Rajat Patidar
-
ఆర్సీబీ నూతన కెప్టెన్ రజత్ పాటిదార్ పర్సనల్ ( ఫోటోలు )
-
అప్పుడే ఆఫర్ వచ్చింది.. కానీ!.. వదిలేసిన ఫ్రాంఛైజీ జట్టుకే కెప్టెన్గా..
గత ఏడాదే కెప్టెన్సీపై ఆసక్తి ఉందా అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం తనను అడిగినట్లు కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ తెలిపాడు. అయితే, ఐపీఎల్కు ముందు రాష్ట్ర జట్టుకు కెప్టెన్సీ చేయాలనుకుంటున్నట్లు వారికి చెప్పానన్నాడు. ఇప్పుడిలా ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2025 సీజన్లో కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. విరాట్ కోహ్లి మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చనే అభిమానుల ఆశలకు భిన్నంగా టీమ్ మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.దూకుడైన బ్యాటింగ్తో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రజత్ పాటీదార్ను కెప్టెన్గా నియమించింది. గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సారథ్య వివరాలను ఆర్సీబీ ప్రకటించింది. గత మూడు సీజన్ల పాటు కెప్టెన్గా వ్యవహరించిన డు ప్లెసిస్ను వేలానికి ముందు టీమ్ విడుదల చేయడంతో కొత్త నాయకుడి ఎంపిక అనివార్యమైంది. వేలానికి ముందు జట్టు రిటైన్ చేసుకున్న ముగ్గురు ప్లేయర్లలో పాటీదార్ ఒకడు. అతడిని రూ.11 కోట్లకు ఆర్సీబీ తమతోనే కొనసాగించింది.కాగా 2021–2024 మధ్య ఆర్సీబీ తరఫున 27 మ్యాచ్లు ఆడిన పాటీదార్ 158.84 స్ట్రైక్రేట్తో 799 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు తొలిసారి కెప్టెన్గా కూడా ఎంపిక చేసిన యాజమాన్యం పెద్ద బాధ్యతను అతనిపై పెట్టింది. ఐపీఎల్లో చరిత్రలో బెంగళూరుకు రజత్ ఎనిమిదో కెప్టెన్. గతంలో ఈ టీమ్కు ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరి, కోహ్లి, వాట్సన్, డుప్లెసిస్ సారథులుగా వ్యవహరించారు. రజత్ పాటిదార్ (PC: RCB X)మెరుపు బ్యాటింగ్తో గుర్తింపు... ఇండోర్కు చెందిన 32 ఏళ్ల పాటీదార్ దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2021 సీజన్లో తొలిసారి అతను ఐపీఎల్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అ సీజన్లో నాలుగు మ్యాచ్లకే పరిమితమైన అతడిని 2022 సీజన్కు ముందు విడుదల చేసింది. అయితే లవ్నీత్ సిసోడియా అనూహ్యంగా గాయపడటంతో రీప్లేస్మెంట్ ప్లేయర్గా మళ్లీ జట్టులోకి వచ్చి చెలరేగిపోయాడు.మొత్తం 333 పరుగులు చేయగా... ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోపై 54 బంతుల్లో 112 పరుగులు బాదిన ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. అయితే గాయం కారణంగా 2023 సీజన్కు పూర్తిగా దూరమైన అతను 2024లో తిరిగొచ్చి మెరుపు బ్యాటింగ్తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2024 సీజన్లో 15 మ్యాచ్లలో 395 పరుగులు సాధించిన అతను 33 సిక్సర్లు బాదాడు.అదే ఏడాది ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీల్లో తొలిసారి మధ్యప్రదేశ్కు కెప్టెన్గా పని చేసిన అనుభవం పాటీదార్కు ఉంది. ముస్తాక్ అలీ టోర్నీలో 186.08 స్ట్రయిక్రేట్తో 428 పరుగులు చేసిన అతను జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. కెప్టెన్గా ఎందుకు... ఐపీఎల్లో కెప్టెన్గా ఎంపిక చేసేందుకు మేనేజ్మెంట్ ముందుగా చూసేది అన్ని మ్యాచ్లలో కచ్చితంగా తుది జట్టులో ఉండే ఆటగాడి గురించే. అది కూడా భారత ఆటగాడైతే మరీ మంచిది. గతంలో విదేశీయులను కెప్టెన్గా చేసి అతను విఫలమవుతున్నా కొనసాగించి దాదాపు పది మందితోనే ఆడినట్లుగా టీమ్లు ఇబ్బంది పడిన ఘటనలు చాలా ఉన్నాయి. అలా చూస్తే విరాట్ కోహ్లి తర్వాత జట్టులో ప్రధాన బ్యాటర్ అయిన పాటీదార్ మినహా మరో ప్రత్యామ్నాయం ఆర్సీబీ వద్ద లేకపోయింది.కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, పడిక్కల్లతో పోలిస్తే ఇది మెరుగైన నిర్ణయమే. భారత్ తరఫున 3 టెస్టులు, ఒకే ఒక వన్డే ఆడిన రజత్కు వ్యక్తిగతంగా స్టార్ ఆటగాడిలా గుర్తింపు లేకపోయినా అతనిపై యాజమాన్యం నమ్మకం ఉంచింది. ‘రజత్ ఎంపికకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అతని నెమ్మదైన స్వభావం, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే తీరు, కెపె్టన్సీకి పనికొచ్చే లక్షణం. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అతని ప్రతిభ, పట్టుదల ఎలాంటివో మధ్యప్రదేశ్ కెప్టెన్గా దగ్గరి నుంచి చూశాం.సహచరులతో కలిసిపోవడం, వారికి అండగా నిలిచే తత్వం కూడా మంచి సారథికి ఉండాల్సిన మరో లక్షణం’ అని ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నాడు. మరోవైపు కోహ్లికి మళ్లీ కెప్టెన్సీ ఇచ్చే విషయంపైచర్చించామన్న టీమ్ డైరెక్టర్ మో బొబాట్... ఎందుకు వద్దనుకున్నారనే ప్రశ్నపై తగిన సమాధానం ఇవ్వలేదు. కోహ్లి స్థాయి ఆటగాడికి ‘కెప్టెన్’ అనే హోదా అవసరం లేదని, తన సహజ నాయకత్వ లక్షణాలు జట్టుకు ఉపయోగపడతాయని అతను వ్యాఖ్యానించాడు.రజత్ పాటిదార్ (PC: RCB X)హడావిడి చేసే రకం కాదుఇక రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ‘‘నేను హడావిడి చేసే తరహా వ్యక్తిని కాదు కానీ మ్యాచ్లలో పరిస్థితులపై అవగాహన ఉంది. ఆటగాళ్లకు అండగా నిలిచి ఫలితాలు రాబడతా. టీమ్లో ఉన్న ఇతర ఆటగాళ్ల అనుభవమూ నాకు పనికొస్తుంది. ఇక కోహ్లినుంచి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది. అతని ఆలోచనలు, వ్యూహాలు కచ్చితంగా ఉపయోగించుకుంటా’’ అని తెలిపాడు.కోహ్లి విషెస్రజత్కు నా అభినందనలు. నీ ఆటతో ఎంతో మంది ఫ్యాన్స్ను ఆకట్టుకున్న నువ్వు ఈ హోదాకు అర్హుడవు. నువ్వు జట్టును ముందుకు తీసుకెళ్లగలవనే నమ్మకం ఉంది- విరాట్ కోహ్లి. -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్.. కోహ్లి కామెంట్స్ వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కొత్త కెప్టెన్ నియామకంపై ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) స్పందించాడు. సారథిగా ఎంపికైన రజత్ పాటిదార్(Rajat Patidar)కు శుభాకాంక్షలు చెప్పిన ఈ రన్మెషీన్.. కెప్టెన్సీకి అతడు వందశాతం అర్హుడని ప్రశంసలు కురిపించాడు. అతడికి ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని ప్రకటించాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 సీజన్కు గానూ ఆర్సీబీ టీమిండియా ఆటగాడు రజత్ పాటిదార్ను తమ కెప్టెన్గా నియమించింది. సౌతాఫ్రికా వెటరన్ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్కు పగ్గాలు అప్పగించింది. కాగా 2021లో ఆర్సీబీలో చేరిన పాటిదార్ను 2022 వేలానికి ముందు ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది.కెప్టెన్ స్థాయికిఈ క్రమంలో అతడు వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోగా.. రీప్లేస్మెంట్ ఆటగాడిగా మళ్లీ జట్టులోకి చేర్చుకుంది. అయితే, తన అద్బుత ఆట తీరుతో అతడు ఇప్పుడు కెప్టెన్ స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి రజత్ పాటిదార్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘ఆర్సీబీ కొత్త కెప్టెన్గా రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. నీకు శుభాభినందనలు రజత్. నిన్ను నువ్వు నిరూపించుకుని... ఫ్రాంఛైజీతో అనుబంధాన్ని పెంచుకుని.. ఇక్కడి దాకా వచ్చావు. ఆర్సీబీ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించావు. నీ ఎదుగుదల ఇక్కడితో ఆగిపోదు.కెప్టెన్గా నువ్వు అర్హుడివి. నాతో పాటు జట్టులోని సభ్యులంతా నీ వెన్నంటే ఉంటాము. నీ పాత్రను సమర్థవంతంగా పోషించేలా సహకారం అందిస్తాం. ఇదొక కీలకమైన బాధ్యత. గత కొన్నేళ్లుగా నేనూ, ఫాఫ్ సారథ్య బాధ్యతలను మోశాం. ఇప్పుడు నీకు ఆ గౌరవం దక్కింది. నువ్వు ఈ స్థాయికి చేరుకోవడం పట్ల నాకు సంతోషంగా ఉంది. ఇది నీ హక్కుకెప్టెన్గా ఉండటం ఒక రకంగా నీకు నువ్వుగా సంపాదించుకున్న హక్కు. గత రెండేళ్ల నీ ప్రయాణం అద్భుతం. టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేశావు. మధ్యప్రదేశ్ జట్టును ముందుకు నడిపించిన తీరు కూడా నన్ను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అద్భుతమైన ఫ్రాంఛైజీ జట్టుకు సారథిగా నిన్ను నువ్వు మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.రజత్ పాటిదార్కు మద్దతుగా ఉండాలని అభిమానులకు కోరుతున్నా. ఏది ఏమైనా.. చివరకు మన అందరికీ జట్టు ప్రయోజనాలు, గెలుపే ముఖ్యం. జట్టుగా ఎదుగుదాం. మన అద్బుతమైన ఫ్రాంఛైజీకి చిరస్మరణీయ విజయాలు అందిద్దాం. రజత్కు మరోసారి శుభాకాంక్షలు. అభిమానుల ప్రేమ మనకు ఎల్లప్పుడూ లభిస్తుంది. రానున్న సీజన్లో ఆర్సీబీ సరికొత్తగా అద్భుతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వీడియో సందేశంలో పేర్కొన్నాడు.కాగా గతేడాది.. రజత్ పాటిదార్ దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్కు చేర్చాడు. ఇక ఐపీఎల్ కెరీర్లో 27 మ్యాచ్లు ఆడిన పాటిదార్ ఓ శతకం, ఏడు అర్ధ శతకాల సాయంతో 799 పరుగులు చేశాడు. ఇక తొమ్మిదేళ్లపాటు ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి 2022 సీజన్కు ముందు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.చదవండి: క్రెడిట్ అతడికే ఇవ్వాలి.. నా స్థానంలో ఎవరున్నా జరిగేది అదే: రోహిత్ శర్మ 𝐊𝐢𝐧𝐠 𝐊𝐨𝐡𝐥𝐢 𝐀𝐩𝐩𝐫𝐨𝐯𝐞𝐬! 💌“Myself and the other team members will be right behind you, Rajat”: Virat Kohli“The way you have grown in this franchise and the way you have performed, you’ve made a place in the hearts of all RCB fans. This is very well deserved.”… pic.twitter.com/dgjDLm8ZCN— Royal Challengers Bengaluru (@RCBTweets) February 13, 2025 -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్.. అధికారిక ప్రకటన
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నూతన కెప్టెన్ను ప్రకటించింది. వచ్చే సీజన్లో ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్ (Rajat Patidar) వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారికంగా వెల్లడించింది. 31 ఏళ్ల పాటిదార్ గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలో కీలక ప్లేయర్గా వ్యవహిరిస్తున్నాడు. తొలుత ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ కోహ్లి మళ్లీ బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమంతా ఊహాగానాలే అని తేలిపోయింది. విరాట్కు కెప్టెన్సీ చేసే ఉద్దేశం లేకనే పాటిదార్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పాటిదార్.. గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్ను ఫైనల్కు చేర్చాడు. పాటిదార్కు రంజీల్లో మధ్యప్రదేశ్కు కెప్టెన్గా పని చేసిన అనుభవం ఉంది. పాటిదార్ కొన్ని సందర్భాల్లో ఆర్సీబీ కెప్టెన్గానూ (తాత్కాలిక) వ్యవహరించాడు. తాజా పరిణామంతో పాటిదార్ ఆర్సీబీ ఎనిమిదో కెప్టెన్గా ఎంపికయ్యాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ (2008), కెవిన్ పీటర్సన్ (2009), అనిల్ కుంబ్లే (2009), డేనియల్ వెటోరీ (2011), విరాట్ కోహ్లి (2011), షేన్ వాట్సన్ (2017), ఫాప్ డుప్లెసిస్ (2022) ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించారు.2022 నుంచి 2024 వరకు ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్ను మెగా వేలంలో తిరిగి రీటైన్ చేసుకోకపోవడంతో 2025 సీజన్కు ముందు ఆర్సీబీ కెప్టెన్ లేకుండా ఉండింది. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పాటిదార్ అప్పటినుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. పాటిదార్.. తనదైన శైలిలో విధ్వంసం సృష్టించి ఆర్సీబీ మిడిలార్డర్లో డ్యాషింగ్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాటిదార్.. స్పిన్ మరియు పేస్ బౌలింగ్ను సమర్దవంతంగా ఎదుర్కొంటాడు. ఐపీఎల్ కెరీర్లో 27 మ్యాచ్లు ఆడిన పాటిదార్ 158.85 స్ట్రయిక్రేట్తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీలు ఉన్నాయి.పాటిదార్ను ఇటీవల ముగిసిన మెగా వేలానికి ముందు ఆర్సీబీ రూ. 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. ఆర్సీబీ రీటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో పాటిదార్ ఒకడు. పాటిదార్ కాకుండా ఆర్సీబీ విరాట్ కోహ్లి, యశ్ దయాల్ను రీటైన్ చేసుకుంది.కాగా, ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే. 2009, 2011, 2016లో రన్నకప్గా నిలిచిన ఈ జట్టు.. 2015, 2020, 2021, 2022, 2024 సీజన్లలో ప్లే ఆఫ్స్కు చేరింది. -
టిమ్ డేవిడ్ ఊచకోత.. ఆర్సీబీకి మరో గుడ్ న్యూస్
వివిధ టోర్నీలో ఇవాళ (జనవరి 5) ఇద్దరు ఆర్సీబీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. బిగ్బాష్ లీగ్లో టిమ్ డేవిడ్ (Tim David) (హోబర్ట్ హరికేన్స్), విజయ్ హజారే ట్రోఫీలో రజత్ పాటిదార్ (Rajat Patidar) విధ్వంసం సృష్టించారు. అడిలైడ్ స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్లో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్.. ఓవరాల్గా 28 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. డేవిడ్ విధ్వంసం ధాటికి అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని హరికేన్స్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (49), అలెక్స్ రాస్ (47) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టుకు భారీ స్కోర్ను అందించారు. ఓలీ పోప్ (33), జేమీ ఓవర్టన్ (27 నాటౌట్) పర్వాలేదనిపించారు. హరికేన్స్ బౌలర్లలో వకార్ సలామ్ఖీల్ 2, క్రిస్ జోర్డన్, స్టాన్లేక్, రిలే మెరిడిత్ తలో వికెట్ పడగొట్టారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ డేవిడ్ అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. మిచెల్ ఓవెన్ (37), మాథ్యూ వేడ్ (27), నిఖిల్ చౌదరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో లాయిడ్ పోప్, కెమరూన్ బాయ్స్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ థార్న్టన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.శతక్కొట్టిన రజత్ పాటిదార్విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ సెంచరీతో కదంతొక్కాడు. బెంగాల్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో పాటిదార్ 137 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 132 పరుగులు (నాటౌట్) చేశాడు. పాటిదార్ శతక్కొట్టడంతో ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ సుదీప్ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. సుదీప్ ఛటర్జీ (47) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాట్ ఝులింపించాడు. షమీ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 42 పరుగులు చేశాడు.అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయినప్పటికీ రజత్ పాటిదార్.. శుభమ్ శ్యామ్సుందర్ శర్మ (99) సాయంతో మధ్యప్రదేశ్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో ఇద్దరు ఆటగాళ్లు 99 పరుగుల వద్ద ఔటయ్యారు.భీకర ఫామ్లో పాటిదార్దేశవాలీ క్రికెట్లో రజత్ పాటిదార్ భీకరఫామ్లో ఉన్నాడు. రజత్ వరుసగా 76(36), 62(36), 68(40), 4(7), 36(16), 28(18), 66*(29), 82*(40), 55(33), 21*(15), 2(7), 2(3), 14(16), 132*(137) స్కోర్లు చేశాడు. రజత్ గత 14 ఇన్నింగ్స్ల్లో 6 అర్ద శతకాలు, ఓ శతకం బాదాడు. -
సుర్యాంశ్ షేడ్గే ఊచకోత.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబైదే
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని ముంబై జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన ఫైనల్లో ముంబై మధ్యప్రదేశ్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్.. కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ చివరి వరకు క్రీజ్లో నిలబడి మధ్యప్రదేశ్కు ఫైటింగ్ టోటల్ అందించాడు. ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లలో పాటిదార్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్లో సుభ్రాన్షు సేనాపతి (23), హర్ప్రీత్ సింగ్ (15), వెంకటేశ్ అయ్యర్ (17), రాహుల్ బాథమ్ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆర్పిత్ గౌడ్ (3), హర్ష్ గావ్లి (2), త్రిపురేశ్ సింగ్, శివమ్ శుక్లా (1) సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్, శివమ్ దూబే, సుయాంశ్ షేడ్గే తలో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన రహానే, స్కై.. షేడ్గే, అంకోలేకర్ ఊచకోత175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఆదిలోనే పృథ్వీ షా (10) వికెట్ కోల్పోయింది. అయితే రహానే (30 బంతుల్లో 37), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9 బంతుల్లో 16) ఏమాత్రం తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48) తనదైన స్టయిల్లో విరుచుకుపడ్డాడు. చివర్లో శివమ్ దూబే (6 బంతుల్లో 9), అథర్వ అంకోలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్), సూర్యాంశ్ షేడ్గే (15 బంతుల్లో 36 నాటౌట్) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి ముంబైని గమ్యానికి చేర్చారు. ముఖ్యంగా షేడ్గే మధ్యప్రదేశ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అంకోలేకర్ సిక్సర్ బాది మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దేశవాలీ క్రికెట్లో ముంబైకు ఇది 63వ టైటిల్. రెండో సయ్యద్ ముస్తాక్ అలీ టైటిల్. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన రహానేకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు, ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సూర్యాంశ్ షేడ్గేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు లభించాయి. సూర్యాంశ్ షేడ్గేను ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కేవలం 30 లక్షలకు సొంతం చేసుకుంది. -
SMAT Final: రజత్ పాటిదార్ విధ్వంసం
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్లో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసం సృష్టించాడు. మధ్యప్రదేశ్, ముంబై జట్ల మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ (డిసెంబర్ 15) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి మధ్యప్రదేశ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. రజత్ పాటిదార్ చివరి రెండు ఓవర్లలో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సుయాంశ్ షేడ్గే వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన పాటిదార్.. శార్దూల్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టాడు. అంతకుముందు మధ్యప్రదేశ్కు ఇన్నింగ్స్ 18వ ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఓవర్లో రాయ్స్టన్ డయాస్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. ఆ ఓవర్లో మొదటి రెండు బంతులకు రాహుల్ బాథమ్ సిక్సర్, బౌండరీ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే రాయ్స్టన్ డయాస్ బౌలింగ్లో బాథమ్ ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో రజత్ పాటిదార్ ఒంటరిపోరాటం చేశాడు. ఓ పక్క సహచరులంతా పెవిలియన్కు చేరుతున్నా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాటిదార్ ఆతర్వాత మరింత రెచ్చిపోయి ఆడాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్లో సుభ్రాన్షు సేనాపతి (23), హర్ప్రీత్ సింగ్ (15), వెంకటేశ్ అయ్యర్ (17), రాహుల్ బాథమ్ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. ఆర్పిత్ గౌడ్ (3), హర్ష్ గావ్లి (2), త్రిపురేశ్ సింగ్, శివమ్ శుక్లా (1) సింగిల్ డిజిట్ స్కోర్లరే పరిమితమయ్యారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకోలేకర్, శివమ్ దూబే, సుయాంశ్ షేడ్గే తలో వికెట్ దక్కించుకున్నారు. -
రెచ్చిపోయిన రజత్ పాటిదార్.. ఫైనల్లో మధ్యప్రదేశ్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మధ్యప్రదేశ్ ఫైనల్కు చేరుకుంది. ఇవాళ (డిసెంబర్ 13) సాయంత్రం జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. అనుజ్ రావత్ (33 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలువగా.. ప్రియాన్ష్ ఆర్య 29, యశ్ ధుల్ 11, ఆయుశ్ బదోని 19, హిమ్మత్ సింగ్ 15, మయాంక్ రావత్ 24, హర్ష్ త్యాగి 9 (నాటౌట్) పరుగులు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్ 2, కుమార్ కార్తికేయ, ఆవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. రెచ్చిపోయిన రజత్ పాటిదార్147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. రజత్ పాటిదార్ రెచ్చిపోవడంతో 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రజత్ పాటిదార్ 29 బంతుల్లో 4 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాటిదార్కు హర్ప్రీత్ సింగ్ భాటియా (46 నాటౌట్) సహకరించాడు. ఆదిలో ఓపెనర్ హర్ష్ గావ్లి (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. హిమాన్షు చౌహాన్ ఓ వికెట్ తీశాడు.ఫైనల్లో మధ్యప్రదేశ్ఢిల్లీపై గెలుపుతో మధ్యప్రదేశ్ ఫైనల్లోకి ప్రవేశించింది. డిసెంబర్ 15న జరిగే ఫైనల్లో మధ్యప్రదేశ్ ముంబైని ఢీకొంటుంది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బరోడాపై గెలిచి ముంబై ఫైనల్కు చేరింది. రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించి ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు. -
MP Vs HYD: రజత్ పాటిదార్ మెరుపులు.. తిలక్ వర్మను వెంటాడిన దురదృష్టం
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. పేలవ ఆటతీరు కొనసాగించిన తిలక్ సేన.. నాలుగో పరాజయంతో నాకౌట్ దశకు చేరే అవకాశాలను కోల్పోయింది.గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు మధ్యప్రదేశ్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 179 పరుగుల లక్ష్యఛేదనలో 14 ఓవర్లు ముగిసేసరికి 125/3తో పటిష్ట స్థితిలో కనిపించిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత మిడిలార్డర్ వైఫల్యంతో 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూట గట్టుకుంది.రజత్ పాటిదార్ మెరుపులుటాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హర్ష్ గావ్లి (29 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకంతో మెరవగా... సుభ్రాంషు సేనాపతి (42; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ రజత్ పాటిదార్ (16 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్, అజయ్దేవ్ గౌడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.తిలక్ వర్మను వెంటాడినన దురదృష్టంఅనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ ఠాకూర్ తిలక్ వర్మ (34 బంతుల్లో 46; 1 ఫోర్, 2 సిక్స్లు), తన్మయ్ అగర్వాల్ (33 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. దీంతో హైదరాబాద్ విజయందిశగా సాగిపోయింది. అయితే మధ్యప్రదేశ్ బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ మిడిలార్డర్ కుప్పకూలింది.మికిల్ జైస్వాల్ (0), ప్రతీక్ రెడ్డి (1), తనయ్ త్యాగరాజన్ (9) విఫలమయ్యారు. చివర్లో మిలింద్ (19; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడినా హైదరాబాద్ జట్టును గట్టెక్కించలేకపోయాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ, కమల్ త్రిపాఠి చెరో 3 వికెట్లు తీశారు. మొత్తం 8 జట్లున్న గ్రూప్ ‘ఎ’లో 6 మ్యాచ్లాడిన హైదరాబాద్ జట్టు రెండింటిలో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయి 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. గురువారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో మిజోరంతో హైదరాబాద్ తలపడనుంది. స్కోరు వివరాలు మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్: సుభ్రాంషు సేనాపతి (సి) రాహుల్ బుద్ధి (బి) నితిన్ సాయి యాదవ్ 42; హర్ష్ గావ్లి (సి) తన్మయ్ (బి) అజయ్దేవ్ గౌడ్ 51; రజత్ పాటిదార్ (సి) రోహిత్ రాయుడు (బి) నితిన్సాయి యాదవ్ 36; హర్ప్రీత్ సింగ్ (సి) తిలక్ వర్మ (బి) మిలింద్ 12; వెంకటేశ్ అయ్యర్ (సి) తనయ్ త్యాగరాజన్ (బి) మిలింద్ 22; అనికేత్ వర్మ (బి) మిలింద్ 0; రాహుల్ బాథమ్ (సి) నితిన్సాయి యాదవ్ (బి) అజయ్దేవ్ గౌడ్ 5; కమల్ త్రిపాఠి (సి) తిలక్ వర్మ (బి) అజయ్దేవ్ గౌడ్ 1; కుమార్ కార్తికేయ (నాటౌట్) 0; అవేశ్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–92, 2–105, 3–142, 4–151, 5–151, 6–163, 7–165, 8–177. బౌలింగ్: రవితేజ 4–0–42–0; మిలింద్ 4–0–33–3; అజయ్ దేవ్ గౌడ్ 4–0–20–3; తనయ్ 4–0–51–0; నితిన్ సాయి 4–0–29–2.హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) కమల్ త్రిపాఠి (బి) కార్తికేయ 47; రోహిత్ రాయుడు (సి) హర్‡్ష (బి) అవేశ్ ఖాన్ 8; తిలక్ వర్మ (సి) అనికేత్ వర్మ (బి) కమల్ త్రిపాఠి 46; రాహుల్ బుద్ధి (సి) అనికేత్ వర్మ (బి) కార్తికేయ 20; మికిల్ జైస్వాల్ (సి) రజత్ (బి) కార్తికేయ 0; ప్రతీక్ రెడ్డి (సి అండ్ బి) కమల్ త్రిపాఠి 1; తనయ్ త్యాగరాజన్ (సి) కార్తికేయ (బి) కమల్ త్రిపాఠి 9; అజయ్దేవ్ గౌడ్ (సి) పాటిదార్ (బి) అవేశ్ ఖాన్ 12; మిలింద్ (సి) అనికేత్ వర్మ (బి) రాహుల్ బాథమ్ 19; రవితేజ (నాటౌట్) 1; నితిన్సాయి యాదవ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–31, 2–87, 3–125, 4–125, 5–127, 6–128, 7–143, 8–167, 9–168.బౌలింగ్: అవేశ్ ఖాన్ 4–0–31–2; ఖెజ్రోలియా 2–0–30–3; రాహుల్ 3–0–27–1; కమల్ 4–0–31–3; వెంకటేశ్ అయ్యర్ 3–0–24–0; కార్తికేయ 4–0–25–3. చదవండి: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. శివమ్ దూబే ఊచకోత -
IPL 2025: మెరుపు సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్!
మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ అద్భుత శతకం సాధించాడు. హర్యానాతో మ్యాచ్లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు శతకంతో ఆదుకున్నాడు. కేవలం 68 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా ఆఖరి రోజు ఆటలో మధ్యప్రదేశ్ను పటిష్ట స్థితిలో నిలపగలిగాడు.కాగా రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్లో భాగంగా తొలుత కర్ణాటకతో మ్యాచ్ను డ్రా చేసుకున్న మధ్యప్రదేశ్.. తదుపరి పంజాబ్తో మ్యాచ్లోనూ ఫలితం తేల్చలేకపోయింది. ఈ క్రమంలో శనివారం ఇండోర్ వేదికగా హర్యానా జట్టుతో రెడ్బాల్ మ్యాచ్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 308ఓపెనర్ హిమాన్షు మంత్రి(97) సహా కెప్టెన్ శుభం శర్మ(44), హర్ప్రీత్ సింగ్(36) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్యానా 440 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ లక్ష్య దలాల్ సెంచరీ(105)తో చెలరేగగా.. హిమాన్షు రాణా 90, ధీరూ సింగ్ 94, హర్షల్ పటేల్ 81 పరుగులతో దుమ్ములేపారు. ఆధిక్యంలోకి హర్యానాదీంతో తొలి ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ కంటే 132 పరుగుల ఆధిక్యంలో నిలిచింది హర్యానా. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ ఆరంభంలోనే ఓపెనర్లు సాగర్ సోలంకి(32), వెంకటేశ్ అయ్యర్(28) వికెట్లు కోల్పోయింది.రజత్ మెరుపు శతకంఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన రజత్ పాటిదార్ 68 బంతుల్లోనే ధనాధన్ ఇన్నింగ్స్తో శతకం సాధించాడు. మరో ఎండ్లో హర్ప్రీత్ సింగ్(44), శుభం శర్మ(38 నాటౌట్) సహకారం అందించగా.. పట్టుదలగా క్రీజులో నిలబడి 102 బంతుల్లో 159 పరుగులు చేశాడు. టార్గెట్ 177ఈ క్రమంలో 48.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 308 పరుగుల వద్ద ఉండగా మధ్యప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాటిదార్ మెరుపు శతకం వల్ల మంగళవారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా హర్యానాకు 177 పరుగుల లక్ష్యం విధించగలిగింది.ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్ఇక ఐపీఎల్-2025 మెగా వేలం సమీపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబరు 31 నాటికి ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రజత్ పాటిదార్ సెంచరీ సాధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యాజమాన్యానికి రేసులో తానూ ఉన్నాననే సందేశం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొన్నేళ్లుగా ఆర్సీబీకి ఆడుతున్న రజత్ పాటిదార్.. ఈ ఏడాది 395 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు -
ఆవేశ్ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలం
Duleep Trophy 2024- Ind C vs Ind A అనంతపురం: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ ‘సి’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ ఆటగాడు అభిషేక్ పొరెల్ (113 బంతుల్లో 82; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో ఈ మేర స్కోరు చేయగలిగింది. నిజానికి.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న గ్రూప్ ‘సి’ జట్టు... చివరి మ్యాచ్లో అదే స్థాయి ప్రదర్శ కనబర్చడంలో తడబడింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17)తో పాటు సాయి సుదర్శన్ (17), రజత్ పటిదార్ (0), ఇషాన్ కిషన్ (5), మానవ్ సుతార్ (2) విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ ‘సి’ జట్టును బాబా ఇంద్రజిత్ (34)తో కలిసి అభిషేక్ ఆదుకున్నాడు. వరస విరామాల్లో వికెట్లు పడుతున్నా... ధాటిగా ఆడిన అభిషేక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మరోవైపు పులకిత్ నారంగ్ (114 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసిన భారత్ ‘సి’.. శనివారం నాటి మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. భారత్ ‘ఎ’ జట్టు కంటే తొలి ఇన్నింగ్స్లో 63 పరుగులు వెనుకబడి ఉంది.టీ20 తరహాలో బ్యాటింగ్ చేసిన ఆవేశ్ ఖాన్ఇదిలా ఉంటే.. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 224/7తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు చివరకు 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ (250 బంతుల్లో 124; 15 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరగగా... పేసర్ అవేశ్ ఖాన్ (68 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అనూహ్యంగా బ్యాట్తో అదరగొట్టాడు.టీ20 తరహాలో ఎడాపెడా భారీ షాట్లు ఆడిన అవేశ్ ఖాన్ జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ (34; 7 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టారు. -
డుప్లెసిస్పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్గా ఊహించని ఆటగాడు!
ఐపీఎల్-2024 సీజన్కు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటైన్ జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఇంకా రిటెన్షన్ పక్రియకు సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ రానిప్పటకి.. ఆయా జట్లు మాత్రం ఇప్పటినుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. మెగా వేలంకు ముందు ఎవరనీ విడిచిపెట్టాలి, ఎవరిని రిటైన్ చేసుకోవాలి అన్న ఆంశాలపై ఫ్రాంచైజీలు ఓ నిర్ణయంకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పలు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్పై వేటు వేయాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.డుప్లెసిస్తో పాటు ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ను సైతం వేలంలోకి విడిచిపెట్టాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు వినికిడి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాటు రజత్ పటిదార్, ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ను రిటైన్ చేసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్ను నియమించే ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పాటిదార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్లో నిరాశపరిచిన పాటిదార్.. సెకెండ్ హాఫ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 15 మ్యాచ్లు ఆడి 398 పరుగులు చేశాడు.గ్రీన్కు గుడ్ బై.. ?అదే విధంగా 2024 మినీ వేలం లో రూ.11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం వేలంలోకి వచ్చే అవకాశముంది.ఐపీఎల్-2024లో పర్వాలేదన్పించిన ఆర్సీబీ.. లిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. 2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. -
ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం.. వరుసగా ఐదో గెలుపు
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసి గెలుపు జెండా ఎగురవేసింది. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. అయితే, మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు.యశ్ దయాల్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఫెర్గూసన్ రెండు, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో ఢిల్లీని 140 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ విజయం సాధించింది.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపురాణించిన విల్ జాక్స్, పాటిదార్.. ఆర్సీబీ స్కోరు ఎంతంటే! ఐపీఎల్- 2024 ప్లే ఆఫ్స్ రేసులో భాగంగా మరో రసవత్తర సమరం జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతోంది.సొంతమైదానంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి(13 బంతుల్లో 27) ధాటిగా ఆరంభించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(6) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఈ క్రమంలో విల్ జాక్స్(29 బంతుల్లో 41), రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నారు. వీరికి తోడు ఐదో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) కూడా రాణించాడు.అయితే, లోయర్ ఆర్డర్ మహిపాల్ లామ్రోర్(13) ఒక్కడు డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. దినేశ్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ డకౌట్ అయ్యారు. కరణ్ శర్మ ఆరు పరుగులు చేసి రనౌట్ కాగా.. మహ్మద్ సిరాజ్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు స్కోరు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలాం రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. -
RCB Vs PBKS: బెంగళూరు జోరు...
ధర్మశాల: ఐపీఎల్లో ఆరు వరుస ఓటముల తర్వాత ఒక్కసారిగా చెలరేగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పుడు వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. ఫలితంగా ఎనిమిదో ఓటమితో పంజాబ్ కింగ్స్ జట్టు వరుసగా పదో ఏడాది ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయింది. గురువారం జరిగిన పోరులో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్స్లు), రజత్ పటిదార్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్లు), కామెరాన్ గ్రీన్ (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేసి ఆర్సీబీ భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రిలీ రోసో (27 బంతుల్లో 61; 9 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారీ భాగస్వామ్యాలు... కొత్త బౌలర్ కావేరప్ప తక్కువ వ్యవధిలో డుప్లెసిస్ (9), జాక్స్ (12)లను అవుట్ చేసి పంజాబ్కు తగిన ఆరంభం అందించాడు. అయితే మరో ఎండ్లో కోహ్లి చెలరేగిపోగా, అతనికి పటిదార్ జత కలిశాక మరింత వేగంగా పరుగులు వచ్చాయి. చహర్ ఓవర్లో పటిదార్ 3 సిక్స్లు కొట్టాక జోరు పెరిగింది. 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పటిదార్ వెనుదిరిగాడు. ఈ దశలో వర్షంతో కొద్దిసేపు ఆట ఆగిపోయింది. మ్యాచ్ మళ్లీ మొదలయ్యాక 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న కోహ్లి దూకుడు పెంచాడు. స్యామ్ కరన్ బౌలింగ్లో అతను కొట్టిన భారీ సిక్సర్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. అయితే మరో భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లి సెంచరీ చేజార్చుకున్నాడు. కోహ్లి, గ్రీన్ ఐదో వికెట్కు 46 బంతుల్లోనే 96 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 3 పరుగులే ఇచ్చి హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. పంజాబ్ భారీ ఛేదనలో బెయిర్స్టో (27) కొంత ధాటిగా ఆడగా... రోసో ఇన్నింగ్స్ మాత్రమే కొద్దిసేపు ఆశలు రేపింది. అతను వెనుదిరిగిన తర్వాత శశాంక్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడినా లాభం లేకపోయింది.క్యాచ్లు వదిలేసి...పంజాబ్ పేలవ ఫీల్డింగ్ కూడా బెంగళూరుకు కలిసొచ్చింది. ఆరంభంలోనే వచ్చిన మంచి అవకాశాలను పంజాబ్ ఫీల్డర్లు వృథా చేశారు. కెరీర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన కావేరప్ప మాత్రం తీవ్రంగా నిరాశ చెందాల్సి వచ్చింది. అతని బౌలింగ్లోనే కోహ్లి (0, 10 వద్ద) ఇచ్చిన క్యాచ్లను అశుతోష్, రోసో వదిలేయగా... పటిదార్ (0 వద్ద) ఇచ్చిన క్యాచ్ను హర్షల్ నేలపాలు చేశాడు. పటిదార్ 33 వద్ద ఉన్నప్పుడు చహర్ బౌలింగ్లో కొంత కష్టమైన క్యాచ్ను బెయిర్స్టో అందుకోలేకపోయాడు. ‘సున్నా’ వద్ద బతికిపోయిన కోహ్లి 92 వరకు చేరడం పంజాబ్ను అన్నింటికంటే బాగా దెబ్బ తీసింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) రోసో (బి) అర్‡్షదీప్ 92; డుప్లెసిస్ (సి) శశాంక్ (బి) కావేరప్ప 9; జాక్స్ (సి) హర్షల్ (బి) కావేరప్ప 12; పటిదార్ (సి) బెయిర్స్టో (బి) స్యామ్ కరన్ 55; గ్రీన్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 46; దినేశ్ కార్తీక్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 18; లోమ్రోర్ (బి) హర్షల్ 0; స్వప్నిల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–19, 2–43, 3–119, 4–211, 5–238, 6–240, 7–241. బౌలింగ్: కావేరప్ప 4–0–36–2, అర్‡్షదీప్ 3–0–41–1, స్యామ్ కరన్ 3–0–50–1, హర్షల్ 4–0–38–3, రాహుల్ చహర్ 3–0–47–0, లివింగ్స్టోన్ 3–0–28–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 6; బెయిర్స్టో (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 27; రోసో (సి) జాక్స్ (బి) కరణ్ 61; శశాంక్ సింగ్ (రనౌట్) 37; జితేశ్ శర్మ (బి) కరణ్ 5; లివింగ్స్టోన్ (సి) కరణ్ (బి) స్వప్నిల్ 0; స్యామ్ కరన్ (బి) ఫెర్గూసన్ 22; అశుతోష్ శర్మ (ఎల్బీ) (బి) సిరాజ్ 8; హర్షల్ (సి) ఫెర్గూసన్ (బి) సిరాజ్ 0; చహర్ (నాటౌట్) 5; అర్‡్షదీప్ (సి) కరణ్ (బి) సిరాజ్ 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 181. వికెట్ల పతనం: 1–6, 2–71, 3–107, 4–125, 5–126, 6–151, 7–164, 8–170, 9–174, 10–181. బౌలింగ్: స్వప్నిల్ 3–0–28–2, సిరాజ్ 4–0–43–3, యశ్ దయాళ్ 2–0–22–0, ఫెర్గూసన్ 3–0–29–2, జాక్స్ 1–0–5–0, గ్రీన్ 1–0–16–0, కరణ్ శర్మ 3–0–36–2.ఐపీఎల్లో నేడుగుజరాత్ X చెన్నై వేదిక: అహ్మదాబాద్రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
కోహ్లి.. ఇలాగేనా ఆడేది?: టీమిండియా దిగ్గజం విమర్శలు
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ పెదవి విరిచాడు. స్థాయికి తగ్గట్లు రాణించడంలో కోహ్లి విఫలమవుతున్నాడని విమర్శించాడు.ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్- ఆర్సీబీ మధ్య బుధవారం నాటి మ్యాచ్లో కోహ్లి అర్ధ శతకం బాదిన విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా కోహ్లి 43 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు.ఈ క్రమంలో కోహ్లి స్ట్రైక్ రేటు 118.6గా నమోదైంది. ఇక రైజర్స్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో కోహ్లితో పాటు రజత్ పాటిదార్(20 బంతుల్లో 50) హాఫ్ సెంచరీ చేయగా.. కామెరాన్ గ్రీన్(20 బంతుల్లో 37 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇందులో కీలక పాత్ర మాత్రం 250 స్ట్రైక్రేటుతో అర్ధ శతకం సాధించిన పాటిదార్దే.ఇక లక్ష్య ఛేదనలో 171 పరుగులకే సన్రైజర్స్ పరిమితం కావడంతో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కోహ్లి స్ట్రైక్రేటు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఆరంభంలో బాగానే ఆడినా మధ్యలో కాస్త వెనుకబడినట్లు కనిపించింది. నంబర్స్ గురించి స్పష్టంగా ప్రస్తావించలేకపోతున్నాను గానీ.. 31- 32 స్కోరు వరకు అతడు బౌండరీ బాదలేకపోయాడు.ఇన్నింగ్స్ తొలి బంతి నుంచి క్రీజులో ఉండి.. 14- 15 ఓవర్ వరకు బ్యాటింగ్ కొనసాగించాలనుకుంటే ఈ స్ట్రైక్రేటు మాత్రం సరిపోదు. ఫ్రాంఛైజీ కోహ్లి వంటి టాప్ క్లాస్ ప్లేయర్నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఆశించదు’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్ట్పోర్స్ షోలో వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లి ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.కాగా సన్రైజర్స్తో మ్యాచ్లో పరుగుల విధ్వంసం సృష్టించి ఆర్సీబీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన రజత్ పాటిదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండో గెలుపు. ఈ విజయంతో ఆర్సీబీ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరినప్పటికీ పట్టికలో మాత్రం అట్టడుగున పదో స్థానంలోనే కొనసాగుతోంది.Lofted with perfection and style! 😎@RCBTweets move to 61/1 after 6 oversWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvRCB | @imVkohli pic.twitter.com/WdVkWT99yz— IndianPremierLeague (@IPL) April 25, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రైజింగ్కు బ్రేక్
హెడ్ విధ్వంసం సృష్టించలేదు... క్లాసెన్ కుమ్మేయలేదు... మార్క్రమ్ మెరుపుల్లేవు... అభిషేక్ ఆశించిన స్థాయిలో చెలరేగలేదు... వరుస మ్యాచ్లలో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడుకు సొంతగడ్డపై బ్రేక్ పడింది. 300 స్కోరు సంగతేమో కానీ ఛేదనలో ఒకదశలో 100 కూడా దాటడమే కష్టమనిపించింది.వరుసగా నాలుగు విజయాల తర్వాత హైదరాబాద్ జట్టు తలవంచింది. మరోవైపు వరుసగా ఆరు పరాజయాలు... మైదానంలో దిగేదే ఓడేందుకా అన్నట్లు ఆడుతూ ఒక్క గెలుపు కోసం తపించిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు భారీ ఊరట లభించింది. బ్యాటింగ్తోపాటు బౌలింగ్లోనూ రాణించడంతో ఎట్టకేలకు ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో రెండో విజయం దక్కింది. సాక్షి, హైదరాబాద్: సీజన్లో తిరుగులేకుండా సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్పై విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధసెంచరీలు చేయగా... కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు.అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓడిపోయింది. షహబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ప్యాట్ కమిన్స్ (15 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. పటిదార్ మెరుపులు... భువనేశ్వర్ ఓవర్లో 3 ఫోర్లతో డుప్లెసిస్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా... కమిన్స్ ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు కొట్టాడు. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. డుప్లెసిస్, జాక్స్ (6) వెనుదిరిగిన తర్వాత కోహ్లి ఆశ్చర్యకర రీతిలో ఒక్కసారిగా నెమ్మదించాడు. తన 17వ బంతికి సిక్స్ కొట్టిన కోహ్లి... ఆ తర్వాత 25 బంతులపాటు బౌండరీ కొట్టలేకపోవడం అనూహ్యం.అయితే మరో ఎండ్లో పటిదార్ విధ్వంసం ఆర్సీబీ స్కోరును పరుగెత్తించింది. లెగ్స్పిన్నర్ మార్కండే లక్ష్యంగా అతను చెలరేగిపోయాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన పటిదార్... అతని తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6, 6, 6 బాదడం విశేషం. కోహ్లి, పటిదార్ తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... గ్రీన్ చక్కటి షాట్లతో స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 64 పరుగులు చేసింది. టపటపా... తొలి ఓవర్లోనే హెడ్ (1) అవుట్ కావడంతో రైజర్స్కు సరైన ఆరంభం లభించలేదు. జాక్స్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ కొట్టిన అభిషేక్ తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. అంతే... ఆ తర్వాత పరుగులు రావడం ఆగిపోవడంతో పాటు హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది.మార్క్రమ్ (8 బంతుల్లో 7; 1 ఫోర్), క్లాసెన్ (3 బంతుల్లో 7; 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 13; 1 సిక్స్) ఇలా వచ్చి అలా పెవిలియన్కు వెళ్లిపోయారు. దాంతో సన్రైజర్స్కు ఏ దశలోనూ గెలుపు అవకాశాలు కనిపించలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సమద్ (బి) ఉనాద్కట్ 51; డుప్లెసిస్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 25; జాక్స్ (బి) మార్కండే 6; పటిదార్ (సి) సమద్ (బి) ఉనాద్కట్ 50; గ్రీన్ (నాటౌట్) 37; లోమ్రోర్ (సి) కమిన్స్ (బి) ఉనాద్కట్ 7; కార్తీక్ (సి) సమద్ (బి) కమిన్స్ 11; స్వప్నిల్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 12; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–48, 2–65, 3–130, 4–140, 5–161, 6–193, 7–206. బౌలింగ్: అభిషేక్ శర్మ 1–0–10–0, భువనేశ్వర్ 1–0–14–0, కమిన్స్ 4–0–55–1, నటరాజన్ 4–0–39–2, షహబాజ్ 3–0–14–0, మార్కండే 3–0–42–1, జైదేవ్ ఉనాద్కట్ 4–0–30–3. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) కార్తీక్ (బి) యశ్ 31; హెడ్ (సి) కరణ్ (బి) జాక్స్ 1; మార్క్రమ్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 7; నితీశ్ కుమార్ రెడ్డి (బి) కరణ్ 13; క్లాసెన్ (సి) గ్రీన్ (బి) స్వప్నిల్ 7; షహబాజ్ (నాటౌట్) 40; సమద్ (సి అండ్ బి) శర్మ 10; కమిన్స్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 31; భువనేశ్వర్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 13; ఉనాద్కట్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–3, 2–37, 3–41, 4–56, 5–69, 6–85, 7–124, 8–141. బౌలింగ్: జాక్స్ 2–0–23–1, సిరాజ్ 4–0–20–0, యశ్ దయాళ్ 3–0–18–1, స్వప్నిల్ 3–0–40–2, కరణ్ శర్మ 4–0–29–2, ఫెర్గూసన్ 2–0–28–0, గ్రీన్ 2–0–12–2. ఐపీఎల్లో నేడుకోల్కతా X పంజాబ్ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
రజిత్ పాటిదార్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 4 సిక్స్లు! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్ మరో అద్బుత ఇన్నింగ్స్ను ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పాటిదార్ అదరగొట్టాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విల్ జాక్స్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పాటిదార్.. ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ముఖ్యంగా స్పిన్నర్లను టార్గెట్ చేశాడు. స్పిన్నర్ మార్కండే వేసిన 11 ఓవర్లో పాటిదార్ వరుసుగా 4 సిక్స్లు బాదాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే పాటిదార్ తన హాప్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రాబిన్ ఉతప్ప సరసన రజిత్ నిలిచాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొన్న పాటిదార్ 2 ఫోర్లు, 5 సిక్స్లతో 50 పరుగులు చేశాడు.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50)తో పాటు విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు. Patidar ka 𝑹𝒂𝒋 🤌🫡#SRHvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/v1dzhJjKxZ— JioCinema (@JioCinema) April 25, 2024 -
#RCBvsKKR: చెత్త బ్యాటింగ్.. ఇంకా ఎన్ని ఛాన్స్లు?
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రజిత్ పాటిదార్ ఆట ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో వరుసగా మూడో మ్యాచ్లోనూ పాటిదార్ నిరాశపరిచాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాటిదార్.. రస్సెల్ బౌలింగ్లో రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన అతడు కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడిని ఆర్సీబీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇకనైనా నీ ఆట తీరు మారదా’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఆర్సీబీ మెనెజ్మెంట్ తీరును తప్పుబడుతున్నారు. అతడు వరుసగా విఫలమవుతున్నప్పటికి అవకాశాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా రాబోయే మ్యాచ్ల్లో పాటిదార్పై ఆర్సీబీ వేటు వేసే ఛాన్స్ ఉంది. అతడి స్ధానంలో మహిపాల్ లామ్రోర్ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. కాగా ఐపీఎల్కు ముందు ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లోనూ పాటిదార్ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు అదే పేలవ ఫామ్ను పాటిదార్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక మ్యాచ్లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. Rajat patidar 😭😭 pic.twitter.com/MXrogYrPNw — ADITYA 🇮🇳 (@troller_Adi18) March 29, 2024 -
RCB Vs PBKS: అన్న నీవు మారవా? ఇంకా ఎన్ని ఛాన్స్లు! జట్టు నుంచి తీసిపడేయండి
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్. ఆర్సీబీ ఆటగాడు రజిత్ పాటిదార్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2024 తొలి మ్యాచ్లో విఫలమైన పాటిదార్.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్లో కేవలం 18 బంతులు ఎదుర్కొన్న పాటిదార్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాటిదార్ తన ఆట తీరుతో నిరాశరిచాడు. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ హార్ప్రీత్ బరార్ బౌలింగ్లో చెత్త షాట్ ఆడి పాటిదార్ క్లీన్ బౌల్డయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్న నీవు మారవా ఇంకా ఎన్ని మ్యాచ్లు ఇలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ఆర్సీబీ మెనెజ్మెంట్ను తప్పుబడుతున్నారు. ఫామ్లో లేని ఆటగాడికి ఎందుకు ఛాన్స్లు ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లోనూ పాటిదార్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లో విరాట్ కోహ్లి(49 బంతుల్లో 77, 11 ఫోర్లు, 2 సిక్స్లు) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఆఖరిలో దినేష్ కార్తీక్ మెరుపు మెరిపించి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందిచాడు. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. pic.twitter.com/LPuKzE4G0g — Sitaraman (@Sitaraman112971) March 25, 2024 -
పంజాబ్తో మ్యాచ్.. ఆర్సీబీ తుది జట్టు ఇదే? రూ.11 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం(మార్చి 25) చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్తో మ్యాచ్కు ఆర్సీబీ మెనెజ్మెంట్ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్లో విఫలమైన మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్, అల్జారీ జోషఫ్పై వేటు వేయనున్నట్లు సమాచారం. పాటిదార్ స్ధానంలో సుయాష్ ప్రభుదేసాయి, జోషఫ్ స్ధానంలో కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాడు. కాగా సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో పాటిదార్ డకౌట్ కాగా.. పేసర్ జోషఫ్ దారుణంగా విఫలమయ్యాడు. 3. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ కరేబియన్ ఫాస్ట్ బౌలర్.. వికెట్ ఏమీ తీయకుండా 38 పరుగులిచ్చాడు. ఈ క్రమంలోనే పాటిదార్, జోషఫ్ను ఆర్సీబీ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 మినీవేలంలో జోషఫ్ను రూ.11. 50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్లో పేసర్ యాష్ దయాల్ను ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకునే అవకాశముంది. ఆర్సీబీ తుది జట్టు(అంచనా) విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, లాకీ ఫెర్గూసన్, మయాంక్ దాగర్, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్. -
టీమిండియాలోనే కాదు.. ఇక్కడా ఇంతేనా?! వీడియో వైరల్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో దారుణ ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాడు, ఆర్సీబీ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్.. ఇప్పుడు ఐపీఎల్-2024లోనూ అదే తీరును కనబరిచాడు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తొలి మ్యాచ్లో పాటిదార్ దారుణంగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న పాటిదార్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్లో ఆఖరి బంతికి ఎటువంటి ఫుట్ మూమెంట్ లేకుండా ఆఫ్ సైడ్ వైపు ఆడటానికి పాటిదార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. ధోని ఎటువంటి తప్పిదం చేయకుండా రెగ్యులేషన్ క్యాచ్ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేమి ఆటరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(37) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. శివమ్ దూబే(34 నాటౌట్), రవీంద్ర జడేజా(25 నాటౌట్) రాణించారు. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్ రావత్(48), దినేష్ కార్తీక్(38 నాటౌట్) తమ అద్బుత ఇన్నింగ్స్లతో అదుకున్నారు. వీరితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(35) పరుగులతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
'వరుసగా మూడు మ్యాచ్ల్లో విఫలం.. అయినా అతడికి ఛాన్స్ ఇవ్వాల్సిందే'
ఇంగ్లండ్తో ఇప్పటికే టెస్టు సిరీస్ను సొంతం చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు నామమాత్రపు ఐదో టెస్టుకు సిద్దమవుతోంది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఆఖరి మ్యాచ్లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్ ఆటగాడు రజిత్ పాటిదార్పై వేటు వేయాలని మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాతి రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్లు ఆడిన ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు కేవలం 63 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే పాటిదార్ను పక్కన పెట్టాలని మెన్జ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాటిదార్కు మద్దతుగా దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ నిలిచాడు. పాటిదార్ అద్భుతమైన ఆటగాడని, అతడికి మరో అవకాశం ఇవ్వాలని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ సిరీస్లో రజిత్ పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. తనకు జీవిత కాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ను ఆడలేకపోయాడు. కానీ ప్రస్తుతం భారత జట్టులో ఉన్న మంచి విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం బాగా ఆడకున్నా ఫలితాలు జట్టుకు అనుకూలంగా వస్తున్నప్పుడు మనం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అతడి అటిట్యూడ్ బాగా ఉండి, డ్రెస్సింగ్ రూమ్లో అందరికి నచ్చితే కెప్టెన్ రోహిత్ శర్మ మెనెజ్మెంట్తో మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే పాటిదార్ మాత్రం అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతానికి అతడు పరుగులేమీ చేయకున్నా అతడికి మరిన్ని అవకాశాలిచ్చి చూడండి తన యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ పేర్కొన్నాడు. చదవండి: NZ vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి -
Ind vs Eng: తిరిగి వెళ్లమన్న సెలక్టర్లు.. పాటిదార్పై వేటు?
'Go back and play Ranji...': BCCI wants To: ఇంగ్లండ్తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ సందర్భంగా నలుగురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేయగా.. మరో ఆటగాడికీ ఛాన్స్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో స్టోక్స్ బృందంతో టెస్టు సిరీస్ను రోహిత్ సేన ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. హైదరాబాద్లో ఆరంభ మ్యాచ్లో ఓడినా.. విశాఖపట్నం, రాజ్కోట్, రాంచిలలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సొంతగడ్డపై ఈ మేరకు ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక విశాఖ టెస్టులో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్.. రాజ్కోట్లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. రాంచిలో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ టీమిండియా క్యాపులు అందుకున్నారు. వీరిలో రజత్ పాటిదార్కు వరుసగా మూడుసార్లు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సిరీస్లో అతడు చేసిన పరుగులు 32,9,5,0,17,0. ఫలితంగా రజత్ పాటిదార్ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్లో లేని ఆటగాడిని జట్టులో కొనసాగించడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదో టెస్టు నుంచి పాటిదార్ను తప్పించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. రంజీ ట్రోఫీ 2023-24లో విదర్భతో మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో ఆడాల్సిందిగా బీసీసీఐ తొలుత ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ గురించి స్పష్టత రాకపోవడంతో పాటిదార్ విషయంలో నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. అయితే, రాహుల్ రాకపోయినా పాటిదార్ను తుదిజట్టు నుంచి తప్పించి.. అతడి స్థానంలో దేవ్దత్ పడిక్కల్ను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదనపు బ్యాటర్గా అతడిని జట్టుతోనే కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కర్ణాటక బ్యాటర్ తాజా రంజీ సీజన్లో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. భారత్-ఏ తరఫున కూడా రాణించాడు. చదవండి: Rohit Sharma: ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా? -
Ind Vs Eng: ‘అక్కడ పులి.. ఇక్కడ పిల్లి’?.. ఖేల్ ఖతమే ఇక!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ మరోసారి విఫలమయ్యాడు. ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో కూడా పూర్తిగా నిరాశపరిచి మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. కాగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రజత్ పాటిదార్.. దేశవాళీ క్రికెట్లో సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పాటిదార్ ఎట్టకేలకు 2023లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ముప్పై ఏళ్ల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు ఆడింది ఒకే ఒక్క వన్డే. సాధించిన స్కోరు 22. ఇక ఇంగ్లండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ సందర్భంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి జట్టుకు దూరంగా ఉండటంతో అతడి స్థానంలో రజత్ పాటిదార్కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న పాటిదార్.. ఆ మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్లో వరుసగా 32, 9 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టులోనూ ఆడే అవకాశం దక్కించుకున్న అతడు రాజ్కోట్(5,0)లో పూర్తిగా విఫలమయ్యాడు. అయినప్పటికీ రాంచి టెస్టులో కూడా పాటిదార్కు ఛాన్స్ ఇచ్చింది మేనేజ్మెంట్. అయితే, ఇక్కడా పాత కథనే పునరావృతం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 17 పరుగులు చేయగలిగిన పాటిదార్.. రెండో ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగాడు. తప్పక రాణించాల్సిన మ్యాచ్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి పాటిదార్ ఈ మేరకు విఫలమయ్యాడు. ఈ మూడు మ్యాచ్లలోనూ రజత్ పాటిదార్ స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకుని వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతడిపై విమర్శలు వస్తున్నాయి. ‘‘ఆర్సీబీలో పులి.. టీమిండియాలో పిల్లి’’ అన్న చందంగా పాటిదార్ ఆట తీరు ఉందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వరుస అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇకనైనా పాటిదార్ను తప్పించి అతడి స్థానంలో అర్హుడైన ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. Againnnnn😭😭 Patidar is promoting his edits more than anyone🤣pic.twitter.com/DY3x5d0yVO — unapologetic_analyst (@arham412003) February 26, 2024 Thank You Rajat Patidar 🦆 You will not be remembered #RajatPatidar #INDvENG pic.twitter.com/JNHOyYFkMF — sarcastic (@Sarcastic_broo) February 26, 2024 -
Ind Vs Eng: ఐదుసార్లూ వాళ్లకే చిక్కాడు.. ఇంకెన్ని అవకాశాలు?
India vs England, 4th Test- Rajat Patidar: టీమిండియా బ్యాటర్ రజత్ పాటిదార్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్తో నాలుగో టెస్టు సందర్భంగా అతడు మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు. వరుస ఇన్నింగ్స్లో వైఫల్యం చెంది టీమిండియా అభిమానుల విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టాడు. విరాట్ కోహ్లి జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో అతడి స్థానంలో ఎంట్రీ ఇచ్చిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ చేసిన పరుగులు 32, 9. రెండు ఇన్నింగ్స్లోనూ ఇంగ్లిష్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్లో పాటిదార్ అవుట్ కావడం విశేషం. ఏదేమైనా.. తొలి మ్యాచ్లో కాస్త ఫర్వాలేదనిపించినా రాజ్కోట్ టెస్టులో మాత్రం పాటిదార్ పూర్తిగా విఫలమయ్యాడు. ఐదుసార్లూ వాళ్ల చేతికే చిక్కాడు తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులకే పరిమితమైన అతడు.. రెండో ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో రెండు సందర్భాల్లోనూ అతడు ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లే చేతికే చిక్కడం గమనార్హం. తాజాగా నాలుగో టెస్టులోనూ 17 పరుగులకే అవుటయ్యాడు పాటిదార్. ఈసారి కూడా స్పిన్ బౌలింగ్ ఆడటంలో తన బలహీనతను మరోసారి బయటపెడుతూ 30 ఏళ్ల పాటిదార్.. షోయబ్ బషీర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో రజత్ పాటిదార్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘‘టీమిండియాలో అరంగేట్రం తర్వాత వరుసగా విఫలమైనా.. తుదిజట్టులో అతడికి చోటు ఇస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మరోవైపు.. సంజూ శాంసన్ వంటి ఆటగాడికి 2015లో టీ20లో టీమిండియా తరఫున.. అదీ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయించారు. మళ్లీ అతడు మరో అంతర్జాతీయ టీ20 ఆడటానికి ఐదేళ్లు(2020) పట్టింది. ఎందుకింత వివక్ష? కేవలం ఐపీఎల్లో ఆడిన ఆటగాళ్లకే అవకాశాలు ఇస్తే ఇలాగే ఉంటుంది. కనీసం టెస్టు జట్టుకు ఎంపిక చేసే ఆటగాళ్లనైనా.. రంజీ ట్రోఫీ, ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్లలో ప్రదర్శన ఆధారంగా ఎంచుకోండి’’ అని సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు. ఇక శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. చదవండి: IPL 2024- MI: అడ్జస్ట్ అవ్వాలా?.. ఇది ఎలా తింటాననుకున్నావు? పాండ్యా ఫైర్ -
ఏమో నాకైతే తెలియదు.. అతడికి మరో ఛాన్స్: భారత బ్యాటింగ్ కోచ్
రాంఛీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టుకు సర్వం సిద్దమైంది. శుక్రవారం ఉదయం 9:30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 3-1తో సొంతం చేసుకోవాలని భారత్ ప్రణాళికలను రచిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ సైతం ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమయ్యాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గాయపడిన రాహుల్.. వైజాగ్, రాజ్కోట్ టెస్టులకు దూరమయ్యాడు. కానీ రాంఛీ టెస్టుకు ముందు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడని, తిరిగి జట్టుతో చేరుతాడని వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం రాహుల్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదని, నాలుగో టెస్టుకు కూడా దూరమయ్యాడనిఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇదే విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "కెఎల్ రాహుల్ ఎంత శాతం ఫిట్నెస్ సాధించాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంతవరకు మ్యాచ్ ఆడే ఫిట్నెస్ అయితే అతడు సాధించలేదు అనుకుంటున్నాను. అతడి పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నదని రాథోర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఇక రాహుల్ గైర్హాజరు నేపథ్యంలో మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్ను తుది జట్టులో కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ.. "పాటిదార్ అద్బుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం అతడితో మేము చర్చలు జరుపుతున్నాం. అతడు తన ప్రతిభను నిరూపించుకుంటాడని భావిస్తున్నాము. అతడికి జట్టు మెనెజ్మెంట్ మొత్తం సపోర్ట్గా ఉందని చెప్పుకొచ్చాడు. కాగా వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. -
IND VS ENG 4th Test: పాటిదారా.. పడిక్కలా..?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్ ఓ అడుగు ముందుకేసి ఇదివరకే తుది జట్టును కూడా ప్రకటించింది. తుది జట్టు విషయంలో టీమిండియానే ఎటూ తేల్చుకోలేకపోతుంది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో నాలుగో టెస్ట్కు అర్హత కోల్పోయాడు. రాహుల్కు ప్రత్యామ్నాయంగా రెండు, మూడు టెస్ట్లు ఆడిన రజత్ పాటిదార్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ ఒక్క స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. పాటిదార్కు మరో అవకాశం ఇవ్వాలా లేక దేవ్దత్ పడిక్కల్కు అరంగేట్రం చేసే ఛాన్స్ ఇవ్వాలా అని మేనేజ్మెంట్ జట్టు పీక్కుంటుంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ నోరు విప్పాడు. పాటిదార్ మంచి ప్లేయర్ అని, ఒకటి రెండు వైఫల్యాలకే ఏ ఆటగాడి నైపుణ్యాన్ని శంకించకూడదని పరోక్షంగా పాటిదార్ను వెనకేసుకొచ్చాడు. రాథోడ్కు పాటిదార్పై సదుద్దేశమే ఉన్నప్పటికీ టీమిండియా అభిమానులు మాత్రం దేవ్దత్ పడిక్కల్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పడిక్కల్ ఇటీవలికాలంలో సూపర్ ఫామ్లో ఉన్నాడని, పాటిదార్తో పోలిస్తే పడిక్కల్ చాలా బెటర్ అని వారభిప్రాయపడుతున్నారు. మరి నాలుగో స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి కొన్ని గంటలు వేచి చూస్తే కాని తెలీదు. మరోవైపు బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ఆకాశ్దీప్కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. రేపటి మ్యాచ్లో ఆకాశ్ అరంగేట్రం చేయడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. నాలుగో టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్/దేవ్దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్దీప్ -
అతడి పని అయిపోయింది.. ఇక బెంచ్కే!
రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత జట్టు.. ఇప్పుడు నాలుగో టెస్టుకు సన్నదమవుతోంది. ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 3-1తో సొంతం చేసుకోవాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు ముందు జట్టు నుంచి రిలీజ్ అయిన పేసర్ ముఖేష్ కుమార్ తిరిగి మళ్లీ రాంఛీ టెస్టుకు అందుబాటులో వచ్చే ఛాన్స్ ఉంది. పాటిదార్ పై వేటు.. ఇక వరుసగా వైజాగ్,రాజ్కోట్ టెస్టులకు గాయం కారణంగా దూరమైన భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు నాలుగో టెస్టు జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉండడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్పై వేటు పడే సూచనలు కన్పిస్తున్నాయి. వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్.. పెద్దగా అకట్టుకోలేకపోయాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 32 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం రాజ్కోట్ టెస్టులో అయితే ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు దారుణంగా విఫలయ్యాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతడి వేటు వేయాలని భారత జట్టు మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అరంగేట్రంలోనే అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురల్ స్ధానాలకు ఎటువంటి ఢోకా లేదు. చదవండి: SL vs AFG: దుమ్ములేపుతున్న శ్రీలంక.. వరుసగా మూడో సిరీస్ విజయం -
అయ్యో రజత్.. బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో! వీడియో వైరల్
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్లో మంచి టచ్లో కన్పించిన పాటిదార్ ఊహించని విధంగా ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ స్ధానంలో జట్టులోకి వచ్చిన పాటిదార్.. నాలుగో వికెట్కు ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే భారత ఇన్నింగ్స్లో 72 ఓవర్ వేసిన ఇంగ్లీష్ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్లో తొలి బంతిని పాటిదార్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ చివర భాగాన తగిలి బౌన్స్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. అతడు తన కాలితో బంతిని అపడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో 32 పరుగులు చేసిన పాటిదార్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(179 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగాడు. చదవండి: IND vs ENG: అంపైర్తో వాగ్వాదానికి దిగిన అశ్విన్.. Kohli ke team se aata hai to Luck bhi toh Kohli jaisa hi hoga na😭😭😭 Bad luck Rajat Patidar🤞 pic.twitter.com/IBCfrJwexj — Vahini🕊️ (@fairytaledust_) February 2, 2024 -
ఒకేరోజు ఎనిమిది మంది క్రికెటర్ల ఎంట్రీ!
క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివిధ ఫార్మాట్లలో ఇవాళ (2024, ఫిబ్రవరి 2న) ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ముందుగా విశాఖ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్తో భారత ఆటగాడు రజత్ పాటిదార్, ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశారు. వెస్టిండీస్తో ఇవాళ జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వన్డే అరంగేట్రం చేశారు. శ్రీలంకతో ఇవాళే మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. మొత్తంగా ఇవాళ ఎనిమిది మంది ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. క్రికెట్ చరిత్రలో ఇంతమంది ఒకే రోజు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఇవాళ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాళ్ల వివరాలు.. రజత్ పాటిదార్ (భారత్) షోయబ్ బషీర్ (ఇంగ్లండ్) జేవియర్ బార్ట్లెట్ (ఆస్ట్రేలియా) లాన్స్ మోరిస్ (ఆస్ట్రేలియా) నూర్ అలీ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) నవీద్ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ (ఆఫ్ఘనిస్తాన్) మొహమ్మద్ సలీం (ఆఫ్ఘనిస్తాన్) ఇవాళ జరుగుతున్న మ్యాచ్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్తో ఇవాళ మొదలైన రెండో టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (125 నాటౌట్) కెరీర్లో మూడో సెంచరీతో కదంతొక్కగా.. అతనికి జతగా అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ (25) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో అరంగేట్రం ఆటగాళ్లు రజత్ పాటిదార్, షోయబ్ బషీర్ పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ తొలి వన్డే విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయానికి చేరువలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 48.4 ఓవరల్లో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 34 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 208 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. గ్రీన్ (68), స్టీవ్ స్మిత్ (65) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ గెలుపుకు మరో 24 పరుగులు మాత్రమే అవసరం ఉంది. అరంగేట్రం ఆటగాళ్లు జేవియర్ బార్ట్లెట్ (9-1-17-4) అద్భుత గణాంకాలతో విజృంభించగా.. లాన్స్ మోరిస్ (10-2-59-0) పర్వాలేదనిపించాడు. ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తొలి రోజు మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు (53 ఓవర్లు) చేసింది. కైస్ అహ్మద్ (16), జియా ఉర్ రెహ్మాన్ (0) క్రీజ్లో ఉన్నారు. అరంగేట్రం ఆటగాళ్లలో నూర జద్రాన్ (31) కాస్త పర్వాలేదనించాడు. -
తుదిజట్టులో నో ఛాన్స్!.. సర్ఫరాజ్ ఖాన్ వ్యాఖ్యలు వైరల్
India vs England, 2nd Test- Sarfraz Khan: ‘‘టెస్టు క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపికగా ఉండాలి. జీవితంలో కొన్నిసార్లు మనం తొందరపాటులో పనులు చేసేస్తూ ఉంటాం. నేను కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టీమిండియాలో అడుగుపెట్టాలని ఎదురుచూసేవాడిని. ఒక్కోసారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యేవాడిని. అలాంటపుడు మా నాన్న నన్ను ఓదార్చేవారు. హార్డ్వర్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడో ఓసారి ఫలితం అదే వస్తుంది. అప్పుడు నిన్నెవరూ ఆపలేరని చెబుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం, ఓపిక కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని నేను తెలుసుకున్నా. ఇప్పుడు మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. కోట్లాది మంది జనాభా ఉన్న ఈ దేశంలో టీమిండియాలో భాగమయ్యే అవకాశం రావడం పట్ల నాకు గర్వంగా ఉంది’’.. ఇంగ్లండ్తో టీమిండియా రెండో టెస్టు ఆరంభానికి ముందు యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్న మాటలివి. అలా తొలిసారి టీమిండియాకు ఎంపిక దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతూ.. భారత్-ఏ తరఫున కూడా అదరగొడుతున్న ఈ ముంబై బ్యాటర్కు వైజాగ్ టెస్టు సందర్భంగా బీసీసీఐ సెలక్టర్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్లతో పాటు సర్ఫరాజ్కు కూడా ప్రధాన జట్టులో చోటిచ్చింది. అయితే, అంతకంటే ముందే మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్లో చోటు కోసం పాటిదార్తో పోటీపడ్డ సర్ఫరాజ్కు నిరాశే మిగిలింది. తుదిజట్టులో పాటిదార్కు స్థానం ఇచ్చారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా.. బీసీసీఐకి అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ తెరమీదకు వచ్చింది. ఓపికగా ఉంటేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమంటూ 26 ఏళ్ల సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) సిరాజ్ స్థానంలో అతడు కాగా ఐదు మ్యాచ్ల సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది టీమిండియా. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మూడు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. రజత్ పాటిదార్ టెస్టు క్యాప్ అందుకోగా.. మహ్మద్ సిరాజ్ స్థానంలో ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్నాడు. చదవండి: SA20 2024: టీ20 మ్యాచ్లో విధ్వంసం.. ఏకంగా 462 పరుగులు -
Ind vs Eng: ‘ఇంత అన్యాయమా.. ఇంకెలా ఆడితే ఛాన్స్ ఇస్తారు?’
India vs England, 2nd Test- No Place For Sarfaraz Khan: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణ కొనసాగుతోంది. ఇంగ్లండ్తో రెండో టెస్టు సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయమని అభిమానులతో పాటు భారత మాజీ క్రికెటర్లు కూడా భావించారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం అతడికి మరోసారి మొండిచేయి చూపింది. తుదిజట్టులో చోటు కోసం మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో పాటిదార్ వైపే మొగ్గుచూపింది. ఇప్పటికే టీమిండియా తరఫున వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన పాటిదార్కే టెస్టు క్యాప్ కూడా అందించింది. దీంతో సర్ఫరాజ్కు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘పాపం.. సర్ఫరాజ్ ఖాన్కు మరోసారి అన్యాయం జరిగింది. ఇన్నాళ్లు జట్టుకు ఎంపికే చేయలేదు. ఈసారి ఛాన్స్ ఇచ్చారనుకుంటే తుదిజట్టులో ఆడించడం లేదు. అసలు అతడిని ఎందుకు పక్కనపెట్టారో కాస్త వివరించగలరా? మీ నిర్ణయాలు మాకైతే అంతుపట్టడం లేదు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్-ఏ జట్టుపై భారత్- ఏ తరఫున సెంచరీ బాది ఫామ్లో ఉన్నా కూడా సర్ఫరాజ్ ఖాన్ ఆట తీరుపై మీకు నమ్మకం కుదరలేదా? ఇంకెన్నాళ్లు అతడు ఎదురుచూడాలి?’’ అంటూ సెలక్టర్లపై ఫైర్ అవుతున్నారు. No Sarfaraz..?? What..??? Please explain. Unbelievable...#INDvsENGTest #INDvsENG #INDvENG #IndianCricket #SarfarazKhan — Raghav Srinivasan (@RaghavSrinivas7) February 2, 2024 I hope India’s more main players get injured so that Sarfaraz ko chance mile https://t.co/vXVrS2n6ND — Akshayyyy (@AkshayyMahadik) February 2, 2024 కాగా తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు.. మొదటి టెస్టు తర్వాత రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో సౌరభ్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్లకు రెండో టెస్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఇక కేఎస్ భరత్కు సొంతమైదానంలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో.. ఇలాంటి అవకాశం రావడం తనకు గర్వకారణమంటూ భరత్ సంతోషం వ్యక్తం చేశాడు. 🗣️🗣️ It's a proud moment to be playing in front of your home crowd. Proud and focused @KonaBharat is geared up for the 2nd #INDvENG Test in Visakhapatnam 🙌#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/2eUkG5vDSN — BCCI (@BCCI) February 1, 2024 తుది జట్లు: టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్. చదవండి: IND VS ENG 2nd Test: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..? ఎందుకంత స్పెషల్ -
రజత్ పాటిదార్ అరంగేట్రం.. జహీర్ చేతుల మీదగా! ఫోటోలు వైరల్
మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ టీమిండియా తరపున టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత తుది జట్టులో పాటిదార్ చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత్ తరపున టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన 310 ఆటగాడిగా రజత్ నిలిచాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ చేతుల మీదగా పటిదార్ క్యాప్ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆల్ ది బెస్ట్ రజత్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రజత్ పాటిదార్కు దేశీవాళీ క్రికెట్లో ఘనమైన రికార్డు ఉంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 55 మ్యాచ్లు ఆడిన పాటిదార్.. 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు నిరాశ ఎదురైంది. తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్.. అంతర్జాతీయ అరంగేట్రం కోసం మరి కొంత కాలం వేచి చూడల్సిందే. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ Congratulations to Rajat Patidar who is all set to make his Test Debut 👏👏 Go well 👌👌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/FNJPvFVROU — BCCI (@BCCI) February 2, 2024 -
IND Vs ENG 2nd Test: తొలిరోజు జైస్వాల్ సూపర్ ‘హిట్’..
India vs England, 2nd Test At Vizag Day 1 Update: ఇంగ్లండ్తో రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. వైజాగ్లో శుక్రవారం మొదలైన మ్యాచ్లో తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి.. 93 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(14) నిరాశపరచగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఆట ముగిసే సరికి 179 పరుగులతో అశ్విన్(5)తో అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో శుబ్మన్ గిల్(34), అరంగేట్ర బ్యాటర్ రజత్ పాటిదార్(32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా నామమాత్రంగానే ఆడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లు షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్లకు రెండు చొప్పున వికెట్లు దక్కగా.. దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్, స్పిన్ బౌలర్ హార్లీ ఒక్కో వికెట్ పడగొట్టాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 90.6: శ్రీకర్ భరత్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో షోయబ్ బషీర్కు క్యాచ్ ఇచ్చి భరత్ (17) పెవిలియన్ చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 330-6(91) 88వ ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు: 307/5 యశస్వి జైస్వాల్ 168, శ్రీకర్ భరత్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా ►85.3: షోయబ్ బషీర్ బౌలింగ్లో రెహాన్ క్యాచ్ ఇచ్చిన అక్షర్ పటేల్. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐదో వికెట్గా వెనుదిరిగిన ఆల్రౌండర్. లోకల్ స్టార్ శ్రీకర్ భరత్ క్రీజులోకి వచ్చాడు. టీమిండియా @ 300 ►84: మూడు వందల పరుగుల మార్కు అందుకున్న టీమిండియా 73 ఓవర్లలో టీమిండియా స్కోరు: 250-4 ►యశస్వి 142, అక్షర్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 71.1: ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్లో రజత్ పాటిదార్ బౌల్డ్(32). నాలుగో వికెట్ కోల్పోయిన భారత్. యశస్వి, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. 63 ఓవర్లలో టీమిండియా స్కోరు: 225/3 జైస్వాల్ 125, పాటిదార్ 25 రన్స్తో క్రీజులో ఉన్నారు. టీ విరామ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. మూడో వికెట్ డౌన్.. శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. టామ్ హార్లీ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్కు ఇచ్చి పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్ వచ్చాడు. యశస్వీ జైశ్వాల్ సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 151 బంతుల్లో జైశ్వాల్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. జైశ్వాల్కు ఇది రెండో టెస్టు సెంచరీ. 50 ఓవర్లకు టీమిండియా స్కోర్: 175/2. క్రీజులో జైశ్వాల్(104), శ్రేయస్ అయ్యర్(23) పరుగులతో ఉన్నారు. 42 ఓవర్లకు టీమిండియా స్కోర్: 137/2 42 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ జైశ్వాల్(69) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(21) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 38 ఓవర్లకు భారత స్కోర్: 114/2 38 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(56), శ్రేయస్ అయ్యర్(14) పరుగులతో ఉన్నారు. లంచ్ విరామానికి భారత్ స్కోర్: 103/2 రెండో టెస్టు తొలి రోజు లంచ్ విరామానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(51), శ్రేయస్ అయ్యర్(4) పరుగులతో ఉన్నారు. జైశ్వాల్ హాఫ్ సెంచరీ ఇంగ్లండ్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 51 పరుగులతో జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. శుబ్మన్ గిల్ ఔట్.. 89 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. జేమ్స్ ఆండర్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. 29 ఓవర్లకు భారత్ స్కోర్: 89/2, క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. జైశ్వాల్(41) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ అవుట్ 17.3: రోహిత్ శర్మ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ మాయాజాలంలో చిక్కుకున్న టీమిండియా కెప్టెన్ ఒలీ పోప్నకు క్యాచ్ ఇచ్చి 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. గిల్ క్రీజులోకి వచ్చాడు. యశస్వి 26 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 41/1 (18) నిలకడగా ఆడుతున్న రోహిత్, జైశ్వాల్.. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్: 39/0, క్రీజులో యశస్వీ జైశ్వాల్(25), రోహిత్ శర్మ(14) పరుగులతో ఉన్నారు. పది ఓవర్లకు టీమిండియా స్కోరు: 23/0 యశస్వి, రోహిత్ ఆచితూచి ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి యశస్వి 13, రోహిత్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లకు టీమిండియా స్కోరు: 14/0 యశస్వి 9, రోహిత్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. ఖాతా తెరిచిన జైశ్వాల్.. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 9/0 తొలి ఇన్నింగ్స్లో 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(9), రోహిత్ శర్మ(0) ఉన్నారు. విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లండ్ రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో రజిత్ పాటిదార్ భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్కు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరంగా కాగా.. పేసర్ మహ్మద్ సిరాజ్కు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలో పాటిదార్తో పాటు ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చారు. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ అరంగేట్రం చేయగా.. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ 🚨 Toss Update 🚨 Captain @ImRo45 wins the toss and #TeamIndia elect to bat in Vizag 👌👌 Follow the match ▶️ https://t.co/UvEzFjxrS7 Zaheer Khan #TeamIndia | #INDvENG | #IDFCFIRSTBank pic.twitter.com/rpBJ1si3XM https://t.co/rpBJ1si3XM — Fatima Raza (@Fatima__ain) February 2, 2024 -
సర్ఫరాజ్ను ఆడిస్తారా? లేదంటే.. టీమిండియా కోచ్ స్పందన
India vs England, 2nd Test- Sarfaraz vs Patidar: ‘‘ఎట్టకేలకు టీమిండియా సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది.. దేశవాళీ క్రికెట్లో, భారత్-ఏ తరఫున సత్తా చాటుతున్న ఈ ముంబై బ్యాటర్ను ఇన్నాళ్లకు బీసీసీఐ కరుణించింది.. ఇక భారత్ తరఫున అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడమే తరువాయి. ఇంతకీ రెండో టెస్టు తుదిజట్టులో అతడికి చోటు దక్కుతుందా?’’.. యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి క్రీడా వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఎట్టకేలకు పిలుపు రంజీల్లో పరుగుల వరద పారించినా.. నోటి దురుసు కారణంగా సెలక్షన్ కమిటీ అతడి పేరును పరిశీలనలోకి తీసుకోలేదనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఎట్టకేలకు అతడి ప్రతిభ వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ఛాన్స్ అయితే ఇచ్చారు. అంతకంటే ముందుగానే పాటిదార్ అయితే, అంతకంటే ముందే విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్కు జట్టులో చోటిచ్చారు. హైదరాబాద్ టెస్టు తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాల కారణంగా దూరం కాగా.. సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లతో పాటు సర్ఫరాజ్కు తలుపులు తెరిచారు. కానీ విశాఖపట్నం టెస్టులో తుది జట్టులో అతడికి చోటిస్తారా లేదంటే పాటిదార్ను ఆడిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఈ అంశం గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారు? ‘‘వాళ్లిద్దరూ సూపర్ ప్లేయర్లు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టంతో కూడుకున్న నిర్ణయం. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఎప్పుటికపుడు వారి ప్రదర్శనలు మేము గమనిస్తూనే ఉన్నాం. ఇక స్వదేశీ పిచ్ల మీద జట్టు ఆడేపుడు వాళ్లిద్దరి చేరిక మాకు అదనపు ప్రయోజనంగా మారుతుందనడంలో సందేహం లేదు. వాళ్ల నిర్ణయాన్ని బట్టే ముందు చెప్పినట్లుగానే ఇద్దరిలో ఒకరినే తీసుకోవాల్సి రావడం వల్ల కఠిన నిర్ణయం తీసుకోకతప్పదు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ నిర్ణయాలకు అనుగుణంగానే తుదిజట్టు ప్రకటన ఉంటుంది’’ అని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు. తొలి టెస్టులో ఓటమితో తామేమీ కుంగిపోలేదని.. రెండో మ్యాచ్లో తమ ఆటగాళ్లు కచ్చితంగా తిరిగి పుంజుకుంటారని ఈ సందర్భంగా రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఫిబ్రవరి 2 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నంలో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇంగ్లండ్తో రెండో టెస్టుకు భారత జట్టు(అప్డేటెడ్): రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్. చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే సర్ఫరాజ్! తాడోపేడో తేల్చుకో.. -
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. రజిత్ పాటిదార్ అరంగేట్రం!?
ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి కమ్బ్యాక్ ఇవ్వాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఈ టెస్టు ఆరంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమయ్యారు. దీంతో రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను సెలక్టర్లు భారత ప్రధాన జట్టులో చేర్చారు. ఇక రెండు టెస్టుకు రాహుల్ దూరం కావడంతో మధ్యప్రదేశ్ ఆటగాడు రజిత్ పాటిదార్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. తొలి టెస్టుకు బెంచ్కే పరిమితమైన పాటిదార్.. వైజాగ్ టెస్టుకు మాత్రం తుది జట్టులోకి తీసుకోవాలని మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పాటిదార్కు దేశీవాళీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 55 మ్యాచ్లు ఆడిన పాటిదార్.. 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: విరాట్ కోహ్లి నాపై ఉమ్మేశాడు.. రెండేళ్ల తర్వాత: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ -
IND VS ENG: కోహ్లి తప్పుకోవడానికి కారణం అదేనా..?
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా రేపటి నుంచి (జనవరి 25) ప్రారంభంకానుంది. సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లకు భారత్ జట్టును ఇదివరకే ప్రకటించారు. అయితే తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అభిమానులకు ఊహించని షాకిచ్చాడు. వ్యక్తిగత కారణాల చేత తొలి రెండు మ్యాచ్లకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను నేరుగా చెప్పనప్పటికీ బీసీసీఐచే అధికారికంగా ప్రకటన విడుదల చేయించాడు. కోహ్లి అకస్మిక ప్రకటనతో అభిమానులతో పాటు సహచరులు కూడా అవాక్కయ్యారు. ఉన్నట్లుండి కోహ్లికి ఏమంత సమస్య వచ్చి పడిందని అనుకున్నారు. అయితే ఈ లోపే బీసీసీఐ మరో ప్రకటన విడుదల చేసింది. కోహ్లి ప్రైవసీని సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులంతా గౌరవించాలని కోరింది. కోహ్లి అందుబాటులో ఉండకపోవడంపై ఆరా తీయడం మానుకోవాలని సూచించింది. ఈ విషయంలో భారత క్రికెట్ అభిమానులు ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని పిలుపునిచ్చింది. బీసీసీఐ ఈ ప్రకటన చేయగానే పలువురు మాజీ క్రికెటర్లు సైతం కోహ్లి ప్రైవసీని గౌరవించాలని పిలుపునిచ్చారు. కోహ్లి విషయంలో బీసీసీఐ, మాజీ క్రికెటర్లు ఈ స్థాయిలో ఏక కంఠంతో స్పందించడంతో ఏదో జరుగుతుందని అభిమానులు అనుమానించడం మొదలుపెట్టారు. కోహ్లి ఏ కారణం లేకుండానే జట్టు నుంచి తప్పుకున్నాడా లేక నిజంగానే ఏదైనా కారణముందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలు పుకార్లు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. కోహ్లికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో అలాగే బీసీసీఐతో విభేదాలు తారా స్థాయికి చేరాయని, అందుకే అతను ఈ మధ్యకాలంలో తరుచూ జట్టుకు దూరంగా ఉంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో కోహ్లి భార్య అనుష్క శర్మ ఆనారోగ్యంతో బాధపడుతుందంటూ నిరాధారమైన పోస్ట్లు పెడుతున్నారు. కోహ్లిపై ఈ విష ప్రచారాన్ని పక్కన పెడితే, అతను లేని లోటు మాత్రం టీమిండియాకు భారీ నష్టాన్ని కల్గిసున్నది కాదనలేని సత్యం. కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్న సమయంలో కోహ్లి జట్టుకు దూరం కావడాన్ని సగటు భారత క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. కోహ్లి జట్టుకు దూరం కావడం కచ్చితంగా టీమిండియా విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజమైన కోహ్లి అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలంటూ పిలుపునిస్తున్నారు. తండ్రి మరణవార్త తెలిసి కూడా బరిలోకి దిగి సెంచరీ బాదిన నిజమైన హీరో తమ కోహ్లి అంటూ కొనియాడుతున్నారు. మొత్తానికి తొలి టెస్ట్కు ముందు కోహ్లికి సంబంధించిన చర్చతో సోషల్మీడియా మొత్తంగా బిజీగా ఉంది. కాగా, భారత సెలెక్టర్లు ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు కోహ్లికి ప్రత్యామ్నాయంగా రజత్ పాటిదార్ను ఎంపిక చేశారు. -
ఆర్సీబీ ఆటగాడికి జాక్పాట్.. కోహ్లికి ప్రత్యామ్నాయంగా ఎంపిక
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రజత్ పాటిదార్ జాక్పాట్ కొట్టాడు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు కోహ్లికి రీప్లేస్మెంట్గా ఎంపికయ్యాడు. ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్పై వరుస సెంచరీలతో (111, 151) విరుచుకుపడిన పాటిదార్ ఎంపిక ముందుగానే ఊహించిందే. 30 ఏళ్ల పాటిదార్ సీనియర్లైన పుజారా, రహానే, యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, రియాన్ పరాగ్ల నుంచి పోటీ ఎదుర్కొన్నప్పటికీ.. అంతిమంగా సెలెక్టర్లు ఈ మధ్యప్రదేశ్ ఆటగాడివైపే మొగ్గు చూపారు. గతేడాది చివర్లో జరిగిన సౌతాఫ్రికా పర్యటనలో వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పాటిదార్.. ఆ సిరీస్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడి 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన పాటిదార్ తాను ప్రాతినిథ్యం వహించిన జట్ల తరఫున ఓపెనర్గా బరిలోకి దిగేవాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్లో అతనికి అవకాశం వస్తే మాత్రం కోహ్లి స్థానమైన నాలుగో ప్లేస్లో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఒకవేళ టీమిండియా మేనేజ్మెంట్ శుభ్మన్ గిల్కు అవకాశం కల్పించాలని భావిస్తే పాటిదార్ బెంచ్కు పరిమితం కాక తప్పదు. ఇలా జరగకపోతే మాత్రం పాటిదార్ టెస్ట్ అరంగేట్రం దాదాపుగా ఖాయమైపోయినట్లే. 2021 సీజన్లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన పాటిదార్.. క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడి సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 404 పరుగులు చేశాడు. కాగా, టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు దూరమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభంకానుంది. తొలి రెండు టెస్ట్ల కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. అందులో పాటిదార్కు చోటు దక్కలేదు. కొద్ది రోజుల కిందట కోహ్లి తొలి రెండు టెస్ట్లకు అందుబాటులో ఉండడని తెలియడంతో సెలెక్టర్లు పాటిదార్ను అతని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్కీపర్), కేఎస్ భరత్ (వికెట్కీపర్), ధృవ్ జురెల్ (వికెట్కీపర్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ -
ఇంగ్లండ్పై వరుస సెంచరీలతో విరుచుకుపడిన ఆర్సీబీ ప్లేయర్
ఓ ప్రాక్టీస్ మ్యాచ్, మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో లయన్స్.. భారత్-ఏ జట్టుతో తలపడుతుంది. పర్యటనలో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ పూర్తి కాగా (డ్రా).. ప్రస్తుతం తొలి అనధికారిక టెస్ట్ జరుగుతుంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏ ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 338 పరుగులు వెనుకపడి ఉంది. వరుస సెంచరీలతో విరుచుకుపడిన పాటిదార్.. ఇంగ్లండ్ లయన్స్తో సిరీస్లో భారత ఏ ఆటగాడు, ఐపీఎల్లో ఆర్సీబీ ప్లేయర్ రజత్ పాటిదార్ వరుస శతకాలతో విరుచుకుపడ్డాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో లయన్స్పై 141 బంతుల్లో 18 ఫోర్లు, సిక్సర్ సాయంతో 111 పరుగులు చేసిన పాటిదార్.. ప్రస్తుతం జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్లో 132 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన విధ్వంసకర శతకం (140) బాదాడు. ఈ మ్యాచ్లో వన్డౌన్లో బరిలోకి దిగిన పాటిదార్.. సహచరులు అభిమన్యు ఈశ్వరన్ (4), సాయి సుదర్శన్(0), సర్ఫరాజ్ ఖాన్ (4), ప్రదోష్ పాల్ (0), శ్రీకర్ భరత్ (15), మానవ్ సుతార్ (0), పుల్కిత్ నారంగ్ (18) విఫలమైనా ఒక్కడే భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. తుషార్ దేశ్పాండే (23) సహకారంతో కష్టాల్లో (95/7) ఉన్న జట్టును ఆదుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. పాటిదార్కు జతగా నవదీప్ సైనీ (3) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్ను 553 పరుగుల వద్ద డిక్లేర్ (8 వికెట్ల నష్టానికి) చేసింది. జెన్నింగ్స్ (154), జోష్ బోహన్నన్ (125) శతకాలతో సత్తా చాటగా.. అలెక్స్ లీస్ (73), మౌస్లీ (68), జాక్ కార్సన్ (53) అర్ధసెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప 2, సైనీ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జనవరి 25 నుంచి మొదలవుతుంది. తొలి రెండు టెస్ట్ల కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. అందులో పాటిదార్కు చోటు దక్కలేదు. తర్వాతి మూడు టెస్ట్ల కోసం ప్రకటించే జట్టులో పాటిదార్ చోటు ఆశిస్తున్నాడు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు భారత జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్కీపర్), కేఎస్ భరత్ (వికెట్కీపర్), ధృవ్ జురెల్ (వికెట్కీపర్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ -
INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్!
India A vs England Lions, 2-day Practice Match: ఇంగ్లండ్ లయన్స్తో ప్రాక్టీస్ మ్యాచ్లో ఓపెనర్ రజత్ పాటిదార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లయన్స్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ శతక్కొట్టాడు. మొత్తంగా 141 బంతులు ఎదుర్కొన్న ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్... 18 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 111 పరుగులు సాధించాడు. సర్ఫరాజ్ సెంచరీ మిస్ పాటిదార్కు తోడు సర్ఫరాజ్ ఖాన్ కూడా రాణించాడు. అయితే, సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి 96 పరుగుల వద్దే నిలిచిపోయాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు భారత్-ఏ, ఇంగ్లండ్-ఏ(లయన్స్) జట్లు అనధికారిక టెస్టు ఆడనున్నాయి. 223 ఇంగ్లండ్ ఆలౌట్ ఇందులో భాగంగా అహ్మదబాద్ వేదికగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో... భారత బౌలర్లు మెరుగ్గా రాణించి 233 పరుగులకే ఇంగ్లండ్ను ఆలౌట్ చేశారు. మానవ్ సుతార్ మూడు, ఆకాశ్ దీప్ రెండు- తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, పులకిత్ నారంగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక భారత ఇన్నింగ్స్లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 32 పరుగులు చేయగా.. రజత్ సెంచరీ(111) సాధించాడు. భరత్, ధ్రువ్ ఫిఫ్టీలు మిగిలిన వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ (96), శ్రీకర్ భరత్(64), ధ్రువ్ జురెల్ (50) అర్ధ శతకాలతో దుమ్ములేపారు. దీంతో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 91ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్-ఏ జట్టు 462 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. ఇక భారత్-ఏ- ఇంగ్లండ్-ఏ జట్ల మధ్య జనవరి 17 నుంచి నాలుగు రోజుల అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. సర్ఫరాజ్ను ఇకనైనా టీమిండియాలోకి? మరోవైపు.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 5 నుంచి ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించి రెండు మ్యాచ్ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, మిగిలిన మ్యాచ్లకు జట్టును ఎంపిక చేసేటపుడైనా సర్ఫరాజ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవాళీ, భారత్- ఏ జట్ల తరఫున ఇంత మంచి ప్రదర్శనలు ఇస్తున్నా అతడిని పక్కనపెట్టడం సరికాదని సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. చదవండి: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
రుతురాజ్ స్థానంలో ఎంట్రీ.. అరంగేట్రంలో ఇలా! అదే హైలైట్
One for future: Rajat Patidar Cameo: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు భారత బ్యాటర్ రజత్ పాటిదార్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయం కావడంతో అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చీ రాగానే మెరుగైన ఇన్నింగ్స్తో తన మార్కు చూపించాడు. కాగా పర్ల్ వేదికగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య గురువారం నిర్ణయాత్మక మూడో వన్డే ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ప్రొటిస్ జట్టు భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఉన్నది కాసేపే అయినా ఈ క్రమంలో రజత్ పాటిదార్.. సాయి సుదర్శన్తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాడు. మొత్తంగా 16 బంతులు ఎదుర్కొని 22 పరుగులు సాధించాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన పాటిదార్.. రెండో ఓవర్ రెండో బంతికే బౌండరీ బాదాడు. అదే ఓవర్లో ఐదో బాల్కు మరో ఫోర్తో అలరించాడు. ఇక ఐదో ఓవర్ మొదటి బంతికి అద్భుత రీతిలో పాటిదార్ సిక్స్ బాదడం హైలైట్గా నిలిచింది. అయితే అదే ఓవర్లో మూడో బంతికి మరో బౌండరీ బాదిన రజత్ పాటిదార్.. ఆ మరుసటి బంతికే బౌల్డ్ అయ్యాడు. ప్రొటిస్ పేసర్ నండ్రే బర్గర్ బౌలింగ్లో బిగ్ షాట్కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. అరంగేట్రంలో మొత్తంగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 22 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో మెరుగైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడంటూ రజత్ పాటిదార్పై ప్రశంసలు కురుస్తున్నాయి. అంతర్జాతీయ టీ20లలో కూడా రజత్కు అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు టీమిండియా అభిమానులు. 30 ఏళ్ల వయసులో అరంగేట్రం మధ్యప్రదేశ్కు చెందిన రైట్హ్యాండ్ బ్యాటర్ రజత్ పాటిదార్. దేశవాళీ క్రికెట్లో గత ఎనిమిదేళ్లుగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా యాభై ఓవర్ల క్రికెట్లో పాటిదార్కు మంచి రికార్డు ఉంది. లిస్ట్- ఏ క్రికెట్లో ఇప్పటి వరకు మొత్తంగా 57 మ్యాచ్లు ఆడిన అతడు రెండు వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. టీ20లలోనూ అతడికి మెరుగైన రికార్డు ఉంది. మధ్యప్రదేశ్ తరఫున 148.55 స్ట్రైక్రేటుతో 1640 పరుగులు సాధించాడు. ఇక పొట్టి క్రికెట్లో అదరగొడుతున్న పాటిదార్ను ఐపీఎల్ వేలం-2021 సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు మొత్తంగా ఆర్సీబీ తరఫున 12 మ్యాచ్లు ఆడిన రజత్ పాటిదార్ 404 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఈ ఏడాది గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చిన పాటిదార్.. ఐపీఎల్2024లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్-2024లో చోటే లక్ష్యంగా ముందుకు సాగనున్నాడు. What a shot from #RajatPatidar for his 1st ODI boundary! Another fearless debutant shows supreme confidence 👏 Tune-in to the 3rd #SAvIND ODI LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/CdtklTD9bs — Star Sports (@StarSportsIndia) December 21, 2023 -
Ind vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. రుతు అవుట్.. రజత్ అరంగేట్రం
Ind vs SA 3rd ODI- Rajat Patidar Makes His Debut: సౌతాఫ్రికా- టీమిండియా మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే పర్ల్ వేదికగా గురువారం మొదలుకానుంది. ఇందులో భాగంగా ఆతిథ్య సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రెండో మ్యాచ్లో ఆడిన జట్టుతోనే తాము బరిలోకి దిగుతున్నట్లుప్రొటిస్ సారథి ఐడెన్ మార్క్రమ్ తెలిపాడు. రజత్ పాటిదార్ అరంగేట్రం మరోవైపు.. తాము రెండు మార్పులతో మైదానంలో దిగనున్నట్లు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. టీమిండియా తరఫున రజత్ పాటిదార్ అరంగేట్రం చేయనున్నాడన్న రాహుల్.. రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయమైన కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలిపాడు. గెలిచి తీరాల్సిందే అదే విధంగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు విశ్రాంతినిచ్చి.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తుదిజట్టుకి ఎంపిక చేసినట్లు రాహుల్ పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-1తో సమం చేసింది. అయితే, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను సొంతం చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే! తొలి వన్డేలో టీమిండియా గెలవగా.. రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. టీమిండియా- సౌతాఫ్రికా మూడో వన్డే తుదిజట్లు ఇవే: సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, లిజాడ్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్. భారత్: సంజూ శాంసన్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్/ వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్. A look at #TeamIndia's Playing XI for the third and final ODI 👌👌 Rajat Patidar is set to make his ODI debut 👏👏 Follow the Match ▶️ https://t.co/nSIIL6gzER#TeamIndia | #SAvIND pic.twitter.com/3qHkp6M32u — BCCI (@BCCI) December 21, 2023 -
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. తిలక్పై వేటు! ఆర్సీబీ ప్లేయర్ అరంగేట్రం
దక్షిణాఫ్రికాతో కీలకమైన మూడో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. పార్ల్ వేదికగా గురువారం జరగనున్న ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత జట్టు కసితో ఉంది. కాగా తొలి మ్యాచ్లో సునాయస విజయాన్ని అందుకున్న రాహుల్ సేన.. రెండో వన్డేలో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమయ్యి ఔటమి పాలైంది. దీంతో సిరీస్ 1-1 సమమైంది. ఈ క్రమంలో ఇరు జట్లకు మూడో వన్డే కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన హైదారాబాదీ తిలక్ వర్మపై వేటు పడే ఛాన్స్ ఉంది. అతడి స్ధానంలో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పటిదార్ వన్డేల్లో అరంగేట్రం చేసే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఈ మ్యాచ్కు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. కుల్దీప్ స్ధానంలో మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశముంది. తుది జట్లు(అంచనా) దక్షిణాఫ్రికా: రిజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్ భారత్:రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజిత్ పాటిదార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ -
RCB కి ఊహించని షాక్... స్టార్ బ్యాటర్ అవుట్
-
IPL 2023: ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ దూరం
ఐపీఎల్-2023 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు రజత్ పటిదార్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ వేదికగా వెల్లడించింది.మడమ గాయంతో బాధపడుతున్న పాటిదార్.. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు రెండు నెలలసమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. "దురదృష్టవశాత్తూ కాలి మడమ గాయం కారణంగా రజత్ పాటిదార్ ఐపీఎల్-2023 నుంచి తప్పుకున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. రజత్కు మేము ఎల్లప్పుడూ మద్దతునిస్తూనే ఉంటాము. ఇక పాటిదార్ స్థానంలో ఎవరని తీసుకోవాలన్నది కోచ్, మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయించలేదు అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. కాగా గతేడాది జరిగిన మెగావేలంలో అన్సోల్డ్గా మిగిలిన పాటిదార్ను అనూహ్యంగా ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. అయితే తనకు వచ్చి అవకాశాన్ని పాటిదార్ అందిపుచ్చుకున్నాడు. గతేడాది ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై అద్భుతమైన సెంచరీ బాదాడు. గతేడాది సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన పాటిదార్.. 333 పరుగులు సాధించాడు. ఇక ఇప్పటికే ఆర్సీబీకి ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ దూరం కాగా.. ఇప్పుడు పాటిదార్ దూరం కావడం మేనేజ్మెంట్ను మరింత కలవరపెడుతోంది. చదవండి: IPL 2023: 'అదే మా కొంపముంచింది.. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి' Unfortunately, Rajat Patidar has been ruled out of #IPL2023 due to an Achilles Heel injury. 💔 We wish Rajat a speedy recovery and will continue to support him during the process. 💪 The coaches and management have decided not to name a replacement player for Rajat just yet. 🗒️ pic.twitter.com/c76d2u70SY — Royal Challengers Bangalore (@RCBTweets) April 4, 2023 -
ఆర్సీబీ గుండె బద్దలయ్యే వార్త.. గాయాల కారణంగా ఇద్దరు స్టార్లు ఔట్..!
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుండె బద్దలయ్యే లాంటి వార్త తెలిసింది. గత సీజన్లో సత్తా చాటిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ సీజన్కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్, ఆసీస్ స్టార్ పేసర్, ఆర్సీబీ కీ బౌలర్ అయిన జోష్ హాజిల్వుడ్ మడమ సమస్య కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యే ప్రమాదముండగా.. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ సైతం మడమ గాయం కారణంగానే సీజన్ ఆరంభ మ్యాచ్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగా ఇటీవలే భారత్తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్ల్లో కూడా పాల్గొనని హాజిల్వుడ్.. గాయం నుంచి వేగంగా కోలుకుని కనీసం సీజన్ సెకెండ్ లెగ్ మ్యాచ్లకైనా అందుబాటులో ఉండాలని భావిస్తున్నాడు. ఒకవేళ హాజిల్వుడ్ సీజన్ మొత్తానికే దూరమైతే, ఆర్సీబీకి ఇది భారీ ఎదురుదెబ్బగా పరిగణించాలి. 2022 మెగా వేలంలో హాజిల్వుడ్ను ఆర్సీబీ రూ. 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. మరోవైపు, గత సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై సెంచరీ బాదిన ఆర్సీబీ హీరో రజత్ పాటిదార్.. గాయం కారణంగా ప్రస్తుతం ఎన్సీఏలోని రిహాబ్లో చికిత్స పొందుతున్నాడు. 2023 ఆర్సీబీ ట్రయినింగ్ క్యాంప్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు గాయం బారిన పడ్డ పాటిదార్.. సీజన్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎన్సీఏ అధికారులు అతన్ని తదుపరి మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఎంఆర్ఐ స్కాన్ అనంతరం పాటిదార్ పరిస్థితిని మరోసారి సమీక్షించి, అతను ఐపీఎల్-2023 సెకెండ్ లెగ్లో పాల్గొనేది లేనిది తేలుస్తామని ఎన్సీఏ అధికారులు తెలిపారు. హాజిల్వుడ్, పాటిదార్లతో పాటు మరో స్టార్ ఆటగాడు మ్యాక్స్వెల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. మ్యాక్సీ కూడా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఇదే నిజమైతే, త్వరలో ప్రారంభమయ్యే సీజన్లోనూ ఆర్సీబీ వైఫల్యాల పరంపర కొనసాగే అవకాశం ఉంది. కాగా, ఏప్రిల్ 2న చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్తో ఆర్సీబీ క్యాంపెయిన్ ప్రారంభం కానుంది. -
అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు: రోహిత్
India vs New Zealand ODI Series: ఏ ఆటగాడికైనా తన సొంతమైదానంలో అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం వస్తే ఆ అనుభూతే వేరు. సొంత ప్రేక్షకుల నడుమ టీమిండియా క్యాప్ అందుకుంటే ఆ జ్ఞాపకం జీవితాంతం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. ఒక్కోసారి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయనిపించినా.. దురదృష్టం వెక్కిరిస్తే.. భంగపడకతప్పదు. మధ్యప్రదేశ్ క్రికెటర్ రజత్ పాటిదార్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్లో ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్ సేన ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నామమాత్రపు మూడో వన్డే ఇండోర్ వేదికగా జరిగింది. పాపం రజత్ ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసిన రజత్కు ఆఖరి మ్యాచ్లో అవకాశం వస్తుందని అభిమానులు భావించారు. అయితే, ఈ ఇండోర్ బ్యాటర్కు మాత్రం మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు రజత్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇషాన్ కూడా అలా అంటే.. ఇందుకు బదులుగా.. ‘‘నిజమే.. మేము అతడిని ఇండోర్ మ్యాచ్లో ఆడించాల్సింది. మరి.. ఇషాన్ కూడా నాది రాంచి కదా.. నన్ను రాంచి మ్యాచ్లో ఆడనివ్వండి అంటాడు. అందరూ అలాగే అంటే కుదరదు కదా! మాకంటూ కొన్ని ప్రణాళికలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే జట్టు కూర్పు ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. చాలా మంది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికి ఛాన్స్ ఇస్తామనే చెబుతాం. అయితే, అందుకు పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా’’ అని హిట్మ్యాన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. క్లీన్స్వీప్ కాగా చివరి వన్డేలో 90 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే.. ఇండోర్లో జన్మించిన రజత్ పాటిదార్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 29 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ పలుమార్లు జట్టుకు ఎంపికైనా తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. చదవండి: Shardul Thakur: ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు ఖాయం! అంతలేదు.. హార్దిక్ ఉండగా.. ICC T20 World Cup: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్తో పోరుకు సై -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. కీలక ఆటగాడు ఔట్
స్వదేశంలో రేపటి నుంచి (జనవరి 18) న్యూజిలాండ్తో ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వెన్నెముక గాయం కారణంగా స్టార్ మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కొద్ది సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. శ్రేయస్ స్థానాన్ని రజత్ పాటిదార్తో భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ను నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపింది. కాగా, ఇటీవలి కాలంలో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా లంకతో జరిగిన వన్డే సిరీస్ మినహా అంతకుముందు అతనాడిన అన్ని సిరీస్ల్లో అంచనాల మేరకు రాణించాడు. ఇప్పటివరకు 7 టెస్ట్లు, 40 వన్డేలు, 49 టీ20లు ఆడిన శ్రేయస్.. 3 సెంచరీలు, 26 అర్ధసెంచరీల సాయంతో 3232 పరుగులు చేశాడు. మరోవైపు శ్రేయస్ స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన పాటిదార్కు ఇప్పటివరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు టీమిండియా (అప్డేటెడ్).. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, చహల్ -
శతకాల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా నిన్న (జనవరి 3) మొదలైన గ్రూప్ మ్యాచ్ల్లో ఇవాళ (రెండో రోజు) కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు సెంచరీలతో రెచ్చిపోయారు. త్రిపురతో జరుగుతున్న మ్యాచ్లో చండీఘర్ ఆటగాడు మనన్ వోహ్రా (200) ద్విశతకంతో విజృంభించగా, అదే జట్టు ఆటగాడు కునల్ మహాజన్ (162) అజేయమైన శతకంతో చెలరేగాడు. ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్లో నాగాలాండ్ ఆటగాడు చేతన్ బిస్త్ (129) సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (165) శతకంతో అలరించాడు. మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాడు అనుప్ అహ్లావత్ (123).. అంతకుముందు మేఘాలయ ఆటగాళ్లు కిషన్ (128), పునిత్ బిస్త్ (215), తారిఖ్ సిద్దిఖీ (102 నాటౌట్) శతకాల మోత మోగించారు. విదర్భతో జరుగుతన్న మ్యాచ్లో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ (121) సెంచరీ సాధించాడు. జమ్మూ అండ్ కశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో రైల్వేస్ ఆటగాడు మహ్మద్ సైఫ్ (233) ద్విశతకంతో రెచ్చిపోయాడు. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు నెహాల్ వధేరా (123) సెంచరీ సాధించాడు. జార్ఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ ఆటగాడు కరణ్ లాంబా (122) అజేయ శతకంతో రాణించాడు. గోవాతో జరుగుతున్న మ్యాచ్లో కేరళ ఆటగాడు ఆర్ ప్రేమ్ (112) సెంచరీ సాధించాడు. బరోడా-హిమాచల్ ప్రదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో బరోడా కెప్టెన్ విక్రమ్ సోలంకి (178), హిమాచల్ ఆటగాడు ప్రశాంత్ చోప్రా (111) శతకాలు సాధించారు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్లో మహారాష్ట్ర ఆటగాడు కేధార్ జాదవ్ (142 నాటౌట్) శతకొట్టాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో సౌరాష్ట్ర ఆటగాళ్లు హార్విక్ దేశాయ్ (107), అర్పిత్ వసవద (127 నాటౌట్) సెంచరీలు సాధించారు. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (162) శతకొట్టాడు. చత్తీస్ఘడ్-కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత చత్తీస్ఘడ్ ఆటగాడు అశుతోష్ (135), ఆతర్వాత కర్ణాటక కెప్టెన్ మయాంక్ ఆగర్వాల్ (102 నాటౌట్) సెంచరీలతో రాణించారు. పుదుచ్ఛేరితో జరుగుతున్న మ్యాచ్లో సర్వీసెస్ ఆటగాళ్లు గెహ్లౌత్ రాహుల్ సింగ్ (137), రజత్ పలివాల్ (101) శతకాలతో రాణించారు. -
10 వికెట్లతో చెలరేగిన చైనామన్ స్పిన్నర్.. కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్
Madhya Pradesh vs Chandigarh: చండీఘడ్తో మ్యాచ్లో మధ్యప్రదేశ్ కెప్టెన్ కుమార్ కార్తికేయ అదరగొట్టాడు. ఏకంగా పది వికెట్లు కూల్చి జట్టుకు భారీ విజయం అందించాడు. కార్తికేయ అద్భుత ప్రదర్శనతో చండీఘడ్పై మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ మీద 125 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్ డిలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య ఇండోర్ వేదికగా డిసెంబరు 20న టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన మధ్యప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశ్ దూబే(44) ఫర్వాలేదనిపించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రజత్ పాటిదార్ 88 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో అక్షత్ రఘువంశీ 77 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో 309 పరుగులకు మధ్యప్రదేశ్ ఆలౌట్ అయింది. విలవిల్లాడిన చండీఘడ్ ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన చండీఘడ్కు మధ్యప్రదేశ్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. ఓపెనర్ అర్స్లాన్ ఖాన్ 34 పరుగులు చేయగా.. మిగతా ఆటగాళ్ల స్కోర్లు వరుసగా 1, 0, 1, 0, 4, 0, 1, 11(నాటౌట్), 0, 0. చైనామన్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ 6 వికెట్లు కూల్చగా.. సారాంశ్ జైన్, ఆవేశ్ ఖాన్ తలా ఒక వికెట్ తీయగా.. అనుభవ్ అగర్వాల్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా బౌలర్లు చెలరేగడంతో చండీఘడ్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. 57 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారీ ఆధిక్యంలో ఉన్న మధ్యప్రదేశ్.. చండీఘడ్ను ఫాలో ఆన్ ఆడించగా 127 పరుగులకే కథ ముగిసిపోయింది. ఈసారి సారాంశ్ జైన్ 5 వికెట్లు పడగొట్టగా.. కుమార్ కార్తికేయ 4 వికెట్లు తీశాడు. ఆవేశ్కు ఒక వికెట్ దక్కింది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో 10 వికెట్లతో చెలరేగిన కుమార్ కార్తికేయ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: Ind VS Ban 2nd Test: టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్ను తప్పించి.. 12 ఏళ్ల తర్వాత.. Tymal Mills: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్.. లీగ్ నుంచి వైదొలిగిన క్రికెటర్ తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్! -
Ind Vs Ban: ఫిట్గా పంత్! సంజూకు నో ఛాన్స్! రజత్పై వాళ్లకెందుకంత ప్రేమ?
India’s Tour of Bangladesh 2022: బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టుపై న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభావంతుడైన సంజూ శాంసన్ను కాదని రజత్ పాటిదార్ను ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రజత్పై ఉన్న ప్రేమ సంజూకు శాపంగా మారిందన్నట్లుగా వ్యాఖ్యానించాడు. ఈ కేరళ బ్యాటర్ను వాళ్లు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం అంటూ బీసీసీఐ సెలక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. కాగా గత కాలంగా వార్తల్లో నిలుస్తున్న పేరు సంజూ శాంసన్. ప్రతిభను నిరూపించుకుంటున్నప్పటికీ అతడికి అదృష్టం కలిసిరావడం లేదు. టీమిండియాలో అడపాదడపా తప్ప పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఐపీఎల్లో రాణించాడు... ఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్గా, బ్యాటర్గా ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు సంజూ. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2022 జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఈ మెగా టోర్నీ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన జట్టుకు ఎంపికైనప్పటికీ టీ20 సిరీస్లో తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ టూర్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన రిషభ్ పంత్ విఫలమైనప్పటికీ అతడినే టీ20 సహా వన్డే సిరీస్లలో కొనసాగించారు. ఇక మొదటి వన్డేలో సంజూ ఆకట్టుకున్పటికీ మిగతా మ్యాచ్లలో బెంచ్కే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరును ఎండగడుతూ సంజూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. సంజూను పక్కనపెట్టి.. రజత్కు ఎందుకు అవకాశం? ఇదిలా ఉంటే.. కివీస్ టూర్ ముగిసిన వెంటనే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టులో వన్డే, టెస్టు సిరీస్ ఆడనుంది. ఇక టూర్కు సంజూ శాంసన్ను పక్కనపెట్టిన సెలక్టర్లు.. మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్కు భారత జట్టులో అవకాశం ఇచ్చారు. దక్షిణాఫ్రికాతో సిరీస్కు ఎంపికైనప్పటికీ అరంగేట్రం చేయలేకపోయిన పాటిదార్ ఈసారి మాత్రం తుది జట్టులో ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్ జట్టులో కీలక ఆటగాడైన రజత్ ఐపీఎల్-2022లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో 49 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ ఫిట్గానే ఉన్నాడు! సంజూకు నో ఛాన్స్ మరోవైపు.. న్యూజిలాండ్తో సిరీస్ సందర్భంగా రిషభ్ పంత్ గాయపడ్డాడని, అతడి స్థానంలో సంజూని తీసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు టెస్టుల్లో కూడా అరంగేట్రం చేయిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, అలా జరుగలేదు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయపడ్డ కారణంగా అతడి స్థానంలో యువ ఫాస్ట్బౌలర్ ఉమ్రాన్ మాలిక్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ శనివారం వెల్లడించింది. ఆదివారం (డిసెంబరు 4) తొలి వన్డే ఆరంభం నేపథ్యంలో ఈ మేరకు అప్డేట్ ఇచ్చింది. కానీ, అంతా ఊహించినట్లుగా సంజూకు జట్టులో స్థానం దక్కలేదు. పంత్ ఫిట్గా ఉన్నట్లు శనివారం నాటి ప్రకటనతో అర్థమైంది. దీంతో సంజూ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రజత్పై ప్రేమ ఉంటే తప్పులేదు.. కానీ ఈ నేపథ్యంలో కివీస్ మాజీ ప్లేయర్ సైమన్ డౌల్ క్రిక్బజ్తో మాట్లాడుతూ సంజూ గురించి ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు.. ‘‘వాళ్లకి రజత్ పాటిదార్ మీద ఎంతో ప్రేమ ఉందని నాకు తెలుసు. అతడిని వాళ్లు ఇష్టపడటంలోనూ తప్పులేదు. అయితే, భారత జట్టులో చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఈసారి అతడిని కాదని వాళ్లు రజత్ పాటిదార్ను ఎందుకు తీసుకున్నట్లు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు’’ అని ఈ మాజీ పేసర్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: Pak Vs Eng 1st Test: ఇంగ్లండ్కు ధీటుగా బదులిస్తున్న పాక్.. వాళ్లు 4 శతకాలు బాదితే, వీళ్లు 3 కొట్టారు Shikhar Dhawan: పంత్కు అండగా నిలబడాలి... సంజూ ఇంకొంత కాలం ఆగాల్సిందే.. ఎందుకంటే! -
దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. రుత్రాజ్కు నో ఛాన్స్! పటిదార్ అరంగేట్రం!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను టీమిండియా ఓటమితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రోటీస్తో తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్.. ఇప్పుడు రెండో వన్డేలో తలపడేందకు సిద్దమైంది. రాంఛీ వేదికగా ఆక్టోబర్9 భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో ఏలగైనా విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని ధావన్ సేన భావిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం ఈ మ్యాచ్లో కూడా తొలి వన్డే జోరును కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలి అని అనుకుంటుంది. ప్రస్తుతం మూడు సిరీస్లో ప్రోటీస్ జట్టు 1-0తో ముందంజలో ఉంది. ఇక ఇప్పటికే రాంఛీకి చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో ఓ మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డేలో విఫలమైన రుత్రాజ్ గైక్వాడ్ స్థానంలో యువ ఆటగాడు రజిత్ పటిదార్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. లక్నో వేదికగా జరిగిన మొదటి వన్డేలో 42 బంతులు ఎదర్కొన్న రుత్రాజ్ కేవలం 19 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. మరో వైపు దక్షిణాఫ్రికా మాత్రం తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే రెండో వన్డేలో కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రజిత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ చదవండి: T20 World Cup 2022: టీ20 క్రికెట్ చరిత్రలో.. ఆఫ్గానిస్తాన్- ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ -
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే .. రజత్ పటిదార్ అరంగేట్రం! భారత జట్టు ఇదే!
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్పై కన్నేసింది. లక్నో వేదికగా ఆక్టోబర్6న తొలి వన్డేలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుండడంతో.. భారత ద్వితీయ శ్రేణి జట్టు ఈ సిరీస్లో తలపడనుంది. ఈ జట్టుకు భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా రజిత్ పాటిదార్, ముఖేష్ కుమార్కు తొలి సారిగా టీమిండియాలో చోటు దక్కింది. ఓపెనర్లగా ధావన్, శుబ్మన్ గిల్ తొలి వన్డేలో ఓపెనర్లగా ధావన్, శుబ్మాన్ గిల్ రానున్నారు. గిల్ ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. విండీస్, జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో అదరగొట్టాడు. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 9 వన్డేలు ఆడిన గిల్.. 499 పరుగులు సాధించాడు. ఇక ధావన్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ధావన్ ఆడిన అఖరి ఆరు వన్డేల్లో 322 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠికి చోటు దక్కే అవకాశం కన్పిస్తుంది. మరోవైపు రజిత్ పాటిదార్ భారత్ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఆల్ రౌండర్ల కోటాలో షబాజ్ ఆహ్మద్, శార్థూల్ ఠాకూర్కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇక చివరగా మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్కు బౌలర్ల కోటాలో ఎంపికయ్యే అవకాశం కన్పిస్తోంది. తొలి వన్డేకు భారత జట్టు (అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజిత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్ (వికెట్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్ చదవండి: T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్ టైటిల్ రేసులో ఆ మూడు జట్లే నిలుస్తాయి' -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! కెప్టెన్గా ధావన్
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు రోహిత్ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు వెళ్లనుండడంతో.. ఈ సిరీస్కు ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా యువ ఆటగాళ్లు రజిత్ పటిదార్, ముఖేష్ కుమార్కు తొలి సారి భారత జట్టులో చోటు దక్కింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇక దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే ఆక్టోబర్ 6న లక్నో వేదికగా జరగనుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్ , అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్. Shikhar Dhawan (C), Shreyas Iyer (VC), Ruturaj Gaikwad, Shubhman Gill, Rajat Patidar, Rahul Tripathi, Ishan Kishan (WK), Sanju Samson (WK), Shahbaz Ahmed, Shardul Thakur, Kuldeep Yadav, Ravi Bishnoi, Mukesh Kumar, Avesh Khan, Mohd. Siraj, Deepak Chahar.#TeamIndia | #INDvSA — BCCI (@BCCI) October 2, 2022 -
ఐదేసిన సౌరభ్ కుమార్.. న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-ఏతో జరిగిన మూడో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత్-ఏ జట్టు ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆటలో స్పిన్నర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో (5/103) చెలరేగడంతో టీమిండియా 113 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ అద్భుతమైన పోరాటం కనబర్చి 302 పరుగుల వద్ద ఆలౌటైంది. కివీస్ బ్యాటర్ జో కార్టర్ (230 బంతుల్లో 111; 12 ఫోర్లు, సిక్స్) అద్భుతమై శతకంతో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేయగా.. డీన్ క్లీవర్ (60 బంతుల్లో 44; 9 ఫోర్లు), మార్క్ చాప్మన్ (61 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) తమ వంతు ప్రయత్నం చేశారు. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ (2/48), ఉమ్రాన్ మాలిక్ (1/62), శార్ధూల్ ఠాకూర్ (1/44), ముకేశ్ కుమార్ (1/39) రాణించారు. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు డ్రా కాగా, ఈ మ్యాచ్లో భారత్ గెలుపొందింది. ఈ సిరీస్ తర్వాత భారత్ ఇదే జట్టుతో మూడు అనధికారిక వన్డే మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మ్యాచ్లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. స్కోర్ వివరాలు.. భారత్-ఏ తొలి ఇన్నింగ్స్: 293 ఆలౌట్ (రుతురాజ్ గైక్వాడ్ 108, ఉపేంద్ర యాదవ్ 76; మ్యాథ్యూ ఫిషర్ 4/52) న్యూజిలాండ్-ఏ తొలి ఇన్నింగ్స్: 237 ఆలౌట్ (మార్క్ చాప్మన్ 92, సోలియా 54; సౌరభ్ కుమార్ 4/48, రాహుల్ చాహర్ 3/53) భారత్-ఏ రెండో ఇన్నింగ్స్: 359/7 డిక్లేర్ (రజత్ పాటిదార్ 109, రుతురాజ్ 94, ప్రియాంక్ పంచల్ 62; రచిన్ రవీంద్ర 3/65) న్యూజిలాండ్-ఏ రెండో ఇన్నింగ్స్: 302 ఆలౌట్ (జో కార్టర్ 111, మార్క్ చాప్మన్ 45; సౌరభ్ కుమార్ 5/103) -
రజత్ పాటిదార్ అజేయ శతకం.. కివీస్ ముందు భారీ టార్గెట్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న మూడో అనధికర టెస్ట్లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. రజత్ పాటిదార్ (135 బంతుల్లో 109 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో, రుతురాజ్ (164 బంతుల్లో 94; 11 ఫోర్లు), కెప్టెన్ ప్రియాంక్ పంచల్ (114 బంతుల్లో 62; 6 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించడంతో టీమిండియా కివీస్కు 406 పరుగుల భారీ టార్గెట్ను నిర్ధేశించింది. భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన కివీస్ (రచిన్ రవీంద్ర (12)).. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. కివీస్ గెలవాలంటే మ్యాచ్ ఆఖరి రోజు (నాలుగో రోజు) మరో 396 పరుగులు చేయాల్సి ఉంది. మూడో రోజు ఆటలో పాటిదార్, రుతురాజ్, పంచల్ చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ను 357 పరుగుల (7 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసింది. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 3 వికెట్లు, జో వాకర్ 2, సోలియా, కెప్టెన్ టామ్ బ్రూస్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ఆటగాళ్లు చాప్మన్ (92), సోలియా (54) అర్ధ సెంచరీలతో రాణించడంతో కివీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో సౌరభ్ కుమార్ 4, రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ 2, శార్ధూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 293 పరుగులకు ఆలౌటైంది. రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో (127 బంతుల్లో 108; 12 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగగా, వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ (76) అర్ధసెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో మాథ్యూ ఫిషర్ 4, జో వాకర్, జాకబ్ డఫీ తలో రెండు వికెట్లు, సోలియా, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇదివరకే జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కివీస్-ఏ భారత్-ఏ జట్ల మధ్య మూడు అనధికార వన్డే మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో ఈ మూడు మ్యాచ్లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. -
అపూర్వ విజయం.. అద్భుతంగా సాగిన మధ్య ప్రదేశ్ గెలుపు ప్రస్థానం
ఏప్రిల్ 1999... ఇదే బెంగళూరు, ఇదే చిన్నస్వామి స్టేడియం... కర్ణాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్కు 75 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు ఆలౌట్ కాకుండా జాగ్రత్తగా ఆడుకుంటే టైటిల్ దక్కేది. కానీ అనూహ్యంగా కుప్పకూలిన మధ్యప్రదేశ్ మ్యాచ్ మరో 5.1 ఓవర్లు మిగిలి ఉండగా ఆలౌటైంది. అయితే ఈ సారి ఆ జట్టు ఎలాంటి తప్పూ చేయలేదు. భారీ ఆధిక్యాన్ని సాధించిన తర్వాత కూడా పట్టు జారకుండా చూసుకుంది. తొలిసారి రంజీ చాంపియన్గా నిలిచింది. నాడు కెప్టెన్గా ఓటమి వేదన అనుభవించిన చంద్రకాంత్ పండిత్ 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే మధ్యప్రదేశ్ కోచ్గా విజయానందాన్ని ప్రదర్శించాడు! సీజన్ తొలి మ్యాచ్ నుంచి విజేతగా నిలిచే వరకు ఆటగాళ్ల చక్కటి ప్రదర్శనతో పాటు కోచ్గా చంద్రకాంత్ దూరదృష్టి, వ్యూహాలు టీమ్ను ముందుకు నడిపించాయి. నరేంద్ర హిర్వాణీ, రాజేశ్ చౌహాన్, అమయ్ ఖురాసియా, నమన్ ఓజా, దేవేంద్ర బుందేలా, జలజ్ సక్సేనా... సుదీర్ఘ కాలం పాటు మధ్యప్రదేశ్ జట్టుకు ఆడి తమ సర్వస్వం ధారబోసినా రంజీ టైటిల్ విజయాన్ని మాత్రం వారంతా రుచి చూడలేకపోయారు. జట్టును ఈ స్థాయికి చేర్చడంలో ఇన్నేళ్లలో వీరంతా కీలక పాత్ర పోషించారు. వారంతా గర్వపడే క్షణమిది. తాజా సీజన్లో ముగ్గురు బ్యాటర్లు ప్రధానంగా జట్టు భారాన్ని మోశారు. ఐపీఎల్ ప్రదర్శన గాలివాటం కాదని నిరూపిస్తూ రజత్ పటిదార్ (మొత్తం 658 పరుగులు) అందరికంటే ముందుండగా... యశ్ దూబే (614), శుభమ్ శర్మ (608) దేశవాళీ క్రికెట్లో ఇప్పుడు తమపై దృష్టి పడేలా చేసుకున్నారు. హిమాన్షు మంత్రి (375) కీలక సమయాల్లో రాణించగా, కోచ్ నమ్మకముంచిన 18 ఏళ్ల అక్షత్ రఘువంశీ 6 ఇన్నింగ్స్లలోనే 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో 295 పరుగులు చేయడం విశేషం. బౌలింగ్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (32 వికెట్లు), పేసర్ గౌరవ్ యాదవ్ (23 వికెట్లు) ఆరంభంలోనే వికెట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు. విడిగా చూస్తే ఏ ఒక్కరూ అసాధారణ ఆటగాళ్లు కాదు. కానీ జట్టుగా, సమష్టిగా వీరంతా సత్తా చాటడంతో మధ్యప్రదేశ్ టీమ్ కల నెరవేరింది. భారత జట్టుకు ఎంపిక కావడంతో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ టీమ్కు దూరమైనా ఆ ప్రభావం పడకుండా కుర్రాళ్లు చూసుకోగలిగారు. మైదానంలో జట్టులో స్ఫూర్తి నింపడంలో కెప్టెన్ ఆదిత్య శ్రీవాస్తవది కూడా కీలక పాత్ర. ‘నేను ఒక ప్లేయర్ను చెంపదెబ్బ కొట్టినా దానికో కారణం ఉంటుంది. ఆటగాడు కూడా అర్థం చేసుకుంటాడు. ఇది నా కోచింగ్ శైలి’ అంటూ చంద్రకాంత్ పండిత్ చెప్పుకున్నారు. టైమ్ మేనేజ్మెంట్, ప్రణాళికలు, సన్నద్ధత విషయంలో ఆయన ఇచ్చిన ‘బ్లూ ప్రింట్’ను జట్టు సభ్యులు సమర్థంగా అమలు చేశారు. వికెట్ కీపర్గా భారత్ తరఫున 5 టెస్టులు, 36 వన్డేలు ఆడిన పండిత్ కోచింగ్ రికార్డు అద్భుతం. ముంబై చివరిసారి విజేతగా నిలిచిన 2015–16 సీజన్లో ఆయన ఆ టీమ్కు కోచ్గా ఉన్నారు. రంజీ దిగ్గజ జట్టే కాదు ఎలాంటి టీమ్నైనా నేను నడిపించగలను అన్నట్లుగా చాలెంజ్ చేస్తూ విదర్భ టీమ్కు పండిత్ వెళ్లారు. అప్పటి వరకు దిగువ స్థాయికే పరిమితమవుతూ గుర్తింపే లేని విదర్భ కూడా ఆయన మార్గనిర్దేశనంలో తొలి టైటిల్ సాధించడంతో పాటు తర్వాతి ఏడాది దానిని నిలబెట్టుకోవడం విశేషం. ఇప్పుడు కూడా అదే తరహాలో తొలి ప్రయత్నంలోనే జట్టును విజేతగా నిలపగలిగారు. తాజా గెలుపుతో మున్ముందు భారత దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ మరింతగా దూసుకుపోవడం ఖాయం. చదవండి: Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ 2022లో అదరగొట్టిన హీరోలు వీళ్లే..! -
కొత్త చరిత్ర ఆవిష్కృతం.. రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్
రంజీ ట్రోఫీ 2021-22 సీజన్ విజేతగా మధ్యప్రదేశ్ నిలిచింది. ముంబైతో జరిగిన ఫైనల్లో మధ్యప్రదేశ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి రంజీ చాంపియన్గా అవతరించింది. 1998-99 రంజీ సీజన్లో రన్నరప్గా నిలిచిన మధ్యప్రదేశ్ ఈసారి మాత్రం అవకాశం చేజారనివ్వలేదు. ముంబైతో జరిగిన ఫైనల్ పోరులో ఆధ్యంతం అధిపత్యం చెలాయిస్తూ విజేతగా నిలిచింది. 113/2 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన ముంబై 269 పరుగులకు ఆలౌటైంది. సువేద్ పార్కర్ 51 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సర్ఫరాజ్ ఖాన్ 45, పృథ్వీ షా 44 పరుగులు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్ కుమార్ కార్తికేయ నాలుగు వికెట్లతో చెలరేగగా.. గౌరవ్ యాదవ్, పార్థ్ సహాని చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 108 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన మధ్యప్రదేశ్ వన్డే తరహా ఆటతీరును ప్రదర్శించింది. హిమాన్షు మాంత్రి 37 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు శుభమ్ శర్మ 30, రజత్ పాటిధార్ 30 పరుగులు నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏 Madhya Pradesh beat Mumbai by 6 wickets & clinch their maiden #RanjiTrophy title👍 👍 @Paytm | #Final | #MPvMUM Scorecard ▶️ https://t.co/xwAZ13D0nP pic.twitter.com/XrSp2YzwSu — BCCI Domestic (@BCCIdomestic) June 26, 2022 Chandu bhai, tumhaala maanla 🙌🏽 1st Mumbai, then Vidarbha, and now MP, it's incredible! Best coach when it comes to winning trophies 🏆 Many congratulations to skipper Aditya Shrivastava, MP team, and support staff 👏🏽👏🏽 #RanjiTrophyFinal pic.twitter.com/BqR1gGXtDW — Wasim Jaffer (@WasimJaffer14) June 26, 2022 Congratulations Madhya Pradesh on winning the #RanjiTrophy2022! We've witnessed some terrific performances throughout the season. Great efforts by everyone @BCCI for ensuring another successful Ranji season amidst the pandemic. pic.twitter.com/qMxmvUNYZf — Jay Shah (@JayShah) June 26, 2022 చదవండి: రోహిత్ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్ కాదనుకుంటే రహానే? -
Ranji Trophy 2022: చరిత్ర సృష్టించనున్న మధ్యప్రదేశ్..!
మధ్యప్రదేశ్ రంజీ జట్టు చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరంలో ఉంది. ఫైనల్లో ముంబైపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (162 పరుగులు) సాధించడం ద్వారా ఆ జట్టు తొలి రంజీ టైటిల్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. రజత్ పాటిదార్ (219 బంతుల్లో 122; 20 ఫోర్లు) సూపర్ శతకంతో మధ్యప్రదేశ్ విజయానికి బాటలు వేశాడు. నాలుగో రోజు ఆటలో పాటిదార్ ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని తన జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. కాగా, రంజీల్లో మ్యాచ్ ఫలితం తేలని పక్షంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. 368 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన మధ్యప్రదేశ్ మరో 7 పరుగులు చేసి లీడ్ను సాధించి 536 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ముంబై ఇంకా 49 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 374 పరుగులకే ఆలౌటైన విషయం విధితమే. ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీ చరిత్రలో మధ్యప్రదేశ్ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. 1998-99 సీజన్లో ఆ జట్టు తొలిసారి ఫైనల్కు చేరింది. ఆ సీజన్ ఫైనల్లో కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించినప్పటికీ.. ఆఖరి రోజు ఆఖరి సెషన్లో అనూహ్యంగా కుప్పకూలి ఓటమిపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక, ప్రస్తుత సీజన్ ఫైనల్ విషయానికొస్తే ఏదో అద్భుతం జరిగితే తప్ప ముంబైకు విజయావకాశాలు లేవు. ముంబై చివరిరోజు ఆటలో మధ్యప్రదేశ్కు టార్గెట్ సెట్ చేసి ఆ జట్టును ఆలౌట్ చేయగలిగితేనే టైటిల్ సాధించే అవకాశం ఉంటుంది. చదవండి: Ranji Trophy Final: వారెవ్వా.. రజత్ పాటిదార్.. సూపర్ సెంచరీ! ఇక -
Ranji Trophy Final: వారెవ్వా.. రజత్ పాటిదార్.. సూపర్ సెంచరీ! ఇక
Ranji Trophy Final 2021-2022 Mumbai Vs MP- Rajat Patidar: రంజీ ట్రోఫీ 2021- 2022 సీజన్లో భాగంగా ముంబైతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ అదరగొట్టాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో నాలుగో రోజు ఆటలో సెంచరీతో మెరిశాడు. భోజన విరామ సమయానికి 195 బంతులు ఎదుర్కొన్న అతడు 120 పరుగులు సాధించాడు. అంతకు ముందు ముంబై బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్ 134 పరుగులతో రాణించాడు. ఇక యశస్వి జైశ్వాల్ అర్ధ శతకం సాధించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో 374 పరుగుల వద్ద ముంబై తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన మధ్యప్రదేశ్ జట్టుకు ఓపెనర్ యశ్ దూబే శుభారంభం అందించాడు. 336 బంతులు ఎదుర్కొన్న అతడు ఎంతో ఓపికగా క్రీజులో నిలబడి 133 పరుగులు చేశాడు. ముగ్గురు మొనగాళ్లు ఇక ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన శుభమ్ శర్మ 116 పరుగులు చేయగా.. ఆదిత్య శ్రీవాస్తవ 25, అక్షత్ రఘువంశి 9, పార్థ్ సహాని 11 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ నేపథ్యంలో రజత్ పాటిదార్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి సరన్ జైన్ అతడికి తోడుగా క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో యశ్ దూబే, శుభమ్, రజత్ సెంచరీలతో నాలుగో రోజు ఆట భోజన విరామానికి ముందు మధ్యప్రదేశ్ 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ముంబైపై 101 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన రజత్ పాటిదార్.. 7 ఇన్నింగ్స్ ఆడి 333 పరుగులు చేశాడు. ప్లే ఆఫ్స్ చేరే క్రమంలో అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక రంజీల్లోనూ అతడు అదరగొడుతున్న నేపథ్యంలో త్వరలోనే రజత్కు టీమిండియాలో ఆడే అవకాశం రావాలని.. అతడి బ్లూ జెర్సీలో చూడాలని ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: India Vs Ireland T20: రాహుల్ త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు.. అతడు క్రీజులో ఉంటే చాలు! 💯 for Rajat Patidar! 👏 👏 What a cracking knock this has been from the Madhya Pradesh right-handed batter in the #RanjiTrophy #Final! 👍 👍 @Paytm | #MPvMUM Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/cftACdqt8T — BCCI Domestic (@BCCIdomestic) June 25, 2022 -
IPL 2022 Qualifier 2: రాజస్తాన్ రైట్ రైట్...
ఐపీఎల్ మొదటి సీజన్–2008లో విజేతగా నిలిచిన తర్వాత పడుతూ, లేస్తూ ప్రస్థానం సాగించి... మధ్యలో రెండేళ్లు నిషేధానికి కూడా గురైన రాజస్తాన్ రాయల్స్ 14 ఏళ్ల తర్వాత మళ్లీ తుది పోరుకు అర్హత సాధించింది. గత మూడు సీజన్లుగా చివరి రెండు స్థానాల్లోనే నిలుస్తూ వచ్చిన ఈ టీమ్ ఈసారి స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్లో ఓడినా... తమ తప్పులు దిద్దుకొని రెండో క్వాలిఫయర్లో సత్తా చాటింది. ప్రసిధ్, మెక్కాయ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో బెంగళూరును సాధారణ స్కోరుకే పరిమితం చేసిన రాజస్తాన్ ఆ తర్వాత బట్లర్ మెరుపు సెంచరీతో సునాయాసంగా విజయాన్ని అందుకుంది. మరోవైపు కొంత అదృష్టం కూడా కలి సొచ్చి ఇక్కడి వరకు వచ్చిన ఆర్సీబీ నాకౌట్ మ్యాచ్లో ఓడి నిష్క్రమించింది. టైటిల్ లేకుండానే ఆ జట్టు 15వ సీజన్నూ నిరాశగా ముగించింది. అహ్మదాబాద్: ఐపీఎల్–2022 ఫైనల్లో టాప్–2 జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు ‘రాయల్స్’ జట్ల మధ్య జరిగిన పోరులో చివరకు రాజస్తాన్దే పైచేయి అయింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూ రు 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్ లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బట్లర్ (60 బంతుల్లో 106 నాటౌ ట్; 10 ఫోర్లు, 6 సిక్స్ లు) సీజన్లో నాలుగో సెంచరీతో చెలరేగాడు. రేపు ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ తలపడుతుంది. పటిదార్ మినహా... కోహ్లి (7) మరోసారి నిరాశపరుస్తూ తొందరగా అవుట్ కావడంతో ఆర్సీబీకి సరైన ఆరంభం లభించలేదు. గత మ్యాచ్ హీరో పటిదార్ కొన్ని చక్కటి షాట్లతో దూకుడు ప్రదర్శించగా, కెప్టెన్ డుప్లెసిస్ (27 బంతుల్లో 25; 3 ఫోర్లు) అతనికి సహకరించాడు. 13 పరుగుల వద్ద పరాగ్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్ ఆ తర్వాత మరింత ధాటిగా ఆడాడు. పటిదార్తో రెండో వికెట్కు 70 పరుగులు (53 బంతుల్లో) జోడించిన అనంతరం డుప్లెసిస్ అవుట్ కాగా, మ్యాక్స్వెల్ (13 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్లు) జోరును ప్రదర్శించాడు. చహల్ బౌలింగ్లో సిక్స్తో 40 బంతుల్లో పటిదార్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే తక్కువ వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసిన రాజస్తాన్ పట్టు బిగించింది. మెరుపు బ్యాటింగ్తో... ఛేదనలో రాజస్తాన్కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురు కాలేదు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్ (13 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్లు) 16 పరుగులు రాబట్టడంతో రాయల్స్ జోరుగా ఇన్నింగ్స్ను మొదలు పెట్టింది. సిరాజ్ తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6 కొట్టిన బట్లర్, షహబాజ్ ఓవర్లోనూ 2 సిక్స్లు, ఒక ఫోర్తో చెలరేగాడు. తొలి వికెట్కు 31 బంతుల్లోనే 61 పరుగులు వచ్చాక యశస్వి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సామ్సన్ (21 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు) కూడా కీలక పరుగులు సాధించాడు. బట్లర్ మాత్రం ఎక్కడా తగ్గకుండా దూకుడును కొనసాగించడంతో రాజస్తాన్ పని మరింత సులువైంది. 66 పరుగుల వద్ద బట్లర్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను దినేశ్ కార్తీక్ వదిలేయడం కూడా బెంగళూరు ఆశలను ముగించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సామ్సన్ (బి) ప్రసిధ్ 7; డుప్లెసిస్ (సి) అశ్విన్ (బి) మెక్కాయ్ 25; పటిదార్ (సి) బట్లర్ (బి) అశ్విన్ 58; మ్యాక్స్వెల్ (సి) మెక్కాయ్ (బి) బౌల్ట్ 24; లోమ్రోర్ (సి) అశ్విన్ (బి) మెక్కాయ్ 8; కార్తీక్ (సి) పరాగ్ (బి) ప్రసిధ్ 6; షహబాజ్ (నాటౌట్) 12; హసరంగ (బి) ప్రసిధ్ 0; హర్షల్ (బి) మెక్కాయ్ 1; హాజల్వుడ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–9, 2–79, 3–111, 4–130, 5–141, 6–146, 7–146, 8–154. బౌలింగ్: బౌల్ట్ 4–0–28–1, ప్రసిధ్ కృష్ణ 4–0–22–3, మెక్కాయ్ 4–0–23–3, అశ్విన్ 4–0–31–1, చహల్ 4–0–45–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) కోహ్లి (బి) హాజల్వుడ్ 21; బట్లర్ (నాటౌట్) 106; సామ్సన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) హసరంగ 23; పడిక్కల్ (సి) కార్తీక్ (బి) హాజల్వుడ్ 9; హెట్మైర్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 0; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–61, 2–113, 3–148. బౌలింగ్: సిరాజ్ 2–0–31–0, హాజల్వుడ్ 4–0–23–2, మ్యాక్స్వెల్ 3–0–17–0, షహబాజ్ అహ్మద్ 2–0–35–0, హర్షల్ పటేల్ 3.1–0–29–0, హసరంగ 4–0–26–1. -
ఐపీఎల్లో పాటిదార్ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా..!
ఐపీఎల్లో ఆర్సీబీ యువ ఆటగాడు రజత్ పాటిదార్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డులెక్కాడు. ఐపీఎల్-2022 ప్లే ఆఫ్స్లో 170 పరుగులు చేసిన పాటిదార్ ఈ ఘనత సాధించాడు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 112 పరుగులు, రాజస్తాన్ రాయల్స్తో క్వాలిఫైర్ 2లో 58 పరుగులు పాటిదార్ చేశాడు. ఇక ఓవరాల్గా ప్లే ఆఫ్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉన్నాడు. 2016 సీజన్లో వార్నర్ 190 పరుగులు సాధించాడు. ఇక 170 పరుగలతో పాటిదార్ రెండో స్ధానంలో ఉన్నాడు. చదవండి: Left Arm Pacers In IPL 2022: ఐపీఎల్ 2022లో అదరగొట్టిన లెఫ్టార్మ్ పేసర్లు వీరే.. -
IPL 2022: చాన్స్ ఇస్తే... చెలరేగిపోవడమే... ఒకరు ఏకంగా టీమిండియలో.. మరొకరు!
IPL 2022: ఒకరు నెట్బౌలర్గా జట్టులోకి వచ్చి ఏడాది తిరిగే లోపు ఏకంగా భారత జట్టులోకి వచ్చేస్తే, మరొకరు మూడేళ్లు బెంచీకే పరిమితమై మరో జట్టు మ్యాచ్ ఇవ్వగానే చెలరేగిపోయాడు... వేలంలో ఎవరూ ఎంచుకోక నిరాశ చెందిన ఆటగాడు అదృష్టం కలిసొచ్చి మళ్లీ పిలుపు వచ్చినప్పుడు వస్తే ఒక్క ఇన్నింగ్స్తో తన విలువేంటో చూపించాడు. దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ ఆకట్టుకునే ప్రదర్శనతో సీజన్కే హైలైట్గా నిలిచిన కుర్రాడు మరొకడు... ఐపీఎల్కు ఎంపిక కావడమే యువ క్రికెటర్ల దృష్టిలో ఒక ఘనత కాగా, తుది జట్టులో స్థానం లభించి సత్తా చాటడం మరో పెద్ద అడుగు. ఈ ఏడాది అలా ఐపీఎల్లో తమదైన ముద్ర వేసిన కొందరు ఆటగాళ్లను చూస్తే... ఉమ్రాన్ మలిక్ (సన్రైజర్స్) 2021 ఐపీఎల్లో తమ ఆటగాడు సమద్ చెప్పిన మాటలపై నమ్మకంతో జమ్ము కశ్మీర్కు చెందిన ఉమ్రాన్ మలిక్ను సన్రైజర్స్ నెట్ బౌలర్గా యూఏఈకి తీసుకెళ్లింది. సాధనలోనే అతడి వేగం అందరినీ కట్టి పడేసింది. నటరాజన్ కరోనా బారిన పడటంతో ఉమ్రాన్కు ప్రధాన టీమ్లో కూడా చోటు లభించింది. మూడు మ్యాచ్లలో అతను బరిలోకి దిగగా, నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం కెప్టెన్ కోహ్లిని కూడా ఆకర్షించింది. దాంతో వరల్డ్ కప్లో టీమిండియాకు సరైన ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ కోసం అతడిని బీసీసీఐ అక్కడే ఉంచింది. ఈ సీజన్కు వచ్చేసరికి మరింత రాటుదేలిన ఉమ్రాన్ తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ముఖ్యంగా గుజరాత్పై ఐదు వికెట్ల ప్రదర్శన అద్భుతం. 14 సార్లూ ‘ఫాస్టెస్ట్ బాల్’ అవార్డు గెలుచుకున్న అతను 22 వికెట్లు పడగొట్టాడు. అనుభవంతో ప్రతీ మ్యాచ్కు మెరుగవుతూ వేగానికి బంతిపై నియంత్రణను కూడా జోడించడం సెలక్టర్లను ఆకట్టుకునేలా చేసి దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కేలా చేసింది. మొహసిన్ ఖాన్ (లక్నో సూపర్జెయింట్స్) 2018లో దేశవాళీ క్రికెట్లోకి వచ్చిన లెఫ్టార్మ్ పేసర్ మొహసిన్కు సరైన వేదిక లభించేందుకు నాలుగేళ్లు పట్టింది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్కు చెందిన మొహసిన్ను 2019లోనే ముంబై ఇండియన్స్ జట్టు తీసుకున్నా...మూడు సీజన్ల పాటు ఒక్క మ్యాచ్ కూడా ఆడించకుండా బెంచీకే పరిమితం చేసింది. తీవ్ర అసహనానికి గురైనా, ముంబైలాంటి జట్టులో అంత సులువుగా అవకాశం దక్కదు కాబట్టి తన ఆటను మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెట్టాడు. ఈ సారి లక్నో అతడిని ఎంచుకుంది. ఇక్కడా ఆరంభ మ్యాచ్లలో అతనికి అవకాశం దక్కలేదు. అయితే కొత్త బంతిని అందించిన మొదటి మ్యాచ్నుంచే సత్తా చాటుతూ అతని ప్రత్యర్థులను కట్టి పడేశాడు. అత్యంత పొదుపైన బౌలింగ్తో సత్తా చాటాడు. ఈ సీజన్లో 6 కంటే తక్కువ ఎకానమీ (5.96)తో రెండో స్థానంలో నిలిచిన మొహసిన్ కేవలం 14.07 సగటుతో 14 వికెట్లు కూడా తీశాడంటే అతని ప్రభావం ఏమిటో అర్థమవుతుంది. చదవండి: Who Is Mohsin Khan: ఢిల్లీ క్యాపిటల్స్కు చుక్కలు చూపించాడు.. ఎవరీ మొహసిన్ ఖాన్..? రజత్ పటిదార్ (బెంగళూరు) గత సీజన్లో పటిదార్ను బెంగళూరు 4 మ్యాచ్లలో ఆడించగా, అతను మొత్తం 71 పరుగులు చేశాడు. ఈ సారి అతనిపై నమ్మకం లేక వేలంలో కనీసం పటిదార్ పేరు కూడా తీసుకోలేదు. ఆర్సీబీ మాత్రమే కాదు ఎవరూ వేలంలో ఎంచుకోకపోవడంతో రజత్ తన స్వస్థలం ఇండోర్ వెళ్లిపోయి సాధనలో మునిగిపోయాడు. అయితే అదృష్టం మరో రూపంలో కలిసొచ్చింది. లవ్నిత్ సిసోడియా గాయపడటంతో అతని స్థానంలో మళ్లీ రజత్ను ఆర్సీబీ పిలిచింది. తన రెండో మ్యాచ్లోనే 32 బంతుల్లో 52 పరుగులు చేసినా జట్టు ఓటమితో ఆ ఆటకు గుర్తింపు దక్కలేదు. లీగ్ దశలో 5 మ్యాచ్లలోనూ చెప్పుకోదగ్గ పరుగులే చేసిన రజత్...నాకౌట్ మ్యాచ్లో తానేంటో చూపించాడు. మైదానమంతా చెలరేగిపోతూ ఎలిమినేటర్ అతను చేసిన సెంచరీ బెంగళూరు అభిమానులు మరో సారి తమ జట్టు టైటిల్ సాధించడంపై ఆశలు పెట్టుకునేలా చేసింది. చదవండి: IPL 2022: సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్ పాటిదార్..? RCB wins #IPL2022 Eliminator vs LSG Virat Kohli & DK lauded Rajat Patidar’s match winning knock, while the team enjoyed making it past the Eliminator stage. All that & more in Part 1 of the Game Day video from the dressing room.#PlayBold #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PlayOffs pic.twitter.com/ER8nW9jOgL — Royal Challengers Bangalore (@RCBTweets) May 26, 2022 తిలక్వర్మ (ముంబై ఇండియన్స్) ప్రతిభ, పట్టుదలకు తోడు కీలక సమయాల్లో ఎలాంటి ఒత్తిడినీ చూపించకుండా సాధికారికంగా, అనుభవజ్ఞుడిలా తిలక్వర్మ ఆడిన తీరు సునీల్ గావస్కర్, రోహిత్శర్మలాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకునేలా చేసింది. 2020 అండర్–19 వరల్డ్కప్లో భాగంగా ఉన్న హైదరాబాదీ తిలక్ కొద్ది రోజుల్లోనే అన్ని ఫార్మాట్లలో సత్తా చాటి సొంత టీమ్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. వేలంలో రూ.1.7 కోట్లకు ముంబై అతడిని ఎంచుకున్నప్పుడు కూడా తుది జట్టులో అవకాశం లభిస్తుందా అనే సందేహాలు! అయితే తన అద్భుత ఆటతో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తొలి సీజన్లోనే టీమ్లో కీలక ఆటగాళ్లలో ఒకడిగా మారి భవిష్యత్తు తారగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 14 మ్యాచ్లలో 131.02 స్ట్రైక్రేట్తో 397 పరుగులు చేసిన తిలక్ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకునేలా చేశాడు. "Talking to Sachin sir, Rohit bhai and Mahela gave me a lot of confidence." 💯 Tilak caps off an excellent debut season with this honest chat about what he learnt and where he has improved 💪#OneFamily #DilKholKe #MumbaiIndians @TilakV9 MI TV pic.twitter.com/Qc3nQeTZJs — Mumbai Indians (@mipaltan) May 26, 2022 చదవండి: KL Rahul-Sanjay Manjrekar: 'కోచ్గా ఉండుంటే కేఎల్ రాహుల్ను కచ్చితంగా తిట్టేవాడిని' -
IPL 2022: ఇంకా రెండు అడుగులు..రెండే! కోచ్తో కోహ్లి.. వీడియో వైరల్
IPL 2022 LSG Vs RCB: ఎలిమినేటర్ గండాన్ని అధిగమించి ఐపీఎల్-2022 క్వాలిఫైయర్-2కు చేరుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. సంతోషంతో ఆర్సీబీ ఆటగాళ్లు, సిబ్బంది ముఖం వెలిగిపోయింది. ఒకరినొకరు హత్తుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇక ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. హెడ్కోచ్ సంజయ్ బంగర్ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘ఇంకా రెండు అడుగులు.. రెండే అడుగులు మిగిలి ఉన్నాయి’’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు. కాగా స్టార్ ఆటగాళ్లు, భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న సంగతి తెలిసిందే. ఆఖరిసారిగా 2016లో ఫైనల్ చేరినా సన్రైజర్స్ చేతిలో భంగపడి చేదు అనుభవాన్ని మిగుల్చుకుంది. ఇక కోహ్లి సారథ్యంలోని బెంగళూరు గత రెండు సీజన్లుగా ప్లే ఆఫ్స్ చేరినా ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రం నెగ్గలేక ఇంటిబాట పట్టింది. తాజా సీజన్లో రజత్ పాటిదార్ అద్భుత శతకంతో లక్నో సూపర్జెయింట్స్ను ఓడించి రాజస్తాన్ రాయల్స్తో పోరుకు సిద్ధమైంది. ఇక తమ సంబరాలకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది లైకులు, షేర్లతో దూసుకుపోతూ వైరల్ అవుతోంది. ఐపీఎల్-2022: ఎలిమినేటర్ మ్యాచ్ లక్నో వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు టాస్: లక్నో ఆర్సీబీ- 207/4 (20) లక్నో- 193/6 (20) విజేత: 14 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫైయర్కు అర్హత సాధించిన ఆర్సీబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రజత్ పాటిదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 112 పరుగులు- నాటౌట్) చదవండి: IPL 2022 LSG Vs RCB: అతడొక అద్భుతం.. అందుకు లక్నో పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ క్రికెటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: అతడు సూపర్.. అందుకు లక్నో పశ్చాత్తాపపడక తప్పదు!
IPL 2022 LSG Vs RCB: ‘‘ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్కు మంచి జట్లు దొరికాయి. ఈ రెండింటిలో పంజాబ్తో పోలిస్తే లక్నో మంచి ప్రదర్శన నమోదు చేసింది. సీజన్ ఆరంభంలోనే అదరగొట్టింది. చక్కగా ఆడింది. కానీ టాప్-2లో అడుగుపెట్టలేకపోయింది. ఇందుకు వారు పశ్చాత్తాపపడక తప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. కొత్త ఫ్రాంఛైజీ లక్నోను దురదృష్టం వెక్కిరించిందని టాప్-2లో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన లక్నోకు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. రాహుల్ కెప్టెన్సీలో ఆడిన 14 మ్యాచ్లలో లక్నో తొమ్మిదింట గెలిచి 18 పాయింట్లు సాధించింది. అయితే, నెట్రన్రేటు పరంగా వెనుకబడటంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది. రెండో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్ నేరుగా క్వాలిఫైయర్-1కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఓడినప్పటికీ టైటిల్ రేసులో నిలిచే మరో అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన లక్నో బుధవారం నాటి మ్యాచ్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. టాస్ మొదలు.. ఫీల్డింగ్ తప్పిదాలు, బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిని మూటగట్టుకుని ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. ఇక పంజాబ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో పద్నాలుగింట ఏడు మ్యాచ్లు గెలిచి.. 14 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. Prior to the season, I expected LSG and PBKS both to go all the way with the squads they had. LSG did better comparatively, but the way they started the season and the kind of depth they had, they'll regret not finishing in the top 2. #LSGvRCB #IPL2022 — Wasim Jaffer (@WasimJaffer14) May 25, 2022 పాటిదార్ అద్భుతం చేశాడు! ఆర్సీబీని గెలిపించిన రజత్ పాటిదార్ను వసీం జాఫర్ ట్విటర్ వేదికగా ప్రశంసించాడు. ‘‘సూపర్స్టార్ల మధ్య ఓ అన్క్యాప్డ్ ప్లేయర్ తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకోవడం చాలా కష్టం. అయితే, మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి.. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడి రజత్ పాటిదార్ ఈ విషయాన్ని సుసాధ్యం చేశాడు’’ అని కొనియాడాడు. It can be difficult for an uncapped player to create his own identity amidst the superstars, but Rajat has made the no.3 spot his own. Another fine knock under pressure tonight, well played 👏🏽 #LSGvRCB #IPL2022 pic.twitter.com/T5QiWoKWRX — Wasim Jaffer (@WasimJaffer14) May 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); .@RCBTweets seal a spot in the #TATAIPL 2022 Qualifier 2! 👏 👏@faf1307 & Co. beat #LSG by 14 runs in the high-scoring Eliminator at the Eden Gardens, Kolkata. 👍 👍 Scorecard ▶️ https://t.co/cOuFDWIUmk #TATAIPL | #LSGvRCB pic.twitter.com/mOqY5xggUT — IndianPremierLeague (@IPL) May 25, 2022 -
IPL 2022: వారెవ్వా.. నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్: విరాట్ కోహ్లి
IPL 2022 RCB Eliminate LSG: ఎలిమినేటర్ మ్యాచ్ హీరో రజత్ పాటిదార్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. తాను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్లో పాటిదార్ ఇన్నింగ్స్ ఒకటని సహచర ఆటగాడిని కొనియాడాడు. ఒత్తిడిలోనూ ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ బ్యాటింగ్ చేసిన విధానాన్ని ప్రశంసించాడు. కీలక మ్యాచ్లో తన సత్తా చాటాడంటూ పాటిదార్కు కోహ్లి కితాబిచ్చాడు. ఐపీఎల్-2022లో ముందుడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ఆర్సీబీ జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆసక్తికరపోరులో లక్నోపై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో రాజస్తాన్ రాయల్స్తో క్వాలిఫైయర్-2కు అర్హత సాధించింది. అయితే , ఈ విజయంలో రజత్ పాటిదార్కే కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 112 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు భారీ స్కోరు చేయడంలో సాయం చేశాడు. ఇందుకు దినేశ్ కార్తిక్(23 బంతుల్లో 37 పరుగులు- నాటౌట్) కూడా తోడయ్యాడు. ఈ క్రమంలో భారీ లక్ష్యం ఛేధించలేక చతికిలపడ్డ లక్నో ఓటమిపాలైంది. ఫలితంగా ఎలిమినేటర్ గండాన్ని దాటిన ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో రజత్ పాటిదార్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక మ్యాచ్ అనంతరం కోహ్లి రజత్తో ముచ్చటిస్తూ అద్భుత ఇన్నింగ్స్ చూశానని పేర్కొన్నాడు. ‘‘నా సుదీర్ఘ కెరీర్లో నేను చాలా గొప్ప ఇన్నింగ్స్ చూశాను. మ్యాచ్ స్వరూపానే మార్చివేయగల ఆట చూశాను. ఒత్తిడిలోనూ మెరుగ్గా రాణించగల ఆటగాళ్లను చూశాను. ఎలిమినేటర్ మ్యాచ్లోనూ అలాంటి అత్యద్భుత ఇన్నింగ్స్ చూశాను. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్.. తీవ్ర ఒత్తిడి అయినా.. కూడా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో సెంచరీ సాధించిన మొదటి అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు’’ అంటూ పాటిదార్ను కోహ్లి ఆకాశానికెత్తాడు. ఐపీఎల్-2022: ఎలిమినేటర్ మ్యాచ్- లక్నో వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు టాస్: లక్నో ఆర్సీబీ- 207/4 (20) లక్నో- 193/6 (20) విజేత: ఆర్సీబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రజత్ పాటిదార్ చదవండి: KL Rahul: ఛ.. మరీ చెత్తగా.. మా ఓటమికి ప్రధాన కారణం అదే! పాటిదార్ అద్భుతం! IPL 2022: సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్ పాటిదార్..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); 💬 💬 "Haven't seen many better innings than the one Rajat played." DO NOT MISS: @imVkohli chats with the man of the moment, Rajat Patidar, after @RCBTweets' win over #LSG in Eliminator. 👏 👏 - By @RajalArora Full interview 📹 🔽 #TATAIPL | #LSGvRCBhttps://t.co/ofEtg6I3Ud pic.twitter.com/TG8weOuZUo — IndianPremierLeague (@IPL) May 26, 2022 .@RCBTweets seal a spot in the #TATAIPL 2022 Qualifier 2! 👏 👏@faf1307 & Co. beat #LSG by 14 runs in the high-scoring Eliminator at the Eden Gardens, Kolkata. 👍 👍 Scorecard ▶️ https://t.co/cOuFDWIUmk #TATAIPL | #LSGvRCB pic.twitter.com/mOqY5xggUT — IndianPremierLeague (@IPL) May 25, 2022 -
సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్ పాటిదార్..?
IPL 2022 LSG Vs RCB- Rajat Patidar: ఐపీఎల్-2022లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే 112 పరుగులు సాధించి.. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో గెలిపొంది.. రాజస్తాన్ రాయల్స్తో క్వాలిఫెయిర్2కు సిద్దమైంది. అయితే కీలకమైన మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన పాటిదార్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పాటిదార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ రజత్ పాటిదార్..? మధ్య ప్రదేశ్కు చెందిన 28 ఏళ్ల పాటిదార్ 2020 నుంచి 2021 సీజన్ వరకు ఆర్సీబీ జట్టులో భాగమై ఉన్నాడు. అయితే పాటిదార్ చాలా మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు పటిదార్ను ఆరీసీబీ విడిచి పెట్టింది. ఇక వేలంలో పాల్గొన్న అతడిని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచలేదు. అయితే ఈ ఏడాది టోర్నీ మధ్యలో గాయపడిన లువ్నిత్ సిసోడియా స్ధానంలో పటిదార్ను ఆర్సీబీ భర్తీ చేసుకుంది. దీంతో మళ్లీ అతడికి ఆర్సీబీ తరపున ఆడే అవకాశం దక్కింది. ఇక డొమాస్టిక్ క్రికెట్లో మధ్య ప్రదేశ్ తరపున పటిదార్ ఆడుతున్నాడు. 39 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడిన పటిదార్ 2500పైగా పరుగులు సాధించాడు. అదే విధంగా 43 లిస్ట్-ఎ మ్యాచ్లు, 38 టీ20లు కూడా ఆడాడు. టీ20ల్లో తన 1000 పరుగులను కూడా పటిదార్ పూర్తి చేసుకున్నాడు. చదవండి: IPL 2022: రజత్ పాటిదార్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలి బ్యాటర్గా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); .@RCBTweets seal a spot in the #TATAIPL 2022 Qualifier 2! 👏 👏@faf1307 & Co. beat #LSG by 14 runs in the high-scoring Eliminator at the Eden Gardens, Kolkata. 👍 👍 Scorecard ▶️ https://t.co/cOuFDWIUmk #TATAIPL | #LSGvRCB pic.twitter.com/mOqY5xggUT — IndianPremierLeague (@IPL) May 25, 2022 -
IPL 2022: మరీ చెత్తగా.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: రాహుల్
IPL 2022 Eliminator LSG Vs RCB: ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే ప్లే ఆఫ్స్ చేరిన లక్నో సూపర్ జెయింట్స్కు కీలక మ్యాచ్లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన కేఎల్ రాహుల్ సేన.. ఐపీఎల్- 2022 ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం తలపడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(58 బంతుల్లో 79 పరుగులు), దీపక్ హుడా(26 బంతుల్లో 45 పరుగులు) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి చవిచూసింది. ఫీల్డింగ్ తప్పిదాలకు తోడు బ్యాటర్ల వైఫల్యం కారణంగా ఆర్సీబీ చేతిలో 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించాలని భావించిన లక్నోకు భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.. తమ జట్టు ఫీల్డింగ్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, కొత్తగా క్యాష్ రిచ్లీగ్లో ఎంట్రీ ఇచ్చిన తాము ప్లే ఆఫ్స్ వరకు చేరుకోవడం సానుకూల అంశమని పేర్కొన్నాడు. ఈ మేరకు రాహుల్ మాట్లాడుతూ.. ‘‘మైదానంలో మేము చేసిన తప్పిదాలే మా ఓటమికి కారణం. సులువైన క్యాచ్లు వదిలేసి కూడా గెలవాలని ఆశించడం సరికాదు. పాటిదార్ అద్భుతంగా ఆడాడు. టాపార్డర్లో వన్డౌన్లో వచ్చిన బ్యాటర్ శతకం సాధిస్తే ఆ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడా అదే జరిగింది. వాళ్లు(ఆర్సీబీ) అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. మా ఫీల్డింగ్ చెత్తగా ఉంది’’ అని తెలిపాడు. ఇక తమలోని సానుకూల అంశాలను ప్రస్తావిస్తూ.. ‘‘మాది కొత్త ఫ్రాంఛైజీ. ఇందులో చాలా మంది యువకులే ఉన్నారు. నిజానికి మేము చాలా తప్పిదాలు చేశాము. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుని రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తాం. మొహ్సిన్ అద్భుత నైపుణ్యాలు కలవాడు. ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని మరింత రాటుదేలితే వచ్చే సీజన్లో అతడు మరింత బాగా రాణిస్తాడు’’ అని లక్నో సారథి రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా ఆర్సీబీ బ్యాటర్ రజత్ పాటిదార్ అద్భుత శతకంతో ఆకట్టుకుని ఆఖరి వరకు అజేయంగా నిలిచి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక పాటిదార్, దినేశ్ కార్తిక్(23 బంతుల్లో 37 పరుగులు- నాటౌట్) ఇచ్చిన క్యాచ్లను డ్రాప్ చేసి లక్నో భారీ మూల్యమే చెల్లించింది. ఐపీఎల్-2022: ఎలిమినేటర్ మ్యాచ్ లక్నో వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు టాస్: లక్నో ఆర్సీబీ- 207/4 (20) లక్నో- 193/6 (20) విజేత: 14 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫైయర్కు అర్హత సాధించిన ఆర్సీబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రజత్ పాటిదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 112 పరుగులు- నాటౌట్) ఇది కూడా చదవండి: IPL 2022: ఐపీఎల్లో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా..! .@RCBTweets seal a spot in the #TATAIPL 2022 Qualifier 2! 👏 👏@faf1307 & Co. beat #LSG by 14 runs in the high-scoring Eliminator at the Eden Gardens, Kolkata. 👍 👍 Scorecard ▶️ https://t.co/cOuFDWIUmk #TATAIPL | #LSGvRCB pic.twitter.com/mOqY5xggUT — IndianPremierLeague (@IPL) May 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్వాలిఫైయర్ 2కి బెంగళూరు ... లక్నోపై ‘సూపర్’ విక్టరీ...
రజత్ పటిదార్ బెంగళూరుకు బంగారంలా మారాడు. ఐపీఎల్ వేలంలో ఎవరూ తీసుకోకపోగా, రెండు లీగ్ మ్యాచ్ల తర్వాత బెంగళూరు జట్టు నుంచి పిలుపు వచ్చింది. గాయపడిన లవ్నిత్ సిసోడియా స్థానంలో అతడిని తీసుకున్న జట్టు లీగ్ దశలో ఆరు మ్యాచ్లు ఆడించింది. అయితేనేం, నాకౌట్ పోరులో అతడిపై నమ్మకముంచి మూడో స్థానంలో పంపించింది. పటిదార్ తన కెరీర్లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్తో అద్భుతం చేశాడు. విధ్వంసక బ్యాటింగ్తో సెంచరీ సాధించి ఆర్సీబీకి మరచిపోలేని విజయాన్ని అందించాడు. పటిదార్ దూకుడు కారణంగానే భారీ స్కోరు నమోదు చేసిన బెంగళూరు... ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసి క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. ఫైనల్లో స్థానం కోసం శుక్రవారం అహ్మదాబాద్లో జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో బెంగళూరు తలపడుతుంది. కోల్కతా: గత రెండేళ్లు ఐపీఎల్లో ‘ఎలిమినేటర్’ మ్యాచ్లోనే ఓడి భంగపడిన బెంగళూురు ఈసారి ఆ గండాన్ని దాటింది. బుధవారం జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ను 14 పరుగుల తేడాతో ఓడించి ముందంజ వేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పటిదార్ (54 బంతుల్లో 112 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్స్లు) శతకం సాధించగా, దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులకే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 79; 3 ఫోర్లు, 5 సిక్స్లు), దీపక్ హుడా (26 బంతుల్లో 45; 1 ఫోర్, 4 సిక్స్లు) రాణించారు. మెరుపు బ్యాటింగ్... తొలి ఓవర్లోనే డుప్లెసిస్ (0) అవుట్తో బెంగళూరు ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. విరాట్ కోహ్లి (24 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. అయితే ధాటిగా బ్యాటింగ్ మొదలుపెట్టిన పటిదార్... కృనాల్ ఓవర్లో వరుసగా 4, 4, 6, 4 బాదడంతో పవర్ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 52 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ (9), లోమ్రోర్ (14) విఫలం కావడంతో స్కోరు 115/4కు చేరింది. ఈ దశలో పటిదార్ తుఫాన్ బ్యాటింగ్తో ఆటను ఒక్కసారిగా మార్చేశాడు. 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అతను చమీరా ఓవర్లో 3 ఓవర్లో తన జోరును కొనసాగించాడు. ఆపై రవి బిష్ణోయ్ ఓవర్లో అతను పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో వరుసగా ఐదు బంతుల్లో అతను 6, 4, 6, 4, 6తో చెలరేగాడు. మరో ఎండ్లో అవేశ్ ఖాన్ ఓవర్లో 3 ఫోర్లతో కార్తీక్ కూడా దూకుడు ప్రదర్శించాడు. మొహసిన్ ఓవర్లో సిక్సర్తో 49 బంతుల్లోనే పటిదార్ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత చమీరా ఓవర్లో అతను, కార్తీక్ కలిపి 2 ఫోర్లు, 2 సిక్స్లు బాదారు. వీరిద్దరు ఐదో వికెట్కు 41 బంతుల్లోనే అభేద్యంగా 92 పరుగులు జోడించారు. రాహుల్ రాణించినా... భారీ ఛేదనలో డికాక్ (6) మొదటి ఓవర్లోనే అవుట్ కావడంతో లక్నో ఇన్నింగ్స్ ఇబ్బందిగా మొదలైంది. మనన్ వోహ్రా (19) కూడా ఎక్కువసేపు నిలవలేదు. సిరాజ్ ఓవర్లో 4, 6, 6 కొట్టి రాహుల్ జోరుగా ఆడే ప్రయత్నం చేయగా, హుడా కూడా ధాటిని ప్రదర్శించాడు. అయినా సరే ఆర్సీబీ చక్కటి బౌలింగ్కు వేగంగా పరుగులు రాలేదు. 13 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 109 పరుగులు మాత్రమే. 7 ఓవర్లలో 99 పరుగులు చేయాల్సిన స్థితిలో లక్నో దూకుడును ప్రదర్శించింది. హాజల్వుడ్, హసరంగ ఓవర్లలో రెండేసి సిక్సర్లు వచ్చాయి. అయితే హుడా అవుట్ కావడంతో గెలిపించాల్సిన భారం రాహుల్పై పడింది. హసరంగ ఓవర్లో లక్నో 14 పరుగులు రాబట్టింది. విజయానికి 3 ఓవర్లలో 41 పరుగులు చేయాల్సి ఉండగా లక్నోవైపు ఆట మొగ్గినా... చివరకు ఆర్సీబీదే పైచేయి అయింది. ఆ క్యాచ్ పట్టి ఉంటే... పటిదార్కు కోలుకునే అవకాశం ఇచ్చిన లక్నో భారీ మూల్యం చెల్లించుకుంది. బిష్ణోయ్ బౌలింగ్లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్ను హుడా వదిలేశాడు. ఆ సమయంలో పటిదార్ స్కోరు 72 పరుగులు... ఆ తర్వాత అతను మరింత భీకరంగా ఆడి 13 బంతుల్లోనే 40 పరుగులు బాదాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) మొహసిన్ (బి) అవేశ్ 25; డుప్లెసిస్ (సి) డికాక్ (బి) మొహసిన్ 0; పటిదార్ (నాటౌట్) 112; మ్యాక్స్వెల్ (సి) లూయిస్ (బి) కృనాల్ 9; లోమ్రోర్ (సి) రాహుల్ (బి) బిష్ణోయ్ 14; కార్తీక్ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–4, 2–70, 3–86, 4–115. బౌలింగ్: మొహసిన్ 4–0–25–1, చమీరా 4–0–54–0, కృనాల్ 4–0–39–1, అవేశ్ 4–0–44–1, బిష్ణోయ్ 4–0–45–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) డుప్లెసిస్ (బి) సిరాజ్ 6; రాహుల్ (సి) షహబాజ్ (బి) హాజల్వుడ్ 79; వోహ్రా (సి) షహబాజ్ (బి) హాజల్వుడ్ 19; హుడా (బి) హసరంగ 45; స్టొయినిస్ (సి) పటిదార్ (బి) హర్షల్ 9; లూయిస్ (నాటౌట్) 2; కృనాల్ (సి అండ్ బి) హాజల్వుడ్ 0; చమీరా (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 22; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–8, 2–41, 3–137, 4–173, 5–180, 6–180. బౌలింగ్: సిరాజ్ 4–0–41–1, హాజల్వుడ్ 4–0–43–3, షహబాజ్ 4–0–35–0, హసరంగ 4–0–42–1, హర్షల్ 4–0–25–1. -
రజత్ పాటిదార్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలి బ్యాటర్గా
ఆర్సీబీ బ్యాటర్ రజత్ పాటిదార్ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో సూపర్ శతకంతో మెరిశాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో పాటిదార్ 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో 54 బంతుల్లో 112 పరుగులు నాటౌట్గా నిలిచిన పాటిదార్ ఐపీఎల్లో ఆర్సీబీ తరపున పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ►ఆర్సీబీ తరపున నాకౌట్ మ్యాచ్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా రజత్ పాటిదార్ నిలిచాడు. ►ప్లేఆఫ్ మ్యాచ్లో ఆర్సీబీ తరపున అత్యధిక స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా రజత్ పాటిదార్(54 బంతుల్లో 112, 12 ఫోర్లు, 7 సిక్సర్లు). ఈ నేపథ్యంలో క్రిస్ గేల్(89 పరుగులు)ను అధిగమించాడు. ►అన్క్యాప్డ్ ప్లేయర్గా ఐపీఎల్లో సెంచరీ అందుకున్న నాలుగో ఆటగాడిగా రజత్ పాటిదార్. ఇంతకముందు పాల్ వాల్తాటి(120*పరుగులు, పంజాబ్ కింగ్స్, 2011లో సీఎస్కేపై), మనీష్ పాండే(114*పరుగులు, ఆర్సీబీ, 2009లో డెక్కన్ చార్జర్స్పై), దేవదత్ పడిక్కల్(101*పరుగులు, ఆర్సీబీ, 2021లో రాజస్తాన్ రాయల్స్పై) ►అన్క్యాప్డ్ ప్లేయర్గా ప్లేఆఫ్ మ్యాచ్లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రజత్ పాటిదార్ నిలిచాడు. ఓవరాల్గా ప్లేఆఫ్ మ్యాచ్ల్లో సెంచరీ అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు సెహ్వాగ్, షేన్ వాట్సన్, వృద్దిమాన సాహా, మురళీ విజయ్లు ఈ ఫీట్ సాధించారు. ►అన్ క్యాప్డ్ ప్లేయర్గాఅత్యధిక స్కోరు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు మనీష్ పాండే 94 పరుగులు( కేకేఆర్, 2014లో పంజాబ్ కింగ్స్పై ), మన్విందర్ బిస్లా 89 పరుగులు(కేకేఆర్, 2012లో సీఎస్కేపై) ఉన్నారు. చదవండి: Kohli-Ganguly: కోహ్లి స్టైలిష్ బౌండరీ.. గంగూలీ రియాక్షన్ అదిరే -
ఆర్సీబీ ఆటగాడి సిక్సర్ దెబ్బకు ముసలాయన గుండు పగిలింది..
ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ బ్యాట్స్మన్ రజత్ పాటిధార్ కొట్టిన సిక్స్ ముసలాయన తల పగిలేలా చేసింది. శుక్రవారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 9వ ఓవర్ హర్ప్రీత్ బార్ వేశాడు. అప్పటికే రన్రేట్ పెరిగిపోతుడడంతో రజత్ పాటిధార్ భారీ షాట్లకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే తొమ్మిదో ఓవర్లో పాటిధార్ 102 మీటర్ల భారీ సిక్సర్ సంధించాడు. ఈ సిక్సర్ నేరుగా వెళ్లి, స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఓ ముసలాయన తలపైకి బంతి దూసుకొచ్చింది. దీంతో ఆయనకు గాయమై రక్తం కారడంతో వెంటనే పక్కనున్నవాళ్లు సేద తీర్చే ప్రయత్నం చేశారు. అయితే మొదట బంతి రూఫ్ టాప్ను తాకడంతో బంతిలో వేగం తగ్గినప్పటికి ఎత్తు నుంచి రావడంతో అతనికి కాస్త గట్టిగానే తగిలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక రజత్ పాటిధార్ మ్యాచ్లో 21 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 26 పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఇంగ్లండ్లో మ్యాచ్ ఆడుతున్న సమయంలో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కొట్టిన ఓ భారీ సిక్సర్, స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ముసలాయన తల పగలకొట్టింది. ఆ మ్యాచ్లో దాదా కొట్టిన సిక్సర్ దెబ్బకు ఆ ఇంగ్లండ్ వృద్ధుడి తల నుంచి రక్తం కారడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 10 ఓవర్ల వరకు పటిష్టంగానే కనిపించింది. వికెట్లు పడినప్పటికి ఓవర్కు 10 పరుగులు చొప్పున రాబట్టారు. అయితే ఆ తర్వాతే సీన్ మారిపోయింది. హర్ప్రీత్ బార్, రబాడలు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆర్సీబీపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితమై 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా..! Ben Stokes: వైరల్గా మారిన ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ చర్య pic.twitter.com/qeHViGpOka — Addicric (@addicric) May 13, 2022