hero
-
బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్
-
ఖండాలు దాటిన హీరో ప్రభాస్ క్రేజ్.. ఆయన పేరుతో ఊరు కూడానా? (ఫోటోలు)
-
వామ్మో ఇదేం బిజినెస్? విలన్ కావాలా..!
‘ఎవరినైనా బెదిరించాలన్నా, గుండాయిజం, రౌడీయిజం వంటి విలనీ పనులు చేయాలన్నా సంప్రదించండి ‘విలన్ ఫర్ హైర్’. విలన్ను చావగొట్టి మీ గర్ల్ఫ్రెండ్ దగ్గర హీరోయిజం ప్రదర్శించాలనుకుంటున్నారా? ‘విలన్ ఫర్ హైర్’ను సంప్రదిస్తే, సులువుగా మీ కోరిక తీరిపోతుంది. మలేసియాలో ఈ సేవలు అందిస్తున్న షజాలీ సులేమాన్కు తగిన రుసుము చెల్లిస్తే, మీకోసం అతగాడు విలన్లా నటిస్తాడు. మీ గర్ల్ఫ్రెండ్ మీతో ఉన్నప్పుడు హఠాత్తుగా వచ్చి, ఆమెను అల్లరిపెడతాడు. అప్పుడు మీరు హీరోలా అతడితో కలబడి, అతడిని తరిమికొట్టి మీ గర్ల్ఫ్రెండ్ దృష్టిలో హీరోగా ఫోజు కొట్టవచ్చు. సులేమాన్ మరికొన్ని సేవలు కూడా అందిస్తున్నాడు. బెదిరించి తగాదాలను పరిష్కరించడం, సోషల్ మీడియాలోను, సమాజంలోను ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను తీర్చడం వంటి పనులను ‘విలన్’లా ప్రవేశించి ఇట్టే పూర్తిచేస్తాడు. ఈ పనులకు అతడు వసూలు చేసే మొత్తం పనిదినాల్లోనైతే, రూ.1,975, వీకెండ్స్లోనైతే రూ. 2,963 మాత్రమే! ఇతడి వ్యాపారం రోజురోజుకూ బ్రహ్మాండంగా సాగుతోంది. (చదవండి: జనరల్ మోటార్స్ డైట్..! దెబ్బకు బరువు మాయం..) -
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కార్తీ (ఫోటోలు)
-
భార్య, కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్ (ఫోటోలు)
-
హీరో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
రెండో పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన నటుడు సాయికిరణ్ (ఫోటోలు)
-
Game Changer Pre Release Event : హీరో రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..
హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకీ, యమహా.. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ కంపెనీలదే రాజ్యం. మారుమూల పల్లెల్లోనూ ఈ బ్రాండ్ల వాహనాలే దర్శనమిస్తాయి. సువిశాల భారతావని అంతటా ఇవి తమ నెట్వర్క్ను దశాబ్దాలుగా పెంచుకున్నాయి. విక్రయ శాలలే కాదు సర్వీసింగ్ను కూడా కస్టమర్లకు చేరువ చేశాయి. మాస్ మార్కెట్ను పూర్తిగా ఇవి చేతుల్లోకి తీసుకున్నాయంటే ఆశ్చర్యంవేయక మానదు.- హైదరాబాద్, బిజినెస్ బ్యూరోఇంత బలమున్న ఈ దిగ్గజాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోనూ పాగా వేస్తాయనడంలో సందేహం లేదు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బజాజ్, టీవీఎస్ తమ సత్తా చాటుతున్నాయి. హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా వేగం పెంచి నవంబర్లో టాప్–5 స్థానానికి ఎగబాకింది. పెద్ద కంపెనీలే ఈ–టూవీలర్స్లోనూ అడ్డా వేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈ–టూవీలర్స్ పరిశ్రమ ఈ ఏడాది నవంబర్ 11 నాటికే 10,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది. మళ్లీ హమారా బజాజ్.. 2024 డిసెంబర్ తొలి వారంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో టాప్–4 కంపెనీల వాటా ఏకంగా 82 శాతం ఉందంటే భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 18 శాతం వాటా కోసం దేశవ్యాప్తంగా 200లకుపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. భారత స్కూటర్స్ మార్కెట్లో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన బజాజ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ చేతక్ రూపంలో స్కూటర్స్ విభాగంలోకి రీఎంట్రీ ఇచ్చి హమారా బజాజ్ అనిపించుకుంటోంది.డిసెంబర్ తొలివారంలో బజాజ్ 4,988 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3,964 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఓలా 3,351, ఏథర్ ఎనర్జీ 2,523 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓలా అమ్మకాలు అక్టోబర్లో 41,775 యూనిట్ల నుంచి నవంబర్లో 29,191 యూనిట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వాహనాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం. పెద్ద కంపెనీల మధ్యే పోటీ.. తదుపరితరం చేతక్ను డిసెంబర్ 20న ప్రవేశపెట్టేందుకు బజాజ్ రెడీ అయింది. 2019–20లో కేవలం 212 యూనిట్లు విక్రయించిన బజాజ్.. 2020–21లో 1,395 యూనిట్లు, ఆ తర్వాతి ఏడాది 8,187, 2022–23లో 36,260 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లను సాధించింది. 2024–25 ఏప్రిల్–నవంబర్లో 1,34,167 యూనిట్లు రోడ్డెక్కాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 జనవరిలో 10,465 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఏడాదిలోనే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది.2024 నవంబర్లో ఈ కంపెనీ 26,971 యూనిట్ల అమ్మకాలను దక్కించుకుంది. ఈ నెలలోనే విదా వీ2 మోడల్ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా ఈ–టూవీలర్స్లో పట్టు సాధిస్తోంది. ఈ కంపెనీ 2023 జనవరిలో 157 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరిలో ఈ సంఖ్య 1,495కు చేరుకుంది. నవంబర్లో ఏకంగా 7,309 యూనిట్ల అమ్మకాలను సాధించి టాప్–5 స్థానాన్ని అందుకుంది. క్యూలో మరిన్ని దిగ్గజాలు.. 2025 తొలి త్రైమాసికం నుంచి నేను సైతం అంటూ హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా రెడీ అవుతోంది. యాక్టివా–ఈ, క్యూసీ1 మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. 2025 జనవరి 1 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 పైచిలుకు సేల్స్, సర్వీస్ టచ్పాయింట్స్ ఉన్నాయి.2025లో 1,00,000 యూనిట్ల ఈ–స్కూటర్స్ తయారు చేయాలని లక్ష్యంగా చేసుకుందంటే కంపెనీకి ఉన్న ధీమా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుజుకీ, యమహా ఎంట్రీ ఇస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ సరికొత్త రికార్డుల దశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యమహా ఇప్పటికే హైబ్రిడ్ టూ వీలర్స్ తయారు చేస్తోంది. సుజుకీ నియో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. -
హీరో వరుణ్ తేజ్ మూవీ మట్కా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కోటి రెమ్యూనరేషన్ అందుకున్న ఇండియన్ తొలి హీరో ఎవరు.. ఏ సినిమాకు? (ఫోటోలు)
-
కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల సంస్థ హీరో మోటార్స్ కంపెనీ(హెచ్ఎంసీ) పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను తాజాగా ఉపసంహరించుకుంది. ఐపీవో ద్వారా రూ.900 కోట్లు సమీకరించాలని తొలుత భావించింది. ఇందుకు అనుగుణంగా సెబీకి ఆగస్ట్లో ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయడంతోపాటు.. మరో రూ.400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేసేందుకు ప్రమోటర్లు ఆసక్తి చూపారు. అయితే కారణం వెల్లడించకుండానే ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ఐపీవోలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ.250 కోట్లు, హీరో సైకిల్స్, భాగ్యోదయ్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.75 కోట్లు చొప్పున షేర్లను ఆఫర్ చేయాలని భావించాయి. కంపెనీ ప్రధానంగా ఆటోమోటివ్ దిగ్గజాలకు హైఇంజినీర్డ్ పవర్ట్రయిన్ సొల్యూషన్ల తయారీ, సరఫరాలో ఉంది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుసురక్షా డయాగ్నోస్టిక్ రెడీసమీకృత డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్కు వీలుగా జులైలోనే ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ జులైలో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. వెరసి కంపెనీకి ఐపీవో నిధులు లభించవు. కంపెనీ పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్ సర్వీసులు అందిస్తోంది. -
హాలీవుడ్లో మనోడి సినిమా
కరీంనగర్ అర్బన్: సినిమా.. అదో రంగుల ప్రపంచం. అద్భుతంగా తెరకెక్కిస్తే సందేశమేదైనా చేరువ చేసే సాధనం. ఇక, సినిమా తీయాలంటే సాంకేతిక విభాగం, నటీనటులు, ప్రొడక్షన్, డైరెక్షన్ ఇలా ఎన్నెన్నో.. ఆపై హీరోనే నిర్మాతగా, ఫిల్మ్ మేకర్గా, కథా రచయితగా రాణించాలంటే కఠోర శ్రమ అవసరం. కానీ, అనుకుంటే కానిది ఏదీ లేదని కరీంనగర్ భగత్నగర్లోని శ్రీరామకాలనీకి చెందిన గుండ వెంకట్సాయి నిరూపించాడు. వృత్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రవృత్తి నటనగా ముందుకెళ్తూ నిరంతర శ్రమతో సఫలీకృతుడయ్యాడు. 31 ఏళ్ల వయసులోనే ఏకంగా హాలీవుడ్లో సినిమా నిర్మించి, ట్రైలర్తోనే 28 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించాడు. 11 ఏళ్ల క్రితం అమెరికాకు..వెంకట్సాయి బీటెక్ పూర్తి చేసి, ఎంఎస్ చదివేందుకు 11 ఏళ్ల క్రితం ఆమెరికా వెళ్లాడు. తన భార్య ప్రత్యూషతో కలిసి న్యూజెర్సీలో ఉంటున్నాడు. అతనికి మొదటి నుంచి ఫొటోగ్రఫీ, నటనపై మక్కువ. తల్లిదండ్రులు గుండ సునీత–శ్రీనివాస్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లినా, ఆరంకెల వేతనం వస్తున్నా వెంకట్సాయి ఫొటోగ్రఫీ, నటనను వదలలేదు. హాలీవుడ్లోనే సినిమా తీయాలి.. తెలుగువాడి సత్తా చాటాలన్న ఆలోచనతో విరామ సమయాల్లో వెబ్సిరీస్, ఫొటోగ్రఫీ చేసేవాడు. ‘వద్దంటే వస్తావే ప్రేమ’ 10 ఎపిసోడ్స్ తీసి, ప్రత్యేక గుర్తింపు పొందాడు. బెస్ట్ ఫొటోగ్రాఫర్గా అనేక అవార్డులు పొందాడు. 14 రోజుల్లోనే సినిమా తీశాడు..తప్పు చేసి, పశ్చాత్తపపడే ఇతివృత్తంతో ది డిజర్వింగ్ సినిమా నిర్మించాడు వెంకట్సాయి. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మూవీస్ చూసే అలవాటు ఉండటంతో తదనుగుణ నటీనటులను ఆడిషన్స్ నిర్వహించి, ఎంపిక చేశాడు. అందరూ అమెరికన్లే. గంట పదిహేడు నిమిషాల నిడివి గల ఈ సినిమాను 14 రోజుల్లోనే తీయడం విశేషం. హార్రర్, థ్రిల్లర్, సైకాలజికల్, ఎమోషనల్ సమ్మిళితమైన మూవీ ఇది. సాయిసుకుమార్, అరోరా(డైరెక్టర్), ఇస్మాయిల్, సీమోన్స్టార్లర్, కేసీస్టార్లర్, ప్రియ(మోడల్), మారియంలు సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారని వెంకట్సాయి తెలిపాడు. అక్టోబర్ 1న 128 దేశాల్లో సినిమా విడుదల కానుందని పేర్కొన్నాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డానుది డిజర్వింగ్ సినిమా తీసేందుకు ఐదేళ్లు పట్టింది. కథ రాయడం నుంచి సినిమా పూర్తయ్యే వరకు చాలా కష్టపడ్డాను. టాలీవుడ్లో ఎన్నైనా టేక్లు తీసుకోవచ్చు. హాలీవుడ్లో అలా కాదు.. డబ్బింగ్ ఉండదు. నటులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలి. వాయిదా పడితే మళ్లీ ఏళ్లు పడుతుంది. చిన్నతనంలో తాతయ్య, నాన్న కథలు చెప్పేవారు. ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఇంగ్లిష్వారికి నచ్చేలా మన కథనే కొంత మార్పు చేశా. సినిమా నిర్మాణంలో నా భార్య ప్రత్యూష సహకారం మరువలేను. టీం అంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలో సినిమా చేశాం. తెలుగు వ్యక్తిగా త్వరలోనే టాలీవుడ్లో నటిస్తా. – గుండ వెంకట్సాయి ప్రపంచస్థాయిలో గుర్తింపునా కొడుకు వెంకట్సాయికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎక్కువగా ఇంగ్లిష్ మూవీస్ చూసేవాడు. కెమెరా పట్టుకొని, ఫొటోలు తీస్తూ తన సరదా తీర్చుకునేవాడు. మేము ఏనాడూ తన ఇష్టాలను కాదనలేదు. అమెరికా వెళ్తానంటే పంపించాం. అక్కడ ఉద్యోగం చేసూ్తనే ప్రపంచం మెచ్చే స్థాయిలో సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించలేదు. గ్రేట్రా సాయి. – గుండ శ్రీనివాస్, వెంకట్సాయి తండ్రి -
మంచు మనోజ్- మౌనికల కూతురి అన్నప్రాసన.. అత్త లేకపోతే ఎలా? (ఫోటోలు)
-
హీరోలకు ఏమాత్రం తగ్గని ఫిజిక్.. సంచలనాల సీఈవో..
-
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్యాన్సర్తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
హీరో విజయ్ను కలిసిన రంభ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! (ఫోటోలు)
-
నేరం అంగీకరించిన హీరో దర్శన్ !
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేయించిన కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకొంది. హత్య తర్వాత అభిమాని మృతదేహాన్ని ఎవరి కంట పడకుండా మాయం చేసేందుకు దర్శన్ మరో నిందితుడికి రూ. 30 లక్షలు ఇచ్చినట్లు తేలింది. ఈ నేరాన్ని దర్శన్ అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హత్య కేసులో ఇప్పటికే దర్శన్ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. రేణుకాస్వామి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని మరో నిందితుడైన ప్రదేశ్కు రూ.30లక్షలు ఇచ్చినట్లు దర్శన్ అంగీకరించాడు. దర్శన్ పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
దర్శన్ మేనేజర్ సూసైడ్
బెంగళూరు: రేణుకాస్వామి అనే యువకుడి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం(జూన్ 18) హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.బెంగళూరులోని దర్శన్ ఫామ్హౌస్లోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపారు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ మెసేజ్లు పెట్టినందుకే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించాడని ఆరోపణలున్నాయి. -
Rajasthan: జీరో నుంచి హీరోగా కాంగ్రెస్?
2024 లోక్సభ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్లో ఎన్డీఏ మెజారిటీ మార్కును దాటింది. ఎన్డీఏ 288 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ 240 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఇండియా అలయన్స్ కూడా మంచి ఫలితాలను రాబడుతోంది. మొదటి రెండు గంటల్లో 211 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక్కటే 92+ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ప్రారంభ పోకడలు పలు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీని చూపాయి. ఇందులో రాజస్థాన్ కూడా ఉంది. రాజస్థాన్లోని 25 లోక్సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.రాజస్థాన్ ట్రెండ్స్ చూస్తుంటే భారీ తిరోగమనం కనిపిస్తోంది. బీజేపీకి పెద్ద దెబ్బ తగులుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 25 స్థానాలకు గానూ గతసారి బీజేపీ 24 సీట్లు గెలుచుకుంది. నాడు కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే ఈసారి కాంగ్రెస్ ఊహించని రీతిలో దూసుకుపోతూ తొలి ట్రెండ్స్లో బీజేపీ కంటే ముందుంది.గతంలో మోదీ హవాతో రాజస్థాన్లో కాంగ్రెస్ దెబ్బతింది. 2014లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. 2019లో 34.22 శాతం ఓట్లు సాధించింది. అయితే ఈసారి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. ప్రారంభ ట్రెండ్స్ను పరిశీలిస్తే రాజ్సమంద్, జైపూర్, పాలి, అల్వార్ స్థానాలలో బీజేపీ ముందుంది. కరౌలి, బార్మర్, జైపూర్ రూరల్, సవాయ్ మాధోపూర్, టోంక్, భరత్పూర్ తదితర స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. -
ప్రముఖ ఫైనాన్స్ కంపెనీపై ఆర్బీఐ చర్యలు
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. రూ.3.1 లక్షల జరిమానా విధించింది.ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ కు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో హీరో ఫిన్ కార్ప్ విఫలం కావడంతో ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. హీరో ఫిన్ కార్ప్ తన కస్టమర్లతో చేసుకున్న ఒప్పందాల చట్టబద్ధతను ఈ పెనాల్టీ ప్రశ్నించదని, రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించడంలో లోపాలను ఎత్తిచూపుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.2023 మార్చి 31 నాటికి హీరో ఫిన్కార్ప్ ఆర్థిక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్బీఐ.. తమ ఆదేశాలను పాటించడంలో కంపెనీ విఫలమైనట్లు నిర్దారించి హీరో ఫిన్ కార్ప్ కు నోటీసులు పంపి, ఈ లోపాలకు ఎందుకు జరిమానా విధించకూడదో వివరించాలని కోరింది. దీనికి హీరో ఫిన్ కార్ప్ రాతపూర్వక, మౌఖికంగా ఇచ్చిన స్పందనను, అదనపు సమాచారాన్ని ఆర్బీఐ సమీక్షించి జరిమానా విధించింది. -
జోడీ రిటర్న్స్
కొన్ని జంటలు ‘హిట్’ అవుతాయి. వెండితెరపై హిట్ అయిన ఆ జోడీలను మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మళ్లీ ఆ జోడీకి తగ్గ కథ కుదరాలి, కథ కుదిరితే ఇద్దరి డేట్స్ సెట్ అవ్వాలి. ఈ రెండూ సెట్ అయి, వెంటనే రిపీట్ అయిన జోడీలు ఉంటాయి.. ఎన్నో ఏళ్లకు గానీ రిపీట్ అయ్యే జోడీలూ ఉంటాయి. అలా కొన్నేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం.విశ్వంభర పిలిచాడు దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత హీరో హీరోయిన్లుగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చిరంజీవి, త్రిష. ఈ ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘స్టాలిన్’ 2006లో విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, సిస్టర్ సెంటిమెంట్తో పాటు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఈ కథలో ఉంటాయని ఫిల్మ్నగర్ సమాచారం.ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ షెడ్యూల్లో ఇంట్రవెల్ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించారు. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త. షష్ఠిపూర్తి సంబరం రాజేంద్రప్రసాద్–అర్చన కలిసి నటించిన ‘లేడీస్ టైలర్’ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 1986లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన కలిసి మళ్లీ వెంటనే మరో సినిమా చేయలేదు. 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘షష్ఠిపూర్తి’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ లీడ్ రోల్స్లో, ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, శకుంతల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ కుటుంబకథా చిత్రానికి ఇళయరాజా స్వరకర్త. అప్పటి ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాయే ఈ ‘షష్ఠిపూర్తి’ సినిమాకూ స్వరాలు సమకూర్చడం విశేషం. కుటుంబ విలువలు, కుటుంబ సభ్యుల అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపేష్ నిర్మిస్తున్నారు. తెరపై యాభైఆరోసారి... మలయాళ సిల్వర్ స్క్రీన్పై మోహన్లాల్, శోభనల జోడీ సూపర్ హిట్. ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ (1985) సినిమా కోసం తొలిసారి మోహన్లాల్, శోభన జత కట్టారు. ఆ తర్వాత ‘మణిచిత్ర తాళు’, ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ సినిమాలతో పాటు యాభైసార్లకు పైగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు మోహన్లాల్, శోభన. అయితే 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ తర్వాత మరోసారి మోహన్లాల్, శోభన కలిసి లీడ్ రోల్స్లో నటించలేదు.ప్రస్తుతం మోహన్లాల్ హీరోగా నటించనున్న 360వ చిత్రంలో శోభన ఓ లీడ్ రోల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది మోహన్లాల్, శోభన కలిసి నటిస్తున్న 56వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో మోహన్లాల్కు జోడీగా కనిపిస్తారట శోభన. తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో మోహన్లాల్ టాక్సీ డ్రైవర్గా కనిపిస్తారని టాక్. ఈ ఏడాది ఓనమ్కు సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. పెళ్లి తర్వాత తొలి సినిమా? దాదాపు పాతికేళ్ల క్రితం తమిళ చిత్రం ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ (1999)లో తొలిసారి సిల్వర్ స్క్రీన్పై జోడీగా కనిపించారు సూర్య, జ్యోతిక. ఆ తర్వాత ‘ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కక్క, మాయావి’ వంటి సినిమాల్లో సూర్య, జ్యోతిక హిట్ జోడీ అనిపించు కున్నారు. చివరిసారిగా 2006లో ‘సిల్లున్ను ఒరు కాదల్’ సినిమాలో సూర్య–జ్యోతిక జోడీగా కనిపించారు.ఈ సినిమా విడుదలైన తర్వాత సూర్య, జ్యోతిక రియల్ లైఫ్ జోడీ కూడా అయ్యారు. అయితే ‘సిల్లున్ను ఒరు కాదల్’ తర్వాత సూర్య, జ్యోతిక కలిసి సినిమా చేయలేదు. పద్దెనిమిదేళ్ల తర్వాత ఆ సమయం ఆసన్నమైందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ‘కేరళ కేఫ్’, ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అంజలీ మీనన్ ఓ కథ సిద్ధం చేశారని, ఈ కథతో తెరకెక్కనున్న సినిమాలో సూర్య, జ్యోతిక జోడీగా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలిసి నటించే చిత్రం ఇదే అవుతుంది. ఇంకా మరికొందరి హీరో హీరోయిన్ జోడీలు రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. -
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
అల్లు అర్జున్తో ఛాన్స్.. నో చెప్పిన తెలుగు హీరో ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే పేద మహిళా డ్రైవర్కు కొత్త ఆటో బహుమతిగా అందించారు. తనవంతు సాయంగా సమాజ సేవలో భాగంగా తాజాగా వికలాంగులకు బైక్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులు, అనాథ బాలల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లారెన్స్. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన 13 ద్విచక్ర వాహనాలు అందజేశారు. అంతే కాకుండా వారికి ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. త్వరలోనే వారికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని లారెన్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం రాఘవ చేస్తున్న సేవలను కొనియాడారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఎంట్రీ ఇచ్చిన రాఘవ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చంద్రముఖి-2, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాలతో అలరించిన రాఘవ.. ప్రస్తుతం దుర్గ అనే చిత్రంలో నటిస్తున్నారు. Hatsoff @offl_Lawrence Sir தமிழர் பாரம்பரிய மல்லர் கலையில் கலக்கி வரும் #கை_கொடுக்கும்_கை மாற்றுத்திறனாளி குழுவினர் ஒவ்வொருவருக்கும் இரண்டு சக்கர வாகனம் பரிசளித்தார் மாஸ்டர் #ராகவா_லாரன்ஸ் .#RaghavaLawrence pic.twitter.com/879dQ28jLO — Actor Kayal Devaraj (@kayaldevaraj) April 18, 2024 Service is god 🙏🏼 pic.twitter.com/UBZXYFIDMQ — Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2024 -
సుహాస్ మూవీతో 'నువ్వు నేను' హీరోయిన్ రీ ఎంట్రీ (ఫోటోలు)
-
క్రేజ్ కాపాడుకోలేకపోయాడు.. ఆ తప్పు వల్ల కెరీర్, జీవితం సర్వనాశనం!
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగేవాళ్లు చాలామందే కనిపిస్తారు. నిజంగానే ఒక్క ఛాన్స్తో అద్భుతాలు జరిగిపోతాయా? అంటే అవుననే చెప్పాలి. ఎంతోమంది తొలి సినిమాతోనే తామేంటో ప్రూవ్ చేసుకుని గొప్ప స్థాయికి ఎదిగారు. అదే సమయంలో ఫస్ట్ సినిమాతో క్రేజ్ అందుకున్నా తర్వాతి రోజుల్లో దాన్ని కాపాడుకోలేక మరుగునపడ్డ హీరోలూ ఉన్నారు. ప్రేమికుల రోజు సినిమా హీరో కునాల్ సింగ్ ఈ కోవలోకే వస్తాడు. ఆయన గురించే నేటి ప్రత్యేక కథనం.. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ కునాల్ సింగ్ నటించిన తొలి సినిమా కాదల్ దినం. ఈ మూవీ తెలుగులో ప్రేమికుల రోజు పేరిట డబ్ అయింది. ఇందులో సోనాలి బింద్రే హీరోయిన్గా యాక్ట్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. వాలు కనులదానా, ప్రేమ అనే పరీక్ష రాసి.. , దాండియా ఆటలు ఆడ.. ఇలా అన్ని పాటలు బ్లాక్బస్టర్ హిట్టయ్యాయి. సినిమా కూడా సూపర్ హిట్టయింది. ఇంకేముంది.. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక్కడే తప్పటడుగులు వేశాడు. హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువగా అందుకున్నాడు. అతడు సంతకం చేసిన సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. (చదవండి: Vithika Sheru: మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. వితికా ఎమోషనల్ పోస్ట్) భార్య ఉండగా నటితో క్లోజ్.. మరికొన్ని షూటింగ్ జరిగినా విడుదలకు నోచుకోలేదు. ఐదేళ్లలోనే డీలా పడిపోయాడు. 2007లో చివరగా నంబనిన్ కాదలై అనే సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్టర్గా రాణించడం కష్టమని తెలియగానే అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తాడు. తర్వాత నిర్మాతగానూ మారాడు. అయతే కునాల్, నటి లావిణ పంకజ్ భాటియా అత్యంత సన్నిహితంగా మెదిలేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటికే అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి ప్రేమ విషయం కునాల్ భార్య అనురాధకు తెలిసింది. దీని గురించి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవట! ప్రాణాలు తీసుకున్నాడు ఆమె కోపంతో ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్లిపోవడంతో కునాల్ మనస్తాపానికి గురయ్యాడు. 2008 ఫిబ్రవరి 7న తన అపార్ట్మెంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఇది జరగడానికి కొన్ని గంటల ముందు ఏదో సినిమా గురించి స్క్రిప్ట్ రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, నటి పంకజ్తో తన ఇంట్లోనే చర్చలు జరిపాడు. అందరూ వెళ్లిపోయాక పంకజ్ అక్కడే ఉన్న వాష్రూమ్ను వాడుకుందామని వెళ్లి వచ్చింది. అంతలోనే కునాల్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఏమీ మిగల్లేదు అయితే పంకజ్కు, కునాల్కు మధ్య ఏదో గొడవ జరిగిందని, ఆ ఆవేశంలోనే హీరో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న పుకార్లు కూడా వచ్చాయి. ఈ కేసులో పోలీసులు పంకజ్ భాటియాను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ ఇది ఆత్మహత్యే అని నిర్ధారించారు. అంతకుముందు కూడా కునాల్ ఒకటీరెండు సార్లు చనిపోయేందుకు ప్రయత్నించాడట! ఒకవైపు కెరీర్ నాశనమైంది.. మరోవైపు సంసార జీవితం కూడా సవ్యంగా లేదు.. వీటికి తోడు నిర్మాతగా అప్పులపాలు అవడంతోనే అతడు తనువు చాలించాడని చెప్తుంటారు. ఏదేమైనా 31 ఏళ్ల వయసులోనే అతడు ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేసింది. చదవండి: తనకెందుకు క్రెడిట్? అని ఆటిట్యూడ్ చూపించా.. తర్వాతి సినిమాల్లో నాకు ఛాన్స్ ఇవ్వలే! -
స్టార్ హీరోయిన్లతో సినిమాలు.. ఇప్పుడేమో ఖరీదైన కారును అమ్మేసి!
సినిమా రంగం అంటేనే కలల ప్రపంచం. ఇక్కడ స్టార్డమ్ అనేది అంత ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన టాలెంట్పై ఆధారపడి ఉంటుంది. అలా ఒక్క సినిమాతో మెరిసి.. ఇలా వచ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్గా వెలుగొందిన హీరోలకు సైతం అవకాశాలు రాక ఇబ్బందులు పడినా సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ముందువరుసలో ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్.. జానే తూ.. య జానేనా అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేశారు. చివరిసారిగా కంగనాతో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. అంతే కాదు స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు కూడా. 2015లో విడుదలైన చివరిసారిగా కట్టి బట్టీలో కనిపించిన ఇమ్రాన్ ఖాన్ అప్పటి నుంచి దాదాపు సినిమాల్లో కనిపించలేదు. అతను సినిమాలకు దూరమై దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు మానేశాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం తన కూతురు కోసమే సమయం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?) ఖరీదైన కారు అమ్మేసి..సింపుల్గా సినిమాలు చేసే సమయంలో ఫుల్ లగ్జరీ లైఫ్ను అనుభవించిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో తాను వినియోగించిన ఖరీదైన ఫెరారీ కారును సైతం అమ్మేశారు. ప్రస్తుతం వోక్స్ వాగన్ కారును ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలోని పాలి హిల్లోని లగ్జరీ బంగ్లా నుంచి బయటకొచ్చారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఓ చిన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'నేను ఇటీవలే తండ్రిని అయ్యా. ఈ సమయం నాకు చాలా విలువైనది. నా కూతురు ఇమారా కోసం నేను సమయం కేటాయించాలని కోరుకుంటున్నా. ఇకపై నటుడిగా ఉండటం నా పని కాదని నిర్ణయించుకున్నా. నేను నన్ను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. నా కుమార్తె, నా ఫ్యామిలీతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా' అని తెలిపారు. అయితే కంగనాతో చేసిన కట్టి బట్టీ ఫ్లాప్ అయిన తర్వాత తనకు అవకాశాలు రాలేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ అప్పటికే ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే 30 ఏళ్లు వచ్చేసరికి డబ్బుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాలేదని వెల్లడించారు. ప్రస్తుతం కెరీర్ కోసం గతంలో మాదిరి కష్టపడేంత ఉత్సాహం ఇప్పుడు లేదని అన్నారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్ మేరీ బ్రదర్ కీ దుల్హాన్, ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ, ఢిల్లీ బెల్లీ, గోరీ తేరే ప్యార్ మే లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. -
సినిమా రక్తం
‘టప్’మంటూ లైట్ వెలుగుతుంది. ఆగంతకుడు ఛాతీ మీద రక్తంతో నేలకొరిగి ఉంటాడు. హీరోయినో, హీరో చెల్లెలో ‘కెవ్వు’మని నోటికి చెయ్యడ్డం పెట్టుకుంటూ కేక వేసి ‘రక్తం... రక్తం’ అని పరిగెడుతుంది. లేదా స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ చేరుతారు. పోలీసులు వస్తారు. రక్తం బయటకు వస్తే రక్తం బయటకు రావడానికి కారకులను పట్టుకోవాలి. శిక్షించాలి. అది చట్టం. సమాజానికి వహించవలసిన బాధ్యత. అక్కడి నుంచి సినిమా కథంతా నడుస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో రక్తం నల్లగా ఉంటుంది. పైగా కొంచెమే కనిపిస్తుంది. అయినా సరే డైరెక్టర్గాని, సినిమా రచయితగాని, హీరోగాని హంతకుణ్ణి క్లయిమాక్స్లో పోలీసులకు అప్పజెప్పకుండా ఊరుకునేవారు కాదు. హిందీలో ‘దుష్మన్’ అనే సినిమా పెద్ద హిట్. రాజేష్ఖన్నా హీరో. లారీ డ్రైవర్. నిర్లక్ష్యంగా లారీ నడిపి గొడ్లు కాచే వ్యక్తి చావుకు కారణం అవుతాడు. జడ్జిగారు అతణ్ణి జైల్లో మగ్గమని తీర్పు చెప్పకుండా, ఏ వ్యక్తి చావుకైతే కారణమయ్యాడో ఆ వ్యక్తి ఊరికెళ్లి, అతడి పొలం పండించి, పిల్లల, ముసలి తల్లిదండ్రుల బాగోగులు చూడమని ఆదేశిస్తాడు. రాజేష్ ఖన్నా ముందు నిరాకరించినా కాలక్రమంలో పరివర్తన చెందుతాడు. ఊరికి ఇలవేల్పుగా మారి క్షమార్హుడవుతాడు. టైరుకు అంటిన రక్తం ఒక మనిషిని చేర్చాల్సిన గమ్యం అది. ఈ సినిమాను తెలుగులో ‘ఖైదీ బాబాయ్’గా తీస్తే హిట్ అయ్యింది. ఇదే రాజేష్ ఖన్నా ‘రోటీ’లో ఒక వ్యక్తి అకారణ చావుకు కారణమై పశ్చాత్తాపం చెందడమే కథ. గతంలో అలా ఉండేది. హీరో నేరం చేస్తే పశ్చాత్తాపం చెందేవాడు. ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు. తప్పు దారి పట్టి ఏ దొంగో, స్మగ్లరో, హంతకుడో అయితే క్లయిమాక్స్లో మరణించేవాడు. జైలుకు వెళ్లేవాడు. అట్టి హీరోకు హీరోయిన్ దక్కే అవకాశం లేదు. పోలీస్జీపులో వెళ్లిపోతున్న హీరోని గుడ్ల నీరు కక్కుకుంటూ చూడాల్సిందే. ‘దీవార్’లో అమితాబ్ చచ్చిపోతాడు. ‘ఖైదీ’లో చిరంజీవి జైలుకెళ్లిపోతాడు. ‘మల్లీశ్వరి’, ‘బంగారు పాప’ వంటి క్లాసిక్స్ తీసిన బి.ఎన్.రెడ్డి కాసింత కత్తి యుద్ధాలు వగైరా ఉండే ‘రాజమకుటం’ తీస్తే ‘ఈయనకేం పోయేకాలం వచ్చింది’ అన్నారట ప్రేక్షకులు హిట్ చేస్తూ కూడా! ‘తమరు కూడా రక్తపాతం తీయాలా మహాశయా’ అన్నారట సినిమా మిత్రులు. ఆయన బాధపడి, ఇదేదో చెడ్డపేరు వచ్చేలా ఉందని తర్వాత అలాంటి సినిమాల జోలికి పోలేదు. సృజించబడే కళ, సృజిస్తున్న కళాకారుడు వేరువేరు కాదు అనుకునేవారు పూర్వం. కళాకారుడి వ్యక్తిత్వమే కళ వ్యక్తిత్వంగా జనం గుర్తించే వారు. దర్శకులుగాని, హీరోలుగాని తమ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వస్తే తలవంపులుగా భావించేవారు. ‘ఏ సర్టిఫికెట్ వచ్చిందట’ అనేది పెద్ద వార్త. ఎన్.టి.రామారావు ‘బొబ్బిలిపులి’లో హింస ఎక్కువైందని సెన్సార్ వారు పేచీ పెట్టారు. కారణం హీరోయే దుర్మార్గులను తుదముట్టిస్తున్నాడు. స్వీయకోర్టు నిర్వహిస్తున్నాడు. రక్తపాతం సృష్టిస్తున్నాడు. దాసరి దర్శకత్వం వహించిన ‘తాండ్ర పాపారాయుడు’ చారిత్రక చిత్రమే అయినా, బొబ్బిలి యుద్ధమే కథాంశమైనా రక్తం ఎక్కువ కనిపిస్తున్నదని కొన్ని కట్స్ చెప్పారు. 1990ల ముందు వరకూ రక్తం ఎక్కువ కనిపించరాదనే సెన్సార్ నియమం ఉండేది. అంతెందుకు? చచ్చీ చెడీ ‘షోలే’ సినిమాను తయారు చేసి సెన్సార్కు పంపితే క్లయిమాక్స్లో సంజీవ్ కుమార్ గబ్బర్ సింగ్ను ఎలా చంపుతాడు... సెన్సార్ ఇవ్వం అని గట్టిగా చెప్పారు అధికారులు. దాంతో క్లయిమాక్స్ రీషూట్ చేసి గబ్బర్ను పోలీసులకు అప్పజెప్పడం చూపారు. చెడ్డపాత్రలు ఎంత మందినైనా చంపొచ్చు. మంచిపాత్రలు చంపుతూ పోతే సమాజం ఏం నేర్చుకోవాలి? సమాజం మీద ఏర్పడే ప్రభావం ఎట్టిది? రామ్గోపాల్ వర్మ వచ్చి ‘శివ’ సినిమాతో రక్తపాతాన్ని పెంచాడనే విమర్శలు వచ్చాయి గాని, సినీ హింసలో ‘శివ’ నేడొక చిన్నగీత. కాలం మారింది. ‘మనుషులను చంపుకుంటూ వెళితే ఎవరూ మిగలరు’ అని అంటూనే చాలామందిని చంపుకుంటూ వెళ్లడమే హీరోయిజం అయ్యింది. ‘ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్... వందమందిని పంపు’ అని కత్తికొక కండగా నరుకుతుంటే రక్తం ఎగజిమ్మేకొద్దీ కలెక్షన్లు వచ్చిపడ్డాయి. సినిమా ఒప్పుకున్న హీరో కాస్ట్యూమ్స్తోపాటు డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్లతో కూర్చొని పోస్టర్లో మెరిసే సరికొత్త మారణాయుధాన్ని తయారు చేయించుకుంటున్నాడు. చాలక భారీ మిషన్గన్లను కూడా తయారు చేయించుకుంటున్నాడు. పేలుస్తున్నాడు. హీరో ఇంతమందిని చంపుతున్నా సినిమా పోలీసులు ఏమవుతున్నారో ఎందుకు కానరావడం లేదో వారిపైన ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలో తెలియని అయోమయ స్థితి. రక్తం మనిషికి జీవధార. చాలా ప్రమాదాల్లో, దాడుల్లో మనుషులు చనిపోయేది ప్రమాద తీవ్రత వల్ల కాదు. రక్తం పోయి. రక్తం అందక. ధర్మరాజు రక్తమే కాదు, ఏ అమాయకుడి నెత్తురు నేల మీద పడ్డా... ఆ నేలకు అది శుభసూచకం కాదు. రక్తాన్ని చూసి చలించని, రక్తాన్ని చూడటం అలవాటుగా మారిన సమాజం మానవీయంగా మనజాలదు. ఎన్ని బ్లడ్బ్యాంకులు పెట్టినా చాలనంత రక్తాన్ని ఇవాళ హీరోలు తెరల మీద పారిస్తూ ఉంటే... స్వయంగా కత్తి పట్టి క్రూరంగా గొంతులు కోస్తూ ఉంటే, ఈలలు వేస్తూ గోలలు చేస్తున్న మన ఇంటి పిల్లల్ని మనం ఎలా తయారు చేశామో తల్లిదండ్రులు ఆలోచించాలి. సినిమా అయినా, సాహిత్యమైనా జంతువును మనిషిగా చేయాలి. మనిషిని జంతువుగా కాదు! కమర్షియల్ కళకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును సినిమావారు గుర్తెరిగితే మంచిది. లేదంటే ప్రేక్షకులే ఏదో ఒకనాడు గుర్తు చేస్తారు. ఫస్ట్హాఫ్లో కాకపోతే సెకండ్ హాఫ్లో! ఏ సినిమాకైనా ‘ది ఎండ్’ పడవలసిందే కదా!! -
నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తున్న కొత్త టెక్నాలజీల ఫలితంగా ఉద్యోగ భద్రత పట్ల మెజారిటీ నిపుణుల్లో (82 శాతం మంది) ఆందోళన వ్యక్తమవుతోంది. వేగంగా మార్పు చెందుతున్న పని వాతావరణాన్ని అధిగమించేందుకు నైపుణ్యాల పెంపు సాయపడుతుందని వారు భావిస్తున్నారు. విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు ఇలా రెండు లక్షల మంది అభిప్రాయాలను హీరో వేద్ (హీరో గ్రూప్ కంపెనీ) పరిగణనలోకి తీసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. పని ప్రదేశాల్లో వస్తున్న నూతన మార్పులను, సవాళ్లను అధిగమించడానికి నైపుణ్యాల పెంపు పరిష్కారమని 78 శాతం మంది చెప్పారు. నేటి ఉద్యోగ మార్కెట్లో నిలిచి రాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అధ్యయనం, నైపుణ్యాల పెంపుపై అవగాహన పెరుగుతుందడానికి ఇది నిదర్శనమని హీరో వేద్ సీఈవో అక్షయ్ ముంజాల్ తెలిపారు. ‘‘సుస్థిరత, సామర్థ్యం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు, కంపెనీలు ఒకే విధమైన దీర్ఘకాల దృష్టితో ఉన్నాయి. దీంతో ఈ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది’’అని చెప్పారు. కృత్రిమ మేథ (ఏఐ) విజ్ఞానం కలిగి ఉండడం, తమ కెరీర్లో మెరుగైన అవకాశాలు అందుకోవడానికి కీలకమని 39 శాతం మంది అంగీకరించారు. తమ సంస్థలు ఏఐపై సరైన శిక్షణ అందించడం లేదని 43 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఏఐ విభాగంలో కావాల్సిన నైపుణ్యాలకు, అందిస్తున్న శిక్షణకు మధ్య అంతరాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నివేదిక గుర్తు చేసింది. 18–55 ఏళ్ల మధ్య వయసున్న నిపుణుల్లో 43.5 శాతం మంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అదనపు నైపుణ్యాలు, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. -
Salaar Part 1 : డార్లింగ్ హీరో ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
వాస్తవ సంఘటనలే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకులు
కథలు ఊహల్లో నుంచే కాదు.. వాస్తవ జీవితాల్లో నుంచి కూడా వస్తుంటాయి. ఇలా రియల్గా జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా కొందరు దర్శకులు రాసుకున్న కథలతో కొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. రియల్ టు రీల్గా రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ‘డాన్ శీను (2010)’, ‘బలుపు (2013)’, ‘క్రాక్ (2021)’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో నాలుగో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించనున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇది కంప్లీట్ పీరియాడికల్ ఫిల్మ్ అని, ఆంధ్రప్రదేశ్లో 1991లో జరిగిన ఓ సంచలన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. మరోవైపు రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ కూడా కొన్ని వాస్తవ ఘటనల ప్రేరణతో తెరకెక్కి, హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ► హీరో మహేశ్బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుంది. అయితే ఈ సినిమా కథలోని కొంతభాగం వాస్తవ ఘటనల ఆధారంగా ఉంటుందని ఈ చిత్ర రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ గత ఏడాది అక్టోబరులో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కథను బట్టి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా రాజమౌళి అండ్ కో ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ► శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన దాదాపు 25 మంది మత్స్యకారులు బతుకుతెరువు కోసం గుజరాత్ తీర ప్రాంతంలోని వీరవల్ వద్ద చేపల వేట కొనసాగిస్తూ, 2018 నవంబరులో పోరపాటున పాకిస్తాన్ కోస్ట్గార్డ్ అధికారులకు బందీలుగా చిక్కారు. దాదాపు ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించిన వారి జీవితాల్లోని వాస్తవ ఘటనల సమాహారంగా ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది. ‘ప్రేమమ్ (2016)’, ‘సవ్యసాచి (2018)’ చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబి నేషన్లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఇది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులోప్రారంభం కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా వివాహం జరిగిన కొద్ది కాలానికే, తాను తండ్రి కాబోతున్న సమయంలోనే పాకిస్తాన్లో ఖైదు కాబడిన శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నట్లుగా తెలిసింది. వచ్చే ఏడాది చివర్లో ‘తండేల్’ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త. ► ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా వరుణ్ తేజ్ నటించిన దేశభక్తి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. హిందీ, తెలుగు భాషల్లో రూపోందిన ఈ ద్విభాషా చిత్రంతో శక్తీ ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో మానుషీ చిల్లర్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వరుణ్ తేజ్ హిందీకి పరిచయం అవుతున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చోటు చేసుకున్న కొన్ని వైమానిక దాడుల వాస్తవ ఘటనల సమాహారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ్రపోడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. తొలుత ఈ సినిమాను డిసెంబరు 8న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని, వచ్చే ఏడాదిప్రారంభంలో విడుదల చేసే ఆలోచన ఉందని యూనిట్ వెల్లడించింది. ► సుధీర్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరోం హర: ది రివోల్ట్’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రధారి. కాస్త రివెంజ్ టచ్ ఉన్న ఈ సినిమా 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 22న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ తేదీకి ప్రభాస్ ‘సలార్’ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో ‘హరోం హర’ చిత్రం విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ► శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా రూపోందిన హారర్ ఫిల్మ్ ‘పిండం’. ఖుషీ రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ఇతర ప్రధాన పాత్రలుపోషించారు. ఓ నిజజీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, చిత్రీకరణ సమయంలో కొన్ని ఘటనలు జరగడంతో కాస్త భయంగానే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ చిత్రదర్శకుడు సాయికిరణ్ దైదా చెబుతున్నారు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 15న విడుదల కానుంది. 1930, 1990.. ప్రస్తుతం.. ఇలా మూడు కాలాలతో ‘పిండం’ స్క్రీన్ ప్లే ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇలా వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుని, ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి. -
హీరోగా బిగ్బాస్ ఫేమ్.. షూటింగ్ ప్రారంభం!
బిగ్బాస్ రియాల్టీ గేమ్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్న సిబీ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సిబీ ఇంతకుముందే వంజగర్ ఉలగం, మాస్టర్ తదితర చిత్రాల్లో నటించారు. నటి ఖుషితా కల్లప్పు హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పరుత్తివీరన్ శరవణన్, జయప్రకాష్, నిరోషా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. క్రౌన్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఎస్ ఇబ్రహీం నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రకాష్ కృష్ణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవీ చిత్రం ఫేమ్ బాబు సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి గోపి కృష్ణన్ చాయాగహ్రణం అందిస్తుండగా.. కబీర్ వాసుకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం చైన్నెలో రెగ్యులర్గా షూటింగ్ జరుగుతోందని యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్ర కథ, కథనాలు కొత్తగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. -
కథ సెట్.. కాంబో రిపీట్
ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్లో ఓ బ్లాక్బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. బిగిన్ ది బిగిన్ కమల్హాసన్ కెరీర్లో ‘నాయగన్’ (1987) బ్లాక్బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్. మణిరత్నం, కమల్హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్హాసన్ కెరీర్లో ఓ బ్లాక్బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్ల కాంబినేషన్లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. లక్నో టు లాహోర్ దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు . ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’. ‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది. ఎప్పటికీ హీరోయే! జాకీ ష్రాఫ్ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి. -
పబ్లిక్ ఇష్యూ ద్వారా హీరో ఫిన్కార్ప్ రూ.4వేల కోట్లు సమీకరణ!
ప్రముఖ దిగ్గజ కంపెనీ హిరో మోటోకార్ప్ ఆటోమోబైల్ రంగంలో సేవలు అందించడంతో పాటు ఫైనాన్స్ రంగంలోనూ తన సత్తాచాటేందుకు సిద్ధం అయింది. హీరో మోటోకార్ప్ ఆర్థిక సేవల విభాగమైన హీరో ఫిన్కార్ప్ రూ.4,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో 2024లో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూపై సలహాలు ఇచ్చేందుకు ఎనిమిది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను సంస్థ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జెఫ్రీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, యూబీఎస్, ఎస్బీఐ కేపిటల్, హెచ్డీఎఫ్సీ ఉన్నాయని ఓ వార్త మీడియాలో ప్రచురించారు. ప్రతిపాదిత ఐపీఓలో భాగంగా కొత్త షేర్ల జారీ, ప్రస్తుత వాటాదార్ల షేర్ల విక్రయం ద్వారా రూ.4,000 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హీరో ఫిన్కార్ప్లో హీరోమోటో కార్ప్ సంస్థకు 40 శాతం వాటా ఉంది. ముంజల్ కుటుంబం చేతిలో 35-39 శాతం వాటా ఉండగా.. అపోలో గ్లోబల్, క్రిస్ కేపిటల్, క్రెడిట్ సూయిజ్, హీరో మోటోకార్ప్నకు చెందిన కొన్ని డీలర్ల సంస్థల వద్ద మిగిలిన వాటా ఉంది. 1991లో హీరో ఫిన్కార్ప్ బ్యాంకింగేతర ఆర్థిక సేవల కంపెనీగా ఏర్పడింది. -
హీరోతో కలిసి ఎంగిలి ఐస్క్రీమ్ తినమన్నారు.. ఇబ్బంది పడ్డా: సుహాసిని
ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్గా కొనసాగారు సుహాసిని. చిరంజీవి, బాలకృష్ణ, వెంటకేశ్ లాంటి బడా హీరోలందరితోనూ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో తల్లి పాత్రతో పాటు సహాయక నటిగా చేస్తోంది. అయితే హీరోయిన్గా చేసినప్పుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి తాజాగా ఓ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడారు. ‘గతంలో హీరోయిన్గా చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే..సున్నితంగా తిరస్కరించేదాన్ని. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉంది. అది చేయాలని డైరెక్టర్ చెబితే.. నేను నో చెప్పాను. పరాయి వ్యక్తి ఒడిలో కూర్చోవడం తప్పు..కాబట్టి నేను ఆ సీన్ చేయనని గట్టిగా వాధించాను. (చదవండి: స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్!) అదే సినిమాలో హీరో కలిసి ఐస్క్రీమ్ తినే సీన్ ఉంది. హీరో తిన్న ఐస్క్రీమ్నే తినాలని నాకు చెప్పారు. అది నాకు నచ్చలేదు. ‘వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి? ఐస్క్రీమ్ మార్చండి’అని ఫైర్ అయ్యాను. దీంతో కొరియోగ్రాఫర్ షాకయ్యారు. నేను చెప్పిన విధంగా చేయలని నాపైకి సీరియస్ అయ్యాడు. అయినా కూడా నేను అంగీకరించలేదు. ఐస్క్రీమ్ తినడం కాదు కదా కనీసం ముట్టుకోబోనని తెగేసి చెప్పారు. ఆ తర్వాత ఐస్క్రీమ్ మార్చారు’అని సుహాసిన చెప్పికొచిఉ్చంది. -
హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం..పెరుగుతున్న వాహనాల ధరలు
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్ - షోరూం ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు అక్టోబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఎంత శాతం మేర పెరుగుతుందనే అంశంపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెహికల్స్కు మార్కెట్లో ఉన్న డిమాండ్, మోడల్స్ ఆధారంగా ఒక శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం. పెరిగిపోతున్న ధరలు, కాంపిటీషన్, ద్రవ్యోల్బణం కారణంగా వాహనాల ధరల్ని పెరుగుదలకు కారణమని హీరో మోటో కార్ప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. పెరిగే ఎక్స్ షోరూం ధర ఎంతంటే? ఇంతకుముందు, కొత్తగా ప్రారంభించిన ఫ్లాగ్షిప్ కరిజ్మా ఎక్స్ఎంఆర్ ప్రమోషనల్ ఆఫర్ ముగిసినందున అక్టోబర్ 1 నుండి ఎక్స్ షోరూం ధరను రూ.7,000కు (ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.1,79,900) పెంచుతున్నట్లు ప్రకటించింది. హీరో కరిజ్మా ఎక్స్ ఎంఆర్ ప్రస్తుత బుకింగ్ విండో రూ.1,72,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది నేటితో ముగియనుంది. ఇకపై పెంచిన ధరలతో సేల్స్ నిర్వహిస్తామని హీరో కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పెరుగుతున్న ఎగుమతులు కాగా, హీరో మోటోకార్ప్ ఆగస్టు నెలలో మొత్తం వాహనాల అమ్మకాలు 6 శాతం పెరిగి 4,88,717 యూనిట్లుగా నమోదయ్యాయి. డొమెస్టిక్ సేల్స్ 4,50,740 యునిట్లుగా ఉండగా 2022 ఇదే ఆగస్టు నెలతో పోలిస్తే దేశీయ విక్రయాలు 5 శాతం వృద్ధితో 4,72,947 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 11,868 యూనిట్ల నుంచి 15,770 యూనిట్లకు పెరిగడం విశేషం. చదవండి👉 హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్ విటారా కార్లు! -
రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో రాజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గతకొంతకాలంగా పాస్టర్గా దైవసేవలో మునిగి తేలుతున్న ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాడు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. 'నాకు రాజకీయాలు కొత్తేం కాదు. ఇంతకుముందు తెర వెనుక పని చేశాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చి పని చేసేందుకు రెడీ అయ్యాను. కేవలం ఒక రాష్ట్రం కోసమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీలో చేరాను' అని చెప్పుకొచ్చాడు. సినిమాలకు దూరం.. 'ఆనంద్: మంచి కాఫీలాంటి సినిమా'తో తెలుగువారికి దగ్గరయ్యాడు హీరో రాజా. 2002లోనే ఓ చిన్నదాన సినిమాతో వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ 2004లో వచ్చిన ఆనంద్ మూవీతోనే అసలు సిసలైన సక్సెస్ రుచి చూశాడు. ఆ నలుగురు, వెన్నెల చిత్రాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ తర్వాత సినిమాల ఎంపికలో తడబడ్డాడు. ఫలితంగా హిట్లు కరువైపోయాయి. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యాడు. 2013 తర్వాత మరే సినిమా చేయలేదు. కాగా రాజా.. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నాడు. చదవండి: ప్రియుడితో జయసుధ? మరోసారి తెరపైకి మూడో పెళ్లి రూమర్స్! -
12 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో
7/G బృందావన్ కాలనీ.. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. 20 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా, సోనియా అగర్వాల్ హీరోయిన్గా నటించింది. నిర్మాత ఏఎం రత్నం తనయుడే రవికృష్ణ. 7/G బృందావన్ కాలనీ తమిళంలో 7/G రెయిన్బో కాలనీగా విడుదలైంది. అక్కడ కూడా సెన్సేషన్ విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే ఉత్తమ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు రవికృష్ణ. తర్వాత తెలుగు, తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు, కానీ మళ్లీ అంతటి హిట్ అందుకోలేకపోయాడు. 2011లో చివరగా అరణ్య కాండం అనే తమిళ చిత్రంలో కనిపించాడు. తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. ఇన్నాళ్లకు అతడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తొలి సినిమాను డైరెక్ట్ చేసిన సెల్వ రాఘవన్ సీక్వెల్కు దర్శకత్వం వహించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. 7/G బృందావన్ కాలనీ ఈ నెల 22న మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ మీడియాతో మాట్లాడాడు. 'చాలారోజులుగా ఈ మూవీని రీ రిలీజ్ చేయాలని నాన్నగారు అనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నాం. దానికంటే ముందు ఈ సినిమాను మరోసారి మీరు చూసేయండి' అని చెప్పుకొచ్చాడు. అయితే అప్పటికి, ఇప్పటికి రవికృష్ణలో చాలా మార్పు వచ్చింది. అసలు 7/G బృందావన్ కాలనీ హీరోలానే లేడు. బరువు పెరిగి గుర్తుపట్టరానంతగా మారిపోయాడు. చదవండి: అజిత్తో సినిమాకు సిద్ధమైన జైలర్ నిర్మాతలు.. ఏకంగా అన్ని కోట్లు ఆఫర్! -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
రాజకీయాల్లోకి స్టార్ హీరో.. పక్కా ప్లాన్తో ప్రజల్లోకి!
తమిళస్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. అంతే కాకుండా విజయ్ ప్రజాసంఘం ఇప్పుడు సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ మరింత బలంగా ముందుకు సాగే ప్రయత్నానికి సిద్ధం అవుతోంది. ఇది చూస్తుంటే విజయ్ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: అల్లు అర్జున్కే అవార్డు అని ముందే హింట్ ఇచ్చిన రష్మిక.. వీడియో వైరల్) ఆయన అభిమానులు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో పలు వార్డుల్లో పోటీ చేసి గెలుపొందారు. విజయ్ రంగప్రవేశమే తదుపరి అనే ప్రచారం జోరుగా సాగుతుంది. విజయ్ ఆంజనేయ సంఘం ఇప్పటికే ప్రజాసంఘంగా మార్చి రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది. కాగా.. ఈ సంఘం ద్వారా పలు విభాగాలను ఏర్పాటు చేశారు. తాజాగా సామాజిక మాధ్యమాలను వాడుకునే ప్రయత్నం చేశారు. ఇందులోభాగంగా శనివారం ఉదయం విజయ్ అభిమాన సంఘం కార్యదర్శి బుస్సీ ఆనంద్ నేతృత్వంలో పనైయూర్లోని విజయ్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన అభిమానులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో సామాజిక మాధ్యమాల కోసం 30 వేల మందిని నియమించారు. బుస్సీ ఆనంద్ మాట్లాడుతూ విజయ్ ప్రజా సంఘాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. తమ సంఘానికి చెందిన ప్రతి విషయాన్ని ప్రజల్లోకి చేరే విధంగా వాట్సాప్లను వినియోగించాలని చెప్పారు. అదే విధంగా 234 నియోజకవర్గాల్లో జరిగే విషయాలను క్లుప్తంగా వీడియోలో చిత్రీకరించి సంఘం ప్రధాన నిర్వాహకునికి పంపించాలని కోరారు. అలాంటి వాటిని ప్రధాన నిర్వాహకుల అనుమతి లేకుండా ప్రచారం చేయరాదన్నారు. అదేవిధంగా ఏ విషయంలోనూ కుల,మత వివక్షతకు పాల్పడరాదని సూచించారు. (ఇది చదవండి: ఎవరైనా ప్రపోజ్ చేశారా?.. హీరోయిన్ శ్రీలీల క్రేజీ కామెంట్స్?) -
Actor Vineeth Unseen Photos: ప్రేమదేశం హీరో వినీత్ బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
రాజకీయాల్లోకి స్టార్ హీరో ఎంట్రీ.. అప్పుడే స్టార్ట్ చేశారు!
నటుడు స్టార్ హీరో విజయ్ రాజకీయాల వైపు శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగానే అందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పవచ్చు. లక్షలాదిమంది విజయ్ అభిమానులు ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. ఇదంతా విజయ్ మక్కళ్ సంఘం ప్రధాన కార్యదర్శి, పుదుచ్చేరి శాసన సభ్యుడు బస్సీ సారథ్యంలో జరుగుతోంది. ఆ మధ్య సంస్థాగత ఎన్నికల్లో విజయ్ అనుమతితో పోటీ చేసి ఆయన పేరుతో ప్రచారం చేసి పలువురు అభిమానులు గెలిచిన విషయం తెలిసిందే. అదే విజయ్కి రాజకీయ రంగ ప్రవేశంపై నమ్మకాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఇక ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 10 పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను జిల్లాకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి వారికి నగదు బహుమతి కార్యక్రమాన్ని విజయ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నోటుకు ఓటు సంస్కృతిని నిలువరించాలని వారికి విజయ్ హిత బోధ చేసినప్పుడే ఆయన రాజకీయ రంగ ప్రవేశం షురూ అయ్యిందనే ప్రచారం హోరెత్తింది. కాగా ఇటీవల నటుడు విజయ్ తాను నటిస్తున్న లియో చిత్ర షూటింగ్ను పూర్తి చేసి విశ్రాంతి కోసం లండన్కు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో విజయ్ మక్కళ్ సంఘం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈనెల 5, 6 తేదీల్లో సంఘం న్యాయవాదుల సమావేశం జరగనుంది. స్థానిక పనైయూర్లోని విజయ్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నట్లు బస్సీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల ప్రజా సమస్యలపై చట్టపరమైన అంశాల గురించి చర్చించనున్నట్లు, 6వ తేదీన కేరళా విజయ్ అభిమానులతో సమావేశం కానున్నట్లు అందులో పేర్కొన్నారు. -
హీరోగా చేస్తున్న సమయంలో విలన్గా ఆఫర్.. అయినా ఓకే!
నిరోజ్ పుచ్చా హీరోగా ధీన రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భారతీయన్స్’. శంకర్ ఎన్. అడుసుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ అయింది. శనివారం విలేకరుల సమావేశంలో నిరోజ్ పుచ్చా మాట్లాడుతూ– ‘‘2019లో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్తో నా యాక్టింగ్ జర్నీ మొదలైంది. ‘భారతీయన్స్’ చేస్తున్నప్పుడే నాకు విలన్గా చాన్స్ వస్తే, ఓకే చెప్పాను. ఎందుకంటే హీరోనా? విలనా అని కాదు.. యాక్టర్గా నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
బర్త్ డే స్పెషల్.. నెవ్వర్ బిఫోర్ గెటప్లో సూర్య (ఫొటోలు)
-
హీరోగా సింగర్ సునీత కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు సంగీత ప్రేక్షకులకు చాలా ఏళ్ల నుంచి తెలిసిన పేరు సునీత. సింగర్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. ప్రస్తుతం పాటలు పాడటంతోపాటు పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ చాలా ఫేమస్ అయింది. ఈమె కుమార్తె ఇప్పటికే ఓ సినిమాలో పాట పాడి గాయనిగా పరిచయమైంది. ఇప్పుడు కొడుకు ఆకాశ్ ఏకంగా హీరో అయిపోయాడు. తాజాగా ఫస్ట్లుక్ కూడా విడుదల చేశారు. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) సునీత్ రియాక్షన్ 'కంగ్రాట్స్ ఆకాశ్.. ఓ తల్లీ, కుమారుడి కల నెరవేరిన రోజు ఇది. ప్రపంచానికి నువ్వు నాకు చెప్పిన కథని చూపించడంతో, నటుడు కావాలనే సాకారం చేసుకోవడం కోసం నువ్వు పడిన శ్రమ, వృత్తి పట్ల నిబద్ధత, నువ్వు చేసిన త్యాగాలు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అని సింగర్ సునీత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ పెట్టారు. ఫస్ట్ లుక్ లో ఏముంది? 'సర్కారు నౌకరి' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావన అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ బట్టి చూస్తుంటే.. 1980ల్లో జరిగిన కథలా అనిపిస్తుంది. ఓ పెద్ద చెట్టు, దానికి కండోమ్ ప్యాకెట్స్ డబ్బా, వెనక పల్లెటూరు చూస్తుంటే ఆసక్తి కలుగుతోంది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) (ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్కి అక్క?) -
PM Modi Egypt Tour: ఇండియా హీరో మోదీ
కైరో: ‘ఇండియా హీరో నరేంద్ర మోదీ’ అంటూ ఈజిప్టులో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మోదీ చరిత్రాత్మక ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఇండియా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమెరికాలో నాలుగు రోజుల అధికారిక పర్యటన ముగించుకొని శనివారం ఈజిప్టులో అడుగుపెట్టారు. గత 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటిస్తుండడంఇదే మొదటిసారి. రాజధాని కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిట్జ్ కార్ల్టన్ హోటల్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఇండియా హీరో(కథానాయకుడు) మీరేనంటూ వారు ప్రశంసించగా మోదీ ప్రతిస్పందించారు. అందరికీ హీరో ఇండియా అని బదులిచ్చారు. ప్రజలంతా కష్టపడి పనిచేస్తున్నారని, అందుకే మన దేశం అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. దేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందని చెప్పారు. దేశ విజయంలో వారికి సైతం వాటా దక్కుతుందన్నారు. అనంతరం దావూదీ బోహ్రా వర్గం ముస్లింలతో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుజరాత్లోని దావూదీ బోహ్రా ముస్లింలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈజిప్టులో ప్రవాస భారతీయులు తనకు ఘన స్వాగతం పలికారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వారి ఆప్యాయత తన హృదయాన్ని కదిలించిందని పేర్కొన్నారు. ఈజిప్టువాసులు సైతం భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి తనకు స్వాగతం పలికారని వెల్లడించారు. భారత్–ఈజిప్టు దేశాలు సంప్రదాయాలను సైతం పంచుకుంటున్నాయని వివరించారు. అల్–హకీం మసీదు, గ్రేట్ పిరమిడ్ల సందర్శన ఈజిప్టులో 11వ శతాబ్దం నాటి చరిత్రాత్మక అల్–హకీం మసీదును ప్రధాని మోదీ సందర్శించారు. ఈజిప్టులో మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు చేసిన ప్రాణత్యాగాలకు గుర్తుగా నిర్మించిన హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ మెమోరియల్ను సందర్శించి, ఘనంగా నివాళులరి్పంచారు. ఇక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈజిప్టులో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 3,799 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన గిజా గ్రేట్ పిరమిడ్లను మోదీ సందర్శించారు. కైరో నగర శివార్లలో గిజా నెక్రోపోలిస్ అనే ప్రాంతంలో ఈ పిరిమిడ్లు ఉన్నాయి. ‘‘కైరో అల్–హకీం మసీదును సందర్శించడం ఆనందంగా ఉంది. ఈజిప్టు ఘనమైన వారసత్వానికి, సంస్కృతికి ఈ మసీదు దర్పణం పడుతోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. అవగాహనా ఒప్పందాలపై సంతకాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకొనే దిశగా భారత్, ఈజిప్టు మరో అడుగు వేశాయి. భారత ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరువురు నేతలు నాలుగు అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)పై సంతకాలు చేశారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. ఇందులో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందం ఉందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ప్రాచీన, పురావస్తు కట్టడాల పరిరక్షణ, ‘కాంపిటీషన్ లా’కు సంబంధించిన మరో మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారని తెలిపారు. మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ ప్రదానం ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈజిప్టు సహా ఇప్పటిదాకా 13 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలతో మోదీని సత్కరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా, మాల్దీవ్స్, రష్యా, బహ్రెయిన్, పపువా న్యూగినియా, ఫిజీ, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ, భూటాన్ తదితర దేశాల నుంచి ఆయన ఈ పురస్కారాలు స్వీకరించారు. తనకు ఆర్డర్ ఆఫ్ ద నైలు పురస్కారం ప్రదానం చేసిన ఈజిప్టు ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ పట్ల ఈజిప్టు ప్రజల ఆప్యాయత అనురాగాలకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. -
సీక్వెల్.. మార్పుల్...
కథ పెద్దదైతే సినిమా రెండు భాగాలవుతుంది.. ఒక్కోసారి మూడు కూడా అవుతుంది. ఇప్పుడలాంటి కథలతో రూపొం దుతున్న సీక్వెల్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఒకటో భాగంలో నటించిన నటీనటులు, తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగంలో కంటిన్యూ కావడంలేదు. ఒకటీ హీరో మారుతున్నారు.. లేదా డైరెక్టర్ మారుతున్నారు... లేదా హీరోయిన్ మారుతున్నారు... ఇక మార్పుల్తో రూపొందుతున్న సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. హిట్: ది థర్డ్ కేస్ తెలుగు చిత్ర పరిశ్రమలో ‘హిట్’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలను నిర్మించింది హీరో నాని కావడం విశేషం. కాగా తొలి రెండు భాగాలు నిర్మించిన నాని థర్డ్పార్ట్ ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించనుండటం విశేషం. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్గా రూపొం దిన ఈ చిత్రంలో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ను (హిట్) లీడ్ చేసే పోలీస్ ఆఫీసర్ రుద్రరాజుపాత్రలో నటుడిగా విశ్వక్ సేన్కి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ మంచి హిట్గా నిలిచింది. కాగా హిట్ ఫ్రాంచైజీలో రెండో భాగం ‘హిట్: ది సెకండ్ కేస్’లో హీరోగా అడివి శేష్ని తీసుకున్నారు శైలేష్. ఎస్పీ కృష్ణదేవ్పాత్రలో అడివి శేష్ తనదైన శైలిలో నటించి, మెప్పించారు. ఈ సినిమా కూడా హిట్. ఇక మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరో నాని నటించనున్నట్లు ‘హిట్: ది సెకండ్ కేస్’ చివర్లో రివీల్ చేశారు. పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్పాత్రలో నాని నటిస్తారు. కాగా హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలుంటాయని శైలేష్ కొలను గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చంద్రముఖి–2 ‘చంద్రముఖి’ (2005)లో ‘లక లక లక..’ అంటూ హీరో రజనీకాంత్ రాజు గెటప్లో విలనిజమ్ పండించి, డాక్టర్ ఈశ్వర్గా మంచితనం కనబరిస్తే ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలకపాత్రలు చేశారు. ‘చంద్రముఖి’ విడుదలైన 18 ఏళ్లకు సీక్వెల్కి శ్రీకారం చుట్టారు పి. వాసు. ‘చంద్రముఖి 2’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ ప్లేస్లోకి లారెన్స్ వచ్చారు. అలాగే కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించారు. ఇంకా వడివేలు, లక్ష్మీ మీనన్, రాధిక తదితరులు నటించారు. ఇటీవల మైసూర్లో జరిగిన షెడ్యూల్తో ఈ మూవీ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకర్త. యుగానికి ఒక్కడు–2 వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు దర్శకుడు సెల్వ రాఘవన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో యుగానికి ఒక్కడు –2010) ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. కార్తీ హీరోగా, ఆండ్రియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ (యుగానికి ఒక్కడు 2) తెరకెక్కించనున్నారు సెల్వ రాఘవన్. అయితే ఈ సినిమాలో తన సోదరుడు, హీరో ధనుష్ని లీడ్ రోల్కి తీసుకున్నారాయన. కార్తీ స్థానంలో ధనుష్ కనిపిస్తారని కొందరు అంటుంటే.. అలాంటిదేం లేదు.. కార్తీ కూడా ఉంటారు.. సీక్వెల్లో ధనుష్పాత్ర యాడ్ అయిందని మరికొందరు అంటున్నారు. మరి ‘యుగానికి ఒక్కడు 2’లో కార్తీపాత్ర ఉంటుందా? లేదా? అనేది చూడాలి. జెంటిల్మన్–2 అర్జున్, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్మేన్’ (1993) చిత్రం సూపర్హిట్గా నిలిచింది. దాదాపు ముప్పైఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ‘జెంటిల్మన్ 2’ని నిర్మిస్తున్నారు కుంజుమోన్. అయితే రెండో భాగంలో దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు ముగ్గురూ మారడం విశేషం. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో ‘మంత్ర–2, రాజుగారి గది, పెళ్లికి ముందు ప్రేమకథ’ వంటి చిత్రాల్లో నటించిన చేతన్ చీను హీరోగా నటించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దనున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ కానుంది. టిల్లు స్క్వేర్ ‘డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు..’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పెప్పులేస్తే ప్రేక్షకులు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై సూపర్హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘టిల్లు స్క్వేర్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే సీక్వెల్కి అటు డైరెక్టర్, ఇటు హీరోయిన్ ఇద్దరూ మారడం విశేషం. ‘టిల్లు స్క్వేర్’కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించి గ్లామర్తో మెప్పించారు. అయితే సీక్వెల్లో మాత్రం అనుపమా పరమేశ్వరన్ని హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. జిగర్తండా–2 సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ కీలకపాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగర్తండా’ (2014) తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ అయి, ఇక్కడా ఘనవిజయం సాధించింది. కాగా ‘జిగర్తండా’ విడుదలైన దాదాపు తొమ్మిదేళ్లకు ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ పేరుతో కార్తీక్ సుబ్బరాజ్ సీక్వెల్ తీశారు. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్లో నటించారు. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
కథ మళ్లీ కలిపింది
ఒక హీరో–ఒక డైరెక్టర్ ఒక హిట్ సినిమా ఇస్తే.. వారిది ‘హిట్ కాంబో’ అవుతుంది. అందుకే ఆ కాంబినేషన్లో రెండో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. తమ కాంబో రిపీట్ అవ్వాలని హీరో–డైరెక్టర్కి కూడా ఉంటుంది. కానీ కథ కుదరాలి. అలా కొందరు హీరో–దర్శకులను మళ్లీ కథ కలిపింది. రెండోసారి రిపీట్ అవుతున్న ఆ కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. దశాబ్దాల తర్వాత హీరోగా కమల్హాసన్, దర్శకుడిగా మణి రత్నంలది ఇండస్ట్రీలో సుధీర్ఘ ప్రయాణం. కానీ కమల్హాసన్, మణిరత్నంల కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రం ఒక్కటే. అదే ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’–1987). అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇంతటి బ్లాక్బాస్టర్ సక్సెస్ అందుకున్నప్పటికీ కమల్, మణిరత్నంల కాంబినేషన్లో మరో సినిమా సెట్స్పైకి వెళ్లలేదు. ముప్పైఐదేళ్ల తర్వాత ఇప్పుడు కమల్, మణిరత్నంల కాంబో రిపీట్ కానుంది. మరోవైపు దర్శకుడు శంకర్తో ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నారు కమల్హాసన్. శంకర్, కమల్ కాంబోలోనే 1996లో రిలీజైన బ్లాక్బస్టర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్ ఇది. సో.. కమల్–శంకర్ కాంబో మళ్లీ సెట్ అవ్వడానికి పాతికేళ్లు పైనే పట్టింది అన్నమాట. దేవర ఎన్టీఆర్ కెరీర్లో ఉన్న సూపర్ హిట్ చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్’ ఒకటి. క్లాస్ టచ్తో మాస్ ఎలిమెంట్స్ను జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా సెట్స్పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. విస్మరణకు గురైన భారతదేశ తీర ప్రాంతవాసుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘దేవర’ విడుదల కానుంది. డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్లోని పవర్ఫుల్ మాస్ యాంగిల్ని ‘ఇస్మార్ట్ శంకర్’ (2019)లో వెండితెరపైకి తెచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇటు రామ్, అటు పూరి జగన్నాథ్ కెరీర్లకు ఆ సమయంలో బాగా బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ చేయనున్నారు రామ్ అండ్ పూరి. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ ‘గీత గోవిందం’ (2018)తో రూ. వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. ఐదేళ్ల తర్వాత విజయ్, పరశురామ్ కాంబోలో సెకండ్ ఫిల్మ్గా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. కాగా ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్ని పరిశీలిస్తున్నారని సమాచారం. అడ్వంచరస్ డ్రామా రెండున్నరేళ్ల క్రితం కోవిడ్ సమయంలో విడుదలైన ‘భీష్మ’ చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పుడు నితిన్–వెంకీ కుడుమల రెండోసారి మరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల మొదలయ్యాయి. అడ్వెంచరస్ ఎంటర్టైనర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాక్షస రాజు ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రంలో జోగేంద్ర పాత్రలో హీరో రానా కాస్త నెగటివ్ షేడ్స్లో మెప్పించారు. అలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తేజ. అయితే రానా, తేజ కాంబోలో మరో సినిమా కన్ఫార్మ్ కావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. రానా, తేజ కాంబినేషన్లోని సెకండ్ ఫిల్మ్ ‘రాక్షస రాజు’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. భైరవ కోనలో... ‘టైగర్’ (2015) చిత్రం కోసం తొలిసారి చేతులు కలిపారు హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఊరిపేరు భైరవకోన’. సస్పెన్స్, థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు, దర్శకులు తమ కాంబోలో రెండో సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. -
హీరో ఆర్య కూతురిని చూశారా? ఎంత క్యూట్గా ఉందో! (ఫొటోలు)
-
సంచలనం సృష్టించిన..7/G బృందావన్ కాలనీ సీక్వెల్
-
మేము ఫేమస్ మూవీ టీజర్
-
అఖిల్ బాబు కామెడీ అయ్య బాబోయ్..
-
NTR 30 పై అదిరిపోయే లీక్ ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ఫాన్స్ కి పండగే
-
ఊహించని లాభాలలో విరుపాక్ష మూవీ ప్రాఫిట్ ఎన్ని కొట్లో తెలిస్తే బిత్రరాపోతారు..
-
రెమ్యూనరేషన్ లో ప్రభాస్ ని దాటేసిన హీరో ఎన్టీఆర్,రామ్ చరణ్ కూడా వెనుకే..
-
విడుదల సినిమా టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
ధూమ్మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది!
హీరో కరిజ్మా బైక్ మళ్లీ వస్తోంది. ఒకప్పుడు బాగా పాపులర్ అయిన పాత బైక్లన్నీ ఇప్పుడు సరికొత్త హంగులు, ఫీచర్లతో మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయి. గత నెలలో బజాజ్ తన సక్సెస్ ఫుల్ బైక్ పల్సర్ ని మళ్లీ మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హీరో మోటోకార్ప్ కూడా ఒకప్పుడు బాగా ఆదరణ పొందిన కరిజ్మా బైక్ను తిరిగి ప్రవేశ పెట్టనుంది. ఇదీ చదవండి: వరల్డ్ బ్యాంక్ కాబోయే ప్రెసిడెంట్కు కోవిడ్.. భారత్లో సమావేశాలన్నీ రద్దు! హీరో కరిజ్మా బైక్ దాని స్పోర్టీ లుక్స్, పెర్ఫార్మెన్స్తో లాంచ్ అయిన వెంటనే భారత మార్కెట్లో బాగా పాపులర్ అయింది. ఆ సమయంలో హీరో కరిజ్మా అత్యంత ఆకర్షణీయమైన మోటార్సైకిళ్లలో ఒకటి. హీరో కరిజ్మా ఆర్, హీరో కరిజ్మా ZMR విక్రయాలు అప్పట్లో భారీగా జరిగాయి. ఆ తర్వాత ఆ బైక్ల ఉత్పత్తిని కంపెనీ నిలిపేసింది. చాలా బైక్ తయారీ సంస్థలు ఇటీవల పాత మోడళ్లను పునరుద్ధరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరిజ్మా బైక్ను కొత్త హంగులతో తిరిగి తీసుకొచ్చేందుకు హీరో సంస్థ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరో కరిజ్మా 2023 కొత్త డిజైన్, శక్తివంతమైన ఇంజన్ ప్రస్తుతం తయారీలో ఉన్నట్లు రష్లేన్ నివేదించింది. కరిజ్మా 2023 టెస్ట్ మ్యూల్ చిత్రాలను కూడా షేర్ చేసింది. అత్యంత ఆదరణ పొందిన ఏ బైక్ అయినా సరే ఆ కంపెనీకి మంచి గుర్తింపుని తీసుకువస్తుంది. అలానే ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో హీరో మోటోకార్ప్ తీసుకువచ్చిన కరిజ్మా బైక్ చాలా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ ఈ బైక్ పై వెళ్తున్న సీన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి. అంత ఆదరణ పొందిన ఈ మోడల్ బైక్ ని సరికొత్త లుక్ రీలాంచ్ చేయనుంది హీరోమోటోకార్ప్. 2014లో ఫేస్లిఫ్ట్ వెర్షన్ లో OG కరిజ్మా R, కరిజ్మా ZMR సిరీస్ బైక్స్ ని హీరో తీసుకువచ్చింది. ఇప్పుడిదే కొత్త లిక్విడ్ కూల్డ్ 210సీసీ ఇంజన్తో వస్తోంది. ఈ సెగ్మెంట్ లో పల్సర్ వంటి అధునాతన బైక్స్కి ఈ సరికొత్త కరిజ్మా గట్టి పోటీ ఇవ్వనుంది. ఫేస్లిఫ్టెడ్ మోడలన్నీ EBR (ఎరిక్ బుల్ రేసింగ్)తో తయారు చేస్తారు. కరిజ్మా మోడల్ని నిలిపివేసిన తర్వాత హీరో ఎక్స్ట్రీమ్ (Xtreme 200S) బైక్ ని లాంచ్ చేసింది. అయితే కరిజ్మా స్థానంలో తీసుకువచ్చిన ఈ బైక్ కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో వాటిని కూడా హీరో సంస్థ నిలిపివేసింది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! -
ఎంట్రీతోనే బిగ్ డిజాస్టర్.. అయినా తగ్గట్లేదుగా హీరో!
ప్రముఖ బిజినెస్మెన్ అరుల్ శరవణన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'ది లెజెండ్'. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అప్పట్లో హీరోగా శరవణన్ ఎంట్రీ ఇవ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే తాజాగా కొత్త లుక్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు శరవణన్. ట్రోలర్స్కు చెక్ పెట్టేందుకే న్యూ లుక్లో కనిపించినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో గడ్డం, మీసాలతో శరవణన్ కాస్తా డిఫెరెంట్ లుక్లో కనిపించారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలంటే శరవణన్కు పిచ్చి బిజినెస్మెన్ అయిన శరవణన్కు సినిమాలంటే పిచ్చి. తెరపై కనిపించాలన్నదే ఆయన కోరిక. అందువల్లే శరవణ స్టోర్స్ యాడ్లో కూడా తానే నటించాడు. స్టార్ హీరోయిన్లతో కలిసి తన బిజినెస్ బ్రాండ్లకు పబ్లిసిటీ ఇస్తుంటారు. గతేడాది జులైలో విడుదలైన ది లెజెండ్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్గా నిలిచినా శరవణన్ ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. తాజా లుక్ చూస్తే మరోసారి స్క్రీన్పై ప్రేక్షకులను అలరించేందకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ది లెజెండ్ సినిమాలో ఆయన నటించడంపై నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ చేశారు. కాగా.. ది లెజెండ్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. New Transition… Details Soon…#Legend #TheLegend #LegendSaravanan #NewEraStarts pic.twitter.com/gws9HR7j8O — Legend Saravanan (@yoursthelegend) March 13, 2023 -
Arvind Swamy Latest Photos: హీరో అరవింద్ స్వామి అరుదైన ఫొటోలు చూశారా
-
క్రేజీ కాంబినేషన్స్... పదేళ్ల తర్వాత మళ్లీ ఇలా..
ఓ సినిమా సూపర్హిట్ అయితే ఆ హీరో, డైరెక్టర్ కాంబినేషన్ రిపీట్ కావాలని ఆడియన్స్ కోరుకుంటుంటారు. కానీ సరైన కథ కుదిరితేనే ఆ కాంబో రిపీట్ అవుతుంది. అలా మంచి కథ కుదరడంతో పదేళ్ల తర్వాత టాలీవుడ్లో రిపీట్ అవుతున్న కొన్ని కాంబినేషన్స్పై (హీరో–డైరెక్టర్) ఓ లుక్కేద్దాం. ♦ హీరో మహేశ్ బాబు ముచ్చటగా మూడోసారి దర్శకుడు త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నారు. 2005లో వచ్చిన ‘అతడు’ సినిమా కోసం మహేశ్, త్రివిక్రమ్ తొలిసారి చేతులు కలిపారు. ఆ మూవీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో 2010లో ‘ఖలేజా’ చిత్రం వచ్చింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో రూ΄పొందుతున్న సినిమా సెట్స్పైన ఉంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ వారంలోనే హైదరాబాద్లోప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో మహేశ్బాబుతో పాటు పూజాహెగ్డే, శ్రీలీల పాల్గొంటారని తెలిసింది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటోంది చిత్రయూనిట్. ♦ హీరో అల్లు అర్జున్తో ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) వంటి ప్రేమకథా చిత్రాలు తీశారు దర్శకుడు సుకుమార్. పది సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ రూ΄పొందుతోంది. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తోంది. ‘పుష్ప’ తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై అద్భుత విజయం సాధించింది. దీంతో మలిపార్టు ‘పుష్ప: ది రూల్’పై మరింత ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. ఆల్రెడీ ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ మార్చి మొదటివారంలోప్రారంభం కానున్నట్లు తెలిసింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2024లో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. ♦ పదిహేను సంత్సరాల క్రితం వచ్చిన ‘ఢీ: కొట్టిచూడు’(2007) సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లోని మరో సినిమా ప్రకటన రావడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. ‘ఢీ: కొట్టిచూడు’ సినిమాకు సీక్వెల్గా ‘ఢీ2: డబుల్ డోస్’ సినిమా రూ΄పొందనున్నట్లు 2020 నవంబరులో ప్రకటించారు మంచు విష్ణు. అయితే ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. మరోవైపు గోపీచంద్తో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు దర్శకుడు శ్రీనువైట్ల. మరి.. ఆయన దర్శకత్వంలో ఏ హీరో సినిమా ముందుగా సెట్స్పైకి వెళుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి. ♦ ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రాల్లో 2009లో వచ్చిన హారర్ ఫిల్మ్ ‘ఈరమ్’ మంచి హిట్ సాధించింది. అరివళగన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం తెలుగులో ‘వైశాలి’గా 2011లో విడుదలై సక్సెస్ సాధించింది. పద్నాలుగేళ్ల తర్వాత ఆది, అరివళగన్ కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో ‘శబ్ధం’ అనే చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. లక్ష్మీమీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా పదేళ్ల గ్యాప్ తర్వాత రిపీట్ అవుతున్న హీరో, డైరెక్టర్ కాంబినేషన్ జాబితాలో మరికొన్ని తెలుగు చిత్రాలు ఉన్నాయి. -
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ను విజిట్ చేసిన హీరో నాగార్జున
-
సిద్దిపేటలో హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు సందడి..
-
స్టార్టప్ కంపెనీల్లో హీరో, హీరోయిన్స్ పెట్టుబడులు
-
హీరోలను మించిపోతున్న వారి భార్యల క్రేజ్
-
హీరోగా పరిచయం కాబోతున్న నిర్మాత
తమిళసినిమా: గతంలో అమ్మువాగియన్ నాన్, మాత్తియోసి వంటి సక్సెస్ఫుల్ త్రాలను నిర్మింన పీఎస్ఎస్ఆర్ ఫిలిమ్స్ అధినేత శేఖర్ సీతారామన్ తాజాగా కథానాయకుడిగా అవతారం ఎత్తారు. ఈయన హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఏ4. రవికుమార్ టీఎస్ కథ, కథనం, మాటలు సమకూర్చుతున్నారు. నటుడు ఇనిగో ప్రభాకర్, నటి ఐశ్వర్య దత్తలతోపాటు పలువురు ప్రముఖ నటినటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను రవికుమార్ తెలుపుతూ.. నిర్మాత శేఖర్ సీతారామన్ను కలిసి కథ వినిపించినప్పుడు ఆయనకు బాగా న్చిందన్నారు. హీరోగా ఎవరిని ఎంపిక చేద్దామని అడిగారన్నారు. ఎలాంటి సంకోచం లేకుండా మీరే నటిస్తే బాగుంటుందని చెప్పానన్నారు.. ముందు ఆయన సంకోంచినా తన ఒత్తిడి మేరకు హీరోగా నటించారని తెలిపారు. ఏ 4 చిత్రం టైటిల్ మాదిరిగానే కథా, కథనాలు వైవిధ్యంగా ఉంటాయన్నారు. అందరికీ అర్థమయ్యే విధంగా చిత్రంలో సంభాషణలు ఉంటాయన్నారు. చిత్ర షటింగ్ చెన్నై, ఊటీ, కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నట్లు చెప్పారు. శేఖర్ ఎంతో అనుభవం ఉన్న నటుడిగా నటిస్తున్నారని ప్రశంసించారు. దీనికి కేఏ రోయిన్ చాయగ్రహణను, సెంతమిళ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఒంటిపై కేవలం అండర్వేర్..అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు
ఒక వ్యక్తి ఇంటికి కొందరూ దొంగలు దోచుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో అతను పడుకుని ఉన్నాడు. వారి అలికిడికి లేచి తాను ఎలా ఉన్నది గమనించకుండా అలానే వచ్చి వారితో వీరోచితంగా పోరాడాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...స్టీవ్ మిడిల్టన్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు సాయుధ దొంగలు ఇంటిలోకి చొరబడేందుకు యత్నించారు. ఆ క్రమంలోనే ఆ దుండగులు స్టీవ్ ఇంటి ముంగిట ఉన్న కారు వద్ద గుమిగూడి ఉన్నారు. ఐతే వారి అలికిడికి స్టీవ్కి మెలుకువ వచ్చింది. ఆ దొంగలను చూసి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారితో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో స్టీవ్ నగ్నంగా నిద్రిస్తున్నాడు. వారిని చూసి హడావిడిగా కేవలం అండర్ వేర్ ధరించి అలానే బయటకు పరిగెత్తాడు. అక్కడ ఉన్న ఆ సముహంతో వీరోచితంగా పోరాడాడు. పైగా వారి వద్ద ఆయుధాలు ఉన్న లెక్కచేయకుండా గట్టిగా పోరాడి వారిని పరిగెట్టించాడు. విచారణలో ఆ దొంగలు భవన నిర్మాణ కార్మికుల సముహం అని తేలింది. స్టీవ్ మాత్రం తన గురించి ఆలోచించికుండా దోచుకోవడానికి వచ్చారన్న కోపంతో అలానే బయటకు వచ్చేశానని చెబుతున్నాడు. ఐతే తాను వారిలో ఒక్కరినైనా పట్టుకుని పోలీసులకు అప్పగించేందకు ప్రయత్నించానని, కానీ సాధ్యం కాలేదని చెబుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు వ్యక్తి స్టీవ్ని 'అండర్ వేర్ హిరో' అంటూ నెటిజన్లు ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Not all heroes wear capes, in fact some just wear a pair of undies. Steve Middleton was up early on Boxing Day when he spotted some thugs trying to steal from his car - the tradie decided to take matters into his own hands. #9News pic.twitter.com/ocg3s37W2f — 9News Gold Coast (@9NewsGoldCoast) December 26, 2022 (చదవండి: ఆందోళనతో బాధపడుతున్న కూతురు కోసం ఆ తల్లి ఏం చేసిందో తెలుసా!) -
ప్లాన్ మార్చిన మాస్ మహారాజ్ రవితేజ
-
అరుదైన రికార్డు సాధించిన ధనుష్..
-
బైక్ లవర్స్కి గుడ్ న్యూస్..హీరో-హార్లే బైక్ వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్, ప్రీమియం మోటర్సైకిల్స్ సంస్థ హార్లే–డేవిడ్సన్ సంయుక్తంగా రూపొందించే బైక్ రాబోయే రెండేళ్లలో మార్కెట్లోకి రానుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు హీరో దీన్ని ప్రవేశపెట్టనుంది. హీరో మోటోకార్ప్ సీఎఫ్వో నిరంజన్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను మరింత పటిష్టం చేసుకుంటున్నామని, ఏటా ఈ విభాగంలో కొత్త మోడల్స్ ప్రవేశపెట్టనున్నామని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లో హార్లే–డేవిడ్సన్ వాహనలకు సంబంధించి 2020 అక్టోబర్లో ఇరు సంస్థలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం హార్లే–డేవిడ్సన్ బ్రాండ్ పేరిట హీరో మోటోకార్ప్ భారత్లో ప్రీమియం మోటర్సైకిళ్ల అభివృద్ధి, విక్రయాలు చేపట్టనుంది. అలాగే ఆయా బైక్లకు అవసరమైన సర్వీసింగ్, విడిభాగాల సరఫరా కూడా హీరో చేపట్టనుంది. 100–110సీసీ బడ్జెట్ బైక్ల విభాగంలో ఆధిపత్యం ఉన్న హీరో .. 160సీసీ ఆ పై విభాగాల్లోనూ అమ్మకాలను పెంచుకోవడం ద్వారా లాభదాయకతను మెరుగుపర్చుకునే యోచనలో ఉంది. గడిచిన కొద్ది త్రైమాసికాలుగా విడిభాగాలు, యాక్సెసరీలు, మర్చండైజ్ (పీఏఎం) వ్యాపార వృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు గుప్తా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పీఏఎం వ్యాపార ఆదాయం 45 శాతం వృద్ధి చెంది రూ. 2,300 కోట్లుగా నమోదైనట్లు వివరించారు. -
2023 లో బాక్సాఫీస్ ని షేక్ చెయ్యబోతున్న సినిమాలివే..
-
సుధీర్ బాబు ‘హంట్’ టైటిల్ మాది: హీరో నిక్షిత్
‘‘హంట్’ టైటిల్ని ముందు మేము రిజిస్టర్ చేయించాం. అయితే సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్పై రూపొందిన చిత్రానికి కూడా ‘హంట్’ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ మార్చుకోమన్నా వారు పట్టించుకోవడం లేదు’’ అని ‘హంట్’ హీరో, దర్శకుడు నిక్షిత్ అన్నారు. నర్సింగ్ రావు నిర్మించిన చిత్రం ‘హంట్’. నిక్షిత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మోషన్ టీజర్ను విడుదల చేశారు. ఎమ్ఎస్ఆర్ట్స్ అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ– ‘‘శ్రీ క్రియేషన్స్ బ్యానర్పై ‘హంట్’టైటిల్ను 6 నెలల క్రితం ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేసుకున్నాం. ఇదే టైటిల్ని భవ్య క్రియేషన్స్ పెట్టుకుని, సినిమా విడుదల ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు’’ అన్నారు. ‘‘మా ‘హంట్’ ఆడియో రైట్స్ అమ్మటానికి ప్రయత్నం చేశాం.. కానీ, ‘హంట్’ పేరుతో వేరే చిత్రం కూడా ఉంది కాబట్టి మేము మీ చిత్రం కొనలేమని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరగాలి’’ అని నర్సింగ్ రావు అన్నారు. -
సీఎం జగన్ హీరో : యార్లగడ్డ
-
హీరోగా మారిన కమెడియన్.. రెండు భాగాలుగా సినిమా
వెన్నెలా కబడి కుళు చిత్రం ద్వారా చిన్న పాత్రలో పరిచయమైన నటుడు సూరి. ఆ చిత్రంలో సూరి కామెడీ అందరినీ ఆకర్షించింది. దీంతో ఆయనకు వరుసగా అవకాశాలు లభించాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రముఖ హాస్యనటుడి స్థాయికి ఎదిగాడు. ఇంకేముంది ఆ క్రేజ్ సూరిని కథానాయకుడిని చేసేసింది. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై ఎల్ రెడ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రంలో సూరి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. వెట్రిమాన్ దర్శకత్వంలో విడుదలై పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సూరి హీరోగా నటిస్తున్న తొలి చిత్రమే రెండు భాగాలుగా రూపొందించడం విశేషం. ఇందులో నటుడు ప్రధాన పాత్రలో నటించడం మరో విశేషం. కాగా ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే ఈయనకు హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. మదయానై చిత్రం ఫేమ్ విక్రమ్ సుకుమార్ నటుడు సూరి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మరో చిత్రంలోనూ సూరి హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో విడుదలై చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా దర్శకుడు వెట్రిమారన్కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా హాస్యనటులుగా పేరుతెచ్చుకుని హీరోల అవతారమెత్తిన వడివేలు, సంతానం వంటి వాళ్లు ఇప్పుడు మళ్లీ మొదటికే వస్తున్నారు. మరి హీరోగా సూరి భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. -
సినిమాలో హీరో మాదిరి కూతురుని రక్షించుకున్న రోజువారీ కూలీ
కిడ్నాప్కి గురైతే దొరకుతారన్నగ్యారంటి ఉండకపోగా బతికే ఉంటారన్న నమ్మకమూ ఉండదు. చాలా వరకు ఇలాంటి కిడ్నాప్ కేసుల్లో బాదితులను హతమార్చడం లేదంటే అమ్మేయడం వంటివి జరుగుతుంటాయి. సరైనా అధారాలు ఉంకపోవడంతో చాలా వరకు ఇలాంటి కేసులు పెండింగ్లోనే ఉండిపోతాయి. ఐతే ఇక్కడొక తండ్రి కిడ్నాప్ అయిన కూతురుని సినిమాలో హీరో మాదిరి గాలించి రక్షించుకున్నాడు. వివరాల్లోకెళ్తే.... పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ముంబైలోని సబర్బన్ బాంద్రాలో రోజువారీ కూలీ తమ ఇంటి వద్ద 12 ఏళ్ల కూతురు కిడ్నాప్కి గరయ్యందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఐతే ఆ అమ్మాయి తండ్రి ఇరుగు పొరుగువారిని విచారించి నిందితుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ అమ్మాయి కిడ్నాప్కి గురయ్యిన రోజు తల్లికి ఏదో సాకుతో బయటకు వెళ్లిందనే విషయాన్ని తెలుసుకుని ఆ దిశగా తెలిసినవాళ్లందర్నీ ఆరా తీయడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి నిందుతుడు షాహిద్ ఖాన్(24)తో వెళ్లినట్లు తెలుసుకుంటాడు. అంతేకాదు ఆ వ్యక్తి తన ఇంటికి సమీపంలోని వస్త్రాల తయారీలో ఉద్యోగం చేస్తుస్నట్లుగా తెలుసుకుంటాడు. దీంతో ఆ తండ్రి ఆ నిందితుడు కుటుంబం అలీఘర్ సమీపంలోని ఐత్రోలి గ్రామంలో ఉంటుందని తెలుసుకుని... పోలీసులు, స్థానికుల సాయంతో తన కూతురుని రక్షించుకుంటాడు. సదరు నిందితుడు ఆ అమ్మాయిని తనతో షాపింగ్కి రావాలంటూ కుర్లాకు తీసుకువెళ్లి..అక్కడ నుంచి సూరత్కి బస్సు ఎక్కి, రైలులో ఢిల్లికి చేరుకున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 12 కోట్లు స్వాధీనం) -
ఫస్ట్ సినిమాలోనే హీరోగా చేశా: నివాస్ శిష్టు
నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా నటించిన చిత్రం రహస్య, శివ శ్రీ మీగడ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎస్ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గౌతమి నిర్మించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర హీరో నివాస్ శిష్టు మీడియాతో మాట్లాడుతూ.. 'మాది వైజాగ్ దగ్గర పాలకొండ, నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. నాకు యాక్టింగ్ చేయాలనే డ్రీమ్ ఉన్నా సరైన వేదిక దొరకలేదు.. నా చదువు పూర్తయ్యాక నా ఫ్రెండ్ సాయంతో కెనడా వెళ్లి అక్కడ సెటిల్ అయిన నాకు కరోనా టైమ్లో "రహస్య" కథ నా దగ్గరకు వచ్చింది. ఇది నా మొదటి చిత్రం ఇక్కడ చాలా మంది నటులు ఉన్నా ఇలాంటి మంచి సినిమాలో హీరోగా విశ్వతేజ అనే పాత్రలో NIA అధికారిగా నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నేను నటనలో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. టీం అంతా ఫుల్ సపోర్ట్ చేయడంతో నాకు నటన ఈజీ అయ్యింది' అన్నాడు నివాస్ శిష్టు. చదవండి: ఫోన్ కొనిచ్చేందుకు నాన్న అప్పు చేశాడు: నేహా చౌదరి ఇద్దరు మాజీ ప్రియులతో సుష్మితా సేన్ పార్టీ -
భారత్లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సత్తా చాటుతున్నాయి. అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. ఈవీ వెహికల్స్లో లోపాలు తలెత్తినా తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల్ని నివారించ వచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం ఇప్పటి వరకు దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం. ఓలా ఎస్1 కొనుగోలు దారుల్ని ఆకట్టుకునే ఈవీ వెహికల్స్ స్కూటర్ల జాబితాలో ఓలా నిలిచింది. ఓలా ఎస్1 121కేఎం స్పీడ్, ఓలా ఎస్ 1 ప్రో 181కేంఎ స్పీడ్ను కలిగి ఉంది. ఓలా ఎస్1 టాప్ స్పీడ్ గంటలకు 115కేఎంపీఎహెచ్ వేగంతో వెళ్లొచ్చు. ఈ వెహికల్ 0కిలో మీటర్ల నుండి 40కిలోమీటర్ల చేరుకోవడానికి 3 సెకన్ల సమయం పడుతుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇక ఈ వెహికల్స్లో ఎలక్ట్రిక్ వాహనాలు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కంట్రోల్ ఆప్షన్లు, క్రూయిజ్ మోడ్ ఫీచర్ల ఉన్నాయి. 10 వేరియంట్ కలర్స్లో లభ్యం అవుతుంది. అథర్ ఎనర్జీ 450ఎక్స్ జనరేషన్ 3 పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ జాబితాలో అథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు పేరు గడించాయి. వీటి రైడింగ్ రేంజ్ 146 కిలోమీటర్లకు 8.7బీపీహెచ్ పవర్ను ప్రొడ్యూజ్ చేస్తుంది. అథర్ ఎనర్జీ డిజైన్ చేసిన ఈ స్కూటర్లో డిజిట్ డ్యాష్ బోర్డ్, టైర్ ప్రెజర్ మానిటర్, మ్యాప్, కాలింగ్ డీటెయిల్స్తో పాటు ఇతర సదుపాయాలుండగా.. ఈ స్కూటర్ మోస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో నిలిచింది. ఓకినావా ఒకి 90 ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒకినావాకు చెందిన ‘ఓకినావా ఒకి 90’ కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో సిగ్నల్స్, వెహికల్స్ ఓవర్ టేక్ చేసే సమయంలో వాహనదారుల్ని సురక్షితంగా ఉంచేలా డే టైం రన్నింగ్ లైట్స్, ఫాస్ట్ ఛార్జింగ్, 140కేఎం రైడింగ్ రేంజ్, టాప్ స్పీడ్ 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 16 అంగుళాల వీల్తో ..లార్జెస్ట్ వీల్ సెగ్మెంట్లో ఈ వెహికిల్ నిలిచింది. దీంతో పాటు బూట్ స్పేస్ 40 లీటర్ల సౌకర్యం ఉంది. హీరో ఎలక్ట్రిక్ ఎడ్డీ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో హీరో ఎలక్ట్రిక్ డిఫరెంట్ డిజైన్లతో వెహికల్స్ను విడుదల చేస్తుంది. వాటిలో హీరో ఎలక్ట్రిక్ ఎడ్డీ ప్రత్యేకం. ఈ వెహికల్స్లో మ్యాక్సిమం రైడింగ్ రేంజ్ 85కేఎం ఉండగా టాప్ స్పీడ్ 25కేఎంపీహెచ్గా నిలిచింది. ఈ స్కూటీలో యాక్సిలేటర్తో పనిలేకుండా స్థిరమైన వేగంతో నడింపేందుకు ఉపయోగపడే క్రూయిస్ కంట్రోల్, డిజిటల్ ఇనస్ట్రుమెంట్ క్లస్, బ్లూటూత్ ట్రాకింగ్, ఫాలోమీ హీడ్ ల్యాంప్, ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.72వేలుగా ఉంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ సైతం హీరో ఎలక్ట్రిక్ సంస్థ వెహికల్స్లో మోస్ట్ పాపులర్ బ్రాండ్గా పేరు సంపాదించింది. ఈ స్కూటర్ను సింగిల్ ఛార్జ్తో 140కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. డిటాచ్బుల్ ఎలక్ట్రిక్ బ్యాటరీ. ఈ సౌకర్యంతో మీ పనిపూర్తయిన వెంటనే వెహికల్ నుంచి ఆ బ్యాటరీని వేరే చేయొచ్చు. టాప్ స్పీడ్ 45కేఎంపీహెచ్ ఉన్న ఈ స్కూటర్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,యూఎస్బీ పోర్ట్ సౌకర్యం ఉంది. చదవండి👉 రతన్ టాటా-నీరా రాడియా సంభాషణల టేపు లీక్! ఎనిమిదేళ్ల తర్వాత.. -
లక్ష రూపాయల లోపు లభించే సూపర్బైక్స్ ఇవే!
సాక్షి, ముంబై: 190 మిలియన్లకు పైగా వాహనాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్గా నిలస్తోంది ఇండియా. ముఖ్యంగా హోండా,హీరో, బజాజ్, టీవీఎస్ లాంటి కంపెనీలతోపాటు బీఎండబ్ల్యూ లాంటి లగ్జరీ బైక్లో మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఎక్కువ మైలేజీ, స్మార్ట్ ఫీచరలతో లభించే ట్రెండీలుక్స్తో సరసమైన ధరలో లభించే బైక్స్పై కొనుగోలుదారులు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్ష రూపాయలలోపు ధరలో అందుబాటులోఉన్న బైక్లపై ఓ లుక్కేద్దాం. హోండా ఎస్పీ125 బీఎస్-6 నిబంధనలకుఅనుగుణంగా వచ్చిన హోండా తొలి బైక్ హోండా ఎస్పీ 125. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్తో కూడిన BS6 కంప్లైంట్ 125cc ఇంజన్తో10.5bhp గరిష్ట శక్తిని 10.3Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈబైక్ రెండు వేరియంట్లలో, 5 కలర్స్లో లభిస్తోంది. ప్రారంభ ధర రూ. 82,243 (ఎక్స్-షోరూమ్) హీరో గ్లామర్ హీరోకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బైక్లలో ఒకటి హీరో గ్లామర్ ..124.7cc ఇంజన్తో పనిచేస్తుంది.ఇది 10.72 bhp శక్తిని, 10.6 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బీఎస్-6 కంప్లైంట్ మోడల్తో చిన్న మార్పులతో మేక్ఓవర్ అయిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.78,753 హీరో గ్లామర్ 12 వేరియంట్లు,13 కలర్ ఆప్షన్లలో లభ్యం. హోండా షైన్ హోండా షైన్ కూడా ఈ సెగ్మెంట్లో చాలా పాపులర్ బైక్. 124cc సింగిల్ సిలిండర్ఎయిర్-కూల్డ్ ఇంజన్తో పనిచేస్తుంది. 10 bhp , 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 కలర్ ఆప్షన్లలో లభ్యమవుతున్న హోండా షైన్ ధర రూ.77,338 (ఎక్స్-షోరూమ్) హీరో సూపర్ స్ప్లెండర్ హీరో ఐకానిక్ బైక్ స్ప్లెండర్ ప్రీమియం వెర్షన్ హీరో సూపర్ స్ప్లెండర్. ఇది 124.7సీసీ ఇంజన్ 10.72 bhp, 10.6 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రారంభ ధర రూ. 77,939 . టీవీఎస్ రైడర్ 125 టీవీఎస్ రైడర్ 125 124.8cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, త్రీ-వాల్వ్ ఇంజన్తో 11.2 bhp శక్తిని , 11.2 Nm గరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది. 4 కలర్స్, 3 వేరియంట్లలో లభ్యం. అద్భుతమైన డిజైన్తో ఆకట్టుకునే ఈ బైక్ ప్రారంభ ధర రూ. 88,078(ఎక్స్-షోరూమ్) బజాజ్ పల్సర్ 125 బజాజ్ పల్సర్ 125 ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న పల్సర్ మోనికర్తో అత్యంత సరసమైన బైక్. రూ. 82,712 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర. 4 వేరియంట్లు 3 కలర్ ఆప్షన్లలో లభ్యం.ఈ బైక్లోని 124.4 సీసీ, ఎయిర్-కూల్డ్, DTSI ఇంజన్తో 1.64 bhp , 10.8 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. -
ఇలా అవుతుందనుకోలేదు, ఆ హీరోయిన్తో సినిమా చేయను
ఒడియా హీరో బాబుషాన్ మెహంతి, హీరోయిన్ ప్రకృతితో కారులో కనిపించాడు. ఇంకేముందీ విషయం తెలుసుకున్న హీరో భార్య తృప్తి వారికి నడిరోడ్డు మీదే ఆపి హీరోయిన్ను చెడుగుడు ఆడుకుంది. జుట్టుపట్టుకుని లాగుతూ ప్రకృతిపై దాడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తాజాగా దీనిపై హీరో బాబుషాన్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'వైరల్గా మారిన మా వీడియోను చూసి ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. కానీ నేను మీకో విషయాన్ని స్పష్టం చేయాలి. చెన్నైలో ఓ ఈవెంట్కు వెళ్లాను, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు ప్రకృతిని కూడా పిలిచారు. నిజానికి మేమిద్దరం త్వరలో ఓ సినిమా చేయబోతున్నాం, దాన్ని అధికారికంగా ప్రకటించాలనుకునేలోపే ఇలా జరిగింది. నా కుటుంబం ఈ రకంగా ఆలోచిస్తుందని ఊహించలేదు. ప్రకృతి వాళ్లకు సమస్య అయితే ఆమెతో నేను సినిమా చేయను.. ఇంకా అవసరమైతే భవిష్యత్తులోనూ ఏ హీరోయిన్తో పని చేయను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: హీరోయిన్పై హీరో భార్య దాడి, వీడియో వైరల్ కేటీఆర్ గారూ, ఈ సినిమాల మీద ఓ లుక్కేయండి.. -
టార్గెట్ 10 కోట్ల అమ్మకాలు..ఈవీ రంగంలోకి మరో దిగ్గజ సంస్థ!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలో అంతర్జాతీయంగా నాయకత్వ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుంది. పరిమాణం పరంగా సంప్రదాయ ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో ఇప్పటికే అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో ఉంది. పండుగల సీజన్ నాటికి భారత ఈవీ విపణిలో కంపెనీ రంగ ప్రవేశం చేయనుంది. విదా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సంస్థ ప్రవేశపెట్టనుంది. ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ పెట్టుబడులు చేసింది. కాగా, 2021–22లో సంస్థ రూ.29,802 కోట్ల టర్నోవర్ సాధించింది. 1984 నుంచి 2011 మధ్య 10 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి భారీ మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. 2030 నాటికి మరో 10 కోట్లు.. ‘ఈ ఏడాది హీరో మోటోకార్ప్ పర్యావరణ అనుకూల వాహన విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా తన నాయకత్వాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ రంగానిదిగా మారుస్తుంది. తదుపరి దశాబ్దానికై సిద్ధంగా ఉన్నాం’.2030 నాటికి మరో 10 కోట్లు వాహనాల్ని అమ్మేదిగా ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు వాటాదార్లకు ఇచ్చిన సందేశంలో సంస్థ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ స్పష్టం చేశారు. -
బైక్ లవర్స్కు బంపరాఫర్!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ‘డర్ట్ బైకింగ్ చాలెంజ్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 45 నగరాల్లో 90 రోజుల పాటు ఐదు స్థాయిల్లో ఈ పోటీని నిర్వహించనుంది. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు, రెండో స్థానంలో వచ్చిన ఇద్దరికి హీరో ఎక్స్పల్స్ 200 4వీ మోటార్సైకిళ్లు, స్పాన్సర్షిప్ కాంట్రాక్టులు లభిస్తాయి. వీటి విలువ దాదాపు రూ.20 లక్షల మేరకు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని నవంబర్లో ఎంటీవీతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్ వీఓఓటీలోనూ టెలీకాస్ట్ చేస్తారు. చక్కటి డ్రైవింగ్ నైపుణ్యాలు కలిగిన యువత రేసింగ్ విభాగంలో ఎదిగేందుకు ఇది ఉత్తమ వేదిక అవుతుందని హీరో మోటాకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజీవ్జిత్ సింగ్ వివరించారు. -
‘కరణ్ అర్జున్’ హీరో నరసన్నపేట కుర్రోడే
సాక్షి,నరసన్నపేట(శ్రీకాకుళం): తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం విడుదలవుతున్న ‘కరణ్ అర్జున్’ సినిమాలో హీరో నరసన్నపేట కుర్రాడే. పట్టణానికి చెందిన డాక్టర్ పొన్నాన సోమేశ్వరరావు కుమారుడు పొన్నాన మోహిత్ అభిమన్యు ఈ సినిమాలో హీరో. నరసన్నపేటలోనే పుట్టి పెరిగి సినిమాలపై ఉన్న ఆకాంక్షతో హైదరాబాద్ వెళ్లి మొదట్లో కొన్ని షార్ట్ఫిల్మ్లు చేశారు. ఇప్పుడు హీరోగా ప్రజల ముందుకు వస్తున్నారు. ఆర్ఆర్ థ్రిల్లర్స్ ప్రొడక్షన్స్పై కరణ్ అర్జున్ నిర్మించారు. మోహన్ శ్రీ వత్స కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. నూతన నటి షఫా హీరోయిన్గా నటిస్తున్నారు. నరసన్నపేటలో హీరో హీరోయిన్లు మాట్లాడుతూ సినిమాను ఆదరించాలని కోరారు. -
విషాదం: గుండెపోటుతో టాలీవుడ్ హీరో మృతి
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సింగర్ కేకే మృతి నుంచి కోలుకోకముందే మరో హీరో మృతి చెందారు. వరం, బ్యాచిలర్స్ సినిమాల్లో కథానాయకుడిగా నటించిన సత్య గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సత్య పూర్తి పేరు వి.రామసత్యనారాయణ. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో హీరో స్నేహితుడి పాత్రలు పోషించారు. తర్వాత వరం మూవీతో కథానాయకుడిగా మారారు. ఈ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు. ఆ తర్వాత బ్యాచిలర్స్ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో సినీ ఇండస్ట్రీకి గుడ్బై చెప్పి బిజినెస్పై దృష్టి పెట్టారు. ఇక కరోనా సమయంలో తల్లిని, భార్యను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు సత్య. అప్పటి నుంచి మానసిక క్షోభను అనుభవిస్తున్న ఆయన ఇప్పుడు గుండెపోటుతో మరణించారు. ఆయనకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. ఆయన మరణవార్త తెలిసిన బంధువులు, సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు సత్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం తెలుపుతున్నారు. చదవండి: డబ్బు అవసరమైంది, అందుకే వాటికి ఒప్పుకున్నాను: హీరోయిన్ -
చాలా కాలం తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న తమిళ నటుడు
తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్ తీ ఇవన్ చిత్రం కోసం ఫైట్ చేశారు. ఈయన చాలా కాలం తరువాత కథానాయకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. మనిదన్ సినీ ఆర్ట్స్ పతాకంపై నిర్మలాదేవి జయమురుగన్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి టి.ఎం.జయమురుగన్ కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు రోజా మలరే, అడడా ఎన్న అళగు, సింధుబాద్ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారన్నది గమనార్హం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పిన నటుడు కార్తీక్ పేర్కొంటూ దర్శకుడు కథ చెప్పినప్పుడే అందులోని సత్తా తనకు అర్థం అయ్యిందన్నారు. తమిళ సంప్రదాయాన్ని, మన జీవన విధానాన్ని అందంగా తెరపై చూపించారన్నారు. చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారన్నారు. పాటల రూపకల్పన, చిత్రీకరణ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఈ చిత్రం కోసం తాను నాలుగు పోరాట దృశ్యాల్లో నటించానని చెప్పారు. చాలా గ్యాప్ తరువాత నటించిన ఈ చిత్రం తన కెరీర్లో మంచి చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని కార్తీక్ పేర్కొన్నారు. చదవండి: Andrew Garfield: బ్రేకప్ చెప్పుకున్న ప్రేమజంట, కారణమే విడ్డూరంగా ఉంది! -
వెండితెరపై ‘రచ్చ’.. ఒకే ఒక్క ఛాన్స్.. అదే అతన్ని హీరోగా మార్చేసింది..
గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): ఒక్క ఛాన్స్.. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునే యువత జపించే మంత్రమిది. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే ఈ రంగంలో రాణించడం కష్టం. తెరమీద మెరవాలంటే కటౌట్ అదిరిపోవాలి. అయితే లక్ష్య సాధనతో శ్రమిస్తే అదృష్టం వెన్నంటే వస్తుందని నిరూపించాడు గుంతకల్లుకు చెందిన పాడి శ్రీధరన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో పడిన శ్రమ చివరకు అతన్ని హీరోగా మార్చేసింది. ఎస్డీవీ క్రియేషన్స్ బ్యానర్లో వెంకటేష్ దర్శకత్వం వహించిన ‘రచ్చ రచ్చ’ సినిమాలో శ్రీధరన్, మాధురి జంటగా నటించారు. ఈ నెల 11న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్కు ధన్యవాదాలు: చిరంజీవి కుటుంబ నేపథ్యం... గుంతకల్లు లోని హెచ్పీసీ డిపో ప్రాంతానికి చెందిన పాడి వెంకటేశులు, పాడి లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పాడి శ్రీధరన్ 1990లో జన్మించారు. అనారోగ్యం కారణంగా 1996లో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి శ్రీధరన్ బరువు బాధ్యతలన్నీ అన్న కిరణ్బాబునే చూసుకునేవారు. శ్రీధరన్కు అన్నతో పాటు ముగ్గురు అక్కలూ ఉన్నారు. గుంతకల్లులోని సెయింట్ మేరీస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పదో తరగతి వరకు, ఎస్కేపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, శ్రీశంకరానందలో డిగ్రీ, హైదరాబాద్లోని సీఎంఆర్ కాలేజీలో ఎంసీఏ పూర్తి చేశారు. అన్నావదినలే తల్లిదండ్రులు లేని లోటును తీర్చి బాగా చదివించారు. సినిమాలంటే మక్కువ.. శ్రీధరన్ తండ్రి వెంకటేశులు ప్రముఖ రంగస్థల నటుడు. తండ్రి స్ఫూర్తితో తానూ నటుడిగా రాణించాలనుకున్నారు. హైదరాబాద్లో ఎంసీఏ పూర్తి చేశాక సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక్క ఛాన్స్ ఇస్తే తన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తానంటూ సినీ పరిశ్రమలోని దర్శకుల చుట్టూ తిరిగారు. 2014లో తొలిసారిగా ‘డెవిల్స్ బుక్’ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అనంతరం లయన్, డిక్టేటర్, జిల్, చుట్టాలబ్బాయి తదితర సినిమాల్లో సైడ్ రోల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. 2021లో ఓటీటీ ద్వారా ప్రదర్శింపబడిన ‘మరణ శ్వాస’ సినిమాలో హీరోగా అరంగ్రేటం చేశారు. సెలబ్రెటీగా ఎదగాలన్నదే నా లక్ష్యం.. సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. రంగస్థల నటుడిగా మా నాన్న చాలా నాటికల్లో నటించారు. 2014లో మొట్టమొదటి సారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. వెండితెరపై వెలగాలన్న నా కలను నిజం చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డాను. నటనలో నా ప్రతిభను గుర్తించిన ఎస్డీవీ క్రియేషన్స్ వారు రచ్చ రచ్చ సినిమా ద్వారా హీరోగా అవకాశమిచ్చారు. నిర్మాతలు... దర్శకుల సహకారం, ప్రేక్షక దేవుళ్ల ఆదరాభిమానాలతో భవిష్యత్తులో మంచి సినిమాల్లో నటించి ఒక సెలబ్రెటీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నా. – పాడి శ్రీధరన్, సినీ హీరో -
తెలుగులో హీరోగా పుష్ప ఫేమ్ 'జాలిరెడ్డి'..
Pushpa Fame Jolly Reddy Turns As Hero For Badawa Rascal: కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన 'బడవ రాస్కెల్' చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల అవడానికి సిద్ధమవుతుంది. డాలీ పిక్చర్స్ మరియు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగులో పలు విజయవంతమైన సినిమాలను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఈ బ్లాక్ బస్టర్ సినిమా అందిస్తుండడం విశేషం. తెలుగులో భారీ విజయం సొంతం చేసుకున్న పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్రతో ప్రేక్షకులను అలరించిన ధనుంజయ్ ఈ సినిమాలో హీరోగా నటించగా అమృత అయ్యంగార్ హీరోయిన్గాగా నటించింది. గీతా శివరాజ్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని సావిత్రమ్మ అడవి స్వామి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శంకర్ గురు దర్శకత్వం వహించారు. తొందరలోనే ఈ సినిమా కు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. -
పదిహేనేళ్ల తర్వాత ‘హీరో’ కోసం థియేటర్కు వెళ్లాను : జగపతిబాబు
‘‘పదిహేనేళ్లుగా థియేటర్స్కు వెళ్లని నేను ‘హీరో’ సినిమా కోసం వెళ్లాను. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాను. పెద్ద సినిమాల్లో నటించిన నాకు కొత్త దర్శకులతో చేయాలనిపించలేదు. అందుకే ‘హీరో’ చేసేటప్పుడు నా పాత్ర పండుతుందా? లేదా అనిపించింది. కానీ నా అంచనాలు తారుమారయ్యేలా చేశారు దర్శకుడు శ్రీరామ్. ఈ సినిమా చూశాక గతంలో నేను చేసిన ‘హనుమాన్ జంక్షన్’ చిత్రం గుర్తొచ్చింది. అశోక్లో మంచి తపన కనిపించింది’’ అన్నారు జగపతిబాబు. అశోక్ గల్లా, నిధీ అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హీరో’. పద్మావతి గల్లా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజైంది. ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో అశోక్ మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల మధ్యలో సినిమా చూశాను. వారి పాజిటివ్ రెస్పాన్స్ తెలిసింది’’ అన్నారు. ‘‘అశోక్ పడిన కష్టం తెరపై తెలుస్తోంది. థియేటర్స్లో నిజమైన పండగ కనిపిస్తోంది’’ అన్నారు శ్రీరామ్. ∙శ్రీరామ్ ఆదిత్య, నిధీ అగర్వాల్, గల్లా జయదేవ్, పద్మావతి, అశోక్, జగపతిబాబు -
RIP Magawa: ‘చిట్టి హీరో’ అస్తమయం
మగావా.. డ్యూటీలో చాలా సిన్సియర్. రోజూ ఫీల్డ్లోకి దిగి ల్యాండ్మైన్లను పసిగట్టడం. వందల మంది ప్రాణాలు రక్షించడం. ఇదంతా ఇన్ ది స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. ఇట్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్.. ఇట్ ఈజ్ ఆల్ టైం రికార్డ్!!. సూపర్ హీరోకి అర్హతలేంటని అడిగితే.. ఏవేవో చెప్తుంటారు కొందరు. కానీ, ఆ అర్హతలేవీ లేకుంటే?.. ఆ సూపర్ హీరో అసలు మనిషి కాకుంటే!! యస్.. మాగావా మనిషి కాదు. ఓ ఎలుక. సాధారణమైంది మాత్రం కాదు. ల్యాండ్ మైన్లను గుర్తించడంలో కఠోర శిక్షణ తీసుకుంది. తన విధి నిర్వహణలో నిబ్ధదత ప్రదర్శించిన ఈ ఎలుక.. ఈమధ్యే కన్నుమూసింది. అందుకే సోషల్ మీడియాలో అంత ఎమోషనల్ అవుతున్నారు. టాంజానియా బ్రీడ్కు చెందిన మగావాను కంబోడియా తీసుకొచ్చి.. ల్యాండ్మైన్లను గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో వందకి పైగా ల్యాండ్ మైన్లను గుర్తించింది. తద్వారా ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ఈ చిట్టి హీరో. 2020లో మాగ్వా యూకేకి చెందిన ఓ ఆర్గనైజేషన్ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకుంది మగావా. కిందటి ఏడాది జూన్లో విధుల నుంచి రిటైర్ అయిన ఈ ఎలుక.. చివరికి ఎనిమిదేళ్ల వయసులో ఈమధ్యే కన్నుమూసింది. ఈ విషయాన్ని దానికి శిక్షణ ఇచ్చిన APOPO అనే బెల్జియం ఎన్జీవో ప్రకటించింది. అంతర్యుద్ధంతో దశాబ్దాలపాటు నలిగిపోయిన కంబోడియా.. ల్యాండ్మైన్ల గనిగా ఒక పేరు దక్కించుకుంది. వీటి ధాటికి వందల మంది ఏటా ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అందుకే రిస్క్ లేకుండా ఎలుకలకు ల్యాండ్మైన్లను గుర్తించే శిక్షణ ఇప్పిస్తున్నారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో ల్యాండ్మైన్లతో పాటు టీబీ రోగి శాంపిల్స్ గుర్తించేందుకు ఎలుకలను ఉపయోగిస్తున్నారు. విశేషం ఏంటంటే.. చాలా సందర్భాల్లో ఇవి విజయవంతంగా ఆపరేషన్ను పూర్తి చేస్తున్నాయి కూడా. అందుకే ఆ ర్యాట్హీరోలకు ఓ సలాం కొడుతూ.. RIP Magawa. -
సంక్రాంతి బరిలో పది సినిమాలు!
సంక్రాంతి వస్తోందే తుమ్మెద కొన్ని సినిమాలు తేనుందే తుమ్మెద సినీ కాంతి పంచనుందే తుమ్మెద సినీ ప్రేమికులను ఖుషీ చేయనుందే తుమ్మెద కలెక్షన్లతో బాక్సాఫీస్ కళకళలాడనుందే తుమ్మెద మొత్తం ఎన్ని సినిమాలు వస్తాయంటే తుమ్మెద... పది వరకూ రావొచ్చు తుమ్మెద. ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం తుమ్మెద. సంక్రాంతి బరిలో నిలిచిన ప్యాన్ ఇండియన్ మూవీ ‘రాధేశ్యామ్’. ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు. 1970 యూరప్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ పీరియాడికల్ లవ్స్టోరీ చిత్రానికి కె. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఈ చిత్రంలో జ్యోతిష్కుడిగా ప్రభాస్, డాక్టర్ ప్రేరణగా పూజా, పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపిస్తారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఇక ఇదే రోజున చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన ‘సూపర్ మచ్చీ’, సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డిజె టిల్లు’ చిత్రాలు కూడా రిలీజ్కు రెడీ అయ్యాయి. పులి వాసు దర్శకత్వంలో ‘సూపర్ మచ్చీ’ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మించగా, కన్నడ బ్యూటీ రచితా రామ్ హీరోయిన్గా నటించారు. ఇటు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఇక పండగ రోజున అంటే జనవరి 15న తొలిసారి ‘హీరో’గా వస్తున్నాడు మహేశ్బాబు మేనల్లుడు గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని గల్లా పద్మావతి నిర్మించారు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల... ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ మూవీ ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) ఈ నెల 7న విడుదల కావాల్సింది. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్లో సీటింగ్ సామర్థ్యం, కొన్ని రాష్ట్రాల్లో సినిమాల ప్రదర్శనల నిలిపివేత వంటి కారణాల చేత జనవరి 7న సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నామని చిత్రబృందం వెల్లడించింది. ఇలా ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిన వల్ల సంక్రాంతికి రిలీజయ్యేందుకు సినిమాలు క్యూ కట్టాయి. ఇక జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కన్ఫార్మ్ కాకముందు సంక్రాంతికి వస్తామంటూ ముందు ప్రకటించిన చిత్రాల్లో మహేశ్బాబు ‘సర్కారువారి పాట’, పవన్ కల్యాణ్ – రానాల ‘భీమ్లా నాయక్’ వెంకటేశ్–వరుణ్తేజ్ల ‘ఎఫ్ 3’ చిత్రాలు ఉన్నాయి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం జనవరి 7న వస్తామని చెప్పిన తర్వాత ‘సర్కారువారి పాట’ చిత్రం ఏప్రిల్ 1కి, ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25కి , వెంకటేశ్–వరుణ్తేజ్ల ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 29కి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. పండగకు ముందే అతిథి దేవో భవ సంక్రాంతి పండగకి వారం ముందే రానున్న చిత్రం ‘అతిథి దేవో భవ’. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ చిత్రంలో సువేక్ష హీరోయిన్. ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ను ప్రకటించారు. ‘‘ఇది మంచి స్పాన్ ఉన్న సినిమా. కథ కొత్తగా ఉంటుంది. క్యారెక్టర్స్ అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. పండగ సీజన్లో వస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్గా ఉంది’’ అని ఆది సాయికుమార్ అన్నారు. ‘‘ఆది సాయికుమార్లోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రం ఇది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలకు, ట్రైలర్కి మంచి స్పందన లభించింది’’ అన్నారు దర్శకుడు. ఇప్పటివరకు సంక్రాంతి రేసులో నిలిచిన చిత్రాల్లో విడుదల తేదీలను ఖరారు చేసుకున్న చిత్రాల గురించి చెప్పుకున్నాం. ఇక పండగ రేసులో ఉన్నామంటూ ఇంకా రిలీజ్ డేట్ను ప్రకటించని చిత్రాల్లో ‘బంగార్రాజు’ ముందు వరుసలో ఉన్నాడు. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’. ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీ చెప్పలేదు. జనవరి 13 లేదా 15 తేదీల్లో ‘బంగార్రాజు’ థియేటర్స్కు వస్తాడట. అలాగే ‘7 డేస్ 6 నైట్స్’, ‘రౌడీ బాయ్స్’ చిత్రబృందాలు సంక్రాంతి రిలీజ్లను కన్ఫార్మ్ చేశాయి కానీ విడుదల తేదీ విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. బ్యాచ్లర్ ట్రిప్ కోసం గోవా వెళ్లిన ఇద్దరు యువకులు, మరో ఇద్దరు యువతుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇక ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ‘హుషారు’ వంటి హిట్ మూవీ తీసిన హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలే కాదు... సంక్రాంతి బరిలో నిలిచేందుకు మరో రెండు సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయని ఫిల్మ్నగర్ సమాచారం. -
Sarath Babu: శరత్బాబు నట వారసుడు హీరోగా ఎంట్రీ
Actor Sarath Babu Nephew Introduced As Hero With Daksha Movie : ప్రముఖ నటుడు శరత్బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. ఈ చిత్రంలో అను, నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను తనికెళ్ల భరణి, శరత్కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల మాట్లాడుతూ – ‘‘దక్ష’ అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడని అర్థం. అతడే మా తల్లాడి సాయికృష్ణ. చిన్న స్థాయి నుంచి వచ్చిన సాయికృష్ణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఆయుష్ నాక్కూడా కొడుకులాంటివాడే. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు శరత్బాబు. ‘‘హీరో అవ్వాలన్న నా కల ఈ చిత్రంతో నేరవేరింది. ఈ థ్రిల్లర్ మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అన్నారు ఆయుష్. ‘‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత తల్లాడ సాయికృష్ణ. -
హీరోగా మారనున్న బండ్ల గణేష్!.. ఇక దబిడిదిబిడే..
కమెడియన్గా తెలుగు తెరకు పరిచయం అయిన బండ్ల గణేష్.. ఆ తర్వాత నిర్మాతగా మారాడు. బ్లాక్ బస్టర్ సినిమాలతో నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత నటుడిగా దూరమైన ఆయన ఇటీవలి కాలంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు. మహేష్బాబుతో కలిసి ట్రైన్ ఎపిసోడ్లో కనిపించి మరోసారి బండ్ల గణేష్ నవ్వులు పంచాడు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇకపై అలాంటి పాత్రలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇటీవలె ఆయనకు తమిళ రీమేక్లో నటించిన అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్హిట్ అయిన మండెల రీమేక్లో హీరోగా నటించాలని దర్శకుడు బండ్లను అప్రోచ్ అవగా, అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తమిళంలో ప్రముఖ కమెడియన్ యోగిబాబు చేసిన పాత్రలో నటించేందుకు సిద్ధంగా లేనని చెప్పారట. అయితే తాజాగా మరోసారి బండ్ల గణేష్కు హీరోగా ఛాన్స్ వచ్చిందట. వెంకట్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథతో బండ్ల గణేష్ సంతృప్తి చెందారని, దీంతో ప్రధాన పాత్ర పోషించేందుకు ఆయన గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీలో నటించేందుకు బండ్ల ఓకే చెప్పారని, అంతేకాకుండా ఈ సినిమాను స్వయంగా ఆయనే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అన్నది త్వరలోనే చూడాలి మరి. -
దూసుకెళ్తున్న ‘హీరో’..అప్పుడే 4M వ్యూస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అమరరాజ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ ఖారారు చేసింది చిత్రబృందం. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. సూపర్ స్టార్ మహేశ్ విడుదల చేసిన ‘హీరో’ టీజర్కు మంచి ఆదరణ లబిస్తుంది. ఇప్పటికే టీజర్కు 4మిలియన్ల వ్యూస్ వచ్చాయి. Remarkable #𝐇𝐄𝐑𝐎TitleTeaser hits 4️⃣ Million Views! ▶️ https://t.co/OIenFMIfqL#Hero@AshokGalla_ @SriramAdittya #PadmavathiGalla @AgerwalNidhhi @IamJagguBhai @JayGalla @ravipatic @GhibranOfficial @amararajaent @WhackedOutMedia pic.twitter.com/54it7718FW — BARaju's Team (@baraju_SuperHit) June 24, 2021 టీజర్లో అశోక్ కౌబాయ్ గెటప్లో కనిపించారు. గుర్రంపై ఆ ట్రైన్ను ఫాలో అవుతూ ఇచ్చిన అశోక్ ఎంట్రీ టీజర్కు హైలెట్గా చెప్పుకోవచ్చు. అంతేగాక హీరో జోకర్ గేటప్లో సైకోగా కనిపించగా మరోచోట రోమియోగా దర్శనం ఇచ్చాడు. టీజర్ మొత్తంలో అశోక్ మూడు పాత్రల్లో కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. దాదాపు షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. జగపతిబాబు, నరేష్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. చదవండి : ఆకట్టుకుంటున్న మహేశ్ మేనల్లుడి ‘హీరో’ టీజర్ -
బాప్రే.. గుర్తుపట్టలేనంతలా మారిపోయిన హీరో
వయసుపైబడే కొద్దీ హీరోయిన్లు తమ గ్లామర్ను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక హీరోల్లో కూడా కొందరుపడే తాపత్రయం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కానీ, సినిమా కోసం ఎంతటి కష్టానినైనా ఒర్చుకునే ‘డెడికేటెడ్ యాక్టర్స్’ కొందరే ఉంటారు. అలాంటి వాళ్లలో హాలీవుడ్ నటుడు బ్రెండన్ ఫ్రాజర్ ఒకరు. మమ్మీ సిరీస్ సినిమాలతో మనదగ్గరా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. గుర్తుపట్టలేనంతలా మారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్రెండన్ ఫాజర్.. జార్జ్ ఆఫ్ ది జంగిల్, మమ్మీ, బ్రేక్ అవుట్ లాంటి సినిమాలతో వరల్డ్వైడ్గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. 52 ఏళ్ల ఈ హాలీవుడ్ స్టార్ శుక్రవారం రాత్రి న్యూయార్క్లో జరిగిన ట్రైబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో ‘నో సడన్ మూవ్’ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యాడు. అయితే బయట ఉన్న ఫొటోగ్రాఫర్లు ఆయనెవరో అనుకుని చాలాసేపు పట్టించుకోలేదు. చివరికి.. నటుడు డాన్ చెడల్ ఆయన దగ్గరికి రావడంతో.. అప్పుడు విషయం తెలుసుకుని ఫ్రాజర్ను క్లిక్ మనిపించారు. ఫ్రాజర్ ప్రస్తుతం ‘ది వేల్’ అనే ప్రాజెక్టు చేస్తున్నాడు. కూతురికి దగ్గరవ్వాలని ప్రయత్నించే తండ్రి క్యారెక్టర్ అందులో ఆయనది. తన పార్ట్నర్ చనిపోయాక ఈటింగ్ డిజార్డర్తో బాధపడే ఛార్లీ పాత్రలో ఫ్రాజర్ కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ కోసమే ఇంత భారీగా లావుగా తయారయ్యాడు ఫ్రాజర్. 2018లో ఓ ఇంటర్వ్యూలో బ్రెండన్ ఫ్రాజర్ తన ఫెయిల్యూర్ ఫిట్నెస్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. రియల్ స్టంట్లకు కోసం తన ఒళ్లు హూనం చేసుకున్నానని, ఇకపై అలాంటి ప్రయోగాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. ఇక ఆరోగ్య సమస్యలతోనే 2014 నుంచి ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు ఫ్రాజర్. అంతేకాదు గతంలో తనకు చాలా సర్జరీలు జరిగాయని, వెనుక పిరుదుల దగ్గర భాగం తొలగించుకోవడం, వెన్నెముకకు సర్జరీ, మోకాలి చిప్ప రిప్లేస్మెంట్, గొంతు భాగంలో ఆపరేషన్లు చేయించుకున్నానని, వాటి ప్రతికూల ప్రభావమూ తన శరీరంపై పడిందని గుర్తు చేసుకుని బ్రెండన్ ఫ్రాజర్ బాధపడ్డాడు. చదవండి: జస్టిస్ లీగ్.. పోర్న్ సినిమానా? -
హీరోగా పరిచయం అవుతున్న 'సై' ఫేం శ్రవణ్
‘సై, దూకుడు, శ్రీమంతుడు, బిందాస్, మగధీర, ఏక్ నిరంజన్’ తదితర చిత్రాల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఎదురీత’. బాలమురుగన్ దర్శకత్వం వహించారు. లియోనా లిషోయ్ హీరోయిన్గా నటించారు. బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘40 ఏళ్ల మధ్యతరగతి తండ్రికి కుమారుడిపై ఉన్న ప్రేమ ఎన్ని సమస్యలు తీసుకువచ్చింది అనేది మా సినిమా కథాంశం. ప్రతి తండ్రి, ప్రతి కుమారుడి హృదయాన్ని హత్తుకునేలా భావోద్వేగాలు ఉంటాయి. సినిమా సెన్సార్ పూర్తయింది. త్వరలో పాటలు విడుదల చేసి, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. -
మాట తప్పిన ప్రముఖ కమెడియన్
హాస్యనటుడు వడివేలు మరోసారి హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తమిళంలో మరుదమలై, తలైనగరం సినిమాలను డైరెక్ట్ చేసిన సూరజ్ దర్శకత్వంలో వడివేలు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లో స్టార్ట్ కానుందని కోలీవుడ్ సమాచారం. సూరజ్ డైరెక్ట్ చేసిన ‘మరుదమలై, తలై నగరం’ ఈ రెండు సినిమాల్లోనూ వడివేలు కీలక పాత్రల్లో నటించారు. సో... ఇప్పుడు వడివేలు హీరోగా సూరజ్ సినిమా సెట్స్పైకి వెళ్తుందని ఉహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఇంతకుముందు ‘ఇమ్సై అరసన్ 23ఆమ్ పులికేసి’, ‘తెనాలిరామన్ ’ వంటి సినిమాల్లో వడివేలు హీరోగా నటించారు. అయితే తాను మరోసారి హీరోగా నటించనని కమెడియన్ వడివేలు గతేడాది ప్రకటించారు. అయినప్పటికీ ఆయనకు సినిమా అవకాశాలు వస్తుండటంతో మరోసారి హీరోగా నటించడానికి ఓకే చెప్పారు. -
మీ అందరికి రుణపడి ఉంటా.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్
సరిగ్గా 18 ఏళ్ల క్రితం.. యావరేజ్ లుక్స్తో, మూతిపై మీసం కూడా సరిగ్గా మొలవని ఓ యువకుడు టాలీవుడ్లోకి కథానాయకుడిగా ఆరంగ్రేటం చేశాడు. మెగా ఫ్యామిలీ హీరోగా కెరీర్ మొదలుపెట్టినప్పటకీ ఆ మార్క్తో సంబంధం లేకుండా స్వయం కృషితో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో ఫ్యాషన్, స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్గా మారాడు. అతడే మన ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్. బన్నీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నేటికి 18 సంవత్సరాలు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీటర్లో ఒక ఎమోషనల్ పోస్ట్ ను పెట్టాడు. “నా మొదటి సినిమా వచ్చి 18 ఏళ్ళు అయ్యింది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో మొదటి నుంచి నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను, నా గుండె నిండా వారందరి పట్ల కృతజ్ఞత ఉందని, ఇన్నేళ్ళుగా నాపై వారందరు కురిపించిన ప్రేమకు రుణపడి ఉంటానని” తెలియజేస్తూ బన్నీ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. కాగా, మార్చి 28న దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తో చేసిన “గంగోత్రి” లో హీరోగా పరిచయమైన బన్ని, ఆ చిత్రం విడుదలకు ముందు తన లుక్స్పై అప్పట్లో గుసగుసలు వినబడ్డాయి. వాటన్నింటిని అధిగమిస్తూ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి అపారమైన అభిమానాన్ని, స్టైలిష్ స్టార్ బిరుదుని సొంతం చేసుకున్నాడు. యూత్ ఐకాన్గా నిలిచాడు. నాటి ‘గంగ్రోతి’ మొదలు నిన్నటి ‘అల వైకుంఠపురములో’ వరకు హీరో స్థాయి నుంచి స్టార్ హీరో స్టేటస్ను సంపాదించాడు. బన్నీ ‘అల వైకుంఠపురములో’, సుకుమార్ ‘రంగస్థలం’ చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తుతం వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా వస్తున్న “పుష్ప” పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ( చదవండి : అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. ఓపెనింగ్ ఎప్పుడంటే! ) It’s has been 18years since my first film released. I wanted to thank each n everyone who has been a part of my 18years journey. My heart is filled with gratitude. I am truly blessed for all the love showered over the years . Thank you for all the blessings. Gratitude. AA — Allu Arjun (@alluarjun) March 28, 2021 -
హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ హీరో ఎలెక్ట్రిక్ స్కూటర్ పేరు నిక్స్ హెచ్ ఎక్స్. దీని ప్రారంభ ధర రూ.64,540. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలదు. ఇందులో ఆప్టిమా హెచ్ ఎక్స్, నిక్స్ హెచ్ ఎక్స్, ఫోటాన్ హెచ్ ఎక్స్ అనే మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చూడటానికి అన్నిటికంటే పొడవుగా చాలా భిన్నంగా ఉన్నాయి. సామాన్యులు, గ్రామీణ ప్రజలకు తగ్గట్టుగా వీటిని తయారు చేశారు. స్పీడ్, రేంజ్ బట్టి స్కూటర్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ స్కూటర్లలో మోడల్ని బట్టీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 82 కిలోమీటర్ల నుంచి 210 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తాయి. ఇందులో ప్రారంభ మోడల్ 82 కిలోమీటర్లు వెళ్తే టాప్ మోడల్ 210 కిలోమీటర్లు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లలో నిక్స్ హెచ్ ఎక్స్ హై స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు. అంటే ఇది సిటీలో ప్రయాణించేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. వెనక రైడర్కి మూడు గ్రాబ్ రెయిల్స్ ఉన్నాయి. ఓ బాటిల్ హోల్డర్ ఉంది. దీనికి 1.536 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇస్తున్నారు. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తుంది. ఎవరైనా హీరో బైక్ లేదా స్కూటర్ను ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో పొందాలనుకుంటే డౌన్ పేమెంట్ రూ.4999 ఉంది. వడ్డీ రేటు రూ.6.99గా నిర్ణయించింది కంపెనీ. పూర్తీ వివరాల కోసం హీరో ఎలక్ట్రిక్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. చదవండి: సింగిల్ ఛార్జింగ్ తో 240 కి.మీ ప్రయాణం -
చిట్చాట్ విత్ షాదీ ముబారక్ హీరో
-
త్వరలో ప్రముఖ టాలీవుడ్ హీరో పెళ్లి!
ప్రముఖ నిర్మాత, డర్టీ హరి దర్శకుడు ఎమ్ఎస్ రాజు ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. ఆయన తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ తొందర్లోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. దీపిక అనే అమ్మాయితో ఆయన వివాహం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కాలం కాబట్టి తక్కువ మంది సమక్షంలోనే అదీ హైదరాబాద్లోనే ఈ పెళ్లి తంతును కానిచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. నెట్టింట వైరల్గా మారిన ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే హీరో సుమంత్ అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే! (చదవండి: మూగజీవాన్ని రక్షించిన హీరో, రేణూ ప్రశంస) ఇక సుమంత్ కెరీర్ విషయానికి వస్తే.. తండ్రి ఎమ్ఎస్ రాజు డైరెక్షన్లో 'తూనీగ తూనీగ' సినిమా ద్వారా వెండితెరపై అడుగు పెట్టాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేసిన 'అంతకు ముందు ఆ తరువాత' హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో కొంత బూస్ట్ వచ్చినట్లైంది. ఇక మూడో చిత్రం 'లవర్స్' మాత్రం అతడికి కమర్షియల్ బ్రేకిచ్చి హీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్తో కలిసి 'ఇదే మా కథ'(రైడర్స్ స్టోరీ)లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గురుపవన్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత ఎమ్ఎస్ రాజు) -
‘కేరింత’ నటుడు విశ్వంత్కు నోటీసులు
సాక్షి, బంజారాహీల్స్: డిస్కౌంట్లో కారు ఇప్పిస్తానని ఓ వ్యాపారిని నమ్మించి మోసం చేసిన ఘటనలో సినిమా హీరో విశ్వంత్ (కేరింత,మనసంతా, ఓ పిట్టకథఫేమ్) కు బంజారాహిల్స్ పోలీసులు 41(ఏ) కింద నోటీసులు అందజేశారు. ఈ కేసులో విచారణ కోసం హాజరుకావాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే... రామకృష్ణ అనే వ్యాపారి కారు కొనేందుకు స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ అధినేత ఆత్మకూరి ఆకాష్ గౌడ్ ద్వారా రూ. 25 లక్షల విలువచేసే ఇన్నోవా క్రిస్టా కారును రూ.17.60 లక్షలకు ఇప్పిస్తానని హీరో విశ్వంత్ నమ్మించాడు. అడ్వాన్స్గా రూ.10 లక్షలు తీసుకున్నాడు. మరో నెల తర్వాత రూ. 2.50 లక్షలు ఇచ్చి కారు తీసుకున్నాడు. నెల రోజుల్లో ఈ కారును రామకృష్ణ పేరు మీదికి మారి్పస్తానని, అప్పుడు మిగతా డబ్బులు తీసుకుంటానని చెప్పాడు. రెండు నెలలుదాటినా కారు బదిలీ కాలేదు. ఆరా తీయగా ఆ కారుపై రూ.20 లక్షల అప్పుతీసుకున్నట్లు తెలిసింది. హీరో విశ్వంత్, ఆయన తండ్రి లక్షి్మకుమార్ ఉద్దేశపూర్వకంగా తమను మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపోలీసులు నోటీసు జారీ చేశారు. కాగా విశ్వంత్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ‘కేరింత’ మూవీలో విశ్వంత్ సెకండ్ హీరోగా నటించి టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత మలయాళ నటుడు మోహన్లాల్, గౌతమిలు నటించిన ‘మనమంతా’లో నటించాడు. అనంతరం ఇటీవల వచ్చిన ‘ఓ పిట్టకథ’ మూవీతో పాలు పలు వెబ్ సిరీస్లో కూడా నటించాడు. కాగా కాకినాడ సామర్లకోటకు చెందిన అతడు పదో తరగతి వరకు విశాఖలో చదువుకున్నాడు. ఇంటర్ హైదరాబాద్లో.. ఇంజనీరింగ్ డిగ్రీని కోయంబత్తూర్లో పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువులకు కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే విశ్వంత్కు 2015లో ‘కేరింత’లో నటించే అవకాశం వచ్చింది. -
హీరో యాదా కృష్ణ కన్నుమూత
హీరో, నిర్మాత యాదా కృష్ణ(61) కన్నుమూశారు. బుధవారం ఆయన గుండెపోటులో మృతి చెందారు. యాదా కృష్ణ 20పై పైగా చిత్రాల్లో నటించారు. 'గుప్త శాస్త్రం', 'వయసు కోరిక', 'పిక్నిక్' వంటి బి గ్రేడ్ సినిమాల హీరోగా ఒకప్పుడు ఒక తరహా ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్న యాదా కృష్ణ. ఆ తర్వాత సంక్రాంతి అల్లుడు అనే ఫ్యామిలీ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న యాదా కృష్ణ కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యాడు. కొన్నిచిత్రాలను స్వయంగా నిర్మించారు. యాదా కృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూత
హిందీ నటుడు ఫరాజ్ ఖాన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ‘ఫరీబ్’ (1996), ‘మెహందీ’ (1998) తదితర చిత్రాల్లో హీరోగా నటించారాయన. బాలీవుడ్ నటుడు ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఫేమ్ యూసఫ్ఖాన్ కుమారుడు ఫరాజ్. సల్మాన్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘మైనే ప్యార్కియా’కి మొదటగా ఫరాజ్ఖాన్నే హీరోగా అనుకున్నారు. అయితే సినిమా ప్రారంభానికి ముందు ఫరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో ఆ సినిమా చేసే అవకాశం సల్మాన్ఖాన్ దక్కించుకున్నారు. కాగా కొన్ని వారాల క్రితం పహ్ మాన్ ఖాన్ తన సోదరుడు ఫరాజ్ అనారోగ్యం గురించి చెబుతూ, ఆర్థిక సహాయం కూడా కోరారు. అప్పుడు సల్మాన్ ఖాన్ సహాయం చేశారు. -
వాహన అమ్మకాలు రివర్స్గేర్లోనే..
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం రివర్స్గేర్లోనే పయనిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏకంగా 89% తగ్గుదల నమోదైంది. గతేడాది మే నెల్లో 1,25,552 యూనిట్లను విక్రయించిన ఈ సంస్థ గతనెల్లో 13,888 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. ఇదే విధంగా మిగిలిన కార్ల తయారీ కంపెనీలు కూడా విక్రయాల్లో భారీ తగ్గుదలను ప్రకటించాయి. మరోవైపు ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ మే నెల అమ్మకాలు 83% శాతం తగ్గిపోగా.. వాణిజ్య వాహన రంగానికి చెందిన అశోక్ లేలాండ్ సైతం 90% క్షీణతను నమోదుచేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఏప్రిల్లో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగిన కారణంగా ఆ నెల్లో దాదాపు అన్ని సంస్థలు సున్నా సేల్స్ను ప్రకటించడం తెలిసిందే. -
సామాజిక బాధ్యతతో శక్తి
‘రెమో’, ‘సీమ రాజా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘హీరో’. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించారు. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్. ఈ చిత్రంలో అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రలు చేశారు. తమిళ్లో గతేడాది డిసెంబర్లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘హీరో’ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో తెలుగులో అనువదించారు. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి జె.రాజేష్ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ– ‘‘సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రస్తుత విద్యావ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందింది. విద్యావ్యవస్థపై సినిమా అంటే ‘జెంటిల్మేన్’ సినిమా గుర్తుకు వస్తుంది. ప్రస్తుత విద్యా వ్యవస్థని సరిచేయడానికి ‘జెంటిల్మేన్’ వస్తే మా ‘శక్తి’లా ఉంటాడు. అర్జున్గారు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్లో ‘శక్తి’ సినిమా విడుదల చేస్తున్నాం.. 22 నుంచి తెలంగాణలో థియేటర్లు మళ్లీ ప్రారంభిస్తారని అంటున్నారు. రెండు రోజులు ఆలస్యంగా నైజాంలో కూడా విడుదల చేస్తాం. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో ఓ సినిమా చేస్తున్నాం. సంతానం హీరోగా ఇంకో చిత్రం చేస్తున్నాం’’ అన్నారు. -
విద్యా వ్యవస్థపై పోరాటం
శివ కార్తికేయన్ హీరోగా ‘అభిమన్యుడు’ ఫేమ్ పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హీరో’. కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికగా నటించగా, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించారు. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ‘శక్తి’ పేరుతో తెలుగులోకి అనువాదం అవుతోంది. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి. జె.రాజేష్ ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. పి.ఎస్. మిత్రన్ మాట్లాడుతూ– ‘‘సూపర్ మాన్, స్పైడర్ మాన్, శక్తి మాన్.. అంటే పిల్లలకే కాదు అన్ని వయసుల వారిలో ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వాళ్ల స్ఫూర్తితో సాహసాలు చేస్తుంటారు కొంతమంది. ఈ చిత్రంలో హీరో కూడా అలాంటివాడే. సూపర్ హీరోలా మారి విద్యా వ్యవస్థలోని విషయాలపై ఎలా పోరాడాడు? అన్నదే కథాశం. వాస్తవ ఘటనల ఆధారంగానే తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘ఏదైనా విభిన్న నేపథ్యం లేకపోతే శివ కార్తికేయన్ సినిమా చేయరు. ‘శక్తి’ చాలా రియలిస్టిక్గా అనిపిస్తూ హార్ట్ని టచ్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ నటించిన తొలి దక్షిణాది చిత్రం ఇదే’’ అన్నారు కోటపాడి. జె. రాజేష్. -
నటుడు ఉదయ్ కిరణ్ హఠాన్మరణం
సాక్షి, కాకినాడ: యువనటుడు నండూరి ఉదయ్కిరణ్ (34) హఠాన్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుతో అతడు మరణించాడు. ఉదయ్కిరణ్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. (చిరంజీవి తొలి సినిమా దర్శకుడు మృతి) పరారే, ఫ్రెండ్స్బుక్ సినిమాల్లో హీరోగా ఉదయ్కిరణ్ నటించారు. పలు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్నారు. 2016లో జూబ్లీహిల్స్లోని ఓవర్ ద మూన్ పబ్లో గొడవ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఉదయ్ కిరణ్ పలు నేరాలకు పాల్పడినట్టు అప్పట్లో పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులోనూ అరెస్టై జైలు జీవితం గడిపాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కాకినాడలో మహిళను మోసం చేసిన కేసులోనూ అరెస్టయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 59లోని నందగిరిహిల్స్లో ఇంటి యాజమానిపై దౌర్జన్యం చేయడంతో 2018లో క్రిమినల్ కేసు పెట్టారు. ఇలా పలువురిని మోసం చేయడంతో అతడిపై పలుమార్లు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఉదయ్ కిరణ్కు 2016లో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించారు. -
సూపర్ హీరో శక్తి
తమిళ నటుడు శివ కార్తికేయన్, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘హీరో’. ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కోటపాడి రాజేష్ నిర్మించారు. బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ విలన్గా నటించారు. ఈ సినిమాను ‘శక్తి’ టైటిల్తో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ‘‘శక్తిమాన్ సీరియల్ చూస్తూ సూపర్ హీరో కావాలని కలలు కంటాడు హీరో. మరి సూపర్హీరో అయ్యాడా? సమాజంలో అతను తెచ్చిన మార్పు ఏంటి? అనే కథతో తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే రిలీజ్ చేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి యువన్ శంకర్రాజా స్వరకర్త. -
సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్
సాక్షి, భువనగిరి(నల్గొండ) : సినీ హీరో కావాలనే లక్ష్యంతో ఓ యువకుడు విభిన్న పాత్రలు పోషిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని లఘుచిత్రాల్లో సైడ్హీరోగా నటించి అనంతరం హీరోగా నటించాడు. ప్రస్తుతం టీవీ సీరియల్లో విభిన్నపాత్రలు పోషిస్తున్నాడు. భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన సుర్పంగ రాములు, లక్ష్మి దంపతుల కుమారుడు గణేష్. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలనే సంకల్పంతో ఆదిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఎప్పటికైనా సినిమాలో హీరోగా నటించాలనే కోరిక అతడిలో కలిగింది. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు. ఈక్రమంలోనే యాదగిరిగుట్టకు చెందిన లఘుచిత్ర దర్శకుడు రాజు గణేష్లో ఉన్న నటన ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా లఘుచిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం టీవీ సీరియల్లో సైతం నటిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో.. గణేష్ ప్రారంభంలో రియల్ లవ్ నెవర్ డై, ల్యాజిక్ ఆఫ్ లైవ్ డిషిసన్, రెండు లఘు చిత్రాల్లో నటించాడు. ఈచిత్రా లు 2013లో విడుదలయ్యాయి. వీటితోపాటు బర్త్డే బాయ్ చిత్రం కూడా నటించాడు. ఆ తర్వాత వదిలేసి వెళ్తున్నా, సైలెంట్ లవ్ స్టోరీ, కాలేజీ పొరగాళ్లు, శాంతాభాయ్, నాకు నీనే తోపు తురుము, తను క్లాస్మెంట్ వంటి చిన్న సినిమాల్లో విభిన్న పాత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇందిరానో కంప్రమైజ్ సినిమాలో నటిస్తున్నాడు. వీటితోపాటు బంగారు పంజారం, మనస్సు మమత వంటి టీవీ సీరియల్లలో నటించాడు. సినీ హీరో కావాలన్నదే నా కోరిక అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. లఘుచిత్రంతో ప్రారంభమైన నా చిన్న సినిమాల వరకు తీసుకువచ్చాను. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నాను. పెద్ద సినిమాల్లో అవకాశం వస్తే తప్పనిసరిగా నటిస్తా. జీవితంలో హీరోగా ఒక సినిమాలో నటించాలని నా కోరిక. – గణేష్, నటుడు -
కొత్త కాంబినేషన్ గురూ
ఈ ఏడాది అక్టోబర్లో తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్తో (‘అభిమన్యుడు’ ఫేమ్) కలిసి ‘హీరో’ మూవీ సెట్లో సందడి చేశారు కథానాయకుడు అఖిల్. అప్పటి ఈ మీటింగ్ అఖిల్ హీరోగా పట్టాలెక్కబోయే సినిమా కోసమేనని తాజా సమాచారం. అఖిల్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు అఖిల్. శివ కార్తికేయన్తో ‘హీరో’ సినిమాని తెరకెక్కిస్తున్నారు మిత్రన్. వారి వారి సినిమాలు పూర్తి చేసిన తర్వాత వీరిద్దరి కొత్త సినిమా మొదలవుతుందని తెలిసింది. -
హీరో మోటోకార్ప్ విక్రయాల్లో మరో మైలురాయి
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ విక్రయాల్లో మరో మైలురాయిని దాటింది. హరిద్వార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే వాహన అమ్మకాలు 2.5 కోట్ల మార్కును అధిగమించినట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 9,500 యూనిట్లు కాగా, ప్రారంభించిన 11 ఏళ్లలోనే ఈస్థాయి రికార్డును నెలకొల్పడం విశేషమని కంపెనీ వివరించింది. 2008లో ఉత్పత్తిని మొదలుపెట్టి.. తాజాగా సాధించిన ఘనత కేవలం ఈ ఒక్క ప్లాంట్కే కాకుండా, మొత్తం కంపెనీ విజయంగా భావిస్తున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విక్రమ్ కస్బేకర్ చెప్పారు. -
విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్తో మొదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. అయితే వీకెండ్ తరువాత సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందన్న టెన్షన్లో ఉన్నారు చిత్రయూనిట్. అయితే తాజాగా విజయ్ దేవరకొండ హీరో నటిస్తున్న తదుపరి చిత్రం ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. డియర్ కామ్రేడ్ తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్తో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాల్లో నటిస్తున్నాడు. హీరో సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ను ఢిల్లీలో చిత్రకరించారు. అయితే ఈ సన్నివేశాలపై చిత్ర నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో తెరకెక్కించిన రేసింగ్ సీన్స్ ఆకట్టుకునేలా లేకపోవటంతో ప్రాజెక్ట్ను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
హీరోకి విలన్ దొరికాడు
‘2.ఓ’ సినిమాలో అక్షయ్కుమార్, ‘పేట’లో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయారు బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్. ‘అభిమన్యుడు’ ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తమిళంలో ‘హీరో’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్గా నటించనున్నారు అభయ్ డియోల్. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తు్తన్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. -
విజయ్ దేవరకొండకు 50 కోట్ల బడ్జెటా?
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు తన మార్కెట్ రేంజ్ను పెంచుకుంటూ వస్తున్నాడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. డియర్ కామ్రేడ్ పనులు ఇప్పటికే పూర్తి కాగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న హీరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ను కేటాయించినట్టుగా తెలుస్తోంది. కేవలం రెండు బైక్ రేసింగ్ సన్నివేశాల కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట. ఫార్ములా వర్మ ట్రాక్ కోసం పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాల్సి రావటంతో పాటు ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు, కాస్ట్లీ బైక్లు ఇలా అన్నింటికీ కలిపి భారీగానే ఖర్చయినట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈసినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి విజయం ఆ స్థాయిలో వసూళ్లు సాధిస్తాడో లేదో చూడాలి. -
ఆధార్ ప్రింట్ చేసినట్టు కాదు..!
న్యూఢిల్లీ: త్రిచక్ర వాహనాలను 2023 నుంచి, ద్విచక్ర వాహనాలను 2025 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలోనే అనుమతించాలన్న నీతి ఆయోగ్ ప్రతిపాదనపై అగ్రశ్రేణి ఆటో కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. ఇదేమీ ఆధార్ కార్డును ప్రింట్ చేసింత ఈజీ కాదని టీవీఎస్, బజాజ్ ఆటో వ్యాఖ్యానించాయి. ఈ ప్రతిపాదనల వెనక తగినంత అధ్యయనం, సంప్రదింపులు లేవని పేర్కొన్నాయి. ‘‘ఇది ఆధార్ కార్డు కాదు. సాఫ్ట్వేర్, ప్రింట్ కార్డులు కాదు. మొత్తం సరఫరా చెయిన్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత వ్యవస్థ నుంచి దానికి మళ్లాల్సి ఉంటుంది’’ అని టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలపై రెండు వారాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ స్పందించాలని నీతి ఆయోగ్ కోరిన నేపథ్యంలో వేణు శ్రీనివాసన్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. నాలుగు నెలల సమయం కోరాం... ‘‘ఓ ప్రణాళికతో ముందుకు రావడానికి మాకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలియజేశాం. ప్రణాళిక ఓ నగరంతో (అత్యధిక ద్విచక్ర వాహనాలు కలిగిన నగరం) మొదలవుతుంది. ఆ తర్వాత బదిలీ అన్నది కొంత కాలానికి జరుగుతుంది’’ అని వేణు శ్రీనివాసన్ తెలిపారు. 2 కోట్ల వాహనాలు, 15 బిలియన్ డాలర్ల అమ్మకాలు, 10 లక్షల మంది ఉపాధితో కూడిన ఈ రంగంలో ఒకేసారి పూర్తిగా మార్పు అన్నది సాధ్యం కాదని చెప్పారాయన. థర్మల్ (బొగ్గు ఆధారిత) విద్యుత్తో నడిచే బ్యాటరీలకు మళ్లడం కాలుష్యాన్ని తగ్గించదని స్పష్టంచేశారు. కాలుష్యంలో వాహనాల పాత్ర 20 శాతం అయితే, ఇందులో ద్విచక్ర వాహనాల నుంచి వెలువడే కాలుష్యం 20 శాతమేనని, అంటే కేవలం 4 శాతం కాలుష్యం గురించి ఇదంతా చేస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అన్నది అవసరం లేదని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. కార్లు తదితర వాహనాలను వదిలేసి, కేవలం ద్వి, త్రిచక్ర వాహనాలనే లక్ష్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం: హీరో మోటోకార్ప్ 150సీసీ సామర్థ్యం వరకు, ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్లతో కూడిన ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలన్న నీతి ఆయోగ్ విధానంతో తలెత్తబోయే పరిణామాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. 150సీసీ సామర్థ్యంలోపు ముఖ్యంగా 100సీసీ, 110సీసీ, 125సీసీ విభాగంలో విక్రయమయ్యే అత్యధిక వాహనాలు ఈ కంపెనీవే. భాగస్వాములు అందరి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కంపెనీ సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమలును బలవంతంగా రుద్దడానికి బదులు, మార్కెట్ పరిస్థితులు, కస్టమర్ల వైపు నుంచి ఆమోదం వంటి అంశాలతో ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అనేది ఆధారపడి ఉండాలని సూచించింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగంపై ప్రతిపాదిత నిషేధం తీవ్ర ప్రభావం చూపుతుందని హీరో మోటోకార్ప్ ఆందోళన వ్యక్తం చేసింది. -
రేసుకు 8 కోట్లు!
సన్నివేశం ప్రాముఖ్యతను బట్టి నిర్మాత చెక్కులో అంకెల్ని పెంచుకుంటూ పోతారు. సినిమాకు ఆ సన్నివేశం కీలకమైనప్పుడు ఖర్చుకు వెనకాడరు. తాజాగా విజయ్ దేవరకొండ నటించనున్న ‘హీరో’ సినిమా కోసం 8 కోట్లు ఖర్చు చేయనున్నారని తెలిసింది. విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ అనే చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీస్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మించనున్నారు. మాళవికా మోహనన్ కథానాయిక. ఇందులో విజయ్ బైక్ రేసర్గా కనిపించనున్నారు. ఫార్ములా 1 రేస్లో భాగంగా జరిగే సన్నివేశాల కోసం టీమ్ ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చు చేయనుందని తెలిసింది. ఈ సీక్వెన్స్ను ఢిల్లీలో ఐదుగురు హాలీవుడ్ స్టంట్స్మెన్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారని తెలిసింది. 20 రోజుల పాటు ఈ రేసింగ్ సీన్స్ను తీస్తారట. బైక్ రేసర్గా కనిపించడం కోసం ప్రస్తుతం విజయ్ చెన్నైలో శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం. -
విజయ్ దేవరకొండ ‘హీరో’ ప్రారంభోత్సవం
-
హీరో మొదలయ్యాడు
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందనున్న చిత్రం ‘హీరో’. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఇందులో ‘పేట్టా’ ఫేమ్ మాళవికా మోహనన్ హీరోయిన్గా నటించనున్నారు. దర్శకుడు కొరటాల శివ హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చి, దర్శకుడు ఆనంద్కు స్క్రిప్ట్ను అందించారు. ఎమ్మెల్యే రవికుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘‘స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగే మ్యూజికల్ థ్రిల్లర్ మూవీ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. దింగత్ మచాలే, ‘వెన్నెల’ కిషోర్, శరణ్ శక్తి, రాజా కృష్ణమూర్తి (కిట్టి), జాన్ ఎడతట్టిల్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేయనున్నారు. ప్రదీప్కుమార్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు మురళీ గోవింద రాజులు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కాకుండా మైత్రీ బ్యానర్లో విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ జూలైలో విడుదల కానుంది. అలాగే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
దగ్గరికెళితే దబిడిదిబిడే
సాక్షి, హిందూపురం: ఆయన సినీహీరో...లెజెండ్...అలా అని అభిమానంతో దగ్గరకువెళ్తే చెంపఛెళ్లుమంటుంది. ఉత్సాహంగా సెల్ఫీకోసం ప్రయత్నిస్తే సెల్ఫోన్ పగిలిపోతుంది. ఆయన చేతికి, కాలికి ఎక్కడ దగ్గరగా ఉంటే ఆ ముద్ర పడుతుంది. ఇక కాస్త దూరంగా ఉంటే వినలేని భాష సినిమా డైలాగుల్లా మార్మోగుతుంది. ఇదీ మన ఎమ్మెల్యే బాలకృష్ణ అలియాస్ బలయ్య వ్యవహార తీరు. అందుకే ఓటు వేసిన పాపానికి హిందూపురం వాసులంతా ఆయన బానిసల్లా బతికేస్తున్నారు. వచ్చినప్పుడల్లా తలో దెబ్బ వేసినా... మా బాబేనంటూ బయట సర్దుకుపోతున్నా...లోలోన తమకిలాంటి శాస్తి జరగాల్సిందేనని తమనుతామే తిట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన తరుణంలో మరెంతమందిపై ఆయన హస్త, పాదముద్రలు పడతాయోనని భయాందోళన చెందుతున్నారు. చివరకు సొంత పార్టీలోని సీనియర్ నేతలైనా బాలయ్య కనిపించగానే కాస్త దూరం జరుగుతున్నారు. బాలకృష్ణ చేసిన సన్మానాల్లో మచ్చునకు కొన్ని ఇలా.. 2014లో హిందూపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలో దిగిన బాలకృష్ణ...కారుటాప్పై కూర్చుని ప్రచారం చేస్తూ ఓ కార్యకర్తను కాలితో తన్నాడు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద వివాదాస్పదమైంది. 2017 అక్టోబరు 3న హిందూపురంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా హిందూపురం మున్సిపాల్టీలోని 20వ వార్డు బోయపేటలో వెళ్తున్న సమయంలో మారుతి అనే అభిమాని ఎమ్మెల్యే బాలకృష్ణ పక్క నుంచి అతృతగా ముందువెళ్ల బోయాడు..అంతే బాలకృష్ణ టెంపర్ లేచింది. మారుతి చెంప చెళ్లుమనిపించేశాడు. ఈ సంఘటనలో అక్కడివారంతా విస్తుపోయారు. ఆ కార్యకర్తల కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్న వారంతా సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లారు. ఈ సంఘటన తర్వాత బాలకృష్ణ పక్కన నడిచేందుకు కూడా నాయకులు, కార్యకర్తలు భయపడుతున్నారు. 2017 ఆగస్టులో నిర్వహించిన నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓహోటల్ వద్దకు వచ్చిన అభిమానులు బాలకృష్ణను గజమాలతో సన్మానించడానికి ప్రయత్నించారు. అభిమానులమధ్య తోపులాట జరిగింది. అంతే బాలకృష్ణ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అభిమానులను దుషిస్తూ ఒకరిపై చేయికూడా చేసుకున్నాడు. అభిమానంతో దండవేస్తామని వస్తే కొడతారేంటి అని అభిమానులే విమర్శలు గుప్పించారు. 2017 సెప్టెంబరు 30న విజయవాడలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభోత్సవంలోనూ వాయిస్ ఇవ్వాలని కోరిన మీడియాను బయటకు పోండి అంటూ చిర్రుబుర్రులాడారు. అలాగే సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులను కూడా మీరు మారరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 మార్చి 3న ఖమ్మం జిల్లాలో విసృత్తంగా ప్రచారంలో భాగంగా మిట్టపల్లి గ్రామానికి వెళ్లిన బాలకృష్ణ కాన్వాయ్ను అభిమానులు చుట్టుముట్టారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీపడ్డారు. దీంతో బాలయ్య ఆగ్రహంతో ఊగిపోతూ వాహనం నుంచి కింది దిగి అక్కడున్న వారిపై చేయి కూడా చూసుకున్నారు. దీనిని జీర్ణించుకోలేని అభిమానులు టీడీపీ ఫ్లెక్సీలు తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటే పోతే బాలయ్య బాధితులు ఎందరో ఉన్నారు. అయినా ఆయన పద్ధతి మారదు..అహం తొలగదు. అన్నట్లు మళ్లీ ఇపుడు ఎన్నికల ప్రచారం కోసం బాలయ్య హిందూపురం వస్తున్నారు. ఇప్పుడెంత మందిని కొడతాడో...మరెంతమదిని తిట్టిపోస్తాడోనన్న భయం ఆపార్టీ కార్యకర్తల్లో నెలకొంది. -
‘హీరో’గా మారుతున్న శివకార్తికేయన్
హీరోగా మారుతున్న శివకార్తికేయన్ అనగానే ఆశ్చర్యపడుతున్నారా? ఆయన ఎప్పుడో స్టార్ హీరోగా అయితే ఇప్పుడు హీరో అవ్వడం ఏమిటి? అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. అసలు విషయం ఏమిటంటే శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రానికి హీరో అనే టైటిల్ను నిర్ణయించా రు. ఇందులో నటుడు అర్జున్ ప్రధాన పాత్రను పోషించనుండడం విశేషం. నటి కల్యాణి ప్రియదర్శన్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు. కేజేఆర్ ఫిలింస్ పతాకంపై కోటపాటి జే.రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇరుంబుదురై ఫేం మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హీరో చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోటపాటి జే. రాజేశ్ మాట్లాడుతూ కేజేఆర్ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిభావంతులైన యూనిట్తో చిత్రం చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు. నటుడు శివకార్తికేయన్ కమర్షియల్ అంశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించడం వల్లే ఆయన నటుడిగా ఈ స్థాయికి చేరారన్నారు. అదే విధంగా ఈ హీరో చిత్రం కూడా అలాంటి కమర్శియల్ అంశాలతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్తో చిత్రం చేయాలన్నది తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఇక నటి కల్యాణి ప్రియదర్శన్ వంటి ప్రతిభావంతులైన యువ నటీనటులు ఈ చిత్రానికి అదనపు మైలేజ్ను ఇస్తారని అన్నారు. దర్శకుడు మిత్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన తొలి చిత్రంతోనే అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారని అన్నారు. ఆయన కథ చెప్పడానికి వచ్చినప్పుడు గత చిత్ర కథా ఛాయలేమైనా ఉంటాయేమోనని అనుకున్నానని, అలాంటి ఛాయలే లేకుండా పూర్తిగా భిన్నంగా చాలా కొత్త కోణంలో కథను చెప్పారని అన్నారు. ఈ సినిమాకు యువన్శంకర్రాజా సంగీతాన్ని, జార్జ్ సి.విలియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇకపోతే శివకార్తికేయన్ నయనతారతో కలిసి రాజేశ్.ఎం దర్శకత్వంలో స్టూడియోగ్రీన్ సంస్థ నిర్మిస్తున్న మిస్టర్ లోకల్ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రం మేడే రోజున విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం తన 14వ చిత్రంగా రవికుమార్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం పూర్తి అయిన తరువాత హీరో చిత్ర షూటింగ్లో పాల్గొంటారు. -
నేనే హీరో
‘అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం స్పీడ్ పెంచారు. ఓ సినిమా సెట్స్పై ఉండగానే మరిన్ని సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు విజయ్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సీవీఎం) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్ని ప్రకటించారు. ఏప్రిల్ 22న ఢిల్లీలో షూటింగ్ ఆరంభం కానుంది. -
విజయ్ దేవరకొండకు టైటిల్ కష్టాలు
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ కొత్త సినిమాను ప్రకటించాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఓ బహు భాషా చిత్రం చేస్తున్నట్టుగా ప్రకటించాడు విజయ్. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ భారీ చిత్రానికి హీరో అనే టైటిల్ను కూడా ప్రకటించారు. అయితే అదే ‘హీరో’ టైటిల్తో తమిళ హీరో శివకార్తికేయన్ బుధవారం ఓ సినిమాను ప్రారంభించారు. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో శివకార్తికేయన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో విజయ్ సినిమాకు టైటిల్ సమస్య ఏర్పడింది. శివకార్తికేయన్ సినిమా యూనిట్ తమిళ నిర్మాతల మండలిలో టైటిల్ తాము రిజిస్టర్ చేసుకున్నట్టుగా సాక్ష్యాలను కూడా బయటపెట్టింది. షూటింగ్ ప్రారంభం కావటంతో ఆ సినిమానే ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ పరిస్థితుల్లో విజయ్ తన సినిమా తమిళ వర్షన్ టైటిల్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నది మాసక్తికరంగా మారింది. -
రేసింగ్ హీరో!
బైక్ రేసర్గా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారట విజయ్ దేవరకొండ. బైక్ రైడింగ్ కోసం ఆల్రెyీ స్పెషల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారట విజయ్. ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించనున్నారు. తమిళం చిత్రం ‘కాకముటై్ట’కు డైలాగ్ రైటర్గా పని చేశారట ఆనంద్. ఈ సినిమాలో విజయ్కు జోడిగా మాళవిక మోహనన్ కనిపిస్తారని టాక్. రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పేట’ సినిమాలో మాళవిక మోహనన్ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు తదిదశకు చేరుకున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించబోతుందని టాక్. ప్రస్తుతం ఇదే బ్యానర్లో విజయ్ ‘డియర్ కామ్రేడ్’ మూవీలో హీరోగా నటిస్తున్నారు. అలాగే ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కూడా విజయ్నే హీరోగా నటిస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్ట్స్తో కెరీర్లో టాప్గేర్ వేశారు విజయ్. -
హీరో ఎలక్ట్రానిక్స్ నుంచి ఏఐ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: హీరో గ్రూప్నకు చెందిన ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ వెంచర్ హీరో ఎలక్ట్రానిక్స్ కంపెనీ వినియోగదారుల ఉత్పత్తుల సెగ్మెంట్లోకి ప్రవేశిస్తోంది. రానున్న ఐదేళ్లలో కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే ఉత్పత్తులను పదింటిని అందించనున్నామని హీరో ఎలక్ట్రానిక్స్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉజ్వల్ ముంజాల్ పేర్కొన్నారు. హోమ్ ఆటోమేషన్, వాహన, ఆరోగ్య, వినోద రంగాలకు సంబంధించి ఈ ఉత్పత్తులుంటాయని... క్వాల్కామ్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. లాస్వేగాస్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ కంపెనీ తన ఉత్పత్తులను ప్రదర్శిస్తోంది. -
నాన్న ఊపిరి
జీవితంలో హెచ్చుతగ్గులుంటాయి.ఊపిరి పీల్చివదలడం కూడా అంతే.ఒకటి నిలబెట్టేది, ఒకటి పడగొట్టేది కాదు. రెండూ ఉండాలి. ఈ రెండిటితో నడిచిన క్రైమ్ డ్రామా ‘బ్రీత్’. ఇందులో ఒక తండ్రి ఎమోషన్ ఉంటుంది. అతడు దుర్మార్గుడే అయినా.. హీరోగా చూపిస్తుంది ఆ ఎమోషన్. కొడుకు ఊపిరి కోసం నాన్న తీసిన ఊపిరే.. ఈ కథ. చదవండి. ‘‘నాన్నా.. ఎన్నో కలలతో ముంబై వచ్చాను. ఇక్కడ నా ఒంటరి ప్రయాణం గురించి మీరెంత భయపడ్డారో.. కలత చెందారో నాకు తెలుసు. అనుకున్నది సాధించడం అంత ఆషామాషీ కాదని అర్థమైంది నాన్నా! సారీ.. నాన్నా.. ఈ పని చేస్తున్నందుకు క్షమించండి’’ అంటూ కాళ్లను కట్టేసుకుని.. పాలిథిన్ కవర్ను ముఖానికి చుట్టేసుకుని.. తనంతట తానుగా చేతులనూ కుర్చీ వెనక్కి కట్టేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది పాతికేళ్ల ఓ అమ్మాయి. ఈ వ్యవహారాన్నంతా ఫోన్ వీడియోలో రికార్డ్ చేస్తుంది. నటి అవ్వాలనే ఆశయంతో ఆమె ముంబైకి వస్తుంది. ట్రెడ్మిల్ మీద వేగంగా పరిగెడుతుంటాడు ఓ వ్యక్తి. ఎంతలా అంటే ఆ ఆయాసం ఆయనకున్న ఆస్తమాను ఎఫెక్ట్ చేసేంతగా. నా వల్ల కాదు.. ప్లీజ్ నన్ను వదిలేయ్.. అని బతిమాలుకుంటూ బతిమాలుకుంటూ ట్రెడ్ మిల్ మీదే స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఈ విషయం అతని కొడుకుకి తెలిసి.. ఇంటికొచ్చి.. ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అప్పటికే అతను కోమాలోకి వెళ్లిపోయినట్టు డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. తర్వాత కొన్ని రోజులకు కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోతాడు. అతను.. రిటైర్డ్ ప్రొఫెసర్. ఆస్తమా తప్ప ఏ ఇబ్బంది, బాదరబందీ లేక సంతోషంగా లైఫ్ను లీడ్ చేస్తున్న వ్యక్తి. ఒక వర్షం రాత్రి.. బైక్ మీద వెళ్తున్న ఒకతనికి యాక్సిడెంట్ అవుతుంది. తలకు బలంగా దెబ్బతగలడంతో అక్కడికక్కడే మరణిస్తాడు. హెల్మెట్ ఉంటే బతికేవాడే అనుకుంటారంతా. హెల్మెట్ ఉంటుంది. తన బైక్ వెనకాలే లాక్ చేసి! ‘‘సేఫ్టీ విషయంలో అతను చాలా అబ్సెసివ్. హెల్మెట్ లేకుండా వెళ్లడు. అలాంటిది హెల్మెట్ను బైక్ వెనకాల లాక్ చేసుకొని.. బైక్ రైడ్ చేయడం ఏంటి? నాకేదో అనుమానంగా ఉంది..ఎంక్వయిరీ చేయించండి’’ అంటూ పోలీస్ ఇన్స్పెక్టర్కి కంప్లయింట్ ఇవ్వడానికి వస్తుంది అతని గర్ల్ ఫ్రెండ్. ‘‘నీ బాధ అర్థమైంది.. ఈ మంచినీళ్లు తాగు.. అయినవాళ్లు పోతే.. ఇలాంటి మానసిక స్థితే ఉంటుంది. ధైర్యంగా ఉండాలి’’ అని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు కాప్. ‘‘విషయం అది కాదు.. ’’ అని ఆమె ఏదో చెప్పబోతున్నా.. వినకుండా పంపించేస్తాడు ఇన్స్పెక్టర్. చనిపోయి కుర్రాడికి 28 ఏళ్లు. ఐటీ ప్రొఫెషనల్. ఇతనూ రిటైర్డ్ పర్సనే. దినచర్యలో భాగంగా కంట్రీక్లబ్కు వెళ్లి.. స్విమ్మింగ్ చేయడం అలవాటు. ఆ ప్రకారం ఆ రోజూ ఎప్పటిలాగే స్విమ్మింగ్ పూల్కి వెళ్లాడు. ఈత కొడ్తున్నప్పుడు కరెంట్ పోతుంది. నీళ్లల్లో ఉక్కిరిబిక్కిరై.. ఊపిరి ఆగిపోతుంది. ఆర్ట్ గ్యాలరీ స్టోర్ రూమ్లో.. ఒక లేడీ ఆర్టిస్ట్ పడి ఉంది. కింద అన్నీ నీళ్లు.. కరెంట్ తీగ వేలాడ్డానికి సిద్ధంగా ఉంది. పొరపాటున ఆ నీళ్లల్లో పడితే.. షాక్ తగిలి.. ఆ ఆర్టిస్ట్ చనిపోవడం ఖాయం. అది జరగబోతుండగా.. ఇన్స్పెక్టర్ వచ్చి.. కరెంట్ తీగను నీళ్లలో వేయబోతున్న వ్యక్తిని పట్టుకుంటాడు. తర్వాత ఇంటరాగేషన్లో అతనిని గుండె దగ్గర కాలుస్తాడు. కరెంట్ షాక్తో ఆ లేడీ ఆర్టిస్ట్ను చంపాలనుకున్న వ్యక్తి ఎవరు? డానీ. ఫుట్బాల్ కోచ్. ఒక్క మహిళా ఆర్టిస్ట్నే కాదు.. పైన చెప్పిన అన్ని చావులతోనూ డానీకి సంబంధం ఉంటుంది. ఇన్ఫాక్ట్ వాటికి స్కెచ్ గీసింది అతడే. అవి హత్యలు.. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియో రికార్డ్ చేసిన అమ్మాయి డెత్తో సహా! డానీ.. ది మర్డరర్. ఓహ్ గాడ్.. ఎందుకు? అతనేమన్నా సైకోనా? కాదు. మంచి తండ్రి. డానీకొక కొడుకు ఉంటాడు. జాషువా. ఆరేళ్లు. అందరూ జాష్ అని పిలుస్తుంటారు. సిస్టిక్ ఫైబ్రోసిస్తో బాధపడుతుంటాడు. ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే కాని బతకడు. పైగా ఆ అబ్బాయిది రేర్ బ్లడ్గ్రూప్. ఏబీ నెగటివ్. ఆ గ్రహీతల జాబితాలో జాషువా అయిదో నంబర్లో ఉంటాడు. వాడు తల్లిలేని పిల్లాడు. నానమ్మ మార్గరేట్, తండ్రి డానీయే జాషువాను కళ్లల్లో పెట్టి చూసుకుంటుంటారు. అరుణ అనే డాక్టర్.. పిల్లాడి ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. డానీ పట్ల ఇష్టాన్నీ పెంచుకుంటుంది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే జాషువా బతకడని చెప్తుంది అరుణ. వాడి లైఫ్ లైన్ అయిదు నెలల వరకే సాగొచ్చు అనే భయాన్నీ వ్యక్తం చేస్తుంది. పరిస్థితి చూస్తుంటే అయిదునెలలోపు ఆపరేషన్ జరిగేలా కనిపించదు. ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఏదైనా చేసి కొడుకును బతికించుకోవాలి. ఆఖరకు మనుషులను చంపైనా సరే అన్నంత కసిగా మార్తాడు. అప్పుడు చేస్తాడు..! .. ఈ హత్యలను. డానీ చేతిలో శ్వాస వదిలిన వాళ్లంతా ఏబీ నెగటివ్ బ్లడ్ గ్రూప్తో ఉన్న ఆర్గాన్ డోనర్సే. వాళ్ల జాబితా దొరికించుకొని అందులోంచి పైన మనుషులను ఎంచుకొని.. వాళ్ల జీవన శైలిని గమనించి మరీ మర్డర్కి ప్లాన్ చేస్తాడు డానీ. చేతికి రక్తం అంటకుండానే నాలుగు హత్యలూ కానిచ్చేస్తాడు. వీటి మీద ఇన్స్పెక్టర్ కబీర్ సావంత్కి అనుమానం వస్తుంది.. అవి సహజ మరణాలు కావని. మోడస్ ఆపరాండీని పరిశీలిస్తే తెలుస్తుంది.. ప్రాణం పోయినవాళ్లంతా ఆర్గాన్ డోనర్స్ అని. ఎంక్వయిరీలో భాగంగా అవయవ గ్రహీతల జాబితా మొదటి వరుసలో ఉన్నవాళ్లందరినీ ప్రశ్నిస్తాడు కబీర్. ఆ క్రమంలో డానీనీ విచారిస్తాడు. అనుమానం వస్తుంది. అతని కదలికల మీద నిఘా పెడ్తాడు ఇన్స్పెక్టర్. తర్వాత లిస్ట్లో ఎవరుండబోతున్నారో తెలుసుకొని హతాశుడవుతాడు. అతని భార్యే ఉంటుంది. ఆమే ఆర్టిస్ట్! పోలీస్ హంట్ తన కదలికల మీద పోలీస్ కన్నుపడిందని డానీకి అర్థమవుతుంది. వాళ్లను తప్పుదోవ పట్టించడానికి అవయవ దాతల కోసం ఎదురు చూస్తున్న ఇంకో వ్యక్తి మీదకు డౌట్ను మళ్లిస్తాడు. ఆ వ్యక్తి భార్యకు ఆర్గాన్స్ కావాలి. ఆమె మంచంలో అచేతనంగా పడి ఉంటుంది. సేవ చేయలేక విసిగిపోయి ఉంటాడు అతను. పోలీసులకూ అతనే చేస్తున్నాడేమో అనిపిస్తుంది ఆ వ్యక్తి వాలకం, తీరు చూస్తే. కాని విచారణలో కాదని తేలుతుంది. ఆ విషయాన్ని అలాగే గోప్యంగా ఉంచి డానీ మీద స్పయింగ్ని మరింత కట్టుదిట్టం చేస్తాడు ఇన్స్పెక్టర్ కబీర్. అలా పోలీసులవలలో ఇరుక్కుని దోషిగా తేలుతాడు డానీ. క్లైమాక్స్లో కబీర్ తూటాతో తలవాల్చేసిన డానీ ఊపిరితిత్తులనే జాషువాకు అమరుస్తారు. ఇంకో కీలక అంశం.. తన కొడుకును బతికించుకోవడం కోసం డానీ సీరియల్ కిల్లర్గా మారాడని డాక్టర్ అరుణ గ్రహిస్తుంది. హార్ట్ ఎటాక్ నాటకంతో డానీ ఆసుపత్రిలో చేరి.. కోమాలోకి వెళ్లిన ఆస్తమా పేషంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆక్సిజన్ పైప్ను లాగేసి అతనిని చంపిన తీరుతో. ఆ విషయంలో డానీని నిలదీస్తుంది. అరుణకు నిజం తెలిసిపోయిందని.. ఆమెను వేగంగా వస్తున్న కారు కిందకు తోసి చంపేస్తాడు. ఇది ‘బ్రిత్’ అనే వెబ్ సీరీస్ కథ. అమెజాన్ సెకండ్ ప్రొడక్షన్. ఫస్ట్ సీజన్లో ఎనిమిది ఎపిసోడ్స్తో సాగుతుంది. కొడుకు ఊపిరి నిలపడం కోసం ఇంకొకరి ఉసురు తీసేంత కఠినంగా మారిన తండ్రి కథ. నిజానికి ఇది ఒక్క తండ్రి కథే కాదు. ప్యారలల్గా ఇంకో తండ్రి వ్యథా కనిపిస్తుంటుంది ఇందులో. ఆ వ్యథాభరితుడే ఇన్స్పెక్టర్ కబీర్ సావంత్. కబీర్కు ఒక కూతురు. ఆరేడేళ్లుంటాయేమో. అతని నిర్లక్ష్యం వల్ల ఆ అమ్మాయి కబీర్ రివాల్వర్తో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పేలి చనిపోతుంది. ఆ అపరాధభావంతో తాగుడికి బానిసవుతాడు కబీర్. భార్యా విడాకులిస్తుంది. చేతులారా బిడ్డను పోగొట్టుకున్నాననే బాధతో ఉద్యోగం పట్లా నిర్లక్ష్యంగానే ఉంటాడు. డానీ కేస్తోనే ఆ మత్తు వదిలి మామూలు మనిషై ఇన్స్పెక్టర్గా బాధ్యతలను నిర్వర్తిస్తాడు. డానీగా మాధవన్.. కబీర్గా అమిత్ సా«ద్ నటించారు. శ్వాస బిగపట్టి చూసేంత ఉత్కంఠతేమీ ఉండదు. అన్ఫార్చునేట్లీ క్లైమాక్స్ కూడా ఊహకందేస్తుంది. అయినా ఆసక్తి చావదు. అదే ‘బ్రిత్’ను నిలిపింది. వ్యూస్ను పెంచింది. ఒక్కడున్నాడు ‘బాంబే బ్లడ్ గ్రూప్’.. ఎక్కడా వినలేదు కదూ. గోపీచంద్ యాక్ట్ చేసిన ‘ఒక్కడున్నాడు’ సినిమా చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో విలన్ మహేశ్ మంజ్రేకర్కు గుండెకి సంబంధించిన ఓ సమస్య ఉంటుంది. గుండె మార్పిడి చేయాలంటే అతని బ్లడ్ గ్రూప్ (బాంబే బ్లడ్) కలిగిన మనిషి గుండె కావాలి. ఒకే ఒక్కడికి ఆ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అతనే హీరో గోపీచంద్. ఇంకేముంది? తనకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి, బ్లడ్ డొనేట్ చేయమని కోరతాడు. ఆ వంకతో గోపీచంద్కి మత్తు ఇచ్చి, ఎంచక్కా గుండె మార్పిడి చేసేయొచ్చన్నది విలన్ ప్లాన్. బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన గోపీచంద్కి మత్తులోకి జారే ముందు అసలు విషయం తెలిసిపోతుంది. ఈలోపు విలన్కి బీపీ పెరగడంతో ఆపరేషన్ వాయిదా పడుతుంది. మత్తులోంచి బయటకు వచ్చిన గోపీచంద్ విలన్ గ్యాంగ్ని రఫ్ఫాడించి, బయటపడతాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా 2007లో విడుదలైంది. ఇంచు మించు ‘బ్రీత్’లాంటి కథే ఇది. 2002లో వచ్చి బాలీవుడ్ మూవీ ‘జాన్ క్యూ’తో ‘బ్రీత్’కి, ‘ఒక్కడున్నాడు’కి పోలికలున్నాయి. – సరస్వతి రమ -
చిక్కుల్లో అంతకుమించి సినిమా హీరో
-
క్లాపురం
‘ఏమండీ షాట్ రెడీ’ అంది శ్రీమతి హీరోయిన్. ‘భార్యలు బయలుదేరేటప్పుడు లేట్ చేస్తారంటారు కానీ నువ్వు సూపర్!’ అన్నాడు శ్రీవారు హీరో. ‘సింగిల్ కారు పంపితే చాలు.. వర్కవుట్ అవుద్ది’ అన్నాడు ప్రొడ్యూసర్. ‘ఇంట్లో చిర్రుబుర్రులేమైనా ఇక్కడ చూపిస్తారేమో’ అనుమానంగా అడిగాడు డైరెక్టర్. ‘ఇంటిని మరిపించేలా అందమైన సంభాషణలు రాశాను’ అన్నాడు రైటర్. ఇదీ.. పెళ్లయిన తరువాత కూడా హీరో హీరోయిన్ చేస్తున్న క్లాపురం! సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అందులోని హీరో హీరోయిన్ జోడీ బాగా కుదిరింది. దర్శక, నిర్మాతలు ఆ జంటను స్క్రీన్పై రిపీట్ చేయాలనుకుంటారు. అంతలా ఆ స్టార్స్ మధ్యలో కెమిస్ట్రీ వర్కౌట్ అయినప్పుడు ‘కలిసి నటì స్తే బావుండు’ అని ప్రేక్షకులూ కోరుకుంటారు. హీరో హీరోయిన్కి కూడా కలిసి నటించడానికి ఓకే. ముందేమో విడి విడిగా సెట్లోకి వెళ్లేవారు. కానీ సినిమా సెట్లోనే అన్నీ సెట్ అయ్యాక, టైటిల్ కార్డ్లో పేర్లను పెళ్లి కార్డులో చూసుకోవాలనుకున్నారు కొందరు సెలబ్రిటీలు. పెళ్లికి ముందు జంటగా నటించి, పెళ్లయ్యాక కూడా జంటగా కనిపించిన ‘కపుల్స్’ కహానీ తెలుసుకుందాం. విజయకృష్ణ ‘సాక్షి’ సినిమాలో ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్ జోడీగా కనిపించారు కృష్ణ, విజయనిర్మల. పెయిర్ బావుందని ప్రేక్షకులు ఈలలు వేశారు. అంతే... వెంటనే 10–15 సినిమాలు కృష్ణ, విజయనిర్మలకు క్యూ కట్టాయి. సినిమాలు, సెట్లు మారుతున్నాయి. పోస్టర్లో కృష్ణ, విజయ నిర్మల అనే పేరు మారడం లేదు. అలా కలిసి పని చేసే ప్రయాణంలో ఒకరికి ఒకరు దగ్గరయ్యారు. ‘ఎవరే అతగాడు.. అంత అందంగా ఉన్నాడు’ అన్నది కృష్ణని చూడగానే విజయ నిర్మలకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్. విజయ నిర్మల యాటిట్యూడ్ నచ్చి చంద్రమోహన్ ద్వారా ప్రేమ కబురును ఆమెకు పంపారు. ఇలా కాదు డైరెక్ట్గా వచ్చి చెబితే ఒప్పుకుంటా అన్నారంట. అలా తిరుపతిలో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి ట్విస్ట్ ఇచ్చిందీ జోడీ. కృష్ణ, విజయ నిర్మల సుమారు 40 సినిమాలకు కలిసి పని చేశారు. జోడీగా కొన్ని సినిమాలు. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా కొన్ని సినిమాలు. ‘తాళి బొట్టు, పండంటి కాపురం, మూడు పువ్వులు ఆరు కాయలు, అంతం కాదిది ఆరంభం’ వంటి సినిమాలతో అభిమానులను అలరించారు. స్క్రీన్ మీదే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా వీరు ‘విజయకృష్ణ’. ప్లస్సు మైనస్సు కలుసే... అంబరీష్ కొంచెం రెబల్ టైప్. సుమలత ఏమో మృదు స్వభావి. ఒక్క ప్లస్సు మైనసు కలిసినప్పుడే కదా ఈక్వేషన్ సరిగ్గా కుదిరేది. అవును ఈక్వేషన్ కరెక్ట్గా కుదిరింది. ‘మాది తొలి చూపులోనే ఏర్పడ్డ ప్రేమ కాదు. సినిమాలు చేస్తూ మెల్లిగా ఒకరినొకరు పూర్తిగా తెలుసుకున్నాం. మా మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది అంటే కచ్చితంగా చెప్పలేం. అది ప్రేమ అని తెలిసేలోపే మేం ప్రేమలో మునిగిపోయాం’ అని సుమలత ఓ సందర్భంలో పేర్కొన్నారు. తొలిసారి ఈ జంట కన్నడ సినిమాలు ‘ఆహుతి. అవతార పురుష’లో యాక్ట్ చేశారు. 1991లో పెళ్లి చేసుకున్న ఈ జంట చిరంజీవి ‘శ్రీమంజునాథ’ కన్నడ ‘కల్లరాలి హోఘొ’ సినిమాల్లో జోడీగా కనిపించారు. హీ మ్యాన్ హేమ జపం హేమ మాలినీ బాలీవుడ్ డ్రీమ్ గాళ్. ధర్మేంద్ర హీ మ్యాన్. ఈ ఇద్దరూ ‘షరాఫత్’ అనే సినిమా కోసం ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 1970లో ‘తుమ్ హసీనా మై జవాన్’ సినిమా సెట్లో ఇద్దరూ ఒకరి మీద ఒకరు అభిప్రాయాలు ఏర్పరచుకోవడం మొదలెట్టారట. ధర్మేంద్రకు ఆల్రెడీ పెళ్లయింది. అయినా హేమ మాలినీ అందానికి హీ మ్యాన్ కాస్తా హేమ జపం చేశారు. మెల్లిగా ఒకరంటే ఒకరు ప్రేమను ఏర్పరచుకుని 5 ఏళ్ల లవ్ని పెళ్లితో కొనసాగించారు. పెళ్ళి తర్వాత రజియా సుల్తాన్, ఆటంక్, వంటి సినిమాల్లో కలిసి నటించారు. ప్రతిజ్ఞ , ఆలీ బాబా 40 చోర్, రజియా సుల్తాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించారు. స్నేహం–ప్రేమ–పెళ్లి కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సూపర్ స్టార్ రిషీ కపూర్, స్టార్ హీరోయిన్ నీతూ సింగ్ లవ్ స్టోరీ లవ్ ఎట్ ఫస్ట్ సెట్ కాదు. రిషీ కపూర్కి బెస్ట్ ఫ్రెండ్లా ఉండేవారట నీతు. అప్పట్లో రిషీ కపూర్కి గర్ల్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ. వాళ్ళ సీక్రెట్స్ అన్నీ తెలిసింది నీతూ సింగ్కే నట. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా గాళ్ఫ్రెండ్తో బ్రేకప్ అయితే రిషీ కన్నీళ్లు తుడుచుకునే కర్చీఫ్ నీతూదే. తలవాల్చుకునే భుజం కూడా నీతూదే. కానీ అవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అనే విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ‘బరూద్’ షూటింగ్ కోసం ప్యారిస్ వెళ్లిన రిషీ కపూర్కి ఒంటరితనం అంటే ఏంటో అర్థం అయిందట. ఉండబట్టలేక నీతూకు ఓ టెలీగ్రామ్ వేసేశారట. ‘ఏ సిక్నీ బడీ యాద్ ఆతీ హై’ అని టెలీగ్రామ్ వేశాడట. అంటే.. ఎప్పుడూ గుర్తొస్తున్నావు అని. కానీ పెళ్లికి మాత్రం అప్పుడే సిద్ధంగా లేను అని అనుకున్నారట. ‘నీతో డేటింగ్ చేయగలను కానీ పెళ్లి చేసుకోలేను’ అనేశారు రిషి. అప్పటికే రిషీ మీద పీకల్లోతు ప్రేమలో ఉన్న నీతు నో చెప్పలేకపోయారు. 5 ఏళ్లు డేటింగ్ తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. 19 సినిమాల్లో రిషీ, నీతు కలిసి నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యారు నీతు. రిషీ కపూర్ ఆపేయమన్నారని వార్తలు వచ్చాయి. నా అంతట నేను తీసుకున్న నిర్ణయం అని నీతు అన్నారు. అసలు నిజం ఏంటో వాళ్లింటి నాలుగు గోడలకే తెలుసు. మళ్లీ 25 ఏళ్లకు ‘లవ్ ఆజ్ కల్’ అనే సినిమా ద్వారా స్క్రీన్ షేర్ చేసుకున్నారు రిషీ, నీతు. ఆ తర్వాత షారుక్ఖాన్ ‘జబ్ తక్ హై జాన్, కుమారుడు రణ్బీర్ సింగ్ ‘బేషరమ్’ సినిమాలో ఈ జంట తళుక్కున మెరిసింది. నిలువెత్తు ప్రేమ బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ల లవ్ స్టోరీ కూడా సినిమా సెట్లోనే మొదలైంది. అయినా అమితాబ్ స్ట్రగ్లింగ్ యాక్టర్గా ఉన్నప్పుడు జయా బచ్చన్ సూపర్ స్టార్. కానీ తొలి చూపులోనే అమితాబ్ నన్ను ఆకట్టుకున్నాడని చాలా సందర్భాల్లో పేర్కొన్నారామె. అమితాబ్, జయాబచ్చన్ తొలిసారి కలిసి నటించిన సినిమా ‘గుడ్డి’. ఈ సినిమా వారికి ఓ పరిచయ వేదిక. ఆ తర్వాత సినిమా సినిమాకు వీళ్ళ మధ్య పరిచయం ప్రేమగా మారడం మొదలైంది. సార్ చాలా హైట్. మేడమ్ కొంచెం షార్ట్. అయినా ఇద్దరి మనసులో ఉన్న ప్రేమ ఎత్తు చాలా. ‘జంజీర్’ సినిమా చేస్తున్న టైమ్కు ఇద్దరూ ఒకరి మీద ఒకరికి పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. సినిమా హిట్ అయితే లండన్ టూర్కి వెళ్దాం అనుకున్న ఈ జంటకు వీసా రిజెక్ట్ అయినట్లు ఇంట్లో వాళ్ల సమ్మతి లభించలేదు. విడిగా అయితే వీల్లేదు.. జాయింట్గా వెళ్లాలనుకుంటే వెళ్లండని స్వీట్ ట్విస్ట్ ఇచ్చారు. అనుకున్నదే అదనుగా జయ, అమితాబ్ పెళ్లి చేసుకొని ఆ మరుసటి రోజే డ్యూయెట్ పాడుకోవడానికి లండన్ పయనమయ్యారు. వీళ్లిద్దరూ జంటగా 16 సినిమాలకు పని చేశారు. అందులో ‘షోలే, కభీ ఖుషి కభీ గమ్, జంజీర్’ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, జయ జోడీగా కనిపించిన లాస్ట్ సినిమా ‘కీ అండ్ కా’. విశేషం ఏంటంటే... ఈ ప్రేమజంట తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా తన కో–స్టార్ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ లవ్స్టోరీ గురించి కూడా తెలుసుకుందాం సుమా. సెట్ అయింది సాబ్ అజయ్ దేవగన్ చాలా మొహమాటస్తుడు. కాజోల్ అవుట్ స్పోకెన్. ఈ ఇద్దరూ పెళ్లిని అనౌన్స్ చేసినప్పుడు ‘ఈ ఇద్దరికీ సెట్ అవ్వదూ’ అంటూ మీడియా కథనాలు రాశాయి. కానీ ఇప్పటికీ బాలీవుడ్లో వన్నాఫ్ ది బెస్ట్ కపుల్స్గా ఉన్నారు కాజోల్ దేవగన్. వీళ్లద్దరికీ సెట్ అయింది సాబ్ అని సరదాగా బాలీవుడ్లో అంటుంటారు. ‘హల్ చల్’ సినిమాలో ఫస్ట్ టైమ్ కలిసి యాక్ట్ చేశారు వీరిద్దరూ. 1999లో ఈ ఇద్దరూ ఒకటయ్యారు. పెళ్ళి తర్వాత యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ‘దిల్ క్యా కరే’. అజయ్ దేవగన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఫస్ట్ సినిమా ‘యు మీ ఔర్ తుమ్’ చిత్రంలో కలిసి యాక్ట్ చేశారు. ఈ కాంబినేషన్లో 7 సినిమాలు వచ్చాయి. మనసులు తెలుసుకున్నాకే... తండ్రిలానే తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా తన కో–స్టార్నే వివాహమాడారు. అభిషేక్, ఐశ్వర్యా రాయ్ తొలిసారి కలసి నటించిన చిత్రం ‘కుచ్ నా కహా’. అప్పటికే అభిషేక్, కరిష్మా కపూర్ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. మరోవైపు ఐశ్వర్య కూడా కండలవీరుడు సల్మాన్ ఖాన్తో లవ్లో ఉన్న వార్తలు వచ్చాయి. చెరో దారి అన్నట్లుగా ఉన్న ఈ ఇద్దరిదీ ఒకే దారి అయింది. ‘ఉమ్రో జాన్, గురు, ధూమ్: 2’.. మూడు సినిమాలతో వరసగా మూడేళ్లు ఒకే సెట్లో ఎక్కువ సమయం గడపడంతో ఇద్దరూ ఒకరిని ఒకరు తెలుసుకున్నారు. ‘గురు’ ప్రీమియర్ టైమ్లో ఐశ్వర్యారాయ్కి అభిషేక్ ప్రపోజ్ చేయడం, ఐష్ కూడా ఆనందంగా ఒప్పుకోవడం జరిగిపోయింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ మణిరత్నం ‘రావణ్’ సినిమాలో కలిసి నటించారు. కానీ జోడీగా కాదు. అయితే యాడ్స్లో కలసి నటించారు. లేటెస్ట్గా అభిషేక్, ఐష్ ‘గులాబ్ జామున్’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. పదేళ్ల ప్రేమ మహారాష్ట్ర సీఎం కుమారుడి ఫస్ట్ సినిమా. అది కూడా మలయాళంలో బ్లాక్బస్టర్ అయిన ‘నిరం’ (తెలుగులో ‘నువ్వే కావాలి’గా రీమేక్ అయింది). అలా ఫస్ట్ టైమ్ సెట్లో మొట్టమొదటిసారిగా కలుసుకున్నారు రితేష్ దేశ్ముఖ్, జెనీలియా. సీఎం కొడుకంటే హడావుడి ఉంటుంది అనుకున్నారు జెనీలియా. రితేశ్ మాత్రం చాలా కామ్. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఒకరికొకరు ‘నువ్వే కావాలి’ అనుకున్నారు. కానీ అనుకున్నంత సులువుగా ఈ లవ్ స్టోరీ సెట్ అవ్వలేదు. సినిమాల్లోలానే ఈ సీఎం అంకుల్ కూడా ఫస్ట్ ఈ మ్యారేజ్ ప్రపోజల్కి ఒప్పుకోలేదు. అప్పుడు జెన్నీ, రితేష్ తీసుకున్న నిర్ణయం వెయిట్ చేయడం. సుదీర్ఘంగా 10 ఏళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫైనల్గా సీఎం అంకుల్ని కూడా వీళ్ల ప్రేమ మార్చగలిగింది. 2012లో ఈ జోడీ ఒక్కటయ్యారు. కపుల్స్ అయ్యాక ‘తేరే నాల్ లవ్ హోగయా’ అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత రితేష్ చేసిన ‘లాల్ భారీ’ అనే మరాఠీ సినిమాలో కూడా చిన్న గెస్ట్ రోల్లో కనిపించారు. నువ్వు–నేను–ప్రేమ సూర్య, జ్యోతిక జంటగా ఏడు సినిమాల్లో యాక్ట్ చేశారు. సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్గా నిలిచిన ‘కాక్క కాక్క’ చిత్రం నుంచి వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. ఈ సినిమాలో సూర్యని హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్కు సజెస్ట్ చేసింది జ్యోతికే. ఆ తర్వాత ‘మాయావి, సిల్లున్ ఒరు కాదల్ (తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’గా విడుదలైంది)’ సినిమాల్లో కనిపించారు. అయితే పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ కలసి నటించలేదు. కానీ సతీమణి కమ్బ్యాక్ మూవీ ‘36 వయదినిలే’ని సూర్య నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన ‘మగళిర్ మట్టుమ్’ని కూడా సూర్యనే నిర్మించారు. మరి.. మళ్లీ ఆన్ స్క్రీన్ కనిపిస్తారా? కాలమే చెబుతుంది. ఎప్పుడో ముడివేశాడు తండ్రి నాగార్జున లానే తనయుడు నాగ చైతన్య కూడా తన కో–స్టార్నే వివాహం చేసుకున్నారు. ఇలాంటివి ప్లాన్ చేసి జరిగేవి కాదు. ఏదో మాయ జరుగుతుంది. ‘ఏ మాయ చేశావే’ సినిమా నాగ చైతన్య–సమంతలను మాయ చేసింది. యూత్ని క్లీన్ బౌల్డ్ చేసిన లవ్ స్టోరీ. ‘జెస్సీ, కార్తీక్’ యూత్ అందర్నీ లవ్లో పడేసిన ప్రేమ జంట. ‘పై లోకంలో వాడు ఎపుడో ముడివేశాడు..’ అంటూ సినిమాలో పాడుకున్నారీ జంట. ఆ క్షణం బహుశా వాళ్లు ఊహించి ఉండరు.. తర్వాత జరగబోయేది అదే అని. ఆ పాటను అనంత శ్రీరామ్తో అనంత లోకాలకు స్క్రీన్ప్లే రాసే రైటరే రాయించుంటాడు. కానీ వాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారడానికి టైమ్ పట్టింది. ఆ మధ్యలో ‘ఆటోనగర్ సూర్య’లో కూడా కలిసి యాక్ట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావుకి నివాళిగా కుటుంబం రూపొందించిన ‘మనం’లో కూడా సమంత ఉండటం విశేషం. ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని తెలుసుకున్నారు ఈ జంట. పబ్లిక్గా అనౌన్స్ చేయకపోయినా కలిసి సినిమాలు, షాపింగ్ అంటూ ప్రేక్షకులకు హింట్ ఇచ్చారు. గతేడాది నవంబర్లో గ్రాండ్గా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్ల్లయ్యాక ‘నిన్ను కోరి’ ఫేమ్ శివా నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాలో కలసి యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత, నాగ చైతన్య పెళ్లైన జంటగానే కనిపించనున్నారు. అన్నట్లు.. రెండు యాడ్స్లో కూడా కలసి నటించారు. ప్రేమికులుగా ఉన్నప్పుడు కెమిస్ట్రీ అదిరింది.. భార్యాభర్తల కెమిస్ట్రీ కూడా వండర్ఫుల్ అంటున్నారు. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
చోరీల బాట పట్టిన సినీహీరో
తార్నాక: ఒకరు సినీహీరో.. మరొకరు సినీ అసిస్టెంట్. ఇద్దరూ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. వాటి నుంచి బయట పడేందుకు దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నారు. వీరిలో ఒకరు ఇళ్లల్లో చోరీలు చేస్తూ దోపిడీ దొంగగా మారితే.. ఆ సొత్తును మరొకరు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి పలు మార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయినా చోరీలు మాత్రం మానలేదు. తిరిగి దొంగతనాలు చేస్తున్న.. అతనికి సహరిస్తున్న వ్యక్తిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన 50 తులాల బంగారు, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఓయూ పోలీసు స్టేషన్లో ఈస్ట్జోన్ డీసీపీ రమేష్, అడిషనల్ డీసీపీ గోవింద్రెడ్డి, కాచిగూడ డివిజన్ ఏపీసీ నర్సయ్య, ఓయూ ఇన్స్పెక్టర్ జగన్ ఆ వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా నాగారానికి చెందిన విక్కీ బలిజ, అలియాస్ విక్కీరాజ్ సిమాల్లో నాలుగేళ్లు అసిస్టెంట్గా పనిచేశాడు. కుషాయిగూడ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహేష్.. విక్కీరాజ్ ఇద్దరూ చిన్ననాటి మిత్రులు. కాగా మహేష్కు సినిమాలంటే పిచ్చి. ఈ క్రమంలో ‘నివురు’ అనే సినిమాను సొంత డబ్బులతో నిర్మించి తనే హీరోగా నటించాడు. అయితే ఆ చిత్రం బక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. దీంతో అప్పుల పాలయ్యాడు. విక్కీరాజ్కు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇళ్లల్లో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. నగరంలో సంపన్నులుండే కాలనీల్లో తిరుగుతూ పగలు రెక్కీ నిర్వహించే వాడు. తాను కేబుల్ ఆపరేటర్గా చెప్పుకుంటూ తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసేవాడు. రాత్రివేళల్లో ఆయా ఇళ్లల్లో చోరీలు చేసేవాడు. ఇలా తస్కరించిన సొమ్మును మహేష్కు తెచ్చివ్వగా అతడు విక్రయించి వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకుని జల్సాలు చేయడంతో పాటు అప్పులు తీరుస్తూ వచ్చారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతూ విక్కీ 2016లో జూబ్లీహిల్స్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా చోరీలు మానకపోగా 2018 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పలు ఇళ్లల్లో చోరీలకు తెగబడ్డాడు. ఇతనిపై ఓయూ పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా, ఆ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నాడు. హబ్సిగూడ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా, విక్కీ బలిజ, మహేష్లను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తాము ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వీరి నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కాగా విక్కీపై పీడీయాక్టు నమోదు చేసినట్లు ఓయూ పోలీసులు తెలిపారు. -
హోరో
-
మెగా హీరోను లాంచ్ చేయనున్న అవసరాల
విభిన్న దర్శకుడు అవసరాల శ్రీనివాస్ స్టైలే వేరు. ఆ విషయం అతని గత సినిమాలను చూస్తే అర్థమవుతుంది. సినిమా కథను నడిపించే విధానం, కథనం అన్నింట్లోనూ తన మార్క్ కనిపిస్తుంది. డైరెక్టర్గా కొనసాగుతూనే నటుడిగానూ బిజీగా ఉన్నారు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం అవసరాల మెగా కాంపౌండ్ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను అవసరాల శ్రీనివాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ (సాయి ధరమ్తేజ్ సోదరుడు), అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. అవసరాల టాలెంట్పై ఉన్న నమ్మకంతోనే మెగాస్టార్ చిరంజీవి అతనికి అవకాశం ఇచ్చినట్లు మెగా కాంపౌండ్ చెబుతోంది. ఈయన సినిమాలు సగటు ప్రేక్షకుడికి నచ్చుతాయి. రొమాంటిక్ కామెడీలను తెరకెక్కించటంలో తనదైన ముద్ర వేసిన అవసరాల వైష్ణవ్ కోసం ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడన్న ఆసక్తి నెలకొంది. అంతేకాదు చిరు చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్( చిరు చిన్న కూతురు శ్రీజ భర్త)తో కూడా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా ఉండబోతోందన్న ప్రచారం జరుగుతోంది. -
అవర్ హీరో
అవర్ హీరో సినిమాల్లో గాల్లోకి దూకి పదిమందిని ఒక్కవేటుతో వందమందిని ఒక్క ఊపుతో వెయ్యిమందిని ఒక్క ఫైటుతో చితక్కొట్టేసే హీరోలను చూశారు. మాకైతే ఈ హీరోయే నచ్చింది. గద్దలు తన్నుకుపోతున్నఇద్దరి బాల్యాన్నిసింగిల్ హ్యాండ్తో కాపాడింది!! షీ ఈజ్ అవర్ హీరో. మార్చి 4, 2018. ఆదివారం. ముంబైలోని వర్సోవా. ఎప్పటిలాగే తెల్లవారింది. ఉదయం పది గంటలు. అప్పుడే టీ తాగి బద్దకంగా అలా సోఫాలో కూర్చుండిపోయింది 27 ఏళ్ల ప్రీతి సూద్.. సెలవు తీరికను మనసారా ఆస్వాదించేందుకు. సెల్ ఫోన్ మోగింది. ‘‘అబ్బా.. మొదలైందా’’ అని విసుక్కుంటూ ఫోన్ను చేతులోకి తీసుకుంది. క్లోజ్ ఫ్రెండ్ నంబర్ అది. లిఫ్ట్ చేసింది. ‘‘హలో’’ అంది. అవతల నుంచి వినపడ్డ విషయంతో ప్రీతికి బద్దకం వదిలింది. గబగబా తయారై తన ఫ్లాట్కు దగ్గర్లో ఉన్న బ్యూటీపార్లర్కు పదిహేను నిమిషాల్లో చేరుకుంది. ‘‘మాటలు తిన్నగా రానియ్’’.. ప్రీతిని బెదిరించాడు ఆగంతకుడు. ఆ తీవ్రతకు బ్యూటీపార్లర్లోనిసిబ్బంది అదిరిపడ్డారు. ఆ ఇద్దరు చిన్న పిల్లలు కూడా బిక్కమొహం వేశారు. ఇంకోవైపు ప్రీతి ఫ్రెండ్ విమెన్ ప్రొటెక్షన్ సెల్కు పదే పదే ఫోన్ చేస్తోంది. టీమ్ను పంపిస్తాం అన్నారు కాని ఆ జాడే లేదు! పార్లర్లో ఇద్దరు బాలికలు! ఓ కస్టమర్లాగే లోపలికి వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్ ఉంది. ఆమె ఎవరో తెలియనట్టే నటిస్తూ ఆ పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిల పక్కన కూర్చుంది. వాళ్ల వయసు ఏడూ పదకొండేళ్ల మధ్య ఉంటుంది. ‘‘క్యా హోనా మేడం?’’ అడిగింది పార్లర్లో అమ్మాయి. ‘‘క్లీనప్’’ చెప్పింది ప్రీతి. ‘‘థోడా టైమ్ లగేగా’’ ఆ పక్కనే ఉన్న ప్రీతి ఫ్రెండ్కు థ్రెడింగ్ చేయడానికి దారాన్ని పంటి కింద పెట్టుకుని సిద్ధమవుతూ చెప్పింది పార్లర్ అమ్మాయి. ‘‘కోయి బాత్ నహీ.. వెయిట్ కరూంగీ’’ అంది ప్రీతి తన ఫ్రెండ్ మొహం చూస్తూ. ఇద్దరూ అపరిచితుల్లా ఉండాలని కళ్లతోనే చెప్పుకున్నారు. ఆదివారం అవడంవల్ల పార్లర్లో వర్కర్స్ తక్కువగా ఉన్నారు. కస్టమర్స్ కూడా పెద్దగా లేరు. ప్రీతి, తన ఫ్రెండ్, ఆ ఇద్దరు అమ్మాయిలు. అంతే.అదే అనుకూలమైన సమయం అనుకొని ఆ పిల్లలిద్దరితో మాట్లాడ్డం మొదలుపెట్టింది ప్రీతి.‘‘పన్నెండేళ్లు కూడా లేవు.. దేనికోసం వచ్చారు మీరు?’’ అడిగింది. ‘‘మేకప్ కోసం’’ చెప్పారు పిల్లలు.‘‘ఏదైనా ఫంక్షనా?’’ అడిగింది. ‘‘పెళ్లి’’.. ‘‘అమెరికా వెళ్తున్నాం’’ ఇద్దరి నుంచి ఒకేసారి.. సంబంధం లేని జవాబులు వచ్చాయి. ఏదో అర్థమైంది ప్రీతికి. ‘‘ఎక్కడుంటారు మీరు?’’ ‘‘మాది గుజరాత్’’ చెప్పింది ఇద్దరిలోకి కాస్త పెద్దపిల్ల. ఇద్దరూ అమాయకంగా, వినయంగా ఉన్నారు. ‘‘మీ వెంట వచ్చినవాళ్లెవరు?’’.. మాటల్లేకుండా తన వెనక విజిటర్స్ లాంజ్లో కూర్చున్న వాళ్లవైపు బిగించిన పిడికిలిలోని బొటనవేలును చూపిస్తూ అడిగింది. ఆ పిల్లలిద్దరూ మొహాలు చూసుకుని మౌనంగా ఉండిపోయారు. అయితే తన ఫ్రెండ్ ఫోన్లో వ్యక్తం చేసిన అనుమానం నిజమేనన్నమాట. ప్రొటెక్షన్ టీమ్ కోసం నిరీక్షణ ఇంకేవో వివరాలు అడగడానికి ప్రయత్నించింది ప్రీతి. లాంజ్లో ఉన్న మగవాళ్లిద్దరూ అసహనంగా కదలసాగారు. గొంతు పెంచి‘‘ ఔర్ కిత్నా టైమ్ లగేగా? జల్దీ కరో... ఫంక్షన్కా టైమ్ హోరారాహై’’ అరిచాడు ఒకడు పార్లర్ అమ్మాయి మీదకు. ఈలోపు తన ఫ్రెండ్కు మెసేజ్ పెట్టింది ప్రీతి. ‘‘నేను వీళ్లను మాటల్లో పెడ్తా.. నువ్వు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కు కాల్ చెయ్’’ అని. పిల్లల వైపు తిరిగి ఏదో అడగబోతుంటే ఆ ఇద్దరు మగవాళ్లు విసురుగా దగ్గరకొచ్చారు. ‘‘ఇందాకటి నుంచి చూస్తున్నా.. ఏంటీ ఆరాలు తీస్తున్నారు. మీకెందుకు వివరాలు?’’ అన్నాడు ఒక వ్యక్తి. ‘‘పిల్లలు కదా.. ముచ్చటనిపించి పలకరిస్తున్నా.. మీకెందుకు అంత ఉలుకు?’’అన్నది ప్రీతి. ‘‘మాటలు తిన్నగా రానియ్’’ ప్రీతిని బెదిరించాడు ఇంకో వ్యక్తి. ఆ తీవ్రతకు బ్యూటీపార్లర్లోని సిబ్బంది బెదిరారు. ఆ ఇద్దరు చిన్న పిల్లలు కూడా బిక్క మొహం వేశారు. ఇంకోవైపు ప్రీతి ఫ్రెండ్ విమెన్ ప్రొటెక్షన్ సెల్కు ఫోన్ చేస్తోంది. టీమ్ను పంపిస్తాం అన్నారు కాని ఆ జాడే లేదు. ఈలోపు ఆ ఇద్దరు వ్యక్తులు పిల్లలిద్దర్నీ తీసుకుని పార్లర్ బయటకు వెళ్లబోయారు. ప్రీతి అడ్డుకుంది. ‘‘ఈ పిల్లలు మీకేమవుతారు?’’ అంటూ. ‘‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు’’ అని తోసి ముందుకెళ్లబోయారు. తూలిపడబోయిన ప్రీతి తమాయించుకుని, వాళ్లను వెళ్లనివ్వకుండా దారికి అడ్డంగా నిలబడింది. ఈ పిల్లలు మీకు సంబంధించిన వాళ్లే అయితే.. పదండి పోలీస్స్టేషన్కు వెళ్దాం. నాకెందుకో మీ మీద డౌట్గా ఉంది’’ అంది. ‘‘ఏం రుజువులు కావాలి? డీఎన్ఏనా?’’ అంటూ గారపట్టిన పళ్లను బయటపెడుతూ నవ్వాడు ఆ ఇద్దరిలో ఒకడు. ‘‘పోలీసులు అడుగుతారు ఏం వివరాలు కావాలో’’ అంటూ ఇంకోవైపు తన స్నేహితురాలికి సైగ చేసింది.. ఏౖమైంది? అంటూ. నో రెస్పాన్స్ అన్నట్టుగా ఆమె ప్రతిసైగతో ఆన్సర్ ఇచ్చింది, ఆందోళనగా. ట్రాఫికింగ్ నుంచి విముక్తి ‘‘పదండి దగ్గర్లో ఉన్న పోలీస్స్టేషన్కు’’ అని ఇద్దరు మగవాళ్లతో అంటోంది ప్రీతి, ఇన్డైరెక్ట్గా తన ఫ్రెండ్కు పోలీస్కు ఫోన్ చెయ్ అనే హింట్ ఇస్తూ. వాళ్లను వెళ్లనివ్వకుండా కాలయాపన చేయడంలో భాగంగా వాళ్లతో సంభాషణ పొడిగిస్తోంది. ‘‘భయ్యా.. మీ పిల్లలే కావచ్చు. పోలీస్స్టేషన్కు వెళ్లడంలో తప్పు లేదుగా. ఒకవేళ మీ పిల్లలే అని తేలితే నేను క్షమాపణ కూడా చెప్తా. ఒక్కసారి పదండి’’ అని ప్రీతి బతిమాలుతుంటే బయట నుంచి ఇంకెవరో దారికి అడ్డంగా ఉన్న ప్రీతిని తోసేస్తూ ఆ పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్లిపోయాడు. ఆ పరిణామానికి హతాశురాలైంది ప్రీతి. ‘‘పోలీసులకు ఫోన్ చెయ్’’ గట్టిగా అరిచింది తన స్నేహితురాలిని ఉద్దేశించి. మళ్లీ ఒకసారి ఫోన్ కలపబోతుంటే పోలీస్ వ్యాన్ వచ్చింది. అది చూసి పారిపోబోయారు ఆ ఇద్దరు మగవాళ్లు. వాళ్లను పట్టుకొమ్మని పోలీసులను వారించింది ప్రీతి.పట్టుకున్నారు. ప్రీతి స్నేహితురాలు అనుకున్నట్టుగానే ఆ ఇద్దరు చిన్నపిల్లలిద్దరినీ ట్రాఫికింగ్ చేయబోతున్నారు. పిల్లలను తీసుకుని వెళ్లిపోయిన వ్యక్తిని దాదాపు 45 నిమిషాలు చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఆ పిల్లల్లో పెద్దమ్మాయి వయసు పదకొండేళ్లు. చిన్నమ్మాయి వయసు ఏడేళ్లు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వాళ్లు చెప్పినట్టుగానే.. గుజరాత్ నుంచి వచ్చారు. ఆడపిల్లలని వాళ్ల అమ్మానాన్న ఆ పిల్లలను లక్షరూపాయలకు అమ్మేశారు. వీళ్లు ఇంకో లక్షకు ఈ పిల్లలను ఇంకో వ్యక్తికి అమ్మేశారు. ఆ కొన్న అతను ఆ రాత్రి ఈ పిల్లలను అమెరికా తీసుకెళ్లబోతున్నాడు. ప్రీతి అడ్డు పడటంతో వీళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. నాకెందుకులే అని ఊరుకోకండి ఇంతగా ధైర్యసాహసాలు కనబర్చిన ప్రీతీ సూద్.. సినిమా, టెలివిజన్ నటి. ఆమె చొరవతో ఆ పిల్లల కథ సుఖాంతం అయింది. ‘‘తర్వాత ఈ విషయం తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్.. అందరూ తిట్టారు. ముంబైలో ఒంటరిగా ఉంటున్నావ్. ఇలాంటి పనులెందుకు నీకు? అలాంటి వాళ్లకు ముఠా ఉంటుంది. నీ మీద దాడి చేస్తే? అని భయపడ్డారు. ఒక్క క్షణం భయమేసినా.. పర్వాలేదు అనుకున్నా. నేను మాత్రమే బాగుండాలి అని అనుకోవడంలేదు. నా చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నా. ముఖ్యంగా అమ్మాయిల రక్షణ కావాలి. కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే నాకెందుకులే అని ఊరుకోవడం నాకు చేతకాదు. అడ్డుకుంటే వాళ్లు రేప్పొద్దున నన్నేమైనా చేస్తారని భయపడ్డం మరింత అన్యాయం. అందుకే భయపడకుండా కళ్లముందు ఇలాంటి అనుమానాస్పద సంఘటనలు ఏవి ఎదురైనా వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఆడపిల్లలను రక్షించండి’’ అని అంటోంది ప్రీతి సూద్. – శరాది -
కాలు రుద్దడంతో.. ఆ హీరో చెంప పగలగొట్టా
బాలీవుడ్ సంచలన నటి రాధికా ఆప్టే మరోమారు వార్తల్లో నిలిచింది. బాలీవుడ్పైనే దృష్టిసారిస్తున్న రాధికాఆప్టే సినీ తారలపై లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమేనని ప్రకటించి వివాదాస్పద నటీమణుల లిస్టులో పడిపోయింది. ఆ తర్వాత దక్షిణాది సినీ ఇండస్ట్రీ పైనా కామెంట్స్ చేసింది. ఇలా ఏదో ఒక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న రాధికా.. తాజాగా మరో కామెంట్ చేసింది. బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహిస్తున్న టాక్ షో వోగ్ బీఎఫ్ఎఫ్కు రాధిక అతిథిగా వెళ్లింది. అక్కడ ఆమె మాట్లాడుతూ తాను నటించిన తొలి దక్షిణాది సినిమాలో ప్రముఖ హీరో చెంప పగలగొట్టానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్లో భాగంగా సెట్కి వెళ్లిన తొలి రోజే తనతో హీరో అసభ్యంగా ప్రవర్తించాడని, తన పక్కనే కూర్చున్న అతడు.. తన కాలిని అసభ్యంగా రుద్దాడని చెప్పింది. కనీసం పరిచయం కుడా లేని తనతో ఆ హీరో అలా ప్రవర్తించడంతో కోపంతో చెంప చెళ్లుమనిపించానని రాధిక వివరించింది. తెలుగులో బాలకృష్ణతో లెజెండ్, లయన్.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతో పాటు తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాతో రాధికా దక్షిణాది వారికి చేరువైంది. -
సూర్యం చెప్పిన కథ
ప్రఖ్యాత తమిళ దర్శకుడు తెలుగులో తీసిన క్లాసిక్ సినిమాలోని సన్నివేశాలివి. ఈ రోజుకీ తెలుగులో గొప్ప సినిమాల లిస్ట్లో ఈ సినిమాను చెప్పుకుంటారు. ఒక స్టార్ హీరో నటించిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? సూర్యం తన కథ చెప్పడం మొదలుపెట్టిన ఆ సమయానికి ఆ ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆదర్శ గ్రామమంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్లుగా ఉంది. అసలు ఆ ఊర్లో గొడవలంటూ జరగవు. పోలీస్స్టేషన్ అంటూ ఒకటి చుట్టుపక్కల ఇరవై ఐదు మైళ్ల వరకూ లేదు. ఊర్లో అందరూ ఎవరికి వారు వాళ్ల పనిచేసుకుంటూ అందరికీ చేదోడువాదోడుగా ఉంటారు. అలాంటి ఊరికి సూర్యం ఏది చెబితే అదే! సూర్యం ఆ ఊరందరికీ చినబాబు. అందరూ ముద్దుగా పిలుచుకునే చినబాబు. సూర్యం కథ వింటున్న వ్యక్తి, ‘‘మీకు పెళ్లైందా?’’ అనడిగాడు. \‘అది కూడా నా కథలోనే ఉంది. సుప్రసిద్ధ వాగ్గేయకారుల వంశం మాది. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బిళహరి గణపతిశాస్త్రి గారి అబ్బాయిని నేను..’’ సూర్యం కథ మొదలుపెట్టాడు. ఆ గుడికి దూరంగా ఉన్న కొండమీద, బాగా ఎండగా ఉన్న ఆ సమయాన, ఆ అమ్మాయి నాట్యం చేస్తోంది, ఆగకుండా. సూర్యం ఆమెను ఇక్కడ గుడి దగ్గర్నుంచే చూసి, ‘‘ఎవరామె?’’ అనడిగాడు. ‘‘అదో పెద్ద కథ..’’ అన్నారంతా. మరునాడూ ఆ అమ్మాయి అదే కొండపై, అదేవిధంగా నాట్యం చేస్తూంటే సూర్యం మళ్లీ చూశాడు. ఈసారి ఆ అమ్మాయి దగ్గరకే వెళ్లి తీక్షణంగా ఆమె నాట్యాన్ని చూస్తూ నిలబడ్డాడు. సూర్యాన్ని చూసి ఆమె ఆగిపోయింది. సిగ్గుతో కళ్లు కిందకు దించుకుంది. ‘‘నమస్కారం! మీ నాట్యం అద్భుతంగా ఉంది. మీరు ఈ కొండమీద ఇలా నిర్జనంగా ఎందుకు నాట్యం చేస్తున్నారు?’’ అడిగాడు సూర్యం. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా ముందుకు కదిలింది. సూర్యం మరింత వేగంగా ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు. ‘‘ఏమిటండీ మీ ఉద్దేశం? నావెంట పడుతున్నారు?’’ అంది. ‘‘క్షమించండి. ఆ పెద్ద కథేంటో చెప్పండి. చూడండీ! నేనేదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే, అది తెలుసుకునే వరకూ ఆగను. అదీ నా పద్ధతి..’’ఆ అమ్మాయి రూపాయి బిళ్ల గాల్లో ఎగరేసి పట్టుకొంది. బొమ్మ పడితే చెప్పాలనుకుంది. బొమ్మే పడింది.‘‘చెప్పండి..’’ ఆసక్తిగా అడిగాడు సూర్యం. ‘‘పెద్ద కథేం కాదు. చాలా చిన్న కథ. నేను హరిజనుల అమ్మాయిని. అదే కథ..’’ అని ఆగింది ఆ అమ్మాయి. ‘‘అయితే?’’ ‘‘దేవీనవరాత్రులు తొమ్మిదిరోజులు గుడిలో నాట్యం చేయాలని నా సంకల్పం. కొంతమంది గొడవ చేశారు. హరిజనులు గుడికొస్తే దేవుడు అపవిత్రమైపోతాడన్నారు. సర్లేండీ! ఎంతదూరంలో ఉంటే మీ దేవుడు పవిత్రంగా ఉంటాడూ? అనడిగాను. వందగజాలు?ఐదువందల గజాలూ? అందుకే ఇక్కడ నాట్యం చేస్తున్నా..’’ అంది ఆ అమ్మాయి. ఇక చెప్పడం అయిపోయిందన్నట్టు సూర్యం వైపు చూసి, ఆ అమ్మాయి అక్కణ్నుంచి వెళ్లిపోయింది. చాలాసేపు సూర్యం ఆ అమ్మాయి వెళ్లిపోతున్న దిక్కే చూస్తూ నిలబడ్డాడు. చాలాసేపు అలాగే నిలబడి ఏదో ఆలోచించాడు. ఆ తర్వాతిరోజు ఆ అమ్మాయిని మళ్లీ చూసేవరకూ ఆలోచిస్తూనే ఉన్నాడు. కలిసిన తర్వాతా ఆలోచిస్తూనే కూర్చున్నాడు. ‘‘ఏంటి విషయం?’’ అనడిగింది సూర్యం వదిన, సూర్యాన్ని అలా చూసి. సూర్యానికి ఆమె అమ్మలాగా. ఆ అమ్మాయి గురించి మొత్తం చెప్పాడు. ‘‘అమ్మాయి పేరేమిటీ?’’ అడిగింది వదిన. ‘‘అర్రే! అడగనేలేదే!!’’.సూర్యం సైకిలేస్కొని బయలుదేరాడు. ‘‘ఏమండీ! నేను మీకోసమే వచ్చానండీ..’’ అని అమ్మాయితో మాటకలిపే వరకూ అతను సైకిల్ తొక్కడం ఆపలేదు. ‘‘నాకోసం వచ్చారా?.. ఎందుకు?’’ ‘‘ఆరోజు మనం అన్ని కబుర్లు చెప్పుకున్నాం కానీ.. ఒకరి పేరు ఒకరం తెలుసుకోనేలేదు.. మీ పేరు తెలుసుకోవచ్చా?’’ అడిగాడు సూర్యం.ఆ అమ్మాయి కోపంగా చూసింది. చిన్నగా దగ్గి, ‘వస్తాను..’ అంటూ కదిలాడు సూర్యం.ఆ అమ్మాయీ అలాగే దగ్గి, ‘‘నా పేరు మీకు కావాలి.. అంతేగా!’’ అంది. ‘‘ఆ! ఆగండి ఆగండి..’’ అంటూ ఆమె అందాన్ని వర్ణిస్తూ, ఆ అందానికి సరిపడే పేరు ఇదై ఉండొచ్చంటూ సూర్యం చాలాపేర్లు చెప్పాడు. ఆమె ఇవేవీ కాదంటూ తల అడ్డంగా ఊపింది. ‘‘పోనీ! మీరే చెప్పండి మీ పేరేంటో..’’ అన్నాడు సూర్యం. ‘‘పెంటమ్మ.’’ అంది ఆ అమ్మాయి. ఒక ఉదయం ఇలాగే కబుర్లు చెబుతూ, సూర్యం, ‘పెంటమ్మ.. పెంటమ్మ..’ అన్న పేరునే పలుకుతూ ఉండడాన్ని చూసి ఆమె పెద్దగా నవ్వింది. ‘‘ఎందుకలా నవ్వుతున్నారు?’’అడిగాడు. ఆమె నవ్వుతూ చూసి, ‘‘నా పేరు పెంటమ్మ కాదు..’’ అంది. ‘‘అబ్బా! బతికిపోయాన్రా బాబూ.. అయితే.. మీ పేరేంటి పెంటమ్మా?’’ అనడిగాడు సూర్యం. ఆ అమ్మాయి కోపంగా చూసింది. ‘‘ఛీ ఛీ ఛీ.. అసలు మీ పేరేంటీ?’’ అడిగాడు. ‘‘చెప్పుకోండి చూద్దాం..’’ అంటూ ఒక రాగం అందుకొని, దానికి నాట్యం చెయ్యడం మొదలుపెట్టిందామె. సూర్యం ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. ‘‘ఇప్పుడు చెప్పండి నా పేరు..’’ అడిగిందామె. ‘‘అది లలితరాగం.. అంటే మీ పేరు.. లలిత..’’ అన్నాడు సూర్యం ఉత్సాహంగా. ‘‘కాదు. లలిత శివజ్యోతి..’’ లలిత సూర్యానికి తన పేరు చెప్పిన కొన్ని రోజులకే వాళ్లు దగ్గరయ్యారు. ఇంకొన్ని రోజులకు ప్రేమలో పడిపోయారు. మరికొన్ని రోజులకు పెళ్లి పీటల వరకూ వెళ్లారు. కానీ సూర్యం చెప్పిన కథలో సూర్యం – లలితలకు పెళ్లి కాలేదు. ఎందుకు కాలేదంటే ఈరోజు ప్రశాంతంగా ఉన్న ఆ ఊరికోసమే. ఆ ఊరలా ప్రశాంతంగా ఉండటానికి సూర్యం ఆరోజు చేసిన యజ్ఞం కోసమే! -
క్యాన్సర్తో బాధపడుతున్న అభిమానికి హీరో వీడియో కాల్
బొమ్మనహళ్లి : క్యాన్సర్ వ్యాధితో చివరి దశలో ఉన్న ఓ వీరాభిమానికి హీరో దర్శన్ వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పడంతో పాటు అన్ని విధాల వైద్య సహాయం కూడా చేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో వీరాభిమానిలో ఆనందం వెల్లివిరిసింది. వివరాలు... శివమొగ్గకు చెందిన రేవంత్ (20)కు చాలెంజింగ్ స్టార్ దర్శన్ అంటే పిచ్చి అభిమానం. ప్రతి ఏడాది దర్శన్ పుట్టిన రోజు బెంగళూరు వెళ్లి దర్శన్ కలిసి శుభాకాంక్షలు చెప్పి వెళ్లేవాడు. అయితే ఇటీవల ఈ యువకుడు భయంకరమైన బోన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు. ఇలాంటి తరుణంలో విషయం తెలుసుకున్న దర్శన్ ఆ అభిమానికి వీడియోకాల్ చేయడం అతడిలో ఎనలేని సంతోషాన్ని నింపింది. శుక్రవారం ఉదయం దర్శన్, రేవంత్ ఫోన్ కాల్ చేసి ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం షూటింగ్స్తో బిజీగా ఉన్నానని, త్వరలో శివమొగ్గకు వచ్చి స్వయంగా కలుస్తానని రేవంత్కు చెప్పాడు. ఎఫ్బీ ద్వారా తెలుసుకుని.. రేవంత్ ఫేస్బుక్ ద్వారా తన అభిమాన హీరో ఫొటోలు, స్టిల్స్ పోస్టు చేసేవాడు. ఎప్పటికప్పుడు దర్శన్ సినిమాలను అప్డేట్ చేసేవాడు. దీంతో దర్శన్ అభిమానులు సైతం రేవంత్ ఎఫ్బీని ఫాలో అయ్యేవారు. ఇటీవల రేవంత్ అనార్యోగ్యానికి గురికావడం, చివరిసారిగా హీరో దర్శన్ను కలుసుకోవాలనే చివరి కోరిక అని తన ఎఫ్బీలో పోస్టు చేశాడు. దర్శన్కు పరిచయం ఉన్న శివమొగ్గ నగరానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి ద్వారా రేవంత్కు ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతో పాటు మలెనాడు వైద్యులు రేవంత్కు చికిత్స అందిస్తున్నారు. -
నేను విజయవాడ కుర్రాడినే..
‘ఛలో’ చిత్ర కథానాయకుడు నాగశౌర్య పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులతో శనివారం సాయంత్రం సందడి చేశారు. కళాశాల ఆడిటోరియంలో అందరితో కొద్దిసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను విజయవాడలోనే పెరిగానని, టిక్కిల్ రోడ్డులో తిరిగానని చెప్పాడు. నగరానికి వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నాడు. ‘ఛలో టీజర్ను యూట్యూబ్లో చూశారా’ అంటూ విద్యార్థులను అడిగాడు. పైరసీని ఎంకరైజ్ చేయవద్దు అన్నారు. అనంతరం నాగశౌర్యతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. – మొగల్రాజపురం -
ఆర్థిక ఇబ్బందితో క్యాబ్ డ్రైవర్గా మారిన నటుడు..!
-
క్యాబ్ డ్రైవర్గా మారిన నటుడు..!
సాక్షి, బెంగళూరు: ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ రంగుల వెండితెరపై నటించే అనేక మంది చిత్ర నటులు, కళాకారులు నిజజీవితంలో మాత్రం ఆర్థిక కష్టాలతో దయనీయ జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా కొన్ని వందల చిత్రాల్లో అన్ని తరహా పాత్రలను పోషించి కన్నడ ప్రేక్షకుల మన్నన పొందిన అలనాటి నటుడు కే.ఎస్.అశ్వథ్ కుమారుడు శంకర్ అశ్వథ్ కూడా అవకాశాల కొరత కారణంగా ఇదేస్థితిలోనున్నారు. జూనియర్ అశ్వథ్ ఉబర్ క్యాబ్ డ్రైవర్గా జీవితం నెట్టుకొస్తున్న వైనం సినీ ప్రేక్షకులకు, అభిమానులకు ఆవేదన కలిగిస్తున్నా అది పచ్చినిజం. 60 సినిమాల్లో నటన సుమారు 370 చిత్రాల్లో పైగా నటించిన తన తండ్రి కే.ఎస్.అశ్వథ్ నటనను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన శంకర్ అశ్వథ్ కూడా నటనపై మక్కువ పెంచుకున్నారు. 1993లో ‘హూవు హణ్ణు’ చిత్రంతో సినిమాల్లో అడుగిడిన శంకర్ శంకర్ గత ఏడాది వరకు 60 వరకు కన్నడ చిత్రాల్లో నటించారు. వెండితెరతో పాటు బుల్లితెరపై వచ్చే పలు ధారావాహికల్లోనూ ప్రతిభ చాటుకున్నారు. అయితే అన్ని చిత్రాల్లో, ధారావాహికల్లోనూ శంకర్ అశ్వథ్కు చిన్నాచితక పాత్రలు మినహాయిస్తే చెప్పకోదగ్గ పాత్రలు రాలేదు. దీంతో పాటు గత ఏడాదిగా సినిమాలు, టీవీల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో శంకర్ అశ్వథ్ కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. వీటిని స్వశక్తితో ఎదుర్కోవాలనుకున్న ఆయన ఉబర్ క్యాబ్ డ్రైవర్గా మారి ఆ ఆదాయంతో బతుకుబండి లాగుతున్నారు. తండ్రి ఆదర్శాలే స్ఫూర్తి: శంకర్ ప్రస్తుత పరిస్థితిపై తనకు ఏమాత్రం బాధగా లేదని, అవకాశాలు రాకపోవడంతోనే క్యాబ్ డ్రైవర్గా వృత్తిని ఎంచుకున్నట్లు శంకర్ అశ్వథ్ తెలిపారు. తమ తండ్రి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా జీవనం సాగించాలనే విషయాలను చిన్నతనం నేర్పించారని ఆయన సూచించిన మార్గంలోనే తాము ప్రయాణిస్తున్నామన్నారు. అవకాశాల కోసం, డబ్బు కోసం ఎవరి ముందు చేయి చాచరాదన్న తమ తండ్రి నేర్పిన సూక్తి ఆదర్శంగానే క్యాబ్ డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నామన్నారు. జనవరి 19న తమ తండ్రి కే.ఎస్.అశ్వథ్ 8వ శ్రద్ధాంజలి సమీపిస్తుండడంతో ఎవరివద్ద అప్పులు చేయకుండా ఆ కార్యక్రమం ఖర్చుల కోసం డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పారు. చిత్తశుద్ధి, నిబద్దతతో పనిచేస్తే ఏ పనైనా ఆదుకుంటుందని ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నప్పటి నుంచి ఆర్థిక కష్టాలు ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్నామన్నారు. అవకాశాలు ఇవ్వని సినీ పరిశ్రమపై ఏమాత్రం కోపం లేదని, ఎంతో గౌరవమని ఆయన చెప్పారు. -
ఆ లెజెండరీ యాక్టర్ ఇక లేరు
గౌహతి: అస్సోంకు చెందిన లెజెండరీ యాక్టర్ బిజు ఫుకన్ (70) ఇక లేరు. గౌహతిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన శ్వాస సమస్యతో మరణిచినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి, గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపాన్ని ప్రకటించారు. పుకాన్ మరణంపై ముఖ్యమంత్రి సరబానందా సోనోవాల్ అసోం గవర్నర్ జగదీష్ ముఖి,మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సహా ఇతర రాజకీయ ప్రముఖులు, ఇతర నటీనటులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అస్సామీ చలన చిత్ర పరిశ్రమలో ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ, ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు గవర్నర్ సానుభూతిని ప్రకటించారు. అస్సామీ చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన బిజూ ఫుకాన్ హఠాన్మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు ముఖ్యమంత్రి . ఇది పరిశ్రమకు, మొత్తం సమాజానికి తీరని నష్టమని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ లాంఛనాలతో బిజు అంత్యక్రియలను నిర్వహిస్తామని సీఎం మీడియా సలహాదారు హృషికేష్ గోస్వామి ప్రకటించారు. కాగా అత్యంత ప్రముఖనటులలో ఒకరుగా నిలిచిన ఫుకాన్ అస్సామీ చలనచిత్ర పరిశ్రమకు అనేక సూపర్ హిట్ చిత్రాలనందించారు. ఉత్తమ కథానాయుకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెల్చుకున్నారు. 1970 ల నుంచి1990 ల వరకు కొన్ని బెంగాలీ చిత్రాలతో సహా 80 చిత్రాలలో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘దూర్’ 2016లో విడుదలైంది. Saddened on the demise of noted Assamese actor Biju Phukan.His death is a great loss to the Assamese movie & cultural fraternity. RIP pic.twitter.com/zM2QTtCgV0 — Tarun Gogoi (@tarun_gogoi) November 22, 2017 I am deeply saddened to learn of the demise of noted Assamese actor Sri Biju Phukan. My prayers are with the bereaved family. May his soul rest in peace in heavenly abode pic.twitter.com/RRrzlYxnSv — Himanta Biswa Sarma (@himantabiswa) November 22, 2017 -
నేనె హీరో
గాల్లో ఎగిరి ఓ తన్ను తన్నినా.. కెమెరాకు తిరిగి క్లోజ్లో ఒక పంచ్ డైలాగ్ కొట్టినా.. మౌనంగా ఒక లుక్ ఇచ్చినా.. చీపురుతో తాట తీసినా.. గన్నుతో కాకపుట్టించినా.. ‘విజయ’లో ఉన్న అశాంతే కనిపిస్తుంది... కోపం, ఉద్రేకం, రౌద్రం, ప్రతీకారం కన్నీళ్లలా కాకుండా చెమట బిందువుల్లా ఆమె చెంపల మీద జారతాయి. ‘హీరోయిన్ బేస్డ్ సినిమాల్లేండీ’ అని తోసి పారేయకండి. రాములమ్మది హీరో బేస్డ్ సినిమాయే. హీరో అవడానికి మీసాలే ఉండక్కర్లా. రోషం.. పౌరుషం ఉంటే చాలు అంటున్నారు విజయశాంతి ⇒ మరో రెండు రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం. దేశానికి ఫ్రీడం వచ్చి 70 ఏళ్లైంది. అసలు మహిళలకు ఫ్రీడమ్ వచ్చిందా? విజయశాంతి: ఇంకా రాలేదనే అనుకుంటున్నా. స్వాతంత్య్రం వచ్చిన ఈ 70 ఏళ్లలో మంచి మార్పు వచ్చుండాలి. కానీ రాలేదు. టీవీలు, పేపర్లలో ప్రతిరోజూ మహిళలపై ఎన్నో ఘటనలు జరుగుతున్నాయనే వార్తలే. జరగరానివి జరుగుతున్నాయి. అవన్నీ చూస్తుంటే బాధగా ఉంటుంది. స్కూల్ పిల్లలు, వర్కింగ్ విమెన్, వాళ్లూ–వీళ్లూ అనే తేడా లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సేఫ్టీ లేకుండా పోయింది. పెద్దింటి పిల్లలు, రాజకీయ నాయకులు, వాళ్ల వారసులు ఉండడంతో కొన్ని తప్పులు వెలుగులోకి రాకుండాపోతున్నాయి. ఓవరాల్గా నష్టపోయేది, చనిపోయేది ఆడవాళ్లే. స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలపై మగాళ్లందరూ తలదించుకోవాలి. ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు అందరూ తలదించుకోవాలి. ఆడవాళ్లకు రక్షణ ఉంటేనే కదా.. ఫ్రీడమ్ వచ్చినట్లు! ⇒ హీరోయిన్గా దాదాపు 30 ఏళ్లు బిజీ బిజీగా సినిమాలు చేశారు. బహుశా ఇంత కెరీర్ స్పాన్ ఉన్న ఆర్టిస్టులు తక్కువేమో? 1979లో స్టార్ అయి, దాదాపు 28 ఏళ్లు కంటిన్యూస్గా సినిమాలు చేశాను. అంత లాంగ్ కెరీర్ నాకే దక్కిందేమో. అదో రికార్డ్. మధ్యలో బ్రేక్ తీసుకుని చేసినవాళ్లు ఉన్నారనుకోండి.టి. కృష్ణగారి సినిమాలు చేయడం నా లక్. లేకపోతే గ్లామరస్ హీరోయిన్గా మిలిగిపోయేదాన్నేమో. టి. కృష్ణగారు, దాసరి నారాయణరావుగారు, మోహన్ గాంధీ వంటి దర్శకులుంటే... ఇప్పటి హీరోయిన్లకూ మంచి మంచి అవకాశాలొస్తాయి. ఇప్పుడంతా హీరోలకే కదా. ⇒ అప్పట్లో కూడా హీరోల డామినేషన్ ఉండేది కదా.. ఉండేది. కాకపోతే మాకు మంచి కథలు వచ్చేవి. నిరూపించుకునే స్కోప్ ఉండేది. ⇒ మీకు హీరోయిన్ ఇమేజ్ ఇష్టమా? హీరో ఇమేజా? హీరోయిన్ ఇమేజ్ని తక్కువ చేయడంలేదు. కాకపోతే నిరూపించుకునే చాన్స్ తక్కువ. అందుకే హీరో ఇమేజే ఇష్టం. నా మెంటాలిటీకి అదే సూట్ అవుతుంది. ‘మహిళలు తక్కువ కాదు’ అనే ఫీలింగ్తో ఉంటాను. అందుకు తగ్గట్టుగానే లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసి, తక్కువ కాదని నిరూపించుకున్నాను. అందుకే హీరోలు చేసినట్లే యాక్షన్ మూవీస్ చేశాను. ⇒ ఏం చేస్తే బాగుంటుందనుకుంటున్నారు... ‘నిర్భయ’ చట్టం వచ్చాక దారుణాలు తగ్గుతాయేమో అనిపించింది.. చట్టాలు తీసుకొస్తున్నారు గానీ... వాటిని కరెక్టుగా అమలు చేయడంలేదు. రీసెంట్గా ఓ రాజకీయ నాయకుడి కుమారుడు అర్ధరాత్రి ఓ అమ్మాయిని వెంబడించిన ఘటన చూశాం కదా. ఇక, మనం ఎవర్ని నమ్ముతాం? ఏ రకంగా నమ్ముతాం? మగవాళ్ల మైండ్సెట్ మారాలేమో అనిపిస్తోంది. ప్రతి ఒక్కరికీ అక్కాచెళ్లెల్లు, అమ్మలు ఉంటారు. మరి, బయటకు వచ్చేటప్పటికి అమ్మాయిల పట్ల ఎందుకలా ప్రవర్తిస్తున్నారనేది అర్థం కావడం లేదు. చట్టాలను స్ట్రాంగ్ చేయాలి. ⇒ ఆడవాళ్లు బయటకు రావడం వల్ల, లేట్ నైట్స్లో బయట ఉండడం వల్ల ఇటువంటివి జరుగు తున్నాయనేవాళ్లు ఉన్నారు. లేట్ నైట్స్ అంటే... ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుంటారు. ఉదాహరణకు... మీరున్నారు. మీడియాలో ఎంతోమంది మహిళలున్నారు. షిఫ్టు ప్రకారం నైట్ డ్యూటీలు చేస్తుంటారు. వాళ్లేం చేయాలి? బయట సమాజం ఇలా ఉందని ఉద్యోగాలు మానుకోలేరు కదా! పని చేసేవాళ్లు చేయాలి. ఎదుటి వ్యక్తులు సరిగ్గా ఉండాలి. పద్ధతిగా నడుచుకోవాలి. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. రెండు మూడు ఘటనల పట్ల స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే అప్పుడు భయం వస్తుంది. పెద్దింటోళ్లు, చిన్నింటోళ్లు అనే తేడాలు లేకుండా తప్పు చేసే ఏ మగాణ్ణయినా శిక్షించాల్సిందే. ఆ విషయంలో దయాదాక్షిణ్యాలు ఉండకూడదు. ⇒ ఈ ఘటనలు పక్కనపెడితే... మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఆ అభివృద్ధి గురించి? అది ఆనందమే. మహిళల్లో మంచి ప్రతిభ దాగుంది. దూసుకెళ్తున్నారు. అదొక్కటే కాకుండా... మహిళలు అన్ని రంగాల్లోనూ కొన్ని ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. వాళ్ల ప్రతిభను చూసి ఓర్వలేనోళ్లు ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తారు. అటువంటి ప్రతికూలస్థితులను అధిగమించి కొందరు మహిళలు పైకొస్తున్నారు. ఇది అభినందించాల్సిన విషయం. మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ⇒ అప్పట్లో హీరోయిన్ అంటే విజయశాంతి. విజయశాంతి అంటే హీరోయిన్ అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అప్పుడు ఈర్ష్యతో మిమ్మల్ని తొక్కేయ డానికి ఎవరైనా ట్రై చేశారా? ఒక హీరోయిన్కి హీరో ఇమేజ్ రావడం ఏంటి? హయ్యస్ట్ పెయిడ్ హీరోయిన్ ఏంటి? అని మాట్లాడిన వాళ్లు ఉన్నారు. అవన్నీ ఓవర్కమ్ చేసుకుని నా పని నేను చేసుకుంటూ వెళ్లేదాన్ని. సక్సెస్లు వస్తుండేవి. ప్రజలు నన్నెంతో ఆదరించారు. దాంతో భయపడలేదు. యాక్షన్ ఫిల్మ్స్లో స్టంట్స్ కూడా డూప్ లేకుండా చేశా. ఇప్పుడంటే గ్రాఫిక్స్ వచ్చాయి కానీ... అప్పట్లో లేవు కదా. 30 అడుగుల ఎత్తు నుంచి దూకాలంటే దూకేయడమే. నేను చేయ నంటే ఎవరూ ఏమీ అనేవారు కాదేమో! కానీ, నేనే తగ్గేదాన్ని కాదు. మహిళలు ఎందులో తక్కువ? అనే ఫీలింగ్తో రిస్క్ తీసుకునేదాన్ని. కొన్ని సందర్భాల్లో కాళ్లు–చేతులు విరగొట్టుకున్నా. వాటిని లెక్క చేయకుండా పని చేయాలనే అభిప్రాయంతో చేశా. రాజకీయాల్లో అయితే సినిమాల్లో కంటే దారుణంగా, భయంకరంగా ఉంటుంది. వాటిని ఓవర్కమ్ చేసి రావాలి. ⇒ రాజకీయాల్లో భయంకరమైన రాజకీయా లుంటాయన్నారు. ఇందులోకి ఎందుకొచ్చాం అనే ఫీలింగ్ ఏమైనా..? నేనా రోజు తెలంగాణ అంశం టేకప్ చేసి నప్పుడు.. ‘సినిమాల్లో టాప్మోస్ట్గా ఉండి, తెలంగాణ కోసం వెంపర్లాడుతోందేంటి? రాంగ్ డెసిషన్ తీసుకుంది?’ అని చాలామంది హేళన చేశారు. కొన్ని అవమానాలూ జరిగాయి. అయినా పట్టించుకోలేదు. రెండు ప్రాంతాల్లో (ఆంధ్రా, తెలంగాణ) పేరు, సామాజిక బాధ్యత గల కళాకారిణిగా తెలుగు ప్రజల క్షేమం కోరుకున్నా. రాష్ట్రాలుగా విడిపోయినా... మంచి మనసుతో అందరూ కలిసుండాలని చెప్పా. తెలుగు ప్రజల మధ్య అప్పట్లో నెలకొన్న గీత, వైరుధ్యాలు ఈరోజు తొలగాయనే సంతృప్తి నాకుంది. ‘విడిపోతే రెండు ప్రాంతా లు బాగుపడతాయి, ఇరు వర్గాలకు న్యాయం చేసినోళ్లమవుతాం’ అని చెప్పా. ఇప్పుడందరూ హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ సాధన కోసం పాటుపడినందుకు ఆనందపడుతున్నా. ⇒ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో శ్రమించారు. ఆ పార్టీలో ఉండి ఉంటే ఒక పెద్ద పదవి పొంది ఉండేవారేమో? నాపై కొన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. ప్రతిభ ఉన్నోళ్లకు ఇబ్బందులు తప్పవు. రాజకీయాలు అన్నప్పుడు వెన్నుపోట్లు తప్పవు. ప్రాంతీయ పార్టీలు అలాగే ఉంటాయి. ప్రజలు ఆశించినట్టు జరగాలంటే జాతీయ పార్టీల ద్వారానే సాధ్యపడుతుంది. జరిగిందేదో జరిగింది. అయినా... కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నాకా గ్రాటిట్యూడ్ ఉంది. పదవులన్నది ఈరోజు రాకపోవచ్చు, రేపు రావొచ్చు. కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామనే తృప్తి నాకుంది. అది పదవుల కంటే ఎక్కువని అనుకుంటున్నా. పదవులది ఏముంది? ఐదేళ్లు అధికారంలో ఉంటారు. తర్వాత ప్రజలు మరొక పార్టీకి ఓటేస్తారు. కానీ, ఈ అచీవ్మెంట్ అనేది మళ్లీ రాదు. గాంధీగారు దేశ స్వాతంత్య్రం కోసం శ్రమించినట్టు, నేను తెలంగాణ కోసం 19 ఏళ్లు కష్టపడ్డా. నాకది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ⇒ తమిళనాడులో రజనీకాంత్, కమల్హాసన్లు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయంటు న్నారు. మీకు అక్కడ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య మీరు తమిళనాడు వెళ్లారు. మీరు అక్కడ్నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదమ్మా. తెలంగాణ కోసం 19 ఏళ్లు నేను కష్టపడి పని చేసి, రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరో రాష్ట్రం గురించి ఆలోచించడం లేదు. అఫ్కోర్స్... నాకు అక్కడ అభిమానులున్నారు. నేనక్కడి రాజకీయాల్లోకి రావాలని వాళ్లు కోరుకోవచ్చు. కానీ, నేనలా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి వెళ్లే మనిషిని కాదు. తెలంగాణను తీసుకురావాలనుకున్నాం. తీసుకొచ్చాం. ఇప్పుడీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇంకా మంచి చేయాలనే ఆలోచనతో నేనున్నా. తమిళనాడులో ఏఐఏడీయంకే పార్టీ వాళ్లు అడిగారు. అయితే... నేను వెళ్లాలనుకోవడం లేదు. జయలలితగారంటే నాకిష్టం. ఆవిడ అధికారంలో తెచ్చిన ప్రభుత్వంలో, పార్టీలో సమస్యలు రాకుండా ఉండడం కోసం... వాళ్లు నన్ను రిక్వెస్ట్ చేయడంతో నేను తమిళనాడుకి వెళ్లి క్యాంపెయిన్ చేసొచ్చా. ⇒ ఈ మధ్య కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్స్ని డ్రగ్స్ విషయమై విచారించారు కదా.. దాని గురించి ఏమంటారు? ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీవాళ్లు పొరపాటు చేసి ఉంటే, వాళ్లను పిలిచి, కౌన్సెలింగ్ ఇస్తే సరిపోయి ఉండేదేమో. ‘ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్’ అని చెబితే బాగుండేదేమో. వేరే రంగాల్లోనూ ఉన్నారు కదా. కొంతమంది పేర్లు బయటపెట్టలేమని డిపార్ట్మెంట్ అంటోంది. దాన్నెలా అర్థం చేసుకోవాలి? పెద్దవాళ్లను ఎలా వదిలే స్తారు? వాళ్లను ఎందుకు ఫ్రేమ్లోకి తీసుకురాలేదు. ఇదెక్కడి న్యాయం? పక్షపాతం ఎందుకు? నైజీరియా వాళ్లు తీసుకొస్తున్నారా? బ్రెజిల్ వాళ్లు తీసుకొస్తున్నారా? డ్రగ్స్ సరఫరా ఎలా జరుగుతోంది? అని కూపీ లాగాలి. వాళ్లను కఠినంగా శిక్షించాలి. పబ్స్ని ఎందుకు మూయ డం లేదు? పబ్లు మన కల్చర్ కాదు. ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే పబ్స్ని మూసేయాలి. డ్రగ్స్ వల్ల వేల మంది జీవితాలు నాశనమవుతున్నాయి. అందుకే అవసరమైతే ఉద్యమం చేయాలనుకుంటున్నా. ⇒ చెన్నై వెళ్లి శశికళగారిని కలిశారు కాబట్టి, ఆవిడతో చేతులు కలపాలనుకున్నారన్నది చాలామంది ఊహ.. జయలలితగారిది ప్రజలు ఎన్నుకున్న పార్టీ. మంచి మంచి పథకాలు ఉన్నాయి. ఐదేళ్ల పాటు ఉండాల్సిన పార్టీ. పళనీస్వామి, పన్నీర్ సెల్వం, శశికళ.. వీళ్లంతా కలసికట్టుగా పార్టీని నడిపిస్తే బాగుంటుందనుకున్నా. వీళ్లల్లో ఏ ఒక్కరి పక్షాన నిలబడాలని నేను అనుకోలేదు. ఆ పార్టీ ముందుకెళ్లాలనుకున్నాను. అంతే కానీ, వ్యక్తులతో సంబంధం లేదు. ⇒ జయలలిత టాపిక్ వచ్చింది కాబట్టి... ఆవిడ మరణం ఓ మిస్టరీ అని చాలామంది ఫీలింగ్? జయలలితగారి మరణంలో మిస్టరీ లేదమ్మా. నిజంగా ఆవిడకు ఒంట్లో బాగాలేదు. 1998 నుంచి నేను ఆవిడతో పని చేస్తున్నా. అప్పట్నుంచి జయలలితగారికి షుగర్, బీపీ ఉన్నాయి. ఒకానొక దశలో ఆవిడ వల్ల కాకపోతే క్యాంపెయిన్కు నన్ను వెళ్లమని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు నేను బీజేపీలో ఉన్నా క్యాంపెయిన్కి వెళ్లి వాళ్ల అభ్యర్థులను గెలిపించా. అప్పుడే ఆమెకు కాళ్ల ఆపరేషన్ చేశారు. ఆవిడకు షుగర్ విపరీతంగా ఉండేది. మిస్టరీ ఏం లేదు. అంత పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న టైమ్లో హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆల్మోస్ట్ రెండు మూడు రోజుల్లో ఇంటికి వచ్చేస్తారని అనుకుంటున్న టైమ్లో ఘోరం జరిగింది. నేను అక్కడి డాక్టర్లతో మాట్లాడాను. ⇒ తెలంగాణ పరిపాలనపై మీ అభిప్రాయం? తప్పులు ఎక్కువైతే మాట్లాడక తప్పదు కదా! తెలంగాణ పరిపాలనపై మాట్లాడాల్సిన సందర్భం వచ్చినట్టుంది. ఆల్మోస్ట్ మూడేళ్లయింది. నేను కొంచెం టైమ్ ఇచ్చా. ఇక, మాట్లాడాల్సిన టైమ్ ఆసన్నమైంది. ⇒ ఒసేయ్ రాములమ్మ’కి పార్ట్ 2 చేయాలనుకున్నారని ఓ టాక్. బహుశా దాసరిగారు ఉండి ఉంటే అది జరిగేదేమో... దాసరిగారు నాకోసం మూడు సబ్జెక్ట్స్ రెడీ చేస్తూ వచ్చారు. ‘ఒసేయ్ రాములమ్మ–2’ స్టోరీ కూడా వర్కవుట్ చేశారు. ఆ తర్వాత ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి ఒక పొలిటీషియన్ జీవితంతో బయోపిక్ ప్లాన్ చేశారు. హిందీలో ‘గులాబ్ గ్యాంగ్’ సినిమా టైప్లో ఒకటి చేయా లనుకున్నారు. ఆయన ఉండి ఉంటే.. సినిమా చేసి ఉండేదాన్ని. ఆర్టిస్ట్ని ఎలా డీల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. హీరోయిన్లను హుందాగా చూపించిన దర్శకుడు. ⇒ ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించి కూడా తెలుసుకుంటుంటారా? ఒక్కో స్టేట్లో అక్కడికి తగ్గ సమస్యలున్నాయి. అయితే మన స్టేట్లో ఎక్కువ ఉన్నాయి. ముందు దీన్ని ‘సెట్రైట్’ చేయాలి. రానున్న రోజుల్లో నా పోరాటం ఈ దిశలోనే ఉంటుంది. ⇒ ఈ ‘డీమానిటైజేషన్’, ‘జీఎస్టీ’.. వీటి వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? నాకు తెలిసి ప్రజలు లాభపడినట్లు అనిపించలేదు. మధ్యతరగతివాళ్లు, దిగువ మధ్యతరగతులవాళ్లు ఇబ్బందుల పాలవుతున్నారు. డబ్బులు తెచ్చుకోవడానికి ఏటీయంల ముందు ఎన్నేసి గంటలు నిలబడ్డారో, ఎన్నిసార్లు బ్యాంకుల చుట్లూ తిరిగారో తెలిసిందే. జీఎస్టీ తర్వాత రేట్లు ఇంకా పెరిగాయేమో అనిపిస్తోంది. ఏ విధానాలనైనా ప్రజల మేలు కొరకు ప్రవేశపెట్టాలి కానీ, వాళ్లను ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేయకూడదు. ⇒ ఫైనల్లీ మీకు ‘సి.ఎం. విజయశాంతి’ అనిపించుకోవాలనే కోరిక ఉందా? సినిమాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు ఇంకా సక్సెస్ వస్తే బాగుంటుందనిపిస్తుంది. సూపర్స్టార్ అయితే బాగుంటుందనిపిస్తుంది. ఏ ఆర్టిస్ట్కైనా ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. టాప్ పొజిషన్కి రావాలనుంటుంది. అలాగే, రాజకీయాల్లో పందొమ్మిదేళ్లు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్ని అవకాశాలొచ్చినా పక్కన పెట్టి... తెలంగాణ సాధించేవరకు నా మైండ్లోకి ఏదీ తీసుకోనని భీష్మించుకుని కూర్చుని అంత నిజాయితీగా పనిచేసి, టార్గెట్ రీచ్ అయ్యా. తెలంగాణ సాధించా. ఇప్పుడు దేవుడు, ప్రజలు అవకాశం ఇస్తే... సి.ఎం. కావడంలో తప్పు లేదు. సి.ఎం. అని మీరంటున్నారు. నా దృష్టిలో అది కూడా సేవే. పేరుకు మాత్రమే సి.ఎం. కానీ, వర్క్ చేయాలి. అనుకున్నదాంట్లో 60, 70 శాతం చేసినా సక్సెస్ అవుతాం. కానీ, ఎందుకో చాలామంది పని చేయడం లేదు. చెప్పేది చెబుతున్నారు. చేతల్లో అది ఉండడం లేదు. – డి.జి. భవాని -
నరసన్నను దర్శించుకున్న వినాయక్, హీరో శ్రీనివాస్
అంతర్వేది (సఖినేటిపల్లి) : స్థానిక శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆదివారం ప్రముఖ చిత్ర దర్శకుడు వినాయక్, సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకట శాస్త్రి, అభిమానులు స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు వీరికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. ‘జై జానకి నాయకా’ చిత్రం త్వరలో విడుదల అవుతున్న సందర్భంగా ఆ చిత్రం హీరో సాయిశ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. చిత్రం విజయవంతం కావాలని ఆయన స్వామిని వేడుకున్నారు. సి. కల్యాణ్ నిర్మాతగా మెగా ఫ్యామిలీ మెంబర్ సాయిధరమ్ తేజ్ హీరోగా సీకే ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై నిర్మించనున్న కొత్త చిత్రం స్క్రిప్టును దర్శకుడు వినాయక్ స్వామివారి పాదాల చెంతన ఉంచి పూజలు చేశారు. వారి వెంట ట్రస్టీలు వీరా మల్లిబాబు, తిరుమాని ఆచార్యులు, యెనుముల శ్రీరామకృష్ణ, శంకరగుప్తం శ్రీనుబాబు, సీనియర్ అసిస్టెంట్ పి. విజయ సారధి, జూనియర్ అసిస్టెంట్ ఎం. సత్యకిరణ్ ఉన్నారు. రాబోయే సినిమా మినీ ఠాగూర్లా ఉంటుంది మలికిపురం : తన దర్శకత్వంలో రానున్న సినిమా మినీ ఠాగూర్లా ఉంటుందని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తెలిపారు. మలికిపురంలో కంచుస్తంభం వాసు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సి. కల్యాణ్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రం షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభం అవుతుందన్నారు. ఆయన వెంట కంచుస్తంభం వాసు, లింగోలు మహేష్, బొలిశెట్టి శ్రీను, అబ్దుల్ తదితరులు ఉన్నారు. -
హీరోగా మారనున్న ప్రముఖ సింగర్
ముంబై: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ నటుడిగా మారనున్నారు. రాధికారావు, వినయ్ సప్రే దర్శకత్వంలో త్వరలో రూపుదదిద్దుకోనున్న‘అఫ్ఘాన్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ హోమ్’ సినిమాలో ఆయన నటించనున్నారు. వీరిద్దరి దర్శకత్వంలో పనిచేయటం చాలా సంతోషంగా ఉందని సమీ పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా వీరిద్దరితో స్నేహబంధం కొనసాగుతోందని తెలిపారు. ఈ సినిమాలో ఆయన అఫ్ఘానిస్తాన్లో పుట్టి పెరిగిన కళాకారుడిగా కనిపించనున్నారు. అనుకోని పరిస్థితుల్లో దేశం వదిలి వెళ్లిన ఆయన మరో దేశంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు ? అనేదే కథాంశం. భారత పౌరసత్వం లభించిన తర్వాత ఆయన చేపట్టిన మొదటి ప్రాజెక్టు ఇదే. బ్రిటన్లో పుట్టి పెరిగిన అద్నాన్కు ఏడాది క్రితం భారత పౌరసత్వం లభించింది. -
హీరో కొత్త గ్లామర్.. ధరెంతో తెలుసా?
న్యూఢిల్లీ: దేశీయ ఆటో దిగ్గజం హీరో... తన గ్లామర్ బైక్ కు మరింత గ్లామర్ అద్దింది.. కొత్త స్టైల్ లో గ్లామర్ ను అప్ డేట్ చేసింది. బీఎస్-4 కంప్లియంట్ ఇంజిన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ తో హీరో తన కొత్త గ్లామర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బైకు అమ్మకాలను భారత్ లో ప్రారంభించింది. ఈ కొత్త మోటారో సైకిల్ ను కంపెనీ ఈ ఏడాది మొదట్లో అర్జెంటీనా ఈవెంట్లో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇవి డీలర్ షిప్ ల వద్ద అందుబాటులో ఉన్నాయి. రెండు వేరియంట్లలో ఇది డీలర్ షిప్ వద్ద అందుబాటులో ఉంది. ఒకటి డ్రమ్ బ్రేక్, రెండు డిస్క్ బ్రేక్. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.57,755(ఎక్స్ షోరూం, ఢిల్లీ) కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ మోటార్ సైకిల్ ధర 59,755 రూపాయలు. ఈ కొత్త గ్లామర్ బైకు గురించి కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కేవలం బైకు తయారీ డీలర్ షిప్స్ మాత్రమే దీనిపై స్పందిస్తున్నారు. కేవలం భారత్ మార్కెట్లోనే కాక, దక్షిణ అమెరికా లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇది అందుబాటులోకి వచ్చినట్టు తెలిసింది. కొత్త స్టైల్ లో తీసుకొచ్చిన గ్లామర్ ను, ఆటో గ్రాఫిక్స్ దగ్గర నుంచి ఎల్లాయ్ వీల్స్ వరకు మొత్తం లుక్నే మార్చేసింది హీరో. బ్లాక్ కోటెడ్ హ్యాండిల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, కొత్త ఎల్లాయ్ వీల్స్, స్టైలిస్ టెయిల్ డిజైన్, కొత్త మీటర్ కన్సోల్ దీనిలో ప్రధాన ఆకర్షణ. -
ఐఫోన్ కంటే చీప్ గా దొరుకుతున్న బైకులివే!
బీఎస్-3 వాహనాలపై ఏప్రిల్ 1నుంచి నిషేధం విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరిచడంతో బైక్ ధరలన్నీ ఒక్క ఉదుడున కిందకి దిగొచ్చాయి. డెడ్ లైన్ ఏప్రిల్ 1కి ఇంకా ఒక్కరోజే ఉండటంతో భారీ డిస్కౌంట్ ఆఫర్లతో స్టాక్ ను సేల్ చేసుకోవడానికి కంపెనీ తహతహలాడుతున్నాయి. ఇదే ఛాన్సుగా భావించిన కస్టమర్లు కొనుగోళ్లకు వెనుకాడటం లేదు. దీంతో మోటార్ షోరూంలన్నీ కొనుగోలదారులతో కళకళలాడుతున్నాయి. అయితే దిగొచ్చిన బైక్ ధరలు ఐఫోన్ కంటే చౌకగా లభ్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ బైకులేమిటో ఓసారి చూద్దాం.... బీఎస్-3 వాహనాలపై టూ-వీలర్స్ దిగ్గజాలు రూ.22వేల వరకు డిస్కౌంట్ ప్రకటించాయి. దీంతో 150సీసీ బైక్ ఐఫోన్ కంటే తక్కువ ధరకే లభ్యమవుతుందట. నమ్మట్లేదా అయితే ధరలు మీరే ఓసారి చూడండి... ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) ధర రూ.82వేలు. నేడు సుజుకీ జిక్సర్ ధర షోరూంలో రూ.77,452లకే దొరుకుతోంది. సుజుకీ జిక్సర్ మాత్రమే కాక, యాక్టివా 3జీ కూడా 50,290కు, డ్రీమ్ యుగ 51,741 రూపాయలకు, సీబీ షైన్ 55,799 రూపాయల నుంచి 61,283 రూపాయల వరకు, సీడీ 110డీఎక్స్ 47,202 రూపాయల నుంచి 47,494 రూపాయల ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ బైకులకు హోండా రూ.22వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించడంతో ధరలు కిందకి తగ్గాయి. హీరో బైకులపై ఉన్న ఆఫర్లు... హీరో మోటార్ కార్పొరేషన్ కూడా బీఎస్-3 టూ-వీలర్స్ పై రూ.12,500 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో స్కూటర్స్ డ్యూయెట్, ఐఫోన్ కంటే చీప్ గా రూ.49,480కు అందుబాటులోకి వచ్చింది. ఇక మాస్ట్రో ఎడ్జ్ నైతే రూ.51,030కే కొనుకోవచ్చు. ప్రీమియం బైకులపై రూ.7500, ఎంట్రీలెవల్ బైకులపై రూ.5000వేల వరకు హీరో ఆఫర్ ప్రకటించింది. దీంతో గ్లామర్ రూ.59,755కు, స్ప్లెండర్ 125 రూ.55,575కు కొనుకునేలా ఆఫర్ ఉంది. ఒక్క హీరో, హోండా కంపెనీలు మాత్రమే కాక, సుజుకీ బైకులు, బజాజ్ బైకులు కూడా ఐఫోన్ కంటే తక్కువ ధరకే మార్కెట్లోకి వచ్చాయి. -
టూ వీలర్స్ పై భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాల నేపథ్యంలో ఉన్న స్టాక్ ను విక్రయించేందుకు దేశీయ ఆటో కంపెనీలు ఆగమేఘాల కదులు తున్నాయి. బీఎస్-3 వాహనాలను నిషేధిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేయడంతో ప్రముఖ టూవీలర్ మేజర్లు భారీ డిస్కౌంట్లను ఆఫర్లను ప్రకటించాయి. డీలర్స్ అందిస్తున్న సమాచారం ప్రకారం మార్కెట్ లీడర్హీరో మోటార్ కార్ప్ స్కూటర్లపై రూ.12500, ప్రీమియం బైక్స్పై రూ.7500, ఎంట్రీ లెవర్ మెటార్ సైకిళ్లపై రూ.5వేల దాకా తగ్గింపును ప్రకటించింది. అలాగే హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అయితే బీఎస్-3 స్కూటర్లపై కొనుగోలుపై రూ. 10వేల డిస్కౌంట్ అంద్తిస్తోంది. స్టాక్ అయిపోయే దాకా లేదా మార్చి 31 దాకా ఆ ఫర్ వర్తించనున్నట్టు ఇరు కంపెనీలు ప్రకటించాయి. టూవీలర్స్ ఇండస్ట్రీలో ఈ రాయితీలను ఎప్పుడూ చూడలేదని ఆటోమొబైల్ డీలర్స్ ఫెడరేషన్, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ నికుంజ్ సాంగ్వి పిటిఐకి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డీలర్స్ చర్యలు గురించి అడిగినప్పుడు, గడువులోపు సాధ్యమైనన్ని వాహనాలను విక్రయించడంపైనే అంతా దృష్టి పెట్టినట్టు తెలిపారు. కాగా ఏప్రిల్ 1 నుంచి బీఎస్-3 వాహనాలను అమ్మకాలను, రిజిస్ట్రేషన్ నిషేధిస్తూ సుప్రీం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. కాలుష్య నివారణలో భాగంగా తయారీదారుల వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యం చాలా చాలా ముఖ్యమైన సుప్రీం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - మోహన్ బాబు
-
కృష్ణవంశీ అంటే అభిమానం..
అందుకే హీరోనైనా ‘నక్షత్రం’లో విలన్పాత్ర చేస్తున్నా : హీరో తనీష్ అమలాపురం టౌన్ : ‘‘దర్శకుడు కృష్ణవంశీ అంటే నాకు చిన్నతనం నుంచీ అభిమానం. ఆయన తీసిన ఖడ్గం, సింధూరం తదితర సినిమాలు నాపై చాలా ప్రభావం చూపాయి. ఎప్పటికైనా ఆయన దర్శకత్వంలో పనిచేయాలనుకునే అవకాశం కోసం ఎదురు చేస్తున్నా. అందుకే ఆయన కొత్తగా తీస్తున్న నక్షత్రం చిత్రంలో విలన్ ప్రాతను ఏ మాత్రం ఆలోచించకుండా అంగీకరించానని వర్ధమాన సినీహీరో తనీష్ అన్నారు. తాను హీరోనైనా విలన్ పాత్ర పోషించేందుకు ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో నెగిటివ్ షేడ్ పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. ముమ్మిడివరం అనాతవరంలోని ప్రసిద్ధ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న పవర్ 2కే17 ఫెస్ట్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు వచ్చిన హీరో తనీష్ అమలాపురంలోని గ్రాండ్ పార్కులో శుక్రవారం సాయంత్రం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘‘దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో పనిచేయటమంటే ఏ నటుడికైనా ఓ గైడ్లా ఉంటుంది. నేను బాల నటుడిగా దాదాపు 50 చిత్రాల్లో, హీరోగా 22 చిత్రాల్లో నటించా. 1999లో ప్రేమంటే ఇదేరా చిత్రంలో బాలనటుడిగా నా సినీ ప్రస్థానం మొదలైంది. దేవుళ్లు, మన్మథుడు చిత్రాల్లో బాలనటుడిగా గుర్తింపు పొందా. ప్రస్తుతం దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం చిత్రం, దర్శకుడు కార్తికేయ తీస్తున్న రంగు చిత్రంలో నటిస్తున్నా. నక్షత్రం చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. హీరోగా.. ‘‘నచ్చావులే’’ హీరోగా నచ్చావులే చిత్రం గుర్తింపు తెచ్చిపెట్టింది. కోడిపుంజు, రైడ్, మేము వయసుకు వచ్చాం...ఏం పిల్లో...ఏం పిల్లడో చిత్రాలు నన్ను పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేశాయి. గతంలో జరిగిన పొరపాట్లు, తప్పులు మళ్లీ దొర్లకుండా చిత్రాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నా. కోనసీమకు రావటం ఇది రెండోసారి. నేనూ గోదావరి జిల్లాల కుర్రాడినే. మా స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - రవితేజ.
-
'మహానటుడికే ఇండస్ట్రీలో గ్యాప్ వచ్చింది'
– ఇంటర్వ్యూలో సినీ హీరో సుమన్ బనగానపల్లె: చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, సుమన్ ఈ ఐదుగురు ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట పాపులర్ హీరోలు. వీరందరిలో ఎవరు బెస్టో చెప్పడానికే సాధ్యమయ్యేది కాదు. కానీ ప్రతిభ ఉన్నా అదృష్టం కూడా ఉండాలంటారు. అది కొందరికి కొన్ని సమయాల్లో వరించదు. అందులో సుమన్ ఒక్కరు. ఫలితంగా కొంత కాలం ఇండస్ట్రీకి దూరం అయినా పడిలేచిన కెరటమయ్యారు. హీరో పాత్రలకే మడికట్టుకు కూర్చోకుండా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని ఇప్పటికి దాదాపు 450 చిత్రాల్లో నటించారు. తాజాగా నిర్మాత మహేష్ ఖన్నా గౌడ్ నిర్మిస్తున్న "సత్యాగ్యాంగ్" సినిమాలో ఏసీపీ పాత్రలో ఇమిడిపోతున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు గ్రామ సమీపంలోని తెల్లటి పాలరాతి కొండలపై ఉన్న నవాబుల సమ్మర్ ప్యాలెస్ వద్ద మంగళవారం ఈ సినిమా చిత్రీకరించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. మీ సినీ ప్రస్థానం ప్రారంభం ఎప్పుడు? సుమన్: 1977లో తమిళ చిత్రం స్విమ్మింగ్పూల్ చిత్రం సినీ రంగప్రవేశం చేశాను. తెలుగులో హీరోగా 1980లో ఇద్దరు కిలాడీలు చిత్రంలో నటించినా విడుదల ఆలస్యం కావడంతో ఆ తర్వాత నటించిన తరంగిణి చిత్రం మొదటి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్హిట్ అయింది. ఎన్ని భాషల్లో ఇంతవరకు ఎన్ని చిత్రాల్లో నటించారు? సుమన్: తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లిష్, హిందీ, కొరియా భాషల్లో కలిపి సుమారు 450 చిత్రాల్లో నటించాను. తెలుగులో నటించిన చిత్రాలు? సుమన్: 99 చిత్రాల్లో హిరో పాత్ర పోషించాను. ప్రస్తుతం పోషిస్తున్న సత్యాగ్యాంగ్ 100వ చిత్రం. మీకు నచ్చిన చిత్రం? సుమన్: అన్నమయ్య చిత్రం పూర్తి సంతృప్తినిచ్చింది. అందులో పోషించిన వేంకటేశ్వరస్వామి పాత్ర ప్రజలను కూడా మెప్పించింది. ఇంకా పౌరాణిక చిత్రం భక్తరామదాసు, సత్యనారాయణస్వామి, తరంగిణి, నేటి భారతం, బావబామ్మర్ది, 20వ శతాబ్దం, సితారతోపాటు మరిన్ని చిత్రాలు పేరుతెచ్చాయి. హీరోగా ఉన్న మీరు తమిళ చిత్రం శివాజీలో విలన్గా నటించడం? సుమన్: ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. అందుకే నటించాను. ప్రజలు కూడా ఆదరించారు. ప్రస్తుతం ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నారు? సుమన్: తెలుగు, కన్నడ, తమిళం, ఒరియా భాషల్లో 10 నుంచి 12 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను. వచ్చే జనవరి చివరి నాటికి 5 నుంచి 6 సినిమాలు విడుదలవుతాయి. రాయలసీమలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై మీ అభిప్రాయం? సుమన్: రాయలసీమ ప్రాంతంలో సినిమా షూటింగ్లకు అవసరమైన లోకేషన్లు చాలా ఉన్నాయి. వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధికి ప్రభుత్వం ముందుకురావాలి. ఈ ప్రాంతం నుంచి నిర్మాతలు వస్తే మంచి ఆర్టిస్ట్లు ఇక్కడే పుట్టుకొస్తారు. సత్యాగ్యాంగ్ సినీ నిర్మాత డోన్కు చెందిన మహేష్ ఖన్నాగౌడ్ అవడం నాకెంతో ఆనందం. ఈ సినిమా విజయవంతమవుతుందన్న నమ్మకం నాకుంది. సినిమాల్లో మీకు కొంతకాలం గ్యాప్ రావడానికి కారణం? సుమన్: ఈ సమస్య సినిమాలోని ప్రతిఒక్కరికీ ఉంటుంది. మహానటుడు ఎన్టీఆర్కే కొంతకాలం గ్యాప్ ఏర్పడింది. ప్రస్తుత రాజకీయాలపై మీ అభిప్రాయం? సుమన్: అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయిననూ అన్ని వర్గాల మన్ననలు చూరగొనాలి. క్రైం నేరాన్ని తగ్గించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి, విద్యార్థులకు ఉన్నత చదువుల అవకాశాలు కల్పించాలి. కొంతకాలంగా పాలకుల్లో ఈ పరిస్థితి అగుపించడంలేదు. మీరు ఏ పార్టీకి మద్దతు అందిస్తారు? లేక ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తారా? సుమన్: ప్రత్యేక పార్టీ ఏర్పాటుచేసే ఆలోచన లేదు. 2019 ఎన్నికల నాటికి అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి నచ్చిన పార్టీకి తన మద్దతు ఉంటుంది. -
అల్లరి నరేష్ ముద్దుల పాప పేరేంటో తెలుసా?
హైదరాబాద్: ప్రముఖ హస్య నటుడు, టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తమ జీవితంలోకి అడుగుపెట్టిన పాపను అపురూపంగా చూసుకుంటున్నారు. ఈ మేరకు తన బంగారం అదేనండీ.. తన ముద్దుల పాపతో ఉన్న ఫోటోనొకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో తనకు కూతురు పుట్టిన ఆనంద క్షణాలను ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్న ఈ కరెంట్ తీగ తాజాగా ట్విట్టర్ అందుకున్నారు. ‘సెల్ఫీరాజా’ విజయంతో ఖుషీగా ఉన్న నరేష్ తన గారాల పట్టి పేరును వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. అయానా ఇవిక ఈదర, అవర్ లైఫ్.... అంటూ నరేష్ ట్వీట్ చేసారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు, ఇతర అభిమానులు, స్నేహితుల సందేశాలు వెల్లువెత్తాయి. కాగా గతేడాది మేలో పెళ్లి చేసుకున్న అల్లరి నరేశ్-విరూపదంపతులకు ఈ సెప్టెంబర్ లో పాప పుట్టింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. పాపను ఎత్తుకొన్న ఫొటోను నరేశ్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. Presenting Ayana Evika Edara, our life :) pic.twitter.com/8AbbP2iNld — Allari Naresh (@allarinaresh) December 4, 2016 Ayana Evika,d name is as cute as d princess herself! The happiness in @allarinaresh & @v1rupa eyes says it all