pulichintala project
-
శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96, 369 క్యూసెక్కుల నీరు రావడంతో నీటినిల్వ 822.5 అడు గుల్లో 42.73 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ లోకి ఎలాంటి వరద చేరకపోగా.. పులిచింతల ప్రాజెక్టు లోకి కేవలం 640 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కాగా పులిచింతలకు దిగువన నదిపరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా కురిసిన వర్షాలకు కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కగా, ఏపీలోని ప్రకాశం బ్యారేజీలోకి 13,634 క్యూసెక్కుల నీరు చేరింది.ఇందులో కృష్ణా డెల్టా కు 1,309 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 12,325 క్యూసెక్కులను 17 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి అధికారులు వదిలేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద ప్రవాహం కొంత పెరిగింది. ఆల్మట్టిలోకి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు.దాని దిగువన నారాయణపూర్ డ్యామ్లోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1,45,750 క్యూసెక్కుల నీటికి వదలడంతో జూరాల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపి పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 1,29,000 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 1,34,161 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మూడు రోజుల్లో తుంగభద్ర గేట్లు ఎత్తేసే అవకాశంఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్లోకి 1,17,647 క్యూసెక్కుల నీటిరాకతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చే రుకుంది. నిండుకుండను తలపిస్తున్న తుంగభద్ర డ్యామ్ లో ఆదివారం విద్యుదుత్పత్తిని ప్రారంభించిన అధికారు లు.. 4,754 క్యూసెక్కులను దిగువకు వదిలారు. తుంగభద్రలో మరో మూడు రోజులు ఇదే రీతిలో వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 27 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. మూడు రోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశముంది. సాగర్ నీటిమట్టం 504.30 అడుగులునాగార్జునసాగర్/మునగాల: నాగార్జునసాగర్ నీటిమట్టం ప్రస్తుతం 504.30 అడుగులుగా ఉంది. తాగునీటికి అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 3,146 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ ద్వారా 800 క్యూసెక్కులు ఇలా మొత్తం 9,646 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్కు ఇన్ఫ్లో ఏమాత్రం లేదు.ఎడమకాల్వ లాకుల వద్ద పహారా: సూర్యాపేట జిల్లా మునగాలలోని సాగర్ ఎడమకాల్వ ప్రధాన లాకుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తుండగా, రైతులు ఈ నీటిని పంటల సాగుకు మళ్లించకుండా ఉండేందుకు పహారా ఏర్పాటు చేశారు. -
పురుగుల మందుతాగిన యువకుడు.. చికిత్స పొందుతూ
నల్లగొండ: పురుగుల మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన నున్న వీరయ్య, సరిత దంపతుల కుమారుడు నున్న సాయిరాం(27) డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్నాడు. శనివారం ఉదయం వీరయ్య గోదాంలో హమాలీ పనులకు, సరిత వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సాయిరాం ఇంట్లో గడ్డి మందు తాగాడు. స్థానికులు గమనించి నకిరేకల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. కాగా సాయిరాం ఆత్మహత్యకు గల కారాణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com పులిచింతల ప్రాజెక్టులో యువకుడు గల్లంతు మేళ్లచెరువు: పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణా పుష్కరఘాట్ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన యాంపంగు సందీప్(19) తన స్నేహితులు పాష, వెంకటేష్, నవీన్, సాయితో కలిసి కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జడపల్లి తండా సమీపంలోని పుష్కరఘాట్ వద్దకు వెళ్లారు. అందరూ కలిసి నదిలోకి దిగగా సందీప్ గల్లంతైనట్లు అతడి స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న అచ్చంపేట పోలీసులు అక్కడకు చేరుకొని కృష్ణా నదిలో వెతకడం ప్రారంభించారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపినట్లు తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి కేతేపల్లి: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ గ్రామానికి చెందిన చెవుగాని జానయ్య(52) వృత్తిరిత్యా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామ సమీపంలోని చెరువులో గాలంతో చేపలు పట్టేందుకు వెళ్లిన జానయ్య చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి మునిగి మృతిచెందాడు. సాయంత్రం చెరువులో మృతదేహం తేలియాడుతుండడాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి భార్య యల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పులిచింతల ప్రాజెక్టు గేటు బిగింపు పూర్తి
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు స్థానంలో కొత్త గేటును బిగించారు. జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్టు సంస్థ బీకెమ్ ప్రతినిధులు శుక్రవారం ఈ ప్రక్రియ పూర్తి చేశారు. 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 250 టన్నుల బరువున్న గేటును భారీ క్రేన్ల సహాయంతో అమర్చారు. స్పిల్ వే 16, 17 పియర్స్ (కాంక్రీట్ దిమ్మెలు) మధ్య గేటును దించి.. ఆర్మ్ గడ్డర్లను పియర్స్ ట్రూనియన్ బీమ్ల యాంకర్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లతో అనుసంధానం చేశారు. ఆ తర్వాత గేటును పైకి ఎత్తుతూ.. కిందకు దించుతూ పలుమార్లు పరీక్షించారు. గేటు పనితీరు ప్రమాణాల మేరకు ఉన్నట్లు అధికారులు తేల్చారు. జపాన్లో బుష్ల తయారీ, దిగుమతిలో జాప్యం వల్లే నాగార్జున సాగర్ నిండిపోవడంతో 2021 ఆగస్టు 4వ తేదీ సాయంత్రం 55,028 క్యూసెక్కులను తెలంగాణ అధికారులు దిగువకు విడుదల చేశారు. ఆ రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి భారీ వరద రావడంతో అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు 2021 ఆగస్టు 5 తెల్లవారుఝామున ఏడు గేట్లను రెండడుగులు ఎత్తారు. ఈ క్రమంలోనే 16వ గేటు ఎడమ వైపు పియర్ ట్రూనియన్ బీమ్ విరిగిపోయి గేటు ఊడిపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, 48 గంటల్లోనే దాని స్థానంలో స్టాప్లాగ్ గేటును ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేసి ఆయకట్టుకు నీరందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జలాశయంలో నీటి నిల్వ తగ్గాక కొత్త గేటు బిగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. 16, 17వ పియర్లకు ట్రూనియన్ బీమ్లను కొత్తగా నిర్మించారు. గేటును కూడా సిద్ధం చేశారు. గేటును పియర్స్ మధ్య బిగించడానికి, వాటి ఆర్మ్ గడ్డర్లను ట్రూనియన్ బీమ్లతో అనుసంధానం చేసే సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లను గతంలో జపాన్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. కొత్త బుష్ల తయారీలో జపాన్ సంస్థ తీవ్ర జాప్యం చేసింది. దీని వల్లే గేటు బిగింపు ఆలస్యమైంది. పది రోజుల క్రితం జపాన్ సంస్థ బుష్లను పంపడంతో అదే రోజు గేటు బిగింపు ప్రక్రియను ప్రారంభించిన అధికారులు శుక్రవారం పూర్తి చేశారు. కృష్ణా డెల్టాకు వరం.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటకు సకాలంలో నీటిని విడుదల చేసి.. తుపానులు వచ్చేలోగా పంట కోతలు పూర్తయ్యేలా చేయడం ద్వారా రైతుకు దన్నుగా నిలవాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 నవంబర్ 18న పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 20,37,656 క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు సులభంగా విడుదల చేసేలా పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు. స్పిల్వేకు 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 24 గేట్లను బిగించారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో 2014 నుంచి 2019 వరకు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధప్రాతిపదికన నిర్వాసితులకు పునరావాసం కల్పించి, 2019 ఆగస్టులోనే పులిచింతలలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గత నాలుగేళ్లుగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ కృష్ణా డెల్టాలో రెండు పంటలకు సకాలంలో నీళ్లందిస్తూ రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. -
కృష్ణమ్మకు భారీగా వరద
సాక్షి, అమరావతి: తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని మున్నేరు ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 1.97 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అదే స్థాయిలో దిగువకు వదిలేశారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, బుడమేరు, పాలేరు తదితర వాగులు, వంకల ప్రవాహం తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్ట్కు దిగువన కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 2,60,875 క్యూసెక్కులు చేరుతుండటంతో.. అంతే స్థాయిలో వరదను 55 గేట్లను 6 అడుగులు, 15 గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. జూలై చివరి వారంలో ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద రావడం.. గేట్లు ఎత్తి సముద్రంలోకి ఈ స్థాయిలో వరదను వదిలేయడం ఇదే తొలిసారి. ఖమ్మం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో శుక్రవారం వర్షాలు తెరిపి ఇవ్వడంతో శనివారం ప్రకాశం బ్యారేజీలోకి చేరే ప్రవాహం తగ్గనుంది. ఎగువ కృష్ణాలో స్థిరంగా ప్రవాహం పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి 1.66 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద కాస్త తగ్గింది. తుంగభద్ర డ్యామ్లోకి 1.07 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 59 టీఎంసీలకు చేరుకుంది. జూరాలకు ఎగువ నుంచి 1.22 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో స్పిల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్నారు. జూరాల నుంచి 1,20,390 క్యూసెక్కులు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల సుంకేశుల బ్యారేజ్ నుంచి 4,311, హంద్రీ నుంచి 117 వెరసి 1,24,818 క్యూసెక్కులు శ్రీశైలంలోకి చేరుతుండటంతో నీటి నిల్వ 45.53 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్లోకి చేరే వరద పెరగనుంది. ఇక తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మూసీ నుంచి పులిచింతలలోకి 55,144 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 28.03 టీఎంసీలకు చేరుకుంది. మరో 17 టీఎంసీలు చేరితే పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయనున్నారు. -
నేటి నుంచి పులిచింతల గేటు అమర్చే పనులు
అచ్చంపేట: పల్నాడు జిల్లా అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్ట్కు అమర్చిన 16వ నంబరు రేడియల్ గేటు 2021 ఆగస్ట్ 5న కృష్ణా నది వరదలకు కొట్టుకుపోగా.. కొత్త గేటు అమర్చే పనులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గేటు కొట్టుకుపోయిన నాటినుంచి ఇప్పటివరకు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా స్టాప్లాగ్ ఎలిమెంట్స్తో 16వ నంబర్ గేటును బ్లాక్చేసి ప్రాజెక్ట్లో సాగునీటిని నింపుతూ వచ్చారు. కాగా.. కొత్తగేటును అమర్చేందుకు ప్రభుత్వం రూ.22.05 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.7.53 కోట్లతో రేడియల్ గేటు తయారీ, రూ.1.73 కోట్లతో కాంక్రీట్ పనులు, రూ.9.57 కోట్లతో అన్ని గేట్లను క్రమబద్ధీకరించే పనులు చేపట్టాల్సి ఉంది. మరో రూ.3.20 కోట్లతో నడక దారిని ఏర్పాటు చేయాలి. ఆయా పనులు రెండు నెలలుగా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు కాంక్రీట్, గడ్డర్స్, ఆమ్స్, స్కిన్ప్లేట్స్ పనులను పూర్తి చేశారు. కొత్త రేడియల్ గేటును ప్రాజెక్ట్కు అమర్చాల్సి ఉంది. ఈ నెల 2 నుంచి 16 వరకు 16వ నంబర్ గేటు అమర్చే పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్ట్ మీదుగా రాకపోకలు నిలిపివేత పనులకు అంతరాయం ఏర్పడకుండా ప్రాజెక్ట్ మీదుగా మంగళవారం నుంచి 15 రోజులపాటు రాకపోకలను నిలిపివేశారు. రేడియల్ గేటు పైభాగంలో కోల్తార్ పెయింట్స్ వేసి రబ్బరు సీల్స్ బిగించి, గ్రీజింగ్ చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయిన వెంటనే రేడియల్ గేట్ను ప్రాజెక్ట్కు బిగించేందుకు 100 టన్నుల క్రాలర్ హెవీలోడ్ క్రేన్, 80 టన్నుల టైర్మౌంటెడ్ క్రేన్లను సిద్ధం చేశారు. పనులను సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అరుణకుమారి, అసిస్టెంట్ ఇంజినీర్లు విక్రమ్, వెంకటరెడ్డి పర్యవేక్షించనున్నారు. -
‘పులిచింతల’ చకచకా
సాక్షి, నరసరావుపేట/అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు మరమ్మతు పనులు చకచకా సాగుతు న్నాయి. ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22.04 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 45.77 టీఎంసీలు నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పులిచింతలలో 2019–20లో 45.77 టీఎంసీలు, 2020–21లో 45.77 టీఎంసీలు, 2021–22లో 44.53 టీఎంసీలు, 2022–23లో 45.77 టీఎంసీలు నీటిని నిల్వ చేశారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రారంభించిన నాటినుంచి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం విశేషం. 16వ గేట్ స్థానంలో రేడియల్ గేట్ నిర్మాణం గత ప్రభుత్వాలు నిర్మాణం, నిర్వహణలో అలసత్వం వల్ల డ్యామ్ 16వ గేట్ 2021 ఆగస్ట్ 5న వరద ఉధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 16వ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ గేట్ను యుద్ధప్రాతిపదికన అమర్చి నీటిని నింపి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంది. తర్వాత 40 టీఎంసీలకు పైగా నీటితో ప్రాజెక్టు కళకళలాడింది. ఈ గేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రూ.7.54 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రేడియల్ గేట్ ఏర్పాటు, దాన్ని అమర్చేందుకు అవసరమైన కాంక్రీటు దిమ్మెలు, క్రేన్స్ నిర్మాణాలు చేపడుతున్నారు. మే చివరి నాటికి అన్ని పనులు పూర్తి పులిచింతల ప్రాజెక్టు 16వ రేడియల్ గేట్ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గేట్ల అమరికకు అవసరమైన పనులు పూర్తయ్యాయి. ఇక గేట్లను ఆ స్థానంలో అమర్చి ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. అన్ని పనులు మే చివరి నాటికి పూర్తి చేస్తాం. రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టులో నీటి నిల్వకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం – రామకృష్ణ, ఎస్ఈ, పులిచింతల ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణకు రూ.9.57 కోట్లు పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 రేడియల్ గేట్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు తరచూ వివిధ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తుండటం, వందలాది టీఎంసీల నీరు ప్రాజెక్టు నుంచి కిందకు వెళుతున్న నేపథ్యంలో కొన్ని మరమ్మతులు చేయాల్సి వస్తోంది. వీటన్నింటికి ప్రభుత్వం రూ.9.57 కోట్లు ఖర్చు చేస్తోంది. రేడియల్, స్లూయిజ్ గేట్లు, క్రేన్లకు గ్రీజు, పెయింట్, గడ్డర్ల పటిష్టం వంటి పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా డ్యామ్ గేట్ల పిల్లర్ల పటిష్టానికి రూ.1.73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. డ్యామ్ రేడియల్ గేట్లకు చేరుకునే నడక దారి పునరుద్ధరణకు రూ.3.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రాజెక్టు పైనుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. గతంలో ఈ మార్గం నుంచి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు నుంచి తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు కొనసాగేవి. (చదవండి: బ్యాంకుల నుంచి పింఛన్ డబ్బు విత్డ్రా.. ఇకపై ఒక్కరు కాదు ఇద్దరు.. ) -
Fact Check: ‘గేటు’పై ఈనాడు అడ్డగోలు అబద్ధాలు
సాక్షి, అమరావతి: వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల గేటు బిగింపు పనులు, మరమ్మతులు తుదిదశకు చేరుకున్నాయని పసిగట్టిన ‘ఈనాడు’ ఆదరాబాదరగా ఓ అడ్డగోలు కథనాన్ని అచ్చేసి చంకలు గుద్దుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక వంటకాన్ని సిద్ధం చేయాలనే ఆదుర్దాతో ‘పులిచింతల గేటు ఏర్పాటు ఎప్పటికి?’ అంటూ బురద చల్లేందుకు ప్రయత్నించింది. మరో 15 రోజుల్లో గేటు బిగింపు పూర్తి కానుండగా 30 శాతం పనులే జరిగాయంటూ పచ్చి అబద్ధాలను ప్రచురించింది. గేట్ల బిగింపు పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. కాలినడక వంతెన పనులు 70 శాతం పూర్తి కాగా 23 పియర్ల కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ కూడా పూర్తైంది. ఈనాడు ఆరోపణ: వరదలకు కొట్టుకుపోయిన 16వ గేటు స్థానంలో కొత్తది ఏర్పాటు, మరమ్మతుల పనులకు పరిపాలన ఆమోదం కోసం 9 నెలల సమయం పట్టింది. వాస్తవం: ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్టు పరిస్థితిపై సాంకేతికంగా మదింపు చేసి మిగిలిన 23 గేట్ల పనితీరును నిశితంగా పరిశీలించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. మిగిలిన పియర్స్ కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ చేయాలని సూచించింది. కమిటీ సూచనల మేరకు జల వనరుల శాఖ రూపొందించిన అంచనాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. నిపుణుల కమిటీతో సమగ్ర అధ్యయనం జరిపించింది. పనులను రెండు భాగాలుగా విభజించి బెకెమ్ సంస్థకు అప్పగించారు. కాలినడక వంతెన పనులను స్వప్న కన్స్ట్రక్షన్స్కు కేటాయించారు. ఆరోపణ: నిధులు ఇవ్వక పోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. వాస్తవం: గేట్లకు సంబంధించి రూ.1.59 కోట్లు, కాలినడక వంతెన పనులకు సంబంధించి రూ.1.29 కోట్ల బిల్లులను ప్రభుత్వం త్వరలో చెల్లించనుంది. ఆరోపణ: గేటు తయారీ, బిగింపులో ఆలస్యం జరుగుతోంది. వాస్తవం: గేటు తయారీలో అతి ప్రధానమైన ట్రూనియన్ బుష్ బేరింగ్లను జపాన్ నుంచి ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. గేటును పియర్స్కు బిగించడానికి అవసరమైన కాంక్రీట్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. క్యూరింగ్కు 15 రోజులు పడుతుంది. గేటు తయారీ పూర్తయింది. మిగిలిన పియర్స్ కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ పూర్తయింది. 15 రోజుల్లో గేటు బిగింపు పూర్తి కానుండగా ‘ఈనాడు’ 30 శాతం పనులే పూర్తయినట్లు అవాస్తవాలు అచ్చేసింది. కాలినడక వంతెన పనుల్లో కూడా 70 శాతం (16వ గేటు వరకూ) పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతి గేటుకు స్టాప్లాగ్ గేటు అమర్చి రబ్బర్ సీళ్లను అమర్చే పనులు చేపట్టారు. ప్రణాళికాబద్ధంగా వాటిని పూర్తి చేసి ఈ సీజన్లో పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
జలయజ్ఞ ఫలం.. ఉప్పొంగుతున్న పులిచింతల
అచ్చంపేట: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మహానేత వరప్రసాదిని పులిచింతల ప్రాజెక్టు నిర్మితమైన దశాబ్దం తర్వాత తొలిసారిగా పూర్తిసామర్థ్యానికి నీటి నిల్వ చేరింది. 45.77 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగ్గా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 45.62 టీఎంసీల నీరు నిల్వ ఉంచారు. 2004 అక్టోబరులో భూమిపూజ ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కృష్ణా నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే ఎన్నో యేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబరు 15న గుంటూరు సరిహద్దులోని అచ్చంపేట మండలం, మాదిపాడు పంచాయతీ పరిధిలోని జడపల్లిమోటు తండాకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజచేశారు. 45.77 టీఎంసీల నీటి నిల్వతోపాటు 23 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. నిర్మాణ కాలంలో నక్సల్స్ ప్రభావం, భారీవర్షాలు, పర్యావరణ అనుమతులు వంటి ఎన్ని అవాంతరాలు వచి్చనా ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ తదిశ్వాస వరకు శ్రమించారు. ఆయన ఉండగానే 60 శాతం మేర పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత నత్తనడకన సాగిన పనులు ఎట్టకేలకు 2012లో పూర్తయ్యాయి. 2014 నుంచి 2019 వరకు వర్షాలు సక్రమంగా లేక రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో ప్రాజెక్టులో 20 నుంచి 25 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం సాధ్యం కాలేదు. గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు అచ్చంపేట, బెల్లంకొండ మండల పరిసరాలలో ఒకప్పుడు 400 నుంచి 500 అడుగులకుపైగా బోరు వేసినా చుక్కనీరు పడేది కాదు. కానీ ఇప్పుడు అవే భూముల్లో 100 నుంచి 200 అడుగుల లోపే నీళ్లు పడుతున్నాయి. ఇది పులిచింతల ప్రాజక్టు పుణ్యమే. 2019 నుంచి వరుణ కటాక్షం 2019 మే నెలలో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతోనే ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ప్రాజెక్టులో తొలి సారిగా 40 టీఎంసీలకు మించి నీటిని నిల్వ పెరిగింది. ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటినిల్వకు చేరింది. మూడేళ్లుగా కృష్ణా డెల్టాలోని 23 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. ఫలితంగా రైతులు రెండు పంటలూ పండిస్తున్నారు. ఇదీ చదవండి: నిర్మాణాత్మక వ్యవస్థతో ‘పారదర్శక’ సేవలు.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి -
అభివృద్ధికి కేరాఫ్ పల్నాడు
‘దాస్యమూ, దోపిడీ, దారిద్య్రమూ హెచ్చి, పాడిపంటల మేలు బంగారు నా తల్లి, కరవు కాపురమైందిరా పలనాడు.. కంటనీరెట్టిందిరా’ అంటూ కవి పులుపుల ఎంతో ఆవేదన చెందాడు ఆనాడు. ఇక మళ్లీ అలాంటి పరిస్థితులు ఎన్నడూ ఈ పలనాటి సీమ దరి చేరకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఇక్కడి మాగాణుల్లో ఆయకట్టు పెంచి ఆదాయ వనరులు పుష్కలంగా పెంపొందించేందుకు అన్ని అవకాశాలు కల్పించింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు నేడు ఫలనాడుగా మారనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వరికిపూడిశెల ప్రాజెక్టు కూడా రానుండటంతో పల్నాడు జిల్లాలో ఆయకట్టు పెరగనుంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పలనాడులోకే సాగునీటి ప్రాజెక్టులన్నీ రావడం విశేషం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాచర్ల నియోజకవర్గంలో ఉంటే, పులిచింతల ప్రాజెక్టు పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో ఉంది. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 41.8813 టీఎంసీలు ఉంది. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 544.90 అడుగులకు చేరింది. ఇది 198.6870 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకి 4,459, ఎడమకాలువకి 6,097, ఎస్ఎల్బీసీకి 1,650, వరదకాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగునీటికి ఇబ్బందులు లేని పరిస్థితులు నెలకొన్నాయి. వెనకబడిన పల్నాడు ప్రాంతంలో చెంతనే కృష్ణానది ఉన్నప్పటికీ సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. బుగ్గవాగు రిజర్వాయర్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీరు సరైన సమయంలో అందక పంటలు ఎండుముఖం పట్టేవి. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వరికపూడిశెలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ ఎత్తిపోతల పూర్తి అయితే 73 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి లేకుండా చూడవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బొల్లాపల్లి మండలంలో 25 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందటంతో పాటు వినుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. అలాగే ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో కూడా సాగు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. నూజెండ్ల మండలంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.95 కోట్లతో 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చేసేందుకు సర్వే పూర్తి చేశారు. నూజెండ్ల మండలం కంభంపాడు, కొత్తపాలెం, పువ్వాడ, ములకలూరు, ఉప్పలపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు వాణిజ్య పంటలకు పల్నాడు కేరాఫ్గా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పండే పత్తి, మిర్చి పంటలు 90 శాతం పల్నాడులోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది రికార్డు స్థా యిలో 2,66,640 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సుమారు రెండు లక్షల ఎకరాల వరకూ పల్నాడు ప్రాంతంలోనే సాగైంది. జిల్లాలో మాచర్ల, దుర్గి, రెంటచింతల, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, రాజు పాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, ఫిరంగిపురం, మేడికొండూరు, అమరావతి, బెల్లంకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల తదితర మండలాల్లో విస్తారంగా మిర్చి పంట సాగు చేశారు. మరోవైపు పత్తిని తీసుకుంటే జిల్లాలో 4,23,750 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది గులాబీ రంగు పురుగు ఉధృతి వల్ల 2,73, 950 ఎకరాల్లోనే సాగు అయ్యింది. అందులో కూడా 90 శాతం పల్నాడులోనే సాగు అయ్యింది. పల్నాడు ప్రాంతంలో 2.81 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో 7,13,142 ఎకరాలు సాధారణ విస్తీర్ణం ఉంది. భవిష్యత్లో కూడా వాణిజ్య పంటల కారణంగా పల్నాడు జిల్లాకు ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాష్ట్రంలో అధిక ఆదాయం పొందే జిల్లాల్లో పల్నాడు కూడా నిలిచే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. -
శ్రీశైలం డ్యామ్లో 4 గేట్లు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల) /సత్రశాల (రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండడంతో నాలుగు గేట్లను తెరచి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల హంద్రీ నుంచి 1,79,728 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సోమవారం నాలుగు గేట్ల ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ మరో 64,615 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 214.8450 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది. అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు 10 క్రస్ట్గేట్ల ద్వారా 1,36,304 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం గరిష్ట స్థాయిలో 590 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా నాగార్జున సాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 1,70,121 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. -
శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట: శ్రీశైలం జలాశయానికి సోమవారం వరద ప్రవాహం పెరిగింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, సుంకేసుల, హంద్రీ నదుల నుంచి 33,650 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తూ తెలంగాణ 12,713 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తోంది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఎడమగట్టు కేంద్రంలో 6.890 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. కాగా, డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 13.10 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం జలాశయంలో 160.5282 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 874.30 అడుగులకు చేరుకుంది. పులిచింతలకూ వరద ప్రవాహం.. మరోవైపు నాగార్జునసాగర్ దిగువన పులిచింతల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం వస్తోంది. నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో అధికంగా నీరు ప్రాజెక్టులోకి చేరుతోందని ఏఈ రాజశేఖర్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 61,628 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణ పనులు జరుగుతున్నందున 53 మీటర్ల లోతు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో 50 మీటర్లకు మించి నీరు నిల్వ ఉంచే అవకాశం లేదన్నారు. అందువల్ల ఎగువ నుంచి వచ్చే నీటిని దిగువకు వదులుతున్నామని వివరించారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.5871 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. పూర్తి సామర్థ్యంతో నీటిని నింపాలంటే పనులు పూర్తి కావాలని చెప్పారు. ఇందుకు మరో 20 రోజులు పడుతుందని తెలిపారు. -
టెన్షన్.. టెన్షన్; నది మధ్యలో.. నాలుగు గంటలు
నందిగామ: అదో ఇసుక రీచ్.. శుక్రవారం అర్ధరాత్రి.. ఇసుక తవ్వే జేసీబీలు.. నింపుకొనే టిప్పర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. నిరంతరాయంగా ఇసుక తవ్వుతూ, వాహనాల్లో నింపుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నదిలో ప్రవాహం పెరిగింది.. కాసేపటికే వాహనాలను ముంచెత్తింది. పెద్ద సంఖ్యలో టిప్పర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు, సిబ్బంది నదిలో చిక్కుకుపోయి.. బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించారు. పులిచింతల ప్రాజెక్టు దిగువన ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బయటికెళ్లే మార్గం తెగిపోయి.. చెవిటికల్లు ఇసుక రీచ్ నుంచి రోజూ వందల వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు ఇసుక లోడ్ చేసుకునేందుకు రీచ్కు వెళ్లాయి. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి అర్ధరాత్రి సమయంలో నీటిని విడుదల చేశారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నదిలో ఒక్కసారిగా వరద పెరిగింది. ఆ సమయంలో నదిలో 132 టిప్పర్లు/లారీలు, నాలుగు ట్రాక్టర్లు, కొన్ని జేసీబీలు ఉన్నాయి. నది ప్రవాహాన్ని గుర్తించిన కొందరు డ్రైవర్లు, సిబ్బంది వెంటనే బయటికి వెళ్లగలిగారు. ఇంతలోనే నదిలోకి వేసిన తాత్కాలిక మార్గం కొట్టుకుపోయింది. దాంతో 123 మంది నదిలోనే చిక్కుకుపోయారు. వాహనాలన్నీ ఆగిపోయాయి. దీనిపై సమాచారం అందిన పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం 6.30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి నాటు పడవల సాయంతో 123 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వాహనాలన్నీ నదిలోనే ఉండిపోయాయి. తెగిపోయిన మార్గాన్ని పునరుద్ధరించి వాటిని బయటికి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. -
పులిచింతలను పరిశీలించిన నిపుణుల కమిటీ
సాక్షి, అమరావతి/అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ బుధవారం ప్రాజెక్టును పరిశీలించింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి ప్రాజెక్టులో నీటినిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈనెల 5న తెల్లవారుజామున దిగువకు ప్రవాహాన్ని విడుదల చేసేందుకు గేట్లు ఎత్తేటపుడు సాంకేతిక లోపం వల్ల 16వ గేటు ఊడిపోవటం తెలిసిందే. వరద ఉధృతికి కొట్టుకుపోయిన గేటు స్థానంలో రికార్డు సమయంలో స్టాప్లాగ్ గేటును ఏర్పాటుచేసి ప్రాజెక్టులో నీటినిల్వకు మార్గం సుగమం చేసిన ప్రభుత్వం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసింది. గేటు ఊడిపోవడానికి కారణాలు, ప్రాజెక్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఈఎన్సీ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన డిజైన్స్ సలహాదారు గిరిధర్రెడ్డి, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, సీడీవో (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్) సీఈ శ్రీనివాస్ సభ్యులుగా, పులిచింతల ఎస్ఈ రమేష్బాబు కన్వీనర్గా నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బుధవారం పులిచింతల ప్రాజెక్టును పరిశీలించింది. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు కృష్ణా బోర్డు కమిటీ బుధవారం రావడంతో ఆ కమిటీకి వివరాలను అందించేందుకు ఈఎన్సీ నారాయణరెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజైన్స్ సలహాదారు గిరిధర్రెడ్డి, రిటైర్డ్ సీఈ సత్యనారాయణ, సీడీవో సీఈ శ్రీనివాస్, పులిచింతల ఎస్ఈ రమేష్బాబు బుధవారం పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. 9వ నంబరు గేటును ట్రయల్ రన్ వేశారు. 23 గేట్లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని తేల్చారు. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయవచ్చని సూచించారు. మరోసారి పరిశీలిస్తాం గేటు ఊడిపోవడానికి దారితీసిన పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేశారు. స్పిల్ వే కాంక్రీట్, స్టీల్ పటిష్టతను తేల్చేందుకు పరీక్షలకు పంపాలని నిర్ణయించారు. పరీక్షల్లో కాంక్రీట్, స్టీల్ పటిష్టతను బట్టి.. గేటు ఊడిపోవడానికి కారణాలను అన్వేషించవచ్చునని డిజైన్స్ సలహాదారు గిరిధర్రెడ్డి చెప్పారు. వరద ఉధృతికి ఊడిపోయిన గేటు పూర్తిగా వంగిపోయిందని.. ఆ గేటు మళ్లీ వినియోగించడానికి పనికిరాదని తేల్చారు. ఆ గేటు స్థానంలో కొత్తది తయారుచేసి అమర్చాలని నిర్ణయించారు. గేట్ల నిర్వహణను మరింత మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో కాంక్రీట్, స్టీల్ పటిష్టత తేలాక ప్రాజెక్టును మరోసారి పరిశీలించి, అధికారులతో సమీక్షించి ప్రాజెక్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. -
‘స్టాప్ గేటు’ ఫలవంతం: పులిచింతలకు జలకళ
సాక్షి, అమరావతి బ్యూరో: పులిచింతల ప్రాజెక్టు మళ్లీ జలకళ సంతరించుకుంది. జలాశయంలో నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ప్రాజెక్టుకు చెందిన 16వ గేటు విరిగిపోవడంతో, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసేందుకు, ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేశారు. మరమ్మతుల సమయానికి ప్రాజెక్టులో నీటి మట్టం ఐదు టీఎంసీల కనిష్ట స్థాయికి పడిపోయింది. యుద్ధప్రాతిపదికన స్టాప్ గేటు ఏర్పాటు చేశారు. కృష్ణా ఎగువ ప్రాంతాల నుంచి వరద స్థిరంగా కొనసాగుతుండటంతో మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటి నిల్వ 17.64 టీఎంసీలకు చేరింది. దీంతో పులిచింతల ప్రాజెక్టు మళ్లీ నీటితో కళకళలాడుతూ కనిపిస్తోంది. కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి 18,887 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పట్టిసీమ నీరు తీసుకోకుండానే.. కృష్ణా డెల్టాలో ముమ్మరంగా వరి నాట్లు సాగుతున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా కాలువలకు నీటిని పుష్కలంగా విడుదల చేస్తున్నారు. కేఈబీ, ఏలూరు కాలువలకు 1400 క్యూసెక్కుల చొప్పున, బందరు కాలువకు 2200, రైవస్ కాలువకు నాలుగు వేలు, కృష్ణా పశి్చమ డెల్టాకు 6200, గుంటూరు కాలువకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాలువలకు సాగునీరు ఇచ్చేందుకు వీలుగా బ్యారేజీ గేట్లు మూసి వేశారు. నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళికబద్ధంగా పట్టిసీమ నీరు తీసుకోకుండానే, పులిచింతల ప్రాజెక్టు నుంచి అవసరమున్న మేరకు నీటిని సేకరిస్తూ, మిగిలిన నీటిని నిల్వ చేస్తున్నారు. రైతు ప్రయోజనాలకు పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు విరిగిపోయినా దాని స్థానంలో రికార్డు స్థాయిలో రెండు రోజుల్లో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమమైంది. డెల్టా ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి తన చిత్త శుద్ధిని నిరూపించుకొంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద పెరిగింది. ప్రాజెక్టులోకి 1,46,318 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,46,317 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 63,317 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టులోకి 40,636 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. డెల్టా సాగు నీటిని అవసరాలకు దిగువనున్న ప్రకాశం బ్యారేజీలోకి 18,887 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నదికి స్వల్పంగా వరద పెరిగిన నేపథ్యంలో, సాగు నీటి అవసరాలకు సరిపడా నీటిని వినియోగించుకొంటూనే, పులిచింతల ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలకు వారం రోజుల్లోపే చేరుతుందని నీటి పారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నాం స్టాప్లాగ్ ఏర్పాటు కోసం పులిచింతల ప్రాజెక్టులో నీరు తగ్గించాం. గేటు ఏర్పాటు పూర్తవడంతో తిరిగి నీటిని నిల్వ చేస్తున్నాం. ప్రస్తు తం 17.64 టీఎంసీల నీరు ఉంది. కృష్ణానదికి వరద స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నింపుతున్నాం. త్వరలో ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, తగు చర్యలు తీసుకొంటున్నాం. - రమేశ్బాబు, ఎస్ఈ, పులిచింతల ప్రాజెక్టు -
కేఆర్ఎంబీ ఆదేశాలు పట్టించుకోని తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులి చింతల ప్రాజెక్టుల్లో జలవిద్యుత్తు ఉత్పాదన నిలిపివేయాలంటూ పలుసార్లు ఆదేశాలిచ్చినా తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని కేంద్రం తెలిపిం ది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లకుండా తెలంగాణ ఏకపక్షంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తోందని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి జూలై 5న లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ పవర్హౌస్లో విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయాలంటూ జూన్ 17న తెలంగాణ జెన్కోను ఆదేశించినట్లు తెలి పారు. అయినప్పటికీ శ్రీశైలం లెఫ్ట్ పవర్హౌస్తో పాటు నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్తు ఉత్పాదనను కొనసాగించడంతో వెంటనే నిలిపివేయాలని జూలై 15న తెలంగాణ జెన్కో అధికారులను కేఆర్ఎంబీ ఆదేశించిందన్నారు. విద్యుత్తు ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు, తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జలవిద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కేఆర్ఎంబీ స్పష్టం చేసినట్లు చెప్పారు. కేఆర్ఎంబీ లేఖలకు తెలంగాణ జెన్కో (హైడల్) డైరెక్టర్ జూలై 16న ప్రత్యుత్తరమి స్తూ తమ ప్రభుత్వ ఆదేశాల మేరకే జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారన్నారు. విద్యుత్తు ఉత్పాదన కోసం నీటిని వినియోగించేందుకు ఆదేశాలు జారీచేసే వరకు.. శ్రీశైలం లెఫ్ట్ పవర్హౌస్, నాగా ర్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్లలో విద్యుత్ ఉ త్పాదన కోసం నీటి విడుదలను నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీ జూలై 16న రా సిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలి పారు. అయినప్పటికీ కేఆర్ఎంబీ ఆదేశాలను బేఖా తరు చేస్తూ తెలంగాణ జలవిద్యుత్తు ఉత్పత్తిని కొనసాగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేఆర్ఎంబీకి కల్పించిన అధికారాలను సద్వినియో గం చేసేదిశగా ఆ బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ను జారీచేసినట్లు చెప్పారు. దీనివల్ల బోర్డు సమర్థంగా పనిచేస్తుందన్నారు. విశాఖ ఉక్కుకు రబోధి బొగ్గు గనులు విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)కు జార్ఖండ్లోని రబోధి బొగ్గు గనులు కేటాయిస్తూ 2019లోనే ఆదేశాలు జారీచేసినట్లు కేంద్రం తెలిపింది. కోకింగ్ కోల్ లభించే రబోధి బొగ్గుగనిని ఆర్ఐఎన్ఎల్కు కేటాయిస్తున్నట్లుగా నామినేటెడ్ అథారిటీకి 2019 డిసెంబర్ 16న ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్జోషి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆర్ఐఎన్ఎల్కు అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని కూడా ఆ ఆదేశాల్లో స్పష్టంగా ఉందన్నారు. ఆర్ఐఎన్ఎల్కు బొగ్గు గనులను కేటాయించాలని కోరుతూ బొగ్గు మంత్రిత్వశాఖకు పలు దఫాలుగా విజ్ఞప్తులు వచ్చిన విషయం వాస్తవమేనని చెప్పారు. ఆ విజ్ఞప్తుల మేరకే ఆర్ఐఎన్ఎల్కు రబోధి గనుల కేటాయింపు జరిగిందన్నారు. అయితే ప్రభుత్వరంగ సంస్థల్లో కొన్నింటిని వ్యూహాత్మక విక్రయం చేయాలన్న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు ఆర్ఐఎన్ఎల్లోని నూరుశాతం ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి నాటికి సాలూరు బైపాస్ రోడ్డు పూర్తి రాయపూర్–విశాఖపట్నం సెక్షన్ జాతీయ రహదారి 26లో భాగంగా సాలూరు టౌన్ వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కోవిడ్ లాక్డౌన్ పరిస్థితుల కారణంగా బైపాస్ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం 32 శాతం బైపాస్ పనులు జరిగాయని, గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కల్పన చేస్తున్నట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే తెలిపారు. ఈ పథకం ద్వారా 2018–19 నుంచి 2021–22లో జూలై 9 వరకు 6,536 మెక్రో ఎంటర్ప్రైజెస్ల ఏర్పాటు ద్వారా 52,288 మందికి ఉపాధి కల్పన అంచనా వేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు జవాబుగా తెలిపారు. -
పులిచింతల ప్రాజెక్టు వద్ద భూప్రకంపనలు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు సమీపంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. తెలంగాణ వైపు చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూమి మూడు సార్లు కంపించింది. రిక్టర్ స్కేల్పై మొదటిసారి 2.3, రెండోసారి 2.7, మూడో సారి 3.0గా నమోదైనట్టు అధికారులు చెప్పారు. గుంటూరు జిల్లా వైపు జడపల్లిమోటుతండా, కంచుబోడుతండాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. పులిచింతలలో పెరుగుతున్న నీటి నిల్వ స్టాప్లాగ్ గేటు ఏర్పాటు అనంతరం పులిచింతల ప్రాజెక్టులో నీటినిల్వను పెంచుతున్నారు. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రాజెక్టులో నీటిమట్టం 139.33 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో నీరు 9.307 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు, పూర్తి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 36.47 టీఎంసీలు అవసరం. స్టాప్లాగ్ గేటు ఏర్పాటుచేసే సమయానికి 5 టీఎంసీలున్న నీరు ఆదివారం రాత్రికి 9.307 టీఎంసీలకు చేరడంతో 10 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొట్టుకుపోయిన 16వ నంబరు గేటును బయటకు తీయడానికి మరికొంత సమయం పడుతుందని ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్ విలేకరులతో చెప్పారు. శ్రీశైలం జలాశయంలో 210.5133 టీఎంసీలు, నాగార్జునసాగర్లో 311.7462 టీఎంసీల నీరు ఉంది. సాగర్ నుంచి 50,662 క్యూసెక్కుల ప్రవాహం పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతోంది. నాగార్జునసాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.799 టీఎంసీల నీరున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగనర్సింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. పులిచింతల నుంచి ఒక గేటు ద్వారా 12,341 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 17,148 క్యూసెక్కులు చేరుతుండగా గేట్లను మూసివేసి, కృష్ణా డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. -
రికార్డు సమయంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు
-
దోపిడీ బట్టబయలు కాకుండా.. రు‘బాబు’
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టులో చేసిన తప్పులు, దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవాస్తవాలను వల్లె వేస్తూ నెపాన్ని మరొకరిపై నెడుతున్నారని నీటి పారుదల రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే సమయంలో ప్రోటోకాల్ ప్రకారం నిపుణుల కమిటీతో ప్రాజెక్టును తనిఖీ చేయించాలి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, ఏవైనా లోపాలు ఉంటే వాటిని చక్కదిద్దాలి. ఆ తర్వాత ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలి. ఈ ప్రోటోకాల్ ప్రకారమే రిటైర్డు సీఈ కె.సత్యనారాయణ, డిజైన్స్ సలహాదారు, రిటైర్డు ఈఎన్సీ డాక్టర్ పి.రామరాజు అధ్యక్షతన ఏర్పాటైన స్పెషల్ డ్యామ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ టీమ్ (ఎస్డీఎస్ఐటీ) 2015 జనవరి 5న పులిచింతల ప్రాజెక్టును తనిఖీ చేసింది. గేట్లను ఎత్తడానికి, దించడానికి ఏర్పాటు చేసిన వైర్లను సరి చేయాలని, స్పిల్ వే గ్యాలరీలో సీపేజీ(లీకేజీ)కి అడ్డుకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేయాలని.. స్పిల్ వే నుంచి 15 మీటర్ల పొడవున 500 మిల్లీమీటర్ల మందంతో అప్రాన్ నిర్మించాలని సూచిస్తూ సర్కార్కు నివేదిక ఇచ్చింది. ఈ పనులను బొల్లినేనికి చెందిన ఎస్సీఆర్–సీఆర్18జీ సంస్థే చేయాలి. వాటికి అదనంగా ఎలాంటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ.. ఆప్రాన్ను కొత్త కాంట్రాక్టర్తో చేయించి, బిల్లులు చెల్లించారు. గ్రౌటింగ్ సక్రమంగా చేయకుండానే బొల్లినేనికి బిల్లులు చెల్లించారు. గేట్ల వైర్లను, ట్రూనియన్ బీమ్ల యాంకర్లో యోక్ గడ్డర్లను పట్టించుకోలేదు. నివేదికలో పేర్కొన్న అధిక అంశాలను బుట్టదాఖలు చేశారు. లోపాలు బయట పడకుండా డ్రామాలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణపై చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవని నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే 1995లో ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని గుర్తు చేస్తున్నారు. కృష్ణా వరదల నియంత్రణలోబాబు విఫలమవడం వల్లే 1998లో శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు విద్యుత్ కేంద్రాన్ని వరద ముంచెత్తిందని చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడం వల్లే 2003 అక్టోబర్ 30న వైఎస్సార్ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని, చివరకు సొంత జిల్లా చిత్తూరులో 2018లో కాళంగి ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోవడానికి చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రజాధనాన్ని దోచుకోవడం మినహా వాటి భద్రతపై ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించని చంద్రబాబు.. ఇప్పుడు తన దోపిడీ, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలాడుతున్నారని అధికార వర్గాలు మండిపడుతున్నాయి. కాంట్రాక్టర్ షరతులకు అంగీకారం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారని పులిచింతల ప్రాజెక్ట్ సీఈ నివేదిక ఇచ్చాకే బ్యాంకు గ్యారంటీలు వెనక్కు ఇవ్వాలి. కానీ అలా నివేదిక ఇవ్వకుండానే ఆ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్, ఈఎండీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రూపంలో బ్యాంకు గ్యారంటీలు (అగ్రిమెంటు విలువలో 7.5 శాతం) సుమారు రూ.21 కోట్లను చెల్లించేలా 2018లో చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. అదనపు పరిహారం చెల్లింపు అంశంపై (ఆర్బిట్రేషన్ నిబంధనను కాంట్రాక్టర్ అడ్డం పెట్టుకుని) మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయకుండా, 766 రోజులపాటు అధికారులను అడ్డుకుని కాంట్రాక్టర్కు చంద్రబాబు దన్నుగా నిలిచారు. తీరా తీవ్ర జాప్యం చేశాక, కేసు విచారించాలంటే చెల్లించాల్సిన పరిహారంలో 50 శాతం.. రూ.199.67 కోట్లను డిపాజిట్ చేయాల్సిందేనని కాంట్రాక్టర్ పెట్టిన షరతుకు అంగీకరించారు. ఆ మేరకు చెల్లింపులు చేస్తూ 2018 జనవరి 18న చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాతే.. కాంట్రాక్టు అగ్రిమెంటు విలువ రూ.268.89 కోట్ల కంటే అదనంగా అంతే మొత్తాన్ని బొల్లినేనికి చెల్లించడం ద్వారా చంద్రబాబు కమీషన్లు దండుకున్నారు. ఈ తప్పులు, ఎస్డీఎస్ఐటీ నివేదికను అమలు చేయకపోవడం వల్లే ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు ఊడిపోయిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే అవాస్తవాలు వల్లె వేస్తున్నారని మండిపడుతున్నారు. -
రికార్డు సమయంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు
సాక్షి, అమరావతి, సాక్షి, అమరావతి బ్యూరో, అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిపోయిన రెండు రోజుల్లోనే దాని స్థానంలో శనివారం స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమం చేసి, రికార్డు సృష్టించారు. ప్రాజెక్టు గేటు విరిగిపోయాక.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువ సమయంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసి, నీటి నిల్వను పునరుద్ధరించిన దాఖలాలు లేవని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. సాగర్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో శనివారం రాత్రి 11 గంటలకు పులిచింతల ప్రాజెక్టులోకి 37,332 క్యూసెక్కులు చేరుతున్నాయి. విద్యుదుత్పత్తి ద్వారా 12,968 క్యూసెక్కులను తెలంగాణ ప్రభుత్వం దిగువకు విడుదల చేస్తోంది. స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుతో ప్రాజెక్టులో నీటి మట్టం 129.19 అడుగుల్లో 6.4 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు గేట్లు అన్నీ మూసి వేశారు. కాగా, గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు 16వ గేటును ఎత్తే సమయంలో ట్రూనియన్ బీమ్ యాంకర్ యోక్ గడ్డర్లో సమస్య తలెత్తడంతో గేటు ఊడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, అధికారులను సీఎం ఆదేశించడంతో యుద్ధ ప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు పనులకు ఉపక్రమించారు. నిర్విరామ శ్రమతో ఫలితం 17 గేట్లు ఎత్తేసి.. దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో శనివారం తెల్లవారుజాముకు ప్రాజెక్టులో నీటి నిల్వను క్రస్ట్ లెవల్కు అంటే 3.66 టీఎంసీలకు తగ్గించారు. ఎగువ నుంచి 46 వేల క్యూసెక్కుల వరద వస్తున్నప్పటికీ లెక్క చేయకుండా శనివారం ఉదయం నుంచే ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో బీకెమ్ ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. స్టాప్ లాగ్స్ను క్రేన్ల ద్వారా సక్రమంగా బిగించేందుకు వైజాగ్కు చెందిన సీలైన్ ఆఫ్షోర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన 10 మంది సభ్యుల బృందం నిర్విరామంగా శ్రమించింది. స్టాప్ లాగ్ను అమర్చుతున్న దృశ్యం విరిగిపోయిన 16వ గేటు వెనుక భాగంలో రెండు పియర్లకు ఏర్పాటు చేసిన రెయిలింగ్ ద్వారా స్పిల్ వే బ్రిడ్జిపై నుంచి గ్యాంట్రీ క్రేన్ ద్వారా తొలుత 17 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల ఎత్తు, 28 టన్నుల బరువు ఉన్న ఎలిమెంటు (ఇనుప దిమ్మె)ను దించారు. దానిపై అంతే బరువున్న రెండో ఎలిమెంటును దించారు. అప్పటి నుంచే నీటి నిల్వ మొదలైంది. ఇలా ఎలిమెంట్లను ఒకదానిపై మరొకటి ఏర్పాటు చేస్తూ నీరు కిందకు రాకుండా రబ్బర్ సీళ్లు వేశారు. అర్ధరాత్రి చివరగా 23 టన్నుల బరువున్న 11వ ఎలిమెంటును దించారు. దాంతో 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో కూడిన స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఇది మిగతా గేట్ల తరహాలో ఎత్తడానికి, దించడానికి వీలుండదు. నీటి నిల్వకు దోహదం చేస్తుంది. పూర్తి గేటు ఏర్పాటుకు కసరత్తు విరిగిపోయిన పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయి, స్పిల్ వే నుంచి దాదాపు 750 మీటర్ల దూరంలో పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. గడ్డర్స్ ఆచూకీ లభించలేదు. ప్రవాహం తగ్గాక.. 250 టన్నుల బరువున్న గేటును వెలికితీసి, పరిశీలిస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. పటిష్టంగా ఉంటే అదే గేటును బిగిస్తామని.. లేదంటే దాని స్థానంలో కొత్తగా గేటును తయారు చేస్తామని చెప్పారు. గేటు బిగించడానికి రెండు పియర్లకు ట్రూనియన్ బీమ్లు దెబ్బతిన్న నేపథ్యంలో వాటిని తొలగించి కొత్తగా నిర్మిస్తామన్నారు. ట్రూనియన్ బీమ్ యాంకర్లో గేట్ల ఆర్మ్ గడ్డర్లను అనుసంధానం చేయడానికి సెల్ఫ్ లూబ్రికెంట్ బుష్లను గతంలో జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు అవి బాగుంటే వాటినే ఉపయోగిస్తామని.. లేదంటే జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తి గేటును బిగించేందుకు రెండు నెలల సమయం పడుతుందన్నారు. స్టాప్ లాగ్ గేటు ద్వారా పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలు నిల్వ చేస్తామని, కృష్ణా డెల్టా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని ప్రధాన ప్రాజెక్టులను పరిశీలిస్తాం పులిచింతల ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులను పరిశీలిస్తామని జల వనరుల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ప్రాజెక్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యయన కమిటీ వేయాలని ఆదేశించారని చెప్పారు. ఈ కమిటీ వారం రోజుల్లోగా నివేదిక ఇస్తుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు పనులను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను శనివారం సందర్శించారు. -
ఆందోళన వద్దు.. 10 రోజుల్లో ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నింపుతాం..!
కృష్ణా: పులిచింతల స్టాప్లాగ్ గేట్ పనులను ప్రభుత్వ విప్ ఉదయ భాను పరిశీలించారు. స్టాప్ లాగ్ గేట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. నేటి రాత్రి (శనివారం)కి స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు పూర్తవుతుందన్నారు. 16వ గేటు కొట్టుకువపోవడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని ఉదయ భాను పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు భవిష్యత్తులో హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటును పరిశీలిస్తామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన విమర్షించారు. లోకేష్ విషయం తెలియకుండా ట్వీట్లు చేస్తున్నారని దుయ్య బట్టారు. మచిలీపట్నం కోర్టు తీర్పుపై హైకోర్టుకి అపీల్కి వెళ్లకుండా.. చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాన్ని అప్పనంగా దోచిపెట్టే ప్రయత్నం చేయలేదా? అని అడిగారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే గత ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేసిందని విమర్షించారు. 10 రోజుల్లో ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నింపుతామని, కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ ఉదయభాను తెలిపారు. -
కొత్త గేట్ ఏర్పాటుకి ప్రతిపాదనలు పంపుతాం
-
పులిచింతల: శరవేగంగా స్టాప్ లాక్ గేటు పనులు
సాక్షి, గుంటూరు: పులిచింతల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయని ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. సాయంత్రానికి స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. స్టాప్ లాక్ గేటు పూర్తికాగానే రిజర్వాయర్ నింపుతామన్నారు. పులిచింతల ఘటనపై అధ్యయనానికి నిపుణుల కమిటీ నియమించామని, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈఎన్సీ పేర్కొన్నారు. -
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద కొనసాగుతున్న మరమ్మతు పనులు
-
పులిచింతల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే..
సాక్షి, అమరావతి: చంద్రబాబు కమీషన్ల కక్కుర్తే పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడానికి కారణమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుతోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కాంట్రాక్టర్ బొల్లినేని రామారావు నిర్వాకాలు పులిచింతల ప్రాజెక్టు, కృష్ణా డెల్టా రైతులను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయని మండిపడ్డారు. పులిచింతల పాపం ముమ్మాటికీ బాబుదేనని విమర్శించారు. ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని 2015లోనే భద్రతా కమిటీ నివేదిక ఇచ్చినా బాబు సర్కారు బేఖాతరు చేసిందన్నారు. ఆనాడే చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. సగర ఉప్పర కులస్తుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమావేశం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. దీనికి సగర ఉప్పర కార్పొరేషన్ చైర్పర్సన్ గానుపెంట రమణమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేత బంగారు శీనయ్యలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి సజ్జల మాట్లాడుతూ బీసీల్లో చిన్న కులాల నేతలను ప్రజాప్రతినిధులుగా ఎదిగేలా చేసేందుకు సీఎం జగన్ ధృడసంకల్పంతో ఉన్నారన్నారు. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ చిన్నగోవిందరెడ్డి, నవరత్నాల అమలు కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇవీ చదవండి: ఏపీ కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే.. -
యుద్ధప్రాతిపదికన ‘గేటు’ పునరుద్ధరణ పనులు
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/అచ్చంపేట (పెదకూరపాడు): పులిచింతల ప్రాజెక్టులో ఎడమ వైపున ట్రూనియన్ బీమ్ విరిగిపోవడం వల్ల ఊడిపోయిన 16వ గేటు స్థానంలో యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేటును అమర్చేందుకు జల వనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. స్టాప్ లాగ్ గేటును దించేందుకు ముందస్తుగా చేపట్టాల్సిన పనులను ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ పర్యవేక్షణలో బీకెమ్ సంస్థ నిపుణులు శుక్రవారం పూర్తి చేశారు. శనివారానికి ప్రాజెక్టులో నీటిమట్టం క్రస్ట్ లెవల్ (గేట్లు అమర్చే స్థాయి)కు చేరగానే.. స్టాప్ లాగ్ గేటును దించుతామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ గేటును 11 ఎలిమెంట్స్(భాగాలు)గా కిందికి దించుతారు. ఊడిపోయిన 16వ గేటు వెనుక భాగంలో పియర్స్కు అమర్చిన రెయిలింగ్ ద్వారా 17 మీటర్ల వెడల్పు, సుమారు 1.68 మీటర్ల పొడవు గల 28 టన్నుల ఎలిమెంట్ను తొలుత దించుతారు. దానిపై అంతే వెడల్పు, ఎత్తుతో కూడిన 26 టన్నుల బరువైన ఎలిమెంట్ దించుతారు. వాటికి ముందే అమర్చిన రబ్బర్ సీల్స్తో ఆ రెండు ఎలిమెంట్లను అతికిస్తారు. ఇలా 11 ఎలిమెంట్లను ఒక దానిపై ఒకటి దించి.. అతికించడం ద్వారా 18.5 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో కూడిన స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేస్తారు. ఈ గేటు బరువు సుమారు 240 టన్నుల బరువు ఉంటుంది. పూర్తి స్థాయి గేటు ఎత్తు, వెడల్పు స్థాయిలో ఈ స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేయడం ద్వారా జలాశయంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేస్తారు. నేడు క్రస్ట్ లెవల్ స్థాయికి నీటి మట్టం పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం రాత్రి 8 గంటలకు 40.9 మీటర్ల స్థాయిలో 7.7142 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 31,825 క్యూసెక్కులు చేరుతుండగా.. 17 గేట్లను 6 మీటర్లు, ఒక గేటును 2.5 మీటర్ల మేర తెరిచి 2,44,406 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇదే రీతిలో దిగువకు నీటిని విడుదల చేస్తే శనివారం ఉదయానికి ప్రాజెక్టులో నీటి నిల్వ క్రస్ట్ లెవల్ 36.34 మీటర్లకు చేరుతుంది. అప్పుడు ప్రాజెక్టులో 3.61 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది. ఎగువ నుంచి స్థిరంగా 31 వేల క్యూసెక్కుల వరద వచ్చినా.. సులభంగా స్టాప్ లాగ్ గేటును దించుతామని అధికార వర్గాలు తెలిపాయి. స్టాప్ లాగ్ గేటును దించే ప్రక్రియ శనివారం సాయంత్రానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశాయి. పులిచింతల ప్రాజెక్టులో స్టాప్ లాగ్ గేటు పెట్టడానికి జరుగుతున్న పనులు ఆ నివేదికను టీడీపీ బుట్టదాఖలు చేయడంతోనే.. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడానికి ముందు 2015లో జనవరి 5న స్పెషల్ డ్యామ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ టీమ్ (ఎస్డీఎస్ఐటీ) ఇచ్చిన నివేదికను అప్పటి టీడీపీ సర్కార్ బుట్టదాఖలు చేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసేందుకు ప్రాజెక్టులో నీటిని ఖాళీ చేసినా.. కొద్ది రోజుల్లోనే పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుండగా.. ప్రాజెక్టుపై ఈ నెల 8, 9 తేదీలలో వాహనాలు, ప్రజల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు తహసీల్దార్ ఎం.క్షమారాణి తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రాజెక్ట్ వద్ద 144వ సెక్షన్ విధిస్తున్నట్టు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు : మంత్రి పేర్ని నాని పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం వెనుక ఎవరైనా కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఈ ప్రాజెక్టు గేట్లను 2013–14లో అమర్చారని గుర్తు చేశారు. వెలగపూడిలో సచివాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశంలో పులిచింతల ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయిన విషయంపై చర్చించామన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో హైడ్రాలిక్ గేట్లు అమర్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారని తెలిపారు. యోక్ గడ్డర్ లోపం వల్లే... పులిచింతల నుంచి వరదను దిగువకు విడుదల చేసేందుకు 16వ గేటును ఎత్తే సమయంలో ఎడమ ట్రూనియన్ బీమ్లో గేటును అనుసంధానం చేసిన యోక్ గడ్డర్లో 25 మిల్లీమీటర్ల మందంతో కూడిన రేకు(ఇనుప ప్లేట్)పై అధిక ఒత్తిడి పడి చితికిపోయింది. దాంతో యోక్ గడ్డర్ విరిగిపోయింది. దీనివల్ల ట్రూనియన్ బీమ్ పగిలిపోవడంతో గేటు ఊడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిందని జల వనరుల శాఖ అధికారులు, బీకెమ్ సంస్థ నిపుణులు తేల్చారు. ఇక్కడున్న ఒక్కో గేటు బరువు 250 టన్నులు. రెండు పియర్ల(కాంక్రీట్ దిమ్మెల) మధ్య ట్రూనియన్ బీమ్లకు అమర్చిన యాంకర్లో యోక్ గడ్డర్లను ఆర్మ్ గడ్డర్లతో అనుసంధానం చేయడం ద్వారా గేట్లను బిగిస్తారు. వరద ఉధృతి వల్ల 1,500 టన్నుల భారం పడినా.. గేట్లను సులభంగా ఎత్తేలా వాటిని అమర్చారు. గేటు ఎత్తే సమయంలో 2,500 టన్నుల భారం పడినా యోక్ గడ్డర్ విరిగిపోయే అవకాశమే లేదని.. కానీ ఆ స్థాయిలో భారం పడకున్నా 16వ గేటు యోక్ గడ్డర్ విరిగిపోవడం ఆశ్చర్యంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరమ్మతుల కోసమే స్టాప్ లాగ్ గేటు పులిచింతల ప్రాజెక్టు స్పిల్ వే పొడవు 560.25 మీటర్లు, ఎడమ వైపు నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్(ఎన్వోఎఫ్) పొడవు 232.75, కుడి వైపు ఎన్వోఎఫ్ పొడవు 141 మీటర్లు. మట్టి కట్ట పొడవు 355 మీటర్లు. ప్రాజెక్టు టాప్ బీమ్ లెవల్(టీబీఎం) 58.24 మీటర్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 53.54 మీటర్లు. కనీస నీటిమట్టం 42.67 మీటర్లు. స్పిల్ వేకు 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 24 గేట్లను బిగించారు. అంటే, స్పిల్ వేకు 32.34 మీటర్ల నుంచి 50.84 మీటర్ల మధ్య వీటిని బిగించారు. వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేస్తే 20.37 లక్షల క్యూసెక్కుల(176 టీఎంసీల)ను ఒకేసారి దిగువకు వదిలేయవచ్చు. ఈ గేట్లలో ఎప్పుడైనా సమస్య ఉత్పన్నమైతే, వాటికి మరమ్మతులు చేయడానికి రెండు స్టాప్ లాగ్ గేట్లను ఏర్పాటు చేశారు. సమస్య ఉన్న గేటుకు ముందు భాగంలో స్టాప్ లాగ్ గేటును దించి.. గేటుకు మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత స్టాప్ లాగ్ గేటును పైకి ఎత్తేస్తారు. ఆ తర్వాత 11 ఎలిమిమెంట్లను విడదీస్తారు. -
పులిచింతల కాంట్రాక్టర్ టీడీపీ నేత కాదా: అనిల్కుమార్
-
పులిచింతల కాంట్రాక్టర్ టీడీపీ నేత కాదా: అనిల్కుమార్
సాక్షి, విజయవాడ: టీడీపీ హయాంలో అన్నమయ్య రిజర్వాయర్ గేట్లు కొట్టుకుపోయాయి.. గోదావరిలో చంద్రబాబు పాదం పెడితే 30 మంది చనిపోయారని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. లోకేష్ చేస్తోన్న ట్వీట్లపై అనిల్ తీవ్ర స్థాయిలో మండిప్డడారు. లోకేష్ వాడుతున్న పదాలు ఎలాంటివో ఆయనే చెప్పాలని కోరారు. గతంలో పులిచింతలపై వచ్చిన రిపోర్ట్ను చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టిందని మంత్రి అనిల్ గుర్తు చేశారు. పులిచింతల కాంట్రాక్టర్ టీడీపీ నేత కాదా.. ఆయన దగ్గర చంద్రబాబు లాలూచీ పడి 700 రోజులు కోర్టులో కౌంటర్ కూడా వెయ్యలేదని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. ఈ విషయం లోకేష్కి తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు పడలేదు.. సీఎం జగన్ పాదం పెట్టాకే వానలు పుష్కలంగా పడుతున్నాయన్నారు అనిల్ కుమార్. -
లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ఆర్కే
-
బాబు చేసిన పాపాలే పులిచింతల పాలిట శాపాలు
-
16వ నంబర్ గేట్ వద్ద సాగుతున్న మరమ్మతు పనులు
-
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరమ్మతులు
సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్టు వద్ద అధికారులు మరమ్మతులు చేపట్టారు. 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి నిపుణులు వచ్చారు. 35 మంది సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రాజెక్ట్ వద్ద స్టాప్ లాక్ గేట్ అమర్చే పనిలో సిబ్బంది ఉన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయిన సంగతి తెలిసిందే. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ నిన్న ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నిపుణుల బృందాన్ని రప్పించి మరమ్మతులు చేపట్టారు. -
విరిగిన పులిచింతల గేటు
సాక్షి, అమరావతి బ్యూరో, సాక్షి, అమరావతి, అచ్చంపేట, జగ్గయ్యపేట : పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయింది. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుపై ఒత్తిడి పడకుండా డ్యాంలో నీటి నిల్వను తగ్గించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ ఫ్లడ్ చేరింది. ఈ దృష్ట్యా అధికారులు, నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. 16వ గేట్ వద్ద స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేయడానికి ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్లో నీటి నిల్వను తగ్గిస్తున్నారు. దీంతో నీటి విడుదల క్రమంగా 6 లక్షల క్యూసెక్కుల వరకు పెరగనుంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులో 34.68 టీఎంసీలు నిల్వ ఉండగా, సాగర్ నుంచి 2,01,099 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 16వ నంబరు గేటు నుంచి పూర్తి స్థాయిలో, మిగతా గేట్ల నుంచి.. మొత్తంగా 5,05,870 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు తగ్గితేగాని మరమ్మతులు సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. మరమ్మతులకు మార్గం సుగమం సాగర్ నుంచి 2,01,099 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉన్న సమయంలో ఊడిపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ప్రాజెక్టులో క్రస్ట్ లెవల్ (గేటు బిగించే మట్టం) 36.34 మీటర్లకు నీటి నిల్వను తగ్గిస్తేనే.. స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేయవచ్చు. శుక్రవారం నాటికి పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ 36.34 మీటర్లకు తగ్గుతుంది. అదే రోజు స్పిల్ వే 16, 17వ పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు) మధ్య స్టాప్ లాగ్ గేటును దించి.. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం చేస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ తర్వాత పూర్తి స్థాయి గేటును బిగిస్తామని చెప్పారు. ట్రూనియన్ బీమ్ విరిగిపోవడంతోనే.. నాగార్జునసాగర్ నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 55,028 క్యూసెక్కులను విడుదల చేసిన తెలంగాణ అధికారులు.. దిగువకు వదిలే ప్రవాహాన్ని రాత్రికి 1.80 లక్షల క్యూసెక్కులకు పెంచారు. పులిచింతల ప్రాజెక్టులో అప్పటికే 44.54 టీఎంసీలు నిల్వ ఉండటం... ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేసేందుకు గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఏడు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్పిల్ వే గేట్లను సంప్రదాయ పద్ధతి(రోప్)లో ఎత్తుతారు. ఒక్కో గేటును ఎత్తేందుకు ఒక్కో వైపు రెండు చొప్పున, నాలుగు రోప్(ఇనుప తీగ)లను అమర్చారు. 16వ గేటును రెండు అడుగుల మేర ఎత్తగానే ఎడమ వైపున ఉన్న ట్రూనియన్ బీమ్ విరిగిపోవడంతో గేటు ఊడిపోయి, వరద ఉధృతికి కొట్టుకుపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ప్రాజెక్టు గేట్లలో ఎప్పుడైనా సమస్య ఉత్పన్నమైతే, వాటికి మరమ్మతులు చేయడానికి రెండు స్టాప్ లాగ్ గేట్లను ఏర్పాటు చేశారు. సమస్య ఉన్న గేటుకు ముందు భాగంలో స్టాప్ లాగ్ గేటును దించి.. గేటుకు మరమ్మతు చేస్తారు. ఆ తర్వాత స్టాప్ లాగ్ గేటును పైకి ఎత్తేస్తారు. నిపుణుల కమిటీ వేస్తాం.. ప్రాజెక్టు గేటు ఊడిపోవడంపై నిపుణులతో అధ్యయన కమిటీ వేయనున్నామని జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) సీఈ శ్రీనివాస్ తదితరులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యయన కమిటీ ద్వారా ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించనున్నట్లు తెలిపారు. ఇకపై ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు చేపడతామన్నారు. ఊడిపోయిన గేటును రేపు (శనివారం) సాయంత్రానికి పునరుద్ధరిస్తామని తెలిపారు. మూడు నాలుగు రోజులుగా ఈ గేటు ద్వారానే ప్రాజెక్టు దిగువకు లక్ష నుంచి రెండు లక్షల నీటిని విడుదల చేశారని, తెల్లవారు జామున నీటి ప్రవాహ ఉధృతికి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గేటు ఊడినట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. మరింత ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని గేట్ల ద్వారా 5,05,870 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నామని చెప్పారు. గేట్ అమర్చేందుకు పోలవరం నుంచి ప్రత్యేక నిపుణుల బృందంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు కూడా వస్తున్నారన్నారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నానిలు ప్రాజెక్టును సందర్శించి అధికారులతో మాట్లాడారు. -
‘నదిలో ఎవరూ ప్రయాణాలు చేయొద్దు’
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేటు సాంకేతిక లోపం తలెత్తడంతో.. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు పోటెత్తినట్లు విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. దీంతో మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ శాఖ తెలిపింది. సహాయక చర్యలకు విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో ఎవరూ ప్రయాణాలు చేయవద్దని విపత్తు నిర్వహణశాఖ సూచించింది. ఈ ఘటనకు సంబంధించి పులిచింతల ప్రాజెక్ట్ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ పరిశీలించారు. 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు. కాగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు పులిచింతల ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16వ నెంబర్ గేటును పరిశీలించారు. రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుండి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడంతో ఇప్పటివరకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 16వ గేట్ అమర్చేందుకు మరో 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని, 5 మీటర్లకు నీటిమట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. -
పులిచింతల ప్రాజెక్ట్ ను పరిశీలించిన మంత్రులు
-
పులిచింతల: బ్యారెజ్కు ఎలాంటి ప్రమాదం లేదు: నారాయణ రెడ్డి
సాక్షి, విజయవాడ: పులిచింతల ప్రాజెక్టు16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యలు తలెత్తి విరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ చీఫ్ నారాయణ రెడ్డ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాత్రి 3:30 సమయంలో గేట్లు ఎత్తుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మెయిన్ గడ్డర్ విరిగిపోవడంతో.. సపోర్ట్ రోప్ థ్రెడ్లు తెగిపోయి గేటు నదిలో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది’’ అని తెలిపారు. ‘‘పైనుంచి వరద నీటిని కిందికి వదిలెందుకు రాత్రి గేట్లను ఎత్తారు. ఒకే గేటు గుండా నీరు వెళ్తుండడంతో ఒత్తిడిని తగ్గించేందుకు క్రమక్రమంగా మొత్తం గేట్లను ఎత్తడం జరిగింది. ప్రభుత్వం, ఏజన్సీలు బ్యారేజ్ నిర్వహణను పట్టించుకోవట్లేదనేది అవాస్తవం. మిగిలిన గడ్డర్లు, గేట్ల పరిస్థితిని చెక్ చేస్తున్నాం. బ్యారేజ్కు ఎలాంటి ప్రమాదం లేదు. రేపటిలోగా సమస్య పరిష్కారం అవుతుంది’’ అన్నారు. -
పులిచింతల ప్రాజెక్ట్ 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్య
-
ప్రాజెక్ట్ వద్ద సాంకేతిక సమస్యను పరిశీలించిన మంత్రి అనిల్
-
పులిచింతల ప్రాజెక్ట్ను పరిశీలించిన మంత్రి అనిల్
-
పులిచింతల ప్రాజెక్ట్: విరిగిన గేటు.. దిగువ ప్రాంతాలు అప్రమత్తం
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్ట్ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ పరిశీలించారు. 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. గేట్లు ఎత్తే సమయంలో హైడ్రాలిక్ గడ్డర్ విరిగిపోయిందని మంత్రి అనిల్ తెలిపారు. రాత్రి 3.30 గంటల ప్రాంతంలో 16వ నంబర్ గేట్ ఊడిపోయిందని వివరించారు. ఇప్పటికే ఇద్దరుప్రాజెక్టు ఇంజనీర్లు, నిపుణులు పరిశీలించారని, మరో రెండు ఇంజనీరింగ్ నిపుణుల బృందాల్ని పిలిపించామని తెలిపారు. 6 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్నామని మంత్రి అనిల్ తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు వద్దకు పలువురు మంత్రులు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు పులిచింతల ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16వ నెంబర్ గేటును పరిశీలించారు. రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘ ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన. వరద తాకిడికి 16వ నంబరు గేట్ కొట్టుకుపోయింది. నీటి సామర్థ్యం తగ్గిస్తేనే గేటు బిగించడం సాధ్యం. గేటును వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారు’’ అని తెలిపారు. యుద్ధప్రాతిపదికన చర్యలు: సామినేని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ, యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుండి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడంతో ఇప్పటివరకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 16వ గేట్ అమర్చేందుకు మరో 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని, 5 మీటర్లకు నీటిమట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/అచ్చంపేట/కర్నూలు సిటీ: ఎగువన గల ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ఆల్మట్టి నుంచి 52 వేల క్యూసెక్కులను దిగువ నారాయణపూర్కు విడుదల చేస్తుండగా.. అక్కడి నుంచి 62 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలేస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీ ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి జూరాలకు 79 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి 99 వేల క్యూసెక్కులు వస్తుండటంతో జలాశయంలోని నీటిమట్టం 41.11 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్ట్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 7 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతుండగా.. నాగార్జున సాగర్లోకి 9వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సాగర్ నీటిమట్టం 169.71 టీఎంసీలకు చేరింది. 44.18 టీఎంసీలకు చేరిన పులిచింతల పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నాగార్జున సాగర్, కృష్ణా పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు నీటి నిల్వ 44.1813 టీఎంసీలకు చేరింది. జెన్కో పవర్ జనరేషన్కు 13,800 క్యూసెక్కులు వదలడం అనివార్యమైందని ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్ తెలిపారు. ఒక రేడియల్ గేటును మూడు అడుగుల మేర ఎత్తి 11వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నామన్నారు. మరో 600 క్యూసెక్కులు రేడియల్ లీకేజీ వల్ల దిగువకు వెళ్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 175 అడుగుల సామర్థ్యానికి గాను 173 అడుగుల మేర నీరు ఉన్నట్టు వివరించారు. ఇది 44.18 టీఎంసీలకు సమానమని చెప్పారు. తుంగభద్రకు పెరిగిన ఇన్ఫ్లో తుంగభద్ర డ్యామ్లోకి నీటి ప్రవాహం పెరిగింది. శనివారం 40 వేల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం ఆదివారం నాటికి 58 వేల క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుతం డ్యామ్లో 50 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో సాగు నీటి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కొప్పళ, రాయచూరు జిల్లాలకు ఉపకరించే తుంగభద్ర ఎడమ కాలువకు ఆదివారం నీటిని విడుదల చేశారు. -
ప్రభుత్వ విప్ ఉదయభానును అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును తెలంగాణ సరిహద్దు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భూభాగం గుండా టీఎస్ పోలీసులు అనుమతించకపోవటంతో కృష్ణా జిల్లా ముత్యాల నుండి గుంటూరు జిల్లా మాదిపాడుకు కృష్ణా నదిలో పడవ ద్వారా పులిచింతల ప్రాజెక్టు వద్దకు సామినేని చేరుకున్నారు. అడ్డుకోవడం దారుణం... పులిచింతల వద్ద తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని.. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణమని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలవకుండా విద్యుదుత్పత్తి వల్ల నీరు వృథా అవుతోందన్నారు. విభజన హామీలను తెలంగాణ తుంగలో తొక్కుతోందని.. బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారం నీటిని వాడుకోవాలని ఉదయభాను అన్నారు. ‘‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జలయజ్ఞంలో భాగంగా పులిచింతల నిర్మించారు. తెలంగాణలోనే వైఎస్ ఎక్కువ ప్రాజెక్టులు కట్టారు. తెలంగాణ మంత్రులు నేతలు వైఎస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. వైఎస్ గురించి మాట్లాడిన మాటలు సబబు కాదు. కేసీఆర్ కూడా ఈ అంశంపై పునరాలోచించాలి. శనివారం ఒక్కరోజే ఒక టీఎంసీ వృధా చేశారు. ఒక టీఎంసీ పదివేల సాగుకు ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు 75 టీఎంసీలు వృధా చేశారు. ఇరు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉండాలని సీఎం జగన్ చెప్పారు. దేవుడు చెప్పినా వినం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని’’ సామినేని హితవు పలికారు. -
నీరంతా సముద్రం పాలు.. ఏమిటీ దారుణం..!
సాక్షి, అమరావతి: ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయినప్పటికీ.. తెలంగాణ సర్కార్ ఎడమగట్టు కేంద్రం ద్వారా యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ 38.72 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం డెడ్స్టోరేజీకి పడిపోయింది. నాగార్జునసాగర్, పులిచింతల్లోనూ యథేచ్చగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్టు 20 గేట్లు అరడుగు మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం 8,400 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. పులిచింతలలో ఆదివారం విద్యుదుత్పత్తిని తెలంగాణ సర్కార్ పెంచడంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం పెరుగుతోంది. సోమవారం ఉదయం ఒక టీఎంసీ నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఈఈ స్వరూప్ తెలిపారు. తెలంగాణ సర్కార్ చర్యల వల్ల భవిష్యత్లో రెండు రాష్ట్రాలకు సాగు, తాగునీటి ముప్పు పొంచి ఉందని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. కానీ.. తెలంగాణ సర్కార్ ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 20,130 క్యూసెక్కులను వదిలేస్తోంది. దీంతో శ్రీశైలంలో నీటిమట్టం 817.09 అడుగులకు పడిపోయింది. మొత్తం 215.81 టీఎంసీల సామర్థ్యంగల ఈ జలాశయంలో నీటినిల్వ 38.72 టీఎంసీలకు తగ్గింది. నీటినిల్వ డెడ్స్టోరేజీకి పడిపోయింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 21,973 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా 31,223 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 30,723 క్యూసెక్కుల వినియోగంతో విద్యుదుత్పాదన కొనసాగుతోంది. దీంతో సాగర్లో నీటిమట్టం 532.2 అడుగులకు పడిపోయింది. మొత్తం 312.04 టీఎంసీల సామర్థ్యంగల ఈ జలాశయంలో నీటినిల్వ 174.46 టీఎంసీలకు తగ్గిపోయింది. పులిచింతల ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం వల్ల నీటినిల్వ 29.52 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని పెంచుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం పెరుగుతోంది. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలకు రైతులు సంసిద్ధంగా లేకపోవడంతో బ్యారేజీ నుంచి 8,400 క్యూసెక్కులను అధికారులు వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గుంటూరు జిల్లా సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జున సాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టులో రెండు యూనిట్ల ద్వారా 46.4 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ణ, ఏఈ బి.కాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పహారాలోనే ప్రాజెక్టులు
ధరూరు(గద్వాల)/ అమరచింత (వనపర్తి)/ దోమలపెంట (అచ్చంపేట)/నాగార్జునసాగర్ / హుజూర్నగర్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జల వివాదాల నేపథ్యంలో అన్ని ప్రాజెక్టుల వద్ద శనివారం భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఎగువన జూరాల నుంచి దిగువన పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. టీఎస్జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రం వద్ద నాగర్కర్నూల్ ఎస్పీ సాయిశేఖర్ ఆధ్వర్యంలో పోలీసుల పహారా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. జూరాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం నిలిచిపోవడం, శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండటంతో నీటిమట్టం తగ్గుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ జలాశయంలో నీటిమట్టం 821 అడుగులుండగా, శనివారం సాయంత్రం 819.5 అడుగులకు చేరింది. నీటి నిల్వ 40.4514 టీఎంసీలుగా ఉంది. ఇక్కడ 13.306 మిలియన్ల యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 21,189 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. రేగుమాగడి గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకి నీటి విడుదల జరగలేదు. అలాగే జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న జెన్ కో జల విద్యుత్ కేంద్రం వద్ద ప్రధాన గేటును మూసివేశారు. ఈ ప్రాజెక్టుపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. సాగర్లో విద్యుదుత్పాదనకు 30,918 క్యూసెక్కులు అలాగే సాగర్ ప్రాజెక్ట్ వద్ద నల్లగొండ ఎస్పీ రంగనాథ్ పోలీస్ బందోబస్తును పరిశీలించారు. మెయిన్ పవర్హౌజ్కు వెళ్లే రోడ్డు దారిని పూర్తిగా మూసివేశారు. కేవలం అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందిని మాత్రమే గుర్తింపు కార్డులను చూసి ఆ మార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 533.80 అడుగుల వరకు నీళ్లు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జలాశయానికి 27,587 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా 32,212 క్యూసెక్కులు విడుదలయ్యింది. విద్యుదుత్పాదనకు 30,918 క్యూసెక్కులు వినియోగించారు. ‘పులిచింతల’లో 30 మెగావాట్లు.. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని వజినేపల్లి వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్ట్ పవర్హౌస్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పవర్హౌజ్, డ్యామ్, పరిసర ప్రాంతంలో సాయుధ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. టీఎస్ జెన్ కోలో జల విద్యుత్ ఉత్పత్తి శనివారం కూడా కొనసాగింది. ఎగువనున్న నాగార్జునసాగర్ నుంచి 39 వేల క్యూసెక్కుల నీరు ఇ ఫ్లోగా వచ్చి ప్రాజెక్ట్లో చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 4 వేల క్యూసెక్కుల నీటితో పవర్ హౌస్లోని 2 యూనిట్లను రన్ చేస్తూ 30 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 27.06 టీఎంసీల నీరు ఉంది. -
పూర్తి స్థాయికి నీటిమట్టం; ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
-
విధిలేని పరిస్థితుల్లో 6 గేట్లు ఎత్తి నీరు వదిలాం: ఈఈ స్వరూప్
సాక్షి,విజయవాడ: విధి లేని పరిస్థితుల్లోనే తాము ప్రకాశం బ్యారేజీ ఆరు గేట్లు ఎత్తి సముద్రంలోకి నీరు వదిలినట్లు ఈఈ స్వరూప్ వెల్లడించారు. కాగా అధికారులు శుక్రవారం ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి ఆరు గేట్ల ద్వారా 8,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తితో పులిచింతల నుంచి బ్యారేజీకి నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ స్వరూప్ మాట్లాడుతూ.. ''ఇండెంట్ లేకుండానే తెలంగాణ నీటిని వాడటంతో బ్యారేజీకి నీళ్లు వస్తున్నాయి. బ్యారేజీలో 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. తెలంగాణ జలవిద్యుత్ కేంద్రం నుంచి వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నాం. ఖరీఫ్కి రైతులు ఇంకా సన్నద్ధం కాలేదు. పంట కాలువలకు నీరు వదిలే అవసరం లేదు'' అని తెలిపారు. -
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం
సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం నెలకొంది. బ్యారేజ్ 10వ గేట్ వద్ద మకాం వేసి టీఎస్ పోలీసులు బారికేడ్లు పెట్టారు. టీఎస్ పోలీసుల తీరును బ్యారేజ్ అధికారులు తప్పుపడుతున్నారు. బ్యారేజ్పై టీఎస్ పోలీసులకు ఎలాంటి హక్కు లేదని.. బ్యారేజ్ నిర్వహణ పూర్తి బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని ఈఈ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ‘‘ఎటువంటి హక్కు లేకుండా బ్యారేజ్ పైకి రావడం నిర్వహణకు ఇబ్బంది కలిగించడమే. వద్దన్నా వినకుండా బ్యారేజ్పై సీసీ కెమెరాలను టీఎస్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి టీఎస్ పోలీసులను వెనక్కి పిలవాలని తెలంగాణ అధికారులను కోరాం. కృష్ణా డెల్టా అధికారులు కోరితేనే పులిచింతల నుంచి నీటిని విడుదల చేస్తాం. ఆ సమయంలోనే జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి. జల విద్యుత్కు నీరు విడుదల చేయాలంటే 9.54 టీఎమ్సీల మినిమం డ్రా డౌన్ లెవల్ ఉండాలి. ప్రస్తుతం బ్యారేజ్లో 21.1 టీఎమ్సీల నీరు నిల్వ ఉంది. ప్రొటోకాల్ పాటించకుండా జలవిద్యుత్కు నీరు విడుదల చేసుకుంటున్నారు. తెలంగాణ అధికారుల చర్యలతో ఖరీఫ్లో కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి సమస్య వస్తుందని’’ ఈఈ శ్యామ్ ప్రసాద్ అన్నారు. -
టీఎస్ జెన్ కో అధికారులకు పులిచింతల ఎస్ఈ మెమోరాండం
-
టీఎస్ జెన్కో అధికారులకు పులిచింతల ఎస్ఈ మెమోరాండం
సాక్షి, విజయవాడ: ప్రొటోకాల్ ప్రకారం పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఎస్ఈ రమేష్బాబు ఆదేశించారు. విద్యుదుత్పత్తికి, నీటి కేటాయింపులకు ప్రొటోకాల్ ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అధికారులు, ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రొటోకాల్ ప్రకారమే విద్యుదుత్పత్తి జరిగింది.. కానీ ఇప్పుడు తెలంగాణ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని తెలిపారు. జూన్ 29 నుంచి టీఎస్ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తోందన్నారు. డెల్టాలో ఇప్పటివరకు నారుమళ్లు ప్రారంభం కాలేదు, నీటి అవసరాలు లేవని.. ఈ పరిస్థితుల్లో నీటిని కిందకు వదిలితే సముద్రంలో కలుస్తాయని తెలిపారు. ఇరిగేషన్ అవసరాలు ప్రారంభమైన తర్వాతే.. విద్యుదుత్పత్తి ప్రారంభించాలని తెలంగాణ అధికారులను కోరాం అని ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. చదవండి: తెలంగాణను నియంత్రించండి -
పులిచింతల ప్రాజెక్టు వద్ద ఇరు రాష్ట్రాల పోలీసుల మోహరింపు
-
తెలంగాణను నియంత్రించండి
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటి అవసరాలు లేకున్నా.. నాగార్జునసాగర్, పులిచింతల నుంచి దిగువకు విడుదల చేసిన జలాలను తెలంగాణ కోటా కింద వినియోగించుకున్నట్టే లెక్కించాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయపురేకు ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి బుధవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. ► కృష్ణా డెల్టా నీటి అవసరాలను తీర్చేందుకు 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించాం. విభజన తర్వాత ఈ ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా 120 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ జల విద్యుత్ కేంద్రం తెలంగాణ అధీనంలో ఉంది. ► కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటిని విడుదల చేయాలని ఎస్ఈ (విజయవాడ) ప్రతిపాదనలు పంపినప్పుడు తెలంగాణ జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేయాలన్నది ప్రాజెక్టు నియమావళి. ► ప్రస్తుత ఖరీఫ్లో కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటిని విడుదల చేయలేదు. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఎస్ఈ ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నా, మంగళవారం ఉదయం 8 గంటల నుంచి పోలీసు పహరా మధ్య తెలంగాణ జెన్కో అధికారులు ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ► బుధవారం నాటికి పులిచింతల ప్రాజెక్టులో 18.07 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసే ప్రకాశం బ్యారేజ్ నీటి నిల్వ సామర్యం 3.07 టీఎంసీలే. ఈ దృష్ట్యా కృష్ణా డెల్టాకు నీటి అవసరాలు లేకపోయినా పులిచింతల నుంచి నీటిని విడుదల చేయడం వల్ల.. ఆ నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా వృథాగా సముద్రంలోకి వదలాల్సి ఉంటుంది. ► కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడానికి బోర్డు నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తోంది. తెలంగాణలో జల విద్యుత్ను వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి చేయాలని గత నెల 28న ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జెన్కో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ దృష్ట్యా తెలంగాణపై కఠిన చర్యలు తీసుకోండి. -
భారీ వర్షం: పులిచింతల బ్యాక్వాటర్తో ముంపు
సాక్షి, నల్గొండ: ఎడతెరపి లేని వర్షంతో ఉమ్మడి నల్గొండ జిల్లా తడిసి ముద్దయింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు జిల్లా అంతటా వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షంతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లడం, చెరువులు అలుగుపడి పలు గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. కూలిన ట్రాన్స్ఫార్మరర్ మరోవైపు మూసీనది ఉగ్రరూపం దాల్చుతుంది. ఆ ప్రభావంతో భువనగిరి-నల్గొండ రహాదారిపై ఎక్కడిక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి పక్కన పార్క్ చేసిన చిన్న చిన్న వాహనాలతో పాటు భారీ లారీలు కూడా వరదలో కొట్టుకుపోయాయి. అదృష్టవాత్తు వాహన డ్రైవర్లు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో వరంగల్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం.. భారీ వర్షంతో సూర్యాపేట, కోదాడ పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూర్యాపేటలోని శ్రీరామ్నగర్, మానసనగర్, అంజనాపురి కాలనీ, బాలాజీనగర్, ఆర్కే గార్డెన్, ఎన్టీఆర్ కాలనీ, కుడకుడ, ఇందిరమ్మ కాలనీ, చింతల చెరువు, అదనపు 60ఫీట్ల రోడ్డు ప్రాంతాలను వర్షం ముంచెత్తి వరద చేరింది. కాలనీల్లో కూడా నీరు చేరుతుండడంతో మున్సిపల్ యంత్రాంగం జేసీబీలతో గండ్లు కొట్టించింది. కోదాడ మండలం రెడ్లకుంట, అనంతగిరి మండలం శాంతినగర్లో రోడ్లవెంట చెట్టుకూలడంతో పోలీసులు తొలగించారు. కోదాడ పట్టణంలో భవానినగర్, శ్రీమన్నారాయణ కాలనీ,మాతానగర్, షిర్డీనగర్ కాలనీల్లోని ఇళ్ల చుట్టూ నీరు చేరింది. అలాగే మునగాల, నడిగూడెం మండల కేంద్రాల్లో కూడా వర్షపు నీళ్లు నిలిచాయి. ఇంకా ఒకటి, రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని ప్రభుత్వం హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలెవరూ లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని జిల్లా అధికారులు సూచనలు చేశారు. రోడ్లపై వాగులు ప్రవహించే చోట పోలీస్ యంత్రాంగం ముందస్తుగా ప్రమాదాలు జరగకుండా రాకపోకలను నిలిపింది. పులిచింతల బ్యాక్వాటర్తో ముంపు.. కృష్ణానది ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో పులిచింతల నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 10గేట్లు ఎత్తి దిగువకు 3లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పై నుంచి వస్తున్న వరదతో చింతలపాలెం, మఠంపల్లి, పాలకవీడు మండలాల్లో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పొలాలు బ్యాక్ వాటర్ ముంపులో పడ్డాయి. వరి, పత్తి చేనులు సుమారు 1500 ఎకరాలు నీటిలో మునిగాయి. చింతలపాలెం మండలంలోని ఎర్రవాగు, బుగ్గమాదారం, వజినేపల్లి వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మండలంలోని 6 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తుంగతుర్తి మండలలోని సంగెం, వెలుగుపల్లి గ్రామాల వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుమలగిరి మున్సిపాటిటీ కేంద్రంలో తొర్రూరు రోడ్డువైపు ఉన్న పెద్దచెట్టుకూలి విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అర్వపల్లి మండలంలోని తిమ్మాపురం సంగెం వద్ద రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. నాగారం మండలంలో ఒక ఇల్లు కూలింది. ఎడతెరిపిలేని వర్షం యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో నిన్నటి నుండి వర్షం కురుస్తుంది. వర్షానికి రోడ్లులు అన్ని జలమయమయ్యాయి. నియోజకవర్గం వ్యాప్తంగా చెరువులు,కుంటల్లో జల కళ సంతరించుకుంది. వాగులు అన్ని నీటి ప్రవాహం తో కనిపిస్తున్నాయి. పలు చోట్ల వాగుల్లో నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో రోడ్డు పై నుండి నీరు ప్రవహిస్తుంది. మరోవైపు ఆలేరు పట్టణ కేంద్రంలోని బీసీ కాలనీ వార్డులు జలమయం అయ్యాయి కురుస్తున్న వర్షానికి రోడ్లు అన్ని జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో రాజపేట పట్టణ కేంద్రంలో రోడ్డు చెరువును తలపిస్తుంది. రోడ్డు పై వర్షం నీరు అధికంగా ప్రవహిస్తుండటం తో రాకపోకలకు అంతరాయం కలగకుండా దారి మళ్లిస్తున్నారు. యాదగిరిగుట్ట నుండి తుర్కపల్లి ఈసీఎల్ కు నిర్మిస్తున్న నాలుగు లైన్ల రోడ్డు దత్తాయ పల్లి వెంకటాపురం మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు వరద ప్రవాహంతో కొట్టుకుపోవడంతో తుర్కపల్లి యాదగిరిగుట్ట మధ్య రాక పోకలు బంద్ అయ్యాయి. -
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు..
సాక్షి, విజయవాడ: పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇన్ ఫ్లో 4లక్షల 2 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3లక్షల 97వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. 70 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రనికి 6 లక్షల క్యూసెక్కులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. -
నిండు కుండలా పులిచింతల
పాలించేవాడు యోగ్యుడైతే ధర్మం నాలుగు పాదాలమీద నిలుస్తుందని చెప్పడానికి పులిచింతల ప్రాజెక్టే నిదర్శనం. ప్రాజెక్టు పూర్తయి ఇప్పటికి 8 సంవత్సరాలు నిండింది. రెండేళ్ల కిరణ్కుమార్ రెడ్డి పాలనలోగాని, అయిదేళ్ల చంద్రబాబు పాలనలో గాని ప్రాజెక్టులో కనీసం 10 టీఎంసీల నీరు కూడా నిల్వ లేదు. కారణం వర్షాలు సక్రమంగా పడకపోవడమే. అలాంటిది వైఎస్ జగన్మోహనరెడ్డి సీఎం అయిన 14 నెలల కాలంలో వచ్చిన రెండు వ్యవసాయ సీజన్లలోను ప్రాజెక్టు నిండటం చూస్తే నిజంగా మంచి పాలనకు ప్రకృతి సహకరించిందనే చెప్పాలి. సాక్షి, అచ్చంపేట(పెదకూరపాడు): జలయజ్ఞంలో భాగంగా 2004 అక్టోబర్ 15న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుంటూరు జిల్లా, అచ్చంపేట మండలం మాదిపాడు పంచాయతీ పరిధిలోని జడపల్లిమోటు తండాకు సమీపంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరించారు. ప్రాజెక్టు 2012లో పూర్తయింది. 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పటి నుంచి గత ఏడాది వరకు సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులో కనీసం 10 టీఎంసీల నీటిని కూడా నిల్వ ఉంచలేని దుస్థితి కొనసాగింది. మొత్తం 45.77 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యంతో నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం గత ఏడాది కాలంలో రెండోసారి. గత ఏడాది ఇదే సీజన్ సెపె్టంబరు మాసంలో వర్షాలు బాగా పడటంతో రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండాయి. నాగార్జున సాగర్ నుంచి వదిలిన మిగులు నీటితో పులిచింతల ప్రాజెక్టును నింపారు. తిరిగి ఈ ఏడాది ఇదే సీజన్లో వర్షాలు పడటంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నింపగలిగారు. ప్రాజెక్టు ద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీరు గత ఏడాదిన్నర కాలంలో రెండుసార్లు ప్రాజెక్టు నిండటంతో కృష్ణా డెల్టాకు చెందిన 13 లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు గత రెండు వ్యవసాయ సీజన్లలోను సమృద్ధిగా సాగునీరు అందుతోంది. వర్షాధారంగా పంటలు పండించుకునే ఈ ప్రాంత రైతులు ఏడాదిలో రెండు పంటలు పండించుకోగలుగుతున్నారు. ముఖ్యంగా ఆహార పంట అయిన వరి పంటను పుష్కలంగా పండించగలగడం సంతోషకరం. దీనికితోడు ప్రాజెక్టులో ఎప్పుడు చూసినా నీరు నిల్వ ఉండటంతో అచ్చంపేట పరిసరి ప్రాంతాల్లో భూగర్భ జలాలు బాగా అభివృద్ధి చెందాయి. గతంలో 200 నుంచి 400 అడుగులలోతు వేసినా బోర్లలో చుక్కనీరు రాని భూముల్లో సైతం ఇప్పుడు 100 అడుగులలోపే నీళ్లు అందుతున్నాయి. వర్షాధారంతో పంటలు పండించే ఈ ప్రాంత రైతులు భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో 24గంటలు విద్యుత్ మోటార్ల ద్వారా పుష్కలంగా సాగు నీటిని వినియోగించుకుంటున్నారు. ప్రాజెక్టు పనులు జరిగిందిలా.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.682 కోట్లు మంజూరు చేశారు. అక్టోబర్ 15, 2004లో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగినప్పటికీ పలు కారణాలవల్ల నిర్మాణ పనులను 2005, జూన్ 9 నుంచి ప్రారంభించారు. అప్పడు వర్షాలు బాగా పడటం, నిర్మాణానికి అంతరాయం కలగడంతో పనులు మందగించాయి. 2009, సెప్టెంబరు 2న మహానేత మృతి చెందేనాటికి ప్రాజెక్టు పనులు 60 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 40 శాతం పనులు పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టింది. ఆ తరువాత 8 సంవత్సరాలలో వర్షాలు పడిందీ లేదు... ప్రాజెక్టు నిండిందీ లేదు. -
ఉగ్ర వేణి
సాక్షి, అమరావతి/ విజయవాడ/ మాచర్ల/ శ్రీశైలం ప్రాజెక్ట్/ పెదకూరపాడు/ కాకినాడ/ పోలవరం రూరల్: మూసీ, మున్నేరు, కట్టలేరు, వైరా, కొండ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చగా.. ఉప నదుల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో గోదారమ్మ శాంతిస్తోంది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో 2.29 లక్షల క్యూసెక్కులు.. మున్నేరు, వైరా, కట్టలేరు వరద తోడవడంతో 4.10 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్నాయి. దీంతో 70 గేట్ల ద్వారా 3.23 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రికి బ్యారేజీలోకి 5 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉండటంతో.. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత.. ► కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలంలో 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,11,790 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. ► సాగర్ జలాశయం వద్ద ఆదివారం సాయంత్రానికి 12 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,51,695 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ వద్ద పర్యాటకులు రాకుండా 144 సెక్షన్ విధించారు. కేవలం కొత్త బ్రిడ్జి మీదుగా వెళ్లి రేడియల్ క్రస్ట్గేట్ల నుంచి స్పిల్వే మీదుగా దుమికే కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గోదావరిలో మరింత తగ్గిన వరద ► గోదావరి నదిలో ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద వరద 9,68,666 క్యూసెక్కులకు తగ్గింది. నీటి మట్టం 45 అడుగులు ఉంది. ► మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటి మట్టం 43 అడుగుల కంటే దిగువకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తామని అధికారులు తెలిపారు. ► ఆదివారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం 17,84,505 క్యూసెక్కులకు తగ్గింది. 175 గేట్ల ద్వారా 17,74,755 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ► కాటన్ బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు 17.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించే అవకాశం ఉంది. ► తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో ముంపునకు గురైన ఇళ్లన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. 36 గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరించలేదు. కోతకు గురవుతున్న నెక్లెస్ బండ్ ► పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం గ్రామానికి వరద నుంచి రక్షణగా నిర్మించిన నెక్లెస్ బండ్ కోతకు గురవుతోంది. 6 మీటర్ల వెడల్పున నిర్మించిన బండ్ రెండు మీటర్లకు తగ్గిపోయింది. ► శనివారం అర్ధరాత్రి 12 గంటలకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హుటాహటిన పోలవరం చేరుకుని యుద్ధ ప్రాతిపదికన గట్టు పటిష్ట పరిచే పనులు చేపట్టారు. పడవలపై కరోనా రోగుల తరలింపు ► తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలంకలో శనివారం ఓ వ్యక్తి కరోనా సోకింది. రాత్రివేళ బాలాజీ అనే వ్యక్తి సాయంతో ట్రాక్టర్పై సఖినేటిపల్లి బోను వద్దకు చేర్చి అక్కడి నుంచి ఆంబులెన్స్లో అల్లవరం కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ► అప్పనరామునిలంక, మామిడికుదురు, అప్పనపల్లి, బి.దొడ్డవరం గ్రామాల నుంచి ఒక్కొక్కరి చొప్పున పడవలపై తీసుకొచ్చి కోవిడ్ ఆస్పత్రులకు తరలించారు. -
పులిచింతలకు భారీగా పెరుగుతున్న వరద
-
పులిచింతలకు భారీగా పెరుగుతున్న వరద
సాక్షి, కృష్ణా జిల్లా: శ్రీశైలం వయా నాగార్జున సాగర్ మీదుగా పులిచింతలకు కృష్ణమ్మ పరుగులు పెడుతూ వస్తోంది. అంచలంచెలుగా తన ఉధృతిని పెంచుకొంటూ ఉరకలేస్తోంది. అప్రమత్తమైన అధికారులు తొలుత ఆరుగేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్కి నీటిని విడుదల చేసారు. వరద ప్రవాహం పెరిగిపోవటంతో నీటి విడుదల శాతాన్ని అంచలంచెలుగా పెంచుతున్నారు. 17 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు. సాగర్ నుంచి 3 ,50 ,000 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 3,50,000 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. పులిచింతల పూర్తి సామర్ధ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 39 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్ఢి ఆదేశాలతో పరిస్థితిని కలెక్టర్ ఇంతియాజ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఫ్లడ్ మేనేజ్మెంట్పై సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసారు. ముంపుకు గురయ్యే ముక్త్యాల, రావెల, చందర్లపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ,పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంత తహశీల్దార్లకు పలు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. -
రేపు పులిచింతల నుంచి నీటి విడుదల
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వరుసగా రెండో ఏడాది కూడా జలకళ సంతరించుకున్న నేపథ్యంలో రైతుల కళ్లలో ఆనందం వెల్లువిరిస్తోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు పెట్టిన వేళా విశేషంతో ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో 12 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని, శనివారం పులిచింతల నుంచి నీరు విడుదల చేస్తామని తెలిపారు. గత నెల 27 నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని, రాయలసీమలోని అన్ని ప్రాజెక్టుల్లో నీటిని నింపుతామని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా కరువుకి శాశ్వత పరిష్కారం చూపుతాం. రాయలసీమ లిఫ్ట్ టెండర్లు పూర్తి చేశాం. ఎన్ని అడ్డంకులు సృష్టించిన సీఎం జగన్ పూర్తి చేసి చూపిస్తారు. నీటి పంపకాల్లో మాకు వివాదాలు అవసరం లేదు. ఏపీకి రావాల్సిన వాటా నీటిని మాత్రమే వినియోగించుకుంటాం. గోదావరి వరద వలన ఎక్కడా గండి పడలేదు. వరదను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. సీఎం జగన్ వస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రుజువైంది. గోదావరి వరదపై ప్రతిపక్ష టీడీపీ చౌకబారు ఆరోపణలు చేస్తోంది. క్లిష్ల సమయంలోనూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారు. -
అన్నదాతలపై ప్రేమకు చిహ్నంగా పులిచింతల
సాక్షి, అమరావతి: రైతును రాజును చేయడానికి ఆయన వేసిన ప్రతి అడుగు ప్రజల గుండెల్లో రాజన్నను రైతు బాంధవుడిగా నిలిపింది. దీంతో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రైతు దినోత్సవంగా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 852 రైతు భరోసా కేంద్రాల్లో మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలను బుధవారం జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాపై రాజన్న చెరగని ముద్ర వేశారు. టీడీపీ కంచుకోటకు బద్దలు కొట్టి 2004లో మొత్తం 19 నియోజకవర్గాల్లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి రాజకీయ ఉద్దండులను సైతం విస్మయపరిచారు. ముఖ్యమంత్రిగా జిల్లా ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉంది. పులిచింతల ప్రాజెక్టును నిర్మించి సస్యశ్యామలం చేశారు. కృష్ణా పశి్చమ డెల్టా, నాగార్జున సాగర్ ఆయకట్టుకు జీవం పోశారు. ఆరోగ్యశ్రీకి ఈ జిల్లాలోనే అంకురార్పణ చేసి లక్షలాది మంది రోగుల ప్రాణాలకు పురుడు పోశారు. గతంలో జిల్లాలో సీఎం హోదాలో డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జిల్లాలో 57 సార్లు పర్యటించారంటే ఆయనకు జిల్లాపై ఎంత మమకారం ఉందో తెలుస్తోంది. రాజన్న పాలన రైతులకు సువర్ణ యుగం దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాలన రైతులకు ఓ సువర్ణయుగం. రైతుల బతుకు చిత్రాన్ని మార్చే క్రమంలో జలయజ్ఞం కింద జిల్లాలో ఆయన పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించారు. వైఎస్సార్ చివరి సంతకం చేసిన ఫైల్ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చేదే. ఈ బీమాతో జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. జిల్లాకు అధిక ప్రాధాన్యం జిల్లా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆయన ఆర్థికంగా, రాజకీయంగా గుంటూరు జిల్లాకు అధిక ప్రాధాన్యం కలి్పంచారు. జిల్లాకు నాలుగు మంత్రి పదవులు కేటాయించడంతోపాటు, పథకాల అమలులో సైతం పెద్ద పీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.12వేల కోట్ల రుణమాఫీలో జిల్లా రైతులు దాదాపు 6.7 లక్షల మందికి రూ.560 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. ఇందిర ప్రభ జిల్లాలో ప్రారంభించి జిల్లా రైతులకు పెద్ద పీట వేశారు. ఇందిరమ్మ ఫేజ్–2 ఇళ్లను జిల్లాలోనే ప్రారంభించారు. రాజీవ్ పల్లెబాట ద్వారా ఎన్నో గ్రామాలకు తాగునీరందించి పల్లె వాసుల మనస్సులో చెరగని ముద్ర వేశారు. గుంటూరు నగరానికి దాహర్తి తీర్చేందుకు రూ.6.50 కోట్లతో తక్కెళ్లపాడు రా వాటర్ ప్లాంట్ నుంచి తక్కెళ్లపాడు నీటి శుద్ధి వాటర్ పాంట్ల వరకు రెండోపైపు లైను నిర్మించారు. నగర ప్రజల నీటి కష్టాలు తీర్చిన మహానేతను నగర ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రూ.460 కోట్లతో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకానికి ఆయనే అంకురార్పణ చేశారు. రైతులకు విద్యుత్ బకాయి మాఫీ చేయడం ద్వారా జిల్లాలో 80వేల మంది రైతులకు లబ్ధి కలిగింది. విద్యుత్ బకాయిల మాఫీ ద్వారా జిల్లాలోని రైతులకు రూ.36 కోట్ల లబ్ధి కలిగింది. ఉచిత విద్యుత్ పథకం ద్వారా జిల్లాలోని 80వేల మంది రైతులకు ఏడాదికి రూ.281.60 కోట్ల లబ్ధి చేకూరింది. దీంతోపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిరుపేదల పాలిటి అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008 లో గుంటూరు నుంచే ఆయన ప్రారంభించడం జిల్లా ప్రజలు మరిచిపోలేని తీపి జ్ఞాపకం. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ కోసం 2008 ఫిబ్రవరి 2న రూ. 4,444.41 కోట్లతో నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు అనుమతి ఇచ్చారు. దీని ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో 6.74 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువల ఆధునికీకరణ కోసం రూ.4,573 కోట్లు కేటాయించారు. ఇందులో గుంటూరు జిల్లాకు సంబంధించి రూ. 1760.15 కోట్లను కాల్వల ఆధునికీకరణకు కేటాయించారు. ఇందులో రూ.1187 కోట్ల పనులు జరిగాయి.దీని ద్వారా జిల్లాలో 5.22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగనుంది. మొత్తం మీద మహానేత కాలంలో జిల్లా వాసులకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను ఆయన పూర్తి చేసి జిల్లావాసుల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన పులిచింతల ప్రాజెక్టు 2004 అక్టోబరు 15న రూ.680 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో విజయవాడ, గుంటూరు నగరాల తాగునీటి దాహర్తి తీర్చడంతోపాటు కృష్ణా డెల్టాలో 13 లక్షల ఆయకట్టు స్థిరీకరించడానికి ఉపయోగపడుతోంది. దీనిని 2013 డిసెంబరు 7న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి ప్రారంభించారు. -
‘పులిచింతల ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ విగ్రహం’
సాక్షి, పులిచింతల: పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ‘పులిచింతల జల హారతి’ కార్యక్రమంలో అనిల్ కుమార్ తోపాటు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరె, సారెలను సమర్పించారు. అనంతరం పులిచింతల ప్రాజెక్టును మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్టు వద్ద సుమారు 45 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే వైఎస్సార్ స్మృతి వనం, పార్కును నిర్మిస్తామని తెలిపారు. వైఎస్సార్ విగ్రహంతో పాటు డా. కెఎల్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రోడ్లు, భవనాలతోపాటు, నాలుగు కిలోమీటర్ల పాటు దిగువన ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ వారధి నిర్మిస్తామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రాజెక్టు వద్ద స్థలాన్ని పరిశీలించినట్టు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం శుభపరిణామం అన్నారు. మరో ఇరవై ఏళ్ల పాటు రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ సామినేని, ఎమ్మెల్యేలు నంబూరి శంకర్ రావు, జోగి రమేశ్ పాల్గొన్నారు. -
గుండె గడపలో వైఎస్సార్
‘ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు ఆయన. ప్రజాకాంక్షకు తగ్గట్టు పాలన అందించిన మహానేత. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా కులమతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసి పల్లె కన్నీరు తుడిచిన మనసున్న మారాజు.’’ ఆయనకు గుంటూరు జిల్లాతో విడదీయ రాని అనుబంధం ఉంది. తండ్రిబాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులు, మహిళలతోపాటు అన్ని వర్గాల ప్రజల ముంగిటకు సంక్షేమ పథకాలు అందించే ప్రణాళికను ప్రకటించారు. నిరుద్యోగులకు గ్రామ వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జిల్లాలో వేలాది ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టి తండ్రి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొన్నారు. సాక్షి,అమరావతి : జిల్లాపై మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి చెరగని ముద్ర వేశారు. ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారు. పులిచింతల ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి డెల్టాను సస్యశ్యామలంగావించారు. ఆరోగ్యశ్రీకి ఈ జిల్లాలోనే అంకురార్పణ చేశారు. పేదోడు తలెత్తుకుని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది మహానేత హయాంలోనే. రైతుల బతుకు చిత్రాన్ని మార్చే క్రమంలో ఆయన 1.50 లక్షల కోట్ల రూపాయల అంచనాతో జలయజ్ఞం కింద రాష్ట్రంలో 86 ప్రాజెక్టులు చేపట్టారు. వైఎస్సార్ చివరి సంతకం చేసిన ఫైల్ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చేదే. కావడం గమనార్హం. రాజ్యం మేలు కోరిన పాలకుడు తెనాలి: వైఎస్సార్ సీఎంగా పగ్గాలు చేపట్టాక తెనాలి ప్రాంతమే కాదు, కృష్ణా డెల్టాకు చిరకాలంగా కలగా మిగిలిన పులిచింతల రిజర్వాయరుకు శంకుస్థాపన చే శారు. బహిరంగసభను తెనాలిలో నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను కృష్ణానదికి రప్పించి, డెల్టా ప్రాంతానికి నీటికరువు లేకుండా చేస్తావుని ప్రకటించారు. అయిదేళ్లలో పులించింతలను సాకారం చేశారు. పోలవరం పనుల్లోనూ పురోగతిని సాధించిన విషయం తెలిసిందే. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాలలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక డెల్టా ప్రాంతంలో రెండు పంటలకు నీరిస్తావుని హామీనిచ్చారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక అయిదేళ్లూ ఆ మాటను నిలబెట్టుకుంటూ వచ్చారు. అంతుకు ముందెన్నడూ లేనివిధంగా 2008లో 2.20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగుచేసిన మెుక్కజొన్న పైరుకు 2009 ఏప్రిల్ వరకు సాగునీరిచ్చి సహకరించిన వైనాన్ని రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఇందిరమ్మ పథకం ఫేజ్–2 ఆరంభానికి అప్పటి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని రప్పించటమే కాకుండా Üమీపంలోని కొల్లిపర మండలం తూములూరులో శంకుస్థాపన చేయించారు. గుంటూరు–హనువూన్పాలెం డబుల్ లైన్ రహదారి, కొల్లిపర గ్రామం నుంచి కృష్ణా కరకట్ట వరకు రెండు లైన్ల సిమెంటు రహదారి, రూ.112 కోట్లతో కృష్ణా కుడి వరదకట్ట విస్తరణ, మున్నంగిలో 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్తో సహా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఇక్కడ నుంచే ప్రారంభించారు. గొడవర్రు వద్ద బ్యాంక్ కెనాల్పై బల్లకట్టు మునిగి 14 మంది చనిపోతే, మరో ఏడాదికల్లా కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాల్, రేపల్లె బ్యాంక్ కెనాల్పై 17 చోట్ల కాలిబాట వంతెనలు నిర్మింపజేశారు. తెనాలిలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప గృహ సముదాయాలను 2009 జనవరి 28న వచ్చిన వైఎస్ ప్రారంభించారు. యడ్ల లింగయ్యకాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు నూరు శాతం ఉచితంగా పక్కా గృహాల నిర్మాణానికి ప్రత్యేకంగా జీవో ఇప్పించారు. చంద్రబాబునాయుడు కాలనీలో మురుగు కాలువల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వుుఖ్యవుంత్రి బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో 3 వేల మంది కళాకారులకు రూ.200 పింఛనును అందిస్తున్నారు. అప్పటికింకా 21 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వైఎస్ దృష్టికి ఈ విషయం రాగానే కళాకారుల 21 నెలల బకాయిలు చెల్లించేశారు. పింఛను మొత్తాన్ని రూ.500 చేశారు. అప్పటి వరకు ఉన్న 3 వేల మందికి అదనంగా మరో 7 వేల మందికి పెన్షన్లను మంజూరు చేశారు. నెరవేరిన పులిచింతల కల గుంటూరు, కృష్ణా జిల్లాలకు పులిచింతల ప్రాజెక్టు గుండెకాయ లాంటిది. విజయవాడ, గుంటూరు నగరాల తాగు నీటి అవసరాలు తీర్చడంతోపాటు, కృష్ణా పశ్చిమ డెల్టాను సస్యశ్యామలం చేస్తుంది. ప్రాజెక్టు సామర్థ్యం 47.45 టీఎంసీలు. తరువాత ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి. 2013లో ప్రాజెక్టుకు సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం పులిచింతల నిర్వాసితులకు సంబంధించి పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిలువ చేయకుండా కిందికి విడుదల చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టులో 40 టీఎంసీలకుపైగా నీటిని నిల్వ చేశారు. ఈ నీరుతో కృష్ణా తూర్పు, పశ్చిమ ఆయకట్టు రైతులకు భరోసా ఏర్పడింది. గుంటూరు, విజయవాడ నగరాలకు తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా పోయింది. నాగార్జున సాగర్, జవహర్ కాలువల ఆధునికీకరణ పనులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 2008లో రూ. 4444.4 కోట్లతో పనులను చేపట్టారు. ఈ పనుల్లో భాగంగానే గుంటూరు జిల్లా పరిధిలోని ప్రధాన కాలువ, బ్రాంచ్ కాలువ ఆధునికీకరణ పనులు, డిస్ట్రిబ్యూటరీ పనులు సాగాయి. కుడికాలువ పరిధిలో లైనింగ్ పనులను చేపట్టారు. ఈ పనులను 2018 జూలై నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. అయితే ఇప్పటి వరకు రూ. 2,832.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో ప్రపంచ బ్యాంకు వాటా 48 శాతం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 52 శాతంగా ఉంది. డాలరు మారకపు విలువతో రూ.900 కోట్ల నిధులతో కాలువల అధునికీకరణ పనులు చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గడువు ముగుస్తున్న తరుణంలో హడావిడిగా కేవలం రూ.400 కోట్లతో మాత్రమే పనులు చేపట్టారు.. జిల్లాపై ఎనలేని మమకారం జిల్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా, రాజకీయంగా గుంటూరుకు వైఎస్ అధిక ప్రాధాన్యాన్ని కల్పించారు. జిల్లాకు నాలుగు మంత్రి పదవులను కేటాయించటంతోపాటు పథకాల అమల్లో పెద్ద పీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన 12 వేల కోట్ల రుణమాఫీలో జిల్లా రైతులకు రూ.560 కోట్ల మేర రైతులకు ప్రయోజనం చేకూరింది. ఇందిర ప్రభ జిల్లాలో ప్రారంభించారు. రాజీవ్ పల్లెబాటలతో ఎన్నో గ్రామాలకు దాహార్తిని తీర్చారు. గుంటూరు నగరానికి దాహార్తి తీర్చేందుకు రూ 6.50 కోట్లతో తక్కెళ్ళపాడు రా వాటర్ ప్లాంటు నుంచి తక్కెళ్ళపాడు నీటి శుద్ధి ప్లాంటు వరకు రెండో పైప్లైన్ నిర్మించారు. విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్ పథకం ద్వారా లక్ష మందికిపైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. తెనాలిలో తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన (ఫైల్) ఐదేళ్లలో 57 సార్లు పర్యటన: ఏ సీఎం తిరగని రీతిలో ముఖ్యమంత్రి హోదాలో డాక్టర్ వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నంగా నిలిచిపోయిన పులిచింతల ప్రాజెక్టును 2004 అక్టోబర్ 15న రూ.682 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. నిరుపేదల పాలిటి అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచే ఆయన ప్రారంభించటం జిల్లా చరిత్రలో మర్చిపోలేని విషయం. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలకు జిల్లాలోనే అంకురార్పణ చేశారు. జలయజ్ఞం పనులతో రూపు రేఖలు మార్చిన మహానేత... దివంగత మహానేత డాక్టర్ వైఎస్,రాజశేఖరరెడ్డి జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో జలయజ్ఞం పథకం కింద పులిచింతల ప్రాజెక్టు, నాగార్జున సాగర్, జవహర్ కాలువల∙ఆధునికీకరణ పనులు, కృష్ణా,పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులను చేపట్టారు. మొత్తం మీద నీటిపారుదల రంగానికి దాదాపు రూ. 6వేల కోట్లు జలయజ్ఞం పనులు చేసి జిల్లా రూపు రేఖలనే మార్చారు. కృష్ణా పశ్చిమ డెల్టా గుంటూరు జిల్లాలో కృష్ణా పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనుల కోసం 2008లో వైఎస్సార్ రూ. 835.33 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో రూ. 390.83 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కాలువల అధునికీకరణ పనులు జరగని దుస్థితి నెలకొంది. తెనాలిలో నగరబాటలో భాగంగా 2008 జనవరిలో రూ. 97 కోట్ల విలువైన రక్షిత మంచినీటి పథకానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. దీంతోపాటు ఇందిరప్రభ ద్వారా 13 వేల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారు. రాజీవ్ పల్లెబాట కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. జిల్లాలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో చేపట్టిన పనులు ప్రజల మదిలో నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీకి మళ్లీ మంచి రోజులొచ్చాయి ఆరోగ్యశ్రీ పథకానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి. చరిత్ర సృష్టించే విధంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించి ఎందరికో ప్రాణదానం చేశారు. తిరిగి నేడు ఆయన బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పథకానికి జీవం పోశారు. వీరిద్దరి పాలనలోనే ఆరోగ్యశ్రీ పథకం పూర్తిస్థాయిలో అమలు జరుగుతోంది. నాడు మహానేత నేడు ఆయన తనయుడు ప్రజా నాయకులుగా నిలిచిపోయారు. – కేసరి నర్సింహా రెడ్డి, నకరికల్లు ఇంత మొత్తంలో ఉద్యోగాల కల్పన ఇదే తొలిసారి ఉపాధిమార్గం కల్పిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని విశ్వసించే ముందుచూపున్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. అప్పట్లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి భారీగా ఉద్యోగాలను కల్పించి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి మార్గం చూపారు. నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్లు, గ్రామ సచివాలయాల ద్వారా లక్షలాది మందికి ఉపాధినిస్తున్నారు. ఇంతస్థాయిలో ఉద్యోగాలు కల్పించడమనేది చరిత్రలో అరుదైన ఘట్టం. ఇదే సమయంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు తెచ్చుకుంటున్నారు. – షేక్.హుస్సేన్, నకరికల్లు రాజన్న దయ వల్లే నాకు పునర్జన్మ నా పేరు గుంటూరు భూలక్ష్మి. నా భర్త శ్రీనివాసరావు సెంట్రింగ్ పని చేస్తుంటాడు. కుమారుడు రాజేష్ సెల్ మెకానిక్ చేస్తుండగా, నా కుమార్తె నాగజ్యోతి పీజీ విద్యనభ్యసించడంతో వివాహం చేశాం. నాకు గుండెల్లో నొప్పి రావడంతో ప్రైవేటు వైద్యశాలను ఆశ్రయించా. గుండె ఆపరేషన్ చేయాలని లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకుని బతికి బయట పడ్డా. రాజన్న వల్లే నేను ప్రాణాలతో ఉన్నా. నాకు ఆపరేషన్తోపాటు ఆరోగ్యశ్రీ ద్వారానే ఇంటికి వెళ్లడానికి చార్జీలు, మందులు కూడా ఉచితంగా ఇచ్చి పంపించారు. నా కుమార్తె ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పీజీ చదివింది. పక్కా గృహాన్ని రాజన్న హయాంలోనే నిర్మించుకున్నా. – గుంటూరు భూమలక్ష్మి, సాలిపేట, సత్తెనపల్లి అన్నదాతకు భరోసా ఇచ్చారు నా పేరు బాపతు శివారెడ్డి. నా భార్య వెంకాయమ్మ. నాకు నందిని, నాగలక్ష్మి, నాగజ్యోతి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాకు 2.25 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాం. పంటలు పండక అప్పులపాలు కావడంతో పొలం అమ్మకానికి పెడు తున్న తరుణంలో రాజశేఖరరెడ్డి రైతుల రుణాలు మాఫీ చేశారు. ఆ సమయంలో నాకు రూ. 90 వేలు రుణమాఫీ అయ్యింది. అంతేగాక నా కుమార్తె నందిని డిగ్రీ, నాగలక్ష్మిని పీజీ, నాగజ్యోతిని ఇంజినీరింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదివించాను. రూపాయి ఖర్చు లేకుండా ఉన్నత విద్యనభ్యసించారు. ఆయన హయాంలోనే పక్కా గృహం నిర్మించుకున్నా. అన్నదాతలను ఆదుకున్న మహానేత రాజశేఖరరెడ్డిని ఎప్పటికీ మరిచిపోలేం. – బాపతు శివారెడ్డి, శాలివాహననగర్, సత్తెనపల్లి -
వరద పొడిచిన లంక గ్రామాలు
సాక్షి, అమరావతి: కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. సాగర్, పులిచింతల ప్రాజెక్టులను ముంచెత్తుతోంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతుండడంతో వరద నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. వరద దెబ్బకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో లంక గ్రామాలకు ముప్పు ఏర్పడింది. పల్నాడుతోపాటు డెల్టా ప్రాంతంలో ఇప్పటికే సాగులో ఉన్న పంటలు నీట మునిగాయి. రాజధాని ప్రాంతంలో వాగులు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరాయి. లంక గ్రామాలను వరద చుట్టుముట్టడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి మోపిదేవి, ఎంపీ సురేష్, ఎమ్మెల్యే నాగార్జున ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి వరద కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుకు నుంచి దిగువకు భారీగా నీటి విడుదల చేస్తుండటంతో కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. పలు లంక గ్రామాలు నీట మునిగాయి. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రికి వరద ప్రకాశం బ్యారేజీకి చేరుతుందన్న అంచనాతో లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసంలోకి నీరు చేరాయి. కరకట్ట లోపల ఉన్న పలు గృహాలలోకి వరద నీరు వచ్చింది. అక్కడ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముంచెత్తిన వరద కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, దాచేపల్లి మండలంలోని పొందుగల, కాట్రపాడులో దాదాపు 500 ఎకరాలు, అచ్చంపేట మండలంలోని కస్తల, అంబడిపూడి, క్రోసూరు, మాదిపాడు, అమరావతి, పెద్దమద్దూరు, మునుగోడు, మల్లాది, దిడుగు, ధరణికోట ప్రాంతాల్లో సుమారు 6,500 ఎకరాల్లో పత్తి, మిరప పంటలు నీటి పాలయ్యాయి. పెద్దమద్దూరు గ్రామంలోకి నీరు చేరింది. విజయవాడ– అమరావతి– క్రోసూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి–ధరణికోట మధ్య గన్నేరువాగు, జూపూడి–మునుగోడు మధ్య నక్కల వాగు ప్రవహించటంతోనే ఇబ్బందులు తలెత్తాయి. తుళ్లూరు మండలంలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. తాడేపల్లి కరకట్ట లోపల ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరింది. వరద వచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు రాద్ధాంతం చేసి హంగామా చేశారు. మాదిపాడు చప్టాపై ప్రయాణికుల రాకపోకలకు ఏర్పాటు చేసిన పడవ లంక గ్రామాల్లో పంటలు నీట మునక కొల్లిపర మండలంలో అన్నవరపు లంక, కొత్తలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామాలకు బోట్లపైన వెళ్లాల్సి వస్తోంది. వల్లభాపురం,, మున్నంగి, పిడపర్రు, పిడవర్తిపాలెం, పాతబొమ్మవానిపాలెం, అన్నవరం, అన్నవరపులంక, కొత్తూరులంకలో పంట పొలాల్లోకి నీరు చేరాయి. ఈ మండలంలో 2815.75 ఎకరాల్లో అరటి, పసుపు, కంద, జామ నిమ్మ, కూరగాయల తోటల్లోకి నీరు వచ్చినట్లు ప్రాథమిక అంచనా వేశారు. కొల్లూరు మండలంలో పెసర్లంక–అరవింద వారధి సమీపంలో గండి పడటంతో రోడ్డు కోతకు గురైంది. అరవిందవారిపాలెంలో చినపాయలోకి నీరు ప్రవేశించకుండా వేసిన అడ్డుకట్టకు గండి పడటంలో పలు గ్రామాల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. దీంతో చిలుమూరు లంక, సుగ్గులంక, ఈపూరిలంక, చింతర్లక, పెసరలంక, పెదలంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోతార్లంక, తిప్పలకట్ట, తోకల వారిపాలెం, కిష్కింపాలెం, జువ్వలపాలెం పంట పొలాల్లోకి నీరు చేరింది. దాదాపు 4000 ఎకరాల్లో పసుపు, కంద, అరటి, బొప్పాయి, మొక్క జొన్న పంటలు మునిగిపోయాయి. కొల్లూరు మండలం పెసర్లంక వద్ద పడిన గండితో రాకపోకలకు అంతరాయంగా మారింది. దుగ్గిరాల మండలంలో వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ముంపు గ్రామాల్లో మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ పర్యటన కొల్లూరు, కొల్లిపర, దుగ్గిరాల, రేపల్లి భట్టిప్రోలు, ప్రాంతాల్లో మంత్రి మోపిదేవి వెంకటరమణరావు, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, కలెక్టర్ ఐ.శ్యామూల్ అనందకుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్కుమార్ పర్యటించారు. కొల్లూరులో వరద పరిస్థితిపై మంత్రి మోపిదేవి వెంకటరమణరావు అధికారులతో సమీక్షించారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. తాగు నీరు, భోజనం అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తుళ్లూరు మండలంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. తాడేపల్లిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్యటించి వరద పరిస్థితిని అంచనా వేశారు. అమరావతి మండలంలో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించారు. గజ ఈతగాళ్లను, పడలవలను సిద్ధంగా ఉంచారు. వరద నివారణకు ప్రత్యేక చర్యలు పోతార్లంక వద్ద వరదలో చిక్కుకుపోయిన వారిని కాపాడుతున్న గజ ఈతగాళ్లు గుంటూరు జిల్లాలో వరద ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా 60 మంది సభ్యులు గల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను విజయవాడ, కొల్లిపర, కొల్లూరు, తెనాలిలో సిద్ధంగా ఉంచారు. జిల్లాలోని 12 మండలాలు, 39 గ్రామాల్లో 537 కుటుంబాలు, 709 మంది ప్రజలకు వరద ముప్పు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1619 మంది తరలించారు. సాగర్ రిజర్వాయర్కు ఇన్ఫ్లో 7,13,052 క్యూసెక్కులు వస్తుండగా, బయటకు 7,13,042 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 8,39,136 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 7,97,502 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో 7,57,005 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 7, 71,134 క్యూసెక్కులను పంపుతున్నారు. శనివారం నాటికి వరద ఉద్ధృతి పెరిగి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉంది. -
నిండుకుండలా పులిచింతల ప్రాజెక్ట్
సాక్షి, హుజూర్నగర్: నాగర్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో పులిచిం తల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను రాత్రి 9 గంటలకు 38.75 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి ఇన్ఫ్లోగా 7.21 లక్షల నీరు వస్తుండగా ప్రాజెక్ట్లోని 22గేట్లనుఎత్తి 7.10 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్కు సందర్శకుల తాకిడి.. నిండుకుండా మారిన పులిచింతల ప్రాజెక్ట్ అందా లను తిలకించేందుకు సందర్శకులు పోటెత్తున్నారు. సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నది అందాలను తమ సెల్ ఫోన్లో బంధిస్తున్నారు. ప్రాజెక్ట్ వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. ముంపు గురవుతున్న పంట పొలాలు... భారీగా వరద నీరు రావండతో పులిచింతల బ్యాక్ వాటర్ అంతకంతకూ పెరుగతోంది. దీంతో ముంపు గ్రామాల పరిధిలో ఉన్న పొలాల్లోని పత్తి, మిర్చి, వరి పొలాలు నీట మునుగుతున్నాయి. రోడ్డుపైకి వచ్చిన వరద... పులిచింతల ప్రాజెక్ట్లో బ్యాక్ వాటర్ అంతకంతకూ పెరుగుతుండడంతో వాగులు వంకలు, కయ్యలను ముంచెత్తుతోంది. ఆ నీరు రోడ్లపైకి చేరుతోంది. వెల్లటూరు గ్రామ శివారులోని తాళ్లవాగులోకి వరద నీరు చేరింది. అంతే కాకుండా శోభనాద్రిగూడెం చెరువుకట్టపైకి వచ్చింది. దీంతో మిగతా గ్రామాలకు ఈ రహదారిలో రాకపోకలు బందయ్యాయి. ఆర్టీసీ బస్సులను దారి మళ్లించి నడుపుతున్నారు. పునరావాస కేంద్రాలకు తరలింపు... పులచింతల ముంపు గ్రామాల్లో ఇంకా నివాసం ఉంటున్న వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రేబల్లె, తమ్మారం ఎస్సీ కాలనీ, శోభనాద్రిగూడెం గ్రామంలోని ప్రజలను ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పిస్తున్నారు. జేసీ, డీఆర్ఓ సందర్శన... ముంపు గ్రామాలను జేసీ సంజీవరెడ్డి, డీఆర్ఓ చం ద్రయ్య సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కార్యక్రమంలో సీఐ శివరాంరెడ్డి, తహసీల్దార్లు కమలాకర్, జవహర్లాల్, ఎస్ఐలు వెంకటరెడ్డి, ప్రవీణ్ కుమార్, దశరధ్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
ముంపుబారిన మట్టపల్లి క్షేత్రం
సాక్షి, మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ముంపుబారినపడింది. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురికాకుండా కోట్లాది రూపాయలతో నిర్మించిన కరకట్టనుంచి వరదనీరు లీకేజీ అయి ఆలయంలోకి చేరింది. ఆంజనేయస్వామి ఆలయంతో పాటు ధ్వజస్తంభాన్ని చుట్టుముట్టింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు. ఆలయంలోకి చేరిన నీటిని ధర్మకర్తలు,ఈఓ తెల్లవారేలోగా విద్యుత్ మోటార్లతో ఎత్తిపోసే పని చేపట్టారు. ఆలయంలోకి చేరిన వరదనీరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం పులిచింతల ప్రాజెక్ట్ ముంపునకు గురైంది. ఆలయం ముంపు బారిన పడకుండా కోట్లాది రూపాయలతో నిర్మించిన కరకట్ట నుంచి బుధవారం వరదనీరు లీకేజీ కావడంతో ఆలయంలోకి చేరింది. దీంతో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన శ్రీస్వామివారి భక్తులు ఆలయానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. స్వయంభూ స్వామివారిని ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కదిలించకుండా ఉండాలనే ప్రభుత్వం ఆలయంతో పాటు శివాలయం, అన్నదాన సత్రాల రక్షణకోసం ఆలయం చుట్టూ రూ.2కోట్లు, శివాలయం నుంచి ప్రహ్లాదఘాట్ వరకు రూ.4కోట్లు, అన్నదాన సత్రాలు, అతిథి గృహాల రక్షణ కోసం మరో రూ.6కోట్లు వెచ్చించి కరకట్టలు నిర్మించింది. మూడు భాగాలుగా నిర్మించిన కరకట్టలో ప్రధానమైన ఆలయం చుట్టూ ఉన్న కరకట్ట (రక్షణగోడ)లీకేజీలు ఏర్పడి ఆలయంలోపలికి తెల్లవారుజాము నుంచి నీరు ప్రవేశించడంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. విషయం తెలుసుకున్న ఆలయ ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ ఉదయభాస్కర్లు తెల్లవారేలోపు ఆలయానికి చేరుకుని విద్యుత్మోటార్ సహాయంతో ఆలయంలోని నీరును బయటికి ఎత్తిపోసేపనిని ప్రారంభించారు. ఆ తరువాత కోదాడ ఆర్డీఓ కిశోర్కుమార్, ఎంపీపీ ముడావత్ కొండానాయక్, జెడ్పీటీసీ జగన్నాయక్, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ జానకిరాములు, సర్పంచ్ విజయలక్ష్మీవెంకటరమణ, ఈఓ ఉదయభాస్కర్లు ఆలయం వద్దకు చేరుకుని లీకేజీలను పరిశీలించారు. అప్పటికే వరదనీరు ఆంజనేయస్వామి ఆలయం, ధ్వజస్తంభం చుట్టుముట్టింది. ఇక్కడ కృష్ణమ్మ ప్రవాహాన్ని చూసి.. స్వామివారిని దర్శించుకునేందుకు మాత్రం భక్తులు భారీగా తరలివచ్చారు. పులిచింతల ఎస్ఈతో ఆర్డీఓ సంప్రదింపులు.. మట్టపల్లి దేవాలయం కరకట్ట లీకేజీతో వరదనీరు చేరి ముంపుకు గురికావడంతో భక్తుల ఆందోళన గమనించిన కోదాడ ఆర్డీఓ కిశోర్కుమార్ ఆలయానికి చేరుకుని పరిశీలించారు. అక్కడి నుంచే పులిచింతల ప్రాజెక్ట్ ఎస్ఈతో ఫోన్లో సంప్రదించి కరకట్ట లీకేజీల విషయాన్ని వివరించారు. అయితే వెంటనే ఇంజనీర్లను పంపించి తక్షణ చర్యలు చేపడతామని ఎస్ఈ తెలిపినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేగాక మట్టపల్లిలో ముంపుకు గురవుతున్న మత్స్యకారుల నివాస ప్రాంతాలను చేపల రేవులను పరిశీలించారు. వరదముంపు పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. ఆలయాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓ కిశోర్కుమార్ -
ప్రకాశం వద్ద వరద ఉధృతి.. అధికారుల అప్రమత్తం
సాక్షి, విజయవాడ: పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ను వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ప్రకాశంలోని 72 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత ప్రాజెక్టును పరిశీలించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4లక్షల 40వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ప్లో ఆరులక్షల క్యూసెక్కులకు మించితే లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాసాలను సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామని, మత్యకారులు వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. వరద మరింత పెరిగినా.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రెస్క్యూ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతుండటంతో దిగువకు విడుదల చేస్తున్న వరద పరిమాణాన్ని అధికారులు పెంచుతూ పోతున్నారు. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో సర్కార్ హైఅలర్ట్ను ప్రకటించింది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 164కు చేరింది. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఈరోజు సాయంత్ర వరకు వరద ఇదే విధంగా కొనసాగితే ప్రాజెక్టు నిండుకుండాల మారనుంది. ఎగువన శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో నాగార్జున సాగర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 312 టీఎంసీలుగా.. ప్రస్తుతం 281టీఎంసీలు నీటినిల్వ ఉంది. దీంతో ప్రాజెక్టులోని పూర్తి26 గేట్ల ద్వారా నీటికి దిగువకు వదలుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కడలి వైపు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/అచ్చంపేట (పెదకూరపాడు)/శ్రీశైలం ప్రాజెక్ట్: గోదావరి సముద్రం వైపు కదలిపోతుంటే దానికి దీటుగా కృష్ణమ్మ కూడా కడలి వైపు పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటం.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మంగళవారం ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 21.74 టీఎంసీల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతుండటంతో దిగువకు విడుదల చేస్తున్న వరద పరిమాణాన్ని అధికారులు పెంచుతూ పోతున్నారు. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో సర్కార్ హైఅలర్ట్ను ప్రకటించింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి నుంచి 57.89 టీఎంసీలు.. నారాయణపూర్ నుంచి 50.98 టీఎంసీల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా ఉపనది భీమాలో వరద ప్రవాహం తగ్గింది. దాంతో ఉజ్జయిని జలాశయం నుంచి 0.94 టీఎంసీని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 64.37 టీఎంసీల ప్రవాహం వస్తుండగా 65 గేట్లు ఎత్తి దిగువకు 63.21 టీఎంసీల ప్రవాహాన్ని కిందకు వదిలారు. తుంగభద్ర జలాశయం నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 10.02 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 76.30 టీఎంసీల వరద ప్రవాహం వస్తుండగా.. 76.37 టీఎంసీల వరద ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. దాంతో సాగర్ 26 గేట్లు ఎత్తి 46.31 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 23.27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. బుధవారం సాయంత్రానికి నీటి నిల్వ 40 టీఎంసీలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా దిగువకు 36.67 టీఎంసీల ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దాంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. బ్యారేజీ భద్రత దృష్టా వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. మరోవైపు గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,36,873 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధార నదిలో వరద ప్రవాహం పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 30,767 క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి వదులుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న పోలీసులు కంచికచర్ల (నందిగామ): కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు లంక భూముల్లో నివాసముంటున్న రైతులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వెళ్లిన పోలీస్ అధికారులు మంగళవారం వరదనీటిలో చిక్కుకున్నారు. కృష్ణానది లంక భూముల్లో సుమారు 40 కుటుంబాల రైతులు ఉంటున్నారు. లంక భూముల్లో నివాసముంటున్న రైతులను గ్రామానికి చేరవేసేందుకు నందిగామ రూరల్ సర్కిల్ సీఐ కె.సతీశ్, ఎస్ఐ జి.శ్రీహరిబాబు కొంతమంది విలేకరులతో కలసి వెళ్లారు. వారు వెళ్లే సమయంలో కృష్ణానదికి వరదనీరు రాకపోవటంతో ఎక్కువమంది రైతులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మిగిలిన ఐదు కుటుంబాల రైతులను తరలించే సమయంలో వరద ఉధృతి తీవ్రరూపం దాల్చింది. దీంతో వారు వరదల్లో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వి.రాజకుమారి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇబ్రహీంపట్నం నుంచి మూడు బోటులను తెప్పించి వారిని కాపాడేందుకు వెళ్లారు. దీంతో అక్కడున్న రైతులు, సీఐ, ఎస్ఐలతోపాటు విలేకరులు గుదే వరప్రసాద్, తోట క్రాంతికుమార్లను బోట్లపై సురక్షితంగా గ్రామానికి తీసుకువచ్చారు. -
కృష్ణా ఉగ్రరూపం.. సాగర్ గేట్ల ఎత్తివేత
సాక్షి, నల్గొండ: ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్పూర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ కళకళలాడుతున్నాయి. వరద ఉద్ధృతి కొనసాగుతున్నందున సోమవారం సాగర్లో 26 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో నాగార్జునసాగర్ జలకళ సంతరించుకుంటోంది. ఆదివారం శ్రీశైలంలో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువన నాగార్జున సాగర్లోకి వదిలారు. నిన్నటి నుంచి భారీ ప్రవాహం సాగర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. సాగర్కు 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అధికారులు 24 గేట్లను పైకెత్తారు. ఒక్కోగేటును 5 అడుగుల మేర పెకెత్తి 65,105 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. నిండునున్న పులిచింతల.. ప్రవాహం మరికొంత పెరిగితే ప్రాజెక్టులోని మొత్తం గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ రాత్రికే దిగువనున్న పులిచింతల ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 559.20 అడుగులు నమోదైంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 225 టీఎంసీలు నమోదైంది. దీంతో సాగర్ పరివాహాక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండుకుండలా మారియి. కాగా ప్రాజెక్టుల ఆయకట్టుకు ఏపీ, తెలంగాణ మంత్రులు ఇదివరకే కాలువల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో శ్రీశైలం, సాగర్ ఆయనకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిండుకుండలా శ్రీశైలం ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 7.53లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 8.51 లక్షల క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉంది. జలాశయం 10 గేట్లను 42 అడుగుల మేర పైకెత్తి నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలద్వారా 8,20,162 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుకి 28వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 735క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.60 అడుగులు నమోదైంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 180.26 టీఎంసీలు ఉంది. సాగర్కు పర్యాటకుల తాకిడి నాగార్జునసాగర్కు జలకళ సంతరించుకోవడంతో అక్కడికి పర్యాటకుల తాకిడి పెరిగింది. మాచర్ల వైపు నుంచి సాగర్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళతున్నారు. బక్రీద్ సెలవుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం వద్ద కూడా పర్యాటకులు సందడి నెలకొంది. ప్రాజెక్టు అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో డ్యాం వద్ద అధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు. -
ఇక.. జల‘సమాధే’
కొన్నింటిని కాపాడితే...చరిత్ర మిగులుతుంది ‘ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టుల వల్ల ముంపు ఏర్పడే చోట చారిత్రక అవశేషాలుంటే వాటిల్లో కొన్నింటిని పదిలపరిచి భావితరాలకు అందించిన దాఖలాలున్నాయి. భవిష్యత్తులో అధ్యయనానికి కూడా అది వీలు కల్పిస్తుంది. పులిచింతల బ్యాక్వాటర్ ముంపు ప్రాంతంలో కూడా అలా కొన్నింటిని పరిరక్షించాలి. కుదిరితే ఓ మినీ మ్యూజియం ఏర్పాటు చేయాలి. అరుదైన చరిత్ర అంతరించకుండా కాపాడుకోవాల్సి ఉంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇటీవల వేముగంటి మురళి, చంటి, రాము, గోపి, పాలూరి మోష తదితరులతో కలసి ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఎన్నో అరుదైన నిర్మాణాల అవశేషాలు కనిపించాయి’. – శ్రీరామోజు హరగోపాల్, తెలంగాణ జాగృతి సాక్షి, హైదరాబాద్: రాతియుగం నాటి నిర్మాణమిది. ఇలాంటివి పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. పూర్తిగా భూఉపరితలంలో నిర్మాణమైన సమాధులూ ఉన్నాయి. క్యాప్స్టోన్ లేని నిర్మాణాలైతే కోకొల్లలు. ఇప్పుడు ఇవన్నీ జలసమాధి కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్టు బ్యాక్వాటర్లో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలోకి వచ్చే కొన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల పునరావాసం దాదాపు పూర్తయింది. మరికొన్ని ముంపు గ్రామాల తరలింపు జరగాల్సి ఉంది. పాత ఊళ్లు నిర్మానుష్యంగా మారి కొత్త ప్రాంతాల్లో ఇళ్లు వెలుస్తున్నాయి. భవిష్యత్తులో ఆ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం క్రమంగా పెరగనున్నందున, ముంపు ప్రాంతాలుగా నిర్ధారించిన పరిధి నీటితో నిండిపోనుంది. గ్రామాల పునరావాసం కొనసాగుతున్నా ‘చరిత్ర’పునరావాసం జాడే లేదు. ఈ విషయమై చరిత్రకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ప్రాంతానికి పూర్వపు చరిత్ర ఉంటుంది. దానికి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. ఆయా ప్రాంతాల్లో వెలుగు చూసే పురాతన ఆనవాళ్లు ఆ విశేషాలను వెల్లడిస్తాయి, నాటి చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా చారిత్రక ఆనవాళ్లను పదిలం చేస్తుంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి రాతియుగం నాటి సమాధులు, వాటి చుట్టుపక్కల ఆదిమానవుల ఆవాసజాడలు వెలుగు చూశాయి. కానీ, ఒక్కో ప్రాంతంలోని నిర్మాణాలు ఒక్కో రకంగా ఉండటం ఆసక్తి కలిగించే విషయమే. ఆయా ప్రాంతాల్లో నేలస్వభావం, దొరికే రాళ్లు, భౌగోళిక స్వారూపం... ఇలాంటివాటి ఆధారంగా నిర్మాణాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. తెలంగాణలో భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల సరిహద్దులో వెలుగుచూసిన డోల్మెన్ సమాధులకు, ఇతర ప్రాంతాల్లోని సిస్ట్ సమాధులకు, ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో లభించిన సమాధులకు తేడాలున్నాయి. సాధారణంగా ఆదిమానవులు క్రూరమృగాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకునేవారు. వీలైనంతవరకు గుట్టలపై గుంపుగా జీవనం సాగించేవారు. కానీ పులిచింతల ముంపు ప్రాంతాల్లో ఎత్తయిన గుట్టలు లేవు. అన్నీ రాతి మైదానాలే కావడంతో ఆ రాళ్లనే ఆవాసంగా చేసుకున్నారు. ఇక్కడి షాబాద్ రాతి పొరలున్నందున, సమాధుల నిర్మాణానికి కూడా ఆ రాతినే వినియోగించారు. మూడు దశాబ్దాల క్రితం... కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రితం భట్టాచారి అనే అధికారి నేతృత్వంలో ఈ ప్రాంతంలో కొంత అధ్యయనం జరిగింది. మచ్చుకు నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకుని పరిశోధించారు. ఇక్కడ వందల సంఖ్యలో ఇలాంటి నిర్మాణాలున్నాయని గుర్తించారు. చాలావరకు ఇప్పుడు భూగర్భంలో ఉన్నాయి. వాటిల్లో ఇప్పటికీ ఎముకలు, వారు వినియోగించిన వస్తు అవశేషాలున్నాయి. పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే నాటిచరిత్రకు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు తెలిసేవి. కానీ అధ్యయనం అసంపూర్తిగానే ముగిసింది. ఈలోపు కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం జరగటంతో నీళ్లు నిలిచి చాలాప్రాంతాలు ముంపుబారిన పడటం మొదలైంది. ఈ క్రమంలో చారిత్రక ఆనవాళ్లు కూడా జలసమాధి అవుతున్నాయి. భవిష్యత్తులో అధ్యయనం చేసేందుకు కూడా ఆనవాళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక ఈ చరిత్రే సమాధి అవబోతోంది. అందుకోసం కొన్ని సమాధులు, నాటి ఇతర ఆనవాళ్లను గుర్తించి వాటిని యథాతథంగా మరో ప్రాంతానికి తరలించి ఏర్పాటు చేయాలని, తద్వారా కొంతమేర అధ్యయనానికి అవకాశం ఉంటుందని చరిత్రకారులు అంటున్నారు. -
రాజన్న నిను మరువలేమన్న..
సాక్షి, తెనాలి : తెనాలి ప్రాంతమే కాదు, కృష్ణా డెల్టాకు చిరకాలంగా కలగా మిగిలిపోయి, టీడీపీ పాలకులు పునాదిరాళ్లకే పరిమితం చేసిన పులిచింతల రిజర్వాయరుకు 2004 అక్టోబర్లో వైఎస్ శంకుస్థాపన చేశారు. అదే రోజు తెనాలి బహిరంగసభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను అందిస్తానని చెప్పారు. ఆ ప్రకారం పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను పనులు చకచకా ఆరంభించి చిత్తశుద్ధి చాటుకున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో రబీలో విస్తారంగా పెరుగుతూ వచ్చిన మొక్కజొన్నకు, ఏప్రిల్ ఆఖరు వరకు పంట కాలువల ద్వారా నీటిని సరఫరా చేశారు. కోరిన వరాలనిచ్చిన ప్రజాబంధువు.. గుంటూరు–హనుమాన్పాలెం డబుల్ లైన్ రహదారి, కొల్లిపర గ్రావుం నుంచి కృష్ణా కరకట్ట వరకు రెండులైన్ల సిమెంటు రోడ్డు, రూ.117 కోట్ల వ్యయంతో కృష్ణా కుడి వరద కట్ట విస్తరణ, మున్నంగిలో 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్తో సహా వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నిర్వహించారు. గొడవర్రు వద్ద బ్యాంక్ కెనాల్పై బల్లకట్టు మునిగి 14 మంది చనిపోతే కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాల్, రేపల్లె బ్యాంక్ కెనాల్పై 25 చోట్ల కాలిబాట వంతెనలు నిర్మించారు. భారీ పథకాలతో భరోసా... తెనాలిలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప సముదాయాలను వైఎస్ స్వయంగా ప్రారంభించారు. అప్పుడే పట్టణం మెుత్తానికి రక్షిత మంచినీటి కోసం ఉద్దేశించిన రూ.93 కోట్ల కృష్ణా జలాల పథకానికి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని యడ్ల లింగయ్యకాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు నూరు శాతం పక్కాగృహాలను నిర్మించారు. చంద్రబాబునాయుడు పేరుతో ఉన్న మరో కాలనీలో మురుగు కాలువల నిర్మాణానికి రూ.30 లక్షల నిధులను మంజూరు చేశారు. కళాకారులకు ప్రభుత్వ పింఛన్ను రూ.200 నుంచి రూ. 500లకు పెంచి, అప్పటికి 21 నెలల బకాయిలను చెల్లించారు. కొ త్తగా మరో ఏడువేల మందికి ఇచ్చిన పింఛన్ల లో యాభైమందికి పైగా తెనాలి కళాకారులకు దక్కాయి. -
మీ పాలనకై వేచి చూస్తున్నం..
సాక్షి, గుంటూరు : గుప్పెడు మెతుకుల కోసం ఏ రోజుకారోజు కండలు కరిగించే పేదోడి గుండెకు జబ్బు చేస్తే నువ్వెందుకయ్యా విలవిలలాడిపోయావు. బక్కచిక్కినోళ్ల ఇళ్లలో భవిష్యత్ వెలుగు దీపమై ప్రకాశించాల్సిన బిడ్డల చదువులు మధ్యలో ఆగిపోతుంటే నువ్వెందుకయ్యా దిగులు పడ్డావుఅవ్వాతాతల ఆవేదనలు ఓ మూలన దీనంగా వినిపిస్తుంటే .. నీ గుండెపై ఎందుకయ్యా కన్నీటి తడి తెచ్చుకున్నావు. పాదయాత్ర ఆసాంతం.. ప్రతి అడుగులో బడుగుల ఆరని కన్నీళ్లు నిన్ను కదిలించాయా.. అప్పటి చంద్రబాబు పాలనలో దుర్భిక్ష పరిస్థితులు నిన్ను చలింపచేశాయా.. అందుకేనా.. ఆరోగ్యశ్రీ పథకంలో మనసున్న వైద్యుడిగా మారావు.. ఫీజు రీయింబర్స్మెంట్తో బిడ్డల జీవితాలకు ఉజ్వల దారులు పరిచావు. పింఛన్లతో అవ్వాతాతల బోసినవ్వులను దోసిటపట్టావు. సంక్షేమాన్ని పేదోళ్ల గుమ్మానికి తోరణంగా కట్టావు.. ఇన్ని చేసిన నిన్ను ఎవరూ మరిచిపోలేదయ్యా. ప్రజల నుంచి దూరమై ఏళ్లు గడుస్తున్నా ప్రతి గుండెచప్పుడులోనూ నిత్యం వినిపిస్తూనే ఉన్నావు. పేదోళ్ల ప్రతి మాటలోననూ కనిపిస్తూనే ఉన్నావు. నిర్మలమైన నీ రూపంతో ప్రతి గుండె గుడిలో దేవుడిలా కొలువై నిలిచిపోయావు. అందుకే గుంటూరు గుండె చప్పుడు ఎదురు చూస్తోంది మళ్లీ సంక్షేమ సారథివై వస్తావని.. జిల్లావాసుల సుదీర్ఘ స్వప్నమైన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ హయాంలో ప్రారంభమైంది. 2004లో జలయజ్ఞంలో భాగంగా జిల్లా పరిధిలోని బెల్లంకొండ మండలం పులిచింతల గ్రామం, నల్గొండ జిల్లాలోని మేళ్ళచెరువు గ్రామాల మధ్య పులిచింతల నిర్మాణ పనులు చేపట్టారు. 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ఉద్దేశంతో రూ.682 కోట్లతో ప్రాజెక్టు మంజూరైంది. ప్రాజెక్టు నిర్మాణం రూ.483.33 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తితో హెక్టారుకు 3.4 టన్నుల ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తి అవుతుందని, తద్వారా రూ.808 కోట్ల నికర ఆదాయం పొందవచ్చని అంచనా. నాగార్జునసాగర్ కుడి కాల్వ పరిధిలో రూ.7.46 కోట్లతో కాల్వ ఆధునికీకరణ పనులు చేపట్టారు. కృష్ణా పశ్చిమ డెల్టాలకు దివంగత వైఎస్ఆర్ హయాంలో మహర్దశ పట్టింది. రెండు డెల్టాలకు రూ.4,444.41 కోట్లతో 604 కిలోమీటర్ల పొడవునా కాల్వల ఆధునీకరణ, 848 కొత్త బ్రిడ్జిల మంజూరయ్యాయి. జిల్లాలో 1,59,489 ఎకరాల ఆయకట్టుకు నీరందించటానికి 234 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 483.27 కోట్లతో మంజూరైనా .. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణంతో వాటిని పట్టించుకునే నాథుడు లేక నిలిచిపోయాయి. అడిగిన వెంటనే ఎత్తిపోతల వరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వినుకొండ ప్రాంతం అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 2004లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వినుకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామస్తులు ముఖ్యమంత్రిని కలసి తమ గ్రామం గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్నప్పటికీ సాగు నీరు అందడం లేదని తెలిపారు. వైఎస్ వెంటనే స్పందించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.4.80 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సభాస్థలిలోనే ప్రకటించారు. దీంతో చకచకా పథకం నిర్మాణం పూర్తయింది. 1050 ఎకరాలు మెట్ట భూములకు సాగు నీరు వచ్చింది. గతంలో రూ.50 వేలు ధర కూడాలేని భూములు ఇప్పుడు లక్షల రూపాయలు పలుకుతున్నాయి. ఆయన జ్ఞాపకార్థంగా గ్రామంలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. గొంతు తడిపిన మహనీయుడు గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, – గురజాల పట్టణ ప్రజల మంచినీటి కష్టాలను చూసి వైఎస్ చలించిపోయారు. గోవిందాపురం కృష్ణానది నుంచి రూ.36 కోట్ల వ్యయంతో పిడుగురాళ్ల పట్టణానికి మంచినీటిని అందించే రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి చేశారు. గురజాలకు సైతం బుగ్గవాగు నుంచి రూ.12 కోట్ల వ్యయంతో మంచినీటిని అందించారు.సత్తెనపల్లి పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.14.5 కోట్లతో 120 ఎకరాల మంచినీటి చెరువును కొనుగోలు చేసి బాగు చేయించారు. మరో రూ.20 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించి రెండు పూటలా మంచినీరు అందించారు. -
సొంత కాంట్రాక్టర్ కోసం స్వరాజ్య మైదానం బలి!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పెద్దల స్వార్థం, ధన దాహానికి సర్కారీ ఆస్తులు కరిగిపోయే దుస్థితి దాపురించింది. సాగునీటి ప్రాజెక్టుల పనులను కావాల్సిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టడం.. తర్వాత అదనపు బిల్లులు చెల్లించడం.. వారి నుంచి అందిన కాడికి కమీషన్లు దండుకుని జేబులు నింపుకోవడం.. ఇదే ఇప్పుడు అమలవుతున్న నీతి. అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులు హారతి కర్పూరమైపోయినా సరే స్వలాభమే ముఖ్యమంటూ ప్రభుత్వ పెద్దలు ఆరాటపడుతుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజధాని విజయవాడలోని చరిత్రాత్మక స్వరాజ్య మైదానం, జలవనరుల శాఖ భవనాలను వేలం వేసి పులిచింతల కాంట్రాక్టర్కు అదనపు బిల్లులు చెల్లించాలని మచిలీపట్నం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. టీడీపీ సర్కారు నిర్వాకం వల్ల పులిచింతల కాంట్రాక్టర్కు రూ.390.65 కోట్ల అదనపు బిల్లులను ఖజానా నుంచి చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీని వెనుక ఉన్న అసలు దందా ఏమిటంటే... పులిచింతల ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు ఒప్పందం విలువ రూ.268.87 కోట్లు. కానీ, ఒప్పందం విలువ కంటే అదనంగా చెల్లించాలని కాంట్రాక్టర్ కోర్టుకెక్కారు. అదనపు బిల్లులు చెల్లించాలని 2016 జూన్ 2న మచిలీపట్నం న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వివాద పరిష్కార మండలి(డీఏబీ) ప్రతిపాదన మేరకు అప్పుడే హైకోర్టులో సవాల్ చేసి, కాంట్రాక్టర్ లేవనెత్తిన 27 అంశాలపై సాధికారికంగా వాదనలు వినిపించి ఉంటే అదనపు బిల్లులు చెల్లించాల్సిన దుస్థితి దాపురించేది కాదని జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. హైకోర్టును ఆశ్రయించకుండా ప్రభుత్వ ముఖ్యనేత, మరో కీలక మంత్రి అడ్డుకోవడం వల్లే పులిచింతల కాంట్రాక్టర్కు రూ.390.65 కోట్లను అదనపు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఒప్పందంలో ‘డీఏబీ’ పులిచింతల ప్రాజెక్టుకు 2003 అక్టోబర్ 30న ఎన్నికలకు ఆరు నెలల ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా రూ.565.89 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చేశారు. రూ.268.89 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) పనులను తనకు అత్యంత సన్నిహితుడైన బొల్లినేని శీనయ్యకు చెందిన కాంట్రాక్టు సంస్థ ఎస్సీఎల్–సీఆర్18జీ(జాయింట్ వెంచర్)కి అప్పగించారు. రాష్ట్రంలో జలవనరుల శాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బిల్లుల విషయంలో ఏవైనా వివాదం ఉంటే డీఏబీని ఆశ్రయించవచ్చనే నిబంధనను కాంట్రాక్టు ఒప్పందంలో చేర్చారు. ఇంతలోనే ఎన్నికలు జరిగాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టారు. చంద్రబాబు నియమించిన పులిచింతల కాంట్రాక్టర్ అప్పటిదాకా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. వైఎస్సార్ అధికారం చేపట్టిన వెంటనే పులిచింతల ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. డీఏబీని అడ్డం పెట్టుకుని చీటికీమాటికీ అదనపు బిల్లుల కోసం కాంట్రాక్టర్ పేచీ పెడుతుండడంతో జలవనరుల శాఖలో చేపట్టే పనుల్లో డీఏబీని వైఎస్సార్ రద్దు చేశారు. పనుల్లో జాప్యం వల్ల తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని అప్పట్లో కాంట్రాక్టర్ పేచీకి దిగడంతో డీఏబీ–1ను ఏర్పాటు చేశారు. డీఏబీ సిఫార్సుల మేరకు కాంట్రాక్టర్కు రూ.5.65 కోట్లు చెల్లించారు. భూసేకరణ, బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవడంతో 2009 నాటికే పలిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. అదనపు బిల్లుల కోసం కాంట్రాక్టర్ పట్టు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత అదనపు బిల్లుల కోసం కాంట్రాక్టర్ మళ్లీ పేచీ పెట్టారు. పులిచింతల స్పిల్ వేను 500.25 మీటర్లు పెంచారని, గేట్లను 39 నుంచి 24కు తగ్గించారని, భూసేకరణలో జాప్యం వల్ల ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వాలని.. ఇలా 27 అంశాలను లేవనెత్తారు. అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని 2012లో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను వామనరావు, జె.ఈశ్వర్ప్రసాద్, మోతీలాల్.బి.నాయక్ సభ్యులుగా ఏర్పాటైన డీఏబీ–2 పరిశీలించింది. కాంట్రాక్టర్కు రూ.199.96 కోట్లు అదనంగా చెల్లించాలని 2013 అక్టోబర్ 3న ప్రభుత్వానికి సూచించింది. డీఏబీ–2 సూచనను ముగ్గురు ఐఏఎస్లతో కూడిన అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీకి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి పంపారు. కాంట్రాక్టర్కు గరిష్టంగా రూ.72 కోట్లకు మించి పైసా కూడా అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని నిపుణుల కమిటీ తేల్చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో 2014 ఎన్నికలు వచ్చాయి. డీఏబీ–2 సిఫార్సును అమలు చేయాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిపై కాంట్రాక్టర్ ఒత్తిడి తీసుకురావడంతో ఆ మేరకు చెల్లింపులు చేసేలా జవనరుల శాఖ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అప్పట్లో తన ప్రభుత్వం పడిపోకుండా కాపాడినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడి సన్నిహిత కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చడానికి కిరణ్కుమార్రెడ్డి ఈ ఉత్తర్వులు ఇప్పించినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ మచిలీపట్నం కోర్టును ఆశ్రయించారు. ఈలోగా తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో గెలిచి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కోర్టులో సాధికార వాదనలేవీ? పులిచింతల కాంట్రాక్టర్కు అదనపు బిల్లులు చెల్లించే విషయంపై మచిలీపట్నం కోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపింది. కాంట్రాక్టర్ లేవనెత్తిన 27 అంశాలను తిప్పికొట్టేలా వాదనలు విన్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఫలితంగా కాంట్రాక్టర్కు అనుకూలంగా 2016 జూన్ 2న మచిలీపట్నం కోర్టు తీర్పు ఇచ్చింది. 2013 అక్టోబర్ 3 నుంచి 15 శాతం వడ్డీతో కలిపి కాంట్రాక్టర్కు రూ.199.96 కోట్లు చెల్లించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ, న్యాయపోరాటానికి అనుమతి ఇవ్వకుండా ‘ముఖ్య’నేత, కీలక మంత్రి జాప్యం చేస్తూ వచ్చారు. ఇదే అంశాన్ని ‘సాక్షి’ వరుస కథనాల ద్వారా ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చింది. దాంతో చేసేదిలేక ఈ వ్యవహారంపై అడ్వొకేట్ జనరల్ నుంచి లీగల్ ఒపీనియన్(న్యాయ అభిప్రాయం) తీసుకోవాలని జలవనరుల శాఖకు సర్కార్ సూచించింది. లీగల్ ఒపీనియన్ ఇవ్వడంలోనూ జాప్యం చోటుచేసుకుంది. అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా జారీ చేసిన ఉత్తర్వులు బిజినెస్ రూల్స్ ప్రకారం ఉంటే చెల్లింపులు చేయాలని.. లేకుంటే న్యాయస్థానంలో సవాల్ చేసే అంశాన్ని పరిశీలించాలని అడ్వొకేట్ జనరల్ సూచించారు. న్యాయ పోరాటానికే సీఎస్ల మొగ్గు పులిచింతల కాంట్రాక్టర్కు అదనపు బిల్లులు ఇవ్వాలని మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయాలని నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. కానీ, లీగల్ ఒపీనియన్ పేరుతో అప్పట్లో సర్కార్ న్యాయపోరాటానికి మోకాలడ్డింది. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత కూడా హైకోర్టులో సవాల్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ స్పష్టం చేశారు. ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. రెండు ఆస్తుల విక్రయ నోటీసు జారీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని.. తనకు చెల్లించాల్సిన సొమ్మును సర్కారీ ఆస్తులను విక్రయించి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ 2017లో పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్ మచిలీపట్నం కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటిషన్(ఈపీ)ను దాఖలు చేశారు. విజయవాడలోని స్వరాజ్య మైదానం, పులిచింతల ప్రాజెక్టు కోసం సేకరించిన 48 ఎకరాల భూమిని సర్కారీ ఆస్తులుగా కాంట్రాక్టర్ పేర్కొన్నారు. ఈ వివాదంపై విచారించిన కోర్టు.. ఆ రెండు ఆస్తులను అటాచ్మెంట్ చేస్తూ 2017 జూలై 31న తీర్పు ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ పిటిషన్పై విచారణ కొనసాగింపులో భాగంగా, ఆ రెండు ఆస్తులకు విక్రయ నోటీసును ఈ ఏడాది మే 2న జారీ చేసి.. విచారణను జూన్ 29కి వాయిదా వేసింది. ఆ తర్వాత ఈ కేసుపై సోమవారం మచిలీపట్నం కోర్టు తీర్పు ఇచ్చింది. స్వరాజ్య మైదానం, జలవనరుల శాఖ భవనాలను వేలం వేసి పులిచింతల కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పును అమలు చేస్తే పులిచింతల కాంట్రాక్టర్కు అసలు రూ.199.96 కోట్లు, 2013 అక్టోబర్ 3 నుంచి ఇప్పటివరకూ వడ్డీ రూ.144.63 కోట్లు.. వెరసి రూ.355.59 కోట్లు, ప్రాజెక్టు పూర్తయినా యంత్రాలను అక్కడే ఉంచడం వల్ల వాటిల్లిన నష్టం రూ.46.06 కోట్లతో కలిపి మొత్తం రూ.390.65 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ మనోడైతే చాలు పులిచింతల కాంట్రాక్టర్ బొల్లినేని శీనయ్యతో ముఖ్యనేత, కీలక మంత్రి అనుబంధం బహిరంగ రహస్యమే. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువలో రూ.వందల కోట్ల విలువైన పనులను నామినేషన్ విధానంలో బొల్లినేని శీనయ్యకే కట్టబెట్టారు. రాజధానిలో రహదారులు, మౌలిక సదుపాయాల పనులు కూడా అప్పగించారు. పులిచింతల ప్రాజెక్టులో నాడు డీఏబీ నిబంధన పెట్టడం ద్వారా ప్రయోజనం చేకూర్చిన ముఖ్యనేత, నేడు దాన్ని అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు ఒప్పంద విలువ కన్నా అధికంగా రూ.390.65 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడి మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయకుండా అడ్డు పడుతున్నారని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు చెప్పారు. తాజాగా మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కాంట్రాక్టర్కు అదనపు చెల్లింపులు చేయడానికి ముఖ్యనేత పావులు కదుపుతున్నారు. విశ్వ బ్రాహ్మణులను మోసం చేశారు ప్రస్తుత ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను చులకనగా చూస్తోంది. బీసీ కార్పొరేషన్ రుణాలు ఇస్తామని దారుణంగా మోసం చేసింది. జిల్లాలో గ్రూప్ లోన్ల కింద మొత్తం 136 సొసైటీలు ఏర్పడితే కేవలం 18 గ్రూపులకు మాత్రమే లోన్లు ఇచ్చారు. మిగతా వారు పలుమార్లు వారి చుట్టూ తిరిగినా ఇవ్వడం లేదు. చేతి వృత్తులు ఆదరణ కోల్పోవడంతో విశ్వబ్రాహ్మణులందరూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మా సమస్యలను జగన్ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన ఆదుకుంటారనే నమ్మకం ఉంది. – టి.శ్రీనివాసరావు,విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నీళ్లు లేవు.. రోడ్లు లేవు.. అయ్యా.. మాది కొత్తవలస మండలం, కంటకాపల్లి పంచాయతీ పరిధిలోని సాంబయ్య పాలెం. జనాభా 500. తాగు నీటి ట్యాంక్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యను ఎన్ని సార్లు అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతలు మా గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదు. సీసీ రహదారులు, కాలువలు కూడా లేవు. మా గోడును వైఎస్ జగన్తో చెప్పుకుందామని మహిళలందరం కలిసి వచ్చాం. – చల్లా లక్ష్మి, రమణమ్మ, గ్రామస్తులు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నా.. అన్నా.. మాకు కనీసం వేతనాలు ఇవ్వడం లేదు. వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వ పరంగా చేయాల్సిన చట్ట సవరణ జరగలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మాకు రెండేళ్లకు ఒకసారి వేతనాలను పెంచేవారు. ఆ తర్వాత ఐదేళ్లకోసారి కూడా జీతాలు పెరగడం కష్టమైంది. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మీరే న్యాయం చేయాలి. – ఆర్.ఎం.అప్పలనాయుడు, జిందాల్ కార్మికుడు -
గడువు ముగిసింది.. గ్రామాన్ని ఖాళీ చేయండి
మాచవరం (గురజాల) : గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన వెల్లంపల్లిని ఖాళీ చేసేందుకు ఇచ్చిన 2 రోజుల గడువు పూర్తయిందని, వెంటనే గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రాజెక్టు అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు ముంపు నిర్వాసితులను ఆదేశించారు. త్వరలో పులిచింతల ప్రాజెక్టులోకి వరదనీరు చేరే అవకాశం ఉన్నందున, గ్రామాన్ని సత్వరమే ఖాళీ చేయించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఆదివారం జేసీబీతో గ్రామంలోని ఇళ్లను తొలగించేందుకు యత్నించారు. పరిహారం అందజేసిన నిర్వాసితుల ఇళ్లకు మార్కింగ్ ఇచ్చామని, వీటిని ఆదివారంలోగా ఖాళీ చేయకుంటే కూల్చేస్తామని శనివారం ప్రకటించారు. గడువు కోరినా అధికారులు స్పందించకపోవడంపై నిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం జేసీబీతో ఓ ఇంటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అకస్మాత్తుగా గడువు విధించి గ్రామాన్ని ఖాళీ చేయాలంటే ఎలాగని అధికారులను నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పరిహారం అందిన వారి ఇళ్లను కూల్చివేస్తున్నామని, పరిహారం అందని వారికి కొంత గడువు ఇస్తామని ప్రకటించారు. అయితే, ఇళ్లను కూల్చేయక ముందే పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాన్ని ఖాళీ చేసేందుకు మరికొన్ని రోజులు గడువు కావాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో.. పరిహారం అందిన వారు సోమవారం సాయంత్రంలోగా ఖాళీ చేయాలని, లేకుంటే మంగళవారం ఉదయాన్నే యంత్రాలతో కూల్చేస్తామంటూ అధికారులు హెచ్చరించారు. పరిహారం అందని వారు నష్టపరిహారం అందేవరకూ ఇక్కడ ఉండవచ్చని తెలిపారు. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ధనుంజయ్, స్థానిక తహసీల్దారు మస్తాన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
జూన్ 15లోగా పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల సహాయ, పునరావాస చర్యలన్నీ జూన్ 15 కల్లా పూర్తిచేయాలని నీటిపారుదల మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. పునరావాస చర్యలపై శుక్రవారం జలసౌధలో ఆయన సమీక్షించారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి 80 శాతం పునరావాస పనులు పూర్తయ్యాయని, ఏపీ విడుదల చేసిన నిధుల్లో రూ.47 కోట్లు మిగిలాయని, వాటితో పనులు చేపట్టాలని పేర్కొన్నారు. పునరావాస పనుల పురోగతిలో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ (రిపేర్స్, రెనోవేషన్, రీస్టోరేషన్) పథకం కింద కేంద్రం 575 చెరువులకు వివిధ దశల్లో రూ.459 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. తొలిదశలో 1,200 చెరువులను ఈ పథకం కిందికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించగా, 182 చెరువులకు రూ.125.45 కోట్లు కేంద్రం విడుదల చేసిందని పేర్కొన్నారు. రెండో దశలో 147 చెరువులకు గత జనవరిలో 163 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని, ఇందులో 72 చెరువుల మరమ్మతు, పునరుద్ధరణ పనులను మిషన్ కాకతీయ రెండో, మూడో విడతల్లో చేపట్టామన్నారు. -
ఉత్తమ్వి చౌకబారు ఆరోపణలు: కర్నె
హైదరాబాద్: పులిచింతల హైడల్ ప్రాజెక్టుపై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన కొందరు కాంగ్రెస్ రైతులను గాంధీ భవన్కు తీసుకువచ్చి అన్నీ అసత్యాలే చెప్పించారని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, హుజూర్నగర్ టీఆర్ఎస్ నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టు కింద 13 ముంపు గ్రామాల ప్రజలకు సరైన నష్ట పరిహారం ఇప్పించని ఉత్తమ్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముంపు పరిహారం విషయంలో నల్లగొండ జిల్లా రైతులకు ఉత్తమ్ అన్యాయం చేశారని ఆరోపించారు. మాయ మాటలు చెప్పి తమ భూములు లాక్కున్నారని, పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల పరిహారానికి సంబంధించిన జీవో 68ని పరిశీలిస్తే జరిగిన అన్యాయం తెలిసిపోతుందని హుజూర్నగర్ రైతులు వెల్లడించారని పేర్కొన్నారు. -
ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందాం: ఉత్తమ్
పులిచింతలపై హరీశ్కు సవాల్ సాక్షి, హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి సవాల్ విసిరారు. పులిచింతల ముంపు ప్రాంతాలు మేళ్లచెరువు, మఠంపల్లి, నేరెడుచర్ల మండలా లకు చెందిన రైతులతో కలసి మంగళవారం గాంధీ భవన్లో ఆయన మాట్లాడారు. ‘హరీశ్రావులా నాకు దోచుకోవడం రాదు. టీఆర్ఎస్లా ఆంధ్రా కాంట్రాక్టర్లకు దాసోహం కాలేను. దేశం కోసం సైన్యంలో పనిచేశా. ప్రా ణాలకు తెగించి యుద్ధం చేశా. అదే స్ఫూర్తితో ప్రజల్లోకి వచ్చి పనిచేస్తున్నా. పులిచింతల సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయో, ఎప్పుడు పూర్తయ్యాయో ప్రాజెక్టు పరిసరాలు, ముంపు గ్రామాల్లోకి వెళ్లి తేల్చుకుందాం’ అని సవాల్ చేశారు. వాస్తవాలను దాచిపెట్టి హరీశ్రావు, టీఆర్ఎస్ నేతలు అబద్ధాలు మాట్లాడ టం తగదన్నారు. పులిచింతల ప్రాజె క్టుతో తమ పొలాలకు నీరొచ్చిందని, పునరావాస ప్యాకే జీతో తమ జీవితాలు బాగుపడ్డాయని మఠంపల్లి, నేరెడు చర్ల, మేళ్లచెరువు మండలాల స్థానిక సంస్థల ప్రజా ప్రతి నిధులు, రైతులు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు రూ.2 లక్షల చొప్పున పంట రుణాలను మాఫీ చేస్తామని టీపీసీసీ కిసాన్ సెల్ సమావేశంలో ఉత్తమ్ చెప్పారు. -
వారిది బానిస మనస్తత్వం
కాంగ్రెస్ నాయకులపై హరీశ్ ఫైర్ ► పులిచింతల కట్టి తెలంగాణను ముంచారు ► 14 వేల ఎకరాలు, 32 గ్రామాలను రోడ్డున పడేశారు ► తెలంగాణలో ఒక్క ఎకరానికి నీరివ్వని ప్రాజెక్ట్ కట్టి గొప్పలు చెప్తున్నారు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకుల బానిస మనస్తత్వం లో ఏమాత్రం మార్పు రాలేదని, తెలంగాణను ముంచి, ఆంధ్రకు ప్రయోజనం చేకూర్చిన ప్రాజెక్టు నిర్మాణం తమ ఘనతే అని చెప్పుకో వడం వాళ్ల ఆత్మవంచనకు నిదర్శనమని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు మండిప డ్డారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి పులిచిం తల ప్రాజెక్టు నిర్మాణం తమ ఘనతే అని ప్రకటించుకోవడంపై హరీశ్ ఆగ్రహం వ్యక్తంచే శారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ అసమర్థత కు పులిచింతల ఓ నిలువెత్తు నిదర్శనమని, ఆయన సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్లో 32 గ్రామాలను ముంచి, ఆంధ్రలో మూడో పంటకు ఢోకాలేని విధంగా 45 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టించిన ఘనుడని విమర్శించారు. తెలంగాణలో 14 వేల ఎకరాలను ముంచి, ఇక్కడ ఒక్క ఎకరా నికి కూడా నీళ్లివ్వని పులిచింతల కట్టవద్దని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తాము డిమాండ్ చేశామన్నారు. దీనివల్ల తెలంగాణకు నష్టం, ఆంధ్రకు లాభం కలిగిందన్నారు. ఆనాడు ఆంధ్రకు దోచిపెట్టినోళ్లు ఇవాళ చాలా తక్కువ ముంపుతో 50టీఎంసీలతో మల్లన్న సాగర్ కడదామంటే గోల చేస్తున్నారన్నారు. మల్లన్నసాగర్పై దొంగ సంతకాలతో కేసులు వేసి హైకోర్టునూ మోసం చేస్తున్నారన్నారు. వాళ్ల నిర్లక్ష్యంతో తెలంగాణకు నష్టం... పులిచింతల పవర్ప్లాంటు కూడా తమ ఘనతే అని ఉత్తమ్ చెప్పారని, అయితే దీనివల్ల తెలం గాణకు చేసింది లాభం కాదని, కోలుకోలేని నష్టమని హరీశ్రావు విమర్శిం చారు. నిజానికి ఉత్తమ్, అప్పట్లో ఆయన సహచర మంత్రులు చూపిన నిర్లక్ష్యం తెలంగాణకు కోట్లలో నష్టం కలిగించిందన్నారు. 2006లోనే పులిచింతల పవర్ ప్లాంటుకు అనుమతి వచ్చిందని, కానీ 2014 జూన్ 2 నాటికి అక్కడ ఏ పనీ జరగ లేదని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మించడంతో మొత్తం వ్యయం తెలంగాణపైనే పడిందన్నారు. ఈ నష్టం మీ నిర్లక్ష్యం ఫలితం కాదా అని మంత్రి ప్రశ్నిం చారు. లోయర్ జూరాల కూడా పదేళ్ల క్రితమే పూర్తికావాల్సి ఉందని, అయితే తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల అసమర్థత వల్ల అది పూర్తి కాలేదని అన్నారు. సీలేరు కోల్పోయాం... పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిం చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, దీనివల్ల తెలం గాణ సీలేరు పవర్ ప్లాంటును కోల్పోవాల్సి వచ్చిందని హరీశ్రావు ఆందోళన వ్యక్తంచే శారు. ఇక్కడ మనకు రావాల్సిన 460 మెగా వాట్ల విద్యుత్ ప్లాంటు ఆంధ్రకు పోయిం దన్నారు. ఏటా దీనివల్ల రాష్ట్రానికి రూ. 300 కోట్ల నష్టంకూడా కాంగ్రెస్ నాయకుల ఘనతే అని విమర్షించారు. 2009లో ప్రారంభించిన భూపాలపల్లి రెండో దశ 600 మెగావాట్ల ప్లాంటు కూడా 2014 నాటికి పూర్తి కాలేదని, అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే పనుల్లో వేగంపెరిగిందని గుర్తుచేశారు. మణు గూరులో పెట్టాల్సిన ప్లాంటును రాయల సీమకు తరలిస్తుంటే అప్పడు ఈ కాంగ్రెస్ మంత్రులు మౌనంగా ఉన్నారని, తాము ఎంత ఉద్యమించినా పట్టించుకోలేదని అన్నారు. అలాగే తెలంగాణలో బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్నా బొగ్గు లేని విజయవాడలో ప్లాంట్లు పెడితే అప్పుడు ఈ మంత్రులు చూస్తూ ఊరుకుండిపోయారని మండిపడ్డారు. అడ్డుకోవడమే వారి లక్ష్యం... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సాగునీటి ప్రాజెక్ట్లు, విద్యుత్ ప్లాంట్లు కట్టలేదని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కడుతుంటే మాత్రం అడ్డుకోవాలని చూస్తు న్నారని హరీశ్ ఆరోపించారు. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్పై 12కేసులు వేశారని, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల మీదా కేసులు వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో రైతులకు 6గంటల కరెంట్ కూడా సరిగ్గా సరఫరాచేయలేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మధ్యాహ్నంపూటే 9 గంటలు సరఫరా చేస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతాంగానికి 24 గంటల విద్యుత్ అందిస్తామన్నారు. -
పులిచింతలపై నిర్లక్ష్యం.. రైతు జీవితాలతో చెలగాటం
ఇదేం తీరు చంద్రబాబూ.. వైఎస్ జగన్ ప్రశ్న ♦ తెలంగాణకు రూ. 120 కోట్ల పునరావాస బకాయిలు చెల్లిస్తే పులిచింతలలో 45 టీఎంసీలూ నిల్వ చేయొచ్చు.. ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వవచ్చు.. ♦ కానీ కమీషన్ల కోసం వందల కోట్లతో పట్టిసీమ చేపడతావ్.. పులిచింతల పూర్తయితే వైఎస్సార్కు పేరొస్తుందనే నీ భయం ♦ కృష్ణా జిల్లాలో దెబ్బతిన్న మినుము పంటలను పరిశీలించిన ప్రతిపక్ష నేత సాక్షి, అమరావతి బ్యూరో : ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేశారు. తెలంగాణాకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద పెండింగ్లో ఉన్నరూ.120 కోట్లు చెల్లిస్తే ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు 45 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. అప్పుడు పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి అక్కడి నుంచి డెల్టాకు నీరు అందించవచ్చు. అలా చేస్తే ఆ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాటన్ దొర మాదిరిగా డెల్టా ప్రజల గుండెల్లో ఉండిపోతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే తెలంగాణ ఎన్ని లేఖలు రాసినా రూ.120 కోట్లు ఇవ్వడం లేదు. దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అసలు ఈ చంద్రబాబుకు బుద్ధీజ్ఞానం ఉందా’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండాల్సిన కృష్ణా డెల్టా బంజరు భూములను తలపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను రాజధానిలోనే ఉంటున్నానని డబ్బాలు కొట్టుకుంటారు. ఇరిగేషన్ మంత్రీ ఈ జిల్లాలోనే ఉన్నారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రెండేళ్లుగా కృష్ణా డెల్టాకు సరిగా నీళ్లు ఇవ్వడమే లేదు. పంటలు చచ్చిపోతున్నాయని రైతులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రాజధానిలో మూడునాలుగు పంటలు పండే 54వేల ఎకరాలను బలవంతంగా తీసుకుంటారు. డెల్టాలోనేమో పంటలకు సాగు నీరే ఇవ్వరు. ఈ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది’ అని తీవ్రంగా వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. కృష్ణా జిల్లాలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పర్యటించారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలోని బొమ్ములూరు, పెరికీడు, దంటగుంట్ల, కాకులపాడు, ఆరుగొలను, కానుమోలు తదితర గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న మినుము పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే.... డెల్టాకు వైరస్ బాబు పుణ్యమే.. ‘కృష్ణా డెల్టాలో ఉండి మాట్లాడుతున్నా. ఏలూరు కాలువ కిందకు వచ్చే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాల్సింది. ఇప్పుడు బంజరు భూమి మాదిరిగా కనిపిస్తోంది. బాబు అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లుగా కృష్ణా డెల్టాకు సరిగా నీళ్లు ఇవ్వడం లేదు. ఏలూరు డిస్ట్రిబ్యూటరీ కాలువ నుంచి నీళ్లు రావడం లేదు. రైతులు వరి పంట వేయలేకపోతున్నారు. నీళ్లు వస్తాయో రావో తెలీదు. వరి వేయాలో వద్దో తెలీదు. నీరు లేక నారుమళ్లు ఎండిపోతున్నాయి. రెండేళ్లుగా ఖరీఫ్లో వరి వేయనే లేదు. నీళ్లు తక్కువగా ఉన్నాసరిపోతుంది కదా అని రబీలో మినుము పంట వేశారు. వైరస్ సోకి ఆ మినుము పంట కూడా పోయింది. మెట్ట ప్రాంతంలో వచ్చే వైరస్ అది. డెల్టా ప్రాంతంలో కూడా ఇపుడు వైరస్ వచ్చింది.చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంతోనే డెల్టా ప్రాంతంలో కూడా వచ్చింది. మొత్తం పంట పోయింది. మూడుసార్లు మినుము వేసినప్పటికీ పంట దక్కలేదు. ధరపడిపోతున్నా పట్టించుకోని బాబు కృష్ణా డెల్టాలో మొట్టమొదట వచ్చే ఊరు కానుమోలు. ఇక్కడే 3 వేల ఎకరాల్లో కేవలం 300 ఎకరాల్లోనే పంట వేశారు. అదీ బోరు బావుల కింద ఉన్న భూములు. మిగిలిన్న భూమంతా బీడుగానే ఉండిపోయింది. బొమ్ములూరు ఎత్తిపోతల పథకం కింద 18 వేల ఎకరాలు ఉన్నాయి. మూడునాలుగు పంటలు పండే ఈ 18 వేల ఎకరాలకు గాను వెయ్యి ఎకరాల్లోనే పంటలు వేశారు. మిగిలిన భూమంతా బీడుగానే ఉండిపోయింది. కాకులపాడులో పూర్తిగా 3 వేల ఎకరాల్లో మినుము పంట నాశనమైంది. మరోవైపు మినుము ధర పడిపోయింది. గత ఏడాది క్వింటా ధర రూ.12వేలు పలికింది. ఇప్పుడేమో క్వింటా రూ.6 వేలకు పడిపోయింది. దీంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడమే లేదు. ఒక్క అధికారీ రాడు.. సర్వే జరగదు.. పంటలు దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామాల్లోకి అధికారులు రాలేదు. నష్టపోయిన పంటలు సర్వే చేయలేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. పరిహారం ఊసే ఎత్తడం లేదు. అక్కడక్కడ సర్వే కోసం ఎవరో వచ్చినా వాళ్లకు కావల్సిన వాళ్ల పేర్లు రాసుకుని వెళ్లిపోయారు. నిజంగా నష్టపోయిన రైతుల గురించి పట్టించుకోనే లేదు. ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు పూర్తిగా నష్టపోయారు. పంటను కాపాడుకునేందుకు ఎక్కువసార్లు పురుగుల మందు కొట్టారు. కానీ పంట దక్కలేదు. రైతుకు ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రం ఇంతవరకు పట్టించుకోనే లేదు. రైతులకు మేమున్నాం అని ప్రభుత్వం భరోసా ఇవ్వనే లేదు. వందమంది రైతులుంటే ఒకరికో ఇద్దరికో ఇన్సూరెన్సు రాస్తున్నారు. రెండేళ్ల నుంచీ ఇదే పరిస్థితి. పులిచింతలపై బాబు కపటనాటకాలు.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45 టీఎంసీలు. కానీ ప్రస్తుతం 22 టీఎంసీలే నిల్వ చేయగలుగుతున్నాం. ఆర్ఆర్ ప్యాకేజీ కింద పెండింగ్లో ఉన్న రూ.120 కోట్లు తెలంగాణాకు చెల్లిస్తే పూర్తి సామర్థ్యం మేర 45 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చును. అప్పుడు పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి, అక్కడి నుంచి ఏలూరు కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు అందించవచ్చును. ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఆ నిధులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం పదే పదే లేఖలు రాసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడమే లేదు. ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టు పూర్తి అయితే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మంచిపేరు వస్తుంది. కాటన్ దొర మాదిరిగా వైఎస్ డెల్టా రైతుల గుండెల్లో ఉంండిపోతారు అని చంద్రబాబు భయపడుతున్నారు. ఆ మహానేతకు మంచిపేరు రాకుండా చేయాలనే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దాంతో పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 22టీఎంసీలే నిల్వ చేయగలుగుతున్నారు. డెల్టాకు సరిపడా నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఏదైనా అంటే పట్టిసీమ పట్టిసీమ అని చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి పదే పదే చెబుతున్నారు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి 45 టీఎంసీలు ఎత్తిపోశామని చెబుతున్నారు. మరి పట్టిసీమ నీళ్లు ఎక్కడికి వెళ్లాయో తెలీడమే లేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటికీ 55 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి విడిచిపెట్టారు. ఇక ఆ పట్టిసీమ వల్ల ఉపయోగమేమిటి? కృష్ణ, గోదావరి రెండింటికీ ఒకేసారి వరదలు వస్తాయని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. నిల్వ సదుపాయం లేకుండా కమీషన్ల కోసం తెచ్చిన వృథా ప్రాజెక్టు అది. నిల్వ సదుపాయం ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రాజెక్టు పులిచింతల.. ఈ రెండింటినీ పరిశీలిస్తే చాలు చంద్రబాబు రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నాడో తెలుసుకోవడానికి’’ అని జగన్ పేర్కొన్నారు. కాగా, హనుమాన్ జంక్షన్లో జరిగిన కార్యక్రమంలో జాతిపిత మహాత్మా గాంధీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఇక్కడే విమానం ఎక్కుతాడు.. రైతులను పట్టించుకోడు.. చంద్రబాబు ఇదే గన్నవరం ఎయిర్పోర్టు నుంచే వెళ్తుంటారు. కానీ ఏనాడూ గన్నవరం నియోజకవర్గంలో ఎండిపోయిన పంటలు ఎలా ఉన్నాయో చూసిన పాపాన పోలేదు. ఇరిగేషన్ మంత్రిదీ ఇదే జిల్లా. ఆయన కూడా ఇదే గన్నవరం ఎయిర్పోర్టుకు నుంచే వెళ్తుంటారు. ఆయనా ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పంటల గురించి, రైతుల గురించి పట్టించుకోనే లేదు. పంటలు పోయి రైతులు ఆగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవ డమే లేదు. చంద్రబాబుకు బుద్ధీజ్ఞానం ఉందా? నేను వచ్చి వెళ్లిన తరువాత అయినా చంద్రబాబుకు కాస్తో కూస్తో బుద్ధి రావాలని కోరుకుంటున్నా. ఆ బుద్ధిలేని మనిషికి జ్ఞానోదయం కలగాలి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేవరకు వదిలేది లేదు. రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు నేను, మా పార్టీ అండగా ఉంటాం.’’ -
'తెలంగాణ రైతులకు ఏపీ ఇబ్బందులు'
నల్లగొండ: పులించితల ప్రాజెక్ట్లో నీటి నిల్వ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెడితే ఎవరికి మంచిది కాదన్నారు. నిబంధనల ప్రకారం పులిచింతలలో 4 టీఎంసీలను నిల్వ చేసి లిఫ్ట్ల కింద ఉన్న ఆయకట్టుకు నిర్భందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లో ఈ సారి నల్లగొండకు రైల్వే కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు. ప్రతిసారి జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఈ సారైన బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. -
పులిచింతలలో 30 టీఎంసీల నీటి నిల్వ
పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం 30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. 49.9 మీటర్ల లెవెల్, 163.72 అడుగుల లోతు ఉంది. ప్రాజెక్టులోకి 78,707 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అంతే మొత్తాన్ని 10 క్రస్ట్గేట్ల ద్వారా బయటకు వదులుతున్నారు. – అచ్చంపేట -
పులిచింతలకు భారీగా వరద
పులిచింతల: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ వద్ద ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ఫ్లో 2.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 29 టీఎంసీలు. పులిచింతల నుంచి దిగువకు 2.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు నీటి విడుదలను పరిశీలించాలని, ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలని అధికారులకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. -
పులిచింతలకు భారీగా వరద నీరు
పులిచింతల: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న పులిచింతల ప్రాజెక్టులోకి భారీ వర్షాలకు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ వద్ద ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ఫ్లో 2.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 29 టీఎంసీలు. పులిచింతల నుంచి దిగువకు 2.50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు నీటి విడుదలను పరిశీలించాలని.. ప్రజలను అప్రమత్తం చేస్తూ.. ఉండాలని అధికారులకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. బ్యాక్ వాటర్తో బోధనం, మేళ్లవాగు, కోళ్లూరు,, కేతవరం, చిట్యాల గ్రామాలు నీటిలో మునిగాయి.