India vs Ireland
-
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు జరిమానా
రాజ్కోట్: భారత పర్యటనలో ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుపై జరిమానా పడింది. భారత మహిళల జట్టుతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఐర్లాండ్ జట్టు మందకొడిగా బౌలింగ్ చేసింది. దీంతో జట్టు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. రెండు ఓవర్లు ఆలస్యం కావడంతో మ్యాచ్ రిఫరీ జి.ఎస్.లక్షి... ఐర్లాండ్ కెప్టెన్ గాబీ లూయిస్ వివరణ అనంతరం జరిమానా ఖరారు చేసింది. ‘అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం, కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్కు 5 శాతం చొప్పున మొత్తం పదిశాతం మ్యాచ్ ఫీజులో కోత విధించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు వన్డేల సిరీస్ను స్మృతి మంధాన నేతృత్వంలోని భారత జట్టు 3–0తో క్లీన్స్వీప్ చేసింది. ఆఖరి పోరులో అయితే అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 435/5 భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మంధాన, ప్రతీకలిద్దరు శతకాలతో కదంతొక్కారు. ఐర్లాండ్ను భారత బౌలర్లు 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూల్చడంతో టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. -
వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్
సైకాలజీ స్టూడెంట్ ఇప్పుడు టీమిండియా తరఫున సత్తా చాటుతోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆరో ఇన్నింగ్స్లోనే ఏకంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. భారత మహిళా క్రికెట్ జట్టులోకి దూసుకువచ్చిన ఆ యువ కెరటం మరెవరో కాదు.. ప్రతీకా రావల్(Pratika Rawal).యువ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలక్టర్లు ప్రతీకా రావల్కు పిలుపునిచ్చారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న 24 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో ఆడిన తొలి నాలుగు వన్డేల్లోనే రెండు అర్ధ శతకాలతో మెరిసింది.వరల్డ్ రికార్డు బద్దలుతాజాగా ఐర్లాండ్తో వన్డే సిరీస్(India Women Vs Ireland Women) జట్టులోనూ చోటు దక్కించుకున్న ప్రతీకా రావల్.. మూడు మ్యాచ్లలోనూ అదరగొట్టింది. తొలి వన్డేలో 89, రెండో వన్డేలో 67 పరుగులు సాధించిన ప్రతీకా.. బుధవారం నాటి మూడో వన్డేలో భారీ శతకంతో అదరగొట్టింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 154 పరుగులు సాధించింది.ఈ క్రమంలో ప్రతీకా రావల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. ప్రతీకా రావల్ భారత్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (154)ను సాధించింది. దీప్తి శర్మ (188), హర్మన్ప్రీత్ (171 నాటౌట్) ఆమెకంటే ముందున్నారు. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు👉ప్రతీకా రావల్(ఇండియా)- 444 పరుగులు👉చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్)- 434 పరుగులు👉నథాకన్ చాంథమ్(థాయ్లాండ్)- 322 పరుగులు👉ఎనిడ్ బేక్వెల్(ఇంగ్లండ్)- 316 పరుగులు👉నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)- 307 పరుగులు.అతిపెద్ద వన్డే విజయంరాజ్కోట్ వేదికగా ఐర్లాండ్తో మూడో వన్డేలో భారత ఓపెనర్లు ప్రతీక రావల్(154), స్మృతి మంధాన(135) శతకాలతో చెలరేగారు. వీరిద్దరికి తోడు రిచా ఘోష్ హాఫ్ సెంచరీ(59)తో రాణించింది. ఈ క్రమంలో భారత జట్టు 435 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది. పురుషులు, మహిళల వన్డే క్రికెట్లో భారత్కు ఇదే అతిపెద్ద స్కోరు. ఓవరాల్గా మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. టాప్–3 అత్యధిక స్కోర్లు న్యూజిలాండ్ (491/4; 2018లో ఐర్లాండ్పై; 455/5; 1997లో పాక్పై; 440/3; 2018లో ఐర్లాండ్పై) పేరిటే ఉండటం విశేషం.ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 304 పరుగులతో ఐర్లాండ్పై టీమిండియా జయభేరి మోగించింది. పరుగుల తేడా పరంగా భారత మహిళా జట్టుకిదే అతిపెద్ద విజయం. 2017లో భారత్ 249 పరుగుల తేడాతో ఐర్లాండ్నే ఓడించింది. ఇక ఈ గెలుపుతో 3–0తో వన్డే సిరీస్ను స్మృతి బృందం క్లీన్స్వీప్ చేసింది. అదే విధంగా.. భారత జట్టు ప్రత్యర్థిని క్లీన్స్వీప్ చేయడం ఇది 13వసారి. అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన రికార్డు ఆస్ట్రేలియా (33 సార్లు) పేరిట ఉంది. ఇక.. ఐర్లాండ్తో ఇప్పటి వరకు ఆడిన 15 వన్డేల్లోనూ భారత జట్టే గెలవడం మరో విశేషం.చదవండి: ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్A post-series chat with the record-breaking opening duo! 😎From Maiden ODI century to Fastest ODI Hundred for India in women's cricket 💯Captain Smriti Mandhana and Pratika Rawal 𝙚𝙡𝙖𝙗𝙤𝙧𝙖𝙩𝙚 it all 😃👌 - By @mihirlee_58 #TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/7c0xsYGaIo— BCCI Women (@BCCIWomen) January 16, 2025 -
భారత్ ఖాతాలో అతిపెద్ద వన్డే విజయం
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు(India Women vs Ireland Women)తో మూడో వన్డేలో స్మృతి సేన ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా భారత మహిళా క్రికెట్ వన్డే చరిత్రలో అతి భారీ గెలుపు(Largest Margin Win)ను నమోదు చేసింది. అంతేకాదు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది.కాగా ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా రాజ్కోట్ వేదికగా భారత్- ఐర్లాండ్ మధ్య మూడు వన్డేలు జరిగాయి. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఈ సిరీస్కు దూరం కాగా.. ఆమె స్థానంలో స్మృతి మంధాన తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించింది. ఇక శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఐర్లాండ్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్లో 116 పరుగుల తేడాతో ఐరిష్ జట్టును చిత్తు చేసింది.శతకాలతో చెలరేగిన స్మృతి, ప్రతికాఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి.. రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్లు ప్రతికా రావల్(Prathika Rawal 129 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్- 154), స్మృతి మంధాన(80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగగా.. వికెట్ కీపర్ రిచా ఘోష్ అర్ధ శతకం(42 బంతుల్లో 59) రాణించింది.మిగిలిన వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్(15), జెమీమా రోడ్రిగ్స్(4*), దీప్తి శర్మ(11*) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. ఈ నేపథ్యంలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. మెన్స్, వుమెన్స్ వన్డే క్రికెట్లో భారత్కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఆది నుంచే ఐర్లాండ్ తడ‘బ్యా’టుఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లలో కెప్టెన్ గాబీ లూయీస్(Gaby Lewis- 1) పూర్తిగా విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ కౌల్టర్ రెలీ(0) డకౌట్గా వెనుదిరిగింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్(41)తో కలిసి ఓర్లా ప్రెరెండెర్గాస్ట్(36) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.చెలరేగిన భారత బౌలర్లుఅయితే, భారత బౌలర్ల ధాటికి ఈ ఇద్దరు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. సారా, ఓర్లా అవుటైన తర్వాత ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. లారా డెలానీ(10), లీ పాల్(15), అర్లెనె కెలీ(2), అవా కానింగ్(2), జార్జియానా డెంప్సీ(0), అలనా డాల్జెల్(5*), ఫ్రేయా సార్జెంట్(1) త్వరత్వరగా పెవిలియన్ చేరారు. ఫలితంగా ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులు చేసి.. ఆలౌట్ అయింది. దీంతో భారత్ 304 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లతో చెలరేగగా.. తనూజ కన్వార్ రెండు వికెట్లు పడగొట్టింది. మరోవైపు.. టైటస్ సాధు, సయాలీ సట్ఘరే, మిన్ను మణి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సెంచరీతో రాణించిన ప్రతికా రావల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మహిళల వన్డే క్రికెట్లో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలు👉ఐర్లాండ్పై రాజ్కోట్ వేదికగా 2025లో 304 పరుగుల తేడాతో గెలుపు👉ఐర్లాండ్పై పోచెఫ్స్ట్రూమ్ వేదికగా 2017లో 249 పరుగుల తేడాతో గెలుపు👉వెస్టిండీస్పై వడోదర వేదికగా 2024లో 211 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్పై డంబుల్లా వేదికగా 2008లో 207 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్పై కరాచీ వేదికగా 2005లో 193 పరుగుల తేడాతో గెలుపు.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
టీమిండియా సరికొత్త చరిత్ర.. వన్డేల్లో అత్యధిక స్కోరు
ఐర్లాండ్తో మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన విధ్వంసానికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా రాణించడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత యాభై ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన స్మృతి సేన ఏకంగా 435 పరుగులు సాధించింది. నాటి రికార్డు బ్రేక్తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు(Highest ODI total) సాధించిన భారత జట్టుగా నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు భారత పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉండేది. ఇండోర్ వేదికగా 2011లో వెస్టిండీస్తో జరిగిన వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. తాజాగా స్మృతి సేన ఆ రికార్డును బద్దలు కొట్టి.. ఈ మేర సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది.ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా సొంతగడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు ఐర్లాండ్(India Women Vs Ireland Women)తో తలపడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గైర్హాజరీ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే.. రాజ్కోట్ వేదికగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు గెలిచిన భారత్.. సిరీస్ను 2-0తో గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డేలోనూ స్మృతి సేన ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ల ధనాధన్ శతకాలుటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు స్మృతి, ప్రతికా రావల్(Pratika Rawal) శతక్కొట్టి అదిరిపోయే ఆరంభం అందించారు. స్మృతి 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు సాధించగా.. ప్రతికా భారీ సెంచరీతో దుమ్ములేపింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని ఇరవై ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఏకంగా 154 పరుగులు రాబట్టింది.హాఫ్ సెంచరీతో మెరిసిన రిచాఇక వన్డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. 42 బంతులు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(25 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్ 15 రన్స్ చేసింది. జెమీమా రోడ్రిగెస్ 4, దీప్తి శర్మ 11 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్గా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా రికార్డు స్థాయిలో 435 పరుగులు స్కోరు చేసింది. ఐరిష్ బౌలర్లలో ఓర్లా ప్రెండెర్గాస్ట్కు రెండు వికెట్లు దక్కగా.. అర్లెనీ కెల్లీ, ఫ్రెయా సార్జెంట్, జార్జియానా డెంప్సీ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఐర్లాండ్తో మూడో వన్డే సందర్భంగా స్మృతి సేన సాధించిన రికార్డులువుమెన్స్ వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీలు బాదిన జట్లలో మూడో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 712. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 593. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్కోట్- 57వుమెన్స్ వన్డేల్లో 400కిపైగా స్కోర్లు సాధించిన జట్లలో నాలుగో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 491/42. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- 1997- క్రైస్ట్చర్చ్- 455/53. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 440/34. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్కోట్- 435/5.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ‘తొలి ప్లేయర్’గా స్మృతి మంధాన చరిత్ర
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో తక్కువ బంతుల్లోనే శతకం బాదిన(Women's ODI Fastest Century) భారత తొలి మహిళా క్రికెటర్గా రికార్డు సాధించింది. ఐర్లాండ్తో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా స్మృతి మంధాన ఈ ఘనత సాధించింది. అంతేకాదు.. మహిళల వన్డే క్రికెట్లో పది సెంచరీలు పూర్తి చేసుకుని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.కెప్టెన్గా, బ్యాటర్గా స్మృతి అదుర్స్ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు.. భారత్(India Women Vs Ireland Women)లో పర్యటిస్తోంది. ఈ మూడు వన్డేల సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ దూరం కాగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో కెప్టెన్గానూ, బ్యాటర్గానూ స్మృతి అద్బుత ప్రదర్శన కనబరుస్తోంది.రాజ్కోట్ వేదికగా సాగుతున్న ఈ సిరీస్లో తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా ఇప్పటికే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లలో స్మృతి వరుసగా 41, 73 పరుగులు సాధించి.. గెలుపులో తన వంతు పాత్ర పోషించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం జరుగుతున్న మూడో వన్డేలోనూ స్మృతి సూపర్ ఫామ్ను కొనసాగించింది.వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన శతక్కొట్టారు. స్మృతి 70 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన తొలి ఇండియన్గా నిలిచింది. అంతేకాదు.. వన్డేల్లో పది సెంచరీలు సాధించిన భారత తొలి మహిళా క్రికెటర్గా, ఓవరాల్గా నాలుగో ప్లేయర్గా చరిత్రకెక్కింది.Led from the front and how 👏👏What a knock THAT 🙌Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/4dQVq6JTRm— BCCI Women (@BCCIWomen) January 15, 2025 ఇక స్మృతి మొత్తంగా ఈ మ్యాచ్లో 80 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్ ఓర్లా ప్రెండెర్గాస్ట్ బౌలింగ్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. అవా కానింగ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరుఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో మూడో వన్డేలో మరో ఓపెనర్ ప్రతికా రావల్ భారీ శతకంతో మెరిసింది. 129 బంతులు ఎదుర్కొని 154 పరుగులు సాధించింది. ప్రతికా ఇన్నింగ్స్లో ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. మిగతా వాళ్లలో రిచా ఘోష్ 59 పరుగులతో రాణించగా.. తేజల్ హెసాబ్నిస్ 28, హర్లీన్ డియోల్ 14 రన్స్ చేశారు. ఇక జెమీమా 4, దీప్తి శర్మ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 435 పరుగులు స్కోరు చేసింది. భారత్ తరఫున మహిళా, పురుష క్రికెట్లో వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.మహిళల వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత ప్లేయర్లు1. స్మృతి మంధాన- ఐర్లాండ్ వుమెన్స్పై- రాజ్కోట్(2025)లో- 70 బంతుల్లో శతకం2.హర్మన్ప్రీత్ కౌర్- సౌతాఫ్రికా వుమెన్స్పై- బెంగళూరు(2024)లో- 87 బంతుల్లో శతకం3. హర్మన్ప్రీత్ కౌర్- ఆస్ట్రేలియా వుమెన్స్పై- డెర్బీ(2017)లో- 90 బంతుల్లో శతకం4. జెమీమా రోడ్రిగ్స్- ఐర్లాండ్ వుమెన్స్పై- రాజ్కోట్(2025)లో- 90 బంతుల్లో శతకం5. హర్లీన్ డియోల్- వెస్టిండీస్ వుమెన్స్పై- వడోదర(2024)లో- 98 బంతుల్లో శతకం.మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లుమెగ్ లానింగ్- 15సుజీ బేట్స్- 13టామీ బీమౌంట్- 10స్మృతి మంధాన- 10చమరి ఆటపట్టు- 9చార్లెట్ ఎడ్వర్డ్స్- 9నాట్ సీవర్ బ్రంట్- 9.MAXIMUM x 2⃣Captain Smriti Mandhana's elegance on display here in Rajkot!Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/wMlnuoUWIr— BCCI Women (@BCCIWomen) January 15, 2025 చదవండి: పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
ప్రతీక, తేజల్ గెలిపించగా...
రాజ్కోట్: భారత మహిళల క్రికెట్ జట్టులో ఇటీవలే కొత్తగా వచ్చిన ఇద్దరు యువ బ్యాటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సత్తా చాటారు. వన్డే కెరీర్లో కేవలం నాలుగో మ్యాచ్ ఆడుతున్న ప్రతీక రావల్, తేజస్ హసబ్నిస్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి ఆటకు సీనియర్ స్మృతి మంధాన తోడవటంతో ఐర్లాండ్ మహిళలతో జరిగిన తొలి వన్డే భారత్ ఖాతాలో చేరింది. జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేయగా... భారత్ 34.3 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు సాధించి గెలిచింది. సిరీస్లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా, రెండో వన్డే ఆదివారం జరుగుతుంది. రాణించిన గాబీ, లియా... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోలేక ఐర్లాండ్ ఇబ్బంది పడింది. 29 పరుగుల వ్యవధిలో జట్టు తొలి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో కెప్టెన్ గాబీ లూయిస్ (129 బంతుల్లో 92; 15 ఫోర్లు), లియా పాల్ (73 బంతుల్లో 59; 7 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. 25 ఓవర్ల పాటు పట్టుదలగా క్రీజ్లో నిలబడిన ఈ జోడీ ఐదో వికెట్కు 117 పరుగులు జోడించింది. ఈ క్రమంలో గాబీ 75 బంతుల్లో, లియా 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కండరాల నొప్పితో బాధపడుతూ ఆడిన గాబీ త్రుటిలో తన తొలి సెంచరీని చేజార్చుకుంది. భారత్ పేలవ ఫీల్డింగ్ కూడా ఐర్లాండ్కు కలిసొచ్చిoది.మన ఫీల్డర్లు నాలుగు సునాయాస క్యాచ్లు వదిలేశారు. ఇందులో ఒకటి గాబీ క్యాచ్, మరో రెండు లియా క్యాచ్లు కాగా...చివర్లో ఎర్లీన్ కెల్లీ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) క్యాచ్ కూడా వదిలేయడంతో ఐర్లాండ్ 50 ఓవర్లు ఆడగలిగింది. భారీ భాగస్వామ్యం... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రతీక రావల్ (96 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ స్మృతి మంధాన (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) కలిసి వేగంగా ఛేదనను ప్రారంభించారు. వీరిద్దరు 10.1 ఓవర్లలోనే 70 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 20; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (6 బంతుల్లో 9; 2 ఫోర్లు) వెనుదిరిగారు. ఇలాంటి స్థితిలో ప్రతీకకు తేజల్ (46 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు) జత కలిసింది. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ జట్టును వేగంగా గెలుపు దిశగా తీసుకుపోయారు. 70 బంతుల్లో ప్రతీక, 43 బంతుల్లో తేజల్ హాఫ్ సెంచరీలు పూర్తయ్యాయి. భారత్ విజయం కోసం మరో 21 పరుగులు కావాల్సి ఉండగా, ప్రతీక 75 పరుగుల వద్ద ఉంది. ఈ దశలో మాగ్వైర్ బౌలింగ్లో 2 ఫోర్లు, సిక్స్తో 89కి చేరిన ఆమె మరో భారీ షాట్కు ప్రయతి్నంచి వెనుదిరిగింది. తేజల్తో కలిసి రిచా ఘోష్ (8 నాటౌట్) ఆట ముగించింది. ఈ మ్యాచ్తో సయాలీ సత్ఘరే భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 152వ ప్లేయర్గా గుర్తింపు పొందింది. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా ఫోర్బ్స్ (సి) దీప్తి (బి) సాధు 9; గాబీ లూయిస్ (సి అండ్ బి) దీప్తి 92; యునా రేమండ్ (రనౌట్) 5; ప్రెండర్గాస్ట్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ప్రియ 9; డెలానీ (బి) ప్రియా మిశ్రా 0; లియా పాల్ (రనౌట్) 59; క్రిస్టినా కూల్టర్ (నాటౌట్) 15; ఎర్లీన్ కెల్లీ (ఎల్బీ) (బి) సయాలీ 28; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–27, 2–34, 3–56, 4–56, 5–173, 6–194, 7–230. బౌలింగ్: టిటాస్ సాధు 9–1–48–1, సయాలీ సత్ఘరే 10–2–43–1, సైమా ఠాకూర్ 10–0–30–0, ప్రియా మిశ్రా 9–1–56–2, దీప్తి శర్మ 10–1–41–1, ప్రతీక రావల్ 2–0–14–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) ప్రెండర్గాస్ట్ (బి) సార్జంట్ 41; ప్రతీక రావల్ (సి) ప్రెండర్గాస్ట్ (బి) మాగ్వైర్ 89; హర్లీన్ డియోల్ (సి) ప్రెండర్గాస్ట్ (బి) మాగ్వైర్ 20; జెమీమా (స్టంప్డ్) కూల్టర్ (బి) మాగ్వైర్ 9; తేజల్ (నాటౌట్) 53; రిచా ఘోష్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 21; మొత్తం (34.3 ఓవర్లలో 4 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–70, 2–101, 3–116, 4–232. బౌలింగ్: ఒర్లా ప్రెండర్గాస్ట్ 4.4–0–28–0, జార్జినా డెంప్సీ 5.3–0– 50–0, ఎర్లీన్ కెల్లీ 6–0–29–0, ఫ్రేయా సార్జంట్ 8–0–38–1, ఎయిమీ మాగ్వైర్ 8–1–57–3, లౌరా డెలానీ 2.2–0–36–0. -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అద్భుత ఫామ్ను కొనసాగిస్తోంది. ఐర్లాండ్ మహిళా జట్టుతో తొలి వన్డేలోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టింది. కేవలం 29 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు సాధించింది.ఈ క్రమంలో స్మతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల మార్కు అందుకున్న తొలి మహిళా ప్లేయర్గా నిలిచింది. కాగా ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా మూడు వన్డేలు ఆడేందుకు ఐర్లాండ్ భారత్ పర్యటన(India Women vs Ireland Women)కు వచ్చింది.కెప్టెన్గా స్మృతిఈ సిరీస్కు భారత మహిళా జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ దూరం కాగా స్మృతి సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం రాజ్కోట్ వేదికగా వన్డే సిరీస్ ఆరంభమైంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ గాబీ లూయిస్ అద్భుత అర్ధ శతకం(92)తో చెలరేగగా.. మిడిలార్డర్లో లీ పాల్(59) కూడా హాఫ్ సెంచరీ సాధించింది. వీరిద్దరికి తోడు లోయర్ ఆర్డర్లో అర్లెనె కెలీ 28 పరుగులతో రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. టైటస్ సాధు, దీప్ది శర్మ, సయాలీ సట్ఘరే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు వేల పరుగుల పూర్తిఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్(Pratika Rawal) శుభారంభం అందించారు. మంధాన 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్రేయా సార్జెంట్ బౌలింగ్లో ఓర్లా ప్రెండర్గాస్ట్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుటైంది. అయితే, ఈ క్రమంలోనే స్మృతి వన్డేల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించింది.ఇంతకు ముందు భారత్ తరఫున మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించగా.. స్మృతి తాజాగా ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే, మిథాలీ రాజ్ నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకోవడానికి 112 వన్డే ఇన్నింగ్స్ ఆడగా.. స్మృతి కేవలం 95 వన్డే ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించింది. తద్వారా అత్యంత వేగంగా 4 వేల వన్డే పరుగుల క్లబ్లో చేరిన భారత తొలి మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.వన్డేల్లో వేగంగా నాలుగు వేల పరుగుల మైలురాయికి చేరుకున్న మహిళా క్రికెటర్లు👉బెలిండా క్లార్క్- ఆస్ట్రేలియా- 86 ఇన్నింగ్స్👉మెగ్ లానింగ్- ఆస్ట్రేలియా- 87 ఇన్నింగ్స్👉స్మృతి మంధాన- ఇండియా- 95 ఇన్నింగ్స్👉లారా వొల్వర్ట్- సౌతాఫ్రికా- 96 ఇన్నింగ్స్👉కరేన్ రాల్టన్- ఆస్ట్రేలియా- 103 ఇన్నింగ్స్👉సుజీ బేట్స్- న్యూజిలాండ్- 105 ఇన్నింగ్స్👉స్టెఫానీ టేలర్- వెస్టిండీస్- 107 ఇన్నింగ్స్👉టస్మిన్ బీమౌంట్- ఇంగ్లండ్- 110 ఇన్నింగ్స్👉మిథాలీ రాజ్- ఇండియా- 112 ఇన్నింగ్స్👉డేబీ హాక్లీ- న్యూజిలాండ్- 112 ఇన్నింగ్స్ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ ప్రతికా రావల్ 89 పరుగులతో చెలరేగగా.. తేజస్ హసాబ్నిస్ 53 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి అద్బుత ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొలి వన్డేలో ఐర్లాండ్పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. -
ఐర్లాండ్పై అద్బుత ప్రదర్శన.. హార్దిక్పై గవాస్కర్ ప్రశంసలు
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫామ్ను తిరిగి పొందాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారథిగా దారుణ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు టీ20 వరల్డ్కప్-2024లో సత్తాచాటుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో పాండ్యా అదరగొట్టాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటకి బౌలింగ్లో మాత్రం హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్యా అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడని గవాస్కర్ కొనియాడాడు."హార్దిక్ పాండ్యా తిరిగి తన రిథమ్ను పొందడం చాలా సంతోషంగా ఉంది. హార్దిక్ తన బౌలింగ్తో అందరిని ఆకట్టుకున్నాడు. హార్దిక్ గతంలో రెండు ఓవర్లు వేసి బ్రేక్ తీసుకునే వాడు.కానీ ఈ మ్యాచ్లో మాత్రం వరుసగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి ఔరా అనిపించుకున్నాడు. హార్దిక్కు ఐపీఎల్ తర్వాత వరల్డ్కప్ అనేది ఒక పరీక్ష వంటి. నా వరకు అయితే ఈ పరీక్షలో హార్దిక్ పాసైడని నేను భావిస్తున్నాని స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
టీ20 వరల్డ్కప్-2024లో న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో అర్షదీప్ సింగ్ భారత బౌలింగ్ ఎటాక్ను ప్రారంభించగా.. మహమ్మద్ సిరాజ్ అతడితో పాటు బంతిని పంచుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్ ఎటాక్కు వచ్చాడు. తన పేస్ బౌలింగ్తో ఐరీష్ బ్యాటర్లను బుమ్రా బెంబేలెత్తించాడు. బుమ్రా తన బౌలింగ్ ఎటాక్ను మెయిడిన్ ఓవర్తో ప్రారంభించాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన బుమ్రా.. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్కు చుక్కలు చూపించాడు. బుమ్రా బౌలింగ్ దాటికి ఆ ఓవర్లో టెక్టార్ కనీసం ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు.ఈ క్రమంలో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మెయిడిన్లు (టెస్టు సభ్యత్వ దేశాలు) చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. బుమ్రా ఇప్పటివరకు టీ20ల్లో 11 మెయిడిన్ ఓవర్లు వేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(10) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో భువీని బుమ్రా అధిగమించాడు. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచిన బుమ్రా.. 3 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.ఇక ఓవరాల్గా ఈ జాబితాలో ఇద్దరు బౌలర్లు బుమ్రా కంటే ముందు ఉన్నారు. ఈ జాబితాలో ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లతో తొలి స్ధానంలో ఉండగా.. కెన్యా బౌలర్ షెబ్ ఎన్గోచె 14 రెండు స్దానంలో ఉన్నాడు. -
పిచ్ అస్సలు అర్థం కావడం లేదు.. కానీ వారు మాత్రం అద్బుతం: రోహిత్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. బుధవారం(జూన్ 5)న న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఐరీష్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత బౌలర్ల దాటికి కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 12.2 ఓవర్లలో ఊదిపడేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ బౌలర్లు అద్బుతంగా రాణించారని హిట్మ్యాన్ కొనియాడాడు. అదే విధంగా తన గాయంపై కూడా రోహిత్ అప్డేట్ ఇచ్చాడు. "నా మో చేయి ఇంకా కొంచెం నొప్పిగా ఉంది. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక టాస్ సమయంలోనే నేను చెప్పాను పిచ్ను అంచనా వేయడం చాలా కష్టమని. అసలు ఈ వికెట్ నుంచి ఏం ఆశించాలో కూడా అర్థం కావడం లేదు.కేవలం ఐదు నెలల వయసున్న పిచ్పై ఎలా ఆడాలో తెలియడం లేదు. మేము సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పిచ్ ఇంకా అలానే ఉంది. ఇది బౌలర్లకు సరిపోయే వికెట్. ఈ వికెట్పై ఫాస్ట్ బౌలర్లు సరైన లెంగ్త్లో బౌలింగ్ చేస్తే సరిపోతుంది. మా జట్టులో ఒక్క అర్ష్దీప్ సింగ్కు తప్ప దాదాపు అంతమంది బౌలర్లకు టెస్టు క్రికెట్లో ఆడిన అనుభవం ఉంది. అయినప్పటికి అర్ష్దీప్ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి మాకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ వికెట్పై నలుగురు స్పిన్నర్లతో ఆడాలనుకోలేదు.బ్యాలెన్స్గా ఉండే తుది జట్టును ఎంపిక చేశాము. మా తుది జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో పాటు, ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు, ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లకు చోటిచ్చాము. పిచ్ సీమర్లకు అనుకూలించినందున స్పిన్నర్లతో కేవలం రెండు ఓవర్లు మాత్రం వేయించాను. ఒకవేళ స్పిన్కు అనుకూలించి ఉంటే వారితో ఫుల్ కోటాను పూర్తి చేసే వాడిని. పరిస్థితులకు తగ్గ జట్టు మా వద్ద వుంది. ఒకవేళ పాకిస్తాన్తో మ్యాచ్కు కూడా పిచ్ ఈ విధంగానే ఉంటే అందుకు తగ్గట్టు మేము సన్నద్దమవుతామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రోహిత్ పేర్కొన్నాడు. -
T20 World Cup 2024: ఆడుతూ పాడుతూ...
భారీ అంచనాలతో టి20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ తొలి పోరులో తమ స్థాయి ప్రదర్శనతో సత్తా చాటింది. సంచలనాల రికార్డు ఉన్న ఐర్లాండ్పై ఏమాత్రం ఉదాసీనత కనబర్చకుండా పూర్తిగా పైచేయి సాధించి భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్కు అంతగా అనుకూలించని పిచ్పై ప్రత్యరి్థని 96 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరింది. మన బౌలర్లలో ఐదుగురు కనీసం ఒక్కో వికెట్తో తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం రోహిత్, పంత్ చక్కటి బ్యాటింగ్ టీమిండియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్తో మ్యాచ్ రూపంలో తర్వాతి సవాల్కు భారత్ సిద్ధమైంది. న్యూయార్క్: టి20 వరల్డ్ కప్లో రోహిత్ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. గారెన్ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు)దే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/6), అర్‡్షదీప్ చెరో 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి గెలిచింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 52 రిటైర్డ్హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), రిషభ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రెండో వికెట్కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించారు. టపటపా... స్వింగ్కు అనుకూల వాతావరణం, అనూహ్య బౌన్స్, నెమ్మదైన అవుట్ఫీల్డ్... ఇలాంటి స్థితిలో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. మూడో ఓవర్లో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (2), బల్బర్నీ (5)లను అవుట్ చేసి అర్‡్షదీప్ ముందుగా దెబ్బ కొట్టడంతో మొదలైన ఐర్లాండ్ పతనం వేగంగా సాగింది. పవర్ప్లేలో 26 పరుగులు రాగా, వాటిలో 9 ఎక్స్ట్రాలే ఉన్నాయి. పాండ్యా తన తొలి రెండు ఓవర్లలో టకర్ (10), కాంఫర్ (12)లను వెనక్కి పంపించగా, టెక్టర్ (4)ను బుమ్రా అవుట్ చేశాడు. సిరాజ్ ఖాతాలో డాక్రెల్ (3) వికెట్ చేరడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 49/6 వద్ద నిలిచింది. అక్షర్ పటేల్ కూడా తన తొలి ఓవర్లో మెక్కార్తీ (0) పని పట్టగా, బుమ్రా బౌలింగ్లో లిటిల్ (14) బౌల్డయ్యాడు. అయితే చివర్లో డెలానీ కొన్ని పరుగులు జోడించగలిగాడు. అర్‡్షదీప్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను అదే ఓవర్ చివరి బంతికి రనౌట్ కావడంతో ఐర్లాండ్ ఆట ముగిసింది. ఆకట్టుకున్న పంత్... ఓపెనర్గా వచి్చన విరాట్ కోహ్లి (1) ప్రభావం చూపలేకపోగా, మరోవైపు రోహిత్ ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన పంత్ కూడా అదే తరహాలో వేగంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. లిటిల్ ఓవర్లో రెండు వరుస సిక్స్లతో జోరు పెంచిన రోహిత్ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకుముందు లిటిల్ వేసిన ఓవర్లో బంతి భుజానికి బలం తగిలిన కారణంగా నొప్పితో మైదానం వీడాడు. 21 పరుగులు చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్కు వచి్చన సూర్యకుమార్ (2) విఫలమైనా... మెక్కార్తీ బౌలింగ్లో రివర్స్ స్కూప్ సిక్సర్తో పంత్ మ్యాచ్ ముగించాడు. ఇటీవలే ఐపీఎల్లో ఆడిన పంత్కు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బర్నీ (బి) అర్‡్షదీప్ 5; స్టిర్లింగ్ (సి) పంత్ (బి) అర్‡్షదీప్ 2; టకర్ (బి) పాండ్యా 10; టెక్టర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 4; కాంఫర్ (సి) పంత్ (బి) పాండ్యా 12; డాక్రెల్ (సి) బుమ్రా (బి) సిరాజ్ 3; డెలానీ (రనౌట్) 26; అడెయిర్ (సి) దూబే (బి) పాండ్యా 3; మెక్కార్తీ (సి అండ్ బి) అక్షర్ 0; లిటిల్ (బి) బుమ్రా 14; వైట్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 15; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్) 96. వికెట్ల పతనం: 1–7, 2–9, 3–28, 4–36, 5–44, 6–46, 7–49, 8–50, 9–77, 10–96. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–2, సిరాజ్ 3–0–13–1, బుమ్రా 3–1–6–2, పాండ్యా 4–1–27–3, అక్షర్ పటేల్ 1–0–3–1, జడేజా 1–0–7–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రిటైర్డ్హర్ట్) 52; కోహ్లి (సి) వైట్ (బి) అడెయిర్ 1; పంత్ (నాటౌట్) 36; సూర్యకుమార్ (సి) డాక్రెల్ (బి) వైట్ 2; దూబే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (12.2 ఓవర్లలో 2 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–22, 2–91. బౌలింగ్: అడెయిర్ 4–0–27–1, లిటిల్ 4–0–42–0 మెక్కార్తీ 2.2–0–8–0, కాంఫర్ 1–0–4–0, వైట్ 1–0–6–1. 600: 600 రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ టెస్టుల్లో 84, వన్డేల్లో 323, టి20ల్లో 193 సిక్స్లు బాదాడు. 4000: రోహిత్ అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగులు (4026) దాటాడు. కోహ్లి (4038), బాబర్ (4023) తర్వాత ఈ మైలురాయిని చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు. -
రోహిత్, బాబర్ కాదు.. అతడే వరల్డ్కప్ టాప్ రన్ స్కోరర్: స్మిత్
టీ20 వరల్డ్కప్-2024లో సత్తా చాటేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సిద్దమయ్యాడు. ఐపీఎల్ 2024లో కనబరిచిన జోరునే ఈ పొట్టి ప్రపంచకప్లోనూ కొనసాగించాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన కింగ్ కోహ్లి.. 741 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. తొలిపోరు కోసం రోహిత్ సేన అన్ని విధాల సిద్దమైంది. ఇక మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లిపై ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టోర్నీలో కోహ్లి టాప్ రన్ స్కోరర్గా నిలుస్తాడని స్మిత్ జోస్యం చెప్పాడు. "ఈ మెగా ఈవెంట్లో లీడింగ్ రన్ స్కోరర్గా విరాట్ కోహ్లి నిలుస్తాడని నేను భావిస్తున్నాడు. అతడు ఐపీఎల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అమెరికాకు వచ్చాడు. విరాట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆ జోరును ఇక్కడ కూడా కొనసాగిస్తాడని నేను ఆశిస్తున్నానని" ఐసీసీ షేర్ చేసిన వీడియోలో స్మిత్ పేర్కొన్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ టాప్ రన్స్కోరర్గా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ లేదా విరాట్ కోహ్లి నిలుస్తాడని అంచనా వేశాడు.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన నేపాల్ కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
ఐర్లాండ్ను తేలికగా తీసుకోము.. ఈ వరల్డ్కప్లో వారిదే పైచేయి: రోహిత్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా తొలి మ్యాచ్కు సిద్దమైంది. న్యూయర్క్ వేదికగా బుధవారం ఐర్లాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. తొలి మ్యాచ్లో గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పాల్గోన్న టీమిండియా కెప్టెన్ న్యూయర్క్ పిచ్కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎటువంటి పరిస్థితులలోనైనా ఆడేందుకు తమ వద్ద బలమైన జట్టు ఉందని రోహిత్ థీమా వ్యక్తం చేశాడు."ఈ ఏడాది వరల్డ్కప్లో స్నిన్నర్లు ప్రధాన పాత్ర పోషిస్తారని నేను అనుకుంటున్నాను. మా జట్టులో జడేజా, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉన్నారు. జట్టు బ్యాలెన్స్గా ఉండాలంటే వారిద్దరూ అవసరమే. అదే విధంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కూడా మా వద్ద ఉన్నారు. కాబట్టి ఈ మెగా టోర్నీలో వారి సేవలను అన్ని విధాలగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తాం. న్యూయర్క్ వికెట్ గురించి మాకు ఎటువంటి ఆందోళన లేదు.ఎందుకంటే ఎటువంటి పరిస్థితులలోనైనా సత్తాచాటేందుకు మా బాయ్స్ సిద్దంగా ఉన్నారు. అదే విధంగా ఐర్లాండ్ జట్టును మేము తక్కువగా అంచనా వేయడం లేదు. ఎందుకంటే ఐర్లాండ్ వద్ద కూడా పటిష్టమైన జట్టు ఉంది. వారు కూడా ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడుతున్నారు. ఐరీష్ జట్టులో చాలా మంది ఆటగాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్లో ఆడిన అనుభవం ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్లో రోహిత్ పేర్కొన్నాడు. -
ఐర్లాండ్తో మ్యాచ్కు భారత తుది జట్టు ఇదే!
టీ20 ప్రపంచకప్-2024 ఫీవర్ తారస్థాయికి చేరింది. టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. న్యూయార్క్లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జూన్ 5న ఐర్లాండ్తో రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ను వన్డౌన్లో ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించాడు.ఇక తన జట్టులో మిగిలిన స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లకు చోటిచ్చాడు గావస్కర్. వికెట్ కీపర్ కోటాలో పంత్కు చోటిచ్చిన గావస్కర్ సంజూ శాంసన్కు మొండిచేయి చూపాడు.కాగా వరల్డ్కప్-2024లో భారత ఓపెనింగ్ జోడీ గురించి చర్చ జరుగుతున్న వేళ.. విరాట్ కోహ్లియే రోహిత్ శర్మకు సరైన జోడీ అని ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా గావస్కర్ కూడా ఇదే మాట అన్నాడు.ఇక కోహ్లి ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ 15 మ్యాచ్లు ఆడి.. 741 పరుగులు సాధించాడు. టాప్ స్కోరర్గా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.ఐర్లాండ్తో మ్యాచ్కు గావస్కర్ ఎంచుకున్న భారత తుది జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.#SunilGavaskar opts for experience with @imVkohli & @ImRo45 at the 🔝A surprise inclusion at number 3, plenty of batting options and two pacers! 😮What changes would you make to this team?📺 | #INDvIRE | 5th June, 6 PM | #T20WorldCupOnStar pic.twitter.com/6hQx6EJmhD— Star Sports (@StarSportsIndia) June 4, 2024 -
ఐర్లాండ్తో మ్యాచ్.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
టీ20 వరల్డ్కప్-2024లో తొలి మ్యాచ్కు టీమిండియా సన్నద్దమవుతోంది. జూన్ 5న న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఐరీష్ను చిత్తు చేసి మెగా ఈవెంట్ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది.ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరో 3 పరుగులు సాధిస్తే.. టీ20ల్లో ఐర్లాండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గా రికార్డులెక్కుతాడు.ఇప్పటివరకు ఐర్లాండ్పై రోహిత్ శర్మ 3 మ్యాచ్లు ఆడి 149 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడా పేరిట ఉంది. దీపక్ హుడా ఇప్పటివరకు ఐర్లాండ్పై 2 మ్యాచ్లు ఆడి 151 పరుగులు చేశాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ -
BCCI: అందుకే తప్పుకొంటున్నా.. ద్రవిడ్ ఫస్ట్ రియాక్షన్
టీమిండియా ప్రధాన కోచ్గా తాను కొనసాగబోవడం లేదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోచ్గా తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు. ఏదేమైనా భారత జట్టు మార్గదర్శకుడిగా వ్యవహరించడం తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఈ మాజీ కెప్టెన్ హర్షం వ్యక్తం చేశాడు.కాగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ ఈ మెగా ఈవెంట్ కోసం కొనసాగమని బీసీసీఐ అతడిని కోరిన విషయం తెలిసిందే. ఇందుకు అంగీకరించిన ద్రవిడ్ ప్రస్తుతం టీమిండియాతో కలిసి అమెరికాకు వెళ్లాడు.అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న వరల్డ్కప్-2024 జూన్ 1న మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనున్న తరుణంలో రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా.. ‘‘ప్రతి టోర్నమెంట్ నాకు ముఖ్యమైనదే. టీమిండియా కోచ్గా ప్రతి మ్యాచ్లోనూ పూర్తి ఎఫర్ట్ పెట్టాను. టీ20 వరల్డ్కప్ కూడా అంతే. అయితే, నేను ఇన్చార్జ్గా ఉన్న సమయంలో ఇదే ఆఖరిది కాబట్టి మరింత ప్రాముఖ్యం ఏర్పడింది.నా పనిని పూర్తి నిష్ఠగా.. ప్రేమతో చేశాను. టీమిండియాకు కోచింగ్ ఇవ్వడం అనేది నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనది. గొప్ప ఆటగాళ్లున్ను జట్టుతో పని చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించాను.అయితే, బిజీ షెడ్యూల్స్, పని ఒత్తిడి కారణంగా తిరిగి ఈ జాబ్కు తిరిగి అప్లై చేయాలనుకోవడం లేదు’’ అంటూ తాను హెడ్కోచ్ పదవి నుంచి తప్పుకొనేందుకు సిద్ధమైనట్లు రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.కాగా ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా వస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గౌతీ సైతం తాను ఈ గౌరవప్రదమైన బాధ్యతను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం గమనార్హం. -
విరాట్ కోహ్లికి ఏమైంది..? మరోసారి ప్రాక్టీస్ డుమ్మా!
టీ20 వరల్డ్కప్-2024 టోర్నీని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్లో జూన్ 5న న్యూయర్క్ వేదికగా తలపడనుంది. ఇప్పటికే న్యూయర్క్ చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్లో తీవ్రంగా శ్రమిస్తోంది. టీమిండియా సోమవారం(జూన్ 3) తమ చివరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు(జూన్ 4)న ఆటగాళ్లకు టీమ్ మెన్జ్మెంట్ విశ్రాంతి ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం వీలైనంత ఎక్కువ సమయం పాటు నెట్స్లో గడపాలని భారత జట్టు భావిస్తున్నట్లు సమాచారం.కోహ్లి ప్రాక్టీస్ డుమ్మా!ఇక జట్టుతో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికాకు చేరుకున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఒక్క ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనలేదు. జూన్ 1న బంగ్లాదేశ్తో జరిగిన వార్మాప్ మ్యాచ్కు దూరమైన కోహ్లి.. ఆదివారం(జూన్ 2)న ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంటుడని పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. కానీ ఆదివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్కు కూడా కోహ్లి డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. జట్టుతో కలిసినప్పటికి అతడు ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. విరాట్ సోమవారం జట్టు ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2024లో ఎలిమినేటర్లో ఓటమి తర్వాత కోహ్లి రెస్టులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా విరాట్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో కోహ్లి దుమ్మలేపాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా విరాట్ నిలిచాడు. ఇదే ఫామ్ను టీ20 వరల్డ్కప్లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. -
చెలరేగిన భారత బౌలర్లు.. 100 పరుగులకే ఆలౌట్.. ఘన విజయం
ICC Under 19 World Cup 2024- India U19 won by 201 runs: ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్-2024లో యువ టీమిండియా ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ను ఏకంగా 201 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ మేరకు భారీ గెలుపు నమోదు చేసింది. సౌతాఫ్రికాలోని బ్లూమ్ఫౌంటేన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ 17, అర్షిన్ కులకర్ణి 32 పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 106 బంతుల్లో 118 పరుగులు సాధించాడు. ఇక ముషీర్తో పాటు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ అరవెల్లి అవినాష్ రావు 22, సచిన్ ధ్యాస్ 21(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. భారీ లక్ష్యం విధించి ముషీర్, ఉదయ్ ఇన్నింగ్స్ కారణంగా యవ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 301 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐరిష్ జట్టును భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లలో జోర్డాన్ నీల్(11)ను స్పిన్నర్ సౌమీ పాండే పెవిలియన్కు పంపి శుభారంభం అందించగా.. పేసర్ నమన్ తివారి ఐరిష్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. నమన్ తివారి దెబ్బకు ఓపెనర్ రియాన్ హంటర్(13)ను అవుట్ చేసిన నమన్.. మిడిలార్డర్ను కకావికలం చేశాడు. అతడి దెబ్బకు ఐర్లాండ్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోగా.. సౌమీ పాండే సైతం మరోసారి విజృంభించాడు. ఈ నేపథ్యంలో 29.4 ఓవర్లలోనే ఐర్లాండ్ కథ ముగిసింది. బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో వంద పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఏకంగా 201 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే భారత బౌలర్లలో నమన్ తివారికి అత్యధికంగా నాలుగు, సౌమీ పాండేకు మూడు వికెట్లు దక్కగా.. ధనుశ్ గౌడ, మురుగన్ అభిషేక్, ఉదయ్ సహారన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ వీరుడు ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్లో భారత్కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను 84 పరుగుల తేడాతో సహారన్ సేన చిత్తు చేసింది. ఇక తాజా విజయంతో గ్రూప్-ఏ టాపర్గా నిలిచింది యువ భారత జట్టు. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! Another huge win, this time by 201 runs, has consolidated India’s position at the top of the Group A table 👏 Match Highlights 🎥 #U19WorldCup pic.twitter.com/U1LucpWNcI — ICC (@ICC) January 25, 2024 -
Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్లకు ఛాన్స్!
డబ్లిన్: వెస్టిండీస్తో ఐదు టి20 మ్యాచ్లు, ఆ తర్వాత ఐర్లాండ్తో మూడు టి20 మ్యాచ్లు భారత యువ ఆటగాళ్లను ఈ ఫార్మాట్లో పరీక్షించేందుకు అవకాశం ఇచ్చాయి. వన్డే ప్రపంచకప్ ఏడాది ఎక్కువ మంది సీనియర్లు విరామం తీసుకోగా, కుర్రాళ్లంతా తమకు లభించిన చాన్స్ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ రెండు పర్యటనల్లో కలిపి ఏడు మ్యాచ్లలో ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. ఇక మరో ఇద్దరు దాని కోసం ఎదురు చూస్తున్నారు. టూర్ చివరి మ్యాచ్లో ఆ చాన్స్ దక్కుతుందా అనేది చూడాలి. సిరీస్ను 2–0తో సొంతం చేసుకున్న భారత్ కోణంలో ఇది మాత్రమే ఆసక్తికర అంశం. మరోవైపు వన్డే, టి20 ఫార్మాట్లలో కలిపి భారత్తో ఆడిన 10 సార్లూ ఓడిన ఐర్లాండ్ ఈసారైనా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ గెలవాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు చివరి టి20కి రంగం సిద్ధమైంది. జితేశ్, షహబాజ్లకు అవకాశం! ఐర్లాండ్తో రెండు మ్యాచ్లోలనూ రాణించిన కెప్టెన్ బుమ్రా, పేసర్ ప్రసిధ్ కృష్ణ ఫామ్లోకి రావడం, ఆసియా కప్కు ఎంపిక కావడంతో ఈ సిరీస్ నుంచి భారత్కు ఆశించిన ప్రధాన ఫలితం దక్కింది. అయితే మరింత మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వీరిద్దరు ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగుతారు. రవి బిష్ణోయ్ కూడా సిరీస్లో తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో రుతురాజ్, సామ్సన్, రింకూ సింగ్ కూడా తమకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకోగా, శివమ్ దూబే కూడా తన ధాటిని ప్రదర్శించాడు. సిరీస్లో విఫలమైన తిలక్ వర్మ చివరి పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. యశస్వి కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఈ స్థితిలో తుది జట్టులో మూడు మార్పులకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని వికెట్ కీపర్ జితేశ్ శర్మ, 3 వన్డేలు ఆడిన షహబాజ్ అహ్మద్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిని తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తే సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో అవకాశం దక్కుతుంది. మరోవైపు కొంత విరామం తర్వాత టీమ్లోకి వచ్చిన అవేశ్ ఖాన్ కూడా టీమ్తో పాటు ఉన్నాడు. అతనికీ ఒక మ్యాచ్ ఇవ్వాలనుకుంటే అర్‡్షదీప్కు విశ్రాంతినిస్తారు. ఇదే జరిగితే కుర్రాళ్లతో భారత్ ప్రయోగం సంపూర్ణమవుతుంది. స్టిర్లింగ్ ఫామ్లోకి వచ్చేనా! రెండు టి20 మ్యాచ్లలో ఐర్లాండ్ ఆటతీరు మరీ పేలవంగా లేకున్నా భారత్లాంటి బలమైన జట్టుకు పోటీనిచ్చేందుకు సరిపోలేదు. గతంలోనూ కొన్ని చక్కటి ప్రదర్శనలు వచ్చినా టీమిండియాను ఓడించడంలో మాత్రం ఆ జట్టు సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో చివరి పోరులోనైనా ఆ జట్టు గెలుపు బాట పడుతుందేమో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా లీగ్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఇక్కడ మాత్రం రెండింటిలోనూ విఫలమయ్యాడు. బల్బిర్నీ మినహా మిగతావారంతా ప్రభావం చూపలేకపోయారు. విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా రాణించడం కీలకం. ఐర్లాండ్ కూడా గత మ్యాచ్తో పోలిస్తే మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. -
ఐర్లాండ్తో మూడో టీ20.. సంజు శాంసన్పై వేటు! ఐపీఎల్ హీరో ఎంట్రీ
ఐర్లాండ్తో టీ20 సిరీస్ను ఇప్పటికే సొంతం చేసుకున్న టీమిండియా.. నామమాత్రపు మ్యాచ్ అయిన ఆఖరి టీ20లో తలపడేందుకు సిద్దమైంది. బుధవారం డబ్లిన్ వేదికగా భారత్-ఐర్లాండ్ మధ్య మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని బుమ్రా సేన భావిస్తోంది. అదే విధంగా గత రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన ఆటగాళ్లకు ఆఖరి టీ20లో అవకాశం ఇవ్వాలని జట్టు మెన్జ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ అర్ష్దీప్ సింగ్ను ఆఖరి మ్యాచ్కు పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. వీరి ముగ్గురి స్ధానంలో వరుసగా జితేష్ శర్మ, షాబాజ్ అహ్మద్, అవేష్ ఖాన్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్లో అదరగొట్టి జట్టులోకి వచ్చిన జితేష్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాడు. గత కొన్ని సిరీస్లకు జితేష్ ఎంపికవుతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం రావడం లేదు. అయితే ఐర్లాండ్తో ఆఖరి టీ20లో జితేష్ అరంగేట్రం దాదాపు ఖాయమన్పిస్తోంది. మరోవైపు అవేష్ ఖాన్ విండీస్తో టీ20 సిరీస్ ఎంపికైనప్పటికి ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం రాలేదు. ఈ క్రమంలో అతడికి ఆఖరి టీ20లో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. తుది జట్లు(అంచనా) భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, షాబాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ చదవండి: IND vs IRE: అయ్యో రింకూ.. ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్! బుమ్రా మంచి మనసు -
అయ్యో రింకూ.. ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడిన సిక్సర్ల కింగ్! బుమ్రా మంచి మనసు
ఐర్లాండ్తో టీ20 సిరీస్లో టీమిండియా కెప్టెన్గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్లిన్ వేదికగా జరిగిన రెండో టీ20 అనంతరం బుమ్రా తన చర్యతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ అదరగొట్టాడు. తన తొలి ఇన్నింగ్స్లోనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఈ యూపీ ఆటగాడు అందరిని అకట్టుకున్నాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి భారత్కు మంచి స్కోర్ను అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రింకూకు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. సూపర్ బుమ్రా.. ఈ క్రమంలో పోస్ట్మ్యాచ్ ప్రెజెంటేషన్లో సమయంలో రింకూ ఇంగ్లీష్లో మాట్లాడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. హిందీలో మాట్లాడితే ఫ్రీగా ఉంటుందని రింకూ ప్రెజెంటర్ అలాన్ విల్కిన్స్కు చెప్పాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న బుమ్రా ముందకు వచ్చి రింకూకు ట్రాన్స్లేటర్గా మారాడు. విల్కిన్స్ ఇంగ్లీష్లో అడుగుతుంటే బుమ్రా దాన్ని హిందీలోకి అనువాదం చేసి రింకూకు అర్దమయ్యేలా చెప్పుకొచ్చాడు. విల్కిన్స్ రింకూను నీవు కెప్టెన్ మాట వింటావా అంటూ ఇంగ్లీష్లో ప్రశ్నించాడు. దాన్ని హిందీలోకి బుమ్రా ట్రాన్సలేట్ చేశాడు. అందుకు బదులుగా రింకూ నవ్వుతూ నేను ఎప్పుడూ కెప్టెన్ మాట వింటా అంటూ సమాధానమిచ్చాడు. తన మంచిమనసు చాటుకున్న బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ సిరీస్లో ఆఖరి టీ20 డబ్లిన్ వేదికగా ఆగస్టు 23న జరగనుంది. చదవండి: Asia Cup 2023: జట్టులో పార్ట్టైమ్ బౌలర్స్ లేరా..? అదిరిపోయే రిప్లై ఇచ్చిన రోహిత్! వీడియో వైరల్ -
ఐర్లాండ్ కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అత్యంత చెత్తరికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్గా స్టిర్లింగ్ నిలిచాడు. ఇప్పటివరకు 13 సార్లు స్టిర్లింగ్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆదివారం డబ్లిన్ వేదికగా భారత్తో జరిగిన రెండో టీ20లో ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో డకౌటైన స్టిర్లింగ్.. ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ఓబ్రియన్ను స్టిర్లింగ్ అధిగమించాడు. ఆ తర్వాతి స్ధానాల్లో జింబాబ్వే క్రికెటర్ చకాబ్వా(11), సౌమ్య సర్కార్(11) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో 33 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో ఐరీష్ కోల్పోయింది. భారత్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఐర్లాండ్ చతికిలపడింది. లక్ష్యఛేదనలో ఐరీష్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 ఆగస్టు 23న జరగనుంది. చదవండి: IND vs IRE: జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో -
జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో
సూపర్ స్టార్ రజనీకాంత్కి టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. కేరళలో పుట్టిన సంజూకు చిన్నతనం నుంచే రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం. తలైవాను కలవాలన్న తన చిన్నప్పటి కోరికను సంజూ 28ఏళ్ల వయస్సులో నేరవేర్చుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో రజినీని తన నివాసంలో కలిశాడు. ఇక తాజాగా మరోసారి సూపర్ స్టార్పై తన అభిమానాన్ని సంజూ చాటుకున్నాడు. శాంసన్ ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలో రజినీ కాంత్ నటించిన 'జైలర్' సినిమాను శనివారం ఐర్లాండ్లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. దీనికి సంజూ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ విషయాన్ని ఐర్లాండ్-భారత్ రెండో టీ20 సందర్భంగా కామేంటేటర్ నైల్ ఓబ్రియన్ వెల్లడించాడు. ఇటీవలే సంజు తన అభిమాన నటుడి సినిమాను చూశాడాని ఓబ్రియన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమా.. రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు రూ.500 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్పై 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో సంజూ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు. అయితే వెస్టిండీస్తో టీ20 సిరీస్లో విఫలమైన సంజూ.. ఐర్లాండ్పై అదరగొట్టడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. జైలర్ సినిమా చూసిన తర్వాత సంజూ రెచ్చిపోయాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరోవైపు నేడు ఆసియాకప్ జట్టు ప్రకటన నేపథ్యంలో సంజూకు చోటు దక్కాలని కోరుకుంటున్నారు. చదవండి: #Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్ Just IN : Indian Cricketer #SanjuSamson WATCHED superstar #Rajinikanth's #Jailer movie. ||#JailerHits500cr | #ShivaRajkumar |#Mohanlal ||pic.twitter.com/M59u7eizgu — Manobala Vijayabalan (@ManobalaV) August 20, 2023 -
చాలా సంతోషంగా ఉంది..10 ఏళ్లగా కష్టపడుతున్నా! నా తొలి మ్యాచ్లోనే: రింకూ
ఐపీఎల్లో అదరగొట్టి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యూపీ క్రికెటర్ రింకూ సింగ్.. తన తొలి ఇన్నింగ్స్లోనే అదరగొట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో రింకూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి సత్తాచాటాడు. శివబ్ దుబేతో కలిసి టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో రింకూ కీలక పాత్రపోషించాడు. ఆఖరి రెండు ఓవర్లలో ఐరీష్ బౌలర్లకు రింకూ చుక్కలు చూపించాడు. కాగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20తో రింకూ సింగ్ అరంగేట్రం చేసినప్పటికీ.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ రెండో టీ20లో మాత్రం ఈ కేకేఆర్ సంచలనానికి ఛాన్స్ దక్కింది. అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను రింకూకు మ్యాన్ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తన ప్రదర్శన పట్ల మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ స్పందించాడు. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐపీఎల్లో ఏమి చేశానో ఇక్కడ కూడా అదే అదే చేయడానికి ప్రయత్నించాను. నేను చాలా కాన్పడెన్స్తో ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగా. ఎటువంటి ఒత్తిడికి గురవ్వకుండా ఉండటానికి ప్రయత్నించాను. నేను గత 10 ఏళ్లగా క్రికెట్ ఆడుతున్నాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజు దక్కింది. నా తొలి ఇన్నింగ్స్లో లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావడం ఆనందంగా ఉందంటూ" రింకూ పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో పేర్కొన్నాడు. చదవండి: వాటిని పట్టించుకోకూడదు.. అది మాకు పెద్ద తలనొప్పి! ప్రతీ ఒక్కరూ: టీమిండియా కెప్టెన్ Achi finish ki chinta kyu jab crease par barkaraar ho Rinku 🤩! 🔥#IREvIND #JioCinema #Sports18 #RinkuSingh #TeamIndia pic.twitter.com/QPwvmPPPxK — JioCinema (@JioCinema) August 20, 2023 -
చరిత్ర సృష్టించిన టీమిండియా స్పీడ్ స్టార్.. తొలి భారత పేసర్గా
టీమిండియా ఫాస్ట్బౌలర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంతవేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్గా అర్ష్దీప్ సింగ్ రికార్డులకెక్కాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో ఆండ్రూ బల్బిర్నీని ఔట్ చేసిన అర్ష్దీప్ ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అర్ష్దీప్ తన 33వ టీ20 మ్యాచ్లోనే ఈ ఫీట్ను అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 41 మ్యాచ్ల్లో ఈ రికార్డు సాధించాడు. తాజా మ్యాచ్తో బుమ్రా రికార్డును అర్ష్దీప్ బద్దలు కొట్టాడు. అదే విధంగా ఓవరాల్గా ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్ కూడా అర్ష్దీప్ కావడం గమానార్హం. అంతకుముందు వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 30 మ్యాచ్ల్లోనే 50 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్పై 33 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో యువ భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. సిరీస్లోని చివరిదైన మూడో మ్యాచ్ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది. చదవండి: #Rinku Singh: టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్ -
టీమిండియాకు నయా ఫినిషర్.. వారెవ్వా రింకూ! వీడియో వైరల్
యూపీ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్ను అద్భుతంగా ప్రారంభించాడు. ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20తో రింకూ సింగ్ అరంగేట్రం చేసినప్పటికీ.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ రెండో టీ20లో మాత్రం ఈ సిక్సర్ల కింగ్కు ఛాన్స్ లభించింది. తనకు వచ్చిన అవకాశాన్ని రింకూ అందిపుచ్చుకున్నాడు. ఈ మ్యాచ్లో రింకూ సంచలన ప్రదర్శన చేశాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన రింకూ.. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి భారత్కు మంచి స్కోర్ను అందించాడు. ఆఖరిలో శివమ్ దుబేతో కలిసి ఐర్లాండ్ బౌలర్లను ఆట ఆడుకున్నాడు. ఇక అద్బుత ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియాకు నయా ఫినిషర్ దొరికాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఐపీఎల్లో దుమ్మరేపడంతో సెలక్టర్లు నుంచి రింకూకు పిలుపు వచ్చింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన రింకూ 149.9 స్ట్రైక్రేట్తో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో చైనా వేదికగా జరగనున్న ఆసియాక్రీడలకు కూడా రింకూను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక రెండో టీ20లో 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్లోని చివరిదైన మూడో మ్యాచ్ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది. చదవండి: వాటిని పట్టించుకోకూడదు.. అది మాకు పెద్ద తలనొప్పి! ప్రతీ ఒక్కరూ: టీమిండియా కెప్టెన్ Achi finish ki chinta kyu jab crease par barkaraar ho Rinku 🤩! 🔥#IREvIND #JioCinema #Sports18 #RinkuSingh #TeamIndia pic.twitter.com/QPwvmPPPxK — JioCinema (@JioCinema) August 20, 2023 -
వాటిని పట్టించుకోకూడదు.. అది మాకు పెద్ద తలనొప్పి! ప్రతీ ఒక్కరూ
ఐర్లాండ్ గడ్డపై యువ భారత జట్టు సత్తాచాటింది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగన రెండో టీ20లో 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్), సంజూ సామ్సన్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రింకూ సింగ్ (21 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిపించారు. ఐరీష్ బౌలర్లలో మెకార్తీ రెండు వికెట్లు, అడైర్, యంగ్, వైట్ తలా వికెట్ సాధించారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరీష్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో కెప్టెన్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. "సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు పిచ్ కొంచెం డ్రైగా ఉంది. మిడిల్ ఓవర్లలో వికెట్ కాస్త నెమ్మదించి బ్యాటింగ్కు ఇబ్బంది అవుతందని నేను భావించాను. కానీ మా బ్యాటర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్లో మా బాయ్స్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకోవడం కెప్టెన్గా చాలా కష్టంగా ఉంది. మాకు అది పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతీ ఒక్కరూ జట్టులో చోటు కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. మేమంతా భారత్ తరఫున ఆడాలని అనుకున్నాం. అయితే మనం నిరంతరం కష్టపడతూ ఉండాలి. ఎదో ఒక రోజు మన శ్రమకు తగ్గ ఫలితం దక్కుతోంది. ఒక ఆటగాడిగా మనపై ఉండే అంచనాలను అస్సలు పట్టించుకోకూడదు. వాటి వల్ల మనం ఒత్తిడికి గురి అవుతాం. వాటిన్నటిని పక్కన పెట్టి జట్టుకు 100 శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నించాలని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో బుమ్రా పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2023: ఆసియా కప్కు నేడు భారత జట్టు ఎంపిక.. వారిద్దరిలో ఎవరికీ ఛాన్స్? Jasprit Bumrah's 💥 spell is 𝘔𝘖𝘖𝘖𝘖𝘋 😍#IREvIND #JioCinema #Sports18 #TeamIndia pic.twitter.com/dixBumib36 — JioCinema (@JioCinema) August 20, 2023 -
ఐర్లాండ్తో రెండో టీ20.. టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్!
ఐర్లాండ్తో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. డబ్లిన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో టీ20లో ఐర్లాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. కాగా ఈ సిరీస్లో యువ భారత జట్టుకు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బుమ్రా తన రీఎంట్రీ మ్యాచ్లోనే అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక తొలి టీ20కు అంతరాయం కలిగించిన వరుణుడు.. ఇప్పుడు రెండో టీ20కు కూడా అడ్డు తగిలే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో 30-50 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా వర్షం కారణంగా తొలి టీ20లో కేవలం 40 ఓవర్లకు 26.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ను విజేతగా నిర్ణయించారు. తుది జట్లు(అంచనా) పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ చదవండి: Asia Cup 2023: ఆసియాకప్కు భారత జట్టు ఇదే.. శాంసన్, అశ్విన్కు నో ఛాన్స్! తెలుగోడికి చోటు -
తిలక్ గోల్డెన్ డక్! ఎందుకు అతడిని ప్రమోట్ చేశారు?: మాజీ క్రికెటర్ ఫైర్
Tilak Varma would be disappointed for sure: ‘‘టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో తిలక్ వర్మ తనను తాను నిరూపించుకున్నాడు. ఇక సంజూ శాంసన్ వన్డౌన్లో సరిగ్గా సరిపోతాడు. వీళ్లు లెఫ్టాండర్లా, రైట్హ్యాండర్లా అన్న అంశంతో అసలు సంబంధమే లేదు. నిజానికి జట్టులో ఏకంగా ఐదుగురు లెఫ్టాండ్ బ్యాటర్లు ఉన్నారు. తిలక్ను ఎందుకు ప్రమోట్ చేశారు? ప్రత్యర్థి జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉన్నాడు. పాల్ స్టిర్లింగ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. అయితే, ఇలాంటి పిచ్పై బాల్ టర్న్ అవ్వదు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి కాంబినేషన్ల పేరిట తిలక్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపాల్సిన అవసరం లేదు. నాలుగో స్థానంలో అతడి ప్రదర్శన మెరుగ్గా ఉంది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ అన్నాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో తిలక్ వర్మ చక్కగా సరిపోతాడని సహచర హైదరాబాదీకి అండగా నిలిచాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటుతున్న తెలుగు తేజం తిలక్ వర్మ.. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అరంగేట్రంలో సత్తా చాటిన హైదరాబాదీ కరేబియన్ జట్టుతో టీ20 సిరీస్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టాండర్.. ఐదు మ్యాచ్లలో కలిపి 173 పరుగులు చేశాడు. 140.65 స్ట్రైక్రేటుతో సగటున 57.67 పరుగులు సాధించి సత్తా చాటాడు. దీంతో అతడిపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఐర్లాండ్తో తొలి టీ20లో తిలక్ అవుటైన తీరు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. పాపం.. గోల్డెన్ డకౌట్ లక్ష్య ఛేదనలో భాగంగా వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఈ హైదరాబాదీ బ్యాటర్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. రైటార్మ్ పేసర్ క్రెయిగ్ యంగ్ బౌలింగ్లో టకర్కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ నాయర్ జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తిలక్ కూడా నిరాశకు లోనై ఉంటాడు తిలక్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తేనే మంచి ఫలితాలు రాబట్టవచ్చని చెప్పుకొచ్చాడు. ఇక తాను అవుటైన తీరుకు తిలక్ వర్మ కూడా తీవ్ర నిరాశకు లోనై ఉంటాడని నాయర్ అభిప్రాయపడ్డాడు. యంగ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో తొలి టీ20లో టీమిండియా డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. చదవండి: ధోని, యువరాజ్ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు! ఐర్లాండ్తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ Yashasvi Jaiswal and Tilak Varma departed on back-to-back deliveries of Craig Young! Golden duck for Tilak Varma 👀#IREvsIND #TilakVarma #CricketTwitter pic.twitter.com/cvA3TSNWMC — OneCricket (@OneCricketApp) August 18, 2023 -
ధోని, యువరాజ్ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు!
Rinku Singh can emulate Yuvraj Singh & MS Dhoni as finisher: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్పై మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో రాణించగల సత్తా అతడికి ఉందని.. బెస్ట్ ఫినిషర్గా ఎదుగుతాడని అంచనా వేశాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా ఫీల్డింగ్లోనూ రింకూ అద్భుతమని కొనియాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్ తాజా ఎడిషన్లో అదరగొట్టిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన సందర్భాల్లో తానున్నానంటూ ఆదుకున్నాడు. ఫినిషర్గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. సిక్సర్ల రింకూగా.. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రింకూ ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టడం పదహారో ఎడిషన్ హైలైట్లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రింకూ సింగ్.. ఐర్లాండ్లో పర్యటించే భారత టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. డబ్లిన్లో ది విలేజ్ మైదానం వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. ధోని, యువీ తర్వాత రింకూనే! ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోరే స్పందిస్తూ.. మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ తర్వాత మళ్లీ రింకూ వాళ్లంతటి వాడు కాగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘ రింకూ ఎప్పుడెప్పుడు టీమిండియాలో అరంగేట్రం చేస్తాడా అని ఎదురుచూశాను. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదు లేదంటే ఆరో స్థానంలో రింకూ రాణించగలడు. అద్భుతమైన ఫినిషర్గా పేరు తెచ్చుకోగలడు. మనం ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్లను చూశాం. వాళ్లిద్దరి తర్వాత మళ్లీ అలాంటి ప్లేయర్ రాలేదు. అద్భుతమైన ఫీల్డర్ ఇప్పుడు రింకూ రూపంలో మంచి ఆప్షన్ దొరికింది. అతడు అద్భుతమైన ఫీల్డర్ కూడా! దేశవాళీ క్రికెట్లో ఆడేటపుడు తనని దగ్గరగా గమనించాను. ప్రస్తుతం తన ఆట మరింత మెరుగైంది’’ అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు. కాగా ఉత్తరప్రదేశ్కి చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ. ఐరిష్ జట్టుపై అరంగేట్రం చేసిన అతడికి.. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక డబ్లిన్ టీ20లో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. టీమిండియా ఐర్లాండ్పై 2 పరుగుల తేడాతో గెలుపొంది 1-0తో సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: కోహ్లిపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన గంగూలీ! ఏమన్నాడంటే? ఐర్లాండ్తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ -
ఐర్లాండ్తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్
వెస్టిండీస్తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్పై కన్నేసింది. ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటికే తొలి టీ20లో గెలుపొందిన టీమిండియా.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక రెండో టీ20లో టీమిండియా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో విఫలమైన అర్ష్దీప్ సింగ్పై వేటు వేయాలని జట్టు మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో మరో పేసర్ అవేష్ ఖాన్కు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తొలి మ్యాచ్లో అర్ష్దీప్ తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక బ్యాటింగ్లో టీమిండియా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ జితీష్ శర్మకు అవకాశం ఇవ్వాలనకుంటే శాంసన్ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆల్రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్,గ్రెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్ భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ! -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. తొలి భారత క్రికెటర్గా!
టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా తన రీ ఎంట్రీ మ్యాచ్లోనే వికెట్ల వేట మొదలు పెట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో తను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. తద్వారా బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 కెప్టెన్గా అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న తొలి భారత క్రికెటర్గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు. కాగా ఈ సిరీస్కు సీనియర్లందరూ దూరం కావడంతో బుమ్రానే యువ భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. టీ20ల్లో భారత జట్టుకు కెప్టెన్గా ఎంపికైన తొలి ఫాస్ట్బౌలర్ కూడా బుమ్రానే కావడం గమానర్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్పై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. . తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది. రెండు పరుగుల అధిక్యంలో ఉండటంతో డీఎల్ఎస్ ప్రకారం భారత్ను విజేతగా నిర్ణయించారు. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ! What a start from the #TeamIndia captain 🤩 Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo — JioCinema (@JioCinema) August 18, 2023 -
వన్డే ప్రపంచకప్కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ!
టీమిండియా స్పీడ్ స్టార్ ప్రసిద్ధ్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లో కూడా తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ కర్ణాటక పేసర్... ఐర్లాండ్తో తొలి టీ20తో పొట్టి క్రికెట్లో డెబ్యూ చేశాడు. తన తొలి మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టి అందరని ప్రసిద్ధ్ అకట్టుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన ప్రసిద్ధ్.. 32 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. తన తొలి ఓవర్లో టెక్టర్ను ఔట్ చేసిన ప్రసిద్ద్, రెండో ఓవర్లో డాక్రెల్ను పెవిలియన్కు పంపాడు. కాగా గత కాలంగా వెన్ను గాయంతో ప్రసిద్ధ్ కృష్ణ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్కు కూడా దూరమయ్యాడు. అతడు ఈ మ్యాచ్కు దాదాపు ఏడాది పాటు జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. ఇక గాయం నుంచి కోలుకుని వచ్చిన వెంటనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ కృష్ణపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్, వన్డే ప్రపంచకప్లకు బుమ్రా, సిరాజ్, షమీలతో పాటు అదనపు పేసర్గా ప్రసిద్ధ్ కృష్ణను కూడా ఎంపిక చేయాలని చాలా మంది సూచిస్తున్నారు. కాగా 27 ఏళ్ల ప్రసిద్ద్కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత తరపున 14 మ్యాచ్లు ఆడిన కృష్ణ.. 5.32 ఏకానమీతో 25 వికెట్టు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిని ఈ మెగా టోర్నీలకు ఎంపిక చేయాలని అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా మరోస్టార్ పేసర్ సిరాజ్ ప్రస్తుతం కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. విండీస్ పర్యటనకు వెళ్లిన సిరాజ్ మధ్యలోనే అక్కడ నుంచి స్వదేశానికి వచ్చాడు. అతడి ఫిట్నెస్పై ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ లేదు. సిరాజ్కు ప్రత్నమ్నాయంగా ప్రసిద్ధ్ను తీసుకునే ఛాన్స్ ఉంది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. క్రెడిట్ మొత్తం వాళ్లకే! ఇంకా మెరుగవ్వాలి: భారత కెప్టెన్ -
చాలా సంతోషంగా ఉంది.. క్రెడిట్ మొత్తం వాళ్లకే! ఇంకా మెరుగవ్వాలి: బుమ్రా
ఐర్లాండ్తో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా గెలుపుతో ఆరంభించింది. ఈ సిరీస్లో భాగంగా శుక్రవారం డబ్లిన్ వేదికగా ఐరీష్తో జరిగిన తొలి టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా టీ20ల్లో భారత కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా తొలి విజయాన్ని అందుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్లో టీమిండియా కెప్టెన్గా బుమ్రా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కెప్టెన్గానే కాకుండా బౌలర్గా కూడా బుమ్రా అదరగొట్టాడు. దాదాపు 11 నెలల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన బుమ్రా.. రీఎంట్రీలోనే ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. రెండు వికెట్లు పడగొట్టి తన పునరాగమాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో టింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. "ఈ మ్యాచ్లో నా ప్రదర్శన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఏన్సీలో చాలా కష్టపడ్డాను. ప్రాక్టీస్ సమయంలో నేను నా రిథమ్ను కోల్పోయానని లేదా ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తున్నాని నాకు అనిపించలేదు. ఏన్సీఏ సపోర్ట్ స్టాప్ వల్లే మళ్లీ అదే క్వాలిటీతో నేను బౌలింగ్ చేయగల్గాను. కాబట్టి వారికి ఈ క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు నాకేం కొత్తగా అన్పించలేదు. కానీ తొలి మ్యాచ్లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. పిచ్పై కొంత స్వింగ్ ఉంది. దాన్ని మేము ఉపయెగించుకోవాలని అనుకున్నాం. అదృష్టవశాత్తూ మేమే టాస్ గెలిచాం. అందుకే బౌలింగ్ను ఎంచుకున్నాను. మంచు ఎక్కువగా ఉండటం వల్ల కూడా కొంత సహకారం లభించింది. ప్రతీ మ్యాచ్ మనకు కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఐర్లాండ్ కూడా బాగా ఆడింది. ఈ మ్యాచ్లో మేము గెలిచినప్పటికీ.. కొన్ని విషయాల్లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. మా బాయ్స్ ప్రతీ ఒక్కరూ చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఈ సిరీస్కు వారు బాగా సిద్దమయ్యారు కూడా. ఐపీఎల్ కూడా వాళ్లకు బాగా ఉపయోగపడిందని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో బుమ్రా పేర్కొన్నాడు. చదవండి: IND vs IRE: ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి ఊచకోత.. సిక్సర్ల వర్షం! ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా -
ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చి ఊచకోత..సిక్సర్ల వర్షం!
ఐర్లాండ్తో మూడో టీ20ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్తో రీ ఎంట్రీ ఇచ్చిన భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఇక మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. . తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. వర్షంతో ఆట నిలిచే సమయానికి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో డీఎల్ఎస్ ప్రకారం టీమిండియాను విజేతగా ప్రకటించారు. బారీ మెకార్తీ అరుదైన రికార్డు.. ఐర్లాండ్ ఆటగాడు బారీ మెకార్తీ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో టీమిండియాపై ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్ధానాల్లో బ్యాటింగ్ వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన క్రికెటర్గా మెకార్తీ రికార్డులెక్కాడు. భారత్తో జరిగిన తొలి టీ20లో ఎనిమిది స్ధానంలో బ్యాటింగ్ వచ్చి 51 పరుగులు చేసిన మెకార్తీ.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా కేశవ్ మహారాజ్ పేరిట ఉండేది. గతేడాది తిరువనంతపురం వేదికగా జరిగిన టీ20లో మహారాజ్(41) పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో ఈ రికార్డును మెకార్తీ బ్రేక్ చేశాడు. చదవండి: Ind Vs Ire: ఐర్లాండ్తో తొలి టీ20.. అరుదైన దృశ్యం! ఆ ఐదుగురు భారత ఆటగాళ్లు ఒకేసారి.. -
ఐర్లాండ్తో తొలి టీ20.. అరుదైన దృశ్యం! ఆ ఐదుగురు ఒకేసారి..
Ireland vs India, 1st T20I- Rare Thing: ఐర్లాండ్తో తొలి టీ20 సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా తరఫున ఏకంగా ఐదుగురు లెఫ్టాండ్ బ్యాటర్లు మైదానంలో దిగారు. కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని యువ జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం(ఆగష్టు 18) డబ్లిన్లోని ది విలేజ్ వేదికగా తొలి టీ20 మొదలైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ బుమ్రా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే పేస్ దళ నాయకుడు బుమ్రా(2 వికెట్లు)తో పాటు అరంగేట్ర(టీ20) ఫాస్ట్బౌలర్ ప్రసిద్ కృష్ణ(2), అర్ష్దీప్ సింగ్(1) చెలరేగారు. స్కోరెంతంటే! స్పిన్నర్ రవి బిష్ణోయి(2) కూడా వీరికి తోడయ్యాడు. అయితే, ఆరంభంలో తడబడ్డా.. తర్వాత కుదురుకున్న ఐరిష్ జట్టు మెరుగైన స్కోరే చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే.. ఆతిథ్య ఐర్లాండ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించిన పర్యాటక టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అత్యంత అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఐదుగురు లెఫ్టాండ్ బ్యాటర్లు ఫీల్డింగ్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ ఐదుగురు ఎవరంటే! ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన రింకూ సింగ్తో పాటు తుది జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్.. ఇలా వీళ్లంతా ఎడమచేతి వాటం కలిగిన బ్యాటర్లే కావడం విశేషంగా నిలిచింది. ఐర్లాండ్తో తొలి టీ20లో భారత తుది జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్. చదవండి: Ind vs Ire: అయ్యో బుమ్రా.. అసలే ఏడాది తర్వాత రీఎంట్రీ! What a start from the #TeamIndia captain 🤩 Bumrah back to what he does best 💥#IREvIND #JioCinema #Sports18 pic.twitter.com/IryoviTKGo — JioCinema (@JioCinema) August 18, 2023 -
Ind Vs Ire: వాళ్లిద్దరి అరంగేట్రం.. జితేశ్ శర్మకు మొండిచేయి..
Ireland vs India, 1st T20I: అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలన్న భారత యువ బ్యాటర్ రింకూ సింగ్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఐర్లాండ్తో తొలి టీ20 సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐరిష్ జట్టుతో టీ20 సిరీస్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్న భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. పేద కుటుంబం నుంచి వచ్చి కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన రింకూ సింగ్ది పేద కుటుంబం. అయితే, చిన్ననాటి నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్న అతడు.. ఇంటింటికి గ్యాస్ బండలు మోస్తూనే ఆటపై దృష్టి సారించాడు. దేశవాళీ క్రికెట్లో తన ప్రతిభను నిరూపించుకుని ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. కోల్కతా నైట్ రైడర్స్ రింకూను కొనడంతో అతడి రాత మారింది. ఆరంభంలో బెంచ్కే పరిమితమవ్వాల్సి వచ్చినా.. రింకూ ఓపికగా ఎదురుచూశాడు. ఈ క్రమంలో 25 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ ఐపీఎల్-2023లో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఐపీఎల్-2023లో సత్తా చాటి మొత్తంగా 14 ఇన్నింగ్స్లో 149.53 స్ట్రైక్రేటుతో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రింకూ సింగ్ తొలుత ఆసియా క్రీడలు-2023 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత టీ20 సిరీస్ నిమిత్తం ఐర్లాండ్లో పర్యటించే భారత జట్టులో చోటు దక్కడంతో శుక్రవారం అరంగేట్రం చేశాడు. జితేశ్కు మొండిచేయి ఇక రింకూ సంగతి ఇలా ఉంటే.. ఈ మ్యాచ్తో కచ్చితంగా టీమిండియా క్యాప్ అందుకుంటాడనుకున్న మరో బ్యాటర్ జితేశ్ శర్మకు నిరాశే మిగిలింది. వెస్టిండీస్ పర్యటనలో మెరుగ్గా రాణించకపోయినప్పటికీ సీనియర్ వికెట్ కీపర్గా సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు దక్కింది. దీంతో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ ఇంకొన్నాళ్లు వేచిచూడకతప్పదు. డబ్లిన్లో మూడు మ్యాచ్లు ఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో తొలి టీ20 సందర్భంగా కర్ణాటక బౌలర్ ప్రసిద్ కృష్ణ అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రసిద్కు కూడా బుమ్రా టీమిండియా క్యాప్ అందించాడు. రింకూ, ప్రసిద్ల అరంగేట్రానికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక డబ్లిన్ వేదికగా టీమిండియా- ఐర్లాండ్ల మధ్య ఆగష్టు 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్. చదవండి: బౌలింగ్లోనూ 'కింగే'.. చెక్కుచెదరని బౌలింగ్ రికార్డు విరాట్ సొంతం Moments like these! ☺️ All set for their debuts in international cricket and T20I cricket respectively 👍 👍 Congratulations Rinku Singh and Prasidh Krishna as they receive their caps from captain Jasprit Bumrah 👏 👏#TeamIndia | #IREvIND pic.twitter.com/JjZIoo8B8H — BCCI (@BCCI) August 18, 2023 -
Ind vs Ire: అయ్యో బుమ్రా.. అసలే ఏడాది తర్వాత రీఎంట్రీ! ఇప్పుడిలా!
India tour of Ireland, 2023: దాదాపు ఏడాది తర్వాత పునరాగమనం చేస్తున్న టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రాకు వరణుడు స్వాగతం పలకబోతున్నాడా? ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్ నేపథ్యంలో తొలిసారి పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఈ పేసు గుర్రం రీఎంట్రీకి వర్షం ఆటంకిగా మారనుందా? అంటే స్థానిక వాతావరణ శాఖ అవుననే అంటోంది! ఐర్లాండ్- టీమిండియా మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం తొలి టీ20 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. డబ్లిన్లోని ది విలేజ్ వేదికగా ఇరు జట్లు పోటీపడనున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 7. 30 గంటలకు)కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం! అయితే, డబ్లిన్లో ఆకాశం మేఘావృతమై ఉన్న నేపథ్యంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రానికి పరిస్థితి మరింత దిగజారవచ్చని హెచ్చరిస్తూ యెల్లో వార్నింగ్ జారీ చేసింది. దీంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు. మ్యాచ్ రద్దైతే.. అంతే సంగతి! బుమ్రా ఎక్స్ప్రెస్ పట్టాలెక్కితే చూడాలని ఆశ పడుతుంటే ఈ వర్షం గోల ఏమిటని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్కప్-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో బుమ్రా ఫిట్నెస్ పరీక్షకు ఐర్లాండ్ పర్యటన మంచి ప్లాట్ఫామ్లా ఉపయోగపడనుందని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. దీంతో రీఎంట్రీలో ఏకంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. తర్వాత ఆసియా కప్! బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఐర్లాండ్కు పంపింది. అయితే, వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దైపోతే బుమ్రాతో పాటు యాజమాన్యానికి చేదు అనుభవం తప్పదు. మిగతా రెండు మ్యాచ్లకు కూడా ది విలేజ్ వేదిక కావడం విశేషం. ఇక ఐర్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాన ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఆసియా కప్ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లనుంది. ఐర్లాండ్తో సిరీస్కు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముకేష్ కుమార్, ఆవేశ్ ఖాన్. చదవండి: ఎల్లప్పుడూ రుణపడి ఉంటా: విరాట్ కోహ్లి భావోద్వేగ పోస్ట్.. వైరల్ -
టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్!
Ireland vs India T20Is 2023: ఇటీవలి కాలంలో యువ క్రికెటర్లలో చాలా మందికి టీమిండియా క్యాప్ తేలికగానే లభిస్తోందని మాజీ పేసర్ అతుల్ వాసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగడం మంచిది కాదని.. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్కు సూచించాడు. కొత్త వాళ్లను ఆడించే క్రమంలో అర్హులైన ప్లేయర్లను బెంచ్కు పరిమితం చేయవద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. ఐపీఎల్ స్టార్లకు అవకాశాలు కాగా దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో నిరూపించుకున్న చాలా మంది యువ క్రికెటర్లు అనతికాలంలో భారత జట్టుకు ఆడే అదృష్టం దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీమిండియా టీ20 జట్టు ఎంపిక సమయంలో వీరికి ప్రాధాన్యం ఉంటోంది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా యశస్వి జైశ్వాల్(టెస్టు ద్వారా), ముకేశ్ కమార్, తిలక్ వర్మ అరంగేట్రం చేశారు. ఇక ప్రస్తుతం ఐర్లాండ్లో పర్యటిస్తున్న భారత జట్టులో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ జితేశ్ శర్మతో పాటు కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ తొలిసారి చోటు దక్కించుకున్నాడు. ఈజీ అయిపోయింది.. ఇలాగే కొనసాగితే డబ్లిన్ వేదికగా శుక్రవారం మొదలుకానున్న మూడు మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో ఐరిష్ జట్టుపై వీరిద్దరి అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతుల్ వాసన్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో ఇండియన్ క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది. మనందరం ఇలాంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే కష్టం. నా అభిప్రాయం ప్రకారం... ఎంత మందికి అవకాశమిచ్చినా.. ఒక మంచి ఆటగాడిని మాత్రం మిస్ చేయకూడదు. ప్రపంచవ్యాప్తంగా టీ10, టీ20, 50- ఓవర్ పేరిట ఎన్నో జట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క ఆటగాడికి ఏదో ఒక రూపంలో కచ్చితంగా ఆడే అవకాశం వస్తోంది’’ అని అతుల్ ఇండియా.కామ్తో చెప్పుకొచ్చాడు. అదే జరిగితే బుమ్రా అవుట్! ఇక ఈ సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్న భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘తీవ్రమైన వెన్ను నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని బుమ్రా తిరిగి వస్తున్నాడు. ఫిట్నెస్ నిరూపించుకుంటే అతడి కెరీర్ మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. ఒకవేళ గాయం గనుక తిరగబెడితే మాత్రం కష్టం. తనదైన బౌలింగ్ యాక్షన్తో బుమ్రా సాధించిన విజయాలు కొనసాగించాలంటే తప్పక పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాల్సిందే’’ అని అతుల్ వాసన్ అభిప్రాయపడ్డాడు. కాగా 55 ఏళ్ల అతుల్ వాసన్ టీమిండియా తరఫున 4 టెస్టుల్లో 10, 9 వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 18-23 వరకు బుమ్రా సారథ్యంలోని భారత యువ జట్టు ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పోటీ పడనుంది. చదవండి: అరంగేట్రంలో విఫలం.. కట్ చేస్తే.. ప్రపంచ క్రికెట్లో రారాజుగా! From emotions of an India call-up to the first flight ✈️ & Training session with #TeamIndia 😃 𝗪𝗵𝗲𝗻 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝘁𝗮𝗸𝗲 𝗳𝗹𝗶𝗴𝗵𝘁 ft. @rinkusingh235 & @jiteshsharma_ 👌👌 - By @RajalArora Full Interview 🎥🔽 #IREvINDhttps://t.co/m4VsRCAwLk pic.twitter.com/ukLnAOFBWO — BCCI (@BCCI) August 17, 2023 -
తొలిసారి బిజినెస్ క్లాస్లో ప్రయాణం.. మా అమ్మ కల నెరవేరింది!
ఐర్లాండ్తో మూడు టీ20ల సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య డబ్లిన్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ సిరీస్తో టీమిండియా పేస్గుర్రం జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు 11 నెలల తర్వాత బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అంతేకాకుండా ఐరీష్ టూర్లో బుమ్రానే భారత జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనకు సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ఐపీఎల్-2023లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, జైశ్వాల్ వంటి యువ ఆటగాళ్లకు చోటుకల్పించారు. అయితే తిలక్ వర్మ, జైశ్వాల్ ఇప్పటికే విండీస్ టూర్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టగా.. రింకూ సింగ్, జితేశ్ శర్మ తమ అరంగేట్రం కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సిరీస్ కోసం బుమ్రా సారథ్యంలోని భారత జట్టు బుధవారం ఐర్లాండ్కు చేరుకుంది. తొలిసారి.. భారత జట్టుకు ఎంపికైన రింకూ సింగ్, జితేశ్ శర్మలు తొలిసారి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణించారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ తొలి అంతర్జాతీయ పర్యటనకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్చేసింది. "నాకు చాలా సంతోషంగా ఉంది. టీమిండియాకు ఆడాలనేది ప్రతీ ఒక్క ఆటగాడి కల. నేను నా గదిలోకి వెళ్లి.. నా పేరు, 35 నంబర్ ముద్రించిన జెర్సీని చూడగానే భావోద్వేగానికి లోనయ్యా. ఈ రోజు కోసమే నేను కష్టపడ్డాను. నేను భారత జట్టు ఎంపికైనప్పుడు నా స్నేహితులతో నోయిడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. వెంటనే మా అమ్మకు ఫోన్ చేశాను. నేను ఈ స్ధాయిలో ఉన్నానంటే అందుకు ఒక కారణం మా అమ్మ కూడా. ఆమెకు నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. భారత్ తరపున ఆడాలన్నది నా ఒక్కడి కలే కాదు మా అమ్మది కూడా. ఇప్పడు మా ఇద్దరి కల నిజమైందని" బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో రింకూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా జితేష్ శర్మ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే ఈ సంతోషంలో నాకు మాటలు కూడా రావడం లేదు. భారత క్రికెట్ జట్టుతో కలిపి విదేశాల్లో పర్యటించడం గొప్ప అనుభవం. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం అనేది మనకు లభించిన గౌరవం. అంతేకాకుండా బాధ్యత కూడా మన సత్తా చూపించుకునేందుకు ఇదొక మంచి అవకాశం. నాకు ఆడేందుకు అవకాశం లభిస్తే 100 శాతం ఎఫక్ట్ భారత్ను గెలిపించేందుకు పెడతాను "అని పేర్కొన్నాడు. చదవండి: BAN vs NZ: బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. 10 ఏళ్ల తర్వాత -
చాలా సంతోషంగా ఉంది.. నేను ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు: బుమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 11 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. డబ్లిన్ వేదికగా శుక్రవారం ఐర్లాండ్తో జరగనున్న తొలి టీ20లో భారత కెప్టెన్ హోదాలో బుమ్రా బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో.. యువ భారత జట్టును బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. వెన్ను గాయం, శస్త్ర చికిత్స, పునరావస శిబిరం ఇలా చాన్నాళ్ల తర్వాత ఆడుతున్న టీమిండియా పేస్ గుర్రం బుమ్రా ఎలా రాణిస్తాడని అందరూ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి టీ20కు విలేకరుల సమావేశంలో పాల్గొన్న జస్ప్రీత్ బుమ్రా తన ఫిట్నెస్పై కీలక వాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్నాక తొలి మ్యాచ్ ఆడేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాని బుమ్రా తెలిపాడు. నా టార్గెట్ వరల్డ్కప్.. మళ్లీ భారత జట్టులోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను 100 శాతం ఫిట్నెస్తో ఉన్నాను. నేషనల్ క్రికెట్ అకాడమీలో చాలా కష్టపడ్డాను. ఏన్సీఏలో సుదీర్ఘ కాలం పాటు గడిపాను. ప్రస్తుతం అంతమంచిగానే ఉంది. మైదానంలో అడుగుపెట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. నెట్స్లో బౌలింగ్ చేసేటప్పుడు నా శరీరం మీద పెద్దగా ఒత్తడి లేకుండా చూసుకున్నాను. అంతమాత్రాన నేను వెనక్కు తగ్గినట్లు కాదు. ఏన్సీఏ నుంచి బయటకు వచ్చాక గుజరాత్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాను. అనంతరం చాలా చోట్ల నెట్ప్రాక్టీస్ సెషన్స్లో కూడా పాల్గొన్నాను. నేను ఇప్పటికే చాలా ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఆడాను. నా రిహాబిటేషన్ ఎప్పుడూ కూడా టీ20లు ఆడేందుకు ప్రాక్టీస్ చేయలేదు. నా లక్ష్యం ప్రపంచకప్లో రాణించడమే. ప్రస్తుతం వరల్డ్కప్కు సిద్దమవుతున్నాను. నెట్ ప్రాక్టీస్లో 10 నుంచి 15 ఓవర్ల వరకు బౌలింగ్ చేస్తున్నాను. అలా ఎక్కువ బౌలర్లు చేయడం నాకు చాలా ఉపయోగపడుతోంది. కొన్ని సార్లు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మనకు కొంచెం ఎక్కవ సమయం పడుతోంది. అటువంటి సమయంలో మనం కాస్త నిరాశ చెందుతాం. కానీ నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. త్వరగా కోలుకుని ఫీల్డ్లోకి రావడం గురించి మాత్రమే ఆలోచించాను అని బుమ్రా ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో పేర్కొన్నాడు. చదవండి: NZ vs UAE: 5 వికెట్లతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్.. యూఏఈపై ఘన విజయం The moment we have all been waiting for. @Jaspritbumrah93 like we have always known him. 🔥🔥 #TeamIndia pic.twitter.com/uyIzm2lcI9 — BCCI (@BCCI) August 16, 2023 -
Ind vs Ire: ఐర్లాండ్తో మ్యాచ్ అంటే ఎవరు చూస్తారు? హౌజ్ఫుల్..
India tour of Ireland, 2023: టీమిండియా- పాకిస్తాన్ హై వోల్టేజీ మ్యాచ్.. అదే విధంగా భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి మేటి జట్లతో పోటీ పడుతుందంటే స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. మరి ఐర్లాండ్తో మ్యాచ్ అంటే.. అది కూడా ఒకరిద్దరు మినహా మిగతా అంతా యువ ఆటగాళ్లతో కూడిన దాదాపు ద్వితీయ శ్రేణి జట్టు అంటే మ్యాచ్ చూసేందుకు వచ్చే వారెవరుంటారు? ఇలా అనుకుంటే మాత్రం పొరపాటే! ఐర్లాండ్లో ఉన్న మన వాళ్లకు, స్థానికులకు ఇలాంటపుడే టీమిండియా ఆటగాళ్లను నేరుగా చూసే అవకాశం వస్తుంది కదా! అందుకే పోటీపడి మరి టీమిండియా- ఐర్లాండ్ టీ20 మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లు కొనుగోలు చేశారు. హౌజ్ఫుల్! తొలి రెండు మ్యాచ్ల కోసం ఇప్పటికే మొత్తం టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది ఐర్లాండ్ క్రికెట్ బోర్డు. మూడో టీ20కి సంబంధించి కూడా త్వరలోనే టిక్కెట్ల విక్రయ ప్రక్రియ ఆరంభిస్తామని తెలిపింది. టీమిండియాతో మ్యాచ్లకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారని హర్షం వ్యక్తం చేసింది. బుమ్రా- ఎక్స్ప్రెస్కు పరీక్ష! కాగా ఆగష్టు 18- 23 వరకు 3 మ్యాచ్ల టీ20 సిరీస్ నేపథ్యంలో భారత జట్టు ఇప్పటికే ఐర్లాండ్లో అడుగుపెట్టింది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లు ఐరిష్ టీమ్తో తలపడనున్నారు. ఏడాది కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా ఫిట్నెస్కు సంబంధించి ఈ సిరీస్ ప్లాట్ఫామ్లా ఉపయోగపడనుంది. చిన్న జట్లకు మేలు ఇక ఐర్లాండ్ వంటి చిన్న జట్లతో పటిష్ట భారత జట్టు ఇటీవలి కాలంలో ఎక్కువగా సిరీస్లు ఆడటం ఆయా జట్లకు మేలు చేస్తోంది. ప్రపంచంలోని సంపన్న బోర్డుకు చెందిన జట్టుతో పోటీ పడుతూ.. ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు ఆయా దేశాల క్రికెట్ బోర్డుల మంచి ఆదాయం ఆర్జించేందుకు దోహదం చేస్తోంది కూడా! ఇదే తొలిసారి కాగా 2018, 2022లో భారత జట్టు ఐర్లాండ్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు పొట్టి ఫార్మాట్లో ఐదు సందర్భాల్లో తలపడ్డాయి. టీ20 వరల్డ్కప్-2009లో భాగంగా ఐర్లాండ్ టీమిండియాను ఢీకొనగా.. మిగతా నాలుగుసార్లు ద్వైపాక్షిక సిరీస్లో ముఖాముఖి పోటీపడింది. అయితే, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి. చదవండి: IND VS IRE 1st T20: చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా -
ఐర్లాండ్తో తొలి టీ20.. సంజూ శాంసన్పై వేటు! సిక్సర్ల కింగ్ ఎంట్రీ
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో తొలిసారి భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్దమయ్యాడు. శుక్రవారం నుంచి ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్లో యువ భారత జట్టును బుమ్రా నడిపించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రాకు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో బుమ్రాకు జట్టు సారథ్య బాధ్యతలు సెలక్టర్లు అప్పగించారు. అతడికి డిప్యూటీగా యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. ఇక ఐరీష్కు సిరీస్కు ఈ ఐపీఎల్లో అదరగొట్టిన రింకూ సింగ్, శివమ్ దుబే, జితేష్ శర్మకు చోటు దక్కింది. అదే విధంగా విండీస్ పర్యటనలో అకట్టుకున్న యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ కూడా ఐర్లాండ్ టూర్లో ఉన్నారు. మరోవైపు పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కూడా ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. సంజూపై వేటు.. ఇక మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి టీ20 డబ్లిన్ వేదికగా ఆగస్టు 18న జరగనుంది. ఈ మ్యాచ్తో యువ క్రికెటర్ రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. రింకూ ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్యాష్రిచ్ లీగ్లో రింకూ సిక్సర్ల వర్షం కురిపించాడు. అదే విధంగా ఆల్రౌండర్ శివమ్ దుబే నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్ తరపున ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దుబే చివరగా 2019లో భారత తరపున ఆడాడు. మళ్లీ ఇప్పుడు ఐర్లాండ్ పర్యటనతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉండడంతో తొలి టీ20కు చోటు దక్కడం ఖాయమన్పిస్తోంది. మరోవైపు విండీస్తో టీ20 సిరీస్లో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను తొలి టీ20కు పక్కన పెట్టాలని జట్టుమెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా): రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ,శివం దూబే, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్,రవి బిష్ణోయ్,షాబాజ్ అహ్మద్,అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా చదవండి: #Matheesha Pathirana: 'చాలా గ్రేట్.. ధోని నుంచి చాలా నేర్చుకున్నా' -
కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే..
డబ్లిన్: మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో తలపడేందుకు భారత జట్టు ఐర్లాండ్ చేరుకుంది. రాజధాని డబ్లిన్ శివారులోని మలహైడ్ మూడు టి20లకు వేదిక కానుంది. విండీస్తో టి20 సిరీస్ ఆడి ఈ సిరీస్కు కూడా ఎంపికైన ఆటగాళ్లు అక్కడినుంచి నేరుగా డబ్లిన్ ప్రయాణించారు. అయితే ఈ సిరీస్ కోసమే జట్టులోకి వచ్చిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్, శివమ్ దూబే నేరుగా భారత్నుంచి డబ్లిన్కు వెళ్లారు. బుమ్రా ఫిట్నెస్ను పరీక్షించే క్రమంలో ఈ నెల 18, 20, 23 తేదీల్లో మ్యాచ్లు జరుగుతాయి. సిరీస్ ఫలితంకంటే అందరి దృష్టీ ప్రధానంగా బుమ్రాపైనే నిలిచింది. గాయాలనుంచి కోలుకొని దాదాపు సంవత్సరం కాలం తర్వాత అతను మళ్లీ మ్యాచ్ బరిలోకి దిగబోతున్నాడు. కీలకమైన ఆసియా కప్, ప్రపంచ కప్కు అతని బౌలింగ్ ప్రాక్టీస్తో పాటు మ్యాచ్ ఫిట్నెస్ను పరీక్షించేందుకు ఇది కీలకం కానుంది. బుమ్రా చివరిసారిగా గత ఏడాది సెప్టెంబరు 25న హైదరాబాద్లో ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ సహా ఇతర సిరీస్లతో పాటు ఈ సీజన్ ఐపీఎల్కు కూడా అతను దూరమయ్యాడు. కలలు నిజమైన వేళ ఇక ఐర్లాండ్తో సిరీస్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఆటగాడు, కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ తొలిసారి టీమిండియాకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ‘‘కలలు నిజమైన వేళ.. టీమిండియా తరఫున నా తొలి పర్యటనకు అంతా సిద్ధం.. ఐర్లాండ్కు పయనం’’ అంటూ రింకూ ఉద్వేగపూరిత పోస్ట్ చేశాడు. యశస్వి, తిలక్ అదరగొట్టారు.. మరి రింకూ? కాగా ఇటీవల ముగిసిన వెస్టిండీస్ టూర్ సందర్భంగా ఐపీఎల్ స్టార్లు యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్), తిలక్ వర్మ(ముంబై ఇండియన్స్) తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో ఈ ఇద్దరు లెఫ్టాండర్లు ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రింకూ.. ఐర్లాండ్ పర్యటనలో ఏ మేరకు రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఐపీఎల్-2023లో రింకూ 14 మ్యాచ్లు ఆడి 474 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. యశస్వి, తిలక్ వర్మ కూడా ఐరిష్ జట్టుతో టీ20లకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్కీపర్), జితేష్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముకేష్ కుమార్, ఆవేష్ ఖాన్. చదవండి: ఫుట్బాల్ దిగ్గజం హబీబ్ ఇకలేరు.. చిరస్మరణీయ క్షణాలు అవే! View this post on Instagram A post shared by Rinku 🧿🇮🇳 (@rinkukumar12) Ireland 🇮🇪, here we come ✈️ #TeamIndia | #IREvIND pic.twitter.com/A4P66WZJzP — BCCI (@BCCI) August 15, 2023 -
ఐర్లాండ్కు పయనమైన భారత జట్టు.. ఫోటోలు వైరల్
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు మరో విదేశీ పర్యటనకు సిద్దమైంది. ఐర్లాండ్తో మూడు టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్లో భారత జట్టు కెప్టెన్గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సిరీస్కు భారత ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో రింకూ సింగ్, యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కింది. అదే విధంగా స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ట ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆగస్టు 18న డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఐర్లాండ్కు పయనమైన టీమిండియా.. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా సారధ్యంలోని భారత జట్టు మంగళవారం ఐర్లాండ్కు పయనమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కెప్టెన్ బుమ్రాతో పాటు రుత్రాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, శివమ్ దుబే వంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరింతా ప్రత్యేక విమానంలో ఐర్లాండ్కు బయలుదేరారు. మరోవైపు విండీస్తో టీ20 సిరీస్లో భాగమైన తిలక్ వర్మ, అవేష్ ఖాన్, జైశ్వాల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్ నేరుగా ఐర్లాండ్కు చేరుకోనున్నారు. ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్కీపర్), జితేష్ శర్మ (వికెట్కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ చదవండి: #Wanindu Hasaranga: హసరంగా సంచలన నిర్ణయం.. టెస్టు క్రికెట్కు గుడ్బై Ireland 🇮🇪, here we come ✈️ #TeamIndia | #IREvIND pic.twitter.com/A4P66WZJzP — BCCI (@BCCI) August 15, 2023 -
ఐపీఎల్లో ఆడితే.. వరల్డ్కప్ గెలిచినట్లా? వాళ్లిద్దరికి రెస్ట్ అవసరమా?
India tour of West Indies, 2023: ‘‘మన వాళ్లు అంతర్జాతీయ టీ20లను సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్ ఐర్లాండ్కు వెళ్లడం లేదన్నది వాస్తవం. ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమే. కానీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు మనం 14 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఐపీఎల్లో ఆడితే.. వరల్డ్కప్ గెలిచినట్లా? ఐపీఎల్ గురించి మనకు అనవసరం. లీగ్ క్రికెట్లో మన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచినంత మాత్రాన వరల్డ్కప్ గెలిచినట్లు కాదు కదా! మనం ఇంతవరకు కేవలం ఒక్కసారి మాత్రమే పొట్టి ఫార్మాట్లో జగజ్జేతగా నిలిచాం. అది కూడా ఐపీఎల్ లేనప్పుడు మాత్రమే!’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా మేజర్ ఈవెంట్లకు ఆటగాళ్లను ఎంపిక చేసే పరిస్థితి లేదన్నాడు. యువ ఆటగాళ్లను కూడా విశ్రాంతి పేరిట పక్కన పెట్టడం సరికాదని పేర్కొన్నాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్కు ఓపెనర్లు శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్లను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. సమయం ఉంది కదా! రెస్ట్ ఎందుకు? కాగా వెస్టిండీస్ టూర్లో 3-2తో టీ20 సిరీస్ను కోల్పోయిన టీమిండియా తదుపరి ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగష్టు 18- 23 వరకు మూడు టీ20లు ఆడనుంది. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని యువ జట్టు అక్కడికి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వీలైనన్ని ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం మనకు ముఖ్యం. ఐర్లాండ్ వంటి జట్టుతో మూడు టీ20లు ఆడుతున్నారంటే.. ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం ఎందుకు? విండీస్తో మూడో టీ20 నుంచే అతడికి రెస్ట్ ఇచ్చారు. నాకైతే అర్థం కావడం లేదు ఐర్లాండ్కు కూడా పంపడం లేదు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆసియా వన్డే కప్ ఆరంభం నాటికి తిరిగి వస్తే ఇషాన్ పరిస్థితి ఏంటి? ఐర్లాండ్ సిరీస్ ఆగష్టులోనే ముగుస్తుంది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబరులో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ అతడిని బ్యాకప్ వికెట్ కీపర్గా భావించినా.. ఆసియా కప్ నాటికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. ఫిట్గా ఉన్న యువ ఆటగాళ్లను కూడా విశ్రాంతి పేరిట పక్కన పెట్టడం ఎందుకో అర్థం కావడం లేదు’’ అని విస్మయం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్తో టీమిండియా నాలుగో టీ20 ముగిసిన తర్వాత ఈ మేరకు ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో హార్దిక్ సేనపై ఘన విజయం సాధించిన కరేబియన్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. అంతకు ముందు టీమిండియా 1-0తో టెస్టు, 2-1తో వన్డే సిరీస్ను గెలిచిన విషయం తెలిసిందే. ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు: బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్. చదవండి: Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్! నోర్ముయ్.. ఇంత చెత్త కెప్టెన్ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? -
లక్షల్లో డబ్బు.. ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసే పని ఇంకా మానలేదు!
కోల్కతా నైట్రైడర్స్ స్టార్, యువ బ్యాటర్ రింకూ సింగ్ కష్టాల కడలిని దాటి క్రికెటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కడు పేదరికంలో జన్మించిన అతడు.. ‘ఆట’తో ఆర్థికంగానూ ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమిండియాకు ఆడే దిశగా దూసుకుపోతున్నాడు. ఇంటింటికి గ్యాస్ బండలు మోస్తూ.. స్వీపర్గా పనిచేస్తూ కాలం వెళ్ల దీసే స్థాయి నుంచి ‘లక్షాధికారి’ అయ్యాడు. ఆర్థిక పరిస్థితి మెరుగైనా.. తద్వారా.. తనలాంటి ఆశావహ క్రికెటర్లందెరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడు. అయితే, తమ ఆర్థిక పరిస్థితి మెరుగైనప్పటికీ తన తండ్రి మాత్రం ఇంకా కుటుంబం కోసం కష్టపడుతూనే ఉన్నారంటున్నాడు రింకూ సింగ్. కొడుకు సంపాదిస్తున్నా.. ఖాళీగా ఉండటం ఆయనకు నచ్చదంటున్నాడు. పనిచేయడంలోనే ఆయనకు సంతృప్తి దొరకుతుందని చెబుతున్నాడు. కేకేఆర్ దృష్టిలో పడ్డ తర్వాత కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కేకేఆర్ రింకూను కొనుగోలు చేయడంతో అతడి దశ తిరిగింది. ఆరంభంలో ఆడే అవకాశాలు రాకున్నా ఓపికగా ఎదురుచూసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఐపీఎల్-2023 ఎడిషన్లో అదరగొట్టాడు. 14 ఇన్నింగ్స్లో 149.53 స్ట్రైక్రేటుతో మొత్తంగా 474 పరుగులు సాధించాడు. సిక్సర్ల రింకూగా.. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో తాజా సీజన్లో అద్బుత ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డ రింకూ తొలుత ఆసియా క్రీడలు-2023 జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్లో పర్యటించే భారత టీ20 జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. నాన్న.. ఇంకా ఆ పని మానలేదు ఈ నేపథ్యంలో త్వరలోనే రింకూ టీమిండియా ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వార్తా సంస్థ పీటీఐతో ముచ్చటించిన రింకూ సింగ్ తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాన్నను రిలాక్స్ అవ్వమని చెప్పాను. కానీ ఆయన ఇప్పటికి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసే పనిమానుకోలేదు. ఆయనకు పని చేయడం ఇష్టం. ఒకవేళ ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతుందని అంటారు. చిన్న వయసు నుంచే కష్టపడటం అలవాటైన వ్యక్తికి ఇప్పుడు అకస్మాత్తుగా ఊరికే కూర్చుకోమంటే కష్టమే కదా!’’ అని పేర్కొన్నాడు. కాగా 25 ఏళ్ల రింకూ కుటుంబ పోషణ కోసం తన తండ్రి, సోదరుడితో కలిసి ఎల్పీజీ గ్యాస్లు సరఫరా చేసేవాడు. తొలుత ఐర్లాండ్ పర్యటనలో స్వీపర్గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా.. క్రికెట్ కెరీర్ను కొనసాగించే క్రమంలో దానిని వదిలేశాడు. దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ సింగ్కు ఐపీఎల్-2023 వేలం నేపథ్యంలో కేకేఆర్ 55 లక్షల రూపాయలు చెల్లించి అట్టిపెట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు ‘సిక్సర్ల’ రింకూ. కాగా ఆగష్టు 18- 23 వరకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో రింకూ సభ్యుడన్న సంగతి తెలిసిందే. చదవండి: సానియా, మాలిక్ విడాకులు నిజమేనా..!? మరోసారి తెరపైకి -
WC 2023: దాదాపు ఏడాది తర్వాత బుమ్రా రీఎంట్రీ.. అది కూడా కెప్టెన్గా! అవసరమా?!
Jasprit Bumrah Returns As Captain IND Vs IRE T20 Series: సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ మైదానంలోకి దిగబోతున్నాడు. వెన్నుకు గాయంతో జట్టుకు దూరం కావడం, ఆపై శస్త్రచికిత్స, అనంతరం రీహాబిలిటేషన్... ఇప్పుడు పూర్తిగా కోలుకొని బుమ్రా ఆట కోసం సిద్ధమయ్యాడు. ఐర్లాండ్తో జరిగే 3 మ్యాచ్ల టి20 సిరీస్ కోసం అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. కెప్టెన్గా రీఎంట్రీ పైగా అతను ఈ సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. గతంలో ఇంగ్లండ్తో జరిగిన ఒక టెస్టులో బుమ్రా భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. కీలకమైన ఆసియా కప్, ప్రపంచకప్కు ముందు బుమ్రా మ్యాచ్ ఫిట్నెస్ స్థాయిని పరీక్షించేందుకు పెద్దగా ఒత్తిడి లేని, బలహీన జట్టుతో జరిగే సిరీస్లో ఆడించబోతున్నారు. ప్రయోగాలు అవసరమా? ఈ నేపథ్యంలో ఓవైపు.. టీమిండియా అభిమానులు బుమ్రా రాకపై హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు.. వన్డే ప్రపంచకప్-2023 లాంటి మెగా ఈవెంట్కు ముందు కెప్టెన్సీతో ప్రయోగాలు ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐర్లాండ్ బలహీన జట్టే కావొచ్చు.. కానీ దాదాపు ఏడాది తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న బుమ్రాపై అదనపు భారం మోపడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదనపు భారమే సారథిగా జట్టును ముందుండి నడిపించడం అంత తేలికేమీ కాదని.. ఆన్ ఫీల్డ్లోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్లోనూ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ప్రధాన పేసర్ అయిన బుమ్రా... మెగా ఈవెంట్కు ముందు బౌలింగ్పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రిస్క్ ఎందుకు? ఫిట్నెస్, ఫామ్ను పరీక్షించడానికే ఐర్లాండ్ సిరీస్ను ప్లాట్ఫామ్గా ఉపయోగించుకుంటున్నప్పటికీ.. ఇప్పుడే మళ్లీ అతడిని రిస్క్లోకి నెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతేడాది.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టును ఓడించినంత పని చేసిన ఐర్లాండ్ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. గాయాల బెడదతో సతమతమైన బుమ్రా విషయంలో.. ఏమాత్రం తేడా వచ్చినా ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతా యువ ఆటగాళ్లే! కాగా చివరిసారిగా గత ఏడాది సెప్టెంబరు 22న హైదరాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన బుమ్రా... ఐపీఎల్-2023 కూడా ఆడలేదు. ఇదిలా ఉంటే.. బుమ్రాతో పాటు గాయం నుంచి కోలుకున్న మరో పేసర్ ప్రసిధ్ కృష్ణకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ఇక ప్రసిధ్ కూడా సంవత్సరం క్రితం భారత్కు ఆడాడు. వీరిద్దరు మినహా సీనియర్ ఆటగాళ్లెవరూ లేకుండా యువ ఆటగాళ్లతోనే మిగతా జట్టును ఎంపిక చేశారు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన టీమ్లోని సభ్యులే దాదాపుగా ఇక్కడా ఉన్నారు. టీమిండియా- ఐర్లాండ్ మధ్య ఆగస్టు 18, 20, 23 తేదీల్లో డబ్లిన్లో మూడు టి20 మ్యాచ్లు జరుగుతాయి. ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు వివరాలు: బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్. చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్!
Team India Captain: వెస్టిండీస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా ఐర్లాండ్ టూర్కు వెళ్లనుంది. ఐరిష్ జట్టుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఆగష్టు 18- 23 వరకు ఈ మేరకు సిరీస్ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. ఐర్లాండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియాకు మరో కొత్త కెప్టెన్ రానున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లి సారథిగా వైదొలిగిన తర్వాత రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్ కాగా.. అతడి గైర్హాజరీలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్ తదితరులు వివిధ సందర్భాల్లో కెప్టెన్లుగా వ్యవహరించారు. మొన్న రుతురాజ్ గైక్వాడ్ ఇక ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో చైనాకు వెళ్లనున్న భారత ద్వితీయ శ్రేణి పురుషుల జట్టుకు ముంబై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ నాయకుడిగా ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి ఆసియా కప్-2023 వన్డే టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. హార్దిక్కు విశ్రాంతి ఈ నేపథ్యంలో ఐర్లాండ్ టూర్లో స్టార్ ఆల్రౌండర్, భవిష్యత్ కెప్టెన్గా ఎదిగిన తాత్కాలిక సారథి హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం వెస్టిండీస్ టీ20 సిరీస్లో హార్దిక్కు డిప్యూటీగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘ఇప్పటి వరకైతే ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత హార్దిక్ నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఫ్లోరిడా నుంచి డబ్లిన్కు వెళ్లాల్సి ఉంటుంది. ఆసియా కప్, ఆ తర్వాత వన్డే వరల్డ్కప్.. ప్రస్తుతం ఇవే ప్రాధాన్యతాంశాలు. పనిభారాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వరల్డ్కప్లో అతడు రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉంటాన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి అతడికి కావాల్సినంత విశ్రాంతి అవసరం’’ అని బీసీసీఐ వర్గాలు పీటీఐతో వ్యాఖ్యానించాయి. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఈ నేపథ్యంలో ఐర్లాండ్లో టీమిండియాను సూర్య ముందుండి నడిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్కు స్కై ఓ మ్యాచ్లో సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఎంత మంది కెప్టెన్లురా నాయనా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా 29 ఏళ్ల పాండ్యా ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యుడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విండీస్ పర్యటన ముగియగానే ఇక ఐర్లాండ్ పర్యటనలో హార్దిక్తో పాటు యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు కూడా రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రస్తుతం విండీస్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత జూలై 27- ఆగష్టు 1 వరకు వన్డే, ఆగష్టు 3- ఆగష్టు 13 వరకు టీ20 సిరీస్లలో తలపడనుంది. ఆ తర్వాత ఐదు రోజుల్లో ఐర్లాండ్కు చేరుకోనుంది. చదవండి: 'నమ్మలేకపోతున్నా విరాట్ సర్.. ఆమె మిమ్మల్ని చూడటానికి వస్తోంది' Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే.. -
ఐర్లాండ్తో టీ20 సిరీస్.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ఆటగాడు!
వెస్టిండీస్ పర్యటన అనంతరం టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్లో అడుగుపెట్టనుంది. ఆగస్టు 18న డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఐర్లాండ్ టూర్కు కూడా భారత ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపనున్నట్లు సమాచారం. ఎందుకంటే అదే నెలలో ఆసియాకప్ ప్రారంభం కానుండడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే వెస్టిండీస్తో టీ20 సిరీస్ చోటు ఆశించి భంగపాటు పడ్డ యువ ఆటగాళ్లకు ఐర్లాండ్ టూర్కు సెలక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేష్ వర్మ వంటి ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నితీష్ రాణా రీ ఎంట్రీ.. ఇక ఐర్లాండ్ సిరీస్కు జట్టు ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న నితీష్ రాణా.. ఐర్లాండ్ సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. రాణా చివరగా 2021 జూలైలో భారత జట్టు తరపున ఆడాడు. రాణా ఇప్పటి వరకు టీమిండియా తరపున కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోకపోవడంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. అయితే ఐపీఎల్-2023లో నితీష్ అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో.. సెలక్టర్లు అతడికి మళ్లీ పిలుపునివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్కు సారధ్యం వహించిన రాణా పర్వాలేదనపించాడు. 14 మ్యాచ్లు ఆడిన అతడు 31.77 సగటుతో 413 పరుగులు చేశాడు. చదవండి: IND Vs WI 2023: భారత జట్టులో నో ఛాన్స్.. ‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్తో ఉన్నాడు’ -
ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ20 సిరీస్.. షెడ్యూల్ విడుదల
3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా ఐర్లాండ్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను క్రికెట్ ఐర్లాండ్ (సీఐ) నిన్న (జూన్ 27) విడుదల చేసింది. ఆగస్ట్ 18న తొలి టీ20, ఆగస్ట్ 20, ఆగస్ట్ 23 తేదీల్లో మిగతా రెండు టీ20లు జరుగుతాయని సీఐ సీఈఓ వెల్లడించాడు. ఈ మూడు మ్యాచ్లకు డబ్లిన్లోని మలహిదే గ్రౌండ్స్ వేదిక కానున్నాయని ఆయన తెలిపాడు. భారత్.. వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే (ఆగస్ట్ 13) ఐర్లాండ్ సిరీస్ మొదలవుతుంది. కాగా, టీమిండియా.. ఐర్లాండ్తో గతేడాది కూడా టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. నాటి సిరీస్ను హార్దిక్ పాండ్యా నేతృత్వంలోనే టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 12 ఓవర్లకు కుదించిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో 4 పరుగుల స్వల్ప తేడాతో భారత్ గెలుపొందింది. రెండో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన దీపక్ హుడా (104)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. అంతకుముందు 2018లో కూడా టీమిండియా ఐర్లాండ్లో పర్యటించింది. నాటి సిరీస్ను కూడా టీమిండియా 2-0 తేడాతో ఊడ్చేసింది. ఓవరాల్గా భారత్-ఐర్లాండ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్లు జరగ్గా ఐదింటిలో టీమిండియానే గెలుపొందింది. -
ఐర్లాండ్తో టీ20 సిరీస్.. టీమిండియా స్టార్ బౌలర్ రీ ఎంట్రీ!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్తో బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా వెస్టిండీస్ టూర్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటన వెళ్లనుంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆతిథ్య ఐర్లాండ్తో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ ఆగస్టులో జరగనుంది. అయితే ఈ ఏడాది ఆగస్టు ఆఖరిలో ఆసియాకప్ జరగనుండడంతో.. భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ జట్టుతో పాటు బుమ్రాను కూడా ఐర్లాండ్కు పంపాలని భారత జట్టు మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా వెన్ను గాయం నుంచి కోలుకున్న బుమ్రా.. ప్రస్తుతం నెషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతడిని వన్డే వరల్డ్కప్ సమయానికి సిద్దం చేసే పనిలో భారత జట్టు మెనెజ్మెంట్ పడింది. ఈ క్రమంలో వీలైనంత వేగంగా బరిలోకి దించాలని మెనెజ్మెంట్ భావిస్తోంది. కాగా గతేడాది సెప్టెంబర్ నుంచి బుమ్రా జట్టుకు దూరంగా ఉన్నాడు. చదవండి: #Cheteshwar Pujara: వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? -
ఐర్లాండ్తో టి20 సిరీస్ ఆడనున్న భారత్
డబ్లిన్: ఈ ఏడాది ఆగస్టులో భారత్తో టి20 సిరీస్కు ఐర్లాండ్ బోర్డు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 18 నుంచి 23 వరకు జరిగే ఈ సిరీస్లో ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్లు నిర్వహిస్తారు. అయితే మరి కొద్ది రోజుల తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో భారత్ కోణంలో ఈ టి20 సిరీస్కు ప్రాధాన్యత లేదు కాబట్టి ద్వితీయ శ్రేణి జట్టు పాల్గొనే అవకాశం ఉంది. -
'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్'
మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా స్టార్ స్మృతి మంధాన ఐర్లాండ్తో మ్యాచ్లో తన టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. అయితే తన కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్ ఇదేనని మంధాన మ్యాచ్ అనంతరం పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐర్లాండ్తో మ్యాచ్లో స్మృతి మంధాన 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మధ్యలో వేలికి గాయమైనప్పటికి మంధాన తన జోరును ఎక్కడా ఆపలేదు. మధ్యలో మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆమె టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది. మ్యాచ్ విజయం అనంతరం స్మృతి మంధాన మాట్లాడుతూ.. ''వర్షం కారణంగా మ్యాచ్ జరిగిన సెంట్జార్జీ పార్క్ బ్యాటింగ్కు ప్రతికూలంగా మారింది. గాలికి బంతి దిశ మారుతూ వికెట్ల మీదకు దూసుకువస్తుండడంతో బ్యాటింగ్ చేయడం కష్టమైపోయింది. బహుశా నా కెరీర్లోనే ఇది అత్యంత కఠినమైన ఇన్నింగ్స్ అనుకుంటున్నా. వేలికి గాయం అయినప్పటికి పెద్దగా ఏం కాలేదు.. అంతా ఓకే. షఫాలీ వర్మతో సమన్వయం చేసుకున్నా. ఇద్దరం కలిసి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాలని ముందే నిశ్చయించుకున్నాం. ఒకరు స్ట్రైక్ రొటేట్ చేస్తే సరిపోతుందని భావించాం. అందుకే జాగ్రత్తగా ఆడాం. మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును సెమీస్ చేర్చినందుకు సంతోషంగా ఉంది. అయితే ఇంగ్లండ్తో మ్యాచ్లో మేం ఆడాల్సిన పద్దతిలో ఆడలేదు. అందుకే ఓడిపోయాం'' అంటూ చెప్పుకొచ్చింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్తో సోమవారం జరిగిన గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (56 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్గా నిలిచింది.156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు సాధించిన సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గకపోవడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం 8.2 ఓవర్లలో ఐర్లాండ్ విజయసమీకరణం 59 పరుగులుగా ఉంది. అయితే ఆ జట్టు ఐదు పరుగులు వెనుకపడి ఉండటంతో భారత విజయం ఖరారైంది. A crucial knock with a big six! This Smriti Mandhana moment could be featured in your @0xFanCraze Crictos Collectible packs! Visit https://t.co/8TpUHbQikC to own iconic moments from the #T20WorldCup pic.twitter.com/Plp5oUH1j4 — ICC (@ICC) February 20, 2023 చదవండి: ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్కప్ మనదే.. -
ఐర్లాండ్తో కీలకపోరు.. కచ్చితంగా గెలవాల్సిందే
మహిళల టి20 ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. సోమవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భాగంగా ఐర్లాండ్తో టీమ్ఇండియా తలపడుతుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో భారత్(4) రెండో స్థానంలో కొనసాగుతుంటే..ఐర్లాండ్(0) ఆఖర్లో ఉంది. అయితే సెమీఫైనల్స్కు ఎలాంటి అవరోధాలు లేకుండా అర్హత సాధించాలంటే టీమిండియా..ఐర్లాండ్పై తప్పక గెలువాలి. ఇప్పటికే గ్రూపు-2 నుంచి ఇంగ్లండ్(6) ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.. అయితే మరో స్థానం కోసం పోటీ ఏర్పడింది. ఇవాళ జరగనున్న మ్యాచ్లో ఐర్లాండ్పై భారత్ గెలిస్తే మన ఖాతాలో ఆరు పాయింట్లు చేరుతాయి. అప్పుడు టీమిండియా నేరుగా సెమీస్లో అడుగుపెడుతుంది. మిగిలిన మ్యాచ్లో ఇంగ్లండ్, పాకిస్థాన్తో తలపడుతుంది. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన పోరులో పాక్ ఓడిపోవడం ఒక రకంగా మనకు కలిసొచ్చింది. ఒకవేళ ఆఖరి పోరులో ఇంగ్లండ్పై పాక్ గెలిస్తే నాలుగు పాయింట్లకే పరిమితమవుతుంది. అప్పుడు భారత్కు బెర్తు ఖాయమైనట్లే. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ మ్యాచ్ను కీలకంగా తీసుకున్న భారత్ అందుకు తగ్గట్లు సిద్ధమైంది. -
IND VS IRE 2nd T20: హార్దిక్ సేన ఖాతాలో చెత్త రికార్డు
ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు రికార్డు విజయాన్నినమోదు చేసి రెండు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆతిధ్య ఐర్లాండ్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన భారత్.. రికార్డు విజయాన్ని నమోదు చేయడంతో పాటు ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. భారత ఇన్నింగ్స్లో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్(తొలి బంతికే ఔట్ కావడం)గా వెనుదిరిగారు. దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్లు తాము ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై పెవిలియన్ బాట పట్టారు. ఓ ఇన్నింగ్స్లో టీమిండియా (టీ20ల్లో) తరఫున ఇన్ని(3) గోల్డెన్ డకౌట్లు రికార్డు కావడం ఇదే తొలిసారి. కాగా, దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతమైన శతకంతో, సంజూ శాంసన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్ను ఆఖరి బంతి వరకు తీసుకువచ్చి ఓటమిపాలైంది. చివర్లో ఐర్లాండ్ ఆటగాళ్లు జార్జ్ డాక్రెల్ (16 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్క్ అడైర్ (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) టీమిండియాను బయపెట్టారు. ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సి ఉండగా ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌల్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో ఐర్లాండ్ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో పాల్ స్టిర్లింగ్ (18 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హ్యారీ టెక్టార్ (28 బంతుల్లో 39; 5 ఫోర్లు) భారీ షాట్లతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. చదవండి: కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన చిన్ననాటి స్నేహితులు -
కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన చిన్ననాటి స్నేహితులు
India Vs Ireland 2nd T20: ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో విజయం ద్వారా 2-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా దీపక్ హుడా, సంజూ శాంసన్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. డబ్లిన్ వేదికగా సాగిన రెండో టీ20తో చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్ ఇషాన్ కిషన్కు జోడీగా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో 42 బంతుల్లో 77(9 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు సాధించాడు. ఇక మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ విఫలం(3) కాగా... వన్డౌన్లో వచ్చిన దీపక్ హుడా సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 87 బంతుల్లో 176 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తద్వారా కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ జోడీ రికార్డును బద్దలు కొట్టారు. దీంతో దీపక్ హుడా, సంజూ శాంసన్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున అత్యధిక స్కోరు భాగస్వామ్యం ►దీపక్ హుడా- సంజూ శాంసన్(2022): ఐర్లాండ్పై 176 పరుగులు- డబ్లిన్లో.. ►కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ(2017): శ్రీలంకపై 165 పరుగులు- ఇండోర్లో. ►శిఖర్ ధావన్- రోహిత్ శర్మ(2018): ఐర్లాండ్పై 160 పరుగులు- డబ్లిన్లో.. ►శిఖర్ ధావన్- రోహిత్ శర్మ(2017): న్యూజిలాండ్పై 158 పరుగులు- ఢిల్లీలో.. ►కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ(2021): అఫ్గనిస్తాన్ మీద140 పరుగులు- అబుదాబిలో.. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ రెండో టీ20: టాస్: ఇండియా- బ్యాటింగ్ ఇండియా స్కోరు: 225/7 (20) ఐర్లాండ్ స్కోరు: 221/5 (20) విజేత: నాలుగు పరుగుల తేడాతో ఇండియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దీపక్ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు) చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్ చేతికి బంతి.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే! #TeamIndia beat Ireland by 4 runs & clinched the series 2-0 🏆 #IREvIND pic.twitter.com/l21YKzk8dX — Doordarshan Sports (@ddsportschannel) June 28, 2022 -
IND Vs IRE: సంజూ క్రేజ్ మామూలుగా లేదు.. హార్దిక్ ఆ మాట చెప్పగానే.. వైరల్!
India vs Ireland 2nd T20- Sanju Samson: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు సంజూ శాంసన్. టీ20 సిరీస్ ఆడేందుకై హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఐర్లాండ్కు టూర్కు వచ్చిన జట్టులో భాగమయ్యాడు. ఈ క్రమంలో మొదటి మ్యాచ్లో బెంచ్కే పరిమితమైనా.. రెండో టీ20లో సంజూ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో ఎంట్రీ ఇచ్చిన సంజూ.. అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్తో కలిసి ఓపెనింగ్కు దిగి 42 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన అద్భుత బ్యాటింగ్తో టీమిండియా విజయంలో కీలకంగా వ్యవహరించిన ఈ కేరళ బ్యాటర్పై ప్రశంసలు కురుస్తున్నాయి. సంజూ.. సంజూ కాగా సంజూ రీ ఎంట్రీతో అభిమానులు ఎంత ఖుషీ అయ్యారో చెప్పేందుకు తార్కాణంగా నిలిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐర్లాండ్తో రెండో టీ20 ఆరంభానికి ముందు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. మూడు మార్పులతో బరిలోకి దిగినట్లు తెలిపాడు. గాయపడిన రుతు స్థానంలో సంజూ ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే మైదానంలో ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ తమ సంతోషాన్ని తెలియజేశారు. అవును నిజమే ఇందుకు స్పందించిన పాండ్యా సైతం సంజూ పేరు వినగానే అందరూ ఖుషీ అయి ఉంటారంటూ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో ఆవేశ్ ఖాన్కు బదులు హర్షల్ పటేల్, యజువేంద్ర చహల్కు బదులు రవి బిష్ణోయి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో పాండ్యా సేన 4 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. కాగా సంజూ పునరామనానికి సంబంధించి హార్దిక్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసిన రాజస్తాన్ రాయల్స్ తమ కెప్టెన్ పేరు వినగానే గూస్బంప్స్ వచ్చాయంటూ కామెంట్ చేసింది. ఇక ఐపీఎల్-2022 ఫైనల్లో హార్దిక్ పాండ్యా జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలై రాజస్తాన్ రన్నరప్తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్ చేతికి బంతి.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే! goosebumps 1.05 - 1.09 😁💗pic.twitter.com/GHr9YTSvYo — Rajasthan Royals (@rajasthanroyals) June 28, 2022 -
IND Vs IRE: ఐర్లాండ్ అద్భుత పోరాటం.. సరికొత్త రికార్డు! భారత జట్టుపై!
Highest T20I totals for Ireland: టీమిండియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. పాండ్యా సేన చేతిలో ఓటమి పాలైనా ఆఖరి వరకు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. కాగా టీ20 సిరీస్లో భాగంగా డబ్లిన్ వేదికగా భారత్- ఐర్లాండ్ జట్ల మధ్య మంగళవారం(జూన్ 28) మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి.. ఆతిథ్య జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్కు ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(40), కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ(60) శుభారంభం అందించారు. ఇద్దరు బ్యాటర్లు మినహా మిగతా వాళ్లంతా చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. అయితే, ఆఖర్లో డెక్రెల్ 16 బంతుల్లో 34, మార్క్ అడేర్ 12 బంతుల్లో 23 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ను ఆఖరి దాకా తీసుకువెళ్లారు. అయితే, టీమిండియా స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ చివరి ఓవర్లో ఒత్తిడి పెంచడంతో 221 పరుగుల వద్ద బల్బిర్నీ బృందం పోరాటం ముగిసింది. దీంతో ఐర్లాండ్కు 4 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. కాగా భారత జట్టుపైన టీ20 ఫార్మాట్లో ఐర్లాండ్కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు.. పొట్టి ఫార్మాట్లో ప్రత్యర్థి జట్టుపై రెండో భారీ స్కోరు. టీ20 ఫార్మాట్లో ఐర్లాండ్ సాధించిన భారీ స్కోర్లు ఇలా: ►అఫ్గనిస్తాన్పై- 2013- అబుదాబిలో- 225/7 ►టీమిండిమాపై- 2022- డబ్లిన్లో- 221/5 ►స్కాట్లాండ్పై- 2017-దుబాయ్లో 211/6 ►హాంకాంగ్పై- 2019- అల్ అమైరెట్లో- 208/5 ►వెస్టిండీస్పై- 2020- సెయింట్ జార్జ్లో- 208/7 చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్ చేతికి బంతి.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే! Had a wonderful time and a great experience here. The way our boys played was fantastic. The fight shown by the Irish batters & their approach tonight was commendable! Great to see such young talents coming up here. Thank you Ireland for hosting us 🤗#IREvIND pic.twitter.com/7H5QWTKJKc — VVS Laxman (@VVSLaxman281) June 28, 2022 Ireland, you guys were exceptional tonight 🇮🇳🤝🇮🇪#IREvIND — Gujarat Titans (@gujarat_titans) June 28, 2022 #TeamIndia beat Ireland by 4 runs & clinched the series 2-0 🏆 #IREvIND pic.twitter.com/l21YKzk8dX — Doordarshan Sports (@ddsportschannel) June 28, 2022 -
IND Vs IRE: అద్భుతమైన షాట్లు.. ఉమ్రాన్ సూపర్.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే: పాండ్యా
India Vs Ireland 2nd T20- Hardik Pandya Comments: ‘‘ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించాను. ప్రస్తుత పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అన్న విషయంపై మాత్రమే దృష్టి సారించాను. ఉమ్రాన్పై నమ్మకం ఉంచాను. అతడి బౌలింగ్లో పేస్ ఉంది. మరి ప్రత్యర్థి 18 పరుగులు సాధించడం అంటే కాస్త కష్టమే కదా!’’ అంటూ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ను కొనియాడాడు. రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ నిమిత్తం ఐర్లాండ్కు వెళ్లిన టీమిండియా క్లీన్స్వీప్ చేసి ఆతిథ్య జట్టుకు నిరాశను మిగిల్చింది. మొదటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచిన పాండ్యా సేన.. రెండో మ్యాచ్లో మాత్రం గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఉమ్రాన్ చేతికి బంతి ముఖ్యంగా ఐర్లాండ్ బ్యాటర్లు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి లక్ష్యం వైపు పయనించినా.. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఓటమి తప్పలేదు. నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో బంతిని పాండ్యా.. ఉమ్రాన్ మాలిక్కు ఇచ్చాడు. ఆరు బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన తరుణంలో ఐర్లాండ్ బ్యాటర్లు మార్క్ అడేర్, డాక్రెల్ క్రీజులో ఉన్నారు. జోరు మీదున్న ఈ ఇద్దరు బ్యాటర్లకు.. స్పీడ్స్టర్ ఉమ్రాన్ తన వేగంతో వారికి చెమటలు పట్టించాడు. అయితే, రెండో బంతికే నోబాల్ వేయడంతో ఐర్లాండ్ శిబిరంలో ఆశలు చిగురించినా ఆ తర్వాత ఉమ్రాన్ తన పేస్తో కట్టడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో 12 పరుగులకే పరిమితమైన బల్బిర్నీ బృందం నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. వాళ్లు అద్భుతమైన షాట్లు ఆడారు.. ఈ విజయంపై స్పందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘నిజంగా వాళ్లు(ఐర్లాండ్ బ్యాటర్లు) అద్భుతమైన షాట్లు ఆడారు. అయితే, ఈ విజయం క్రెడిట్ మొత్తం మా బౌలర్లకే దక్కుతుంది’’ అని పేర్కొన్నాడు. ప్రేక్షకుల నుంచి కూడా తమకు మద్దతు లభించిందని, అందుకు ప్రతిగా వారికి కావాల్సినంత వినోదం పంచామని చెప్పుకొచ్చాడు. ఉమ్రాన్ మాలిక్, సెంచరీ వీరుడు ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు పాండ్యా వెల్లడించాడు. మొదటి సిరీస్లోనే ఇలా: పాండ్యా భావోద్వేగం తమను సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికి పాండ్యా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఇక దేశానికి ఆడాలన్న చిన్ననాటి కల నెరవేరడం ఒక ఎత్తైతే.. జట్టుకు సారథ్యం వహించిన మొదటి సిరీస్లోనే విజయం సాధించడం తన కెరీర్లో మరింత ప్రత్యేకమైనదంటూ పాండ్యా ఉద్వేగానికి లోనయ్యాడు. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ రెండో టీ20: టాస్: ఇండియా- బ్యాటింగ్ ఇండియా స్కోరు: 225/7 (20) ఐర్లాండ్ స్కోరు: 221/5 (20) విజేత: నాలుగు పరుగుల తేడాతో ఇండియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దీపక్ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు) చదవండి: Deepak Hooda: దీపక్ హుడా సెంచరీ.. టీమిండియా తరపున నాలుగో ఆటగాడిగా #TeamIndia beat Ireland by 4 runs & clinched the series 2-0 🏆 #IREvIND pic.twitter.com/l21YKzk8dX — Doordarshan Sports (@ddsportschannel) June 28, 2022 -
IND VS IRE 2nd T20: ఉత్కంఠపోరులో భారత్ విజయం
-
ఉత్కంఠపోరులో టీమిండియా విజయం.. సిరీస్ క్లీన్స్వీప్
డబ్లిన్: ఐర్లాండ్తో జరిగిన రెండు టి20 మ్యాచ్ల సిరీస్లో భారత్ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్ను ఓడించి 2–0తో సిరీస్ సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా, సంజు సామ్సన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్స్లు) సత్తా చాటాడు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఆండీ బల్బర్నీ (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్స్లు), పాల్ స్టిర్లింగ్ (18 బంతుల్లో 40; 5 ఫోర్లు, 3 సిక్స్లు), హ్యారీ టెక్టర్ (28 బంతుల్లో 39; 5 ఫోర్లు), డాక్రెల్ (16 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. రికార్డు భాగస్వామ్యం... 87 బంతుల్లో 176 పరుగులు... భారత జట్టు తరఫున టి20ల్లో అత్యధిక పరుగుల కొత్త రికార్డు భాగస్వామ్యమిది! హుడా, సామ్సన్ కలిసి జోడించిన ఈ పరుగులే భారత్ భారీ స్కోరుకు కారణమయ్యాయి. ఇషాన్ కిషన్ (3) వెనుదిరిగిన తర్వాత జత కలిసిన వీరిద్దరు ఐర్లాండ్ బౌలర్లపై చెలరేగడంతో పవర్ప్లే ముగిసేసరికే స్కోరు 54 పరుగులకు చేరింది. డెలానీ ఓవర్లో వరుస బంతుల్లో సామ్సన్ 4, 6 కొట్టగా, మెక్బ్రైన్ ఓవర్లో హుడా రెండు సిక్సర్లు బాది 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆల్ఫర్ట్ ఓవర్లోనూ హుడా 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా... 31 బంతుల్లో సామ్సన్ తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాతా హుడా, సామ్సన్ జోరు కొనసాగింది. డెలానీ ఓవర్లో సామ్సన్ మళ్లీ వరుస బంతుల్లో రెండు సిక్సర్లతో దూకుడును ప్రదర్శించాడు. ఎట్టకేలకు సామ్సన్ను బౌల్డ్ చేసి ఎడైర్ ఈ భారీ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. లిటిల్ ఓవర్లో పాయింట్ దిశగా సింగిల్ తీసి హుడా 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో చివరి 3 ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 24 పరుగులే చేయగలిగింది. ఆరంభం అదిరినా... భారీ ఛేదనను ఐర్లాండ్ దూకుడుగా ఆరంభించింది. భువీ వేసిన తొలి ఓవర్లో స్టిర్లింగ్ వరుసగా 6, 4, 4, 4 బాదగా, 5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 65. అయితే తర్వాతి ఓవర్లో స్టిర్లింగ్ను బిష్ణోయ్ బౌల్డ్ చేయగా, డెలానీ (0) రనౌటయ్యాడు. మరో ఎండ్లో సిక్సర్లతో చెలరేగిన బల్బర్నీ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. జోరు మీదున్న బల్బర్నీని హర్షల్ అవుట్ చేయడంతో ఐర్లాండ్ వేగానికి బ్రేకులు పడ్డాయి. చివర్లో డాక్రెల్ పోరాడినా లాభం లేకపోయింది. చదవండి: దీపక్ హుడా సెంచరీ.. టీమిండియా తరపున నాలుగో ఆటగాడిగా What a thriller we've witnessed 😮#TeamIndia win the 2nd #IREvIND by 4 runs and seal the 2-match series 2️⃣-0️⃣ 👏👏 Scorecard ▶️ https://t.co/6Ix0a6evrR pic.twitter.com/6GaXOAaieQ — BCCI (@BCCI) June 28, 2022 -
దీపక్ హుడా సెంచరీ.. టీమిండియా తరపున నాలుగో ఆటగాడిగా
ఐర్లాండ్తో రెండో టి20లో టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు. తొలి టి20లో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన దీపక్ హుడా రెండో టి20లో ఏకంగా శతకంతో చెలరేగాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీపక్ హుడాకు ఓపెనర్ సంజూ శాంసన్(42 బంతుల్లో 77, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సహకరించాడు. కాగా దీపక్ హుడాకు టి20ల్లో ఇదే తొలి సెంచరీ. ఇక టీమిండియా తరపున టి20ల్లో సెంచరీ బాదిన నాలుగో భారత ఆటగాడిగా దీపక్ హుడా నిలిచాడు. ఇంతకముందు టి20ల్లో రోహిత్ శర్మ(4 సెంచరీలు), కేఎల్ రాహుల్(2 సెంచరీలు), సురేశ్ రైనా.. తాజాగా దీపక్ హుడా వీరి సరసన చేరాడు. ఇక ఐర్లాండ్తో మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. -
ఆఖరి వరకు ఉత్కంఠ.. టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం
ఐర్లాండ్తో జరిగిన ఉత్కంఠపోరులో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఒక దశలో లక్ష్యం వైపుగా సాగింది. అయితే ఆఖర్లో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయడంతో టీమిండియా తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. ఐర్లాండ్ బ్యాటింగ్లో ఆండ్రూ బాల్బర్నీ(37 బంతుల్లో 60, 3 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ స్టిర్లింగ్(18 బంతుల్లో 40, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దాటిగా ఆడారు. హ్యారీ టెక్టర్ 39 పరుగులు చేయగా.. చివర్లో జార్జ్ డాక్రెల్ 34 నాటౌట్, మార్క్ ఎడైర్ 23 నాటౌట్గా మిగిలారు. టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయి తలా ఒక వికెట్ తీశారు. కాగా రెండు మ్యాచ్ల టి20 సిరీస్ను టీమిండియా 2-0తో క్లీన్స్వీప్ చేసింది. ►టీమిండియాతో జరుగుతున్న రెండో టి20లో ఐర్లాండ్ సంచలనం చేస్తుంది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జార్జ్ డాక్రెల్ 28, హ్యారీ టెక్టర్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఆండ్రూ బాల్బరిన్ 44, హారి టెక్టర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►ఐర్లాండ్తో మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీపక్ హుడాకు ఓపెనర్ సంజూ శాంసన్(42 బంతుల్లో 77, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సహకరించాడు. ► పది ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 97/1. ఆరంభంలో వికెట్ పడినా ఏ మాత్రం తడబడకుండా భారత బ్యాటర్లు ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం దీపక్ హుడా(58), సంజు సాంసన్(42) క్రీజులో ఉన్నారు. ► ఆరో ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 54/1. క్రీజులో దీపక్ హుడా(28), సంజు సాంసన్(25) ఉన్నారు. ► మూడో ఓవర్లోనే భారత్కి ఎదురు దెబ్బ తగిలింది.భారత్ ఓపెనర్ ఇషాన్ కిషన్(3) పెవిలియన్ బాట పట్టాడు. కిషన్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోరు 13. ప్రస్తుతం దీపక్ హుడా(0) , సంజు సాంసన్(10) క్రీజులో ఉన్నారు. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా ఇవాళ (జూన్ 28) రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన రుతురాజ్ స్థానంలో సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్ స్థానంలో హర్షల్ పటేల్, చహల్ ప్లేస్లో రవి బిష్ణోయ్లు తుది జట్టులోకి వచ్చారు. భారత జట్టు: సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దినేశ్ కార్తిక్ (వికెట్కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), హ్యారీ టెక్టార్, గరేత్ డిలనీ, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టకర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడేర్, జాషువా లిటిల్, ఆండీ మెక్బ్రిన్, కానర్ ఆల్ఫర్ట్, క్రెయిగ్ యంగ్. చదవండి: టీమిండియా కెప్టెన్ ఎవరని ప్రశ్నించిన ఐసీసీ.. హర్భజన్ ఏమన్నాడంటే..? -
IND Vs IRE: రాహుల్ త్రిపాఠికి ఛాన్స్.. అర్ష్దీప్ ఎంట్రీ!
India Vs Ireland T20 Series 2022: ఐర్లాండ్తో టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా రెండో విజయంపై దృష్టి సారించింది. తమ పర్యటనలో భాగంగా పాండ్యా సేన ఆఖరి టీ20 గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భావిస్తోంది. మొదటి మ్యాచ్ ఫలితాన్ని పునరావృతం చేసి సంపూర్ణ విజయంతో స్వదేశానికి తిరిగి రావాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని జట్టులో ప్రయోగాలు చేసేందుకు మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డబ్లిన్ వేదికగా మంగళవారం(జూన్ 28) జరుగనున్న రెండో టీ20లో రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా తొలి మ్యాచ్లో బ్యాటింగ్కు రాలేదన్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ హుడా ఇషన్ కిషన్తో కలిసి ఓపెనింగ్ చేశాడు. అయితే, ఓపెనర్గా రాణించగల సత్తా ఉన్న వెంకటేశ్ అయ్యర్కు తుది జట్టులో చోటు దక్కకపోవడంతో హుడా ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా రెండో మ్యాచ్లో కూడా అయ్యర్ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రైట్- లెఫ్ట్ ఓపెనింగ్ కాంబినేషన్తో వెళ్లాలని పాండ్యా భావిస్తే.. రాహుల్ త్రిపాఠి తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. త్రిపాఠి లేదంటే అనువజ్ఞుడైన సంజూ శాంసన్ ఇషాన్కు జోడీగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఐపీఎల్-2022లో వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన శాంసన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. దీంతో అతడికి అవకాశం వస్తే మిడిలార్డర్లో ఆడించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో ఆవేశ్ ఖాన్ స్థానంలో అర్ష్దీప్ సింగ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. కాగా ఐపీఎల్-2022లో సన్రైజర్స్కు ప్రాతినిథ్యం వహించిన రాహుల్ త్రిపాఠి 14 మ్యాచ్లలో మొత్తంగా 413 పరుగులతో సత్తా చాటాడు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ 14 ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్తో రెండో టీ20 మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా) ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చహల్. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ప్రసారం? రాత్రి గం.9 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3, 4లలో ప్రత్యక్ష ప్రసారం మ్యాచ్ వేదిక: ది విలేజ్, డబ్లిన్. చదవండి: Rohit Sharma Daughter: నాన్న రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు? -
IND Vs IRE: ఈ మ్యాచ్లో ఉమ్రాన్కు ఒకే ఓవర్.. అయితే: పాండ్యా
India vs Ireland T20 Series: శ్రీనగర్ సంచలనం, సన్రైజర్స్ హైదరాబాద్ ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఎట్టకేలకు ఐర్లాండ్తో సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో మొదటి టీ20 ద్వారా అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ పొట్టి ఫార్మాట్తో ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చేతుల మీదుగా క్యాప్(నంబర్ 98) అందుకున్నాడు. అయితే, వరణుడి ఆటంకం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో ఈ జమ్మూ ఎక్స్ప్రెస్కు ఒకే ఓవర్ బౌల్ చేసే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్ 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో రెండు ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి. అయితే, ఉమ్రాన్కు ఒకే ఓవర్ వేసే అవకాశం ఇవ్వడంపై తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం స్పందించాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘తన ఫ్రాంఛైజీ తరఫును ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా ఆడాడు. అయితే, అతడితో సంభాషణ సందర్భంగా పాత బంతితో తను మెరుగ్గా బౌల్ చేయగలడని తెలుసుకున్నాను. నిజానికి మా కీలక బౌలర్లను ఐర్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. ఇక ఉమ్రాన్ విషయానికొస్తే అతడికి తదుపరి మ్యాచ్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేసే అవకాశం దక్కొచ్చు’’ అని రెండో మ్యాచ్లో ఉమ్రాన్ను పూర్తి స్తాయిలో బాగా వాడుకుంటామని హింట్ ఇచ్చాడు. కాగా ఉమ్రాన్ మాలిక్కు ఒకే ఓవర్ ఇవ్వడంతో పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పాండ్యా రెండు ఓవర్లు వేసి, ఉమ్రాన్ విషయంలో ఇలా వ్యవహరించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. కాగా ఐపీఎల్-2022లో ఉమ్రాన్ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ స్కోర్లు: టాస్- భారత్- బౌలింగ్, వర్షం కారణంగా మ్యాచ్ 12 ఓవర్లకు కుదింపు ఐర్లాండ్ స్కోరు: 108/4 (12) టీమిండియా స్కోరు: 111/3 (9.2) విజేత: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు? Rohit Sharma- T20 Captaincy: టీ20 కెప్టెన్సీ నుంచి అతడికి విముక్తి కల్పించండి! -
IND VS IRE 1st T20: భువీ ఖాతాలో అరుదైన రికార్డు
Bhuvaneshwar Kumar: టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఆదివారం ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో ఆండ్రూ బల్బిర్నీ వికెట్ పడగొట్టడం ద్వారా భువీ పొట్టి ఫార్మాట్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు (34 వికెట్లు) సాధించిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. భువీకి ముందు ఈ రికార్డు విండీస్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీల పేరిట ఉండేది. వీరిద్దరు పవర్ ప్లేలో 33 వికెట్లు సాధించారు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫలితంగా హార్ధిక్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో భువీ తొలి ఓవర్ ఐదో బంతికే ఐరిష్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్లో మూడు ఓవర్లు వేసిన భువీ కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. భువీ తన స్పెల్లో మెయిడిన్ కూడా వేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ తొలి ఓవర్లో భువీ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఈ ఓవర్లో భువీ బౌలింగ్ చేస్తుండగా స్పీడోమీటర్ మూడు సార్లు గంటకు 200కు పైగా కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరినట్లు చూపించింది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్కు వేసిన బంతి 201 Km/h, అదే విధంగా బల్బిర్నీ ఎదుర్కొన్న రెండు బంతులు 208, 201 కిమీ వేగంతో విసిరినట్లుగా రికార్డైంది. అయితే, భువీ నిజంగా ఈ ఫీట్ నమోదు చేశాడా లేదంటే సాంకేతిక తప్పిదం కారణంగా స్పీడోమీటర్ ఇలా చూపిందా అన్న విషయం తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(161.3 km/h) పేరిట నమోదై ఉంది. చదవండి: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. త్వరలోనే ఐపీఎల్లో ఆడుతాడు' -
'అతడు అద్భుతమైన ఆటగాడు.. త్వరలోనే ఐపీఎల్లో ఆడుతాడు'
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిడియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఐర్లాండ్ యువ ఆటగాడు హ్యారీ టెక్టర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. టెక్టర్ అద్భుతమైన ఆటగాడని, భవిష్యత్తులో ఐపీఎల్ కాంట్రక్ట్ పొందే అవకాశం ఉందని పాండ్యా తెలిపాడు. ఇక వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో.. తొలుత బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో 22 ఏళ్ల టెక్టర్ అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును అదుకున్నాడు. పోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో మిడ్ వికెట్ దిశగా టెక్టర్ కొట్టిన సిక్స్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. టెక్టెర్ 33 బంతుల్లో 64 పరుగులు సాధించి నాటౌట్గా నిలిచాడు. "ఈ మ్యాచ్లో టెక్టర్ అద్భుతమైన షాట్లు ఆడాడు. అతడికి కేవలం 22 ఏళ్లు మాత్రమే. టెక్టర్కు చాలా మంచి భవిష్యత్తు ఉంది. అతడు రాబోయే రోజుల్లో ఇదే ఫామ్ను కొనసాగిస్తే.. ఖచ్చితంగా ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందుతాడు. అతడికి తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడికి సరైన గైడెన్స్ ఇవ్వండి. అతడికి ఎల్లప్పడూ మేనేజేమెంట్ సపోర్ట్గా ఉంటే.. ఐపీఎల్లోనే కాదు, ప్రపంచంలోని అన్ని లీగ్లలో కూడా ఆడుతాడు" అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ స్కోర్లు: టాస్- భారత్- బౌలింగ్, వర్షం కారణంగా మ్యాచ్ 12 ఓవర్లకు కుదింపు ఐర్లాండ్ స్కోరు: 108/4 (12) టీమిండియా స్కోరు: 111/3 (9.2) విజేత: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి:IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్ ఎవరు? 🎥 That moment when @hardikpandya7 revealed his conversations with Ireland's Harry Tector while handing over a bat after the first #IREvIND T20I. 👍 👍#TeamIndia pic.twitter.com/fB4IG6xHXN — BCCI (@BCCI) June 27, 2022 -
ఐర్లాండ్తో రెండో టీ20.. టీమిండియాకు షాక్..!
ఐర్లాండ్తో రెండో టీ20కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఫామ్లో ఉన్న భారత యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ గాయం కారణంగా రెండో టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆదివారం డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20లో మోకాలి గాయంతో రుతురాజ్ బాధపడ్డాడు. దీంతో అతడు టీమిండియా ఇన్నింగ్స్లో పూర్తిగా బ్యాటింగ్ రాలేదు. అతడి స్థానంలో దీపక్ హుడా ఓపెనింగ్ వచ్చాడు. ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. గైక్వాడ్ మోకాలి గాయంతో బాదపడుతున్నట్లు హార్ధిక్ తెలిపాడు. ఒక వేళ ఈ మ్యాచ్కు గైక్వాడ్ దూరమైతే అతడి స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 డబ్లిన్ వేదికగా మంగళవారం జరగనుంది. భారత తుది జట్టు( అంచనా) ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: IND vs IRE: అందుకే గైక్వాడ్ బ్యాటింగ్కు రాలేదు: హార్ధిక్ పాండ్యా -
IND Vs IRE: గంటకు 208 కి.మీ. వేగం.. అక్తర్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?
India vs Ireland T20 Series: ఐర్లాండ్తో డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. మొదటి ఓవర్ ఐదో బంతికే ఐరిష్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీని అవుట్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. ఈ మ్యాచ్లో మొత్తం మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ వైస్ కెప్టెన్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తద్వారా హార్దిక్ పాండ్యా సేన ఐర్లాండ్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా భువీ బౌలింగ్ చేస్తున్నపుడు స్పీడోమీటర్ రెండుసార్లు గంటకు 200కు పైగా కిలోమీటర్ల వేగంతో అతడు బంతి విసిరినట్లు చూపడం గమనార్హం. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్కు భువీ వేసిన బాల్ 201 Km/h, అదే విధంగా బల్బిర్నీకి 208 201 Km/h వేగంతో బంతిని విసిరినట్లు చూపింది. నిజానికి అంతర్జాతీయ మ్యాచ్లో అత్యంత వేగంగా బంతిని విసిరిన రికార్డు పాకిస్తాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్(161.3 km/h) పేరిట ఉంది. అయితే, భువీ నిజంగా ఈ ఫీట్ నమోదు చేశాడా లేదంటే సాంకేతిక తప్పిదం కారణంగా స్పీడోమీటర్ ఇలా చూపిందా అన్న విషయం అంతుబట్టక నెటిజన్లు తికమకపడుతున్నారు. అదే సమయంలో.. భువీని కొనియాడుతూ.. ‘‘తప్పో.. ఒప్పో.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. ఇంతకీ షోయబ్ అక్తర్’’ ఎవరూ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా స్పీడోమీటర్లో చూపింది విండ్స్పీడ్రా బాబూ అంటూ మరికొంత మంది పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ స్కోర్లు: టాస్- భారత్- బౌలింగ్, వర్షం కారణంగా మ్యాచ్ 12 ఓవర్లకు కుదింపు ఐర్లాండ్ స్కోరు: 108/4 (12) టీమిండియా స్కోరు: 111/3 (9.2) విజేత: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs IRE- Hardik Pandya: మరీ ఇంత స్వార్థం పనికిరాదు! పాండ్యాపై నెటిజన్ల ఫైర్ Shoaib Akhtar, Umran Malik who??? Bhuvi just bowled the fastest ball ever.🤣🤣 Real pic, just took ss pic.twitter.com/2wDDDJQ6gK — Usama Kareem (@UsamaKarem2) June 26, 2022 201 kmph 😂😂#INDvIRE pic.twitter.com/QFNlhedAlb — Arslan Awan (@iamArslanawan) June 26, 2022 -
అందుకే గైక్వాడ్ బ్యాటింగ్కు రాలేదు: హార్దిక్ పాండ్యా
ఐర్లాండ్తో టీ20 సిరీస్ను టీమిండియా విజయంతో ఆరంభించింది. డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్ధేశించిన 109 పరుగుల టార్గెట్ను అలవోకగా టీమిండియా చేధించింది. ఇక భారత ఇన్నింగ్స్లో ఓపెనర్గా రుత్రాజ్ గైక్వాడ్ స్థానంలో దీపక్ హుడా బ్యాటింగ్ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే రుత్రాజ్ బ్యాటింగ్కు రాకపోవడానికి గల కారణాన్ని మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. గైక్వాడ్ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని, ముందుజాగ్రత్త చర్యగా అతడిని బ్యాటింగ్కు పంపలేదని పాండ్యా చెప్పాడు. "రుతు మోకాలి గాయంతో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్లో అతడు ఓపెనింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. కానీ ఎటువంటి రిస్క్ తీసుకోడదని మేము భావించాము. ఎందుకంటే మ్యాచ్ కంటే ఆటగాడి శారీరక శ్రేయస్సు చాలా ముఖ్యమైనది. మా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మేము విజయం సాధించాము. కాబట్టి గైక్వాడ్ బ్యాటింగ్కు రాకపోవడం జట్టుపై పెద్దగా ప్రభావం చూపలేదు" అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో హార్ధిక్ పాండ్యా పేర్కొన్నాడు. చదవండి: IND vs IRE: చరిత్ర సృష్టించిన హార్ధిక్ పాండ్యా.. తొలి భారత కెప్టెన్గా..! -
Ind Vs Ire: అంతా నేనే అని విర్రవీగకూడదు.. పాండ్యాపై నెటిజన్ల ఫైర్!
India vs Ireland T20 Series: ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరీ ఇంత స్వార్థం పనికిరాదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్గా ఉన్నపుడు జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని, అంతే తప్ప నేనే అంతా నడిపిస్తున్నా కదా అని విర్రవీగకూడదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. సీనియర్లను చూసి కాస్త నేర్చుకో అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా రెండు టీ20 మ్యాచ్ల సిరీస్కై టీమిండియా ఐర్లాండ్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్లిన్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్కు వరణుడు ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్ను 12 ఓవర్లకు కుదించారు. ఇక టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. కెప్టెన్గా తొలి విజయం.. అయినా లక్ష్య ఛేదనకు దిగిన పాండ్యా సేన 9.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు సాధించింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచింది. 3 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసిన యజువేంద్ర చహల్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అంతాబాగానే ఉన్నా హార్దిక్ పాండ్యాపై అభిమానుల ఆగ్రహానికి కారణం.. అరంగేట్ర ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ పట్ల వ్యవహరించిన విధానం. ఈ మ్యాచ్లో స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్తో ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేయించిన పాండ్యా.. తాను మాత్రం రెండు ఓవర్లు వేశాడు. దీంతో.. ఇటీవలి కాలంలో బౌలింగ్లో మరీ అంత గొప్ప ప్రదర్శన లేకున్నా నువ్వు మాత్రం రెండు ఓవర్లు వేశావు.. ఉమ్రాన్కు మాత్రం ఒకే ఓవర్ ఎందుకు ఇచ్చావు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్గా ఇలాగేనా వ్యవహరించేది.. ముందు జట్టు గురించి ఆలోచించాలి.. ఆ తర్వాతే నీ గురించి అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో మొత్తంగా రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఉమ్రాన్ మాలిక్ తన ఓవర్లో 14 పరుగులు ఇచ్చాడు. కాగా ఐపీఎల్-2022లో 14 సార్లూ ‘ఫాస్టెస్ట్ బాల్’ అవార్డు గెలుచుకున్న ఉమ్రాన్ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్కు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు. చదవండి: ENG vs IND: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! IND vs IRE: చరిత్ర సృష్టించిన హార్ధిక్ పాండ్యా.. తొలి భారత కెప్టెన్గా..! For his economical spell of 1/11 - @yuzi_chahal was the player of the match in the 1st T20I 👏👏 A 7-wicket win for #TeamIndia to start off the 2-match T20I series against Ireland 🔝#IREvIND pic.twitter.com/eMIMjR9mTL — BCCI (@BCCI) June 26, 2022 -
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి భారత కెప్టెన్గా..!
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో వికెట్ పడగొట్టిన తొలి భారత కెప్టెన్గా హార్దిక్ పాండ్యా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన పాండ్యా.. పాల్ స్టిర్లింగ్ను పెవిలియన్కు పంపాడు. తద్వారా ఈ ఘనతను పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో తొలి సారి భారత కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 12 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 12 ఓవర్లలో త ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(64) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, పాండ్యా, అవేశ్ ఖాన్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. ఇక 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో దీపక్ హుడా(47), ఇషాన్ కిషన్(26), హార్ధిక్ పాండ్యా(24) పరుగులతో రాణించారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 డబ్లిన్ వేదికగా మంగళవారం జరగనుంది. చదవండి: ENG vs IND: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! 🏏💙🇮🇳 pic.twitter.com/bBizMXBudT — Deepak Hooda (@HoodaOnFire) June 26, 2022 -
ఆ ముగ్గురు భారత ఆటగాళ్లే మా టార్గెట్: ఐర్లాండ్ ఆల్రౌండర్
స్వదేశంలో ఐర్లాండ్ రెండు మ్యాచ్ల సిరీస్లో టీమిండియాతో తలపడనుంది. ఆదివారం డబ్లిన్ వేదికగా ఇరు జట్లు మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నప్పటికీ.. భారత్కు గట్టి పోటీ ఇవ్వాలని ఐర్లాండ్ కూడా భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియాను అడ్డుకునేందుకు ఐర్లాండ్ ప్రణాళికలు రచిస్తోంది. హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, సంజూ శాంసన్లను త్వరగా ఔట్ చేయాలని భావిస్తున్నట్లు ఐర్లాండ్ ఆల్రౌండర్ మార్క్ అడైర్ తెలిపాడు. "టీమిండియాలో హార్ధిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, సంజూ శాంసన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. వారు ఏ స్థానంలోనైనా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలరు. ముఖ్యంగా దినేష్ కార్తీక్ భీకర ఫామ్లో ఉన్నాడు. గత కొన్ని మ్యాచ్ల నుంచి కార్తీక్ ఏ విధంగా ఆడుతున్నాడో మనం చూస్తున్నాం. ఈ మ్యాచ్లో ఈ ముగ్గురు విఫలమైతే విజయం మాదే. కాబట్టి ఈ ముగ్గురును అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తాం" అని అడైర్ పేర్కొన్నాడు. ఐర్లాండ్ సిరీస్కు భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ఆర్ బిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: IND vs ENG Test: ఇంగ్లండ్తో ఏకైక టెస్టు.. టీమిండియా అభిమానులకు గుడ్న్యూస్ -
'ఇద్దరు అరంగేట్రం చేయబోతున్నారు'.. హార్ధిక్ పాండ్యా హింట్
డబ్లిన్ వేదికగా ఆదివారం ఐర్లాండ్తో జరగనున్న తొలి టీ20కు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లంతా దూరం కావడంతో.. హార్ధిక్ పాండ్యా సారథ్యంలో జూనియర్ భారత జట్టు బరిలోకి దిగనుంది. తొలి టీ20కు ముందు విలేకరుల సమావేశంలో హార్థిక్ పాండ్యా మాట్లాడాడు. ఈ మ్యాచ్లో ఇద్దరు ఆటగాళ్లు భారత తరపున అరంగేట్రం చేయబోతున్నారంటూ పాండ్యా సూచించాడు. కాగా తొలి టీ20లో ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి అంతర్జాతీయ అరంగేట్రం చేయున్నట్లు తెలుస్తోంది. "మేము ఈ మ్యాచ్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము. అదే విధంగా అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్తో బరిలోకి దిగాలని భావిస్తున్నాము. ప్రస్తుత జట్టు పరిస్థితుల బట్టి ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. ఈ సిరీస్లో మంచి ఫలితాన్ని తీసుకురావడంపై నా దృష్టంతా ఉంది" అని హార్ధిక్ పాండ్యా పేర్కొన్నాడు. చదవండి: West Indies New captain: వెస్టిండీస్ కెప్టెన్గా హేలీ మాథ్యూస్.. -
భారత్, ఐర్లాండ్ తొలి టి20.. ముచ్చటగా తొమ్మిది రికార్డులు
ఇండియా, ఐర్లాండ్ మధ్య ఇవాళ తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఇటీవలే సౌతాఫ్రికాతో ముగిసిన ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను 2-2తో ప్రొటిస్తో సంయుక్తంగా పంచుకుంది. సీనియర్లంతా ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉండడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో జూనియర్ జట్టు ఐర్లాండ్ పర్యటనకు వచ్చింది. దినేశ్ కార్తిక్, భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా మినహా మిగతావారికి ఐర్లాండ్ పర్యటన ఇదే తొలిసారి. తొలి టి20 జరగనున్న నేపథ్యంలో రికార్డులపై ఒక లుక్కేద్దాం. ►ఐర్లాండ్ బౌలర్ ఆండీ మెక్బ్రిన్ అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇక క్రెయిగ్ యంగ్ కూడా 50 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి రెండు వికెట్ల దూరంలోనే ఉన్నాడు. ►ఇప్పటివరకు ఐర్లాండ్, టీమిండియాల మధ్య మూడు టి20 మ్యాచ్లు జరగ్గా అన్నింటిలో భారత్నే విజయం వరించింది. ►టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో నాలుగు వికెట్లు తీస్తే టీమిండియా తరపున టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవనున్నాడు.ఈ నేపథ్యంలో బుమ్రాను అధిగమించనున్నాడు. ►ఇషాన్ కిషన్ మరో 5 పరుగులు.. టీమిండియా సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ 9 పరుగులు చేస్తే టి20ల్లో 500 పరుగులు పూర్తి చేసుకుంటారు. ►ఐర్లాండ్ స్టార్ పాల్ స్టిర్లింగ్ మరో నాలుగు సిక్సర్లు కొడితే ఐర్లాండ్ తరపున టి20ల్లో వంద సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించనున్నాడు. ►టి20ల్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించనున్న తొమ్మిదో ఆటగాడు హార్దిక్ పాండ్యా. పాండ్యా కంటే ముందు సెహ్వగ్, ఎంఎస్ ధోని, సురేశ్ రైనా, అజింక్యా రహానే, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ టి20ల్లో టీమిండియా కెప్టెన్లుగా వ్యవహరించారు. ►2022లో టీమిండియాకు ఐదుగురు కెప్టెన్లు మారారు. ఈ ఏడాది కోహ్లి, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్.. తాజాగా పాండ్యా ఐదో కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇంతకముందు 1959లో టీమిండియాకు ఇదే తరహాలో ఒకే ఏడాదిలో ఐదుగురు కెప్టెన్లు మారారు. హేము అధికారి, దత్తా గెక్వాడ్, వినూ మాన్కడ్, గులబ్రాయ్ రామ్చంద్, పంకజ్ రాయ్ టీమిండియాకు కెప్టెన్లుగా చేశారు. ►డబ్లిన్ మైదానంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. గతంలో ఇక్కడ ఆడిన టి20 మ్యాచ్లో టీమిండియా ఐర్లాండ్పై 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 2018లో జరిగిన ఏకైక టి20 మ్యాచ్లో టీమిండియా ఈ విజయాన్ని నమోదు చేసింది. ►380- ఐర్లాండ్పై టి20ల్లో హార్దిక్ పాండ్యా స్ట్రైక్రేట్. 2018లో పాండ్యా ఆడిన రెండు మ్యాచ్ల్లో 6 నాటౌట్(1 బంతి), 32నాటౌట్(9 బంతులు) పరుగులు సాధించాడు. చదవండి: India Vs Ireland: కొత్తవారికి అవకాశం దక్కేనా! -
India Vs Ireland: కొత్తవారికి అవకాశం దక్కేనా!
డబ్లిన్: ఇంగ్లండ్తో ప్రధాన పోరుకు ముందు భారత క్రికెట్ జట్టు మరో సంక్షిప్త సిరీస్కు సన్నద్ధమైంది. ఐర్లాండ్తో రెండు టి20 మ్యాచ్ల పోరులో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. అయితే అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో టెస్టు టీమ్లో లేని ఇతర ఆటగాళ్లతోనే టీమిండియా బరిలోకి దిగనుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఆడిన జట్టే దాదాపుగా ఇక్కడా ఉండగా... కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలిసారి భారత జట్టును నడిపించబోతున్నాడు. రాహుల్ ద్రవిడ్ ప్రధాన జట్టుతో ఉండటంతో వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్కు తాత్కాలిక కోచ్గా వ్యవహరిస్తాడు. బలాబలాలు, గత రికార్డును చూస్తే ఐర్లాండ్పై భారత్దే స్పష్టంగా పైచేయి కాగా, సొంతగడ్డపై సత్తా చాటా లని ఐర్లాండ్ భావిస్తోంది. సామ్సన్ను ఆడిస్తారా... దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో తొలి మ్యాచ్ నుంచి చివరి వరకు మార్పు లేకుండా ఆ 11 మందినే ఆడించారు. అయితే ఈసారి టీమ్ మేనేజ్మెంట్ కొత్తగా ప్రయత్నించవచ్చు. పేసర్లు అర్‡్షదీప్, ఉమ్రాన్ మాలిక్లు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చని అంచనా. బ్యాటింగ్పరంగా గత మ్యాచ్ ఆడిన తుది జట్టును చూస్తే పంత్, అయ్యర్ లేరు కాబట్టి రెండు స్పష్టమైన ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుత జట్టు నుంచి రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేయకపోగా, సామ్సన్ మరో చాన్స్ కోసం చూస్తున్నాడు. పోటీనిస్తారా... గత ఏడాది టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐర్లాండ్ పెద్ద జట్టుతో మ్యాచ్లు ఆడలేదు. అమెరికా, యూఏ ఈలతో మాత్రమే తలపడిన టీమ్కు ఇన్నేళ్లలో కూడా పెద్ద జట్లను ఎదు ర్కొనే అవకాశం ఎక్కువగా రాలేదు. భారత్ తర్వాత ఆ టీమ్ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో ఆడనుంది. టి20 వరల్డ్కప్కు సన్నాహకంగా భారత్తో సిరీస్ పనికొస్తుంది. భారత్తో గతంలో ఆడిన 3 టి20ల్లోనూ ఐర్లాండ్ ఓడింది. ప్రస్తుత జట్టులోని సీనియర్లు స్టిర్లింగ్, డాక్రెల్తో పాటు కెప్టెన్ బల్బరీన్ జట్టు భారం మోస్తున్నారు. కొత్తగా వచ్చిన యువ ఆటగాళ్లతో కలిసి వీరు జట్టును ఎలా గెలుపు దిశగా నడిపిస్తారనేది చూడాలి. -
ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..!
IND VS IRE T20 Series 2022: హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యంగ్ ఇండియా జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. డబ్లిన్ వేదికగా జరుగనున్న ఈ సిరీస్లోని రెండు మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్లు సోనీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. పొట్టి ఫార్మాట్లో ఇండియాతో ఐర్లాండ్ గత రికార్డులను పరిశీలిస్తే.. ఈ రెండు జట్లు తలపడిన 3 సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది. ఇరు జట్లు తొలిసారి ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2009లో తలపడగా.. టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 18 ఓవర్లకు కుదించిన నాటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేయగా.. ఛేదనలో టీమిండియా మరో 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 3 ఓవర్లలో 19 పరుగులిచ్చి ఐర్లాండ్ను కట్టడి చేసిన జహీర్ ఖాన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 52; 4 ఫోర్లు, సిక్స్) అజేయమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2018లో డబ్లిన్ (మలహిదే) వేదికగా జరిగిన 2 మ్యాచ్లో టీ20 సిరీస్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఆ సిరీస్లో భాగంగా జరిగిన తొలి టీ20లో 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టీ20లో రికార్డు స్థాయిలో 143 పరుగుల భారీ తేడాతో మరో ఘన విజయం నమోదు చేసింది. తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో ఐర్లాండ్ 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (97), శిఖర్ ధవన్ (74) బ్యాట్తో.. కుల్దీప్ యాదవ్ (4/21), చహల్ (3/38), బుమ్రా (2/19) బంతితో చెలరేగారు. ఈ సిరీస్లో జరిగిన రెండో టీ20లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేయగా.. ఛేదనలో ఐర్లాండ్ 70 పరుగులకే చాపచుట్టేసింది. కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 70), సురేశ్ రైనా (45 బంతుల్లో 69), హార్ధిక్ పాండ్యా (9 బంతుల్లో 32 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కుల్దీప్ యాదవ్ (3/16), చహల్ (3/21) ఐర్లాండ్ను తిప్పేశారు. ఐర్లాండ్తో సిరీస్కు టీమిండియా: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి. ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), హ్యారీ టెక్టార్, గరేత్ డిలనీ, పాల్ స్టిర్లింగ్, కర్టిస్ కాంఫర్, స్టీఫెన్ డోహ్నీ, లోర్కాన్ టకర్, మార్క్ అడేర్, జార్జ్ డాక్రెల్, జాషువా లిటిల్, ఆండీ మెక్బ్రిన్, బ్యారీ మెకార్టీ, కానర్ ఆల్ఫర్ట్, క్రెయిగ్ యంగ్. చదవండి: India Vs Ireland: ఐర్లాండ్తో భారత్ టీ 20 సిరీస్.. ఈ వివరాలు తెలుసా? -
India vs Ireland: నాడు తుది జట్టులో డీకే.. డ్రింక్స్ మోసిన ధోని!
India vs Ireland T20 Series: మహేంద్ర సింగ్ ధోని.. మిస్టర్ కూల్.. సింప్లిసిటీకి మారుపేరు.. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో మేటి.. అంతేనా జట్టు ప్రయోజనాల కోసం తన స్థానాన్ని కూడా త్యాగం చేయగలడు.. తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఎన్నో సార్లు ఈ విషయాన్ని నిరూపించాడు ధోని. ఇక ఐర్లాండ్తో టీమిండియా జూన్ 26 నుంచి టీ20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ధోని సింప్లిసిటీకి సంబంధించిన ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. కాగా 2018లో భారత జట్టు ఐర్లాండ్లో పర్యటించింది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ధోని 5 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో రెండో మ్యాచ్లో ధోని స్థానంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ధోని వాటర్బాయ్ అవతారం ఎత్తాడు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సహచర ఆటగాళ్లకు డ్రింక్స్ అందించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజా సిరీస్ నేపథ్యంలో అభిమానులు వాటిని వెలికి తీసి రీషేర్ చేస్తున్నారు. ఇవి చూసిన నెటిజన్లు ధోని నిరాడంబరతకు అద్దం పట్టే దృశ్యాలు ఇవి అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక 2018 సిరీస్ విషయానికొస్తే కోహ్లి సేన మొదటి మ్యాచ్లో 76, రెండో మ్యాచ్లో 143 పరుగుల భారీ తేడాతో గెలుపొంది ట్రోఫీ సొంతం చేసుకుంది. అయితే, ధోని స్థానంలో రెండో మ్యాచ్కు జట్టులోకి వచ్చిన డీకేకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. తొలి టీ20లో కుల్దీప్ యాదవ్(4 వికెట్లు), రెండో టీ20లో కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 70 పరుగులు)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. చదవండి: Rajat Patidar: రజత్ పాటిదార్ సెంచరీ.. ముగ్గురు మొనగాళ్ల విజృంభణ.. ముంబైకి చుక్కలు! -
డీకేకే ఆ ఛాన్స్! ‘ప్రపంచకప్’ జట్టులో అతడే ముందు! ఇక ఉమ్రాన్ సంగతి!
India Vs Ireland T20I Series: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ఆదివారం నుంచి ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్ల ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇరు దేశాలు తమ జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్కు దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఈ టూర్లో భాగంగా జట్టుతో చేరాడు. అదే విధంగా మరో మహారాష్ట్ర బ్యాటర్ రాహుల్ త్రిపాఠికి తొలిసారిగా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. అదే విధంగా ప్రొటిస్తో సిరీస్లో అదరగొట్టిన వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సైతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఎంపికయ్యాడు. చాన్నాళ్ల తర్వాత కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ కూడా సెలక్ట్ అయ్యాడు. సంజూ, ఇషాన్ కాదు.. డీకేకే ఛాన్స్! ఈ క్రమంలో పాండ్యా సేన తుది జట్టు కూర్పు గురించి పలువురు మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ 18తో మాట్లాడిన మాజీ ఆటగాడు రోహన్ గావస్కర్కు ఈ సిరీస్లో ఎవరిని వికెట్ కీపర్గా ఎంచుకుంటారన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిచ్చిన రోహన్.. సంజూ, ఇషాన్ కిషన్ను కాదని డీకేకు ఓటు వేశాడు. ఈ మేరకు.. ‘‘వికెట్ కీపర్లుగా ఈ ముగ్గురికి తమకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే, నేను మాత్రం.. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉన్నా కూడా డీకేకే వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇస్తాను’’ అని స్పష్టం చేశాడు. ప్రపంచకప్ జట్టులో అతడి పేరే ముందు! ఇక సూర్యకుమార్ యాదవ్ జట్టుతో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రోహన్ గావస్కర్.. ‘‘టీ20 ప్రపంచకప్ భారత జట్టు అనగానే నాకు మొదట గుర్తుకు వచ్చే పేరు సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే తనొక విలక్షణమైన ఆటగాడు. అత్యద్భుతమైన క్రికెటర్. ఇప్పుడు ఈ సిరీస్తో ఫామ్లోకి వస్తే.. ప్రపంచకప్నకు ముందు మంచి ప్రాక్టీసు లభించినట్లవుతుంది. నిజంగా తను తిరిగి రావడం జట్టుకు మేలు చేస్తుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ఉమ్రాన్ మాలిక్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో అదిరిపోయే ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అద్భుతమైన బంతులు సంధించాడు. వికెట్లు కూడా తీశాడు. అయితే, కొంతమంది అత్యంత వేగంగా బాల్ విసిరినా వికెట్లు తీయలేరు. అలాంటి వాళ్లు జట్టులో ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. అయితే, ఉమ్రాన్ మాత్రం ఈ రెండు లక్షణాలు కలగలిసిన ప్యాకేజ్. అతడి అరంగేట్రం కోసం అభిమానులతో పాటు నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని రోహన్ గావస్కర్ చెప్పుకొచ్చాడు. చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు!