music director
-
‘తండేల్’కి దేవిశ్రీని తీసుకోవద్దనుకున్నా.. కానీ.. : అల్లు అరవింద్
సినిమా ఆడాలంటే..దమ్మున్న కథ కావాలి. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు కచ్చితంగా థియేటర్కు వస్తాడు. అందులో డౌటే లేదు. కానీ అది ఎంత మంచి కంటెంట్ అయినా సరే.. ప్రేక్షకులకు రీచ్ కాకపోతే అంతే సంగతి. అందుకే రిలీజ్కు ముందే పాటలు, ట్రైలర్, టీజర్లను విడుదల చేస్తూ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు మేకర్స్. రిలీజ్కు ముందు..రిలీజ్ తర్వాత కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేంది సంగీతం అనే చెప్పాలి. పాటలు, నేపథ్య సంగీతం బాగుంటే చాలు సినిమా సగం హిట్టయినట్టే. అందుకే సంగీత దర్శకుల విషయంలోనూ నిర్మాతలు ఆచి తూచి అడుగేస్తారు. జానర్ని బట్టి మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకుంటారు. ఇక ప్రేమ కథలకు పెట్టింది పేరు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad). లవ్స్టోరీ చిత్రాలకు ఆయన అందించే పాటలు ఎలా ఉంటాయో తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. మెలోడీ అయినా మాస్ సాంగ్ అయినా.. హృదయాలను హత్తుకుంటాయి. తాజాగా తండేల్(Thandel) చిత్రానికి కూడా దేవి అలాంటి పాటలే అందించాడు. ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని పాటలు ఇప్పటికే సూపర్ హిట్గా నిలిచాయి. హైలేస్సో హైలెస్సా.. సాంగ్ అయితే అంతటా మార్మోగుతుంది. అలాంటి చాట్ బస్టర్స్ అందించిన దేవిశ్రీ.. ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ కాదట. అసలు ఈ చిత్రానికి అతన్ని తీసుకోవద్దని నిర్మాత అల్లు అరవింద్ అనుకున్నారట. బన్నీ చెప్పడంతోనే తండేల్ చాన్స్ డీఎస్పీకి వచ్చిందట. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిత్రబృందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అరవింద్ ఈ విషయాన్ని చెప్పారు.దేవి సంగీతం వద్దని చెప్పానుతండేల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా దేవిప్రసాద్ని పెట్టుకుందామని మా టీమ్ చెబితే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే..పుష్ప2 సినిమా, మా సినిమా పనులు ఒకేసారి ప్రారంభం అయ్యాయి. దేవి పుష్ప 2కి సంగీతం అందించడంలో బిజీగా ఉన్నాడు. అలాంటి వాడిని తీసుకుంటే మన సినిమాకు న్యాయం చేయలేడని టీమ్కి చెప్పాను. వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవాలనుకున్నాం.బన్నీ చెప్పడంతో..దేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ల నాన్న(సత్య మూర్తి) నా స్నేహితుడు. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. కానీ పుష్ప 2 లాంటి సినిమాకు పని చేస్తున్నప్పడు.. ఇంకో సినిమాకు న్యాయం చేయలేడేమో అనిపించింది. దేవిని వాళ్లే(పుష్ప టీమ్) లాగేసుకుంటారు. మాకు సమయం కేటాయించడు అనుకున్నాం. అయితే తండేల్కి మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరి తీసుకోవాలనేది అర్థం కాలేదు. ఓ రోజు ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో అల్లు అర్జున్కి ఈ విషయం చెప్పాను. ‘ఎవరి తీసుకోవాలో తెలియడం లేదు. దేవిని తీసుకుంటే.. మీరు(పుష్ప 2) ఇబ్బంది పెడతారు. అతన్ని తీసుకోవాలంటే నిన్ను(బన్నీ), దర్శకుడు(సుకుమార్) ఇలా అందరిని అడగాల్సి ఉంటుంది. అందుకే వేరే వ్యక్తిని చూద్దాం అనుకుంటున్నాను’అని చెప్పా. వెంటనే బన్నీ.. ‘దేవినే బెస్ట్ చాయిస్. లవ్స్టోరీలకు దేవిని మించినోడు లేడు..అతన్నే తీసుకోండి’ అని చెప్పాడు. దీంతో మేం దేవిని సంప్రదించాం’ అని అరవింద్ చెప్పుకొచ్చాడు. కాగా, చందు మొండేటి దర్వకత్వంలో నాగచైనత్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఇంట విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్(Gopi Sundar ) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లివి సురేశ్ బాబు(65)( Livi Suresh Babu)కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె గురువారం కేరళలోని కూర్కెన్చెరిలోని తన అపార్టుమెంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా గోపీ సుందరే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తల్లి మరణ వార్తను తెలియజేస్తూ.. ‘అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేసే ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది. నువ్వు వెళ్లిపోలేదు. నా మనసులో, మెలోడీస్లో, నేను వేసే ప్రతీ అడుగులో ఉన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎప్పటికీ నా బలానివి. నాకు దారి చూపించే వెలుగువి’అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వడూకరా క్రిమేటోరియం వద్ద గోపీ సుందర్ తల్లి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్మలయాళం టాప్ సంగీత దర్శకుల్లో గోపి సుందర్ ఒకరు. మెలోడీస్కి కేరాఫ్ ఆయన. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’ తో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో మలయాళ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. గోపీ సుందర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చి మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేశారు. ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘18 పేజెస్’, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి తదితర బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by Gopi Sundar Official (@gopisundar__official) -
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయి
హైదరాబాద్: క్రీడలు శారీరక దేహ దారుడ్యానికే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి కూడా ఎంతో దోహదం చేస్తాయని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 2025 జాతీయ సదస్సు హెచ్ఐసీసీలో నిర్వహించిన సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన బ్రిటిష్ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీదేవి మహాలింగప్పతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నిత్యం జీవితంలోని ఎన్నో టెన్షన్స్ను, పని ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా క్రీడలు ఆడాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో సౌత్ జోన్ సభ్యులు విజేతలుగా నిలిచారు. వారికి థమన్ ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అశ్విన్ బాబు, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి. కిషన్, సెక్రటరీ డాక్టర్ ఉమా శంకర్, కోశాధికారి డాక్టర్ జార్జ్ రెడ్డి, డాక్టర్ విశాల్ ఆకుల, న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నా కూతురు పోయాకే చేదు నిజం తెలుసుకున్నా.. ఇళయరాజా ఎమోషనల్
కళ్లముందు కూతుర్ని కోల్పోవడం కంటే విషాదం మరొకటి ఉంటుందా? ఆ కడుపుకోతను సంగీత జ్ఞాని ఇళయరాజా అనుభవిస్తున్నాడు. గతేడాది జనవరి 25న ఆయన కూతురు, గాయని, సంగీత దర్శకురాలు భవతారిణి క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూసింది. ఆమె మొదటి వర్ధంతి సందర్భంగా కూతుర్ని తలుచుకుని ఇళయారాజా భావోద్వేగానికి లోనయ్యాడు.నిర్లక్ష్యం చేశా..ఇళయరాజా (Ilayaraja) మాట్లాడుతూ.. నేను ఎంతగానో ప్రేమించే నా కూతురు దూరమై ఏడాదవుతోంది. తను మాతో లేదన్న బాధ ఇప్పటికీ నన్ను వేధిస్తోంది. తను నాపై ఎంత ప్రేమ కురిపించేది.. ఎంత ఆప్యాయత చూపించేదన్న విషయం తనను కోల్పోయాకే తెలుసుకున్నాను. నా జీవితమంతా సంగీతానికే ధారపోశాను. ఈ క్రమంలో నా కుటుంబాన్ని పట్టించుకోలేదు. పిల్లల్ని నిర్లక్ష్యం చేశాను. వారికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. ఈ చేదు నిజం నన్ను కుంగదీస్తోంది.సంగీతంతో స్వాంతనసంగీతం ఎంతోమందికి ఓదార్పునిస్తుందంటారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అదే సంగీతం నాకూ కొంత స్వాంతన కలిగిస్తోంది. ఫిబ్రవరి 12న నా కూతురి పుట్టినరోజు. ఆరోజు నా కూతురికి నివాళిగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. నా సన్నిహితులను, ఇండస్ట్రీ మిత్రులను అందరినీ ఈ ప్రోగ్రామ్కు ఆహ్వానిస్తాను. నా కూతురు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. (చదవండి:సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత)సింగర్గా భవతారిణిఇళయరాజాకు కూతురు భవతారిణితో పాటు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా అని ఇద్దరు కుమారులు సంతానం. మలయాళ త్రీడీ ‘మై డియర్ కుట్టి చాత్తాన్’ (1984) గాయనిగా భవతారణికి తొలి చిత్రం. ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ (1995) మూవీ ద్వారా సింగర్గా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ‘భారతి’ (2000) చిత్రంలోని ‘మైలు పోల పొన్ను..’ పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకుంది. తెలుగులోనూ పలు పాటలు పాడింది. ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నన్ను నీతో..’ అనే పాటను ఆలపించింది.మ్యూజిక్ డైరెక్టర్గానూ..‘మిత్ర్: మై ఫ్రెండ్’తో సంగీత దర్శకురాలిగా మారారు భవతారణి. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ‘ఫిర్ మిలేంగే’ (2004) సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా చేశారు. హిందీలో ఇదే తన తొలి సినిమా. దాదాపు పాతిక చిత్రాల్లో సాంగ్స్ పాడగా పది సినిమాలకు సంగీత దర్శకురాలిగా పని చేసింది. శబరిరాజ్ అనే వ్యక్తితో భవతారణి వివాహం జరిగింది.. కానీ, వీరికి సంతానం లేదు.చదవండి: వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే? -
కంగువా బీజీఎంపై విమర్శలు.. దేవీశ్రీ ప్రసాద్ రియాక్షన్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్గా నిలిచిందిఅయితే ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ మూవీలో దేవీశ్రీ సంగీతంపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదురయ్యాయి. కొన్ని సీన్స్లో విపరీతమైన బీజీఎం(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) కొట్టారని దేవిశ్రీ ప్రసాద్పై కొందరు నెటిజన్స్ విమర్శలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన విమర్శలపై డీఎస్పీ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ నేను పెద్దగా పట్టించుకోను. నా పని మీద మాత్రమే ఫోకస్ పెడతా. మనం ఏం చేసినా విమర్శించే వారు విమర్శిస్తూనే ఉంటారు. సూర్య కంగువా ఆల్బమ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో మణిప్పు పాటపై ప్రశంసలు కూడా వచ్చాయి. సూర్య కూడా నాకు ఫోన్ చేసి పాటల గురించి చాలాసేపు మాట్లాడారు. నా పనిని ఆయన ప్రశంసించారు. ప్రతి సినిమాలో మంచి చెడు రెండూ ఉంటాయి. కంగువా మేము ఎంత కష్టపడ్డామో విజువల్స్లో చూస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కొందరికీ నచ్చకపోయినప్పటికీ మేం గర్వపడుతున్నాం' అని అన్నారు.ఆస్కార్ బరిలో కంగువా..అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయిన కంగువా ఆస్కార్-2025 నామినేషన్స్లో చోటు దక్కించుకుంది. భారత్ నుంచి ఆరు చిత్రాలు ఎంపికవ్వగా అందులో కంగువా కూడా ఉంది. ఈ ఏడాది అందించనున్న 97వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్కు ఎంపికైన చిత్రాల జాబితా జనవరి 19న రానుంది. -
విడాకుల తర్వాత ఒకే స్టేజీపై కోలీవుడ్ జంట.. ఫ్యాన్స్ ఎమోషనల్
తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు, హీరో జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవి ఈ ఏడాది మేలో విడిపోయారు. బాల్య స్నేహితులైన వీరు 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట సడన్గా విడిపోవడానికి సిద్ధపడటం అభిమానులను షాక్కు గురి చేసింది. విడాకులు తీసుకున్నజంట11 ఏళ్ల దాంపత్య జీవితానికి ఫుల్స్టాప్ పెడుతూ ఎవరి దారి వారు చూసుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి కనిపించారు. మలేషియాలోని ఓ సంగీత కచేరీలో పాల్గొన్న జీవీ ప్రకాశ్, సైంధవి జంటగా పాటలు ఆలపించారు. అది చూసిన అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కచేరీ కోసం జీవీ ప్రకాశ్ రిహార్సల్స్ చేసేటప్పుడు కూడా సైంధవి.. తన కూతుర్ని తండ్రి దగ్గరకు పంపించింది.మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా, హీరోగా..ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇకపోతే జీవీ ప్రకాశ్ కుమార్ తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా సింగర్గా, హీరోగానూ ఫామ్లో ఉన్నాడు. సైంధవితో కలిసి తమి ఎన్నో పాటలు పాడాడు. ఈయన తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, కథానాయకుడు, యుగానికి ఒక్కడు, పందెం కోళ్లు, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, రాజా రాణి, ఆకాశమే నీ హద్దురా.., సార్, టైగర్ నాగేశ్వరరావు, లక్కీ భాస్కర్, మట్కా.. ఇలా పలు సినిమాలకు సంగీతం అందించాడు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ప్రస్తుతం జీవీ ప్రకాశ్ చేతిలో మ్యూజిక్ డైరెక్టర్గా పదికి పైగా సినిమాలున్నాయి. హీరోగా ఈ ఏడాది మూడు సినిమాలతో పలకరించిన జీవీ ప్రస్తుతం కథానాయకుడిగా మరో మూడు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. Omg ❤️🥺 bt the professionalism btwn them is! 🥹#GVPrakash #gvprakashconcert #GVPrakashKumar #Saindhavi pic.twitter.com/jgarTEbmY9— Mr.D 🤍 ᵈⁱˡˡᵘ (@dilson_raj) December 9, 2024 உங்களுக்கு என்ன நா Rights இருக்கு 🥲🥲😭 எங்க அழ வைக்க @gvprakash #GVPrakash #GVPrakash @singersaindhavi #Saindhavi pic.twitter.com/RCXgse4wFO— 𝕽𝖔𝖇𝖎𝖓 𝕮𝖍𝖗𝖎𝖘 😈🛡️🗡️ (@robinthebadguy) December 8, 2024Pirai Thedum song hits really hard now especially after their separation 💔🥺#gvprakashliveinkl #gvprakashconcert #GVPrakash #saindhavi pic.twitter.com/RXP3G0Wzrx— Ramya Subhashinie ✨ (@blxckfame_) December 8, 2024 Thanks #Malaysia kuala lampur for making my live in concert a BLOCKBUSTER hit …. @dmycreationoffl pic.twitter.com/SUigJNaVwK— G.V.Prakash Kumar (@gvprakash) December 8, 2024 చదవండి: టాప్ 5 కంటెస్టెంట్లతో ప్రభాకర్, ఆమని పోటీ! వీళ్లే కాదు ఇంకా.. -
చెన్నైలో దేవీశ్రీప్రసాద్ కామెంట్స్.. స్పందించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత
ప్రస్తుతం అందరిచూపు పుష్ప-2 ది రూల్పైనే ఉంది. రోజులు గడిచే కొద్ది ఆడియన్స్లో మరింత ఆతృత పెరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్లో కిస్సిక్ సాంగ్ విడుదల చేశారు.అయితే ఈ ఈవెంట్లో మ్యూజిక్ దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ హాట్టాపిక్గా మారాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు నాపై ప్రేమతో పాటు ఫిర్యాదులు కూడా ఎక్కువే ఉన్నాయంటూ మాట్లాడారు. తాను ఏదైనా చెప్పాల్సి వస్తే వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటేనే బాగుంటుందని డీఎస్పీ మాట్లాడారు.అయితే దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్పై తాజాగా నిర్మాత యలమంచిలి రవిశంకర్ స్పందించారు. నితిన్ రాబిన్హుడ్ ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మా వాళ్లకు నాపై లవ్ ఉంటది.. దాంతో పాటు కంప్లైంట్స్ కూడా ఎక్కువే అన్నారు. అందులో తప్పేముంది సార్? మాకైతే దేవిశ్రీ ప్రసాద్ మాటల్లో ఎలాంటి తప్పు కనిపించలేదని రవిశంకర్ అన్నారు. మీరేదో రాసినంత మాత్రాన మేమంతా ఒక్కటే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. డీఎస్పీ ఉన్నంతవరకు ఆయనతో సినిమాలు చేస్తాం.. మేము ఉన్నంతసేపు ఆయన సినిమాలు చేస్తారు.. అందులో డౌటే లేదని రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
తొమ్మిదేళ్లకే ఇండస్ట్రీలోకి.. ఆరో తరగతిలోనే చదువుకి పుల్స్టాప్.. తమన్ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
నా కల నెరవేరింది: తమన్
‘‘బాయ్స్’ (2003) సినిమా సమయంలో శంకర్గారు నాలో యాక్టర్ని చూశారు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ని అని ఆయన గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. శంకర్గారి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా కల. అది ‘గేమ్ చేంజర్’ సినిమాతో నెరవేరింది’’ అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. నేడు (నవంబరు 16) ఆయన పుట్టినరోజు.ఈ సందర్భంగా శుక్రవారం తమన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు రొటీన్ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తున్నాను. సినిమాలో భావోద్వేగం లేకపోతే నేను ఎంత మ్యూజిక్ కొట్టినా వేస్ట్. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన దానికి అనుగుణంగా సంగీతం ఇస్తాను. కొన్ని చిత్రాలకు వాయిస్ ఎక్కువగా వినిపించాలి. ఇంకొన్నింటికి పరికరాల సౌండ్ ఎక్కువగా వినిపించాలి.తెలుగులో ప్రస్తుతం నేను చేస్తున్న ‘తెలుసు కదా, ఓజీ, గేమ్ చేంజర్, డాకు మహారాజ్’ వంటి సినిమాలు దేనికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నేపథ్య సంగీతంలో మణిశర్మగారి తర్వాత నేనో ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. ‘పుష్ప: ది రూల్’కి 15 రోజుల్లో నేపథ్య సంగీతం పూర్తి చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైమ్లో ఫస్ట్ హాఫ్ను దాదాపుగా పూర్తి చేసి ఇచ్చాను. ప్రభాస్గారి ‘రాజా సాబ్’లో ఆరు పాటలుంటాయి. ఇతరుల సినిమాల నుంచి ట్యూన్స్ని కాపీ కొట్టేంత తెలివి నాకు లేదు. అందుకే వెంటనే దొరికిపోతాను (నవ్వుతూ). ‘అఖండ 2’కి ఇప్పటికే ఒక పాట అయిపోయింది. హీరో అల్లు అర్జున్–డైరెక్టర్ త్రివిక్రమ్ల ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. ఓ ప్రపంచ స్థాయి మ్యూజికల్ స్కూల్ నెలకొల్పి, ఆర్థికంగా వెనకబడిన వారికి ఉచితంగా సంగీతం నేర్పించాలనుకుంటున్నాను’’ అని చె΄్పారు. -
మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని శబ్దాలయ వెనుక సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తికి కేటాయించిన స్థలంలో నిరి్మంచిన అక్రమ నిర్మాణాలను షేక్పేట మండల రెవెన్యూ సిబ్బంది బుధవారం కూల్చివేశారు. చక్రవర్తికి మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో నిరి్మంచుకునేందుకు ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లో 20 గుంటల స్థలాన్ని కేటాయించింది. అయితే కేటాయించిన స్థలంలో ఏడాది లోపు ఆ ఉద్దేశాన్ని బహిర్గతపరుస్తూ నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు చెబుతున్నాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి మాత్రం తనకు కేటాయించిన స్థలంలో పదేళ్లు దాటినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆ తర్వాత ఆయన మృతి చెందారు. ఆయన తనయుడు కూడా సదరు స్థలంలో రికార్డింగ్ స్టూడియో నిర్మించకపోగా తాను కూడా తప్పుకున్నారు. దీంతో ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాండ్ బ్యాంక్లో నమోదు చేసింది. గత కొన్నేళ్లుగా ఈ స్థలం ప్రభుత్వ ఆ«దీనంలోనే ఉంది. ఖాళీగా ఉన్న ఈ స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలను చేపట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి 25 వేలు వసూలు చేస్తూ డబ్బాలు ఏర్పాటు చేశారని, కొన్ని శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు తమ దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు షేక్పేట మండల తహశీల్దార్ అనితారెడ్డి తెలిపారు.ఈ స్థలం ప్రభుత్వానిదేనని, ఎవరైనా నిర్మాణాలు చేపట్టినా, ఆక్రమించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ విభాగాలకు కేటాయించే ప్రతిపాదన ఉందన్నారు. ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు నకిలీ డాక్యుమెంట్లతో తమదేనంటూ అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దెలు తీసుకుంటున్నట్లుగా తమ దృష్టికి వచి్చందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
మలయాళ రాక్స్టార్ పెళ్లి.. హాజరైన సెలబ్రిటీలు
మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ పెళ్లి పీటలెక్కాడు. ప్రేయసి, సింగర్ ఉత్తర కృష్ణన్ మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇకపోతే నటుడు పార్వతీ జయరామ్ చుట్టాలమ్మాయే ఉత్తర. బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా..పార్వతి జయరాం కూతురి పెళ్లిలోనే సుశిన్-ఉత్తర ప్రేమాయణం బయటపడింది. మొదట బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న వీళ్లు తర్వాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి భార్యాభర్తలుగా ఓ అడుగు ముందుకు వేశారు. ఈ వివాహానికి సినీనటులు ఫహద్ ఫాజిల్, నజ్రియా, జయరామ్, దర్శకుడు అన్వర్ రషీద్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మ్యూజిక్ కెరీర్..సుశిన్ విషయానికి వస్తే.. దీపక్ దేవ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మొదట శిక్షణ తీసుకున్నాడు. లార్డ్ లివింగ్స్టన్ 700 కండి, కిస్మత్ వంటి చిత్రాలకు బీజీఎమ్ అందించాడు. వరథాన్, కుంబలంగి నైట్స్ సినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భీష్మ పర్వం, మిన్నాల్ మురళి, రోమాంచం, మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, బోగిన్ విల్లా వంటి పలు చిత్రాలకు సంగీతం అందించాడు. Sensational Malayalam music director #SushinShyam got married to AD and singer #UtharaKrishnan ❤️ #fahadhfaasil and wife #Nasriya , #Jayaram were present at this very private ceremony pic.twitter.com/CHR41ApcXL— sridevi sreedhar (@sridevisreedhar) October 30, 2024 చదవండి: అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది! -
రజినీతో బంధుత్వం.. సినిమాకు రూ.10 కోట్లు.. అనిరుధ్ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
నా పాటను మార్చేశారు, రూపాయి కూడా అక్కర్లేదు: కల్కి మ్యూజిక్ డైరెక్టర్
ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను అందించిన అంధగన్ సినిమా టైటిల్ సాంగ్ను ఇష్టమొచ్చినట్లుగా మార్చేశారని ఆగ్రహించాడు. కాగా బాలీవుడ్ హిట్ మూవీ అంధదున్ను తమిళంలో అంధగన్గా రీమేక్ చేస్తున్నారు. హీరో ప్రశాంత్ అంధుడిగా నటిస్తున్న ఈ సినిమా నుంచి అంధగన్ యాంథెమ్ రిలీజ్ చేశారు. దళపతి విజయ్ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు.అంతా మార్చేశారు: సంతోష్ నారాయణన్ఈ సాంగ్కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించినట్లుగా క్రెడిట్స్ ఇచ్చారు. అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన సాంగ్ను ఇష్టారీతిన మార్చేశారంటున్నాడు. 'చరిత్రలో మొట్టమొదటిసారి.. ఒక ఆడియో సంస్థ కళ్లులేనట్లుగా నటిస్తోంది. ఈ పాటలో ఉన్న సంగీతం, లిరిక్స్, అరేంజ్మెంట్, ఆ మిక్సింగ్ అన్నీ కూడా నేను కంపోజ్ చేసినట్లుగా లేనే లేదు. కాబట్టి ఈ సాంగ్కు ఒక్క రూపాయి కూడా తీసుకోను' అని ట్వీట్ చేశాడు. అప్పుడే రిలీజ్ఇకపోతే చెన్నైలో జరిగిన ప్రమోషనల్ సాంగ్ ఈవెంట్కు సంతోష్ నారాయణన్ హాజరవలేదు. అంధగన్ సినిమా విషయానికి వస్తే సిమ్రాన్, ప్రియా ఆనంద్,కార్తీక్, సముద్రఖని, ఊర్వశి, యోగి బాబు, కేఎస్ రవికుమార్, వనితా విజయకుమర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. సంతోష్ నారాయణన్ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాకు సంగీతం అందించాడు. For the first time in history, the audio label is also playing a blind character - method acting ? . FYI I don’t charge a fee to check if the actual music/lyric/arrangement/mix/master is actually mine . All The Best Of Luck 😂😂 https://t.co/i7rWKBFQ9N pic.twitter.com/iMq0dhxmfj— Santhosh Narayanan (@Music_Santhosh) July 24, 2024 చదవండి: మందు తాగితే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు: సినీరచయిత -
విడాకుల తర్వాత మళ్లీ అలా కలిసిన జీవీ ప్రకాశ్, సైంధవి
కోలీవుడ్ యంగ్ హీరో వేమల్ నటించిన SIR సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ విడుదలైంది. బోస్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేమల్తో పాటు ఛాయా దేవి కన్నన్, శరవణన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సాంఘిక డ్రామాగా ఈ చిత్రాన్ని ఎస్ఎస్ఎస్ పిక్చర్స్ పతాకంపై సిరాజ్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్ అందించారు.ఎస్ఐఆర్ (SIR) చిత్రం నుంచి తాజాగా విడుదలైన సాంగ్ కోలీవుడ్లో భారీగా వైరల్ అవుతుంది. దానికి ప్రధాన కారణం జీవీ ప్రకాశ్, ఆయన మాజీ సతీమణి సైంధవి అని చెప్పవచ్చు. వీరిద్దరు కొద్దిరోజుల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసింది. ఆ సమయంలో వారిపై భారీగా ట్రోల్స్ వచ్చాయి. కానీ, వాటిని సున్నితంగానే ఇద్దరూ తప్పుపట్టారు. అయితే, విడాకులు తీసుకున్న తర్వాత జీవీ ప్రకాశ్, సైంధవి కలిసి ఎస్ఐఆర్ (SIR) సినిమా కోసం ఒక పాటకోసం తమ గొంతు కలిపారు. వారిద్దరూ కలిసి పాడిన ఆ సాంగ్ ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. 2025లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది.ఈ ఏడాది మే నెలలో సైంధవి, జీవీ ప్రకాశ్ విడిపోతున్నట్లు తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఆ సమయంలో ప్రకాశ్ ఇలా చెప్పాడు 'మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేశాం. అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. దయచేసి మా ఇద్దరి భావోద్వేగాలను గౌరవించండి. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. కాగా.. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి గుడ్ బై చెప్పారు. -
రచయితగా మారిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్!
అల్లరి నరేష్ చిత్రం సుడిగాడు సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన శ్రీ వసంత్. టాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమాకు శ్రీ వసంత్ సాంగ్స్, మాటలు రాశారు. నిధిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో రిలీజైంది. విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహారాజ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్గా ప్రేక్షకులను అలరిస్తోంది.ఒక మంచి సినిమాకు మాటలు, పాటలు రాయడం సంతోషాన్ని కలిగిస్తుందని శ్రీ వసంత్ తెలిపారు.మహారాజ సినిమాలోని "అమ్మ నీకే నాన్నయ్యనా" అంటూ సాగే పాటలు శ్రీ వసంత్ స్వరాలు పాపులర్ అయ్యాయి. అజనీస్ లోకనాధ్ సంగీతం పాటకు మరో బిగ్ అడ్వాంటేజ్. దీంతో మహారాజ సినిమాకు విడుదలైన రోజే మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే మహారాజా సినిమాకు రివ్యూస్లోనూ మాటలు, పాటల గురించి కూడా పాజిటివ్గా రాసుకొచ్చారు. శ్రీ వసంత్ స్వీయ డబ్బింగ్ కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్లో మాహారాజ సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు. -
విడాకులపై ట్రోల్స్.. అంత దిగజారిపోయారా? అన్న నటుడు
ఇటీవలే కోలీవుడ్ స్టార్ జీవీ ప్రకాశ్ కుమార్, అతని భార్య, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు ఊహించని షాకిచ్చారు. ఈ సందర్భంగా తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ప్రైవసీకి గౌరవించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ జంటపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే దీనిపై జీవీ ప్రకాశ్ రియాక్ట్ అయ్యారు. తమ విడాకుల విషయంలో కొందరు విమర్శిస్తున్నారని అన్నారు. ఇద్దరు వ్యక్తులు కలవడం, విడిపోవడంపై సరైన అవగాహన లేకుండా ప్రజలు చర్చించుకోవడం మంచిది కాదు. సెలబ్రిటీలు అనే కారణంతో వ్యక్తిగత జీవితాలపై ఊహాగానాలు రావడం దురదృష్టకరం.. ఇవీ తమకు చాలా ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించడం, వారి గురించి కామెంట్స్ చేయడం ఆమోదయోగ్యం కాదు. సోషల్ మీడియాలో ఇలాంటి ఊహాజనిత కథనాలు ఆ వ్యక్తులపై ప్రభావం చూపుతాయని గ్రహించలేనంతగా తమిళుల సద్గుణాలు దిగజారిపోయాయా?" అని జీవీ ప్రకాశ్ ప్రశ్నించారు. దీనిపై తమిళంలో సుదీర్ఘమైన నోట్ను తన ఇన్స్టాలో రాసుకొచ్చారు.జీవీ ప్రకాశ్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'మేము విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు తెలియజేశాం. అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. మా ఉద్దేశ్యంతో సంబంధం లేకుండా మీరు చేసే కామెంట్స్ బాధ కలిగించేవిగా ఉన్నాయని చెప్పడానికే ఈ పోస్ట్ చేస్తున్నా. దయచేసి అందరి భావోద్వేగాలను గౌరవించండి. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. కాగా.. జీవీ ప్రకాశ్, సైంధవి 11 ఏళ్ల తమ వివాబహాబంధానికి గుడ్ బై చెప్పారు. View this post on Instagram A post shared by G.V.Prakash Kumar (@gvprakash) -
11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన సినీ ఇండస్ట్రీ కపుల్ (ఫొటోలు)
-
అభిమానుల దెబ్బకు ఇన్స్టాను తొలగించేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. అయితే ఈ సాంగ్ వల్ల మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా దారుణమైన ట్రోల్స్ను ఎదుర్కొంటున్నాడు. యూట్యూబ్లో విజిల్ పోడు పాటను మిలియన్ల కొద్ది ప్రేక్షకులు చూశారు. సోషల్ మీడియాలో కూడా ఈ పాటకు మంచి ఆదరణ లభించినప్పటికీ, కొందరి నుంచి నెగటివ్ కామెంట్లు వచ్చాయి. పాటలో మ్యూజిక్ పరమచెత్తగా ఉందని యువన్ శంకర్ రాజాపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా అనిరుద్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటపై విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు. అనిరుధ్ను పొగుడుతూ యువన్ను తక్కవ చేసి కామెట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వారందరూ కూడా యువన్ శంకర్ రాజాను ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు. దీంతో ఆందోళన చెందిన యువన్ శంకర్ రాజా ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి తప్పుకున్నారు. తన అకౌంట్ను తొలగించేశారు. కొందరి అభిమానుల వల్లే యువన్ శంకర్ రాజా ఈ నిర్ణయం తీసుకున్నారని యువన్ ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజిల్ పోడు పాట విజయ్ పార్టీ ఎన్నికల ప్రచార గీతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. యువన్ నుంచి ఇలాంటి పాట వస్తుందని ఊహించలేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతలో, యువన్ శంకర్ రాజా తన ఎక్స్ పేజీలో ఒక కామెంట్ చేశారు. 'నా ఇన్స్టాగ్రామ్ పేజీలో సాంకేతిక లోపం కారణంగా, నా పోస్ట్లు తొలగించబడ్డాయి. అభిమానుల ఆందోళన చెందాల్సిన పనిలేదు. ధన్యవాదాలు, నేను నా ఇన్స్టాగ్రామ్ పేజీని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను' అంటూ వివాదానికి ముగింపు పలికారు. ప్రస్తుతం అయితే యువన్ శంకర్ రాజా ఇన్స్టాగ్రామ్ ఖాతా వినియోగంలో లేదు. -
అప్పట్నుంచి కీరవాణి ఫ్యాన్ని!
‘‘మా తరానికి చెందిన అద్భుతమైన సంగీతదర్శకుల్లో ఒకరైన కీరవాణితో సినిమా చేసే అవకాశం రావడం నాకు గర్వకారణం. నా కల నిజమైంది’’ అని బాలీవుడ్ ప్రముఖ నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇరవై రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించారు అనుపమ్ ఖేర్. తాజాగా ‘తన్వీ ది గ్రేట్’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతదర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ట్రాక్ కంపోజ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేత కీరవాణి మా సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం ఓ ఆశీర్వాదం. ఏడాదిగా ఈ సినిమాకి కలిసి పని చేస్తున్నాం. కీరవాణి స్వరపరచిన ‘తుమ్ మిలే దిల్ ఖిలే..’ (నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ నటించిన ‘క్రిమినల్’ సినిమాలోని ΄ాట) విన్నప్పట్నుంచి ఆయనకు అభిమాని అయిపోయాను. ఇప్పుడు నా సినిమా ఒప్పుకున్నందుకు ఆయనకు «థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు అనుపమ్ ఖేర్. -
తిరుమలలో ఓంకార్ సోదరుడు అశ్విన్, తమన్ సందడి (ఫోటోలు)
-
ఆ తమన్ అన్నీ అబద్ధాలే చెప్తాడు: మణి శర్మ
మాస్ పాటైనా, క్లాస్ పాటైనా, భక్తి గీతమైనా.. అన్ని రకాల ట్యూన్స్తో అద్భుతాలు సృష్టిస్తాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిన ఈయన ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు పూర్తయింది. ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకున్న ఈయన ఇప్పుడు చేతినిండా అవకాశాలు లేవని బాధపడుతున్నాడు. తనకు కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులిస్తే బాగుండని ఆశపడుతున్నాడు. తాజాగా అతడు ఓ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మణి శర్మ మాట్లాడుతూ.. 'నేను మొదట వయొలిన్ నేర్చుకున్నాను. తర్వాత పెద్దదిగా కనిపించిందని కీబోర్డు నేర్చుకున్నాను' అని చెప్పాడు. ఇంతలో అనంత శ్రీరామ్.. 'మీకు పాట నచ్చకపోతే స్పీకర్ బాక్సులు పగలగొడతారంట కదా!' అని అడిగేశాడు. వెంటనే మణిశర్మ స్పందిస్తూ.. 'ఆ తమన్గాడు అబద్ధం చెప్పాడు. నా జీవితంలో ఒక్కసారే అలా చేశానులే' అని నవ్వేశాడు. తన కెరీర్లో ఎంతోమంది గొప్ప సెలబ్రిటీలతో కలిసి పని చేయడం అదృష్టమంటూ ఎమోషనలయ్యాడు. షో చివర్లో ఆయనకు సగౌరవంగా సన్మానం చేశారు. చదవండి: బెల్లంకొండ గణేశ్తో లవ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
చెన్నై: సీనియర్ సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ (71) మంగళవారం చైన్నెలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశారు. విసు దర్శకత్వం వహించిన నాణయం ఇల్లాద నాణయం చిత్రం ద్వారా విజయ్ ఆనంద్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'నాన్ అడిమై ఇల్లై' చిత్రం ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆ చిత్రంలోని 'ఒరు జీవన్ దాన్ ఉన్ పాడల్దాన్..' పాట చాలా పాపులర్ అయ్యింది. తమిళంలో 'కొరుక్కు ఉపదేశం', 'రాసాతి వరుం నాళ్' తదితర 10 చిత్రాలకు పని చేసిన విజయ్ ఆనంద్ కన్నడంలో 100కు పైగా సినిమాలకు సంగీతం అందించడం విశేషం. కాగా విజయ్ఆనంద్ భౌతిక కాయానికి బుధవారం నాడు చైన్నెలో అంత్యక్రియలు జరిగాయి. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత కళాకారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చదవండి: బెల్లంకొండ గణేశ్తో లవ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
‘ఈగల్’లో మ్యూజిక్ కూడా కథ చెబుతుంది
రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్’. కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాంద్ మాట్లాడుతూ– ‘‘నా పదో తరగతి నుంచే మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేశాను. పియానో, గిటార్, డ్రమ్స్, ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. కొన్ని వీడియో గేమ్స్కి మ్యూజిక్ ఇచ్చాను. సంగీత దర్శకుడిగా ‘ఈగల్’ నాకు తొలి చిత్రం. కాలేజీలో నేను, హీరో శ్రీవిష్ణు క్లాస్మేట్స్. అలా కార్తీక్ నాకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు తనతో నా జర్నీ మొదలైంది. రవితేజగారితో సినిమా ఫిక్స్ అయ్యాక ఆయన ఓకే చెబితే, మ్యూజిక్ డైరెక్టర్గా నాకు చాన్స్ ఇస్తానన్నాడు కార్తీక్. రవితేజగారు నా మ్యూజిక్ ట్రాక్స్ విని, నచ్చి ఓకే చేశారు. రవితేజగారి సినిమాకు మ్యూజిక్ చేయడం నా లక్. ఈ సినిమాలో మ్యూజిక్, ఆర్ఆర్లకు మంచి స్కోప్ ఉంది. మ్యూజిక్ కూడా కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు ΄ాటలు ఉన్నాయి. ఇక కార్తీక్ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా చేస్తున్న ఓ సినిమాకు, దర్శకుడు నక్కిన త్రినాథరావుగారిప్రోడక్షన్లోని ఓ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాను. మరో రెండు ్ర΄ాజెక్ట్స్ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
హీరోగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. రిలీజ్ ఎప్పుడంటే?
సంగీతదర్శకుడిగా, కథానాయకుడిగా సక్సెస్ఫుల్ పయనం చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి జీవీ.ప్రకాశ్కుమార్. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో రెబల్ ఒకటి. నూతన దర్శకుడు నికేశ్ ఆర్ఎస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్కుమార్ విద్యార్థిగా చాలా పవర్ఫుల్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో సంభాషణలు, జీవీ.ప్రకాశ్కుమార్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక రెబల్ చిత్ర టీజర్ను ఇటీవల విడుదల చేయగా మిలియన్ల సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా షూటింగ్ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో మమతా బైజూ, కరుణాస్ సుబ్రమణియ శివ, షాలూ రహీమ్, వెంకటేశ్. వీపీ, ఆదిత్య భాస్కర్, కల్లూరి వినోద్, ఆదిరా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
చిరంజీవి, నాగార్జున కి మ్యూజిక్ సెన్స్ చాలా ఉంటుంది