private
-
డాక్టర్ చదువుకు డబ్బుల్లేక..కూలి పనులకు..
హుస్నాబాద్ రూరల్: వైద్యురాలు కావాలన్నది ఆ అడవి బిడ్డ తపన.. అందుకోసం కూలి పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్లో 447 మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలో సీటు రావడంతో ఫీజులకు డబ్బుల్లేక.. ఎప్పట్లాగే తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన లావుడ్య లక్ష్మి, రమేశ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. దంపతులు కూలిపని చేస్తూ కూతుళ్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు బీ–ఫార్మసీ చేస్తోంది. చిన్న కూతురు దేవిని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో చేరి్పంచి చదివించారు.పదో తరగతి, ఇంటర్మిడియెట్లో మంచి మార్కులు సాధించిన దేవి.. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఏడాదిగా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తూనే నీట్కు సిద్ధమైంది. నీట్లో 447 (2లక్షల 80 వేల ర్యాంకు) మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని అశించిన లావుడ్య దేవికి.. సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో సీటు వచి్చంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకు ఏటా రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో.. చేసేదిలేక దేవి కూలి పనులకు వెళ్తోంది. ఆస్తులు అమ్మి ఫీజు కడదామంటే అడవిలో పెంకుటిల్లు ఒకటే దిక్కు. దానిని కొనేవారు కూడా ఎవరూ లేరు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశయం నెరవేరుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
క్రెడిట్ కార్డ్ వసూళ్లకూ ఓ పద్ధతుంది
ప్రస్తుత కాలంలో వివిధ అవసరాల రీత్యా ఒకే వ్యక్తి సగటున నాలుగైదు క్రెడిట్ కార్డులు ఉండడం సర్వసాధారణం అయిపోయింది. ఒకటే జీతం మీద పరిమితి కలిగిన ఒక కార్డు వరకు అయితే ఇబ్బంది లేకుండా చెల్లించగలరు. కానీ అదే వ్యక్తికి నాలుగయిదు కార్డులు ఉంటే తన జీతానికి – స్థోమతకి మించి ఎన్నో రెట్లు పరిమితి కలిగిన కార్డులు ఉన్నట్టే! అయితే ఉద్యోగాలు పోవడం, వ్యాపారాలు దెబ్బ తినడం వలన క్రెడిట్ కార్డు వాడిన బకాయిలు తిరిగి చెల్లించలేని పరిస్థితులలోకి వెళ్లిపోతుంటారు చాలామంది. దాంతో ఆ బకాయిల వసూలు కోసం బ్యాంకులు చాలా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంటాయి.మరీ ముఖ్యంగా ప్రైవేట్ రికవరీ ఏజెంట్లను నియమించి వారి ద్వారా వినియోగదారులను తీవ్రంగా వేధించడం, పీడించడం, ఇంటి చుట్టుపక్కల వాళ్ల దగ్గరికి వెళ్లి పరువు తీయడం వంటివి. ఈ మధ్య అయితే మొబైల్ ఫోన్ లో ఓ యాప్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేసి మరీ తెలిసిన వారందరికీ వీడియోలు ఫోటోలు మెసేజ్లు పంపడం వంటి చట్టవ్యతిరేక పనులకి పాల్పడుతున్నారు. అయితే బ్యాంకు వారికి అలా వేధించే హక్కు లేదు. ఎటువంటి లోను బకాయి అయినప్పటికీ నోటీసుల ద్వారా, కోర్టు కేసు ద్వారా మాత్రమే రికవరీ చేయాల్సి ఉంటుంది. అంతేకానీ పైన చెప్పిన విధమైన చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. అలా చేసిన బ్యాంకు వారిపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా సివిల్ కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. సివిల్ కోర్టులో ఇంజక్షన్ సూట్ వేయడం ద్వారా ఆ బ్యాంకు వారు వినియోగదారుని వేధించడానికి వీల్లేదు అని కోర్టు నుండి రక్షణ పోందవచ్చు . వివిధ బ్యాంకులు వినియోగదారులను వేధిస్తుంటే డైనమిక్ ఇంజక్షన్ ద్వారా కూడా సివిల్ కోర్టు నుండి రక్షణ పోందవచ్చు. క్రెడిట్ కార్డు వసూళ్లకు కానీ, మరి ఏ విధమైన లోన్ రికవరీ కోసం కానీ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకూడదు అని ఆర్.బి.ఐ నిబంధనలు సైతం సూచిస్తున్నాయి. ఎవరైనా బ్యాంకు వారు మిమ్మల్ని వేధింపులకు గురిచేస్తుంటే, వెంటనే పోలీసు వారిని ఆశ్రయించటం మంచిది. కొత్త చట్టం ద్వారా ఆన్లైన్లో కూడా ఎఫ్.ఐ.ఆర్. చేయవచ్చు. అయితే అలా చేసిన మూడు రోజులలోగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ ఫిర్యాదును ధ్రువీకరించవలసి ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వొకేట్ -
విమానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై మహిళ దాడి
ముంబై: విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగపడ్డారు. ఈ ఘటన శనివారం పుణెలోని లోహెగావ్ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే.. ఓ ప్రైవేటు విమానంలో బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో ఓ మహిళ దాడికి తెడపడ్డారు. మొదట ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం ఆ మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు. ఆ మహిళను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి మాట్లాడుతూ.. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టాం. ఎయిర్లైన్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది,సహ ప్రయాణీకులు వాంగ్మూలాలను రికార్డు చేశాం’ అని చెప్పారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. -
రోడ్డు స్వరూపం మార్చేశారు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ శివార్లలోని బుద్వేల్లో దళితులకు చెందాల్సిన 26 ఎకరాల భూమి కబ్జా చేశారనే కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కొత్తగా వేస్తున్న వెంచర్ కోసం గతంలో నిర్మించిన విల్లాల్లోని ప్రైవేటు రోడ్డు పబ్లిక్ రోడ్డుగా స్వరూపం మార్చేశారు. అలాగే ఓ నాలాపై అనుమతుల్లేకుండానే వంతెన నిర్మించారు. ఈ అక్రమాలపై రామ్దేవ్గూడలోని వెస్సెల్లా మెడోస్ నివాసితులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదై దర్యాప్తు మొదలవడంతో దిగివచ్చిన శివానందరెడ్డి... తన తప్పులు సరిదిద్దుకొనేలా జీహెచ్ఎంసీకి మరో దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారం మొత్తంలో అధికారుల ఉదాశీనత, శివానందరెడ్డి లాబీయింగ్ స్పష్టంగా కనిపిస్తోందని వెస్సెల్లా మెడోస్ నివాసితులు చెబుతున్నారు. కొత్త వెంచర్కు రోడ్డు లేక... మాండ్ర శివానందరెడ్డి సీఈఓగా ఉన్న వెస్సెల్లా గ్రూప్ రామ్దేవ్గూడ ప్రధాన మార్గంలో తారామతి–బారాదరి ఎదురుగా 38 ఎకరాల్లో వెస్సల్లా మెడోస్ పేరుతో 295 త్రీ, ఫోర్, ఫైవ్ బీహెచ్కే విల్లాలు నిర్మించడానికి 2017లో జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకుంది. అప్పట్లో ఈ విల్లాస్ లోపల రెండు అంతర్గత ప్రైవేటురోడ్లు ఉండేలా రూపొందించిన ప్లాన్కే అధికారులు అనుమతి ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం వెస్సెల్లా గ్రూప్ పాత వెంచర్కు వెనుక వైపు నాలా పక్కన మరో 9 ఎకరాల్లో మరో వెంచర్ మొదలుపెట్టింది. ప్రధాన రహదారి నుంచి ఈ వెంచర్కు చేరుకోవాలంటే సమీప మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే శివానందరెడ్డి మరో కుట్రకు తెరలేపారు. వెస్సెల్లా మెడోస్లో ఉన్న రెండు ప్రైవేట్ రహదారుల్లో ఒకదాన్ని పబ్లిక్ రోడ్డుగా అక్రమంగా మార్చేశారు. ఈ మేరకు రివైజ్డ్ ప్లాన్తో 2022లో జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు ఆమోదించడంతో వెస్సెల్లా మెడోస్లోని ప్రైవేట్ రోడ్డు పబ్లిక్ రోడ్డుగా మారిపోయి వెనుక ఉన్న 9 ఎకరాల వెంచర్ను ప్రధాన రహదారికి దగ్గర చేసింది. ఈ రెండు వెంచర్ల మధ్య ఓ నాలా ఉండటంతో ఇరిగేషన్ విభాగం సహా ఎవరి అనుమతి లేకుండానే ఆయన దానిపై వంతెన నిర్మించారు. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి.. వెస్సెల్లా మెడోస్ శాంక్షన్డ్ ప్లాన్కు విరుద్ధంగా తమ ప్రైవేటు రోడ్డును పబ్లిక్ రోడ్డుగా శివానందరెడ్డి మార్చేసినట్లు నివాసితులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలిసింది. దీంతో 6 విల్లాలకు చెందిన యజమానులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఐపీసీలోని 420, 406 సెక్షన్ల కింద అదే నెల 8న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు నమోదు కాకుండా చూసేందుకు శతవిధాలా శివానందరెడ్డి ప్రయత్నించినప్పటికీ ఉన్నతాధికారుల జోక్యంతో కేసు నమోదై దర్యాప్తు ప్రారంభం కావడంతో ఆయన హైకోర్డును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేశారు. తనపై కేసు కొట్టేయాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించని న్యాయస్థానం... నిందితులకు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించి కేసు దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేక శివానందరెడ్డి వెస్సెల్లా మెడోస్కు సంబంధించి తాను సమర్పించిన రివైజ్డ్ ప్లాన్ను రద్దు చేయాలంటూ జీహెచ్ఎంసీకి మరో దరఖాస్తు సమర్పించినట్లు తెలిసింది. కాగా, జీహెచ్ఎంసీ అధికారులను మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ కేసులో శివానందరెడ్డిపై పోలీసులు అదనపు సెక్షన్లు జోడించాలని వెస్సెల్లా మెడోస్ నివాసితుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ కోరారు. -
గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే పేలిన జపాన్ తొలి ప్రైవేటు రాకెట్..!
టోక్యో: వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయల్దేరిన దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ లాంచ్ అయిన కొద్ది సెకన్లలోనే పేలిపోయింది. ఈ రాకెట్ నింగిలోకి ఎగిరితే జపాన్ చరిత్రలోనే తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి ఎగిరిన రికార్డు క్రియేట్ అయ్యేది. JUST IN: Space One rocket in Japan explodes after takeoff during its “inaugural launch.” The Kairos rocket was attempting to make Space One the first Japanese company to put a satellite in orbit. (Reuters) The 59 ft, four-stage solid-fuel rocket was launched from the Kii… pic.twitter.com/BJAAWXGsCy — Collin Rugg (@CollinRugg) March 13, 2024 ఈ రాకెట్ను స్పేస్ వన్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్ రాకెట్ ప్రభుత్వానికి చెందిన సాటిలైట్ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్ పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ రాకెట్ మార్చ్ 9వ తేదీనే లాంచ్ కావల్సి ఉండగా పలు కారణాల వల్ల లాంచింగ్ వాయిదాపడింది. రాకెట్ పేలిపోవడంతో స్పేస్ వన్ కంపెనీ షేర్లు జపాన్ స్టాక్మార్కెట్లో ఒక్కరోజే 13 శాతం పడిపోయాయి. ఇదీ చదవండి.. చైనాలో భారీ పేలుడు -
అమ్మకు మానని గాయం!
బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వం పొందడం మహిళ అదృష్టంగా భావిస్తోంది. ప్రసవం ఆమెకు పునర్జన్మతో సమానం. ఒకప్పుడు అత్యధిక ప్రసవాలు సాధారణ పద్ధతిలోనే జరిగేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పలు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి సిజేరియన్లను మార్గంగా చూడటం.. తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలని కొందరు కుటుంబీకులు ఆపరేషన్లకు సరే అనడం.. మరి కొందరు శుభఘడియలు అంటూ కడుపు కోతకు ఒత్తిడి తేవడం.. ఇలా కారణాలు ఏవైనా అమ్మ కడుపుపై మానని గాయం ఏర్పడుతోంది. సిజేరియన్లతో భవిష్యత్లో అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నా పరిస్థితి మారడం లేదు. సాక్షి, నంద్యాల: దనార్జనే లక్ష్యంగా పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణులకు ఇష్టానుసారంగా సిజేరియన్లు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణ ప్రసవాలకు అవకాశం ఇవ్వకుండా సిజేరియన్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం వంటి అత్యవసర సమయాల్లో చేయాల్సిన ఆపరేషన్లను కాసుల కోసం అమ్మకు కడుపు కోత పెడుతున్నారు. సిజేరియన్లతో ప్రసవాలు జరగడంతో చిన్న వయస్సులోనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గర్భం దాలిస్తే సిజేరియన్ తప్పనిసరి అన్నట్లు పరిస్థితి మార్చేశారు. గర్భం దాల్చిన రెండో నెల నుంచే అవసరం లేకపోయినా స్కానింగ్లు, టెస్టులు, మందులు, టానిక్ల పేరుతో రూ.వేలకు వేలు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు 79 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వీటిలో శస్త్రచికిత్సలు చేసే హాస్పిటళ్లు సుమారు 35 వరకు ఉన్నాయి. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ (సీహె చ్సీ)లు 11, డోన్, బనగానపల్లెలో ఏరియా ఆస్పత్రి, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలకు సుమారు 2 వేలకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఏ ప్రాంతంలోనైనా ప్రసవాల్లో సిజేరియన్లు గరిష్టంగా 15 శాతం మించకూడదు. కాన్పు కష్టమైన సమయాల్లో, తల్లీబిడ్డల్లో ఎవరికై నా ప్రాణహాని ఉండే సందర్భాల్లోనే సిజేరియన్ చేయాలి. రక్తహీనత, అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉన్నప్పుడే ఆపరేషన్కు మొగ్గు చూపాలి. అయితే ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ, కొందరు కుటుంబీకులు మూఢనమ్మకాలు వెరిసి సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 50 శాతానికి పైగా కడుపు కోత ఉంటున్నాయి. విస్తుగొల్పుతున్న గణాంకాలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏప్రిల్ నుంచి ఈనెల 21వ తేదీ వరకు మొత్తం 10,086 ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,034, ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,052 ప్రసవాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో దాదాపు 45 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగాయి. ఇందులోనూ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,052 ప్రసవాలు జరిగితే వీటిలో 50 శాతం అంటే 3 వేలకు పైగా ప్రసవాలు సిజేరియన్ ద్వారా చేయడం విస్తుపోయే వాస్తవం. గర్భం దాల్చినప్పుటి నుంచి సాధారణ ప్రసవం కావాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే సరికే ఏదో కారణంతో భయపెట్టి సిజేరియన్ చేయిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఆపరేషన్కు వేలల్లో ఖర్చు..! సాధారణ ప్రసవం జరిగితే ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 వేలకు మించి బిల్లు కాదు. అదే సిజేరియన్ అయితే పేషంట్ పరిస్థితిని బట్టి, ఆస్పత్రిని బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు. సిజేరియన్కు కనిష్టంగా రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ. 80 వేల వరకు కూడా బిల్లులు వేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని ఐదు ప్రముఖ ఆస్పత్రుల్లో, ఆళ్లగడ్డలోని రెండు ఆస్పత్రుల్లో సిజేరియన్లు యథేచ్ఛగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రులోని వైద్య సిబ్బంది సాధారణ ప్రసవాలు చేసేందుకు చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో అవగాహన ఉన్న పలువురు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్యాపిలి, పాములపాడు, చాగలమర్రి, అహోబిలం.. తదితర మండలాల్లో సాధారణ ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయి. ముహూర్తాలు చూసుకుని మరీ.. ఇటీవల కాలంలో ముహూర్తం, శుభ ఘడియలు చూసుకుని మరీ ప్రసవాలు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారంతా ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఫలానా రోజు, తేదీ, గంటలు, నిమిషాలను కూడా పాటిస్తూ పిల్లల్ని కనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొందరైతే బిడ్డ ఎన్ని సెకండ్లకు బయటకు రావాలో కూడా నిర్ణయించేస్తున్నారు. మరికొందరు గర్భిణులు పురిటి నొప్పులు భరించలేక సిజేరియన్ల వైపు వెళ్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వివరాలు నెల ప్రభుత్వ ప్రైవేటు ఏప్రిల్ 762 1,121 మే 814 1,051 జూన్ 800 1,064 జులై 798 1,057 ఆగస్ట్ 860 1,108 సెప్టెంబర్ 716 651 (21 తేదీ వరకు) పరీక్షలు చేయించుకోవాలి గర్భందాల్చినప్పటి నుంచి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ప్రతి నెల బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. సాధారణ ప్రసవమైతే రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. సిజేరియన్ అయితే కనీసం మూడు నెలల విశ్రాంతి అవసరం. జీవనశైలిలో వచ్చే మార్పుల వల్లే ఆపరేషన్లు పెరిగిపోతున్నాయి. – డాక్టర్ అనూష గింజుపల్లి, గైనకాలజిస్ట్ అవగాహన కల్పిస్తున్నాం సిజేరియన్ల శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చేస్తున్నాం. కేవలం హై రిస్క్ ఉన్న వారిని మాత్రమే సిజేరియన్లకు రెఫర్ చేస్తున్నారు. బిడ్డ పుట్టిన సమయమే శుభ ఘడియలు. ప్రత్యేక తేదీలు, ప్రముఖల జన్మదిన రోజులు అంటూ డాక్టర్లపై ఒత్తిడి చేయకూడదు. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి (చదవండి: గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి దూసుకుపోయి..) -
‘గ్రాంట్’ ముసుగు..‘కైండ్’ మిస్టరీ!
సాక్షి, అమరావతి: యువత శిక్షణ కోసం భారీగా ఆర్థిక సహాయం అందిస్తామని అప్పటిదాకా నమ్మబలికిన ప్రైవేట్ కంపెనీ ప్లేటు ఫిరాయించింది! భారీ లాభాన్ని వేసుకుని మరీ ప్రాజెక్టును దక్కించుకుని ప్రజాదనాన్ని కాజేసింది. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత జీవోలు, ఒప్పందాల్లో ఉన్న ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఆర్థిక సహకారం) అనే పదం స్థానంలో తరువాత ‘గ్రాంట్ ఇన్ కైండ్ (వస్తు సహకారం) చేరింది. చివరకు ‘గ్రాంట్ ఇన్ కైండ్’ సైతం అదృశ్యమైంది. ఈ మాయాజాలంతో చివరకు టెండర్ల ప్రక్రియ అనేదే లేకుండా పోయింది. తద్వారా డిజైన్టెక్కు ఏకపక్షంగా కట్టబెట్టేసి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బాబు గూటికి చేరవేశారు. 34.88 శాతం లాభంతో.. ఏపీ ఎస్ఎస్డీసీ ప్రాజెక్టు ముసుగులో నిధులను కొల్లగొట్టాలని ముందుగానే నిర్ణయించుకున్న మాజీ సీఎం చంద్రబాబు ఆరు క్లస్టర్లుగా అంచనా వ్యయం నివేదికను రూపొందించాలని ఆదేశించారు. వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని అధికారులు ఏడు నివేదికలు రూపొందించారు. వాటిల్లో ప్రాజెక్టు కనిష్ట వ్యయం రూ.214 కోట్లు కాగా గరిష్ట వ్యయం రూ.282 కోట్లుగా మాత్రమే ఉంది. బినామీ సంస్థ డిజైన్ టెక్ లాభం 34.88 శాతాన్ని కూడా కలిపి ఒక్కో క్లస్టర్కు రూ.55 కోట్లు చొప్పున మొత్తం ఆరు క్లస్టర్లకు రూ.330 కోట్లు అవుతుందని నివేదిక రూపొందించారు. అందులో 90 శాతం సీమెన్స్–డిజైన్ టెక్ భరిస్తాయని, మిగతా 10 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అసలు ఈ ప్రాజెక్టు గురించే సీమెన్స్ కంపెనీకి తెలియదు. ఆ కంపెనీ 90 శాతం నిధులను సమకూర్చదని చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. 34.88 శాతం అంటే భారీ లాభమే. మరి లాభం ప్రస్తావన ఉన్న ప్రాజెక్టుకు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ఎలా వస్తుందనే ప్రాథమిక అంశాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఆ కంపెనీ పేరును వాడుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం రూ.330 కోట్లు వ్యయం అవుతుంది అని రూపొందించిన నివేదిక.. కానీ ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేసి ప్రజాధనం కొల్లగొట్టారు అంచనాలు పెంచి వాటా నిధులు స్వాహా ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేస్తే అందులో ప్రభుత్వం వాటా 10 శాతం కింద వెచ్చించాల్సిన నిధులు కూడా ఆ మేరకు పెరుగుతాయి. తద్వారా ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించేలా చంద్రబాబు పథకం వేశారు. అందుకే ఆరు క్లస్టర్లకు కలిపి రూ.330 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ను ఏకంగా రూ.3,300 కోట్లకు అమాంతం అంచనాలు పెంచేసి ఖరారు చేశారు. సిమెన్స్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు ఆర్థిక శాఖ అధికారులు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అందులో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు గూటికి చేరాయి. అదే విషయం సీఐడీ దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైంది. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం నిధులను సీమెన్స్ కంపెనీ ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’గా సమకూరుస్తుందని టీడీపీ సర్కారు జీవోలో పేర్కొంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ గురించి సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియదు. ఢిల్లీలో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్ ద్వారా చంద్రబాబు ముఠా గూడుపుఠాణి నడిపించింది. జీవో జారీ చేసిన తరువాత డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి తెచ్చారు. సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది.సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. చంద్రబాబు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్టెక్కు చేరవేశారు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు! గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు! చివరికి చంద్రబాబు దోపిడీ మాత్రమే మిగిలిందని స్పష్టమైంది. టెండర్లు లేకుండా కట్టబెట్టడానికే... సుమన్ బోస్ నాటి సీఎం చంద్రబాబుతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. చంద్రబాబు మాత్రం సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు 90 శాతం నిధులను ఆర్థిక సహాయంగా సమకూరుస్తాయని ఎందుకు చెబుతూ వచ్చారన్నది కీలకంగా మారింది. ఎందుకంటే...? గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. ఓ ప్రాజెక్టులో ప్రైవేటు కంపెనీలు లాభం తీసుకుంటే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే అర్హత ఉన్న ఎన్నో కంపెనీలు పోటీ పడతాయి. ప్రాజెక్ట్ను యధాతథంగా అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే టెండర్ల ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో డిజైన్టెక్కు ఈ ప్రాజెక్టు కట్టబెట్టడానికే చంద్రబాబు ఈ పథకం వేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే ముసుగులో డిజైన్ టెక్కు కట్టబెట్టేశారు. తరువాత నిబంధనలకు విరుద్ధంగా ఆ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారు. కమీషన్లు పోనూ అందులో రూ.241 కోట్లను హైదరాబాద్లోని తన బంగ్లాకు తరలించారు. -
కేంద్ర గిరిజన వర్సిటీకి నేడు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. విభజన హామీల్లో ఒకటైన ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతంలోనే యూనివర్సిటీ గిరిజన విశ్వవిద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు. అందించే కోర్సులు ఈ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమెస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, బి.కామ్లో ఒకేషనల్ తదితర 14 కోర్సులను అందిస్తారు. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియెంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులను కూడా అందిస్తారు. గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధిని ఈ యూనివర్సిటీ ద్వారా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే విజయనగరం జిల్లా కొండకరకంలోని ఆంధ్రా యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీ తరగతుల్లో 385 మంది విద్యార్థులున్నారు. -
ప్రైవేటులో ఎంబీబీఎస్ ఫీజుల ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల ఫీజులను సవరించారు. కొన్ని కాలేజీల్లో పెరగ్గా కొన్ని కాలేజీల్లో తగ్గాయి. మరికొన్ని కాలేజీల్లో యథాతథంగా ఉన్నాయి. ఫీజుల సవరణకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇచ్చిన సిఫార్సులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అనుమతించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. 2023–26 మధ్య చేరిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు ఇదే రుసుము కొనసాగుతుందని ఆయన తెలిపారు. బీ–కేటగిరీ ఎంబీబీఎస్ ఫీజులు కొన్ని కాలేజీల్లో రూ. 50 వేలు పెరగ్గా కొన్ని కాలేజీల్లో తగ్గాయని వివరించారు. ఉదాహరణకు అపోలో మెడికల్ కాలేజీలో బీ–కేటగిరీ ఎంబీబీఎస్కు గతంలో రూ. 12.50 లక్షలున్న ఫీజును ఈ ఏడాది నుంచి రూ. 13 లక్షలకు పెంచారు. అయాన్ మెడికల్ కాలేజీలో గతంలో రూ. 14 లక్షలున్న బీ–కేటగిరీ ఫీజును ఇప్పుడు రూ. 12 లక్షలకు తగ్గించారు. సీ–కేటగిరీ ఫీజులను బీ–కేటగిరీ ఫీజుకు రెట్టింపు చేశారు. అంటే బీ–కేటిగిరీ ఫీజు రూ. 12 లక్షలున్న కాలేజీలో సీ–కేటగిరీ ఫీజు రూ. 24 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చు. మొత్తంగా సరాసరి 5 శాతం ఫీజులు పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. స్వల్పంగానే ఫీజులు పెరిగాయని.. కొన్నిచోట్ల తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మెడికల్ కాలేజీలో ఒక్కో ఫీజు... రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో 56 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,700 సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 35 శాతం సీట్లు బీ–కేటగిరీ, 15 శాతం సీ–కేటగిరీ సీట్లుంటాయి. వాటిని మేనేజ్మెంట్ కేటగిరీ సీట్లుగా పరిగణిస్తారు. మిగిలిన 50 శాతం సీట్లు ఏ–కేటగిరీ (కన్వినర్) కిందకు వస్తాయి. కాలేజీలవారీగా నిర్వహణ ఖర్చు లు మొదలు, బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, నిర్వహణ వ్యయం తదితర వివరాలతో కూడిన ఆడిట్ రిపోర్టులను పరిశీలించిన టీఏఎఫ్ఆర్సీ... వాటి ఆధారంగానే ఫీజుల సవరణకు సిఫార్సు చేసింది. అయితే ప్రైవేటు కాలేజీల్లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సీట్ల ఏ–కేటగిరీ ఫీజు రూ. 60 వేలు ఉండగా అందులో ఎలాంటి మార్పు చేయలేదు. అదనపు వసూళ్లు చేయరాదు... కాలేజీలు నిర్వహణ ఖర్చుల నిమిత్తం విద్యార్థుల నుంచి ఎటువంటి క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదని కాళోజీ వర్గాలు స్పష్టం చేశాయి. కమిటీ నిర్ణయించిన రుసుము మినహా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఇతర మొత్తాన్ని యాజమాన్యం అనధికారికంగా లేదా చట్టవిరుద్ధంగా వసూలు చేయకూడదని పేర్కొన్నాయి. ఒకవేళ విరా ళం ముసుగులో వసూలు చేసినట్లయితే దాన్ని క్యాపిటేషన్ రుసుముగా పరిగణించనున్నాయి. అయితే తదుపరి సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు కోసం కాలేజీలు బ్యాంక్ గ్యారెంటీని విద్యార్థుల నుంచి తీసుకోవచ్చని స్పష్టం చేశాయి. దీనిపై గతం నుంచే విద్యార్థులు నిరసన తెలుపుతుండగా ఈ నిబంధనను ఇంకా కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులను పెంచలేదని కాళోజీ వర్గాలు తెలిపాయి. -
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రవేశాల గడువు మంగళవారంతో ముగుస్తోంది. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరగలేదు. దీంతో మరికొంత గడువు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అడ్మిషన్లు సరిగా జరగడం లేదని జిల్లాల్లోని ఇంటర్ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా మరికొంత గడువు పొడిగించాలని ఉన్నతాధికారులను కోరారు. దీంతో క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ప్రవేశాల గడువు పెంపునకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీల్లోనే సమస్య ఉందని అధికారులు తెలిపారు. హెచ్చరికతో ప్రైవేటు కాలేజీలు అప్రమత్తం.. రాష్ట్రవ్యాప్తంగా 3,339 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. వీటిల్లో ఇప్పటి వరకు 3,27,202 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్ తీసుకున్నారు. గత ఏడాది (2022–23) కాలేజీల సంఖ్య 3,107 మాత్రమేకాగా, 4,98,699 మంది విద్యార్థులు చేరారు. దీనిని బట్టి దాదాపు 1.7 లక్షల మంది విద్యార్థులు ఇంకా చేరాల్సి ఉందని తెలుస్తోంది. వారంరోజుల క్రితం వరకూ ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నా, ప్రవేశాలను బోర్డుకు చూపించలేదు. విద్యార్థుల ప్రవేశాలు ఒకచోట, వారు చదివేది మరోచోట ఉండేలా కాలేజీలు చేస్తున్న మాయాజాలంపై ఇంటర్ బోర్డు ఉక్కుపాదం మోపడమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ‘సాక్షి’ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం స్పందించింది. అడ్మిషన్లు ముగిసే నాటికి ప్రవేశాలు చూపించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ హెచ్చరించారు. దీంతో గత వారం లక్ష వరకూ ఉన్న అడ్మిషన్ల సంఖ్య ప్రస్తుతం 2 లక్షలు దాటింది. టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత పెరిగాయి. -
ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్లోనే.. యజమాని ఈయనే..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం భారత్లోనే ఉందన్న విషయం మీకు తెలుసా? గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా ప్రాంతంలో ఉంది. బరోడా గైక్వాడ్స్ యాజమాన్యంలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ (Laxmi Vilas Palace) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం. ఇది ఇంగ్లండ్ రాజ కుటుంబీల నివాసమైన బకింగ్హామ్ ప్యాలెస్ కంటే చాలా రెట్లు పెద్దది. 500 ఎకరాల విస్తీర్ణం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ బరోడా రాజ కుటుంబానికి చెందిన నివాసం. ఈ ప్యాలెస్ 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 19వ శతాబ్దపు ఇండో-సార్సెనిక్ కాలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఇదే అతి పెద్దది. ఇంగ్లండ్లోని బకింగ్హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది. ఆకట్టుకునే కళాకృతులు గుజరాత్లోని ఈ రాజ యుగం నాటి ప్యాలెస్లో విస్తృతమైన ఇంటీరియర్ డిజైన్లు ఆకట్టుకుంటాయి. మొజాయిక్లు, షాన్డిలియర్లు, కళాకృతులు, ఆయుధాలు, కళాకృతులు ఆకర్షిస్తాయి. అప్పటి బరోడా మహారాజు ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మను ప్రత్యేకంగా నియమించి పెయింటింగ్లు వేయించారు. విశాలమైన పార్క్ లాంటి మైదానాలు ఇందులో ఉన్నాయి. ఇందులో గోల్ఫ్ కోర్స్ కూడా ఉండటం విశేషం. ఈయనే యజమాని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యజమాని హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ ( HRH Samarjitsinh Gaekwad). రంజిత్సిన్హ్ ప్రతాప్సిన్హ్ గైక్వాడ్, శుభంగినీరాజేల ఏకైక కుమారుడు. 1967 ఏప్రిల్ 25న జన్మించిన ఈయన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నారు. సమర్జిత్సిన్హ్ తన తండ్రి మరణం తర్వాత 2012లో మహారాజుగా పట్టాభిషక్తుడయ్యారు. ఈ వేడుక లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో 2012 జూన్ 22న అట్టహాసంగా జరిగింది. 2013లో తన మామ సంగ్రామ్సింగ్ గైక్వాడ్తో పాత వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకుని లక్ష్మీ విలాస్ ప్యాలెస్కు యజమాని అయ్యారు. రూ. 20,000 కోట్లకు పైగా ఆస్తి సంక్రమించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్లోని బనారస్లో 17 దేవాలయాలను నిర్వహించే దేవాలయాల ట్రస్టు సమర్జిత్సిన్హ్ ఆధీనంలో ఉంది. 2014లో బీజేపీలో చేరిన ఈయన 2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. సమర్జిత్సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. -
భార్య అర్ధ నగ్న చిత్రాలను స్నేహితులకు పంపిన భర్త
కర్ణాటక: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త, భార్యపై ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఆమె ప్రైవేట్ వీడియోలు, అర్ధనగ్న చిత్రాలను స్నేహితులకు పంపడంతో పాటు ఇంటర్నెట్లో పెట్టాడు. ఇది తెలిసి బాధితురాలు మైసూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి నగరలో నివాసం ఉంటున్న అబ్దుల్ సలీంతో 10 నెలల కిందట ఒక యువతికి పెళ్లయింది. అయితే కొద్దిరోజులకే గొడవలు పడి దూరం అయ్యారు. ఇద్దరు కలిసి ఉన్న సమయంలో అబ్దుల్ సలీం భార్య వీడియోలు, అర్ధనగ్న ఫోటోలను తీసి పెట్టుకున్నాడు. తనను కాదని వెళ్లిపోయిందన్న ఉక్రోషంతో వాటిని స్నేహితులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాధితురాలు సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు. -
సంక్షోభంలో రష్యా
మాస్కో: ఉక్రెయిన్పై ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్న రష్యా అనూహ్య పరిణామాలతో అంతర్గత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్లూ ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన ప్రైవేటు సైనిక సంస్థ వాగ్నర్ శుక్రవారం రాత్రికి రాత్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలి్చవేస్తామని వాగ్నర్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ గర్జించారు. తమ సంస్థకు చెందిన బలగాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం దాడులకు దిగుతోందని అందుకే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని ప్రధాన నగరమైన రోస్తోవ్ దాన్ తమ అధీనంలోనే ఉందని ఆయన ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగును లక్ష్యంగా చేసుకుంటూ పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తమ సంస్థపై సెర్గీ దాడులు చేయిస్తున్నారని ఆయనను విడిచిపెట్టబోమంటూ ఆగ్రహావేశాలతో వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత అంతరంగికుడైన ప్రిగోజిన్ ఈ తిరుగుబాటుకు పాల్పడడాన్ని ప్రభుత్వంలో ఎవరూ జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలతో రష్యాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రిగోజిన్ను నిలువరించడానికి తన సొంత దేశంలోనే రష్యన్ మిలటరీ దాడులకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కల్లోల పరిస్థితుల మధ్య ఏది వాస్తవమో , ఏది కాదో అన్న గందరగోళం కూడా ఏర్పడింది. ఒకానొక దశలో రష్యా అద్యక్షుడు పుతిన్ మాస్కో విడిచి పరారయ్యారన్న వార్తలు హల్చల్ చేశాయి. అయితే అందులో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రిగోజిన్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడు పుతిన్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ తిరుగుబాటుపై జాతినుద్దేశించిన ప్రసంగించిన పుతిన్ ప్రిగోజిన్ పేరు ప్రస్తావించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని, వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తిరుగుబాటు చేసిన వారందరినీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో బలగాలను, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని, ఎలా ముందుకు వెళ్లాలో ఆదేశాలిచ్చామని చెప్పారు. రష్యా ఎఫ్ఎస్బీ సెక్యూరిటీ సరీ్వస్ ప్రిగోజిన్పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. పుతిన్ తప్పు చేశారు : ప్రిగోజిన్ పుతిన్ ప్రసంగం అనంతరం ప్రిగోజిన్ మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తమను దేశద్రోహులమని పేర్కొని పుతిన్ అతి పెద్ద తప్పు చేశారన్నారు. ఉక్రెయిన్పై యుద్ధంలో పోరాటం చేసిన తామే అసలు సిసలు దేశభక్తులమని అన్నారు. తాము ప్రభుత్వానికి లొంగి పోయే స్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 25వేల మంది సైన్యంతో తిరుగుబాటు ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఉన్న వాగ్నర్ సైనికుల్ని వెనక్కి రప్పించిన ప్రిగోజిన్ రోస్తోవ్ దాన్ నగరంలోసైనిక ప్రధాన కార్యాలయం, ఇతర సైనిక స్థావరాలను తమ అ«దీనంలోకి తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. నగరంలో మిలటరీ వాహనాలు, ట్యాంకుల్ని మోహరించిన వీడియోలు కూడా విడుదల చేశారు. ఒక్క తుపాకీ తూటా పేలకుండానే తాము మిలటరీ కార్యాలయాన్ని స్వా«దీనం చేసుకున్నామని ప్రిగోజిన్ చెప్పారు. రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, మిలటరీ జనరల్ గెరాసిమోవ్ రోస్తోవ్లోని మిలటరీ కార్యాలయంలో తనతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే రాజధాని మాస్కోని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాగ్నర్ సంస్థకు చెందిన దాదాపుగా 25 వేల మంది సైనికులు మాస్కోదిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది. మాస్కోకి దక్షిణంఆ 360 కి.మీ. దూరంలోని లిపె్టక్ ప్రావిన్స్లో వాగ్నర్ బలగాలు, ఇతర ఆయుధాల్ని మోహరించినట్టుగా ప్రిగోజిన్ విడుదల చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని లిపె్టక్ ప్రావిన్స్ గవర్నర్ ఇగోర్ అర్టమోనోవ్ కూడా ధ్రువీకరించారు. వాగ్నర్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ సేనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజల భద్రతకు ఎలాంటి ప్రమాదమూ లేదని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున జనం గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు మాస్కో ప్రాంత గవర్నర్ తెలిపారు. విద్యా సంస్థలను జులై ఒకటి దాకా మూసివేసినట్లు తెలుస్తోంది. తాత్కాలిక విరమణ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో మధ్యవర్తిత్వంతో శనివారం రాత్రికల్లా ఇరువర్గాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. మాస్కో దిశగా వెళుతున్న వాగ్నర్ గ్రూపు సైనికులను ఆగిపోవాల్సిందిగా యెవ్గెనీ ప్రిగోజిన్ ఆదేశాలు ఇచ్చారు. రష్యన్ల రక్తం చిందకూడదనే ఉద్దేశంతోనే మాస్కో దిశగా ముందంజ వేయడాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్లోని తమ స్థావరాలకు మళ్లాల్సిందిగా తమ బలగాలకు ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. వాగ్నర్ గ్రూపు సైనికుల రక్షణకు పుతిన్ నుంచి హామీ లభించిందని మధ్యవర్తిత్వం వహించిన లుకశెంకో ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి బలహీనంగా రష్యా : జెలెన్స్కీ రష్యాలో అంతర్గత సంక్షోభంతో ఆ దేశం పూర్తి స్థాయిలో బలహీనపడిపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. చెడు మార్గాన్ని అనుసరించే వారందరూ తమను తామే నాశనం చేసుకుంటారన్నారు. ‘‘చాలా కాలంగా రష్యా తన బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోంది. ప్రభుత్వంలో ఉన్న వారి మూర్ఖత్వాన్ని దాచిపెడుతూ వస్తోంది. ఇక ఏదీ దాచి ఉంచలేరు. అబద్ధాలు చెప్పలేరు. రష్యా తమ సైన్యాన్ని దళాలు, కిరాయి సైన్యం ఉక్రెయిన్లో ఎంత కాలం ఉంచుతుందో అంత ఎక్కువ బాధను ఆ దేశం కూడా ఎదుర్కొంటుంది’’ అని జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
పెట్రోల్, డీజిల్పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) బంకుల కన్నా చౌకగా ప్రైవేట్ కంపెనీలు ఇంధనాలను విక్రయిస్తున్నాయి. జియో–బీపీ తర్వాత తాజాగా నయారా ఎనర్జీ ఈ జాబితాలోకి చేరింది. పీఎస్యూ బంకులతో పోలిస్తే రూ. 1 తక్కువకే తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్ను విక్రయిస్తున్నట్లు వివరించింది. మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లో డిస్కౌంటు రేట్లకు విక్రయాలను జూన్ ఆఖరు వరకు కొనసాగించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా మొత్తం 86,925 పైచిలుకు పెట్రోల్ బంకులు ఉండగా.. నయారా ఎనర్జీకి 6,376 బంకులు (7 శాతం పైగా వాటా) ఉంది. జియో–బీపీ (రిలయన్స్–బీపీ జాయింట్ వెంచర్ సంస్థ) తమ బంకుల్లో ప్రస్తుతం డీజిల్ను మాత్రమే పీఎస్యూ బంకుల కన్నా తక్కువకు విక్రయిస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినప్పటికీ పీఎస్యూలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం రేట్లను సవరించకుండా యథాప్రకారం కొనసాగిస్తున్నాయి. అయితే, జియో–బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు మాత్రం ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకే డిస్కౌంటుకు విక్రయిస్తున్నట్లు తెలిపాయి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ - ప్రజలు సమ్మతిస్తారా..?
ఆధార్ నెంబర్ల వెరిఫికేషన్ను ప్రైవేట్ సంస్థలకు అనుమతించాలన్న ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాల కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గడువుని ఇప్పుడు మరో 15 రోజుల పొడిగించింది. గతంలో ఈ గడువు 2023 మే 05 వరకు మాత్రమే ఉండేది, కాగా ఇప్పుడు ఇప్పుడు మే 20 వరకు పొడిగించారు. ఇప్పటికే ఆధార్ను ప్రామాణీకరించడానికి ప్రభుత్వేతర రాష్ట్ర సంస్థలను అనుమతించే ప్రతిపాదన కోసం ఒక ముసాయిదా విడుదలైన విషయం తెలిసిందే. దీనిపైన ప్రజల అభిప్రాయాలను తెలపాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రతిపాదిత సవరణ ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఇతర సంస్థలు కొన్ని సందర్భాల్లో ఆధార్ ప్రామాణీకరణ కోసం అనుమతిని పొందవచ్చు. ఇది వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆధార్ ప్రామాణీకరణ కోసం కోరుతున్న ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదని సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వ శాఖ ఒప్పించినట్లయితే, అటువంటి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఈ ప్రతిపాదనపై కొంత మంది నిపుణులు, న్యాయవాదులు గతంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది వినియోగదారులను మోసాలకు గురించి చేసే అవకాశం ఉందని వెల్లడించారు. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) రాష్ట్ర సంక్షేమం, నిజమైన గ్రహీతలను గుర్తించడానికి ఆధార్ నంబర్లను ఉపయోగించగలిగినప్పటికీ, ప్రైవేట్ సంస్థలు అలాంటి ధృవీకరణను నిర్వహించలేవని ఒక తీర్పులో పేర్కొంది. అయితే దీనిపైన ఇప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ప్రభుత్వ కేంద్రాలున్నా.. ప్రైవేట్కే ధాన్యం అమ్ముకోవాలా?
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వరికోతలు ప్రారంభమై ధాన్యం కేంద్రాలకు తరలుతున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు కొనుగోళ్లు చేపట్టకపోవడం, మరోవైపు అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటను కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో కొంతమంది రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు సైతం బస్తాకు రెండు నుంచి మూడు కిలోల చొప్పున అదనంగా తూకం వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాలను ప్రారంభించి, వేగంగా తూకం వేస్తే ప్రైవేటుకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉండదని రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రారంభమైనవి 20 కేంద్రాలే.. జిల్లాలో ఈసారి మొత్తం 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. కోతల సీజన్ ప్రారంభమై పదిరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కేవలం 20 కేంద్రాలను మాత్రమే అధికారులు ప్రారంభించారు. ఇవి కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అధికంగా ఉన్నాయి. మిగితా చోట్ల ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం కాలేదు. ఇప్పటికే జిల్లాలోని బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, తెలకపల్లి, నాగర్కర్నూల్ మండలాల్లో వరిపంటను కోసం పది రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. అకాల వర్షాల నేపథ్యంలో కల్లాలకు తెచ్చిన ధాన్యం నీటిపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 214 కొనుగోలు కేంద్రాలకు ప్రస్తుతం 20 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈసారి సీజన్లో మొత్తం 1.50లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం 2.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మొత్తం 1,069 మెట్రిక్ టన్నులు మాత్రమే. ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో చాలావరకు ధాన్యం ప్రైవేటుకు తరలుతోంది. దీంతో జిల్లాలో ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ చేపట్టకుండా, కొంతమేరకు కొనుగోళ్లకే అధికారులు పరిమితం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తేమ పేరుతో కొర్రీలు.. జిల్లాలో చాలాచోట్ల వరికోతలు పూర్తయ్యి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కాంటాలు మొదలు కావడం లేదు. ధాన్యం ఇప్పుడిప్పుడే కేంద్రాలకు వస్తోందని, తేమ శాతం సరిగ్గా ఉంటే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 17శాతం తేమ ఉంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం చేపట్టాలి. కానీ జిల్లాలోని చాలా కేంద్రాల్లో 16 నుంచి 14 శాతం వరకు ఉంటేనే తీసుకుంటున్నారు. అప్పటివరకు రైతులతో మళ్లీ ఆరబోయిస్తున్నారు. కొన్నికేంద్రాల్లో తేమ శాతం ఉన్నా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లర్లకే విక్రయిస్తున్నారు. ‘ఈ ఫొటోలోని రైతు పేరు సాగర్. జిల్లాలోని తాడూరు మండలం చర్లఇటిక్యాల గ్రామానికి చెందిన రైతు సాగర్ 14 రోజుల కిందట వరిపంటను కోశాడు. అయితే ఇప్పటివరకు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోళ్లను ప్రారంభించలేదు. దీంతో జిల్లాకేంద్రంలో సమీపంలోని మిల్లుకు ధాన్యాన్ని తరలించాడు. మిల్లు నిర్వాహకుడు బస్తాకు కిలోన్నర చొప్పున కట్ చేసుకున్నాడని వాపోయాడు. గ్రామంలో అధికారులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాల భయానికి ప్రైవేటు మిల్లులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.’ తేమ శాతం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తున్నాం.. జిల్లాలో ఈసారి మొత్తం 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం. జిల్లాలోని చాలాచోట్ల ఇంకా వరికోతలు పూర్తికాలేదు. ఇప్పుడిప్పుడే ధాన్యం సెంటర్లకు వస్తోంది. కేంద్రానికి వచ్చిన ధాన్యం నిర్ణీత తేమ శాతం ఉంటే వెంటనే కొనుగోలు చేస్తాం. – మోహన్బాబు, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి జిల్లాలో ఏర్పాటుచేయనున్న కొనుగోలు కేంద్రాలు - 214 ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు - ప్రారంభమైనవి - 20 -
కేంద్రం కీలక ప్రకటన.. ఆధార్ అథెంటికేషన్ ప్రైవేట్ చేతుల్లోకి
ఆధునిక కాలంలో ఆధార్ కార్డు మనిషి జీవితంలో భాగమైపోయింది. ప్రస్తుతం ఆధార్ కార్డు లేకుండా ఏ ముఖ్యమైన పని జరగదనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి పనికి ఆధార్ నంబర్ కచ్చితంగా కావాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. లోన్స్ తీసుకోవాలన్నా.. ఆధార్ కార్డే ఆధారం. భారతదేశంలో ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డుని జారీ చేస్తుంది. 2022 నవంబర్ 30 నాటికి 135 కోట్ల ఆధార్ కార్డులు జారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ అంశానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో ప్రైవేటు కంపెనీలకు కూడా ఆధార్ అథెంటికేషన్ అప్పగించాలని చూస్తోంది. ఆధార్ అథెంటికేషన్ సేవలు ప్రభుత్వ రంగ సంస్థలు, మంత్రిత్వ శాఖల పరిధిలో మాత్రమే ఉన్నాయి. అయితే వాటి పరిధిని విస్తరించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: రిటర్నులు సమర్పించడంతోనే అయిపోదు - తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు తెలుసుకోండి..) ఆధార్ను ప్రజలకు మరింత అనువైనదిగా, అనుకూలమైనదిగా మార్చడానికి మాత్రమే కాకుండా మరింత మెరుగైన సేవలు అందించడానికి కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కావున ఆధార్ అథెంటికేషన్ ప్రైవేటు చేతుల్లోకి కూడా వెళ్లనుంది. (ఇదీ చదవండి: Kumar Mangalam Birla: 28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని) ప్రభుత్వ విభాగాలు అందించే ప్రయోజనాలు, సేవలు, రాయితీల కోసం ఆధార్ అథెంటికేషన్ నిర్వహించడానికి ప్రైవేటు సంస్థలను అనుమతిచేలా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈ సేవలను పొందాలనుకునే ప్రైవేటు సంస్థలు దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి ముందుగానే అనుమతులు తీసుకోవాలి. కేంద్రం అనుమతి పొందిన తరువాత మాత్రమే ఆధార్ అథెంటికేషన్ చేసేందుకు అర్హత పొందుతుంది. -
ఇన్ఫీ నుంచి ప్రైవేట్ ‘5జీ సర్వీసులు’
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తమ క్లయింట్ల కోసం ప్రైవేట్ 5జీ–యాజ్–ఎ–సర్వీస్ను ప్రారంభించింది. దీనితో కంపెనీలకు అధిక బ్యాండ్విడ్త్, తక్కువ లేటెన్సీ, విశ్వసనీయ వైర్లెస్ కనెక్టివిటీ లభించగలదని సంస్థ తెలిపింది. డేటా ప్రాసెసింగ్కు పట్టే వ్యవధిని కుదించడం ద్వారా నెట్వర్క్లో జాప్యాన్ని తగ్గించగలిగే మల్టీ–యాక్సెస్ ఎడ్జ్ కంప్యూటింగ్ సాంకేతికతను ఇందులో వినియోగిస్తున్నట్లు ఇన్ఫీ తెలిపింది. -
భర్తకు తెలియకుండా అప్పులు..చివరికి అదే ఆమెను..
సాక్షి, తాడిపత్రి అర్బన్: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రిలోని పాతకోటలో నివాసముంటున్న షేక్ గౌస్, ఖతీజా (38) దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ కోసం భర్తకు తెలియకుండా ఖతీజా ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసింది. దీంతో పాటు సొంత పూచీకత్తుపై తన ఇంటి సమీపంలోని కొందరికి అప్పులు ఇప్పించింది. ఈ క్రమంలో అప్పులు చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తడంతో తరచూ వడ్డీ వ్యాపారులు ఇంటి వద్దకు చేరుకుని దుర్భాషలాడడం మొదలు పెట్టారు. ఈ విషయం తన భర్తకు తెలిస్తే గొడవవుతుందని భావించిన ఆమె శనివారం ఉదయం 9 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: చీప్ లిక్కర్ సిద్దయ్య! వీడిన గుట్టు.. టీడీపీకి చెంపపెట్టు!) -
కాలేజీ విద్యార్థుల మధ్య గొడవ.. కర్రలతో కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు
-
Mann Ki Baat: ‘అంతరిక్షం’లో నూతన సూర్యోదయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘విక్రమ్–ఎస్’ రాకెట్ ప్రయోగం మన దేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నూతన సూర్యోదయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంతో దేశ అంతరిక్ష రంగంలో నూతన శకం మొదలైందన్నారు. ఆదివారం 95వ ‘మన్కీ బాత్’లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జీ20కి సారథ్యం వహిస్తున్న దేశంగా ప్రపంచం ముందున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు కనిపెట్టాల్సిన బాధ్యత భారత్పై ఉందని చెప్పారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘స్పేస్’లో ప్రైవేట్ పాత్ర భేష్ స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ రంగం పాత్ర ప్రశంసనీయం. స్పేస్ సెక్టార్లో నవంబర్ 18న ‘కొత్త చరిత్రకు’ ప్రజలంతా సాక్షిభూతంగా నిలిచారు. దేశీయంగా ప్రైవేట్ రంగంలో డిజైన్ చేసి, రూపొందించిన తొలి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. ఈ రాకెట్ను తక్కువ ఖర్చుతో రూపొందించడం గొప్ప విషయం. స్పేస్ టెక్నాలజీలో భారత్ పరిమిత ఖర్చుతోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంది. విక్రమ్–ఎస్ రాకెట్లో కొన్ని కీలక భాగాలను 3డీ ప్రింటింగ్ ద్వారా తయారు చేశారు. ఈ రాకెట్ ప్రయోగం ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో నూతన సూర్యోదయం. కాగితాలతో విమానాలు తయారు చేసి, గాల్లోకి ఎగురవేసిన మన పిల్లలు ఇప్పుడు అసలైన విమానాలు తయారు చేసే అవకాశం దక్కించుకుంటున్నారు. కాగితాలపై ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలను గీసిన మనవాళ్లు ఇప్పుడు రాకెట్లు తయారు చేస్తున్నారు. విక్రమ్–ఎస్ ప్రయోగం భారత్–భూటాన్ సంబంధాలకు బలమైన నిదర్శనం. దేశమంతటా జీ20 కార్యక్రమాలు శక్తివంతమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహించనుండడం ప్రతి భారతీయుడికి గొప్ప అవకాశం. వసుధైక కుటుంబ భావనను ప్రతిబింబించేలా జీ20కి ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే థీమ్ ఇచ్చాం. జీ20కి సంబంధించిన కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా విదేశీయులు మన రాష్ట్రాలను సందర్శిస్తారు. మన విభిన్నమైన సంస్కృతి సంప్రదాయలను విదేశాలకు పరిచయం చేయొచ్చు. జీ20 కార్యక్రమాల్లో ప్రజలు.. ముఖ్యంగా యువత పాలుపంచుకోవాలి. యువత పరుగును ఆపడం కష్టం మన యువత గొప్పగా ఆలోచిస్తున్నారు, గొప్ప ఘనతలు సాధిస్తున్నారు. అంతరిక్షం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల విషయంలో సహచర యువతను కలుపుకొని ముందుకెళ్తున్నారు. స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నారు. డ్రోన్ల తయారీలోనూ భారత్ వేగంగా పరుగులు తీస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవలే యాపిల్ పండ్లను డ్రోన్ల ద్వారా రవాణా చేశారు. నూతన ఆవిష్కరణ ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుండడం సంతోషకరంమన యువత పరుగును ఆపడం ఇక కష్టం. ప్రపంచం నలు మూలలకూ మన సంగీతం సంగీత రంగంలోనూ భారత్ గణనీయ ప్రగతి సాధిస్తోంది. ఎనిమిదేళ్లలో సంగీత పరికరాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగింది. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచ నలుమూలలకూ చేరుతోంది. తమ కళలు, సంస్కృతి, సంగీతాన్ని చక్కగా పరిరక్షించుకుంటున్న నాగా ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని మోదీ సూచించారు. యూపీలోని బన్సా గ్రామంలో ‘కమ్యూనిటీ లైబ్రరీ, రిసోర్స్ సెంటర్’ను స్థాపించిన జతిన్ లలిత్ సింగ్, జార్ఖండ్లో ‘లైబ్రరీ మ్యాన్’గా గుర్తింపు పొందిన సంజయ్ కశ్యప్పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
‘విక్రమ్ ఎస్’ విజయంతో అంబరాన ప్రైవేటు సంబరం
అంతరిక్ష యానంలో మరో పెద్ద అడుగు ముందుకు పడింది. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి 550 కిలోల చిన్న రాకెట్ ‘విక్రమ్ ఎస్’ గతవారం గగనంలోకి దూసుకుపోవడం చారిత్రక ఘట్టం. దీంతో, రోదసీ రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం విషయంలో మన దేశం ఒక్క ఉదుటున ముందుకు ఉరికినట్టయింది. భారత్లో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన తొట్టతొలి రాకెట్ ఇదే. హైదరాబాద్కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సంస్థ దీన్ని రూపొందించడం మరింత ఆనందదాయకం. రానున్న కాలంలో ఈ సంస్థ మరింత పెద్ద రాకెట్లను వరుసగా ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. అంటే, అంబర వీధిలో అనేక సంవత్సరాల భారత ప్రయత్నాలు మరో పెద్ద మలుపు తిరగనున్నాయన్న మాట. దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఒకపక్క ‘ఇస్రో’ ప్రధానపాత్ర కొనసాగిస్తుంటే, మరోపక్క దానికి పూరకంగా ప్రైవేట్ రంగం నిలబడనుంది. దీని పరిణామాలు, విపరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. భారత అంతరిక్ష ప్రయోగాల మార్గదర్శి విక్రమ్ సారాభాయ్ పేరిట ‘విక్రమ్ ఎస్’ రాకెట్తో సాగించిన ఈ ‘ప్రారంభ్’ ప్రయోగం శుభారంభం. భారతీయ అంకుర సంస్థలు మరింతగా పాలు పంచుకొనేలా భారత అంతరిక్ష కార్యక్రమానికి తలుపులు తెరవాలన్న కేంద్ర ప్రభుత్వ చొరవ వల్ల ఇది సాధ్యమైంది. నిజానికి, వినువీధిలోకి అంతరిక్ష ప్రయోగ వాహన నౌకలను పంపడం మంచి గిరాకీ ఉన్న వ్యాపారం. ఇటీవలి దాకా అందులో ఆయా దేశ ప్రభుత్వాలదే ఆధిపత్యం. ఎలన్ మస్క్ తన ‘స్పేస్ ఎక్స్’ సంస్థతో దానికి గండి కొట్టింది. త్వరలోనే అమెజాన్ వారి ‘బ్లూ ఆరిజన్’ రాకెట్ మార్కెట్లోకి రానుంది. అంతరిక్షంలోని సరికొత్త వాణిజ్య అవకాశాలను అంది పుచ్చుకోవడానికి అంతర్జాతీయ సహకారం పెరుగుతుండడంతో ప్రైవేట్ రంగ వికాసానికి దారులు పడ్డాయి. ఒకప్పుడు మన విహాయస ప్రయోగాలకు అభివృద్ధి, దేశ ప్రతిష్ఠలే మూలమంత్రాలు. ఇప్పుడు బ్రాడ్బ్యాండ్కు ఉపగ్రహ వినియోగం, చంద్రమండల శోధన, గగనాంతర గవేషణ లాంటివి ముందుకొచ్చాయి. అలా వ్యాపారం, ఆర్థికవ్యవస్థ వచ్చి చేరాయి. శరవేగంగా పెరుగుతున్న ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ ప్రస్తుతం 45 వేల కోట్ల డాలర్లు. పదేళ్ళలో ఇది ఏకంగా లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందట. ఇందులో ఇప్పుడు భారత్ వాటా 2 శాతమే. రానున్న వత్సరాల్లో మన వాటాను చకచకా 8 శాతానికి పెంచాలన్నది ప్రధాని మాట. ప్రైవేట్ రంగ సంస్థలకు సైతం పెద్ద పీట వేస్తేనే ఆ వాటా పెరుగుదల సాధ్యం. ఆ క్రమంలో వచ్చినదే తాజా ‘విక్ర’మార్కు విజయం! ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో అనేక ప్రపంచ దేశాలు ఇప్పటికే చాలా ముందుకు పోయాయి. వారిని అందుకొనేందుకు మనం బహుదూరం ప్రయాణించాల్సి ఉంది. మన ప్రైవేట్ రంగంలోనూ ప్రతిభాపాటవాలున్నాయి. వాటి వినియోగానికి ప్రభుత్వం విధానపరంగా తగిన వాతావరణం కల్పిస్తే సుదీర్ఘ యానం సంక్షిప్తమవుతుంది. ఇన్నేళ్ళ భారత అంతరిక్ష ప్రయోగ పరిణామ క్రమంలో ప్రైవేట్ రంగ పాత్ర లేనే లేదనుకుంటే పొరపాటు. గోద్రెజ్ అండ్ బోయిస్, లార్సెన్ అండ్ టుబ్రో, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ లాంటి అనేక ప్రైవేట్ రంగ సంస్థలు తమ వంతు భాగస్వామ్యం వహించాయి. ఇప్పుడిక స్కైరూట్ లాంటి స్టార్టప్లు నక్షత్రపథాన నవీన కల్పనలకు పాదులు వేస్తాయి. అయితే, ఆకసాన బలమైన ఆర్థికశక్తిగా ఎదగాలంటే భారీ సంస్థల ప్రవేశం అనివార్యం. ప్రస్తుతానికి మన అంకుర సంస్థలకు విదేశీ మూలధనమే ఆధారం. మచ్చుకు విక్రమ్ను ప్రయోగించిన స్కైరూట్ సంస్థలో ప్రధాన పెట్టుబడులు సింగపూర్వి. రేపు మన అంతరిక్ష ప్రయోగాలు తలుపులు బార్లా తెరిచినప్పుడు పాశ్చాత్య సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం ఖాయం. ఇవాళ ప్రపంచమంతటా జాతీయ అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ భాగస్వామ్యమూ పెరుగుతోంది. 50 ఏళ్ళ క్రితం చంద్రునిపై మానవుడి ‘అపోలో’ ప్రయోగాన్ని జాతీయ ప్రాజెక్ట్గా అమెరికా నిర్వహించింది. వారం క్రితం నవంబర్ 16న మరోసారి చంద్రుని పైకి ‘ఆర్టెమిస్1’ రాకెట్ ప్రయోగాన్ని ఫ్రాన్స్, కెనడా, జపాన్లతో కలసి బహుళ దేశాల ప్రయత్నంగా జరిపింది. రష్యా, చైనాలు చుక్కలతోవలో చెట్టపట్టాలు వేసుకోవడమే కాక నెలవంకపై దీర్ఘకాల మానవ ఆవాసానికి సంయుక్త స్థావరం నెలకొల్పే పనిలో ఉన్నాయి. రయ్యిమంటూ రోదసీలోకి సాగిన మన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని వీటన్నిటి నేపథ్యంలో చూడాలి. వచ్చే పదేళ్ళలో దేశంలో 20 వేలకు పైగా చిన్న ఉపగ్రహాలు నింగికి ఎగురుతా యట. వ్యాపార సంస్థలు, విద్యాలయాలు, ప్రైవేట్ ప్రయోగశాలలు తాము తీర్చిదిద్దిన ఉపగ్రహా లను ప్రైవేట్ రాకెట్లతో దివికి పంపి, వాతావరణ, భూవిజ్ఞాన సమాచారాన్ని సేకరిస్తాయి. వెరసి, నిన్నటి దాకా ప్రభుత్వ ఆధిపత్యంలోని అంబర చుంబన యాత్రలో ప్రైవేట్ పాదముద్రలు బలంగా పడనున్నాయి. 2020 జూన్లోనే అంతరిక్ష కార్యకలాపాలన్నిటా ప్రైవేట్కు సర్కారు ద్వారాలు తీసింది. పరిశోధనలకూ, పోటీ తత్త్వానికీ తోడ్పడే ఈ మార్పును స్వాగతిస్తూనే తగు జాగ్రత్తలూ తప్పవు. అంతా ప్రైవేటైపోతే, దేశ రక్షణ మాటేమిటన్న భయాలను పాలకులు పోగొట్టాలి. ఇస్రో అనుభవాన్నీ, మార్గదర్శనాన్నీ వాడుకోవాలి. అమెరికాలో నాసాలా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానం మేలు. 350కి పైగా ప్రైవేట్ అంతరిక్ష సంస్థలతో అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీల తర్వాత మనది 5వ స్థానం. భవిష్యత్తులో చుక్కల తోటలో ఎక్కడుంటామో ఆసక్తికరం. ఇదీ చదవండి: సైన్సు అవార్డుల్లో కోతలా? -
అంతరిక్షమే హద్దుగా..
-
నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-S
-
శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-ఎస్
తిరుపతి: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం రాకెట్ ప్రయోగం జరిగింది. దేశీయంగా ప్రైవేట్ రంగంలో రూపొందిన మొదటి రాకెట్ విక్రమ్-ఎస్. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ ఈ ప్రైవేట్రాకెట్ను రూపొందించింది. ‘మిషన్ ప్రారంభ్’ విజయవంతమైందని ప్రకటించారు సైంటిస్టులు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగానికి నాంది పలుకుతూ ప్రైవేట్రంగంలో రూపొందిన తొలి రాకెట్ విక్రమ్–ఎస్. రాకెట్కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు.స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్–ఎస్ రాకెట్ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు. మిషన్ ప్రారంభ్ విజయోత్సాహంతో.. ఇది కొత్త ప్రారంభం అని ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ ప్రకటించారు. మన అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో కొత్త అధ్యాయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
ప్రైవేటు డిస్కంలకు లైన్ క్లియర్! విద్యుత్ చట్ట సవరణ బిల్లు బహిర్గతం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో ప్రభుత్వ విద్యుత్ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరవేస్తూ.. ప్రైవేటు డిస్కంలకు తలుపులు తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రం నూతన సంస్కరణలతో తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముసాయిదా శుక్రవారం బహిర్గతమైంది. దీనిని ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అందులోని కీలక అంశాలు.. ►ఎక్కడైనా ఒకే ప్రాంతం పరిధిలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఎక్కువ డిస్కంలకు అనుమతులు ఇవ్వనున్నారు. సొంత ట్రాన్స్మిషన్ వ్యవస్థ (విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు) ఉన్న కంపెనీలకే లైసెన్స్ అన్న నిబంధనను తొలగిస్తున్నారు. దీనితో ప్రైవేటు కంపెనీలూ తెరపైకి రానున్నాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా లైసెన్స్ జారీ చేసేలా కేంద్ర నిబంధనలు ఉన్నాయి. ►ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ల ద్వారా వచ్చే విద్యుత్ను, అందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రాల ఈఆర్సీలు.. భవిష్యత్తులో వచ్చే అన్ని కంపెనీలకు సమానంగా పంచాల్సి ఉంటుంది. అదనపు విద్యుత్ అవసరమైన కంపెనీలు కొత్తగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చేసుకోవాల్సి ఉంటుంది. ►రిటైల్ విద్యుత్కు సంబంధించి గరిష్ట, కనిష్ట ధరలను మాత్రమే రాష్ట్రాల ఈఆర్సీలు నిర్ణయిస్తాయి. అంటే ఈ గరిష్ట, కనిష్ట ధరల మధ్య ఎవరు తక్కువ చార్జీలను ఆఫర్ చేస్తే ఆ కంపెనీని ఎంపిక చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది. సంస్థల మధ్య పోటీ వల్ల నాణ్యమైన సరఫరా ఉంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.ప్రైవేటు డిస్కంల రాకతో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఎసరు వచ్చే పరిస్థితి ఉంటుందన్న ఆందోళన కనిపిస్తోంది. ►ప్రస్తుతం విద్యుత్ రంగం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉంది. ఇప్పుడీ సవరణలు అమల్లోకి వస్తే.. విద్యుత్ రంగం పూర్తిగా కేంద్రం గుప్పిట్లోకి వెళుతుందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. చదవండి: మూడురోజులు అతిభారీ వర్షాలు! -
రాజపక్సకు ఆశ్రయం ఇవ్వలేదు: సింగపూర్
కొలంబో: శ్రీలంకలో నిరసనకారులు ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన భార్యతో సహా మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఐతే అక్కడ కూడా గోటబయకి ఆందోళనకారుల నిరసన సెగ వదలకపోవడంతో ఆయన సింగపూర్ పయనమయ్యారని, అక్కడి ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందంటూ పలు వార్తలు వచ్చాయి. ఈ విషయమై సింగపూర్ ప్రభుత్వం స్పందించింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్ వచ్చారే తప్ప తాము ఆయనకు ఆశ్రయం ఇవ్వలేదని అక్కడి ప్రభుత్వ పేర్కొంది. అయినా సింగపూర్ సాధరణంగా ఆశ్రయం కోసం అభ్యర్థనలను మంజూరు చేయదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయన ఆశ్రయం కోరలేదని కూడా పేర్కొంది. రాజపక్స గురువారం మధ్యాహ్నం సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో సింగపూర్కి వచ్చినట్టు తెలిపింది. లంక అధ్యక్షుడు గోటబయ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లే ముందు కొంతకాలం సింగపూర్లో ఉంటారని లంక అధికార వర్గాలు పేర్కొన్నాయి. అదీగాక గోటబయ సింగపూర్కు వెళ్లేందుకు ప్రైవేట్ జెట్ను ఏర్పాటు చేయాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు కూడా అధికారిక వర్గాలు తెలిపాయి. ఐతే ఆయన కొలంబో బయలుదేరే ముందే రాజీనామ పంపుతానని కూడా లంక నాయకులు హామీ ఇచ్చాడు కూడా. ఈ మేరకు గోటబయ సింగపూర్ చేరిన వెంటనే స్పీకర్కి రాజీనామ పంపినట్లు శ్రీలంక పేర్కోంది. (చదవండి: గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే.. మరోదేశం పోవాల్సిందే!) -
రియల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకే ఎక్కువ పెట్టుబడులు
ముంబై: దేశీయంగా గత నెలలో పీఈ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు 2021 మే నెలతో చూస్తే 42 శాతం ఎగసి 5.3 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన 7.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే 29 శాతం క్షీణించాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం డీల్ పరిమాణం భారీగా పెరిగింది. గతేడాది మేలో నమోదైన 66 నుంచి 109కు డీల్స్ సంఖ్య ఎగసింది. ఈ ఏప్రిల్లో మాత్రం ఇంతకంటే అధికంగా 117 లావాదేవీలు జరిగాయి. 2022 మే నెలలో ప్రధానంగా రియల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు అధిక పెట్టుబడులను సాధించాయి. 1.7 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్స్ నమోదయ్యాయి. ఇక 10 కోట్ల డాలర్ల విలువైన 14 భారీ డీల్స్ సైతం మే నెలలో జరిగాయి. వీటి మొత్తం విలువ 3.9 బిలియన్ డాలర్లుకాగా.. అపోలో గ్లోబల్ నుంచి అదానీ గ్రూప్ నిర్వహణలోని ముంబై ఎయిర్పోర్ట్ సమీకరించిన 75 కోట్ల డాలర్లు వీటిలో కలసి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. -
ఉక్రెయిన్ యుద్ధం: ప్రైవేట్ సైనికులు కావలెను.. భారీగా జీతం, బోనస్ ప్రత్యేకం
‘‘ఉక్రెయిన్ శిథిలాల్లో, కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు ప్రైవేట్ సైనికులు కావలెను. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల డాలర్ల జీతం. బోనస్ ప్రత్యేకం’’ – సైలెంట్ ప్రొఫెషనల్స్ అనే ప్రైవేట్ సైనిక సంస్థ ప్రకటన ఇది. కొన్నేళ్లుగా ఇలాంటి ప్రకటనలు వెబ్సైట్లలో అనేకం ప్రత్యక్షమవుతున్నాయి. అమెరికా, యూరప్కు చెందిన వందలాది మంది మాజీ సైనికులు ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో పని చేస్తున్నారు. ఇంకా చాలామంది వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. సంక్షుభిత ఉక్రెయిన్ నుంచి పౌరులను సురక్షిత దేశాలకు తీసుకెళ్లేందుకూ ప్రైవేట్ సైనిక సంస్థలు కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి. కుటుంబాలను, సమూహాలను సురక్షితంగా తరలించేందుకు 30,000 డాలర్లు మొదలుకొని 60,000 డాలర్ల దాకా కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నాయి ఈ సంస్థలు. ప్రోత్సహిస్తోంది ప్రభుత్వాలే చాలా దేశాల్లో సైన్యానికి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ సంస్థలు ఇలా బలగాలను పోషిస్తున్నాయి. పరిశ్రమలు, కార్యాలయాలకు రక్షణ కల్పించే సెక్యూరిటీ సంస్థల్లాగే సైనిక అవసరాలను తీరుస్తున్న ఈ కంపెనీలను ప్రైవేట్ మిలటరీ కంపెనీలు (పీఎంసీ) అంటారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా పని చేస్తున్నాయి. ప్రభుత్వాలు, సైన్యం అధికారికంగా చేయలేని పనులను వీటితో చేయించుకుంటారు. వీటి కార్యకలాపాలు వివాదాస్పదమైతే తమకు సంబంధం లేదని ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటాయి. ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులూ వీటి సేవలను వాడుకుంటున్నారు. వేలు, లక్షల కోట్ల వ్యాపారం చేసే బడా కార్పొరేట్ సంస్థ లు ఆరితేరిన మాజీ సైనికులను నియమించుకుంటున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా పీఎంసీల వ్యాపార విలువ 22,400 కోట్ల డాలర్లని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ న్యూస్ చెబుతోంది. 2030 నాటికి 45,700 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. వాగ్నర్ VS అకాడమీ ఇవి రెండూ ప్రస్తుతం ఉక్రెయిన్లో వైరి పక్షాల తరఫున బరిలో దిగాయి. గతంలో సిరియా, లిబియాల్లో రష్యా ప్రయోజనాలు కాపాడేందుకు పనిచేసిన వాగ్నర్ ఇప్పుడు ఉక్రెయిన్ సైనికాధికారులు, నేతలే లక్ష్యంగా 400 మంది కిరాయి సైనికులను దించిందని ది టైమ్స్ పత్రిక వెల్లడించింది. వీరిని గుర్తించి హతమార్చేందుకు ఉక్రెయిన్ కోరిక మేరకు అకాడమీ పని చేస్తోంది. ఇరాక్, అఫ్గానిస్తాన్ల్లో అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు పని చేసిన అకాడమీ ఉక్రెయిన్లో మాజీ సైనికులను రిక్రూట్ చేసుకొని పౌరులకు సైనిక శిక్షణ ఇస్తోంది. సైనిక సామగ్రి బాధ్యతలూ దీనివే. కంపెనీల స్వరూపం ప్రపంచవ్యాప్తంగా, అమెరికా, సంపన్న యూరప్ దేశాల్లో వందలాది పీఎంసీలున్నాయి. అంతర్జాతీయ సూత్రాలకు, ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమైన పనులూ చేసే ఈ కంపెనీలను పలు దేశాల్లో ప్రభుత్వాలే రంగంలోకి దించి తమ టార్గెట్లు పూర్తి చేసుకుంటుంటాయి. ఈ కంపెనీల్లో ముఖ్యమైనవి.. చదవండి: McDonald's: మూతపడ్డ 2 నెలలకు రీ ఓపెన్. అయితే కొత్త పేరు, లోగో! ► అకాడమీ: బ్లాక్ వాటర్ పేరుతో నడిచిన ఈ సంస్థ చేతులు మారి అకాడమీగా అవతరించింది. అమెరికాలో ని నార్త్ కరోలినా కేంద్రంగా పని చేస్తుంది. 25,000కు పైగా ఉద్యోగులున్నారు. 90% కాంట్రాక్టులు అమెరికా ప్రభుత్వం, నిఘా సంస్థ సీఐఏ నుంచి వస్తాయి. ► వాగ్నర్ గ్రూప్ రష్యా రాజధాని మాస్కో కేంద్రంగా పని చేసే ఈ సంస్థలో 10,000కు పైగా కిరాయి సైనికులున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడైన యవ్జెన్ ప్రిగోజిన్ దీని అధిపతి. ► జీఫోర్ఎస్ ప్రపంచంలో అత్యంత పెద్ద పీఎంసీల్లో ఒకటి. లండన్ కేంద్రంగా పని చేస్తుంది. 5 లక్షలకుపైగా ఉద్యోగులున్నారు. ► యూనివర్సల్ ప్రొటెక్షన్ అమెరికాకు చెందిన కంపెనీ. 2 లక్షల మంది పని చేస్తున్నారు. ► కేబీఆర్ అమెరికాలోని టెక్సాస్కు చెందిన సంస్థ. 40,000 మంది ఉద్యోగులున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఫార్మసీలు బంద్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రైవేట్ మందుల దుకాణాలను ఎత్తివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు వీటిని ఎందుకు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోని ప్రైవేట్ ఔషధ దుకాణాలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో వాటిని ఏర్పాటు చేసిన యాజమాన్యాల నుంచి రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఖాళీ చేయబోమని చెబుతున్నట్లు తెలిసింది. అవసరమైతే కోర్టులకు వెళ్లి ఖాళీ చేయించకుండా స్టే తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తామన్నట్లు సమాచారం. అయితే చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా వీటిని ఎలా ఖాళీ చేయించాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ మందుల దుకాణాలను ఎత్తి వేయాల్సిందేనని మంత్రి హరీశ్రావు.. అధికారులకు హుకుం జారీచేశారు. దీంతో తొలగింపునకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రైవేట్ దుకాణాలను ఎత్తివేయడమే కాకుండా.. తక్షణమే అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా అన్ని రకాల మందులు, అవసరమైనన్ని సరఫరా చేయాలని కూడా వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రోగులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. రోజుకు రూ.లక్షల విక్రయాలు.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు ఉచిత వైద్య సేవలు, చికిత్స అందించాలి. ఉచిత వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఉచితంగా మందులు ఇవ్వాల్సిన బాధ్యత సర్కారు ఆసుపత్రులపై ఉంది. దీనికోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు బోధనాసుపత్రుల వరకు అన్నింటికీ ప్రభుత్వమే ఉచితంగా మందులను సరఫరా చేస్తుంది. దీనికి ప్రభుత్వం మూడేళ్లుగా రూ.330 కోట్ల చొప్పున కేటాయించగా, ఈ ఏడాది రూ.500 కోట్లు కేటాయించింది. అయితే అనేక ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లోని ప్రాంగణాల్లో ప్రైవేట్ మెడికల్ షాపులకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి బోధనాసుపత్రుల్లో అయితే రోజుకు రూ.ల క్షల విలువైన మందుల విక్రయాలు జరు గుతున్నాయి. ఇలా వాటిని నెలకొల్పిన యాజమాన్యాలు నెలకు కోట్లు గడిస్తున్నాయి. ఉచిత మందులున్నా.. అనేక మంది డా క్టర్లు రోగులకు ఆయా ఆసుపత్రుల్లోని ప్రైవే ట్ మెడికల్ షాపుల వద్ద ఉన్న మందులే రాస్తున్నారు. బ్రాండెడ్ మందులే మంచి వన్న భావనను కల్పిస్తున్నారు. అంతేగాక కొన్ని ఆసుపత్రుల్లో కోర్సు ప్రకారం వాడా ల్సిన రోజులకు కాకుండా, తక్కువ రోజులకే మందులు ఇస్తున్నారు. ఉదాహరణకు నెల రోజులకు డాక్టర్ మందులు రాసిస్తే, వారంపది రోజులకే ఉచితంగా ఇస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులు ఉండని పరిస్థితి. మరికొన్నిచోట్ల ఒక మం దు ఉంటే మరోటి ఉండదు. ఇలాంటి కార ణాలతో పేదలు ఆయా ఆసుపత్రుల్లోని ప్రైవేట్ మందుల దుకాణాల్లో కొంటున్నా రు. ఇక కొన్ని ఏరియా, జిల్లా ఆసు పత్రు ల్లోనూ ప్రైవేట్ జనరిక్ మందుల దుకా ణా లను నెలకొల్పారు. వాటిల్లోనూ పేదలు డ బ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుండటంతో ప్రైవేట్ ఔషధ దుకాణాలను ఖాళీ చేయించాలని సర్కార్ నిర్ణయించింది. ‘ప్రైవేట్’లో కొనుక్కోమని రాసిస్తే చర్యలు.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రైవేట్ ఔషధ దుకాణాలను ఎత్తివేయాలన్న మంత్రి హరీశ్ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు ప్రైవేట్ మెడి కల్ షాపుల అవసరం ఏముంటుంది?. ఎక్కడైనా ప్రభుత్వ డాక్టర్లు ఉచి త మం దులు ఇవ్వకుండా ప్రైవేట్లో కొ నుక్కో మని రాసిస్తే చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ అజయ్కుమార్, కమిషనర్ -
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
బద్వేలు అర్బన్: రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీపై మండిపడ్డారు. బుధవారం ఆయన బద్వేలులో విలేకరులతో మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీకి తోడు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుండటం భావ్యం కాదన్నారు. ప్రైవేటు యాజమాన్యం కింద నడిచే విద్యా సంస్థల పనితీరుపై సీఎం వైఎస్ జగన్ ఒక కమిటీ వేసి ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు అప్పగించారన్నారు. ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏ విధంగా పని చేస్తున్నాయి.. టీచర్, విద్యార్థి నిష్పత్తి ఎలా ఉంది.. ఫలితాలు ఎలా వస్తున్నాయి.. నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి.. తదితర విషయాల్లో సూచనలివ్వాలని కమిటీని ఆదేశించారన్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితి దారుణం ► ఎయిడెడ్ స్కూళ్లు దాదాపుగా నిర్వీర్యమయ్యాయి. కొన్ని చోట్ల టీచర్లకు, యాజమాన్యం మధ్య సఖ్యత లేదు. చాలా స్కూళ్లలో మౌలిక వసతులు లేవు. అందువల్ల విద్యార్థులు ఆ స్కూళ్లలో చేరడం లేదు. ► ఈ పరిస్థితిలో యాజమాన్యాలు స్కూళ్లను ప్రభుత్వానికి అప్పగిస్తే అవసరమైన మేరకు టీచర్లను నియమించడంతో పాటు నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేయవచ్చని నిర్ణయించాం. ► అయితే ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తే స్కూళ్లు మూత పడిపోతాయని ప్రతిపక్షం, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నాయి. వాస్తవానికి స్కూళ్లు అప్పగించాలని ప్రభుత్వం ఏ ఒక్క స్కూలు యాజమాన్యాన్ని బలవంత పెట్టడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలుగా నడుపుకోవచ్చు ► ఎయిడెడ్ యాజమాన్యాలు తమకు గ్రాంట్ అవసరం లేదని, టీచర్లను ప్రభుత్వానికి సరెండర్ చేసి ప్రైవేటు విద్యా సంస్థలుగా నడుపుకుంటామని చెబితే ఎలాంటి అభ్యంతరం లేదు. ► రాష్ట్రంలో ఉన్న సుమారు 137 పైచిలుకు డిగ్రీ కాలేజీల్లో 7 డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు స్టాఫ్తో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తామని రాత పూర్వకంగా తెలిపారు. 124 డిగ్రీ కాలేజీలు స్టాఫ్ను మాత్రమే సరెండర్ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని ప్రైవేటు కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయి. మొత్తంగా 93 శాతం డిగ్రీ కాలేజీలు విల్లింగ్నెస్ ఇచ్చాయి. ► 122 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉంటే 5 జూనియర్ కాలేజీలు ఆస్తులతో, 103 కాలేజీలు కేవలం స్టాఫ్ను ఇస్తామని తెలిపాయి. ► 1,988 స్కూళ్లకు గాను 1200 స్కూళ్ల యాజమాన్యాలు స్టాఫ్ను ప్రభుత్వానికి అప్పగిస్తామని రాత పూర్వకంగా తెలిపాయి. 88 స్కూళ్లు ఆస్తులతో పాటు స్టాఫ్ను ఇస్తున్నట్లు ఒప్పుకున్నాయి. ► విశాఖలో సెయింట్పీటర్స్, కాకినాడలో సెయింట్ యాన్స్ స్కూళ్ల యాజమాన్యాలు తాము స్కూళ్లు మూసి వేస్తున్నామని చెప్పాయి. కాబట్టి మీ పిల్లలను వేరే స్కూళ్లలో చేర్పించుకోండని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యం విల్లింగ్నెస్ ఇచ్చినప్పటికీ, తిరిగి విత్డ్రా చేసుకుంటామంటే వారి ఆప్షన్ను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు. ► రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్ల దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే కారణం. -
అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు
-
మొక్కలు, కల్తీ నారు అమ్మితే జైలుకే
సాక్షి, కరీంనగర్: ఎదుగుదల లేని మొక్కలు విక్రయించినా, కల్తీ నారు అంటగట్టినా ఇకపై కటకటాలు లెక్కించాల్సిందే. ఇబ్బడిముబ్బడిగా పూలు, పండ్ల మొక్కల విక్రయాలు, బంతి, మిర్చి నారు విక్రయాలు జోరందుకున్నాయి. ఒకప్పుడు అంకెల్లో ఉన్న నర్సరీలు నేడు వందలకు చేరాయి. హైబ్రిడ్ మొక్కలని అంటగట్టి ఉడాయిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రయివేటు నర్సరీలను కూడా చట్ట పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కోరలు లేని గత చట్టానికి సవరణలు చేసి ఉద్యాన శాఖకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. నర్సరీల రిజిస్ట్రేషన్ సదరు శాఖ కనుసన్నల్లో సాగనుంది. ఇకపై జిల్లాలో ఉన్న నర్సరీలన్నీ ఉద్యాన శాఖ పరిధిలో చేరాల్సిందే. రైతులు, ప్రకృతి ప్రేమికులకు నాణ్యమైన మొక్కలు, నారు విక్రయాలతోపాటు నర్సరీలు బాధ్యతగా వ్యవహరించనున్నాయి. నష్టపరిహారం కూడా ఇచ్చే నిబంధన ఉండటంతో పారదర్శకంగా ఉండనున్నారు. పక్కాగా రిజిస్ట్రేషన్.. లేకుంటే కఠిన చర్యలే రైతులను మోసగించే నర్సరీదారులను ఏకంగా జైలుకు పంపించే నూతన నియమావళిని జారీ చేసింది ప్రభుత్వం. 27 పేజీల జీవోలో విత్తన దశ నుంచి నారు విక్రయం వరకు అన్ని దశల్లో రైతును కాపాడేలా కఠిన నిబంధనలను విధించింది. రైతులను మోసగించే ఏ చర్యనూ సహించబోమని మార్గదర్శకాల్లో పేర్కొంది. గతంలో ఖమ్మం జిల్లాలో నాసిరకం మిర్చి విత్తనాలు సరఫరా చేసిన వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసిన ప్రభుత్వం రైతు రక్షణకు ఈ చట్టాన్ని రూపొందించింది. ఏటా నకిలీ మకిలీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ఈ క్రమంలో నర్సరీదారుల నూతన లైసెన్సు పొందే అంశం నుంచి నారు ఏ దశలో విక్రయించాలి, అక్రమాలు జరిగితే విధించే శిక్షలు తదితర విషయాలన్ని అందులో వివరంగా పేర్కొంటూ జీవో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్(నియంత్రణ) నియమావళి–2012కు పలు సవరణలు చేస్తూ తెలంగాణ రిజిస్ట్రేషన్ ఆఫ్ నర్సరీ రూల్స్–2017 పేరిట ఉద్యాన శాఖ దీనిని రూపొందించింది. 4 లక్షల లోపు మొక్కలుండే నర్సరీకి రూ.500 రిజిస్ట్రేషన్ రుసుము, 4 లక్షలకు పైగా మొక్కలుండే నర్సరీలకు రూ.వెయ్యి రుసుము నిర్ణయించారు. ఏ సర్వే నంబర్ భూమిలో నర్సరీ నిర్వహిస్తున్నారు, భూసార పరీక్ష ఫలితాలున్నాయా, ఏ నేల, నేల స్వభావం, ఏయే మొక్కలు వృద్ధి చేస్తున్నారు, భూమికి సంబంధించిన పాసుపుస్తకాలు ఇలా అన్ని వివరాలను అందజేయాలి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల నాణ్యమైన మొక్కల తయారీకి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. పండ్ల మొక్కల ఉత్పత్తికి రూ.5 వేలు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలు 4 లక్షలలోపు పెంపకానికి రూ.వెయ్యి, 4 లక్షలకు మించిన మొక్కల పెంపకానికి రూ.2,500 ఫీజు చెల్లించాలి. పండ్ల మొక్కల నర్సరీలను ఏడాదికోసారి, కూరగాయ నర్సరీలను 4 నెలలకోసారి అధికారులు తనిఖీ చేస్తారు. నిబంధనలు తప్పనిసరి అనుమతి పొందిన నర్సరీలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. నర్సరీదారులు విత్తనం ఎక్కడ నుంచి సేకరించారు. బిల్లు వివరాలు, లాట్ నంబర్, బ్యాచ్ నంబర్, విత్తన పరీక్ష వివరాల పత్రాలు, విత్తనం తయారుచేసిన తేదీ, గడువు తేదీ, విత్తిన తేదీ, నారు మొక్కలు అమ్మిన తేదీ తదితర వివరాలు విధిగా నమోదు చేయాలి. నర్సరీ ప్రధాన ద్వారం వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేసి అక్కడ లభించే నారు మొక్కల సంఖ్య, ధరల పట్టిక తెలుగులో రాసి ఉంచాలి. నాణ్యమైన నారు మొక్కల పెంపకానికి సరైన భూమి ఎన్నుకోవడంతోపాటు చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. పిల్ల, తల్లి మొక్కల బ్లాక్లను వేరుగా ఉంచాలి. నీటితోపాటు కార్యాలయం, స్టోర్ వసతులు ఉండాలి. మొలకలు, నర్సరీ బెడ్ల తయారీ, షేడ్నెట్ హౌస్, నెట్హౌస్, పాలీటన్నెల్, చాంబర్ తదితరరాలు సమకూర్చుకోవడంతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. నారు వయస్సు, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. నిబంధనలు అతిక్రమిస్తే శిక్షే నిబంధనలు పాటించని నర్సరీదారులపై చట్ట ప్రకారం రూ.50 వేల జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. రైతులు కూడా రిజిస్టర్ నర్సరీ నుంచే నారు కొనుగోలు చేయాలి. బిల్లు తీసుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం గడువేమీ లేదని, వీలైనంత త్వరగా ఉద్యాన శాఖలో సంప్రదించి నమోదు చేసుకోవాలని ఉద్యాన అధికారులు వివరించారు. -
ప్రైవేటు కార్లను నిషేధిస్తున్న తొలి సిటీ
న్యూఢిల్లీ : డీజిల్, పెట్రోల్తో సంబంధం లేకుండా ప్రపంచంలో ప్రైవేటు కార్లను పూర్తిగా నిషేధిస్తున్న తొలి నగరం బ్రిటన్లోని యార్క్ సిటీ. పబ్లిక్ రవాణా బస్సులు, దివ్యాంగులను తీసుకెళ్లే వాహనాలు మినహా మిగతా ప్రయాణికులను తీసుకెళ్లే ప్రైవేటు వాహనాలన్నింటిని నిషేధించాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ నిషేధం సిటీవాల్స్ వరకు, నగరం చుట్టూ నిర్మించిన గోడల పరిధి వరకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. నగరం చుట్టూ రోమన్ కాలంలో నిర్మించిన గోడలు ఇప్పటికీ అక్కడ బలంగానే ఉన్నాయి. పబ్లిక్ రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా పెట్రోలు, డీజిల్ కార్లే కాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను కూడా నిషేధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏటా 70 లక్షల మంది పర్యాటకులు వచ్చే ఈ నగరంలో కాలుష్యం ఎక్కువగా ఉంది. కాలుష్యానికి కారణం పర్యాటకులంటూ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ విమర్శలను పర్యాటకుల మీదకు నెట్టింది. నగరంలోని 12 ప్రాంతాల్లో కాలుష్య ప్రమాణాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో 2030 నాటికల్లా నగరంలో కర్బన ఉద్గారాలను జీరోస్థాయికి తీసుకరావాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకొంది. అందులో భాగంగా 2023 నాటికి నగరంలో సంపూర్ణ కార్ల నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే నేపథ్యంలోనే 2021 సంవత్సరం నాటికి డీజిల్ కార్లను సంపూర్ణంగా నిషేధించాలని బ్రిటన్లోని బ్రిస్టల్ నగరం నిర్ణయం తీసుకుంది. -
నాగులవంచ గ్రామంలో కులపంచాయతీ
-
పారిశుద్ధ్యం.. ప్రైవేట్ పరం
ప్రజారోగ్యంలో కీలకమైన పారిశుద్ధ్యం విభాగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 279 గెజిట్ ఆర్డర్ జారీ చేసిన నేపథ్యంలో అమలుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నగరాన్ని మూడు ప్యాకేజీలుగా విభజించి ప్రణాళిక రూపొందించారు. మరి కొద్ది రోజుల్లో ప్రయోగాత్మకంగా ఒక ప్యాకేజీని అమలు చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పారిశుద్ధ్య కార్మిక సొసైటీ అధ్యక్షులతో కార్పొరేషన్ కమిషనర్ చర్చలు జరుపుతున్నారు. ఎప్పటికైనా పర్మినెంట్ అవుతాం.. తాము పడుతున్న కష్టాలు తీరుతాయి.. అనే ఆశతో 15 ఏళ్లకు పైగా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో కార్మికులను ప్రైవేట్ పరం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై కార్మికులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరితో కార్మికుల భవిష్యత్ను పణంగా పెట్టడానికే సిద్ధపడుతోంది. నెల్లూరు సిటీ: నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 877 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. 77 సొసైటీల కింద కార్మికులు ఉన్నారు. కార్పొరేషన్లోని 54 డివిజన్లను 20 శానిటరీ డివిజన్లుగా విభజించి పనులు చేస్తున్నారు. మూడున్నర ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికులను సొసైటీల కింద కాకుండా ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ కింద పనిచేసేలా ప్రభుత్వం 279 జీఓను విడుదల చేసి నిర్ణయం తీసుకుంది. అయితే ప్రైవేట్ వ్యక్తులు జీతాలు సరిగా ఇవ్వకపోవడం, పని ఒత్తిడి పెంచి ఇబ్బందులు పెడతారని, భరోసా ఉండదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మికుల కుటుంబ భద్రతను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా జీఓ అమలు చేసేందుకు ముందడుగులు వేస్తుంది. ఈ క్రమంలో గతేడాది గుంటూరుకు చెందిన కాంట్రాక్టర్ బొమ్మిడి రామకృష్ణకు మూడు ప్యాకేజీల కింద మూడేళ్ల పాటు నెల్లూరు కార్పొరేషన్ పారిశుద్ధ్య పనులను అప్పగించారు. మూడేళ్ల పాటు రూ.61.15 కోట్లు కార్మికులకు చెల్లించేలా మూడు ప్యాకేజీలను దక్కించుకున్నారు. అదనంగా 6.80 శాతం ఎక్స్స్ వేసి టెండర్ దక్కించుకోవడం వెనుక అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారని విమర్శలు ఉన్నాయి. సొసైటీ అధ్యక్షులతో చర్చలు సొసైటీల కింద పనిచేస్తున్న కార్మికుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కమిషనర్ అలీంబాషా సొసైటీ అధ్యక్షులతో వారం రోజులుగా విడతల వారీగా సమావేశాలు జరిపారు. కార్మికులకు 279 జీఓ కారణంగా వచ్చే లాభాలను వివరించాలని చెప్పినట్లు తెలుస్తుంది. జీఓ అమలు కావడం కచ్చితమని అందరూ సహకరించాలని కోరారు. అయితే సొసైటీ అధ్యక్షులు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, పోరాటం ఉధృతం చేస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఒక ప్యాకేజీ అమలుకు రంగం కాంట్రాక్టర్ మొత్తం మూడు ప్యాకేజీలు దక్కించుకున్నారు. ఒక ప్యాకేజీని ముందుగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో 10 రోజుల్లో కొన్ని ప్రాంతాలను సెలక్ట్ చేసుకున్నారు. ఒక మైక్రో ప్యాకెట్ కింద 350 మంది కార్మికులు పనిచేయాల్సి ఉంది. ఇలా 1వ డివిజన్ నుంచి 10వ డివిజన్ వరకు ఉన్న ఇళ్లను 109 మైక్రో ప్యాకెట్లుగా విజించారు. ఈ డివి జన్లను కార్పొరేషన్ అధికారులు పర్యవేక్షించనున్నారు. కాంట్రాక్టర్ దక్కించుకున్న 11వ డివిజన్ నుంచి 24వ డివిజన్ వరకు 128 మైక్రో ప్యాకెట్లుగా, 25వ డివిజన్ నుంచి 38వ డివిజన్ వరకు 126 మక్రో ప్యాకెట్లుగా, 39వ డివిజన్ నుంచి 54వ డివిజన్ వరకు 113 మైక్రో ప్యాకెట్లుగా విభజించారు. ఇలా కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని మరో 10 రోజుల్లో అమలు చేయనున్నారు. ఉద్యమం ఉధృతం చేస్తాం 279 జీఓ అమలు చేస్తే కార్మికులను కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కార్మికులకు ఉద్యోగ భరోసా కూడా ఉండదు. మేయర్ అజీజ్ గతంలో జీఓను అమలు చేయమని హామీ ఇచ్చారు. అమలు చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం. – కత్తి శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్,అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు -
‘విమ్స్’లో కమీషన్ల దందా!
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రాణదాతగా పేరుగాంచిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)ను ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసం ప్రైవేట్కు అప్పజెప్పారు. రాత్రికి రాత్రే నిబంధనలు మార్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిం చారు. ఇప్పటిదాకా రూ.300 కోట్లు వెచ్చించి, అభివృద్ధి చేసిన ఆసుపత్రిని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిన తీరు అధికారవర్గాల్లో చర్చనీయాం శంగా మారింది. విమ్స్ ప్రైవేటీకరణతోపాటు ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రోగులు చికిత్స పొందే ప్రైవేట్ ఆస్పత్రులపై అజమాయిషీ కోసం ‘క్లినికల్ ఆడిట్’ పేరుతో ఓ కాంట్రాక్టు, మాతా శిశుమరణాలు తగ్గించే మరో కాంట్రా క్టును బాగా కావాల్సిన వారికే అప్పగించారు. ఈ కాంట్రాక్టుల అప్పగింత వెనుకరూ.కోట్ల కమీషన్లు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువుకు ముందే కానిచ్చేశారు ఎక్కడైనా టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తే, బిడ్లు దాఖలు చేసుకునేందుకు తగినంత గడువు ఇస్తారు. విమ్స్ ప్రైవేటీకరణలో భాగంగా రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్ పిలిచింది. బిడ్ల దాఖలుకు జూన్ 18వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. కానీ, తమకు బాగా కావాల్సిన బిడ్డర్లు బిడ్లు దాఖలు చేయగానే జూన్ 6వ తేదీనే టెండర్ ప్రక్రియ ముగించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నిబంధనల ప్రకారం ఒకసారి టెండర్ పిలిస్తే గడువుకు ముందే ముగించకూడదు. కావాలంటే టెండర్ గడువును ఇంకా పొడిగించుకోవచ్చు. అంతేతప్ప గడువుకు ముందే ముగించడం నిబంధనలకు విరుద్ధమే. ఏపీఎంఎస్ఐడీసీ నిర్వాకం వల్ల చాలామంది బిడ్లు దాఖలు చేయలేకపోయారు. రాత్రికి రాత్రే ఈఎండీ తగ్గింపు ఏ టెండర్లో అయినా ఎర్నెస్ట్ డిపాజిట్ మనీ(ఈఎండీ) నిబంధన ఉంటుంది. విమ్స్ ప్రైవేటీకరణ టెండర్లలో ఈఎండీ రూ.25 లక్షలుగా నిర్దేశించారు. జూన్ 5వ తేదీన ఏపీఎంఎస్ఐడీసీ ఇంజనీర్కు సచివాలయంలోని ముఖ్యకార్యదర్శి పేషీ నుంచి ఈ–మెయిల్ వెళ్లినట్లు సమాచారం. రూ.25 లక్షలున్న ఈఎండీని రూ.లక్షకు తగ్గించాలన్నదే ఆ ఈ–మెయిల్ సారాంశం. ముఖ్యమంత్రి కార్యాలయ ఒత్తిళ్ల మేరకే సదరు ఈ–మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైద్య ఆరోగ్యశాఖ సలహాదారు కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఫోన్ చేసి తాము చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించినట్లు ఏపీఎంఎస్ఐడీసీ వర్గాలు చెప్పాయి. సీఎంఓ నుంచి ఆర్డర్ ఉందన్నారు ‘‘టెండర్ను గడువు కంటే ముందే ముగించిన విషయం వాస్తవమే. ఉన్నతాధికారులు చెప్పినందు వల్లే ఈఎండీని తగ్గించాం. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆర్డర్ ఉందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య రాతపూర్వకంగా ప్రతిపాదన పంపిన తర్వాతే చేశాను. దీనిపై నా పాత్ర ఏమీ లేదు’’ – రోహిణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఎంఎస్ఐడీసీ రూ.కోట్లు ఖర్చు చేసి ప్రైవేట్కు అప్పగిస్తారా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచనల్లోంచి విమ్స్ పురుడు పోసుకుంది. దీన్ని హైదరాబాద్లోని నిమ్స్ కంటే ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన కలలుగన్నారు. విమ్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.300 కోట్లు ఖర్చు చేసింది. ఇక్కడ చాలామంది సిబ్బంది పని చేస్తున్నారు. స్పెషలిస్టు డాక్టర్లున్నారు. ఇన్సోర్సింగ్ కింద వైద్యులు సేవలందిస్తున్నారు. మరో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ‘విమ్స్’ అద్భుతంగా తయారవుతుంది. ఎంబీబీఎస్ సీట్లు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అలాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం పెద్దలు తమ స్వార్థం కోసం ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. తాజా నిబంధనల ప్రకారం ఐదు రకాల సేవలను ప్రైవేట్కు ఇచ్చేశారు. గుండెజబ్బుల చికిత్సలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్సలు, నియోనెటాలజీ అండ్ పీడియాట్రిక్, రీనల్ సర్వీసెస్ (కిడ్నీ సేవలు), స్పోర్ట్స్ ఇంజూరీ (ఎముకల శస్త్రచికిత్సలు, కీళ్ల మార్పిడి) చికిత్సలు ప్రైవేట్పరమయ్యాయి. ఈ సేవలను ధనుష్ టెక్నాలజీస్ అనే సంస్థకు కట్టబెట్టినట్టు సమాచారం. సాఫ్ట్వేర్ సేవలకు సంబంధించిన ఈ సంస్థకు ఆరోగ్య సేవల్లో ఎలాంటి అనుభవం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థకు అప్పగించారు. తాజాగా విమ్స్ కూడా అదే సంస్థ చేతుల్లోకి వెళ్లింది. పైన పేర్కొన్న సేవల్లో ఔట్పేషెంట్కు, ఇన్పేషెంట్కు, ఎక్స్రే, ఎంఆర్ఐ, ఎండోస్కొపీ ఇలా ఒక్కొక్క సేవకు ధర నిర్ణయించి ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ఇదంతా ఏటా రూ.కోట్లలోనే ఉంటుందని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒక్క ఏడాదిలో ప్రైవేట్ సంస్థకు చెల్లించే సొమ్ముతో విమ్స్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయొచ్చని అన్నారు. -
ప్రైవేటు చేతికి బాలల ఆరోగ్య పథకం
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రీయ బాల స్వాస్త్య స్కీమ్ (ఆర్బీఎస్కే)లోని స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రైవేటు చేతికి వెళ్లింది. ఈ పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరవాల్సి ఉండగా ఇప్పటి వరకు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద వైద్యులను, సిబ్బందిని సైతం నియమించలేదు. జిల్లాలో 2,992 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 3,549 అంగన్వాడీ కేంద్రాలు, 51 ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 5.30 లక్షల మంది 18 ఏళ్లలోపు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరందరికీ గతంలో ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ద్వారా ప్రభుత్వ వైద్యులే నెలకు రెండుసార్లు పాఠశాలలకు వెళ్లి వైద్యపరీక్షలు చేసేవారు. విద్యార్థులకు ఉన్న వ్యాధులను గుర్తించి చికిత్స చేయడం, వారికి సాధ్యంకాని వ్యాధులుంటే ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయడం చేసేవారు. ఈ ప్రోగ్రామ్ను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ధనుష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ జిల్లాలో 40 వైద్యబృందాలను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు పారా మెడికల్ సిబ్బంది ఉంటారు. ఒక్కో బృందం ప్రతి రోజూ 120 మంది విద్యార్థులను పరీక్షించి చికిత్స చేయాలి. విద్యార్థులను పూర్తి స్థాయిలో 30 రకాల వ్యాధుల గురించి పరీక్షించి, వారికి సాధ్యంకాని వ్యాధులుంటే రెఫరల్ ఆసుపత్రులకు పంపించాలి. ఈ మేరకు ఒక్కో విద్యార్థికి రూ.47.50 ఇచ్చే విధంగా ఒప్పందం చేసినట్లు సమాచారం. నియామకాలూ మొదలు కాలేదు ఈ ప్రోగ్రామ్ కింద జిల్లాలో 40 బృందాల్లో 80 మంది వైద్యులు, 80 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. జూన్ 12వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. కాని ఇప్పటి వరకు ధనుష్ ఇన్ఫోటెక్ సంస్థ నియామకాలు చేపట్టలేదు. నియామకాలతో పాటు 40 మొబైల్ వాహనాలను సైతం ఆ సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్కు సంబంధించి ఎంఓయూ, గైడ్లైన్స్ జిల్లా అధికారులకు కూడా చేరలేదు. ఎంపిక చేశారు..ఉత్తర్వులు ఇవ్వలేదు ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ కింద రెండేళ్ల క్రితం జిల్లాలో 40 వైద్యబృందాల కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టారు. ఈ మేరకు 15 మంది అల్లోపతి, 15 ఆయుర్వేద వైద్యులను ఎంపిక చేశారు. కానీ ఇప్పటి వరకు వారికి నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఓ వైపు ఆర్బీఎస్కే కింద ఎంపికయ్యామన్న ఆనందం ఉన్నా రెండేళ్లైనా నియామకపు ఉత్తర్వులు ఇవ్వక పోవడంపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయి వివరాలు అందలేదు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ను ధనుష్ అనే సంస్థకు ఇచ్చారని తెలిసింది. వారు చేసే ప్రోగ్రామ్లో భాగంగా రోజూ 40 వాహనాలు వెళ్తున్నాయా లేదా, రోజూ ఒక్కో బృందం 120 మంది విద్యార్థులను పరీక్షిస్తుందా లేదా అని పరిశీలించాలని చూచాయగా మాత్రమే మాకు చెప్పారు. ప్రోగ్రామ్ గురించి ఎంఓయూ, నియమ నిబంధనలకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇంకా అందలేదు. – హేమలత, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ జిల్లా కో ఆర్డినేటర్ -
ప్రైవేట్ టీచర్ కిడ్నాప్ కలకలం
కణేకల్లు : ఓ ప్రైవేట్ టీచర్ కిడ్నాప్ కలకలం రేపింది. ప్రయాణికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం చేరవేయడంతో 45 నిమిషాల్లోనే కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వివరాల్లోకెళితే.. రాయదుర్గానికి చెందిన యువతి కణేకల్లు మండలం ఆలూరులోని ప్రైవేట్ స్కూలులో టీచరుగా పనిచేస్తోంది. విధినిర్వహణలో భాగంగా గురువారం ఉదయం 7గంటలకు రాయదుర్గంలో ఆర్టీసీ బస్సు ఎక్కింది. సరిగ్గా 7.40గంటలకు ఆలూరు వద్ద బస్సు దిగి స్కూలు వద్దకు నడుచుకుంటూ వెళుతోంది. కణేకల్లులోని ద్విచక్రవాహన షో రూం యజమాని ముగ్గురు స్నేహితులతో కలిసి ఏపీ31 సీజే 2349 నంబర్ గల ఇన్నోవా కారులో వచ్చి టీచరును బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకున్నారు. నన్ను కాపాడండి అంటూ ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంకా ముందుకు కదలని ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు గమనించి వచ్చేలోపు కారు స్పీడుగా వెళ్లిపోయింది. వెంటనే జరిగిన విషయాన్ని ఎస్ఐ రామరావుకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. ఆయన సమీపంలోని బెళుగుప్ప, రాయదుర్గం, కళ్యాణదుర్గంతోపాటు జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లనూ అప్రమత్తం చేశారు. దుండగులు కణేకల్లువైపు వచ్చి షిర్డిసాయిబాబా దేవాలయం వద్ద కుడివైపున కొత్తపల్లి మీదుగా వెళ్లారు. కళ్యాణదుర్గం వెళ్లే అవకాశముండటంతో అక్కడి పోలీసులు వాహనానికి ఎదురుగా వచ్చారు. అంతలోనే రాయదుర్గం ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వాహనాన్ని ఛేజ్ చేయగా.. రమనేపల్లి వద్ద దుండగులు పట్టుబడ్డారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, కణేకల్లు ఎస్ఐ రామరావులు ఘటనస్థలానికెళ్లిన దుండగులను అదుపులో తీసుకున్నారు. అక్కడే గంటన్నర సేపు విచారణ చేపట్టారు. అనంతరం కణేకల్లు పోలీసుస్టేషన్కు బాధితురాలిని, కిడ్నాపర్లుగా భావిస్తున్న వారిని తీసుకొచ్చారు. కిడ్నాప్ కాదంటూ డీఎస్పీ క్లీన్చిట్ ప్రైవేట్ స్కూల్ టీచర్ది కిడ్నాప్ కాదంటూ డీఎస్పీ వెంకటరమణ క్లీన్చిట్ ఇచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్.. సదరు అబ్బాయి ప్రేమించుకుంటున్నారన్నారు. అయితే అబ్బాయికి ఇదివరకే పెళ్లయ్యిందని, భార్యకు విడాకులిస్తున్నాడని తెలిపారు. రెండో పెళ్లి చేసుకునే విషయమై మాట్లాడేందు కోసమే టీచర్ను కారులో తీసుకెళ్లాడని చెప్పారు. తననెవరూ కిడ్నాప్ చేయలేదంటూ టీచర్ కూడా చెప్పడంతో కేసును ఇంతటితో క్లోజ్ చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు. ఇరువురి స్టేట్మెంట్లు రికార్డు చేసిన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాళ్లను ఇళ్లకు పంపారు. భారీ ప్యాకేజీ! కిడ్నాప్ ఘటన విషయమై ఓ మంత్రి సోదరుడు పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చినట్లు సమాచారం. కిడ్నాప్ చేసినోడు తమకు కావల్సిన వాడేనని కేసుల్లాంటివి లేకుండా చూడాలని హకుం జారీ చేసినట్లు తెల్సింది. అంతేకాక ఈ కేసులో హెల్ప్ చేసిన పోలీసులకు మంత్రి సోదరుడు కిడ్నాపర్లుగా భావిస్తున్న వారిని నుంచి భారీ ప్యాకేజీ ఇప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐ రామరావును వివరణ కోరగా ఆరోపణలను కొట్టిపారేశారు. -
ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఉపసంహరించుకోవాలి
ఎదులాపురం(ఆదిలాబాద్) : ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యం లో బుధవారం ఆందోళన చేపట్టారు. స్థానిక బస్టాండ్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సం దర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఓ వైపు కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామంటూనే మరో వైపు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందన్నా రు. యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చిలవిడిగా అనుమతులిస్తోందని విమర్శించారు. ఫలితంగా ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడే పరిస్థి తి ఏర్పడుతోందన్నారు. కార్యక్రమంలో టీఏవీఎస్ జిల్లా అధ్యక్షుడు కోట్నాక రాహుల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆత్రం నగేశ్, కన్వీనర్ సుప్రియ, టీవీవీ జిల్లా అధ్యక్షుడు బి.రాహుల్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి పి.కళావతి, టీఏవీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అన్నమెల్ల కిరణ్, టీవీవీ, పీడీఎస్యూ నాయకులు శివ, అజయ్, తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకులను ప్రైవేటీకరించబోం
న్యూఢిల్లీ: పీఎన్బీ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రి జైట్లీ తోసిపుచ్చారు. రాజకీయంగా ఆమోదయోగ్యంకాని ఈ నిర్ణయాన్ని తమ ప్రభుత్వమూ తీసుకోబోదన్నారు. ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో జైట్లీ శనివారం ప్రసంగించారు. ‘ప్రైవేటీకరణకు రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. దీంతోపాటుగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు చేయాలి. నా అభిప్రాయం ప్రకారం భారతీయ రాజకీయాలు ఈ ఆలోచనకు అంగీకరించవు. ఇది సవాలుతో కూడుకున్న నిర్ణయం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సర్కారు వాటా 50 శాతానికన్నా తక్కువకు తగ్గించుకోవాలని ఫిక్కీ, అసోచామ్లు సూచిస్తున్నాయి. తద్వారా డిపాజిటర్లు, భాగస్వాములపై బ్యాంకుల జవాబుదారీ పెరుగుతుందంటున్నాయి. ఈ నేపథ్యంలోనే జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉన్నతస్థాయి ఉదాసీనతే.. పీఎన్బీ కుంభకోణానికి బ్యాంకులు, వాటి ఆడిటర్లు, రెగ్యులేటర్లు వ్యవహరించిన తీరే కారణమని జైట్లీ మండిపడ్డారు. వీరి ఉదాసీనత వల్లే రూ.11,400 కోట్ల భారీ మోసం జరిగిందన్నారు. కుంభకోణాలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవటంలో ఉపేక్షించబోమన్నారు. ‘బ్యాంకుల్లోని కొన్ని విభాగాల్లో విలువల్లేకపోవటం, వివిధ దశల్లో పనిచేసే ఆడిటింగ్ వ్యవస్థ సీరియస్గా లేకపోవటం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఉన్నత స్థానాల్లో పనిచేసే వారు కూడా వ్యవస్థలో ఏం జరుగుతుందో గుర్తించలేకపోవటం దారుణం. ఆర్థిక వ్యవస్థలో రెగ్యులేటర్ల పాత్ర కీలకం. బ్యాంకుల్లో ఏక్షణం, ఎక్కడ ఏమేం జరుగుతుందో మూడోకన్నుతో చూడాల్సిన బాధ్యత వీరిది. కానీ భారత వ్యవస్థలో రెగ్యులేటర్ల బదులు రాజకీయ నేతలు జవాబుదారీగా మిగిలిపోతున్నారు’ అని జైట్లీ పేర్కొన్నారు. వ్యాపారస్తులు నీతి, నిజాయితీతో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. తప్పుచేసిన వారెవరినీ వదలబోమని ఆయన స్పష్టం చేశారు. -
ముగ్గురు విద్యార్థుల పరార్
ఇళ్ల నుంచి పారిపోయిన వైనం రాయగడ : రాయగడ సెంట్జేవియర్ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈ నెల 19వ తేదీన తమ ఇళ్లల్లో ప్రైవేటు కు వెళతాం అని చెప్పి పరార్ అయినట్టు తెలిసింది. రాయగడ రైతులకాలనీ, న్యూకాలనీ, రైల్వే కాలనీలో ఉంటున్న కె.అవినాష్, ఎస్.శ్రీనివాసు, టి.పవన్ అనే ముగ్గురు విద్యార్థులు స్నేహితులు. మంగళవారం వీరు ముగ్గురు ప్రైవేటుకు వెళతామని ఇంట్లో చెప్పి వెళ్లిపోయారు. రాత్రి అయినా తిరిగి ఇళ్లకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే వీరు వినియోగించిన మోటార్సైకిల్ రాయగడ బస్స్టాండులో లభించింది. ఈ ముగ్గురు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లి ఉంటారని వారు కుటుంబీకులు అనుమానిస్తున్నారు. అయితే వీరి సెల్ఫోన్ నెట్వర్కు ఆధారంగా హట్శశికళ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనపై అవినాష్ తల్లి సూజాత, ఇతర విద్యార్థుల కుటుంబ సభ్యులు రాయగడ పోలీసులను బుధవారం ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. దీనిపై ఐఐసీ ఆర్.కె.పాత్రో మాట్లాడుతూ పిల్లల ఆచూకీ తెలుసుకుంటామని హామీ ఇచ్చారు. -
టాటా సన్స్ ప్రతిపాదనపై మిస్త్రీ ఫైర్
సాక్షి, ముంబై: టాటా గ్రూపులోని టాటా సన్స్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేట్ లిమిటెడ్గా అవతరించనుంది. టాటా సన్స్ సంస్థను ప్రైవేట్ లిమిటెడ్గా మార్చే ప్రతిపాదనను మైనారిటీ షేర్హోల్డర్ల అనుమతి కోరేందుకు కంపెనీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్లలో మార్పులు చేయాల్సి ఉండగా.. దీనికి వాటాదారుల అనుమతి కంపెనీ కోరనుంది. అయితే మిస్త్రీ కుటుంబానికి చెందిన పెట్టుబడి సంస్థ సైరస్ ఇన్వెస్ట్మెంట్ ప్రెవేట్ లిమిటెడ్ ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది తమ హక్కుల అణచివేసేందుకు తీసుకున్న చర్య అంటూ బోర్డు కు ఒక లేఖ రాసింది. ఈ ప్రతిపాదన మైనారిటీ వాటాదారులను మరింత అణిచివేసే "మరొక ఆయుధం" గా పేర్కొంది. మరోవైపు టాటా సన్స్ ఒక ప్రైవేటు కంపెనీగా మారితే, మైనారిటీ వాటాదారుల హక్కులను మరింత నిరుత్సాహపరుస్తుందని ప్రాక్సీ సలహా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. ఇది ఒక తిరోగమన దశ అని పేర్కొన్నారు. ఒకవేళ టాటాసన్స్ ప్రతిపాదనను షేర్హోల్డర్లు ఆమోదిస్తే, టాటా సన్స్ లిమిటెడ్ నుంచి టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్గా కంపెనీ పేరు మారుతుంది. సెప్టెంబర్ 21న వార్షిక సర్వ సభ్య సమావేశం జరగనుండగా.. దీనికి ముందుగా ఈ ప్రతిపాదన రావడం విశేషం. అయితే.. దీనికి నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ ఆమోదం రావాల్సి ఉంటుంది. దీంతో పాటు 75 శాతం మైనారిటీ వాటాదారులు కూడా అనుమతించాలి. సైరస్ మిస్త్రీ ని టాటా సన్స్ బోర్డు ఛైర్మన్గా తొలగించిన తరువాత దాదాపు ఒక సంవత్సరం తరువాత సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. -
రక్షణలో ప్రైవేటు భాగస్వామ్యం
ఖరారుచేసిన రక్షణ శాఖ న్యూఢిల్లీ : భారత్లోని ప్రైవేట్ కంపెనీలు విదేశీ సంస్థల సహకారంతో యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, సైనిక వాహనాలను దేశీయంగా తయారుచేసే విషయమై కేంద్రం రూపొందించిన వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా(ఎస్పీఎం)కు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి జైట్లీ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) శనివారం ఈ ఒప్పందాన్ని ఖరారుచేసింది. ఆర్థిక శాఖ సమీక్షించాక ఎస్పీఎం కేబినెట్ పరిశీలనకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ జాబితా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, సైనికవాహనాలకే పరిమితమైనప్పటికీ తదుపరి దశలో మరిన్ని రక్షణ ఉత్పత్తుల్ని చేర్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతమిచ్చేలా..దేశీయంగా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ఈ నమూనా దోహదపడుతుందని అధికారులు తెలిపారు. భారత కంపెనీలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పారదర్శకంగా, పోటీతత్వంతో పనిచేసేలా నూతన విధానం ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల రక్షణ మంత్రి జైట్లీతో సమావేశమైన అశోక్ లేలాండ్, మహీంద్ర అండ్ మహీంద్ర తదితర సంస్థలు ప్రస్తుతమున్న జాబితాలో మరిన్ని రక్షణ ఉత్పత్తులను చేర్చాలన్నాయి. ఒప్పందం ఖరారయ్యాక సదరు సంస్థలపై న్యాయవిచారణ, తనిఖీలకు వీలు కల్పించాలని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించారు. -
తాయిలాల గాలం
విద్యార్థుల వేటలో ప్రైవేటు స్కూళ్లు విద్యాసంవత్సరం ముగియకుండానే అడ్మిషన్ల హడావుడి ఫీజుల్లో రాయితీలంటూ వల రాయవరం (మండపేట) : విద్యాసంవత్సరం పూర్తవకుండానే ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల వేటలో పడ్డాయి. అనేక రాయితీలు ప్రకటిస్తూ చిన్నారుల తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో విద్యా సంవత్సరం ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేస్తున్నాయి. గతంలో పరీక్షల అనంతరం వేసవి సెలవుల్లో విద్యార్థుల వేట ప్రారంభించేవి. ఈ ఏడాది జనవరి నుంచే ఈ కార్యక్రమం మొదలైంది. గతేడాది అక్టోబరులోనే సేకరించిన విద్యార్థుల జాబితా ఆధారంగా పీఆర్వోలు తల్లిదండ్రులను కలిసి తమ పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను వివరిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడ్డారు. రాయితీలు..ఫ్రీలు.. విద్యా సంవత్సరం ముందుగానే మా పాఠశాలలో చేర్పిస్తే ఫీజులో 10 శాతం రాయితీ ఇస్తున్నామని కార్పొరేట్ పాఠశాలలు చెబుతున్నాయి. ముందుగా కొంత సొమ్ము చెల్లించి సీటు రిజర్వు చేసుకోవాలని తల్లిదండ్రులపై పీఆర్వోలు ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఎల్కేజీలో ఇప్పుడే చేర్పిస్తే ఈ నాలుగు నెలలు ఫీజులు చెల్లించనక్కర లేదని చెబుతున్నారు. దీని వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం మార్చితోనే ముగియనుంది. ఈ పరిస్థితుల్లో ముందుగానే విద్యార్థులను చేర్చుకుంటే వచ్చే విద్యా సంవత్సరంలో తమ పాఠశాల వదిలి వెళ్లరనే ముందస్తు ఆలోచనతో కార్పొరేట్,ప్రైవేటు పాఠశాలల ఆలోచన చేస్తున్నాయి. మేల్కొనకుంటే నష్టమే.. ఇంగ్లిషు మీడియం మోజులో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల ఎన్రోల్మెంట్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యా సంవత్సరం ముగియకుండానే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఎన్రోల్మెంట్పై దృష్టి సారించాల్సి ఉంది. లేకుంటే వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ఏటేటా తగ్గుతున్నాయి. ‘మన బడి’కి ఆదరణ లభించేనా! మన ఊరు - మన బడి కార్యక్రమానికి ఈ ఏడాది ఆశించినంతగా ఆదరణ లభిస్తుందా? అనే సందేహాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ ఫిబ్రవరి నుంచే విద్యార్థులను చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఉంటే సత్ఫలితాలు ఉండేవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గతేడాది 36,200 మంది చిన్నారులను చేర్చుకున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 40 వేల మంది చిన్నారులను చేర్చుకోవడం లక్ష్యంగా చెబుతున్నా అది ఏ మేరకు సఫలీకృతమవుతుందన్నది వేచి చూడాల్సిందే. -
సీసీఈ విధానాన్ని మార్చాలి
జిల్లా ఏపీపీఎస్ఏ సర్వసభ్య సమావేశం తీర్మానం తాళ్లరేవు : నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) వి«ధానాన్ని ప్రభుత్వం మార్చాలని జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీపీఎస్ఏ) డిమాండ్ చేసింది. సూరంపాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా అధ్యక్షుడు తమ్మయ్యనాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశం వివరాలను జిల్లా జనరల్ సెక్రటరీ, తాళ్లరేవు మార్గదర్శి హైస్కూల్ కరస్పాడెంట్ పెమ్మాడి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీపీఎస్ఏ రాష్ట్ర అ«ధ్యక్షుడు కేఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ సీసీఈ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఆరు నుంచి 9వ తరగతి పరీక్షలను ఏప్రిల్లోనే నిర్వహించాలని కోరారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పాటించాలని తదితర సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఆదిత్యా విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఏపీపీఎస్ఏ బలోపేతానికి పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలని కోరారు. తమ్మయ్యనాయుడు మాట్లాడుతూ సమస్యలు తెలిపితే జిల్లా కమిటీ తరఫున పోరాడతామన్నారు. పెమ్మాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూటీఎఫ్ తరహాలో ఏపీపీఎస్ఏ సంఘానికి నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రగౌరవ అధ్యక్షురాలు వసంతాప్రసాద్, రాష్ట్ర కన్వీనర్ చౌదరి, ప్రధాన కార్యదర్శి మురళీమనోహర్, రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజు, ఆదిత్య విద్యా సంస్థల కరస్పాండెంట్ మధులత తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు ఉద్యోగిని దోచుకున్న దుండగులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం అప్పటికప్పుడు కేసు కట్టి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తెనాలి రూరల్ : ఆటోలో ఇంటికి వెళ్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగిపై దాడి చేసి, ల్యాప్టాప్, నగదును దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఘటన జరిగిన నాడే ఫిర్యాదు చేయగా, గోప్యంగా ఉంచిన పోలీసులు సోమవారం హడావిడిగా నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి సేకరించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణంలోని ఐతానగర్కు చెందిన కానిస్టేబుల్ కొడుకైన దాసరి సాగర్ కారు కంపెనీలకు సంబంధించి నెల్లూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో సర్వీస్, కంప్యూటరైజేషన్ శిక్షకుడిగా పని చేస్తున్నాడు. గత నెల 24వ తేదీ రాత్రి ఉద్యోగం నుంచి తిరిగి వచ్చి, ఆటోలో ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఇద్దరు ఆటోలోకి ఎక్కి సాగర్పై దాడి చేసి, అతని ల్యాప్టాప్, నగదును లాక్కున్నారు. కదులుతున్న ఆటోలో నుంచి దూకేసిన బాధితుడు అదే రోజు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు నిందితులను ఐతానగర్కే చెందిన మెరుగుమాల కిరణ్ అలియాస్ కిన్నెట్టు, తూమాటి విజయ్కుమార్లుగా గుర్తించి, సోమవారం అరెస్ట్ చేశారు. -
విద్యాసంస్థల నిర్లక్ష్యం అపరిమితం!
ఏలూరు అర్బన్ : విద్యను పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చేసిన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బస్ ఫీజుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా పిల్లల రక్షణకు సరియైన చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీఏ అధికారులు అనుమతించిన పరిమితి నిబంధనను తుంగలో తొక్కుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పైగా విద్యార్థులకు ప్రమాదం కలిగిస్తున్నా సంబంధిత ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నామమాత్రపు దాడులకే పరిమితమవుతుండడం విమర్శలకు తావిస్తోంది. గత చేదు అనుభవాలు l గతంలో పెదవేగి మండలంలోని ఒక విద్యా సంస్థ కేవలం 45 మంది విద్యార్థులను తరలించేందుకు అనుమతి ఉన్న బస్లో ఏకంగా 130 మంది చిన్నారులను తరలించేది. పలుమార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎట్టకేలకు తల్లిదండ్రులు ధర్నాకు దిగడంతో యాజమాన్యం దిగొచ్చింది. l గత యేడాది నగరానికి చెందిన ప్రముఖ విద్యా సంస్థలు ఇదే విధంగా తమ కాలేజీలో చదువుకుంటున్న దూరప్రాంత విద్యార్థులను పరిమితికి తరలించేవారు. కేవలం 36 మంది మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉన్న వ్యాన్లో వందమందికి పైగా విద్యార్థులను తరలించడం గుర్తించిన నాటి ట్రాఫిక్ డీఎస్పీ పి.భాస్కరరావు బస్ను ఆపివేశారు. అందులో ఉన్న విద్యార్థులను లెక్కించగా ఏకంగా నూట ఐదుగురు ఉన్నారు. డీఎస్పీ నిర్ఘాంతపోయారంటే పరిస్థితి ఎంద ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. l స్థానిక తంగెళ్లమూడిలో ఉన్న ప్రముఖ పాఠశాల బస్లో ఇదేవిధంగా అపరిమితంగా విద్యార్థులను ఎక్కించడంతో డ్రైవర్కు స్టీరింగ్ సైతం తిప్పే అవకాశం లేకపోయింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి బస్సు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోయారు. l జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యాసంస్థ బస్లో పరిమితికి మించి విద్యార్థులు ప్రయాణిస్తున్న సమయంలో బోల్తా కొట్టడంతో 27 మంది పిల్లలకు గాయాలయ్యాయి. ఇవిగో నిబంధనలు విద్యార్థులను తరలించే బస్లలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వ జీవో 35లో స్పష్టంగా ఉందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఎస్ మూర్తి ఇలా వివరించారు. l ఏదైనా ప్రమాదం సంభవిస్తే విద్యార్ధులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ బస్సులో ఉండాలి. కాలేజీ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆ బాక్స్లో ఉండాల్సిన మందుల పరికరాలు ఉన్నాయా? లేవా? అనే దానిపై 30 రోజులకు ఒకసారి పరీక్షించాలి. l బస్లో మంటలు చెలరేగితే వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిలిండర్ ఉండాలి. l బస్ బోల్తా కొడితే అందులో ఉన్న చిన్నారులను రక్షించేందుకు ఎమర్జెన్సీ డోర్ ఉండాలి. l చిన్నారులు కిటికీల గుండా తలలు, చేతులు బయటపెట్టేందుకు ఆవకాశం లేకుండా కిటికీలకు మెష్లు ఏర్పాటు చేయాలి. l సీనియర్ డ్రైవర్లను నియమించాలి. అదే సమయంలో వారి నుంచి ఫిజికల్ ఫిటెనెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. 60 ఏళ్లకు పైబడిన వయసు మళ్లిన వారిని డ్రైవర్లుగా నియమించకూడదు. l చిన్నారులు బస్లోకి ఎక్కేందుకు, దిగేందుకు అనువుగా బస్ ఫుట్బోర్డు మొదటి మెట్టు నేల నుంచి 325 మి.మీల ఎత్తులో అమర్చాలి. l అన్ని బస్లలో అటెండర్లు ఉండాలి. వారు పిల్లలు దిగే సమయంలో లోపలికి ప్రవేశించే సమయంలో జాగ్రత్తగా సహకరించాలి l విద్యార్థులు తమ స్కూలు బ్యాగులను పెట్టుకునేందుకు లగేజీ స్థలం ఉండాలి. ఈ నిబంధనలను పాటించని బస్ల విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మూర్తి హెచ్చరించారు. -
20 సర్కారు చేప విత్తన చెరువులు ప్రైవేటుకు...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని చేప విత్తన చెరువులను ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. మొత్తం 28 చేప విత్తన చెరువుల్లో నాలుగైదు మాత్రమే ఉనికిలో ఉన్నాయని... మిగిలినవి పడావుపడి పోయినందున వాటిలో 20 చెరువులను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఆ చెరువులను ఐదేళ్లకు లీజుకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. త్వరలో వీటికి టెండర్లు ఖరారు చేయనున్నారు. అయితే వీటిని రెండు విధాలుగా పీపీపీ పద్ధతిలో లీజుకిచ్చే అవకాశాలున్నాయి. ఒకటి పూర్తిగా లీజుకు ఇవ్వడం... రెండోది లీజుతోపాటు కొంత విత్తనాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా మరో పద్ధతి ద్వారా టెండర్ ఖరారు చేయడం. ఏది అనుకూలమో దానికి అనుగుణంగా లీజుకు ఇవ్వనున్నారు. -
పీహెచ్సీలకు పురుటి నొప్పులు
ప్రసూతి కేసులు ప్రైవేటు ఆస్పత్రులకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మృగ్యం అన్నిచోట్లా అధ్వాన్న పరిస్థితులే సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు ప్రసూతి సేవలు అందించలేక చేతులెత్తేస్తున్నాయి. కాన్పు కోసం వచ్చే గర్భిణులను ప్రైవేటు ఆస్పత్రులకు తరిమేస్తున్నాయి. జిల్లాలో ప్రసూతి వైద్యసేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 79 ఉండగా.. మూడు ఏరియా ఆస్పత్రులు, 11 కమ్యూనిటీ వైద్య కేంద్రాలతోపాటు ఏలూరులో జిల్లా కేంద్ర ఆస్పత్రి ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు జిల్లా వ్యాప్తంగా 41,372 ప్రసవాలు నమోదు కాగా.. వీటిలో 19,622 జననాలు మాత్రమే ప్రభుత్వాస్పత్రుల్లో జరిగాయి. 21,750 మంది గర్భిణులు ప్రసూతి సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై ’సాక్షి’ బృందం బుధవారం పరిశీలన జరపగా.. వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టాయి. ప్రైవేటు సేవలే దిక్కు ప్రసవాలన్నీ ప్రభుత్వాస్పత్రుల్లోనే జరగాలని చెబుతున్నా.. వాటిలో సదుపాయాల లేమి, వైద్యుల కొరత కారణంగా గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించక తప్పని పరిస్థితులు తలెత్తుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గర్భిణులు అత్యవసర సమయాల్లో పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ’ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం.. తల్లీబిడ్డ సురక్షితం’ అంటూ అధికారులు బోర్డులు తగిలించి చేతులు దులుపుకుంటున్నారు. గర్భిణులకు ప్రసూతి సేవలు, శస్త్ర చికిత్స, మందులు, ఆరోగ్య పరీక్షలు, ఆహారం, రక్తం, రవాణా సదుపాయాలన్నీ ఉచితమని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు ఇస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకున్న తల్లులకు జననీ సురక్ష యోజన కింద రూ.వెయ్యి పారితోషికం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆస్పత్రులకు భవనాలు నిర్మించినా ప్రసూతి సమయంలో అవసరమైన సర్జికల్ మెటీరియల్ అందుబాటులో లేదు. చాలాచోట్ల పుట్టిన బిడ్డల్లో కొందరిని అత్యవసరంగా ఇంక్యుబేటర్ సేవలు అవసరమవుతోంది. అలాంటి సేవలు చాలాచోట్ల అందుబాటులో లేవు. వార్మర్స్, ఊయలను నేటికీ ప్రభుత్వం అందించలేదు. చాలాచోట్ల వైద్య పరికరాలు బిగించక నిరుపయోగంగా మారాయి. దీంతో పీహెచ్సీలకు వచ్చే గర్భిణుల్లో అధిక శాతం మందిని ప్రైవేట్ ఆస్పత్రులను రిఫర్ చేస్తున్నారు. బాలింతలకు, వారితో వచ్చే కుటుంబీకులకు భోజనం సదుపాయం కల్పించడంతోపాటు పాలు ఇవ్వాల్సి ఉంది. ప్రసవాల సంఖ్య ఆధారంగా, స్థానికంగా ఉన్న సౌకర్యాలు బట్టి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. లేదంటే ఆ ఖర్చులను కూడా చెక్కుల రూపంలో చెల్లిస్తున్నారు. బిడ్డ సంరక్షణకు చైల్డ్ కిట్ను ప్రస్తుతం అందజేస్తున్నారు. ఎక్కడ చూసినా సమస్యలే.. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో రూ.10 కోట్లు వెచ్చించి నిర్మించిన 100 పడకల మాతా,శిశు సంరక్షణ కేంద్రంలో వసతులున్నా వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా అలంకారప్రాయంగా మారింది. 11 మంది గైనకాలజిస్ట్లు అవసరం కాగా.. కేవలం నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఆపరేషన్ చేసే సమయంలో గర్భిణికి మత్తు ఇచ్చే వైద్యులు లేనేలేరు. ఆపరేషన్ థియేటర్లో వైద్యులకు సహకరించేందుకు ఆరుగురు టెక్నీషియన్ అవసరం కాగా, ఆ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. అత్యవసర సమయాల్లో విద్యుత్ కోత విధిస్తే.. జనరేటర్ కూడా లేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చాటపర్రు, గుడివాకలంక కేంద్రాల్లో ప్రసూతి సేవలు అందడం లేదు. అక్కడ వైద్య పరీక్షలకే పరిమితం కావడంతో ప్రసవం కోసం గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకు 3 నుంచి 5 డెలివరీలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ పీహెచ్సీలో ఏడాదిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. డాక్టర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీరవాసరం, కొణితివాడ పీహెచ్సీల్లో ఆపరేషన్ థియేటర్లు ఉన్నా.. పూర్తిస్థాయి పరికరాలు, గైనకాలజిస్ట్లు లేరు. ఆపరేషన్లు అవసరమైతే పాలకొల్లులోని సీహెచ్సీకి గర్భిణులను పంపిస్తున్నారు. 24 గంటలూ ప్రసూతి సేవలు అందించే కాళ్ల పీహెచ్సీ భవనం శిథిలావస్థకు చేరింది. ఇందులోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కొరత కూడా ఉంది. ఫస్ట్ ఏన్ఎం పోస్టులు 5, సెకండ్ ఏఎన్ఎం పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. ఒక స్టాఫ్ నర్స్, ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను సైతం భర్తీ చేయాల్సి ఉంది. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం, మాధవరం గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వెంకట్రామన్నగూడెం పీహెచ్సీలో సాధారణ ప్రసవాలకు మాత్రమే సేవలందిస్తున్నారు. అత్యవసర కేసులను తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. ఈ రెండు పీహెచ్సీలలో ప్రసవ ఆపరేషన్ (సిజేరియన్)లకు సదుపాయాలు లేవు. భీమడోలు మండలం పూళ్ల పీహెచ్సీలో 16 మంది పని చేయాల్సి ఉండగా ఏడుగురు ఏఎన్ఎంలు మాత్రమే ఉన్నారు. స్టాఫ్ నర్సు పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పురుడు పోసుకున్న 66 మందిలో జననీ సురక్ష యోజన ప్రోత్సాహకం నిమిత్తం 48 మంది వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదయ్యాయి. బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం, కేఆర్పురం, నందాపురం, అంతర్వేదిగూడెం, దొరమామిడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే, వీటిలో గైనకాలజిస్ట్, పిల్లలకు వైద్యసేవలందించే డాక్టర్ల పోస్టులు ఒక్కటి కూడా భర్తీ కాలేదు. భీమవరం ప్రభుత్వాస్పత్రిలో బాలింతలను ఉంచే గదులు అధ్వానంగా ఉన్నాయి. బూజులు పట్టిన గోడలు, పగిలిపోయిన కిటికీలు, చిరిగిపోయి గట్టిపడిన మంచాలతో చూడటానికే ఇబ్బందిగా ఉన్నాయి. ఽచిరిగిన మంచాలపైనే బాలింతలు ఇబ్బందులు పడుతూ పడుకుంటున్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గంలోని చాలా ఆస్పత్రుల్లో వైద్యుల కొరత అధికంగా ఉంది. సౌకర్యాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. చింతలపూడి మండలం రాఘవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులున్నా ఆపరేషన్ థియేటర్ లేదు. -
జిల్లా ఆసుపత్రి ఇక ప్రైవేట్!
– సీఎం గ్రీన్ సిగ్నల్ – ధ్రువీకరించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైస్ చైర్మన్ - ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో అసంతృప్తి నంద్యాల: చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించినట్లే రూ.90కోట్ల విలువైన స్థానిక ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా స్థాయి ఆసుపత్రిని కూడా ప్రైవేటు పరం చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ సీఎల్ వెంకటరావు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో జీఓ కూడా విడుదల కావచ్చని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసుపత్రులను ప్రైవేటు పరం చేసేందుకు ఏడాదిన్నర క్రితమే ప్రతిపాదనలు రూపొందించింది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీఓ నెం.125, 14–10–2015) అపోలోకు అప్పగించింది. తర్వాత రాష్ట్రంలోని 9 జిల్లా స్థాయి ఆసుపత్రులను ప్రైవేటు పరం చేయాలని ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందులో నంద్యాలలోని జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి. విపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆ ప్రతిపాదనలను కొంత కాలం పెండింగ్ పెట్టారు. మళ్లీ ఆ ప్రతిపాదనను ఇటీవల వెలుగులోకి తీసుకొచ్చారు. స్పష్టం చేసిన స్వచ్చాంధ్ర కార్పొరేషన్ వైస్ చైర్మన్ రాష్ట్రంలోని 8 జిల్లా ఆసుపత్రులను ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ సీఎల్ వెంకటరావు ప్రకటించారు. ఆయన రెండు రోజుల క్రితం అమరావతిలో జరిగిన ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, ప్రైవేటు అసోసియేషన్ల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని నంద్యాలతో సహా 9 జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుకు ఇవ్వనున్నారని, ఇకపై పీపీపీ పద్ధతిలో వైద్య సేవలు అందుతాయని చెప్పారు. దీనిపై జనవరిలో ప్రభుత్వం జీఓ జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి రూ.90కోట్ల ఆస్తి ప్రైవేటు చేతిలోకి.. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 200 పడకలు, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో 150 పడకలు ఉన్నాయి. ఆసుపత్రికి రూ.7.35ఎకరాల స్థలం ఉంది. మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.70కోట్లు పైమాటే. ఆసుపత్రి భవనం, పరికరాలు, దాదాపు రూ.20కోట్లకు పైగా విలువ చేసే అవకాశం ఉంది. అంతటి విలువైన ఆసుపత్రిని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంకావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. -
నేటి నుంచి ప్రైవేట్ వ్యవసాయ కళాశాలల కౌన్సెలింగ్
గుంటూరు రూరల్ : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ పరి«ధిలో అనుమతులు కలిగిన ప్రైవేటు కళాశాలల్లో సీట్ల భర్తీకి గురువారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించానున్నామని వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ప్రకాశం జిల్లా మార్కాపూర్లోని ఎన్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రైవేటు వ్యవసాయ కళాశాలకు అనుమతులు ఇచ్చామన్నారు. గతంలో అనుమతులు ఇచ్చిన 5 ప్రైవేటు కళాశాలలతో కొత్తగా అనుమతులు ఇచ్చిన కళాశాలకు ఎంసెట్ ప్రాతిపదికన కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. గతంలో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలతో సర్టిఫికెట్లను తీసుకొని కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. -
ప్రైవేట్ చేతుల్లోకి ట్రాన్స్కో !
సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. తొలుత అమరావతి పరిసర ప్రాంతాల్లోని రూ. 1,300 కోట్ల విలువైన ఏపీ ట్రాన్స్కో పనులన్నీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధంచేసింది. ఆ తర్వాత దశల వారీగా అన్ని విద్యుత్ సంస్థల నిర్వహణను ప్రైవేటు కంపెనీల చేతిలో పెట్టాలని నిర్ణరుుంచుకుంది. దీనిపై శనివారం గుట్టు చప్పుడు కాకుండా ‘బూమ్’(బిల్డ్ ఆపరేట్ ఓన్ మెరుుంటెన్స) నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్కోకు సంబంధం లేకుం డా ట్రాన్సమిషన్ లైన్లు, సబ్ స్టేషన్లను ప్రైవేట్కు అప్పగించాలని భావించింది. ఈ విషయంలో మంగళవారం బడా కంపెనీలతో విద్యుత్ ఉన్నతాధికారులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పెద్దలకు ఈ బడా కంపెనీలు భారీ మొత్తంలో ముట్టజెప్పేందుకు ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎంతో ప్రైవేట్ సంస్థల ప్రతినిధుల భేటీ నూతన రాజధాని నలువైపుల నుంచి విద్యుత్ సరఫరా ఉండేలా ప్రభుత్వం పథకాలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఏపీ ట్రాన్స్కోనే చేపడుతుందని సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారు. అరుుతే వారం రోజుల క్రితం కొన్ని ప్రైవేటు సంస్థల ప్రతినిధులు సీఎంను కలవడంతో ప్లాన్ మారిపోరుుంది. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ, నిర్వాహణ బాధ్యత ప్రైవేటు వ్యక్తులకే అప్పగించాలని నిర్ణరుుంచారు. ఇందుకు అనుగుణంగా బిల్డ్ ఆపరేట్ ఓన్ మెరుుంటెనెన్స పేరుతో ప్రకటన జారీ చేసింది. తెలుగు పత్రికలకు ఈ ప్రకటన ఇవ్వకుండా.. ఒకటి రెండు ఇంగ్లిష్ పత్రికల్లో కనబడీకనబడనట్లు ప్రచురించారు. ప్రైవేటు వ్యక్తులు నిర్మించే ఈ ప్రాజెక్టులన్నీ 35 ఏళ్ల పాటు వారి అజమారుుషీలోనే ఉంటారుు. వారు ఎంతైనా దండుకునేందుకు ప్రభుత్వం వెసులు బాటు కల్పిస్తోంది. రాజధాని లైన్ల నుంచి సరఫరా అయ్యే విద్యుత్కు ప్రైవేటు వ్యక్తులే చార్జీలు నిర్ణరుుస్తారు. -
ఏ లబ్ధి ఆశించి ‘ప్రైవేటు’కు కట్టబెట్టాలని చూస్తున్నారు?
భావనపాడు పోర్టుపై బాబుకు కేవీపీ లేఖ సాక్షి, అమరావతి/ న్యూఢిల్లీ: ఏ ప్రయోజనం ఆశించి శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు అభివృద్ధి పనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం చంద్రబాబును రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎంకు లేఖ రాశారు. ప్రభుత్వరంగంలో కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)-డీబీఎఫ్వోటీ పద్ధతిలో అభివృద్ధి చేయాలనుకోవడం ఆశ్చర్యకరమన్నారు. గతేడాది డిసెంబర్ 5న విజయ వాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సందర్భం గా కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ భావనపా డు పోర్టును ప్రైవేటీకరణ చేయొద్దని, నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగిస్తే 25 నుంచి 30 శాతం లాభాన్ని రాష్ట్రాని కిస్తానని చెప్పడాన్ని ఆయన గుర్తుచేశారు. -
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి
– అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలి – చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి – రాజ్యాధికారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తాం – సామాజిక హక్కుల వేదిక మహాధర్నా కర్నూలు(న్యూసిటీ): ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని సామాజిక హక్కుల వేదిక నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ సమస్యల పరిష్కారానికి..శనివారం కలెక్టరేట్ పక్కన సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శేషఫణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. సంపద అంతా కొంతమంది దగ్గర ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా నిమ్నవర్గాల ప్రజలు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తే పేద ప్రజల సమస్యలకు న్యాయం జరుగుతుందని వివరించారు. రాజ్యాధికారం కోసం సామాజిక హక్కుల వేదిక నాయకులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. హామీల అమలేది బాబూ.. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవడానికి పాతనగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని గఫూర్, రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గతంలో ఆగస్టు 15వ తేదీన కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.3,400 కోట్లు అప్పుగా తీసుకుని అమరావతిలో రాజధాని నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించి 13 జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి మార్చే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్రెడ్డి టీడీపీలోకి మారి కోట్లాది రూపాయలను తీసుకున్నారని విమర్శించారు. ఐక్యపోరాటాలే శరణ్యం.. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమని సీపీఐ ఎంఎల్సీ పి.జె.చంద్రశేఖర్రావు అన్నారు. బీసీలకు సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు విమర్శించారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ రావడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్, జిల్లా అధ్యక్షుడు భరత్కుమార్, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.రామచంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.భీమలింగప్ప, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.మనోహర్ మాణిక్యం, జిల్లా కార్యదర్శి మునెప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు, సామాజిక హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుభాష్ చంద్రబోస్, బుడగజంగం యువజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు టి.మనోహర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రైవేటు’ రిజర్వేషన్లూ సాధిద్దాం
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ అమలాపురం టౌన్ : దళితులు, గిరిజనులు ఐక్యంగా ముందుకు సాగితే హక్కుల సాధనే కాదు..ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లను సాధించుకోవచ్చని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ప్రైవేటు రిజర్వేషన్లకు కృషి చేద్దామని చెప్పారు.అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కోనసీమ ప్రాంత దళిత ముఖ్య నాయకులతో స్థానిక కాటన్ అతిథిగృహంలో బుధవారం ఉదయం నిర్వహించిన సభకు శివాజీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పథకాన్ని ఖచ్చితంగా అమలు పరిచేందుకు, దళిత గిరజనులకు ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని శివాజీ అన్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రాజమహేంద్రవరంలోని ఆరŠట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన దళిత గిరజనుల మహాగర్జన భారీ బహిరంగ సభకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందన సభను కూడా ఇదే వేదికపై ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యే ఈ సభలో ఆయనను దళితులు, గిరిజనుల తరఫున సత్కరిస్తామని చెప్పారు. అనంతరం దళిత గిరజన మహాగర్జన సభ పోస్టర్లు, బ్రోచర్లను శివాజీ, దళిత నాయకులు విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యేలు జగదీశ్వరి, వరప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్, కోనసీమ దళిత నాయకులు జంగా బాబూరావు, ఇసుకపట్ల రఘుబాబు, నాగాబత్తుల శ్రీనివాసరావు, బొంతు బాలరాజు, పెనుమాల చిట్టిబాబు, కుసుమ సూర్యమోహనరావు, దేవరపల్లి శాంతికుమార్, ఉండ్రు బుల్లియ్య, కాశి వెంకట్రావు ప్రసంగించారు. -
ప్రైవేటుకు నోఛాన్స్
పాఠశాలకు రెగ్యులర్గా వెళ్లకుండా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయాలని భావిస్తున్న విద్యార్థులకు ఇక భంగపాటే. పాఠశాలలో చదవకుండా పరీక్షలు సమీపించే ముందు కాండొనేషన్ ఫీజు చెల్లించి ప్రైవేటుగా హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులతో ఆ అవకాశం చేజారింది. * రెగ్యులర్గా పాఠశాలకు వెళ్తేనే టెన్త్ పరీక్షకు అర్హులు * మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ * ప్రైవేటు విద్యార్థులకు ఇక దూర విద్యే దిక్కు గుంటూరు ఎడ్యుకేషన్: నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానం అమలు కారణంగా టెన్త్ పరీక్షలకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో రెగ్యులర్గా హాజరవుతున్న విద్యార్థులే అర్హులుగా పేర్కొంటూ విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వులు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సాధారణంగా ప్రతి యేటా ప్రైవేటు విద్యార్థుల మాదిరిగా హాజరు మినహాయింపు కోరుతూ పరీక్ష ఫీజుతో పాటు కాండొనేషన్ ఫీజు చెల్లించి పరీక్షలకు దరఖాస్తు చేస్తుంటారు. ఈ విధంగా దరఖాస్తు చేసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థులుగా పరిగణించి పరీక్షలకు అనుమతిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చిన సీసీఈ ప్రభావంతో ప్రభుత్వ, గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులు మినహా ప్రైవేటుగా విద్యార్థులెవ్వరూ పరీక్షలకు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని విద్యాశాఖ తేల్చి చెప్పింది. సీసీఈ విధానంతో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు థియరీ, మరో 20 మార్కులను విద్యార్థుల ఓవరాల్ ప్రతిభ ఆధారంగా లెక్కిస్తారు. దీంఓ పాఠశాలకు వెళ్లని విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం లేకుండా పోయింది. తగ్గిన గుర్తింపులేని స్కూళ్ల సంఖ్య.. జిల్లాలో గత మూడేళ్ల క్రితం వరకూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థుల సంఖ్య దాదాపు 10 వేల వరకూ ఉంటుండగా, గుర్తింపు లేని స్కూళ్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో 2015–16 విద్యాసంవత్సరంలో వీరి సంఖ్య 3,450కి పరిమితమైంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఉత్తర్వులతో వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పరీక్షలకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మినహా ప్రైవేటు అనే మాట లేకుండా చేసినట్లయింది. దీంతో పరీక్షలకు ప్రైవేటుగా హాజరు కావాలని భావిస్తున్న విద్యార్థులు దూర విద్యను ఆశ్రయించాల్సి వస్తుంది. అటువంటి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే దూర విద్య టెన్త్ పరీక్షలకు దరఖాస్తు చేయాల్సి ఉంది. చైల్డ్ ఇన్ఫో డేటా ఆధారం.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ కార్డు ఆధారంగా వారికి సంబం«ధించి అన్ని వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదుచేసిన విద్యాశాఖ, దాని ఆధారంగానే విద్యార్థులను 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అనుమతించనుంది. ఆధార్ కార్డు వివరాలు నమోదు అయిన విద్యార్థులనే పదో తరగతి పరీక్షలకు అర్హులుగా గుర్తించనున్నారు. -
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు కర్నూలు(న్యూసిటీ): ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం బి.క్యాంప్లోని బీసీ భవన్లో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, బీసీ జనసభ రాష్ట్ర కార్యదర్శి ఎం.నాగరాజు, ఆంధ్ర దండోరా రాష్ట్ర అధ్యక్షుడు సోమసుందరం, బీసీ జనసభ జిల్లా కార్యదర్శి శేషుఫణి, సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ కె.జగన్నాథం హాజరయ్యారు. ఈ సందర్భంగా నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగా ప్రైవేట్రంగానికి ప్రాధాన్యం పెరిగిందన్నారు. వైద్య, విద్య రంగాల్లో కార్పొరేట్ హవా నడుస్తోందన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం నవంబర్ 5వ తేదీన మహా ధర్నా చేస్తామని పేర్కొన్నారు. నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.రవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.సుబ్బయ్య పాల్గొన్నారు. -
కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడులు
10,400 లీటర్ల నూనె స్వాధీనం హైదరాబాద్: పాతనగరం అడ్డాగా కల్తీ నూనెల తయారీపై సెప్టెంబరు 18న ‘సాక్షి’ దినపత్రికలో ‘కల్తీ రాజ్యం!’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఎట్టకేలకు ఎస్ఓటీ పోలీసులు స్పందించారు. సోమవారం జల్పల్లి గ్రామ శివారులో పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న ఓ కేంద్రంపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. దుర్గంధపూరిత జంతుకళేబరాల నుంచి ఇక్కడ నూనె తీసి... నగరంలోని కొన్ని పాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు శంషాబాద్ ఎస్వోటీ ఎస్ఐ లాల్ మజ్హర్ తెలిపారు. ప్రహారీ ఉన్న ఓ ప్రైవేట్ స్థలాన్ని అద్దెకు తీసుకున్న సలీం, అఫ్రోజ్లు... ఈ దందా సాగిస్తున్నారు. పశు వధశాలల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సేకరించిన కొవ్వును వీరు భారీ కడారుులలో ఉడికించి నూనె తయారు చేస్తున్నారు. దీన్ని 200 లీటర్ల సామర్థ్యంగల డ్రమ్ముల్లో నింపి నగరంలోని పలు ఫాస్ట్ఫుడ్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. తయారీ కేంద్రంలో పనిచేస్తున్న ఎనిమిది మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురు రాయల్ కాలనీలో ఉండే బర్మా శరణార్థులు. 52 డ్రమ్ముల్లోని 10,400 లీటర్ల నూనె, 8 టన్నుల కొవ్వు, డీసీఎం వ్యాన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. కల్తీ నూనె తయారీలో ఇప్పటికే రెండు సార్లు అరెస్టయిన నిర్వాహకులు ఎప్పటికప్పుడు తమ అడ్డా మార్చుకుంటూ దందా కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. -
ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి
ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి శుక్రవారం యువకుడు మృతి చెందాడు. నగరంలోని ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ పరిధి హబీబ్నగర్కు చెందిన మహమ్మద్ వికార్, భాను బేగంలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు మేస్త్రీ పనిచేస్తూ మరొక చోట భార్య పిల్లలతో ఉంటుండగా, మహమ్మద్ వాసీల్(17) స్థానికంగా ఓ ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తుంటాడు. ఇతని తండ్రి వికార్ గతంలోనే మృతి చెందగా, తల్లి భానుబేగం చిన్నకొడుకు వాసీల్ వద్ద ఉంటోంది. వాసీల్కు జ్వరం రావటంతో గత సోమవారం హ బీబ్నగర్లో ఆర్ఎంపీ బషీర్బాబా వద్దకు తీసుకెళ్లారు. అతను ఆర్ఎంపీ వాసీల్ నడుముకు రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. అయితే, ఇంజెక్షన్లు ఇచ్చిన చోట పుండ్లు అయ్యాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పారు. అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపగా గత గురువారం రాత్రి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం వరకు బాగానే ఉన్న వాసీల్ సాయంత్రం ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కాగా.. వాసీల్కు చికిత్స చేసిన ఆర్ఎంపీపై బంధువులు, స్థానికులు దాడిచేసేందుకు వెళ్లగా విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రన్న వైద్యం.. అంతంత‘మాత్ర’మే
104 వాహనాల్లో కానరాని వైద్యులు అందుబాటులో ఉండని మందులు వేతనాలు పెరగక సిబ్బంది వెతలు రోగుల్లేకున్నా ఎక్కువగా ఓపీ నమోదు పీఎస్ఎంఆర్ఐ సంస్థ మాయాజాలం పార్వతీపురం: పల్లెల్లో వైద్య సేవలందిస్తాం. గ్రామీణుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాం.. అంటూ ఆర్భాటంగా ప్రారంభించిన చంద్రన్న సంచార చికిత్స సేవలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఒకప్పుడు 104 పేరుతో చక్కని సేవలందించిన పథకాన్ని చంద్రన్న సంచార చికిత్సగా పేరు మారింది తప్ప ఎలాంటి పురోగతి లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రభుత్వం పీఎస్ఎంఆర్ఐ అనే ప్రైవేటు సంస్థకు చంద్రన్న సంచార చికిత్స నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అప్పటినుంచి వైద్యసేవలు పూర్తిగా పడకేశాయి. సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫార్మసిస్టే వైద్యుడు వాహనంలో వైద్యుడు, ఫార్మసిస్ట్, స్టాఫ్నర్స్, ల్యాట్టెక్నీషియన్, డ్రైవర్లుండాలి. కానీ ప్రస్తుతం ఏ వాహనాలోనూ వైద్యులు కానవడం లేదు. దీంతో ఫార్మసిస్ట్ వైద్యుని పాత్ర పోషిస్తున్నారు. ఇందువల్ల నాణ్యమైన వైద్యం అందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానరాని అత్యవసర మందులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పీఎస్ఎంఆర్ఐ సంస్థలు ప్రతి వాహనంలో దాదాపు 120 రకాల మందులు, ఇంజక్షన్లను అందుబాటులో ఉంచాలి. ఇంతవరకు ఇంజక్షన్ను వినియోగించకపోగా, కేవలం 20 రకాల లోపు మందులతో సంచార సేవలు అందిస్తున్నారు. అత్యవసరమైన మందులేవీ అందుబాటులో ఉండటం లేదు. గర్భిణులకు, బాలింతలు, పసిపిల్లలు, వద్ధులకు వైద్య పరీక్షలు చేసి సేవలందించేందుకు వాహనంలో స్టాఫ్ నర్సు ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్గా స్టాఫ్నర్సు పీఎస్ఎంఆర్ఐ సంస్థ స్టాఫ్నర్స్లను రోజువారీ ఓపీ డేటా పంపించే కంప్యూటర్ ఆపరేటర్లా వాడుకుంటోంది. నిలదీస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నట్టు పలువురు స్టాఫ్నర్సులు వాపోయారు. గతంలో ప్రతి వాహనంలో ఓపీ వివరాలను పంపించేందుకు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేవారు. ప్రస్తుతం వాళ్లను తొలగించి స్టాఫ్ నర్స్లకు అప్పగించారు. చంద్రన్న సంచార వాహనాల సేవలు దాదాపు పడకేయడంతో రోగుల సంఖ్య తగ్గిపోయింది. చాలా గ్రామాల్లో వాహనం వద్దకు రోగుల రాకపోయినా, తక్కువ వచ్చినా ఎక్కువగా నమోదు చేయమని యాజమాన్యం సిబ్బందిని బెదిరిస్తున్నట్టు సమాచారం. పరికరాల్లేవు.. ఉన్నా వాడరు మైక్రోస్కోప్, నిబిలైజర్ (ఆస్తమా రోగులకు అత్యవసర సమయంలో వాడే పరికరం) ఆప్తాల్మిక్ స్కోప్ (కంటి రెటీనాని పరీక్షించే పరికరం) ఫెటోస్కోప్ (గర్భిణులను పరీక్షించేది), ఎల్ఈడీ ఎక్స్రే బోర్డ్, ఈసీజీ (గుండె పరీక్షలకు వాడేది) ప్రింటర్, థర్మోమీటర్ లాంటి విలువైన పరికరాలు వాహనంలో ఉన్నా వాటిని వినియోగించడం లేదు. కొన్ని వాహనాల్లో ఆ పరికరాలేవీ కానవడం లేదు. ప్రతి వాహనంలో మలేరియా, టైఫాయిడ్, పచ్చకామెర్లు, ఉమ్మి, కఫం పరీక్షలు (టీబీకి సంబందించి), అన్ని రక్త పరీక్షలు, మూత్రం, మధుమేహం, బ్లడ్ సుగర్, హెచ్బీ తదితర అన్ని రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పీఎస్ఎంఆర్ఐ సంస్థ చంద్రన్న సంచార చికిత్స 104 సేవలు చేపట్టి 6 నెలలు కావస్తున్నా ఈ సేవలేవీ అందడం లేదు. ఒకే ఒక్క ఆర్బీఎస్ (డైబెట్స్) పరీక్షతో ల్యాబ్టెక్నీషియన్లు సరిపెట్టి ఖాళీగా ఉంటున్నారు. దాదాపు ఎనిమిదేళ్లుగా 104లో పనిచేస్తున్న సిబ్బందికి ఇస్తున్న వేతనాలు అంతంతమాత్రమే. చేరినప్పటి నుంచి ఒకే జీతంతో పనిచేస్తున్నారు. అదికూడా ఆలస్యంగా ఇస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. డొక్కు వాహనాలతో నిర్వహణ ప్రస్తుతం వాహనంలో పనిచేస్తున్న సిబ్బంది సెలవు పెట్టినప్పుడు ప్రత్యామ్నాయ సిబ్బంది లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. జిల్లా మొత్తానికి ఒక్క ఉద్యోగిని మాత్రమే ప్రత్యామ్నాయంగా నియమించడంతో అత్యవసర పరిస్థితిలో సెలవు పెట్టలేకపోతున్నామని సిబ్బంది వాపోతున్నారు. పాత బడిన వాహనాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో మరమ్మతులకు గురై ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో వైద్యసేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అందని సేవలు– కొల్లి సాంబమూర్తి, సీపీఎం నాయకులు. చంద్రన్న సంచార చికిత్స 104 వాహనంలో సేవలు అందడం లేదు. వాహనంలో మందులు లేవు. రక్త పరీక్షలు జరగవు. వైద్యులుండరు. ఒకరిద్దరు సిబ్బందితో అలా నడిపించేస్తున్నారు. వాహనం రావడం లేదు– గులిపల్లి చిన్న సుధ, కొమరాడ. గతంలోలా 104 వాహనాలు మా గ్రామాలకు రావడం లేదు. చంద్రన్న సంచార చికిత్సగా మార్చాక సేవలందడం లేదు. దీంతో మా గ్రామస్తులు వాహనం కోసం నిరీక్షించడం లేదు. -
‘ప్రైవేట్’లోనూ రిజర్వేషన్ కల్పించాల్సిందే
అనంతపురం రూరల్: ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాలని సామాజిక హక్కుల వేదిక నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని వీఆర్ఓ భవన్లో 32 కులాల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలు డిమాండ్లపై తీర్మానం చేశారు. అనంతరం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మాట్లాడుతూ అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేని ప్రతి నిరుపేదకూ భూ పంపిణీ చేపట్టాలన్నారు. మైనారిటీలు, దళితులపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సామాజిక హక్కుల వేదిక పనిచేస్తోందని అందులో భాగంగా జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో సెప్టెంబర్ 1 నుంచి 14వరకు సదస్సులు నిర్వహించనుందని వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు జగదీష్, రాగే పరశురాం, బోరంపల్లి ఆంజనేయులు, ఫైలా నరసింహయ్య, సాకే నరేష్, జయంత్, నదీమ్, మైనుద్దీన్, సాలార్బాషా, మహబుబ్బాషా, నూర్మహ్మద్, ఆనంద్, మల్లికార్జున, రాజగోపాల్, లింగమయ్య, జయంత్, దేవేంద్ర, నారాయణస్వామి, చక్రధర్యాదవ్, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు. -
యానంపల్లిలో డెంగీ?
డిచ్పల్లి : మండలంలోని యానంపల్లిలో కొందరు డెంగీతో బాధపడుతూ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోవర్ధన్, అరుట్ల సతీశ్, నర్సయ్యలు జ్వరంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో జరిపిన వైద్య పరీక్షల్లో వీరికి డెంగీ లక్షణాలు బయట పడ్డాయి. గ్రామంలో సుమారు 20 మంది వరకు విషజ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో మురికి కాల్వలు శుభ్రం చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి వైరల్ వ్యాధుల భారిన పడుతున్నారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల విషయంలో పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకుండా పోతోంది. డిచ్పల్లిలో ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రి ఉన్నా వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు చేసేది లేక జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి యానంపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఇందల్వాయి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కట్టా శుభాకర్ను సంప్రదించగా.. అధికారికంగా డెంగీ వ్యాధి నిర్ధారణ కాలేదని తెలిపారు. యానంపల్లిలో కొందరు వ్యక్తులు వైరల్ ఫీవర్తో బాధపడుతున్న మాట వాస్తవమేనన్నారు. అయితే వారిలో ఎవరికి డెంగీ లక్షణాలు లేవని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో సర్వే జరిపి బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. -
ప్రైవేట్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
నెల్లికుదురు : మండల కేంద్రంలోని ప్రయివేటు జూని యర్ కళాశాలల్లో శుక్రవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్స్ ఏఎస్పీ సురేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. స్థానిక వివేకానంద జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం మౌలిక వసతులు, కళాశాల ఆట స్థలం, విద్యార్థులకు అనుగుణంగా క్లాస్రూంలు, అధ్యాపకులు, ఫీజ్ రీయింబర్స్మెంటు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి ప్రభుత్వానికి రహస్య నివేదికను అందించనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక మార్గదర్శి కళాశాల మూసివేసి ఉండడంతో 2014 నుంచి 2016 వరకు కళాశాల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐడీ ఎస్సై రమేష్, ఏఈ సుగుణాకర్రావు, అధ్యాపకుడు అంజయ్య, జూనియర్ అసిస్టెంటు వేణుకుమార్, సిబ్బంది రమేష్, అఫ్జల్ పాల్గొన్నారు. కొడకండ్లలో.. కొడకండ్ల : మండల కేంద్రంలోని ప్రైవేటు కళాశాలల్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిం చారు. సాయి డిగ్రీ కళాశాల, శ్రీవెంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో విజిలెన్స్ ఏజీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కళాశాల రికార్డులు, మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల అర్హతలు తదితర అంశాలను పరిశీలించారు. కళాశాలల స్థితిగతులపై నివేదిక రూపొందించి జిల్లా అధికారులకు అందించనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడు ధనుం జయ్ తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనం రూ.18 వేలకు పెంచా«లి
ఏలూరు (సెంట్రల్) : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని, కనీసవేతనాల షెడ్యూల్ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పదేళ్లుగా కార్మికుల కనీస వేతన చట్టాన్ని సవరించని ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రాజారామ్మోహన్రాయ్ డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. సీఐటీయూ నాయకులు డీఎన్వీడీ ప్రసాద్, పి.కిషోర్, చింతకాయల బాబూరావు, ఆర్.లింగరాజు పాల్గొన్నారు. -
జోరుగా బ్లాక్ దందా
l మూడు నెలలుగా రెవెన్యూ స్టాంపుల కొరత l సరఫరా చేయని ప్రభుత్వం l రూపాయి స్టాంప్ ఐదు రూపాయలకు అమ్మకాలు జనగామ : రూపాయి రెవెన్యూ స్టాంపు.. ఐదు పలుకుతుంది.. ప్రైవేట్లో జోరుగా అమ్మకాలు జరుగుతుంటే.. పోస్టాఫీసులో మాత్రం లేవనే సమాధానం వినిపిస్తుంది. జనగామ సబ్ డివిజన్లో మూడు నెలలుగా రెవెన్యూ స్టాంపుల కొరత కలవరపెడుతుంది. జనగామ నియోజక వర్గంతో పాటు లింగాలఘణపురం, రఘునాథపల్లి పరిధిలోని 15 సబ్ పోస్టాఫీసుల్లో రెవెన్యూ స్టాంపుల కొరత ఏర్పడింది. ప్రైవేట్ మార్కెట్లో మాత్రం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. ఒక్క రూపాయి స్టాంపును ఏకంగా ఐదు రూపాయలకు విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. పోస్టాఫీసులకు మూడు నెలలుగా లేని సరఫరా.. ప్రైవేట్ మార్కెట్లో ఎలా దొరుకుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు లో రుణాలు, ఉద్యోగులు, ప్రైవేట్ ఫైనాన్స్లు, ఎల్ఐసీ, చిట్ఫండ్స్ ఇలా అనేక రకాల వాటికి రెవెన్యూ స్టాంపులు తప్పనిసరి. సబ్ డివిజన్ పరిధిలో కొంతమంది ఏజెంట్ల కనుసన్నలల్లో కొనసాగుతున్న రెవెన్యూ స్టాంపుల బ్లాక్ దందాపై పోస్టల్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. మూడు నెలలుగా కొరత ఉంది మూడు నెలలుగా రెవెన్యూ స్టాంపుల కొరత ఏర్పడింది. హైదరాబాద్ సర్కిల్ స్టాంపు డిపో నుంచి రావాల్సి ఉన్నాయి. జనగామతో కలుపుకుని 15 మండలాల పరిధిలో ప్రతి నెల రూ.30వేల రెవెన్యూ స్టాంపుల అమ్మకాలు ఉంటాయి. పదిహేను రోజుల క్రితమే ఇండెంట్ కూడా పంపించాం. ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారనే విషయం దృష్టికి రాలేదు. –సాంబశివుడు,పోస్టుమాస్టర్, జనగామ హెడ్ ఆఫీస్ రెవెన్యూ స్టాంపు రూ.5కు అమ్ముతున్నారు పోస్టాఫీసులో రెవెన్యూ స్టాంపులు లేకపోవడంతో ప్రైవేట్లో ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు. మూడు నెలలుగా ఫోస్టాఫీసులకే సరఫరా లేని పరిస్థితులో ప్రైవేట్లో లక్షల్లో రెవెన్యూ స్టాంపులు ఎలా దొరుకుతున్నాయి. దీనిపై పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి. –కాసుల శ్రీనివాస్, జిరాక్స్ సెంటర్ యజమాని -
అర్బన్ హెల్త్సెంటర్లలో ప్రైవేట్ వైద్యం..!
– గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం – ఎన్జీవోల నుంచి హెల్త్సెంటర్ల స్వాధీనం –ఆగస్టు ఒకటి నుంచి ప్రై వేట్ చేతుల్లోకి కర్నూలు(హాస్పిటల్): పట్టణాల్లోని మురికివాడల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన అర్బన్హెల్త్ సెంటర్లను ప్రభుత్వం ప్రై వేటుపరం చేయనుంది. ఆధునిక వైద్యసేవల పేరుతో పీపీపీ విధానంలో వీటిని ప్రై వేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆయా అర్బన్హెల్త్ సెంటర్లను ఎన్జీవోల నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయమై కొంత మంది ఎన్జీవోలు కోర్టును ఆశ్రయించారు. జిల్లాలో కర్నూలు నగరంలో 8, ఆదోనిలో 4, నంద్యాలలో 5 అర్బన్హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ప్రతి సెంటర్లో ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక కో ఆర్డినేటర్, ఒక వాచ్మెన్, స్వీపర్, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ ఉంటారు. మెడికల్ ఆఫీసర్కు రూ.18వేలు, ఏఎన్ఎంలకు రూ.10వేలు, కో ఆర్డినేటర్కు రూ.9వేలు, ఇతర ఉద్యోగులకు రూ.4,900ల చొప్పున జీతాలు ఇస్తారు. ఇవి గాక సెంటర్ కంటింజెన్సీ కింద నెలకు రూ.3వేలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కోసం రూ.2వేలు, అద్దెభవనంలో ఉంటే అద్దె రూ.2వేలు చెల్లిస్తారు. ఈ సెంటర్లను జిల్లాలో ఇప్పటి వరకు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తూ వచ్చాయి. వీటి పనితీరు బాగాలేదని, మురికివాడల్లో ప్రజలకు కనీస వైద్యం అందడం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రై వేటు సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ముందుగా ఆయా సెంటర్లను స్వచ్ఛంద సంస్థల నుంచి స్వాధీనం చేసుకోవాలని డీఎంహెచ్వోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సెంటర్లు నిర్వహించే ఎన్జీవోలకు డీఎంహెచ్వో కార్యాలయం నోటీసులు పంపించింది. ఇప్పటికే పలు కేంద్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు ఏప్రిల్ నుంచి జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులను సైతం ఇవ్వకుండా నిలిపివేశారు. కేవలం మందులు మాత్రమే ఏపీఎంఎస్ఐడిసి డ్రగ్స్టోర్ నుంచి పంపిణీ చేస్తున్నారు. ఈ కారణంగా ఎన్జీవో ద్వారా గాకుండా డీఎంహెచ్వో కార్యాలయంతో అక్కడ పనిచేసే సిబ్బంది బాధ్యులుగా ఉంటున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రై వేటు సంస్థలు వీటిని నిర్వహించే విధంగా ప్రభుత్వం విధివిదానాలు రూపొందించనున్నట్లు సమాచారం. సెంటర్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నాం –డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్వో కర్నూలు అర్బన్హెల్త్ సెంటర్లను స్వాధీనం చేసుకోవాలని గతంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఎన్జీవోలందరికీ టెర్నినేషన్ ఆర్డర్స్ ఇచ్చాం. వాటిని డిప్యూటీ డీఎంహెచ్వోల ద్వారా ప్రస్తుతానికి నడిపించాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు వాటిని నడిపిస్తునాం. ఈ విషయమై కొందరు కోర్టుకు వెళ్లారు. వాటిని ప్రై వేటు సంస్థలకు ఇస్తుందనే విషయం మాకు సమాచారం రాలేదు. -
ప్రైవేట్ కంపెనీలకు పనిగంటలు తగ్గింపు!
దుబాయ్ః రంజాన్ నెలలో ప్రైవేట్ కంపెనీల పనిగంటలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రంజాన్ పవిత్ర మాసంలో కార్మికులకు ఎటువంటి జీతం తగ్గింపు లేకుండా రెండు గంటల పని సమయాన్ని తగ్గిస్తూ ప్రకటన చేసింది. కార్మిక సంబంధాలు, సవరణల నియంత్రణకు సంబంధించిన 1980 ఫెడరల్ చట్టం 08, ఆర్టికల్ 65 నిబంధన ప్రకారం కార్మికుల పనిగంటలకు సంబంధించిన నిబంధన అమల్లోకి తెచ్చినట్లు యూఏఈ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నివేదించింది. ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఫెడరల్ అథారిటీ ప్రకటన ప్రకారం రంజాన్ నెలలో ఉదయం 9 గంటలనుంచి 2గంటల వరకూ పని గంటలను సవరించినట్లు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం అటు ప్రైవేట్ తో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ రంజాన్ నెలంతా రెండు గంటల పని సమయం తగ్గిస్తూ తెచ్చిన నిబంధన అమల్లోకి వస్తుంది. తాజా నిబంధననను సోమవారం అమల్లోకి తెచ్చిన సందర్భంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యుఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ ప్రధానమంత్రి హెచ్ హెచ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టౌమ్, ప్రజలకు రంజాన్ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. -
మద్యం డిపోలో ‘వసూళ్ల కిక్కు’
► నెలకు రూ.4లక్షల పైమాటే.. ► లారీ అన్లోడ్కు రూ.200 ► టెంపరరీ పర్మిట్కు రూ.100 ► బిల్లింగ్కు రూ.100 వసూలు జిల్లాలోని మద్యం డిపోలో వసూళ్ల దందా కొనసాగుతోంది. ఇది ఏకంగా నెలకు రూ.నాలుగు లక్షలకుపైమాటే. మద్యం డిపోకు లోడ్తో లారీ వచ్చిందా ఇక అంతే.. లారీకి రూ.200, టెంపరరీ పర్మిట్ జారీ చేస్తే రూ.100, బిల్లింగ్ చేస్తే రూ.100 చొప్పున బ్రెవరేజీ కంపెనీల నుంచి డిపో అధికారులు బెదిరింపులకు పాల్పడి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నా యి. ఈ అక్రమ దందాను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమదందా వ్యవహారం నెలకు ఎంత లేదన్నా.. రూ.నాలుగు లక్షలపైగానే ఉంటోందని సమాచారం. కరీంనగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని మద్యం డిపోకు వివిధ రకాల మద్యం కంపెనీలు వారివారి మద్యాన్ని పంపిస్తుంటారు. ప్రతినెలా 25 రోజుల్లో సుమారు 600 లారీలు మద్యంతో వస్తుంటారుు. లారీ సకాలంలో డిపోలోకి వెళ్లి.. మద్యం అన్లోడ్ చేయూలంటే సంబంధిత డిపో అధికారులకు రూ.200 ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకుంటే సదరు లారీని రోజులతరబడి బయటనే ఉంచుతున్నారు. దీంతో చేసేది లేక కంపెనీ ప్రతినిధులు రూ.200 చెల్లించి మద్యాన్ని అన్లోడ్ చేరుుంచుకుంటున్నట్లు సమాచారం. ఇలా లారీలను డిపోలోకి అనుమతించడం ద్వారానే డిపో అధికారులకు సుమారు రూ.1.20 లక్షలు అనధికారికంగా సమకూరుతున్నట్లు తెలుస్తోంది. లారీ లోపలికి రావడంతో మొదలైన ఈ దందా.. మద్యం దుకాణాలకు వెళ్లేవరకూ ప్రతి దశలో కొనసాగుతూనే ఉంటుంది. టెంపరరీపర్మిట్ జారీ చేయూలంటే రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈలెక్కన ప్రతిరోజూ డిపోకు 80 నుంచి 100 వరకు లారీలు వస్తాయని అనుకున్నా.. రోజుకు రూ.10 వేలు, నెలకు రూ.మూడు లక్షలు దాటుతారుు. ‘వసూళ్ల’కు ప్రైవేట్ వ్యక్తులు.. మద్యం డిపోలో ఈ మామూళ్ల వసూలుకు ముగ్గురు ప్రైవేట్ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిసింది. బీర్లతో వచ్చిన లారీల నుంచి వసూలుకు ఒకరు.. లిక్కర్ లారీ నుంచి వసూలుకు ఇద్దరు పనిచేస్తున్నారని సమాచారం. వీరు ప్రతిరోజూ వసూలు చేసిన మొత్తాన్ని సంబంధిత అధికారికి అప్పగిస్తారని తెలిసింది. వీరితోపాటు మరో ముగ్గురు పనిచేస్తున్నారని, వారికి నెలకు రూ.12 వేల చొప్పున వేతనం రూపంలో చెల్లిస్తుంటారని డిపోవర్గాల ద్వారా తెల్సింది. ఈ లెక్కన సంబంధిత వ్యాపారులు ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని వసూళ్ల దందాను దర్జాగా కొనసాగిస్తున్నట్లు అర్థమవుతోంది. ఉన్నతాధికారులకు తెలిస్తే ఎలా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘వారికి నెలనెలా మామూళ్లు వెళ్తుంటారుు. వారు ఇటువైపు కన్నెత్తి చూడరు. వచ్చినా మమ్మల్ని ఏం చేయరు..’ అని ఓ అధికారి బహిరంగంగానే పేర్కొంటున్నాడని సదరు వ్యాపారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు తెలిసినా.. జిల్లాలో ఉన్న మద్యం డిపోకు చైర్మన్గా జారుుంట్ కలెక్టర్ వ్యవహరిస్తారు. అరుుతే మద్యం డిపోలో పనిచేస్తున్న అధికారులపై అజమాయిషీ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రచారంలో ఉంది. డిపోలో పనిచేస్తున్న ఓ అధికారి వారం లో మూడు రోజులు డిపోలో ఉంటాడని.. మిగిలిన మూడు రోజుల సొంత పనులపై వెళ్తుంటాడని, ఎవరైనా అధికారులు అకస్మాత్తుగా తనిఖీ చేస్తే ‘ఇప్పుడే.. బయటకు వెళ్లాడ’ని చెబుతుంటారని పలువురు గుర్తుచేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి డిపో జరుగుతున్న అక్రమ వసూళ్లపై దృష్టి సారించాలని పలువురు మద్యం వ్యాపారులు కోరుతున్నారు. -
స్కూల్ ఫీజులపై ఏమైనా చెప్పాలనుకుంటున్నారా...
హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లు విచ్చిలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులపై మరో పోరుకు స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం ఏర్పాటైన జేఏసీ కార్యాచరణ రచించింది. ఇప్పటికే పలు రూపాల్లో అధిక ఫీజుల వసూళ్ల తీరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. తాజాగా బహిరంగ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి మాజీ చైర్ పర్సన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎం. బుల్గయ్య తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆ జేఏసీ చైర్ పర్సన్ అరవింద జటా, సెక్రటరీ జనరల్ నాగటి నారాయణ పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న ఫీజు వసూలును నియంత్రిస్తామని ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని వారు పేర్కొన్నారు. చివరకు అసెంబ్లీలో సైతం మాటిచ్చినా ఇంతవరకు కదలిక లేదన్నారు. దీంతో స్కూళ్లు ఫీజులను మరింత పెంచాయని, తల్లిదండ్రులపై తీవ్ర భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ బహిరంగ విచారణ చేపట్టామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థలు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ వాణి వినిపించాలని పిలుపునిచ్చారు. -
పాఠశాల చదువు.. మోయలేని బరువు..
* ఏటా ఫీజులను పెంచేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు * ఈ సంవత్సరమూ 10 నుంచి 15 శాతం పెంపు * పరీక్షలు పూర్తవకుండానే వచ్చే సంవత్సరానికి అడ్మిషన్లు అమలాపురం : అర్హులైన వారికి.. ఉన్నత విద్య చదివే సందర్భంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. ఇంటర్, డిగ్రీలకు స్కాలర్ షిప్లున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోనేకాదు.. ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులకు సైతం ఇవి వర్తిస్తున్నాయి. ఆ వెసులుబాటు లేనిదల్లా పాఠశాల విద్యకే. పాఠశాల విద్య ప్రభుత్వ స్కూళ్లలో ఉచితం కాగా.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఖరీదైన వ్యవహారంగా, సామాన్య, మధ్య తరగతి వర్గాలకు మోయలేని భారంగా మారిపోయింది. ఏటా పెంచినట్టే ప్రైవేట్ స్కూళ్లలో ఈ ఏడాది కూడా 10 నుంచి 15 శాతం ఫీజులు పెంచారు. జిల్లాలో మరో వారం రోజుల్లో పాఠశాలస్థాయి పరీక్షలు పూర్తికానున్నాయి. తరువాత వేసవి సెలవులు మొదలవుతారుు. జూన్ పది తరువాత పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు తెరవనున్నారు. ప్రైవేట్ స్కూళ్ల యజమానులు ఇంకా పరీక్షలు పూర్తి కాకపోరుునా వచ్చే విద్యా సంవత్సరానికి అప్పుడే అడ్మిషన్లు ఆరంభించారు. కొత్తవారిని చేర్చుకునేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నారు. విద్యార్థులను గుర్తించి తమ పాఠశాలల్లో చేర్చేందుకు పీఆర్వోలనే కాదు చివరకు ఉపాధ్యాయులను కూడా రంగంలోకి దింపారు. పనిలో పనిగా టా పెంచినట్టే ఈ ఏడాది కూడా 10 నుంచి 15 శాతం ఫీజులు పెంచివేశారు. కార్పొరేట్ స్కూళ్లలో ఈ పెంపు మరింత ఎక్కువగా ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల వసూలు ఇలా.. నర్సరీ - యూకేజీ : రూ.19,000 నుంచి రూ.25,000 1 - 3 తరగతులు : రూ.20,000 నుంచి రూ.27,000 4 - 5 తరగతులు : రూ.23,000 నుంచి రూ.28,000 6 - 7 తరగతులు : రూ.25,000 నుంచి రూ.30,000 8 - 9 తరగతులు : రూ.27,000 నుంచి రూ.32,000 10వ తరగతి : రూ.29,000 నుంచి రూ.34,000 ఎన్నిరకాల బాదుళ్లో.. ఇవి కాకుండా కొత్తగా చే రే వారి నుంచి అడ్మిషన్ ఫీజుగా రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకూ వసూలు చేస్తున్నారు. బస్సు చార్జీలుగా 5 కిలోమీటర్లలోపు రూ.5 వేలు, అంతకుమించిన దూరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక పుస్తకాలు, యూనిఫాంల పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే యూకేజీ లోపు చదివే విద్యార్థికే రూ.30 వేలకు పైబడి అవుతుందంటే ప్రాథమిక విద్య ఎంత ఖరీదైన వ్యవహారంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా ఫీజులు పెంచుతున్నా అడ్డుకోవాల్సిన విద్యాశాఖాధికారులు మిన్నకుండడంతో ప్రైవేట్ స్కూల్ యజమాన్యాల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. విద్యార్థులను చేర్చకుంటే ఇంక్రిమెంట్లు లేనట్టే.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యూజమాన్యాలు కొత్తగా విద్యార్థులను చేర్చే బాధ్యతను ఆ సంస్థల పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో)ల మీదనే కాక ఉపాధ్యాయులు మీద కూడా పెడుతున్నాయి. ఉపాధ్యాయులు ఒక్కొక్కరూ ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలా చేర్చకుంటే ఇంక్రిమెంట్లను రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని యాజమాన్యాలు వేసవి సెలవులు ఇచ్చేది లేదనడంతో ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారులు ఫీజుల పెంపుపై స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
జంట టవర్ల స్థలంపై వివాదం
♦ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రైవేటు వ్యక్తులు ♦ ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్నెంబర్ 12లో పోలీసుల కోసం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో చేపట్టదలచిన జంట టవర్ల నిర్మాణంపై తెలంగాణ సర్కార్కు హైకోర్టులో షాక్ తగిలింది. ఈ టవర్లు నిర్మించతలపెట్టిన స్థలంపై కొంద రు ప్రైవేటు వ్యక్తులు యాజమాన్యపు హక్కు లు కోరుతున్న నేపథ్యంలో, అందులో నాలు గు వారాల పాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ జిల్లా, షేక్పేట మండలం బంజారాహిల్స్ సర్వే నంబర్లు 129/103లోని తమ ఐదెకరాల భూమి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుంటే అధికారులు తిరస్కరించారని, అంతేకాక తమ భూమిలో బహుళ అంతస్తుల భారీ భవన నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారని, దీనిని అడ్డుకోవాలంటూ హైదరాబాద్కు చెందిన మీర్ ఇక్బాల్ అలీ, మరో 16 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారించారు. 1981కి పూర్వం నుంచే తమ తల్లి గౌసియా బేగం స్వాధీనంలో ఆ ఐదెకరాల భూమి ఉందని పిటిషనర్లు తెలిపారు. అయితే దీనిని గుర్తించకుండా ఆ భూమి నుంచి ఖాళీ చేయించేందుకు 1981లో అప్పటి ప్రభుత్వం జీవో 942 జారీ చేసిందని, దీనిని హైకోర్టులో సవాల్ చేస్తే ఆ జీవోను న్యాయస్థానం కొట్టేసిందని వివరించారు. దీనిపై ప్రభుత్వం, మరికొందరు ధర్మాసనాన్ని ఆశ్రయించి అప్పీళ్లు దాఖలు చేశారని, విచారణ జరిపిన ధర్మాసనం అప్పీళ్లను పరిష్కరిస్తూ వివాదం తేలేంత వరకు సదరు భూమి విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా కొట్టేసిందని వివరించారు. యథాతథస్థితి ఉత్తర్వులు ఉండగానే ప్రభుత్వం తమ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించిందని, దీనిపై తాము మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, తమ భూమిని పోలీసు శాఖకు కేటాయించినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపిందన్నారు. వివాదం కొనసాగుతుండగానే తమ స్థలంలో భూమి పూజ చేసి, అక్కడ జంట టవర్లు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారన్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్లో తాము హైకోర్టును ఆశ్రయించగా, క్రమబద్ధీకరణ కోసం తమ తల్లి పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ మెమో జారీ చేసినట్లు కోర్టుకు చెప్పారని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రభుత్వ మెమోలో పేర్కొన్న కారణాలు అర్థం లేకుండా, చాలా గోప్యతతో ఉన్నాయని పేర్కొన్నారు. ఆ స్థలంలో 4 వారాల పాటు నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
'ప్రయివేట్ మెసేజ్ లను కూడా చూడొచ్చు...'
కంపెనీలకు తమ కార్మికుల ఆన్లైన్ ప్రైవేట్ మెజేస్ లను మానిటర్ చేసే హక్కును యూరోపియన్ న్యాయస్థానం కల్పించింది. ఓ ఇంజనీర్ తన వృత్తిపరమైన విషయాలను మాత్రమే సంభాషించాల్సిన యాహూ మెసెంజర్ లో తన సోదరుడు, కాబోయే భార్యతో మాట్లాడి, తర్వాత తొలగించడాన్ని యూరోపియన్ మానవ హక్కుల న్యాయస్థానం తప్పుపట్టింది. బొగ్డన్ మిహై బార్బులెస్కు తన ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు యాహూ మెసెంజర్ అవసరమని, తన ఖాతాను ఓపెన్ చేయమని యాజమాన్యాన్ని కోరాడు. దీంతో కంపెనీ అతనికి కొత్త ఖాతా ఓపెన్ చేసి ఇచ్చింది. అనంతరం 2007 లో తన ఛాట్స్ కొంతకాలంగా ఎవరో పర్యవేక్షిస్తున్నట్లు అతడు యాజమాన్యాన్ని కలిసి ఫిర్యాదు చేశాడు. అయితే కంపెనీ నిబంధనల ప్రకారం అతడి సేవలను కంపెనీకి మాత్రమే వినియోగించాల్సి ఉంది. దీంతో యాజమాన్యం అతని ఫిర్యాదును స్వీకరించకపోగా, అతడు చేసిన తప్పును ఎత్తి చూపింది. దీంతో కోర్టుకెక్కిన సదరు ఇంజనీర్ తన కాబోయే భార్యకు సహా ఇతరులకు పంపిన మెజేస్ లతో పాటు 45 పేజీల ట్రాన్స్ స్క్రిప్ట్ ను కోర్టు ముందుంచాడు. విషయాన్ని పరిశీలించిన స్ట్రాస్బోర్గ్ కోర్ట్ యాజమానివైపు నిలిచింది. ఉద్యోగి పని గంటల సమయంలో వృత్తి పరమైన పనులు పూర్తి చేశాడా లేదా అన్న విషయాన్ని గమనించే హక్కు యాజమాన్యానికి ఉంటుందని తీర్పునిచ్చింది. కార్మికుల పనిని పరిశీలించడంలో భాగంగా ప్రైవేట్ మెజేజ్ లను కూడా పర్యవేక్షించే అధికారం యాజమాన్యానికి ఉంటుందని కోర్టు.. తేల్చి చెప్పింది. కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిన బార్బులెస్కు దావాను న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ నిర్ణయం యూరోపిన్ దేశాలన్నింటికి వర్తిస్తుందని, ఉద్యోగి పని విషయంలో యాజమాన్యాలకు చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయని, లండన్ సంస్థ లెవిస్ సిల్కిన్ ఉపాధి హెడ్ బ్లూమ్ బర్గ్, న్యాయవాది మైఖేల్ బర్డ్ లు చెప్పారు. అయితే ఈ కేసులో యాహూను స్వవిషయాలకు వినియోగించినట్లు ఉన్నా ఇది ఒక్క యాహూకే కాక ఏ ఇతర మెసేజింగ్ సర్వీసుల విషయంలోనైనా వర్తిస్తుందని వారు చెప్తున్నారు. -
ఏపీలో 108 ఇక ప్రైవేటు చేతుల్లోకి
-
ఆస్పత్రి ప్రైవేటుపరంలో ఆంతర్యమేమిటి?
- అఖిలపక్షం రౌండ్టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్న చిత్తూరు (అగ్రికల్చర్) : చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ఎవరి ప్రయోజనం కోసం ప్రైవేటు(అపోలో ఆస్పత్రి)పరం చేస్తున్నారని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు. చిత్తూరు ఆస్పత్రిని ప్రైవేటు పరం చేయడంపై శనివారం స్థానిక ప్రెస్క్లబ్ భవనంలో అఖిల పక్షం పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, దళిత, బీసీ, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాస్పత్రులను ప్రైవేటు పరం చేయడంలో భాగంగానే మొదట చిత్తూరు ఆస్పత్రిని ధారాదత్తం చేస్తున్నారన్నారు. నిరుపేదలకు, సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించే చిత్తూరు ఆస్పత్రిని ప్రైవేటు పరం చేసి వైద్యాన్ని సామన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పీవీ గాయత్రీదేవి మాట్లాడుతూ నిరుపేదలకు నిర్విరామంగా వైద్యసేవలు అందిస్తున్న చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు. జిల్లావాసి అయిన చంద్రబాబు నిరుపేదలకు అన్ని విధాల అన్యాయం చేస్తున్నారన్నారు. విజయా డెయిరీని, షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి పాడి రైతులకు, చెరకు రైతులకు అన్యాయం చేశారని ఆమె విమర్శించారు. నిరుపేదలకు ఏకైక దిక్కైన చిత్తూరు ఆస్పత్రిని కూడా ప్రైవే టు యాజమాన్యానికి ధారాదత్తం చేసి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. సీపీఐ, సీపీఎం నాయకులు నాగరాజన్, చైతన్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు వాటిని నెరవేర్చకపోగా, ఉన్న ఆస్తులను సైతం కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం బాధాకరమన్నారు. చంద్రబాబు నియంతృత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెప్పి మనుగడ లేకుండా చేయడం ఖాయమని హెచ్చరించారు. చిత్తూరు ఆస్పత్రిని ప్రైవేటుపరం చేసే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఏఐటీయూసీ నాయకులు కె.మణి, బి.ఆరుముగం, వైఎస్సార్సీపీ నాయకుడు జ్ఞాన జగదీష్, ఎస్టీయూ నాయకుడు గంటా మోహన్, ఆటో యూనియన్ నాయకుడు విజయకుమార్, జర్నలిస్టుల యూని యన్ నాయకుడు జయరాజ్, బీసీల సంఘం నాయకుడు మురగయ్య, సీఐటీయూ నాయకులు సురేంద్రన్, గంగాధరన్, మాలమహానాడు నాయకుడు కేకే రవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటుకిచ్చినా ప్రశ్నించే వీల్లేదు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని పేరిట సమీకరించిన భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పక్కా వ్యూహం అమలు చేసింది. రైతుల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినా, ఏరకంగా వినియోగించుకున్నా ప్రశ్నించే అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంది. సమీకరించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు జీఓ జారీ చేసిన ప్రభుత్వం.. వాస్తవానికి దీనికి ముందునుంచే రైతులతో చేసుకుంటున్న ఒప్పందపత్రాల్లో అందుకనుగుణంగా షరతులు విధించింది. భూములు ప్రైవేటువారికిచ్చినా రైతులు ఎటువంటి అభ్యంతరం చెప్పకూడదని 9.14 ఒప్పందపత్రాల్లో 15వ షరతుగా పేర్కొంది. తద్వారా భూములపై సర్వ హక్కులు సీఆర్డీఏకే లభించేలా చూసుకుంది. భూములిచ్చిన రైతులకు మాత్రం వాటిపై ఎటువంటి హక్కులు లేకుండా, కనీసం ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా చేసింది. ఈ షరతుల గురించి ఏమాత్రం అవగాహన లేకుండానే చాలామంది రైతులు 9.14 పత్రాలపై సంతకాలు పెట్టి సీఆర్డీఏ అధికారులకు ఇచ్చారు. కోర్టుకెళ్లడమూ చట్ట విరుద్ధమే! భూములపై సర్వహక్కులు ఉండేలా చూసుకున్న సీఆర్డీఏ.. ఆ భూములపై ఏవైనా బకాయిలుంటే మాత్రం మళ్లీ రైతుల వాటా నుంచే మినహాయించుకునే వెసులుబాటు కల్పించుకుంది.ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి మించి రైతులు అదనంగా ఎటువంటి పరిహారం అడగకుండా ఉండడంతోపాటు కనీసం దానిపై నిరసన తెలిపే హక్కు కూడా రైతుకు లేకుండా చేశారు. కనీసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసే అవకాశం కూడా ఒప్పందాలు చేసుకున్న రైతులకు లేదు. ఒకవేళ దాఖలు చేసినా అవి చెల్లుబాటు కావని అలా చేయడం చట్టవిరుద్ధమని ముందే ఒప్పందంలో పేర్కొన్నారు. సీఆర్డీఏదే అంతిమ నిర్ణయం తనకు అనుకూలంగా ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న ప్రభుత్వం.. ఒకవేళ ఏ కారణంతోనైనా భూసమీకరణ పథకాన్ని కొనసాగించకపోయినప్పటికీ రైతు మాట్లాడేందుకు వీల్లేకుండా కూడా చూసుకుంది. ఎటువంటి కారణం లేకుండా, ఏ సమయంలోనైనా భూసమీకరణ ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం సీఆర్డీఏకు ఉంటుంది. -
ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ట్రావెల్స్
-
నీరు.. చోరీ
- నగరంలో ట్యాంకర్ల మాయూజాలం - ఆరు ట్రిప్పులకు మూడే సరఫరా - పేదల కాలనీల్లో తీరని దాహార్తి - కార్పొరేషన్ నీరు హోటళ్లకు విక్రయం - స్వచ్ఛంద సంస్థల వ్యాపారం - రూ.వందకు కొని.. రూ.వెయ్యికి అమ్మకం - చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగరంలో యథేచ్ఛగా మంచి నీటి దోపిడీ జరుగుతోంది. వేసవిలో తీవ్ర నీటిఎద్దడిని ఆసరాగా చేసుకొని ప్రజలకు జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ పర్వం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్లతో పాటు, స్వచ్ఛంద సేవా సంస్థల ముసుగులో సాగుతోంది. కార్పొరేషన్ నీటిని ట్యాంకర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్లు అమ్ముకుంటున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థల పేరిట కొందరు కార్పొరేషన్ ట్యాంకుల నుంచి నీటిని రూ.100 చెల్లించి తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు రూ.600 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. నీటి వ్యాపారంలో ఆరితేరుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నా.. క్షేత్రస్థారుులో ఇందుకు విరుద్ధంగా ఉంది. నీటి సరఫరా కాగితాలపై అంకెల గారడీ సృష్టిస్తున్నారు. మంచినీటి సరఫరా చేసేందుకు కార్పొరేషన్కు సొంతంగా ఒక ట్యాంకర్ మాత్రమే ఉంది. అయితే వేసవిలో మంచినీటిని సరఫరా చేసేందుకు ఈ ఏడాది 12 ట్యాంకర్ల కోసం టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లను ఐదుగురు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ వరకు నీటిని సరఫరా చేయాలి. ఒక్క ట్యాంకర్కు ఒక్క ట్రిప్పుకు రూ.325 చెల్లిస్తున్నారు. ప్రతిరోజూ ఒక్క ట్యాం కర్ ద్వారా ఆరు ట్రిప్పులు సరఫరా చేయాలని టెండర్ నిబంధన పెట్టారు. ట్యాంకర్ల కాంట్రాక్టర్లు కార్పొరేషన్లోని ఇంజనీరింగ్ అధికారులు సూచించిన ప్రకారం నగరంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం మంచి నీటిని సరఫరా చేయాలి. అరుుతే ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లోపంతో మూడు, నాలుగు ట్రిప్పులు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని పలు కాలనీల వాసులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు మాత్రం ఆరు ట్రిప్పులు సరఫరా చేసినట్లు రిజస్టర్లలో రాసుకుంటున్నారని, అనుకూలంగా ఉన్న స్థానికులతో సంతకాలు చేయించుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకు అడ్డాలను ఏర్పాటు చేసి స్థానికులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలు ఏమీ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ట్యాంకర్ల నీటిని కాంట్రాక్టర్లు వాణిజ్య అవసరాలకు అమ్ముకుంటున్నారు. కార్పొరేషన ఖజానాకు గండి.. ఏటా ఈ ట్యాంకర్ల మంచినీటి సరఫరాలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై భారీ ఎత్తున కార్పొరేషన్ ఖజానాకు గండికొడుతున్నారు. త క్కువ ట్రిప్పులు సరఫరా చేసి ఎక్కువ ట్రిప్పు లు సరఫరా చేసినట్లు లెక్కలు రాసుకుంటున్నారు. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసిన తర్వాత నెల వారీగా బిల్లులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ మూడు, నాలుగు నెలల తర్వాత మంచినీటి సరఫరా బిల్లులు తీసుకుంటున్నారు. అప్పటికి ఈ లెక్కలు ఎవ్వరూ చూడరన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు కొన్నేళ్లుగా ఇలా చేస్తున్నారు. ఇందులో ఓ కాంట్రాక్టర్కు రెండు ట్యాంకర్లు మాత్రమే ఉన్నప్పటికీ తన వద్ద ఐదు ట్యాంకర్లు ఉన్నట్లు టెండర్ దక్కించుకోవడం గమనార్హం. నీటిని నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మూడు, నాలుగు ట్రిప్పులు సరఫరా చేసి మిగతావి ఆపార్ట్మెంట్లు, హోటళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పేరుకు మాత్రం లైన్మన్లతో పర్యవేక్షణ చేస్తున్నట్లు ఏఈలు చెబుతున్నప్పటికీ నగరంలో రూ.10 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. వీటిని పర్యవేక్షించుందుకే ఏఈలకు తీరకలేదు. వీరికే ట్యాంకర్ల సరఫరా పర్యవేక్షణ బాధ్యతలు అప్పటించడంతో కాంట్రాక్టర్లకు కలిసివచ్చింది. కింది స్థాయి ఉద్యోగుల చేతులు తడిపి నాలుగు ట్రిప్పులకు ఆరు ట్రిప్పులు సరఫరా చేస్తున్నట్లు రిజిస్టర్లలో రాయించుకుంటున్నారు. వాస్తవంగా ఏ ట్యాంకర్..? రోజు ఎన్ని ట్రిప్పులు..? ఏ ప్రాంతాల్లో సరఫరా చేశారన్న విషయాలు కమిషనర్ లేక ఎంఈకి నివేదిక రూ పంలో సంబంధిత విభాగం అధికారులు ఇవ్వాలి. కానీ ఇక్కడ డీఈలు సైతం దీనిపై దృష్టి పెట్టడడం లేదు. దీంతో నగరంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ‘స్వచ్ఛంద’.. వ్యాపారం.. నగరంలో కొన్ని సేవా సంస్థలు స్వచ్ఛంద సేవా ముసుగులో కార్పొరేషన్ నీటిని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలకు మాత్రమే కార్పొరేషన్ నిబంధనల ప్రకారం నీటిని ఉచితంగా ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు చేశారు. గతంలో దీన్ని ఆసరా చేసుకున్న కొంత మంది వ్యక్తులు కార్పొరేషన్ నుంచి ఉచితంగా నీటిని తీసుకొని నగరంలో హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్మెంట్లకు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేసి నీటి విక్రయించారు. అయితే ప్రస్తుతం గుర్తింపు ఉన్నా లేకున్నా సొంత ట్యాంకర్ ఉంటే రూ.100 చెల్లించి ట్యాంకర్ నీటిని కార్పొరేషన్ పరిధిలోని ట్యాంకుల నుంచి తీసుకోవచ్చు. అయితే గుర్తింపు ఉన్నా, లేకున్నా పదుల సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు, కొంత మంది వ్యక్తులు కార్పొరేసన్ ట్యాంకుల నుంచి రూ.100 చెల్లించి నీటిని తీసుకొని ఇదే ట్యాంక్ను నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. తనిఖీలు చేయని అధికారులు.. మంచినీటి కోసం ప్రతిరోజు నగరంలో ఏదో ఒక చోట నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నగరంలో ఎక్కడ సమస్య ఉందో చెబితే అక్కడి ట్యాంకర్ పంపిస్తామని చెప్పిన కార్పొరేషన్ అధికారులు ప్రస్తుతం ట్యాంకర్లతో మంచినీటి సరఫరాపై నిఘా పెట్టడం లేదు. -
కొత్తబస్సుల కొనుగోలులో బెస్ట్కు సాయం చేస్తాం: బీఎంసీ
గతంలోనూ రూ. 1,600 కోట్లు అందజేత సాక్షి, ముంబై: కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులను ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్పోర్టు (బెస్ట్) సంస్థకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వెల్లడించింది. అయితే ఈ నిధులు అప్పు రూపంలో ఇవ్వనుండటంతో ఈ మొత్తాన్ని బెస్ట్ సంస్థ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా బెస్ట్ నష్టాల్లో నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో నష్టాల బాటలో నడుస్తున్న సంస్థకు రుణాలు ఇచ్చేందుకు ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరం బీఎంసీ రూ.1,600 కోట్లు బెస్ట్కు అప్పుగా ఇచ్చింది. అంతేగాకుండా చార్జీలు పెంచకుండా అందులో రూ.150 కోట్లు మినహాయింపు ఇచ్చింది. కాగా, ప్రస్తుతం బెస్ట్ సంస్థ ఆదీనంలో నడుస్తున్న 3,500 పైగా బస్సుల్లో సుమారు 300 బస్సులు పాడైపోయాయి. వీటి స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని బెస్ట్ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం బెస్ట్ సంస్థ రూ.700 కోట్లకుపైగా నష్టాల్లో నడుస్తోంది. చార్జీలు పెంచినప్పటికీ ఈ లోటును పూడ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 300 కొత్త బస్సులు కొనుగోలు చేయడం పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఆదుకునేందుకు బీఎంసీ ముందుకు రావడంతో బెస్ట్కు ఊరట లభించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై స్థాయి సమితి అధ్యక్షుడు శైలేష్ ఫణసే ఆమోద ముద్రవేశారు. కాగా, ముంబై అర్బన్ ట్రాన్స్పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ) మాదిరిగా బెస్ట్ బస్సులపై బీఎంసీ లోగో అమర్చాలని బీఎంసీ శరతులు విధించనుంది. ప్రస్తుతం నగరంలో సేవలు అందిస్తున్న బెస్ట్ బస్సుల్లో కొన్నింటిని ఎంయూటీపీ నిధులతో కొనుగోలు చేయడంతో వాటిపై ఎంయూటీపీ లోగో ఉంది. దీంతో బీఎంసీ అందజేసిన నిధులతో కొనుగోలు చేసిన బస్సులపై ఆ సంస్థ లోగో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. -
ప్రైవేట్పరం చేస్తే ప్రతిఘటిస్తాం
గోవాడ సుగర్స్ చైర్మన్ మల్లునాయుడు సీఎంను సైతం ధిక్కరిస్తాం అధ్యయన కమిటీకి స్పష్టీకరణ చోడవరం: అధ్యయన కమిటీ పేరుతో గోవాడ సుగర్స్ను ప్రై వేట్పరం చేయాలని ఆలోచన చేస్తే పార్టీలకతీతంగా ప్రతిఘటిస్తామని గోవాడ సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు హె చ్చరించారు. రాష్ట్రంలో చక్కెర ఫ్యాక్టరీల పనితీరుపై నియమిం చిన అధ్యయన కమిటీ శుక్రవా రం గోవాడ సుగర్స్లో రైతుల తో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటువంటి నిర్ణయమే తీసుకుంటే సీఎం చంద్రబాబును సైతం ధిక్కరిస్తామని ఉద్వేగంతో మాట్లాడారు. టీడీపీ అనుకూల పాలక వర్గం అయినా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీకి ఎటువంటి సహకారం అందించడం లేదని ఆయన ఆవేశంగా అన్నారు. హుద్హుద్ తుపాను నష్టాన్ని పరిశీలించి వెళ్లిన మంత్రులు ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఫ్యాక్టరీల పనితీరు విషయంలో మాత్రమే అధ్యయనం చేసేందుకు బృందం వస్తుందని తమకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. నష్టలలో ఉన్న వాటిని పెద్ద ఎత్తున సహాయం చేస్తున్న ప్రభుత్వం తమను మాత్రం ఆదుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు రైతుల మద్దతు లభించింది. వ్యాట్ రద్దు, కోజనరేషన్ పవర్ ధర పెంపు వంటి విషయాలలో ప్రభుత్వం నుంచి అనుకూల నిర్ణయం కోసం చూడాలని ఆయన అధ్యయన బృందాన్ని కోరారు. అధ్యయన బృందానికి కార్మికుల వినతి అధ్యయన బృందానికి సుగర్ ఫ్యాక్టరీ కార్మికుల తరపున వర్క్ మెన్ డెరైక్టర్ శ్రీనివాసరాజు. గుర్తింపు యూనియన్ నాయకుడు కె. భాస్కరరావు వినతిపత్రం సమర్పించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, డైలీవేజ్ కార్మికులు, సీజనల్కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వివరించారు. ఫ్యాక్టరీపై ప్రభుత్వం విధించిన వ్యాట్ ట్యాక్స్ను రద్దు చేయాలని, కోజనరేషన్ ధరలను పెంచాలని, దీనివల్ల ఫ్యాక్టరీపై ఆర్థికభారం తగ్గుతుందని ఫలితంగా లాభాలు పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వం స్పందించాలి సుగర్ ఫ్యాక్టరీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చ ర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అ ధ్యయన బృందం ముందు రైతులు ముక్త కంఠంతో నినదించారు.మాజీ ఎమ్మెల్యే, ైవె ఎస్సార్సీపీ నాయకుడు గూనూరు ఎ ర్రునాయుడు(మిలట్రీ నాయుడు) మా ట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం సుగర్ ఫ్యాక్టరీపై విధించిన వ్యాట్ ట్యాక్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీపై వ్యాట్ ట్యాక్స్ వి ధించడం వల్ల ఫ్యాక్టరీపై సుమారు రూ.8 కోట్లు భారం పడుతోందని ఆవేదన వ్య క్తం చేశారు. మొలాసిస్, విద్యుత్ తక్కువ టారిఫ్ వల్ల ఫ్యాక్టరీ నష్టపోతోందన్నారు. ఫ్యాక్టరీ కో జనరేషన్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్కు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.2.83ను పెంచాలని వారు డిమాండ్ చేశారు. చీపురుపల్లి సూర్యనారాయణ, గూనూరు సూర్యనారాయణ, భీశెట్టి సిం హాచలం, ఏడువాక సత్యారావు తదితర రైతులు పాల్గొన్నారు. రైతులు అభిప్రాయాలు బృందం సభ్యులు భరద్వాజ్, గురువారెడ్డి నమోదు చేసుకున్నారు.