hathras
-
హత్రాస్ బాబాకు క్లీన్ చిట్
హత్రాస్: హత్రాస్లో 121 మంది ప్రాణాలను బలి తీసుకున్న తొక్కిసలాట ఘటనపై ఆధ్యాత్మిక గురువు నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలె బాబాకు న్యాయ విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. గతేడాది జులై 2వ తేదీన ఈ దారుణం చోటుచేసుకుంది. దీనిపై యూపీ ప్రభుత్వం రిటైర్డు జస్టిస్ బ్రిజేశ్ కుమార్ శ్రీవాస్తవ్ సారథ్యంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. భోలె బాబా అసలు పేరు సూరజ్పాల్. అయితే, పోలీసులు నిందితుడి జాబితాలో సూరజ్పాల్ పేరును చేర్చలేదు. దర్యాప్తు సమయంలో గతేడాది అక్టోబర్లో కమిషన్ ఎదుట భోలె బాబా హాజరయ్యారు. ఈ కమిటీ భోలెబాబాకు క్లీన్ చిట్ ఇస్తూ నివేదిక అందజేసిందని ఆయన లాయర్ ఏపీ సింగ్ వెల్లడించారు. కొందరు కుట్రదారులు భోలె బాబాను, యూపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించగా వారి ఎత్తుగడలను కమిషన్ బయటపెట్టిందన్నారు. ఇది సత్యానికి, విశ్వాసానికి లభించిన విజయంగా పేర్కొన్నారు. తొక్కిసలాట చోటుచేసుకున్న తర్వాత కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు ప్రకాశ్ మధుకర్ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్చార్జిని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కార్యక్రమానికి 80 వేల మందికి మాత్రమే అనుమతివ్వగా 2.50 లక్షల మందికి పైగా భక్తులు రావడంతోనే ఘోరం జరిగిందని యంత్రాంగం వాదించింది. కాగా, ఘటన వెనుక కుట్ర కోణం ఉందంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. -
Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు
మరికొద్ది గంటల్లో 2024 ముగియబోతోంది. 2025ను స్వాగతించేందుకు ప్రపంచమంతా సిద్ధమయ్యింది. 2024లో దేశంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో కొన్ని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. యూపీలో జరిగిన రెండు ఘటనలైతే ఎన్నటికీ మరువలేని విషాదాన్ని మిగిల్చాయి. వాటిని తలచుకుంటే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.హత్రాస్ తొక్కిసలాట2024, జులై 2న ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోరాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆ రోజు మంగళవారం.. హత్రాస్(Hathras) పరిధిలోని పుల్రాయి గ్రామంలో నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలే బాబా సత్సంగం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది తరలివచ్చారు. సత్సంగం ముగిసిన అనంతరం భోలే బాబా పాదాలను తాకేందుకు ఆయన దగ్గరకు ఒక్క ఉదుటున జనం పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పడిపోయారు. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంతమందికి గాయాలయ్యాయి.ఈ ఘటన దరిమిలా భోలే బాబా పరారయ్యాడు. ఈ ఉదంతం ప్రభుత్వ యంత్రాంగంలో కలకలం రేపింది. యూపీ పోలీసులు భోలే బాబా కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సత్సంగ్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాడు సీఎం యోగి స్పందిస్తూ, ఈ ఘటనకు కారకులైనవారినెవరినీ, వదిలిపెట్టబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 91 రోజుల పాటు పోలీసులు కేసు దర్యాప్తు చేసి, మొత్తం 11 మందిని నిందితులుగా తేల్చారు. అయితే ఈ చార్జిషీటులో నారాయణ్ సకర్ హరి అలియాస్ సూరజ్పాల్ బాబా(Surajpal Baba) పేరు లేకపోవడం విశేషం. ఈ కేసులో పోలీసులు 3,200 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు.ఝాన్సీ అగ్ని ప్రమాదం2024, నవంబర్ 15న యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ(Maharani Lakshmibai Medical College)లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చైల్డ్ వార్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎన్ఐసీయూ వార్డులో 54 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది, చిన్నారుల బంధువులు చైల్డ్ వార్డు కిటికీ పగులగొట్టి, పలువురు చిన్నారులను రక్షించారు. ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. యావత్దేశం ఈ ఉదంతంపై కంటతడి పెట్టుకుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఐదు ఘటనలు.. రాజధానిలో సంచలనం -
యూపీలో ఘోరం.. స్కూల్ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఘోరం చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరిట హథ్రాస్లో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారు. విద్యార్ధి చదువుతున్న పాఠశాల అభివృద్ధి చెందాలని స్కూల్ హాస్ట్లోనే బాలుడిని హత్య చేశారు. వారం కిందట జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాఠశాల యజమాని జసోదన్ సింగ్తో, అతని కుమారుడు దినేష్ భఘేల్ పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా వెలువడిన పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు... 11 ఏళ్ల కృతార్థ్ హథ్రాస్ జిల్లాలోని రస్గవాన్లోని డీఎల్ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గతవారం తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఆయనకు కాల్ వచ్చింది. దీంతో తండ్రి స్కూల్ వద్దకు వెళ్లగా.. బాలుడిని పాఠశాల డైరెక్టర్ తండ్రి తనక ఆరులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్ చెప్పాడు. దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న కృష్ణన్కు మీ కొడుకు చనిపోయాడని దినేశ్ బాఘెల్ చెప్పాడు. తన కారులో ఉన్న మృతదేహాన్ని అప్పగించాడు. అయితే కొడుకు మరణంపై అనుమానంతో కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.స్కూల్ డైరక్టర్ తండ్రి దినేశ్ బఘేల్కు క్షుద్రపూజల మీద నమ్మకం ఉందని పోలీసులు తెలిపారు. బాలుడిని తొలుత స్కూల్ బయట ఉన్న గొట్టపు బావి దగ్గర చంపాలని భావించారు. కానీ హాస్టల్ నుంచి బయటకు తీసుకువెళుతుండగా బాలుడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఫలితంగా అక్కడే, అతడి గొంతు నులిమి చంపేశారు.స్కూల్కు సమీపంలో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. అయితే స్కూల్ సక్సెస్ కోసం క్షుద్రపూజలు చేయాలని నిందితులు గతంలో కూడా ప్లాన్ వేశారు. సెప్టెంబర్ 6వ 9వ తరగతి స్టూడెంట్ని బలి ఇవ్వాలని చూశారు. కానీ విఫలం అయ్యారని తేలింది. -
‘ఉన్నావ్, హత్రాస్ ఘటనల్లో ఏం న్యాయం చేశారు?’
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మంగళవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా మహిళలపై హత్యాచార నేరాలు జరగకుండా ఉండేందుకు సామాజిక సంస్కరణలు అవసరమని సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఆర్జీకర్ హత్యాచార ఘటనపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ సాక్షిగా మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. మహిళలపై ఇటువంటి దారుణ ఘటనలు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయని, బీజేపీ పాలిత గుజరాత్, యూపీలో బాధితులకు న్యాయం ఏళ్లతరబడి కూడా అందడం లేదని ప్రస్తావించారామె. ఘటనలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. 2020లో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో 20 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం, 2013లో బెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థినిపై హత్యాచారం, గత వారం బీజేపీ పాలిత రాజస్థాన్లోని జైపూర్లో ప్రభుత్వ హాస్పిటల్ ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం జరిగాయి. ఆయా ఘటనల్లో ఏం న్యాయం చేశారో బీజేపీ వాళ్లు చెప్పగలరా? అని ప్రశ్నించారామె. అదేవిధంగా బెంగాల్లోని నార్త్ పరగణాలలో జరిగిన హత్యాచారం కేసులో శిక్ష విధించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కానీ ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేశారు. ఇదే కేసులో కలకత్తా హైకోర్టు ఒక నిందితుడిని నిర్దోషిగా ప్రకటించి, మరో ఇద్దరి మరణశిక్షను తగ్గించిన తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారామె. ఉన్నావ్, హత్రాస్ దారుణ ఘటనల్లో బాధితురాలికి న్యాయం జరగలేదని మాత్రం ఎవరూ మాట్లాడరని బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు.వాస్తవానికి.. మహిళలపై దారుణమైన నేరాలు, లైంగిక దాడులు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఆ రాష్ట్రాలో జరిగిన ఘటనలకు న్యాయం జరగటం లేదని, పశ్చిమ బెంగాల్లో కోర్టు న్యాయం లభిస్తోందని తెలిపారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలను తీసుకురాని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు.. మహిళలపై దారుణాలు జరుగుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారామె. మీరు(బీజేపీ) తమకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లే తాను కూడా ప్రధానమంత్రికి, హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీదీ సర్కార్ తెచ్చిన కొత్త చట్టానికి ‘అపరాజిత’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.Kolkata: At the West Bengal Assembly, CM Mamata Banerjee says, "...I express my condolences to the girl who was raped, murdered and to her family. When the RG Kar incident took place on the night of 9th August, I was in Jhargram. On 10th August, the body was found, and on 12th… pic.twitter.com/TjTZS1gJnc— ANI (@ANI) September 3, 2024#WATCH | Kolkata: At the West Bengal Assembly, CM Mamata Banerjee says, "...I had written two letters to the Prime Minister, but I did not get any reply from him, rather I got a reply from the Minister of Women and Child Development, but I also replied to his reply and informed… pic.twitter.com/XKmSOWDj3B— ANI (@ANI) September 3, 2024 -
పుట్టినవాడు గిట్టక తప్పదు
లక్నో: హత్రాస్ తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని, అయితే విధిరాతను ఎవరూ తప్పించలేరని భోలే బాబా అన్నారు. అందరూ ఏదో ఒకరోజు మరణించక తప్పదని వేదాంతం వల్లెవేశారు. భోలే బాబా సత్సంగ్లో తొక్కిసలాటలో ఇటీవల 121 మంది మరణించడం తెలిసిందే. బుధవారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘పుట్టినవాడు ఏదో ఒకరోజు గిట్టక తప్పదు. కాస్తా ముందూ వెనకా అంతే’ అన్నారు. తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని పునరుద్ఘాటించారు. ‘జూలై 2 దుర్ఘటన తర్వాత నేను తీవ్ర నిరాశకు లోనయ్యా, కలత చెందా. కానీ జరిగేదాన్ని ఎవరూ తప్పించలేరు. విషపూరిత రసాయనాలను స్ప్రే చేశారని నా న్యాయవాది, ప్రత్యక్షసాక్షులు చెప్పింది ముమ్మాటికీ నిజం. దీనివెనుక కచి్చతంగా కుట్ర ఉంది’ అని బాబా పేర్కొన్నారు. -
హత్రాస్ ఘటన: మృతదేహాల నుంచి నగలు మాయం
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో చోటుచేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి మరికొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సత్సంగానికి హాజరైన పలువురు మహిళలు మంగళసూత్రాలు, నగలు వేసుకుని వచ్చారు. అయితే తొక్కిసలాటలో మృతిచెందిన మహిళల మెడలో ఉండాల్సిన నగలు మాయమయ్యాయి. దీంతో ఇక్కడ మనుషులే కాదు మానవత్వం కూడా చచ్పిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఘటనా స్థలంలో ఇప్పటికీ భయానక దృశ్యానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చెప్పులు, దుస్తులు, వంట పాత్రలు, బ్యాగులు.. ఇప్పటికీ అక్కడ కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడకు చేరుకుని తమవారి వస్తువుల కోసం వెతికారు. వారికి అక్కడ తమ వారి విలువైన వస్తువులేవీ లభించలేదు. తమ ఇంటి మహిళలు మంగళసూత్రాలు, చెవిపోగులు, బంగారు గాజులు ధరించి ఇంటి నుంచి వచ్చారని అయితే వారి మృతదేహాలపై ఉండాల్సిన నగలు మాయమయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.ఆస్పత్రిలో తన తల్లి ఆశాదేవి మృతదేహం ఉందని, అయితే ఆమె సత్సంగానికి వెళ్లిన సమయంలో వేసుకున్న నగలు మాయమయ్యాయని ఆమె కుమారుడు తెలిపాడు. కస్గంజ్లోని పాటియాలీ నివాసి బ్రజేష్ తల్లి కూడా ఈ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఆమె మెడలో ఉండాల్సిన నగలు కూడా మాయమయ్యాయి. ఇదేవిధంగా పాటియాలీకి చెందిన జైవీర్ తల్లికి చెందిన బంగారు గొలుసు, ముక్కుపుడక, చెవిపోగులు మాయమయ్యాయి. ఘటన అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను ఒకే అంబులెన్స్లో ఎక్కించారని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలంలో తగినన్ని అంబులెన్స్లు, ఇతర వైద్య సౌకర్యాలు ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కావని బాధితులు పేర్కొన్నారు. -
హత్రాస్ ఘటన: పిటిషన్పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
ఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి దాఖలైన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ విచారణ కోసం లిస్ట్ చేయాలని సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. దీంతో సుప్రీం కోర్టు రిజిస్ట్రీ జూలై 12న (శుక్రవారం) పిటిషన్ విచారణను షెడ్యూల్ చేసింది. ఈ నెల 2న హత్రాస్లో భోలే బాబా సత్సంగ్లో చోటుచేసుకున్న తొక్కిసలాటల ఘటనలో 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు లాయర్ విశాల్ తివారీ.. అత్యున్నంత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా ఈ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నివేదిక తయారు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.మరోవైపు.. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇవాళ తన నివేదికను వెల్లడించింది. తొక్కిసలాట ప్రమాదానికి ఆర్గనైజర్ల నిర్వహణ వైఫల్యమే కారణమని సిట్ ప్రాథమికంగా వెల్లడించింది. వాస్తవాలను దాచిపెట్టి నిర్వాహకులు సత్సంగ్ కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారని పేర్కొంది. షరతులు పాటించకుండ ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలను ఆహ్వానించారని తెలిపింది. ..పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు కనీస ఏర్పాట్లు చేయలేదని తెలిపింది. పోలీసు వెరిఫికేషన్ లేకుండానే వాలంటీర్లను నియమించుకున్నారని, భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా లేవని పేర్కొంది. భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వారు బయటకు వెళ్లేందుకు బారికేడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రమాదం జరిగిన తర్వాత సత్సంగ్ నిర్వాహకుల కమిటీలోని సభ్యులు అక్కడినుంచి పారిపోయారని సిట్ తన నివేదికలో వెల్లడించింది. -
హత్రాస్ ఘటనపై 850 పేజీల సిట్ రిపోర్టు
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ తొక్కిసలాట కేసులో సిట్ నివేదిక వెలువడింది. యూపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సిట్ ఈ కేసుపై విచారణ జరిపింది. తాజాగా సిట్ ఈ నివేదికను హోం శాఖకు అందజేసింది. బాధ్యులందరి పేర్లు ఈ నివేదికలో ఉన్నాయి.ఈ కేసులో 128 మందితో జరిపిన సంభాషణల ఆధారంగా సిట్ అధికారులు ఈ నివేదికను రూపొందించారు. ఇందులో సత్సంగంలో ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి ఎవరు కారకులనేది వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ నివేదిక గోప్యంగా ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు సీఎం ఆదేశించనున్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నివేదికపై సీనియర్ అధికారులతో చర్చించనున్నారు. ఏడీజీ ఏడీజీ అనుపమ కులశ్రేష్ఠ, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ చైత్ర వి ఈ నివేదికను రూపొందించారు. సిట్ రూపొందించిన ఈ నివేదిక 850 పేజీలు ఉన్నట్లు సమాచారం.ఇటీవల హత్రాస్లో బాబా సాకార్ హరి అలియాస్ భోలే బాబా సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. భోలే బాబా పాదాలను పూజించేందుకు భక్తులు ఒక చోట గుమిగూడిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఆర్గనైజింగ్ కమిటీతో సంబంధం కలిగినవారిని అరెస్టు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో బాబా పేరు లేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఘటనాస్థలికి వెళ్లారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. -
హత్రాస్ తొక్కిసలాట: ‘బోలేబాబా’ లాయర్ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ: హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. జులై 2న హత్రాస్ సత్సంగ్లో కొందరు వ్యక్తులు విషపూరిత డబ్బాలను తెరిచారని, దీనివల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు తనతో చెప్పినట్లు సింగ్ తెలిపారు. ఆదివారం(జులై 7) ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగ్ మాట్లాడారు. పెరిగిపోతున్న బోలేబాబా పాపులారిటీని ఓర్వలేకే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘తొక్కిసలాటకు ముందు 15 మంది దాకా దుండగులు అక్కడ విషపూరిత డబ్బాలను తెరిచారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు నన్ను కలిసి చెప్పారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులను పరిశీలిస్తే వారు ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని స్పష్టంగా తెలుస్తుంది. అంతేగాక సత్సంగ్ సమీపంలోనే దుండగులు పారిపోయేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసి ఉంచుకున్నారు. ఇందుకు మా వద్ద ఆధారాలున్నాయి. సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వాలి’అని సింగ్ కోరారు.జులై 2న ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో బోలేబాబా సత్సంగ్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఘటనపై విచారణకుగాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ను కూడా నియమించింది. -
హత్రాస్ ఘటన: వెలుగులోకి ‘భోలే బాబా’ భవనం, ఖరీదైన కార్లు!
లక్నో: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ సత్సంగ్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్( భోలే బాబా)పై శనివారం తొలి కేసు నమోదైంది. అయితే భోలే బాబాకు సంబంధించి పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019కి ముందు భోలేబాబా కొన్ని రోజులు లఖింపూర్ఖేరిలో అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పడు నివసించిన విలాసవంతమైన భవనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ భవనంలో ఒక లగ్జరీ కార్లు, గుహ వంటి నిర్మాణంలో ఉన్న గది ఉన్నాయి. అందులో భోలే బాబా ఫొటోలు, మంత్రాల చిత్రాలు కనిపించాయి. ఈ బిల్డింగ్లోనే భోలే బాబా మూడునాలుగు సార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చివరిసారి ఇక్కడ 2019లో 15 రోజులపాటు ఉన్నట్లు ఈ భవనం యజమాని గోవింద్ పుర్వార్ తలిపారు. ఇక.. ఈ బిల్డిండ్ పూర్తిగా వ్యవసాయ భూములు, పెద్ద తోటల మధ్యలో ఉండటం గమనార్హం. ఈ భవనంలో విశాలమైన పార్కింగ్ స్థలం ఉంది. భోలే బాబాకు చెందిన రెండు లగ్జరీ కార్లు ఇక్కడ పార్క్ చేయబడి ఉన్నాయి. వంట చేసుకోవటం కోసం కిచన్, స్టవ్, సామాగ్రి కూడా ఉన్నాయి. వంటగది పక్కనే గుహవంటి రూం ఉంది. ఇందులో 2019 నాటి భోలే బాబా సత్సంగ్ పోటోలు ఉన్నాయి. మరో గదిలో గోధుమ కంటేయినర్లు, భోలే బాబా ఫోటోలు, హనుహాన్ చాలిసా మాదిరిగా చేతితో రాసిన హారతి చాలిసా ఉన్నాయి. అయితే భోలే బాబా ఈ భవనంలో విశ్రాంతి తీసుకునేవారని స్థానికంగా ఉండే ఆయన భక్తులు మీడియాతో తెలిపారు.ఇక తొక్కిసలాట ఘటన తర్వాత భోలేబాబా శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు పేర్కొన్నారు.మరోవైపు హత్రాస్ ఘటనపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం జూలై 3న హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది. -
హత్రాస్ తొక్కిసలాట.. భోలే బాబాపై తొలి కేసు నమోదు
ఉత్తర్ప్రదేశ్లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భోలే బాబాపై తొలి కేసు నమోదైంది. పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయనపై కేసు నమోదైంది.కాగా, జూలై 2న 121 మంది ప్రాణాలను బలిగొన్న హత్రాస్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మధుకర్ను శనివారం స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. తొక్కిసలాట జరిగిన సత్సంగానికి చెందిన 'ముఖ్య సేవాదార్' మధుకర్ ప్రథమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఏకైక నిందితుడు. కాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు మధుకర్ను పట్టుకునే వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందేఇక తొక్కిసలాట ఘటన తర్వాత భోలో బాబా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.మరోవైపు హత్రాస్ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు, తొక్కిసలాట వెనుక కుట్ర ఉందనే విషయాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది. -
హత్రాస్ ఘటన: మీడియా ముందుకొచ్చిన భోలే బాబా
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన ‘భోలే బాబా’ సత్సంగ్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదానికి గురిచేసింది. ఈ ఘటనలో121 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత ‘భోలే బాబా’ నారాయణ్ శంకర్ హరీ పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. అయితే తాజాగా ఆ బాబా మీడియా ద్వారా మాట్లాడారు.‘జులై 2న జరిగిన ఘటన బాధాకారం. ఈ బాధను భరించే శక్తిని దేవుడు మాకివ్వాలి. తొక్కిసలాటకు కారకులైన వాళ్లెవరైనా ఉపేక్షించకూడదు. ప్రభుత్వం, అధికారం యంత్రాంగంపై నమ్మకం ఉంది. బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని కమిటీ సభ్యుల్ని కోరుతున్నా. అలాగే క్షతగాత్రులకు అవసరమైన సాయం అందించాలని కోరుతున్నా అని తన లాయర్ ఏపీ సింగ్ ద్వారా బోలే బాబా సందేశం పంపించారు’’.#WATCH | Hathras Stampede Accident | Mainpuri, UP: In a video statement, Surajpal also known as 'Bhole Baba' says, "... I am deeply saddened after the incident of July 2. May God give us the strength to bear this pain. Please keep faith in the government and the administration. I… pic.twitter.com/7HSrK2WNEM— ANI (@ANI) July 6, 2024భోలే బాబా నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని అలీగఢ్ ఐజీ శలభ్ శుక్రవారం తెలిపారు. అయితే, సత్సంగ్కు ఆయన పేరుతో కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అవసరమైతే బాబాను ప్రశ్నిస్తామన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ‘భోలే బాబా’పేరులో లేకపోవటం గమనార్హం. ఈ ఘటనలో సత్సంగ్ ఆర్గనైజింగ్ నిర్వాహకులతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వీరు సత్సంగ్ కార్యక్రమ నిర్వాహకులు, సేవాదార్లుగా పనిచేస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు ‘ముఖ్య సేవాదర్’దేవప్రకాశ్ మధూకర్ను ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు హత్రాస్ పోలీసులు శుక్రవారం తెలిపారు.అయితే.. పోలీసులు మధూకర్ను అరెస్టు చేయలేదని, ఆయనే లొంగిపోయరని ఆయన తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. ‘‘ ఈ రోజు (శుక్రవారం) దేవ్ప్రకాశ్ మధూకర్ పోలీసులకు లొంగిపోయారు. సత్సంగ్ ప్రధాన నిర్వాహకుడైన దేవ్ ప్రకాశ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మేము చేసి తప్పు ఏంటీ? మా తప్పులేనప్పడు ముందస్తు బెయిల్ దాఖలు చేయటం లేదు. అదే విధంగా మధూకర్ హార్ట్ పేషెంట్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. దర్యాప్తుకు సహకరించటం కోసం ఆయన పోలీసులకు లొంగిపోయారు’’ అని న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడిన వీడియో విడుదల చేశారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 90 మంది వద్ద స్టేట్మెంట్ రికార్డు చేసుకుంది. ఈ ఘటపై విచారణ కోసం యూపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది.చదవండి: లగ్జరీ కార్లు, ఆశ్రమాలు.. భోలే బాబా ఆస్తులు రూ. 100 కోట్లకు పైనే! -
హత్రాస్ ఘటన: లొంగిపోయిన ప్రధాన నిందితుడు
యూపీలోని హత్రాస్లో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ ఢిల్లీలో లొంగిపోయాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు మధుకర్ను యూపీ పోలీసులకు అప్పగించినట్లు సుప్రీంకోర్టు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.రాజస్థాన్, హర్యానాతో పాటు యూపీలో మధుకర్ కోసం హత్రాస్ పోలీసులు వెదుకులాట సాగించారు. మధుకర్ లొంగిపోయిన తర్వాత అరెస్టు చేశారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో చీఫ్ సేవాధర్ మధుకర్ మాత్రమే నిందితునిగా ఉన్నాడు. అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించారు. మధుకర్ ఢిల్లీలో వైద్య చికిత్స పొందుతున్నాడని న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. మధుకర్పై నేరపూరిత నరహత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు ఇండియన్ జస్టిస్ కోడ్లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఆగ్రా జోన్ ఏడీజీ అనుపమ్ కులశ్రేష్ట్ మాట్లాడుతూ త్వరలోనే ఈ కేసుపై సిట్ తుది నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 132 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. మరోవైపు నారాయణ్ సాకార్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో భోలే బాబా పేరు లేదు. కాగా దర్యాప్తునకు ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ హత్రాస్కు చేరుకుంది. -
లగ్జరీ కార్లు, ఆశ్రమాలు.. భోలే బాబా ఆస్తులు రూ. 100 కోట్లకు పైనే!
ఉత్తర్ప్రదేశ్లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కారణమైన సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భోలే బాబాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. హథ్రాస్ తొక్కిసలాటలో 121 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆచూకి తెలియరాలేదు.అయితే ఈ విషాదంపై దర్యాప్తులో భాగంగా ఆయన ఆదాయం, సంపద వెలుగు చూసింది. గత ఇరవై ఏళ్ల కాలంలో భేలే బాబా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారు. నిత్యం తెల్లటి సూటు, బూట్లు, టై, నల్ల కండ్లద్దాలతో కనిపించే భోలే బాబా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాస్గంజ్, ఆగ్రా, కాన్పూర్, గ్వాలియర్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 విలాసవంతమైన ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తుంటారు. అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లే వీటి నిర్వహణ బాధ్యతలను చూస్తుంటారు.ఇక భోలే బాబా సూరజ్పాల్ మెయిన్పురిలోని విలాసవంతమైన హరి నగర్ ఆశ్రమంలో నివాసముంటారు. ఈ ఆశ్రమం మొత్తం 13 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. రాజభవనాన్ని పోలి ఉన్న ఈ ఆశ్రమాన్ని రూ. 4 కోట్లతో నిర్మించారు.ఆయన భక్తులలో ఒకరు ఈ స్థలాన్ని బాబాకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.ఇందులో భోలే బాబా, ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది.ఆయనకు దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఉంటారు. అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భోలే బాబా తెల్లటి టయోటా ఫార్చునర్ కారులో వస్తాడు. అందులో బాబా ప్రయాణిస్తుండగా.. ముందు ఆయన కమాండోలు బైక్లపై దారిని క్లియర్ చేస్తారు. అదే విధంగా వెనుక దాదాపు 30 లగ్జరీ కార్లతో ఆయన కాన్వాయ్ ఉంటుంది. ఇక భోలే బాబా ఉపయోగించే కారు ఇంటీరియర్ మొత్తం తెలుపు రంగులోనే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది.యూపీలోని ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన సూరజ్ పాల్ మొదట తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరి 18 ఏళ్ల పాటు పని చేశాడు. ఈ సమయంలోనే తాను ఇంటలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నట్టు చెప్పుకొని జనాన్ని బురిడీ కొట్టించేవాడు. తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటున్న భోలే బాబా 1999లో కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి బోధించడం ప్రారంభించాడు. ఖరీదైన వస్తువులు, కార్లపై ప్రీతి కలిగిన ఆయనకు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీటిని తన భక్తుల పేర్లతో కొనుగోలు చేసేవాడు.హథ్రాస్లోని భోలే బాబా సత్సంగ్లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కు చేరుకుంది. వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సత్సంగ్ను వీరే నిర్వహించారని, కార్యక్రమానికి వీరే అనుమతి పొందారని పోలీసులు చెప్పారు.ఈ కార్యక్రమానికి నిర్వాహకులు కేవలం 80,000 మందికి మాత్రమే అనుమతినివ్వగా.. దాదాపు 2.5 లక్షల మంది అనుచరులు తరలివచ్చారని పోలీసులు తెలిపారు. భోలే బాబా వేదిక నుంచి వెళుతున్న సమయంలో అతని కాన్వాయ్ ద్వారా తన్నిన ధూళిని సేకరించడానికి భక్తుల గుంపు పరుగెత్తుకొచ్చింది, ఇది ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే గుంపును నియంత్రించే ప్రయత్నంలో వాలంటీర్లు, అతని భద్రత సిబ్బంది ప్రజలను వెనక్కి నెట్టడం ప్రారంభించారు. దీంతో అనేక మంది భక్తులు గుంపుగా పడి నలిగిపోయారు. అక్కడి నుంచి పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగింది.అయితే ఇప్పటి వరకు సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా ఆచూకీ మాత్రం తెలియ రాలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు భోలే బాబా ఆశ్రమానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఎఫ్ఐఆర్లో భోలే బాబా పేరు లేనందున ఆయనను అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిని విచారించిన తర్వాత అవసరమైతే భోలే బాబాను విచారిస్తామని తెలిపారు. -
హత్రాస్ ప్రమాదాన్ని రాజకీయం చేయాలని లేదు: రాహుల్ గాంధీ
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హత్రాస్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా హత్రాస్ దుర్ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.కాగా, రాహుల్ హత్రాస్ పర్యటన సందర్భంగా అలీఘర్లోని పిల్ఖానాలో ఛోటే లాల్ భార్య మంజు, ఛోటే లాల్ కుమారుడు పంకజ్, ప్రేమవతి, ప్రమాదంలో మరణించిన విజయ్ సింగ్ భార్య శాంతి దేవి కుటుంబాలను కలుసుకున్నారు. వారిని పరామర్శించారు. అనంతరం, హత్రాస్లోని నవీపూర్ ఖుర్ద్, విభవ్ నగర్లో ఉన్న గ్రీన్ పార్కుకు చేరుకుంటారు. ఇక్కడ రాహుల్ గాంధీ జుగ్ను, సుభాష్ చంద్, కిషన్ లాల్ కుటుంబ సభ్యులను కలిశారు. VIDEO | Congress MP Rahul Gandhi (@RahulGandhi) meets the families of the Hathras stampede victims in Aligarh.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/LQ6wTonyDe— Press Trust of India (@PTI_News) July 5, 2024 అనంతరం, రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘హత్రాస్ ఘటనను రాజకీయం చేయాలనుకోవడం లేదు. హత్రాస్ ఘటన విషయంతో యూపీ సీఎం యోగి పెద్ద మనసు చేసుకోవాలి. బాధితులకు ఆరేళ్ల తర్వాత పరిహరం చేయడం కాకుండా.. వెంటనే న్యాయం చేయాలి. హత్రాస్లో భద్రతా వైఫ్యలం కారణంగా ప్రమాదం జరిగినట్టు బాధిత కుటుంబాల సభ్యులు చెబుతున్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | Hathras, UP: After meeting the victims of the stampede, Congress MP and LoP in Lok Sabha, Rahul Gandhi says "It is a sad incident. Several people have died. I don't want to say this from a political prism but there have been deficiencies on the part of the administration… pic.twitter.com/n2CXvZztJx— ANI (@ANI) July 5, 2024 ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం హత్రాస్లో సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా 121 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక, ఈ ఘటనపై యూపీలోకి యోగీ సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారు సాక్ష్యాలను దాచిపెట్టారని, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఇక, ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ బుధవారం హత్రాస్ను సందర్శించి ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు. ఈ ప్రమాదానికి కారణమైన భోలే బాబా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. #WATCH | Uttar Pradesh: Congress MP Rahul Gandhi leaves from the residence of a victim of the Hathras stampede accident, in Aligarh. pic.twitter.com/OUecgpgAXL— ANI (@ANI) July 5, 2024 -
హత్రాస్ తొక్కిసలాట: ఆరుగురి అరెస్ట్, అవసరమైతే బాబాను విచారణ
హత్రాస్ తొక్కిసలాట కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో సత్సంగ్ ఆర్గనైజింగ్ నిర్వాహకులతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వీరు సత్సంగ్ కార్యక్రమ నిర్వాహకులు, సేవాదార్లుగా పనిచేస్తున్నారని అలీగఢ్ ఐజీ శలభ్ పేర్కొన్నారు.ప్రధాన నిర్వాహకుడిని పట్టుకునేందుకు రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు తెలిపారు. త్వరలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. జనాలు ఒకేసారి గుంపుగా రాగా.. నిర్వాహకులు అడ్డుకున్నారని.. ఆ తర్వాత ఒకేసారి బయటకు రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. మహిళలు, పిల్లలు ఒకరిపై పడిపోయారన్నారు. భోలే బాబా నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఐజీ వెల్లడించారు. అయితే, సత్సంగ్కు ఆయన పేరుతో కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అవసరమైతే బాబాను ప్రశ్నిస్తామన్నారు. అప్పటి వరకు 121 మంది మృతి చెందారని.. మృతుల ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ సైతం పూర్తయ్యిందన్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
Hathras Incident: ఊపిరాడక కొందరు.. ఎముకలు విరిగి మరికొందరు..
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 121 మంది మృతిచెందారు. వీరికి సంబంధించిన పోస్ట్మార్టం నివేదికలలో వీరంతా ఎలా మృతి చెందినదీ తెలియవచ్చింది. ఈ వివరాలు ఎవరినైనా కంటతడి పెట్టించేలా ఉన్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం అలీఘర్లో 37 మందికి పోస్టుమార్టం నిర్వహించగా, వారిలో 10 మంది ఊపిరాడక మృతి చెందారని వైద్యులు తెలిపారు. తలకు బలమైన గాయాలు కావడం, ఎముకలు విరిగిపోవడం, బ్రెయిన్ హెమరేజ్ మొదలైనవి పలువురి మృతికి కారణంగా నిలిచాయి. 12 నుంచి 15 మంది కాలేయం, ఊపిరితిత్తులు పగిలిపోవడంతో మృతి చెందారు. తల, భుజం, మెడ, వెన్నెముకపై తీవ్రమైన గాయాల కారణంగా మరికొందరు మృతి చెందారు.జిల్లా ఆస్పత్రిలోని పోస్ట్మార్టం హౌస్కు మృతదేహాలు చేరుకోగానే.. అప్పటికే అక్కడికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తమ వారిని చూసుకుని బిగ్గరగా రోదించారు. ఈ దృశ్యాన్ని చూసినవారంతా కంటతడి పెట్టుకున్నారు. పోస్టుమార్టం హౌస్ వద్దకు అంబులెన్స్లు, పోలీసు వాహనాల్లో మృతదేహాలను వరుసగా తీసుకువస్తుండటంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. మృతదేహాలను ఉంచేందుకు జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ, పోస్ట్మార్టం హౌస్ సరిపోలేదు. దీంతో వాటిని తెల్లటి వస్త్రాలలో చుట్టి, ఆస్పత్రి ఆవరణలోనే ఉంచారు. -
Hathras Satsang Stampede: అనుమతి 80 వేల మందికి.. వచ్చింది 2.5 లక్షలు
హత్రాస్/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య బుధవారం 121కి చేరుకుంది. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్య సేవాదార్ దేవప్రకాశ్ మధుకర్తోపాటు ఇతరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. భోలే బాబా పేరును ఇంకా చేర్చలేదు. 80 వేల మందికే అనుమతి ఉంటే 2.5 లక్షల మంది వచ్చారని ఎఫ్ఐఆర్లో పోలీసులు స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు దాచిపెట్టేందుకు నిర్వాహకులు ప్రయతి్నంచారని ఆరోపించారు. అనుమతి తీసుకొనే సమయంలో తమకు సరైన సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తొక్కిసలాటలో పోలీసుల తప్పిదమీమీ లేదని స్పష్టం చేశారు. ఫూల్రాయ్లో తొక్కిసలాటకు కారణమైన బాబా నారాయణ్ హరి అలియాస్ సకర్ విశ్వ హరి భోలే బాబా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 121 మంది మృతుల్లో 117 మందిని గుర్తించారు. గాయపడ్డ 28 మందికి చికిత్స కొనసాగుతోంది. సత్సంగ్ టెంట్ వద్ద గుట్టలుగా పేరుకుపోయిన చెప్పులు దుర్ఘటనకు మౌనసాక్షిగా నిలిచాయి. జ్యుడీషియల్ విచారణ: యోగితొక్కిసలాటపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వలో జ్యుడీషియల్ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. దుర్ఘటన వెనుక కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు. చికిత్స పొందుతున్న వారిని ఆయన బుధవారం పరామర్శించారు. ఘటనా స్థలాన్నీ్న పరిశీలించారు.బాబా మంచోడు: గ్రామస్తులుభోలే బాబా మంచోడని యూపీలో కాస్గంజ్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బహదూర్నగర్ వాసులు చెబుతున్నారు. బాబా తమను ఏనాడూ చందాలు గానీ, కానుకలు గానీ అడగలేదని గ్రామస్థులు చెప్పారు. బహదూర్నగర్ సమీపంలో భోలేబాబాకు ఒక ఆశ్రమం ఉంది. బాబా దంపతులకు సంతానం కలగలేదు. ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 16 ఏళ్ల క్రితం ఆ బాలిక చనిపోయింది. ఆమె ప్రాణాలతో లేచివస్తుందన్న నమ్మకంతో మృతదేహాన్ని రెండు రోజులపాటు తన ఇంట్లోనే ఉంచారు. పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు అంత్య క్రియలు నిర్వహించారు. బాబా అనుచరుల వల్లే తొక్కిసలాట! తొక్కిసలాటపై హత్రాస్ సబ్డివిజనల్ మేజి్రస్టేట్(ఎస్డీఎం) బుధవారం జిల్లా మేజి్రస్టేట్కు ప్రాథమిక నివేదిక సమర్పించారు. సత్సంగ్ ముగిసిన తర్వాత తన వాహనం వద్దకు తిరిగి వెళ్తున్న భోలే బాబాను దగ్గరగా చూసేందుకు, చేత్తో తాకేందుకు భక్తులు అరాటపడ్డారని, వారిని బాబా అనుచరులు దూరంగా తోసివేయడానికి ప్రయతి్నంచడంతో తొక్కిసలాట జరిగిందని నివేదికలో వెల్లడించారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో నేలంతా బురదగా ఉండడంతో జనం జారిపడ్డారని, ఒకరిపై ఒకరు పడిపోయారని పేర్కొన్నారు. కింద చిక్కుకున్నవారు ఉపిరాడక మృతిచెందారని నివేదికలో ప్రస్తావించారు. సత్సంగ్కు 2 లక్షల మందికిపైగా జనం హాజరయ్యారని వివరించారు. విద్రోహ శక్తులే కారణం భోలే బాబా లక్నో: సత్సంగ్ వేదిక నుంచి తాను వెళ్లిపోయిన చాలాసేపటికి తొక్కిసలాట జరిగిందంటూ భోలే బాబా బుధవారం ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాటకు సంఘ విద్రోహ శక్తులే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో తానక్కడ లేనన్నారు. భక్తుల మృతిపట్ల సంతాపం ప్రకటించారు. -
ఘోరం... నేరం...
మానవ బలహీనతను సొమ్ము చేసుకోవడానికి నమ్మకాన్ని వాటంగా మార్చుకోవడం చరిత్రలో తరచూ కనిపించేదే. ఎవరికీ ఏ ఇబ్బందీ కలగనంత వరకేమో కానీ... ప్రజల అమాయకత్వాన్ని స్వార్థానికి వాడుకుంటున్నప్పుడు, ఆ ప్రక్రియ ఆఖరికి ప్రాణాంతకంగానూ మారినప్పుడు చూస్తూ సహించలేం. సమకాలీన సమాజంలో అలాంటి అనుభవాల్ని భరించలేం. ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫూల్రాయ్ వద్ద మంగళవారం జరిగిన ధార్మిక సభ, అక్కడ తొక్కిసలాటను చూసినప్పుడు అదే అనిపిస్తుంది. 121 మంది అమాయక భక్తులు మరణించిన హాథ్రస్ ఘటన ఘోర విషాదం. పాదధూళితో, పంపులో నీళ్ళతో సమస్త సమస్యలూ పరిష్కారమవుతాయని అమాయక ప్రజల్ని నమ్మిస్తున్న ఓ పెద్ద మనిషి తప్పిదానికి అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిశాయి. పాలకులు ఎప్పటి లానే సంతాపాలు తెలిపారు. నష్టపరిహారాలు ప్రకటించారు. సిట్ దర్యాప్తుకూ ఆదేశించారు. కానీ, తరచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనల్ని నివారించాల్సిన బాధ్యత లేదా? ప్రమాదవేళ తూతూ మంత్రంగా స్పందించి, ఆనక నివారణ చర్యలపై నిమ్మకు నీరెత్తినట్టుంటే సరిపోతుందా? తాజా హాథ్రస్ ఘటనకు కేంద్రబిందువైన స్వయం ప్రకటిత దైవదూత నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబా కథ సుదీర్ఘమైనదే. ఆయన అసలు పేరు సూరజ్ పాల్. ఆధ్యాత్మిక గురువుగా మారక ముందు యూపీ పోలీసుల స్థానిక ఇంటెలిజెన్స్ విభాగంలో సాధారణ హెడ్ కానిస్టేబుల్. ఉద్యోగంలో ఉండగానే తాను ఆధ్యాత్మికత వైపు మొగ్గాననీ, అందుకే 1990లలో చేస్తున్న ఉద్యోగం మానేసి దైవమార్గం పట్టాననీ ఆయన కథనం. ఉత్తరప్రదేశ్లో ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చలువ కళ్ళద్దాలు, శ్వేత వస్త్రధారణతో పేరు, పలుకుబడి గల బాబాగా అవతరించడం ఆశ్చర్యమే. ఇవాళ యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా తదితర ప్రధాన హిందీ రాష్ట్రాల్లో ఆయనకు లక్షలాది భక్తులు పోగుబడడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. చనిపోయిన బిడ్డను బ్రతికిస్తానంటూ 23 ఏళ్ళ క్రితం శ్మశానంలో గందరగోళం చేయడం మొదలు లైంగిక అత్యాచార ఆరోపణల దాకా ఈ బాబాపై అనేక కేసులున్నాయి. నాలుగేళ్ళ క్రితం 2020 జనవరిలో షాజహాన్పుర్లో ఈయన సత్సంగంలోనే ప్రసాద వితరణ వేళ మంటలు చెలరేగి, తొక్కిసలాట జరిగింది. సమయానికి అగ్నిమాపక దళం రావడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, దోవ కూడా సరిగ్గా లేని తాజా హాథ్రస్ ఘటనాస్థలిలో కనీసం అంబులెన్స్ లాంటివైనా లేకపోవడం ఘోరం, నేరం.హాథ్రస్ ఘటనపై కఠిన చర్యలు చేపడతామని యూపీ సీఎం గర్జించారు కానీ, ఈ దుర్ఘటనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో అసలు భోలే బాబా పేరే పెట్టలేదు. ఇక, ఇంత భారీ దుర్ఘటన జరిగాక సదరు బాబా ఎవరికీ కనిపించకుండా పరారీలో ఉన్నారు. హాథ్రస్ ఘటన అత్యాశకూ, అపరిమిత నిర్లక్ష్యానికీ ప్రతీక. ఈ ఘటనలో తిలా పాపం తలా పిడికెడు. సత్సంగమంటూ 80 వేల మందికే అనుమతి తీసుకొన్నా, రెండున్నర లక్షల మందికి పైగా జనాన్ని అనుమతించడం ఎవరి తప్పు? తగినన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలైనా లేకుండా అంత భారీ ఆధ్యాత్మిక సభ జరిపిన నిర్వాహకులను ఏమనాలి? ‘నా పాదధూళి ఇంటికి తీసుకెళ్ళి సమస్యల్లో ఉన్నవారికి రాస్తే అన్నీ చక్కబడతాయి’ అని అమాయకుల బలహీనతతో ఆడుకొని, ఇంత ఘోరానికి కారకుడైన మహానుభావుణ్ణి ఏం చేయాలి? ఇంత జరిగాక కూడా ఆయన తన వకీలు ద్వారా ఈ దుర్ఘటన వెనుక అసాంఘిక శక్తుల కుట్ర ఉందంటూ నెపం నెట్టేసే పని చేస్తుంటే పాలకులు ఏం చేస్తున్నట్టు? హాథ్రస్ ఘటన లాంటివి మనకు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. 2005లో మహారాష్ట్రలోని వాయిలో మంధరాదేవి గుడి వద్ద తొక్కిసలాటలో 340 మందికి పైగా చనిపోయారు. 2008లో రాజస్థాన్లో చాముండా దేవి ఆలయం వద్ద కనీసం 250 మంది, హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి గుడి వద్ద 162 మంది తొక్కిసలాటల్లోనే దుర్మణం పాలయ్యారు. చరిత్ర పుటల్లో వెనక్కి వెళితే, 70 ఏళ్ళ క్రితం 1954లో స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళాలో అలహా బాద్లో జరిగిన తొక్కిసలాటలో 800 మంది ప్రాణాలు కోల్పోవడం గుండెల్ని మెలిపెట్టే విషాదం. రద్దీని నియంత్రించే వ్యవస్థలు లేకపోవడం, భారీగా జనం తరలివచ్చే సందర్భాలకు తగ్గట్టు ముందస్తు ప్రణాళికా రచన చేయకపోవడం, సామాన్యుల నియంత్రణే కష్టంగా ఉండే సమయంలో వీఐపీల తాకిడి ఎక్కువై యంత్రాంగమంతా వారి సేవల్లో తరించడం లాంటి లోపాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అది మరింత విషాదం. భారతదేశంలో నూటికి 79 తొక్కిసలాటలు ధార్మిక సమ్మేళనాలు, తీర్థయాత్రల్లో జరుగుతున్నవేనని 2013లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. పైపెచ్చు, మన దేశంలో అనేక ఆలయాలు కొండల పైన, నదీ తీరాల్లో, ప్రయాణానికి సంక్లిష్టమైన ఇతర ప్రాంతాల్లో నెలకొన్నందున తొక్కిసలాటల ముప్పు ఎక్కువ. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక సమ్మేళనాలు నిర్వహిస్తుంటే వేలు, లక్షల్లో జనం రాకతో ఆ ప్రాంతాలు క్రిక్కిరిసి పోతున్నాయి. అలాంటి చోట్ల ప్రాథమిక వసతులే కాదు... కనీసం సరైన ప్రవేశ మార్గాలు, అత్యవసర పరిస్థితుల్లో నిష్క్రమణ మార్గాలు సైతం ఉండట్లేదు. ఇవన్నీ ప్రమాదాలకు కారణాలే. వీటిని నివారించాలంటే జనసమ్మర్దాన్ని నియంత్రించే యంత్రాంగం కీలక పాత్ర పోషించాలి. 2014లోనే జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ జనసమ్మర్ద నియంత్రణపై మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ, అవి ఎక్కడా అమలైనట్టు లేవు. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజా ఘటనతోనైనా పాలకులు నిద్ర లేస్తారా? ఓట్ల రాజకీయాల్ని వదిలేసి, మూఢనమ్మకాలు ప్రోత్సహించేవారికి ముకుతాడు వేస్తారా? -
భోలే బాబాకు రక్షణగా 'బ్లాక్ కమాండోస్', మహిళా సైన్యం..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది మరణానికి కారణమైన భోలే బాబా గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తనని తాను స్వయంగా దేవుడిగా ప్రకటించుకున్న భోలే బాబాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. యూపీలోని మెయిన్పురిలో భారీ మొత్తంలో పొందిన విరాళాలతో నిర్మించిన విశాలమైన ఆశ్రమం ఆయన భక్తులలో ఆయనకున్న పట్టు, ఆదరణకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అయితే వివాదాలు ఆయన్ని వెంటాతుండడంతో తన ప్రాణాలు ముప్పు వాటిల్లుతుందనే అనుమానం ఎక్కువగా ఉండేదని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామంలోని తన ఇంటికి దాదాపు ఎనిమిదేళ్లుగా భోలే బాబా వెళ్లలేదు. అతని చుట్టూ బ్లాక్ కమాండో తరహాలో మహిళలు 24 గంటలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఆశ్రమంలో భోలే బాబాకు ఓ గది ఉంది. అందులో భోలే బాబా ఎంపిక చేసిన ఏడుగురు వ్యక్తులకు మాత్రమే అందులోకి అనుమతించే వారు. ఏడుగురిలో మహిళలు,సేవకులున్నారు.సెక్యూరిటీ ప్రోటోకాల్కు అనుగుణంగా రాత్రి 8 గంటల తర్వాత ఎవరినీ కలవడని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. భోలో బాబాకు రక్షణా ఉండే సిబ్బందికి ఒక కోడ్ వర్డ్, ప్రతి సెక్యూరిటీ స్క్వాడ్కి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంది.నారాయణి సేన, గరుడ్ యోధ, హరి వాహక్ అనే మూడు బృందాలు బాబాను రక్షించడానికి 24 గంటలూ పని చేస్తాయి.నారాయణి సేనలోని సిబ్బంది గులాబీ రంగు దుస్తులు, గరుడ్ యోధ నల్లని దుస్తులను (స్థానికులు వారిని బ్లాక్ కమాండోలు అని పిలుస్తారు.హరి వాహక్ సభ్యులు విలక్షణమైన టోపీలు, గోధుమ రంగు దుస్తులు ధరిస్తారు.బ్లాక్ కమాండోలు బాబా కాన్వాయ్ వెంట ఉంటారు. ఎల్లప్పుడూ 20 మంది పనిచేస్తుంటారు. ప్రతి నారాయణి సేనలో 50 మంది సభ్యులు, హరి వాహక్ సభ్యులు ఒక్కొక్కరు 25 మందితో కూడిన బృందాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
హత్రాస్ తొక్కిసలాట.. తొలిసారి స్పందించిన భోలే బాబా
లక్నో : ఉత్తరప్రదేశ్ హత్రాస్లో భోలే బాబా సత్సంగ్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు .. సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. కానీ ఆ ఘటన తర్వాత భోలే బాబా పరారయ్యాడు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ హత్రాస్లో 121 మందికి మరణానికి కారణమైన భోలేబాబా ఓ ప్రకటన చేశారు. వ్యతిరేక శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇది భయంకరమైన గందరగోళాన్ని సృష్టించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు.First responce from Bhole Baba Ashram after stampede incident. Appointed Advocate AP Singh for legal action pic.twitter.com/jXdq1AxW4H— Abhishek Thakur (@Abhisheklive4u) July 3, 2024తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వెళ్లిన చాలా సేపటి తర్వాత తొక్కిస లాట జరిగిందని తెలిపారు.సంత్సంగ్ ముగిసిన తర్వాత కొంతమంది సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం. దీనిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ ఓ నోట్ను విడుదల చేశారు.కాగా, సామాన్యుల మరణానికి కారణమైన భోలే బాబాను అరెస్టు చేస్తారా అని అడిగిన ప్రశ్నకు రాష్ట్ర పోలీసు చీఫ్ ప్రశాంత్ కుమార్ స్పందించారు. వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము అని ఆ నోట్లో పేర్కొన్నారు. -
హత్రాస్ తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణ: సీఎం యోగి ప్రకటన
లక్నో: ఉత్తర ప్రదేశ్లో హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121 చేరింది. బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణమైన సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బోలే బాబా కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసుల వెతుకుతున్న నేపథ్యంలో బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.హత్రాస్ జిల్లాలో తొక్కిసలాటలో 121 మంది మరణించిన ఘటనపై న్యాయ విచారణ జరిపించనున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు. ఈ జ్యుడీషియల్ విచారణ కమిటీలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, పోలీసు అధికారులు ఉంటారని తెలిపారు.ఈ విషాదానికి బాధ్యులెవరో గుర్తించడంతో పాటు, ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందిస్తామని సీఎం తెలిపారు. కాగా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని వదిలేదిలేదని సీఎం ఇప్పటికే ప్రకటించారుసుప్రీంకోర్టులో పిటిషన్మరోవైపు, హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. అటు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. -
విస్తుపోయే వాస్తవాలు.. జైలు జీవితం.. ఆపై ‘భోలే బాబా’గా అవతారం ఎత్తి
లక్నో : ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో నారాయాణ్ సాకార్ హరి.. అలియాస్ సాకార్ విశ్వ హరి(సూరజ్ పాల్)..‘భోలే బాబా’ లైంగిక వేధింపులకు పాల్పడిన చరిత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మంగళవారం సత్సంగ్ పేరుతో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిస లాట జరిగి 121 మంది మరణించగా.. 108 మందికిపైగా తీవ్రగాయాల పాలయ్యారు. హత్రాస్లో జరిగిన ఈ సంఘటన, భోలేబాబా పాద దూళి కోసం ఎగబడటం, ఆయన ఆశిస్సులు తీసుకునేందుకు పోటి పడడం విషాదానికి కారణమైంది. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో భోలే బాబాపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పోలీస్ విభాగంలో పనిచేసే సమయంలో లైంగిక వేధింపులు పాల్పడి జైలు పాలయ్యాడు. ఆయనపై ఆగ్రా, ఎటావా, కస్గంజ్, ఫరూఖాబాద్, రాజస్థాన్తో సహా వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.లైంగిక వేధింపులతో జైలు పాలై,విడుదలైన తర్వాత తన పూర్వీకుల గ్రామంలోని ఆశ్రమం ఏర్పాటు చేసి 'సాకర్ విశ్వ హరి బాబా'గా తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది.#WATCH | On the Hathras stampede incident, Uttar Pradesh CM Yogi Adityanath says "Some people have the tendency to politicise such sad and painful incidents. These people have the nature of 'chori bhi aur seenazori bhi'. Everyone knows with whom the gentleman's (preacher) photos… pic.twitter.com/gNCHNJdpNz— ANI (@ANI) July 3, 2024 -
Hathras Stampede: కరోనా కాలంలోనూ..
యూపీలోని హత్రాస్లో జరిగిన భారీ తొక్కిసలాట దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో 121 మంది మృతి చెందారు. నారాయణ్ సాకార్ అలియాస్ భోలే బాబా సత్సంగంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ సత్సంగానికి స్థానికులతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ల నుంచి కూడా భోలే బాబా అనుచరులు తరలివచ్చారు. భారీ స్థాయిలో జనం వచ్చినప్పటికీ సత్సంగ్ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో భోలే బాబా నిర్వాకానికి సంబంధించిన అంశం మరోమారు చర్చల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న 2021లో భోలే బాబా ఒక సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో 50 వేల మందికి పైగా జనం పాల్గొన్నారు. నాడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సత్సంగంలో 50 మంది మాత్రమే పాల్గొనడానికి అనుమతివుంది. అయితే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ 50 వేల మందికి పైగా జనం సత్సంగానికి హాజరయ్యారు.ఇందుకు భోలే బాబా సహకరించారనే ఆరోపణలున్నాయి. నాడు ఫరూఖాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి జనం పోటెత్తడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఆప్పట్లో జిల్లా యంత్రాంగం సత్సంగ్ నిర్వాహకులకు నోటీసు కూడా ఇచ్చింది. 2021లో బాబా నిర్వహించిన సత్సంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ये वीडियो 2021 का है जब फ़र्रुख़ाबाद में बाबा नारायण हरि साकार ने सत्संग किया था. साल 2021 में कोविड की वजह से प्रशासन ने सिर्फ़ 50 लोगों की अनुमति दी थी लेकिन बाबा ने 50 हज़ार से ज़्यादा की भीड़ इकट्ठी कर दी थी.#HathrasAccident #HathrasTragedy #bholebaba pic.twitter.com/0GLHXUdxV0— NDTV India (@ndtvindia) July 3, 2024 -
హత్రాస్ తొక్కిసలాట: భయంతో మరో బాబా వినతి
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల సంఖ్య 121 దాటింది. ఈ ప్రమాదం నేపధ్యంలో అప్రమత్తమైన మధ్యప్రదేశ్కు చెందిన మరో బాబా తన అనుచరులను ఉద్దేశిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.బాగేశ్వర్ ధామ్కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి భక్తులు, అనుచరులు అధిక సంఖ్యలో ఉన్నారు. జూలై నాలుగున జరిగే అతని పుట్టిన రోజుల వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే హత్రాస్ ఘటన నేపధ్యంలో మరోమారు అలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతో పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు.ఆ వీడియోలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి ‘జూలై 4న నా పుట్టిన రోజు. ఆ రోజు నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గుతుంది. అయితే ఆరోజు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వీడియో ద్వారా ఒక అభ్యర్థన చేస్తున్నాను. జూలై నాలుగున జరిగే వేడుకలకు దూరప్రాంతాల నుంచి రావాలనుకుంటున్నవారు తమ ఇళ్లలోనే పూజలు చేసుకోవాలి. ఇప్పటికే ఇక్కడ భక్తుల రద్దీ పెరిగింది. భద్రత దృష్ట్యా ఎక్కడివారు అక్కడే వేడుకలు చేసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. अतिआवश्यक सूचना…पूज्य सरकार द्वारा सभी भक्तों को आवश्यक संदेश….इसे जन जन तक पहुँचाए… pic.twitter.com/GgLledRw4H— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) July 2, 2024 -
బాబా ఆశీస్సుల కోసం వెళ్లి 116 మంది దుర్మరణం..
-
Hathras Stampede: అఖిలేష్ కూడా బాబా భక్తుడే.. ఫొటో వైరల్
యూపీలోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాట అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 121 దాటింది. నారాయణ్ సాకార్ అలియాస్ భోలే బాబా సత్సంగంలో ఈ ఘటన చోటుచేసుకుంది.యూపీలో ఈ బాబాకు లెక్కకు మించిన భక్తులు, అనుచరులు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గతంలో భోలే బాబా సత్సంగానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్గా మారాయి.నాడు భోలే బాబా సత్సంగానికి హాజరైన అఖిలేష్ యాదవ్ తన ప్రసంగంలో బాబాను పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి సంబంధించిన ఫోటోలను అఖిలేష్ అప్పట్లో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో అఖిలేష్ వీఐపీ సీట్లలో కూర్చుని కనిపిస్తున్నారు. మరో ఫోటోలో అఖిలేష్ యాదవ్ బాబా భక్తులను ఉద్దేశించి ప్రసంగించడాన్ని చూడవచ్చు. नारायण साकार हरि की सम्पूर्ण ब्रह्मांड में सदा - सदा के लिए जय जयकार हो pic.twitter.com/lp4wTmaHal— Akhilesh Yadav (@yadavakhilesh) January 3, 2023 -
Hathras Stampede: అన్ని మృతదేహాలను ఒకేచోట చూసేసరికి..
యూపీలోని హత్రాస్లో తొక్కిసలాట తర్వాత సమీప ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కనిపించాయి. ఇవి చూపరుల హృదయాలను కలచివేశాయి. ఎంతటి గుండెధైర్యం కలిగినవారైనా అన్ని మృతదేహాలను ఒకేచోట చూస్తే వారి మనసు కల్లోలమవుతుంది. ఒక కానిస్టేబుల్ ఇటువంటి అనుభవానికే లోనై, చివరికి ప్రాణాలు కోల్పోయాడు. హత్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్ట్మార్టం హౌస్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవికుమార్ మృతదేహాలను అక్కడికి తీసుకురావడాన్ని గమనిస్తున్నాడు. అక్కడికి వస్తున్న మృతదేహాల సంఖ్య లెక్కకుమించి ఉండటానికి తోడు, బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటడం రవికుమార్ మనసును తీవ్రంగా కలచివేశాయి.అతనిలో గుండె దడ మొదలయ్యింది. కొద్ది క్షణాలకే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే తోటి కానిస్గేబుల్ లలిత్ కుమార్ అతనిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించాడు. వైద్య చికిత్స తీసుకుంటూనే 20 నిమిషాల తర్వాత రవికుమార్ మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రవి కుమార్ బన్నా దేవి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహల్లా సిద్ధార్థ్ నగర్లో నివసిస్తున్నాడు. 2022 నుండి అవగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. హత్రాస్ ప్రమాదం నేపధ్యంలో రవికుమార్ను ఎటా మెడికల్ కాలేజీ మార్చురీ వద్ద విధులలో నియమించారు. -
హత్రాస్ ఘటన: కుమార్తె కోసం ఆస్పత్రికి వెళ్లే సరికి..
యూపీలోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మంది మృతిచెందారు. ఈ ప్రమాదం యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘటనలో తన 16 ఏళ్ల కుమార్తెను కోల్పోయిన ఒక తల్లి తన ఆవేదనను మీడియా ముందు వెల్లడించింది.బాధితురాలు కమల మాట్లాడుతూ ‘మేము గత 20 ఏళ్లుగా సత్సంగానికి హాజరవుతున్నాం. ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ఈ దుర్ఘటనలో నేను నా కుమార్తెను కోల్పోయాను. నా కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎవరో ఫోన్ చేశారు. మేము ఆస్పత్రికి చేరుకునే సమయాకే నా కుమార్తె మరణించింది. ఈ విషయాన్ని వైద్యులే స్వయంగా తెలిపారు’ అని పేర్కొంది.భోలే బాబా సత్సంగం సికంద్రరావు కొత్వాలి ప్రాంతంలోని జిటి రోడ్డులోని ఫుల్రాయ్ గ్రామ సమీపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 40 వేల మంది పాల్గొన్నారు. నిర్వహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగి విషాదం చోటుచేసుకుంది. #WATCH | Mother of a 16-year-old who died in the Hathras stampede, Kamala says, " We have been attending the Satsang for the last 20 years and such an incident has never happened...'Parmatama' (Bhole Baba) left around 2-2:30 pm and after that, the incident happened...I lost my… pic.twitter.com/QnAazDZvAa— ANI (@ANI) July 3, 2024 -
మృత్యుకేళికి సాక్ష్యం.. తాజా వీడియో
యూపీలోని హత్రాస్లో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 116 మంది మృత్యువాత పడ్డారు. లెక్కలేనంతమంది గాయపడ్డారు. సత్సంగం జరిగిన ప్రాంతానికి చెందిన తాజా వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ మౌనం తాండవిస్తోంది. నిన్న(మంగళవారం) జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 40 వేల మంది పాల్గొన్నారు. #WATCH | Uttar Pradesh: Visuals from the incident spot where a stampede took place yesterday, claiming the lives of 116 people in Hathras. The incident happened during a Satsang conducted by 'Bhole Baba'. pic.twitter.com/7wfXYFRHIO— ANI (@ANI) July 3, 2024నారాయణ్ సకర్ విశ్వ హరిగా పేరొందిన భోలే బాబా సత్సంగ కార్యక్రమానికి హాజరైన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన సికంద్రరావు కొత్వాలి ప్రాంతంలోని జీటీ రోడ్డులోని ఫుల్రాయ్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.సత్సంగానికి పెద్ద సంఖ్యలో జనం హాజరు కావడం, నిర్వాహకులు తగిన ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలుస్తోంది. కాగా యూపీ సీఎం యోగి ఈరోజు(బుధవారం) హత్రాస్ బాధితులను పరామర్శించనున్నారు. -
హత్రాస్ ఘటన అప్డేట్స్: సుప్రీం కోర్టులో పిటిషన్
Updatesహత్రాస్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి ఆదిత్య నాథ్ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు.#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath chairs a meeting with officials regarding the Hathras Stampede Accident. pic.twitter.com/ziTf51Vyf4— ANI (@ANI) July 3, 2024హత్రాస్ ఘటనపై సుప్రీం కోర్టులో పిటిషన్హత్రాస్ తొక్కిసలాట ఘటనపై నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. కర్ణాటకకు చెందిన న్యాయవాది విశాల్ తివారీ ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టును పిటిషన్లో కోరారు. #WATCH | Bengaluru, Karnataka: On Hathras Stampede, Advocate Vishal Tiwari says, "The PIL has been filed (in the Supreme Court) related to the Hathras stampede incident. We have requested that an expert committee, comprising five members, shall be constituted under the… pic.twitter.com/RJpNdEPkVA— ANI (@ANI) July 3, 2024 సత్సంగ్ తొక్కిసలాట ఘటనా స్థలాన్ని సీఎం యోగి పరిశీలించారు.#WATCH | Hathras Stampede accident | UP CM Yogi Adityanath reaches and inspects the accident spot where the stampede took place yesterday pic.twitter.com/I5hAxtP0dQ— ANI (@ANI) July 3, 2024హత్రాస్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న తొక్కిసలాట ఘటన బాధితులను సీఎం యోగి పరామర్శించారు.#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath meets the injured in the stampede incident, at Hathras government hospital121 people lost their lives in a stampede during a religious event in Hathras yesterday pic.twitter.com/mDpTLBxpL2— ANI (@ANI) July 3, 2024 హత్రాస్ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసులతో పరిస్థితి సమీక్ష చేస్తున్నారు. ఘటన పరిస్థితిపై సీఎం యోగి పోలీసులతో ఆరా తీస్తున్నారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసులను సీఎం యోగి ప్రశ్నించారు. భక్తుల తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. #WATCH | Hathras Stampede accident | Hathras: UP CM Yogi Adityanath takes stock of the situation at the Hathras Police lines pic.twitter.com/DWtRcUzJb2— ANI (@ANI) July 3, 2024సత్సంగ్ తొక్కిసలాట ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హత్రాస్ చేరుకున్నారు.#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath arrives in Hathras, to meet those injured in the stampede incident 121 people lost their lives and 28 people were injured in the incident pic.twitter.com/z7VnybRoZv— ANI (@ANI) July 3, 2024 ఇది చిన్న ప్రమాదం కాదుహత్రాస్ తొక్కిసలాట ఘటనపై యూపీ మంత్రి సందీప్ సింగ్ మీడియాతో మాట్లాడారు.‘ ఇప్పటివరకు ఈ ఘటనలో 121 మంది మృతి చెందారు. గాయపడినవారి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను, బాధితులను పరామర్శించడానికి హత్రాస్ రానున్నారు. ఈ ఘటను కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది చిన్న ప్రమాదం కాదు’అని అన్నారు.#WATCH | Aligarh | On Hathras stampede, UP Minister Sandeep Singh says, "Till now 121 people have died in the incident...The injured are being treated. The CM will visit Hathras to meet the injured persons and their families. Strict action will be taken against those found… pic.twitter.com/1NJUQrh3BH— ANI (@ANI) July 3, 2024 హత్రాస్ ఘటనా స్థలంలో ఎటువంటి ప్రత్యేకమైన ఆధారాలు లభించలేదు. భక్తులకు సంబంధించిన చెప్పులు, ష్యూస్ కలెక్ట్ చేశామని ఫోరెన్సిక్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.#WATCH | Hathras Stampede incident | Hathras: "... I will not be able to tell what we have found. There are no specific things to collect from here, it is only the belongings of the devotees such as shoes and sheets used for sitting..," says a member of the forensic unit who… pic.twitter.com/IVs9uMDAoU— ANI (@ANI) July 3, 2024 హత్రాస్ ఘటనలో సత్సంగ్ నిర్వాకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయిలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని అలహాబాద్ హైకోర్టులో బుధవారం పిల్ దాఖలైంది.PIL filed in Allahabad HC demanding CBI inquiry into Hathras stampede incident Read @ANI Story | https://t.co/McnK6R0USZ#Hathras #UttarPradesh #AllahabadHC #PIL pic.twitter.com/36iXxUrZBA— ANI Digital (@ani_digital) July 3, 2024 హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 121 మంది మృతి చెందగా, 28 మంది గాయపడ్డారని రిలీఫ్ కమిషనల్ ఒక ప్రకటనలో తెలిపారు.Uttar Pradesh | Death toll in Hathras incident rises to 121 and 28 injured, as per the Office of the Relief Commissioner.— ANI (@ANI) July 3, 2024 ఘటన జరిగిన తర్వాత 38 స్వాధీనం చేసుకున్నాం. అందులో 36 మంది మృతదేహాలను గుర్తించామని హాత్రాస్ సిటీ ఏఎస్పీ అమ్రిత్ జైన్ తెలిపారు. లీగర్ ప్రక్రియ పూర్తి చేసి.. వారితో గ్రామాలకు, కుటుంబసభ్యులతో సహా పంపించాం. ఇంకా రెండు మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. వారిని గుర్తించడానికి ఫొటోలు విడుదల చేశాం’అని తెలిపారు.#WATCH | Aligarh, Uttar Pradesh | On Hathras stampede, city ASP Amrit Jain says, "We received 38 bodies from Hathras district where the incident took place yesterday. We have successfully identified 36 of them. After completing the legal formalities - panchayat nama and… pic.twitter.com/5zDVDRNQt5— ANI (@ANI) July 3, 2024 ఆశ్రమ్ (రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్)కు భక్తులు రావడాన్ని ఆపటం లేదని హత్రాస్ డీప్యూటీ ఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు. ఆశ్రమానికి భక్తులు వస్తున్నారు.. వెళ్లుతున్నారు. ఎవరినీ ఆపటం లేదని చెప్పారు.#WATCH | Mainpuri, UP | On Hathras stampede, Deputy SP Sunil Kumar says, "The public are coming and going into the ashram (Ram Kutir Charitable Trust). No one has been stopped..." pic.twitter.com/xgJ8w3oJ0t— ANI (@ANI) July 3, 2024 హత్రాస్ ఘటనా స్థలంలో ఫోరెన్సీక్ టీం, డాగ్ స్వ్కాడ్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు.#WATCH | Uttar Pradesh: Forensic experts along with dog squad collect evidence at the incident site in Hathras, where a stampede took place yesterday, claiming the lives of 116 people pic.twitter.com/a9u9t1bXDi— ANI (@ANI) July 3, 2024 ‘పది మంది బాధిత పేషెంట్ల ఆరోగ్యం నిలకడగా ఉంది. నాలుగురిని ఆగ్రా పంపించాం. ఇప్పటివరకు 34 మంది మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి అయింది’ అని హత్రాస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మన్జిత్ సింగ్ తెలిపారు.#WATCH | Hathras, UP: On Hathras stampede incident, Hathras CMO Manjeet Singh says, "10 patients are admitted here and all of them are stable. 38 bodies came here. Four of them were sent to Agra. Post-mortem of the remaining 34 was completed... Two will be sent now and two of… pic.twitter.com/1zC6OsREH8— ANI (@ANI) July 3, 2024 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 116 మంది భక్తులు మృతి చెందారు. మృతిచెందిన 116 మంది భక్తుల్లో ఇప్పటివరకు 72 మందిని గుర్తించినట్లు పోలీసులులు తెలిపారు. మరోవైపు.. ఘటన స్థలంలో బుధవారం తెల్లవారుజాము నుంచే ఫొరెన్సిక్ బృందాలు, డాగ్ స్వ్కాడ్ చేరుకున్నాయి. ప్రమాద స్థలాన్ని ఫొరెన్సిక్ బృందాలు పరిశీస్తున్నారు. తక్కిసలాట జరిగిన వెంటనే సాకార్ విశ్వ హరి భోలే బాబా పరారైనట్లు తెలుస్తోంది.#WATCH | Uttar Pradesh: Forensic unit along with dog squad at the incident site in Hathras, where a stampede took place yesterday, claiming the lives of 116 people. pic.twitter.com/fOlNtEHdtL— ANI (@ANI) July 3, 2024 దీనిపై హత్రాస్ డిప్యూటీ ఎస్పీ స్పందిస్తూ.. భోలే బాబాను ఇంకా తాము గుర్తించలేదని తెలిపారు. ఈఘటనపై దర్యాప్తు కొనసాగతోందని చెప్పారు. ఫూల్రాయ్ తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది."We did not find Baba ji...": Deputy SP on Hathras stampedeRead @ANI Story | https://t.co/NB3WQrINnm#HathrasStampede #DeputySP pic.twitter.com/YsbDdwRSU7— ANI Digital (@ani_digital) July 2, 2024 సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సత్సంగ్కు 80 వేల మంది హాజరవుతారన్న అంచనాతో నిర్వాహకులు అనుమతి తీసుకున్నారని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. కానీ, అంతకంటే ఎక్కువ మంది హాజరయ్యారని తెలిపారు.#WATCH | Uttar Pradesh: Visuals from the incident spot where a stampede took place yesterday, claiming the lives of 116 people in Hathras. The incident happened during a Satsang conducted by 'Bhole Baba'. pic.twitter.com/7wfXYFRHIO— ANI (@ANI) July 3, 2024 మంగళవారం మధ్యాహ్నం ప్రవచనాలు వినేందుకు వందల మంది భక్తులు వచ్చారు. బాబా సత్సంగ్ ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లే తొందరలో జనమంతా టెంట్ నుంచి ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పడిపోయి.. ఊపిరాడక 116 మంది మృతి చెందారు. మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఈ హత్రాస్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్సభలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధానమంత్రి కార్యాలయం పరిహారం ప్రకటించింది. యూపీ సర్కారు కూడా అంతే మొత్తం పరిహారం ఇస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. -
సత్సంగ్లో మృత్యుకేళి.. 116 మంది భక్తుల దుర్మరణం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో మాటలకు అందని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 116 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. వీరిలో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. సత్సంగ్ ముగిశాక బయటకు వచ్చే క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన ఘోరమైన సంఘటన ఇదే కావడం గమనార్హం.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో ఏకంగా 116 మంది మరణించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి కార్యాలయం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించాయి.హత్రాస్: అప్పటిదాకా భోలే బాబా ప్రవచనాలు, భక్తుల కీర్తనలు, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన సత్సంగ్ నిమిషాల వ్యవధిలోనే శోక సముద్రంగా మారిపోయింది. ప్రవచనాలు వినేందుకు వచి్చన బాబా భక్తులు విగతజీవులయ్యారు. సత్సంగ్ ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లే తొందరలో జనమంతా టెంట్ నుంచి ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక 116 మంది కన్నుమూశారు. మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన ఘోరమైన సంఘటన ఇదే కావడం గమనార్హం. పలువురు క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 89 మంది ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరికొందరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్తోపాటు వివిధ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో భక్తులున్న సాకార్ విశ్వ హరి భోలే బాబా ఫూల్రాయ్ గ్రామంలో సత్సంగ్ నిర్వహించేందుకు స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం భక్తులకు గంటన్నరకు పైగా ఆధ్యాత్మిక బోధ చేశారు. టెంట్ లోపల నిర్వాహకులే ఏర్పాట్లు చేసుకున్నారు. టెంట్ బయట స్థానిక పోలీసులు భద్రత కలి్పంచారు. సత్సంగ్ పూర్తయిన తర్వాత వీరంతా ఒకేసారి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. అయితే కార్యక్రమం పూర్తయ్యాక తన వాహనం వద్దకు తిరిగి వెళ్తున్న బాబా ఆశీస్సులు తీసుకొనేందుకు, ఆయన అడుగులు వేసిన చోట పవిత్రమైన మట్టిని సేకరించేందుకు భక్తులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగిందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ వెల్లడించారు. సత్సంగ్ జరిగిన ప్రాంతం బురదమయంగా ఉండడంతో భక్తులు జారిపడ్డారని, దాంతో తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదని, అందుకే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని భక్తులు ఆరోపించారు. దర్యాప్తు బృందం ఏర్పాటు తొక్కిసలాట సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను, మృతదేహాలను వాహనాల్లో హత్రాస్ మెడికల్ సెంటర్తోపాటు సమీపంలోని ఎటాహ్ జల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విసిరేసినట్లుగా పడి ఉన్న శవాలు, వాటి చుట్టూ కూర్చొని రోదిస్తున్న కుటుంబ సభ్యుల హృదయ విదారక దృశ్యాలు కలచివేశాయి. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నారని, వారికి చికిత్స అందించడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఆసుపత్రిలో ఒకే ఒక్క డాక్టర్ ఉన్నారని, ఆక్సిజన్ సదుపాయం లేదని ఆరోపించారు.ఫూల్రాయ్ తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సత్సంగ్కు 80 వేల మంది హాజరవుతారన్న అంచనాతో నిర్వాహకులు అనుమతి తీసుకున్నారని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. కానీ, అంతకంటే ఎక్కువ మంది హాజరయ్యారని తెలిపారు. భోలే బాబా పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ హత్రాస్ తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్సభలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధానమంత్రి కార్యాలయం పరిహారం ప్రకటించింది. యూపీ సర్కారు కూడా అంతే మొత్తం పరిహారం ఇస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.కాల్వలో ఒకరిపై ఒకరు పడిపోయారుప్రత్యక్ష సాక్షుల కథనం హాత్రాస్: తొక్కిసలాట ఘటన వివరాలను కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ‘‘ సత్సంగ్ అయిపోగానే అందరూ ఒక్కసారిగా ప్రాంగణం నుంచి బయటికి బయల్దేరారు. ప్రాంగణం బయట రోడ్డు ఎత్తులో నిర్మించారు. దాని కింద మురికి కాల్వ ఉంది. దూసుకొచి్చన జనం అందులో పడ్డారు. ఒకరిపై మరొకరు పడుతూనే ఉన్నారు. కింద ఉన్న వాళ్లు కూరుకుపోయి కన్నుమూశారు’’ అని శకుంతల అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ‘‘ సత్సంగ్ను రోడ్డు చివర నిలబడి ఉన్న వాళ్లను ప్రాంగణంలో కిక్కిరిసిన జనం తోసేశారు. దీంతో కొనకు ఉన్న వాళ్లు కాల్వలో పడిపోయారు.అలా అప్పటికప్పుడు ఒక పాతిక మంది ప్రాణాలుకోల్పోయారు’ అని మరో ప్రత్యక్ష సాక్షి ఆ భయానక ఘటనను గుర్తుచేసుకున్నారు. సత్సంగ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు మహేశ్ చంద్ర సైతం కార్యక్రమం నిర్వహణ విధానాన్ని తప్పుబట్టారు. ‘‘ సరైన నిర్వహణ లేకే ఈ దారుణం జరిగింది. బురదలో పడ్డ వాళ్లను జనం పరుగెడుతూ తొక్కుకుంటూ వెళ్లారు. వాళ్లను ఎవరూ అదుపుచేయలేకపోయారు. దీంతో పడిపోయిన వాళ్లు ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆయన అన్నారు. గతంలోనూ...⇒ 2005 జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మంధరాదేవి ఆలయ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. 340 మందికిపైగా భక్తులు విగత జీవులయ్యారు. ⇒ 2008 సెపె్టంబర్ 30న రాజస్తాన్లోని జోద్పూర్ సిటీలో చాముండాదేవి ఆలయ ఉత్సవాలకు జనం భారీగా తరలివచ్చారు. తొక్కిసలాట జరగడంతో 250 మంది వఅగీురణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు.⇒ 2008 ఆగస్టు 3న హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో నైనాదేవి ఆలయంలో మత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. 162 మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ⇒ 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్లోని రతన్గఢ్ ఆలయంలో నవరాత్రి వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. 115 మంది మృతిచెందారు. ⇒ 2011 జనవరి 14న కేరళలోని ఇడుక్కి జిల్లాలో శబరిమల ఆలయం సమీపంలో తొక్కిసలాటలో 104 మంది అయ్యప్ప భక్తులు కన్నుమూశారు. ⇒ 2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో రామ్జానకి ఆలయంలో తొక్కిసలాటలో 63 మంది మృతిచెందారు. ⇒ 2003 అగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కుంభమేళాలో తొక్కిసలాటలో 39 మంది మరణించారు. 140 మంది గాయపడ్డారు. -
ఎవరీ ‘బోలే బాబా’?..హత్రాస్ తొక్కిసలాటకు కారణం అదేనా?
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్లోని సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట జరిగింది.రతిభాన్పూర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిస లాటలో 107 మంది మృతి చెందారు. 150 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని హత్రాస్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగ్రాతులకు సకాలంలో చికిత్సనందించేలా చూడాలని యూపీ సీఎం యోగి ఆధిత్యనాద్ ఆదేశాలు జారీ చేశారు. రేపు ఆధిత్యనాద్ సైతం ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు.కారణం అదేనాకాగా స్థానిక గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి గౌరవార్థం ప్రతి ఏటా ఫుల్రాయ్ గ్రామంలో శివారాదన జరుగుతోంది. అయితే ఈ ఏడాది కూడా శివారాదన జరిగింది. ఇందులో పాల్గొనేందుకు సుమారు 20వేల మంది భక్తలు హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి కారు బయలుదేరే వరకు భక్తులను వెళ్లనీయకుండా నిర్వహకులు అడ్డుకున్నారు. దీంతో నిర్వహకులు భక్తుల్ని అడ్డుకోవడం..వెనుక నుంచి ముందుకు భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్గాంధీంతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన క్షతగాత్రులను, వారి కుటుంబసభ్యులను అన్నీ రకాలుగా ఆదుకోవాలని ఉత్తర్ దేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎవరీ భోలే బాబాభోలే బాబా అలియాస్ అకా నారాయణ్ సాకర్ హరి అలియాస్ నారాయణ్ హరి ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామంలో జన్మించాడు. అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. కాలేజీ పూర్తి చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేయడం ప్రారంభించాడని, ఆ సమయంలో ఆధ్యాత్మికత వైపు మళ్లినట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. -
హత్రాస్లో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 100కి పైగా మృతి
హత్రాస్: ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు చిన్నారులు సహా 100కి పైగా మృతి చెందారు. 150కి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.రతీభాన్పూర్లో మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమం ముగియగానే భక్తులు ఒక్కసారిగా గుంపులుగా వెళ్లారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఇటా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఈ విషాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. వెంటనే ఘటనా స్థలం వద్దకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువస్తున్నారని.. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నామని ఇటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేశ్ త్రిపాఠి తెలిపారు.మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్ర్గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారాన్నియూపీ సర్కార్ ప్రకటించింది.ప్రధాని మోదీ దిగ్భ్రాంతిహత్రాస్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హత్రాప్ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
పోలీసుల వేధింపులు?.. రెండు రోజుల వ్యవధిలో సోదరుల ఆత్మహత్య
లక్నో: పోలీసుల వేధింపులకు రెండు ప్రాణాలు బలయ్యాయి. హత్రాస్ పోలీసుల వేధింపులతో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా తమ్ముడు సంజయ్ అనే ఆత్మహత్య చేసుకున్న రెండు రోజులకు ఆగ్రా సమమీపంలోని ఓ గ్రామంలో చెట్టుకు ఉరేసుకొని సోదరుడు ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.కాగా జూన్ 9న అతని బావమరిది లక్ష్మణ్ గ్రామంలోని ఒక మహిళతో పారిపోవడంతో పోలీసులు సంజయ్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూన్ 13న ప్రమోద్ను విచారించారు. అయితే కస్టడీలో ఉన్న సంజయ్ను కొందరు పోలీసు అధికారులు కొట్టారని, వారు అతని నుంచి రూ. 1 లక్ష డిమాండ్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముందుగా పదివేలు కట్టి, మిగతా 90 వేలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సంజయ్ను విడుదల చేశారని తెలిపారు.అనంతరం జూన్ 22 న సంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసు అధికారులు నిరంతరం వేధింపులకు గురిచేయడం, పోలీస్ స్టేషన్కు పిలపించి బెదిరింపులకు పాల్పడటంతో మనస్తాపం చెందిన సంజయ్ చనిపోయాడని కుటుంబీకులు ఆరోపించారు.సంజయ్ మరించిన తర్వాత ప్రమోద్ను పోలీసులు మళ్లీ విచారణకు పిలించారు. దీంతో అతడు కూడా సోమవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యపై ఫిర్యాదు చేయవద్దని ప్రమోద్ను పోలీసులు హెచ్చరించినట్లు కుటుంబ సభ్యుడు ఆరోపించారు. కాగా జంట ఆత్మహత్యలపై గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భద్రతను పెంచారు.సుసైడ్కు ముందు హత్రాస్లోని సాదాబాద్ పోలీస్ స్టేషన్లో కొంతమంది అధికారులను తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ప్రమోద్ సింగ్ ఓ లేఖ రాశారు. దీని ఆధారంగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఓ అధికారి అగ్నిహోత్రిని సస్పెండ్ చేయగా.. మరో అధికారి కుమార్ను బదిలీ చేశారు. -
మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినప్పుడు బీజేపీ ఎక్కడుంది?
కోల్కతా: ‘సందేశ్ఖాలీ’ తుపాను ధాటికి పశి్చమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని, నారీశక్తి ఈసారి లోక్సభ ఎన్నికల్లో టీఎంసీని గద్దె దింపుతుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీటైన జవాబిచ్చారు. రాష్ట్రంలో మహిళలకు తమ ప్రభుత్వం అండగా నిలబడిందని పునరుద్ఘాటించారు. దేశంలోనే మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం తమదేనని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందే గురువారం కోల్కతాలో ‘మహిళా హక్కులే మాకు ముఖ్యం’ పేరిట చేపట్టిన పాదయాత్రలో మమత ముందు నడిచారు. ఆమెను వందలాది మంది మహిళలు, పార్టీ కార్యకర్తలు అనుసరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన అకృత్యాలపై మమత విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ సందేశ్ఖాలీపై బీజేపీ దేశానికి తప్పుడు సందేశాలు పంపుతోంది. బెంగాల్లో మహిళలకు రక్షణ లేదంటూ నిన్న ఇక్కడికొచ్చి లెక్చర్లు దంచేసిన మోదీ బీజేపీపాలిత రాష్ట్రాల్లో మహిళలు అకృత్యాలకు బలైనప్పుడు ఎందుకు మౌనం వహించారు?’’ అని నిలదీశారు. ‘‘మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించినపుడు ఈ బీజేపీ ఏం చేసింది?. ఉత్తరప్రదేశ్ హథ్రాస్లో అత్యాచారం చేసి మృతదేహాన్ని బలవంతంగా తగలబెడితే బీజేపీ సర్కార్ ఏం చేసింది?. గుజరాత్లో సర్వం కోల్పోయిన బిల్కిస్ బానోకు దక్కిన న్యాయమెంత?’’ అని ప్రశ్నించారు. ‘నిజానికి దేశంలో మహిళలకు అత్యంత భద్రమైన రాష్ట్రం బెంగాల్’ అని ప్రకటించారు. ఎక్కడ పోటీచేసినా ఓడిస్తాం గురువారం బీజేపీలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్నూ మమత విమర్శించారు. ‘‘ తన తీర్పుల ద్వారా బెంగాల్లో వేలాది మంది యువత నుంచి ఉద్యోగాలు లాక్కున్నారు. వారు మిమ్మల్ని క్షమించరు. మీ తీర్పుల విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసినా సరే మిమ్మల్ని ఓడించి తీరతాం’ అని అన్నారు. ‘‘ పింటూ బాబు(బీజేపీ) ఆగ్రహంతో ఊగిపోయినా సరే బెంగాల్లో మీ విభజన రాజకీయాలు నడవనివ్వను. బెంగాల్కు 450కిపైగా బృందాలను పంపిన పింటూ బాబు.. మహిళలను లైంగికంగా వేధించి నగ్నంగా ఊరేగించిన మణిపూర్కు ఒక్క బృందాన్ని కూడా పంపలేదు’ అని మమత గుర్తుచేశారు. ‘బీజేపీపాలిత యూపీలో మహిళలపై దారుణ అత్యాచారాలు జరుగుతున్నాయి. మణిపూర్లో మహిళలు రేప్కు గురై, అగి్నకి ఆహుతైన ఉదంతంలో అక్కడి బీజేపీ సర్కార్ సిగ్గుతో తలదించుకోవాలి’ అని మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ సందేశ్ఖాలీ ఘటనను తీవ్రంగా ఖండించాల్సిందే. టీఎంసీ కార్యకర్తలు బాధ్యుతులుగా తేలితే అరెస్ట్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడను’ అని ఆమె స్పష్టంచేశారు. పాదయాత్రలో సందేశ్ఖాలీ ప్రాంతానికి చెందిన 200కుపైగా మహిళలు పాల్గొన్నారు. -
పెళ్లిలో తుపాకీ పేల్చిన వధువు.. నాలుగు రౌండ్ల కాల్పులు.. వీడియో వైరల్
లక్నో: ఓ వధువు తన పెళ్లి వేడుకలో తుపాకీతో హల్చల్ చేసింది. వరుడి పక్కనే కూర్చొని గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఉత్తర్ప్రదేశ్ హథ్రాస్లోని సాలెంపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్టేడీపై ఉన్న వధవు దగ్గరకు వెళ్లి తుపాకీ ఇచ్చాడు. దీంతో ఆమె దాన్ని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపింది. అనంతరం తుపాకీ తిరిగి ఇచ్చేసింది. ఈ సమయంలో వరుడు కూడా ఆమె పక్కనే ఉన్నాడు. కదలకుండా కూర్చున్నాడు తప్ప వద్దని గానీ, ఆపమని గానీ చెప్పలేదు. The video went #viral while firing pistol bride The bride fired joy at a guest house in Salempur of Thana #Hathras Junction area Bride's video of Harsh firing went viral on #socialmedia The bride is a resident of village Nagla Sekha of Hasayan police stn area.#UttarPradesh pic.twitter.com/neXrJexBik — Siraj Noorani (@sirajnoorani) April 8, 2023 అయితే వధువు తుపాకీ పేల్చిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించారు. కాల్పులకు సంబంధించి విచారణ చేపట్టారు. చదవండి: గ్యాంగ్స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయ్.. మాఫియా వణికిపోతోంది: సీఎం యోగి -
హత్రాస్ సామూహిక అత్యాచారం కేసు.. యూపీ కోర్టు కీలక తీర్పు
లక్నో: ఉత్తర్ప్రదేశ్ హత్రాస్లో 2020లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి యూపీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురు.. రవి, రాము, లవ్కుష్ను నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్ను దోషిగా తేల్చినప్పటికీ అతనిపై అత్యాచారం, హత్య అభియోగాలు లేకుండా బాధితురాలిని తీవ్రంగా గాయపరిచినట్లు మాత్రమే న్యాయస్థానం పేర్కొంది. హత్రాస్ సామూహిక అత్యాచార ఘటన 2020లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పొలంలో తల్లి, సోదురుడితో ఉన్న దళిత యువతిని అదేగ్రామంలో ఉన్నతకులానికి చెందిన వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వాంగ్మూలంలో పేర్కొంది. ఆ ఘటనలో యువతిని తీవ్రంగా హింసించారు నిందితులు. దీంతో ఆమెకు చాలా చోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి. అనంతరం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి యువతి మరణించింది. అయితే పోలీసులు కుటుంబసభ్యులను ఇంట్లోనే బంధించి రాత్రికిరాత్రే ఆమె అంత్యక్రియలు నిర్వహించడంతో సీఎం యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో పోలీసులు కూడా నిందితులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. బాధితురాలు వాంగ్మూలం ఇచ్చేవరకు వారు నిందితులపై అత్యాచార అభియోగాలు మోపలేదు. చదవండి: హోం మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకోని వ్యక్తి మృతి ..కానీ కాన్వాయ్.. -
కటకటాల నుంచి స్వేచ్ఛ
రెండేళ్లకుపైగా ఉత్తరప్రదేశ్ జైల్లో మగ్గిన కేరళ పాత్రికేయుడు సిద్దిఖీ కప్పన్ బెయిల్ మంజూరై ఎట్టకేలకు స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2020 అక్టోబర్లో దుండగుల అమానుషత్వానికి బలైపోయిన పందొమ్మిదేళ్ల దళిత యువతి భౌతికకాయాన్ని పోలీసులు ఆమె తల్లిదండ్రుల అభీష్టానికి విరుద్ధంగా తరలించుకుపోయి, తామే అంత్యక్రియలు పూర్తిచేసేందుకు ప్రయత్ని స్తున్నారన్న సంగతి తెలిసి వెళ్తున్న కప్పన్ను యూపీ పోలీసులు మార్గమధ్యంలో అరెస్టు చేశారు. పాత్రికేయ వృత్తిలో ఉండేవారికి ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. ఉద్యమకారులకూ, పోలీసు లకూ మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడైనా...అవినీతి, మాఫియా సామ్రాజ్యాల గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడైనా వారికి సమస్యలు ఎదురవుతుంటాయి. సిద్దిఖీ కప్పన్ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు అంత్యక్రియల ప్రాంతానికి వెళ్లకుండా ఆయన్ను అడ్డుకోవడానికేనని అందరూ అనుకున్నారు. కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. ఒక సాధారణ పాత్రికేయుడని అందరూ అనుకుంటున్న కప్పన్ను పోలీసులు ఉగ్రవాద సమర్థకుడిగా చిత్రిస్తూ వరస కేసులు పెట్టారు. అప్పటికింకా నిషేధానికి గురికాని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కు సలహాదారుగా చిత్రించి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)కింద కేసు పెట్టారు. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) స్వీకరించింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా రంగంలోకొచ్చి నేరారోపణలు చేసింది. ఆయనతోపాటు మరో అయిదుగురు కూడా ఈ కేసులన్నిటా సహ నిందితులుగా ఉన్నారు. ఈ ఆరోపణలు ఏమేరకు నిలబడతాయో, కప్పన్, ఆయన సహచరులు నిర్దోషులుగా బయటికొస్తారో లేదో మున్ముందు తేలుతుంది. అయితే నిరుడు సెప్టెంబర్లో కప్పన్కు బెయిల్ మంజూరు చేస్తూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్ లేవనెత్తిన ప్రశ్న కీలకమైనది. ‘ప్రతి పౌరుడికీ తన అభిప్రాయాలు వ్యక్తంచేసే స్వేచ్ఛ ఉంది. హథ్రాస్ బాధితురాలికి న్యాయం జరగాలని ఆయన కోరుకుంటే అది చట్టం దృష్టిలో నేరమెలా అవుతుంది?’ అని ఆయన నిలదీశారు. అదుపులోనికి తీసుకున్న సమయంలో కప్పన్ వాహనం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్న కొన్ని కాగితాలు జస్టిస్ లలిత్కు అభ్యంతరకరమైనవిగా కనబడలేదు. అప్పటికే దీర్ఘకాలం జైల్లో ఉన్నందువల్ల, అరెస్టు చేసినప్పుడున్న పరిస్థితులను, ఈ కేసులోని ప్రత్యేకతలనూ పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించడానికి మరో నాలుగు నెలలు పట్టింది. ఈడీ పెట్టిన మనీ లాండరింగ్ కేసు చిత్రమైనది. తన బ్యాంకు ఖాతా నుంచి సహ నిందితుడి ఖాతాకు కప్పన్ రూ. 5,000 బదిలీ చేయటం దీని సారాంశం. యూఏపీఏ కేసులో బెయిల్ లభించినవారు సమర్పించే పూచీకత్తులు సరిచూడటానికి 90 రోజులు తీసుకోవచ్చు గనుక కప్పన్ బయటికొచ్చేందుకు ఇంత సమయం పట్టింది. కప్పన్ ఒక్కరే కాదు... దేశంలో ఇదే మాదిరి యూఏపీఏ కేసుల్లో ఇరుక్కొని జైలుపాలైనవారు మరో అయిదుగురున్నారని నిరుడు డిసెంబర్లో పాత్రికేయుల పరిరక్షణ సంఘం(సీపీజే) తెలిపింది. మణిపూర్ పాత్రికేయుడు కిషోర్చంద్ర వాంఖెమ్ను 2019లో జాతీయ భద్రతా చట్టం(నాసా) కింద అరెస్టు చేశారు. నిజానికి కప్పన్ యూపీ నివాసి కాదు. ఆయన ఢిల్లీ కేంద్రంగా ఒక మలయాళ మీడియా సంస్థకు పనిచేస్తున్నారు. అందువల్ల కప్పన్పై యూపీ పోలీసులకైనా, అక్కడి రాజకీయ నాయకత్వానికైనా వ్యక్తిగత కక్ష ఉండే అవకాశం లేదు. మరైతే ఏ ప్రయోజనాన్ని ఆశించి, ఎవరు కప్పన్పై కేసులు పెట్టడానికి పూనుకున్నట్టు? హథ్రాస్ అమానుషం చుట్టూ అలుముకున్న పరిస్థితులనూ, ఈ ఉదంతంవల్ల ప్రభుత్వానికి కలగబోయే అప్రదిష్టనూ పరిగణనలోకి తీసుకుని మీడియా కథనాలను నియంత్రించాలన్న లక్ష్యంతో, పాత్రికేయులను భయభ్రాంతుల్ని చేసే ఉద్దేశంతో యూపీ సర్కారు ఈ చర్యకు దిగిందని పాత్రికేయ సంఘాలు అప్పట్లో ఆరోపించాయి. ఈమాదిరి కేసులు విచారణకు రావాలంటే కింది స్థాయి కోర్టుల్లోనే ఏళ్ల తరబడి సమయం పడుతుంది. ఈలోగా బెయిల్ కోసం ఉన్నత స్థాయి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సివస్తుంది. అక్కడ వెంటనే ఉపశమనం లభించటం సులభం కాదు. అప్పటికే పెండింగ్లో ఉన్న లక్షల కేసుల్లో ఇదొకటవుతుంది గనుక సహజంగానే జాప్యం చోటుచేసుకుంటుంది. సుదీర్ఘంగా సాగే ఈ ప్రక్రియంతా నిందితులకూ, వారి కుటుంబాలకూ ఒక శిక్షలాంటిదే. ప్రస్తుత కేసుల్లో కప్పన్కు బెయిల్ రావటానికే 28 నెలలు పట్టింది. ఇక కేసు విచారణ పూర్తయి, తీర్పు వెలువడటానికి మరెన్నేళ్లు పడుతుందో? తీర్పు ప్రతికూలంగా వెలువడితే మళ్లీ జైలుకూ, ఆ తర్వాత అప్పీల్కూ పోవాలి. ఆ తర్వాత మళ్లీ బెయిల్, విచారణకు హాజరుకావడం షరా మామూలు. అడపా దడపా జరిగే ఉగ్రవాద ఘటనలను సాకుగా చూపి ప్రభుత్వాలు ఈ కఠినమైన చట్టాలు తీసుకొచ్చాయి. ఉన్న చట్టాలకు సవరణలద్వారా పదునుపెట్టాయి. చట్టసభల్లో చర్చ జరిగినప్పుడల్లా తమ చర్యలను గట్టిగా సమర్థించుకున్నాయి. దుర్వినియోగానికి ఆస్కారం లేనివిధంగా పకడ్బందీ నిబంధనలు చేర్చామని స్వోత్కర్షకు పోయాయి. సాధారణ పౌరులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేనేలేదని చెప్పాయి. ఆచరణలో మాత్రం జనం తరఫున ప్రశ్నిస్తున్న ఉద్యమకారులు, నిజాలను ధైర్యంగా వెలికితీసేందుకు ప్రయత్నించే పాత్రికేయులు ఈ చట్టాలకు బలైపోతున్నారు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కనుక దీన్ని అరికట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం తగిన ఆదేశాలివ్వాలి. -
టీచర్ అయ్యి ఉండి ఇదేం పని... పిల్లల ముందే అలా..: వీడియో వైరల్
ఉపాధ్యాయుడి వృత్తిలో ఉండి కూడా ఒక ప్రబుద్ధుడు దారుణమైన ఘోరానికి ఒడిగట్టాడు. విద్యార్థులుండే స్కూల్కి తాగుతు రావడమే కాకుండా చిన్నారుల ముందే ఒక ఖాళీ బీర్బాటిల్ని కింద పెట్టాడు. అదీకూడా విద్యార్థులకు మంచి చెడు చెప్పాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలా తాగుతూ స్కూల్కి రావడం అందర్నీ ఒకింత విస్తుపోయేలా చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఈ ఉపాధ్యాయుడు తాగా వచ్చిందే గాక వారి ముందే ఒక ఖాళీ బీర్ల బాటిల్ని కింద పెట్టాడు. ఎవరో ఒక పక్క నుంచి వీడియో తీస్తుంటే మరో బీర్ బాటిల్ని దాచుకునేందుకు యత్నించి విఫలమయ్యాడు కూడా. ఈ ఘటన స్పందించిన ఉత్తరప్రదేశ్ జిల్లా అధికారులు సదరు ఉపాధ్యాయుడిన సస్పెండ్ చేశారు. కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులోనే స్కూల్కి వస్తున్న టీచర్ని గమనించి ఈ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన డిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలి ట్విట్టర్లో...విద్యార్థుల ముందే తాగి వచ్చిన సదరు టీచర్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తరప్రదేశ్ పోలీసులను కోరారు. नशे की हालत में धुत मास्टर जी बच्चे बच्चियों को पढ़ा रहे हैं। वीडियो हाथरस यूपी की बताई जा रही है। यदि बच्चों के भविष्य के सृजनहार टीचर ऐसी हरकत करें तो क्या बच्चों का भविष्य अच्छा हो सकता है? तुरंत इस टीचर पे कार्यवाही करे @Uppolice pic.twitter.com/zbCoJb5D8e — Swati Maliwal (@SwatiJaiHind) October 2, 2022 (చదవండి: టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం) -
జర్నలిస్టు సిద్దిఖికి బెయిల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ జైల్లో రెండేళ్లుగా మగ్గిపోతున్న కేరళ జర్నలిస్టు సిద్దిఖి కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతీవ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందన్న అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ హథ్రాస్లో 2020 సెప్టెంబర్లో 19 ఏళ్ల దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురై మరణించిన దుర్ఘటనని కవర్ చేయడానికి వెళుతున్న సిద్దిఖిని యూపీ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆయన నిధులు అందిస్తారన్న ఆరోపణలపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం (యూఏపీఏ) కింద అదుపులోనికి తీసుకున్నారు. మూడు రోజుల్లోగా కప్పన్ను ట్రయల్ కోర్టులో హాజరు పరిచి ఆ తర్వాత బెయిల్పై విడుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరువారాలు కప్పన్ ఢిల్లీలోనే ఉండాలని, ప్రతీ సోమవారం పోలీసు స్టేషన్ కావాలని షరతులు విధించింది. ఆ తర్వాత కేరళలో తన సొంత గ్రామానికి వెళ్లవచ్చునని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. 2020 సెప్టెంబర్ 14న హథ్రాస్లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన పోలీసులు అర్థరాత్రి హడావుడిగా అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో అనుమానాలు రేకెత్తి నిరసనలు భగ్గుమన్నాయి. సంచలనం సృష్టించిన ఈ ఉదంతాన్ని కవర్ చేయడానికి యూపీ వెళుతుండగా మార్గమధ్యలోనే కప్పన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే పాపులర్ ఫ్రంట్ ఇండియాతో సంబంధాలున్నాయని వాదిస్తూ వచ్చారు. -
ఒక చట్టం... వేల వివాదాలు
124ఏ. బ్రిటిష్ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...? సెక్షన్ 124 ఏలో ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. ఎందుకు తెచ్చారు ? స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి. దిశ రవి నుంచి వరవరరావు వరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్ కిట్ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్ పటేల్, భీమా–కొరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు. ► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి ► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ► 2010–20 మధ్య బిహార్లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సొంతపిచ్పై...అఖిలేశ్కు అగ్నిపరీక్ష!
ఉత్తరప్రదేశ్ మొదటిదశ ఎన్నికల్లో జాట్లు కీలకంగా మారగా.. రెండోదశలో (ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది) ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 20న మూడోదశ పోలింగ్ యాదవుల బెల్ట్లో జరుగుతోంది. మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో యాదవ సామాజికవర్గ బలమెక్కువ. సమాజ్వాది (ఎస్పీ)కి దీన్ని కంచుకోటగా అభివర్ణిస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి తలబొప్పి కట్టింది. అఖిలేశ్పై తిరుగుబాటు చేసి సొంతకుంపటి పెట్టుకున్న బాబాయి శివపాల్ సింగ్ యాదవ్తో ఇటీవలే సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకున్నప్పటికీ ఎస్పీ అధినేతకు మూడోదశ విషమపరీక్షగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కర్హల్ నుంచే అఖిలేశ్ స్వయంగా బరిలో నిలిచారు. బాబాయ్తో సయోధ్యతో పూర్వవైభవంపై ఆశలు పశ్చిమ యూపీలోని..ఐదు జిల్లాలు, అవధ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలు, బుందేల్ఖండ్ ప్రాంతంలోని ఐదు సీట్లకు ఫిబ్రవరి 20న మూడోదశ పోలింగ్ జరగనుంది. ఫిరోజాబాద్,, కాస్గంజ్, ఎతాహ్, మెయిన్పురి,, ఫరూకాబాద్,, కన్నౌజ్, ఔరాయా జిల్లాలు 2017లో అఖిలేశ్ పార్టీకి ఓటువేయలేదు.ఫలితంగా ఐదేళ్ల కిందట మొత్తం 59 సీట్లలో బీజేపీ ఏకంగా 49 తమ ఖాతాలో వేసేసుకుంది. సమాజ్వాది పార్టీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్పీ అధినేత కుటుంబకలహాలు పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉన్నప్పటికీ అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2012లో ఈ 59 సీట్లలో (20న పోలింగ్ జరిగే స్థానాలు) ఎస్పీ 37 చోట్ల నెగ్గడం గమనార్హం.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ బెల్ట్లో ఎస్పీ విజయావకావలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అఖిలేశ్ తన శివపాల్ యాదవ్ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. గతంలో హథ్రాస్ గ్యాంగ్రేప్ ఘటన కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్న ఎస్పీ అధినేత ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రతినెలా ‘హథ్రాస్ కి బేటి స్మృతి దివస్’ను నిర్వహిస్తున్నారు. బుందేల్ఖండ్ బాగా వెనుకబడిన ప్రాంతం కావడతో నిరుద్యోగ సమస్య, నీటి ఎద్దటి తదిదర సమస్యలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. ఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్, నెలకు కిలో నెయ్యిని అందిస్తామని అఖిలేశ్ ఓటర్లుకు హామీ ఇచ్చారు. ఒకప్పుడు బుందేల్ఖండ్ బీఎస్పీకి కంచుకోటగా ఉండేది. కానీ 2017లో వీచిన బీజేపీ గాలితో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది. హైటెన్షన్ పోరు కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్కు పోటీగా ఓబీసీ నాయకుడు, కేంద్ర మంత్రి సత్యపాల్సింగ్ బఘేల్ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ స్థానంలో మొత్తం ఓటర్లలో 38 శాతం మంది యాదవులే. తర్వాతి స్థానంలో క్షత్రియులు ఉంటారు. భోగావ్ నియోజకవర్గంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రామ్నరేశ్ అగ్నిహోత్రికే బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. కాన్పూర్ నగర్ జిల్లాలోని మహారాజ్పూర్ నుంచి సతీష్ మహానాను బీజేపీ మరోసారి రంగంలోకి దిగింది. తొలిదశ ఎన్నికలు పశ్చిమ యూపీలో జరిగినందువల్ల తమకు అనుకూలత ఉందని భావిస్తున్న అఖిలేశ్ యాదవ్ మూడోదశలో ఎలాగైనా పైచేయి సాధించాలనే పట్టుదలతో పని చేస్తోంది.దీంట్లో పైచేయి సాధిస్తే మిగతా నాలుగు దశల్లో కొంత ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని ఎస్పీ భావిస్తోంది. యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కుల, సంకుచిత, నియంతృత్వ పాలనకు ముగింపు పల కండి. సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూసే బహుజన సమాజ్ పార్టీకే పట్టంకట్టండి. దోపిడీదారుల అరాచకాలతో గతంలో యూపీ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. మా పాలనలో వీరందరినీ ఏరిపారేశాం. ఎస్పీ పాలనలో రాష్ట్రంలో కేవలం ఒక వర్గం వారే అభివృద్ధి ఫలాలను అందుకున్నారు. మా ప్రభుత్వం వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించింది. మిగతా పార్టీల్లా మేం నెరవేర్చని వాగ్దానాలు చేయబోం. అందుకే ఈసారి ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదలచేయలేదు. – బీఎస్పీ చీఫ్ మాయావతి అఖిలేశ్ గెలుపు ఖాయమని మొదట్లో అతి విశ్వాసంతో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో స్వయంగా ప్రచారం చేయా ల్సిన పనే లేదని, నేరుగా ఫలితాలు వెలువడే రోజు(మార్చి పదో తేదీ)న కర్హాల్ వస్తానని అఖిలేశ్ ధీమా వ్యక్తంచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వయంగా ములాయం సింగ్తో ముందే ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈసారి ఎన్నికల్లో 300 సీట్లు సాధించి బీజేపీ ఘన విజయం సాధించాలని ఓటర్లు ఆకాంక్షిస్తే.. ఈ గెలుపు పరంపర కర్హాల్ నుంచే మొదలవ్వాలి. – హోం మంత్రి అమిత్ షా – నేషనల్ డెస్క్, సాక్షి -
అతడిని ఢిల్లీ పంపి వైద్యం అందించండి: సుప్రీం
న్యూఢిల్లీ: జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్ను ఢిల్లీకి తరలించి వైద్యం అందించాల్సిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అదేశించింది. గతేడాది జరిగిన హథ్రాస్ రేప్ బాధితురాలి వద్దకు వెళుతున్నాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కప్పన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను మంచానికి కట్టేసి వైద్యం అందిస్తున్నారని సిద్ధిఖీ భార్య, కేరళ జర్నలిస్ట్ అసోషియేషన్లు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మనిషికి ఉన్న స్వేచ్ఛా హక్కు కారణంగా వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఆరోగ్యం మెరుగయ్యాక తిరిగి మథురలోని జైలుకు తరలించాలని చెప్పింది. వారి హక్కులకు భంగం కలిగించవద్దు సాక్షి, న్యూఢిల్లీ: చట్ట ప్రకారం బెయిలు పొందిన వారు విడుదల కావడానికి ఉండే హక్కులకు భంగం కలిగించవద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బీసీఐ సంయుక్త కార్యదర్శి అశోక్ పాండే లేఖలు రాశారు. బెయిల్ పొందిన వారికి సంబంధించి బెయిలు బాండ్లు, పూచీకత్తులు సమర్పించడానికి న్యాయవాదులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. అలా చేయకపోతే బెయిల్ పొందిన వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందని ఆ లేఖలో పాండే స్పష్టం చేశారు. చదవండి: కోవిడ్ రిలీఫ్: ప్రాణాల్ని కాపాడుతున్న భిల్వారా మోడల్ -
మహిళలపై హింసను సహించం
నందిగ్రామ్: బీజేపీ కార్యకర్త అని చెబుతున్న వ్యక్తి తల్లి మృతి ఘటన పశ్చిమ బెంగాల్లో సంచలనాత్మకంగా మారింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మహిళలపై హింసను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోనని పేర్కొన్నారు. వృద్ధురాలి మరణానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఆమె సోమవారం నందిగ్రామ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగాల్ గురించి మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న అరాచకాల విషయంలో ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. హథ్రాస్ ఘటనపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బెంగాల్లో తన తల్లులు, సోదరీమణులపై హింసను సహించే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఇటీవలే ముగ్గురు చనిపోయారని అన్నారు. బెంగాల్లో ప్రస్తుతం శాంతిభద్రతలు ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని వెల్లడించారు. నందిగ్రామ్లో దీదీ భారీ రోడ్ షో అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానం నుంచి మంచి మెజార్టీలో విజయం సాధించాలని మమత సంకల్పించారు. ఇక్కడ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు సోమవారం భారీ రోడ్ షో నిర్వహించారు. రేయపారా ఖుదీరామ్ మోరే నుంచి ఠాకూర్చౌక్ వరకూ 8 కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీలో దీదీ ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. నందిగ్రామ్లో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటిదాకా తాను ఇక్కడే ఉంటానని మమతా బెనర్జీ ప్రకటించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, ఆ పార్టీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. -
అక్కడ ప్రజా రక్షణ లేదు కానీ ఇక్కడకొచ్చి మాట్లాడతారా?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలవ్వడంతో అధికార తృణముల్ కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం బెంగాల్లోని మల్దాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీపై ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్లో గోవధ, లవ్ జిహాద్లను దీదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. బెంగాల్లో దుర్గా పూజను నిషేధించారని, ఈద్ సందర్భంగా గోవుల వధ జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో జైశ్రీరామ్ నినాదాన్ని అనుమతించడం లేదన్న సీఎం యోగి.. ప్రజల మనోభావాలతో మమతా ప్రభుత్వం ఆడుకుంటుందని దుయ్యబట్టారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యానాథ్ పర్యటనపై తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీ నుస్రత్ జహాన్ ఘాటుగా స్పందించారు. తమ సొంత రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టలేని వ్యక్తి పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విటర్లో ‘బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర ఘటనను మాటల్లో వర్ణించలేకపోతున్నాను. హత్రాస్ ఘటనలోని బాధిత కుటుంబ సభ్యులకు ఆ ప్రభుత్వం రక్షణ ఇవ్వలేకపోయింది. ఆ కుటుంబ ప్రాధాన్యత కంటే బీజేపీకి బెంగాల్ ఎన్నికలు ముఖ్యమా.’ అంటూ కౌంటర్ ఇచ్చారు. చదవండి: దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్ SHOCKING! Cannot find the words to describe the horror that @BJP4India ruled Uttar Pradesh has turned into! WHY couldn't @myogiadityanath prioritize the safety & security of this family? Is Bengal elections more important to BJP?#BJPHataoBetiBachaohttps://t.co/WPvi5GHzP4 — Nusrat Jahan Ruhi (@nusratchirps) March 2, 2021 కాగా ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచార ఘటనలో బాధితురాలి తండ్రిని నిందితుడు, అతని స్నేహితుడు కాల్చి చంపిన విషయం తెలిసిందే. రెండేళ్ల కిందట యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు గౌరవ్ శర్మని పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో జైలుకెళ్లిన నిందితుడు ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. బెయిల్పై విడుదలైన నిందితుడు తనపై ఫిర్యాదు చేసారన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే తండ్రి కోసం విలపించిన బాధితురాలు తనకు న్యాయం జరగాలని, తనపట్ల కిరాతకంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠిన శిక్ష పడాలని కోరింది. -
హాథ్రస్ కేసులో చార్జ్షీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన హాథ్రస్ కేసులో సీబీఐ చార్జ్షీటు దాఖలు చేసింది. యూపీలోని హాథ్రస్ జిల్లాలో జరిగిన దళిత యువతిపై అత్యాచారం, హత్యకు సంబంధించి నలుగురిపై సీబీఐ నేరారోపణ చేస్తూ శుక్రవారం కోర్టులో చార్జ్షీటు ఫైల్ చేసింది. రెండు నెలల దర్యాప్తు అనంతరం నిందితులు సందీప్, రవి, లవ్కుశ్, రాము సెప్టెంబర్14న దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు సీబీఐ పేర్కొంది. చార్జ్షీటులో వీరిపై అత్యాచారం, హత్య, సామూహిక అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద నేరారోపణ చేసింది. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే గరిష్ఠంగా మరణ శిక్ష విధిస్తారు. చనిపోయిన యువతి వాంగ్మూలం, సాక్ష్యాలు, ఇతర సాక్షుల స్టేట్మెంట్ల ఆధారంగా విచారణ పూర్తి చేసినట్లు సీబీఐ తెలిపింది. సీబీఐ చార్జ్షీటుతో అసలు నేరమే జరగలేదన్న యూపీ పోలీసుల వాదన తేలిపోయినట్లయింది. అత్యాచారమే జరగలేదన్న పోలీసుల వాదనపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు యువతి అంత్యక్రియలపై అలహాబాద్ హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసులకు అక్షింతలు వేసింది. -
సామూహిక లైంగిక దాడి జరిగింది: సీబీఐ
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హథ్రాస్ దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెను చిత్రహింసలకు గురిచేసి మృతికి కారణమైన వారిపై, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, సామూహిక అత్యాచారం కింద అభియోగాలు నమోదు చేసింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆమె నాలుక కోసి, వెన్నుముక విరిచి అత్యంత పాశవికంగా దాడి చేశారు. (చదవండి: కాలేజీ క్లర్కుతో ఎఫైర్: 21 ఏళ్లుగా..) దీంతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కాగా తల్లితో కలిసి గడ్డి కోస్తున్న సమయంలో మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్లి బాధితురాలిని చిత్ర హింసలకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక బాధితురాలి అత్యంత దయనీయ పరిస్థితిలో మరణించడం, మృతదేహానికి పోలీసులే అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడం వంటి పరిణామాలు పలు అనుమానాలకు తావిచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సెప్టెంబరు 30న యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఈ కేసు విచారణకై తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆ తర్వాత సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణను అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. -
3 నెలల క్రితం అత్యాచారం.. నేడు పెట్రోల్ పోసి!
లక్నో: వరుస అత్యాచార ఘటనలకు ఉత్తరప్రదేశ్ కేంద్ర బిందువుగా మారింది. మూడు నెలల క్రితం జరిగిన అత్యాచార బాదితురాలిపై నిప్పంటించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. వివరాలు.. బులంద్షహర్లో 15 ఏళ్ల మైనర్పై ఆగష్టు 15న ముగ్గురు దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరు జైలుల్లో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే కేసును ఉపసంహరించుకోవాలని నిందితుల మామ, స్నేహితులు బాధితురాలిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కాలిన గాయాలతో బాలిక బులంద్షహర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. చదవండి: పదేళ్లుగా 50 మంది బాలికలపై అత్యాచారం.. అత్యాచారానికి పాల్పడిన నిందితుల కుటుంబం నుంచి బెదిరింపులు తలెత్తడంతో తనకు తానుగా నిప్పంటించుకున్నానని వీడియో రూపంలో తెలియజేసింది. కాగా తన కూతురిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు అత్యాచార ఘటనలో అలసత్వం ప్రదర్శించినందుకు ఇద్దరు పోలీసులను ఎస్పీ సంతోష్ కుమార్ విధుల నుంచి తొలగించారు. వారి స్థానంలో సీనియర్ పోలీస్ అధికారులను నియమించారు. చదవండి: విచక్షణ కోల్పోయి: భార్య, కుమారుడిపై... -
యూపీ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
లక్నో: హత్రాస్ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వైఖరిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కూమార్ పై యూపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఈ ఉన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ కేసుపై సోమవారం అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. హత్రాస్ దారుణోతందంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ రాజన్ రాయ్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. తదుపరి విచారణలోపు (నవంబర్ 25) జిల్లా మేజిస్ట్రేట్పై చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. కాగా, హత్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా రాత్రికి రాత్రి దహనం చేయడంతో జిల్లా మేజిస్ట్రేట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్పై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారని కోర్టు ప్రశ్నించగా... ఆయన చర్యను ప్రభుత్వం సమర్థించింది. ఆయన ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీని ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు ప్రభుత్వం తరుపున న్యాయవాది చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం, మేజిస్ట్రేట్ ప్రవీణ్ కూమార్, సస్పెండ్ అయిన ఎస్పీ విక్రాంత్ వీర్ కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తమకు తెలపాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న కన్నుమూసింది. దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుంది. -
హథ్రాస్ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ దర్యాప్తును అలహాబాద్ కోర్టు పర్యవేక్షించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఉత్తర ప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోని కోర్టుకు మార్చాలని బాధితురాలి కుటుంబం తరఫున హాజరైన న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న హథ్రాస్లో నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న కన్నుమూసింది. బాధితురాలి దహన సంస్కారాలు అర్థరాత్రి నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశం విచారణ సందర్భంగా సామాజిక కార్యకర్త, న్యాయవాది ఇందిరా జైసింగ్ ఉత్తరప్రదేశ్లో న్యాయమైన విచారణ జరగదనే భయాన్ని వ్యక్తం చేశారు. అలానే పలువురు కార్యకర్తలు, న్యాయవాదులు ఉత్తరప్రదేశ్లో న్యాయమైన విచారణ జరగదంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 15న వెల్లడించాల్సిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు కల్పించిన భద్రత, రక్షణకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు సమర్పించారు. (చదవండి: హథ్రాస్ కేసు.. డీఐజీ భార్య ఆత్మహత్య) ఇప్పటికే కేసును సీబీఐకి బదిలీ చేసి, సుప్రీం కోర్టు పర్యవేక్షణకు సమ్మతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, సాక్షి రక్షణపై, బాధితుడి కుటుంబం న్యాయవాదిని ఎన్నుకున్నదా అనే దాని గురించి ఉన్నత న్యాయస్థానం కోరిన వివరాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. బాధితురాలి కుటుంబం న్యాయవాదిని నియమించుకున్నప్పటికి.. ప్రభుత్వం నియమించిన న్యాయవాదిని తమ తరఫున కేసును వాదించాలని కోరారు -
హథ్రాస్ కేసు.. డీఐజీ భార్య ఆత్మహత్య
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. హథ్రాస్ కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్ డీజీపీ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసు దర్యాప్తుకు గాను యూపీ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ చంద్ర ప్రకాష్ సిట్ సభ్యుల్లో ఒకరు. ఆయన భార్య పుష్ప ప్రకాష్(36) శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లక్నోలోని వారి నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను లోహియా ఆస్పత్రికి తరలించారు. పుష్ప ప్రకాష్ని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించిందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: హథ్రాస్ ఆగ్రహం.. 50 కుటుంబాలు మత మార్పిడి) ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని ఈస్ట్ జోన్ డీసీపీ చారు నిగమ్ తెలిపారు. 2005 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన చంద్ర ప్రకాష్ ప్రస్తుతం హథ్రాస్ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్లో సభ్యుడిగా ఉన్నారు. -
దళితులకు ప్రత్యేక నివాసాలు తప్పదా?
‘‘దళితులకు ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేయడం, ఎవరి హక్కులనూ, అధికారా లనూ, అతిక్రమించడం కాదు. వేల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉపయోగం లేకుండా ఉంది. అటువంటి భూములలో దళితులకు ప్రత్యేక నివాసాలను, ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి, నిధులను కేటాయిం చాలి. దక్షిణాఫ్రికాలోని ‘బంటు’ తెగ లాంటి గిరిజన జాతి పరిస్థితికి, షెడ్యూల్డ్ కులాల జీవన పరిస్థితులకు చాలా దగ్గరి పోలిక ఉంది. దక్షిణాఫ్రికా రాజ్యాం గంలో బంటు తెగకు ప్రత్యేక ప్రాంతాల ఏర్పాటు అవకాశాన్ని కల్పిం చారు. కానీ భారత రాజ్యాంగం ముసాయిదాలో అటువంటి ప్రతిపా దన లేకపోవడం ఎందుకో అర్థం కావడం లేదు’’ అని 1946, ఏప్రిల్ 23వ తేదీన బాబాసాహెబ్ అంబేడ్కర్ ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్రతిపాదన చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు. చాలా మందికి మింగుడు పడకపోవచ్చు. ఫర్వాలేదు. కానీ, ఎందుకు అంబే డ్కర్ అటువంటి ప్రతిపాదన చేశాడో ఆలోచించాలి? అదే విధంగా ఇప్పుడు 70 ఏళ్ళ తర్వాత మళ్ళీ దానిని ఎందుకు లేవనెత్త వలసి వచ్చిందో కూడా మనం గుర్తించాలి. గతనెల రోజులుగా ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ జిల్లా బుల్బరి గ్రామంలో 19 ఏళ్ళ దళిత బాలికపై నలుగురు ఆధిపత్య కులానికి చెందిన యువకులు అత్యాచారం చేసి, చంపడానికి ప్రయత్నించారు. సెప్టెంబర్ 14, 2020 తేదీన పొలంలోకి గడ్డికోసం వెళ్ళిన యువతిని సందీప్, రాము, లవకుశ్, రవి అనే నలు గురు యువకులు ఆమె దుపట్టాను మెడకు బిగించి లాక్కొని వెళ్ళి, సామూహికంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆ దళిత యువతి సోద రుడు పోలీసులకు తెలిపారు. ఈ దాడిలో ఆ యువతి వెన్నెముక పూర్తిగా విరిగిపోయింది. అమ్మాయి అరుస్తుంటే నాలుకను సైతం పీకే సిందా నరహంతక ముఠా. అయినా ఆమె అరుస్తుంటే తల్లి పరిగెత్తు కొని వచ్చింది. అప్పటికే ఆమె పడిపోయి ఉన్నది. ఆమెపై అత్యాచారం చేయబోతుంటే అడ్డుకున్నందుకు దళిత యువతిని క్రూరంగా చిత్ర హింసలకు గురిచేసినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. చివరకు ఆమె చికిత్స పొందుతూ ఢిల్లీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. తమ బిడ్ద చివరి చూపుకూడా దక్కకుండా, అర్ధరాత్రి ఆ యువతి శవాన్ని పోలీ సులే దహనం చేశారు. ఈ ఘటన జరిగిపోయిన తర్వాత పోలీసులు మరో సంచలన అబద్ధాన్ని ప్రకటించారు. పోస్ట్మార్టం రిపోర్టులో ఆమెపైన అత్యా చారం జరగలేదని తేల్చారు. ‘అత్యాచారం జరగకపోతే, ఆమెపైన ఇంతటి క్రూరమైన హింస ఎందుకు జరిగిందనే విషయానికి పోలీసుల దగ్గర సమాధానం లేదు. పోలీసులు ప్రవర్తించిన తీరు ఒక కులం పెంచుకుంటున్న కాపలాదారులు వ్యవహరించిన విధంగానే ఉంది. కానీ ‘రూల్ ఆఫ్ లా’కు కట్టుబడిన యంత్రాంగం విధంగా కనిపిం చడం లేదు. ఈ ఒక్క ఘటనతో ఆగిపోలేదు. ఆ తర్వాత జరిగిన ఘటనలు కూడా చూస్తే, భారత దేశంలో షెడ్యూల్డ్ కులాలుగా పిలువ బడుతున్న దళితులకు ఎంతటి రక్షణ ఉందో మనకు అర్థం కాగలదు. సెప్టెంబర్ 29న, ఉత్తరప్రదేశ్లోని అజ్మీర్ జిల్లా రామ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దౌరాయి గ్రామంలో ఒక యువతిపై అత్యాచారం జరిగింది. అదే రాష్ట్రంలో బలరాంపూర్లో 22 ఏళ్ళ దళిత యువతిపై ఇద్దరు ఆధిపత్య కులానికి చెందిన యువకులు అత్యాచారం జరిపారు. భదోయి జిల్లాలో 14 ఏళ్ళ దళిత బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేశారు. ఆమె తలను ఇటుకలతో కొట్టి ముక్కలు ముక్కలు చేశారు. అంతేగాకుండా గ్యాన్పూర్ ఏరియాలో 44 ఏళ్ళ దళిత వివా హితపై నలుగురు వ్యక్తులు అత్యాచారం జరిపారు. మధ్యప్రదేశ్, బిహార్, రాజస్తాన్ ఇంకా దేశంలోని చాలా రాష్ట్రాల్లో అత్యాచారాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక దళిత యువతుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. దళిత స్త్రీలపై జరుగుతోన్న అత్యాచారాలు నేరాలుగానే పరిగణించని స్థితి. గత నాలుగేళ్ళలో దళిత మహిళలపై జరిగిన అత్యాచారాలను పరిశీలిస్తే, దళితుల జీవితాలు ఎంతటి భయంకర మైన స్థితిలో ఉన్నాయో అర్థం అవుతుంది. దేశం మొత్తంలో 2015లో 2,332 మంది, 2016లో 2,540, 2017లో 2,770, 2018లో 2956 మంది దళిత మహిళలు ఆధిపత్య కులాల పురుష దురహంకారానికి బలైపోయారు. ఇందులో ఉత్తరప్రదేశ్ కుల దురహంకారానిదే అగ్ర స్థానం. 2015లో 444 మంది, 2016లో 557 మంది, 2017లో 549 మంది, 2018లో 526 మంది మహిళలు అత్యాచారానికి బలై పోతు న్నారు. ఇవి కేవలం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు మాత్రమే. అసలు పోలీసు స్టేషన్ మెట్లెక్కడానికి సాహసించని దళిత కుటుం బాలు కోకొల్లలు. దళిత స్త్రీలపై జరుగుతోన్న అత్యాచారాలు అనూ హ్యమైన సంఖ్యలో ఉంటాయన్నది సత్యం. ఇక హత్యలు, కిడ్నాప్లు, దాడుల లాంటి ఘటనలకు దేశంలో ఎక్కడా లెక్కా పత్రం లేదు. మనదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్ళు దాటాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్ళు నిండాయి. కానీ దళితుల రక్షణ విషయంలో ఎటువంటి ప్రగతి లేదు. సమాజం ఆధునిక ఆలోచనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధిస్తుందని భావి స్తున్నాం. కానీ దళితులపైన జరుగుతున్న దాడులను చూస్తే ఈ దేశంలో దళితులనే వారిని మనుషులుగా చూస్తున్నారా? అనే అను మానం కలగకమానదు. అందుకే అంబేడ్కర్పైన ఉటంకించిన అభి ప్రాయం, ప్రతిపాదించిన పరిష్కారం మళ్ళీ చర్చలోకి తీసుకురాక తప్పలేదు. అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు 9వ భాగంలో ప్రత్యేక నివాసాలు అనే చాప్టర్ ఉంది. అందులో ఆయన పేర్కొన్న ఒక అంశాన్ని ఇక్కడ పేర్కొనడం సబబుగా ఉంటుంది. ‘పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ రెండూ హిందువుల వైపే ఉంటాయి. అందుచేత హిందువులతో పోరాడితే వారికి పోలీసుల నుంచి రక్షణ గానీ, న్యాయమూర్తుల నుండి న్యాయం గానీ లభించదు. వాళ్ళు ఆధిపత్య కులాల పక్షాన్నే ఉంటారు. ఆధిపత్య కులాలకు ఉన్న సామాజిక అండదండలు, ఆర్థిక బలం దళితులకు ఉండవు. అందువల్ల వాళ్ళు ఈ వ్యవస్థ ఫలితాలను అందుకోలేరు’ అన్న అంబేడ్కర్ మాటలు నేటి ప్రభుత్వ వ్యవస్థల పనితీరుకి అద్దంపడుతున్నాయి. అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో నమోదౌతున్న కేసుల సంఖ్య రోజు రోజుకీ తరిగిపోతోంది. ఇటీవల ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిందితులకు అండగా నిలిచింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడానికి ముందు విచారణ జరపాలనేది అటువంటి నిబంధన. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. దానితో చాలా కేసుల్లో పోలీసులే బాధితులను బెదిరించి, కేసులే లేకుండా చేసి, నిందితుల కొమ్ముకాస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అయితే కోర్టుల దాకా వెళ్ళిన కేసులలో కూడా శిక్షలు పడుతున్నవి అత్యంత అరుదనే చెప్పొచ్చు. 2017–18 కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 16.3 శాతం కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి. ఇవన్నీ కింది కోర్టులే. పై కోర్టుల్లో వీటిని కొట్టేస్తున్నారు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చుండూరు కేసు. జిల్లా కోర్టు శిక్షలు విధిస్తే, హైకోర్టు న్యాయమూర్తి దానిని కొట్టివేశారు. ఇంతకన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదు. ఇంతేకాకుండా దళితులపైన భౌతిక దాడులే కాకుండా, ఉద్యోగులపై, అధికారులపై వివక్ష, వేధింపులు నిత్యకృత్యంగా మారిపోయాయి. రాజకీయ నాయ కులైన దళితులు కూడా రెండవ శ్రేణి నాయకులుగానే చూడబడుతు న్నారు. పార్టీ నాయకత్వాలకు అడుగులకు మడుగులొత్తకపోతే, ఏ నాయకుడికైనా పుట్టగతుల్లేవు. ఇది ప్రస్తుత దళితుల పరిస్థితి. అందుకే బాబాసాహెబ్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు, కనీసం ప్రత్యేక నివాసాల ద్వారానైనా దళితులు భౌతిక హింసకు దూరమవు తారని భావించారు. నాగ్పూర్లో 1942, జూలై, 19 తేదీల్లో జరిగిన అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సదస్సులో ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘హిందువులకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాల నివాసాలను ఏర్పాటు చేయాలి. కొత్త గ్రామాల నిర్మాణం కోసం సెటిల్మెంట్ కమిషన్ని ఏర్పాటు చేయాలి. ప్రభు త్వానికి సంబంధించిన అనాక్రమిత వ్యవసాయ భూముల్ని కమిషన్కు అప్పగించాలి’ ఇట్లా తన ప్రతిపాదనలను అంబేడ్కర్ రాజ్యాంగ సభ ముందుంచారు. కానీ ఇవేవీ రాజ్యాంగంలోకి రాలేదు. ఇప్పుడైనా అటువంటి ప్రతిపాదనను ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆధిపత్య కులాలు మెజారిటీగా ఉన్న చోట, దళితులు చాలా తక్కువ జనాభా ఉన్నచోట ఈ దారుణాలు మరింతగా పెరుగుతున్నాయి. కారంచేడు, చుండూరులో దాడిచేసిన సామాజిక వర్గాల జనాభా అధికం. అదేవిధంగా బులాన్గర్ గ్రామంలో అత్యాచారం జరిగిన చోటా కులం బలం ఎక్కువ. అక్కడ దళితుల ఇళ్ళు కేవలం పదిహేను మాత్రమే. అంతే కాకుండా చాలాచోట్ల ఏ కులం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ కులం వాళ్ళు దాడులకు సిద్ధమౌతున్నారు. దీనికి ఎన్ని ఉదాహరణలైనా చూపించవచ్చు. కనీసం ముందు ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎక్కడైతే దళితులు చాలా తక్కువ జనాభాగా ఉన్నారో, వారిని దళితులు అధికంగా ఉన్న చోటుకు మార్చితే కనీసం జన బలంతోనైనా కొంత భద్రత వస్తుం దేమో చూడాలి. ఏది ఏమైనా హాథ్రస్ ఘటన తర్వాత దళితుల్లో ఒకరకమైన ఆవేదన, ఆవేశం బయట పడుతున్నాయి. ఇది ప్రత్యక్ష కార్యాచరణగా ఇప్పుడు బయటపడకపోవచ్చు. కానీ ఇది ఇంతటితో ఆగదు. ఎవరైనా ఈ దేశ సమగ్రత, సమైక్యత గురించి ఆలోచించే ముందు దళితుల రక్షణ, భద్రత గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంటుంది. అంబేడ్కర్ చేసిన ప్రతిపాదన గురించి ఆలోచించాలి. ఒకవేళ ఆ ప్రతిపాదన సరైంది కాదనుకుంటే, ప్రత్యామ్నాయం ఏంటో చెప్పాల్సి ఉంటుంది. లేదంటే దేశ సమగ్రత, సమైక్యత కేవలం హుళక్కిగానే మిగిలిపోతుంది. హిందూ సమాజం ఏకత్వం గురించి హిందూ మతం ఐక్యత గురించి సంఘాలు, సంస్థలు, పీఠాలు, ట్రస్టులు ఈ విషయాన్ని ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడితే వినాలని ఉంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
హథ్రాస్ ఆగ్రహం.. 50 కుటుంబాలు మత మార్పిడి
లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల బాధితురాలి సామాజిక వర్గం(వాల్మీకి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతో ఆ వర్గానికి చెందిన 50 కుటుంబాలకు చెందిన 236 మంది ప్రజలు బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు సమాచారం. ఈ సంఘటన ఘజియాబాద్లోని కర్హేడా ప్రాంతంలో అక్టోబర్ 14న చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాల్మీకి వర్గానికి చెందిన 236 మంది ప్రజలందరు బౌద్ధమతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ముని ముని మనవడు రాజరత్న సమక్షంలో వీరు బౌద్ధంలోకి మారారు. హథ్రాస్ సంఘటనతో తాము బాధపడ్డామని, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ, నాయకులు, అధికారులు వారి బాధలు వినలేదని కుటుంబాలు ఆరోపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఉంది. దీనిలో రాజరత్న అంబేద్కర్, వాల్మీకి వర్గ ప్రజలను బౌద్ధమతంలోకి ప్రవేశపెట్టడాన్ని చూడవచ్చు. వీరందరు భారత బౌద్ధ సర్వసభ్య ధృవీకరణ పత్రం కూడా పొందారు. (చదవండి: హథ్రస్ కేసు: ఆ రైతు పాలిట శాపంగా..) బౌద్ధమతంలోకి వెళ్ళిన ప్రజలలో ఒకరైన బిర్ సింగ్ మాట్లాడుతూ, “మా గ్రామంలోని 50 కుటుంబాలకు చెందిన 236 మంది మహిళలు, పిల్లలతో సహా బౌద్ధమతంలోకి మారాము. దీనికి ఎటువంటి ఫీజు తీసుకోలేదు. బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత, సామాజిక సేవ వంటి మంచి కార్యకలాపాలను చేపట్టాలని మాకు బోధించారు" అని తెలిపారు. ఇక సెప్టెంబర్ 14 న, హథ్రాస్లోని బుల్గాది గ్రామంలో వాల్మీకి వర్గానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం, హత్యతో ఆగ్రహం చెలరేగింది. ఈ సంఘటన తరువాత, వాల్మీకి సమాజ్ నిరసన వ్యక్తం చేసి వివిధ ప్రదర్శనలు నిర్వహించింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. నలుగురు నిందితులను అలీగఢ్ జైలులో ఉంచారు. -
హథ్రస్ కేసు: ఆ రైతు పాలిట శాపంగా..
లక్నో : హథ్రస్ దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. అధికారులు.. బాధితులు, నిందితులను ఇది వరకే పలుమార్లు విచారించారు. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. బాధితులతో కలిసి పంట పొలంలోని క్రైం సీన్ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కారణంగా తన పంట నాశనం అయిందని క్రైం సీన్ ఉన్న పంట పొలం యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 19 ఏళ్ల దళిత బాలిక అత్యాచారానికి గురైన బూల్గర్హీ గ్రామంలోని పంట పొలాన్ని సీబీఐ అధికారులు పలుమార్లు పరిశీలించారు. క్రైం సీన్ను కాపాడటానికి పొలానికి దూరంగా ఉండాలని దాని యజమానిని ఆదేశించారు. నీళ్లు పెట్టకపోవడం, కలుపు తీయకపోవటంతో పంట నాశనం అయిపోయింది. ( ఢిల్లీ వెళ్తామన్న ‘హాథ్రస్’ కుటుంబం ) దీనిపై సదరు రైతు మాట్లాడుతూ.. ‘‘క్రైం సీన్లోని ఆధారాలను పరిరక్షించటానికి దాదాపు రెండున్నర ఎకరాలు ఉన్న నా పొలానికి నీళ్లు పెట్టవద్దని, పొలంలో ఎలాంటి పనులు చేయవద్దని సీబీఐ అధికారులు ఆదేశించారు. దానికి తోడు చాలామంది పంటను తొక్కారు. దీంతో పంట నాశనమై 50 వేల రూపాయల నష్టంతో పాటు మా ఇంటిల్లిపాది కష్టం వృధా అయింది. ప్రభుత్వం నాకు నష్ట పరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్ చేశారు. -
ఢిల్లీ వెళ్తామన్న ‘హాథ్రస్’ కుటుంబం
హాథ్రస్: భద్రతా కారణాల రీత్యా తాము ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచే న్యాయ పోరాటం చేస్తామని హాథ్రస్ బాధిత కుటుంబం చెప్పింది. హాథ్రస్ ఘటనలో మరణించిన దళిత యువతి సోదరుడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని ఆ కుటుంబానికి న్యాయ సాయం అందిస్తున్న సీమా కుష్వాహ కూడా స్పష్టం చేశారు. అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ ఎదుట ఆమె శనివారం హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబం ఈ కేసును ఢిల్లీకి గానీ, ముంబైకి గానీ తరలించి విచారణ జరిపించాలని కోరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి భద్రత కల్పిస్తున్న ఎస్డీఎం అంజలి గంగ్వార్ కుటుంబ సభ్యులను కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రేషన్ను అందిస్తామని చెప్పారు. పొలంలోకి వెళ్లేందుకు భద్రత కావాలని కుటుంబ పెద్ద అడిగారని, అందుకు అంగీకరించామని అంజలి తెలిపారు. -
హథ్రాస్ కేసు: ఐదు గంటల పాటు విచారణ!
లక్నో: హథ్రాస్ సామూహిక లైంగిక దాడి, హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఘటనాస్థలి వద్దకు వెళ్లి వివరాలు సేకరించిన సీబీఐ బృందం, శనివారం మరోసారి బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసింది. భూల్ఘర్లోని వారి ఇంటికి వెళ్లి, సుమారు ఐదు గంటల పాటు వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. బాధితురాలి తల్లి, వదిన చెప్పిన వివరాలను నమోదు చేసుకుంది. వీరితో పాటు చోటు అనే సాక్షిని కూడా విచారించినట్లు సమాచారం. అంతేగాకుండా ఈ కేసులోని ప్రధాన నిందితుడు, బాధితురాలి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు ఆధారాలు పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో, ఈ విషయం గురించి బాధితురాలి కుటుంబ సభ్యులను ఆరా తీసినట్లు తెలుస్తోంది. (చదవండి: వాళ్లు భయపడ్డం లేదు.. జైలు మార్చండి!) కాగా, ఈ కేసులోని నలుగురు నిందితుల కుటుంబసభ్యుల్ని సీబీఐ అధికారులు గురువారం విచారించిన విషయం తెలిసిందే. ఆధారాల సేకరణ కోసం వారి ఇళ్ల వద్ద సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిందితుడు లవ్ కుశ్ సికార్వర్ ఇంట్లో రక్తపు మరకలతో కూడిన దుస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే అవి రక్తపు మరకలు కాదని, ఎర్రని పెయింట్ అని అతడి సోదరుడు వీడియో విడుదల చేయడం గమనార్హం. ఇక హథ్రాస్ దళిత యువతి సామూహిక అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణను పర్యవేక్షించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా బాధితురాలి కుటుంబానికి, ఈ కేసులోని సాక్షులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే, బాధితురాలి ఇంటి వద్ద విధులు నిర్వరిస్తున్న పోలీసు సిబ్బంది, ఇతరత్రా వివరాలతో కూడిన అఫిడవిట్ను దాఖలు చేసింది. (‘ఎవరికీ భయపడం.. న్యాయం తప్ప ఇంకేమీ వద్దు’) -
‘అవి రక్తపు మరకలు కాదు పెయింట్’
లక్నో : హథ్రస్ దళిత యువతి అత్యాచారం కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు సీబీఐ అధికారులు. గ్రామంలో తాత్కాళిక కార్యాలయం ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది వరకే బాధితురాలి కుటుంబసభ్యుల్ని పలు మార్లు విచారించారు. గురువారం నలుగురు నిందితుల కుటుంబసభ్యుల్ని అధికారులు విచారించారు. ఆధారాల కోసం వారి ఇళ్ల వద్ద సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాజాగా నిందితుడు లవ్ కుశ్ సికార్వర్ ఇంట్లో రక్తపు మరకలతో కూడిన దుస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ( ‘హథ్రాస్ బాధితురాలిగా నా భార్య ఫోటో’ ) అయితే ఈ వార్తల్ని నిందితుడి కుటుంబసభ్యులు ఖండించారు. లవ్ కుశ్ సోదరుడు రవి ఓ ఫ్యాక్టరీలో పెయింటర్గా పని చేస్తున్నాడని, అందుకే అతడి బట్టలు ఎర్ర పెయింట్తో మాసిపోయి ఉన్నాయని చెప్పారు. అది కేవలం ఎర్ర రంగు మాత్రమేనని సీబీఐ అధికారులు భావిస్తున్నట్లుగా రక్తపు మరకలు కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు నిందితుడి సోదరుడు లలిత్ ఓ వీడియో మెసేజ్ను విడుదల చేశాడు. -
ఖమ్మం మైనర్ బాలిక ఘటనలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, ఖమ్మం: ఓ వైపు హథ్రాస్ బాధితురాలి విషయంలో అర్థరాత్రి, కుటుంబ సభ్యులు లేకుండా అంత్యక్రియలు నిర్వహించడం పట్ల కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి అధికారులు తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఖమ్మం మైనర్ బాలిక ఘటనలో కూడా పోలీసులు ఇలానే ఓవరాక్షన్ చేశారు. కుటుంబ సభ్యులు లేకుండానే పోస్టుమార్టం పూర్తి చేసి, సంతకాలు పెట్టించుకుని పంపించారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడేనికి చెందిన ఉప్పలయ్య కుమార్తె కామాంధుడి చేతిలో దారుణ అత్యాచారానికి గురై దాదాపు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం కన్ను మూసిన సంగతి తెలిసిందే.(చదవండి: ఆ ఘటన మా కుటుంబానికి తీరని లోటు) ఈ క్రమంలో పోలీసులు కుటుంబ సభ్యులు లేకుండానే పోస్టుమార్టం పూర్తి చేసి హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తరలించారు. ఇదేంటని మీడియా ప్రశ్నిస్తే లోపల పోస్టుమార్టం నడుస్తుందని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘హథ్రాస్ బాధితురాలిగా నా భార్య ఫోటో’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ ఉదంతంలో బాధితురాలి ఫోటో అంటూ చనిపోయిన తన భార్య ఫోటోను వాడుతున్నారంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదును పరిశీలించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా మాట్లాడుతూ.. ‘సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నిజమని తేలితే.. ప్రభుత్వం ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఆదేశాలు జారీ చేయడమే కాక వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పిటిషన్దారు సమర్పించిన దృష్ట్యా మొదటి ప్రతివాదిగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ మంత్రిత్వ శాఖ సదరు వ్యక్తి ఫిర్యాదుని పరిశీలించాలి. ఒకవేళ నిజమని తేలితే దానిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలి. ఈ ఉత్తర్వు కాపీని స్వీకరించిన మూడు రోజుల వ్యవధిలో గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని తెలిపారు. ఇక ఈ ఫిర్యాదుకు సంబంధించి కోర్టు అక్టోబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: వాళ్లందరికీ భద్రత కల్పిస్తున్నాం..) అంతేకాక సదరు వ్యక్తిని ఈ ఉత్తర్వు కాపీతో పాటు తన ఫిర్యాదుకు మద్దతుగా ఉన్న అవసరమైన పత్రాలను మంత్రిత్వ శాఖకు పంపాలని కోర్టు సూచించింది. తప్పుడు కంటెంట్ ఉన్న యూఆర్ఎల్ని గుర్తించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి తన స్పందనను తెలియజేయాల్సిందిగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్కి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో ఒక యువతిపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన ఘటనలో బాధితురాలిగా.. చనిపోయిన తన భార్య ఫోటోను వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేస్తున్నట్లు విచారణ సందర్భంగా వ్యక్తి కోర్టుకు తెలిపాడు. ఇక అతడి న్యాయవాది అత్యాచార బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయడం భారత శిక్షాస్మృతి ప్రకారం నేరం అని.. పైగా ప్రస్తుతం తప్పుడు ఫోటో ప్రచారం అవుతుందని కోర్టుకు విన్నవించాడు. (చదవండి: అర్ధరాత్రి అంత్యక్రియలు ఉల్లంఘనే) ఇక ట్విట్టర్ తరపు న్యాయవాది ఈ వ్యక్తి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపాడు. కోర్టు ఉత్తర్వులను సూచించే సరైన ఛానెల్ ద్వారా తప్పుడు ఫోటో షేర్ అవుతున్న యూఆర్ఎల్కు సంబంధించిన సమాచారం తమకు పంపితే వాటిని తొలగిస్తామని తెలిపాడు. గూగుల్ కూడా ఇదే తెలిపింది. -
వాళ్లు భయపడ్డం లేదు.. జైలు మార్చండి!
లక్నో : హథ్రస్ సంఘటనకు సంబంధించి సీబీఐ విచారణను వేగవంతం చేసింది. బుధవారం బాధితురాలి తండ్రి, సోదరుల్ని మరోసారి విచారించనుంది. హథ్రస్లో ఏర్పాటు చేసిన సీబీఐ తాత్కాళిక కార్యాలయంలో వారిని ప్రశ్నించనుంది. దీనిపై సీబీఐ అధికారి అంజలి గంగావర్ మాట్లాడుతూ..‘‘ హథ్రస్లో ఏర్పాటు చేసిన సీబీఐ తాత్కాళిక కార్యాలయంలో బాధితురాలి కుటుంబంలోని మగవారిని ఈ బుధవారం విచారిస్తాము. ఆడవారిని గురువారం వారి ఇంటివద్దే విచారిస్తాము. విచారణ సందర్భంగా వారిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టము. విచారణ ప్రక్రియకు సంబంధించి సదరు కుటుంబానికి ఎటువంటి ఆక్షేపణలు లేవ’’ని తెలిపారు. ( హత్రస్లో మరో ఘోరం! ) బుధవారం బాధితురాలి వదిన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా భర్త సీబీఐ అధికారులతో మంగళవారం సంఘటనా స్థలానికి వెళ్లారు. బాధితురాలి చెప్పులు, అస్థికలు, ఇతర వస్తువులను అధికారులు వారి వెంట తీసుకెళ్లారు. నిందితుల్ని అలీఘర్ జైలు నుంచి వేరే జైలుకు మార్చండి. వాళ్లు భయపడ్డం లేదు. ఆ జైలులో వాళ్లు సొంత ఇంట్లో ఉంటున్నట్లుగా ఫీలవుతున్నార’’ని పేర్కొంది. కాగా, మంగళవారం బాధితురాలి కుటుంబసభ్యుల్నందర్ని విచారించిన సీబీఐ.. సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. వారినుంచి వివరాలను అడిగి తెలుసుకుంది. -
వాళ్లందరికీ భద్రత కల్పిస్తున్నాం..
న్యూఢిల్లీ/లక్నో: హాథ్రస్ దళిత యువతి సామూహిక అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణను పర్యవేక్షించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అదే విధంగా దర్యాప్తునకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిందిగా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరింది. అదే ఫైల్ను యూపీ పోలీస్ చీఫ్ ద్వారా సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పిస్తామని, కాబట్టి తమ అభ్యర్థనను మన్నించాల్సిందిగా యోగి సర్కారు విజ్ఞప్తి చేసింది. ఇక బాధితురాలి కుటుంబానికి, ఈ కేసులోని సాక్షులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే, బాధితురాలి ఇంటి వద్ద విధులు నిర్వరిస్తున్న పోలీసు సిబ్బంది, ఇతరత్రా వివరాలతో కూడిన అఫిడవిట్ను దాఖలు చేసింది. బాధిత కుటుంబ నివాస ప్రాంగణంలో ఎనిమిది సీసీటీవీలను బిగించామని, తద్వారా నిరంతరం అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో సుప్రీంకోర్టు గురువారం తదుపరి విచారణ చేపట్టనుంది. (చదవండి: హథ్రస్లో మరో ఘోరం!) సామూహిక అత్యాచారానికి గురై, అత్యంత దారుణ పరిస్థితుల్లో ఢిల్లీ ఆస్పత్రిలో మరణించిన 20 ఏళ్ల దళిత యువతి మృతి కేసులో సీబీఐ మంగళవారం విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫోరెన్సిక్ నిపుణులతో సహా నేరం జరిగిన చోటుకు వెళ్లిన దర్యాప్తు బృందం, బాధితురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఆమె తల్లి, సోదరుడిని క్రైంసీన్ వద్దకు తీసుకువెళ్లి వివరాలు సేకరించింది. అనంతరం, అర్ధరాత్రి దాటిన తర్వాత బాధితురాలి మృతదేహాన్ని హడావుడిగా దహనం చేసిన చోటుకు వెళ్లి పరిశీలించింది. ఇక ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సైతం విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ మేరకు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేయడం గమనార్హం.(చదవండి: అర్ధరాత్రి అంత్యక్రియలు ఉల్లంఘనే) కాగా.. ఈ కేసులో ఆది నుంచి పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. బాధిత యువతి భౌతిక కాయాన్ని అర్థరాత్రి దహనంచేయడం మానవహక్కుల ఉల్లంఘన అని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాథ్రస్ లాంటి ఘటనల్లో శవ దహనానికి మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. -
హత్రస్లో మరో ఘోరం!
లక్నో: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో బాలికపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో ఘోరమైన ఘటన హత్రాస్లో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ఆమె తరుపు బంధువులే అత్యాచారం చేశారు. బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా అరవింద్ అనే వ్యక్తి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడని బాలిక మామయ్య తెలిపారు. అనంతరం సాయంత్రం పూట బాలికను చూసిన తల్లిదండ్రులకు అనుమానం రావడంతో ఆమెను వైద్యులకు చూపించారు. వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్థారించారు. దీంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సెప్టెంబర్లో హత్రాస్లో బాలికపై ఉన్నత వర్గాలకు చెందిన యువకులు అత్యాచారానికి పాల్పడి ఘోరంగా హింసించారు. అనంతరం ఆమె మరణించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. చదవండి: హథ్రాస్ కేసు : గ్రామ పెద్ద సంచలన ఆరోపణలు -
అర్ధరాత్రి అంత్యక్రియలు ఉల్లంఘనే
లక్నో: హాథ్రస్ సామూహిక అత్యాచార బాధిత యువతి భౌతిక కాయాన్ని అర్థరాత్రి దహనంచేయడం మానవహక్కుల ఉల్లంఘన అని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. హాథ్రస్ లాంటి ఘటనల్లో శవ దహనానికి మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు లక్నో బెంచ్ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంప్రదాయాలను పాటించకుండా, అర్థరాత్రి శవాన్ని దహనం చేయడం బాధిత మహిళ మానవ హక్కులను, వారి కుటుంబ సభ్యులు, బంధువుల మానవ హక్కులను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. హాథ్రస్కు సీబీఐ బృందం హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను మంగళవారం సీబీఐ ప్రశ్నించింది. నేరం జరిగిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు. మంగళవారం ఉదయం హాథ్రస్ చేరుకున్న సీబీఐ బృందం మొదట బాధితురాలి సోదరుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తరువాత, వారి కుటుంబం నుంచి పూర్తి వివరాలను సేకరించారు. సంఘటన పూర్వాపరాలపై వారిని లోతుగా ప్రశ్నించారు. మరోవైపు, హాథ్రస్ కేసు విచారణకు సీబీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలో మరో నలుగురు అధికారులు కొత్తగా చేరారు. సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబ్ నుంచి కూడా నిపుణులు ఈ బృందంలో చేరారు. -
హాథ్రస్: క్రైంసీన్ పరిశీలించిన సీబీఐ
-
హాథ్రస్: క్రైంసీన్ వద్దకు బాధితురాలి తల్లి
లక్నో: హాథ్రస్ ఉదంతంపై లోతుగా విచారణ చేపట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రంగంలోకి దిగింది. అత్యంత దారుణ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి కన్నుమూసిన పందొమిదేళ్ల దళిత యువతి మృతి కేసులో విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలో సీబీఐ అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం బాధితురాలి సొంత గ్రామానికి చేరుకుంది. డిప్యూటీ సూపరిండెంటెండ్ ఆఫ్ పోలీస్ సీమా పహుజా నేతృత్వంలో, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు, బాధితురాలి సోదరుడితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించింది. అంతేగాక బాధితురాలి తల్లిని కూడా క్రైంసీన్ దగ్గరకు తీసుకువెళ్లి వివరాలు అడిగి తెలుసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను, అనంతరం అంబులెన్సులో ఇంటికి తరలించారు. (చదవండి: కోర్టులో హాజరైన హాథ్రస్ బాధిత కుటుంబీకులు) కాగా ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి, నాలుక కోసి, వెన్నుముక విరిచి అత్యంత పాశవికంగా దాడి చేయడంతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. తల్లితో కలిసి గడ్డి కోస్తున్న సమయంలో మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్లి ఆమెను చిత్ర హింసలకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సెప్టెంబరు 30న యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఈ కేసు విచారణకై తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. ఆ తర్వాత మరో పది రోజుల పాటు సమయం కావాలని సిట్ కోరడంతో గడువును పొడిగించింది. ఇక ఈ కేసులో ఆది నుంచి పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిని సీబీఐకి అప్పగించాల్సిందిగా డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ, 379-డీ(సామూహిక లైంగిక దాడి), 307(హత్యాయత్నం), 303(హత్య)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఘటనాస్థలి వద్ద ఆధారాలు సేకరించేందుకు నేడు ఫోరెన్సిక్ నిపుణులను తీసుకువెళ్లింది. గతంలో షిమ్లా అత్యాచారం, హత్య కేసును విచారించిన సీమా పహుజా నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. -
కోర్టులో హాజరైన హాథ్రస్ బాధిత కుటుంబీకులు
లక్నో: యూపీలోని హాథ్రస్లో నలుగురు యువకుల చేతిలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన దళిత యువతి కుటుంబ సభ్యులు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ ఎదుట హాజరయ్యారు. కేసును కోర్టు విచారించి తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. బాధితురాలి తల్లి, తండ్రి, ఆమె ముగ్గురు సోదరులు కోర్టుకొచ్చారు. బాధిత యువతి శవాన్ని దహనం చేయడంలో, పై అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవని, శాంతి భద్రతలను పరిగణనలోనికి తీసుకొని, రాత్రే దహనసంస్కారాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ కోర్టుకి తెలిపారు. కేసు విచారణ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలంటూ కోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్ 14న అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీ ఆసుపత్రిలో మరణించింది. ఆ తరువాత హడావిడిగా యువతి భౌతిక కాయాన్ని దహనం చేశారంటూ జిల్లా అధికార యంత్రాంగం ఆరోపణలెదుర్కొంటోంది. -
హాథ్రస్ ఘటనసై ఆలహాబాద్ హైకోర్టు విచారణ
లక్నో: హాథ్రస్ ఘటన కేసుపై అలహాబాద్ లక్నో బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. బాధిత మృతురాలికి గుట్టుచప్పుడుగా అర్థరాత్రి అంత్యక్రియలు జరిపించిన ఉత్తర ప్రదేశ్ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసింది. తమ బంధించి బలవంతంగా పోలీసులు అంత్యక్రియలు జరిపించారని బాధితురాలి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను రికార్డు చేసిన హైకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 2వ తేదికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. చదవండి: నేడు హైకోర్టుకు హాథ్రస్ బాధిత కుటుంబం -
యూపీలోనే ఎక్కువ.. ఎందుకిలా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కల్లోలం రేపిన హాథ్రస్ దళిత యువతి అత్యాచారం చోటు చేసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో మహిళలకు వ్యతిరేకంగా క్రైమ్ రేటు ఏకంగా 66.7 శాతం పెరిగిందని సెప్టెంబర్ 19వ తేదీన ‘క్రైమ్ ఇన్ ఇండియా 2019’ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులల మహిళలకు వ్యతిరేకంగా 37 శాతం రేప్ సంఘటనలు పెరగ్గా, 20 శాతం భౌతిక దాడులు పెరిగాయి. దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల మహిళలకు వ్యతిరేకంగా రేప్ సంఘటనలు సరాసరి 23.3 శాతం పెరగ్గా, హింసాత్మక సంఘటనలు 18.8 శాతం పెరిగింది. షెడ్యూల్డ్ కులాల మహిళలపైనే కాకుండా మొత్తంగా దేశంలోని మహిళలపై దాడులు పెరిగాయి. గత నాలుగేళ్ల కాలంలో దేశంలోని మహిళలకు వ్యతిరేకంగా ఓ పక్క దాడులు పెరగ్గా మరోపక్క పెండింగ్ కేసులు కూడా పెరగడం విచిత్రమే. అన్ని కేటగిరీలకు చెందిన మహిళలపై పెండింగ్ కేసులు 29.3 శాతం పెరగ్గా, ఎస్సీ మహిళలకు వ్యతిరేకంగా పెండింగ్ కేసుల సంఖ్య 33.8 శాతంకు పెరిగాయి. మహిళలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో కేవలం 7.6 శాతం కేసులే పరిష్కారమయ్యాయి. షెడ్యూల్డ్ మహిళలకు సంబంధించిన కేసుల్లో ఈ సంఖ్య 6.1 శాతానికే పరిమితమైంది. 40 శాతం కేసుల్లో నేరానికి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కొట్టివేయడం కనిపిస్తోంది. మహిళలకు వ్యతిరేకంగా గత నాలుగేళ్లలో పెరుగుతున్న నేరాల్లో కేసులు నమోదవడం కూడా ఎక్కువే జరుగుతోంది. కట్నం చావులు, కట్నం కోసం భర్త, ఇతర కుటుంబ సభ్యులు హింసకు పాల్పడడం, లైంగిక దాడులు, ఆసిడ్ దాడులు, కిడ్నాప్లు, అక్రమ రవాణా తదితర నేరాలను మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలుగా పరిగణలోకి తీసుకున్నారు. 2015 సంవత్సరంతో పోలిస్తే 2019 సంవత్సరానికి ఈ కేసుల నమోదు కూడా దేశవ్యాప్తంగా సరాసరి 7.3 శాతం పెరిగింది. ఈ సంఖ్య కూడా యూపీలో ఎక్కువగా ఉంది. యూపీలో 66.7 శాతం కేసులు నమోదుకాగా, హర్యానాలో 54.4 శాతం, రాజస్థాన్లో 47.2 శాతం, ఒడిశా, బిహార్ రాష్ట్రాల్లో 34, 35 శాతం కేసులు నమోదయ్యాయి. 2014 సంవత్సరంతో పోలీస్తే 2019 సెప్టెంబర్ 29వ తేదీ నాటికి యూపీలో మహిళలకు వ్యతిరేకంగా జరిగిన దాడుల కేసులో ఏకంగా 15 శాతం పెరిగాయి. (హథ్రాస్ : నిందితుడిపై కేసు నమోదు చేసిన సీబీఐ) -
నేడు హైకోర్టుకు హాథ్రస్ బాధిత కుటుంబం
లక్నో/హాథ్రస్: ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో కామాంధుల రాక్షసత్వానికి ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి కుటుంబ స భ్యులు సోమవారం అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు హాజరు కానున్నారు. పటిష్టమైన భద్రత మధ్య వారిని న్యాయస్థానానికి తీసుకెళ్లేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. యువతిపై అత్యాచారం, హత్య కేసు లో బాధిత కుటుంబ సభ్యుల వాదనను కోర్టు నమోదు చేయనుంది. జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ రంజన్ రాయ్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును సోమవారం విచారించనుంది. ధర్మాసనం ముందు హాజరు కావాలని యూపీ అదనపు చీఫ్ సెక్రెటరీ(హోం), డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీని సైతం హైకోర్టు ఆదేశించింది. ప్రభు త్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వీకే సాహిని హాజరుకానున్నారు. రంగంలోకి దిగిన సీబీఐ.. హాథ్రస్ ఘటనను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. ఆదివారం ఉదయం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సామూహిక అత్యాచారం, హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. సీబీఐ ఘజియాబాద్కు చెందిన ప్రత్యేక టీమ్ ఈ కేసును విచారిస్తుందని అధికారులు తెలిపారు. -
హథ్రాస్ : నిందితుడిపై కేసు నమోదు చేసిన సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన హథ్రాస్ హత్యాచార కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ నిందితుడిపై కేసు నమోదు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హథ్రాస్ కేసు దర్యాప్తును యూపీ పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించింది. సెప్టెంబర్ 14న బాధితురాలు పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. దుండగులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేసి.. నాలుక కోసి తీవ్రంగా హింసించిన్నట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెడ, వెన్నెముకకు తీవ్ర గాయాలయిన బాధితురాలిని ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె రెండు వారాలపాటు ప్రాణాలతో పోరాడి చివరకు సెప్టెంబర్ 29న కన్ను మూశారు. ఇక హథ్రాస్ ఘటన యూపీ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కేసు పట్ల యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బాధితురాలి కుటుంబం పట్ల నిర్థాక్షిణ్యంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి అర్ధరాత్రి ఆమె మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం దుమారం రేపింది. చదవండి : హథ్రాస్: 60 మంది పోలీసులు.. 8 సీసీ కెమెరాలు -
షాకింగ్: మహిళా నేతపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
లక్నో: హాథ్రస్ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో కాంగ్రెస్కు కొత్త జోష్ వచ్చిందని రాజకీయ విశ్లేకులు చెప్తున్నారు. ముఖ్యంగా నాయకత్వ లేమితో ఇబ్బందులు పడుతున్న పార్టీని ప్రియాంక ముందుండి నడిపించగలదని అంటున్నారు. కానీ, అదే ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఓ ఘటన కాంగ్రెస్ పార్టీలో మహిళలపట్ల వివక్ష ఏమేరకు ఉందో కళ్లకు కడుతోంది. కాంగ్రెస్ మహిళా నేత తారా యాదవ్పై పార్టీ కార్యకర్తలు దాడికి దిగిన షాకింగ్ ఉదంతం డియోరియా ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నాయకుడికి టికెట్ ఇవ్వడంపై ఆమె గళమెత్తడంతో.. మరో వర్గం కార్యకర్తలు ఆమెపై చేయి చేసుకున్నారు. (చదవండి: కొత్తగాలి.. ఆశ – పాత ‘స్వరం’.. ఘోష) ‘లైంగికదాడి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ముకుంద్ భాస్కర్కు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం సరైనది కాదని అభిప్రాయం చెప్పాను. అంతమాత్రానికే అతని అనుచరులు కొందరు నాపై దాడి చేశారు. రౌడీల్లాగా ప్రవర్తించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఆమె నాకు న్యాయం చేస్తుందని భావిస్తున్నా’అని తారా యాదవ్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, తారా యాదవ్పై దాడి ఘటనను బీజేపీ నేతలు ఖండించారు. కాంగ్రెస్లో మహిళలకు గౌరవం లేదని మరోసారి వెల్లడైందని విమర్శించారు. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి విజ్ఞప్తి చేశారు. విచారణ చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మ ట్విటర్లో తెలిపారు. (చదవండి: యోగీ కాచుకో.. ఇదే నా చాలెంజ్!) -
మహిళా నేతపై దాడి
-
రేప్ కేసుల విచారణ 2నెలల్లో..
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో చట్ట ప్రకారం రెండు నెలల్లోపు విచారణ పూర్తి చేసి, చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న దారుణాలు, హాథ్రస్ ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఈమేరకు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి మరణ వాంగ్మూలం రికార్డు చేయలేదన్న నెపంతో, మరణవాంగ్మూలాన్ని విస్మరించరాదని కేంద్రం తన మార్గదర్శకాల్లో తేల్చి చెప్పింది. సీఆర్పీసీ ప్రకారం నేరం జరిగిన వెంటనే తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయాల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం జరగదని, కనుక పోలీసులు నేరం జరిగినట్టు ఫిర్యాదు అందిన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. ఒకవేళ నేరం జరిగిన ప్రాంతం సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోనికి రాకపోయినప్పటికీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. పోలీసులకు చట్టాలను గురించి అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఒకవేళ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వాటిని విచారించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించిన మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 173 అత్యాచారం కేసుల్లో విచారణ రెండు నెలల్లో ముగించాలని చెపుతోందని, సీఆర్పీసీ సెక్షన్ 164–ఎ ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలిని ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు గుర్తింపు కలిగిన వైద్యులచే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హోం శాఖ తెలిపింది. సాక్ష్యాల చట్టం–1872 ప్రకారం, చనిపోయిన వ్యక్తి మరణానికి ముందు రాతపూర్వకంగా గానీ, నోటి మాట ద్వారాగానీ ఇచ్చిన వాంగ్మూలాన్ని నిజమని నమ్మితీరాలని, విచారణలో అది తొలిసాక్ష్యమని చెపుతోంది. లైంగిక దాడి సాక్ష్యాల సేకరణ (ఎస్ఏఈసీ) కిట్లను వాడేందుకు పోలీసులకు, ప్రాసిక్యూటర్లకు, వైద్య సిబ్బందికి శిక్షణనిస్తున్నట్టు హోం శాఖ తెలిపింది. విచారణను ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలంది. పదే పదే అత్యాచారాలకు పాల్పడేవారిని గుర్తించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ స్థాయిలోని డేటాబేస్ని వాడుకోవాలని తెలిపింది. అత్యాచార నేరాలను విచారించేందుకు కేంద్రం, కఠినమైన చట్టాలను తీసుకొచ్చినట్లు పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వాలని, నిర్ణీత కాల వ్యవధిలో చార్జ్షీట్ దాఖలయ్యేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
యోగీ కాచుకో.. ఇదే నా చాలెంజ్!
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హథ్రాస్ ఘటనను అడ్డం పెట్టుకుని డబ్బు వసూలు చేస్తున్నారనే సీఎం ఆరోపణలపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. సీఎం యోగి భీమ్ ఆర్మీపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని చంద్రశేఖర్ ట్విటర్లో పేర్కొన్నారు. గౌరవప్రదమైన జీవితానికి కట్టుబడి ఉంటానని అన్నారు. చివరి శ్వాస వరకు తన జాతి బాగుకోసం పనిచేస్తానని, ఖర్చుల భారం కూడా తన జాతి బిడ్డలే భరిస్తారని అన్నారు. అంతేగానీ ఇతరుల వద్ద చేయి చాచమని, బెదిరింపులతో సొమ్ము రాబట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్) 100 కోట్లు కాదు కదా.. లక్ష రూపాయలు వసూలు చేసినట్టు తేలినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుంటానని అన్నారు. భీమ్ ఆర్మీపై చేసిన ఆరోపణలు తప్పని రుజువైతే యోగి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని చంద్రశేఖర్ సవాల్ విసిరారు. హథ్రాస్ ఘటనపై అంతర్జాతీయ సమాజం స్పందించి.. న్యాయం జరగాలి అని కోరితే అనవసర ఆరోపణలు చేస్తున్నారని యోగీపై మండిపడ్డారు. కాగా, అంతర్జాతీయ నిధుల ద్వారా కుల, మత అల్లర్లకు పునాది వేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని సీఎం యోగి భీమ్ ఆర్మీపై పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. భీమ్ ఆర్మీ విదేశాల నుంచి డబ్బు వసూలు చేసిందనేందుకు ఎలాంటి ఆధారలు లేవని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేల్చింది. (చదవండి: దళిత యువతి మృత్యు ఘోషకు భయపడే..) -
హథ్రాస్: 60 మంది పోలీసులు.. 8 సీసీ కెమెరాలు
హథ్రాస్(యూపీ): ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన దళిత యువతి కుటుంబానికి పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆమె ఇంటి వద్ద 60 మంది పోలీసులను మోహరించామని, 8 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని శుక్రవారం వెల్లడించారు. అవసరమైతే గ్రామంలో కంట్రోల్ రూమ్ నెలకొల్పుతామని డీఐజీ శలభ్ మాథూర్ చెప్పారు. బాధిత కుటుంబం భద్రతకు సంబంధించి ఆయన నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలతో అక్కడి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. పరామర్శించేందుకు వస్తున్న వారి వివరాలను నమోదు చేస్తున్నట్లు స్థానిక ఎస్పీ వినీత్ జైస్వాల్ చెప్పారు. (ఆమె మృత్యు ఘోషకు భయపడే..) -
ఆమె మృత్యు ఘోషకు భయపడే..
సాక్షి, న్యూఢిల్లీ : ఒళ్లంతా ఛిద్రమై పక్షం రోజులపాటు ఆస్పత్రిలో అవస్థపడి అశువులు బాసిన 19 ఏళ్ల కూతురును కడసారి నుదిటి మీద ముద్దు పెట్టుకొని కాటికి పంపుదామనుకున్న ఆ కన్న తల్లి కల నెరవేరలేదు. పొంగి పొర్లుకొచ్చే కన్నీటి బిందువులు కనిపించకుండా ముఖాన కొంగు కప్పుకొని ఆఖరి సారి ఆప్యాయంగా ఆ చెంప నిమిరి పంపించాలనుకున్న కుటుంబ సభ్యుల ఆఖరి కోరిక తీరలేదు. అంబులెన్స్లో ఇంటికొచ్చిన మృతదేహాన్ని ఆపండంటూ ఇంటి ముందే గుమిగూడిన జనం అడ్డం పడినా....పట్టించుకోకుండా నేరుగా శ్మశానానికి పంపించి అర్ధరాత్రి దాటాక దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించిన పోలీసులకు ఎన్ని శాపనార్థాలు పెడితే ఏం లాభం...? మృతదేహాన్ని ఇంటి వద్దనే ఉండనిస్తే మరుసటి రోజు పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగే ప్రమాదం ఉందని తెలిసే రాత్రికి రాత్రే దహన సంస్కారాలు జరిపించామని ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ పోలీసులు స్వయంగా కోర్టు ముందే ఒప్పుకున్నారు. వారి చెబుతున్నది అబద్ధమని, నలుగురు నిందితులను అత్యాచారం నుంచి తప్పించేందుకు ‘రేప్ జరగలేదు’ అంటూ ఫోరెన్సిక్ నివేదిక తీసుకున్న పోలీసులు, మరోసారి అటాప్సీ చేయడానికి ఆస్కారం లేకుండా దేహాన్ని దగ్ధం చేశారని ఇటు కాంగ్రెస్, అటు దళిత పార్టీలతోపాటు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. (మేమిద్దరం ఫ్రెండ్స్.. వాళ్లే చంపేశారు..) ఆలిగఢ్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సెప్టెంబర్ 22వ తేదీన సాక్షాత్తు మేజిస్ట్రేట్ నమోదు చేసిన దళిత యువతి మరణ వాంగ్మూలంలో నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై దాడి జరిగిందని తప్ప రేప్ జరిగిందని ఆ దళిత యువతి ఆరోపించలేదంటూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేసిన వీడియో క్లిప్ ద్వారా కూడా వాస్తవం ఏమిటో తెలుస్తోంది. తనపై నలుగురు యువకులు ‘జబర్దస్థ్’ చేశారని ఆ వీడియోలో దళిత యువతి నాలుగు సార్లు ఆరోపించింది. దారుణంగా రేప్ చేశారని చెప్పడాని యూపీ హిందీ యాసలో ‘జబర్దస్థ్’ అని వాడడం అక్కడ సర్వసాధారణం. అత్యాచారం జరగలేదని ఢిల్లీ ఆస్పత్రి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు. రేప్ జరిగిందని చెప్పడానికి ఆనవాళ్లు లేవని, లైంగికదాడి జరిగిన 15 రోజులకు వైద్య పరీక్షలు జరిపితే అలాంటి ఆనవాళ్లు దొరకవని వైద్య నిపుణులే తేల్చి చెప్పారు. (భయంతో బతకలేం.. ఊరొదిలి పోతాం!) తెల్లారితే మృతదేహం వల్ల పెద్ద ఎత్తున అల్లర్లు, హింస చెలరేగే అవకాశం ఉందని తెలిసే రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేశామంటూ పోలీసులు కోర్టు ముందు చెప్పడంలోనే నిజముందని అనిపిస్తోంది. ఇదే కారణంగా కశ్మీర్లో అనాదిగా మిలిటెంట్ల మృతదేహాలను, భద్రతా బలగాల ఎన్కౌంటర్లలో మరణించిన వారి భౌతికకాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహన సంస్కారాలు జరుపతూ వస్తున్నారు. ఇక టెర్రరిస్టుల విషయంలోనైతే దహనం తర్వాత మిగిలే బూడిదను కూడా ఎవరికి దొరక్కుండా చేస్తున్నారు. దళిత యువతి మరణ వార్త ఇప్పటికే ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించగా, మృతదేహం రూపంలో ఆమె వినిపించే మృత్యుఘోష ఎంత మందిని కదిలిస్తుందో, ఎంత హింసను సృష్టిస్తుందోనన్న పోలీసుల భయంలో నిజం లేదనలేం! (హథ్రాస్ కేసు : గ్రామ పెద్ద సంచలన ఆరోపణలు) -
కొత్తగాలి.. ఆశ – పాత ‘స్వరం’.. ఘోష
కేవలం రాహుల్ గాంధీని నమ్ముకుంటే గట్టెక్కుతామా? ప్రత్యామ్నాయమేమైనా ఉందా? ప్రియాంక గాంధీ నూతన ఆశాజ్యోతి అయ్యేనా? కాంగ్రెస్ శ్రేణుల్ని వెంటాడుతున్న ప్రశ్నలివి. కేంద్రంలో అధికారం చేజారిన తర్వాతి ఆరేళ్లలో పార్టీ పరిస్థితి రాజకీయంగా ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టు తయారయింది. సంస్థాగతం, ప్రజా దరణ... ఎలా చూసినా ఎదుగుదల లేదు. ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి జారిపోతున్నట్టుంది. సుస్థిర, ఆధారపడదగ్గ నాయకత్వ లేమి పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక విధానాల్ని వెల్లడించలేకపోవడమూ లోపమే! దేశవ్యాప్తంగా తాము, తమ కూటమి (యుపీఏ) ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అని ఎక్కడికక్కడ ఉనికి చాటుకునేందుకే పోరాడాల్సి వస్తోంది. ఒకటొకటిగా రాష్టాలన్నీ ‘చే’జారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్ పంజాబ్ రైతులతో ‘ఖేతీ బచావ్’ట్రాక్టర్ ర్యాలీలు, సోదరి ప్రియాంకతో కలిసి ఉత్తర్ ప్రదేశ్లో జరిపిన ‘హథ్రాస్ పర్యటన’ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపాయని అధినాయకత్వం భావిస్తోంది. ‘పోరాడొచ్చు, మరీ చేతు లెత్తేయాల్సిన దుస్థితిలేదు’ అన్న కొత్త నమ్మకం శ్రేణుల్లో కలుగు తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. అందుకే, నాయకత్వం క్షేత్రస్థాయి నుంచి స్పందన సమాచారం (ఫీడ్బ్యాక్) తెప్పించుకుం టోంది. రెండు పరిణామాలకు సంబంధించీ... కాంగ్రెస్ నాయక త్వంలో, దాని విధానాలు–అమలులో ద్వైదీభావమున్నట్టు కనిపి స్తోంది. సొంత వైఖరిని గట్టిగా సమర్థించుకోలేని స్థితి, గతానికి జవా బుదారుగా నిలువలేని పరిస్థితి! దీన్నొక అవకాశంగా మలుచుకుంటూ పాలక బేజీపీ కాంగ్రెస్ను ఎండగట్టే పనిలోపడింది. అధికారంలో ఉంటే ఒక పంథా, విపక్షంలో ఉంటే మరో వైఖరా? అని ప్రశ్నిస్తు న్నాయి. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఇస్తామనే వాళ్లు ఏకరీతి వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని నిలదీస్తున్నాయి. ఇదివరకటి విధానాల నుంచి దారిమళ్లుతున్నపుడు సంజాయిషీ ఇవ్వాలంటున్నాయి. అందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా ఉందా? అనే ప్రశ్న కాంగ్రె‹స్కు ఇంటా బయటా ఎదురౌ తోంది. (చదవండి: ‘ఎవరికీ భయపడం.. న్యాయం తప్ప ఇంకేమీ వద్దు’) వాటన్నింటికన్నా ముందు సంస్థాగతంగా పార్టీ బలోపేత మవ్వాలి, బలమైన నాయకత్వాన్ని సుస్థిరపరచుకోవాలి, అందుకు నాయకత్వం ఏం చేస్తోందనే ప్రశ్న పార్టీ అన్ని స్థాయిల నుంచీ వస్తోంది. ఇదే విషయమై 23 మంది సీనియర్లు పార్టీ అధినేత్రికే లేఖ రాసి, ఇటీవలి వర్కింగ్ కమిటీ (సీడబ్లు్యసీ) భేటీలోనూ లేవనెత్తారు. ఆ అంశాలకు తామింకా కట్టుబడే ఉన్నట్టు వారిలో ఒకరైన మనీష్ తివారీ తాజాగా ఒక ఇంటర్వూ్యలో ప్రకటించారు. వీటికి సంతృప్తికర సమా ధానాలిచ్చి, శ్రేణుల్లో నైతిక స్థయిర్యం నింపితే తప్ప ముందుకు కదల లేని స్థితిలో నాయకత్వం సతమతమౌతోంది. అన్నీ, అంతటా చేయగలరా? ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది. అలాంటి చట్టాల్ని తీసుకు వస్తామని లోగడ తమ ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్, భిన్న వైఖరితో ఇప్పుడు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోం దని పాలకపక్షం చేసే విమర్శకు వారివద్ద సమాధానం లేదు. కాంగ్రెస్ లోగడ ఆర్జేడీతో కలిసి మహాకూటమిగా గెలుపొందిన బిహార్లో ప్రయివేట్ మండీ వ్యవస్థ అమలౌతోంది. ఇప్పుడు తామధికారంలో ఉన్న రాజస్తాన్లోనూ వ్యవసాయోత్పత్తులకు ప్రయివేటు మార్కెట్ వ్యవస్థ ఉంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్) అక్కడ వాటిని రద్దు చేసి, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థల్ని పటిష్టపరుస్తూ, మద్దతు ధర లభిం చేలా చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగలదా? అన్న ప్రశ్నకు స్పందిం చాలి. కొత్త చట్టాలతో తమకు దక్కకుండా పోతాయేమోనని పంజా బ్లో రైతాంగం ఆందోళన చెందుతున్న మద్దతు ధర, ప్రభుత్వ పక్కా మార్కెటింగ్ వ్యవస్థల్ని దేశవ్యాప్తంగా ఏకరీతిన అమలు చేస్తామని ప్రకటిస్తే తప్ప రైతాంగం కాంగ్రెస్ను విశ్వసించదు. కొత్త వ్యవసాయ చట్టాలను తాము అధికారంలోకి వచ్చాక బుట్టదాఖలు చేస్తామని రాహుల్ ప్రకటించారు. హత్రాస్ వంటి దాష్టీకాలు దేశంలోని పలు చోట్ల జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రజలు రకరకాల సమస్య లతో సతమతమవుతున్నారు. వాటన్నిటికి ఇదే స్ఫూర్తితో నాయకత్వం ఎందుకు స్పందించదనే ప్రశ్న తలెత్తుతోంది. ఉత్తరాదిపై చూపే శ్రద్ధ దక్షిణాది రాష్ట్రాలపై చూపరని, ఉత్తరాదిలోనూ శ్రద్ధ ఉత్తరప్రదేశ్పైనే ఉంటుందనే విమర్శ ఉంది. 2022లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలుం డటం, తమ కుటుంబానికి అది రాజకీయ కార్య క్షేత్రం కావడమే కారణమైతే ఈ వివక్ష తగదనే భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. అసలెక్కడ బావుందని? కాంగ్రెస్ పరిస్థితి దేశమంతటా దిగదుడుపుగానే ఉంది. 2004 నుంచి పదేళ్ల పాలన తర్వాత 2014 లోక్సభ ఎన్నికల్లో చరిత్రాత్మక అత్యల్ప సంఖ్య, 44 నమోదు చేసింది. కొత్తగా ఏర్పాటైన నరేంద్రమోదీ నేతృ త్వపు ఎన్డీయే ప్రభుత్వంపై యువనాయకుడు రాహుల్ నేతృత్వంలో పార్టీ అయిదేళ్లు పోరాడి, 2019 ఎన్నికల్లో 8 స్థానాలు మాత్రమే (మొత్తం 52) పెంచుకోగలిగింది. అతి పెద్ద వైఫల్యమిది. దేశంలో విస్తీర్ణపరంగా, రాజకీయంగా కీలకమైన అయిదు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో కలిపి 249 లోక్సభ స్థానాలుంటే కాంగ్రెస్ ప్రాతినిధ్యమున్నది 12 చోట్ల. ఇక్కడే మొత్తం 1462 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్కున్నవి 130 మాత్రమే! ఏపీ, ఢిల్లీ, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్లలో కనీసం ఒక స్థానం కూడా లేదు. సొంతంగా ప్రభుత్వాలున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య దేశంలో 3కు తగ్గిపోయింది. పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ కాకుండా పాలనలో ఉన్న పాండిచ్చేరి సగం రాష్ట్రమైతే, మహారాష్ట్రలో కాంగ్రెస్ సంకీర్ణ భాగస్వామి. కర్ణాటకలో 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను, సంకీర్ణ ప్రభుత్వం ‘చే’జారడాన్ని ఆపలేక పోయింది. అంతకు ముందు గోవా, మణిపూర్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేక చతికిల పడింది. సమర్థనాయకత్వం లేదనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో బలపడు తోంది. రాజకీయాల్లోకి వచ్చి, ఎదగాలనుకునేవారు నాయకత్వంపై నమ్మకం కుదరనపుడు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల్ని వెతుక్కో వడం çసహజం. బీజేపీ తరఫున గెలిచిన 300 పైచిలుకు ఎంపీల్లో కనీసం పది శాతం, అంటే 30 మందిపైనే మాజీ కాంగ్రెస్ నాయకు లున్నారు. గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించి పాలకపక్షం పంచన చేరిన వారిలో లోక్సభ సభ్యులకన్నా శాసన సభ్యులే అధికం. తరాల మధ్య తరగని అంతరాలు ఇంకా గాంధీ–నెహ్రూ కుటుంబాన్ని నమ్ముకుంటే ఓట్లు రాలటం లేదు. కాదని బయటకు నడుద్దామంటే పార్టీ నిలిచే పరిస్థితి లేదు. పార్టీని సమైక్యంగా ఉంచడానికి ఆ కుటుంబంపైనే ఆధారపడాల్సి వస్తోంద న్నది పార్టీ వర్గాల నిశ్చితాభిప్రాయం. నాయకత్వానికి పరిష్కారం తట్టడం లేదు, దానికి వర్కింగ్ కమిటీ భేటీలో రభసే నిదర్శనం. రాహుల్ తన స్థానాన్ని దిటువు చేసుకోకపోవడం ప్రధాన సమస్య. ఒకటిన్నర దశాబ్దాల పరిణామాల్లో సోనియాగాంధీ వృద్ధకోటరీ పాత తరం, రాహుల్ కేంద్రకంగా తయారైన ‘నవతరం’ మధ్య పెనుగులాట సాగుతోంది. ఇందులో మేలైన స్పర్థ కన్నా పొసగనితనమే ఎక్కువ. ఫలితంగా పార్టీకి ఏ మేలూ జరగట్లేదు. ఫలితాలు ఆశాజనకంగా లేవు. పదిహేడేళ్ల కింద పడ్డ ఓ బీజం, ఎదుగుదల సరిగా లేదు. 2003 సిమ్లాలో పార్టీ ‘చింతన్ శిబిర్’ జరుగుతున్నపుడు, సోనియా కోటరీ ప్రధానకార్యదర్శి ఒకరు సర్వే జరిపించారు. పార్టీలో యువతను ప్రోత్స హించాల్సి వస్తే ఎవరైతే బావుంటుంది? అప్పుడు జ్యోతిరాధిత్య సింధియా, సచిన్పైలట్, జితిన్ప్రసాద్, మిలింద్ దేవర, ఆర్పీఎన్ సింగ్ వంటి పేర్లు వచ్చాయి. ఒక ఎమ్మెల్యేను మినహా యించి 2004 ఎన్నికల్లో వారందరికీ పార్టీ టిక్కట్లిచ్చి నాయకత్వం లోక్సభకు తెచ్చింది. అప్పుడే 33 ఏళ్ల రాహుల్ కూడా సభకు వచ్చారు, రాహుల్ యువ బృందం ఏర్పడింది. నిజానికి, మంత్రిపదవి తీసుకొని 2004లో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వంలోనో, తర్వాతి 2009 ప్రభుత్వంలోనో రాహుల్ భాగస్వామి అయుండాల్సిందనే అభిప్రాయం కొందరు ఇప్ప టికీ వ్యక్తం చేస్తారు. కానీ ఆయన పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తారుమారైన పరిస్థితి సంస్థాగత వ్యవహారాల్లో రాహుల్ క్రియాశీల పాత్ర ప్రారంభించారు. చొరవ తీసుకొని రాజస్థాన్ కాంగ్రెస్ పగ్గాలు సచిన్ పైలట్కు, హరి యాణా పీసీసీ పీఠం అశోక్ తన్వర్కు ఇప్పించడంతో కాంగ్రెస్లో నెమ్మదిగా ఇక తరం మారుతోందనుకున్నారు. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వృద్ధ తరం ఆధిపత్యం పుంజుకుంది. వివిధ స్థాయిల్లో నాయకత్వ మార్పిడితో యువతకు పట్టం కట్టాలన్న రాహుల్ ప్రతిపాదనను వారు పొసగనీయలేదు. అధికారంలో లేన పుడు అటువంటివి సత్ఫలితాలివ్వవంటూ మార్పును అడ్డుకున్నారు. బిహార్లో సంకీర్ణ విజయం (2015), పంజాబ్లో సొంత గెలుపు (2017), గుజరాత్లో దాదాపు గెలుపు వాకిట్లోకి రావడం (2017 చివర్లో), ఎంపీ, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ మూడు రాష్ట్రాల్లో విజయాలు (2018) పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. కానీ, వృద్ధతరం ఆధిపత్యం యువతరాన్ని వెనక్కినెట్టి మధ్యప్రదేశ్, రాజస్తాన్లో జ్యోతిరాదిత్య, సచిన్ పైలెట్లు ముఖ్యమంత్రులు కానీకుండా అడ్డు కున్న నాటకం పార్టీకి తగిలిన పెద్ద దెబ్బే! కమల్నాథ్, అశోక్ గెహ్లా ట్లు ముఖ్యమంత్రులయ్యారు కానీ, యువత అసంతృప్తి వల్ల పార్టీ చితికిపోయింది. అసంతృప్తికి గురైన సింధియా తన అనుచర ఎమ్మెల్యే లతో నిష్క్రమించడంతో ఎంపీలో ప్రభుత్వం బీజేపీ పరమైంది. చివరి క్షణం రాజీతో రాజస్తాన్లో చావుతప్పి కన్నులొట్టబోంది. రాహుల్ ‘పప్పు’ అనే ప్రచారాన్ని బీజేపీ తీవ్రం చేసింది. మోదీ–అమిత్షా ద్వయం చేపట్టిన ‘కాంగ్రెస్ విముక్త భారత్’ ఊపందుకుంది. రాహుల్ వ్యవహారశైలి కూడా విమర్శలకు గురైంది. బాధ్యత తీసుకోరని, రిమోట్ పద్ధతిన అధికారం చెలాయింపజూస్తారనేది ముఖ్యారోపణ. అంతటా తన మనుషులుండాలనుకుంటారు, కానీ, అవసర సమ యాల్లో వారికీ అందుబాటులో ఉండరని ఆరోపణ. అందుకు తగ్గట్టు గానే ఒక్క హిమంత్ బిశ్వశర్మను లెక్కజేయనితనంవల్ల నేరుగా ఓడిపోయో, పరోక్ష కారణాలతో సర్కార్లు కూలిపోయో మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని పలుచోట్ల చతికిల పడింది. తెలంగాణ కాంగ్రెస్లో ఇంకా వీడని అయోమయం. ఏపీలో ఇప్పటికీ పార్టీకి నామరూపాల్లేవు. బిహార్లో ఆశాజనక పరిస్థితి లేదు. కేరళలో పుంజుకునే సంకేతాల్లేవు. నాయకత్వలేమి, సమిష్టి తత్వలోపం, విధానాల అస్పష్టత వంటి సమస్యల నుంచి పార్టీ గట్టెక్కితే గాని బీజేపీ సంకీర్ణానికి కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వలేదు. ట్రాక్టర్ ర్యాలీ, హాథ్రస్ పర్యటన కొత్త స్ఫూర్తి అనుకుంటే... ప్రయాణం ఇప్పుడిప్పుడే తిరిగి మొదలైనట్టు భావించాలి. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
కట్టుకథ; ఆడియో రికార్డులు బయటపెట్టండి!
లక్నో: ‘‘ఇప్పటికే మా కూతురిని కోల్పోయాం. ఇప్పుడేమో మమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మేం ఎవరికీ భయపడం. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలే. మాకు ఎటువంటి నష్టపరిహారం గానీ, డబ్బు గానీ వద్దు. కేవలం న్యాయం మాత్రమే కావాలి. అంతకుమించి ఇంకేమీ ఆశించడం లేదు’’అంటూ హథ్రాస్ సామూహిక అత్యాచారం, హత్య ఘటన బాధితురాలి తండ్రి జాతీయ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన తన కూతురిపై నిందలు వేయవద్దని, తమ కుటుంబం గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో 19 ఏళ్ల దళిత యువతి హత్యోదంతం కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్ బాధితురాలి తల్లి, సోదరులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం విదితమే. (చదవండి: మా స్నేహం నచ్చక వాళ్లే చంపేశారు: సందీప్ ఠాకూర్) ఈ కేసులో తనతో పాటు జైలులో ఉన్న మరో ముగ్గురు నిందితులతో కలిసి హథ్రాస్ ఎస్పీకి లేఖ రాసిన అతడు.. యువతి కుటుంబ సభ్యులే ఆమెను తీవ్రంగా కొట్టి మృతికి కారణమయ్యారని ఆరోపించాడు. బాధితురాలు తనతో స్నేహం చేయడం నచ్చకే, ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, తాము అమాయకులమని లేఖలో రాసుకొచ్చాడు. అదే విధంగా భూల్గరీ గ్రామ పెద్ద సైతం ఇదే తరహా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై స్పందించిన బాధితురాలి తండ్రి.. దయచేసి తమ కుటుంబం గురించి వదంతులు వ్యాప్తి చేయవద్దంటూ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. కట్టుకథలు అల్లుతున్నారు..: ప్రియాంక గాంధీ హథ్రాస్ బాధితురాలిపై వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. ‘‘కట్టుకథలు అల్లి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా వ్యవహరిస్తున్నారు. నేరం చేసినవాళ్లకు మద్దతు పలుకుతూ బాధితురాలినే ఘటనకు బాధ్యురాలిని చేయడం అమానుషం’’అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మహిళకు కావాల్సింది న్యాయమని, ఆమెపై నిందలు వేయడం సరకాదంటూ హితవు పలికారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆడియో రికార్డులు బయటపెట్టండి ఇక ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది. ఘటనపై లోతుగా విచారణ చేపట్టిన సిట్, బాధితురాలి సోదరుడు, ప్రధాన నిందితుడికి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు కాల్డేటా లభించిందన్న వార్తల నేపథ్యంలో, ముగ్గురు సభ్యుల బృందం అతడిని ప్రశ్నించింది. ఈ విషయంపై స్పందించిన బాధితురాలి సోదరుడు.. ‘‘వాళ్లతో మాకు కాంటక్ట్ లేదు. మా ఇంట్లో ఒకే ఒక్క ఫోన్ ఉంది. ఒకవేళ నిజంగానే పోలీసుల దగ్గర ఆడియో కాల్స్ రికార్డింగ్ ఉంటే వాటిని బయటపెట్టాలి’’అని డిమాండ్ చేశాడు. కాగా ఆది నుంచి ఈ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. -
‘మోదీ, యోగిల తలలు నరుకుతాను’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీల శిరచ్ఛేదనం చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అంతేకాక జనాలు అభినందనలు తెలుపుతూ.. చప్పట్లు కొడుతూ అతడి వ్యాఖ్యలను స్వాగతించారు. వివరాలు.. రాష్ట్రీయ్ లోక్దళ్ నాయకుడు జయంత్ చౌదరి హథ్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అతడిపై లాఠీ చార్జీ చేశారు. ఇందుకు వ్యతిరేకంగా మీరట్, ముజఫర్ నగర్, బాగ్పట్, బులంద్షహర్ అలీగఢ్, బిజ్నోర్ జిల్లాల్లో భారీ నిరసనలు జరిగాయి. అలానే ముజఫర్ నగర్లో మహాపంచాయత్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సభను ఉద్దేశించి ప్రసంగించాడు. ‘మనందరం ఏకం కావాలి. పీఎం మోదీ, సీఎం యోగిల తలలు నరికి మీ పాదాల చెంత పడేయాలనుకుంటున్నాను’ అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాలు అతడి వ్యాఖ్యలను స్వాగతిస్తూ చప్పట్లతో అభినందించారు. దాంతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.(చదవండి: భయంగా ఉంది.. వెళ్లిపోతాం!) Threat to PM CM. Behead them. This all happening before the muzzafarnagar panchayat at Baghpat pic.twitter.com/UnxRdI2ff1 — Anil Tiwari (@Interceptors) October 8, 2020 హథ్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి వెళుతున్న తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జీ చేసినందుకు నిరసనగా రాష్ట్రీయ లోక్దళ్ కార్యకర్తలు మధుర సమీపంలోని నౌహిల్ బజ్నా-అలీఘర్ రహదారిపై ట్రాఫిక్ను అడ్డుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మలను కూడా ఆర్ఎల్డి కార్మికులు తగలబెట్టారు.