Manu Bhaker
-
ఒలింపిక్ విజేత, షూటర్ మను భాకర్ ఇంట్లో విషాదం
-
ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట తీవ్ర విషాదం
పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ (జనవరి 19) ఉదయం మనూ బాకర్ అమ్మమ్మ, మామ రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందారు. హర్యానాలోని చర్కీ దాద్రిలో గల మహేంద్రఘర్ బైపాస్ రోడ్డులో ఈ ఘటన సంభవించింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో స్కూటర్పై వెళ్తున్న మనూ బాకర్ అమ్మమ్మ, మామను బ్రీజా కారు ఢీకొంది. మానూ బాకర్ అమ్మమ్మ, మామ స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు.కాగా, మనూ బాకర్ రెండు రోజుల కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు అందుకుంది. మనూ బాకర్ గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మనూ.. ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా రికార్డు నెలకొల్పింది. పారిస్ ఒలింపిక్స్లో మనూ 10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం (సరబ్జోత్ సింగ్తో కలిసి) ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది. -
ఖేల్ రత్న అవార్డులు అందుకున్న గుకేశ్, హర్మన్ప్రీత్ సింగ్, మనూ బాకర్, ప్రవీణ్ కుమార్
భారత దేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అయిన "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు" గతేడాది (2024) నలుగురిని వరించింది. చెస్లో డి గుకేశ్, పురుషుల హాకీలో హర్మన్ప్రీత్ సింగ్, మహిళల షూటింగ్లో మనూ బాకర్, పారా-అథ్లెట్ (హై జంప్) ప్రవీణ్ కుమార్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ నలుగురు ఇవాళ (జనవరి 17) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది.A historic moment for 🇮🇳 Indian chess! 🏆Congratulations to 🇮🇳 GM Gukesh on receiving the prestigious Major Dhyan Chand Khel Ratna Award from Hon’ble President Droupadi Murmu👏Your hard work and passion continue to inspire us all—onward and upward 🥳👏@DGukesh📹Doordarshan pic.twitter.com/4AMZ8ClZD9— Chess.com - India (@chesscom_in) January 17, 2025గుకేశ్ అతి చిన్న వయసులో (18) ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన రెండవ భారతీయుడు గుకేష్. గుకేశ్ గత నెలలో చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ను ఓడించి వరల్డ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు.హర్మన్ప్రీత్ సింగ్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్. హర్మన్ సారథ్యంలో భారత్ గతేడాది ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్ పతకం సాధించడంలో హర్మన్ కీలకపాత్ర పోషించాడు.మనూ భాకర్ .. ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా రికార్డు నెలకొల్పింది. మనూ బాకర్ గతేడాది ఆగస్టులో జరిగిన విశ్వక్రీడల్లో రెండు కాంస్య పతకాలు (10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం ఈవెంట్లలో) గెలుచుకుంది.ప్రవీణ్ కుమార్.. గతేడాది జరిగిన పారాలింపిక్స్లో పురుషుల హై జంప్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.పై నలుగురు భారత క్రీడా రంగంలో చేసిన విశేష కృషికి గాను ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. -
నలుగురు ‘ఖేల్ రత్న’లు
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మేటి క్రీడాకారులకు ‘ఖేల్ రత్న’ అవార్డు వరించింది. పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలతో మెరిసిన మహిళా షూటర్ మనూ భాకర్... పిన్న వయసులో చెస్ ప్రపంచ చాంపియన్గా అవతరించిన తమిళనాడు గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్... భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్... పారాథ్లెట్ ప్రవీణ్ కుమార్... 2024 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరితోపాటు మరో 32 మంది ప్లేయర్లకు ‘అర్జున అవార్డు’ దక్కింది. ఇందులో 17 మంది పారాథ్లెట్లు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం అవార్డుకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. » స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్గా మనూ రికార్డు నెలకొల్పింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో హరియాణాకు చెందిన 22 ఏళ్ల మనూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యాలు నెగ్గింది. కొన్ని రోజుల క్రితం ఈ అవార్డు కోసం మనూ భాకర్ దరఖాస్తు చేసుకోలేదనే వార్తలు వచి్చనా... చివరకు ‘పారిస్’లోని ఆమె ప్రదర్శనకు అవార్డు దక్కింది. » గత ఏడాది చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టుకు స్వర్ణ పతకం దక్కడంలో కీలకపాత్ర పోషించిన గుకేశ్ ఆ తర్వాత సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించి జగజ్జేత అయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (1991–1992లో) ‘ఖేల్ రత్న’ అవార్డు పొందనున్న రెండో చెస్ ప్లేయర్ గుకేశే కావడం విశేషం. » 2024 పారిస్ ఒలింపిక్స్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్ప్రీత్ సింగ్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. మూడుసార్లు అతను అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. » పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. »‘ఖేల్ రత్న’ అవార్డు గ్రహీతలకు అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకం, అర్జున అవార్డీలకు రూ. 15 లక్షల నగదు బహుమతి లభించనుంది. జ్యోతి, దీప్తిలకు ‘అర్జున’ ఆంధ్రప్రదేశ్ వర్ధమాన అథ్లెట్ జ్యోతి యర్రాజీ...తెలంగాణ పారాథ్లెట్ దీప్తి జివాంజిలకు ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున అవార్డు’ లభించింది. వైజాగ్కు చెందిన 25 ఏళ్ల జ్యోతి పారిస్ ఒలింపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో పోటీపడింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచింది. 2023 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. 2023, 2024లలో జరిగిన ఆసియా ఇండోర్ చాంపియన్షిప్లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ, రజతాలు గెలిచింది. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల దీప్తి 2024 పారిస్ పారాలింపిక్స్లో 400 మీటర్ల టి20 కేటగిరీలో కాంస్యం... 2024 ప్రపంచ పారాథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. 2023 హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో దీప్తి బంగారు పతకం గెలిచింది. దీప్తికి భారత స్పోర్ట్స్ అథారిటీ కోచ్ నాగపురి రమేశ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు.అవార్డీల వివరాలు‘ధ్యాన్చంద్ ఖేల్రత్న’: దొమ్మరాజు గుకేశ్ (చెస్), హర్మన్ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా–అథ్లెటిక్స్), మనూ భాకర్ (షూటింగ్). అర్జున అవార్డు (రెగ్యులర్): జ్యోతి యర్రాజీ, అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు, స్వీటీ బూరా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్ప్రీత్, సుఖ్జీత్ సింగ్ (హాకీ), రాకేశ్ కుమార్ (పారా ఆర్చరీ), దీప్తి జివాంజి, ప్రీతి పాల్, అజీత్ సింగ్, సచిన్ ఖిలారి, ధరమ్వీర్, ప్రణవ్ సూర్మ, హొకాటో సీమ, సిమ్రన్, నవ్దీప్ (పారా అథ్లెటిక్స్), నితీశ్, తులసిమతి, నిత్యశ్రీ, మనీషా (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జూడో), మోనా అగర్వాల్, రుబీనా (పారా షూటింగ్), స్వప్నిల్ కుసాలే, సరబ్జోత్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (లైఫ్టైమ్): సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ పేట్కర్ (పారా స్విమ్మింగ్). ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్): సుభాశ్ రాణా (పారా షూటింగ్), దీపాలి దేశ్పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్ (హాకీ). ద్రోణాచార్య అవార్డు (లైఫ్టైమ్): మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో అనెలో కొలాకో (ఫుట్బాల్). -
ఖేల్రత్న, అర్జున అవార్డు గ్రహీతలకు వైఎస్ జగన్ అభినందనలు
అర్జున అవార్డుకు ఎంపికైన జ్యోతి యర్రాజీకి వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో రాష్ట్రానికీ, దేశానికీ పేరు తెచ్చిన ఈ అథ్లెట్ను అభినందించారు. కఠిన శ్రమ, అంకితభావం, నిబద్ధత వల్లే జ్యోతి ఈస్థాయికి చేరుకుందని ప్రశంసలు కురిపించారు.జాతీయ స్థాయిలో రికార్డులుట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు, 400 మీటర్ల హార్డిల్స్ విభాగంలో సరికొత్త బెంచ్ మార్కులు సృష్టిస్తున్న జ్యోతి యర్రాజీ క్రీడా నైపుణ్యాలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా కొనియాడారు. విశాఖపట్నంలోని సాధారణ కుటుంబంలో జన్మించి.. జాతీయ స్థాయిలో రికార్డులు సాధించిన జ్యోతి దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అదే విధంగా.. జ్యోతి యర్రాజీ భవిష్యత్తులోనూ తన విజయపరంపరను కొనసాగించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రపంచ వేదికపై సత్తా చాటి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని జ్యోతిని విష్ చేశారు.మొదటి భారత అథ్లెట్గా జ్యోతి రికార్డుకాగా విశాఖ వాసి జ్యోతి యర్రాజీని ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడామంత్రిత్వ శాఖ గురువారం ఇందుకు సంబంధించి గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా అథ్లెటిక్స్ విభాగంలో జ్యోతి కి అర్జున అవార్డు వచ్చింది. ఈ నెల 17 వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా జ్యోతి పురస్కారం అందుకోనుంది.ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలను జ్యోతి యర్రాజీ సొంతం చేసుకుంది. వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న ఆమె..100 మీటర్ల హర్డిల్స్లో బరిలోకి దిగింది. ఒలింపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో పోటీపడిన మొదటి భారత అథ్లెట్గా ఆమె రికార్డులకెక్కింది.దీప్తి జీవాంజికి వైఎస్ జగన్ అభినందనలుజ్యోతి యర్రాజీతో పాటు అర్జున అవార్డు గెలుచుకున్న తెలంగాణ పారా అథ్లెట్, వరంగల్కు చెందిన దీప్తి జీవాంజికి కూడా వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.ఖేల్రత్న అవార్డులకు ఎంపికైన వారికి శుభాకాంక్షలుఅదే విధంగా.. ఖేల్రత్న అవార్డులకు ఎంపికైన దొమ్మరాజు గుకేశ్(చెస్), మనూ భాకర్(షూటింగ్), హర్మన్ప్రీత్ సింగ్(హాకీ), ప్రవీణ్ కుమార్(పారా అథ్లెట్)లను కూడా వైఎస్ జగన్ ఈ సందర్భంగా అభినందించారు. అసాధారణ విజయాలతో వీరంతా దేశం గర్వించేలా చేశారని... రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు, అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. భారతీయ క్రీడలను మరింత ఎత్తుకు తీసుకుని వెళ్లటంలో వీరి కృషి అభినందనీయమని వైఎస్ జగన్ ప్రశంసించారు.చదవండి: జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన -
షూటింగ్ లో ఒలింపిక్స్ పతక విజేత మనుబాకర్ కు ఖేల్ రత్న
-
మను భాకర్కు ఖేల్ రత్న అవార్డు..
2024 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్ విజేత మను భాకర్, చెస్ ప్రపంచ ఛాంపియన్ డి గుకేశ్, హాకీ లెజెండ్ హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వరించింది.అదే విధంగా గతేడాది క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో 32 మందిని అర్జున అవార్డుతో కేంద్రం సత్కరించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి చోటు దక్కింది. అయిదుగురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు.సుభాష్ రాణా(పారా షూటింగ్), దీపాలి దేశ్పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్(హాకీ), ఎస్ మురళీధరన్ (బ్యాడ్మింటన్),అర్మాండో ఆగ్నెలో కొలాకో(ఫుట్బాల్)లకు ద్రోణాచార్య అవార్డు వరించింది. ఈ విజేతలకు జనవరి 17 వ తేదిన రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు గ్రహీతలు1. దొమ్మరాజు గుకేశ్- చెస్- పద్దెమినిదేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్2. హర్మన్ప్రీత్ సింగ్- హాకీ- ఒలింపిక్స్లో భారత్కు వరుసగా రెండో కాంస్యం రావడంలో ప్రధాన పాత్ర3. ప్రవీణ్ కుమార్- పారా అథ్లెటిక్స్- పారిస్ పారాలింపిక్స్లో హై జంప్ టీ64 విభాగంలో స్వర్ణం4. మనూ భాకర్- షూటింగ్- 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యాలు- ఒకే ఒలింపిక్స్ ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన ప్లేయర్గా అరుదైన ఘనతఅర్జున అవార్డు విజేతలు వీరే..👉జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్)👉అన్ను రాణి (అథ్లెటిక్స్)👉నీతు (బాక్సింగ్)👉సావీతీ (బాక్సింగ్)👉వంతిక అగర్వాల్ (చెస్)👉సలీమా (హాకీ)👉అభిషేక్ (హాకీ)👉సంజయ్ (హాకీ)👉జర్మన్ప్రీత్ సింగ్ (హాకీ)👉సుఖ్జీత్ సింగ్ (హాకీ)👉స్వప్నిల్ సురేష్ కుసాలే (షూటింగ్)👉సరబ్జోత్ సింగ్ (షూటింగ్)👉అభయ్ సింగ్ (స్క్వాష్)👉సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్)👉అమన్ (రెజ్లింగ్)👉రాకేశ్ కుమార్ (పారా ఆర్చర్)👉ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్)👉జీవాంజి దీప్పతి ((పారా అథ్లెటిక్స్)👉అజీత్సింగ్ ((పారా అథ్లెటిక్స్)👉సచిన్ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్)👉ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్)👉హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్)👉సిమ్రాన్ (పారా అథ్లెటిక్స్)👉నవ్దీప్ (పారా అథ్లెటిక్స్)👉నితీశ్ కుమార్ (పారా బ్యాడ్మింటన్)👉తులసీమతి మురుగేశన్ (పారా బ్యాడ్మింటన్)👉నిత్య శ్రీ సుమతి శివన్ (పారా బ్యాడ్మింటన్)👉మనీశా రాం దాస్ (పారా బ్యాడ్మింటన్)👉కపిల్ పర్మార్ (పారా జుడో)👉మోనా అగర్వాల్ (పారా షూటింగ్)👉రుబినా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్)👉అర్జున అవార్డ్స్ (లైఫ్టైమ్)👉సుచా సింగ్ (అథ్లెటిక్స్)👉మురళీకాంత్ రాజారాం పెట్కర్ (పారా స్విమ్మింగ్) -
Rewind 2024: విండీస్లో ‘విన్’.. మనూ సూపర్... చెస్లో పసిడి కాంతులు
ఏడాది గడిచింది. క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ సమానమంటే మాత్రం కానేకాదు. ఎందుకంటే కప్, రన్నరప్... విజేత, పరాజిత... స్వర్ణం, రజతం... ఒకటి కావు. ఒక రంగులో ఉండవు. ఒక రూపం ఉండదు. అదెప్పటికీ ప్రత్యేకం... అపురూపం!చాంపియన్కు, టైటిల్కు, ట్రోఫీకి ఉండే విలువే వేరు. నేటితో గడిచిపోయే ఈ యేడాది స్పోర్ట్స్ డైరీలో మరుపురాని విజయాలెన్నో, చిరస్మరణీయ క్షణాలెన్నో ఉన్నాయి. ఓ ప్రపంచకప్ విజయం. ‘పారిస్’లో పతకాల ప్రతాపం. పారాలింపిక్స్లో అయితే పతకాల తోరణం!చెస్లో ప్రపంచ చాంపియన్లు, ఒలింపియాడ్లో స్వర్ణాలు. ఇవన్నీ కూడా సొంతగడ్డపై కాదు... విదేశాల్లోనే విజయకేతనం! ఇది కదా భారత క్రీడారంగానికి శుభ వసంతం... ఏడాది ఆసాంతం! పట్టుదలకు పట్టం, ప్రతిభకు నిదర్శనం... మన క్రీడాకారుల విజయగర్జన. కొత్తేడాదికి సరికొత్త ప్రేరణ. విండీస్లో ‘విన్ ఇండియా’ కపిల్దేవ్ సారథ్యంలో 1983లో తొలి వన్డే వరల్డ్కప్ గెలిచిన చాలా ఏళ్లకు మళ్లీ ధోనీ బృందం 2011లో భారత్కు రెండో వన్డే ప్రపంచకప్ ముచ్చట తీర్చింది. అంతకంటే ముందు ఆరంభ టీ20 ప్రపంచకప్ (2007)ను ధోని సారథ్యంలోని యువసేన గెలుచుకొస్తే... 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఈ ఏడాది(T20 World Cup 2024) కరీబియన్ గడ్డపై రెండో టీ20 కప్ను అందించింది.ప్రతీ మ్యాచ్లో భారత్ గర్జనకు ప్రత్యర్థులు తలవంచారు. అయితే దక్షిణాఫ్రికాతో ఫైనల్ మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. కోహ్లి ఫైనల్లో రాణించడంతో భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యం కఠినమైందో, క్లిష్టమైందో కాకపోవడం .. క్లాసెన్ అప్పటికే ఐపీఎల్తో దంచికొట్టిన ఫామ్లో ఉండటంతో మ్యాచ్ను సఫారీ చేతుల్లోకి తెచ్చాడు.దాదాపు బంతులు, పరుగులు సమంగా ఉన్న దశలో క్లాసెన్ను హార్దిక్ అవుట్ చేశాడు. నిప్పులు చెరిగే బౌలింగ్తో బుమ్రా, యువ పేసర్ అర్ష్దీప్ పరుగుల్ని ఆపేశారు. సూర్యకుమార్ చరిత్రలో నిలిచే క్యాచ్... ఇలా ప్రతిఒక్కరు కడదాకా పట్టుబిగించడంతో భారత్ ప్రపంచకప్ను సొంతం చేసుకుంది.మను భాకర్... సూపర్పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. అరడజను పతకాలైతే పట్టారు. కానీ స్వర్ణమే లోటు! బహుశా వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) (100 గ్రాముల అధిక బరువు) అనర్హతకు గురి కాకుంటే రెజ్లింగ్లో పసిడి పట్టేదేమో! షూటర్ మను భాకర్(Manu Bhaker) టోక్యోలో ఎదురైన నిరాశను అధిగమించేలా పారిస్ ఒలింపిక్స్ను చిరస్మరణీయం చేసుకుంది.ఒకే ఒలింపిక్స్లో ‘హ్యట్రిక్’ పతకం, అరుదైన ఘనత చేజారినా... ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. మళ్లీ స్వర్ణం తెస్తాడని గంపెడాశలు పెట్టుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టాడు. స్వప్నిల్ కుసాలే (షూటింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్) కాంస్యాలు నెగ్గారు.హాకీ ఆటకు ఒలింపిక్స్లో పునర్వైభవం మొదలైనట్లుంది. వరుస ఒలింపిక్స్లో మన పురుషుల జట్టు కాంస్యం సాధించింది. షట్లర్ లక్ష్యసేన్, లిఫ్టర్ మీరాబాయి చాను, షూటర్ అర్జున్ బబుతా త్రుటిలో ఒలింపిక్ పతకాన్ని (కాంస్యం) కోల్పోయారు. ఓవరాల్గా 206 మందితో కూడిన భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సంతృప్తికరంగా ఈవెంట్ను ముగించింది. ‘పారా’లో ఔరా అనేలా మన ప్రదర్శన పారాలింపియన్ల పట్టుదలకు వైకల్యం ఓడిపోయింది. 84 మందితో పారిస్కు వెళ్లిన మన బృందం 29 పతకాలతో కొత్త చరిత్ర లిఖించింది. పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచిన భారత్ మునుపెన్నడు గెలవనన్నీ పతకాల్ని చేజిక్కించుకుంది. ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలు గెలుచుకుంది.అవని లెఖరా, సుమిత్ అంటిల్, మరియప్పన్ తంగవేలు, శీతల్ దేవి, నితీశ్ కుమార్, ప్రవీణ్ కుమార్, నవ్దీప్ సింగ్, హర్విందర్ సింగ్, ధరంవీర్ తదితరులు పతకాల పంట పండించారు. చదరంగంలో ‘పసిడి ఎత్తులు’భారత్లో చెస్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విశ్వనాథన్ ఆనంద్! ఆ తర్వాత మరెంతో మంది గ్రాండ్మాస్టర్లు వచ్చారు. కానీ అతనిలా భారత చదరంగంలో నిలిచిపోలేదు. అయితే ఈ ఏడాది మాత్రం చదరంగంలో స్వర్ణ చరిత్రను ఆవిష్కరించింది.చెస్ ఒలింపియాడ్, క్యాండిడేట్స్ టోర్నీ (ప్రపంచ చాంపియన్తో తలపడే ప్రత్యర్థిని ఖరారు చేసే ఈవెంట్), ప్రపంచ చాంపియన్షిప్, ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్ వీటన్నింటా మనదే జేగంట! ఓ రకంగా 2024 భారత చెస్ గడిల్లో తీపిగీతలెన్నో గీసింది. బుడాపెస్ట్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో దొమ్మరాజు గుకేశ్, అర్జున్ ఇరిగేశి, విదిత్ గుజరాతి, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ... ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ముఖ్, వంతిక అగర్వాల్, వైశాలి, తానియా సచ్దేవ్లతో కూడిన భారత బృందం విజయంతో పుటలకెక్కింది.క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన దొమ్మరాజు గుకేశ్(D Gukesh) ఇటీవల క్లాసికల్ ఫార్మాట్లో సరికొత్త ప్రపంచ చాంపియన్గా ఆవిర్భవించాడు. అనుభవజ్ఞుడు, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) ఎత్తుల్ని చిత్తుచేసి అతిపిన్న వయసులో జగజ్జేతగా గుకేశ్ కొత్త రాత రాశాడు. న్యూయార్క్లో తెలుగుతేజం, వెటరన్ ప్లేయర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్షిప్లో రెండోసారి విజేతగా నిలిచింది. –సాక్షి క్రీడా విభాగం -
వనితదే చరిత
చరిత్ర సృష్టించిన విజేతలు కాలం దారిలో వెలిగే దీపాలు అవుతారు. ఎంతోమందిని తమ బాటలో నడిపించే ఉత్తేజం అవుతారు. క్రీడల నుంచి సైన్యం వరకు వివిధ రంగాలలో 2024లో ‘శభాష్’ అనిపించుకోవడమే కాదు చరిత్ర సృష్టించారు మహిళలు...పవర్ఫుల్ బుల్లెట్హరియాణ లోని ఝుజ్జర్ జిల్లాకు చెందిన మను బాకర్ చిన్న వయసులోనే వివిధ ఆటల్లో అద్భుత ప్రతిభాసామర్థ్యాలు చూపింది. షూటింగ్లోకి అడుగు పెట్టడానికి ముందు మార్షల్ ఆర్ట్స్, టెన్నిస్, బాక్సింగ్, స్కేటింగ్లాంటి వివిధ విభాగాలలో రాణించింది. ‘షూటింగ్’లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను బాకర్ చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత షూటర్ల వరుసలో చేరింది. పారిస్ ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో తన అద్భుతమైన ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి దేశం మొత్తం గర్వపడేలా చేసింది. మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి మన దేశానికి మరో కాంస్య పతకాన్ని సాధించింది. స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్గా చరిత్ర సృష్టించింది.పట్టుదల ఉంటే ప్రతికూలతలు పారిపోతాయిప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే... దృఢ సంకల్పం, నిబద్ధత ఉంటే తిరుగులేని విజయాలు సాధించవచ్చని నిరూపించింది రాజస్థాన్లోని జైపూర్కు చెందిన అవని లేఖర. 2012లో రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె వీల్చైర్కే పరిమితం కావాల్సి వచ్చింది. నిరాశ నిండిన ఆ చీకటిలో అవని విల్పవర్ కోల్పోయి ఉంటే విజయాలు సాధించి ఉండేది కాదు. స్తబ్దత నుంచి బయటపడడానికి తండ్రి సలహాతో క్రీడల వైపు వచ్చింది. పారిస్లో జరిగిన 2024 పారాలింపిక్ గేమ్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్–1 విభాగంలో స్వర్ణపతకం గెల్చుకొని మన దేశంలోని ప్రసిద్ధ పారాలింపియన్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టోక్యో పారాలింపిక్స్లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న అవని రెండోస్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.స్ఫూర్తినిచ్చే తేజంభారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధవిమానాన్ని నడిపిన తొలి మహిళా ఫైటర్పైలట్గా స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ చరిత్ర సృష్టించింది. జోద్పూర్లో జరిగిన ‘తరంగ్ శక్తి’ సైనిక విన్యాసాల్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. సాయుధ దళాలలో జెండర్ బ్యారియర్స్ను విచ్ఛిన్నం చేసిన అద్భుతం అది.రాజస్థాన్లోని ఝున్ఝున్లో సైనిక కుటుంబంలో పుట్టిన మోహనాసింగ్కు ఫైటర్ పైలట్ కావాలని కోరిక. భారత వైమానిక దళం ఫైటర్ పైలట్ ్రపోగ్రామ్(2016)లో అవనీచతుర్వేది, భావనా కాంత్తో కలిసి చేరిన మొదటి మహిళల్లో మోహన ఒకరు. ఐఏఎఫ్ హాక్ ఎంకే.132 అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్లలో పూర్తిస్థాయి ఆపరేషన్ స్టేటస్ సాధించిన తొలి మహిళా ఫైటర్ పైలట్గా రికార్డ్ సృష్టించింది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ కాంబాట్ మోడ్స్లోప్రావీణ్యం సాధించింది. -
ఖేల్రత్న వివాదం: తొలిసారి స్పందించిన మనూ భాకర్
దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీ జాబితాలో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్, భారత షూటర్ మను భాకర్(Manu Bhaker)కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని రెపరెపలాడించిన మనును ప్రతిష్టాత్మక ఖేల్ రత్న(Major Dhyan Chand Khel Ratna) అవార్డుకు నామినెట్ చేయకపోవడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ క్రమంలో నామినీల జాబితాలో మను పేరు లేకపోవడంపై ఆమె రామ్ కిషన్ భాకర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమార్తెను షూటర్ కాకుండా, క్రికెటర్ను చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. అదేవిధంగా తన పేరు లేకపోవడంతో మను కూడా బాధపడిందని కిషన్ భాకర్ వ్యాఖ్యనించారు. తాజాగా ఈ విషయంపై మను భాకర్ తొలిసారి స్పందించారు. అవార్డుల కంటే దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే తన లక్ష్యమని మను చెప్పకొచ్చారు. "అవార్డుల గురుంచి నేను ఎప్పుడూ ఆలోచించను. ఒక అథ్లెట్గా దేశం తరపున ఆడి మరిన్ని పతకాలు తీసుకు రావడమే నా లక్ష్యం.దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అనవసరమైన ఊహాగానాలు ప్రచారం చేయవద్దు. నామినేషన్ కోసం అప్లై చేసేటప్పుడు పొరపాటు జరిగిందని అనుకుంటున్నా" ఎక్స్లో రాసుకొచ్చారు.కాగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం.. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేర్లను నామినేట్ చేసింది. ప్యారిస్ ఒలిపింక్స్-2024 షూటింగ్లో మను రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
Manu Bhaker: నేను చేసిన తప్పు అదే.. అందుకే ఇలా!
తన కూతురిని ‘షూటర్’గా తీర్చిదిద్ది తప్పుచేశామంటూ మనూ భాకర్(Manu Bhaker) తండ్రి రామ్ కిషన్ భాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను క్రికెటర్ను చేసి ఉంటే ఇలాంటి దుస్థితి ఎదురయ్యేది కాదని పేర్కొన్నారు. ఒకే ఒలింపిక్ ఎడిషన్లో రెండు పతకాలు సాధించినా సరైన గుర్తింపు దక్కడం లేదని వాపోయారు.కాగా భారత ప్రభుత్వం ప్రదానం చేసే క్రీడా అత్యుతన్నత పురస్కారం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న’(Major Dhyan Chand Khel Ratna). ఇందుకు సంబంధించిన అవార్డు కమిటీ సోమవారం నామినీల పేర్లను ప్రకటించగా.. అందులో మనూ భాకర్కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనైన మనూ తండ్రి రామ్ కిషన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నా బిడ్డ ఇంకేం చేయాలి?‘‘ఇప్పటి వరకు భారత్ తరఫున ఎవరూ సాధించని ఘనత నా కూతురు సాధించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇంతకంటే దేశం కోసం నా బిడ్డ ఇంకేం చేయాలి? ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించాలి కదా!.పతకాలు గెలవకుంటేనే బాగుండేదిఈ విషయం గురించి నేను మనూతో మాట్లాడాను. తన మనసంతా బాధతో నిండి ఉంది. ‘నేనసలు దేశం తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకాలు సాధించకపోయి ఉంటే.. ఈ బాధ ఉండేదే కాదు. అసలు క్రీడాకారిణిని కాకపోయే ఉంటే ఇంకా బాగుండేది’ అని తను నాతో అన్నది’’ అని రామ్ కిషన్ భాకర్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తమ ఆవేదనను పంచుకున్నారు.బాహ్య శక్తుల ప్రభావం ఉంది!ఇక దేశానికి ఇంత గొప్ప పేరు తెచ్చినా గుర్తింపు దక్కకపోవడం చూస్తుంటే.. కమిటీపై బాహ్య శక్తుల ప్రభావం లేదంటే నమ్మబుద్ధి కావడం లేదని రామ్ కిషన్ భాకర్ అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె విషయంలో ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.కాగా హర్యానాకు చెందిన రామ్ కిషన్ భాకర్ మర్చెంట్ నేవీ చీఫ్ ఇంజనీర్. ఇదిలా ఉంటే.. టోక్యో ఒలింపిక్స్లో తృటిలో పతకం చేజార్చుకున్న మనూ భాకర్.. ప్యారిస్ ఒలింపిక్స్-2024(Paris Olympics 2024)లో రెండు మెడల్స్ గెలిచింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో కాంస్యాలు కైవసం చేసుకుంది. తద్వారా స్వాతంత్ర్యం తర్వాత భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన మొట్టమొదటి ప్లేయర్గా అరుదైన ఘనత సాధించింది.చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
అవార్డుల కోసం అడుక్కోవాలా?: మండిపడ్డ మనూ భాకర్ తండ్రి
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీల జాబితాలో తన కూతురు పేరు లేకపోవడం పట్ల షూటర్ మనూ భాకర్ తండ్రి రామ్ కిషన్ భాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్ పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్లేయర్ కూడా అవార్డుల కోసం అడుక్కోవాలా?.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా క్రీడాకారులను సమున్నత రీతిలో గౌరవించేందుకు భారత ప్రభుత్వం ఏటా పురస్కారాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అన్నింటికంటే అత్యున్నత పురస్కారం. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యులతో కూడిన జాతీయ స్పోర్ట్స్ డే కమిటీ ఖేల్ రత్న అవార్డుల నామినీల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.అయితే, ఇందులో మనూ భాకర్కు మాత్రం చోటు దక్కలేదు. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్, డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేర్లను అవార్డు కోసం నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వివాదం చెలరేగగా.. మనూ భాకర్ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా శాఖ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.అవార్డుల కోసం అడుక్కోవాలా? ఈ నేపథ్యంలో మనూ తండ్రి రామ్ కిషన్ భాకర్ ఘాటుగా స్పందించారు. ‘‘ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచినప్పటికీ.. అవార్డుల కోసం అడుక్కోవాలా? ఒక ప్రభుత్వ అధికారి నిర్ణయం తీసుకుంటే.. కమిటీ సభ్యులంతా సైలెంట్గా ఉంటారా? వారు తమ అభిప్రాయాలను బయటకు చెప్పరా? అథ్లెట్లను ప్రోత్సహించే విధానం ఇదేనా? నాకైతే ఏం అర్థం కావడం లేదు.మేము అవార్డు కోసం అప్లై చేశాము. కానీ కమిటీ నుంచి ఎలాంటి సమాధానం లేదు. పిల్లలను తల్లిదండ్రులు క్రీడల్లో ప్రోత్సహించాలా లేదంటే.. ప్రభుత్వంలో ఐఆర్ఎస్ ఆఫీసర్లు అవ్వమని బలవంతం చేయాలా?’’ అంటూ స్పోర్ట్స్ తక్తో మాట్లాడుతూ రామ్ కిషన్ భాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్ కాంస్య పతకాలు సాధించింది. తద్వారా స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్ ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్గా 22 ఏళ్ల ఈ హర్యానా అథ్లెట్ చరిత్ర సృష్టించింది. -
పిస్టల్ వదిలి.. వయోలిన్ చేతబట్టి (ఫొటోలు)
-
‘ప్రతిసారీ మెడల్స్ అవసరమా?’.. మనూ స్ట్రాంగ్ కౌంటర్
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్పై భారత షూటర్, ఒలింపిక్ పతకాల విజేత మనూ భాకర్ స్పందించింది. తాను హాజరవుతున్న ప్రతీ ఈవెంట్కు మెడల్స్ తీసుకువెళ్లడానికి గల కారణాన్ని వెల్లడించింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ఈ హర్యానా షూటర్ రెండు పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో.. అదే విధంగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి.. కాంస్యాలు కైవసం చేసుకుంది. తద్వారా ఆధునిక ఒలింపిక్స్ సింగిల్ ఎడిషన్లో రెండు మెడల్స్ గెలిచిన భారత తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. దీంతో ఈ హర్యానా షూటర్పై ప్రశంసల వర్షం కురిసింది.ఘన స్వాగతంతో పాటు సత్కారాలుస్వదేశంలో అడుగుపెట్టగానే మనూకు ఘన స్వాగతంతో పాటు సత్కారాలు లభించాయి. ఆ తర్వాత దేశంలోని రాజకీయ, క్రీడా ప్రముఖులను కలిసిన మనూ తన మెడల్స్ను వారికి చూపించి మురిసిపోయింది. ఇక దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన క్రమంలో చాలా మంది తమ ఈవెంట్లకు మనూ భాకర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ప్రతిచోటకు మెడల్స్ తీసుకువెళ్లడం అవసరమా?ఆ సమయంలోనూ ఈ యువ షూటర్ తన పతకాలను అక్కడ ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మనూ భాకర్పై ట్రోల్స్ చేశారు. ‘‘కాంస్యం గెలిస్తేనే ఇంతలా హంగామా చేస్తున్నారు. మరి స్వర్ణం గెలిచి ఉంటే పరిస్థితి ఇంకెలా ఉండేదో! అయినా ప్రతిచోటకు మెడల్స్ తీసుకువెళ్లడం అవసరమా? పారాలింపిక్స్లో పసిడి పతకాలు సాధించిన వాళ్లకు ఏమాత్రం గుర్తింపు లేదు. మనూకు మాత్రం ఫుల్క్రేజ్’’ అంటూ కామెంట్లు చేశారు. తాజాగా ఈ విషయంపై మనూ భాకర్ స్పందించింది. ఇందులో తప్పేం ఉందో నాకైతే అర్థం కావడంలేదు‘‘అవును.. నేను ప్రతి చోటకూ మెడల్స్ తీసుకువెళ్తా. అయినా.. తీసుకువెళ్లకూడదని చెప్పేందుకు కారణాలేమైనా ఉన్నాయా?.. నిజానికి నన్ను ఈవెంట్స్కు ఆహ్వానించే ప్రతి ఒక్కరు పతకాలు తీసుకురావాలని కోరుతున్నారు.ఒలింపిక్స్ మెడల్స్ను ప్రతక్ష్యంగా చూడాలని ఆరాటపడుతున్నారు. ఆర్గనైజర్ల అభ్యర్థన మేరకే నేను మెడల్స్ వెంట తీసుకువెళ్తున్నా. ఇందులో తప్పేం ఉందో నాకైతే అర్థం కావడంలేదు’’ అని 22 ఏళ్ల మనూ భాకర్ ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.చదవండి: అందరూ మహిళలే... -
నీరజ్ చోప్రా భావోద్వేగం.. స్పందించిన మనూ భాకర్
తాను ఈ ఏడాది ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని.. తిరిగి పూర్తి ఫిట్నెస్తో మళ్లీ బరిలోకి దిగుతానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. 2024లో తాను పాల్గొనబోయే చివరి టోర్నీని విజయంతో ముగించాలనకున్నానని.. అయితే, అంచనాలు అందుకోలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. పోటీకి ముందు తాను గాయపడ్డాడని.. అయినప్పటికీ తన టీమ్ సహకారం వల్ల రెండో స్థానంలో నిలవగలిగానని పేర్కొన్నాడు.కాగా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో నీరజ్ చోప్రా రెండో స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. బ్రసెల్స్లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో గ్రెనెడాకు చెందిన వరల్డ్ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ విజేతగా నిలిచాడు. అతడే టైటిల్ విన్నర్పీటర్స్ జావెలిన్ను 87.87 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. నీరజ్ ఈటెను 87.86 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో రెండో స్థానంలో నిలిచిన అతడికి ప్రైజ్మనీగా 12 వేల డాలర్లు (రూ. 10 లక్షలు) లభించాయి.ఇక జర్మనీకి చెందిన జూలియన్ వెబెర్ 85.97 మీటర్లు జావెలిన్ను విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్లోనూ రెండోస్థానంలోకాగా ఈ ఏడాది నీరజ్ మెరుగ్గానే రాణించాడు. అయితే, ఒలింపిక్స్లో రెండో స్వర్ణం గెలవాలన్న అతడి కల నెరవేరలేదు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్.. అర్షద్ నదీం పసిడి పతకం గెలవగా.. నీరజ్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక డైమండ్ లీగ్లోనైనా అగ్రస్థానంలో నిలుస్తాడనుకుంటే.. అక్కడే రెండో స్థానమే దక్కింది.అయితే, ఓవరాల్గా నీరజ్ డైమండ్ లీగ్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో టాప్–3లో నిలువడం ఇది మూడోసారి. 2022 గ్రాండ్ ఫైనల్లో విజేతగా నిలిచిన నీరజ్... 2023 గ్రాండ్ ఫైనల్లో రెండో స్థానాన్ని పొందాడు. ఈసారి డైమండ్ లీగ్ ఫైనల్లో ఈ సీజన్ మొత్తం నీరజ్ నిలకడగా రాణించాడు. ఆరు టోర్నీల్లో పోటీపడి ఐదింటిలో రెండో స్థానాన్ని, ఒక టోర్నీలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.అథ్లెట్గా.. వ్యక్తిగా మరింత మెరుగయ్యానుఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘ఈ ఏడాది మిశ్రమ భావనలతో ముగిసింది. సోమవారం.. నేను గాయపడ్డాను. నా ఎడమఅరచేతిలోని ఎముక ఫాక్చర్ అయినట్లు ఎక్స్ రే ద్వారా తేలింది. పోటీకి ముందు ఇలా కావడం తీవ్రంగా బాధించింది. అయితే, నా టీమ్ నన్ను బ్రసెల్స్ లీగ్లో పాల్గొనేలా సమాయత్తం చేసింది.ఈ ఏడాది ఇదే చివరి కాంపిటీషన్. టైటిల్తో ముగించాలని కోరుకున్నా. కానీ అలా జరుగలేదు. ఏదేమైనా ఈ ఏడాది ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నాను. త్వరలోనే మళ్లీ పూర్తి ఫిట్నెస్తో తిరిగి వస్తా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఈ ఏడాది అథ్లెట్గా.. వ్యక్తిగా మరింత మెరుగయ్యాను. 2025లో కలుసుకుందాం’’ అని ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ఈ క్రమంలో.. ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకాల విజేత, షూటర్ మనూ భాకర్ బదులిస్తూ.. నీరజ్ చోప్రాను అభినందించింది. స్పందించిన మనూ భాకర్‘‘2024 సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నావు నీరజ్ చోప్రా. నువ్వు త్వరగా కోలుకోవాలని.. వచ్చే ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని మనూ భాకర్ ఆకాంక్షించింది.కాగా ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల తర్వాత నీరజ్ చోప్రా.. మనూ భాకర్, ఆమె తల్లితో ముచ్చటించిన దృశ్యాలు వైరలైన విషయం తెలిసిందే. దీంతో ఈ హర్యానా అథ్లెట్ల మధ్య మంచి అనుబంధం ఉందంటూ వార్తలు రాగా.. మనూ భాకర్ తండ్రి స్పందిస్తూ.. నీరజ్ తమ కుమారుడి లాంటి వాడని పేర్కొన్నారు. చదవండి: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా... -
మను భాకర్కు విశ్రాంతి
న్యూఢిల్లీ: వచ్చే నెల భారత్లో జరిగే సీజన్ ముగింపు టోర్నమెంట్ ప్రపంచకప్ ఫైనల్స్లో మను భాకర్ పాల్గొనడం లేదు. ఆమె మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. పారిస్ ఒలింపిక్స్లో ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) గురువారం 23 మంది సభ్యుల భారత షూటింగ్ జట్టును ఎంపిక చేసింది. ఇందులో పారిస్కు వెళ్లొచ్చిన తొమ్మిది మంది షూటర్లున్నారు. అయితే మొత్తం 23 మందిలో ఒక్క రిథమ్ సాంగ్వాన్ మాత్రమే రెండు ఈవెంట్లలో పోటీపడనుంది. ఆమె మహిళల 10 మీటర్ల, 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో తలపడుతుంది. మిగతా వారంతా ఒక ఈవెంట్కే పరిమితం కానున్నారు. వచ్చే నెల 13 నుంచి 18 వరకు ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో ప్రపంచకప్ షూటింగ్ పోటీలు జరుగనున్నాయి. రైఫిల్, పిస్టల్, షాట్గన్ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు. -
సచిన్ టెండుల్కర్ను కలిసిన మనూ భాకర్ (ఫొటోలు)
-
ఆడుకుందాం రండి
‘ఎప్పుడూ ఆటలేనా... చదువుకోవచ్చు కదా’ అనే తల్లిదండ్రులే ఎక్కువ. ‘ఎప్పుడూ చదువేనా... ఆటలు కూడా ఆడవచ్చు కదా’ అనే తల్లిదండ్రులు అతి తక్కువ. చదువు విషయంలోనే కాదు ఆటల్లో కూడా పిల్లలను ్రపోత్సహిస్తే చారిత్రక అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి బలమైన ఉదాహరణ... స్టార్ షూటర్ మను బాకర్. ‘మీకు డాక్టర్ లేదా ఇంజినీర్ కావాలని లేదా... అయితే ఆటల ప్రపంచంలోకి రండి. అదొక అద్భుత ప్రపంచం’ అంటుంది ఒలింపిక్స్లో డబుల్–మెడల్ గెల్చుకున్న మను బాకర్. విద్యార్థుల దృష్టిని ఆటలపై మళ్లించడానికి నేషనల్ టూర్ చేస్తోంది...తన పర్యటనలో భాగంగా చెన్నైలోని వేలమ్మళ్ నెక్సెస్ స్కూల్కు వెళ్లిన మను బాకర్ ఆటలకు ఉండే శక్తి ఏమిటో ఆసక్తికరంగా చెప్పింది. ‘ఆటలు అనే దారి వైపు వచ్చి చూడండి. ఆ దారిలో ముందుకు వెళుతున్న కొద్దీ మీలో ఉత్సాహం, శక్తి అంతకంతకూ పెరుగుతూ పోతాయి’ అంటుంది మను.‘టోక్యో ఒలింపిక్స్లో నా గురి తప్పింది. ఓటమి పలకరించింది. అలా అని నిరాశలోనే ఉండిపోలేదు. ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి అంతే సహజం. గెలుపు ఓటములు ఆటలో శాశ్వతం కాదు. ఆటలో ఉన్న అందం, అద్భుతం ఇదే’ అంటుంది మను.‘డ్రీమ్ బిగ్’ అని మను అన్నప్పుడు పిల్లలు చప్పట్లు కొట్టారు. ‘మనం ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా అనేది పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుందంటూ తన గత అనుభవాలను విద్యార్థులతో పంచుకుంది.‘ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకే ఆటలు సరిపోతాయి. పేద, మధ్యతరగతి పిల్లలకు కష్టం’ అనే అపోహను తోసిపుచ్చింది మను. ‘ఆత్మస్థైర్యం నుంచి ఆర్థికసహాయం వరకు క్రీడా ప్రపంచంలో ఏది కష్టం కాదు. మీరు పెద్ద కల కంటే పెద్ద విజయాన్ని సాధిస్తారు. పేదరికం మీకు ఎప్పుడూ అడ్డు కాదు. ఈ విషయాన్ని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది’ అంటుంది మను బాకర్. ‘మీ ఇన్స్పిరేషన్ ఎవరు?’ అనే ప్రశ్నకు– ‘ఇంకెవరు... మా అమ్మే’ అని చెప్పింది మను. ‘ఎప్పుడూ ఆటలేనా!’ అని ఎప్పుడూ అనేది కాదు ఆమె. ఆటల్లో కూతురు చూపుతున్న ప్రతిభకు సంతోషించేది.‘క్రీడల్లో పిల్లలు రాణించడం, పెద్దస్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది’ అంటుంది మను బాకర్.ఆటలు ఇంకా ఏం చేస్తాయి? మను మాటల్లో చె΄్పాలంటే ప్రపంచాన్ని చూపిస్తాయి. ‘షూటింగ్ కెరీర్ వల్ల ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను. దీనివల్ల రకరకాల మనుషులు, రకరకాల సంస్కృతులు, చరిత్ర, పోరాటాలు... ఒక్కటా రెండా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. నేను ఆటల్లోకి రాకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు’ అంటుంది మను.‘మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఎక్కడికి వెళ్లాలనేది ముఖ్యం’ అంటారు పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన విజేతలు. ఇదే విషయాన్ని పిల్లలకు చెబుతుంటుంది మను.‘మేము పేదవాళ్లం, నాకు ఇంగ్లీష్ రాదు, నేను బలహీనంగా ఉంటాను, ఇతరులతో పోటీ పడగలనా... ఇలాంటి ఆలోచనలేవీ పెట్టుకోవద్దు. ఎన్ని పరిమితులు ఉన్నా కష్టపడే తత్వం, అంకితభావం ఉంటే మన ప్రయాణానికి అవేమీ అడ్డు కాదు. ప్రయాణం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం. నా విషయానికి వస్తే... మొదట్లో నాకూ ఇంగ్లీష్ పెద్దగా రాదు, ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఏమీ తెలియదు... అనుకుంటే అక్కడే ఉండిపోతాం. తెలుసుకుంటాను’... అనే పట్టుదల ఉంటే తెలుసుకోగలం. నేను ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల వరకు ఎవరితోనైనా మాట్లాడవచ్చు’ అంటుంది మను.‘మీకు ఎన్నో కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. అవేమీ మీకు ఆసక్తిగా లేకపోతే ఆటల ప్రపంచంలోకి రండి’ అని విద్యార్థులను ఆహ్వానిస్తోంది మను బాకర్. ఆమె మాటల స్ఫూర్తి ఎంతోమందికి విజయ మంత్రం కావాలని ఆశిద్దాం. -
లీలా ప్యాలెస్లో మనూ భాకర్కు అపూర్వ స్వాగతం
చెన్నైలోని సుప్రసిద్ధ ఫైవ్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్లో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్కు అపూర్వ స్వాగతం లభించింది. మనూ గౌరవార్థం హోటల్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సన్మానించింది. హోటల్ రూమ్స్లో టవల్స్, పిల్లోస్, న్యాప్కిన్స్ ఇతరత్రా వస్తువులపై మనూ పేరును ముద్రించారు హోటల్ నిర్వహకులు. హోటల్ సిబ్బంది మనూను సంప్రదాయ బద్ధంగా హోటల్లోకి ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. The Leela Palace Chennai welcomes Manu Bhaker, the Olympic Champion ! Just WoW pic.twitter.com/Dc2lhQpnE4— Megh Updates 🚨™ (@MeghUpdates) August 27, 2024హోటల్ నిర్వహకులు మనూ కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. లీలా ప్యాలెస్ ఆతిథ్యానికి మనూ పరవశించి పోయింది. మనూ లీలా ప్యాలెస్లో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. కాగా, మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్ రెండు పతకాలు సాధించాక దేశవ్యాప్తంగా చాలామంది ఆమెను తమతమ స్థానాలకు ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే మనూ చెన్నైలోని ఓ కాలేజీలో పర్యటించింది. అక్కడ కూడా కాలేజీ యాజమాన్యం మనూను ఘనంగా సన్మానించింది. ఒలింపిక్స్లో పతకాలు సాధించాక మనూకు దేశవ్యాప్తంగా పిచ్చి క్రేజ్ వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్లినా జనాలు సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడుతున్నారు. మనూ పారిస్ ఒలింపిక్స్లో షూటింగ్లోని రెండు ఈవెంట్స్లో కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
క్రీడలను కెరీర్గా ఎంచుకోండి, జీవితం అందంగా ఉంటుంది: మనూ భాకర్
చెన్నై: పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత మహిళా షూటర్ మనూ భాకర్ క్రీడారంగంలోనూ అందమైన కెరీర్ ఉంటుందని చెప్పింది. డాక్టర్లు, ఇంజినీర్లే కాదు క్రీడాకారులుగా కూడా అందమైన జీవితాన్ని గడపొచ్చని 22 ఏళ్ల మనూ చెన్నై విద్యార్థులకు సూచింది. మంగళవారం వేళమ్మాల్ నెక్సస్ స్కూల్ మనూను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల క్రితం టోక్యోలో ఎదురైనా పరాభవాన్ని పారిస్లో రెండు పతకాలతో అధిగమించిన తీరును వివరించింది. ఓటమిని రుచి చూసి... ‘ప్రపంచ రెండో ర్యాంక్ షూటర్గా టోక్యోకు వెళ్లాను. కానీ ఒలింపిక్స్లో నా గురి అస్సలు కుదర్లేదు. పాల్గొన్న ప్రతి ఈవెంట్లోనూ ఎదురైన చేదు అనుభవం కొన్నాళ్లు నా ప్రయాణాన్ని కష్టంగా మార్చింది. అయినా నేనెప్పుడూ దాన్నే తలచుకొని దిగులుపడలేదు. ఓటమిని రుచి చూసిన నాకు విజయం దక్కుతుందని తెలుసు. స్పోర్ట్స్ అంటేనే అది! ఒకదాంట్లో పరాజయం, మరోదాంట్లో విజయం సహజం. అయితే ఇవన్నీ కూడా కష్టపడితేనే సాధ్యం’ అని పేర్కొంది. మనం కనే పెద్ద పెద్ద కలల్ని సాకారం చేసుకోవాలంటే ఆ స్థాయిలో కఠోరంగా శ్రమించాల్సిందేనని మనూ తెలిపింది. లక్ష్యాన్ని పెట్టుకుంటే దాని కోసం చెమటోడ్చాలని, ఒక్కసారిగా అవి సాకారం కాకపోవచ్చని... కానీ అంతమాత్రాన నిరాశ చెందకుండా లక్ష్యం కోసం నిరంతరం పనిచేయాలని వివరించింది. Badhiya pradarshani chal rahi is desh main Bronze medal ki. pic.twitter.com/sX2FpS4vZX— Prayag (@theprayagtiwari) August 20, 2024ఆత్మవిశాస్వంతో... ‘నేనెప్పుడు కూడా పోటీల్లో జయాపజయాల గురించి పట్టించుకోలేదు. ప్రతీసారి ఆత్మవిశ్వాసంతో ఉంటాను. ప్రతీ పరీక్షను ఆ ఆత్మవిశ్వాసంతోనే నెట్టుకొస్తాను. మనకు కెరీర్లో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు, ప్రత్యామ్నాయాలుంటాయి. చాలామంది డాక్టరో, ఇంజనీర్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనుకుంటారు. కానీ క్రీడల్లోనూ అపారమైన అవకాశాలున్నాయన్న సంగతి గుర్తుంచుకోండి. ఆర్థికపరమైన మద్దతు కావొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు. క్రీడల్లో అవన్నీ దక్కుతాయి’ అని మనూ భాకర్ వివరించింది. అమ్మ చూపిన దారి... తనకు తన అమ్మ స్ఫూర్తి అని ఆమె చూపించిన దారే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పింది. అడుగడుగునా తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేకపోతే పిల్లలకు ఇవేవి సాధ్యం కానేకావని తెలిపింది. ‘ఏ క్రీడయినా సరై బీజం పడేది ఇంట్లోనే! ఆ తర్వాత స్కూల్లో మొదలవుతుంది. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల భవితకు చక్కని బాట వేయడంలో కీలక భూమిక పోషిస్తారు’ అని వినమ్రంగా చెప్పింది. మన సంస్కృతి, నేపథ్యం ఏదైనా మనం ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకూడదని, చిన్న చిన్న అవరోధాలు ఎదురైనంత మాత్రాన ఆగిపోకూడదని స్ఫూర్తివంతమైన మాటలతో విద్యార్థులను మనూ ఉత్తేజపరిచింది. మన ప్రదర్శన బాలేకపోయినా, కొన్నిసార్లు విఫలమైనా, క్రీడల్లో పతకాలు గెలవలేకపోయినా, పరీక్షల్లో పాస్ కాకపోయినా ఎట్టిపరిస్థితుల్లోనూ కుంగిపోకూడదని ఉద్బోధించింది. పారిస్ ఒలింపిక్స్లో మనూ మహిళల 10 మీటర్ల ఎయిర్పిస్టల్, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు కాంస్య పతకాలు గెలుపొందింది. సరదాగా ఆడి పాడిన మనూ..కార్యక్రమం ముగింపు సందర్భంగా మనూ విద్యార్థులతో కలిసి ప్రముఖ హిందీ పాటకు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. -
సౌరభ్ చౌదరి ఎక్కడ? రైఫిల్ సమాఖ్యపై మండిపడ్డ మను కోచ్
ప్యారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ షూటర్ మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం విధితమే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ జస్పాల్ రాణా.. ఒలింపిక్స్ భారత షూటర్ల సెలక్షన్ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్ విధానాల వల్ల యువ షూటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రాణా అసహనం వ్యక్తం చేశాడు. "ఫెడరేషన్ సెలక్షన్ పాలసీ ప్రతీ ఆరు నెలలకోసారి మారుతుంది. ఈ విషయం గురించి ఇప్పటికే క్రీడా మంత్రితో నేను మాట్లాడాను. ఫెడరేషన్ నుంచి సెలక్షన్ పాలసీని తెప్పించుకోని, ఓసారి పరిశీలించాలని కోరాను.అది చూశాక వారు ఏ నిర్ణయం తీసుకున్న మేము కట్టుబడి ఉంటాము. ఆ తర్వాత ఈ విషయం గురించి అస్సలు చర్చించం. షూటర్లకు అండగా నిలిస్తే కచ్చితంగా వారి ప్రదర్శనలలో మనం మార్పులు చూస్తాం. భారత షూటింగ్ ఫెడరేషన్ విధి విధానాల వల్ల ఎంతో మంది యువ షూటర్లు ముందుకు వెళ్లలేకపోతున్నారు. భారత్లో అత్యుత్తమ షూటర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి సపోర్ట్గా నిలిచే వారు ఎవరూ లేరు. పిస్టల్ షూటర్ సౌరభ్ చౌదరి ఎక్కడ? ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ పిస్టల్ షూటర్ జితూ రాయ్ ఎక్కడ? వీరిగురించి ఎవరూ మాట్లడటం లేదు. పారిస్లో నాలుగో స్థానంలో నిలిచిన (10మీ ఎయిర్ రైఫిల్ షూటర్) అర్జున్ బాబుటా గురించి అస్సలు చర్చే లేదు. అతను స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయాడు. మళ్లీ అతడిని ఈ ప్లాట్ఫామ్కు తీసుకు రావాలని ఎవరూ ఆలోచించడం లేదని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్పాల్ రాణా పేర్కొన్నాడు. -
కత్తిలాంటి చూపు కోసం... యుద్ధకళ నేర్చుకున్న మను భాకర్
యుద్ధంలో గెలవాలంటే దేహం ఒక ఆయుధంగా మారాలి . దృష్టి, ఆలోచన ఆయుధంగా మారాలి. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్ గురి నిలవడానికి ప్రత్యర్థులను గెలవడానికి ‘థాంగ్ తా’ను నేర్చుకుంది. కేరళ కలరిపట్టులాగా మణిపూర్కు చెందిన ఈ యుద్ధకళ మనసును లగ్నం చేసి దేహాన్ని ఉద్యుక్తం చేయడంతో సాయం చేస్తుంది.‘ఒలింపిక్స్లో పతకం సాధించడం పెద్ద లక్ష్యం. ఇందుకోసం అన్ని విధాలా సిద్ధం కావాలి. ఇది ఎవరిమీదో ఆధారపడే విషయం కాదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నేను స్త్రీని కాబట్టి పేలవమైన ప్రదర్శన చేసినా సాకులు చెప్పొచ్చులే అనుకోకూడదు. అందుకే నేను షూటర్గా గట్టిగా నిలవడానికి అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అందులో థాంగ్ తా నేర్చుకోవడం ఒకటి’ అంది మను భాకర్.పారిస్ ఒలింపిక్స్లో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళా షూటర్గా, ఒకే సీజన్లో రెండు పతకాలు సాధించిన మహిళా షూటర్గా ఆమె చరిత్ర సృష్టించింది. అయితే గెలుపు అంత సులభంగా రాదు. ప్రపంచ వేదికపై ప్రత్యర్థులతో తలపడాలంటే ఎంతో ఆందోళన ఉంటుంది. ప్రాక్టీస్లో, వేదిక బయట ఎంత గొప్పగా రాణించినా సరిగ్గా నిర్దిష్ట క్షణంలో తొణకక బెణకక పోటీ పడినప్పుడే గెలుపు సాధ్యం. ఇందుకు కఠోర సాధన అవసరం.యోగా, గుర్రపు స్వారీ, థాంగ్ తాషూటర్గా రాణించడానికి శరీరం, మనసు రాటుదేలి ఉండేందుకు మను భాకర్ సంవత్సరాల తరబడి శారీరక, మానసిక శ్రమ చేసింది.యోగాతో మనసుకు శిక్షణ ఇస్తే గుర్రపు స్వారీతో శరీరంలో చురుకుదనం తెచ్చుకుంది. గురి వైపు తుపాకీ పేల్చడం అంటే గుర్రాన్ని లక్ష్యం వైపు ఉరకెత్తించడమే. ప్రాణం ఉన్న అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకుంటే ప్రాణం లేని తుపాకీ అదుపులోకి వస్తుంది. అయితే ఇవి మాత్రమే చాలవు అనుకుంది మను భాకర్. అందుకే థాంగ్ తా నేర్చుకుంది. గురువుకు లోబడిమను భాకర్ కోచ్ జస్పాల్ రాణ. మనలో ఎంత ప్రతిభ ఉన్నా గురు ముఖతా నేర్చుకున్నప్పుడే విజయం సిద్ధిస్తుంది. గురువు దగ్గర నేర్చుకోవాలంటే గురువు ఆధిపత్యాన్ని అంగీకరించాలి. చాలామంది శిష్యులు ఆ పని సంపూర్ణంగా చేయలేరు. ‘థాంగ్ తా’లో మొదట నేర్పేది శిష్యుడు తన అహాన్ని వీడి గురువుకు లోబడటమే. కత్తి, బల్లెం, డాలు ఉపయోగించి నేర్పే ఈ యుద్ధకళలో గురువు చెప్పిందే వేదం అనుకునేలా ఉండాలి. క్రమశిక్షణ, నిజాయితీ, గౌరవం ఈ కళలో ముఖ్యం. షూటింగ్ సాధనలో గురువు దగ్గర క్రమశిక్షణ తో, నిజాయితీతో, నేర్పే విద్యను గౌరవిస్తూ నేర్చుకోవడంలో మను భాకర్కు థాంగ్ తా ఉపయోగపడింది.తెగలను కాపాడుకునేందుకు... మణిపూర్ తెగల యుద్ధకళ ‘హ్యుయెన్ లల్లాంగ్’. ఇందులో కత్తి, బరిసెలతో చేసేది థాంగ్ తా. ఆయుధాలు లేకుండా చేసేది సరిత్ సరక్. బయట తెగలు వచ్చి స్వీయ తెగలను రూపుమాపకుండా ఉండేందుకు పూర్వం మణిపూర్లో ప్రతి ఒక్క పురుషుడు థాంగ్ తాను నేర్చుకుని సిద్ధంగా ఉండేవాడు. స్త్రీలు కూడా నేర్చుకునేవారు. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయి క్రీడగా మారింది. చెక్క కత్తి, డాలుతో ఈ యుద్ధక్రీడను సాధన చేస్తున్నారు. భవిష్యత్తులో దీనిని ఒలింపిక్స్ కమిటీ గుర్తిస్తుందనే ఆశ ఉంది. ‘ఎంత వీరులైతే అంత వినమ్రులవుతారు ఈ యుద్ధ కళలో’ అంటారు మణిపూర్ గురువులు. మను భాకర్ గెలవడానికి ఆమెలోని వినమ్రత కూడా ఒక కారణం కావచ్చు. -
'ఈ సినిమాకు ఒలింపిక్ మెడల్ ఇవ్వాల్సిందే'.. మను భాకర్ పోస్ట్ వైరల్!
ఇటీవల పారిస్లో ముగిసిన ఒలింపిక్స్లో ఏకంగా రెండు పతకాలు సాధించిన భారత స్టార్ షూటర్ మను భాకర్. తొలిసారి రెండు కాంస్య పతకాలు గెలిచి అందరి మనసులను గెలుచుకుంది. తాజాగా ఆమె ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఒక అథ్లెట్ పాత్రలో నటించడం అంత సులభం కాదని ఆమె అన్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? హీరో ఎవరు? అనే వివరాలేంటో చూద్దాం.బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'చందు ఛాంపియన్'. మొదటి పారాలింపిక్ స్వర్ణపతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా రాబట్టింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా చందు ఛాంపియన్ వీక్షించిన మనుభాకర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే మను భాకర్ చేసిన పోస్ట్కు హీరో కార్తీక్ ఆర్యన్ రిప్లై ఇచ్చారు. మీలాంటి నిజమైన ఛాంపియన్ మా సినిమాపై ప్రశంసలు కురిపించడం అద్భుతమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఒలింపిక్స్లో రాణించారని కొనియాడారు. ప్యార్ కా పంచనామా సినిమాతో కెరీర్ కార్తీక్ ఆర్యన్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. -
మరోసారి వార్తల్లో నీరజ్ చోప్రా, మనూ భాకర్.. కారణం ఇదే! (ఫొటోలు)
-
నీరజ్తో మనూ పెళ్లా?.. షూటర్ తండ్రి స్పందన
ప్యారిస్ ఒలింపిక్స్-2024 పతక విజేతలు నీరజ్ చోప్రా- మనూ భాకర్ గురించి జరుగుతున్న ప్రచారంపై మనూ తండ్రి రామ్ కిషన్ భాకర్ స్పందించారు. మనూకు ఇప్పట్లో పెళ్లి చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. కాగా విశ్వ క్రీడల తాజా ఎడిషన్లో షూటర్ మనూ భాకర్ రెండు కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించిన 22 ఏళ్ల మనూ.. అదే క్రీడాంశంలో సరబ్జోత్ సింగ్తో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో కంచు పతకం సొంతం చేసుకుంది. తద్వారా ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన భారత తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ నాలుగో స్థానంలో నిలిచి.. మూడో పతకానికి అడుగుదూరంలో నిలిచిపోయింది.పెళ్లి చేసుకోబోతున్నారంటూ వదంతులుఈ నేపథ్యంలో మనూ భాకర్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. మరోవైపు.. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. టోక్యోలో స్వర్ణం గెలిచిన 26 ఏళ్ల నీరజ్ ఈసారి మాత్రం రెండోస్థానానికే పరిమితం కావడం కాస్త నిరాశ కలిగించేదే అయినా.. ప్యారిస్లో భారత్కు ఏకైక రజతం అందించిన అథ్లెట్గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల అనంతరం నీరజ్ చోప్రా- మనూ భాకర్ మాట్లాడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. ఇందులో వీరిద్దరు కాస్త సిగ్గుపడుతున్నట్లుగా కనిపించగా.. మనూ తల్లి సుమేధా భాకర్ ఫొటోలు క్లిక్మనిపించారు. అంతేకాదు.. అనంతరం నీరజ్ దగ్గరకు వచ్చిన సుమేధా.. అతడి చేయిని తన చేతుల్లోకి తీసుకుని మాటివ్వు అన్నట్లుగా తలపై పెట్టుకున్నారు. ఆ తర్వాత మనూ తండ్రి రామ్ కిషన్ కూడా అక్కడికి వచ్చారు. నీరజ్ ఆయన పాదాలకు నమస్కరించగా.. ఆయన అతడి వెన్నుతట్టారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో... ఈ హర్యానా అథ్లెట్లు పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇందుకు మనూ తల్లిదండ్రుల అనుమతి కూడా లభించిందంటూ వదంతులు పుట్టుకొచ్చాయి. వాళ్లది తల్లీకొడుకుల అనుబంధంఈ విషయంపై స్పందించిన మనూ తండ్రి రామ్ కిషన్ దైనిక్ భాస్కర్తో మాట్లాడుతూ.. ‘‘మనూ ఇంకా చిన్నపిల్ల. తనకు ఇంకా పెళ్లి చేసే ఈడు కూడా రాలేదు. ఇప్పట్లో అసలు ఆ విషయం గురించే మేము ఆలోచించడం లేదు.ఇక మనూ వాళ్ల అమ్మ నీరజ్ను తన కుమారుడిలాగే భావిస్తుంది. వాళ్లిద్దరి మధ్య తల్లీకొడుకుల అనుబంధం ఉంది’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. నీరజ్ చోప్రా అంకుల్ కూడా ఈ విషయం గురించి స్పందించారు. ‘‘నీరజ్ పతకం తీసుకురావడం దేశమంతా చూసింది కదా. అలాగే అతడి పెళ్లి కూడా అందరికి తెలిసే జరుగుతుంది’’ అని స్పష్టం చేశారు.చదవండి: Neeraj Chopra: రూ. 52 లక్షల వాచ్!.. కోట్ల ఆస్తి: కష్టపడి పైకొచ్చిన నీరజ్ చోప్రాNeeraj Chopra can be seen talking to the Manu Bhaker's mother and into the other video, Neeraj Chopra and Manu Bhaker are discussing closely..!I'm sorry but I don't know why I am getting interested in Manu Bhaker and Neeraj Chopra 😜 pic.twitter.com/uymONMo8sj— Priyanshu Kumar (@priyanshu__63) August 11, 2024 -
మాటివ్వు: నీరజ్ చోప్రాతో మనూ భాకర్ తల్లి
భారత అథ్లెట్లు మనూ భాకర్, నీరజ్ చోప్రాకు సంబంధించిన ఆసక్తికర వీడియో వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు పరస్పరం మాట్లాడుకుంటూ ఉండగా.. మనూ తల్లి ఫొటోలు తీశారు. అంతేకాదు.. ఆ తర్వాత నీరజ్ చోప్రా చేయి తన తలమీద పెట్టుకుని ఒట్టు వేయించుకున్నారు కూడా!ప్యారిస్ ఒలింపిక్స్-2024లో షూటర్ మనూ భాకర్ భారత్ పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కంచు పతకం గెలిచిన 22 ఏళ్ల ఈ హర్యానా అమ్మాయి.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి మరో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. తద్వారా భారత ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు గెలిచిన భారత ప్లేయర్(స్వాతంత్ర్యం తర్వాత)గా అరుదైన రికార్డు సాధించింది.అరుదైన ఘనత సాధించిపందొమిదేళ్ల వయసులో టోక్యో ఒలింపిక్స్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని.. కఠిన సవాళ్లకు ఎదురీది ఈసారి రెండు మెడల్స్ గెలుచుకుంది మనూ. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనూ నాలుగోస్థానంలో నిలిచి.. పతకానికి అడుగుదూరంలో నిలిచిపోయింది. మరోవైపు.. టోక్యో ఒలింపిక్స్ ‘గోల్డెన్ బాయ్’, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా సైతం ప్యారిస్లో పతకం గెలిచాడు.అయితే, ఈసారి రెండోస్థానంతో సరిపెట్టుకుని.. పసిడి కాకుండా రజత పతకానికి పరిమితమయ్యాడు. ఈ ఎడిషన్లో భారత్ తరఫున ఏకైక సిల్వర్ మెడల్ గెలిచిన అథ్లెట్గా నిలిచాడు. ఈ క్రమంలో మనూతో పాటు నీరజ్.. ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల్లో ఫ్లాగ్బేరర్గా వ్యవహరించాల్సింది. అయితే, ఆ ఛాన్స్ హాకీ లెజెండ్, కేరళ ప్లేయర్ శ్రీజేశ్కు దక్కింది. నీరజ్ చోప్రా మంచి మనసు వల్లే శ్రీజేశ్కు ఈ అవకాశం వచ్చింది.మాటివ్వు బాబూఇక ఆదివారం నాటి ముగింపు వేడుకల అనంతరం.. మనూ భాకర్- నీరజ్ చోప్రా సంభాషిస్తున్న వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నీరజ్తో కలిసి ఫొటోకు ఫోజులివ్వాల్సిందిగా మనూ తల్లి సుమేధా భాకర్ కూతురిని కోరారు. అనంతరం.. నీరజ్ దగ్గరికి వచ్చిన సుమేధా.. నీరజ్ చేయి తన తల మీద పెట్టుకుని మాట తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. పసిడి పతకం తేవాలి!వరుస ఒలింపిక్స్లో పతకాలు సాధించిన నీరజ్.. విజయ రహస్యం ఏమిటో తన కూతురికి కూడా చెప్పాలని కోరారని కొంతమంది అంటుండగా.. వచ్చేసారి కచ్చితంగా స్వర్ణం సాధించాలని 26 ఏళ్ల నీరజ్తో ఒట్టు వేయించుకున్నారని మరికొందరు అంటున్నారు. కాగా మనూ భాకర్, నీరజ్ చోప్రా.. ఈ ఇద్దరూ హర్యానాకు చెందిన వాళ్లే అన్న విషయం తెలిసిందే. నీరజ్ స్వస్థలం పానిపట్ కాగా.. మనూ భాకర్ కుటుంబానిది ఝజ్జార్ జిల్లాలోని గోరియా గ్రామం. ఇదిలా ఉంటే.. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు ఆరు పతకాలు వచ్చాయి. షూటింగ్లో మూడు కాంస్యాలు, హాకీ పురుషుల జట్టుకు కాంస్యం, రెజ్లింగ్లో ఒక కాంస్యం, జావెలిన్ త్రోలో ఒక రజతం దక్కాయి. Manu Bhaker’s Mother with Neeraj Chopra. pic.twitter.com/SDWbaWeOG7— Avinash Aryan (@avinasharyan09) August 11, 2024Neeraj Chopra and Manu Bhaker are talking to each other as if they have a crush on each other. I am getting wild ideas on getting India a couple of future super athletes. pic.twitter.com/KXsTZDGq8y— Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) August 11, 2024 -
నీరజ్ చోప్రా మంచి మనసు.. శ్రీజేశ్కు అరుదైన గౌరవం
భారత హాకీ జట్టు గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల్లో భారత బృంద పతకధారిగా అతడు వ్యవహరించనున్నాడు. కాంస్య పతకాల విజేత, షూటర్ మనూ భాకర్తో కలిసి ఫ్లాగ్బేరర్ హోదాలో ముందుండి నడవనున్నాడు.భారత ఒలింపిక్ సంఘం ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రెండు దశాబ్దాలుగా భారత హాకీకి వెన్నెముకగా ఉన్న శ్రీజేశ్ ఈ గౌరవానికి అర్హుడని పేర్కొంది. ఈ విషయం గురించి జావెలిన్ త్రోయర్, రజత పతక విజేత నీరజ్ చోప్రాతో చర్చించామని.. అందుకు అతడు సంతోషంగా ఒప్పుకొన్నాడని తెలిపింది. ఈ క్రమంలో శ్రీజేశ్ పేరును ఫ్లాగ్బేరర్గా ఎంపిక చేసినట్లు పేర్కొంది.పతకాల ఖాతా తెరిచిన మనూ భాకర్కాగా షూటర్ మనూ భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. తొలుత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన ఈ హర్యానా షూటర్.. సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో కాంస్యం కైవసం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్ ఒకే ఎడిషన్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించింది.ఈ క్రమంలో ఆమెను ఫ్లాగ్బేరర్గా ప్రకటించింది భారత ఒలింపిక్ సంఘం. మరోవైపు.. టోక్యోలో స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్యారిస్లో రజతంతో సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ.. వరుస ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలిచిన నాలుగో భారత ప్లేయర్గా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో మనూతో పాటు ఫ్లాగ్బేరర్గా ఈ హర్యానా ఆటగాడు ఉంటాడని అంతా భావించారు.అయితే, వరుసగా భారత హాకీ జట్టు రెండోసారి కాంస్యం గెలవడంలో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ శ్రీజేశ్ వైపు ఒలింపిక్ సంఘం మొగ్గుచూపింది. ప్యారిస్లో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ కేరళ క్రీడాకారుడు.. భారత క్రీడా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా సముచిత గౌరవం ఇవ్వాలని భావించింది.శ్రీజేశ్ పట్ల నీరజ్కు ఉన్న గౌరవానికి నిదర్శనంఈ విషయం గురించి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ.. ‘‘ముగింపు వేడుకల్లో శ్రీజేశ్ను ఫ్లాగ్బేరర్గా నియమించాలనుకుంటున్నామని నీరజ్ చోప్రాతో చెప్పాను. అందుకు బదులిస్తూ.. ‘మేడమ్.. ఒకవేళ పతకధారిగా ఎవరు సరైనవ్యక్తి అని మీరు గనుక నన్ను అడిగితే.. నేను కూడా కచ్చితగా శ్రీ భాయ్ పేరునే చెపుతా’ అన్నాడు.శ్రీజేశ్ పట్ల నీరజ్కు ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం. క్రీడా స్ఫూర్తితో తను ఇందుకు అంగీకరించాడు’’ అని హర్షం వ్యక్తం చేశారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్కు నాలుగు కాంస్యాలు(షూటింగ్లో మూడు, హాకీ 1), ఒక రజత పతకం(పురుషుల జావెలిన్ త్రో) దక్కింది. ఇక ఆగష్టు 11న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఇక ఆరంభ వేడుకల్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ భారత బృంద పతకధారులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.చదవండి: అర్షద్ కూడా మా బిడ్డ లాంటివాడే: నీరజ్ చోప్రా తల్లిదండ్రులు -
హలో, మెడల్ సాధించినట్లు ఆ పోజేంటి?.. హీరోపై ఆగ్రహం
ఒలంపిక్స్లో రెండు పతకాలు సాధించిన భారత స్టార్ షూటర్ మనూ భాకర్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒలపింక్స్లో విజయకేతనం ఎగురవేసిన ఆమె ఇండియాకు తిరిగొచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఆమెను స్వయంగా కలిసి అభినందించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఒలంపిక్ పతకంతో హీరోఅందులో జాన్, మనూ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అయితే జాన్ అబ్రహం మను సాధించిన ఓ పతకాన్ని తన చేతితో పట్టుకుని ఫోటోకు పోజిచ్చాడు. ఇది నెటిజన్లకు మింగుడుపడలేదు. ఆమె కష్టపడి సాధించిన పతకాలను తాకే అర్హత ఎవరికీ లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. కరెక్ట్ కాదు'తను భారత్ గర్వపడేలా చేసింది. ఆమెను కలిసే అవకాశం వచ్చినందుకు సంతోషపడాలి. కానీ ఇలా తన పతకంతో ఫోజివ్వడం కరెక్ట్ కాదు..', 'ఒకరు సాధించిన మెడల్ను తాకే హక్కు నీకు లేదు, సారీ..', 'ఆ పతకం నువ్వు సాధించినట్లే బిల్డప్ ఇస్తున్నావేంటి?'అది నీ కష్టఫలం'ఆమెకు రెండు చేతులున్నాయిగా.. మరి నువ్వెందుకు పట్టుకోవడమో..', 'మనూ.. నువ్వు సాధించిన పతకాన్ని ఎవరి చేతికీ ఇవ్వకు.. అది నీ కష్టానికి దక్కిన ప్రతిఫలం' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'వేద'. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) -
‘మిషన్ 2028’ మొదలైంది...
న్యూఢిల్లీ: నాలుగేళ్ల తర్వాత జరగనున్న 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని భారత స్టార్ షూటర్ మనూ భాకర్ వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించిన మనూ బుధవారం స్వదేశానికి తిరిగి వచి్చంది. స్థానిక ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మనూ భాకర్, ఆమె కోచ్ జస్పాల్ రాణాకు ఘనస్వాగతం లభించింది. 22 ఏళ్ల మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ విభాగంలో కాంస్య పతకాలు గెలుచుకొని.. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొలి్పన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మనూ భాకర్ మాట్లాడుతూ. ‘పారిస్ ఒలింపిక్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. నేనప్పుడే 2028 లాస్ ఏంజెలిస్ క్రీడల కోసం ప్రయాణం ప్రారంభించా. కాస్త విరామం అనంతరం సాధన మొదలుపెడతాను. భవిష్యత్తులోనూ ఇదే నిలకడ చూపేందుకు ప్రయతి్నస్తా. అందుకోసం మరింత శ్రమిస్తా. కాకపోతే ఇప్పుడు కొంతకాలం కుటుంబ సభ్యులతో గడుపుతాను. మూడు నెలల తర్వాత తిరిగి షూటింగ్ ప్రాక్టీస్ ప్రారంభిస్తా’ అని ఆమె వెల్లడించింది. విశ్వక్రీడల్లో రెండు పతకాలు సాధించడంతో పాటు 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో త్రుటిలో పతకం చేజార్చుకున్న మనూ భాకర్.. శనివారం తిరిగి పారిస్ వెళ్లనుంది. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో మనూ భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించనుంది. -
Paris Olympics : మను భాకర్పై నీతా అంబానీ ప్రశంసలు, సన్మానం
ఐవోసీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల కృషిని అభినందిస్తూ మంగళవారం పారిస్లోని ఇండియన్ హౌస్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఒలింపిక్ గేమ్స్లో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు మను.ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు సాధించిన యువషూటర్ మను భాకర్ను నీతా అంబానీ ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకి కృషికి, విజయాలను సెలబ్రేట్ చేస్తూ ఆమెను సన్మానించారు. మను భాకర్తో పాటు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో కాంస్యం సాధించిన స్వప్నిల్ కుశాలేను కూడా సత్కరించారు. ఫ్రాన్స్ ఒలింపిక్ ఈవెంట్లో అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సమున్నతంగా నిలిపిన అథ్లెట్లను అంబానీ అభినందించారు. టోక్యో ఆటల తర్వాత, మను చెప్పినట్టుగా అందరూ మన ప్రాచీన గ్రంథం గీతాసారాన్ని, గీత బోధను అనుసరించాలని 'మీ వంతు కృషి చేయండి , మిగిలిన వాటిని భగవంతుడికి వదిలివేయండి’’ అంటూ క్రీడాకారులకు నీతా సూచించారు.ఈ ఒలింపిక్స్లో మన షూటింగ్ టీమ్ అత్యుత్తమ ఫామ్లో ఉందంటూ నీతా అంబానీ పేర్కొన్నారు. షట్లర్ లక్ష్య సేన్, షూటర్లు విజయవీర్ సింగ్ సిద్ధూ, మహేశ్వరి చౌహాన్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, సిఫ్ట్ కౌర్ సమ్రా, ఈషా సింగ్, రైజా ధిల్లాన్, అనీష్ బన్వాలా, బాక్సర్ నిషాంత్ దేవ్, షాట్ పుట్ అథ్లెట్ తాజిందర్పాల్ సింగ్ టూర్, అథ్లెట్ జెస్విన్ ఆల్డ్రిన్ శాలువాలతో సత్కరించారు.నిలకడగా ఆడి మలేషియాకు చెందిన జియ్ జియా లీపై కాంస్య పతకాన్ని సాధించి ఒలంపిక్స్లో నాల్గవ స్థానంలో నిలిచిన షట్లర్ లక్ష్య సేన్ను కూడా అభినందించారు. తకాలు,రికార్డులకు అతీతంగా వ్యక్తిత్వం, పట్టుదల, కఠోర శ్రమ, ఓటమినిఎదిరించే సామర్థ్యంతో మనం అందరం జరుపుకునే విశ్వ క్రీడా వేడుక అని నీతా అంబానీ అన్నారు. Mrs. Nita Ambani felicitates ace shooters, Manu Bhaker and Swapnil Kusale, as she honours all our athletes at India House, “Every Indian feels inspired and every girl in India feels empowered by Manu’s achievements. Swapnil’s historic success has made all of us proud. Our… pic.twitter.com/chBG0jrwBr— Pankaj Upadhyay (@pankaju17) August 7, 2024 -
ఒట్టు... మను బాకర్ భోజనమే చేయలేదు!
గెలుపు, ఓటములకు అతీతంగా కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆట అంటే ‘గెలుపు’ లేదా ‘ఓటమి’ మాత్రమే కాదు. గెలుపుకు ముందు, గెలిచిన తరువాత, ఓటమికి ముందు ఓటమికి తరువాత విషయాలు కూడా పసందుగా ఉంటాయి. ‘షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్లో భోజనం చేయలేదు’ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అరె మనకు పతకాలు తెచ్చిన అమ్మాయి భోజనం చేయలేదా? ఎందుకు చేయలేదు?పారిస్ ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో కాంస్యం, మిక్స్డ్ టీమ్ విభాగంలో మరో కాంస్యాన్ని గెలుచుకొని రికార్డ్ సృష్టించింది షూటర్ మను బాకర్. ‘ఇది మను ఒలింపిక్స్’ అంటూ క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది. 25 మీటర్ల విభాగంలో మూడో పతకం కొద్దిలో చేజారింది.హిస్టారిక్ మెడల్ హాట్రిక్ మిస్ అయిన తరువాత ఆమె ఏం ఆలోచించిందనే విషయానికి వస్తే... మొదటిది... నాలుగు సంవత్సరాల తరువాత లాస్ ఏంజెల్స్లో జరగనున్న ఒలింపిక్స్ గురించి. రెండోది... భోజనం గురించి. మొదటి విషయం సరే, రెండో విషయమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఆడి ఆడి అలిసిపోయిన మను బాకర్ను విశ్రాంతి గురించి అడిగినప్పుడు... ‘నేను చేసే మొదటి పని ఇంటి భోజనం చేయడం. ఇన్ని రోజులు నేను భోజనం చేయలేదు. విలేజ్లో బ్రేక్ ఫాస్ట్ చేసి, షూటింగ్ రేంజ్కు వచ్చేదాన్ని. అక్కడ స్నాక్స్ తినేదాన్ని. విలేజ్లో మధ్నాహ్న భోజనం ఉంటుంది. ప్రాక్టీస్ తర్వాత 3 లేదా 5 గంటల మధ్య మాత్రమే తిరిగి భోజనశాలకు రావడానికి వీలయ్యేది. ఆ సమయానికి మధ్యాహ్న భోజనం అయిపోయేది. దాంతో సాయంత్రం ఏదో తినేదాన్ని’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మను బాకర్.మను మధ్యాహ్న భోజనానికి దూరమైన విషయం ఆమె తల్లి సుమేధకు కూడా తెలిసి పోయింది.కుమార్తె విజయం కోసం రోజూప్రార్థనలు చేసిన ఆమె ఇలా అన్నది...‘మను ఇంటికి తిరిగి రాగానే వేడి వేడి ఆలూ పరోట తినిపిస్తాను. మనుకు ఆలూ పరోట అంటే ఎంతో ఇష్టం’ ‘కుమార్తె గెలుపు వార్త మాత్రమే వినాలి... తన ఓటమిని చూడలేను’ అనుకుందో ఏమో మను బాకర్ లైవ్ మ్యాచ్లు చూడడానికి ఇష్టపడేది కాదు సుమేధ.‘మా అమ్మ నన్ను ఛాంపియన్ చేయడం కోసం ఎంతో కష్టపడింది. అమ్మా... నువ్వు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలి’ అంటున్న మను బాకర్ అమ్మ చేతి వంట కోసం ఎదురు చూస్తోంది.‘ఏదైనా సరే, మా ఇంట్లో అమ్మ చేతివంట తినడం అంటే ఎంతో ఇష్టం. ఐ రియల్లీ లవ్ ఆలూ పరోటా. ఆలూ పరోటా తినక నాలుగు నెలలు అవుతోంది’ అంటుంది మను బాకర్ మనకు విజయాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ విజయాల వెనుక ఎన్ని సర్దుబాట్లు ఉంటాయో చెప్పడానికి మను బాకర్ ఒక ఉదాహరణ.ఒకటి రెండు రోజులంటే ఫరవాలేదుగానీ ఎన్నో రోజులు మధ్నాహ్న భోజనం లేకుండా గడిపింది మను. ఆ సమయంలో ఆమెకు కోపం రాలేదు. ఎందుకంటే మను బాకర్ ‘గెలుపు’ ఆకలితో ఉంది. రెండు పతకాలతో ఆ ఆకలి తీరింది.డైట్ రొటీన్భోజనానికి సంబంధించి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వేరు. క్రీడాకారిణిగా వేరు. శాకాహారి అయిన మను బాకర్ ‘డైట్ రోటిన్’ విషయానికి వస్తే... హెల్తీ ఫ్యాట్స్. లో–జీఐ కార్బోహైడ్రేడ్స్తో కూడిన సింపుల్ డైట్కుప్రాధాన్యత ఇస్తుంది. అలసట, గాయాలకు దూరంగా ఉండడానికి డైట్లో హైడ్రేషన్కు అధికప్రాధాన్యత ఇస్తుంది. మను డైట్లో రకరకాల పండ్లు, విటమిన్ సి అధికంగా ఉండే కూరగాయలు ఉంటాయి. హై–ఎనర్జీ, షుగర్ ఫుడ్స్కు దూరంగా ఉంటుంది.ఆహారానికి ఎంతప్రాధాన్యత ఇస్తుందో కంటినిండా నిద్రకు అంతేప్రాధాన్యత ఇస్తుంది. యోగా, జిమ్ తరువాత ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెయింటింగ్స్ వేస్తుంటుంది. మైండ్ ఫోకస్డ్గా ఉండడానికి క్రియేటివ్ వర్క్ ఉపయోగపడుతుందని చెబుతుంది మను బాకర్. -
Paris Olympics 2024: ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా మనూ భాకర్
పారిస్ ఒలింపిక్స్లో తన అద్భుత ప్రదర్శన ద్వారా దేశానికి రెండు పతకాలు అందించిన స్టార్ షూటర్ మనూ భాకర్కు మరో గౌరవం దక్కింది. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గా రికార్డుల్లోకెక్కిన మనూ... ‘పారిస్’ క్రీడల ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరించ నుంది. ఈనెల 11న జరగనున్న ముగింపు వేడుకల్లో మనూ.. జాతీయ జెండా చేబూని భారత బృందాన్ని నడిపించనుంది. ‘ముగింపు వేడుకల్లో మనూ ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనుంది. దీనికి భాకర్ పూర్తి అర్హురాలు’ అని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. ముగింపు వేడుకల్లో ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనున్న పురుష అథ్లెట్ పేరు తర్వాత ప్రకటించనున్నారు. -
Paris Olympics 2024: ఒలింపిక్స్ విజేత మను భాకర్కు అరుదైన గౌరవం
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలతో సత్తాచాటిన భారత స్టార్ షూటర్ మను భాకర్ అరుదైన గౌరవం దక్కింది. ఈ విశ్వక్రీడల ముగింపు వేడకల్లో భారత మహిళా పతాకధారిగా మను భాకర్ వ్యవహరించనున్నారు. ఈ మెరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆదివారం ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ క్లోజింగ్ సెర్మనీలో భారత్ నుంచి మెన్స్ ఫ్లాగ్ బేరర్ ఎవరన్నది ఇంకా ఖారారు చేయలేదు. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుక ఆగష్టు 11న జరగనుంది. కాగా ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా మను భాకర్ చరిత్ర సృష్టించింది.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన మను.. సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మూడో పతకాన్ని తృటిలో మను కోల్పోయింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంతో ఈ హర్యానా అమ్మాయి సరిపెట్టుకుంది. -
‘మూడో’ కన్ను చెదిరింది!
ఏడు రోజుల వ్యవధి. రెండు ఒలింపిక్ కాంస్య పతకాలు గెలిచిన ఘనత. మూడో పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించేందుకు సై. కానీ చివరకు ‘షూట్ ఆఫ్’తో ఆశలకు తెర పడింది. త్రుటిలో కాంస్యం చేజారింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున వ్యక్తిగత క్రీడాంశంలో మూడు పతకాలు గెలుచుకున్న తొలి ప్లేయర్గా నిలవాలని ఆశించిన యువ షూటర్ మనూ భాకర్కు చివర్లో చుక్కెదురైంది. తీవ్ర ఒత్తిడికి తలవంచిన ఆమె ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేక నాలుగో స్థానంతో ముగించింది. అయితే 22 ఏళ్ల మనూ భాకర్ సాధించిన ఘనత చిన్నదేమీ కాదు. మూడు ఈవెంట్లలో రెండు పతకాలు, మరో దాంట్లో నాలుగో స్థానం అంటే అసాధారణ ప్రదర్శన. గత టోక్యో ఒలింపిక్స్లో కనీస ప్రభావం చూపించలేక తీవ్ర విమర్శలపాలైన ఈ యంగ్స్టర్ ఇప్పుడు పారిస్ నుంచి సగర్వంగా స్వదేశం వెళుతోంది. పారిస్: భారత స్టార్ షూటర్ మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్లో మూడో పతకాన్ని సాధించడంలో విఫలమైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మనూ నాలుగో స్థానానికి పరిమితమైంది. శనివారం జరిగిన ఫైనల్లో మనూ ‘షూట్–ఆఫ్’లో ఓటమి పాలైంది. ఒక్కో సిరీస్లో ఐదు షాట్ల చొప్పున ఉండే ఎనిమిది సిరీస్లు ముగిసేసరికి మనూ 28 పాయింట్లు స్కోరు చేసింది. హంగేరీకి చెందిన వెరోనికా మాయో కూడా సరిగ్గా 28 పాయింట్లే సాధించింది. దాంతో ఇద్దరి మధ్య ఐదు షాట్ల ‘షూట్–ఆఫ్’ నిర్వహించారు. ఇందులో మూడు షాట్లను మనూ లక్ష్యంపైకి సరిగ్గా కొట్టగా... నాలుగు షాట్లు సరిగ్గా కొట్టిన వెరోనికాయే పైచేయి సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దాంతో మనూకు నిరాశ తప్పలేదు. ఫైనల్లో తొలి సిరీస్లో రెండు షాట్లు మాత్రం లక్ష్యం చేర్చిన మనూ పేలవంగా మొదలు పెట్టింది. అయితే ఆ తర్వాత వరుసగా 4, 4 పాయింట్లు సాధించి 10 పాయింట్లతో ఎలిమినేషన్ రౌండ్కు సిద్ధమైంది. ఇక్కడ మళ్లీ తడబడి 3తో మొదలు పెట్టిన మనూ ఆ తర్వాత వరుసగా 5, 4, 4 పాయింట్లతో ఏడు సిరీస్ల తర్వాత మొత్తం 26 పాయింట్లతో రెండో స్థానంతో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే ఈ తర్వాత ఈ జోరు కొనసాగలేదు. ఎనిమిదో సిరీస్ మనూను బాగా దెబ్బ తీసింది. కేవలం 2 షాట్లు మాత్రమే లక్ష్యం చేరడంతో వెనకబడిపోయి కాంస్యం కోసం పోటీ పడాల్సి వచ్చింది. అయితే ‘షూట్–ఆఫ్’లో అదే వైఫల్యం కొనసాగింది. ఈ ఈవెంట్లో ‘షూట్–ఆఫ్’లో జిన్ యాంగ్ (దక్షిణ కొరియా) స్వర్ణం, క్యామిలె జెడ్రెస్కీ (ఫ్రాన్స్) రజతం గెలుచుకున్నారు. నిర్ణీత 10 సిరీస్ల తర్వాత ఇద్దరూ 37 పాయింట్లతో సమంగా నిలిచారు. ‘షూట్–ఆఫ్’లో జిన్ యాంగ్ 3 పాయింట్లు సాధించగా... క్యామిలె ఒక పాయింట్తో సరిపెట్టుకుంది. స్కీట్లో నిరాశ... షూటింగ్లోనే స్కీట్ ఈవెంట్ పురుషుల విభాగంలో భారత షూటర్ అనంత్ జీత్సింగ్ నరూకా విఫలమయ్యాడు. ఐదు క్వాలిఫయింగ్ రౌండ్ల తర్వాత అతను 24వ స్థానంలో మాత్రమే నిలిచి ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. తొలి ఆరుగురు ఫైనల్కు చేరే ఈ ఈవెంట్లో అనంత్ జీత్ మొత్తం 125కుగాను 116 (23, 22, 23, 24, 24) పాయింట్లు సాధించాడు. బాక్సర్ నిశాంత్ ఓటమి బాక్సింగ్లో భారత్కు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన 71 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నిశాంత్ దేవ్ 1–4తో మార్కో వెర్దె (మెక్సికో) చేతిలో ఓడిపోయాడు. నిశాంత్ ఓటమితో పురుషుల విభాగంలో భారత కథ ముగిసింది. ఒత్తిడిని అధిగమించలేకపోయాను పారిస్ ఒలింపిక్స్లో మూడో పతకంపై గురి పెట్టాను. అయితే కీలక సమయంలో ఒత్తిడిలో చిత్తయ్యాను. ఎంత ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. అయితే రెండు కాంస్యాల తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో ఇంతకంటే మెరుగైన ప్రదర్శన ఇస్తాను. ‘షూట్–ఆఫ్’లో చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నా. దానిని అధిగమించి గెలిచేందుకు నా శాయశక్తులా ప్రయత్నించినా అది సరిపోలేదు. రెండు పతకాలు గెలవడం సంతోషకరమే.కానీ ఈ క్షణాన మాత్రం నాలుగో స్థానం నాకు తీవ్ర నిరాశ కలిగించింది. ఒలింపిక్స్లో చాలా వరకు బాగానే ఆడినా ఈసారి విఫలమయ్యాను. ఎప్పుడైనా రేపు మరో అవకాశం అనేది ఉంటుంది. 2028 కోసం ఎదురు చూస్తున్నా. ఈ పోరుకు ముందు ఎలాగైనా మూడో పతకం సాధించాలని నాపై ఎవరూ ఒత్తిడి పెట్టలేదు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను కాబట్టి బయటి వ్యక్తుల అంచనాల గురించి కూడా నాకేమీ తెలియదు. నాలుగో స్థానం దక్కింది కాబట్టి నా లోపాలేమిటో తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది. పతకం రాకపోతే ఎవరూ నిరాశ చెందవద్దని నేను ముందే చెప్పడం ఏదో మాట వరసకు అన్నదే. ఇక్కడా గెలిస్తే బాగుండేది. కానీ చివరి వరకు పోరాడగలిగాను. నేను ఈ ఒలింపిక్స్ కోసం చాలా కష్టపడ్డాను. ఇక ముందు ఇలాగే కష్టపడతానని అందరికీ చెబుతున్నాను. –మనూ భాకర్ -
థాంక్యూ అమ్మ.. నీ వల్లే ఇదంతా: మను భాకర్
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకాలు సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత స్టార్ షూటర్ మను భాకర్కు నిరాశే ఎదురైంది. ప్యారిస్ ఒలింపిక్స్లో తృటిలో మూడో పతకాన్ని మను భాకర్ చేజార్చుకుంది.శనివారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 4వ స్థానంతో మను సరిపెట్టుకుంది. ఏదమైనప్పటకి మను తన పేరును ఒలింపిక్స్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్గా మను రికార్డులకెక్కింది.మను బాకర్ తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకోగా .. ఆ తర్వాత మరో షూటర్ సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ డబుల్స్లో మరో కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. ఇక మూడో పతకం చేజారిన అనంతరం ఆధికారిక బ్రాడ్కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన మను భాకర్ భావోద్వేగానికి లోనయ్యంది. తన తల్లి సహకారంతోనే ఇదింతా సాధించానని మను తెలిపింది.'ఈ సందర్భంగా మా అమ్మకు ఓ సందేశం పంపాలనుకుంటున్నాను. నా కోసం అన్నింటిని త్యాగం చేసిన అమ్మకు ధన్యవాదాలు. నీ సహకారంతో ఈ స్థాయికి చేరుకోగలిగాను. నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను.నువ్వు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నీవు వీలైనంత ఎక్కువ కాలం నాతో పాటే ఉండాలని నేను ఆశిస్తున్నా అని మను బాకర్ పేర్కొంది. -
Olympics 2024: హార్ట్ బ్రేక్.. మనూ చేజారిన పతకం
Paris Olympics 2024: భారత యువ షూటర్ మనూ భాకర్ చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా మూడు వ్యక్తిగత పతకాలు గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్గా ఈ హర్యానా అమ్మాయి నిలుస్తుందని భావించగా.. నిరాశే మిగిలింది.కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మనూ... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి మరో కాంస్యం కైవసం చేసుకుంది. తాజాగా.. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలోనూ పతక రేసులో మనూ నిలిచింది. అయితే, ఆదిలో కాస్త వెనుకబడ్డా.. తర్వాత తిరిగి పుంజుకున్న మనూ.. కాంస్య పతకానికి చేరువగా వచ్చింది. అయితే, మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన ఎలిమినేషన్ ప్లే ఆఫ్లో దురదృష్టవశాత్తూ మనూ ఓడిపోయింది. ఏదేమైనా అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే రెండు మెడల్స్ గెలిచిన మనూ భారతీయలు మనసులు గెలుచుకుంది. మనూ ప్రయాణం సాగిందిలా..👉మొత్తం 3 సిరీస్లు- 5 షాట్ల చొప్పున మొత్తం 15 షాట్లు👉తొలి సిరీస్👉శుభారంభం అందుకోలేకపోయిన మనూ.. 👉ఐదింటిలో రెండు సఫలం👉ఆరు పాయింట్లతో రేసులోకి వచ్చిన మనూ.. 8 పాయింట్లతో టాప్లో సౌత్ కొరియా షూటర్👉రెండో సిరీస్👉ఐదింటిలో 4 సఫలం.. రెండోస్థానానికి చేరిన మనూ👉తొలి ఎలిమినేషన్- యూఎస్ఏ షూటర్ కేటలిన్ మోర్గాన్ రేసు నుంచి అవుట్👉ఆరోస్థానానికి పడిపోయిన మనూ భాకర్👉మూడో సిరీస్👉ఐదింటిలో ఐదూ సఫలం.. మూడో స్థానంలోకి మనూ భాకర్👉ఇరానియన్ షూటర్ రోస్తమియాన్ అవుట్..రెండో స్థానంలో మనూ👉ఐదింట నాలుగు సఫలం- రెండో స్థానంలోనే మనూ👉చైనా షూటర్ నాన్ జావో ఎలిమినేట్👉మూడో స్థానానికి పడిపోయిన మనూ👉మూడో స్థానం కోసం జరిగిన షూట్ ఆఫ్లో మనూ ఓటమి👉నాలుగోస్థానంలో సరిపెట్టుకున్న మనూ👉కాంస్య పతక రేసు నుంచి కూడా మనూ అవుట్నాలుగో స్థానంలోసౌత్ కొరియా షూటర్ జిన్ యాంగ్కు స్వర్ణంఫ్రాన్స్ షూటర్ కమిలె జెద్రెజెజ్వ్స్కికి రజతంహంగేరీ షూటర్ వెరోనికాకు కాంస్యంనాలుగో స్థానంతో సరిపెట్టుకున్న మనూ భాకర్భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు గెలిచిన క్రీడాకారులు వీరే👉మనూ భాకర్- షూటింగ్- రెండు కాంస్యాలు- ప్యారిస్ ఒలింపిక్స్-2024👉నార్మన్ ప్రిచర్డ్(బ్రిటిష్- ఇండియన్)- అథ్లెటిక్స్- రెండు రజతాలు- ప్యారిస్ ఒలింపిక్స్- 1900 పారిస్👉సుశీల్ కుమార్- రెజ్లింగ్- ఒక కాంస్యం, ఒక రజతం- బీజింగ్ ఒలింపిక్స్- 2008, లండన్ ఒలింపిక్స్- 2012 👉పీవీ సింధు- బ్యాడ్మింటన్- ఒక రజతం, ఒక కాంస్యం- రియో ఒలింపిక్స్- 2016, టోక్యో ఒలింపిక్స్- 2020 -
మరో చరిత్రకు మను ‘సై’
ఏ భారత ప్లేయర్కూ సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు పిస్టల్ షూటర్ మనూ భాకర్ ఒక్క పతకం దూరంలో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్లో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు గెలిచిన 22 ఏళ్ల మనూ భాకర్ మూడో పతకంపై గురి పెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫయింగ్లో మనూ రెండో స్థానంలో నిలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య నేడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జరిగే ఫైనల్లో మనూ టాప్–3లో నిలిస్తే మూడో పతకాన్ని ఖరారు చేసుకుంటుంది. దాంతోపాటు ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 3 వ్యక్తిగత పతకాలు గెలిచిన భారత ప్లేయర్గా మనూ భాకర్ అవతరిస్తుంది.నార్మన్ ప్రిచర్డ్ (1900 పారిస్; అథ్లెటిక్స్లో 2 రజతాలు), రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్లో కాంస్యం; 2012 లండన్లో రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియోలో రజతం; 2020 టోక్యోలో కాంస్యం) రెండు పతకాల చొప్పున సాధించగా... ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచి ప్రస్తుతం ఈ ముగ్గురి సరసన మనూ భాకర్ ఉంది. పారిస్: టోక్యో ఒలింపిక్స్లో పూర్తిగా నిరాశపరిచిన మనూ భాకర్ ‘పారిస్’లో మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తోంది. తాను పాల్గొంటున్న మూడు ఈవెంట్లలోనూ మనూ భాకర్ ఫైనల్కు చేరి ఔరా అనిపించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలోనూ కాంస్యం గెలిచిన మనూ భాకర్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలోనూ పతక పోరుకు అర్హత పొందింది. 40 మంది షూటర్ల మధ్య జరిగిన క్వాలిఫయింగ్లో మనూ 600 పాయింట్లకుగాను 590 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పోటీపడ్డ మరో భారత షూటర్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 581 పాయింట్లు స్కోరు చేసి 18వ స్థానంతో సరిపెట్టుకుంది. టాప్–8లో నిలిచిన వారికి మాత్రమే ఫైనల్ బెర్త్లు ఖరారవుతాయి. 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫయింగ్ను రెండు భాగాలుగా నిర్వహించారు. ముందుగా ప్రెసిషన్ ఈవెంట్లో, తర్వాత ర్యాపిడ్ ఈవెంట్లో పోటీపడ్డారు. మనూ ప్రెసిషన్ ఈవెంట్లో 294 పాయింట్లు, ర్యాపిడ్లో 296 పాయింట్లు సాధించింది. క్వాలిఫయింగ్లో వెరోనికా (హంగేరి; 592 పాయింట్లు) టాప్ ర్యాంక్లో నిలిచింది. ఆ తర్వాత హనియె రోస్తమియాన్ (ఇరాన్; 588 పాయింట్లు) మూడో స్థానాన్ని, ట్రిన్ తు విన్ (వియత్నాం; 587 పాయింట్లు) నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. నాన్ జావో (చైనా; 586 పాయింట్లు) ఐదో ర్యాంక్లో, జిన్ యాంగ్ (కొరియా; 586 పాయింట్లు) ఆరో ర్యాంక్లో, కామిలి జెద్రావ్స్కీ (ఫ్రాన్స్; 585 పాయింట్లు) ఏడో ర్యాంక్లో, కేటలిన్ మోర్గాన్ (అమెరికా; 585 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్లో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. -
పారిస్ ఒలింపిక్స్ విజేతలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ బంపరాఫర్..
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ తరపున పతకాలు సాధించేవారికి జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జల్ జిందాల్ బంపరాఫర్ ఇచ్చారు. ఈ విశ్వ క్రీడల్లో మెడల్స్ సాధించిన భారత క్రీడాకారులకు 'ఎంజీ విండ్సర్' కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు సజ్జల్ జిందాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా శుక్రవారం వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్ల్స్ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిందాల్ తెలిపారు. "భారత్ తరపున పతకం సాధించే ప్రతీ క్రీడాకారుడికి జేఎస్డబ్ల్యూ గ్రూపు తరుపున 'ఎంజీ విండ్సర్స్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ ప్రకటన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యుత్తమ వ్యక్తులు అత్యుత్తమైనవి పొందేందుకు అర్హులు కదా! వారి అంకిత భావం, విజయాల కోసమే ఇది అంటూ" ఎక్స్లో జిందాల్ రాసుకొచ్చాడు. కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్గా కూడా సజ్జల్ జిందాల్ ఉన్నారు. ఇక ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో ప్రస్తుతం మూడు పతకాలు ఉన్నాయి. షూటింగ్లో మను భకర్ రెండు కాంస్య పతకాలు సాధించగా.. స్వప్నిల్ కుసాలే సింగ్ ఓ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. -
Olympics: మూడో పతకానికి చేరువైన మనూ భాకర్
భారత స్టార్ షూటర్ మనూ భాకర్.. మూడో ఒలింపిక్ పతకానికి చేరువైంది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్కు చేరుకుంది. అయితే, భారత్కే చెందిన మరో షూటర్ ఇషా సింగ్ మాత్రం ఈ ఈవెంట్లో నిరాశపరిచింది.కాగా తొలుత.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మనూ భాకర్ ప్యారిస్లో భారత్ పతకాల తెరిచింది. అనంతరం సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన భారత ప్లేయర్గా 22 ఏళ్ల మనూ చరిత్ర సృష్టించింది. తాజాగా గురువారం నాటి 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో 600కు గాను మనూ 590 పాయింట్లు సాధించింది. తద్వారా క్వాలిఫయర్స్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచి మెడల్ రౌండ్కు అర్హత సాధించింది. ఇక తెలంగాణ షూటర్ ఇషా సింగ్.. 581 పాయింట్లకే పరిమితమై 18వ స్థానంతో సరిపెట్టుకుని.. ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.చదవండి: అందమైన ప్రయాణం.. జీర్ణించుకోలేని ఓటమి.. ఇకపై: పీవీ సింధు పోస్ట్ వైరల్ -
ఒలింపిక్స్లో ఇవాల్టి (ఆగస్ట్ 2) భారత షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్లో ఆరో రోజు (ఆగస్ట్ 1) భారత్కు కలిసి రాలేదు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న కొందరు అథ్లెట్లు అనూహ్య ఓటములు ఎదుర్కొని ఇంటిబాట పట్టారు. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. మహిళల బాక్సింగ్లో నిఖత్ జరీన్.. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో పీవీ సింధు ప్రత్యర్ధుల చేతుల్లో ఓడి పతక ఆశలను నీరుగార్చారు. ఏడో రోజు భారత్ పలు క్రీడాంశాల్లో పతకాలపై ఆశలు పెట్టుకుంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో లక్ష్యసేన్ (క్వార్టర్ ఫైనల్స్).. మహిళ 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్లో మనూ భాకర్ పోటీపడనున్నారు. ఒలింపిక్స్లో ఇవాల్టి భారత షెడ్యూల్ ఇలా ఉంది.గోల్ఫ్- శుభాంకర్ శర్మ, గగన్జీత్ భుల్లర్ (పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 2)- మధ్యాహ్నం 12:30 గంటలకుషూటింగ్- మనూ భాకర్, ఇషా సింగ్ (మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్)- మధ్యాహ్నం 12:30 గంటలకుఅనంత్జీత్ సింగ్ నరుకా (పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ డే 1)- మధ్యాహ్నం ఒంటి గంటకుఆర్చరీ- ధీరజ్ బొమ్మదేవర/అంకిత భకత్ వర్సెస్ దియానంద కొయిరున్నిసా/ఆరిఫ్ పంగెస్తు (రికర్వ్ మిక్సడ్ టీమ్ 1/8 ఎలిమినేషన్స్)- మధ్యాహ్నం 1:19 గంటలకుజూడో- తులికమన్ వర్సెస్ ఇడాలిస్ ఓర్టిజ్ (మహిళల +78 కేజీల ఎలిమినేషన్ రౌండ్ ఆఫ్ 32)- మధ్యాహ్నం 1:32 నుంచిషూటింగ్- మనూ భాకర్, ఇషా సింగ్ (మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ (ర్యాపిడ్))- మధ్యాహ్నం 3:30 గంటలకుసెయిలింగ్- నేత్రా కుమనన్ (మహిళల డింఘీ రేస్ 3 మరియు 4)- మధ్యాహ్నం 3:45 గంటలకుహాకీ- ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (పురుషుల హాకీ పూల్ బి)- సాయంత్రం 4:45 గంటలకుబ్యాడ్మింటన్- లక్ష్యసేన్ వర్సెస్ చౌ టిన్ చెన్ (పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్)- 6:30 గంటలకుసెయిలింగ్- విష్ణు శరవణన్ (పురుషుల డింగీ రేస్ 3 అండ్ 4)- రాత్రి 7:05 గంటలకుఅథ్లెటిక్స్- అంకిత ధయాని (మహిళల 5000 మీటర్ల హీట్ 1)- రాత్రి 9:40 గంటలకుపారుల్ చౌధరి (మహిళల 5000 మీటర్ల హీట్ 2)- రాత్రి 10:06 గంటలకుతజిందర్ పాల్ సింగ్ తూర్ (పురుషుల షాట్ పుట్ క్వాలిఫికేషన్)- రాత్రి 11:40 గంటలకు -
ప్యారిస్ ఒలింపిక్స్: నీతా అంబానీ సెల్ఫీల సందడి, వైరల్ వీడియో
రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. ముఖ్యంగా ఇటీవల లాంచ్ చేసిన ప్రతిష్టాత్మక ఇండియా హౌస్లో భారత ఒలింపిక్ షూటింగ్ బృందాన్ని సత్కరించారు. ప్రత్యేకంగా అభినందించారు. వారితో సెల్పీలకు ఫోజులిచ్చి సందడి చేశారు. భారతీయులందర్నీ గర్వంతో తల ఎత్తుకునేలా చేశారు! గో ఇండియా.. గో’ అంటూ వారిని ఉత్సాహ పరిచారు. మరిన్ని విజయాలు సాధించాలంటూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు విశ్వ క్రీడావేదికపై మనదేశాన్ని సగర్వంగా నిలిపిన కృషికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటికే రెండు పతకాలతో, మన షూటర్లు పారిస్లో త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరేసిన సంగతి తెలిసిందే. భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్, ఇండియా హౌస్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. విమెన్స్ 10 మీ. ఎయిర్ పిస్టల్లోనూ మను కాంస్య పతకాన్నిసాధించి స్వాతంత్య్రం తర్వాత రెండు మెడల్స్ నెగ్గిన తొలి అథ్లెట్గా చరిత్రకెక్కింది.Indian star shooter Sarabjot Singh gets heroic reception in India house 😍😍Manu Bhaker and Sarabjot Singh win Bronze 🥉 in the 10m air pistol mixed team event. #Sarabjot #Shooting #ManuBhaker #ParisOlympics2024 #Paris2024 #Paris2024Olympic #ParisOlympics pic.twitter.com/8oUs2x7PoK— India Olympics 2024 (@nnis_sports) July 30, 2024 -
ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు.. మనుభాకర్ సరికొత్త రికార్డు
-
మను మహరాణి
పారిస్ వేదికగా మంగళవారం భారత మహిళా షూటర్ మనూ భాకర్ కొత్త చరిత్రను లిఖించింది. గతంలో ఏ భారత ప్లేయర్కూ సాధ్యంకాని ఘనతను మనూ సాధించి చూపించింది. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఈ హరియాణా అమ్మాయి అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మనూ భాకర్... మంగళవారం అదే వేదికపై సహచరుడు సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన భారత ప్లేయర్గా ఆమె చరిత్రకెక్కింది. తాను పోటీపడ్డ రెండు ఈవెంట్లలోనూ పతకాలు నెగ్గిన మనూకు మూడో పతకం సాధించే అవకాశం కూడా ఉంది. ఆగస్టు 2న ఆమె 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ క్వాలిఫయింగ్లో బరిలోకి దిగుతుంది. క్వాలిఫయింగ్లో రాణించి ఫైనల్కు చేరితే ఆగస్టు 3న మూడో పతకంపై మనూ గురి పెడుతుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత క్వాలిఫయింగ్లో త్రుటిలో ఫైనల్ స్థానాన్ని చేజార్చుకున్న సరబ్జోత్... మనూతో కలిసి ‘మిక్స్డ్’లో కాంస్యం నెగ్గి కెరీర్లోనే చిరస్మరణీయ ప్రదర్శన నమోదు చేశాడు.పారిస్: రెండు రోజుల క్రితం పతకం సాధించిన విశ్వాసంతో భారత మహిళా యువ షూటర్ మనూ భాకర్ మరోసారి అదరగొట్టింది. పూర్తి సంయమనంతో, చెక్కు చెదరని ఏకాగ్రతతో లక్ష్యం దిశగా బుల్లెట్లు సంధించిన మనూ ఈ క్రమంలో కొత్త చరిత్రలో భాగమైంది. స్వాతంత్య్రం వచ్చాక ఒలింపిక్స్ క్రీడల్లో ఏ భారతీయ క్రీడాకారుడు సాధించని ఘనతను మనూ అందుకుంది. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్గా మనూ భాకర్ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్–సరబ్జోత్ సింగ్ (భారత్) జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతక మ్యాచ్లో మనూ–సరబ్జోత్ ద్వయం 16–10 పాయింట్ల తేడాతో జిన్ ఓయె–లీ వన్హో (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్లో మనూ–సరబ్జోత్ 580 పాయింట్లతో మూడో స్థానంలో, జిన్ ఓయె–లీ వన్హో 579 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. తర్హాన్ సెవల్ ఇల్యాదా–యూసుఫ్ డికెచ్ (టర్కీ) జోడీ 582 పాయింట్లతో టాప్ ర్యాంక్లో... జొరానా అరునోవిచ్–దామిర్ మికెచ్ (సెర్బియా) ద్వయం 581 పాయింట్లతో రెండో ర్యాంక్లో నిలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత పొందారు. మంగళవారం జరిగిన ఫైనల్లో జొరానా–దామిర్ ద్వయం 16–14తో తర్హాన్–యూసుఫ్ జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. తర్హాన్–యూసుఫ్ జోడీకి రజత పతకం లభించింది. 1900 పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో బ్రిటిష్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన నార్మన్ ప్రిచర్డ్ పురుషుల 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్లో రెండు రజత పతకాలు సాధించాడు. అయితే ఈ ఘనత భారత్కు స్వాతంత్య్రంరాక ముందు నమోదైంది. గత టోక్యో ఒలింపిక్స్లో సౌరభ్ చౌదరీతో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో బరిలోకి దిగిన మనూ భాకర్ క్వాలిఫయింగ్లో ఏడో స్థానంలో నిలిచి మెడల్ రౌండ్కు అర్హత పొందలేకపోయింది. అయితే ఈసారి సరబ్జోత్తో జత కట్టిన మనూ క్వాలిఫయింగ్లోనే కాకుండా కాంస్య పతక మ్యాచ్లోనూ నిలకడగా స్కోరు చేసి తన ఖాతాలో రెండో పతకాన్ని వేసుకుంది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం క్వాలిఫయింగ్లో 577 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత పొందలేకపోయిన బాధను మర్చిపోయి సరబ్జోత్ ‘మిక్స్డ్’ ఈవెంట్లో గురి తప్పని లక్ష్యంతో పాయింట్లు సాధించి తన ఒలింపిక్ పతకం కలను నిజం చేసుకున్నాడు. మిక్స్డ్ ఈవెంట్ పతక మ్యాచ్లో రెండు జోడీల్లో తొలుత 16 పాయింట్లు స్కోరు చేసిన జంటను విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో అవకాశంలో రెండు జట్లలోని ఇద్దరేసి షూటర్లు లక్ష్యం దిశగా రెండు షాట్ల చొప్పున సంధిస్తారు. రెండు జోడీల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జంటకు 2 పాయింట్లు, తక్కువ స్కోరు చేసిన జోడీకి 0 పాయింట్లు కేటాయిస్తారు. 13 సిరీస్లపాటు జరిగిన కాంస్య పతక మ్యాచ్లో తొలి సిరీస్లో కొరియా జోడీ నెగ్గగా... ఆ తర్వాత వరుసగా నాలుగు సిరీస్లలో భారత జంట గెలిచి 8–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆరో సిరీస్లో కొరియా ద్వయం... ఏడో సిరీస్లో భారత జోడీ పైచేయి సాధించాయి. ఎనిమిదో సిరీస్లో కొరియా గెలుపొందగా... తొమ్మిది, పది సిరీస్లను భారత జోడీ సొంతం చేసుకొని 14–6తో విజయానికి చేరువైంది. అయితే 11వ సిరీస్లో, 12వ సిరీస్లో కొరియా ద్వయం పైచేయి సాధించి ఆధిక్యాన్ని 10–14కి తగ్గించింది. అయితే 13వ సిరీస్లో మనూ–సరబ్జోత్ జోడీ 19.6 స్కోరు చేయగా... కొరియా జంట 18.5 స్కోరు సాధించింది. దాంతో భారత జంట మొదటగా 16 పాయింట్లను అందుకొని విజయంతోపాటు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. పతకం గెలవగానే నా మనసులో ఎన్నో చిన్ననాటి ఆలోచనలు వచ్చాయి. ఇన్నేళ్లుగా నాన్న, తాత నాకు అండగా నిలిచిన వైనం, తొలి రెండేళ్లు కోచింగ్ కోసం బస్సులో అంబాలాకు వెళ్లిన రోజులు గుర్తుకొచ్చాయి. ఈవెంట్కు ముందు రేంజ్లోకి అడుగు పెట్టే సమయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా. వ్యక్తిగత విభాగంలో వైఫల్యం తర్వాత నా కుటుంబసభ్యులు, కోచ్లు ఓదార్చి నాలో మళ్లీ స్ఫూర్తిని నింపారు. ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకునే ప్రయత్నం చేశాను. నా విజయంలో ఆరి్థకపరంగా అండగా నిలిచిన భారత ప్రభుత్వ పాత్ర కూడా ఎంతో ఉంది. –సరబ్జోత్ సింగ్ మనందరం గర్వపడే క్షణాలను మన షూటర్లు మళ్లీ అందించారు. మనూ, సరబ్జోత్లకు అభినందనలు. ఇద్దరూ చక్కటి ప్రదర్శన కనబర్చారు. భారత్ ఎంతో సంతోషిస్తోంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి వరుసగా రెండో ఒలింపిక్ పతకం సాధించడం మనూ భాకర్ నిలకడైన ప్రదర్శనను, అంకితభావాన్ని చూపిస్తోంది. కాంస్యం గెలిచిన మనూ, సరబ్జోత్లకు శుభాకాంక్షలు. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. –ద్రౌపది ముర్ము, రాష్ట్రపతిమనూ, సరబ్జోత్... గతంలో ఏ భారత జోడీ సాధించని ఘనతను మీరు అందుకున్నారు. షూటింగ్లో ఇది భారత్కు తొలి టీమ్ మెడల్. ఈ క్షణాలను ఆస్వాదించండి. –అభినవ్ బింద్రా ఒలింపిక్స్లో కాంస్యం సాధించి మనూ, సరబ్జోత్ దేశం గర్వపడేలా చేశారు. ఇతర క్రీడాకారులకు మీ ప్రదర్శన స్ఫూర్తిగా నిలుస్తుంది. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం3 స్వాతంత్య్రం వచ్చాక ఒలింపిక్స్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన మూడో భారత ప్లేయర్ మనూ భాకర్. గతంలో రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్–కాంస్యం; 2012 లండన్–రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం) ఈ ఘనత సాధించారు.6 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన ఆరో భారతీయ షూటర్గా సరబ్జోత్ సింగ్ గుర్తింపు పొందాడు. గతంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (డబుల్ ట్రాప్; రజతం–2004 ఏథెన్స్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; స్వర్ణం–2008 బీజింగ్), విజయ్ కుమార్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్; రజతం–2012 లండన్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; కాంస్యం–2012 లండన్), మనూ భాకర్ (2024 పారిస్; 2 కాంస్యాలు) ఈ ఘనత సాధించారు. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలుస్తానని నేను అనుకోలేదు. ఈ అనుభూతి కొత్తగా ఉంది. దేశం తరఫున సాధ్యమైనన్ని ఎక్కువ పతకాలు గెలవాలని కోరుకుంటా. టోక్యోలో వైఫల్యం చూశాను కాబట్టి ఆ పతకాల విలువ ఏమిటో నాకు ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతోంది. ప్రస్తుతానికి మరో మెడల్ సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నా. తర్వాతి ఈవెంట్లో ఎలా ఆడతానో చెప్పలేను. నా శాయశక్తులా ప్రయతి్నస్తా. ఒకవేళ విఫలమైతే అభిమానులు నిరాశపడరనే అనుకుంటున్నా. నాపై కురుస్తున్న ఈ ప్రేమాభిమానులు ఇలాగే కొనసాగాలి. –మనూ భాకర్ -
Olympics 2024: మనూ భాకర్- సరబ్జోత్ సింగ్లకు వైఎస్ జగన్ అభినందనలు
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన భారత ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ జోడీ మనూ భాకర్- సరబ్జోత్ సింగ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు.‘ఒలింపిక్స్ ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల మిక్స్డ్ ఈవెంట్ లో మనూ భాకర్- సరబ్జోత్ సింగ్లు కాంస్యం గెలిచి భారతదేశ కీర్తిని మరింత పెంచారు’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Team India makes the nation proud yet again at the 2024 Olympics! @realmanubhaker and Sarabjot Singh bring home the bronze in the 10m air pistol mixed team event. #IndiaAtOlympics pic.twitter.com/MQQI792J1q— YS Jagan Mohan Reddy (@ysjagan) July 30, 2024 కాగా, ఒలింపిక్స్-2024లో భారత్ రెండో పతకం సాధించిన సంగతి తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్ జోడీ మనూ భాకర్- సరబ్జోత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్ మెడల్ అందించారు.దక్షిణ కొరియా జోడీ(జిన్ ఓయె–లీ వన్హో)ని 16-10తో ఓడించి పతకం సాధించారు. ఈ క్రమంలో మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున ఒకే ఎడిషన్లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్గా నిలిచింది. కాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఆమె కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. -
ఫుట్బాలర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే! షూటర్గా ఒలింపిక్ మెడల్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత యువ షూటర్ సరబ్జోత్ సింగ్ సత్తాచాటాడు. సరబ్జోత్ 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మను భాకర్తో కలిసి కాంస్య పతకాన్ని భారత్కు అందించాడు. మూడు రోజుల క్రితం పురుషుల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో తృటిలో ఫైనల్కు చేరే ఛాన్స్ కోల్పోయిన సరబ్జోత్.. మిక్స్డ్ ఈవెంట్లో మాత్రం తన గురితప్పలేదు. విశ్వవేదికపై మను భాకర్తో కలిసి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. దీంతో దేశవ్యాప్తంగా సరబ్జోత్ సింగ్ పేరు మారుమ్రోగుతోంది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు రెండో పతకం అందించిన సరబ్జోత్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఎవరీ సరబ్జోత్ సింగ్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ సరబ్జోత్ సింగ్.. ?22 ఏళ్ల సరబ్జోత్ సింగ్ హర్యానా రాష్ట్రం అంబాలాలోని ధీన్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. అతడి తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. సరబ్జోత్ తన చిన్నతనంలో ఫుట్బాలర్ కావాలని కలలు కన్నాడు. ఆ విధంగానే ముందుకు అడుగులు వేశాడు. కానీ తన 13 ఏళ్ల వయస్స్సులో ఒక రోజు స్కూల్ సమ్మర్ క్యాంప్లో కొంత మంది పిల్లలు ఎయిర్ గన్లతో తాత్కాలిక రేంజ్లో టార్గెట్ను గురిపెట్టడం సరబ్జోత్ చూశాడు.ఆ దృశ్యం(షూటింగ్) అతడిని ఎంతో గానో ఆకట్టుకుంది. దీంతో సరబ్జోత్ కూడా షూటర్ కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి జతీందర్ సింగ్ కూడా సరబ్జోత్కు మద్దతుగా నిలిచాడు. సరబ్జోత్ చండీగఢ్లోని డీఏవీ కాలేజీలో చదువును కొనసాగిస్తూ కోచ్ అభిషేక్ రాణా దగ్గర శిక్షణ పొందాడు. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం వంటి స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలు కూడా అతడు షూటర్గా ఎదగడంలో కీలక పాత్ర పోషించాయి. 2019లో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించడం సరబ్జోత్ కెరీర్కు టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి. ఆ తర్వాత సరబ్జోత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ఏకంగా విశ్వక్రీడల్లో కూడా తన తుపాకీ పవర్ను సరబ్జోత్ చూపించాడు.సరబ్జోత్ సింగ్ సాధించిన విజయాలు ఇవే..2023 ఆసియా ఛాంపియన్షిప్, కొరియా: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం, (ఒలింపిక్ కోటా)2023 ప్రపంచ కప్, భోపాల్: వ్యక్తిగత ఈవెంట్లో బంగారు పతకం2023 ప్రపంచ కప్, బాకు: మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం2022 ఆసియా క్రీడలు: టీమ్ ఈవెంట్లో బంగారు పతకం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజత పతకం2022 జూనియర్ ప్రపంచ కప్, సుహ్ల్: టీమ్ ఈవెంట్లో బంగారు పతకం, వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో రజత పతకాలు2021 జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్, లిమా: టీమ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు2019 జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ -
భారత్ ఖాతాలో రెండో పతకం మనూ భాకర్ పై మోదీ ప్రశంసలు..
-
124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్.. అత్యంత అరుదైన ఘనత
విశ్వ క్రీడల్లో భారత షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి ఇండియన్ అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ మహిళల విభాగంలో 22 ఏళ్ల మనూ కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.మిక్స్డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్లోతద్వారా భారత్కు ఈ ఎడిషన్లో తొలి పతకాన్ని అందించిన అథ్లెట్గా మనూ నిలిచింది. తాజాగా మంగళవారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి మరోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. దక్షిణ కొరియా జోడీని ఓడించి ఈ జంట మెడల్ను కైవసం చేసుకుంది.124 ఏళ్ల క్రితంఈ క్రమంలో భారత్ తరఫున ఒలింపిక్స్ సింగిల్ ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన మనూ.. ఈ ఘనత అందుకున్న ప్యూర్ ఇండియన్గా రికార్డులకెక్కింది. అంతకు ముందు 1900 ఒలింపిక్స్లో బ్రిటిష్- ఇండియన్ నార్మన్ ప్రిచార్డ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్లో రజతాలు సాధించాడు. ఈ క్రమంలో భారత్ తరఫున 124 ఏళ్ల తర్వాత హరియాణా అమ్మాయి మనూ భాకర్ ఈ రికార్డు బద్దలు కొట్టింది.చదవండి: నాడు కోచ్తో మనూ గొడవ.. శాపం పోయిందంటూ రాణా సంతోషంTHE HISTORIC MOMENT! 🇮🇳Manu Bhakar and Sarabjot Singh wins clinching the bronze medal in the #Shooting double event! 🥉 - #ManuBhaker becomes the first Indian woman to win multiple medals at an Olympics. 🫡❤️#IndiaAtParis2024 #ManuBhakar pic.twitter.com/DSSwilaFdp— Ashish 𝕏|.... (@Ashishtoots) July 30, 2024 -
Olympics 2024: భారత్ ఖాతాలో రెండో పతకం
Olympics 2024 Day 4: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ రెండో పతకం కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్లో కాంస్యం దక్కించుకుంది. భారత షూటింగ్ జోడీ మనూ భాకర్- సరబ్జోత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్ మెడల్ అందించారు. దక్షిణ కొరియా జోడీ(జిన్ ఓయె–లీ వన్హో)ని 16-10తో ఓడించి పతకం సాధించారు. ఈ క్రమంలో మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున ఒకే ఎడిషన్లో రెండు పతకాలు గెలిచిన అథ్లెట్గా నిలిచింది. కాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో ఆమె కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.సరబ్జోత్కు తొలి మెడల్మరోవైపు.. పురుషుల వ్యక్తిగత విభాగంలో త్రుటిలో ఫైనల్ అవకాశాలు చేజార్చుకున్న సరబ్జోత్కు మిక్స్డ్ ఈవెంట్లో మాత్రం లక్ కలిసి వచ్చింది. పేలవంగా ఆరంభించినా మనూ ఆది నుంచే ఆకట్టుకోవడంతో కొరియన్ జంటను ఓడించగలిగారు. ఫలితంగా మనూ ఖాతాలో రెండో పతకం చేరగా.. సరబ్జోత్ తొలి మెడల్ను ముద్దాడాడు.ఇక సోమవారం పతకం కోసం బరిలోకి దిగిన షూటర్లలో అర్జున్ బబూతా నాలుగో స్థానంలో నిలిచి దురదృష్టవశాత్తూ కాంస్యం చేజార్చుకోగా, రమిత ఏడో స్థానంతో నిరాశగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. THE HISTORIC MOMENT! 🇮🇳Manu Bhakar and Sarabjot Singh wins clinching the bronze medal in the #Shooting double event! 🥉 - #ManuBhaker becomes the first Indian woman to win multiple medals at an Olympics. 🫡❤️#IndiaAtParis2024 #ManuBhakar pic.twitter.com/DSSwilaFdp— Ashish 𝕏|.... (@Ashishtoots) July 30, 2024BREAKING: India WIN Bronze medal 🔥🔥🔥 Manu Bhaker & Sarabjot Singh beat Korean pair 16-10 in 10m Air Pistol Mixed team event to win India's 2nd medal in Paris. #Paris2024 #Paris2024withIAS pic.twitter.com/G2XcZRgpoN— India_AllSports (@India_AllSports) July 30, 2024 -
ఒలింపిక్స్లో నేటి (జులై 30) భారత షెడ్యూల్
పారిస్ ఒలింపిక్స్లో మూడో రోజు భారత్కు ఆశించినంత ఫలితాలు రాలేదు. షూటింగ్, టెన్నిస్, ఆర్చరీలో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ సింగిల్స్లో లక్ష్య సేన్, డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ తదుపరి రౌండ్లకు అర్హత సాధించగా.. హాకీలో భారత్ డ్రాతో గట్టెక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా తృటిలో పతకం చేజార్చుకోగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్-సరబ్జోత జోడీ కాంస్య పతక రేసులో నిలిచింది.నాలుగో రోజు (జులై 30) భారత షెడ్యూల్ ఇలా..షూటింగ్- పృథ్వీరాజ్ తొండైమాన్ (ట్రాప్ మెన్స్ క్వాలిఫికేషన్)- 12:30 గంటలకుశ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (ట్రాప్ వుమెన్స్ క్వాలిఫికేషన్)- 12:30 గంటలకుకాంస్య పతక పోరు: మనూ భాకర్, సరబ్జోత్ సింగ్ వర్సెస్ కొరియా టీమ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్)- మధ్యాహ్నం ఒంటి గంటకురోయింగ్- బల్రాజ్ పన్వర్ (మెన్స్ సింగిల్స్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్)- మధ్యాహ్నం 1:40 గంటలకుహాకీ- ఇండియా వర్సెస్ ఐర్లాండ్ (మెన్స్ పూల్-బి)- సాయంత్రం 4:45 గంటలకుఆర్చరీ- అంకిత భకత్ వర్సెస్ వియోలెట మిస్జోర్ (పోలాండ్)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్- సాయంత్రం 5:14 గంటలకుభజన్ కౌర్ వర్సెస్ సైఫా నూరాఫిఫా కమల్ (ఇండొనేషియా)- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్- సాయంత్రం 5:27 గంటలకుబ్యాడ్మింటన్- సాత్విక్సాయిరాజ్/చిరాగ్ షెట్టి వర్సెస్ అల్ఫియాన్ ఫజర్/ముహహ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండొనేషియా)- పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజీ- సాయంత్రం 5:30 గంటలకుఅశ్విని పొన్నప్ప/తనిష క్రాస్టో వర్సెస్ సెత్యానా మపాసా/ఏంజెలా యు (ఆస్ట్రేలియా)- మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజీ మ్యాచ్- సాయంత్రం 6:20 గంటలకుబాక్సింగ్- జాస్మిన్ లంబోరియా వర్సెస్ నెస్తీ పెటెకియో (ఫిలిప్పీన్స్)- మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32- రాత్రి 9:24 గంటలకుఆర్చరీ- ధీరజ్ బొమ్మదేవర వర్సెస్ ఆడమ్ లి (చెకియా) మెన్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగం 1/32 ఎలిమినేషన్ రౌండ్- రాత్రి 10:46 గంటలకుబాక్సింగ్- ప్రీతి పవార్ వర్సెస్ యెని మార్సెలా అరియాస్ (కొలంలియా)- మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16- మధ్య రాత్రి 1:20 గంటలకు -
మరో కాంస్యం వేటలో
షూటింగ్ యువ తార మనూ భాకర్ రెండు రోజుల వ్యవధిలో తన రెండో ఒలింపిక్ పతకంపై గురి పెట్టింది. ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం నెగ్గిన మనూ భాకర్కు ఈసారి సరబ్జోత్ సింగ్ జత కలిశాడు. ఈ జోడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. జిన్ ఓయె–లీ వన్హో (దక్షిణ కొరియా) జంటతో నేడు జరిగే ఈ పోరులో గెలిస్తే ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్గా మను చరిత్ర సృష్టిస్తుంది. వ్యక్తిగత విభాగంలో త్రుటిలో ఫైనల్ అవకాశాలు చేజార్చుకున్న సరబ్జోత్కు కూడా తొలి పతకం గెలుచుకునేందుకు ఇది మంచి అవకాశం. మరోవైపు సోమవారం పతకం కోసం బరిలోకి దిగిన షూటర్లలో అర్జున్ బబూతా నాలుగో స్థానంలో నిలిచి దురదృష్టవశాత్తూ కాంస్యం చేజార్చుకోగా, రమిత ఏడో స్థానంతో నిరాశగా ని్రష్కమించింది. పారిస్: ఒలింపిక్స్ షూటింగ్ సమరాల్లో భారత్కు సోమవారం మిశ్రమ ఫలితాలు లభించాయి. మనూ భాకర్–సరబ్జోత్ జోడీ కాంస్య పతకం గెలుచుకునే అవకాశాలు సృష్టించుకోగా... ఇతర షూటర్లు విఫలమయ్యారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ–సరబ్ జోడీ క్వాలిఫయింగ్లో మెరుగైన చక్కటి ప్రదర్శన కనబర్చింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో మనూ–సరబ్ ద్వయం గెలిస్తే భారత్ ఖాతాలో షూటింగ్ నుంచి మరో పతకం చేరుతుంది. ఈ మ్యాచ్లో కొరియాకు చెందిన జిన్ ఓయె–లీ వన్హో జంటతో భారత జోడీ తలపడుతుంది. సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్లో 580 స్కోరు సాధించిన భారత షూటింగ్ జంట పతకం కోసం ముందంజ వేసింది. మూడు సిరీస్లలో ఇద్దరు భారత షూటర్లు కలిసి వరుసగా 193, 195, 192 స్కోర్లు సాధించారు. తొలి రెండు సిరీస్లలో 98, 98 పాయింట్లు సాధించిన మనూ చివరి సిరీస్లో 95కే పరిమితం కావడం తుది ఫలితంపై ప్రభావం చూపించింది. సరబ్జోత్ 95, 97, 97 స్కోర్లు నమోదు చేశాడు. నేటి భారత్ ప్రత్యర్థి కొరియా 579 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్వాలిఫయింగ్ ఈవెంట్లో తొలి రెండు స్థానాలు సాధించిన టర్కీ (582), సెర్బియా (581) నేడు జరిగే ఫైనల్లో స్వర్ణ–రజత పతకం కోసం పోటీ పడతాయి. ఇదే ఈవెంట్లో బరిలోకి దిగిన మరో భారత జోడీ రిథమ్ సాంగ్వాన్–అర్జున్ సింగ్ చీమా ఓవరాల్గా 576 పాయింట్లు స్కోరు చేసి 10వ స్థానంతో ముగించింది. బబూతా పోరాడినా... పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో పతక ఆశలతో బరిలోకి దిగిన అర్జున్ బబూతాను చివరకు దురదృష్టం పలకరించింది. స్టేజ్–1లో పది షాట్ల తర్వాత 105 పాయింట్లతో అతను మూడో స్థానంతో మెరుగైన స్థితిలో నిలిచాడు. స్టేజ్–2 ఎలిమినేషన్ రౌండ్ తొలి సిరీస్లో కూడా 10.6, 10.6 స్కోర్లతో పతకావకాశాలు మెరుగుపర్చుకున్నాడు. అయితే ఇదే జోరును బబూతా కొనసాగించలేకపోయాడు. రెండో సిరీస్ తొలి షాట్లో పేలవంగా 9.9 స్కోరు చేయడం అతడిని బాగా దెబ్బ తీసింది. అయినా సరే... మూడు సిరీస్లు ముగిసిన తర్వాత 167.8 స్కోరుతో క్రొయేíÙయా షూటర్ మరిసిచ్తో సమంగా నిలి చాడు. కానీ నాలుగో సిరీస్ రెండో షాట్లో 10.1 మాత్రమే సాధించి వెనకబడిపోయాడు. ఓవరాల్గా 208.4 పాయింట్లతో నాలుగో స్థానమే దక్కింది. ఈ ఈవెంట్లో షెంగ్ లిహావో (చైనా–252.2), విక్టర్ లింగ్రెన్ (స్వీడన్–251.4), మిరాన్ మరిసిచ్ (క్రొయేíÙయా–230) స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగం ఫైనల్లో భారత షూటర్ రమిత జిందాల్ నిరాశపర్చింది. మొత్తం 145.3 పాయింట్లతో ఆమె ఏడో స్థానంతో ముగించింది. పురుషుల ట్రాప్ ఈవెంట్ క్వాలిఫయింగ్లో తొలి రోజు భారత షూటర్ పృథ్వీరాజ్ తొండైమన్ పేలవ ప్రదర్శనను కనబర్చాడు. 75 పాయింట్ల మూడు రౌండ్ల తర్వాత పృథ్వీరాజ్ 68 పాయింట్లు సాధించి ప్రస్తుతం 30వ (చివరి) స్థానంలో కొనసాగుతున్నాడు. అతను వరుసగా 22, 25, 21 పాయింట్లు స్కోరు చేశాడు. మంగళవారం మరో 25 పాయింట్లు చొప్పున రెండు రౌండ్లు జరుగుతాయి. ఆ తర్వాత ఓవరాల్ పాయింట్లను బట్టి టాప్–6లో నిలిచినవారు ఫైనల్స్కు అర్హత సాధిస్తారు. -
శెభాష్ మనూ! మరో పతకానికి గురి.. చరిత్రకు అడుగుదూరంలో
భారత షూటింగ్ జోడీ మనూ భాకర్- సరబ్జోత్ సింగ్ ప్యారిస్ ఒలింపిక్స్-2024లో శుభారంభం చేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సోమవారం నాటి క్వాలిఫికేషన్ రౌండ్లో మూడో స్థానంలో నిలిచారు. తద్వారా మనూ- సరబ్జోత్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. ఇద్దరూ కలిసి 580 పాయింట్లు స్కోరు చేసి.. బ్రాంజ్ మెడల్ పోటీలో నిలిచారు. అయితే, ఈ ఈవెంట్లో మరో జోడీ రిథమ్ సంగ్వాన్- అర్జున్ సింగ్ చీమా మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. టాప్-3కి చేరుకోలేక రేసు నుంచి నిష్క్రమించారు. మరోవైపు.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వుమెన్స్ మెడల్ ఈవెంట్లో రమితా జిందాల్ నిరాశపరిచింది. మెడల్ రౌండ్కు ఆమె అర్హత సాధించలేకపోయింది.చరిత్రకు అడుగు దూరంలో మనూ భాకర్10 మీటర్ల వుమెన్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో 22 ఏళ్ల మనూ భాకర కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా షూటర్గా చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అమ్మాయి.. మరో పతకానికి గురిపెట్టింది.సరబ్జోత్తో కలిసి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. మంగళవారం(మద్యాహ్నం ఒంటి గంటకు) జరుగనున్న ఈ పోటీలో గనుక మనూ- సరబ్జోత్ గెలిస్తే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్గా మనూ భాకర్ రికార్డు సృష్టిస్తుంది. శతాబ్దం తర్వాతఅదే విధంగా.. ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్గా నిలుస్తుంది. 1900 ఒలింపిక్స్లో బ్రిటిష్- ఇండియన్ నార్మన్ పిచార్డ్ 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్లో కలిపి రెండు రజత పతకాలు సాధించాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. మనూ ఇప్పుడు రికార్డు బ్రేక్ చేయగల అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. -
సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవ్వాలనుకుని.. ఒలింపిక్ మెడల్ గెలిచి! (ఫొటోలు)
-
Manu Bhaker: రూ. 2 కోట్లు ఖర్చు చేశాం..
ఒలింపిక్ పతకం గెలిచిన షూటర్ మనూ భాకర్కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. కఠిన శ్రమతోనే ఆమెకు ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసించారు. ‘ఖేలో ఇండియా’లో మనూ భాకర్ భాగమైందని.. ఆమె శిక్షణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే.భారత్ను గర్వపడుతోందిమహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో హర్యానాకు చెందిన మనూ భాకర్ కాంస్యం గెలిచింది. తద్వారా విశ్వ క్రీడల్లో పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా ఆమె చరిత్రకెక్కింది. 22 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన మనూపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ.. ‘‘ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలవడం ద్వారా మనూ భాకర్ భారత్ను గర్వపడేలా చేసింది. తనను ప్రశంసించిన క్రమంలో.. తానూ ఖేలో ఇండియాలో భాగమయ్యానని ఆమె తెలిపింది. ప్రధాని మోదీ చొరవతో ఖేలో ఇండియా కార్యక్రమం రూపుదిద్దుకుంది.ఆమె శిక్షణ కోసం రూ. 2 కోట్లు ఖర్చు చేశాంపాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. వారిని మెరికల్లా తీర్చిదిద్దే బాధ్యతను కోచ్లకు అప్పగిస్తున్నాం. మనూ భాకర్ శిక్షణ కోసం దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశాం. ట్రెయినింగ్ కోసం ఆమెను జర్మనీ, స్విట్జర్లాండ్కు పంపించాం.తను కోరుకున్న కోచ్ను శిక్షకుడిగా నియమించాం. కావాల్సిన ఆర్థిక సహాయం అందించాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా మన క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్లో మన వాళ్లు సత్తా చాటుతారని నమ్మకం ఉంది. మన ఆటగాళ్లకు మనం ఎల్లవేళలా మద్దతుగా ఉండాలి. మన అథ్లెట్లు అద్భుతంగా ఆడి పతకాలతో తిరిగి రావాలని ఆశిద్దాం’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్లో తలపడుతున్న అథ్లెట్లకు మన్సుఖ్ మాండవీయ ఆల్ ది బెస్ట్ చెప్పారు.చదవండి: ‘మీ అహానికి అభినందనలు’: నాడు కోచ్తో మనూ గొడవ.. శాపం పోయిందంటూ.. -
నాడు కోచ్తో మనూ గొడవ.. కట్ చేస్తే!
మనూ భాకర్.. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్కు తొలి పతకం అందించిన క్రీడాకారిణి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన ఈ హర్యానా అమ్మాయి.. భారత్ తరఫున మెడల్ గెలిచిన తొలి మహిళా షూటర్గా రికార్డు సాధించింది. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పతకాలు అందుకున్న మనూ భాకర్ ఖాతాలో.. ఇప్పుడు ఒలింపిక్ మెడల్ కూడా చేరింది. టోక్యోలో నిరాశ ఎదురైనా పడిలేచిన కెరటంలా మనూ ‘బుల్లెట్’లా దూసుకొచ్చిన తీరు అద్భుతం. అయితే, ఈ ప్రయాణంలో 22 ఏళ్ల మనూకు తన తండ్రి రామ్కిషన్ భాకర్ ప్రోత్సాహంతో పాటు.. కోచ్ జస్పాల్ రాణా.. ‘‘పెద్దన్న’’లా క్షమించి, మళ్లీ శిక్షణ తీరు నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఉపయోగపడింది. ఏమిటా కథ?!మనూ భాకర్ కెరీర్లో రెండు వేర్వేరు సందర్భాలు ఆమె ప్రస్థానంలో కీలకంగా నిలిచాయి. 2018–2019 సమయంలో మనూ వరుస విజయాలతో అద్భుత ఫామ్లో ఉంది. ఆ సమయంలో భారత జట్టు (పిస్టల్)కు మాజీ ఆటగాడు జస్పాల్ రాణా కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఆ సమయంలో 17 ఏళ్ల ఒక టీనేజర్ ఎలా దుందుడుగా, ఆవేశంగా ఉంటారో భాకర్ కూడా అదే తరహా మానసిక స్థితిలో ఉంది. కోచ్పై ఆగ్రహం.. ఎందుకంటే?రాణా కఠినమైన కోచింగ్ శైలి నచ్చక ఆమె బహిరంగంగానే చిన్న చిన్న విమర్శలు చేస్తూ వచ్చింది. కొంత కాలం తర్వాత ఇది మరింత పెరిగింది. మనూ వేర్వేరు ఈవెంట్లలో ఆడితే ఆమె విఫలమయ్యే అవకాశం ఉందని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్పైనే దృష్టి పెట్టాలంటూ రాణా సూచించాడు.మీ అహానికి అభినందనలు25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మరో షూటర్ చింకీ యాదవ్ను ప్రోత్సహించడాన్ని భాకర్ వ్యక్తిగతంగా తీసుకొని కోచ్పై మరింత ఆగ్రహాన్ని పెంచుకుంది. చివరకు టోక్యో ఒలింపిక్స్కు కొన్ని నెలల ముందు ఢిల్లీ వరల్డ్ కప్లో ఇది పూర్తిగా బయటపడింది. 10 మీటర్ల ఈవెంట్లో చింకీ స్వర్ణం గెలవగా, మనూ కాంస్యానికే పరిమితమైంది. దాంతో మనూ ‘ఆనందం దక్కింది కదా... మీ అహానికి అభినందనలు’ అంటూ రాణాకు మెసేజ్ చేసింది.‘సర్...నాకు మీరు మళ్లీ కోచింగ్ ఇస్తారా’ ఆ వాక్యాలను రాణా తన టీషర్ట్పై వెనుక భాగంలో రాసుకొని మైదానమంతా తిరిగాడు. దాంతో మనూతో అక్కడే అన్ని సంబంధాలు ముగిసిపోయాయి! కాలక్రమంలో రెండేళ్లు గడిచాయి. ఏడాది క్రితం మనూలో కొత్త మథనం మొదలైంది. తాను ఒలింపిక్ పతకం గెలవాలంటే సరైన దారి మళ్లీ సరైన కోచ్ను ఎంచుకోవడమే అనిపించింది. ఎంతో మథనం తర్వాత రాణాకు ‘సర్...నాకు మీరు మళ్లీ కోచింగ్ ఇస్తారా’ అని మెసేజ్ చేసింది.ఒక పెద్దన్న తరహాలో రాణా కూడా స్పందించాడు. గత అనుభవాన్ని మనసులోంచి తీసేసి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. సంవత్సర కాలంలో తనదైన శైలిలో ఆమెకు కోచింగ్తో పాటు ఇతర అన్ని సన్నాహకాల్లో అండగా నిలుస్తూ ఇప్పుడు ఒలింపిక్ పతకం వరకు తీసుకొచ్చాడు. వారి సన్నాహాల్లో ఒక ఆసక్తికర అంశం ఉంది.లక్ష్యంగా పెట్టుకున్న పాయింట్లు సాధించలేనప్పుడు తగ్గిన పాయింట్లలో ఒక్కో పాయింట్కు 10 యూరోల చొప్పున జరిమానా విధించి దానిని అక్కడి పేదవారికి దానం చేయాలనేది ఒక షరతు! ఇప్పుడూ భాకర్ వయసు 22 ఏళ్లే... కానీ గతంతో పోలిస్తే ఎంతో పరిపక్వతతో వ్యవహరించిన ఆమె విజయానికి బాటలు వేసుకుంది. పతకం కోసం పోటీ పడిన సమయంలో జనంలో కూర్చొని ఉన్న రాణాను చూస్తూ ధైర్యం తెచ్చుకున్నానని, తమ శ్రమ ఫలితాన్నందించిందన్న మనూ... రాణాకు తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పడం విశేషం.శాపం తొలగిపోయిందిఇక రాణా స్పందిస్తూ.. ‘‘నా మనసుకు ఇప్పుడు ఉపశమనంగా ఉంది. టోక్యో నుంచి కొనసాగుతున్న శాపం తొలగినట్లనిపించింది. నాటి ఓటమి నుంచి పూర్తిగా కోలుకున్నామని చెప్పలేను. అయితే, మనూ మెడల్ సాధించడం మాకు నిజంగా బిగ్ రిలీఫ్. ప్రతి విషయంలోనూ అతిగా స్పందించడం నాకూ అలవాటే. అయితే, ఆమె మరోసారి నన్ను సంప్రదించినపుడు తనకు నో చెప్పలేకపోయాను. ఇద్దరం మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలుపెట్టాం. తను ఇప్పుడు పరిణతి సాధించిన అథ్లెట్. తన విజయానికి ప్రధాన కారణం ఇదే’’ అని ట్రిబ్యూన్తో పేర్కొన్నాడు.-సాక్షి, క్రీడా విభాగం -
చరిత్ర సృష్టించిన మను భాకర్
-
ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో మూడో స్థానం.. ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్గా రికార్డు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఒలింపిక్స్లో రెండో రోజు (జులై 28) భారత్కు అనుకూల ఫలితాలు
పారిస్ ఒలింపిక్స్లో రెండో రోజు (జులై 28) భారత్కు అనుకూల ఫలితాలు వచ్చాయి. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మనూ భాకర్ భారత్కు తొలి పతకం (కాంస్యం) అందించగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత జిందాల్, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబుతా ఫైనల్స్కు అర్హత సాధించారు. అలాగే పురుషుల రోయింగ్ సింగిల్స్ స్కల్స్ రెపిచేజ్ రౌండ్లో బల్రాజ్ పన్వర్ క్వార్టర్ ఫైనల్కు చేరాడు.మహిళల 50 కేజీల బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రీ క్వార్టర్స్కు చేరింది.మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో ఆకుల శ్రీజ, మనికా బత్రా విజయం సాధించారు.పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ ఎస్ ప్రణయ్ విజయం సాధించాడు. రెండో రోజు భారత్కు వచ్చిన వ్యతిరేక ఫలితాలు..పురుషుల టేబుల్ టెన్నిస్ తొలి రౌండ్లో శరత్ కమల్ స్లొవేనియాకు చెందిన డేనీ కొజుల్ చేతిలో 2-4 తేడాతో (12-10 9-11 6-11 7-11 11-8 10-12) ఓటమిపాలయ్యాడు.పురుషుల టెన్నిస్ సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ నగాల్ ఫ్రాన్స్కు చెందిన కొరెంటిన్ మౌటెట్ చేతిలో 2-6, 6-2, 5-7 తేడాతో ఓటమిపాలయ్యాడు.భారత మహిళల ఆర్చరీ టీమ్ (అంకిత భకత్, భజన్ కౌర్, దీపికా కుమార్) క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో 0-6 తేడాతో భారత్ ఓటమిపాలైంది.టేబుల్ టెన్నిస్లో హర్మీత్ దేశాయ్, స్విమ్మింగ్లో శ్రీహరి నటరాజ్, ధినిధి దేశింగు ఓటమిపాలయ్యారు. -
షూటర్ మను భాకర్ కు జగన్ అభినందనలు
-
Olympics: ‘మను’సంతా పతకమే!
జూలై 25, 2021, టోక్యో... ఫైనల్స్కు కూడా అర్హత సాధించకుండా తీవ్ర నిరాశ... పని చేయని తుపాకీతో వేదనగా నిష్క్రమించిన రోజు... జూలై 28, 2024, పారిస్... ఫైనల్స్లో సత్తా చాటి ఒలింపిక్ కాంస్యం గెలుచుకున్న క్షణం... గర్జించిన తుపాకీని గొప్పగా ప్రదర్శించిన రోజు... అవే ఒలింపిక్స్ క్రీడలు...అదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్... అదే ప్లేయర్...కానీ తుది ఫలితం మాత్రం భిన్నం...విజయాలు కొత్త కాదు... మూడేళ్ల క్రితం మనూ భాకర్ టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగింది. 19 ఏళ్ల ఒక అమ్మాయి మెగా ఈవెంట్లో మొదటిసారి... అదీ మూడు ఈవెంట్లలో పోటీ పడటం చిన్న విషయం కాదు. కానీ అసాధారణ ప్రతిభతో దూసుకొచి్చన ఈ షూటర్ అలాంటి అవకాశం సృష్టించుకుంది. నిజానికి అప్పటి వరకు ఆమె సాధించిన ఘనతలే భాకర్పై అంచనాలు భారీగా పెంచేశాయి. చివరకు అదే ఒత్తిడి ఆమెను చిత్తు చేసింది. టోక్యో ఒలింపిక్స్కు ముందు వరకు పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకుంది. జూనియర్ వరల్డ్ కప్లో రెండు స్వర్ణాలు, యూత్ ఒలింపిక్స్లో స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో రెండు స్వర్ణాలు, వరల్డ్ కప్లలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు... ఇలా ఈ జాబితా చాలా పెద్దది. దాంతో ఇదే జోరులో ఒలింపిక్ పతకం కూడా దక్కుతుందని అంతా ఆశించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇదేదో ఆటలో ఓటమిలా కాదు! క్వాలిఫయింగ్ పోటీల్లో కీలక సమయంలో భాకర్ పిస్టల్ సాంకేతిక సమస్యల కారణంగా పని చేయలేదు. దానిని సరిచేసుకొని వచ్చేసరికి ఆరు నిమిషాల కీలక సమయం వృథా అయింది. అయినా సరే 60 షాట్ల ద్వారా 575 పాయింట్లు సాధించడం విశేషం. చివరకు కేవలం రెండు పాయింట్ల తేడాతో ఫైనల్ అవకాశం కోల్పోయిన మను కన్నీళ్లపర్యంతమైంది. ఈ ప్రభావం మరో రెండు ఈవెంట్లపై పడి ఆమె కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. మళ్లీ మొదలు... ఒలింపిక్ పతకం ప్రతిభ ఉంటేనే కాదు... ధైర్యవంతులకే దక్కుతుంది! శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు ఓటమి భారంతో కుంగిపోయిన దశ నుంచి మళ్లీ పైకి లేవడం ఎంతో ధైర్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా ఇలాంటి పరాజయం తర్వాత కుప్పకూలిపోతారు. టోక్యో ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత ఇతర షూటర్లు అపూర్వీ చండీలా, అభిషేక్ వర్మ, మిక్స్డ్ ఈవెంట్లో ఆమె సహచరుడు సౌరభ్ చౌదరీ మళ్లీ కెరీర్లో ముందుకు వెళ్లలేక దాదాపుగా షూటింగ్కు దూరమయ్యారు. ఒకదశలో మనూ కూడా అలాగే ఆలోచించింది. షూటింగ్ తనలో ఆసక్తి రేపడం లేదని, ఇక ఆటకు గుడ్బై చెప్పి సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకుంది. కానీ సన్నిహితుల కారణంగా ‘చివరిసారిగా మళ్లీ ప్రయతి్నద్దాం’ అనే ఆలోచన మళ్లీ షూటింగ్లో కొనసాగేలా చేసింది. ఈసారి కూడా అంతే స్థాయిలో కఠోర సాధన చేసింది. ఏకాగ్రత చెదరకుండా ఒకే లక్ష్యానికి గురి పెట్టింది. దాంతో మళ్ళీ ఫలితాలు వచ్చాయి. జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో నాలుగు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణం, వరల్డ్ కప్లలో రెండు కాంస్యాలు, వరల్డ్ చాంపియన్షిప్లో స్వర్ణ, కాంస్యాలు దక్కాయి. అయితే పారిస్ క్రీడలకు ముందు గత రికార్డులను ఆమె పట్టించుకోలేదు. తనపై అంచనాలు లేకపోవడమే మంచిదని భావించి ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మెగా ఈవెంట్లోకి అడుగు పెట్టి పతకంతో తన విలువను ప్రదర్శించింది. కానీ ఈ మూడు సంవత్సరాల మూడు రోజుల వ్యవధి ఒక చాంపియన్ ప్లేయర్ కెరీర్లో ఎన్నో మార్పులు తీసుకొచి్చంది... ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని గెలుపు వైపు ఎలా సాగాలో చూపించింది. 22 ఏళ్ల వయసులో మనూ భాకర్ ఇప్పుడు ఒలింపిక్ పతక విజేతగా తానేంటో నిరూపించుకుంది. గత ఒలింపిక్స్ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ సగర్వంగా నిలిచింది. –సాక్షి క్రీడా విభాగంనాన్న అండతో... హరియాణాలోని ఝఝర్ జిల్లా గోరియా మనూ భాకర్ స్వస్థలం. తండ్రి రామ్కిషన్ భాకర్ మర్చంట్ నేవీలో చీఫ్ ఇంజినీర్. చిన్నప్పటి నుంచి ఆయన తన కూతురు ఆసక్తి కనబర్చిన ప్రతీ చోటా ప్రోత్సహించాడు. టెన్నిస్, స్కేటింగ్, మార్షల్ ఆర్ట్స్...ఇలా అన్నీ ఆడించాడు. ఒకదశలో బాక్సింగ్పై బాగా ఆసక్తి కనబర్చి ఎక్కువ సమయం ఈ గేమ్పై దృష్టి పెట్టింది. కానీ 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇదీ నచ్చలేదు. చివరకు తండ్రికి చెప్పి షూటింగ్ వైపు మరలగా... ఆయన ఇక్కడా వద్దనలేదు. కేవలం రెండేళ్ల శిక్షణ, సాధనతో షూటింగ్లో మనూ దూసుకుపోవడం విశేషం. 15 ఏళ్ల వయసులో జాతీయ సీనియర్ చాంపియన్íÙప్లో అగ్రశ్రేణి షూటర్ హీనా సిద్ధూను ఓడించి సంచలనం సృష్టించడంతో పాటు ఈ టోరీ్నలో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు సాధించడంతో అందరి దృష్టి భాకర్పై పడింది. ఆ తర్వాత 16 ఏళ్ల వయసులో మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్లో స్వర్ణం గెలుచుకొని పిన్న వయసులో ఈ ఘనత సాధించిన షూటర్గా నిలిచిన తర్వాత మనూ కెరీర్ బుల్లెట్లా దూసుకుపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
మను మురిపించె...
గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో మూగబోయిన భారతీయ తుపాకీ ‘పారిస్’లో గర్జించింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగి కనీసం ఫైనల్ చేరుకోకుండానే వెనుదిరిగిన మనూ భాకర్... ‘పారిస్’లో మాత్రం చిరస్మరణీయ ప్రదర్శనతో దేశం మొత్తాన్ని మురిపించింది. చెక్కు చెదరని ఏకాగ్రతతో... గురి తప్పని లక్ష్యంతో... ఒక్కో బుల్లెట్ను 10 మీటర్ల ముందున్న వృత్తంలోకి పంపిస్తూ... మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మనూ కొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్గా ఈ హరియాణా అమ్మాయి గుర్తింపు పొందింది. పారిస్: గత చేదు అనుభవాలను వెనక్కి నెట్టి పారిస్ వేదికగా భారత మహిళా షూటర్ మనూ భాకర్ కొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా షూటర్గా చరిత్రకెక్కింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 22 ఏళ్ల మనూ భాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మనూ భాకర్ 221.7 పాయింట్లు సాధించి కాంస్య పతకాన్ని సాధించింది. దక్షిణ కొరియాకు చెందిన జిన్ ఓయె (243.2 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... కిమ్ యెజీ (241.3 పాయింట్లు) రజతం గెలిచింది. ఫైనల్ సాగిందిలా... ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో ఫైనల్ జరిగింది. ముందుగా స్టేజ్–1లో ఎనిమిది మంది షూటర్లు 10 షాట్లు సంధించారు. 12వ షాట్ తర్వాత స్టేజ్–2లో ఎలిమినేషన్ మొదలైంది. 12 షాట్ల తర్వాత తక్కువ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్న వెరోనికా మాయో (హంగేరి–114 పాయింట్లు) ని్రష్కమించింది. అప్పటికి మనూ 121.2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 14వ షాట్ తర్వాత తర్హాన్ (టర్కీ –135.6 పాయింట్లు), 16వ షాట్ తర్వాత రాన్జిన్ జియాంగ్ (చైనా–156.5 పాయింట్లు), 18వ షాట్ తర్వాత జుయ్ లీ (చైనా–178.3 పాయింట్లు) వెనుదిరిగారు. 20వ షాట్ తర్వాత త్రిన్ తు విన్ (వియత్నాం–198.6 పాయింట్లు) నాలుగో స్థానంతో ని్రష్కమించడంతో వరుసగా జిన్ ఓయె, కిమ్ యెజీ, మనూ భాకర్ పతకాల రేసులో నిలిచారు. 22వ షాట్ తర్వాత మనూ భాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో... కిమ్ యెజీ 221.8 పాయింట్లతో రెండో స్థానంలో, జిన్ ఓయె 222.6 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నారు. 0.1 పాయింట్ తేడాతో కిమ్ యెజీకంటే మనూ వెనుకబడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. చివరి రెండు షాట్లలో జిన్ ఓయె 10, 10.6 పాయింట్లు... కిమ్ యెజీ 9.7, 9.8 పాయింట్లు స్కోరు చేశారు. దాంతో జిన్ ఓయె 243.2 పాయింట్లతో స్వర్ణాన్ని ఖాయం చేసుకోగా, కిమ్ యెజీ 241.3 పాయింట్లతో రజతం నెగ్గింది. క్వాలిఫయింగ్లో మెరిసి...పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్లో అర్జున్ బబూతా... మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫయింగ్లో రమితా జిందాల్ టాప్–8లో నిలిచి ఫైనల్స్కు అర్హత సాధించారు. 49 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో అర్జున్ బబూతా 630.1 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత సాధిస్తారు. 43 మంది షూటర్లు పోటీపడ్డ మహిళల క్వాలిఫయింగ్లో రమితా జిందాల్ 631.5 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ విభాగంలోనూ టాప్–8లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత సాధిస్తారు. 7 ఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు పతకం అందించిన ఏడో మహిళా క్రీడాకారిణిగా మనూ భాకర్ నిలిచింది. ఈ జాబితాలో కరణం మల్లీశ్వరి (వెయిట్లిఫ్టింగ్; కాంస్యం–2000 సిడ్నీ), సైనా నెహా్వల్ (బ్యాడ్మింటన్; కాంస్యం–2012 లండన్), మేరీకోమ్ (బాక్సింగ్; కాంస్యం–2012 లండన్), పీవీ సింధు (బ్యాడ్మింటన్; రజతం–2016 రియో, కాంస్యం–2020 టోక్యో), సాక్షి మలిక్ (రెజ్లింగ్; కాంస్యం–2016 రియో), లవ్లీనా బొర్గొహైన్ (బాక్సింగ్; కాంస్యం–2020 టోక్యో) ఉన్నారు. 5 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం గెలిచిన ఐదో భారతీయ షూటర్గా, తొలి మహిళా షూటర్గా మనూ భాకర్ గుర్తింపు పొందింది. గతంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (డబుల్ ట్రాప్; రజతం–2004 ఏథెన్స్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; స్వర్ణం–2008 బీజింగ్), విజయ్ కుమార్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్; రజతం–2012 లండన్), గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్; కాంస్యం–2012 లండన్) ఈ ఘనత సాధించారు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత నేను తీవ్రంగా నిరాశపడ్డాను. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు కాంస్యం సాధించడం పట్ల సంతోషంగా ఉన్నా. దీనిని మాటల్లో చెప్పలేను. వచ్చే సారి ఇంతకంటే మెరుగైన పతకం గెలుస్తానేమో. చాలా కాలం తర్వాత భారత్కు షూటింగ్లో మెడల్ రావడం కూడా గొప్పగా అనిపిస్తోంది. ఫైనల్లో ఆఖరి షాట్లో కూడా ఎంతో ప్రయత్నించా. ఒక దశలో రజతం సాధించగలనని భావించా. నేను భగవద్గీత చదువుతాను. నేను చేయాల్సింది చేసి ఫలితాన్ని భగవంతునికే వదిలేస్తాను. మీకు ఏం రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. జరగబోయేది మన చేతుల్లో ఉండదు. మన ప్రయత్నం చేస్తూ అత్యుత్తమ ప్రదర్శన మాత్రమే ఇవ్వగలం. ఈ పతకం కోసం మేం చాలా కష్టపడ్డాం. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. –మనూ భాకర్ చారిత్రక విజయం! పారిస్ ఒలింపిక్స్లో భారత్ తరఫున తొలి పతకం గెలిచిన మనూ భాకర్కు అభినందనలు. షూటింగ్లో ఈ ఘనత సాధించిన తొలి మహిళ కావడం మరింత గర్వకారణం.–నరేంద్ర మోదీ, ప్రధానిభారత పతకాల బోణీ చేసిన భాకర్కు శుభాకాంక్షలు. ఈ విజయం మరింత మంది మహిళలకు స్ఫూర్తినిస్తుంది. మనూ మరిన్ని ఘనతలు సాధించాలి. –ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్గా రికార్డు సృష్టించావు. మనూ... నీ ప్రదర్శనతో దేశం మొత్తం గర్వించేలా చేశావు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంనీ అంకితభావం, శ్రమ ఫలించాయి. ప్రతీ షాట్తో భారత్ గర్వపడేలా చేశావు. నీ పట్టుదలకు ఈ పతకం ఉదాహరణ. –అభినవ్ బింద్రా -
ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం.. మను బాకర్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించిన మను బాకర్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘‘ఒలింపిక్స్లో షూటింగ్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. యావత్ భారతదేశాన్ని గర్వపడేలా చేశారు’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.పారిస్ ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో మనూ 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలువగా.. సౌత్ కొరియాకు చెందిన ఓ (243.2), కిమ్ (241.3) మొదటి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్ తరఫున షూటింగ్లో పతకం సాధించిన తొలి మహిళగా మనూ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల మనూ హర్యానాకు చెందిన యువతి. మనూ తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా.. తల్లి ప్రిన్సిపల్. మనూ.. 2018 కామన్వెల్త్ క్రీడల్లో 16 ఏళ్ల వయసులోనే స్వర్ణ పతకం సాధించింది. మనూ అర్జున అవార్డు గ్రహీత. My best wishes and congratulations to @realmanubhaker on creating history as the first Indian woman to win a medal in shooting at the Olympics. You have made me and all of India very proud!#Olympics2024Paris pic.twitter.com/tu8YK1Afpd— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2024 -
‘మనూభాకర్’ పాత జుమ్లా ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం గెలిచిన మనూ భాకర్ పాత ట్వీట్ ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. 2018 అక్టోబర్లో యూత్ ఒలింపిక్స్లో మనూభాకర్ గోల్డ్మెడల్ గెలిచిన తర్వాత అప్పటి హర్యానా మంత్రి అనిల్ విజ్ ఆమెకు రూ.2 కోట్ల రివార్డు ప్రకటించారు. అయితే ఈ నగదు అందకపోవడంతో రివార్డు ప్రకటించిన మూడు నెలల తర్వాత మనూ భాకర్ ఒక ట్వీట్ చేశారు. అనిల్విజ్ రివార్డు ప్రకటించిన ట్వీట్ స్క్రీన్షాట్స్ పోస్ట్ చేస్తూ ‘సర్ ప్లీజ్ కన్ఫామ్ చేయండి. ఈ రివార్డు నిజమేనా లేక ఉత్త జుమ్లానా’అని ప్రశ్నించారు. తమకు రివార్డుగా ప్రకటించిన సొమ్ముతో హర్యానా ప్రభుత్వంలో కొందరు ఆటలాడుతున్నారని భాకర్ విమర్శించారు. దీనికి స్పందించిన అనిల్విజ్ రివార్డు గురించి భాకర్ తొలుత క్రీడాశాఖలో తెలుసుకుని తర్వాత ఓపెన్గా మాట్లాడాలని సూచించారు. భాకర్కు రూ.2కోట్ల రూపాయలు కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. క్రీడాకారులకు క్రమశిక్షణ అవసరం అన్నారు. తాజాగా ఈ ట్వీట్లు నెట్టింట వైరల్గా మారాయి. శివసేన(ఉద్ధవ్) వర్గానికి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. భాకర్కు రివార్డు నగదు ఎగ్గొట్టి ఇప్పుడు ఒలింపిక్స్లో ఆమెకు పతకం రాగానే క్రెడిట్ కోసం బీజేపీ నాయకులు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, మనుభాకర్ షూటింగ్లో కాంస్య పతకం గెలుచుకుని ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతా తెరిచారు. -
'గురి' అదిరింది.. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం
పారిస్ ఒలింపిక్స్లో భారత్ తొలి పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనూ బాకర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలో మనూ 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలువగా.. సౌత్ కొరియాకు చెందిన ఓ (243.2), కిమ్ (241.3) మొదటి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్ తరఫున షూటింగ్లో పతకం సాధించిన తొలి మహిళగా మనూ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల మనూ హర్యానాకు చెందిన యువతి. మనూ తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా.. తల్లి ప్రిన్సిపల్. మనూ.. 2018 కామన్వెల్త్ క్రీడల్లో 16 ఏళ్ల వయసులోనే స్వర్ణ పతకం సాధించింది. మనూ అర్జున అవార్డు గ్రహీత.HISTORIC MOMENT. 🇮🇳MANU BHAKER WINS THE BRONZE IN PARIS OLYMPICS. pic.twitter.com/aN6TPamWco— Johns. (@CricCrazyJohns) July 28, 2024Indian flag flying high at Paris Olympics 🥺MANU BHAKER, TAKE A BOW. pic.twitter.com/GeLHFRW4ef— Johns. (@CricCrazyJohns) July 28, 2024BRONZE FOR MANU BHAKER...!!!! 🇮🇳- History in the Paris Olympics by Manu in 10m Air Pistol.ONE OF GREATEST MOMENTS FOR INDIA IN SPORTS 🔥 pic.twitter.com/pwNCszwxk6— Johns. (@CricCrazyJohns) July 28, 2024 -
మనూ చరిత్ర లిఖించేనా!
మూడేళ్ల క్రితం ఎన్నో అంచనాలతో టోక్యో ఒలింపిక్స్లో అరంగేట్రం చేసిన భారత యువ షూటర్ మనూ భాకర్ తడబడి నిరాశపరిచింది. అయితే ఈసారి ‘పారిస్’లో మాత్రం మనూ తుపాకీ గర్జించింది. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా క్వాలిఫయింగ్లో పూర్తి విశ్వాసంతో లక్ష్యంవైపు గురి పెట్టిన మనూ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో నేడు జరిగే ఫైనల్లో మనూ అదే జోరు కొనసాగిస్తే పారిస్ ఒలింపిక్స్లో భారత్ పతకాల బోణీ కొడుతుంది. పారిస్: విశ్వ క్రీడల్లో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ నుంచి రెండు జోడీలు బరిలోకి దిగినా పతకానికి దూరంగా నిలిచాయి. అయితే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 22 ఏళ్ల మనూ భాకర్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి ప్రవేశించి పతకంపై ఆశలు రేకెత్తించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ త్రుటిలో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫయింగ్లో అర్జున్ బబూతా–రమితా జిందాల్ (భారత్) ద్వయం 628.7 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. భారత్కే చెందిన సందీప్ సింగ్–ఇలవేనిల్ వలారివన్ జోడీ 626.3 పాయింట్లు సాధించి 12వ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 28 జోడీలు క్వాలిఫయింగ్లో పోటీపడ్డాయి. టాప్–4లో నిలిచిన జోడీలు ఫైనల్ చేరుకుంటాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్లో సరబ్జోత్ సింగ్ త్రుటిలో ఫైనల్కు దూరమయ్యాడు. 33 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత సాధించారు. సరబ్జోత్, జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్ 577 పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. అయితే సరబ్జోత్ (16) కంటే 10 పాయింట్ల షాట్లు ఎక్కువ కొట్టిన రాబిన్ వాల్టర్ (17) ఎనిమిదో స్థానంతో ఫైనల్ బెర్త్ను దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు. నిలకడగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్లో భారత్ నుంచి మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ బరిలో నిలిచారు. మొత్తం 44 మంది షూటర్లు క్వాలిఫయింగ్లో పోటీపడ్డారు. మనూ 580 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి ఫైనల్కు చేరింది. రిథమ్ మాత్రం 573 పాయింట్లతో 15వ స్థానాన్ని దక్కించుకొని ఫైనల్కు దూరమైంది. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్లో ఒక్కో షూటర్కు 10 షాట్లతో ఆరు సిరీస్లు అవకాశం ఇచ్చారు. మనూ వరుసగా ఆరు సిరీస్లలో 97, 97, 98, 96, 96, 96 పాయింట్లు సాధించింది. నేడు జరిగే ఫైనల్లో వెరోనికా (హంగేరి), జిన్ ఓ యె (దక్షిణ కొరియా), విన్ తు ట్రిన్ (వియత్నాం), కిమ్ యెజి (దక్షిణ కొరియా), జుయ్ లీ (చైనా), తర్హాన్ సెవల్ (టరీ్క), రాన్జిన్ జియాంగ్ (చైనా)లతో కలిసి మనూ పోటీపడుతుంది. ఫైనల్లో ముందుగా 8 మంది షూటర్లు 10 షాట్లు సంధిస్తారు. 10 షాట్ల తర్వాత తక్కువ స్కోరు ఉన్న చివరి షూటర్ ని్రష్కమిస్తుంది. ఆ తర్వాత ప్రతి రెండు షాట్ల తర్వాత ఒక్కో షూటర్ అవుట్ అవుతారు. చివరకు 24 షాట్లు ముగిశాక టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. -
ప్యారిస్ ఒలింపిక్స్: ఫైనల్ చేరుకున్న మనూ భాకర్ (ఫొటోలు)
-
Paris Olympics 2024: భారత్కు గుడ్న్యూస్.. ఫైనల్ చేరుకున్న మను భాకర్
ప్యారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత్కు షూటింగ్లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. అయితే ఆఖరిలో మాత్రం భారత్కు కాస్త ఊరట లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ విభాగంలో మను భాకర్ ఫైనల్ రౌండ్కు ఆర్హత సాధించింది.క్వాలిఫికేషన్ రౌండ్లో 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన మనూ.. తుది పోరు(మెడల్ రౌండ్)కు క్వాలిఫై అయింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్(573 పాయింట్లు) 15వ స్ధానానికే పరిమితమైంది. దీంతో తొలి రోజు షూటింగ్లో భారత్ ఈవెంట్లు పూర్తయ్యాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ జులై 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్, రమిత- అర్జున్ బబుతా జోడీలు నిరాశపర్చగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా కూడా ఫైనల్కు ఆర్హత సాధించలేకపోయారు. -
ప్రపంచ రికార్డుతో సిఫ్ట్కౌర్ సమ్రా.. ఇషా సింగ్కు సిల్వర్ మెడల్
Asian Games 2023 Day 4 Updates: టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో ముందడుగు భారత జోడీ సాహిత్యాన్, మనికా బాత్రా థాయ్లాండ్ ద్వయాన్ని ఓడించి రౌండ్ 16కు చేరుకున్నారు. చరిత్ర సృష్టించిన అనంత్జీత్ స్కీట్ మెన్ వ్యక్తిగత విభాగంలో భారత్కు రజత పతకం లభించింది. షూటర్ అనంత్జీత్ సింగ్ నరూకా ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారిగా భారత్కు ఈ పతకం అందించాడు. అద్భుత ప్రతిభతో సిల్వర్ మెడల్ సాధించి చరిత్రకెక్కాడు. 🥈SILVER IN SKEET MEN⚡ 🇮🇳 Shooter and #KheloIndiaAthlete Anantjeet adds another SILVER medal in India's medal haul🌟🎯 This is the 1️⃣st time ever in the history of the Asian Games that India has won a silver in this event. Our shooters' combined excellence is making India… pic.twitter.com/5178kedO1u — SAI Media (@Media_SAI) September 27, 2023 ఇషా సింగ్కు రజతం తెలంగాణ షూటర్ ఇషా సింగ్ 25మీ పిస్టల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. 18 ఏళ్ల ఇషా ఇప్పటికే 25మీ పిస్టల్ టీమ్ విభాగంలో మనూ బాకర్, రిథం సంగ్వాన్తో కలిపి గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. 🥈 A Shining Silver for Esha Singh! 🇮🇳🔫 18-year-old @singhesha10 #TOPSchemeAthlete won a spectacular silver 🥈 in the 25m Pistol event at the #AsianGames2022 Let's applaud her unwavering spirit 🎯🫡 Congratulations, Esha! 🌟🎯 P.S: A special shoutout to the Olympian,… pic.twitter.com/D0AkuBPIAY — SAI Media (@Media_SAI) September 27, 2023 ఫెన్సింగ్లో ముందుకు ఫెన్సింగ్ వుమెన్స్ ఎపీ టీమ్ విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. తనిక్షా ఖత్రి, జ్యోతికా దత్త, ఇనా అరోరా జెర్డాన్ మహిళా జట్టుపై 45-36తో విజయం సాధించారు. ఇక క్వార్టర్స్లో భారత జట్టు సౌత్ కొరియాను ఎదుర్కోనుంది. హాకీలో.. భారత మహిళా జట్టులో హాకీలో విజయంతో గ్రూప్ దశను ఆరంభించింది. సెయిలింగ్లో మరో పతకం ఆసియా క్రీడల్లో సెయిలింగ్ విభాగంలో భారత్ మరో పతకం సాధించింది. Men's Dnghy ILCA7 ఈవెంట్లో విష్ణు శరవణన్ కాంస్యం గెలిచాడు. కాగా సెయిలింగ్లో భారత్కు ఇది మూడో మెడల్. 3️⃣rd Medal in SAILING⛵🇮🇳@VishnuS28686411 has secured the BRONZE🥉 MEDAL in the ILCA7 sailing event at the #AsianGames2022! 🥉⛵ His outstanding performance on the water has brought honor to India. Well done, Vishnu! 🌟🌊 #Cheer4India#Hallabol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/Dr9RSqq5ae — SAI Media (@Media_SAI) September 27, 2023 GOLD WITH A WORLD RECORD- భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్) వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సిఫ్ట్కౌర్ సమ్రా గోల్డ్ మెడల్ సాధించింది. 469.6 స్కోరుతో ప్రపంచ రికార్డు నమోదు చేసి దేశానికి బంగారు పతకం అందించింది 22 ఏళ్ల సమ్రా. తద్వారా భారత పసిడి పతకాల సంఖ్యను ఐదుకు చేర్చింది. GOLD FOR 🇮🇳 WITH A WORLD RECORD! Huge applause for Sift Samra Kaur, who has secured 🇮🇳's 1st Individual Gold🥇at the #AsianGames2022 👏@SiftSamra's Gold in the Women's 50m Rifle 3 Position event was achieved through unbelievable and surreal shooting, displaying incredible… pic.twitter.com/M1Sg1aB9e6 — Anurag Thakur (@ianuragthakur) September 27, 2023 స్కీట్ మెన్స్ టీమ్ విభాగంలో భారత జట్టుకు కాంస్యం భారత పురుష షూటర్ల జట్టు కాంస్య పతకం సాధించింది. గుర్జోత్, అనంత్జీత్, అంగాడ్విర్ స్కీట్ మెన్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. Remarkable display of skill and teamwork⚡👍 The Skeet Men's Team secures the BRONZE MEDAL! 🥉🇮🇳 Their precision shooting has earned 🇮🇳 a place on the podium, and we couldn't be prouder! 🌟🎯#Cheer4India#Hallabol#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/FfaqFlRubI — SAI Media (@Media_SAI) September 27, 2023 ఆషీ చోక్సీకి కాంస్యం 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో భారత మహిళా షూటర్ ఆషీ చోక్సీ కాంస్యం సాధించింది. AND ANOTHER BRONZE🥉🎯 Outstanding performance by the 🇮🇳 Shooter, Ashi Chouksey finished 3️⃣rd in the Women's 50m Rifle 3 Positions Individual, winning India it's 8️⃣th bronze at the #AsianGames2022 ⚡🏅 With this, Ashi has won a total of 3️⃣ medals (2🥈1 🥉) so far. Proud of you,… pic.twitter.com/IQhhdQyA6m — SAI Media (@Media_SAI) September 27, 2023 బంగారు తల్లులు.. వారికేమో వెండి పతకం చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ బుధవారం శుభారంభం చేసింది. షూటింగ్ విభాగంలో తొలుత రజతం, తర్వాత ఈవెంట్లో స్వర్ణం దక్కింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్)లో సిఫ్ట్కౌర్ సమ్రా, మనిని కౌశిక్, ఆషి చోక్సీలతో కూడిన మహిళా జట్టు భారత్కు సిల్వర్ మెడల్ అందించింది. 50 మీటర్ల రైఫిల్ విభాగం(3 పొజిషన్స్)లో రజతం బంగారు తల్లులు వీరే తదుపరి.. 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు మనూ బాకర్, రిథం సంగ్వాన్, ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మరో పసిడి చేర్చారు. దీంతో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరింది. ప్రస్తుతం నాలుగు స్వర్ణాలు, ఐదు వెండి, ఏడు కాంస్యాలు ఉన్నాయి. 🏆 Triumph Beyond Measure! 🇮🇳🔫 In the 25-meter Pistol Women's Team event, the formidable trio of @realmanubhaker, Sangwan Rhythm, and @singhesha10 secures India's pride with a GOLD medal finish! 🥇🔥 Their exceptional precision and teamwork deserve a standing ovation! 🌟👏… pic.twitter.com/lh7q3t8inx — SAI Media (@Media_SAI) September 27, 2023 -
శెభాష్ మనూ, ఇషా, రిథమ్.. భారత్కు మరో స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో భారత్ మరో స్వర్ణం సాధించింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో ఈ పతకం దక్కింది. భారత షూటర్లు మనూ బాకర్, రిథం సంగ్వాన్, ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మరో పసిడి చేర్చారు. చాంపియన్లుగా నిలిచి దేశానికి గర్వకారణమయ్యారు. తాజా గోల్డ్ మెడల్తో 19వ ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 16వ పతకం చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు వెండి, ఏడు కాంస్యాలు ఉన్నాయి. 🏆 Triumph Beyond Measure! 🇮🇳🔫 In the 25-meter Pistol Women's Team event, the formidable trio of @realmanubhaker, Sangwan Rhythm, and @singhesha10 secures India's pride with a GOLD medal finish! 🥇🔥 Their exceptional precision and teamwork deserve a standing ovation! 🌟👏… pic.twitter.com/lh7q3t8inx — SAI Media (@Media_SAI) September 27, 2023 -
మను భాకర్కు రెండు స్వర్ణాలు
వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మనూ భాకర్ రెండు పసిడి పతకాలతో మెరిసింది. ఓవరాల్గా ఈ పోటీల్లో శనివారం భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక కాంస్యం చేరాయి. భారత్ ఖాతాలో చైనాలోని చెంగ్డూలో జరుగుతున్న క్రీడల్లో భాకర్ 10 మీటర్ల ఎయిర్పిస్టల్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో స్వర్ణాలు సాధించింది. టీమ్ ఈవెంట్లో ఆమెతో పాటు యశస్విని సింగ్ దేశ్వాల్, అభింద్య అశోక్ పాటిల్ సభ్యులుగా ఉన్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలోనూ భారత్కు చెందిన ఎలవెనిల్ వలరివన్ స్వర్ణ పతకం గెలుచుకుంది. మరో వైపు జూడో 57 కేజీల మహిళల విభాగంలో భారత్కు చెందిన యామిని మౌర్య కాంస్య పతకం సాధించింది. -
Bhopal ISSF World Cup: మనూ భాకర్కు కాంస్యం
భోపాల్లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్లో భారత్ ఖాతాలో ఆరో పతకం చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మనూ భాకర్ (20 పాయింట్లు) కాంస్య పతకం గెలుచుకుంది. టోర్నీలో భాకర్కు ఇదే మొదటి పతకం. ఈ పోరులో డొరీనా (30 పాయింట్లు), జియూ డు (29 పాయింట్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో మరో భారత షూటర్, తెలంగాణకు చెందిన ఇషా సింగ్ పతకం సాధించడంలో విఫలమైంది. శనివారం ఈవెంట్లు ముగిసే సరికి భారత్ 1 స్వర్ణం, 1 రజతాలు, 4 కాంస్యాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా...6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు (మొత్తం 10 పతకాలు) చైనా అగ్ర స్థానంలో నిలిచింది. -
మనూ భాకర్కు స్వర్ణం..
వ్రోక్లా (పోలాండ్): ప్రెసిడెంట్స్ కప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు మనూ భాకర్, రాహీ సర్నోబత్ మెరిశారు. మనూ భాకర్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించగా... రాహీ సర్నోబత్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో రజత పతకం కైవసం చేసుకుంది. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ ఫైనల్లో మనూ (భారత్)–ఒజ్గుర్ వార్లిక్ (టర్కీ) జంట 557 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకం నెగ్గింది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో రాహీ 31 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా! -
షూటర్ మనూ భాకర్కు నాలుగో స్వర్ణం
World Junior Shooting Championship: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ మనూ భాకర్ నాలుగో స్వర్ణం సాధించింది. పెరూలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మహిళల టీమ్ 25 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్లో మనూ, రిథమ్, నామ్యా కపూర్లతో కూడిన టీమిండియా 16–4తో అమెరికాపై నెగ్గింది. పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్ లో, 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో భారత్కు రజతాలు దక్కాయి. భారత్, ఆ్రస్టేలియా తొలి టి20 వర్షార్పణం వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య గోల్డ్కోస్ట్లో గురువారం జరిగిన తొలి టి20 క్రికెట్ మ్యాచ్ రద్దయింది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 15.2 ఓవర్లలో 4 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం వచి్చంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు) దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో టి20ల్లో 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న నాలుగో భారత మహిళా క్రికెటర్గా ఆమె నిలిచింది. -
‘పిస్టల్’ పని చేయలేదు!
టోక్యో: తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న యువ షూటర్ మనూ భాకర్ గుండె పగిలింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో కచ్చితంగా పతకం సాధించగలదని భావించిన భాకర్, ఫైనల్స్కు కూడా అర్హత సాధించలేకపోయింది. తాను నమ్ముకున్న ‘ఆయుధం’ ఆమెను చివరకు దెబ్బ తీసింది. క్వాలిఫయింగ్ ఈవెంట్ సందర్భంగా భాకర్ పిస్టల్ సాంకేతిక లోపంతో పని చేయలేదు. పోటీ జరుగుతున్న వేదిక నుంచి కాస్త దూరంగా వెళ్లిన భారత షూటర్... దానిని సరి చేయించుకొని వచ్చి మళ్లీ బరిలోకి దిగే సరికే అమూల్యమైన సమయం వృథా అయింది. దాంతో 19 ఏళ్ల మనూ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. మొత్తం 6 రౌండ్లలో వరుసగా 98, 95, 94, 95, 98, 95 (మొత్తం కలిపి 575 పాయింట్లు) స్కోర్ చేసిన ఆమె 12వ స్థానంలో నిలిచి ఫైనల్ అవకాశాలు చేజార్చుకుంది. ఇదే విభాగంలో బరిలోకి దిగిన మరో భారత షూటర్ యశస్విని సింగ్ కూడా నిరాశపర్చింది. క్వాలిఫయింగ్లో 574 పాయింట్లు సాధించిన ఆమె 13వ స్థానంతో సరిపెట్టుకుంది. టాప్–8లో నిలిచిన వారే ఫైనల్కు చేరుకుంటారు. రెండో పిస్టల్ ఉన్నా కూడా... సాధారణంగా షూటర్లు ఈవెంట్ సమయంలో ‘స్పేర్ గన్’ను ఉంచుకుంటారు. పేరుకు ఇది కూడా గ్రిప్, ట్రిగ్గర్ తదితర అంశాల్లో దాదాపుగా మొదటి పిస్టల్లాగే ఉన్నా... సుదీర్ఘ కాలంగా మొదటి గన్తోనే ప్రాక్టీస్ చేసిన అలవాటు వల్ల కొత్త గన్ను అంత సమర్థంగా ఉపయోగించడం కష్టమవుతుంది. పైగా రెండో గన్ తీసుకుంటే ఎలా పని చేస్తుందో చూసేందుకు ‘సైటర్స్’ (షూట్ చేసి పరీక్షించడం) చేయాల్సి ఉంటుంది. మొత్తం పిస్టల్ చెడిపోవడంవంటి అత్యవసర పరిస్థితి అయితే తప్ప రెండో గన్ను బయటకు తీయరు. భాకర్ ఘటనతో కొత్త గన్ను పరీక్షించడంతో పోలిస్తే మొదటి గన్ను రిపేర్ చేయడానికే తక్కువ సమయం పడుతుంది కాబట్టి దానినే ఎంచుకున్నట్లు రోనక్ పండిట్ వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తూ ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా మనూ మంచి స్కోరు సాధించగలిగింది. ఇలాంటి స్థితిలోనూ ఆమె కుప్పకూలిపోలేదు. గన్లకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం కానీ అసలు లివర్ విరిగిపోవడం అనేది అనూహ్యం. మనూ ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా’ అని పండిట్ వ్యాఖ్యానించారు. టోక్యో ఒలింపిక్స్లో మరో రెండు ఈవెంట్లు (25 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్)లలో భాకర్ ఇంకా పోటీ పడాల్సి ఉంది. అసలేం జరిగింది? వేర్వేరు ప్రపంచకప్లలో 9 స్వర్ణాలు, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాలతో పాటు ప్రస్తుత వరల్డ్ నంబర్ 2 అయిన హరియాణా టీనేజర్ మనూ భాకర్పై ఒలింపిక్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. మనూ కూడా అదే ఉత్సాహంతో బరిలోకి దిగింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్కోరు సాధించే మొత్తం 60 షాట్లు అందుబాటులో ఉంటాయి. ఆరు సిరీస్లలో కలిపి 75 నిమిషాల్లో వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. 16 షాట్లు ఆడిన తర్వాత ఆమె పిస్టల్ మొరాయించింది. ఈ 16 షాట్లను అద్భుతంగా వాడుకున్న భాకర్ స్కోరులో 10 పాయింట్ల షాట్లు 10... 9 పాయింట్ల షాట్లు 6 ఉండటం విశేషం. అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆమె సరైన దిశలోనే సాగింది. ‘పిస్టల్ కాకింగ్ లివర్ విరిగిపోయింది. ఇలాంటిది సాధారణంగా ఎప్పుడూ జరగదు. లివర్ మార్చాలంటే గ్రిప్, ట్రిగ్గర్ సర్క్యూట్ కూడా బయటకు తీయాల్సి ఉంటుంది. దీనిని సరి చేసిన తర్వాత సర్క్యూట్ పని చేయలేదు. దాంతో దానిని కూడా మార్చాల్సి వచ్చింది’ అని మనూ భాకర్ కోచ్ రోనక్ పండిట్ వివరించారు. నిబంధనల ప్రకారం షూటర్ల వ్యక్తిగత సమస్యకు ఎలాంటి అదనపు సమయం లభించదు. మనూ మళ్లీ తన స్పాట్ వద్దకు వచ్చి షూట్ చేసే సమయానికి మరో 38 నిమిషాలు మిగిలి ఉండగా, 44 షాట్లు పూర్తి చేయాల్సి ఉంది. దాంతో వేగం పెంచిన మనూ తన సామర్థ్యానికి తగినట్లుగా చివర్లో షూట్ చేయలేక 2 పాయింట్ల తేడాతో ఫైనల్ అవకాశం కోల్పోయింది. ముఖ్యంగా 60వ షాట్లో 10 పాయింట్లు స్కోర్ చేసి ఉంటే ముందంజ వేసే అవకాశం ఉండగా... 8 పాయింట్లు మాత్రమే సాధించింది. దీపక్, దివ్యాంశ్ విఫలం... పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు పేలవ ప్రదర్శన కనబర్చారు. బరిలోకి దిగిన ఇద్దరు షూటర్లు దీపక్ కుమార్, దివ్యాంశ్ సింగ్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. క్వాలిఫయింగ్లో దీపక్ 624.7 పాయింట్లతో 26వ స్థానంలో నిలవగా... 622.8 పాయింట్లు సాధించిన దివ్యాంశ్ సింగ్ పన్వర్ 32వ స్థానంతో సరిపెట్టుకున్నారు. స్కీట్లో అవకాశం ఉందా! పురుషుల స్కీట్ విభాగంలో ఇద్దరు భారత షూటర్లు తొలి రోజు ఫర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చారు. ఇదే పోటీ సోమవారం కూడా కొనసాగుతుంది. మొదటి రోజు అంగద్ సింగ్ అందుబాటులో ఉన్న 75 పాయింట్లలో 73 పాయింట్లు (24, 25, 24) సాధించి 11వ స్థానంలో ఉన్నాడు. మిగిలిన రెండు సిరీస్లలో నేడు పోరాడతాడు. మరో భారత షూటర్ మేరాజ్ 71 పాయింట్లు సాధించి 25వ స్థానంలో నిలిచాడు. మొత్తం ఐదు సిరీస్లు ముగిసిన అనంతరం టాప్–6 మాత్రమే ఫైనల్లోకి అడుగుపెడతారు. -
మనూ–సౌరభ్ జంటకు రజతం
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్కు మూడో పతకం లభించింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ జంటకు రజత పతకం దక్కింది. ఫైనల్లో మనూ–సౌరభ్ జోడీ 12–16తో వితాలినా బత్సారష్కినా–అర్తెమ్ చెర్నోసువ్ (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఇదే ఈవెంట్ కాంస్య పతక పోరులో అభిషేక్ వర్మ–యశస్విని సింగ్ (భారత్) జోడీ 7–17తో గొల్నూష్ సెబ్గతోలాహి–జావెద్ ఫరూగి (ఇరాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
భారత మహిళల పిస్టల్ జట్టుకు కాంస్యం
ఒసిజెక్ (క్రొయేషియా): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్కు రెండో కాంస్య పతకం లభించింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్, రాహీ సర్నోబత్, యశస్విని సింగ్లతో కూడిన భారత బృందం మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో మనూ, రాహీ, యశస్విని త్రయం 16–12 పాయింట్ల తేడాతో వెరోనికా, మిరియమ్ జాకో, సారా రాహెల్లతో కూడిన హంగేరి జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కాంస్య పతక పోరులో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, దీపక్ కుమార్, దివ్యాంశ్ సింగ్ పన్వర్లతో కూడిన భారత జట్టు 14–16తో మిలెంకో, స్టెఫనోవిచ్, లాజార్లతో కూడిన సెర్బియా జట్టు చేతిలో ఓడిపోయింది. పురుషుల స్కీట్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ గుర్జత్ ఖంగురా క్వాలిఫయింగ్లో 115 పాయింట్లు స్కోరు చేసి 56వ స్థానంలో నిలిచాడు. శనివారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ రెండు విభాగాల్లో భారత్కు పతకాలు వచ్చే అవకాశముంది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ సౌరభ్ కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. మనూ, రాహీ, యశస్విని -
షూటర్ మనూ భాకర్కు కోవిడ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా షూటర్ మనూ భాకర్ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోస్ను మంగళవారం తీసుకుంది. హరియాణాలోని ధక్లా గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో అమ్మ, నాన్నలతో పాటు తాను కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ను తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులందరూ వ్యాక్సిన్కు అర్హులని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో... భాకర్ వయసు 19 ఏళ్లే అయినా వ్యాక్సిన్ తీసుకోవడానికి వీలు పడింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే టోక్యో ఒలింపిక్స్లో మనూ భాకర్ షూటింగ్లోని మూడు ఈవెంట్స్లో (25 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్) భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. చదవండి: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు టాప్ ర్యాంక్ -
టోక్యో ఒలింపిక్స్కు భారత షూటింగ్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత షూటింగ్ జట్టును నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్లో భారత షూటర్లు 10 కేటగిరీలకుగాను 15 బెర్త్లు సంపాదించారు. అయితే ఎన్ఆర్ఏఐ నిబంధనల ప్రకారం బెర్త్ అనేది దేశానికి చెందుతుందికానీ అర్హత సాధించిన షూటర్కు కాదు. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అర్హత పొందకపోయినా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, తమిళనాడు షూటర్ ఇలవేనిల్ వలారివన్కు టోక్యోలో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. గత మూడేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఎన్ఆర్ఏఐ 15 మందితో జట్టును ఎంపిక చేసింది. ఇక 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో టోక్యో బెర్త్ సాధిం చిన చింకీ యాదవ్ను కాదని మనూ భాకర్కు అవకాశం ఇచ్చారు. చింకీని రిజర్వ్గా ఎంపిక చేశారు. పురుషుల విభాగం: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: దివ్యాంశ్, దీపక్. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: సంజీవ్ రాజ్పుత్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: సౌరభ్ చౌధరీ, అభిషేక్ వర్మ. స్కీట్ ఈవెంట్: అంగద్వీర్, మేరాజ్ అహ్మద్ఖాన్. మహిళల విభాగం: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: అపూర్వీ, ఇలవేనిల్. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: అంజుమ్, తేజస్విని. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: మనూ భాకర్, యశస్విని. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్: రాహీ, మనూ. 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ టీమ్: దివ్యాంశ్, ఇలవేనిల్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్: సౌరభ్, మనూ భాకర్. -
‘టీమ్’ ఈవెంట్లలో మరో 2 పతకాలు
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో ఏడో రోజు గురువారం భారత్కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో చింకీ యాదవ్, రాహీ సర్నోబత్, మనూ భాకర్లతో కూడిన భారత జట్టు 17–7తో వార్జోనొస్కా, జులిటా బోరెక్, అగ్నీస్కా కొరెజ్వోలతో కూడిన పోలండ్ జట్టుపై గెలిచింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్, శ్రేయ సక్సేనా, గాయత్రి నిత్యానందమ్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 43–47తో అనెటా స్టాన్కివిచ్, అలెక్సాండ్రా, నటాలియా కొచనస్కాలతో కూడిన పోలండ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం భారత్ 10 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సహా మొత్తం 21 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ‘మావాడితో కలిసి ఆడం’ ప్రత్యర్థి ఆటగాళ్లపైనో, వారి నిబంధనల ఉల్లంఘనపైనో మరో జట్టు ఆటగాళ్లు ఫిర్యాదులు చేయడం, పరిష్కారానికి నిర్వహకులు జోక్యం చేసుకోవడం చాలా టోర్నీలలో సహజంగా కనిపించే విషయం. అయితే అందుకు భిన్నంగా తమ జట్టు సహచరుడిపైనే మరొకరు ఫిర్యాదు చేసి అతనితో కలిసి బరిలోకి దిగేందుకు నిరాకరించడం విశేషం. మరికొద్ది నిమిషాల్లో పోటీ అనగా... హంగేరీ షూటర్లు ఇస్తవాన్ పెని, జవన్ పెక్లర్ తమ తోటి షూటర్ పీటర్ సిడీ నిబంధనలకు విరుద్ధంగా ‘బైపాడ్’ అతికిచ్చి ఉన్న రైఫిల్తో పోటీలో పాల్గొంటున్నాడని ఆరోపిస్తూ తాము ఫైనల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనిపై స్పందించిన ఐఎస్ఎస్ఎఫ్ అధికారులు మాత్రం అతను నిబంధనలను అతిక్రమించలేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా రూల్స్ విషయంలో తమకు హంగేరీ ప్లేయర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదంటూ ఘాటుగా స్పందించారు. అయితే నిబంధనలకంటే ఆటగాళ్ల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. సిడీ 2000నుంచి వరుసగా 5 ఒలింపిక్స్లో పాల్గొనగా, ఇస్తవాన్ పెని ప్రస్తుతం వరల్డ్ నంబర్వన్గా ఉన్నా డు. తాజా వివాదంతో భారత్తో ఫైనల్లో పోటీ పడేందుకు అమెరికా అర్హత సాధించగా...ఫైనల్ను నేటికి వాయిదా వేశారు. -
పిస్టల్లో క్లీన్స్వీప్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. టోర్నీ ఆరో రోజు బుధవారం భారత్కు నాలుగు పతకాలు లభించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్లు అందుబాటులో ఉన్న మూడు పతకాలను నెగ్గి క్లీన్స్వీప్ చేశారు. ఈ ఫైనల్లో చింకీ యాదవ్కు స్వర్ణం దక్కగా... రాహీ సర్నోబత్ రజతం, మనూ భాకర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మనూ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. చింకీ యాదవ్, రాహీ 32 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూట్ ఆఫ్ నిర్వహిం చగా... చింకీ యాదవ్ 4 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. 3 పాయింట్లు స్కోరు చేసిన రాహీకి రజతం దక్కింది. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ చరిత్రలో ఒకే ఈవెంట్లో ముగ్గురు భారత షూటర్లు క్లీన్స్వీప్ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే ఈ ముగ్గురు భారత మహిళా షూటర్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ప్రతాప్ సింగ్ ఘనత మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ తరఫున పసిడి పతకం గెలిచిన పిన్న వయస్కుడిగా ప్రతాప్ సింగ్ ఘనత వహించాడు. 20 ఏళ్ల ప్రతాప్ సింగ్ 462.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ప్రపంచ నంబర్వన్ ఇస్తవన్ పెనీ (హంగేరి–461.6 పాయింట్లు) రజతంతో సరిపెట్టుకోగా... స్టీఫెన్ ఒల్సెన్ (డెన్మార్క్–450.9 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్లో భారత షూటర్లు తేజస్విని సావంత్ 12వ స్థానంలో, అంజుమ్ మౌద్గిల్ 16వ స్థానంలో, సునిధి చౌహాన్ 17వ స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత పొందలేకపోయారు. ఆరో రోజు పోటీలు ముగిశాక భారత్ 9 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
షూటింగ్ వరల్డ్కప్: సత్తా చాటిన భారత షూటర్లు
ఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్కప్లో భారత షూటర్ల జోరు కొనసాగుతుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో అన్ని పతకాలు భారతీయ మహిళా షూటర్లు కైవసం చేసుకోవడం విశేషం. బుధవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్ విభాగంలో చింకీ యాదవ్కు స్వర్ణం, రాహీ సావంత్కు రజతం, మను బాకర్కు కాంస్యం దక్కించుకున్నారు.