ట్రాన్స్ట్రాయ్ను తీసేసి నవయుగ తెచ్చింది చంద్రబాబు కాదా?. కాఫర్ డ్యామ్ కట్టకుండా డయా ఫ్రమ్ వాల్ ఎలా కట్టారు?. డయా ఫ్రమ్ వాల్ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారు. కాసుల కోసం కక్కుర్తిపడి చారిత్రాత్మక తప్పిదం చేశారు. నాటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మాపై విష ప్రచారం చేస్తున్నారు. ఆర్అండ్ఆర్ను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ముంపు ప్రజలకు ప్యాకేజ్ అందించి ఖాళీ చేయిస్తున్నాం. ఆర్అండ్ఆర్కు రూ.1500 కోట్లు ఖర్చు చేశామని’’ అంబటి అన్నారు. ‘‘పోలవరంపై టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర చేస్తోంది. పోలవరం విధ్వంసం అంటూ విష ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వలనే పోలవరం ఆగినట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ట్రాన్స్ ట్రాయ్ ని తొలగించి నవయుగ అనే సంస్థకు అప్పగించారు. మేము రివర్స్ టెండర్ నిర్వహించి ప్రభుత్వానికి 12.6 శాతం ఆదా చేశాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి దుర్మార్గమైన వార్తలు రాస్తున్నాయి. కాపర్ డ్యాం కట్టాక డయా ఫ్రంవాల్ కట్టాలి. కానీ చంద్రబాబు ఏం చేశాడో అందరూ తెలుసుకోవాలి. ఆయనగారి ముందు చూపులేని ఫలితంగా ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాపర్ డ్యాం నిర్మాణం చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేయటం వలనే ఇబ్బందులు. చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చటానికి ఎల్లోమీడియా తాపత్రయ పడుతోంది. వాస్తవాలు రాసే దమ్ము ఆ మీడియాకు ఉందా?’’ అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. -
‘ఈనాడు’ ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతోంది?
అది 1986వ సంవత్సరం ఆగస్టు పదిహేనో తేదీ.. పైన ఎండ.. కింద వరద.. వినడానికి ఆశ్చర్యంగానే ఉండవచ్చు. కానీ అది నిజం. సడన్గా కాకపోయినా గోదావరికి విపరీతమైన వరద ఎగువ నుంచి వచ్చింది. అది సుమారు 36 లక్షల క్యూసెక్కులపైనే ఉంది. దాని కారణంగా గోదావరి గట్టు దెబ్బతిన్నాయి. పలు చోట్ల గండ్లు పడ్డాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో అనేక పట్టణాలు, వందలాది గ్రామాలు నీట మునిగిపోయాయి. చదవండి: ఏపీలో వృద్ధి చాలా బాగుంది.. నీతి ఆయోగ్ బృందం ప్రశంసలు ప్రజలు అల్లల్లాడారు. కొవ్వూరు సమీపంలోని విజ్జేశ్వరం ప్లాంట్ చూస్తూ ఉండగానే మెయిన్ కెనాల్లో కొట్టుకుపోయింది. పలు కాల్వలు పొంగిపొర్లాయి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఎవరూ ఎన్టీఆర్ ప్రభుత్వం విఫలం అనో, మరొకటనో పెద్దగా విమర్శించలేదు. సహాయ కార్యక్రమాలు ఎలా జరగాలన్నదానిపైనే అధికంగా మాట్లాడారు. ఏటి గట్లను ఎలా పటిష్టం చేయాలన్నదానిపై అదికారులు దృష్టి పెట్టారు. అప్పట్లో ఈనాడు పత్రిక సైతం ఆయా వర్గాలకు, రంగాలకు జరిగిన వరద నష్టం గురించి వార్తలు ఇచ్చిందే కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనికట్టుకుని వార్తలు ఇచ్చినట్లు జ్ఞాపకం లేదు. కానీ ఇప్పుడు చూడండి. ప్రస్తుతం ముప్పై లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా, ప్రభుత్వం సకాలంలో స్పందించి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కానీ, గతంలో ఏటి గట్ల ఎత్తు పెంచడం వల్ల కానీ గోదావరికి గండి పడలేదు. కాకపోతే నది కట్టదాటి నీరు రావడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. ముఖ్యంగా నది మధ్యలో ఉండే లంకల్లోని ప్రజలు అవస్థలు పడ్డారు. ప్రతి వరద సమయంలోనే ఈ లంకల ప్రజలకు ఇది అనుభవమే. వెంటనే ప్రభుత్వాలు నిర్దిష్ట నిబంధనల ప్రకారం వారికి సహాయ కార్యక్రమాలు చేపడతాయి. ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా భోజనం, నీరు సరఫరా, తాత్కాలిక శిబిరాల ఏర్పాటు మొదలైన చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించి, ఆయా జిల్లాలకు అవసరమైన నిధులు విడుదల చేశారు. ఆహారం విషయంలో ఎక్కడా రాజీపడవద్దని ఆదేశించారు. ప్రభుత్వం అంటే వెయ్యి కాళ్ల అమీబా వంటిది. అది ఎటు నుంచి ఎటు వెళుతుంటుందో, ఎక్కడ ఎవరు ఏమి చేస్తుంటారో చెప్పలేం. ఇదేదో ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అని కాదు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమస్య తప్పదు. కానీ తెలుగుదేశం పార్టీకి కంకణం కట్టుకుని సేవ చేస్తున్న ఈనాడు దినపత్రిక మాత్రం అసలు సహాయ కార్యక్రమాలే జరగడం లేదన్నట్లుగా ప్రచారం ఆరంభించింది. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎంతో జాగ్రత్తగా, ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకంగా వార్తలు రాయకుండా జాగ్రత్త పడుతోంది. దీనిని ప్రజలు గమనించలేదని వారి భావన కావచ్చు. దానినే పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకుంటుందంటారు. అలాగే ఈనాడు కూడా వ్యవహరిస్తోంది. మరో ఉదాహరణ కూడా చెప్పాలి. హైదరాబాద్లో అధ్వాన్నంగా ఉన్న ఒక రోడ్డు ఫోటోను ఈనాడు జిల్లా ఎడిషన్లో వేశారు. అదే ఏపీలో అయితే జనరల్ ఎడిషన్ మొదటి పేజీలో ప్రచురించి అక్కడ అసలు రోడ్లే లేవన్నట్లు స్టోరీలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయాలని అనడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగాను, తెలంగాణలోను మరో రకంగాను వ్యవహరిస్తూ ఈనాడు పత్రిక , ఈనాడు టివీ చానల్ కానీ, టీడీపీకి నిస్సిగ్గుగా సపోర్టు చేస్తూ బట్టలు ఊడదీసుకుని తిరుగుతున్న మరికొన్ని ఇతర మీడియా సంస్థలు కాని ఎలా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయో చెప్పడానికి ఈ విషయం ఉదహరించవలసి వస్తున్నది. ఒక పక్క వరద బాధితులను ఆదుకునే చర్యలలో ప్రభుత్వ అధికారులు బిజీగా ఉంటే, ఈ మీడియా మాత్రం ప్రభుత్వంపై విషం కక్కే పనిలో ఆత్రంగా కనిపించింది. ఈనాడులో ఒక రోజు పెట్టిన హెడింగ్ ఏమిటంటే వరద బాధితులను గాలికి వదలివేశారు అని. అది నిజమా? అన్నది ఆలోచిస్తే ఎక్కడైనా ఏదైనా గ్రామంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కొందరికి సాయం అంది ఉండకపోవచ్చు. కాని దానిని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్లో ప్రొజెక్టు చేయడం ద్వారా ఈనాడు తన కుళ్లు బుద్ది ప్రదర్శించిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ముందుగా ప్రభుత్వం మంత్రులను, సీనియర్ అధికారులను పంపించి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న వైనాన్ని, పలు చోట్ల గ్రామాలలో సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సదుపాయాలు కల్పిస్తున్న తీరు గురించి కాని, వారికి భోజనాది సదుపాయాలు సమకూర్చుతున్న వైనం గురించి, ప్రభుత్వ సిబ్బంది పడుతున్న కష్టం గురించి కాని వాస్తవిక సమాచారం ఇచ్చి, ఎక్కడైనా లోటుపాట్లు రాస్తే అది జర్నలిజం అవుతుంది. నిజంగానే ప్రభుత్వం వైపు నుంచి అసలు స్పందన లేకపోతే వార్తలు రాయవచ్చు. అలా కాకుండా ఒక పక్కన వేగంగా ప్రభుత్వం స్పందిస్తుంటే, మరో పక్క ఈనాడు వంటి మీడియా అబద్దాలనాడుగా మారి ప్రజలపై ద్వేషపూరిత కథనాలను కక్కడం దారుణంగా ఉంది. నిజంగానే ఈనాడులో వస్తున్నంత దారుణంగా పరిస్థితి ఉందా అని విచారిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఈ మీడియా తీరుపై కూడా ఆందోళన చెందుతున్నారట. ప్రభుత్వపక్షాన ప్రజలకు సాయం అందుతున్నప్పుడు ఇలా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే, జనంలో విశ్వసనీయతను కోల్పోవడం జరుగుతుందని, ఆ తర్వాత ఏదైనా నిజం రాస్తే కూడా జనం నమ్మరని, ఈనాడు ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతోందని అంటున్నారట. మరో సంగతి ఏమిటంటే తెలుగుదేశం ఆఫీస్ నుంచి పార్టీ వారికి కొన్ని ఆదేశాలు వెళ్లాయట. వరద నీటిలో దిగి ఫోటోలు, వీడియోలు దిగి ప్రచారం చేయాలని, ప్రభుత్వ అధికారులు ఎవరూ రాలేదని చెప్పించాలని చెప్పారట. దానికి తగినట్లుగానే కొంతమంది చేస్తున్నారు. అది వేరే సంగతి. అయితే వాస్తవం ఏమిటంటే గ్రామాలలో ఉన్న వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, మండల సిబ్బంది తదితరులు ప్రజలకు సేవలందించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం వల్ల పెద్దగా ఇబ్బందులు రావడం లేదు. అలాగనీ ప్రజలందరికి తమ సొంత ఇళ్లలో ఉన్న మాదిరి సౌకర్యాలు సమకూర్చడం ఎవరివల్లాకాదు. మన ఇంటికి పది మంది వస్తేనే ఏమి చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడతాం. సరిపడినన్ని మంచాలు లేక కొందరు కింద కూడా పడుకుంటారు. ఇది సహజం. అలాంటిది ఇంత పెద్ద కలామిటీ సంభవించినప్పుడు ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వాలు స్థూలంగా వారికి కనీస అవసరాలు తీర్చుతున్నారా? లేదా అన్నది గమనించాలి. ప్రభుత్వ సిబ్బంది పడవలలో వరదలో ప్రయాణం చేసి ప్రజలను కలుసుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలలో వారికి ఆశ్రయం కల్పించడం వంటివి జరుగుతున్నాయి. భోజనాలు కూడా సకాలంలో అందుతున్నాయి. వీటిని కొన్ని మీడియాలు కవర్ చేస్తున్నాయి. కానీ ఈనాడు, ఇతర టీడీపీ మీడియాకు మాత్రం ఇవేవి కనిపించకపోతే మానే. అచ్చంగా ప్రజలను ఎవరూ పట్టించుకునే వారే లేకుండా పోయారని, వారిని భయపెట్టే విధంగా వార్తలు ఇస్తుండడం శోచనీయం, పిల్లలకు పాలు లేవు, పెద్దలకు తిండి లేదు అంటూ పచ్చి పాపంగా ఈనాడు కథనాలను దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. ఇదంతా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడిస్తారా అన్న పగ, జగన్ ప్రభుత్వంపై ఉన్న కక్షతో ఇలా చేస్తున్నారు. ఈనాడులో ఈ వార్తలు వచ్చిన రోజుల్లోనే హిందూ ఆంగ్ల దినపత్రిక డెబ్బై ఐదు వేల మందిని సహాయ శిబిరాలకు తరలించారని వారికి సహాయం అందుతోందని వార్తలు రాసింది. మరి ఎవరిని నమ్మాలి? పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను రాస్తూ, వారికి శాశ్వత సదుపాయం కల్పించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని రాశారు. తప్పు లేదు. కానీ దానికి కారణం కేంద్ర ప్రభుత్వమా? గత ప్రభుత్వమా? నిధులు ఎవరు ఇవ్వాలి మొదలైన అంశాలు టచ్ చేయకుండా అదేదో ప్రస్తుత ప్రభుత్వం విఫలం అయిందని ప్రజలు అనుకోవాలన్నట్లుగా కథనాలు ఇస్తున్నారు. వీళ్ల వైఖరి చూస్తే ఏటి గట్లకు ఎక్కడా గండ్లు పడలేదేమిటి? అన్న బాధ వీరికి ఉందా అన్న అనుమానం వస్తుంది. చదవండి: ఇవేం రాతలు, ఇవేం కూతలు? పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా నీటిని కిందకు విడుదల చేయడానికి గేట్లను సమర్థంగా ఓపెన్ చేయగలిగారు. ఇందులో ఏదైనా చిన్న తేడా వచ్చినా టీడీపీ మీడియా రచ్చ, రచ్చ చేసి ఉండేది. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన సహజ శైలిలో పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ హెలికాఫ్టర్లో సర్వే చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా గతంలో తుపానులు, వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు సీఎం హోదాలో హెలికాఫ్టర్లో ప్రయాణిస్తూ టీ కూడా సేవిస్తూ సర్వే చేస్తున్న వీడియో ఫోటోలను సోషల్ మీడియాలో కొంతమంది పోస్టు చేశారు. గతంలో హుద్ హుద్ తుపాను సమయంలో విశాఖలో అన్ని సదుపాయాలు ఉన్నా, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఖరీదైన బస్లో బస చేసి చాలా కష్టపడ్డానని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు జగన్ ప్రచార ఆర్భాటాలు చేయడం లేదు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎలా తయారైందంటే ప్రతిపక్షం అంటే అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేయడమే అన్నట్లుగా ఉంది. చివరికి ఏ దశకు వెళ్లారంటే తామే సమస్యను సృష్టించడం, తర్వాత వారే ప్రచారం చేయడం. జనసేన కూడా ఈ విషయంలో టీడీపీని దాటి పోవాలని చూస్తోంది. అందుకే రోడ్లు బాగోలేదంటూ చేస్తున్న ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలో ఒక చోట జనసేన కార్యకర్తలే చక్కగా ఉన్న రోడ్డును తవ్వుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని బట్టి ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏ స్థాయిలో టీడీపీ, జనసేన, వారికి మద్దతు ఇచ్చే ఈనాడు తదితర మీడియాలు ఎంత అధమ స్థాయిలో వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
మద్యం మరణాలపై టీడీపీ దుష్ప్రచారం: ఎంపీ మోపిదేవి
సాక్షి, బాపట్ల జిల్లా: మద్యం మరణాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఆదివారం ఆయన రేపల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతకు చెందిన వేడుకల్లో మద్యం పంపిణి చేశారని.. ఆ వేడుకల్లో మద్యం తాగి ఇద్దరు మరణిస్తే ప్రభుత్వానికి అంటగడుతున్నారన్నారు. చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యే సత్యప్రసాద్ శవ రాజకీయాలు చేస్తున్నారని మోపిదేవి నిప్పులు చెరిగారు. చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు -
సాక్షి కార్టూన్ 16-7-2022: పాత ఫొటోలు వెతుకుతుంటే ఈ ఫొటో దొరికింది సార్!
పాత ఫొటోలు వెతుకుతుంటే ఈ ఫొటో దొరికింది సార్! -
ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ?
రామోజీరావుకు మండుతోంది. రావాల్సిన వాటాలు రావటం లేదన్న మంట!!. ఐదేళ్ల పాటు రాత్రీపగలూ తేడాలేకుండా యథేచ్ఛగా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల ఇసుక సొమ్ము.. మూడేళ్లుగా దారి తప్పి నేరుగా ప్రభుత్వ ఖాతాలోకే పోతోందన్న మంట!!. ఇకపై తన ’బాబు’ గెలిచే అవకాశం లేదన్న మంట!!. తమ విషప్రచారాన్ని జనం మునుపట్లా నమ్మటం లేదన్న మంట!!. అందుకే శివాలెత్తిపోతున్నారు. చదవండి: వంశ‘ధార’ ఎత్తిపోతలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ప్రతి రోజూ పతాక శీర్షికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడి... వీలైనంత విషం చిమ్ముతున్నారు. శనివారం వండి వార్చిన ‘చెన్నై సంస్థ గుప్పిట్లోనే ఇసుక’ కథనం కూడా అలాంటిదే!!. ఆరు నెలల కిందట రాసిన ఇదే కథనాన్ని.. మళ్లీ ఓసారి బూజు దులిపి అచ్చు వేసేశారు. నిజాలకు పూర్తిగా పాతర వేసేసి... అడుగడుగునా జనంలో అనుమానాలు రేకెత్తేలా విషం గక్కిన ఈ కథనంలో... నిజానిజాలేంటో చెప్పే ప్రయత్నమే ఇది.. అబద్ధాలను అందంగా పేర్చడంలో ‘ఈనాడు’ది అందెవేసిన చేయి. ఎందుకంటే టెండర్ల ప్రక్రియ గురించి కానీ... సబ్ కాంట్రాక్టర్ల గురించి కానీ... ఆ కాంట్రాక్టర్లు పెట్టుకునే సిబ్బంది గురించి కానీ రామోజీకి తెలియనిదేమీ కాదు. కాకపోతే జనం తను ఏది చెబితే అది నమ్ముతారన్న భ్రమలో ఈ తరహా రాతలు రాస్తుంటారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ ఇసుక ఉచితమే అని రామోజీ పదేపదే రాస్తారు తప్ప... ఆ ఉచితం ప్రజలకు కాదని, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, కొందరు నేతలకే అని చెప్పరు. దొంగల ముఠాగా ఏర్పడ్డ దుష్ట చతుష్టయం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు ఐదేళ్లు రాత్రీపగలూ యథేచ్ఛగా నదులూ, వాగులూ ఊడ్చేశారని చెప్పనే చెప్పరు. ఈ ఇసుక దోపిడీ ఏ స్థాయిలో సాగిందంటే... ఆఖరికి చినబాబు, పెదబాబు కనుసన్నల్లో కరకట్ట ఇంటివెనక తిరిగిన లారీల దెబ్బకు జాతీయ హరిత ట్రిబ్యునల్ కన్నెర్ర చేసింది. నాటి ప్రభుత్వంపై ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇదీ... రామోజీరావు చెప్పని అసలు కథ. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సమీపంలో కృష్ణానదిలో ఏకంగా రిగ్ ఏర్పాటు చేసి మరీ నదిగర్భాన్ని తవ్వేశారు.. చంద్రబాబు హయాంలో యథేచ్చగా ఇసుక దోపిడీ జరిగిందనేందుకు ఇవే నిదర్శనాలు.. అడ్డుకున్న ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని... అంతేకాదు!. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెగబడ్డ దాష్టీకానికి అప్పట్లో యావత్తు రాష్ట్రం విస్తుబోయింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లటం ఎవ్వరూ మరిచిపోలేరు. కాకపోతే ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరే అన్నిటికన్నా హైలైట్. ఇదేదో గట్టుకింద తగవు మాదిరి... వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసే సిగ్గుమాలిన ప్రయత్నం చేశారు. చింతమనేనిపై కేసు పెట్టడానికి కూడా మనసొప్పలేదు నారా వారికి. ఒక మహిళా అధికారికి అంతటి అన్యాయం చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా పెన్నెత్తి ఒక్క అక్షరమైనా రాయలేకపోయింది ‘ఈనాడు’. పైపెచ్చు చంద్రబాబు నాయుడి హయాంలో ఇసుక ఉచితం... అంటూ ఇప్పటికీ వండి వారుస్తుంటుంది. అదీ... రామోజీ మార్కు రాజకీయమంటే!!. టెండర్లలో మీరెందుకు పాల్గొనలేదు రామోజీ? నిజానికి బాబు హయాంలో ఐదేళ్లూ జరిగిన లూటీని చూశాకే ఈ విషయంలో పారదర్శకమైన విధానం తేవాలని భావించారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. ఉచితం అనే పేరుతో జనానికి విక్రయించిన రేటుకన్నా కాస్త తక్కువ ధరకే దొరికేలా... నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) చేతే విక్రయాలు జరిపించారు. దాదాపు ఏడాదిన్నరకు పైగా ఇలానే జరగ్గా... ఆ పద్ధతీ ‘ఈనాడు’కు నచ్చలేదు. కొన్నాళ్లు ఇసుక దొరకటం లేదంటూ... కొన్నాళ్లు లెక్కలు సరిగా లేవంటూ చేతికొచ్చిన రాతలు రాస్తూనే వచ్చింది. వీలైనంత విషం చిమ్ముతూనే వచ్చారు రామోజీ!!. వీటన్నిటికీ ఫుల్స్టాప్ పెట్టడానికి టెండర్లు పిలిచి ప్రైవేటు వారికే అప్పగించాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా రావాలని కేబినెట్ సబ్కమిటీ సిఫారసు చేయటంతో ఆ దిశగా కొత్త విధానం తెచ్చింది ప్రభుత్వం. టెండర్లలో ఎలాంటి అవకతవకలూ లేకుండా అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ఈ ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీకి అప్పగించింది ప్రభుత్వం. టెండర్లు పిలవటం నుంచి వారి అర్హతలను చూసి... అత్యధికంగా చెల్లిస్తామన్న బిడ్డర్ను ఎంపిక చేసే వరకూ అంతా ఎంఎస్టీసీయే చూసుకుంది. రాష్ట్రానికి వెలుపలున్న పలు సంస్థలు పాల్గొన్న ఆ టెండర్ల ప్రక్రియలోనే ఉత్తరాదికి చెందిన జేపీ వెంచర్స్ విజేతగా నిలిచింది. నిబంధనలు మీరితే కోల్పోయే షరతుతో రూ. 120 కోట్ల ముందస్తు డిపాజిట్ను కూడా చెల్లించింది. ఇవన్నీ వదిలి... ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో, మధ్యప్రదేశ్లోని నిగ్రీలో రిజిస్టర్డ్ చిరునామాలుండి, ఢిల్లీలో కార్పొరేట్ ఆఫీసున్న జేపీ సంస్థ కాంట్రాక్టును దక్కించుకుందనేది ‘ఈనాడు’ కథనం సారాంశం. ఏం? జాతీయ స్థాయి బిడ్లు పిలిచినప్పుడు జాతీయస్థాయి సంస్థలు రావా? మీరెందుకు టెండర్లు వేయలేదు రామోజీ? మీ అర్హతను బట్టి మీకే వచ్చేదేమో? బాబుతో కలిసి ఫ్రీగా లూటీ చేయటం అలవాటైంది కనక టెండర్లు వేయటానికి మనసొçప్పలేదా? జాతీయ స్థాయిలో టెండర్లు పిలవబట్టే కదా సదరు కాంట్రాక్టు సంస్థ ద్వారా ఇప్పుడు రాష్ట్రానికి పారదర్శకంగా ఏటా రూ.750 కోట్ల రాబడి వస్తోంది. ఐదేళ్లు లెక్కవేస్తే దాదాపు రూ.4 వేల కోట్లు. మరి బాబు హయాంలో ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి పోయింది రామోజీరావు గారూ? మీ ముఠానే లూటీ చేసిందన్న ఆరోపణలకు మీ దగ్గర సమాధానముందా? ఇక చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల ఇసుక దందా గురించి తెలియనిదెవరికి? సబ్ కాంట్రాక్టులు ఇవ్వకూడదా? దాన్ని అడ్డుకోగలరా? ఏ కాంట్రాక్టుకయినా ‘కాంట్రాక్టు ధర్మం’ తప్పనిసరి. అంటే!! అప్పగించిన పనిని పూర్తి చేయటం. ఆర్థికాంశాలకు నిబద్ధతతో కట్టుబడి ఉండటం. ఇసుక విషయంలోనూ ఇంతే. వాళ్లు ఎంత ఇసుకను తవ్వి జనానికి అందుబాటులో ఉంచాలనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది. గరిష్ట విక్రయ ధరను కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ప్రభుత్వానికి ఎంత రాయల్టీ చెల్లించాలన్నది కూడా కాంట్రాక్టు ధర్మంలోనే ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆ కాంట్రాక్టరు పనిచేస్తే చాలు. కానీ వీటికోసం తను ఎవరైనా సబ్ కాంట్రాక్టరును ఉపయోగించుకున్నారా, లేక కూలీలను పెట్టుకున్నారా... లేక ఎవరికైనా లీజుకిచ్చారా... ఇవన్నీ ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇదే పద్ధతి. చంద్రబాబు కానీ... మరో బాబు కానీ ఎవరు అధికారంలో ఉన్నా ఇదే పద్ధతి. దీన్ని కూడా ‘ఈనాడు’ తప్పు పట్టడమే చిత్రాతిచిత్రం. జేపీ సంస్థ వేరెవరిదో చెన్నై సంస్థకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చేసిందని, అన్నిచోట్లా వారే చక్రం తిప్పుతున్నారని రామోజీరావు శివాలెత్తిపోయారు. పైపెచ్చు సదరు సంస్థ తమిళం మాట్లాడే వాళ్లను, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల యాస మాట్లాడేవాళ్లను విధుల్లో ఉపయోగిస్తోందన్నది మరో ఆరోపణ. ఏం? తెలుగుదేశానికి చెందిన కాంట్రాక్టర్లు దేశంలో వివిధ ప్రాంతాల్లో పనులు దక్కించుకుని చేయలేదా? వేరొకరి దగ్గర సబ్ కాంట్రాక్టులు చేయలేదా? ఆ పనుల్లో తమ వారినే పెట్టుకోలేదా? ఇవన్నీ నియంత్రించగలిగే అంశాలేనా రామోజీ? ఎందుకీ విషపురాతలు? మీ ఫిలిం సిటీలోని అడ్వెంచర్స్, విజువల్ గ్రాఫిక్స్ వంటి రకరకాల విభాగాల్లో ఉన్నదంతా ఉత్తరాది వారే కదా? వారికి అందులో నైపుణ్యం ఉన్నదనే కదా తెచ్చుకున్నారు? చేసేదొకటి... చెప్పేదొకటి అయితే ఎలా? ధరలో పారదర్శకత కనిపించలేదా? చంద్రబాబు హయాంలో ఉచితం అని చెప్పినా... వాస్తవ ధర ఇప్పటికన్నా టన్నుకు రూ.50 నుంచి 100 వరకూ ఎక్కువే. అందుకనే కాంట్రాక్టరైన జేపీ వెంచర్స్కు ధరకు సంబంధించి ఖచ్చితమైన నిబంధన విధించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిప్రకారం ప్రతి వారం పత్రికల టాబ్లాయిడ్లలో స్థానికంగా ఇసుక ఎంత ధరకు లభిస్తోందన్నది స్పష్టంగా ప్రకటన ఇవ్వాలి. దాన్లోని ధరకన్నా ఎక్కువకు విక్రయించకూడదు. ఒకవేళ అలా విక్రయిస్తే ప్రజలు ‘‘14500’’ నెంబరుకు ఫోన్ చేయొచ్చు. ఇసుక, మద్యం అక్రమాల్ని ఏరిపారెయ్యడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) టోల్ ఫ్రీ నంబర్. ఇలా అక్రమాలకు పాల్పడ్డవారికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా వంటి చట్టాలనూ తెచ్చింది. మరి అక్రమాలకు తావెక్కడుంది రామోజీ.. మీ రాతల్లో తప్ప!!. ప్రతిరోజూ.. ఓ గోబెల్స్ ఘట్టం ఏమీ జరగకున్నా ఏదో జరిగిపోతోందన్న ప్రచారాన్ని సమర్థంగా అందరిలోకీ పంపి... అదే నిజమని వారంతా నమ్మేలా భ్రమింపజేసేవాడట గోబెల్స్. అలాంటి గోబెల్స్ ప్రచారంలో... దుష్ట చతుష్టయంగా ముద్ర పడ్డ దొంగముఠా దిట్ట. ప్రతిరోజూ ఓ అంశాన్నెత్తుకుని పతాక శీర్షికల్లో వేయటం ద్వారా గోబెల్స్ తొలిఘట్టాన్ని ఆరంభించే బృహత్తర బాధ్యత రామోజీది. దాన్ని మళ్లీ టీడీపీ నాయకులు ప్రస్తావిస్తే.. దాన్ని మిగిలిన దుష్ట చతుష్టయం ఇంకాస్త జనంలోకి తీసుకెళుతుంది. రాష్ట్రంలో ఇసుక లభ్యత లేదని, సబ్ కాంట్రాక్టర్లు ధరలు పెంచేస్తున్నారని వస్తున్న ప్రచారమంతా ఇలాంటిదే. అవసరం ఉండి ఇసుక తీసుకునే వారికి నిజమేంటో తెలుసు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి మరీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. శుక్రవారం నాడు మత్స్యకారుల ఖాతాల్లో వేసిన రూ.109 కోట్ల మత్స్యకార భరోసా కూడా ఇలాంటి కార్యక్రమమే. జగన్ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరానికే రూ.109 కోట్లను మత్స్యకారుల ఖాతాల్లో వేయగా... చంద్రబాబు ఐదేళ్లలో వారికి ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు. జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏకంగా రూ.418 కోట్లు వారి ఖాతాల్లో వేసింది. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో పెరుగుతున్న ముఖ్యమంత్రి గ్రాఫ్ను... ఎలాగో ఒకలా తగ్గించాలన్నది ఈ దుష్ట చతుష్టయం పన్నాగం. అందుకే గోబెల్స్ ప్రచారం. అందులో తొలి మెట్టే... ‘ఈనాడు’ కథనాలు. ఆన్లైన్పైనా అబద్ధాలేనా? 950 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే చోట ఆన్లైన్ చెల్లింపులకు ఆస్కారం లేకపోవటం ఏమిటన్నది రామోజీరావు ఆక్రోశం. అందుకే ఆయన ప్రధాని మోదీని కూడా ప్రస్తావనలోకి తెచ్చేశారు. డిజిటల్ చెల్లింపులను మోదీ ప్రోత్సహిస్తుంటే రాష్ట్రం పట్టించుకోవటం లేదని రాసి పారేశారు. కానీ... ఆన్లైన్లో స్లాట్ బుకింగ్లు, చెల్లింపులు వంటివి ఉన్నా అందరికీ అవగాహన లేక చేయటం లేదని కూడా రామోజీయే రాశారు. ఎందుకీ రెండు నాల్కల రాతలు? ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు అక్కడే చెల్లించే అవకాశం ఉండటంతో పాటు... ఆన్లైన్ బ్యాంకు ఖాతా నంబర్లను ఇసుక రీచ్లు, స్టాక్ పాయింట్లు, డిపోల వద్ద సైతం జేపీ సంస్థ అందుబాటులో ఉంచింది. నగదు కూడా చెల్లించే అవకాశం ఉంది తప్ప నగదు మాత్రమే చెల్లించాలన్న నిబంధన ‘ఈనాడు’ కల్పితం. అన్నిచోట్లా వే బ్రిడ్జ్ లు ఉండటమే కాక ఓవర్లోడింగ్కూ అవకాశం లేదు. ఇవన్నీ అబద్ధాల వంటకానికి కాస్త మసాలా జోడించే ప్రయత్నాలు. ఇదే రామోజీ మార్కు పాత్రికేయం. ఇసుక తవ్వకాల్లో అవకతవకల్లేవు రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాల్లో ఎక్కడా ఉల్లంఘనలు, అవకతవకలు జరగడంలేదని గనుల శాఖ ఇన్చార్జి డైరెక్టర్ డబ్ల్యూబీ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈనాడు పత్రికలో ఇసుక తవ్వకాలు, విక్రయాలపై అవాస్తవాలు ప్రచురించారని తెలిపారు. విజయవాడలోని ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఉన్న లోపాలను సవరించి ఇసుక విధానం పారదర్శకంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలన్నీ సవ్యంగా జరుగుతున్నాయని, మైనింగ్ శాఖతోపాటు ఎస్ఈబీ, పోలీసు, రెవెన్యూ శాఖలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులున్నట్లు ఫిర్యాదు వస్తే వెంటనే స్పందిస్తున్నామన్నారు. ఇసుకపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీవారం పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నామని, ఏమైనా ఇబ్బందులుంటే ఎస్ఈబీకి ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఫోన్ నంబర్లు కూడా అందులో ప్రచురిస్తున్నామని ఆయన తెలిపారు. ఇసుక అమ్మకాలకు సంబంధించిన చెల్లింపులను ఆఫ్లైన్లోనే కాకుండా ఆన్లైన్లోనూ స్వీకరిస్తున్నట్లు చంద్రశేఖర్ చెప్పారు. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి జేపీ సంస్థ ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చి ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. జేపీ సబ్ కాంట్రాక్టుకు ఇచ్చుకోవచ్చు ఇక ఇసుక కాంట్రాక్టును జేపీ సంస్థ జాతీయ స్థాయి ఓపెన్ బిడ్డింగ్లో దక్కించుకుందని, టెండర్ల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ నిర్వహించిందని తెలిపారు. టెండరు దక్కించుకున్న సంస్థ సబ్ కాంట్రాక్టు ఇచ్చుకునే వెసులుబాటు ఉందన్నారు. కానీ, తమకు జేపీ సంస్థ మాత్రమే జవాబుదారీ అని, ఏదైనా తాము ఆ సంస్థనే అడుగుతామని తెలిపారు. టర్న్కీ సంస్థను సబ్ కాంట్రాక్టుగా జేపీ సంస్థ పెట్టుకుందని దాంతో తమకు నేరుగా సంబంధంలేదన్నారు. జేపీ సంస్థ నుంచి రూ.120 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ను కూడా కట్టించుకున్నామని, నిబంధనల ప్రకారం పనిచేయకపోతే ఆ డబ్బును ప్రభుత్వం జమ చేసుకుంటుందన్నారు. అక్రమాల అడ్డుకట్టకు ఎస్ఈబీ ఏర్పాటు ఇక ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నిలువరించేందుకు ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసిందని, టోల్ ఫ్రీ నంబర్ 14500ని కూడా ప్రజలకు అవగాహన అయ్యేలా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా వంటి చట్టాలను తీసుకువచ్చిందన్నారు. ఇసుక ఆపరేషన్స్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయనడంలో వాస్తవం లేదన్నారు. ఇసుక తవ్వకాలను గనుల శాఖాధికారులు తనిఖీలు చేస్తున్నారని, ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే వెళ్లి పరిష్కరిస్తున్నారని తెలిపారు. అన్ని ఇసుక డిపోల్లో వేబ్రిడ్జిలు ఉన్నాయని, రీచ్లు కూడా తమకు దగ్గరగా ఉన్న వేబ్రిడ్జిలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపారు. జేపీ సంస్థ ఇప్పటివరకు 1.70 కోట్ల టన్నుల ఇసుకను తవ్విందని, అందులో కోటి టన్నులను విక్రయించిందని తెలిపారు. మిగిలిన 70 లక్షల టన్నుల ఇసుకను నిల్వచేసి విక్రయిస్తోందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి జేపీ సంస్థ రూ.668 కోట్లు చెల్లించిందని తెలిపారు. -
ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’
చంద్రబాబు నాయుడి హయాంలో కరెంటు స్థితిగతులపై అప్పట్లో ‘ఈనాడు’ ఓ వార్త రాసింది. ‘‘మిగులు విద్యుత్తే అసలు సమస్య’’ అనేది దాని శీర్షిక. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న విద్యుత్తులో కొంత మిగిలిపోతోందని.. దాన్ని బయట విక్రయిస్తే ఇక్కడ ఉత్పత్తి చేసిన ధరలో సగం కూడా రావటం లేదన్నది ఆ వార్త సారాంశం. కాబట్టి దాన్ని అమ్మకుండా వదిలేయటమే మంచిదని సూత్రీకరించారు రామోజీరావు!!. ఇక అసలు సంగతి చూద్దాం. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే తనకు కావాల్సిన పవన, సౌర విద్యుత్తు సంస్థలను ఎంచుకున్నారు. పాతికేళ్ల సుదీర్ఘకాలం పాటు ఏకంగా 8వేల మెగావాట్లు కొంటామంటూ ఎడాపెడా ఒప్పందాలు (పీపీఏ) చేసుకున్నారు. అదీ యూనిట్కు గరిష్ఠంగా రూ.6.45 పెట్టి మరీ!!. నిజానికి అప్పట్లో అంత కరెంటు అవసరం లేదు. పైపెచ్చు కొన్నేళ్లలో సౌర, పవన విద్యుత్ చార్జీలు భారీగా తగ్గొచ్చనే అంచనాలున్నాయి. వాటన్నిటినీ తోసిరాజని.. కమీషన్ల కోసం పాతికేళ్ల బండను తగిలించారు చంద్రబాబు. చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా? సరే!! వాళ్లతో ఒప్పందం చేసుకున్నారు కనక... ఆ కరెంటు వాడినా, వాడకున్నా పాతికేళ్లు వాళ్లకు చార్జీలు చెల్లించకతప్పదు. 2017–18లో రాష్ట్రంలో ఉత్పత్తయినది, ఒప్పందం ప్రకారం కొంటున్నది కలిసి రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిపోయింది. అలా మిగిలిన విద్యుత్తును బయట అమ్మాలంటే... బయట యూనిట్ రూ.2కే దొరుకుతోంది. 6 రూపాయలకు కొనే కరెంటును యూనిట్ రూ.2కు అమ్మితే నష్టం వస్తుంది కనక... అమ్మకుండా వదిలేయటమే మంచిదనేది ‘ఈనాడు’ వార్త ఉద్దేశం. అసలు బయట రూ.2కే దొరుకుతున్నప్పుడు ఇక్కడ రూ.5–రూ.6 పెట్టి ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబును కాలర్ పట్టుకుని నిలదీయొద్దా? రాష్ట్రావసరాలు సరిగా అంచనా వేయకుండా, భవిష్యత్లో తగ్గుతాయన్న సూచనలు పట్టించుకోకుండా పాతికేళ్లపాటు మోయలేని బండను తగిలించిన బాబును ఎడాపెడా వాయించొద్దా? అవన్నీ వదిలేసి ‘ఈనాడు’ రాసిన వార్తే... ‘‘మిగులు విద్యుత్తే అసలు సమస్య’’ అని. నిజానికిక్కడ చంద్రబాబే అసలు సమస్య. తప్పు చేసినా తనను విజనరీ అంటూ మోసే ‘ఈనాడు’.. దాని అధిపతి రామోజీరావే అసలైన సమస్య. ఏం రామోజీ? ఇదే పరిస్థితి ఏ జగన్మోహన్ రెడ్డి హయాంలోనో తలెత్తితే ఇలాగే రాస్తారా? లేనివి రెండు జోడించి మరీ రాష్ట్రాన్ని తగలెట్టేస్తున్నారని గగ్గోలు పెట్టరా? ఇంత దారుణమైన విషంగక్కుతూ ఏం సాధించాలని? ‘సామాన్యుడికి షాక్’ అంటూ విద్యుత్తు చార్జీలపై అచ్చేసిన వార్తలో వాస్తవాలెక్కడ? చంద్రబాబు చేసిన ఘోరాలను వీసమాత్రమైనా ప్రస్తావించరేం? ఐదేళ్లలో విద్యుత్తు సంస్థలపై అక్షరాలా నలభైవేల కోట్ల బకాయిలు మోపిన చంద్రబాబు, ఆయన్ను ఆకాశానికెత్తేసే మీరు ఎంత గొప్ప విజనరీలో జనానికి తెలియదా? అప్పట్లో సామాన్యులపై 41.04 శాతం భారం ఇటీవల ప్రభుత్వం కరెంటు చార్జీలను స్వల్పంగా పెంచిన మాట వాస్తవమే. దాన్నెవరూ కాదనరు. కానీ చంద్రబాబు హయాంలో అసలు చార్జీలే పెరగనట్లు... సామాన్యులపై తీవ్ర భారం మోపేశారంటూ ‘ఈనాడు’ రాయటమే దారుణం. ఎందుకంటే 2015–16లో 76 యూనిట్లు వాడితే రూ.140.10 బిల్లు వచ్చేది. దాన్ని చంద్రబాబు 2018–19లో ఏ స్థాయిలో పెంచారంటే... అదే వాడకానికి రూ.197.60 చెల్లించాల్సి వచ్చింది. అంటే 41.04 శాతం మేర పెరిగింది. 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. అప్పట్లో దాన్నసలు చార్జీల పెంపుగానే పరిగణించని రామోజీరావు... ఇప్పుడు 37.65 శాతం బిల్లు పెరిగిందంటూ గుండెలు బాదుకోవటాన్ని ఏమనుకోవాలి? 80 యూనిట్లలోపు కరెంటు వాడేవారు అప్పట్లో సామాన్యుల్లా అనిపించలేదా? ఇది ఏ మార్కు జర్నలిజం?? రాష్ట్రంలోనే తక్కువ... తాజాగా తెలంగాణలో రూ.5,600 కోట్లు మేర విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై వేయగా ఏపీలో రూ.1,400 కోట్లకే పరిమితమయ్యారు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే 100 యూనిట్లలోపు వాడేవారికి చార్జీలు ఏపీలోనే తక్కువ. ఇక్కడ 100 యూనిట్లలోపు యూనిట్కు రూ.3.11 చార్జీ పడితే... కర్ణాటక, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, పంజాబ్ వంటి అనేక రాష్ట్రాల్లో ఇది కనిష్టంగా రూ.6.10 నుంచి గరిష్ఠంగా రూ.8.26 వరకూ ఉంది. ఈ వాస్తవాలను ‘ఈనాడు’ ఏనాడూ రాయదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ధరలెక్కువ ఉన్నాయంటూ పుంఖానుపుంఖాలు రాస్తారు తప్ప... వాస్తవంగా విద్యుత్ చార్జీల వంటివి ఎంత ఉన్నాయనేది చెప్పరు. అదే చంద్రబాబు సహిత రామోజీమార్కు పాత్రికేయం మరి!. టెలిస్కోపిక్తో మేలు కాదా? గత ప్రభుత్వ హయాంలో శ్లాబుల విధానం అమల్లో ఉండేది. ఇప్పుడు టెలిస్కోపిక్ విధానాన్ని తెచ్చారు. గతంలో మొత్తం వినియోగానికి ఒకే శ్లాబ్లో బిల్లులు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు నెలకు 250 యూనిట్లు వాడేవారు.. తొలి 30 యూనిట్లకు యూనిట్ రూ.1.90, తర్వాత 45 యూనిట్లకు యూనిట్ రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్ రూ.4.50, అనంతరం 100 యూనిట్లు యూనిట్ రూ.6, చివరి 25 యూనిట్లకు యూనిట్ రూ.8.75 చొప్పున బిల్లు చెల్లించాలి. గతంలో టారిఫ్ మారితే దిమ్మదిరిగేలా షాక్ కొట్టేదన్న విషయం రాజగురువుకు గుర్తులేదేమో!! అప్పటికీ ఇప్పటికీ తేడా ఇదీ... చంద్రబాబు పీపీఏల వల్ల డిస్కమ్లు ఏడాదికి రూ.3వేల కోట్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది. ఇప్పటికి ఆ నష్టాల విలువ రూ.35,000 కోట్లు దాటింది. అందుకే బాబు హయాంలో రాష్ట్ర డిస్కమ్ల నెట్వర్త్ తుడిచిపెట్టుకుపోయి ఏకంగా రూ.4,315.72 కోట్ల మైనస్లోకి జారాయి. దీనికి విరుద్ధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయానికి నిరాటంకంగా ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్తో (సెకీ) ఒప్పందం చేసుకుంది. ఇది కూడా యూనిట్ రూ.2.49కి. అంటే బాబు కొనుగోలు ధరలో సగానికన్నా తక్కువ. ఫలితంగా డిస్కమ్లకు ఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతోంది. కాకపోతే దీనికీ వక్రభాష్యం చెప్పడానికి రామోజీరావు నానా తంటాలూ పడుతూనే ఉండటం పాత్రికేయ దుస్థితికి పరాకాష్ట. ‘ఈనాడు’ చెప్పని మరికొన్ని వాస్తవాలివిగో.. ►బాబు ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్తుపై రూ.13,255 కోట్లు రాయితీలివ్వగా ప్రస్తుత ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.21,497 కోట్లు సబ్సిడీ విడుదల చేసింది. విద్యుత్ సంస్థలకు రూ.35 వేల కోట్లు ఇచ్చి ఆదుకుంది. ►2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోళ్లలో రూ.4925 కోట్లు ఆదా కాగా, దీనిలో రూ.3373 కోట్లను వినియోగదారులకే ఇచ్చారు. ►దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో 52 శాతం వాటా థర్మల్దే. కొన్నాళ్లుగా బొగ్గు సరఫరా సరిగా లేదు. మరో రెండేళ్లు ఇలాగే ఉంటుందని కేంద్రమే చెప్పింది. ►కనీసం 10 శాతం బొగ్గు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కూడా. కానీ రష్యా–ఉక్రెయిన్ పరిస్థితుల వల్ల ధర విపరీతంగా పెరిగింది. ►గతంలో టన్ను బొగ్గు రూ.7 వేలుంటే ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేల వరకూ పలుకుతోంది. ►రాష్ట్రంలో బొగ్గు గనులు లేవు. మహానది కోల్ ఫీల్డ్స్, ►సింగరేణి కాలరీస్ నుంచి తెస్తున్నాం. కేవలం రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా వస్తున్న బొగ్గు రేట్లు, రవాణా చార్జీలు పెరుగుదల వల్ల ఉత్పత్తి వ్యయం 14 శాతం పెరిగింది. ►కొనుగోలు వ్యయం బాగా పెరగటంతో మార్చిలో రూ.1123.74 కోట్లతో 1268.69 మిలియన్ యూనిట్లను, ఏప్రిల్లో రూ.1022.42 కోట్లతో 1047.78 మిలియన్ యూనిట్లను కొన్నారు. ఇవన్నీ ‘ఈనాడు’ ఎన్నటికీ చెప్పదు మరి!!. -
ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా?
చంద్రబాబు నాయుడి హయాంలో పల్లె రోడ్లన్నీ అద్దాల్లా మెరిసిపోయాయి. నల్లటి తాచుపాముల్లా బుసలు కొట్టాయి. కాబట్టే... ‘ఈనాడు’ ఏనాడూ ఆ రోడ్ల గురించి ఒక్క వార్త కూడా రాయలేదు. రామోజీరావు కూడా ఆ రోడ్లను చూసి మురిసిపోయారే తప్ప ఒక్కనాడూ తన సిబ్బందిని పంపించి రోడ్లెలా ఉన్నాయో చూసి... వార్త రాయమనలేదు. కాకపోతే... ‘వీటిని రోడ్లంటారా?’ అని తాటికాయంత అక్షరాలతో సోమవారం అచ్చేసిన కథనంలోనే రామోజీ ఓ నిజాన్ని ఒప్పుకున్నారు. 2019లో ఎన్నికల సమయంలో కంకర తేలి దారుణంగా ఉన్న ఓ రోడ్డును అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ బాగు చేయిస్తానన్నారని, తాను గెలిచినా ఇప్పటికీ చేయించలేదని కూడా రాశారు. అంటే... చంద్రబాబు నాయుడి ఐదేళ్ల జమానాలో ఆ రోడ్డు అలానే ఉందని తానే అంగీకరించారు. మరి ఆ ఐదేళ్లలో ఒక్కరోజు కూడా రాష్ట్రంలో రహ‘దారుణాల’ గురించి రాయలేదెందుకురామోజీ? చంద్రబాబు అధికారంలో ఉంటే ఆ గుంతలు కనపడకుండా మీ కళ్లకు గంతలు కట్టుకుంటారా? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి గంతలు తీసేసి చూస్తున్నారా? ఎందుకింతటి విషపు రాతలు? రోడ్లనేది నిరంతర ప్రక్రియని.. ఎక్కడో చోట రోడ్లు వేయటం... మళ్లీ కొన్ని దెబ్బతినటం జరుగుతూనే ఉంటుందని తెలియదా? ఆరేడు రోడ్లు తీసుకుని దాన్ని రాష్ట్రమంతటికీ వర్తింపజే సి ఈ తరహా రాతలు రాయటం ఏ మార్కు పాత్రికేయం? ‘ఈనాడు’ రాతల్లో నిజమెంత? ఏది నిజం? ఇదిగో చూద్దాం.... రామోజీ పంపించిన ‘ఈనాడు’ బృందం రాష్ట్రంలో చూసినవన్నీ పల్లె రోడ్లే. అంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోనివి. రాష్ట్రంలో మొత్తంగా పంచాయతీరాజ్ పరిధిలో 26,450 కిలో మీటర్ల పొడవున తారు రోడ్లున్నాయి. కాకపోతే వాటిలో సగానికి పైగా రోడ్లు... అంటే 13,801 కిలో మీటర్ల మేర రోడ్లు 2018 ఏప్రిల్ నాటికే దారుణంగా దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు చేయాలని, ఆ రోడ్లపై కొత్త తారు లేయర్ వేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఇంకో నెలరోజుల్లో ఎన్నికలు పెట్టుకుని .. 2019 జనవరి 11వ తేదీన జీవో నంబరు 34 జారీ చేసింది. ఒక్క కిలోమీటరూ వేయకుండానే దిగిపోయింది. అదీ.. రామోజీ మిత్రుడు చంద్రబాబు చిత్తశుద్ధి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషమేంటంటే... అప్పట్లో పంచాయతీ రాజ్ మంత్రి సాక్షాత్తూ చిన నారావారే!!. ఇక ఇప్పుడు చూస్తే... రాష్ట్రంలో 9,122 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతిన్నట్టు పంచాయతీరాజ్ అధికారులు నిర్ధారించారు. అంటే... అప్పట్లో దెబ్బతిన్న రోడ్లు ఈ మూడేళ్లలో బాగు చేసినట్లే కదా? ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించరు రామోజీ? దీనికి తోడు అక్కడక్కడా గుంతలు ఉండేవి పోను... ఈ 9,122 కిలో మీటర్ల రోడ్లలో 5,260 కిలోమీటర్ల పొడవు రోడ్లపై కొత్త తారు లేయరు వేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు కూడా మంజూరు చేసింది. ఆ 5,260లో... రోడ్లు బాగుండి కేవలం గుంతలు పూడ్చాల్సినవి 899 కిలోమీటర్లు. ప్రభుత్వం అనుమతులివ్వటంతో ఈ పనులకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా మొదలయింది. ఇవీ... రామోజీ రాయటానికిష్టపడని నిజాలు. మెరుగుపడినట్లా? లేక దెబ్బతిన్నట్లా? గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు రోడ్లను బాగు చేసూ్తనే వస్తోంది. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రోడ్లను పట్టించుకోకపోవటంతో ప్రతిరోడ్డూ అధ్వాన్నంగా తయారైంది. దీంతో వాటిని బాగు చేయడానికిçప్పుడు మరింత ఎక్కువ వెచ్చించాల్సి వస్తోంది. విచిత్రమేంటంటే బాబు పాలనలో ఐదేళ్లూ రోడ్లను పట్టించుకోకున్నా రామోజీ ఒక్క వార్త రాయలేదు. ఒక్క ఫొటో వేయలేదు. పైపెచ్చు ఈ మూడేళ్లలో ఎక్కడికక్కడ రోడ్లను బాగు చేసి అధికారులు... నాడు– నేడు పేరిట ప్రజెంటేషన్ కూడా తయారు చేశారు. అలాంటి ఫొటోలు కూడా ‘ఈనాడు’లో వస్తే ఒట్టు!!. అంటే... రామోజీకి కావలసింది వైఎస్ జగన్ ప్రజాభిమానాన్ని దెబ్బతీయటం. ఓ సమస్యకు వంద అబద్దాలు కలిపి మరీ వీలైనంత వ్యతిరేకతను పోగు చేయటం. ఇంకెన్నాళ్లీ దొంగాట రామోజీ? రూ.1,072 కోట్లతో మరమ్మతులకు జీవో పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న రోడ్లు పోను మిగిలిన వాటిక్కూడా రూ.1,072.72 కోట్లతో పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం ఈ నెల 5న జీవో మంజూరు చేసింది. ఈ నిధులతో 2,421.14 కి.మీ. మేర దెబ్బతిన్న రోడ్లకు ఒక లేయర్ కంకర, మరో లేయర్ తారు వేస్తారు. మరో 1,948.5 కి.మీ. మేర పూర్తిగా తారు లేయర్... ఇంకో 898.92 కి.మీ. మేర గుంతలు పూడ్చడం చేపడతారు. వీటికోసం పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలెట్టారు కూడా. నిధులివ్వకుండా బాబు హడావుడి... 2018 ఏప్రిల్ నాటికే 13,801 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు చెప్పినా... నాటి బాబు సర్కారు పట్టించుకుంటే ఒట్టు. చివరకు నిధులివ్వకుండానే ఎన్నికలకు నెల ముందు హడావుడిగా జీవో ఇచ్చి చేతులు దులుపుకొంది. అప్పట్లో రూ. 1,500 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుని 9 జిల్లాల్లో రోడ్లు మరమ్మతు చేపడతామని జీవో ఇచ్చినా... రుణానికి బ్యాంకులు నో చెప్పటంతో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కాకపోతే చంద్రబాబు చేసిన ఈ దారుణాల్ని రామోజీ ఎప్పుడూ తన మీడియాలో చెప్పరు. రోడ్ల మర్మమతులకు ‘ఉపాధి’ నిధులిస్తారా? తనది కాకుంటే ఏమైనా చెప్పొచ్చనేది ‘ఈనాడు’ పద్ధతి. రోడ్లకు ఉపాధి హామీ నిధులు ఖర్చు పెట్టలేదని, భవనాలపై పెట్టేశారని తెగ ఆక్రోశించింది. కానీ ఎప్పుడో వేసిన రోడ్లకు మరమ్మతులు చేసుకోవడానికి ఉపాధి హామీ పథకంలో అవకాశమే ఉండదు. ఈ పథకంలోని మెటీరియల్ నిధులతో కొత్తగా కంకర రోడ్డు లేదంటే బీటీ రోడ్డు వేయొచ్చు. ఈ విషయం తెలిసి కూడా జనంలో వ్యతిరేకతను పెంచడానికి విషం గక్కారో... లేక అజ్ఞానంతో అలా ఆక్రందనలు చేశారో రామోజీకే తెలియాలి. పైపెచ్చు ఉపాధి నిధులతో రైతు భరోసా కేంద్రాలు, పాల కేంద్రాల వంటివి నిర్మించడం నేరమనే రీతిలో రాతలు రాయటం ఏ రకం జర్నలిజమో ‘ఈనాడు’కే తెలియాలి!!. పూర్తయినవి 3,705 కి.మీ.. పురోగతిలో మరో 6,113 కి.మీ. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత మూడేళ్లలో 3,705 కిలోమీటర్ల పొడవున కొత్తగా తారు రోడ్లు వేశారు. వాటి వివరాలివీ... ►60–40 నిష్పత్తిన కేంద్ర రాష్ట్రాల నిధులతో రూ.989 కోట్లతో 1741 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో రెండు మూడు లేయర్ల తారు రోడ్లు... మరో 410 కిలో మీటర్ల సింగిల్ లేయర్ తారు రోడ్లు నిర్మించారు. ►ఏపీ రూరల్ రోడ్ ప్రాజెక్టు కార్యక్రమంలో ఇంకొక 1,147 కి.మీ. మేర తారు రోడ్ల నిర్మాణం చేపట్టారు. నాబార్డు నిధులతో మరో 407 కి.మీ. మేర తారు రోడ్లు వేశారు. ►ఇప్పటికే పూర్తయినవి కాకుండా పీఎంజీఎస్వై పథకం ద్వారా మరో 2160 కి.మీ. ఏపీ రూరల్ రోడ్ ప్రాజెక్టులో ఇంకొక 3,953 కి.మీ. రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. అంటే.. 6,113 కి.మీ. మేర రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. ►టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పీఎంజీఎస్వై కింద కొత్తగా 1317 కి.మీ. రోడ్లు మంజూరు చేస్తే... ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలోనే 3047 కి.మీ. మేర రోడ్లు మంజూరు చేసింది కాకపోతే... ఈ నిజాలు ‘ఈనాడు’ ఏనాడూ రాయదు.