November
-
ఈఎస్ఐ కిందకు కొత్తగా 16 లక్షల మంది
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే బీమా పథకం ‘ఈఎస్ఐ’ కిందకు 2024 నవంబర్ నెలలో కొత్తగా 16.07 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఒక శాతం అధికంగా సభ్యులు చేరినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్లో కొత్త సభ్యుల నమోదు 15.92 లక్షలుగా ఉంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. గతేడాది నవంబర్లో 20,212 సంస్థలు ఈఎస్ఐసీలో చేరాయి. తద్వారా ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ రక్షణ లభించినట్టయింది. 16.07 లక్షల మందిలో 7.57 లక్షల మంది (47.11 శాతం) 25 ఏళ్లలోపు వయసున్నవారు కావడం గమనార్హం. 3.28 లక్షల మంది మహిళలు కాగా, 44 మంది ట్రాన్స్జెండర్లు కూడా కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. -
బంగారం దిగుమతి లెక్కల్లో పొరపాటు
వాణిజ్య లోటు రికార్డు స్థాయికి పెరగడానికి కారణమైన నవంబర్ బంగారం దిగుమతి (Gold Import) డేటాలో చూసిన "అసాధారణ" పెరుగుదలను ప్రభుత్వం తాజాగా సరిదిద్దింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం నవంబర్ నెలలో బంగారం దిగుమతి విలువ 14.8 బిలియన్ డాలర్లు నుండి 9.8 బిలియన్ డాలర్లకు సర్దుబాటు చేసింది.గణన లోపం కారణంగా మునుపటి సంఖ్య తప్పుగా ఉంది. జూలైలో పద్దతిలో మార్పును అనుసరించి గిడ్డంగులలో రెట్టింపు లెక్కింపు దీనికి కారణం కావచ్చు. ఈ విషయంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.2024 జనవరి నుండి నవంబర్ వరకు బంగారం దిగుమతులపై సవరించిన డేటా "వార్షిక సగటు 800 టన్నుల కంటే చాలా తక్కువగా ఉంది" అని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా అన్నారు. జనవరి నుండి నవంబర్ వరకు మొత్తం బంగారం దిగుమతులు 796 టన్నుల నుండి 664 టన్నులకు సరిదిద్దారు. అక్టోబర్కు సంబంధించి 97 టన్నులు నుండి 58 టన్నులకు, నవంబర్లో దిగుబడులను 170 టన్నుల నుండి 117 టన్నులకు సర్దుబాటు చేశారు.డిసెంబర్ 16న జరిగిన సాధారణ నెలవారీ ట్రేడ్ డేటా బ్రీఫింగ్లో, బంగారం దిగుమతులు పెరగడం వల్ల నవంబర్లో భారతదేశ వాణిజ్య లోటు రికార్డు గరిష్ట స్థాయి 37.8 బిలియన్ డాలర్లకు విస్తరించిందని డేటా చూపించింది . 2024 డిసెంబరులో అసాధారణ పెరుగుదలను గమనించిన డీజీసీఐఎస్.. కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ అందుకున్న డేటాతో సమన్వయం చేసుకుంటూ బంగారం దిగుమతి డేటాపై వివరణాత్మక పరిశీలనను చేపట్టింది. -
భారత్కు ‘వాణిజ్య లోటు’ భయాలు!
న్యూఢిల్లీ: భారత్కు వాణిజ్యలోటు సవాళ్లు తలెత్తుతున్నాయి. ఎగుమతులు నవంబర్లో అసలు పెరగకపోగా, 4.85 శాతం క్షీణించి (2023 ఇదే నెలతో పోల్చి) 32.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఎగుమతులు భారీగా 27 శాతం పెరిగి 69.95 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఆల్టైమ్ హై 32.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వంట నూనెలు, ఎరువులు, పసిడి వెండి దిగుమతులు భారీగా పెరగడం మొత్తం వాణిజ్యలోటు తీవ్రతకు దారితీసిందని వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. → పసిడి దిగుమతుల విలువ ఆల్టైమ్ హై 14.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2023 నవంబర్లో ఈ విలువ 3.5 బిలియన్ డాలర్లు. → క్రూడ్ ఆయిల్ దిగుమతులు సమీక్షా నెల్లో 7.9 శాతం పెరిగి 16.11 బిలియన్ డాలర్లకు చేరాయి. → పెట్రోలియం ప్రొడక్టుల దిగుమతులు 50 శాతం తగ్గి, 3.71 బిలియన్ డాలర్లుగా నమోదైంది. → జౌళి, ఇంజనీరింగ్ గూడ్స్, ఎల్రక్టానిక్స్, ఫార్మా, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు బాగున్నాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య ఇలా.. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఎగుమతులు 2.17 శాతం పెరిగి 284.31గా నమోదయ్యాయి. దిగుమతులు 8.35 శాతం పెరిగి 486.73 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనితో వాణిజ్యలోటు 202.42 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 170.98 బిలియన్ డాలర్లు. కాగా, ఎనిమిది నెలల్లో పసిడి దిగుమతులు 49 శాతం పెరిగి 49 బిలియన్ డాలర్లకు ఎగశాయి. సేవల రంగం ఇలా.. నవంబర్లో సేవల ఎగుమతుల విలువ గత ఏడాది ఇదే కాలంతో పోలి్చతే 28.11 బిలియన్ డాలర్ల నుంచి 35.67 బిలియన్ డాలర్లకు చేరాయి. -
నవంబర్లో ద్రవ్యోల్బణం ఊరట
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్లో కొంత ఊరట నిచ్చింది. సూచీ 5.48 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. ఆహార ఉత్పత్తులు ప్రత్యేకించి కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నవంబర్ గణాంకాల్లో ముఖ్యమైనవి... → అక్టోబర్లో 10.87 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో 9.04 శాతానికి తగ్గింది. → కూరగాయలుసహా పప్పుదినుసులు, ఉత్పత్తులు, చక్కెర, పండ్లు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గాయి. -
కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజన్.. వాహన అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: పెళ్లిళ్ల సీజన్, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం, గ్రామీణ మార్కెట్లు మెరుగుపడుతుండటం వంటి సానుకూల అంశాలతో నవంబర్లో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటర్స్, టయోటా కిర్లోస్కర్ మోటర్స్ మొదలైన దిగ్గజాల దేశీయ అమ్మకాలు వృద్ధి చెందాయి.మారుతీ విక్రయాలు 5 శాతం, టాటా మోటర్స్ 2 శాతం, టయోటా 44 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. అటు, కొత్తగా లిస్టయిన హ్యుందాయ్ మోటర్ ఇండియా అమ్మకాలు 2 శాతం క్షీణించాయి. గ్రామీణ మార్కెట్లు పుంజుకుంటూ ఉండటం, ఎస్యూవీలకు డిమాండ్ నెలకొనడం, లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టడం తదితర అంశాలు తమకు కలిసొచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.నవంబర్లో బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్ విటారా ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నవంబర్లో నమోదైన 49,016 యూనిట్లతో పోలిస్తే 59,003 యూనిట్లకు పెరిగాయి. అయితే, ఆల్టో, ఎస్–ప్రెసోలాంటి మినీ–సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 9,959 యూనిట్ల నుంచి 9,750 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు, వివిధ వర్గాల అవసరాలకు అనుగుణమైన హ్యాచ్బ్యాక్ల నుంచి ఎస్యూవీల వరకు వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో విక్రయాలు మెరుగుపర్చుకుంటున్నట్లు టయోటా వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. -
International Mens Day: మార్కెట్లో మగసిరులు
అందచందాలను కాపాడుకోవడంలో పురుషులు ఏమీ తీసిపోవడం లేదు. సౌందర్య సాధనాల ఖర్చులోను, సౌందర్య పరిరక్షణ సేవల కోసం చేసే ఖర్చులోను మహిళలతో పోటీ పడుతున్నారు. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్ను ముంచెత్తుతున్న కొత్త కొత్త సౌందర్య సాధనాలను కొనుగోలు చేయడంలో పురుషులు ముందంజలో ఉంటున్నారు. అలాగే, అందానికి తగిన అలంకరణ చేసుకోవడంలోను, ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఫ్యాషన్ దుస్తులను ధరించడంలోనూ ‘తగ్గేదే లే’ అంటున్నారు. పురుషుల సౌందర్య పోషణాభిలాష, ఫ్యాషన్ స్పృహ మార్కెట్లో సిరులు కురిపిస్తున్నాయి.అందచందాలను కాపాడుకోవడంలో మహిళలకు కొంత ఎక్కువ శ్రద్ధ ఉండే సంగతి వాస్తవమే అయినా, ఇటీవలి కాలంలో ఈ విషయంలో పురుషులు తామేమీ తీసిపోవడం లేదంటూ నిరూపిస్తున్నారు. నఖ శిఖ పర్యంతం అందంగా కనిపించడానికి తాపత్రయపడుతున్నారు. కేశ సంరక్షణ ఉత్పత్తులకు, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు, ఫ్యాషన్ దుస్తులకు భారీగా ఖర్చుపెడుతున్నారు. పురుషుల్లో సౌందర్య స్పృహ పెరగడం గమనించిన సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థలు కొత్త కొత్త ఉత్పత్తులతో ముందుకొస్తున్నాయి. పురుషుల అలంకరణ వస్తువుల తయారీ సంస్థలు, ఫ్యాషన్ దుస్తుల తయారీ సంస్థలు కూడా పురుషుల అందచందాలను ఇనుమడింపజేయడానికి ఇతోధికంగా పాటుపడుతున్నాయి. ఇటీవలి కాలంలో పురుషుల్లో పెరిగిన సౌందర్య స్పృహకు మార్కెట్ గణాంకాలే అద్దం పడుతున్నాయి.అంతర్జాతీయ గణాంకాల ప్రకారం 2023లో పురుషులు అలంకరణ వస్తువుల కోసం 53.46 బిలియన్ డాలర్లు (రూ.4.50 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 85.53 బిలియన్ డాలర్లకు (రూ.7.20 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. చర్మ సంరక్షణ వస్తువుల కోసం 13.56 బిలియన్ డాలర్లు (రూ.1.14 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 29.61 బిలియన్ డాలర్లకు (రూ.2.49 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. కేశసంరక్షణ వస్తువుల కోసం 32.90 బిలియన్ డాలర్లు (రూ.2.77 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 67.20 బిలియన్ డాలర్లకు (5.65 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ చాలాకాలంగా ముందంజలో ఉంటున్నాయి. ఈ దేశాల్లో మార్కెట్ నిలకడగా వృద్ధి చెందుతోంది. ఇటీవలి కాలంలో ఆసియా–పసిఫిక్ దేశాల్లో పురుషుల సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు సౌందర్య ఉత్పత్తుల వినియోగంలో అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నాయి.మన దేశంలో పురుషుల అలంకరణ, కేశసంరక్షణ, చర్మసంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు 2023లో రూ.17,696 కోట్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు 2032 నాటికి రూ.34,550 కోట్లకు చేరుకోగలవని మార్కెట్ వర్గాల అంచనా. భారత్లో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో ఏటా సగటున 7.2 శాతం వృద్ధి నమోదవుతోంది. ఈ వృద్ధి ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ వార్షిక సగటు వృద్ధి 6.8 శాతం వరకు నమోదవుతోంది. రానున్న కాలంలో మన దేశంలో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ వృద్ధి మరింత వేగాన్ని పుంజుకుని, 12.1 శాతానికి చేరుకోగలదని నిపుణులు చెబుతున్నారు.నవతరం కొత్తపోకడలుతర తరానికీ పురుషుల సౌందర్య సాధనాల వినియోగంలోను, ఫ్యాషన్లలోను మార్పులు సర్వసాధారణం. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే, ఇప్పటి నవతరం యువకులు సౌందర్య సాధనాలు, ఫ్యాషన్లలోను మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలకు పోటీగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెడుతున్నారు. ప్రస్తుత కాలంలో మార్కెట్ను ప్రభావితం చేస్తున్న నవతరాన్ని ‘జెన్ ఆల్ఫా’గా పిలుచుకుంటున్నారు. ఈ శతాబ్ది తొలినాళ్లలో పుట్టిన ఈ యువతరం ‘టిక్టాక్’ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ‘లుక్ మ్యాక్స్’ ట్రెండ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముఖాలంకరణలు, వస్త్రాలంకరణలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ‘టిక్టాక్’లోనే ‘గెట్ రెడీ విత్ మీ’ అనే ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇందులో భాగంగా నవతరం యువకులు చక్కగా ముస్తాబైన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ, తమకు దీటుగా తయారవగలరా? తమ ఫాలోవర్లకు చాలెంజ్ విసురుతున్నారు. ఇదివరకటి కాలంలో పురుషులు వాడే సౌందర్య సాధనాలు చాలా పరిమితంగా ఉండేవి. సబ్బు, పౌడర్, షేవింగ్ రేజర్, షేవింగ్ క్రీమ్ ఉంటే చాలనుకునేవారు. ఆఫ్టర్షేవ్ లోషన్లు వాడేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇటీవలి యువకులు రకరకాల హెయిర్ స్టైల్స్ మారుస్తున్నారు. గడ్డం పెంచేవాళ్లు గడ్డాన్ని ఎప్పటికప్పుడు తీరుగా ట్రిమ్ చేయించుకోవడం, గడ్డానికి పోషణ అందించడానికి బీయర్డ్ వ్యాక్స్ పట్టించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇదివరకు జుట్టు నెరిసినవాళ్లు మాత్రమే జుట్టుకు రంగు వేసుకునేవాళ్లు. ఇటీవలికాలంలో జుట్టు నెరవకపోయినా, జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటున్నారు. శరీరమంతా నిగనిగలాడుతూ మెరిసిపోయేలా చూసుకునేందుకు పెడిక్యూర్, మ్యానిక్యూర్, వ్యాక్సింగ్, బ్లీచింగ్ వంటి సౌందర్యసేవలను పొందడానికి వెనుకాడటం లేదు. పురుషుల సౌందర్య సాధనాల జాబితాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులు వచ్చి చేరుతున్నాయి. హెయిర్ జెల్, సన్స్క్రీన్ లోషన్, ఫేస్వాష్ క్రీమ్, డియాడరెంట్స్, ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్ వంటివి పురుషుల సౌందర్య సాధనాలలో తప్పనిసరి వస్తువులుగా మారుతున్నాయి. ఈ వస్తువులను కూడా ఎంపిక చేసుకోవడంలో ఇప్పటి యువకులు అమిత శ్రద్ధ తీసుకుంటున్నారు. అల్యూమినియం ఫ్రీ డియాడరెంట్, ఆర్గానిక్ ఫేస్వాష్ క్రీమ్, నేచురల్ హెయిర్ కలర్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. వీటి ఖరీదు ఎక్కువైనా ఖర్చుకు వెనుకాడటం లేదు. ఫ్యాషన్లపై పెరుగుతున్న శ్రద్ధశరీరాన్ని నిగనిగలాడేలా చూసుకోవడమే కాదు, శరీరానికి తగిన దుస్తులు ధరించడంలోను, వాటికి తగినట్లుగా ఇతర అలంకరణలను ధరించడంలోను ఈ తరం పురుషులు అమిత శ్రద్ధ చూపుతున్నారు. సమయానికి, సందర్భానికి, కాలానికి తగిన ఫ్యాషన్లతో ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో 537.31 బిలియన్ డాలర్లు (రూ.45.31 లక్షల కోట్లు) నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి 988.24 బిలియన్ డాలర్లకు (రూ.83.33 లక్షల కోట్లు) చేరుకోగల అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల అంచనా. భారత్లో పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో రూ.2.24 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ వ్యాపారం 2028 నాటికి రూ.3.30 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ నిపుణుల అంచనా. దుస్తులు, బెల్టులు, షూస్ వంటివి కొనాలంటే దుకాణాలకు వెళ్లేవారు. ఆన్లైన్ మార్కెట్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది ఆన్లైన్లోనే కొనుగోళ్లు సాగిస్తున్నారు. మన దేశంలో ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్లైన్ కొనుగోళ్లలో మహిళల కంటే పురుషులే దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలతో పోల్చుకుంటే పురుషులు ఆన్లైన్లో ఫ్యాషన్ దుస్తులు, ఇతర వస్తువుల కొనుగోళ్ల కోసం 36 శాతం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం–ఏ) గత ఏడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఈ కొనుగోళ్ల కోసం పురుషులు సగటున రూ. 2.484 మేరకు ఖర్చు చేస్తే, మహిళలు సగటున రూ.1,830 మేరకు ఖర్చు చేసినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. మరో విశేషం ఏమిటంటే, ఈ కొనుగోళ్లలో మెట్రో నగరాల్లో కంటే, రెండో తరగతి, మూడో తరగతి, నాలుగో తరగతి చిన్న నగరాల్లోని పురుషులే ముందంజలో ఉంటున్నారు. మెట్రో నగరాల్లోని పురుషులు ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్లైన్ కొనుగోళ్ల కోసం గత ఏడాది సగటున రూ.1,119 ఖర్చు చేస్తే, రెండో తరగతి నగరాల్లో రూ.1,870, మూడో తరగతి నగరాల్లో రూ.1,448, నాలుగో తరగతి నగరాల్లో 2,034 మేరకు ఖర్చు చేసినట్లుగా ఐఐఎం–ఏ అధ్యయనంలో వెల్లడైంది. పురుషుల సౌందర్య చరిత్రపురుషుల సౌందర్య చరిత్ర ఆధునిక యుగం నుంచి ప్రారంభమైందనుకుంటే పొరపాటే! పురాతన నాగరికతల కాలంలోనే పురుషులు తమ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించేవారు. ముఖంపైన, శరీరంపైన రోమాలను తొలగించుకోవడానికి, గోళ్లను కత్తిరించుకోవడానికి కంచు వంటి లోహాలతో తయారు చేసిన రేజర్లు, ట్వీజర్లు, కత్తెరలు, సన్నని చురకత్తులు వంటి పరికరాలను ఉపయోగించేవారు. శిరోజాలంకరణ కోసం రకరకాల సుగంధ తైలాలను, లేపనాలను ఉపయోగించేవారు. ముఖానికి, శరీరానికి చందనం వంటి చెట్ల బెరళ్లతో తయారు చేసిన చూర్ణాలను పూసుకునేవారు. ప్రాచీన ఈజిప్షియన్, రోమన్, గ్రీకు నాగరికతల ప్రజలు అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు.పురుషులు కూడా కళ్లకు రకరకాల వర్ణ లేపనాలను ఉపయోగించేవారు. కొందరు మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని, వాటిని తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునేవారు. మధ్యయుగాల కాలంలో కూడా పురుషులు మీసాలు, గడ్డాలు తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునే పద్ధతి ఉన్నా, మీసాలు, గడ్డాలు నున్నగా గొరిగించుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా సైన్యంలో పనిచేసే యోధులు, రక్షణ విధులు నిర్వర్తించేవారు ఎక్కువగా మీసాలు, గడ్డాలను పూర్తిగా తొలగించుకునేవారు. అయితే, కళాకారులు, తత్త్వవేత్తలు, మేధావులు వంటి వర్గాల వారు మాత్రం మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని కనిపించేవారు. బారెడు గడ్డం పెంచుకోవడాన్ని మేధావితనానికి చిహ్నంగా భావించేవారు. గడ్డానికి, మేధావితనానికి ఎలాంటి సంబంధం లేదనే సంగతి ఇప్పటి జనాలకు బాగా తెలిసినా, గడ్డాలు పెంచుకోవడం, వాటి పోషణకు నానా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పటికీ ఫ్యాషన్ రంగాన్ని ప్రభావితం చేస్తుండటం విశేషం. గడ్డాల విషయానికొస్తే, విక్టోరియన్ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. విక్టోరియన్ కాలంలో ఇంగ్లండ్లో పురుషులకు గడ్డాల పోటీలు జరిగేవి. అందమైన గడ్డాన్ని పెంచుకునేవాళ్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేవారు. గడ్డాలు, మీసాలు పెంచుకోవడం, శరీరానికి రకరకాల లేపనాలు పూసుకోవడం వంటివాటితో పాటు పురుషులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో దుస్తులు ధరించేవారు. రకరకాల టోపీలు, తలపాగాలు ధరించేవారు. నాగరికతల తొలినాళ్ల నుంచి మధ్యయుగాల చివరికాలం వరకు శరీర అలంకరణల్లోను, దుస్తుల ఫ్యాషన్లలోను మహిళలకు ఏమీ తీసిపోకుండా ఉండేవారు. అయితే, ఇరవయ్యో శతాబ్దం నుంచి ఈ ధోరణి మారింది. ఈ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఫలితంగా పురుషుల సౌందర్య సాధనాలు కనీస స్థాయికి చేరుకున్నాయి. సమాజంలోని ఉన్నతవర్గాల పురుషులు తప్ప సామాన్యులు ఫ్యాషన్లలో మార్పులను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇరవయ్యో శతాబ్ది ప్రథమార్ధం అంతా ఇలాగే గడిచింది. సినిమాలు పెరిగి, యుద్ధాలు సద్దుమణిగిన తర్వాత అగ్రరాజ్యాల్లోని ఫ్యాషన్ ప్రపంచంలో నెమ్మదిగా మార్పులు మొదలయ్యాయి. పురుషుల దుస్తుల ఫ్యాషన్లలో ఈ మార్పులు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి. ఈ శతాబ్ది తొలినాళ్ల నుంచి పురుషుల సౌందర్య పోషణ, ఫ్యాషన్ రంగాలు బాగా వేగాన్ని పుంజుకున్నాయి. స్పాలు.. సెలూన్లకు పెరుగుతున్న గిరాకీమహిళలకు ప్రత్యేకంగా బ్యూటీపార్లర్లు చాలాకాలంగా ఉన్నాయి గాని, పురుషుల కోసం హెయిర్ సెలూన్లు తప్ప వేరేవేమీ ఉండేవి కాదు. ఇటీవలి కాలంలో పురుషుల కోసం ప్రత్యేకంగా స్పాలు, బ్యూటీ సెలూన్లు పెరుగుతున్నాయి. పెద్దపెద్ద నగరాల్లోనే కాకుండా, చిన్న పట్టణాల్లోనూ వీటికి ఆదరణ పెరుగుతోంది. ‘కోవిడ్’ మహమ్మారి తర్వాత పురుషుల స్పా సేవలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ‘స్పాబ్రేక్స్’ సర్వే ప్రకారం 2019–23 మధ్య కాలంలో పురుషుల స్పా సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 346 శాతం మేరకు గిరాకీ పెరిగింది. పురుషుల సౌందర్య ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం చేయడం, సెలబ్రిటీలే స్వయంగా సొంత బ్రాండ్స్ ప్రారంభించడం వంటి పరిణామాలు కూడా ఈ వ్యాపారంలో అనూహ్యమైన వృద్ధికి కారణమవుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పురుషుల బ్యూటీ సెలూన్లు, స్పాల వ్యాపారం 2023లో రూ.88,800 కోట్ల మేరకు నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి రూ1.86 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్లో పురుషుల స్పా, సెలూన్ల వ్యాపారం కనీసం 7.85 శాతం వార్షిక వృద్ధి సాధించగలదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
మినీ సంక్రాంతిగా నవంబర్ సీజన్
-
నవంబర్లో చలి లేనట్లే!
న్యూఢిల్లీ: సాధారణంగా నవంబర్ మాసం వచి్చందంటే చలికాలం మొదలైనట్లే. చలి గాలులు గిలిగింతలు పెడుతుంటాయి. కానీ, ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర శుక్రవారం చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్లో సాధారణం కంటే 1.23 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అక్టోబర్లో సాధారణంగా 25.69 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, ఈసారి 26.92 డిగ్రీలు నమోదైంది. 1901 తర్వాత అత్యంత వేడి కలిగిన అక్టోబర్గా రికార్డుకెక్కింది. నవంబర్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గిపోయే సూచనలు కనిపించడం లేదని మృత్యంజయ్ వివరించారు. చలి పెరగడానికి వీలుగా వాతావరణ పరిస్థితులు లేవని అన్నారు. నవంబర్లో చలికి వాయువ్య భారతదేశం నుంచి వీలే గాలులే కీలకమని వివరించారు. అక్కడ రుతుపవనాల ప్రభావం ఇంకా ఉండడంతో గాలులు వీచడం లేదని తెలియజేశారు. వాయువ్య భాగంలో మరో రెండు వారాలపాటు ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని చెప్పారు. రెండు వారాల తర్వాత మాత్రమే ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నవంబర్లో కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక, తమిళనాడులో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాస్తవానికి వాతావరణ విభాగం దృష్టిలో నవంబర్ నెల చలి మాసం కాదు. జనవరి, ఫిబ్రవరి మాత్రమే చలి మాసాలు. -
నవంబర్ నుంచి కొత్త రూల్స్ ఇవే
-
బ్యాంకు పనులు ఈరోజుల్లో మానుకోండి..!
బ్యాంకులు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఎంత ఆన్లైన్ సేవలు ఉన్నప్పటికీ కొన్ని పనులను బ్యాంకులకు వెళ్లే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేస్తాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.బ్యాంకు సెలవుల సమాచారం ముందుగా తెలిస్తే దాని ఆధారంగా ప్రణాళికలు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితాను విడుదల చేసింది. మరి వచ్చే నవంబర్లో బ్యాంకులు ఎన్ని రోజులు మూతపడబోతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: పేటీఎంకి ‘కొత్త’ ఊపిరి!సెలవుల జాబితా ఇదే..» నవంబర్ 1 శుక్రవారం దీపావళి » నవంబర్ 2 శనివారం దీపావళి (కొన్ని ప్రాంతాల్లో)» నవంబర్ 3 ఆదివారం భాయ్ దూజ్» నవంబర్ 9 రెండవ శనివారం» నవంబర్ 10 ఆదివారం» నవంబర్ 15 శుక్రవారం గురునానక్ జయంతి» నవంబర్ 17 ఆదివారం» నవంబర్ 23 నాల్గవ శనివారం» నవంబర్ 24 ఆదివారంఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్పై భారీ జరిమానా -
‘నవంబరు 1-19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దు’
దేశంలో విమానలకు గత కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ.. విమానాలకు సంబంధి హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని గురుపత్వంత్ సింగ్ ప్రయాణికులను హెచ్చరించాడు.భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని, కావును ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కాగా సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్జేఎఫ్) వ్యవస్థాపకుడైన పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటి సారి కాదు. గతేడాది కూడా నవంబర్ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.అంతేగాక నవంబరు 19న దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని గతేడాది అతడు ఓ వీడియోలో హెచ్చరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద భారత ప్రభుత్వం పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడికి కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. -
48లక్షల పెళ్లిళ్లు.. రూ.5.76లక్షల కోట్లు ఖర్చు
సాక్షి అమరావతి: జూన్ నెలాఖరు నుంచి సరైన ముహూర్తాలు లేవు. వివాహాలు, శుభకార్యాలు వాయిదా పడుతూ వస్తు న్నాయి. ఎట్టకేలకు ఇక ముహూర్తం కుదిరింది. వధూవరులు ఒక్కటయ్యే తరుణం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శనివారం నుంచి పెళ్లి సందడి అంబరాన్ని తాకనుంది. ఈ ఏడాది చివరి వరకు ఇది కోలాహలం కొనసాగనుంది. అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 81 మధ్య 23 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ఘడియల్లో దాదాపు 48లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాన్సెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఎఐటీ) తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023వ సంవత్సరంలో చివరి మూడు నెలల్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. సుమారు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు ఉన్న ముహూర్తాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 48లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క పెళ్లి వేడుకకు సగటున రూ.12 లక్షలు ఖర్చు పెడతారని అంచనా. ఈ లెక్కన ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.5,76 లక్షల కోట్లు ఖర్చు అవుతుం దాని ప్రాథమికంగా లెక్క తేల్చారు.షాపింగ్ సందడి షురూ..దసరా పండుగతోపాటు పెళ్లిళ్ల షాపింగ్ కూడా కొందరు. ప్రారంభించారు. దీంతో మార్కెట్లో సైతం సందడి నెలకొంది. భోజనాలు, క్యాటరింగ్, కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, డెకరేషన్లకు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖల ప్రీం టింగ్స్, ఫ్లెక్సీ ప్రింటర్స్, ఫొబో గ్రావర్లు, టెంట్ హౌస్, వంటమేస్త్రీలు, ముట పనివాళ్లు, క్యాటరింగ్ బాయ్స్, బ్యూటీ మనన్లు, మెహందీ ఆది పూలు అమ్మేవాళ్లు, మంగళ వాయిద్య కళాకారులు, డీజే మ్యూజి నివ్వాహకులు ఇలా పెళ్లి వేడుకతో ప్రతి ఒక్కరిని ముందుగానే ఎంపిక చేసుకుని అడ్వాన్సులు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. దేశంలో సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి సంపన్నుల వరకు పెళ్లి వేడుక అన్నట్లుగా ఖర్చు చేస్తున్నారు. ఎంగేజ్మెంట్, ఫ్రీ వెడ్డింగ్, హల్దీ, రిసెప్షన్ పోస్ట్ వెడ్డింగ్... ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకకు రాజీపడకుండా నిర్వహిస్తున్నారు. అందువల్ల ఈ ఏడాది చివరి వరకు దేశవ్యాప్తంగా పెళ్లి సందడి ఉంటుందని సీఏఐటీ వెల్లడించింది.ముహూర్తాలు.. ఇవీ అక్టోబర్ 12, 13, 16, 20,27వ తేదీల్లో మహూర్తాలు ఉన్నాయి. నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 16,17. డిసెంబర్లో 5,6,7 8, 11, 12, 14, 15, 26 వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి మాసం ప్రారంభం కావడంతో మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలు వరకు శుభ ముహూ కోసం ఆగాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఏడాురు దీపావళి తర్వాత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉపనయనాలు, గృహప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతాయని అంచనా. -
నవంబర్లో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: దేశ రాజధానిని ప్రతిఏటా ఇబ్బంది పెట్టే విషయం వాయు కాలుష్టం. అక్టోబర్ చివరి నుంచే వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు ఆప్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈసారి కూడా వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.నవంబర్లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో నగరంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైంది.నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాజధాని ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం పేర్కొన్నారు. ఈ మేరకు కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్ర సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోడానికి 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మంత్రి విడుదల చేశారు. 2016 – 2023 మధ్య రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం 34.6 శాతం తగ్గిందని మంత్రి తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో నగరంలో రెండు కోట్ల చెట్లను నాటామని, దీని ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించగలిగామని చెప్పారు. డ్రోన్ల ద్వారా కాలుష్య హాట్స్పాట్ ప్రాంతాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ, రవాణా మంత్రిత్వ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సహా 86 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. -
నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు- మహారాష్ట్ర సీఎం
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబరు మొదటి వారంలో జరిగే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సారి ఎన్నికలు రెండు దశల్లో జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. గణేశోత్సవాలు పురస్కరించుకుని శిందే అధికార నివాసమైన వర్షా బంగ్లాలో విలేకరులతో కొద్ది సేపు ముచ్చటించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే వెల్లడించాల్సి ఉంది. కానీ వరుసగా వస్తున్న ఉత్సవాలు, పర్వదినాల కారణంగా వాయిదా వేయాల్సి వస్తోందని అన్నారు. అయినప్పటికీ తుది నిర్ణయం ఎన్నికల సంఘమే తీసుకుంటుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో ఎవరు ఎన్ని స్థానాలపై, ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై వారం, పది రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని సంకేతాలిచ్చారు. తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఈ పథకాలను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారని శిందే ధీమా వ్యక్తం చేశారు. అయితే సీట్ల పంపకం విషయంలో విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వచి్చన ఫలితాలను ప్రధాన అం«శంగా పరిగణించి మెరిట్, స్ట్రైక్ రేట్ బేసిక్పై సీట్ల పంపిణీ చేపడతామని శిందే స్పష్టం చేశారు. ప్రస్తుతం సీట్ల పంపకంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. మిత్రపక్షాల్లో కొందరి ఎక్కువ సీట్లు, మరికొందరికి తుక్కువ సీట్లు లభించవచ్చని అన్నారు. ఏ పార్టీకి, ఎక్కడ గెలిచే సత్తా ఉందో ఆ పారీ్టకే అక్కడ స్థానాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఫార్ములా వచ్చే వారం లేదా పది రోజుల్లో పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. అభ్యర్థిత్వం ఇచ్చేముందు మూడు పారీ్టలకు ఎక్కడెక్కడ మంచి పట్టు ఉందో ఆయా పార్టీల అభ్యర్థులను ఎంపికచేసి బరిలోకి దింపుతామని పేర్కొన్నారు. అభ్యర్థిత్వం ఇచ్చే ముందు అధ్యయనం చేపడతామని తెలిపారు. తమది సామాన్య ప్రజల ప్రభుత్వం, మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల తమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లభిస్తుందని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు ఓర్వలేక అనవసరంగా మహాయుతి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)కాంగ్రెస్కు 1,633 దరఖాస్తులు! లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడంతో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ)లో చాలా ఉత్సాహకర వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావహులు క్యూలు కడుతున్నారు. కొందరైతే ఇప్పటి నుంచే పైరవీలు చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ వద్దకు 1,633 దరఖాస్తులు వచ్చాయి. అత్యధిక దరఖాస్తులు విదర్భ నుంచి (485), ఆ తర్వాత మరఠ్వాడా రీజియన్ నుంచి (325) నియోజక వర్గాల నుంచి రాగా అతి తక్కువ కొంకణ్ రీజియన్ నుంచి (123) దరఖాస్తులు వచ్చాయి. అదే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 476 దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. దీన్ని బట్టి 2019తో పోలిస్తే ఈ సారి జరిగే అసెంబీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగినట్లు స్పష్టమవుతోంది. అధికార మహా అఘాడీకి చెందిన కొందరు సభ్యులు కూడా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వారి పేర్లు ఇప్పుడే బయట పెట్టలేమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ వారి ప్రోగ్రెస్ రిపోర్ట్ను బట్టి ఎంపిక చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. భారీ సంఖ్యలో వచి్చన దరఖాస్తుల్లో కొన్నింటినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. తిరస్కరణకు గురైన దరఖాస్తుల్లో కొందరు తిరుగుబాటు చేసే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఎంవీఏ నేతలు ఆచితూచి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: సుశీల్కుమార్ శిందే మనవడు, జాన్వీ బాయ్ఫ్రెండ్ రాజకీయాల్లోకి! -
ఎయిర్ ఇండియాలోకి విస్తారా: ఆ రోజే చివరి ఫ్లైట్
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (Vistara).. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలోకి విలీనం కానుంది. 2024 నవంబర్ 11న విస్తారా తన చివరి విమానం నడపనుంది. అంతకంటే ముందు (సెప్టెంబర్ 3) సంస్థ టికెట్ రిజర్వేషన్లను కూడా ఎయిర్ ఇండియా వెబ్సైట్కు మళ్ళించనున్నట్లు సమాచారం. అయితే విమాన ప్రయాణాలు మాత్రం నవంబర్ 11వరకు కొనసాగుతాయి.విస్తారా సంస్థ.. ఎయిర్ ఇండియాలో విలీనం కావడానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సింగపూర్ ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంటే ఎయిర్ ఇండియాలో విలీనం కానున్న విస్తారాలో.. సింగపూర్ ఎయిర్లైన్స్ 25.1 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ & ఏఐ ప్రిఫిక్స్తో విస్తారా నెట్వర్క్.. విమానాలు కొనసాగుతాయి. విస్తారా సిబ్బంది.. విస్తారా విమానాలను 2025 ప్రారంభం వరకు ఎయిర్ ఇండియా కింద నిర్వహిస్తారు. అయితే సర్వీస్ లెవల్స్, భోజనం, ఇతరత్రా కార్యకలాపాలు ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం ఉంటాయి.ఇప్పటికే విస్తారా ఫ్లైట్ టికెట్ నవంబర్ 11 తరువాతకు బుక్ చేసుకుని ఉంటే.. ఎయిర్ ఇండియాలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రయాణానికి ఏ లోటు లేదు. కానీ మీరు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవచ్చు. -
నవంబరు నాటికి రామ్లల్లా దర్బారు సిద్ధం!
ఈ ఏడాది నవంబర్ నాటికి అయోధ్య రామాలయ మొదటి అంతస్తు (రామ్లల్లా దర్బారు) సిద్ధం కానున్నదని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సర్క్యూట్ హౌస్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగానే రామమందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, టెంపుల్ పార్కు, ఇతర సౌకర్యాల కోసం జరుగుతున్న పనులను పరిశీలించామని మిశ్రా తెలిపారు. ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి సారించామని, రామ్లల్లా దర్బారు నవంబర్ నాటికి పూర్తికానున్నదని పేర్కొన్నారు. ఇదిలావుండగా అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ప్రధాన కార్యాలయాన్ని రామనగరిలో నెలకొల్పనున్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్, అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాల కోసం కొత్త భవనాలను నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీ టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్ ఆనంద్ మెహతా తెలిపారు. మార్చి నెలాఖరులోగా కాశీ-అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని కేవలం 55 నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చు. ఒక్కో ప్రయాణికునికి ఛార్జీ రూ.14,159 చొప్పున వసూలు చేయనున్నారు. ఒక ట్రిప్పులో ఐదుగురు ప్రయాణించే అవకాశం ఉండనుంది. ఈ హెలికాప్టర్ సేవలను ఉత్తరాఖండ్కు చెందిన రాజాస్ ఏరోస్పోర్ట్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అందించనుంది. -
ఎగుమతులు మళ్లీ మైనస్లోకి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ తీవ్ర అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతులు అద్దం పడుతున్నాయి. అక్టోబర్లో ‘ప్లస్’లోకి వచి్చన ఎగుమతులు తిరిగి నవంబర్లో మైనస్లోకి జారిపోయాయి. 2022 ఇదే నెలతో పోలి్చతే 2023 నవంబర్లో ఎగుమతుల విలువ 2.83% క్షీణించి 33.90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక 10 నెలల తర్వాత అక్టోబర్లో ఎగువబాటకు చేరిన దిగుమతులు నవంబర్లో మళ్లీ క్షీణతలోకి జారాయి. 4.33% పతనంతో 54.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ముందు.. వెనుకలు ఇలా... అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్లో 2.6 శాతం క్షీణించాయి. అక్టోబర్లో సానుకూల ఫలితం వెలువడింది. మరుసటి నెలలోనే మళ్లీ క్షీణరేటు నమోదయ్యింది. ఏప్రిల్–నవంబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 6.51 శాతం క్షీణించి 278.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.67 శాతం క్షీణించి 445.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 166.36 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎనిమిది నెలల కాలంలో పసిడి దిగుమతులు 21 శాతం పెరిగి 32.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
టాటా మోటార్స్ సరికొత్త రికార్డు.. ఎప్పుడూ లేనంతగా..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2023 నవంబర్లో గరిష్ట విక్రయాలను నమోదు చేసింది. పండుగల సీజన్ నేపథ్యంలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఇందుకు కారణమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. ‘గత నెలలో దేశవ్యాప్తంగా కంపెనీ 53,000 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్య అంత క్రితం నెలతో పోలిస్తే 8 శాతం, 2022 నవంబర్తో పోలిస్తే 30 శాతం అధికం. 2023 నవంబర్ నెలలో నమోదైన విక్రయాలు ఇప్పటి వరకు కంపెనీ చరిత్రలోనే అత్యధికం. ఇక 47 రోజుల పండుగల సీజన్లో 79,374 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 పండుగల సీజన్తో పోలిస్తే ఇది 18 శాతం అధికం. కొత్తగా విడుదలైన నూతన నెక్సన్, హ్యారియర్, సఫారీ మోడళ్లతోపాటు ఐ–సీఎన్జీ శ్రేణి ఈ జోరుకు కారణం’ అని చెప్పారు. డీజిల్ స్థానంలో సీఎన్జీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమతోపాటు టాటా మోటార్స్ సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చనుందని శైలేష్ చంద్ర అన్నారు. ‘2023–24లో అన్ని కంపెనీలవి కలిపి 40 లక్షల యూనిట్ల మార్కును దాటవచ్చు. నవంబర్ రిటైల్ విక్రయాల్లో టాటా మోటార్స్ వాటా 15 శాతం దాటింది. ఎస్యూవీల్లో నెక్సన్, పంచ్ గత నెలలో టాప్–2లో ఉన్నాయి. ఎస్యూవీ మార్కెట్లో టాటా రెండవ స్థానంలో నిలిచింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగం నెలకు 3.3–3.5 లక్షల యూనిట్లను నమోదు చేస్తుంది. చిన్న హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్లో డీజిల్ మోడళ్లు కనుమరుగయ్యాయి. డీజిల్ స్థానంలో సీఎన్జీ వచ్చి చేరింది. ఈ విభాగాల్లో సీఎన్జీ ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచింది. కాంపాక్ట్ ఎస్యూవీకి పైన డీజిల్ మోడళ్లకు బలమైన డిమాండ్ ఉంది. కాబట్టి మార్కెట్కు అనుగుణంగా నడుచుకుంటాం’ అని వివరించారు. -
ఢిల్లీ కాలుష్యం తగ్గించడానికి కృత్రిమ వర్షం?
ఢిల్లీ: ఢిల్లీలో వాయు నాణ్యత అడుగంటిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన ఉద్గారాల వల్ల గత ఏడు రోజులుగా కాలుష్య స్థాయిలు విషమంగానే కొనసాగుతున్నాయి. గాలి నాణ్యత పెంచడానికి తక్షణ ఉపాయం ఆలోచించాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. నవంబర్ 20-21లో రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని యోచిస్తోంది. ఐఐటీ కాన్పూర్ బృందంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక మంత్రి అతిషి సమావేశమయ్యారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు. కృత్రిమ వర్షానికి సంబంధించిన ప్రణాళికను ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ నిపుణులను కోరింది. ఈ ప్రణాళికను సుప్రీంకోర్టులో శుక్రవారం సమర్పించనుంది. ఢిల్లీలో కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేస్తే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాయి. "కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేఘాలు కమ్ముకోవాలి. నవంబర్ 20-21 తేదీల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. కృత్రిమ వర్షం ప్రణాళికను అమలు చేసేందుకు అనుమతి లభిస్తే అధ్యయనాన్ని నిర్వహిస్తాం' అని ఐఐటీ కాన్పూర్ నిపుణులు తెలిపారు. దేశ రాజధానిలో గాలి కాలుష్యం రాజకీయ వివాదంగా పరిణమించకూడదని సుప్రీంకోర్టు ఇటీవల హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో పంట వ్యర్థాల దహనాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కాలుష్య సమస్యను ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని కోరింది. కృత్రిమ వర్షం అంటే? కరువుల ప్రభావాన్ని తగ్గించడం, అటవీ మంటలను నివారించడం, గాలి నాణ్యతను పెంచడానికి సాధారణంగా ఉపయోగించే కృత్రిమ పద్ధతి. వివిధ రసాయనిక పదార్థాలను మేఘాలలోకి ప్రవేశపెట్టడం ద్వారా వర్షపాతాన్ని కలిగిస్తారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాలను హెలికాప్టర్ల ద్వారా మేఘాలలోకి విడుదల చేస్తారు. ఈ రసాయనాలు నీటి ఆవిరిని మేఘాలుగా ఏర్పర్చి వర్షం కురిసేలా చేస్తాయి. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యానికి రీజనరేటివ్ వ్యవసాయమే విరుగుడు..? అసలేంటది..? -
64.40 లక్షల మందికి రూ.1,775.33 కోట్లు
సాక్షి, అమరావతి: నవంబర్ నెలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 64,40,536 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు రూ.1,775.33 కోట్ల మొత్తాన్ని పింఛన్లుగా ప్రభుత్వం పంపిణీ చేసింది. నాలుగు రోజులుగా వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పటికే 98.26 శాతం లబ్ధిదారులకు పంపిణీ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన వారి కోసం ఆదివారం సెలవు రోజు అయినా వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
Bank holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! నవంబర్లో సెలవులు ఇవే..
Bank holidays in November 2023: అక్టోబర్ నెల ముగుస్తోంది. నవంబర్లోకి అడుగు పెట్టబోతున్నాం. పండుగ సీజన్ కావడంతో నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా కస్టమర్లు తమ ఆర్థిక కార్యకలాపాలను ప్లాన్ చేసుకునేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేసింది. నవంబర్లో దీపావళి, గోవర్ధన్ పూజ, ఛత్ పూజ, సాధారణ వారాంతాలతో సహా దేశంలోని పలు రాష్ట్రాలలో సెలవులతో కలుపుకొని మొత్తం 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవచ్చు. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. నవంబర్లో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే.. నవంబర్ 1 - కన్నడ రాజ్యోత్సవం/కుట్/కర్వా చౌత్ (కర్ణాటక, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 5 - ఆదివారం నవంబర్ 10 - వంగల పండుగ (మేఘాలయ) నవంబర్ 11 - రెండవ శనివారం (వీక్లీ ఆఫ్) నవంబర్ 12 - ఆదివారం (వీక్లీ ఆఫ్) నవంబర్ 13 - గోవర్ధన్ పూజ/లక్ష్మీపూజ (త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర) నవంబర్ 14 - దీపావళి నవంబర్ 15 - భాయ్ దూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మీ పూజ/నింగల్ చక్కుబా/భ్రాత్రి ద్వితీయ (సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 19, 2023 - ఆదివారం నవంబర్ 20 - ఛత్ (బిహార్, రాజస్థాన్) నవంబర్ 23 - సెంగ్ కుట్ స్నెమ్/ఇగాస్ బగ్వాల్ (ఉత్తరాఖండ్, సిక్కిం) నవంబర్ 25 - నాల్గవ శనివారం నవంబర్ 26 - ఆదివారం నవంబర్ 27 - గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ (త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్ - తెలంగాణ, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్) నవంబర్ 30 - కనకదాస జయంతి (కర్ణాటక) -
IPO: నెలలో రూ.15వేల కోట్లు సమీకరించే కంపెనీలు ఇవే..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబరులో దాదాపు 12 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. వీటి ద్వారా వచ్చే నెల రోజుల్లో దాదాపు రూ.15,000 కోట్ల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ డజన్ కంపెనీల్లో ఇప్పటికే బ్లూ జెట్ హెల్త్కేర్ ఐపీఓ ప్రారంభం అయింది. సెల్లో వరల్డ్ ఇష్యూ తేదీలను ప్రకటించింది. టాటా టెక్నాలజీస్, మామాఎర్త్, ఏఎస్కే ఆటోమోటివ్, ప్రోటీన్ ఈగవ్ టెక్, ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ పబ్లిక్ ఆఫర్లు నవంబరులో రానున్నాయి. వీటితో మొత్తం దాదాపు రూ.15వేలకోట్లు సమీకరించే వీలుంది. రూ.1,900 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తోన్న సెల్లో వరల్డ్ ఐపీఓ అక్టోబర్ 30న ప్రారంభమై నవంబర్ 1 వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.617-648గా నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన బ్లూ జెట్ హెల్త్కేర్ ఐపీఓ అక్టోబర్ 27 వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీ రూ.840 కోట్లు సమీకరించనుంది. చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ రెండు లేదా మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇరవయ్యేళ్లలో టాటా గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓ ఇది. దీని ఒక్కో షేరు ధర శ్రేణి రూ.400 నుంచి రూ.500 మధ్య ఉండొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు. చివరగా 2004లో టాటా సంస్థల నుంచి టీసీఎస్ ఐపీఓగా వచ్చింది. హొనాస కన్జ్యూమర్(మామాఎర్త్ మాతృసంస్థ) పబ్లిక్ ఇష్యూకు త్వరలో రాబోతోంది. దాదాపు రూ.1,650 కోట్ల సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ఫెడరల్ బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు రానుంది. రూ.1,200 కోట్ల సమీకరణ లక్ష్యంతో ప్రోటీన్ ఇగవ్ టెక్, రూ.1,000 కోట్ల సమీకరణ కోసం ఏఎస్కే ఆటోమోటివ్ సైతం నవంబర్లోనే ఐపీఓ (IPO)కి రానున్నాయి. వచ్చే నెలలోనే రూ.1,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకి సిద్ధ అవుతుంది. రూ.750 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు మరో 70.3 మిలియన్ల షేర్లు ఓఎఫ్ఎస్ కింద జారీ చేయనున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓకు వచ్చిన 36 కంపెనీలు దాదాపు రూ.28,330 కోట్లు సమీకరించాయి. గతేడాది మొత్తం 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. ఫలితంగా రూ.59వేలకోట్ల నిధులు కూడగట్టాయి. కంపెనీలు సమీకరించనున్న మొత్తం టాటా టెక్నాలజీస్: రూ.2500 కోట్లు సెల్లోవరల్డ్: రూ.1900 కోట్లు హొనాస కన్జ్యూమర్:రూ.1650 కోట్లు ఫెడ్బ్యాంక్ ఫైనాన్సియల్: రూ.1400 కోట్లు ప్రొటీన్ ఈగోవ్టెక్: రూ.1300 కోట్లు డీఓఎంఎస్ ఇండస్ట్రీస్:రూ.1200 కోట్లు ఏఎస్కే ఆటోమోటివ్:రూ.1000 కోట్లు జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.1000 కోట్లు ఫిన్కేర్ మైక్రోఫైనాన్స్: రూ.900 కోట్లు బ్లూజెట్ హెల్త్కేర్: రూ.840 కోట్లు ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్: రూ.800 కోట్లు ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.630 కోట్లు -
ఆప్యాయనురాగాలతో..
పులివెందుల మహేశ్, ప్రియా పాల్ జంటగా శివరామ్ తేజ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఊరి సిన్మా’. జి. మంజునాథ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రెస్మీట్లో పీపుల్ మీడియా ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్ కాసుల రామకష్ణ (శ్రీధర్), నటులు నాగమహేశ్, ‘బలగం’ సంజయ్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఇంత మంచి సినిమాను నిర్మించడానికి సహకరించినవారికి థ్యాంక్స్’’ అన్నారు జి. మంజునాథ రెడ్డి. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు శివరామ్ తేజ. ‘‘తండ్రీకొడుకుల అనురాగం, బావా–మరదళ్ల ఆప్యాయతతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు పులివెందుల మహేశ్. -
యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ పూర్తి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. విక్రాంత్ డెఫ్ ఫ్రాగ్ ప్రోడక్షన్స్పై రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా హీరో–డైరెక్టర్ విక్రాంత్ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. భావోద్వేగాలు, ప్రేమ, భారీ ఫైట్స్తో ఈ మూవీ రూపొందింది. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ అనుభూతినిచ్చే సినిమా ఇది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 17న ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
TSPSC: నవంబర్లోనే గ్రూప్-2.. కొత్త తేదీలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థులకు గమనిక. ఈనెల 29,30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు కొత్త తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచనలు చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసే అంశంపై టీఎస్పీఎస్సీ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. మిగతా పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వివరాలను ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిందని, వాటిని నవంబర్లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఒక్క క్లిక్తో.. ఆర్టీసీ బస్సు ఎక్కడుందో చెబుతుంది.. డౌన్లోడ్ ఇలా.. -
గ్రూప్–2 పరీక్షలు నవంబర్కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచన లు చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసే అంశంపై టీఎస్పీఎస్సీ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మిగతా పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వివరాలను ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిందని, వాటిని నవంబర్లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అభ్యర్థుల ఆందోళనకు చెక్ ఈనెల 29, 30వ తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఐదు నెలల క్రితమే తెలిపింది. కమిషన్ షెడ్యూల్ ఆధారంగా ఆగస్టులో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలకు గురుకుల బోర్డు సన్నద్ధమై పరీక్షల షెడ్యూల్ను ప్రకటించి నిర్వహిస్తోంది. వరుసగా ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తుండటం... ఆ తర్వాత 29, 30 తేదీల్లో 5.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే గ్రూప్–2 పరీక్షలుండటంతో అభ్యర్థులపై ఒత్తిడి తీవ్రమవుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఈక్రమంలో పలు రకాలుగా కమిషన్కు వినతులు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో కమిషన్ కార్యాలయ ముట్టడికి సైతం అభ్యర్థులు దిగడం... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం... మరోవైపు కొందరు అభ్యర్థులు న్యాయపోరాటానికి సైతం ఉపక్రమించడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పరీక్ష నిర్వహణను వాయిదా వేయడంతో అభ్యర్థుల ఆందోళనకు చెక్ పడింది. -
‘వారంతా 18-25 ఏళ్ల వయస్సు వాళ్లే’.. దేశంలో పెరిగి పోతున్న ఉద్యోగం చేసే వారి సంఖ్య
న్యూఢిల్లీ: ఉపాధి కల్పనకు సంబంధించి నవంబర్ సానుకూల సంకేతం ఇచ్చింది. 2022 నవంబర్లో నికరంగా 16.26 లక్షల మంది చందాదారులు చేరినట్లు కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ సంఖ్య 16.5 శాతం అధికంగా ఉండడం గమనార్హం. ఇక 2022 అక్టోబర్తో పోల్చితే ఈ గణాంకాలు ఏకంగా 25.67 శాతం అధికంగా ఉన్నాయి. తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► నవంబర్లో 16.26 లక్షల మంది నికరంగా ఈపీఎఫ్ఓ చందాదారులగా చేరితే అందులో 8.99 లక్ష మంది మొదటి సారి చేరినవారు. ఇలా చేరిన వారు అక్టోబర్తో (7.28 లక్షలు) పోల్చితే 1.71 లక్షల మంది అధికం. ► కొత్తగా ఆర్గనైజేషన్లో చేరిన వారిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సువారు 2.77 లక్షల మంది. 22–25 మధ్య వయస్సు వారు 2.32 లక్షల మంది. మొత్తం కొత్త సభ్యుల్లో 18 నుంచి 25 మధ్య వయస్కుల వారి వెయిటేజ్ 56.60 శాతంగా ఉంది. మొదటిసారి ఉద్యోగంలో చేరినవారు భారీగా సంఘటిత రంగంలోనే నమోదయినట్లు ఈ గణాంకాలు పేర్కొనడం సానుకూల అంశం. ► ఇక దాదాపు 11.21 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓమెంబర్షిప్లో తిరిగి చేరారని కూడా డేటా పేర్కొంది. ఉద్యోగాల మార్పు, ఈపీఎఫ్ఓ కింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరడం, తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా సామాజిక భద్రతా రక్షణను పొడిగిస్తూ వారి నిధిని బదిలీ చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నవారు ఇందులో ఉన్నారు. ► ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం, నవంబర్ 2022లో నికర మహిళా సభ్యుల నమోదు సంఖ్య 3.19 లక్షలు. అక్టోబర్ 2022కు సంబంధించి 2.63 లక్షల మందితో పోల్చితే ఇది 0.56 శాతం అధికం. ఈఎస్ఐ స్కీమ్ గణాంకాలు ఇలా... ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈఎస్ఐ స్కీమ్) తొలి విడత 2022 నవంబర్ పేరోల్ డేటాను కూడా కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో సమీక్షా నెల్లో 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగులు జతయ్యారు. 2021 నవంబర్తో పోల్చితే ఈ సంఖ్య నికరంగా 5.24 లక్షలు పెరిగింది. డేటా ప్రకారం, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద తమ ఉద్యోగులకు సామాజిక భద్రత కవరేజీని అందజేయడానికి ఉద్దేశించి నవంబర్ 2022 నెలలో దాదాపు 21,953 కొత్త సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. ఈఎస్ఐ కింద నవంబర్లో జతయిన 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగుల్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు 8.78 లక్షల మంది. నమోదయిన నికర మహిళా సభ్యుల సంఖ్య 3.51 లక్షలు. నవంబర్లో మొత్తం 63 మంది ట్రాన్స్జెండర్ ఉద్యోగులు కూడా ఈఎస్ఐ స్కీమ్లో నమోదు చేసుకున్నట్లు డేటా పేర్కొంది. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి ( సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
ఆధార్ ఈ కేవైసీ లావాదేవీలు 29 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు నెలవారీగా చూస్తే నవంబర్లో 22 శాతం పెరిగాయి. 28.75 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 1,350 కోట్ల మైలురాయిని లావాదేవీలు అధిగమించాయి. ఆధార్ ధ్రువీకృత లావాదేవీలు సైతం నవంబర్లో 11 శాతం అధికంగా 195 కోట్లు నమోదయ్యాయి. ఆధార్ వాడకం దేశవ్యాప్తంగా పెరుగుతోందని, చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ప్రకటించింది. ఆధార్ ఈ కేవైసీ లావాదేవీ అంటే.. బ్యాంక్ ఖాతా కోసం ఈ–కేవైసీ ఇస్తాం కదా, ఇది ఒక లావాదేవీ కిందకు వస్తుంది. ఆధార్ ఈ–కేవైసీ లావాదేవీల వృద్ధికి ప్రధానంగా బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక లావాదేవీలు మద్దతునిస్తున్నాయి. ఈ–కేవైసీ వల్ల పేపర్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన ఇబ్బంది తప్పిపోయింది. ఇది వచ్చిన తర్వాత బ్యాంక్ ఖాతాలు, టెలికం సిమ్ కార్డుల జారీ, కొత్త కస్టమర్లను చేర్చుకోవడం తదితర సేవలు ఎంతో సులభంగా మారడం తెలిసిందే. ఆధార్ హోల్డర్ వ్యక్తిగతంగా హాజరై వేలిముద్ర, ఓటీపీ ఇస్తేనే ధ్రువీకరణ కావడం ఇందులో భద్రతకు హామీ ఇస్తోంది. ఇక ఆధార్ ఈ–కేవైసీ విధానం వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 8,621 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఆధార్ ఆధారిత చెల్లింపులు రూ.1,592 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 1,100 ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు వేగంగా, పారదర్శకంగా చేరేందుకు ఆధార్ ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తెలిపింది. -
నవంబర్లో 37 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ నవంబర్లో దేశీయంగా 37.16 లక్షల ఖాతాలను నిషేధించింది. అంతక్రితం నెలతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. అక్టోబర్లో 23.24 లక్షల ఖాతాలను నిషేధించింది. తాజాగా నవంబర్లో మిగతావారి నుంచి ఫిర్యాదులు రావడానికి ముందే క్రియాశీలకంగా వ్యవహరించి బ్యాన్ చేసిన ఖాతాల సంఖ్య 9.9 లక్షలుగా ఉందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం తమ నెలవారీ నివేదికలో వాట్సాప్ తెలిపింది. విద్వేషపూరిత, తప్పుడు సమాచార వ్యాప్తికి వేదికలుగా మారుతున్నాయంటూ సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై ఆరోపణలు వస్తుండటంతో కేంద్రం గతేడాది కఠినతర ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం 50 లక్షల పైగా యూజర్లు ఉన్న బడా డిజిటల్ ప్లాట్ఫాంలు తాము నిబంధనలను పాటిస్తున్నట్లు తెలిపేలా ప్రతి నెలా నివేదికను ప్రచురించాల్సి ఉంటుంది. తమకు వచ్చిన ఫిర్యాదులు, తాము తీసుకున్న చర్యల గురించి వెల్లడించాలి. దీనికి అనుగుణంగానే వాట్సాప్ తాజా నివేదికను రూపొందించింది. -
1.16 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 నవంబర్లో 1.16 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 నవంబర్తో పోలిస్తే ఈ సంఖ్య 11.06 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. 2022 అక్టోబర్లో దేశీయంగా 1.14 కోట్ల మంది విహంగ వీక్షణం చేశారు. కోవిడ్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న తరువాత.. దేశంలోని పౌర విమానయాన రంగం రికవరీ బాటలో ఉంది. ఇటీవలి కాలంలో దేశీయంగా సగటున ప్రతిరోజు 4 లక్షల పైచిలుకు మంది విమాన ప్రయాణం చేస్తున్నారు. నవంబరులో నమోదైన మొత్తం ప్రయాణికుల్లో 55.7 శాతం వాటాతో ఇండిగో తొలి స్థానంలో నిలిచింది. విస్తారా 9.3 శాతం వాటాతో 10.87 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఎయిర్ ఇండియా 9.1 శాతం, ఏయిర్ఏషియా ఇండియా 7.6, గో ఫస్ట్, స్పైస్జెట్ చెరి 7.5 శాతం వాటాను దక్కించుకున్నాయి. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ఏషియా సంయుక్తంగా 26 శాతం వాటాతో 30.35 లక్షల మందికి విమాన సేవలు అందించాయి. 92 శాతం అధిక ఆక్యుపెన్సీతో స్పైస్జెట్ ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో రాకపోకల విషయంలో సగటున 92 శాతం ఇండిగో విమానాలు నిర్ధేశిత సమయానికి సేవలు అందించాయి. -
5.85 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మాదిరే టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సైతం నవంబర్లో గణనీయంగా తగ్గి 5.85 శాతానికి పరిమితమైంది. అంతకుముందు నెలలో (అక్టోబర్) ఇది 8.39 శాతంగా ఉంది. ఆహారం, చమురు, తయారీ ధరలు తగ్గుముఖం పట్టడం ద్రవ్యోల్బణం వేడి తగ్గేందుకు సాయపడ్డాయి. నవంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్లో ఉన్న 6.77 శాతం నుంచి 5.88 శాతానికి తగ్గడం తెలిసిందే. గతేడాది నవంబర్లో డబ్ల్యూపీఐ బేస్ అధికంగా ఉండడం, ఆహార ధరలు కొంత తగ్గడం ద్రవ్యోల్బణం నియంత్రణకు సాయపడినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ పరిశోధన పత్రంలో పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.83% తర్వాత, అతి తక్కువ స్థాయిలో నమోదు కావడం మళ్లీ ఇదే మొదటిసారి. విభాగాల వారీగా.. ► ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం అక్టోబర్లో 8.33% ఉంటే, నవంబర్లో 1.07%గా ఉంది. ► కూరగాయల ధరలు అయితే ఊహించని విధంగా నియంత్రణలోకి వచ్చాయి. కూరగాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం అక్టోబర్లో 17.61 శాతంగా ఉంటే, నవంబర్లో ఏకంగా మైనస్ 20 శాతానికి (డిఫ్లేషన్) పడిపోయింది. ► ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 17.35 శాతంగా నమోదైంది. ► తయారీ ఉత్పత్తులకు సంబంధించి 3.59 శాతంగా ఉంది. మరింత తగ్గిస్తాం.. ప్రధాని మోదీ, మంత్రుల బృందం, అధికారులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకోవడం, చర్యలు తీసుకోవడం ఫలితాలనిచ్చాయి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు తెలిపారు. సామాన్యుడి కోసం ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
భారీగా వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు నవంబర్లో గణనీయంగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 11,38,823 టన్నులతో పోల్చి చూస్తే, 32 శాతం పెరిగి 15,28,760 టన్నులకు చేరాయి. ముఖ్యంగా ముడి పామాయిల్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు అధికంగా జరిగినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. నవంబర్ నెలకు సంబంధించి వంట నూనెలు, ఇతర నూనెల దిగుమతుల గణాంకాలను ఎస్ఈఏ బుధవారం విడుదల చేసింది. వంట నూనెలకు సంబంధించి 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో నవంబర్ మొదటి నెల అవుతుంది. పామాయిల్ రికార్డులు ► మొత్తం నూనెల దిగుమతులు నవంబర్ నెలకు 15,45,540 టన్నులుగా ఉన్నాయి. 2021 నవంబర్లో ఇవి 11,73,747 టన్నులుగా ఉన్నాయి. ► కేవలం వంట నూనెల దిగుమతులు 15,28,760 టన్నులకు చేరాయి. ► ఇతర నూనెల దిగుమతులు ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 34,924 టన్నులతో పోలిస్తే 52 శాతం తగ్గి 16,780 టన్నులుగా ఉన్నాయి. ► ముడి పామాయిల్ దిగుమతులు 9,31,180 టన్నులుగా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇవి 4,77,160 టన్నులుగానే ఉన్నాయి. అంటే రెట్టింపైనట్టు తెలుస్తోంది. ► ఇప్పటి వరకు ఒక నెలలో ముడి పామాయిల్ అధిక దిగుమతులు ఇవే కావడం గమనించాలి. చివరిగా 2015 అక్టోబర్ నెలలో 8,78,137 టన్నుల ముడి పామాయిల్ దిగుమతులు జరిగాయి. ► రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు నవంబర్ నెలకు 2,02,248 టన్నులుగా ఉన్నాయి. 2021 నవంబర్లో ఉన్న 58,267 టన్నులతో పోలిస్తే మూడు రెట్లకు పైగా డిమాండ్ పెరిగింది. ► ముడి సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 2,29,373 టన్నులకు తగ్గాయి. ఏడాది క్రితం ఇదే నెలలో ఇవి 4,74,160 టన్నులుగా ఉన్నాయి. ఎస్ఈఏ ఆందోళన..: రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ దిగుమతులు పెరిగిపోవడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఎస్ఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ముడి పామాయిల్, రిఫైన్డ్ ఆయిల్ మధ్య టారిఫ్ అంతరం 7.5 శాతమే ఉండడంతో, రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు పెరగడానికి దారితీస్తోంది. తుది ఉత్పత్తుల దిగుమతులు పెరగడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం. దేశీ సామర్థ్య వినియోగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రిఫైన్డ్ పామోలీన్ దిగుమతులు పెరగడానికి.. వాటిని ఎగుమతి చేసే దేశాలు (ఇండోనేషియా, మలేషియా) అక్కడి పరిశ్రమకు రాయితీలు ఇవ్వడం వల్లే. ముడి పామాయిల్ ఎగుమతులపై ఆయా దేశాలు అధిక సుంకాలు విధించాయి. తుది ఉత్పత్తి అయిన పామోలీన్ ఆయిల్పై తక్కువ డ్యూటీ విధించాయి’’అని అసోసియేషన్ పేర్కొంది. దేశీ పరిశ్రమను ఆదుకునేందుకు, ముడి పామాయిల్ దిగుమతిని ప్రోత్సహించేందుకు పరిశ్రమ కీలక సూచన చేసింది. రెండింటి మధ్య సుంకాల్లో అంతరం 15 శాతం మేర ఉంచాలని పేర్కొంది. రిఫైన్డ్ పామోలీన్ ఆయిల్పై డ్యూటీని 20 శాతం చేయాలని కోరింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వంట నూనెల దిగుమతులు అంతకుమందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 131 లక్షల టన్నుల నుంచి 140 లక్షల టన్నులకు పెరగడం గమనార్హం. -
సామాన్యుడికి ఊరట:11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: సామాన్యుడికి ధరల మంట కాస్తంత తగ్గింది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారోత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో నవంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతానికి దిగొచ్చింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అంటే ఏడాది తర్వాత మళ్లీ తక్కువ ధరలు చూస్తున్నాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (వినియోగ ధరల ఆధారిత సూచీ/రిటైల్ ద్రవ్యోల్బణం) గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా రెండో మాసం. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) అంతకుముందు అక్టోబర్లో 6.77 శాతంగా ఉంది. 2021 నవంబర్ నెలలో ఇది 4.91 శాతంగా ఉండడం గమనార్హం. ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పటికీ 1శాతం మేర అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ, వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించే ప్రయత్నం చేస్తుండడం తెలిసిందే. ఈ నెల మొ దటి వారంలో ముగిసిన తాజా ఎంపీసీ సమీక్షలోనూ కీలక రెపో రేటు 0.35శాతం మేర పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే రెపో రేటు మొత్తం మీద 2.25 శాతం ఎగిసింది. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6శాతం లోపునకు దిగొస్తుందని, రానున్న రోజుల్లో ధరల మంట కాస్తంత చల్లారుతుందని ఇటీవలి సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. (ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి) ధరల తీరు...: ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్లో 7.01 శాతంగా ఉంటే అది నవంబర్ నెలకు 4.67 శాతానికి క్షీణించింది. సీపీఐలో ఆహారోత్పత్తుల వాటా 40 శాతం. కూరగాయల ధరలు 8 శాతం మేర తగ్గాయి. ఇక వంట నూనెల ధరలు 0.63 శాతం, చక్కెర ధరలు 0.25 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ధాన్యాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ట స్థాయిలో 12.96శాతం వద్ద ఉంటే, వంట దినుసులకు సంబంధించి 19.52 శాతం, పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.16 శాతం, పప్పులకు సంబంధించి 3.15శాతంగా నమోదైంది. చమురు, పొగాకు, మత్తు కారకాల రేట్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఎక్కువలోనే ఉన్నాయి. వస్త్రాలు, పాదరక్షల ధరలు 9.83శాతం, ఇళ్ల ధరలు 4.57శాతం పెరిగాయి. ‘డిసెంబర్లోనూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే వచ్చే ఫిబ్రవరి సమీక్షలో పాలసీ రేట్ల సమీక్షలో కీలక అంశంగా మారుతుందని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు. ఊహించని విధంగా ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివచ్చినట్టు చెప్పారు. నవంబర్ నెలకు 5.88 శాతం చర్యల ఫలితమే ఇది..: ఆహార ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా, ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత గరిష్ట పరిధి అయిన 6 శాతం లోపునకు దిగొచ్చింది. ధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ చర్యల ఫలితాలు రానున్న నెలల్లో ద్రవ్యోల్బణంపై ఇంకా ప్రతిఫలిస్తాయి. – కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ -
భారత్కు చమురు సరఫరాలో రష్యానే టాప్
న్యూఢిల్లీ: భారత్కు అత్యధికంగా ముడిచమురు సరఫరా చేసే దేశాల జాబితాలో వరుసగా రెండో నెలా నవంబర్లోనూ రష్యా అగ్రస్థానంలో నిల్చింది. ఎనర్జీ ఇంటెలిజెన్స్ సంస్థ వర్టెక్సా గణాంకాల ప్రకారం రోజుకు 9.09 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) ముడి చమురును సరఫరా చేసింది. అక్టోబర్లో ఎగుమతి చేసిన 9.35 లక్షల బీపీడితో పోలిస్తే ఇది కాస్త తక్కువే అయినా.. మిగతా దేశాల ద్వారా వచ్చిన క్రూడాయిల్తో పోలిస్తే అధికంగానే ఉంది. (గుడ్న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు) సాధారణంగా భారత్కు చమురు సరఫరా చేయడంలో ఇరాక్, సౌదీ అరేబియా అగ్రస్థానాల్లో ఉంటాయి. కానీ తాజాగా నవంబర్లో మాత్రం ఇరాక్ నుంచి 8.61 లక్షల బీపీడీ, సౌదీ అరేబియా నుండి 5.70 లక్షల బీపీడీ చమురు మాత్రమే దిగుమతయ్యింది. 4.05 లక్షల బీపీడీతో అమెరికా నాలుగో స్థానంలో ఉంది. భారత్కు రష్యా నుంచి చమురు ఎగుమతులు ఈ ఏడాది మార్చిలో కేవలం 0.2 శాతం స్థాయిలో ఉండేవి. (‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు) కానీ ప్రస్తుతం భారత చమురు సరఫరాల్లో అయిదో వంతుకు పెరిగాయి. ఉక్రెయిన్తో యుద్ధం దరిమిలా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో భారత్కు రష్యా డిస్కౌంటు రేటుకే ముడి చమురును అందిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో రష్యా క్రూడాయిల్ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. (ఎన్డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్నకు 2 సీట్లు ఆఫర్) -
ఈ కార్లకు యమ క్రేజ్.. జనాలు ఎగబడి కొనేస్తున్నారు!
ముంబై: దేశీయంగా వ్యక్తిగత రవాణా గిరాకీ పుంజుకోవడంతో నవంబర్లో వాహన విక్రయాలు దూసుకెళ్లాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదుచేశాయి. కియా ఇండియా, హోండా కార్స్, స్కోడా, ఎంజీ మోటార్స్ సంస్థలు సైతం చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మొత్తం 1,59,044 వాహనాలు విక్రయించింది. గతేడాది నవంబర్ నాటి 1,39,184 అమ్మకాలతో పోలిస్తే ఇవి 14 శాతం అధికం. డిసెంబర్తో కలుపుకొని ఈ ఏడాదిలో మొత్తం 38 లక్షల కార్ల విక్రయాలను అంచనా వేస్తున్నట్లు కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా నవంబర్ విక్రయాలు 36 శాతం పెరిగి 64,004 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో కంపెనీ 46,910 వాహనాలను అమ్మింది. టాటా మోటార్స్ మొత్తం విక్రయాలు 62,192 నుంచి 21 శాతం పెరిగి 75,478కు చేరాయి. కియా ఇండియా మొత్తం అమ్మకాలు 69 శాతం పెరిగి 24,025 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ద్విచక్ర వాహనాల గణాంకాలను పరిశీలిస్తే.., హీరో మోటోకార్ప్ అమ్మకాలు నవంబర్లో 12 శాతం పెరిగి మొత్తం 3.90 లక్షల యూనిట్లను విక్రయించిట్లు ఆ కంపెనీ తెలిపింది. బజాజ్ ఆటో విక్రయాలు 19 శాతం మేర క్షీణించాయి. -
CMIE: నవంబర్లో మూడు నెలల గరిష్టానికి నిరుద్యోగం!
ముంబై: దేశంలో నిరుద్యోగం రేటు నవంబర్లో మూడు నెలల గరిష్టం ఎనిమిది శాతానికి పైగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం– పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.96 శాతానికి చేరితే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 7.55 శాతంగా ఉంది. అక్టోబర్లో దేశంలో నిరుద్యోగం రేటు 7.77 శాతం. పట్టణ ప్రాంతాల్లో ఇది 7.21 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.04 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా సెప్టెంబర్లో నిరుద్యోగిత రేటు 6.43 శాతంగా ఉంది. నవంబర్లో 30.6 శాతంతో హర్యానా నిరుద్యోగంలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో రాజస్తాన్ (24.5 శాతం), జమ్మూ,కశ్మీర్ (23.9 శాతం) బీహార్ (17.3 శాతం), త్రిపుర (14.5)లు ఉన్నాయి. అతి తక్కువ నిరుద్యోగం రేటు విషయంలో చత్తీస్గఢ్ (0.1 శాతం), ఉత్తరాఖండ్ (1.2 శాతం), ఒడిస్సా (1.6 శాతం), కర్ణాటక (1.8 శాతం), మేఘాలయ (2.1 శాతం)లు ఉన్నాయి. -
రెండంకెల స్థాయిలో ఇంధన విక్రయాల వృద్ధి
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో కార్యకలాపాలు మరింత పుంజుకోవడం, వ్యవసాయ రంగంలో డిమాండ్ పెరగడంతో నవంబర్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి. రెండంకెల స్థాయిలో పెరిగాయి. గతేడాది నవంబర్తో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాలు 11.7 శాతం పెరిగి 2.66 మిలియన్ టన్నులకు, డీజిల్ విక్రయాలు 27.6 శాతం వృద్ధి చెంది 7.32 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. కోవిడ్ కష్టకాలమైన 2020 నవంబర్తో పోలిస్తే పెట్రోల్ అమ్మకాలు 10.7 శాతం, కోవిడ్ పూర్వం 2019 నవంబర్తో పోలిస్తే 16.2 శాతం పెరిగాయి. అటు డీజిల్ విక్రయాలు 17.4 శాతం (2020 నవంబర్తో పోలిస్తే), 9.4 శాతం (2019 నవంబర్తో పోలిస్తే) పెరిగాయి. జూన్ నుండి పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. పంటల సీజన్ కావడంతో డీజిల్కు డిమాండ్ గణనీయంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాగు నీటి పంపులు, ట్రక్కుల్లో ఇంధనాల వినియోగం ఎక్కువగా పెరిగిందని వివరించాయి. విమాన ప్రయాణాలు కూడా పుంజుకుంటూ ఉండటంతో విమాన ఇంధన (ఏటీఎఫ్) విక్రయాలు సైతం గత నవంబర్తో పోలిస్తే ఈసారి 21.5 శాతం పెరిగి 5,72,200 టన్నులకు చేరాయి. అయితే, కోవిడ్ పూర్వం నవంబర్ (2019)తో పోలిస్తే మాత్రం 13.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశీయంగా విమాన ప్రయాణాలు కోవిడ్ పూర్వ స్థాయులకు చేరినప్పటికీ కొన్ని దేశాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణాల ట్రాఫిక్ కాస్త తక్కువగానే ఉంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. ఏటీఎఫ్ ధర తగ్గింపు .. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గడంతో ప్రభుత్వ రంగ చమురు రిటైల్ కంపెనీలు ఏటీఎఫ్ రేటును గురువారం 2.3 శాతం తగ్గించాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం వరుసగా ఎనిమిదో నెలా సవరించకుండా, యథాతధంగా ఉంచాయి. తాజా తగ్గింపుతో ఏటీఎఫ్ రేటు ఢిల్లీలో కిలోలీటరుకు రూ. 2,775 తగ్గి రూ. 1,17,588కి చేరింది. గత నెల కూడా ఆయిల్ కంపెనీలు విమాన ఇంధనం రేటును 4.19 శాతం (రూ. 4,842) తగ్గించాయి. విమానయాన కంపెనీల నిర్వహణ వ్యయా ల్లో 40 శాతం వాటా ఇంధనానిదే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపులు వాటికి కొంత ఊరటనివ్వనున్నాయి. ఏటీఎఫ్ రేటును ఆయిల్ కంపెనీ లు ప్రతి నెలా 1వ తారీఖున సమీక్షిస్తాయి. పెట్రో ల్, డీజిల్ రేట్లను అవి ఏప్రిల్ 6 నుండి సవరించలేదు. విండ్ఫాల్ లాభాలపై పన్ను సగానికి తగ్గింపు డీజిల్ ఎగుమతుల లెవీపై ఊరట అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదలతో, దేశీ చమురు ఉత్పత్తి దారులకు వచ్చే భారీ లాభాలపై (విండ్ఫాల్ ట్యాక్స్) పన్నును కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించింది. అలాగే, డీజిల్ ఎగుమతులపైనా లెవీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓఎన్జీసీ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే టన్ను చమురుపై ప్రస్తుతం రూ.10,200గా ఉన్న పన్నును రూ.4,900కు తగ్గించింది. లీటర్ డీజిల్ ఎగుమతిపై లెవీని 10.5 నుంచి 8కి తగ్గించింది. ఏటీఎఫ్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు రూ.5గా కొనసాగనుంది. మొదట పెట్రోల్ ఎగుమతులైనా కేంద్రం లెవీ విధించగా, తర్వాత దాన్ని ఎత్తివేయడం గమనార్హం. ఉక్రెయిన్పై రష్యా యు ద్ధం తర్వాత అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి, సరఫరా తగ్గిపోయి, ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ఈ పరిణా మం దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలకు అనూహ్య లాభాలు వచ్చేందుకు దారితీసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విండ్ఫాల్ పన్నును ప్రవేశపెట్టడం తెలిసిందే. -
మైక్రో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది..అత్యంత చౌక ధరలో
సాక్షి, ముంబై: భారతదేశపు అత్యంత చౌక ఎలక్ట్రిక్ కార్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన మైక్రో ఎలక్ట్రిక్ వెహికిల్ పీఎంవీ ఎలక్ట్రిక్ ఈఏఎస్-ఈ కారు నవంబరు 16న విడుదల కానుంది. దీని ధర రూ. 4లక్షలు- 5 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ముంబై ఆధారిత పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ (పర్సనల్ మొబిలిటీ వెహికిల్) ఇండియాలో తన తొలి ఫ్లాగ్షిప్ స్మార్ట్ మైక్రోకార్ EaS-Eని ఆవిష్కరించనుంది. EaS-E ఎలక్ట్రిక్ కార్ స్పెసిఫికేషన్ అంచనాలు కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభించనుంది. ప్యాషనేట్ రెడ్, ఫంకీ ఎల్లో, డీప్ గ్రీన్, రూస్టిక్ చార్కోల్, స్పార్కిల్ సిల్వర్, బ్రిలియంట్ వైట్, రాయల్ లేత గోధుమరంగు, మెజెస్టిక్ బ్లూ, వింటేజ్ బ్రౌన్, పెప్పీ ఆరెంజ్, ప్యూర్ బ్లాక్ రంగుల్లో లభ్యం. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ ఫౌండర్ కల్పిత్ పటేల్ సమచారం ప్రకారం ఈ వెహికల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-200 కి.మీ పయనిస్తుంది. నాలుగు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతంది. ఇందుకోసం 3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ని ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. పీఎంవీ ఎలక్ట్రిక్ ఈఏఎస్-ఈలో డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్, సీట్ బెల్ట్స్ వంటివి ఉన్నాయి. ఇంకా మైక్రో ఎలక్ట్రిక్ కారు 550కేజీల బరువుతో పొడవు 2,915ఎంఎం, విడ్త్ 1,157ఎంఎం, హైట్ 1,600 ఎంఎంగానూ, వీల్బేస్ 2,087ఎంఎంగా, గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎంఎంగా ఉంటుందట. -
క్యాన్సర్ను గుర్తించడం ఎలా?
గుంటూరు మెడికల్: పూర్వం రాచపుండుగా పిలువబడే క్యాన్సర్ వ్యాధి వస్తే మరణమే శరణ్యం అనే పరిస్థితులు ఉండేవి. అయితే ప్రస్తుతం ఆధునిక వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందటంతో క్యాన్సర్ను పూర్తిగా నయం చేస్తున్నారు. ప్రజల్లో వ్యాధిపై అవగాహన కలి్పంచేందుకు 2014లో నాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ జాతీయ క్యాన్సర్ అవగాహన దినం ప్రకటించారు. క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియంను పోలాండ్ దేశానికి చెందిన మేడం క్యూరీ కనిపెట్టారు. క్యాన్సర్కు వ్యతిరేకంగా న్యూక్లియర్ ఎనర్జీ, రేడియోథెరపీ క్యాన్సర్ వైద్య సేవలను ఆమె వృద్ధి చేశారు. ఆమె పుట్టన రోజు నవంబర్ 7. దీంతో ప్రతి ఏడాది నవంబర్ 7న నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. క్యాన్సర్ను గుర్తించడం ఎలా? మానకుండా ఉండే పుండు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదుగుతున్న గడ్డ, ఎదుగుతున్న కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగడం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణ వ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ కారకాలు.. సిగరెట్ పొగలో 400 రకాల హానికారక రసాయనాలు ఉంటాయి. వీటి ద్వారా నోటి క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్లు వస్తాయి. గుట్కా, పాన్పరాగ్ వల్ల నోటి క్యాన్సర్, ప్రేగు సంబంధిత క్యాన్సర్లు వస్తాయి. మసాలాలు, వేపుళ్లు, నిల్వ ఉన్న పచ్చళ్లు, బేకరీ పదార్థాలు ఎక్కువగా తింటే నోటి క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్లు వస్తాయి. ఊబకాయుల్లో మూత్రాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్లు వస్తాయి. పారిశ్రామిక వ్యర్థాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగలవల్ల క్యాన్సర్ రిస్క్ 3 నుంచి 4 శాతం ఉంటుంది. క్యాన్సర్ రాకుండా.. తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిల్లో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెంట్స్ ఉంటాయి. మాంసాహారం తీసుకునేవారు తప్పనిసరిగా వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ తినాలి. దీనివల్ల మాంసాహారంలో ఉండే క్యాన్సర్ కణాలతో సలాడ్లోని యాంటీజెంట్స్ పోరాడతాయి. కొవ్వుశాతం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. భోజనంతో తాజా పండును ప్రతి రోజూ తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేయాలి. స్మోకింగ్, మద్యం, పాన్, గుట్కా లాంటి దురలవాట్లకు దూరండా ఉండాలి. జిల్లాలో బాధితులు.. నాన్కమ్యూనకబుల్ డిసీజ్ ప్రోగ్రామ్లో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా జిల్లాలో 2,54,636 మంది రొమ్ముక్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. జిల్లాలో 40 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉండగా ప్రతి రోజూ వీరి వద్ద 20 నుంచి 30 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. అందుబాటులో ఆధునిక వైద్యం క్యాన్సర్ను నయం చేసే ఆధునిక వైద్య పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. ముందస్తుగా వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నవారు (హైరిస్క్) ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. లిక్విడ్ బయాప్సీ, పెట్స్కాన్, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రి వంటి అత్యాధునిక వైద్య పద్ధతుల ద్వారా అతి తక్కువ సమయంలో, ప్రాథమిక స్థాయిలోనే పలు రకాల క్యాన్సర్లను గుర్తించి నివారించవచ్చు. డాక్టర్ ఎంజీ నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు -
మారుతీ కార్లపై అదిరిపోయే ఆఫర్స్!
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థలుపలు వాహనాలపై ఫెస్టివ్ సీజన్ ముగిసిన తరువాత కూడా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తున్నాయి. తద్వారా ఫెస్టివ్ జోష్ను కొనసాగించి, తక్కువ ధరలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో హోండా ఇప్పటికే తగ్గింపు ధరలను ప్రకటించగా, తాజాగా ఈ కోవలో మారుతి సుజుకి చేరింది. నవంబర్ నెలలో నెక్సా లైనప్లో మారుతీ సుజుకి బాలెనో, ఇగ్నిస్, వ్యాగన్-ఆర్ లాంటి పలు మోడళ్ల కార్ల కొనుగోలుపై రూ. 50వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఆల్టో కే10: పాపులర్ మోడల్ ఆల్టో కే10పై అత్యధికంగా రూ. 50వేల వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితరాలు ఉన్నాయి. మారుతీ సుజుకి సియాజ్: మిడ్సైజ్ సెడాన్ సియాజ్ అన్ని మాన్యువల్ వేరియంట్లపై రూ. 40వేల దాకా, అన్ని ఆటోమేటిక్ వేరియంట్లపై రూ. 30,000 వరకు ప్రయోజనాలతో పొందవచ్చు. ఆల్టో 800: ఆల్టో 800 పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ. 15వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 15వేలు , 4 వేల రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ ప్రకటించింది. సెలేరియో: సెలేరియో బేసిక్ మేన్యువల్ వేరియంట్, సీఎన్జీ వేరియంట్పై క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000గా ఉంది. వీ, జెడ్, జెడ్ ప్లస్ వేరియంట్లపై 25వేల దాకా తగ్గింపును అందిస్తోంది. మిగిలిన సమాచారంకోసం మారుతి సుజరుకి డీలర్ల వద్దగానీ, వెబ్సైట్లో గానీ చూడవచ్చు. -
పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: పలు మోడళ్ల హోండా కార్లపై భారీ తగ్గింపు లభిస్తోంది. హోండా సిటీ, జాజ్, WR-V లాంటి మోడల్స్ రూ. 63,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. నవంబరు నెలకు సంబంధించిన ఈ డీల్స్ కస్టమర్లు తమకు సమీపంలో ఉన్న డీలర్షిప్ను సంప్రదించడం ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దేశంలో ఐదు విభిన్న హోండా మోడల్లు అందుబాటులో ఉన్నాయి: అమేజ్, సిటీ (5వ తరం), సిటీ (4వ తరం), జాజ్ , WR-బలతో సహా ఐదు విభిన్న మోడళ్లను అందిస్తుంది. హోండా డబ్యుఆర్-వీ డబ్యుఆర్-వీ కి అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు లేదా రూ. 36,144 విలువైన ఉచిత యాక్సెసరీలున్నాయి. అలాగే రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్లు తదితరాలు ఉన్నాయి. హోండా అమేజ్ సబ్-కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ కొనుగోలుపై కస్టమర్లు రూ. 10,000 నగదు, లేదా రూ. 11,896 విలువైన ఉచిత యాక్సెసరీలను పొంద వచ్చు, అదనంగా రూ. 5,000 లాయల్టీ ఇన్సెంటివ్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు లభ్యం. హోండా జాజ్: త్వరలోనే ఉత్పత్తిని నిలిపివేయాలని భావిస్తున్న హోండా జాజ్పై 25 వేల తగ్గింపు లభ్యం. హోండా సిటీ (5వ జనరేషన్ : హోండా సిటీ మాన్యువల్పై రూ. 59,292 మొత్తం తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30వేల నగదు తగ్గింపు లేదా రూ. 32,292 విలువైన ఉచిత యాక్సెసరీలు, ఇంకా ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ తగ్గింపును కూడా అందిస్తోంది. -
Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు
సాక్షి, గుంటూరు: ఫిట్స్ వ్యాధికి వైద్యం లేదనే అపోహకు కాలం చెల్లింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 50 మిలియన్ల ప్రజలు మూర్చవ్యాధితో (ఎపిలెప్సి) బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం బాధితులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. మన దేశంలో 10 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నారు. ప్రజలకు ఫిట్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎపిలెప్సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2009 నుంచి నవంబర్ నెలను జాతీయ ఎపిలెప్సీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మూర్చ అంటే (ఫిట్స్).. మెదడులో ఉన్న న్యూరాన్లలో విద్యుత్ ఆవేశం ఎక్కువైనప్పుడు బయట కనిపించే లక్షణాలనే ఫిట్స్ లేదా మూర్చ అంటారు. ఇది వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కొట్టుకుని పడిపోతారు. ఫిట్స్ వచ్చినప్పుడు కొంత మందికి నాలుక కొరుక్కోవడం, నోటి నుంచి నురగ రావడం గమనించవచ్చు. ఫిట్స్ ఎక్కువ సమయం ఉండే మనిషి దేహం నీలంరంగుగా మారి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. కారణాలు.. మెదడులో వచ్చే ఇన్ఫెక్షన్లు, గడ్డలు, తలకు గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, మెదడులో రక్తనాళాలు ఉబ్బడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల వల్ల ఫిట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దవాళ్లలో అందరిలోనూ ఈ మూర్ఛ వ్యాధి వస్తుంది. గొంతు, చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్నారుల్లో వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ప్రసవ సమయంలో కొన్ని రకాల చికిత్స విధానాలు పాటించకపోవడం వల్ల, టీబీ, హెచ్ఐవీ, మెదడువాపు జబ్బుల వల్ల, వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ల వల్ల ఫిట్స్ కేసులు దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో బాధితులు.. గుంటూరు జీజీహెచ్లో ప్రతి శనివారం మూర్చవ్యాధి బాధితుల కోసం ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. ప్రతి వారం 150 మంది ఓపీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు , ఫిజీషియన్ల వద్ద ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్ద ఐదు నుంచి పది మంది వరకు ఫిట్స్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. -
చిన్న సినిమాలతో పోటీ పడుతున్న సమంత
-
ఖాతాదారులకు అలెర్ట్, నవంబర్లో బ్యాంకు సెలవుల జాబితా ఇదే
ఆర్బీఐ ప్రతినెల బ్యాంక్ హాలిడేస్ను ప్రకటిస్తుంది. నవంబర్ నెలలో సైతం బ్యాంక్లకు ఎన్ని రోజులు సెలవులనే అంశంపై స్పష్టత ఇచ్చింది. నవంబర్ నెలలో గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, కనకదాస్ జయంతి, వంగ్లా ఫెస్టివల్, కన్నడ రాజ్యోత్సవం, కుట్ ఫెస్టివల్, సెంగ్ కుత్సానేం వంటి పండుగలు ఉన్నాయి. ఈ పండుగల సందర్భంగా ఆయా రాష్ట్రాల్ని బట్టి బ్యాంకు హాలిడేస్ను ఇస్తుంటాయి. కాబట్టి హాలిడేస్ను ముందుగానే గుర్తించి మిగిలిన రోజుల్లో బ్యాంకుల్లో ఏదైనా పనులు ఉంటే చక్కబెట్టుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఆర్బీఐ ప్రకటించిన బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి. నవంబర్ 1 : కన్నడ రాజ్యోత్సవ (కర్నాటక) నవంబర్ 6 : ఆదివారం నవంబర్ 8 : గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, రహాస్ పూర్ణిమ నవంబర్ 11 : కనకదాస్ జయంతి,వంగలా ఫెస్టివల్ నవంబర్ 12 : రెండో శనివారం నవంబర్ 13 : ఆదివారం నవంబర్ 20 : ఆదివారం నవంబర్ 23 : సెంగ్ కుత్సానేం బెంగళూరు, షిల్లాంగ్లలో బ్యాంకులు మూసివేయబడతాయి . నవంబర్ 26 : నాలుగో శనివారం నవంబర్ 27 : ఆదివారం -
స్పైస్జెట్ దీపావళి కానుక: వారికి నెలకు రూ.7 లక్షల జీతం
సాక్షి, ముంబై: విమానయాన సంస్థ స్పైస్జెట్ తన పైలట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. నవంబరు 1 నుంచి వర్తించేలా జీతాలపెంపును ప్రకటించింది. తద్వారా స్పైస్జెట్ వారికిదీపావళి కానుక అందించింది. స్పైస్జెట్ కెప్టెన్లకు 80 గంటల విమాన ప్రయాణానికి నెలవారీ వేతనం 7 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈపెంపు నవంబర్ 1, 2022 నుండి వర్తిస్తుందని తెలిపింది. ట్రైనర్స్, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ల వేతనాలను కూడా తగిన విధంగా పెంచినట్లు స్పైస్జెట్ పేర్కొంది. నెలవారీ ప్రాతిపదికన పైలట్ వేతనాలను సవరించినట్టు తెలిపింది. అక్టోబర్లో కెప్టెన్లు , ఫస్ట్ ఆఫీసర్ల జీతం 22 శాతం పెంచింది. ఆగస్టుతో పోలిస్తే, సెప్టెంబర్ జీతంలో శిక్షకులకు 10 శాతం, కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్ల వేతనం 8 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. -
ఫారిన్ టూర్లో మహేశ్.. తివిక్రమ్ సినిమా షూటింగ్ అప్పుడేనా?
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దాదాపు పన్నెండేళ్ల అనంతరం హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ముగిసింది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ నెల 9న ఆరంభం కావాల్సిన ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ వాయిదా పడింది. అనుకోకుండా మహేశ్బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందడంతో ఈ సినిమా షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాగా నవంబరు మొదటివారంలో ఈ సినిమా రెండో షెడ్యూల్ను ఆరంభించాలనుకుంటున్నారట. గత వారం ఓ యాడ్ షూట్లో పాల్గొన్న మహేశ్బాబు ప్రస్తుతం ఫారిన్ టూర్లో ఉన్నారు. మహేశ్ తిరిగి హైదరాబాద్కు రాగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ షెడ్యూల్లో మహేశ్, పూజాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. -
కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్ట్యాక్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్లో టోల్ ట్యాక్స్ త్వరలోనే ముగియనుంది. కేంద్రం సూచనలతో టోల్ ట్యాక్స్ రద్దుకు కంటోన్మెంట్ బోర్డు తీర్మానం చేసింది. టోల్ట్యాక్స్ రద్దుతో కంటోన్మెంట్ బోర్డు రూ.10 కోట్ల వార్షిక బడ్జెట్ను కోల్పోనుంది. అదే సమయంలో కంటోన్మెంట్ గుండా ప్రయాణం సాగించే కమర్షియల్ వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. అయితే టోల్ట్యాక్స్ రద్దుతో తాము కోల్పోయే ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గంలో భర్తీ చేయాల్సిందిగా బోర్డు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. పెండింగ్ సర్వీసు చార్జీల విడుదల, గ్రాంట్ ఇన్ ఎయిడ్లకు తోడుగా టోల్ట్యాక్స్ నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరనున్నారు. బోర్డు అధ్యక్షుడు, బ్రిగేడియర్ సోమశంకర్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశంలో సీఈఓ అజిత్ రెడ్డి, సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణలతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ బాలన్ నాయర్లు పాల్గొన్నారు. ఆదాయ మార్గాలపై ఆసక్తికర చర్చ.. ఇప్పటికే ఆర్థిక లేమితో సతమతం అవుతున్న బోర్డు టోల్ట్యాక్స్ను సైతం రద్దు చేస్తే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బోర్డు సభ్యుడు రామకృష్ణ ప్రతిపాదించారు. ఆరేళ్ల క్రితమే ఆక్ట్రాయ్ను రద్దు చేయగా, సంబంధిత పరిహారాన్ని జీఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గతంలోనే టోల్ట్యాక్స్ను రద్దుచేయడంతో సంబంధిత రాష్ట్రాలే నష్టపరిహారాన్ని చెల్లించాయని గుర్తు చేశారు. ఈ మేరకు ఏయే రాష్ట్రాలు కంటోన్మెంట్లకు నష్టపరిహారాన్ని ఇస్తున్నాయో వెల్లడించాలని ఎమ్మెల్యే సాయన్న కోరగా, అధ్యక్షుడు స్పష్టమైన సమాచారం తమ వద్ద లేదన్నారు. ఆర్మీ సర్వీసు చార్జీలను సక్రమంగా చెల్లిస్తే బోర్డు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సాయన్న ప్రతిపాదించారు. నష్టపరిహారం చెల్లిస్తేనే టోల్ట్యాక్స్ రద్దు చేస్తామంటూ నెల రోజుల క్రితం బోర్డు తీర్మానం చేసి పంపినప్పటికీ, కేంద్రం మరోసారి సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని అధ్యక్షుడు సోమశంకర్ అభిప్రాయపడ్డారు. సీఈఓ అజిత్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయంతో ఏకీభవించగా, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కూడా ఆమోదం తెలిపారు. టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేతకు అంగీకారం తెలుపుతూనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరదాం అని తీర్మానించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వసూళ్లకు అక్టోబర్ 31 వరకు గడువు ఉండటంతో, అప్పటి వరకు వసూళ్లు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. టెండర్కు ఆమోదం టోల్ట్యాక్స్ వసూళ్ల నిలిపివేతకు బోర్డు తీర్మానం తీసుకున్న సమావేశంలోనే మరుసటి ఏడాది టెండర్లకు సంబంధించి, గతంలోనే జారీ చేసిన సర్క్యులర్ ఎజెండాకు బోర్డు ఆమోదం తెలపడం గమనార్హం. బోర్డు తాజా నిర్ణయంతో ఆ టెండర్ల ప్రక్రియపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వెల్లడించలేదు. -
దేశంలో తగ్గిన చమురు ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి అంతకంతకూ తగ్గుతోంది. నవంబర్లో 2 శాతం క్షీణించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడాయిల్ ఉత్పత్తి గతేడాది నవంబర్లో 2.48 మిలియన్ టన్నులుగా ఉండగా, ఈ ఏడాది నవంబర్లో 2.43 టన్నులకు పరిమితమైంది. ఈ ఏడాది అక్టోబర్లో ఇది 2.5 మిలియన్ టన్నులుగా నమోదైంది. పరికరాలు, యంత్రాలను సమకూర్చుకోవడంలో జాప్యం కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఉత్పత్తి 3 శాతం తగ్గి 1.6 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఆయిల్ ఇండియా ఉత్పత్తి 2,43,200 టన్నుల నుంచి 2,41,420 టన్నులకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్–నవంబర్ మధ్య) దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తి 2.74 శాతం క్షీణించి 19.86 మిలియన్ టన్నులుగా నమోదైంది. దేశీయంగా ఇంధన అవసరాల కోసం భారత్ ఏటా 85 శాతం మేర క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు, కోవిడ్ దెబ్బతో కుదేలైన ఎకానమీ క్రమంగా పుంజుకుంటూ ఉండటంతో ఇంధన వినియోగం పెరిగి, రిఫైనరీల్లో ప్రాసెసింగ్ సైతం గణనీయంగా మెరుగుపడింది. రిఫైనరీలు .. నవంబర్లో 21.48 మిలియన్ టన్నుల క్రూడాయిల్ (గత నవంబర్తో పోలిస్తే 3.38 శాతం అధికం) ప్రాసెస్ చేశాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో ఇది 11.7% వృద్ధి చెంది 155.73 మిలియన్ టన్నులుగానమోదైంది. | గ్యాస్ 23 శాతం అప్.. నవంబర్లో సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ఉత్పత్తి 23 శాతం పెరిగి 2.86 బిలియన్ ఘనపు మీటర్లుగా (బీసీఎం) నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ ఆధ్వర్యంలోని కేజీ–డీ6 బ్లాకులో కొత్త క్షేత్రాలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడింది. కేజీ–డీ6 నుంచి ఉత్పత్తి 1,251 శాతం ఎగిసి 581.36 బీసీఎంకి చేరగా, ఓఎన్జీసీ క్షేత్రాల్లో మాత్రం 5.28 శాతం క్షీణించి 1.72 బీసీఎంకి తగ్గింది. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో గ్యాస్ ఉత్పత్తి 21.78 శాతం పెరిగి 22.77 బీసీఎంకి చేరింది. చదవండి: Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు! -
నవంబర్లో ఊపందుకున్న రిటైల్ విక్రయాలు
న్యూఢిల్లీ: రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది నవంబర్లో మెరుగైన వృద్ధిని చూపించాయి. కరోనా ముందు నాటి సంవత్సరం 2019 నవంబర్ నెలలోని గణంకాలతో పోలిస్తే 9 శాతం పెరిగినట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. ఒకవేళ 2020 నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే వృద్ధి 16 శాతంగా ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ భారతంలో 11 శాతంగా ఉంటే, తూర్పు, దక్షిణాదిన 9 శాతం చొప్పున, ఉత్తరాదిన 6 శాతం మేర అమ్మకాల్లో వృద్ధి నమోదైనట్టు వివరించింది. వ్యాపార వాతావరణం మెరుగైందని.. ఇది నిలదొక్కుకుంటుందని భావిస్తున్నట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ పేర్కొన్నారు. అయితే ఒమిక్రాన్, కరోనా మూడో దశకు సంబంధించి ఆందోళనలు అయితే ఉన్నాయన్నారు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలు నవంబర్లో 32 శాతం వృద్ధిని చూపించినట్టు రాయ్ తెలిపింది. క్రీడా ఉత్పత్తులు 18 శాతం అధిక అమ్మకాలను నమోదు చేసినట్టు పేర్కొంది. అలాగే, ఆహారం, గ్రోసరీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల విభాగంలోనూ వృద్ధి నమోదు కాగా.. పాదరక్షలు, సౌందర్య, విలాస ఉత్పత్తులు, ఫర్నిచర్ విభాగాలు కోలుకుంట్నుట్టు వివరించింది. -
ఈ ఏడాది రెట్టింపైన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: భారత్ నవంబర్ ఎగుమతి–దిగుమతుల తాజా గణాంకాలు వెలువడ్డాయి. 2020 ఇదే నెలతో పోల్చితే ఎగుమతులు 27.16 శాతం పెరిగి 30.04 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతుల విలువ ఇదే నెల్లో 56.58 శాతం పెరిగి 52.94 బిలయన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి రెండింటిమధ్య వాణిజ్యలోటు 22.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది నవంబర్ వాణిజ్యలోటు 10.19 బిలియన్ డాలర్లతో పోల్చితే ఇది రెట్టింపు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ తాజా ప్రకటనలో ముఖ్యాంశాలు.. ఎగుమతుల తీరిది... - నవంబర్లో పెట్రోలియం ప్రొడక్టులు, ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. - వార్షిక ప్రాతిపదికన పెట్రోలియం ప్రొడక్ట్స్ 154.22 శాతం పెరిగి 3.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు 37 శాతం పెరిగి 8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతులు 30 శాతం పెరిగి 1.12 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్గానిక్– ఆర్గానిక్యేతర రసాయన ఎగుమతుల విలువ 32.54 శాతం పెరిగి 2.24 బిలియన్ డాలర్లకు చేరాయి. - సేవల ఎగుమతులు 16.88 శాతం పెరిగి 20.33 బిలియన్ డాలర్లకు చేరాయి. వస్తువులు, సేవలు కలిపితే ఎగుమతుల విలువ 22.80 శాతం ఎగసి 50.36 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతుల వరుస... - దిగుమతుల విషయానికి వస్తే.. పసిడి విలువ 40 శాతం పెరిగి 4.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. - బొగ్గు,కోక్, బ్రికెట్లు 135.81 శాతం పెరిగి 3.57 బిలియన్ డాలర్లకు చేరాయి. - పెట్రోలియం, క్రూడ్, సంబంధిత ఉత్పత్తుల దిగుమతులు 132.43 శాతం పెరిగి 14.67 బిలియన్ డాలర్లకు ఎగశాయి. - వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతులు 78.82 శాతం పెరిగి 1.75 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఆర్థిక సంవత్సరంలో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఎగుమతులు 51.34 శాతం పెరిగి 263.57 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతులు ఇదే కాలంలో 74.84 శాతం పెరిగి 384.34 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 120.76 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 45.66 బిలియన్ డాలర్లు. 2022 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను దేశం సాధించగలదన్న విశ్వాసాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికైన ఆసీస్ స్టార్ ఓపెనర్
దుబాయ్: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నవంబరు నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. నవంబర్ నెలలో జరిగిన టీ20 ప్రపంచకప్-2021లో అద్భుత ప్రదర్శనకు గాను అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించినట్లు ఐసీసీ పేర్కొంది. వార్నర్.. పాకిస్థాన్ ఓపెనర్ ఆబిద్ అలీ, న్యూజిలాండ్ సీమర్ టిమ్ సౌథీలను వెనక్కినెట్టి ఈ అవార్డును కైవసం చేసుకున్నట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది. కాగా, వార్నర్ పొట్టి ప్రపంచకప్-2021లో రెండు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో ఆసీస్ తొలిసారి పొట్టి ప్రపంచకప్ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ మెగా టోర్నీలో అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మరోవైపు, నవంబర్ నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు వెస్టిండీస్ ఆల్రౌండర్ హేలీ మ్యాథ్యూస్ ఎంపికైంది. గత నెలలో జరిగిన వన్డేల్లో మాథ్యూస్ ఆల్రౌండ్ ప్రదర్శన(4 మ్యాచ్ల్లో 141 పరుగులు, 9 వికెట్లు)తో అదరగొట్టడంతో ఆమెను ఈ అవార్డు వరించింది. మాథ్యూస్.. ఈ అవార్డుకు ఎంపికయ్యే క్రమంలో పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆనం అమిన్, బంగ్లాదేశ్కు చెందిన నహీదా అక్తర్లను వెనక్కి నెట్టింది. చదవండి: మూడు రోజుల క్వారంటైన్లో టీమిండియా.. డుమ్మా కొట్టిన కోహ్లి..! -
మరీఘోరంగా టూ వీలర్స్ అమ్మకాలు
November 2021 Record Lowest wholesales In automobile industry Due To Chip Shortage: ఆటోమొబైల్ రంగంలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి ఇప్పుడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత ఒక నెలలో ద్విచక్ర వాహనాలు రికార్డు స్థాయిలో తక్కువగా అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు దాదాపు ఏడేళ్ల తర్వాత ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లోనూ ఇదే ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. 2021 నవంబర్ నెల ఆటోమొబైల్ రంగానికి అచ్చి రాలేదు. ఓవైపు పండుగ సీజన్ కొనసాగినా.. ఊహించినంత వాహన అమ్మకాలు లేకపోవడం విశేషం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చురర్స్ (SIAM) నివేదికల ప్రకారం నవంబర్ నెలలో.. ప్యాసింజర్ వెహికిల్ అమ్మకాల మొత్తం 18.6 శాతం పడిపోయింది. అదే విధంగా టూ వీలర్స్ ఏకంగా 34 శాతం తగ్గింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ డౌన్ఫాల్ దారుణంగా నమోదు అయ్యింది. ►ప్యాసింజర్ వెహికిల్స్ ఈ నవంబర్లో 2, 15, 626 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 2, 64, 898గా ఉంది. ఇక ఉత్పత్తి కూడా 9.5 శాతం పడిపోయింది (2,94,596 యూనిట్ల నుంచి 2,66,552కి). ►టూ వీలర్స్ ఈ నవంబర్లో 10, 50, 616 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. కిందటి ఏడాది నవంబర్లో ఈ సంఖ్య 16 లక్షల యూనిట్లకు పైనే ఉంది. ఇక ఉత్పత్తి కూడా 29 శాతం పడిపోయి.. పదకొండేళ్ల తర్వాత పతనం నమోదు చేసుకుంది. 19, 36, 793 యూనిట్లకు గానూ 13, 67, 701 యూనిట్లను ఉత్పత్తి పడిపోయింది. ►ఇక త్రీ వీలర్స్ విషయానికొస్తే.. ఈ నవంబర్లో 6.64 శాతం క్షీణత కనిపిస్తోంది. 22, 471 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 24, 071 యూనిట్లుగా ఉంది. ఉత్పత్తి మాత్రం 6 శాతం పడిపోయింది. 65, 460 యూనిట్ల నుంచి 61, 451 యూనిట్లకు పడిపోయింది. పెరిగిన ఎగుమతి.. అమ్మకాల సంగతి ఎలా ఉన్నా.. ఎగుమతుల విషయంలో మాత్రం కంపెనీలు అస్సలు తగ్గట్లేదు. మొత్తంగా ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే.. ప్యాసింజర్ వెహికిల్స్లో 15.5 శాతం పెరుగుదల (44, 265 యూనిట్లు), టూ వీలర్స్లో 9 శాతం (3, 56, 659 యూనిట్లు), త్రీ వీలర్స్లో 14 శాతం (42, 431 యూనిట్లు) ఎగుమతి శాతం పెరిగింది. కారణం.. సెమీ కండక్టర్ల కొరత. కరోనా సమయంలో చిప్ ఉత్పత్తి ఫ్యాక్టరీలు మూతపడి.. ఈ ప్రభావం ఏడాది తర్వాత కూడా వెంటాడుతోంది. చిప్ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతింటోంది. మన దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అయితే నవంబర్లో అదీ పండుగ సీజన్లో ఈ రేంజ్ ప్రతికూల ప్రభావం చూడడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి అని సియామ్(SIAM) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్తున్నారు. ముఖ్యంగా త్రీ వీలర్స్ అమ్మకాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్తున్నారాయన. చదవండి: గూగుల్, యాపిల్ను తలదన్నే రేంజ్ ప్లాన్.. 17 బిలియన్ డాలర్లతో చిప్ ఫ్యాక్టరీ -
ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులు.. నవంబర్లో రూ.11,615 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నెలవారీ పెట్టుబడులు నవంబర్లో రూ.11,615 కోట్లకు పెరిగాయి. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. మార్కెట్లు అస్థిరతల్లో ఉన్నప్పటికీ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి కొనసాగడం పెట్టుబడులు బలంగా ఉండేందుకు దోహదం చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూ.5,215 కోట్లు, సెప్టెంబర్లో రూ.8,677 కోట్లు, ఆగస్ట్లో రూ.8,666 కోట్ల చొప్పున నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది జూలై తర్వాత అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వచ్చింది నవంబర్లోనే కావడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.25,002 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద అన్ని రకాల పథకాల్లోకి కలిపి నవంబర్లో రూ.46,165 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్లో ఈ మొత్తం రూ.38,275 కోట్లుగా ఉంది. నవంబర్ చివరికి ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.38.45 లక్షల కోట్లకు చేరుకుంది. హైబ్రిడ్ పథకాలు ఆదరణ - ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లోకి రూ.2,660 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. - ఈక్విటీ హబ్రిడ్ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.9,422 కోట్లుగా ఉన్నాయి. - సిప్ ఖాతాలు 4.78 కోట్లకు పెరిగాయి. నెలవారీగా సిప్ రూపంలో వచ్చే పెట్టుబడులు 11,005 కోట్లుకు చేరాయి. - డెట్ పథకాల్లోకి నికరంగా రూ.14,893 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. - గోల్డ్ ఈటీఎఫ్ పథకాలు రూ.682 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. -
ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు
David Warner Nominated For ICC Player Of The Month Award: 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డుకు గాను నవంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాక్ ఆటగాడు ఆబిద్ అలీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ నిలిచారు. పురుషుల విభాగంలో ఈ ముగ్గురు క్రికెటర్లు నామినీస్ కాగా.. మహిళల కేటగిరీలో పాక్ స్పిన్నర్ ఆనమ్ అమిన్, బంగ్లా బౌలర్ నహీదా అక్తర్, విండీస్ ఆల్రౌండర్ హలే మథ్యూస్ ఉన్నారు. వార్నర్.. నవంబర్లో జరిగిన టీ20 ప్రపంచకప్లో నాలుగు మ్యాచ్ల్లో 69.66 సగటుతో 209 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలువగా.. అదే టోర్నీలో సౌథీ 7 వికెట్లతో రాణించి తన జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. డబ్ల్యూటీసీలో భాగంగా భారత్తో జరిగిన తొలి టెస్ట్లో సైతం సౌథీ 8 వికెట్లు సత్తా చాటాడు. ఈ అవార్డు రేసులో ఉన్న పాక్ ఓపెనర్ ఆబిద్ అలీ బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో 133, 91 పరుగులతో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, నవంబర్ నెలలో టీమిండియా ఆటగాళ్లు తక్కువ మ్యాచ్లు ఆడటం.. అందులో పెద్దగా రాణించకపోవడంతో ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. కాగా, ఐసీసీ.. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెలా ఈ అవార్డును అందజేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: వాళ్లిద్దరినీ త్వరగా ఔట్ చేస్తే.. భారత్దే విజయం! -
నవంబర్లో ఎక్కువగా అమ్ముడైన టాప్-10 కార్లు ఇవే!
Here Are the Top 10 Best-Selling Cars From November: భారతదేశంలో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఇండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. నవంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడవుతున్న పది కార్ల జాబితాలో ఏడు స్థానాలను మారుతి సుజుకి ఇండియా ఆక్రమించింది. ఇండో-జపనీస్ కార్ల తయారీ కంపెనీ నవంబర్ నెలలో మొత్తంగా 9 శాతం అమ్మకాలు పడిపోయినప్పటికీ, జాబితాలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మిగిలిన మూడు హ్యుందాయ్, కియా, టాటా మోటార్స్ కు చెందిన ఒక్కొక్క మోడల్ ఉన్నాయి. నవంబర్లో భారతదేశంలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మారుతి వ్యాగన్ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి సుజుకికి చెందిన వ్యాగన్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. మారుతి నవంబర్ 2021లో 16,853 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది. ఇది నవంబర్ 2020లో విక్రయించిన 16,256 యూనిట్ల కంటే కొంచెం ఎక్కువ. 2. మారుతి స్విఫ్ట్ ఈ జాబితాలో మారుతి సుజుకికి వచ్చిన మారుతి స్విఫ్ట్ రెండవ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో తక్కువ రేటింగ్ పొందినప్పటికి అమ్మకాల పరంగా దూసుకెళ్లింది. మారుతి సుజుకి 2021 నవంబర్ నెలలో స్విఫ్ట్ 14,568 యూనిట్లను విక్రయించింది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మారుతి 2020 నవంబర్ నెలలో 18,498 యూనిట్ల స్విఫ్ట్ కార్లను విక్రయించింది. 3. మారుతి ఆల్టో ఈ జాబితాలో మూడవ స్థానంలో కూడా మారుతి సుజుకికి చెందిన మారుతి ఆల్టో నిలిచింది. ఇది అక్టోబర్ నెలలో అగ్ర స్థానాన్ని కలిగి ఉంది, కానీ ఈసారి దీనిని వ్యాగన్ఆర్ ఓడించింది. మారుతి సుజుకి 2021 నవంబర్ నెలలో 13,812 యూనిట్ల ఆల్టో కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 15,321 యూనిట్ల కంటే తక్కువ. 4. మారుతి విటారా బ్రెజ్జా విటారా బ్రెజ్జా, భారతీయ మార్కెట్లలోకి ప్రవేశించిన మొట్టమొదటి సబ్-కాంపాక్ట్ ఎస్యువీ కారు. మారుతీ గత నవంబర్ నెలలో 10,760 యూనిట్ల బ్రెజ్జాను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో విక్రయించగలిగిన 7.838 యూనిట్ల కంటే చాలా ఎక్కువ. మారుతి రాబోయే రోజుల్లో బ్రెజ్జా యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ను కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. అయితే, కార్మేకర్ ఇంకా నిర్దిష్ట లాంచ్ టైమ్లైన్ను వెల్లడించలేదు. 5. హ్యుందాయ్ క్రెటా ఈ జాబితాలో కనిపించిన మొదటి నాన్-మారుతి కారు హ్యుందాయ్ క్రెటా మాత్రమే. గత కొంత కాలంగా చిప్ సంక్షోభం ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నప్పటికీ హ్యుందాయ్ నవంబర్లో 10,300 యూనిట్ల క్రెటా కాంపాక్ట్ ఎస్యువీని విక్రయించింది. గతేడాది నవంబర్లో హ్యుందాయ్ క్రెటా 12,017 యూనిట్లను విక్రయించింది. 6. మారుతి బాలెనో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో 6వ స్థానంలో మారుతి బాలెనో నిలిచింది. మారుతి నవంబర్ 2020లో 17,872 యూనిట్లతో పోలిస్తే నవంబర్ 2021లో 9,931 యూనిట్ల బాలెనో కార్లను విక్రయించింది. ఈ కారు కూడా లాటిన్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో తక్కువ రేటింగ్ పొందింది. 7. టాటా నెక్సన్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో నిలిచిన ఏకైక కారు టాటా మోటార్స్ నెక్సాన్ మాత్రమే. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్ యువి300 కార్ల నుంచి భారీ పోటీని ఎదుర్కొన్నప్పటికీ ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచింది. 2021 నవంబరులో టాటా 9,831 యూనిట్ల నెక్సన్ కార్లను విక్రయించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో 10,096 యూనిట్లతో పోలిస్తే ఇది తక్కువ. 8. మారుతి ఈఈసీఓ ఈ జాబితాలో కనిపించిన ఏకైక వ్యాన్ మారుతి ఈఈసీఓ. మారుతి నవంబరులో 9,571 యూనిట్ల ఈకో కార్లను విక్రయించింది, ఇది సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఈఈసీఓ నాన్ కార్గో వేరియెంట్ల ధరలను మారుతి రూ.8,000 పెంచింది. ధరల పెంపు నవంబర్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. 9. మారుతి ఎర్టిగా మారుతి ఎర్టిగా నవంబరులో ఏడు సీట్ల ఎంపివి విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో ఇది 9వ స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి నవంబరులో 8,752 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది, అక్టోబర్ నెలలో విక్రయించిన యూనిట్ల కంటే గణనీయమైన తగ్గుదలను నమోదు చేసింది. 10. కియా సెల్టోస్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల టాప్-10 జాబితాలో ఇది 10వ స్థానంలో కియా సెల్టోస్ నిలిచింది. 2020 నవంబరులో విక్రయించిన 9,205 యూనిట్లతో పోలిస్తే కియా నవంబర్ 2021లో 8,659 యూనిట్ల సెల్టోస్ ఎస్యూవీని విక్రయించింది. -
ధనాధన్ ‘నవంబర్’!
భారత్ ఆర్థిక వ్యవస్థ నవంబర్లో మంచి ఫలితాలను నమోదుచేసినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను వసూళ్లు, ఎగుమతులు, తయారీ రంగం ఇలా ప్రతి కీలక విభాగమూ వృద్ధిలో దూసుకుపోయింది. ఆయా రంగాలను పరిశీలిస్తే.. జీఎస్టీ ఆదాయం రూ.1,31,526 కోట్లు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్లో రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. ఎక్సైజ్ సుంకం, సేవల పన్ను, వ్యాట్ వంటి పలు రకాల పరోక్ష పన్నులను ఒకటిగా మార్చుతూ 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత, జీఎస్టీ ద్వారా ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో వసూలయిన రూ.1,39,708 కోట్లు ఇప్పటి వరకూ భారీ వసూలుగా రికార్డయ్యింది. కాగా, 2020 నవంబర్ నెలతో (1.05 లక్షల కోట్లు) పోల్చితే తాజా సమీక్షా నెల వసూళ్లలో 25 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక 2019 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 27 శాతం ఎగశాయి. వ్యాపార క్రియాశీలత మెరుగుపడ్డం, ఎకానమీ రికవరీ పటిష్టత వంటి అంశాలు తాజా సమీక్షా నెల్లో మంచి ఫలితాలకు కారణం. ఇక జీఎస్టీ వసూళ్లు లక్షకోట్లు పైబడ్డం కూడా ఇది వరుసగా ఐదవనెల. పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని, జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. అంకెల్లో చూస్తే... ► నవంబర్లో మొత్తం స్థూల వసూళ్లు రూ.1,31,526 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.23,978 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.31,127 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.66,815 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.32,165 కోట్లు సహా) ► సెస్ రూ.9,606 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలు చేసిన రూ.653 కోట్లుసహా) ఇదిలాఉండగా, ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల జీఎస్టీ వసూళ్ల అంకెల్లో సవరణ జరిగింది. ఎగుమతులు 26 % అప్ భారత్ ఎగుమతులు నవంబర్లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 26.49 శాతం ఎగశాయి. విలువ రూపంలో 29.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, రసాయనాలు, మెరైన్ ఉత్పత్తుల వంటి పలు విభాగాలు పురోగతిలో నిలిచాయి. 2020 నవంబర్లో ఎగుమతుల విలువ 23.62 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 57.18 శాతం పెరిగి 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ 38.81 బిలియన్ డాలర్లు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే, వాణిజ్యలోటు రెట్టింపు కావడం గమనించాల్సిన మరో అంశం. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మొత్తం ఎగుమతుల్లో 28.19 శాతం వాటా ఉన్న ఇంజనీరింగ్ ఎగుమతులు 37% పెరిగి 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతులు 145.3% పెరిగి 3.82 బిలియన్ డాలర్ల్లకు చేరాయి. ► రత్నాభరణాల దిగుమతులు మాత్రం 11% క్షీణించి 2.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► సమీక్షా నెల్లో పసిడి దిగుమలు 8 శాతం పెరిగి 4.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 132.44 శాతం పెరిగి 14.68 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులు 135.81% పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే ఎగుమతులు విలువ 50.71 శాతం పెరిగి 174.15 బిలియన్ డాలర్ల నుంచి 262.46 బిలియన్ డాలర్లకు ఎగసింది. కరోనా ముందస్తు సమయం 2019 ఏప్రిల్–నవంబర్తో పోల్చినా ఎగుమతులు 24 శాతం పెరగడం గమనార్హం. అప్పట్లో ఈ విలువ 211.17 బిలియన్ డాలర్లు. 10 నెలల గరిష్టానికి ‘తయారీ’ భారత్ తయారీ రంగం నవంబర్లో పురోగమించింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.6కు ఎగసింది. అక్టోబర్లో ఈ సూచీ 55.9 వద్ద ఉంది. గడచిన 10 నెలల్లో ఈ స్థాయి మెరుగుదల ఇదే తొలిసారి. కాగా ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా లెక్కించడం జరుగుతుంది. దీర్ఘకాలిక సగటు 53.6కన్నా కూడా సూచీ పైన ఉండడం తాజా సమీక్షా నెల ముఖ్యాంశం. మూడు నెలల వరుస క్షీణత అనంతరం నవంబర్లో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా మెరుగుపడినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు. వరుసగా ఐదు నెలల తర్వాత నిర్వహణా పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని కూడా ఆమె తెలిపారు. -
దూసుకెళ్తున్న జీఎస్టీ వసూళ్లు!
న్యూఢిల్లీ: నవంబర్ నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. వరుసగా ఐదో నెలా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటాయి. 2021 నవంబరులో వసూలైన జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఆదాయం రూ.1,31,526 కోట్లుగా ఉంది. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ - రూ.23,978 కోట్లు, స్టేట్ జీఎస్టీ - రూ.31,127 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ - రూ.66,815 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో పన్ను ఆదాయం రావడం ఇది రెండోసారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటిసారి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.1,39,708 కోట్లు వచ్చాయి. ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా రూ.66,815 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,165 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.9,606 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.రూ.653 కోట్లతో సహా) . గత ఏడాది ఇదే నెలలో వసూలైన జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే నవంబర్ 2021లో సేకరించిన జీఎస్టీ ఆదాయం 25 శాతం పెరిగింది. 2019-20తో పోలిస్తే కంటే 27 శాతం పెరిగింది. ఈ సమ్మిళిత జీఎస్టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,273 కోట్లు, రాష్ట్రాలతో 22,655 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ. 51,251 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.53,782 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 43 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2021 నవంబర్ 3న జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం రూ.17,000 కోట్లు విడుదల చేసింది. (చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు!) -
Thanks Giving Day : ఎవరికైనా థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారా?
సాక్షి, హైదరాబాద్: మనిషిగా పుట్టింది మొదలు గిట్టే వరకు ఆ ‘నలుగురి’ సాయం లేకుండా సాగదు. ప్రస్తుతం ఒక స్థాయికి చేరుకోగలిగాము అంటే కచ్చితంగా ఎందరో తోడ్పాటు ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు,స్నేహితులు ఈ కోవలో ముందు వరుసలో నిలుస్తారు. చాలా సందర్భాల్లో చాలా క్లిష్టసమయాల్లో మన జీవితంలో చాలామంది పరోక్షంగానో ప్రత్యక్షంగా సాయపడతారు. మన కరియర్లో కీలక మలుపు తిరగడానికి దోహద పడతారు. ఫలానా వారి వల్లే నేను జీవితంలో ఇంత స్థాయికి చేరుకున్నాను అనుకుంటాం కదాం. అలాంటి వారి వద్దకు వెళ్లి ఒకసారి కలిసి, మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పందుకే ఈ థ్యాంక్స్ గివింగ్ డే. క్షణం తీరిక లేకుండా జీవితాల నుంచి కాస్త సమయం తీసుకుని అలాంటి చక్కగా ఆలింగనం చేసుకోవడం కోసమే ఈ రోజు. వారు చేసిన సేవ, సాయంగాని, ముఖ్యమైన సలహా గానీ, చేసిన మేలు, త్యాగం ఇలా ఏదైనా గుర్తు చేసుకోవడం. మన అభివృద్ధి కోసం పాటుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం. ప్రపంచవ్యాప్తంగా ఈ థ్యాంక్స్ గివింగ్ డేకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని మొట్టమొదటి సారిగా అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 1789 నవంబర్ 26న నిర్ణయించారు. అయితే తరువాత మరో అధ్యక్షుడు భారత సంతతికి చెందిన ప్రముఖుడు అబ్రహం లింకన్ ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం రోజు ఈ కృతజ్ఞతా దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు అమెరికాలో నేషనల్ హాలిడే కూడా. సాంప్రదాయం ప్రకారం స్నేహితులు, హితులందరితో చక్కటి విందు భోజనం చేయడంతోపాటు ఉత్సాహంగా అందరూ కలిసి ఈ వేడుకను జరుపుకుంటారు. భారతదేశంలో ఇది పెద్దగా ప్రాచుర్యంలో లేనప్పటికీ, అమెరికా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, జపాన్తో సహా ఇతర దేశాలలో కూడా థాంక్స్ గివింగ్ జరుపు కుంటారు. పండుగ తర్వాత మరుసటి రోజు బ్లాక్ ఫ్రైడే జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో మెగా షాపింగ్ మేలా ఉంటుంది. ఆసక్తికరంగా, కెనడాలో అక్టోబర్ రెండవ సోమవారం థ్యాంక్స్ గివింగ్ డే వేడుక ఉంటుంది. జీవితంలో తెలిసో తెలియకో, పాజిటివ్గానో, నెగిటివ్గానో ఎంతో కొంత మేలు చేసే ఉంటారు. వారిని ఏడాదికి ఒకసారైనా గుర్తు చేసుకోవడానికే ఈ కృతజ్ఞతా దినోత్సవం అన్నమాట. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సెకండ్వేవ్తో జనం అల్లాడిపోయారు. తీరని కష్టాల్లో ఉన్న అలాంటి వారిని ఆదుకునేందుకు చాలామంది ముందుకు వచ్చారు. 24 గంటలూ నిద్రాహారాలు మాని, బాధితులకు ఎనలేని సేవలందించారు. వారి త్యాగాలు, సేవలకు విలువ కట్టడం అసాధ్యం. అలాంటి వారిందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి. సో... ఇంకెందుకు ఆలస్యం...అలాంటి గొప్ప వ్యక్తులు అందరికీ థ్యాంక్స్ చెప్పేయండి! -
ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేత!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా దేశంలో నిరుపేదలకు ఉచితంగా అందించిన బియ్యం, ఇతర ఆహార ధాన్యాల పంపిణీ నవంబర్ తర్వాత నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకం కింద పేదలకు ఉచితంగా బియ్యం/గోధుమల పంపిణీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. గడువు పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆహార ధాన్యాల పంపిణీని కొనసాగించే అంశమై ఎలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఇటీవలే ప్రకటించారు. కోవిడ్–19 మహహ్మరి వ్యాప్తి, లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ఉచితంగా 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పును పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని ఈ ఏడాది నవంబర్ వరకు పొడిగించారు. ఈ పథకం ద్వారా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. ఇందుకోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పథకాన్ని మరో ఆరు నెలలపాటు కొనసాగించాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ తదితర విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదు. -
కుండపోత వర్షాలతో హైదరాబాద్ మునక.. ఏటా ఇదే సీన్.. అయినా!
సాక్షి, హైదరాబాద్: వానకాలం..చలికాలం...ఇలా సీజన్తో సంబంధం లేకుండా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏటా గ్రేటర్ సిటీ నిండా మునుగుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ 19 వరకు సరాసరిన 21.8 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణం కంటే 50 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. అల్పపీడనం, వాయుగుండం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం, ఇలా పలు కారణాలతో ప్రతి నెలా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కుండపోతగా వర్షపాతం... జీహెచ్ఎంసీ పరిధిలోని 28 మండలాల్లో అల్వాల్, కుత్భుల్లాపూర్, పటాన్చెరు మినహా..ఈ ఏడాది జూన్ నుంచి నవంబరు 19 వరకు సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో ఏకంగా 50 శాతానికంటే అధిక వర్షపాతం నమోదవడం విశేషం. విశ్వవ్యాప్తంగా వాతావరణ పరంగా చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులు, ఎల్నినో, లానినో ప్రభావాలు, గతితప్పిన రుతుపవనాలు, సముద్రంలో తరచూ ఏర్పడుతున్న అల్లకల్లోల పరిస్థితులు, అల్పపీడనాలు, వాయుగుండాలు, తీవ్ర తుపానులు కూడా సీజన్తో సంబంధం లేకుండా అకాల వర్షాలకు కారణమౌతున్నట్లు బేగంపేట్లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. వరద నీరు వెళ్లే దారేదీ... నగరంలో గంట వ్యవధిలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసినా.. నిండా మునుగుతోంది. సుమారు 300 బస్తీలు ఏటా ముంపునకు గురవుతున్నట్లు బల్దియా లెక్కలు చెబుతున్నాయి. గతంలో ముంపు సమస్యల పరిష్కారానికి ముంబై ఐఐటీ నిపుణులు, కిర్లోస్కర్ కమిటీ సూచనలు, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నిపుణులు చేసిన సూచనల అమలుపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఏటా ఇవే సీన్లు పునరావృతమౌతుండడం గ్రేటర్ పిటీ. నాలాల ఆక్రమణల పరిస్థితీ అలాగే ఉంది. -
నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!
Major Changes That Will Set In From November 1: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే మనం వెంటనే అప్రమత్తమైపోతాం. ఇంటి అద్దె బిల్లులు , చిన్న చితకా బిల్లులను ఇతర లావాదేవీలను ఒకటో తారీఖున పూర్తి చేస్తాం. అంతేందుకు ప్రభుత్వాలు కూడా ఒకటో తేదీనే పలు ముఖ్యమైన కార్యక్రమాలను చేపడుతాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు కొత్త నిబంధనలను కూడా అమలులోకి తెస్తాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెల నవంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.ఇక నవంబర్ 1 నుంచి సామాన్యులపై గ్యాస్ బండ మోత కూడా మోగనుంది. చదవండి: దివాళీ ఎఫెక్ట్ : తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే నవంబర్ 1 నుంచి మారనున్న రూల్స్..! ఎల్పీజీ డెలివరీ సిస్టమ్ వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే నెల నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ కోసం వినియోగదారులు కచ్చితంగా వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని అందించాల్సి ఉంటుంది.డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC)లో భాగంగా ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్లో ఈ మార్పు రానుంది. డిపాజిట్లు, ఉపసంహరణలపై ఛార్జీలను సవరించనున్న పలు బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నిర్దేశిత పరిమితిని మించి డిపాజిట్, డబ్బును విత్డ్రా చేయడం కోసం నవంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఛార్జీలు సేవింగ్స్ ఖాతాదారులతో పాటు వేతన ఖాతాదారులకు వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, యాక్సిస్ , సెంట్రల్ బ్యాంకులు డిపాజిట్లు, విత్డ్రా విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే టైమ్ టేబుల్ దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే పలు రైళ్ల టైమ్ టేబుల్లో మార్పులు చేయబోతోంది. నవంబరు 1 నుంచి పలు రైళ్లకు కొత్త టైమ్టేబుల్ ప్రకటించనుంది. భారతీయ రైల్వేస్ ప్రకారం... 13 వేల ప్యాసింజర్ రైళ్లు , 7 వేల గూడ్స్ రైళ్లు టైమింగ్స్లో మార్పు రానున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ ధరలు గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరల పెంపు కారణంగా..చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగితే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు రానున్నాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై కీలక వ్యాఖ్యలు చేసిన పేటీఎమ్..! -
5న కేదార్నాథ్కు ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నవంబర్ 5వ తేదీన ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయానికి వెళ్లి, పూజలు చేస్తారని ప్రధానమత్రి కార్యాలయం(పీఎంవో) గురువారం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రారంభించి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొంది. అనంతరం రూ.130 కోట్లతో నిర్మించిన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు, రూ.180 కోట్లతో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపింది. 2013లో సంభవించిన వరదల్లో ఆదిశంకరాచార్య సమాధి ధ్వంసమైందని పీఎంవో పేర్కొంది. -
పది రోజులు సెలవు తీసుకోండి, పండగ చేస్కోండి! ఆ కంపెనీ వినూత్న నిర్ణయం
ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, ప్రశాంతతే లక్ష్యంగా ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉల్లాసంగా, ఉత్సాహాంగా గడపండంటూ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇచ్చింది. అంతేకాదు ఈ సెలవులు స్పెషల్గా ప్లాన్ చేసుకునేందుకు వీలుగా రెండు నెలల ముందే హాలిడే షెడ్యూల్ సైతం ప్రకటించింది. పది రోజుల సెలవులు సోషల్కామర్స్ రంగంలో స్టార్టప్గా మొదలై యూనికార్న్ కంపెనీగా ఎదిగింది మీషో సంస్థ. ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి పని చేయడంతో అనతి కాలంలోనే ఈ సంస్థ మార్కెట్ వాల్యూ అనూహ్యంగా పెరిగింది. దీంతో తమ కంపెనీ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను యాజమాన్యం తీసుకుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని భావించింది. దీంతో కంపెనీ ఉద్యోగులందరికీ ఒకేసారి పది రోజుల పాటు సామూహికంగా సెలవులు ప్రకటించింది. ఎప్పుడంటే గత రెండు నెలలుగా కరోనా సంక్షోభ సమయంలోనూ తమ కంపెనీ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడినట్టు మీషో యాజమాన్యం ప్రకటించింది. దీనికి తోడు రాబోయే దసరా, దీపావళి సీజన్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని కూడా ముందే తెలిపింది. ఎంతో ఒత్తిడిలో సంస్థ అభివృద్ధికి పాటుపడిన ఉద్యోగులకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పీక్ సీజన్ ముగిసిన తర్వాత 2021 నవంబరు 4 నుంచి 14 వరకు సంస్థలోని ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు ఆ పది రోజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపండి అంటూ ఉద్యోగులకు సూచించింది. మీషో ప్రస్థానం విదిత్ ఆత్రేయ్ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త 2016లో మీషోను ప్రారంభించారు. చిన్న కళాకారులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేలా మీషోను వేదికగా మార్చారు. బయ్యర్లు, అమ్మకం దార్ల మధ్య మీషోను ప్లాట్ఫామ్గా చేశారు. కేవలం ఐదేళ్లలోనే ఈ మీషో స్టార్టప్ నుంచి యూనికార్న్గా ఎదిగింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో మీషో ఎల్లప్పుడు జాగ్రత్తగానే ఉంటుందనే పేరుంది. ఈ కంపెనీ అంతకు ముందు 64 ఆప్షనల్ హలిడేస్ను ఉద్యోగుల కోసం ప్రకటించింది. Meesho is going on a company-wide break from November 4-14th. Yes, you read that right. We are going to completely unplug from work — right after our busy and frenetic festive sale season, so that we are back to doing what we love — relaxed and rejuvenated. (1/2)#Meesho pic.twitter.com/CGusDZZyfw — Life@Meesho (@meeshoapp) August 30, 2021 చదవండి : ఫిట్గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..! -
అప్పు చేయలేదు
సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బకు కుదేలైన రాష్ట్ర రాబడులు నెమ్మదిగా యథాతథ స్థితికి వస్తున్నాయి. కొత్త అప్పు చేయకుండానే రాష్ట్రం నవంబర్ మాసాన్ని నెట్టుకురాగలిగింది. ఇది ఊరటనిచ్చే అంశం. కరోనా మహమ్మారి మిగిల్చిన ఆర్థిక కష్టాలతో... 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచీ అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇప్పుడది మారిందని నవంబర్ నెల రాష్ట్ర ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. చదవండి: (1,950కోట్లు ఇవ్వండి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ మాసంలో రూపాయి కూడా అప్పు చేయలేదు. పైగా 398.63 కోట్ల రూపాయల అప్పును కూడా తీర్చింది. అటు రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరులు గత మూడు మాసాలుగా నిలకడగా వస్తుండటం, ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 3,784 కోట్లు రావడంతో నవంబర్లో అప్పు పద్దుకు వెళ్లాల్సిన అవసరం రాలేదని ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. నిలకడగా ఆదాయం... ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే మొదలైన కరోనా కష్టాల నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్టేనని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ మాసంలో కూడా పన్నుల రాబడి కింద రూ. 6,374 కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరాయి. గత ఐదునెలలుగా రూ.6 వేల కోట్లు దాటుతున్న పన్ను ఆదాయం నవంబర్లో కూడా అదే స్థాయిలో రావడం గమనార్హం. ఇందులో జీఎస్టీ కింద నవంబర్ నెలలో రూ.2,360 కోట్లు సమకూరాయి. దీంతో వార్షిక బడ్జెట్ అంచనాల్లో జీఎస్టీ రాబడులు నవంబర్ నాటికి రూ. 15,247 కోట్లకు చేరాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం నామమాత్రంగానే వచ్చిందని నవంబర్ కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఎక్సైజ్ డ్యూటీల రూపంలో రూ.1,000 కోట్లు, అమ్మకపు పన్ను రూపంలో రూ.2,027 కోట్లు ఆదాయం వచ్చింది. ముఖ్యంగా ఈసారి కేంద్ర పన్నుల్లో వాటా పెద్దగా రాలేదు కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 3,784 కోట్లు వచ్చాయి. మొత్తం మీద రెవెన్యూ రాబడులు ఈ ఏడాది రూ.1.43 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేయగా, నవంబర్ నాటికి రూ.56,948 కోట్లు వచ్చింది. మొత్తం అంచనాలో ఇది 39.82 శాతం మాత్రమే. ఇక, మొత్తం రాబడుల అంచనా రూ.1.76 లక్షల కోట్లు కాగా నవంబర్ నాటికి రూ.84,702 కోట్లు (47.74 శాతం) వచ్చింది. ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో మొత్తం రెవెన్యూ రాబడులు 70–75 శాతం మించే అవకాశం లేదని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. చదవండి: (అలర్ట్: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్ వద్దు) ఖర్చు కూడా పెరిగింది నవంబర్ మాసంలో ఆదాయంతో పాటు ఖర్చు కూడా పెరిగిందని కాగ్ గణాంకాలు చెపుతున్నాయి. రెవెన్యూ పద్దు కింద ఈ ఏడాదిలో నవంబర్ నెలలో అతి తక్కువగా రూ. 2,045 కోట్లు మాత్రమే ఖర్చు కాగా, ఈ ఏడాదిలోనే అత్యధికంగా నవంబరులో ఉద్యోగుల వేతనాల కింద రూ. 2,558 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదే విధంగా పింఛన్ల కోసం కూడా ఈ ఏడాదిలోనే అత్యధికంగా నవంబరులో రూ. 1,213 కోట్లు ఖర్చయ్యాయని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. సబ్సిడీల కింద కూడా రూ. 1,400 కోట్ల వ్యయం జరిగింది. మొత్తం మీద నవంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.78,003 కోట్లు ఖర్చు పెట్టిందని కాగ్ వెల్లడించింది. -
నవంబర్ 26 సార్వత్రిక సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు
సాక్షి, ముంబై: కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు నవంబర్ 26న జరగనున్న ఒక రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ సమ్మెలో తామూ పాల్గొంటామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించింది. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు నిర్ణయించామని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన లోక్సభ సెషన్లో 'ఈజీ ఆఫ్ బిజినెస్' పేరిట మూడు కొత్త కార్మిక చట్టాలను ఆమోదించిందని, ప్రస్తుత 27 చట్టాలను తుంగలో తొక్కి పూర్తిగా కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ కొత్త చట్టాలను తీసుకొస్తోందని ఏఐబీఈఏ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. తద్వారా 75 శాతం మంది కార్మికులను చట్టపరిధిలోంచి తప్పించి వారికి రక్షణ లేకుండా కేంద్రం చేస్తోందని ఆరోపించింది. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల జాతీయ కార్మిక సదస్సు పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ మినహా పది కేంద్ర కార్మిక సంఘాలు నవంబర్ 26 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
నవంబర్లో ‘స్టార్స్’ హుషార్
స్టార్స్ ఉంటే ఆకాశం నిండుగా ఉంటుంది. స్టార్స్ ఉంటే సినిమాలు సందడిగా ఉంటాయి. కోవిడ్ వల్ల సినిమాల చిత్రీకరణలు అటూఇటూ అయ్యాయి. స్టార్స్ సినిమాలంటే భారీ కాన్వాస్తో కూడుకున్నవి. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగుతున్నారు. ఈ నవంబర్లో చాలా మంది స్టార్స్ మళ్లీ సెట్స్లోకి అడుగుపెడుతున్నారు. కొందరు కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మరికొందరు మధ్యలో ఉన్నవాటిని ముగించనున్నారు. ఆ విశేషాలు. వేసవిలో మెగామాస్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 9న మళ్లీ ఆరంభం కానుంది. ‘నెలరోజుల పాటు సాగే షెడ్యూల్తో చాలా శాతం చిత్రీకరణ పూర్తి చేయనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్లో మెగామాస్ చూస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఎంట్రీ షురూ బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. అయితే నవంబర్ 16 నుంచి బాలకృష్ణ లొకేషన్ ఎంట్రీ షురూ అయిందని తెలిసింది. క్రాక్ టు ఖిలాడీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నుంచి పక్కా పోకిరిగా మారబోతున్నారు రవితేజ. ఆయన ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నారు. అందులో రవితేజ పోలీస్గా కనిపిస్తారు. ఇది పూర్తి కాగానే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా ప్రారంభించనున్నారు. ఇందులో ఆయన ఖిలాడీగా కనిపిస్తారు. నవంబర్ చివరి వారంలో చిత్రీకరణలో పాల్గొంటారట రవితేజ. అడవిలోకి పుష్ప అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రీకరణ కోసం నవంబర్ 6 నుంచి 10 మధ్యలో రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవులకు ప్రయాణం కానుంది యూనిట్. 30 రోజుల పాటు దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరపనున్నారు. ముంబైలో ఫైటర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్లో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోంది. ఇందులో కిక్ బాక్సర్గా విజయ్ దేవరకొండ కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ మూడు లేదా నాలుగో వారం నుంచి ముంబైలో ఆరంభం కానుంది. శ్రీదేవి సోడా సెంటర్ సుధీర్బాబు హీరోగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే కొత్త చిత్రం ఇటీవలే ప్రకటించారు. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకుడు. గోదావరి పరిసర ప్రాంతాల్లో నవంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి, వేసవికి సినిమాలను థియేటర్స్లోకి తీసుకురావడానికి చిత్రబృందాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఏడాది మిస్సయిన జోష్ని వచ్చే ఏడాది రెండింతలు ఇవ్వడానికి ఇండస్ట్రీ రెడీ అవుతోంది. ఫుల్ స్పీడ్ స్టార్స్ అందరిలో ముందుగా షూటింగ్లో పాల్గొన్న హీరో నాగార్జున. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ను పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. అలాగే పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’, ఎన్టీఆర్, రామ్చరణ్ల ‘ఆర్ఆర్ఆర్’, నాగచైతన్య ‘లవ్స్టోరీ’, శర్వానంద్ ‘శ్రీకారం’, నాగశౌర్య కొత్త చిత్రం, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ సినిమాలు ఫుల్ స్పీడ్లో షూటింగ్స్ జరుగుతున్నాయి. -
నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్
బీజింగ్: చైనా తయారు చేస్తోన్న కోవిడ్ వ్యాక్సిన్ నవంబర్ నాటికల్లా ప్రజలకు అందుబాటులోకి రానుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. చైనాలో మానవప్రయోగ తుది దశలో ఉన్న నాలుగు కోవిడ్ వ్యాక్సిన్లలో మూడింటిని ఇప్పటికే అత్యవసర కార్యక్రమం కింద, అత్యవసర సిబ్బందికి ఉపయోగించారు. ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ సజావుగా సాగుతోందనీ, ఈ వ్యాక్సిన్ నవంబర్, లేదా డిసెంబర్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సీడీసీ చీఫ్, బయోసేఫ్టీ ఎక్స్పర్ట్ గ్విన్జెన్ వూ వెల్లడించారు. ఏప్రిల్లో స్వయంగా తానే వ్యాక్సిన్ తీసుకున్న తరువాత, తనకు ఎటువంటి అసాధారణ లక్షణాలు కనిపించలేదని గ్విన్జెన్ వూ తెలిపారు. అయితే ఆమె ఏ వ్యాక్సిన్ తీసుకున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. చైనా ఔషధ దిగ్గజ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్(సినోఫార్మ్), సినోవా బయోటెక్ అత్యవసర కార్యక్రమం కింద మూడు వ్యాక్సిన్లను అభివృద్ధిచేస్తున్నాయి. కాన్సినో బయోలాజిక్స్ డెవలప్ చేసిన నాల్గో వ్యాక్సిన్ని చైనా సైన్యానికి ఉపయోగించేందుకు జూన్లో అనుమతి లభించింది. మూడవ దశ ట్రయల్స్ ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికి ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో వస్తుందని సినోఫార్మ్ జూలైలో వెల్లడించింది. -
నవంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి
సాక్షి, పెద్దపల్లి: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) నిర్మాణం చివరి దశ పనులు త్వరగా పూర్తి చేస్తామని, నవంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవ్య అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఆర్ఎఫ్సీఎల్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డితో కలసి శనివారం సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.6,120.5 కోట్లతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు 99 శాతం పూర్తయ్యాయన్నారు. కరోనా కారణంగా ప్లాంట్ పనులు మూడు నెలలు ఆలస్యం అయ్యాయని చెప్పారు. ప్లాంట్లో ఏటా 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని, అందులో 6.25 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణకే కేటాయిస్తామని తెలిపారు. కర్మాగారం పూర్తయ్యాక ఎరువుల కొరత సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు దాదాపు 4 కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తారని, 2.5 కోట్ల యూరియా దిగుమతి చేసుకుంటామని వివరించారు. దేశవ్యాప్తంగా ఐదు ఎరువుల కర్మాగారాలు నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులు వినియోగించే ఎరువుల బస్తాపై కేంద్ర ప్రభుత్వం రూ.600 నుంచి రూ.700 సబ్సిడీ అందిస్తుందన్నారు. ఈ కర్మాగారం ద్వారా స్థానికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి ధర్మాపిల్, కలెక్టర్ భారతి హోళికేరి, ఆర్ఎఫ్సీఎల్ ఈడీ రాజన్ థాపర్ పాల్గొన్నారు. తమాషా చూస్తున్నారా? పోలీసులపై కిషన్రెడ్డి ఆగ్రహం రాష్ట్రంలో ఎక్కడ ప్రతిపక్షాలు ధర్నాలు చేసినా ముందే హౌస్ అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీ నాయకుల విషయంలో పక్షపాతంగా వ్యవహరించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ గేటు ఎదుట టీఆర్ఎస్ నాయకులు గంటసేపు ధర్నా చేసినా పట్టించుకోకుండా తమాషా చూస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న క్రమంలో జనాల వద్దకు మంత్రులు వెళ్లొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. తాము వాహనాలను దిగివచ్చి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో మాట్లాడామన్నారు. అక్క డ పెద్దసంఖ్యలో గుమికూడిన ప్రజలను నియంత్రించడంలో పోలీసులు విఫలమ య్యారని విమర్శించారు. రాజకీయం కావా లా? ఫ్యాక్టరీ కావాలా? తెలంగాణ రైతులకు ఉపయోగపడే యూరియా కావాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నెలాఖరుకు ప్లాంట్లో ట్రయల్రన్ నిర్వహిస్తామని, నవంబర్లో ప్రధాని మోదీ చేతులు మీదుగా ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్లో ‘లోకల్ ఫైట్’ కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా రామగుండం ఎరువుల కర్మాగారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీని సందర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు మాండవ్య, కిషన్రెడ్డిని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఆర్ఎఫ్సీఎల్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించడంతో కేంద్ర మంత్రులు వాహనాలు దిగి వారి వద్దకు వెళ్లారు. ఈ సమయంలో మంత్రులకు, ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే చందర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆర్ఎఫ్సీఎల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న వీర్నపల్లి గ్రామాన్ని తరలించాలంటూ టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఇదే క్రమంలో అక్కడకు చేరుకొన్న బీజేపీ నాయకులు కూడా ప్రతిగా నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఒకదశలో అసహనానికి గురైన కేంద్రమంత్రులు వెనక్కివెళ్లి వాహనాల్లో కూర్చున్నారు. ఈ సమయంలో ఎంపీ వెంకటేశ్ వారివద్దకు వెళ్లి కేంద్రమంత్రులతో మాట్లాడారు. తర్వాత మంత్రులు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లారు. ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కొత్త పురపాలికల్లో నవంబర్ వరకు ఎల్ఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కొత్త మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం గడువును పెంచామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకునేలా త్వరలో ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ మేళాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునేలా విస్తృతంగా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఐదారేళ్లలో సింహభాగం జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉండే అవకాశముందని, దీనికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని వివరించారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తెలంగాణ తెచ్చిందని, ఈ చట్టంలోని విధులు అధికారాలు కచ్చితంగా పాటించేలా అధికారులు పని చేయాలని సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలపై మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, స్థానిక ఎమ్మెల్యేలతో కలసి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలుగా ఏర్పడిన నారాయణపేట, గద్వాల్ జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, శ్మశానాల వంటి ప్రాథమిక అంశాలపై శ్రద్ధ వహించాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టేందుకు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. టాయిలెట్లు, ఫుట్పాత్ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని సూచించారు. కేటీఆర్ సూచనల మేరకు తమ జిల్లాల పరిధిలోని పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపడతామని మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, చైర్మెన్లు పాల్గొన్నారు. -
మరింత దిగజారిన టోకు ధరల సూచీ
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ(డబ్ల్యుపీఐ) ద్రవ్యోల్బణం నవంబరు మాసానికి 0.58 శాతంగా నమోదైంది. ప్రధానంగా ఆహార ధరలు కొండెక్కడంతో అక్టోబర్లో 0.16గా ఉన్న టోకు ధరల సూచీ మరింత దిగజారింది. కూరగాయల ద్రవ్యోల్బణం 45.32గా వుంది. గత నెలలో ఇది 38.91గా ఉంది. ఈ గణాంకాలు వెలువడిన వెంటనే కీలక సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో 100పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ వెంటనే ఫ్లాట్గా మారింది. ప్రస్తుతం 54 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతోంది. అటు ఆరంభంలో 8 పైసలు ఎగిసిన రూపాయి కూడా నష్టాల్లోకి మారింది. -
నవంబర్లో పెరిగిన మారుతీ సుజుకీ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. నవంబర్లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,41,834 యూనిట్లుగా నమోదైనట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతక్రితం ఏడాది నవంబర్లోని 1,35,946 యూనిట్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి 4.33 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి గతనెల్లో 1,39,084 యూనిట్లు కాగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలోని 1,34,149 యూనిట్లతో పోల్చితే 3.67 శాతం వృద్ధి ఉందని కంపెనీ వివరించింది. అక్టోబర్ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించి 1,19,337 యూనిట్లకే పరిమితం చేసిన సంస్థ.. గతనెల్లో పెంపును ప్రకటించింది. -
బెర్లిన్ గోడను కూల్చింది ఈ రోజే..
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ప్రజలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్లకుండా, రాకుండా నిర్మించిన 96 మైళ్ల బెర్లిన్ గోడ్ను కూల్చేందుకు పూనుకున్నది నేడే. అంటే 1989, నవంబర్ 9వ తేదీ నాడు. ఆ గోడను కూలగొట్టడానికి మూడు రోజులు పట్టింది. అది కూలిన మరుక్షణం నుంచే తూర్పు జర్మనీ ప్రజలు తండోపతండాలుగా దాదాపు 30 లక్షల మంది పశ్చిమ జర్మనీ వెళ్లారు. మరో మూడు రోజుల్లోనే వారిలో ఎక్కువ మంది వెనక్కి తిరిగి వచ్చారు. తూర్పు జర్మనీలో కమ్యూనిస్టు ప్రభుత్వం, పశ్చిమ జర్మనీలో మితవాద ప్రభుత్వం ఉండడంతో ఇరు దేశాల మధ్య అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొని ఉండేవి. ఆర్థికంగా వెనకబడిన తూర్పు జర్మనీలో కమ్యూనిస్టు పాలకులు కఠిన చట్టాలను అమలు చేస్తుండడంతో అక్కడి ప్రజలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందిన పశ్చిమ జర్మనీకి వలసలు పోయేవారు. రానురాను ఈ వలసలు మరీ ఎక్కువవడంతో జర్మనీ డెమోక్రటిక్ రిపబ్లిక్గా పిలిచే తూర్పు జర్మనీ ప్రభుత్వం రెండు దేశాల సరిహద్దులో గోడను కట్టాల్సిందిగా తన సైనికులను ఆదేశించింది. దాంతో వారు 1961, ఆగస్టు 13న గోడ నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య 200 రోడ్లను బ్లాక్ చేశారు. బారికేట్లు, తీగలతో మొదలైన 96 మైళ్ల ఈ గోడ ఆ తర్వాత కాంక్రీటు రూపం సంతరించుకుంది. రానురాను తూర్పు జర్మనీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. 1989 నాటికి పశ్చిమ జర్మనీతో పోలిస్తే దేశీయ దిగుబడి 40 శాతానికి పడిపోయింది. అదే ఏడాది అక్టోబర్లో అప్పటి రష్యా అధ్యక్షుడు మిహాయిల్ గోర్బచ్చేవ్, తూర్పు జర్మనీలో పర్యటించగా, ‘గోర్బీ హెల్ప్ అస్, గోర్బీ హెల్ప్ అస్’ జీడీర్ ప్రజలు నినాదాలు చేశారు. ఆ మరుసటి నెలలోనే ప్రజలు బెర్లిన్ గోడను కూల్చేందుకు స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. ప్రజాగ్రహాన్ని గమనించిన జీడీఆర్ ప్రభుత్వం దేశ పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. -
తదుపరి సీజేఐ జస్టిస్ బాబ్డే
న్యూఢిల్లీ: కీలకమైన పలు కేసులను విచారిస్తున్న జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే(63) సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ బాబ్డే నవంబర్ 18వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు అంటే 17 నెలల పాటు జస్టిస్ బాబ్డే పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టులో సీనియారిటీ ప్రకారం జస్టిస్ బాబ్డే రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీకాలం నవంబర్ 17వ తేదీతో ముగియనుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో 1956 ఏప్రిల్ 24న బాబ్డే జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే. నాగపూర్ యూనివర్సిటీ నుంచే బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1978లో బాబ్డే మహారాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా చేరారు. బాంబే హైకోర్టులో 21 ఏళ్లు పనిచేశారు. 1998లో ఆయన్ను సీనియర్ న్యాయవాదిగా నియమించారు. 2000లో బోంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా, 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కీలక తీర్పుల్లో జస్టిస్ బాబ్డే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత పౌరుడి ప్రాథమికహక్కు అంటూ 2017లో చారిత్రక తీర్పునిచ్చిన తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఒకరు. జస్టిస్ బాబ్డే సహా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం గోప్యత హక్కుకు రాజ్యాంగం రక్షణ కల్పించిందని వ్యాఖ్యానించింది. దేశ పౌరులెవరూ కూడా ఆధార్ కార్డు లేని కారణంగా కనీస సదుపాయాలను గానీ, ప్రభుత్వ సేవలకూ గానీ దూరం కారాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాలుష్యాన్ని వెదజల్లుతోన్న టపాసులను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాలన్న వాదనను ఈ ఏడాది మార్చిలో జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం కేసును విచారిస్తోన్న ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు. యావద్దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ కేసుపై సుప్రీంకోర్టు నవంబర్ 15న తుదితీర్పును వెలువరించనుంది. ఆ తరువాత రెండు రోజులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. -
ఏడాది కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి,ముంబై: నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. బుధవారం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2.33 శాతంగా నమోదైంది. అక్టోబర్ నెలలో ఇది 3.31 శాతంగా ఉంది. వరుసగా గత నాలుగు నెలలుగా దిగి వస్తున్న రీటైల్ ద్రవ్యోల్బణం తాజాగా దీంతో 2017 జులై నాటి స్థాయిని నమోదు చేసింది. మరోవైపు పారిశ్రామికవృద్ధి రేటు రెండింతలైంది. ఇది ఆర్థికవ్యవస్థకు డబుల్ బొనాంజా అని విశ్లేషకులు పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్ నెలలో 8.1 శాతం పెరిగింది.ఇది ఏడాది గరిష్టం. సిఎస్ఓ డేటా ప్రకారం కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 2.61 శాతంతో పోలిస్తే.. తాజాగా 0.86 శాతంగా ఉంది. గత నెలలో 7.39 శాతంతో పోలిస్తే ఇంధనం ద్రవ్యోల్బణం 8.55 శాతంగా నమోదైంది. దుస్తులు, పాదరక్షల ద్రవ్యోల్బణం అక్టోబరు 3.55 శాతంతో పోలిస్తే 3.53 శాతం వద్ద ఉంది. హౌసింగ్ ద్రవ్యోల్బణం నవంబరు 5.99గా నమోదుకాగా అంతకుముందు నెలలో ఇది 6.55 శాతంగా ఉంది. -
నెలాఖరులో వరుస బ్యాంకు సెలవులు
సాక్షి, ముంబై: నవంబరు నెలాఖరులో బ్యాంకులు నాలుగు రోజులు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారంలో వీలైనంత త్వరగా ముఖ్యమైన బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నవంబరులో దీపావళి, ఈద్ (నేడు) రెండే పండుగ సెలవులు. అసోసియేషన కార్యదర్శి వికె శెంగర్ అందించిన సమాచారం ప్రకారం ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా ఈ రోజు బ్యాంకులు కొన్ని రాష్ట్రాల్లో పని చేయలేదు. నవంబరు 21 (ఈద్)న అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లో బ్యాంకులకు సెలవు లేదు. అలాగే గురునానక్ జయంతిని పురస్కరించుకొని నవంబరు 23న కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. అయితే తెలుగు రాష్ట్రాలు, బిహార్, డామన్ అండ్ డయ్యు, గోవా, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, పాండిచ్చేరి, సిక్కిం, తమిళనాడు, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి. 24, నవంబర్ - నాలుగో శనివారం పంజాబ్లో మాత్రమే సెలవు 25, నవంబర్ - ఆదివారం 26, నవంబర్ - కనకదాస్ జయంతి సందర్భంగా కర్ణాటకలో మాత్రమే సెలవు. అయితే సెలవు రోజుల్లో ఏటీఎంలలో నగదుకు ఎలాంటి కొరత ఉండదని బ్యాంకులు స్పష్టం చేశాయి. -
నవంబర్లో శాసనసభ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ ఏడాది నవంబర్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబర్లోనే ఎన్నికలు జరిపేలా ఓటర్ల జాబితా షెడ్యూల్ను సవరించింది. సాధారణ షెడ్యూల్ కంటే మూడు నెలల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2019 సాధారణ ఎన్నికల కోసం గతంలో ప్రకటించిన షెడ్యూల్లో ఈ మేరకు మార్పులు చేసింది. అక్టోబరు 8న ఓటర్ల తుది జాబితాను ఖరారు చేయనుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్కుమార్ ఈ మేరకు శనివారం కొత్త షెడ్యూల్ జారీ చేశారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు ఉన్నవారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. ఓటరు జాబితాలో పేరుతో పాటు గుర్తింపు కార్డు కూడా ఉండాలని పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతుందని రజత్కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ఓటరు జాబితా రూపకల్పన షెడ్యూల్ పూర్తి కాగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గరిష్టంగా 50 రోజులలోపు ఫలితాల ప్రకటనతో పాటు మొత్తం ప్రక్రియ పూర్తి చేయనుంది. ఓటరు జాబితా తాజా షెడ్యూల్ ప్రకారం చూస్తే డిసెంబర్ మొదటి వారంలోపే ఎన్నికల ఫలితాలు సైతం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల జాబితా షెడ్యూల్లో మార్పులు చేసిన నేపథ్యంలో ఓటర్ల నమోదు విషయంలోనూ ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెస్టెంబర్ 15, 16 తేదీల్లో గ్రామసభలు, స్థానిక సంస్థలో ఓటరు నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. 2018 జనవరి 1 ఆధారం... కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్వహిస్తుంది. జనవరి 1వ తేదీ ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తుంది. ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా షెడ్యూల్ ప్రక్రియలో మార్పులు జరిగాయి. పాత షెడ్యూల్ ప్రకారం 2019 జనవరి 1ని క్వాలిఫైయింగ్ తేదీగా నిర్ధారించగా, తాజా మార్పుల నేపథ్యంలో 2018 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించనున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. తాజా మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. -
నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!!
-
పెళ్లి పిలుపులు!
స్నేహితులను, బంధు మిత్రులను పెళ్లికి పిలుస్తున్నారట దీపికా పదుకోన్. బాలీవుడ్ హీరో రణ్వీర్సింగ్తో ఆమె వివాహం ఈ ఏడాది నవంబర్లో ఇటలీలో జరగనుందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 12–14 తేదీల మధ్యలో దీపికా–రణ్వీర్ల వివాహం ఫిక్స్ అయ్యిందని బీటౌన్ టాక్. ఆల్రెడీ వీరిద్దరూ సన్నిహితులకు పెళ్లి ఆహ్వానాలను కూడా పంపుతున్నారట. ఇటలీలో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్కి చాలా తక్కువ మందిని పిలిచి, ఆ నెక్ట్స్ ముంబైలో గ్రాండ్గా అందరికీ రిసెప్షన్ అరేంజ్ చేయాలని భావిస్తున్నారట దీపికా అండ్ రణ్వీర్. ప్రస్తుతం తెలుగు ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’ సినిమాతో బిజీగా ఉన్నారు రణ్వీర్. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఈ వివాహం జరుగుతుందట. ‘పద్మావతి’ చిత్రం విడుదలై ఆర్నెళ్లు అయినా దీపికా పదుకోన్ నెక్ట్స్ ప్రాజెక్ట్పై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఆమె నీరజ్ గయవాన్ దర్శకత్వంలో రూపొందనున్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్కి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. ఈ సినిమా దీపికా పెళ్లి తర్వాత సెట్స్పైకి వెళ్తుందట. -
ఆ బ్యూటీ సినీ కెరీర్, జీవితం.. రెండూ సంచలనమే..
సాక్షి, చెన్నై: అగ్రనటి నయనతారపై రోజుకో సంచలన వార్త ప్రచారమవుతూ ఆమె అభిమానుల్ని టెన్షన్కు గురిచేస్తోంది. ఈ బ్యూటీ సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం రెండూ సంచలనంగానే సాగుతున్నాయి. నటిగా వద్దంటే అవకాశాలన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక వ్యక్తిగతంగా చూస్తే ప్రేమ, జాలీ అంటూ యమజోరుగా సాగిపోతోంది. దర్శకుడు విఘ్నేశ్శివతో పరిచయం నయనతార దిశను మార్చేసిందనే చెప్పాలి. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన నానూమ్ రౌడీదాన్ చిత్రం హిట్. ఆ చిత్రంతో పరిచయం అయిన ఈ జంట బంధం బలపడింది. నయనతార, విఘ్నేశ్శివల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందన్న ప్రచారమే తప్ప వారిద్దరూ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఇటీవలే నయనతార డేర్ చేసి నా కాబోయే భర్తకు ధన్యవాదాలు అంటూ బహిరంగంగా విఘ్నేశ్శివతో తన బంధాన్ని స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు చాలా విషయాలు జరిగాయన్నదే తాజా సమాచారం. నయనతారకు విఘ్నేశ్శివకు ఇటీవల కేరళలో అత్యంత రహస్యంగా వివాహ నిశ్చితార్థం జరిగిందని, ఆ వేడుకను ఎంజాయ్ చేయడానికే ఈ జంట అమెరికాకు వెళ్లినట్లు తెలిసింది. అయితే నయనతార, విఘ్నేశ్శివల వివాహ నిశ్చితార్థం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యనే జరిగిందట. మరో విషయం ఏమిటంటే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుంటున్న నయనతార త్వరలో నటనకు గుడ్బై చెప్పేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అవును ఇప్పటికే నయనతార, విఘ్నేశ్శివలకు అర్ధ పెళ్లి జరిగిపోగా నవంబర్లో ఈ ప్రేమజంట పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం. వివాహానంతరం నయనతార నటనకు టాటా, బైబై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇందులో నిజం ఎంత అన్నది తెలియాలంటే ఈ సంచలన జంట కల్యాణ ఘడియల వరకూ ఆగాల్సిందే. -
మరోసారి సత్తా చాటిన జియో
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం రిలయన్స్ జియో మరోసారి తన సత్తాను చాటుకుంది. 4జీ నెట్వర్క్ స్పీడ్లో మరోసారి టాప్లో నిలిచింది. వరుసగా 11వ సారి కూడా జోరును సాగించిన జియో నవంబర్లో నెలలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్, వొడాఫోన్లకు భారీ నిరాశను మిగిల్చింది. ఆరంభం నుంచి కస్టమర్లకు ఆఫర్లను అందించడంలో దూకుడును ప్రదర్శించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు హైస్పీడ్ డేటాను అందివ్వడంలో మళ్లీ టాప్ లో నిలిచిందనీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. ట్రాయ్ తన మై స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా సేకరించిన గణాంకాల ప్రకారం నవంబరు నెలలో దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం సంస్థలు అందించిన డేటా స్పీడ్లో జియో మొదటి స్థానంలో నిలిచింది. ట్రాయ్ డేటా నవంబరు 2017 నాటికి 25.6 ఎంబీపీఎస్ వేగంతో 4జీ సర్వీసు ప్రొవైడర్ల జాబితాలో రిలయన్స్ జియో మొదటిస్థానంలో నిలిచింది. జియోకు సన్నిహిత ప్రత్యర్థి వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్, భారతీ ఎయిర్టెల్ 9.8 ఎంబీపీఎస్, ఐడియా సెల్యూలార్ 7 ఎంబీపీఎస్ వేగాన్ని అందించాయి. అప్లోడ్ వేగంలో ఐడియాను వెనక్కినెట్టి వోడాఫోన్ నవంబరులో 6.9 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది. ఆ తరువాతి స్థానాల్లో ఐడియా(6.6 ఎంబీపీఎస్), జియో( 4.9 ఎంబీపీఎస్) నిలిచాయి. ఎయిర్టెల్ 4 ఎంబీపీఎస్ వేగాన్ని మాత్రమే నమోదు చేసింది.