Sensex BSE
-
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: ఆరంభ నష్టాల నుంచి తేరుకొన్న స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 466 పాయింట్ల పతనం నుంచి కోలుకున్న సెన్సెక్స్ చివరికి 29 పాయింట్ల నష్టంతో 75,967 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 22,945 వద్ద నిలిచింది. దీంతో సూచీల లాభాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా కాసేపు లాభాల్లో ట్రేడయ్యాయి.ఇండస్ట్రియల్, కన్జూమర్ డ్యూరబుల్స్, టెలికం, క్యాపిటల్ గూడ్స్, ఆటో, కన్జూమర్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో మిడ్ సెషన్ కల్లా సెన్సెక్స్ 466 పాయింట్లు క్షీణించి 75,531 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 22,801 వద్ద కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే మిడ్సెషన్ నుంచి ఐటీ, వినిమయ, ఆయిల్అండ్గ్యాస్, ఇంధన షేర్లు రాణించడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి.డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 10 పైసలు బలహీనపడి 86.98 వద్ద స్థిరపడింది. ⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2% క్షీణించింది. మిడ్ క్యాప్ సూచీ 0.19 శాతం నష్టపోయింది. రూ.400 లక్షల కోట్ల దిగువకు సంపద స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.2.10 లక్షల కోట్లు హరించుకుపోయాయి. గతేడాది ఏప్రిల్ 8న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్ను అందుకుంది. గత సెప్టెంబర్ 27న జీవితకాల గరిష్టం రూ.479 లక్షల కోట్లకు చేరుకుంది. నాటి నుంచి నాటి నుంచి ఏకంగా రూ.81 లక్షల కోట్లు హరించుకుపోయింది. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి!
ముంబై: స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. 1,000పైగా పాయింట్ల నష్టంతో 76,356 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతుండగా, నిఫ్టీ 305 పాయింట్లు కోల్పోయింది. మొత్తంగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు తెలుస్తోంది. మార్కెట్లు భారీగా క్షీణించడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.స్టీల్ టారిఫ్ ఆందోళనలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించి ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా క్షీణించాయి.పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్: పది సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి ఇండియా, అమెరికా గవర్నమెంట్ బాండ్లపై రాబడులు పెరిగాయి. ఈక్విటీల కంటే బాండ్లు సురక్షితం కాబట్టి, మదుపర్లు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దాంతో మార్కెట్లోని తమ పెట్టుబడులను ఉపసంహరించి బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు.ఇదీ చదవండి: రూ.6,000 కోట్లతో ‘అదానీ హెల్త్ సిటీస్’రంగాలవారీ ప్రభావం: లోహాలు, రియల్టీ, మీడియా, హెల్త్ కేర్ సహా వివిధ రంగాల షేర్లు భారీగా క్షీణించాయి. ఇది మొత్తం మార్కెట్ తిరోగమనానికి దోహదం చేసింది.అంతర్జాతీయ ఆర్థిక అంశాలు: అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. -
మూడో రోజూ లాభాలు
ముంబై: ఐటీసీ, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ షేర్ల రికార్డుల ర్యాలీతో పాటు ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో స్టాక్ సూచీలు మూడోరోజూ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు పెరిగి 72,832 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 83 పాయింట్లు బలపడి 22,097 వద్ద నిలిచింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 474 పాయింట్లు పెరిగి 73,115 వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 22,181 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే యాక్సెంసర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) ఆదాయ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఐటీ, టెక్ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి సూచీల లాభాలను పరిమితం చేసింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ ఇండెక్సులు వరుసగా 1.06%, 0.38% చొప్పున లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రంగాల వారీగా బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్ 2.28%, ఆటో 1.67%, రియల్టీ 1.40% కన్జూమర్ డి్రస్కిషనరీ 1.20%, ఇండస్ట్రీస్, మెటల్స్ 1.17%, ప్రభుత్వరంగ బ్యాంకులు 1% చొప్పున లాభపడ్డాయి. ఐపీఓకు స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్, శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ... కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. జాబితాలో మహారాష్ట్ర కంపెనీ స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమి కల్స్, మధ్యప్రదేశ్ కంపెనీ శ్రీ తిరుపతి బాలాజీ ఆగ్రో ట్రేడింగ్ ఉన్నాయి. జీవితకాల కనిష్టానికి రూపాయి రూపాయి విలువ శుక్రవారం జీవితకాల కనిష్ట స్థాయి 83.61 వద్ద ముగిసింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలు, డాలర్ బలోపేత ధోరణి, దేశీయ క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం రూపాయి కోతకు కారణమయ్యాయని ట్రేడర్లు తెలిపారు. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంతో పోలిస్తే 83.28 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో ఏకంగా 52 పైసలు క్షీణించి 83.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 48 పైసలు కోల్పోయి జీవితకాల కనిష్టం 83.61 వద్ద ముగిసింది. కాగా, ఇప్పటి వరకూ డాలర్ మారకంలో రూపాయి కనిష్ట ముగింపు (2023 డిసెంబర్13) 83.40 గా ఉంది. -
71,000 శిఖరంపై సెన్సెక్స్
ముంబై: ఐటీ, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన షేర్లు రాణించడంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 71,000 పాయింట్ల ఎగువన ముగిసింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీలు తాజా గరిష్టాలు నమోదు చేశాయి. వచ్చే ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల ప్రభావం భారత్తో సహా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై కొనసాగింది. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, ఎఫ్ఐఐల వరుస కొనుగోళ్లు అంశాలు కలిసొచ్చాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదిలాయి. సెన్సెక్స్ 70,804 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 1,092 పాయింట్లు ఎగసి 71,484 వద్ద కొత్త జీవితకాల గరిష్టం తాకింది. చివరికి 970 పాయింట్లు లాభపడి 71,484 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో నిఫ్టీ 310 పాయింట్లు బలపడి 21,492 వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆఖరికి 274 పాయింట్లు లాభపడి 21,457 వద్ద నిలిచింది. ఎఫ్ఎంసీజీ, ఆటో, రియలీ్ట, సేవా రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► సూచీల రికార్డుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ గత ట్రేడింగ్ సెషన్లలో రూ.8.11 లక్షల కోట్ల పెరిగి రూ.357.87 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ ఐదు మాత్రమే నష్టపోయాయి. ఇక వారం మొత్తంగా సెన్సెక్స్ 1,658 పాయింట్లు, నిఫ్టీ 487 పాయింట్లు చొప్పున లాభాలు నమోదు చేశాయి. ఇరు సూచీలకిది వరుసగా ఏడో వారం లాభాల ముగింపు. ► పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ ఐపీఓకు చివరిరోజు నాటికి 93.40 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ మొత్తం 88.37 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 82.54 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 115.97 రెట్లు, రిటైల్ కోటా 69.10 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటా 66.47 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. ► డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువెత్తడం, స్టాక్ సూచీల కొత్త శిఖరాలకు ► ఫెడ్ వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపు, ద్రవ్యోల్బణం దిగివచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో ఐటీ షేర్లు రెండో రోజూ లాభపడ్డాయి. ఇనీ్ఫబీమ్ 12%, జెన్సార్ టెక్ 11%, మెస్టేక్ 6.50%, హెచ్సీఎల్ టెక్ 6%, పర్సిస్టెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు 5%, కో ఫోర్జ్, సైయంట్ 4%, టెక్ మహీంద్రా 3 చొప్పున లాభపడ్డాయి. ► బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేరు ఒకటిన్నర శాతం లాభపడి రూ.91.24 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.ఒక లక్షల కోట్లను అధిగిమించింది. -
70,000 వాలా!
ముంబై: స్టాక్ మార్కెట్ రికార్డు ర్యాలీలో భాగంగా సెన్సెక్స్ సరికొత్త మైలురాయిని తాకింది. 44 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 70,000 పాయింట్లను తాకింది. మరో సూచీ నిఫ్టీ 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో నిలిచింది. కొంతకాలంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది., ఆర్బీఐ వరుసగా అయిదోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు దేశీయ వృద్ధి అవుట్లుక్ను పెంచింది. అయిదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. దీంతో కొన్ని వారాలుగా దలాల్ స్ట్రీట్లో కొనుగోళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త రికార్డుల దిశగా సాగుతున్నాయి. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) నిర్ణయాలు బుధవారం వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. ఒడిదుడుకులున్నా.., సరికొత్త శిఖరాలకు .... ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 69,926 వద్ద, నిఫ్టీ నాలుగు పాయింట్లు నష్టపోయి 20,965 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్ షేర్లకు రాణించడంతో ప్రథమార్ధంలోనే 232 పాయింట్లు పెరిగి 70,000 స్థాయిపై 70,058 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు బలపడి 21,026 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అయితే ద్వితీయార్ధంలో రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో సూచీలు కొంతమేర లాభాలు కొల్పోయాయి. చివరికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 69,929 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు బలపడి 21,000 శిఖరానికి కేవలం 3 పాయింట్ల దూరంలో 20,997 నిలిచింది. ‘‘కొత్త ఏడాదికి సరిగ్గా 20 రోజుల ముందు సెన్సెక్స్ 70 వేల పాయింట్ల ధమాకా ఇచి్చంది. అయితే నేడు(మంగళవారం) అమెరికా, భారత్ల నవంబర్ ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ)డేటా వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. మరో ఏడాది కాలంలో సెన్సెక్స్ 80 వేల స్థాయిని అందుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మౌలిక, ప్రభుత్వ రంగాల షేర్లు ర్యాలీకి ప్రాతినిథ్యం వహించవచ్చు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లో కొంత అస్థిరతర ఉండొచ్చు.’’ అని మార్కెట్ నిపుణుడు విజయ్ కేడియా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నిధుల సమీకరణ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టింగ్ ప్రణాళికల నేపథ్యంలో స్పైస్జెట్ షేరు. బీఎస్ఈలో 10%పైగా లాభపడి రూ.60.57 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 16% ఎగసి రూ.63.69 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► అమెరికా నియంత్రణ సంస్థ హైదరాబాద్ రీసెర్చ్ ఫ్యాకల్టీ యూనిట్కు 3 అభ్యంతరాలు జారీ చేయడంతో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ 5% నష్టపోయి రూ.5,473 వద్ద స్థిరపడింది. ► ఓఎన్జీసీ నుంచి రూ.1,145 కోట్ల ఆర్డరు దక్కించుకోవడంతో మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ షేరు 3% పెరిగి రూ.2118 వద్ద నిలిచింది. ► సెన్సెక్స్ 65,000 స్థాయి నుంచి 70,000 పాయింట్లకు చేరేందుకు కేవలం 110 రోజుల సమయం పట్టింది. ► 1979లో 100 పాయింట్ల వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించిన సెన్సెక్స్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి 70 వేల స్థాయికి చేరుకుంది. అంటే 44 ఏళ్లలో సెన్సెక్స్ ఇన్వెస్టర్లకు 700 రెట్ల లాభాలు పంచింది. ► సెన్సెక్స్ కొత్త రికార్డు స్థాయి నెలకొల్పడంతో సోమవారం రూ.1.85 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.351.09 లక్షల కోట్లకు చేరింది. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రతికూల అంశాలు ప్రభావం చూపడంతో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 64,756.11 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 65,014.06 పాయింట్ల గరిష్ఠానికి, 64,580.95 పాయింట్ల కనిష్టాన్ని నమోదు చేసింది. ముగింపు దశలో ఒక్కసారిగా కొనుగోళ్లు పుంజుకొని లాభాల్లోకి వెళ్లాయి. చివరకు 72 పాయింట్ల లాభంతో 64,904 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు లాభంతో 19,425 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా కంన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్లు లాభాలు గడించగా.. మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. -
భారత్ లోని 5 కంపెనీలు వల్లే ద్రవ్యోల్బణం పెరుగుతోంది
-
నిపుణుల అంచనాల తలకిందులు.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే వారి అంచనాల్ని తలకిందులు చేస్తూ సోమవారం ఉదయం దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఉదయం 9.40 గంటల సమయానికి సెన్సెక్స్ 224 పాయింట్లు నష్టపోయి 59239 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల స్వల్ప నష్టాల్లో ఉండగా 76 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాలు తగ్గాయి. దీంతో ఆ కంపెనీకి చెందిన అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్ని ముటగట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, ఐసీఐసీ బ్యాంక్, ఎస్బీఐ, నెస్లే, బీపీసీఎల్,కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏసియన్ పెయింట్స్,హెచ్డీఎఫ్సీ, అల్ట్రా టెక్ సిమెంట్స్, బ్రిటానియా షేర్లు పాజిటీవ్గా ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో,యూపీఎల్,ఇన్ఫోసిస్,ఎథేర్ మోటార్స్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎయిర్టెల్,హెచ్సీఎల్,టెక్ మహీంద్రా, విప్రో,టీసీఎస్, హీరో మోటో కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. -
అమ్మకాల ఒత్తిడిలో మదుపర్లు, నష్టాల్లో దేశీ స్టాక్ సూచీలు
జాతీయ,అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.అమెరికాతో పాటు ఆసియా మార్కెట్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, భారత్లో యూనియన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మదపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. వెరసి మంగళవారం ఉదయం 9.37 గంటల సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టంతో 59341 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ అత్యల్పంగా 47 పాయింట్ల నష్ట పోయి 17601 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇక బీపీసీఎల్, ఓఎన్జీసీ, జేఎస్డ్ల్యూ స్టీల్, యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్,అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎం అండ్ ఎం, మారుతి సుజికి, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, సిప్లా, సన్ ఫార్మా, హెచ్సీఎల్, టీసీఎస్, లార్సెన్,హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
వేదాంత డివిడెండ్ రూ.17.50
న్యూఢిల్లీ: మైనింగ్ కంపెనీ వేదాంత లిమిటెడ్ మరోసారి భారీ డివిడెండ్ను వాటాదారులకు ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున 2022–23 సంవత్సరానికి మూడో మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని మంగళవారం నాటి బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఈ రూపంలో కంపెనీ రూ.6,505 కోట్లను చెల్లించనుంది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ.58,597 కోట్లుగా ఉంది. రుణాలు తీర్చడానికి బదులు వాటాదారులకు భారీ మొత్తంలో డివిడెండ్ ఇవ్వడానికి కంపెనీ ప్రాధాన్యం ఇవ్వడం గమనించాలి. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో వాటా ఉంది. దీంతో డివిడెండ్ రూపంలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరనున్నాయి. డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ తేదీగా నవంబర్ 30ని ప్రకటించింది. వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొదటి మధ్యంతర డివిడెండ్ కింద రూ.31.50, రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.19.50 చొప్పున ఇవ్వడం గమనించాలి. ఈ మొత్తం కలిపి చూస్తే ఏడాది కాలంలో రూ.68.50 వరకు డివిడెండ్ కింద ఇచ్చినట్టయింది. -
స్టాక్ మార్కెట్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నమోదు
న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)లను లిస్టింగ్కు అనుమతించడం ద్వారా పెట్టుబడుల సమీకరణ మార్గాలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశలో ఆర్ఆర్బీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు వీలుగా ఆర్థిక శాఖ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాథమిక మూలాలు తదితర అంశాలను రూపొందించింది. వీటి ప్రకారం గత మూడేళ్లలో కనీసం రూ. 300 కోట్ల నెట్వర్త్ను కలిగి ఉండాలి. అంతేకాకుండా నిబంధనలు డిమాండ్ చేస్తున్న 9 శాతం లేదా అంతకుమించిన కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్)ని గత మూడేళ్లలో నిలుపుకుని ఉండాలి. ఈ బాటలో మూడేళ్లుగా లాభాలు ఆర్జిస్తుండటంతోపాటు.. గత ఐదేళ్లలో మూడేళ్లు కనీసం రూ. 15 కోట్లు నిర్వహణ లాభం సాధించిన సంస్థనే లిస్టింగ్కు అనుమతిస్తారు. సంస్థ నష్టాలు నమోదు చేసి ఉండకూడదు. గత ఐదేళ్లలో మూడేళ్లపాటు ఈక్విటీపై కనీసం 10 శాతం రిటర్నులు అందించిన సంస్థకు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల సహకారంతో ఆర్ఆర్బీలు వ్యవసాయ రంగానికి రుణాలందించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ప్రస్తుతం ఆర్ఆర్బీలలో కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటాను కలిగి ఉంటోంది. మరో 35 శాతం సంబంధిత పీఎస్యూ బ్యాంకుల వద్ద, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. -
స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్! రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి!
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, అదుపులోకి రాని క్రూడ్ ఆయిల్ ధరలు, చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు అన్ని మార్కెట్లను అతలాకుతలం చేశాయి. దీంతో సోమవారం మొత్తం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. ఎన్నడూ చూడని రీతిలో షేర్లు పతననమవడంతో రోజంతా బ్లడ్ బాత్ కొనసాగింది. కేవలం ఒక్కరోజులోనే రూ7లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరై పోయింది. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1456 పాయింట్ల భారీ నష్టంతో 52,846 వద్ద నిఫ్టీ 427 పాయింట్ల నష్టంతో 15,744 వద్ద ట్రేడింగ్ ముగిసింది. బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు నష్టపోయాయి. బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, మెటల్, ఐటీ, రియల్ ఎస్టేట్, పీఎస్యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్తో సహా ఇలా అన్నీ సెక్టార్ల షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. 2020 తర్వాత తొలిసారిగా గత వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇలా వారం రోజుల పాటు నష్టాలతో కొట్టుమిట్టాడాయి. కానీ ఈ వారంలో వరుసగా ఆరు రోజులుగా కొనసాగిన నష్టాలకు స్టాక్ మార్కెట్లు చెక్ పెట్టాయి. దీంతో సోమవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 180 పాయింట్లుతో 0.34 శాతం పెరిగి 52,974 వద్ద ముగియగా, నిఫ్టీ 60 పాయింట్లతో 0.38 శాతం పెరిగి 15,842 వద్ద స్థిరపడింది. ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్,ఎన్టీపీసీ,యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్ బీఐ, మారుతి సుజికీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాలతో ముగియగా.. ఆల్ట్రాటెక్ సిమెంట్,శ్రీ సిమెంట్, ఏసియన్ పెయింట్స్,ఐటీసీ, గ్రాసిం, దివిస్ ల్యాబ్స్,టెక్ మహీంద్రా, నెస్లే, టీసీఎస్ షేర్లు నష్టాల పాలయ్యాయి. -
కోలుకునేది ఎప్పుడో, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. ఆర్బీఐ ఆకస్మిక రెపోరేటు పెంపుతో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్ 927 పాయింట్లు భారీగా నష్టపోయి 54774 వద్ద నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 16401 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి.బ్లూడార్ట్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్, అంబీర్ ఎంటర్ ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజికీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కో, అపోలో హాస్పిటల్, హెచ్సీఎల్ టెక్నాలజీ, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
ఒడిదుడుకుల మార్కెట్, పరుగులు పెట్టిన ఐటీ షేర్లు!
ముంబై: ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో విఫలమైన స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 898 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్ చివరికి 33 పాయింట్ల లాభంతో 55,702 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 268 పాయింట్లు వరకు ర్యాలీ చేసింది. మార్కెట్ ముగిసే సరికి ఐదు పాయింట్ల అతి స్వల్ప లాభంతో 16,683 వద్ద నిలిచింది. దీంతో సూచీలు మూడురోజుల నష్టాలకు బ్రేక్ పడినట్లైంది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఐటీ, మెటల్, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్సులు అరశాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,075 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,229 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 16 పైసలు బలపడి 76.24 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్యపాలసీ ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. భారీ లాభాల నుంచి ఫ్లాట్గా ముగింపు ఆర్బీఐ ఆకస్మిక రెపోరేటు పెంపుతో బుధవారం భారీగా నష్టపోయిన దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 586 పాయింట్లు పెరిగి 56,255 వద్ద, నిఫ్టీ 177 పాయింట్ల లాభంతో 16,855 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఒక దశలో సెన్సెక్స్ 898 పాయింట్లు దూసుకెళ్లి 56,567 వద్ద, నిఫ్టీ 268 పాయింట్లు 16,946 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అయితే మిడ్సెషన్ నుంచి అమ్మకాల వెల్లువెత్తడంతో ఆరంభ లాభాల్ని కోల్పోయి ఫ్లాట్గా ముగిశాయి. ‘‘ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు అంశాలను డిస్కౌంట్ చేసుకున్న ఇన్వెస్టర్లు తొలి సెషన్లో కనిష్ట స్థాయిల వద్ద షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. దేశీయ సేవా రంగ కార్యకలాపాలు ఏప్రిల్లో పుంజుకొని ఐదు నెలల గరిష్టానికి చేరుకోవడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. అయితే మిడ్సెషన్ నుంచి అధిక వెయిటేజీ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. దీనికి తోడు అమెరికా స్టాక్ ఫ్యూచర్లు అనూహ్యంగా నష్టాల్లోకి మళ్లడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీల ఆరంభ లాభాలన్నీ మాయమయ్యాయి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ►ఒడిదుడుకుల మార్కెట్లో ఐటీ షేర్లు రాణించాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్ షేర్లు 4% నుంచి 1%లాభపడ్డాయి. ►మార్చి క్వార్టర్లో నికరలాభం రెండు రెట్లు పెరగడంతో ఏబీబీ ఇండియా షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 10.5% పెరిగి రూ.2,224 వద్ద స్థిరపడింది. ►ట్రేడింగ్లో 12% ర్యాలీ చేసి రూ. 2,251 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ►షేర్ల బైబ్యాక్ను చేపట్టేందుకు సిద్ధమవుతుందనే వార్తలతో మాట్రిమోనీడాట్ కామ్ షేరు 5% లాభంతో రూ.729 వద్ద స్థిరపడింది. -
ఎల్ఐసీ ఐపీవో.. క్యూకడుతున్న యాంకర్ ఇన్వెస్టర్లు!
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించింది. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. తద్వారా రూ. 21,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 5.92 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది. వీటి విలువ రూ. 5,620 కోట్లు కాగా.. సోమవారం(2న) ఈ విభాగంలో రూ. 7,000 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా సావరిన్ వెల్త్ఫండ్స్, దేశీ మ్యూచువల్ ఫండ్స్ ఆసక్తి చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 20 యాంకర్ సంస్థలు ఆసక్తి చూపినట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. షేరుకి రూ.902–949 ధరలో చేపట్టిన ఇష్యూ బుధవారం(4న) ప్రారంభమై సోమవారం(9న) ముగియనుంది. అతిపెద్ద ఇష్యూ..: రూ. 21,000 కోట్ల సమీకరణ ద్వారా దేశీయంగా ఎల్ఐసీ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించనుంది. ఇంతక్రితం 2021లో రూ. 18,300 కోట్లు సమీకరించిన వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) ఇప్పటివరకూ భారీ ఐపీవోగా నిలుస్తోంది. 2010లో రూ. 15,200 కోట్ల సమీకరణతో లిస్టింగ్ సాధించిన పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా తదుపరి ర్యాంకును సాధించింది. కాగా.. తాజా ఐపీవోలో ఎల్ఐసీ పాలసీదారులకు 2,21,37,492 షేర్లు, ఉద్యోగులకు 15,81,249 షేర్లు విక్రయించనుంది. పాలసీదారులకు షేరు ధరలో రూ. 60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ. 45 చొప్పున రాయితీని ఇస్తోంది. ఈ నెల 17న ఎల్ఐసీ లిస్ట్కానుంది. చదవండి👉ఎల్ఐసీ షేరు ధర ఆకర్షణీయం... -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!
ప్రపంచ దేశాల్లో నెలకొన్న ప్రతికూలతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపలేదు. దీంతో గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం రష్యా–ఉక్రెయిన్ యుద్ధ వేడి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు వంటి తదితర ప్రతికూల అంశాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో బుధవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 537 పాయింట్లు పతనమై 56,819 వద్ద నిలవగా.. నిఫ్టీ 162 పాయింట్లు క్షీణించి 17,038 వద్ద ముగిసింది. అయితే ఆ ప్రభావం గురువారం సైతం మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా గురువారం అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అమెరికాలో క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో ముదుపర్లు పెట్టుబుడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఆ ప్రభావంతో పాటు భారత్ ఎకానమీ వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండడంతో దేశీయ మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 9.17 నిమిషాలకు నిఫ్టీ 256 పాయింట్లు లాభపడి 57082 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 17122 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. హెచ్యూఎల్, దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా,యూపీఎల్,అపోల్ ఆస్పిటల్,ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,ఎథేర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్,ఎసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్, బ్రిటానియా,భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, టీసీఎస్, ఎన్టీపీసీ,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు!
ఆర్బీఐ పాలసీ సమావేశ నిర్ణయాల ప్రకటన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు ఉదయం 9.35గంటలకు సెన్సెక్స్ 32 పాయింట్లు లాభపడి 59060 వద్ద, నిఫ్టీ 24పాయింట్లు లాభపడి 17654 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. కోల్ ఇండియా, యూపీఎల్, టాటాకాన్స్, హిందాల్కో, జేఎస్డ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, బ్రిటానియా, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కిప్లా, టెక్ మహీంద్రా,టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్టీపీసీ, హీరో మోటోకార్పొరేషన్ యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
మార్కెట్: క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నా ఈ స్టాక్స్కు ఢోకాలేదు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయుల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని ముడి వనరుగా ఉపయోగించే కొన్ని రంగాల సంస్థల మార్జిన్లు, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పీజీఐఎం ఇండియా మ్యుచువల్ ఫండ్ హెడ్ (ఈక్విటీస్) అనిరుద్ధ నహా తెలిపారు. ముడి చమురు అధిక ధరల వల్ల ద్రవ్యోల్బణంతో పాటు వాణిజ్య లోటు.. ద్రవ్య లోటు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈక్విటీ మార్కెట్ల విషయంలో ఆచి తూచి వ్యవహరించనున్నట్లు అనిరుద్ధ వివరించారు. ఆదాయాలపరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం మెరుగ్గా కనిపిస్తోందని, ఇటీవల కొంత కరెక్షన్ తర్వాత ఐటీ స్టాక్స్ ఆకర్షణీయ ధరలో ఉన్నాయని ఆయన చెప్పారు. టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరుగుతుండటం .. ఐటీ రంగానికి తోడ్పాటునివ్వగలదని పేర్కొన్నారు. ఇక డిమాండ్ రికవరీ అనేది పారిశ్రామిక ఉత్పత్తుల సంస్థలకు సానుకూలమని తెలిపారు. సుదీర్ఘ మందగమనం తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరిగి కోలుకుంటోందని, సమీప భవిష్యత్తులో ఇది నిలకడగా వృద్ధి చెందవచ్చని చెప్పారు. క్రూడాయిల్ ధరలు దిగి వస్తే.. రాబోయే మూడేళ్లలో కొన్ని ఆటో, ఆటో అనుబంధ కంపెనీలు సముచిత స్థాయిలో వృద్ధి చెందగలవని భావిస్తున్నట్లు అనిరుద్ధ వివరించారు. అయిదేళ్లు కార్పొరేట్లకు సానుకూలం.. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో క్రూడాయిల్ రేట్లు భారీగా ఎగియడం వల్ల సమీప భవిష్యత్తులో కాస్త సవాళ్లు నెలకొనవచ్చని అనిరుద్ధ చెప్పారు. అయితే, ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా ఇన్వెస్టర్లు ఎన్నో చూశారని.. కంపెనీల వృద్ధి, లాభదాయకత ఆధారంగా మార్కెట్లు పుంజుకుంటూనే ఉన్నాయన్నారు. ‘‘ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి వ్యవస్థాగత మార్పులు కార్పొరేట్లకు సానూకూలాంశాలు. డిమాండ్ పుంజుకునే కొద్దీ అమ్మకాలు, లాభాలు వృద్ధి చెంది వచ్చే మూడు నుంచి అయిదేళ్ల పాటు దేశీ కార్పొరేట్లకు మెరుగ్గా ఉండగలదు‘‘ అని ఆయన పేర్కొన్నారు. మూడు నుంచి అయిదేళ్ల కాలవ్యవధితో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నాయని అనిరుద్ధ చెప్పారు. మ్యుచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు సంబంధించి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాలను, రాబడుల అంచనాలను బేరీజు వేసుకుని తదనుగుణమైన వ్యూహాన్ని పాటించాలని అనిరుద్ధ సూచించారు. తగు స్థాయి రిస్కు తీసుకోగలిగి, కనీసం మూడేళ్లకు మించి ఇన్వెస్ట్ చేయగలిగే వారు ఫ్లెక్సిక్యాప్ లేదా మిడ్క్యాప్ వ్యూహాన్ని ఎంచుకోవచ్చన్నారు. మరింత దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న వారు స్మాల్ క్యాప్ ఫండ్స్లో పరిశీలించవచ్చని అనిరుద్ధ పేర్కొన్నారు. -
అదృష్టం అంటే వీళ్లదే..! లక్షపెట్టుబడితో రూ.18లక్షలు లాభం..!
దేశీయ స్కాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్ తారా జువ్వలా దూసుకెళ్తున్నాయి. నవంబర్ 2, 2020న రూ.4.18 పైసలున్న సాఫ్ట్వేర్ కంపెనీ బ్రైట్.కామ్ గ్రూప్ స్టాక్స్ ఏడాది తిరిగే సరికల్లా ఆ స్కాక్స్ వ్యాల్యూ రూ.75.40కి చేరింది. దీంతో ఈ పెన్నీ స్టాక్స్ కొన్న ఇన్వెస్టర్లకు పంట పడినట్లైంది. లక్ష పెడితే రూ.18.03లక్షలు ఉదాహరణకు బ్రైట్.కామ్ గ్రూప్ షేర్లలో ఏడాది క్రితం లక్ష పెట్టుబడి పెడితే ఈరోజు ఆ లక్షకాస్త రూ.18.03 లక్షలైంది. ఈ మధ్యకాలంలో సెన్సెక్స్ 47.89 శాతం పెరగడంతో ఆ స్కాక్స్ వ్యాల్యూ అమాంతం పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 13న షేరు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరి రూ.90.55ను తాకింది. నిన్న(నవంబర్ 4న) దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సెషన్లో షేరు 0.87% లాభంతో రూ.75.40 వద్ద ముగిసింది. బీఎస్ఈలో ఈ కంపెనీ మొత్తం 2.78 లక్షల షేర్లు ఉండగా రూ. 2.10 కోట్ల టర్నోవర్ను సాధించడంతో బ్రైట్ కామ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ రూ.7,853.91 కోట్లకు చేరింది. సంవత్సరంలోనే ఇంత లాభమా బ్రైట్కామ్ గ్రూప్ షేర్లు ఈ సంవత్సరం ప్రారంభం నుండి 1,002 శాతం లాభపడ్డాయి. కేవలం ఒక్కనెలలో 17 శాతం పెరిగాయి. బ్రైట్కామ్ గ్రూప్ షేర్లు 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల వ్యాల్యూ స్థిరంగా సగటు కంటే ఎక్కువగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.కాగా బ్రైట్.కామ్ గ్రూప్ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, ఏజెన్సీలు, ఆన్లైన్ ప్రచురణకర్తలకు డిజిటల్ మార్కెటింగ్ పరిష్కారాల్ని అందిస్తుంది. కరోనా కారణంగా ఆన్లైన్ సర్వీసులు పెరగడంతో ఆ షేర్ వ్యాల్యూ భారీగా పెరిగినట్లు ఇన్వెస్టర్లు తెలిపారు. పెన్నీ స్టాక్స్ అంటే దేశీయ స్కాక్ మార్కెట్లో రిజిస్టరైన కంపెనీ షేర్ వ్యాల్యూ రూ.10 కన్నా తక్కువగా ఉంటే ఆ స్కాక్స్ను పెన్నీ స్కాక్స్ అంటారు. -
అదే దూకుడు.. లాభాల్లో సూచీలు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లో సూచీలు సానుకూలంగా ఉండటం, ఇటు ఏషియా మార్కెట్లు సైతం లాభాల బాటలో పయణిస్తుండటం దేశీ మార్కెట్ల జోరుకు మరింత ఊతం ఇచ్చాయి. గత కొంత కాలంగా కొనసాగుతోన్న బుల్ జోరుని మరింతగా పెంచాయి. దీంతో ఈ రోజు మార్కెట్ ప్రారంభమైన కొద్ది సేపటికే బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు ఆల్టైం హైలను టచ్ చేశాయి. ఈ రోజు ఉదయం 9:50 గంటల సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 62,123 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్ఎస్సీ నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 18,571 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఈ రోజు నిఫ్టీ ప్రారంభం కావడమే 18,602 పాయింట్లతో మొదలై ఆల్టైం హైని టచ్ చేసింది. ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, ఆల్ట్రాటెక్, టైటాన్, పవర్గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. -
సెన్సెక్స్ సరికొత్త రికార్డ్, 58 వేల మార్క్ క్రాస్
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9:54 గంటల సమయానికి సెన్సెక్స్ 58 వేల మార్క్ ను క్రాస్ చేసి సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసి 119 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 60.75 పాయింట్ల లాభంతో 17,294 వద్ద ట్రేడింగ్ కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో బీఎస్ఈ 30 సూచీలో దాదాపు సగానికిపైగా కంపెనీల షేర్ల లాభాలు కంటిన్యూ అవుతున్నాయి. వీటిలో కొటాక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, టైటన్,ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉండగా హెచ్సీఎల్ టెక్, హెచ్యూఎల్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, మారుతీ షేర్లు నష్టాల బాట పట్టాయి. -
మళ్లీ బుల్ పరుగులు
ముంబై: ఒకరోజు నష్టాల ముగింపు తర్వాత స్టాక్ సూచీలు గురువారం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్స్ షేర్లలో చెప్పుకోదగ్గ కొనుగోళ్లు జరిగాయి. లార్జ్క్యాప్ షేర్లైన టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ షేర్లు మూడు శాతం వరకు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. ఫలితంగా సెన్సెక్స్ 514 పాయింట్లు ఎగసి 57,853 వద్ద ముగిసింది. ఒక దశలో 554 పాయింట్ల వరకు ర్యాలీ చేసి 57,892 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 17,234 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ 169 పాయింట్లు ర్యాలీ చేసి 17,246 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఆల్టైం హై ముగింపులు కావడం విశేషం. అంతకు ముందు(బుధవారం) ట్రేడింగ్లో పతనమైన షేర్లకు అధిక డిమాండ్ నెలకొంది. సూచీలు జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలైన ఎఫ్ఎమ్సీజీ, ఐటీ షేర్లను కొనేందుకు అధికాసక్తి చూపారు. సెమికండక్టర్ కొరతతో ఆగస్టు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆటో రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.349 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.382 కోట్ల ఈక్విటీలను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లోనూ రూపాయి 2 పైసలు బలపడి 73.06 వద్ద స్థిరపడింది. అమెరికా ఉద్యోగ గణాంకాల విడుదలకు ముందు అప్రమత్తతతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. బుల్ జోరుతో ఇన్వెస్టర్లకు రూ.2.5 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.252.66 లక్షల కోట్లకు చేరింది. ‘‘జీడీపీతో సహా ఇటీవల విడుదలైన దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ వర్గాలను మెప్పించగలిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందనే ఆశావాదంతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీయ ఈక్విటీ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 17100 కీలక నిరోధాన్ని ఛేదించిన తర్వాత మరింత దూసుకెళ్లింది. ప్రస్తుత ట్రేడింగ్ స్థాయి(17200–17250)ని నిలుపుకోగలిగితే మూమెంటమ్ కొనసాగి 17,400 – 17450 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని ఆనంద్ రాఠి ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నరేందర్ సోలంకీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు ► నిధుల సమీకరణ అంశంపై బోర్డు సమావేశాని(శుక్రవారం)కి ముందు హెచ్డీఎఫ్సీ లైఫ్ షేరు ఎనిమిది శాతం ఎగసి రూ.776 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 6% లాభంతో రూ.759 వద్ద ముగిసింది. ► మధ్యంతర డివిడెండ్ ప్రకటన తర్వాత వేదాంత షేరుకు డిమాండ్ నెలకొంది. మూడు శాతం ర్యాలీ చేసి రూ. 306 వద్ద స్థిరపడింది. ► కెనడా దేశంలోని స్థానిక ఫార్మా మార్కెట్లోకి రెవెలిమిడ్ జనరిక్ ఔషధాన్ని విడుదల చేయడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేరు రెండు శాతం లాభపడి రూ.4,857 వద్ద నిలిచింది. ► రూ.1000 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వడంతో కైటెక్స్ గార్మెంట్స్ షేరు పదిశాతం లాభంతో రూ.164 వద్ద ముగిసింది. -
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9.32 గంటల సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు నష్టపోయి 55,795 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుండగా నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 16,609 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. -
రికార్డ్ల వేట, భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతుంది. ప్రధాన సూచీలు గరిష్టస్థాయిలో సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాయి. బుధవారం ఉదయం 9.36 గంటల సమయానికి సెన్సెక్స్ సరికొత్త రికార్డ్ లను నమోదు చేసింది. సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 56119 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 16683 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్,హిందాల్కో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా,మౌలిక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన రూ.6 లక్షల కోట్ల జాతీయ మానిటైజేషన్ పైప్లైన్(ఎన్ఎంపీ) కార్యక్రమం మార్కెట్ సెంటిమెంట్ను బలపరచడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రపంచ ప్రతికూలతలు పడేశాయ్
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ మార్కెట్ రెండో రోజూ వెనకడుగు వేసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం సెంటిమెంట్ను దెబ్బతీసింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సమావేశపు మినిట్స్ బుధవారం వెల్లడయ్యాయి. కరోనా సంక్షోభ సమయంలో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలను ఉపసంహరించుకునే(ట్యాపరింగ్) అంశంపై ఫెడ్ అధికారులు చర్చించినట్లు మినిట్స్లో వెల్లడైంది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతారన్న భయాలు తెరపైకి వచ్చాయి. చదవండి : 5g Smartphone : దూసుకెళ్తున్న అమ్మకాలు వ్యాక్సినేషన్ తక్కువగా నమోదైన ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. సరైన సమాచారం ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ తమ దేశానికే చెందిన దిగ్గజ ఐటీ సంస్థలపై చైనా రెగ్యులేటరీ కఠిన ఆంక్షలను విధించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లు పతనబాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్కు అనుగుణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజూ క్షీణించాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమై 55,329 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లను కోల్పోయి 16,500 దిగువను 16,450 వద్ద నిలిచింది. మార్కెట్ పతనంలో భాగంగా మెటల్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాలు ఆగలేదు. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు రెండుశాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడటంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 15 పైసలు పతనమై 74.39 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,287 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.119 కోట్ల షేర్లను కొన్నారు. మెటల్ షేర్లలో మంటలు... ఈ ఏడాదిలో చైనా స్టీల్ ఉత్పత్తి భారీగా తగ్గిపోవచ్చని ప్రముఖ మైనింగ్ కంపెనీ బీహెచ్పీ గ్రూప్ తన కమోడిటీ అవుట్లుక్లో తెలపడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐరన్ ఓర్ ఫ్యూచర్లు నెలరోజుల కనిష్టానికి కుప్పకూలిపోయాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మెటల్ షేర్లపైనా పడటంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఆరున్నర పతనాన్ని చవిచూసింది. ఎన్ఎండీసీ, వేదాంత, టాటా స్టీల్, సెయిల్, జిందాల్ స్టీల్ షేర్లు పదిశాతం నుంచి ఎనిమిదిశాతం క్షీణించాయి. కార్ట్రేడ్ టెక్ ... లిస్టింగ్లో డీలా ఆటో క్లాసిఫైడ్ సంస్థ కార్ట్రేడ్ టెక్ షేర్లు లిస్టింగ్ తొలిరోజే డీలాపడ్డాయి. ఇష్యూ ధర రూ.1,618తో పోలిస్తే బీఎస్ఈలో ఒకశాతం డిస్కౌంట్తో రూ.1,600 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో 9% క్షీణించి రూ.1475 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 7% నష్టంతో రూ.1501 వద్ద ముగిశాయి. -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న బుల్ జోరుకి బ్రేకులు పడింది. శుక్రవారం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. యరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అంచనాల(2.2%)ను మించుతూ యూరోజోన్ ద్రవ్యోల్బణం 2.20 శాతంగా నమోదుకావడంతో యూరప్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. వాటి ప్రభావం దేశీ మార్కెట్ పై పడింది. దీంతో శుక్రవారం 9.34 గంటల సమయానికి దేశీ మార్కెట్లో సెన్సెక్స్ 165.80 పాయింట్లు క్షీణించి 55,296 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 111.30 పాయింట్లు నష్టపోయి 16,457.55 పాయింట్లతో ట్రేడ్ కొనసాగుతుంది. టాటాస్టీల్, హీరో మోటో కార్ప్, టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
మంగళవారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.భారత్, రష్యా ద్వైపాక్షిక ఇంధన సహకార బలోపేతంపై దృష్టి సారించడంతో పాటు..రష్యాలోని ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులపై భారత్ పెట్టుబడులు 15 బిలియన్ డాలర్లను మించడం వంటి అంశాలు మార్కెట్పై ప్రభావాన్ని చూపాయి. దీంతో మంగళవారం ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్సె 71.30 పాయింట్ల లాభంతో 55,653 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 10.50 స్వల్ప లాభంతో 16,573 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. మాస్ ఫిన్ సర్వీస్, డీసీఎం శ్రీరామ్, అపోలో హాస్పిటల్, eClerx సర్వీసెస్, పెట్రో నెట్ ఎల్ఎన్జీ స్టాక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
రంకెలేసిన బుల్, లాభాల్లో స్టాక్ మార్కెట్లు
శుక్రవారం స్టాక్ మార్కెట్లో బుల్ రంకెలేసింది. కొనుగోళ్ల అండతో ఉత్సాహంగా ఉరకలేసింది. దీంతో ఉదయం ప్రారంభం నుంచి దేశీయ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ఏకంగా 55,060 పాయింట్లను టచ్ చేసింది. దీంతో సెన్సెక్స్ 216.44 పాయింట్లు లాభపడి 55,060వద్ద కొనసాగుతుంది. అదే సమయంలో నిఫ్టీ సైతం ఫ్రెష్ హై రికార్డ్ లను క్రియేట్ చేస్తూ 67 పాయింట్ల లాభంతో 16,441.25తో పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా పెట్రోస్టాక్స్తో పాటు ఆటోమోబైల్, మెటల్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఫార్మాషేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
గురువారం రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభ సమయానికి సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. నిఫ్టీ 16,290 పాయింట్లను టచ్ చేసి ఫ్రెష్ ఆల్ టైమ్ రికార్డ్లను నమోదు చేయగా.. సెన్సెక్స్ సైతం అదే దూకుడును ప్రదర్శిస్తూ ఫస్ట్ టైమ్ 54,500 క్రాస్ చేసింది. దీంతో మార్కెట్ ఉదయం 9.48 నిమిషాల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 47 పాయింట్ల లాభాలతో 54405 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 6 పాయింట్ల స్వల్ప లాభాలతో నిఫ్టీ 16263 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.టెలికాంలో ఎయిర్ టెల్ లాభాల్లో కొనసాగుతుండగా .. టెక్ మహీంద్ర, ఏషియన్ పెయింట్స్, నెస్ట్లే ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్లు అదే జోరును కంటిన్యూ చేస్తున్నాయి. -
లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో మంగళవారం ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్ల లాభంతో 53,264.33 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుండగా..నిఫ్టీ 66 పాయింట్లతో 15,963.85 వద్ద లాభాలతో ట్రేడింగ్ కొనసాగుతుంది. కాగా, టాప్ టెన్ స్టాక్స్ లో ఏషియన్ పెయింట్స్, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్, అదానీ పోర్ట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కో లిమిటెడ్, టెక్ మహీంద్రా, బ్రిటానియా ఇండస్ట్రీస్, విప్రో లిమిటెడ్, బజాస్ ఫిన్ సర్వ్, టాటా కన్సెల్టెన్సీ సర్వీస్లు లాభాల్ని మూటగట్టుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియా లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్సీఎల్,శ్రీ సిమెంట్, బజాజ్ ఆటో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రసీమ్ ఇండస్ట్రీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం చూపడంతో గురువారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 252 పాయింట్ల లాభాలతో 52,695.58 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుండగా నిఫ్టీ 74 పాయింట్లను నమోదు చేసి 15783.80 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్, టెక్ మహేంద్ర, బ్లూ చిప్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వచ్చే వారం నుంచి టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఆ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా నెస్ట్లే, ఐచర్ మోటార్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా షేర్లు నష్టాల బాట పట్టాయి. -
స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
శుక్రవారం దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపడం,అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపడంతో సెన్సెక్స్ 130.66 పాయింట్ల స్వల్ప లాభాలతో 52,9067 పాయింట్లతో ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 32.80 పాయింట్ల లాభంతో 15,856 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇక, ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, ఫెడరల్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, ఎస్ బ్యాంక్, ఆర్ట్సన్ ఇంజనీరింగ్ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
గురువారం రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపడంతో సెన్సెక్స్ 405 పాయింట్లు లాభపడి 52,604 పాయింట్లతో ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 114 పాయింట్ల లాభాలతో 15,747 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇక ఐటీ కంపెనీలు క్యూ 1 ఫలితాలను ప్రకటిస్తుండడంతో టెక్ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, ఆటో మొబైల్ స్టాక్ సైతం లాభాల బాటలో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ,బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
సరికొత్త రికార్డులతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: ఇన్వెస్టర్లు రియాల్టీ, ఐటీ స్టాక్లను భారీగా కొనుగోలు చేయడంతో గురువారం సూచీలు రికార్డు స్థాయికి చేరాయి. వరుసగా నాలుగో రోజు సూచీలు లాభాల్లో ముగిశాయి.ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 53,159పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ సరికొత్త జీవితకాలపు గరిష్ట లాభాలను నమోదుచేసింది. నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 15, 924 వద్ద నిలిచింది. అన్ని రంగాల షేర్లు లాభాల్లో నిలిచాయి. రియాల్టీ, ఐటీ రంగ షేర్లు రాణించగా.. ఆటో, బ్యాంకింగ్, ఫార్మా, మీడియా సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. హెచ్సిఎల్ టెక్ , ఎల్ అండ్ టి, టెక్ ఎమ్, హిండాల్కో, విప్రో, యుపిఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటిసి లాభాలను గడించాయి. ఒఎన్జిసి ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా , భారతి ఎయిర్టెల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టాలను చవిచూశాయి. -
ఆర్థిక గణాంకాల లాభాలు
ముంబై: సానుకూల ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు స్టాక్ మార్కెట్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవ్వడం కూడా కలిసిరావడంతో ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా 397 పాయింట్లు పెరిగి 52,769 పాయింట్ల వద్ద స్థిరపడింది. దీంతో మూడురోజుల వరుస నష్టాలకు ముగింపు పడింది. అలాగే మే 31 తర్వాత ఈ సూచీ ఒకరోజులో అత్యధిక లాభాలను గడించింది. మరో సూచీ నిఫ్టీ 120 పాయింట్లు ఎగసి 15,812 వద్ద నిలిచింది. ఇండెక్స్ల్లో అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు రాణించడం సూచీలకు అధిక లాభాలొచ్చాయి. లార్జ్ క్యాప్తో పాటు అధిక నాణ్యత కలిగిన మిడ్క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ క్యూ1 ఆర్థిక ఫలితాల ప్రకటన(నేడు)కు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 30 షేర్లలో తొమ్మిది షేర్లు నష్టపోగా, మిగిలిన షేర్లన్నీ లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.114 కోట్ల షేర్లను., దేశీయ ఇన్వెస్టర్లు రూ.344 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ తొమ్మిది పైసలు బలహీనపడి 74.49 వద్ద స్థిరపడింది. ‘‘మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. పతనాన్ని నాణ్యమైన షేర్ల కొనుగోళ్లకు అవకాశంగా మలుచుకోవాలి. సాంకేతికంగా నిఫ్టీ 15,750 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,915 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది’’ రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. ఇంట్రాడేలో స్థిరమైన కొనుగోళ్లు... ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 322 పాయింట్ల లాభంతో 52,695 వద్ద మొదలైంది. నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 15,794 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. భారీ లాభాల ప్రారంభం నేపథ్యంలో తొలుత కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అయితే జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. ఒక దశలో సెన్సెక్స్ 434 పాయింట్లు ర్యాలీ చేసి 52,807 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 15,821 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. లాభాలు ఎందుకంటే... ఆర్థిక గణాంకాల ఉత్సాహం: ఈ ఏడాది మేలో పారిశ్రామికోత్పత్తి 29.3 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే మేలో ఐఐపీ గణాంకాలు 33.4 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలతో పోలిస్తే జూన్లో దిగివచ్చింది. సమీక్షించిన నెలలో 6.26%గా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగిరావడం, పారిశ్రామికోత్పత్తి ఊపందుకోవడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడింది. ప్రపంచ మార్కెట్లలో సానుకూలతలు: ఆసియాలో ఒక్క ఇండోనేషియా తప్ప మిగిలిన అన్ని దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు్ల లాభాలతో ముగిశాయి. చైనా మెరుగైన ఆర్థిక గణాంకాలను ప్రకటించడంతో పాటు అక్కడి టెక్నాలజీ కంపెనీలు రాణించడంతో ఆసియా మార్కెట్లు రాణించాయి. రెండో త్రైమాసిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో యూరప్తో పాటు యూఎస్ మార్కెట్లు జీవితకాల సరికొత్త రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. -
స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్
ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ముగింపు సమయానికి వచ్చే సరికి నెమ్మదిగా నష్టాల వైపు పయనించాయి. చివరకు సెన్సెక్స్ 13.50 పాయింట్లు(0.03%) క్షీణించి 52372.69 వద్ద ముగిస్తే, నిఫ్టీ 2.80 పాయింట్లు (0.02%) పెరిగి 15692.60 వద్ద స్థిర పడింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.57 వద్ద నిలిచింది. ఇక మార్కెట్లో ఈ రోజు అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్స్, జెఎస్ డబ్ల్యు స్టీల్ మరియు ఎస్ బిఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. అయితే, అదానీ పోర్ట్స్, భారతి ఎయిర్ టెల్, బిపిసిఎల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. -
282 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో సెన్సెక్స్ 282 పాయింట్లు కోల్పోయి 52, 306 పాయింట్ల వద్ద మార్కెట్ క్లోజ్ అయ్యింది. జూన్ 22న ఆల్టైం హై 53 వేల పాయింట్లను దాటిన సెన్సెక్స్ అదే రోజు సాయంత్రం 52,558 దగ్గర క్లోజైంది. అయితే ఈ రోజు ఉదయం 52,912 పాయింట్లతో మార్కెట్ ఓపెన్ అయ్యింది. మరోసారి ఆల్టైం హై నమోదు అవుతుందేమో అనిపించినా ఆ తర్వాత క్రమంగా పాయింట్లు కోల్పోతూ ఒక దశలో 52, 264 పాయింట్లకు చేరుకుంది. మార్కెట్ ముగుస్తుందనగా మరోసారి పుంజుకుని చివరకు 52,306 పాయింట్ల దగ్గర క్లోజైంది. నిన్నటితో పోల్చితే మొత్తం 282 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ ఎన్ఎస్సీ నిఫ్టీ 85 పాయింట్లు కోల్పోయి 15,686 పాయింట్ల వద్ద క్లోజైంది. నిఫ్టీ ఈ రోజు 15,862 పాయింట్లలో మొదలై 15,82 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత 15,673 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. చదవండి : ఇక్కడ మొబైల్లో చూస్తే.... అక్కడ కాసులు వర్షం -
నిఫ్టీ రికార్డు ర్యాలీకి విరామం
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ మంగళవారం ఫ్లాట్గా ముగిసింది. సెన్సెక్స్ మూడు పాయింట్ల స్వల్ప నష్టంతో 51,935 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఎనిమిది పాయింట్లను కోల్పోయి 15,575 వద్ద నిలిచింది. దీంతో నిఫ్టీ ఏడురోజులు, సెన్సెక్స్ నాలుగు రోజుల లాభాల ముగింపునకు విరామం పడినట్లైంది. మెటల్, బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనంతో ఐటీ, ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో ఉదయం నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 15,661 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ సైతం 292 పాయింట్లు లాభపడి 52,229 స్థాయిని అందుకుంది. మిడ్ సెషన్ నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీల లాభాలన్నీ కరిగిపోయాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.230 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.450 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ‘‘ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ బ్రెండ్ క్రూడాయిల్ ధర 70 డాలర్లకు చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత రెండోరోజూ కొనసాగింది. గత ఆర్థిక సంవత్సరపు జీడీపీ డేటాతో పాటు ఏప్రిల్ మౌలిక, మే తయారీ రంగ గణాంకాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. ఆర్బీఐ పాలసీ కమిటీ సమావేశాల ప్రారంభం(బుధ–శుక్ర)నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. వీటికి తోడు సూచీల వరుస ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ►ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ షేరు రెండు శాతం లాభపడి రూ.433 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.435.35 వద్ద ఆల్టైం హైని నమోదు చేసింది. ►కొత్త యాజమాన్య నియామకంతో బ్యాంకింగేతర సంస్థ మాగ్మా ఫిన్కార్ప్ షేరు ఐదు శాతం లాభపడి రూ.143 వద్ద స్థిరపడింది. ► పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుందని పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ తెలపడంతో షేరు 20 శాతం పెరిగి రూ.631 వద్ద ముగిసింది. ►నాలుగో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను వెల్లడించడంతో నారాయణ హృదయాలయ షేరు 12 పెరిగి రూ.493 వద్ద నిలిచింది. ►బ్రిటన్ ఏస్ ఇన్వెస్టర్ జెరెమీ గ్రాన్థమ్ రూప కంపెనీలో వాటాను కొనుగోలు చేయడంతో షేరు 20 శాతం ర్యాలీ చేసి రూ.476 వద్ద ముగిసింది. -
మార్కెట్ ర్యాలీ మిస్సయ్యారా?
గతేడాది కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత నెల రోజులకు ఈక్విటీ మార్కెట్లు పాతాళానికి పడిపోయాయి. అక్కడి నుంచి ఏడాది తిరిగేసరికి ఈక్విటీ మార్కెట్లు మళ్లీ శిఖర స్థాయిలకు చేరుకున్నాయి. చారిత్రకంగా చూస్తే సంక్షోభంలోనూ ఇంత బలమైన బుల్ ర్యాలీ అన్నది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇదేనట. ఈక్విటీ మార్కెట్లు అంటేనే అస్థిరతలకు నిలయం. అందుకే ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకునే స్టాక్స్ సవాళ్లకు, సంక్షోభాలకు కుదేలై పోకుండా గట్టిగా ఎదుర్కొని మళ్లీ ప్రగతి దిశగా ప్రయాణించే సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ భవిష్యత్తు అంచనాల ఆధారంగానే చలిస్తుంటాయి. కనుక ప్రస్తుత ఆర్థిక అంశాలపై కాకుండా దేశ వృద్ధి చక్రం త్వరలోనే రెండంకెల స్థాయికి పరుగెడుతుందన్న అంచనాలు ర్యాలీకి మద్దతుగా నిలిచే అంశమని విశ్లేషణ. ఏడాది కాలంలో కరోనా పూర్తి నియంత్రణలోకి వస్తుందని.. ఆ తర్వాత వృద్ధి వేగాన్ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. అస్థిరతలకు చలించిపోకుండా, గట్టిగా నిలబడే కంపెనీలు ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో ఉండడం ఎంతైనా అవసరం. అంటే.. బేర్ మార్కెట్లో పడిపోకుండా ఉండే స్టాక్స్ అని కాదు అర్థం. బేర్ మార్కెట్ తర్వాత వచ్చే బుల్ పరుగులో బలంగా పాల్గొనే సత్తా వాటికి ఉండాలన్నది విశ్లేషకుల సూచన. అందుకు ఏం చేయాలన్నది తెలియజేసే ప్రాఫిట్ప్లస్ కథనం ఇది.. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు యావరేజ్ చేస్తుంటారు. అంటే ఒక స్టాక్ను కొనుగోలు చేసిన తర్వాత.. అది పడిపోతూ ఉంటే ధరలు ఆకర్షణీయంగా అనిపించి మరికొంత మొత్తం పెట్టుబడి పెడుతూ వెళతారు. దీంతో తెలియకుండానే ఒక్క స్టాక్లోనే ఎక్కువ పెట్టుబడులు పోగుపడతాయి. మరి నిజంగా ఆ కంపెనీ తిరిగి పూర్వపు స్థాయికి చేరుకోకపోతే..? మరింత పతనమై అలాగే ఉండిపోతే..? రిటైల్ ఇన్వెస్టర్ ఈ విధంగా ప్రశ్నించుకుని వివేకంతో పెట్టుబడులు పెడితేనే లాభాలు అందుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. యావరేజ్ విషయమై ప్రాచుర్యంలో ఉన్న కథనం కూడా ఒకటి ఉంది. ఒక స్టాక్ను బుల్ మార్కెట్లో మూడు అంకెల్లో ఉండగా కొనుగోలు చేసి.. బేర్ మార్కెట్లో రెండంకెల స్థాయికి పడిపోయిన తర్వాత యావరేజ్ చేసి తదుపరి బుల్ మార్కెట్లో.. ఒక అంకె ధరలో (రూ.10కు దిగువన) విక్రయించినట్టుగా ఉంటుంది యావరేజ్ చేయడం. బలమైన, పటిష్టమైన ఆర్థిక మూలాలు ఉండి, వ్యాపార పరంగా మోట్ (పోటీలేని) కలిగి ఉన్న వాటిని తక్కువ ధరల్లో యావరేజ్ చేయడం కొంత వరకు సరైనదే అని చెప్పుకోవచ్చు. అది కూడా కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యల్లేకుండా.. కేవలం తాత్కాలిక పరిణామాల వల్ల ధరల్లో దిద్దుబాటు వస్తే యావరేజ్ను అవకాశంగా చూడొచ్చు. కానీ, కారణం తెలియకుండా యావరేజ్ చేయడం వల్ల లాభం కంటే నష్టాలకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా యావరేజ్తో ఉన్న పెద్ద ప్రతికూలత పెట్టుబడులన్నీ కేవలం కొన్ని స్టాక్స్లోనే ఎక్కువగా పోగవడం. ఒక్కోసారి యావరేజ్ చేసేందుకు పెట్టుబడుల్లేక.. తమ పోర్ట్ఫోలియోలో లాభాలు చూపిస్తున్న స్టాక్స్ను విక్రయించేసే వారు కూడా ఉన్నారు. బంగారు గుడ్లు పెట్టే బాతును కోసిన చందమే అవుతుంది ఇది. బుల్ మార్కెట్ ముగిసి బేర్ మార్కెట్లోకి ప్రవేశించినట్టయితే.. అప్పటి వరకు ఎదురేలేదు అనుకున్న కంపెనీలు కనిపించకుండా పోవచ్చు. జేపీ అసోసియేట్స్, యూనిటెక్, అడాగ్ గ్రూపు కంపెనీలైన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా, సుజ్లాన్ ఇలా చెప్పుకునేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నిఫ్టీ స్టాక్ యస్ బ్యాంకు పతనం గుర్తుండే ఉంటుంది. యస్ బ్యాంకు రాణా కపూర్ సారథ్యంలో మరింత ముందుకు వెళుతుందని, రూ.2,000 వరకు స్టాక్ వెళ్లొచ్చన్న అంచనాతో ఇన్వెస్ట్ చేసిన వారూ ఉన్నారు. రూ.400 స్థాయి నుంచి యస్ బ్యాంకు స్టాక్ ధర క్రమంగా పడిపోతూ ఉంటే.. రూ.200–300 మధ్య తిరిగి పెద్ద ఎత్తున యావరేజ్, కొనుగోలు చేసిన వారు గణనీయంగా ఉన్నారు. అంతేకాదు అక్కడి నుంచి రూ.12 స్థాయి వరకు యావరేజ్ చేస్తూ మరింత పెట్టుబడులు పెట్టిన వారున్నారు. జియోడెసిక్, తులిప్ టెలికం, ఎడ్యుకాంప్, ఎవరాన్, కరుతూరి గ్లోబల్, ఐవీఆర్సీఎల్ ఇలా ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించేసిన స్టాక్స్ బండెడున్నాయి. కేటాయింపుల్లో పరిమితులు ఒక్కో రంగం ఒక్కో కాలంలో గణనీయంగా ర్యాలీ చేస్తుంటుంది. 2005–2007 కాలంలో ఇన్ఫ్రా, విద్యుత్ కంపెనీలు భారీ ర్యాలీ చేశాయి. మళ్లీ ఆ స్థాయి ర్యాలీ ఇంత వరకు వాటిల్లో చూడలేదు. 2008 కరెక్షన్కు ముందు విద్యుత్, ఇన్ఫ్రా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పటికీ లాభాలు వచ్చిన దాఖలాలు లేవు. కనుక ఈ తరహా ర్యాలీలను ముందుగా అంచనా వేసి ఇన్వెస్ట్ చేయగలిగితే గణనీయమైన రాబడులను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనదేశంలో రానున్న కాలంలో విద్యుత్ వాహనాల మార్కెట్ భారీగా వృద్ధి చెందుతుందన్న అంచనాలున్నాయి. ఇదే అంచనాతో కొన్నేళ్ల క్రితం టెస్లా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పుటికే కోటీశ్వరులయ్యారు. కానీ టెస్లా స్టాక్ బంపర్ ర్యాలీ చేయడానికి ముందు పలు పర్యాయాలు దివాళా అంచుల వరకు వెళ్లొచ్చిన సంగతి ఎంత మందికి తెలుసు? అందుకే తొలి దశలోనే భవిష్యత్తు విజేత ఎవరన్నది గుర్తించడం కొంచెం కష్టం. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో మీ ప్రతిభ కారణంగాను లేదా అదృష్టం కొద్దీ మల్టీబ్యాగర్ స్టాక్ను కొనుగోలు చేసి ఉన్నారనుకోండి.. ఆ కంపెనీ భవిష్యత్తులో ఇంకా ఎంతో వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని నిపుణులు ఘంటా పథంగా చెబుతుంటే.. ఎగువ వైపున యావరేజ్ చేయడం మంచిదే అవుతుంది. అది కూడా మీరు గతంలో కొనుగోలు చేసిన ధరకు కొంచెం సమీపంలో ఉంటేనే. మీ కొనుగోలు ధరపై అప్పటికే 10 రెట్లు, 20 రెట్లు పెరిగిన తర్వాత మరో 100 శాతం, 200 శాతం వృద్ధి కోసం యావరేజ్ చేయడం కంటే ఆ పెట్టుబడులను అలాగే కదపకుండా కొనసాగించడం సరైనది. ఎందుకంటే అంత పెరిగిన తర్వాత పనితీరు అంచనాలు కొంచెం తేడా వచ్చినా స్టాక్లో దిద్దుబాటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే రిస్క్ను బట్టి ఇన్వెస్టర్లు అడుగులు వేయాలి. ఇన్వెస్టర్లు తగినంత అధ్యయనం తర్వాతే స్టాక్లో ఒకే విడత పెట్టుబడులు పెట్టాలి. లేదా ఫలానా స్టాక్లో రూ.10వేలు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంటే.. ఐదు నుంచి పది విడతల్లో రూ.1,000–2,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లి అంతటితో ఆగిపోవాలి. ఒకటికి మించిన విడతల్లో కొనుగోలుకు నిర్ణయించుకున్నట్టయితే.. ఫండమెంటల్స్ మారనంత వరకు స్టాక్ ధర ఏ స్థాయిలో ఉన్నా పట్టించుకోవక్కర్లేదు. అంతేకానీ, ముందుగా నిర్ణయించుకున్న పరిమితిని మించి యావరేజ్లు చేయకూడదు. దీనివల్ల ఒక స్టాక్లో పెట్టుబడి రూ.10వేలకు పరిమితం అవుతుంది. మీ అంచనాలు నిజమై, కంపెనీ మంచి వృద్ధినే చూపిస్తే చక్కని రాబడులు సొంతం అవుతాయి. ఒకవేళ అంచనాలు తప్పి కంపెనీ పనితీరు బాగోలేక స్టాక్లో పతనం వచ్చిందనుకుంటే ఆ నష్టం పరిమితమవుతుంది. అందుకే ఇన్వెస్టర్ తనవద్దనున్న మొత్తం పెట్టుబడుల్లో ఒక స్టాక్కు 5–10 శాతం మించి కేటాయింపులు చేసుకోకూడదని నిపుణులు సూచిస్తుంటారు. మూలాలు మర్చిపోకూడదు నాణ్యమైన కంపెనీలు, మెరుగైన యాజమాన్యాలు, మంచి నగదు ప్రవాహాలతో కూడిన బలమైన బ్యాలన్స్ షీట్లు ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకోవడం కూడా రిస్క్ తగ్గించుకునే మార్గాల్లో ముఖ్యమైనది. బేర్ మార్కెట్లలో ఈ తరహా కంపెనీలు పడినా గట్టిగానే నిలబడతాయి. తిరిగి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత మంచి పనితీరును నమోదు చేస్తాయి. నాణ్యమైన కంపెనీల్లో యావరేజ్ చేయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. మంచి నాణ్యమైన స్టాక్ను కొనుగోలు చేసిన తర్వాత స్టాక్ ధర పడిపోయినప్పటికీ కంగారు పడిపోనక్కర్లేదు. అదనపు పెట్టుబడులకు అవకాశంగానే చూడొచ్చు. ముఖ్యంగా సైక్లికల్ స్టాక్స్లో యావరేజ్ విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. చారిత్రకంగా చూస్తే సైక్లికల్ స్టాక్స్ కనిష్ట విలువల వద్ద లభిస్తున్నప్పుడు వాటిని కొనుగోలు చేయడం, యావరేజ్ చేయడం కలిసొస్తుంది. కొంత ‘క్యాష్’ ఉంచుకోవాలి బేర్ మార్కెట్లే కాదు.. బుల్ మార్కెట్లు కూడా దీర్ఘకాల ఇన్వెస్టర్ల పెట్టుబడులకు అవకాశాలు తీసుకొస్తుంటాయి. పెట్టుబడులకు అనువైన అవకాశాలు ఈక్విటీ మార్కెట్లలో అన్నివేళలా అందుబాటులో ఉంటుంటాయి. మార్కెట్లు చారిత్రకంగా గరిష్టాల వద్ద ట్రేడవుతున్నాయని పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, కనిష్టాల వద్ద ట్రేడవుతున్నాయని పూర్తిగా పెట్టుబడులు పెట్టేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లు ఎప్పుడైనా కుప్పకూలిన తర్వాత వచ్చే బుల్ ర్యాలీలో స్పెక్యులేటివ్ ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుంది. దాన్ని చూసి కంగారు పడాల్సిన పనిలేదు. 2004–2007 బుల్ ర్యాలీలో పెట్టుబడులు పెట్టలేకపోయామని బాధపడిన వారికి.. 2009లో మరో అవకాశం వచ్చింది. 2005 నాటి విలువల వద్ద తిరిగి 2009లో ఆయా స్టాక్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే, 2013–2020 మధ్య ర్యాలీలో పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోలేకపోయామే అని బాధపడిన వారికి 2020 మార్చి–ఏప్రిల్ దిద్దుబాటులో 2014 నాటి కనిష్ట విలువలకు స్టాక్స్ లభించాయి. అందుకే మార్కెట్లలో అవకాశాలను కోల్పోయామన్న వెర్రి పనికిరాదు. ఓపికగా వేచి చూసే ధోరణితో ఉంటే మంచి అవకాశాలు ఎప్పుడూ వస్తుంటాయి. ప్రస్తుత బుల్ ర్యాలీలో పాల్గొనలేదని మథనపడొద్దు. మళ్లీ ఆకర్షణీయమైన విలువల వద్ద స్టాక్స్లోకి ప్రవేశించేందుకు భవిష్యత్తులోనూ అవకాశాలు తలుపులు తడతాయి. -
గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ
ముంబై: సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ మార్కెట్ బుధవారం నష్టంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 13 పైసల పతనం కూడా ప్రతికూలంగా మారింది. ఫలితంగా సెన్సెక్స్ 291 పాయింట్లను కోల్పోయి 50వేల దిగువున 49,903 వద్ద ముగిసింది. నిఫ్టీ 78 పాయింట్లను కోల్పోయి 15,030 వద్ద స్థిరపడింది. మెటల్, ఆర్థిక, ఐటీ, ప్రైవేట్ రంగ బ్యాంక్స్ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. నష్టాల మార్కెట్లోనూ ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విస్తృతస్థాయి మార్కెట్లో చిన్న తరహా షేర్లకు డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం లాభపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 362 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు చొప్పున నష్టాన్ని చవిచూశాయి. ఎఫ్ఐఐలు రూ.698 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మారు. డీఐఐలు రూ.853 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ‘‘ఫెడ్ రిజర్వ్ మినిట్స్ వెల్లడికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నాయి. కమోడిటీ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్నాయి. ఈ అంశాలు దేశీయ ట్రేడింగ్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అయితే క్రమంగా తగ్గుతున్న కోవిడ్ కేసులు.., మార్కెట్లో భారీ అమ్మకాలను అడ్డుకున్నాయి’’ జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇంట్రాడేలో నిఫ్టీ 100 పాయింట్లు క్రాష్... ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 104 పాయింట్ల నష్టంతో 50,089 వద్ద, నిఫ్టీ 49 పాయింట్లను కోల్పోయి 15,059 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. గత రెండురోజులుగా సూచీల భారీ ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. మిడ్సెషన్లో యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో ఒక దశలో సెన్సెక్స్ 362 పాయింట్లను కోల్పోయి 49,831 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లను నష్టపోయి 15,009 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: గత వారం నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే తీరును కనబరిచాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, దేశీయంగా కోవిడ్ కేసులు తగ్గు ముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరందుకోవడం మదుపర్లకు ధైర్యాన్ని కలిగించాయి. ఉదయం 48,990 పాయింట్ల వద్ద ప్రారంభించిన సెన్సెక్స్ 49,628 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 848 పాయింట్లు లాభపడి 49,580 వద్ద ముగిసింది. ఇక, 14,756 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన నిఫ్టీ 14,938 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకి చివరకు 245 పాయింట్లు ఎగబాకి 14,923 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లకు చైనా పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం వంటి సానుకూల పరిణామాలు తోడవ్వడంతో నేడు లాభాల్లో పయనించాయి.సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో ముగిస్తే.. భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, మారుతీ, పవర్గ్రిడ్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. చదవండి: వాట్సాప్: కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేం! -
లాభాల్లో సూచీలు, 15వేలకు చేరువగా నిఫ్టీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి ప్రారంభమై లాభాల వైపు అడుగులు వేస్తోంది. ఆర్బీఐ లిక్విడిటి మద్దతు తెలపడంతో, కరోనా దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్డౌన్ లేకపోవడంతో ఈ వారం సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. మొదట్లో సెన్సెక్స్ 350 పాయింట్ల వరకు ఎగబాకింది. ప్రస్తుతం 255.34 పాయింట్లు ఎగబాకి 49,462.61 వద్ద ట్రేడ్ అవుతోంది. సూచీ తొలుత 49,590.43 గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 117 పాయింట్లు లాభపడి 14,940 వద్ద ట్రేడ్ అవుతుండగా మరోసారి 15000 మార్కును తాకే అవకాశం ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.31 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో గడించాయి.దీంతో ఆసియా మార్కెట్లు నేడు లాభాల బాటలో పయనిస్తున్నాయి.గ్లోబల్ మార్కెట్ల సానుకూల పవనాలతో ఇండెక్స్ మేజర్ కంపెనీలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. చదవండి: India GDP: భారత్ వృద్ధి అంచనాలు డౌన్..! -
కనిష్ట స్థాయిల నుంచి రికవరీ
ముంబై: మిడ్సెషన్ నుంచి మెటల్, ఎఫ్ఎంసీజీ, టెలికాం రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు సోమవారం కనిష్టస్థాయిల నుంచి రికవరీ అయ్యాయి. ఉదయం సెషన్లో 754 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 64 పాయింట్ల నష్టంతో 48,719 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 215 పాయింట్ల పతనం నుంచి తేరుకొని మూడు పాయింట్ల స్వల్ప లాభంతో 14,416 వద్ద ముగిసింది. రూపాయి బౌన్స్ బ్యాక్ ర్యాలీ సూచీల నష్టాల రికవరీకి తోడ్పాటును అందించింది. మిశ్రమ అంతర్జాతీయ పరిణామాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు పతనంతో సూచీలు ఇంట్రాడేలో భారీ పతనాన్ని చవిచూశాయి. మిడ్ క్యాప్ షేర్లలో అమ్మకాలు జరగ్గా, చిన్న, లార్జ్ క్యాప్ షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 2,289 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.553 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆదుకున్న మిడ్సెషన్ కొనుగోళ్లు .... దేశంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్, లాక్డౌన్ విధింపు యోచనలు, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం తదితర అంశాలు దేశీయ మార్కెట్లో బలహీన సంకేతాలను నెలకొన్నాయి. దీంతో ఉదయం స్టాక్ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 426 పాయింట్ల నష్టంతో 48,356 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లను కోల్పోయి 14,631 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. బ్యాంకింగ్ షేర్లతో పాటు రిలయన్స్ షేరులో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు మరింత పతనాన్ని చవిచూశాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. సెన్సెక్స్ 754 పాయింట్లను కోల్పోయి 48,028 వద్ద చేరుకుంది. నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 14,416 వద్ద దిగివచ్చింది. ఉదయం సెషన్లో అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలకు మిడ్సెషన్లో కొనుగోళ్ల ఉపశమనం లభించింది. మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా సూచీలు ఇంట్రాడే కనిష్ట స్థాయిల నుంచి నష్టాలను పూడ్చుకోగలిగాయి. ఐపీఓకు కెంప్లాస్ట్ సన్మార్... ప్రత్యేక రసాయనాల తయారీ సంస్థ కెంప్లాస్ట్ సన్మార్ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోసం సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.1,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రమోటర్లు ఆఫర్ సేల్ పద్ధతిలో రూ.2000 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. తద్వా రా కంపెనీ రూ.3,500 కోట్ల సమీకరించాలని భావిస్తోంది. సమీకరించిన నిధుల్లో రూ.1,238 కోట్లను ముందస్తుగానే ఎన్సీడీలను ఉపసంహరించుకునేందుకు వినియోగిస్తామని కంపెనీ డ్రాఫ్ట్ పేపర్లలో తెలిపింది. ఈ కంపెనీ షేర్లు స్టాక్ ఎక్సే్చంజీల నుంచి వైదొలగి పదేళ్లు కావొస్తుంది. చెన్నై ఆధారిత ఈ కంపెనీ వ్యవసాయ, ఫార్మా రంగాలకు వినియోగించే ప్రత్యేక రసాయనాలకు తయారు చేస్తోంది. యస్ బ్యాంక్ షేర్లకు క్యూ4 ఫలితాల సెగ... యస్ బ్యాంకు షేరు సోమవారం నాలుగు శాతం పతనమై రూ.13.91 వద్ద ముగిసింది. మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించకపోవడం షేరు క్షీణతకు కారణమైంది. నాలుగో త్రైమాసికంలో రూ.3,790 కోట్ల నికర నష్టాన్ని చవిచూసినట్లు బ్యాంకు ప్రకటించింది. దీంతో ఉదయం బీఎస్ఈలో కంపెనీ షేరు 12 శాతం నష్టంతో రూ.12.85 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఇంట్రాడేలో మార్కెట్ రికవరీ భాగంగా ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో చివరికి నాలుగు శాతం నష్టంతో ముగిసింది. -
మళ్లీ కరోనా కల్లోలం, కుప్పకూలిన స్టాక్ మార్కెట్
ముంబై: కరోనా రెండో దశ విజృంభణతో సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కోవిడ్ వ్యాక్సిన్ కొరత వార్తలు కలవరపెట్టగా.., లాక్డౌన్ భయాలు వెంటాడాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. రూపాయి వరుస పతనం సెంటిమెంట్ను దెబ్బతీసింది. దేశీయ మార్కెట్లో ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం కూడా ప్రతికూలాంశంగా మారింది. అలాగే ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి ట్రేడింగ్ చేశారు. కార్పొరేట్ సంస్థల నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా సూచీలు ఫిబ్రవరి 26 తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,708 పాయింట్లను కోల్పోయి 47,883 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 524 పాయింట్ల పతనంతో 14,311 వద్ద నిలిచింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు చెందిన షేర్లు పెద్ద ఎత్తున విక్రయాలు జరగడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ మొదలు ముగిసేంతవరకు ట్రేడర్లు అమ్మేందుకే ఆసక్తి చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 1898 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 587 పాయింట్లను కోల్పోయింది. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఒక్క డాక్టర్ రెడ్డీస్ తప్ప, మిగిలిన అన్ని షేర్లు నష్టాల నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్లోని 50 షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,746 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.233 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలే... జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 634 పాయింట్ల క్షీణతతో 48,957 వద్ద, నిఫ్టీ 189 పాయింట్లు పతనంతో 14,645 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. కేవలం పావు గంట వ్యవధిలోనే సుమారు 190 షేర్లు లోయర్ సర్క్యూట్ తాకాయి. అలాగే బీఎస్ఈలో లిస్టయిన షేర్ల మార్కెట్ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు ఆవిరైంది. భారీ నష్టాలతో ప్రారంభమైన నేపథ్యంలో సూచీలు కాస్తయినా కోలుకుంటాయని ఆశించిన ఇన్వెస్టర్లను నిరాశపరుస్తూ మరింత క్షీణించసాగాయి. ఏ ఒక్క రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ఒక దశలో సెన్సెక్స్ 1898 పాయింట్ల నష్టపోయి 47,693 వద్ద, నిఫ్టీ 587 పాయింట్లు పతనమై 14,248 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదుచేశాయి. మిడ్సెషన్ సమయంలో యూరప్ మార్కెట్ల నష్టాలతో మొదలు కావడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ‘‘కరోనా ఉధృతి, లాక్డౌన్ భయాలతో స్టాక్ మార్కెట్ నెలరోజు కనిష్టానికి చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గి, ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టేంత వరకు మార్కెట్లో అస్థిరత కొనసాగుతుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్–ఆధారిత ట్రేడింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. నిమిషానికి రూ.2,321 కోట్ల నష్టం సూచీల మూడున్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.8.77 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇంట్రాడే ట్రేడింగ్లో ప్రతి నిమిషానికి రూ.2321 కోట్ల నష్టాన్ని చవిచూశారు. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.200 లక్షల కోట్లకు దిగివచి్చంది. నష్టాలకు నాలుగు కారణాలు... కరోనా కేసుల ఉధృతి, లాక్డౌన్ భయాలు... కరోనా కేసుల ఉధృతి, లాక్డౌన్ భయాలు స్టాక్ మార్కెట్ను కుదిపేశాయి. దేశవాప్తంగా ఆదివారం ఒక్కరోజే 1.68 లక్షల కేసుల నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులు రోజు కో నూతన గరిష్టాన్ని నమోదు చేస్తున్న తరుణంలో లాక్డౌన్ భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో లాక్డౌన్ విధించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. వ్యాక్సిన్ కొరత... దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కోవిడ్ వ్యాక్సిన్ కొరత వార్తలు మార్కెట్ సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. వ్యాక్సిన్లు లేక రాష్ట్ర ప్రభుత్వాలు టీకా కేంద్రాలను మూసేశాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు రోజుల టీకా ఉత్సవ్ మందకొడిగా సాగడం మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. గణాంకాల వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత టెక్ దిగ్గజం టీసీఎస్ క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో దేశీయ కార్పొరేట్ రంగంలో ఫలితాల సందడి మొదలవుతుంది. కంపెనీల నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ పలు కంపెనీల షేర్లలో ముందస్తు లాభాల స్వీకరణ చేశారని స్టాక్ నిపుణులు తెలిపారు. అలాగే ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గారు. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు... అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై సానుకూల వైఖరికే మొగ్గుచూపవచ్చనే అంచనాలతో అమెరికా బాండ్ ఈల్డ్స్ మళ్లీ పుంజుకున్నాయి.అలాగే అమెరికాలోనూ ఫలితాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి ఇన్వెస్టర్లు కూడా అప్రమత్త వైఖరి అనుసరిస్తున్నారు. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నేడు(ఏప్రిల్ 5) భారీ నష్టాలతో ముగిసాయి. అంతర్జాతీయ ప్రతికూల సంతకేతాలతో తోడు, దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, లాక్డౌన్ కారణాల రీత్యా సోమవారం కీలక సూచీలు భారీ నష్టాల్లో ముగిసాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడుస్తున్నకొద్దీ అంతకంతకూ దిగజారాయి. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో బీఎస్ఈ నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువలో దాదాపు రూ.4.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. నేడు సెన్సెక్స్ 870.51 పాయింట్లు(1.74 శాతం) కోల్పోయి 49,159.32 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 229.55 పాయింట్లు కుప్పకూలి (1.54 శాతం) 14,637.80 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.33 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. విప్రో, బ్రిటానియా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. కరోనా సెకండ్వేవ్ ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్రమం పటిష్టంగానే ఉందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ నోమురా తెలిపింది. అయితే లాక్డౌన్, పెరిగిన ఆంక్షల నేపథ్యంలో క్యూ2 జీడీపీని ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! -
రెండో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిసాయి. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాట పట్టినప్పటికీ.. దేశీయ మార్కెట్లు మాత్రం లాభాలతో ముగిసాయి. ఇవాళ 50,258 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 50,439 వద్ద గరిష్ఠాన్ని.. 49,807 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 50,296 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఉదయం 14,865 వద్ద ట్రేడింగ్ ఆరంభించిన నిఫ్టీ చివరకు 157 పాయింట్లు లాభంతో 14,919 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.38గా ఉంది. సెన్సెక్స్ టాప్ 30లో ఐదు కంపెనీలు మినహా మిగిలిన సంస్థల షేర్లన్నీ లాభాలను ఒడిసిపట్టాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, విప్రో లిమిటెడ్, ఎన్టీపీసీ షేర్లు లాభపడగా.. ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్ని చవిచూశాయి. చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక! రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
సాక్షి, ముంబై: గత వారపు భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు సోమవారం కోలుకున్నాయి. దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలతో పాటు దేశీయంగా సానుకూల జీడీపీ వృద్ధి రేటు, వాహన విక్రయాలు పుంజుకోవడం వంటివి మదుపర్లలో విశ్వాసం నింపాయి. దీనితో ఉదయం 49,747 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 50,058 వద్ద గరిష్ఠాన్ని.. 49,440 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఉదయం 14,772 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. రోజులో 14,806-14,638 మధ్య కదలాడింది. చివరకు సెన్సెక్స్ 749 పాయింట్ల(1.53 శాతం) లాభంతో 49,849 వద్ద ముగియగా నిఫ్టీ 232 పాయింట్లు 232.40(1.60 శాతం) పైకి చేరి 14,761 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.50 వద్ద చేరుకుంది. సెన్సెక్స్ టాప్ 30లో ఒక్క భారతీ ఎయిర్టెల్ మినహా మిగిలిన కంపెనీల షేర్లన్నీ లాభాలను ఒడిసిపట్టాయి. టెలికాం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, యూపీఎల్ షేర్లు ఐదు శాతానికి పైగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్టెల్ మాత్రం 4.22 శాతం నష్టాల్ని చవిచూసింది. చదవండి: గృహ కొనుగోలుదారులకు ఎస్బీఐ గుడ్న్యూస్ ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఎఫ్ రూల్స్! -
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిసాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి బయటపడ్డ మార్కెట్ అమ్మకాల ఒత్తిడి గురైంది. కీలక రంగాల మద్దతు లభించడంతో కొంత సానుకూలంగా కదలాడాయి. 49,745 వద్ద స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ కాసేపు లాభాల్లో పయనించింది. తర్వాత ఇంట్రాడేలో సెన్సెక్స్ 50,317 గరిష్ఠానికి చేరుకుంటే నిఫ్టీ 14,849 గరిష్టాన్ని చేరుకుంది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఓ దశలో సెన్సెక్స్ 49,666 వద్ద, నిప్టీ 14,655 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకాయి. చివరకు సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 49,751.32కు చేరుకుంటే, నిఫ్టీ 32 పాయింట్లు లాభంతో 14,707.70 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. మొత్తంగా ఈరోజు సూచీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.46 వద్ద నిలిచింది. చదవండి: ఒక్క ట్వీట్తో లక్ష కోట్ల నష్టం..! డీహెచ్ఎఫ్ఎల్లో బయటపడ్డ మరో భారీ మోసం -
‘క్రాష్’ మార్కెట్..!
ముంబై: స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు భారీ అమ్మకాలకు దారితీశాయి. ఫలితంగా సూచీలు సోమవారం రెండునెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్లను కోల్పోయి 50,000 దిగువన 49,744 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు సూచీకి మూడువారాల కనిష్టస్థాయి. నిఫ్టీ 306 పాయింట్లు నష్టపోయి 14,676 వద్ద నిలిచింది. అలాగే ఇరు సూచీలకిది వరుసగా ఐదోరోజు నష్టాల ముగింపు. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, దేశవ్యాప్తంగా తిరిగి పెరుగుతున్న కోవిడ్–19 కేసులు, బాండ్ ఈల్డ్స్ అనూహ్య ర్యాలీ తదితర అంశాలు మన మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులను సృష్టించాయి. అలాగే మండుతున్న ముడిచమురు ధరలు, ఇటీవల మార్కెట్ ర్యాలీ నేపథ్యంలో పెరిగిన ఈక్విటీల వ్యాల్యుయేషన్ల ఆందోళనలు కూడా ఇన్వెస్టర్లను కలవరపరిచాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒక్క మెటల్ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లలో విస్తృతంగా అమ్మకాలు జరిగాయి. ఎన్ఎస్ఈలో ప్రభుత్వ బ్యాంకులు, ఫార్మా, ఐటీ, మీడియా రంగాల సూచీలు మూడుశాతం పతనమయ్యాయి. ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లు రెండుశాతం క్షీణించాయి. రూపాయి 16 పైసల ర్యాలీతో ఐటీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యతనివ్వడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ఒకదశలో సెన్సెక్స్ 1,273 పాయింట్లు నష్టపోయి 49,617 వద్ద దిగివచ్చింది. నిఫ్టీ 346 పాయింట్లను కోల్పోయి 14,635 స్థాయిని తాకింది. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఈ జనవరి 29 తర్వాత తొలిసారి దేశీయ మార్కెట్లో్ల విక్రయాలు జరిపారు. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) సోమవారం రూ.893 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. అలాగే దేశీ ఇన్వెస్టర్లు రూ.919 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు ఎక్సే్చంజ్ గణాంకాలు తెలిపాయి. ‘‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాలు లాక్డౌన్ను విధిస్తున్నాయి. కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ విధింపుతో ఆర్థిక రికవరీపై ప్రభావం పడొచ్చన్న భయాలు మార్కెట్ను వెంటాడాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్బణ కారణాలతో ఇటీవల మార్కెట్ ర్యాలీకి దన్నుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఇప్పుడు నెమ్మదించాయి.’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. పడినప్పుడల్లా... కొనండి..! ఐదు రోజుల వరుస పతనంతో సెన్సెక్స్ 2410 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 639 పాయింట్లను నష్టపోయింది. మార్కెట్ భారీగా క్షీణిస్తున్న ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చని స్టాక్ నిపుణులు సలహానిస్తున్నారు. ప్రస్తుత పతనం స్వల్పకాలికమేనని, పడిపోయిన ప్రతిసారి కొనుగోలు చేయమని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు మెరుగుపడ్డాయని.. ఇండస్ట్రీయల్, సైక్లికల్స్ రంగాల షేర్లపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. నిమిషానికి రూ.1000 కోట్ల నష్టం..! మార్కెట్ భారీ పతనంతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ సమయంలో ప్రతి నిమిషానికి రూ. 1000 కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.3.08 లక్షల కోట్లు ఆవిరయ్యింది. వెరసి బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.200.18 లక్షల కోట్లకు దిగివచ్చింది. ట్రేడింగ్లో మరిన్ని విశేషాలు... ► సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి ► నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు మెరిశాయి. ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలతో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా మెటల్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ చేసింది. ► మార్కెట్లో అస్థిరతను సూచించే ఎన్ఎస్ఈ వీఐఎక్స్ ఇండెక్స్ 14 శాతం పెరిగి 25.47 వద్ద ముగిసింది. ► ఎన్సీఎల్టీ నుంచి తుది అనుమతులు వచ్చిన ఆరునెలల్లో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని కంపెనీ బిడ్డింగ్లో దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం సభ్యుడు మురారి లాలా జలాన్ తెలిపారు. ఫలితంగా ఈ కంపెనీ షేరు ఐదు శాతం లాభపడి రూ. 114.90 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకింది. ► ఫైడీస్ ఫుడ్ సిస్టమ్స్ విలీన ప్రక్రియను పూర్తి చేయడంతో జుబిలెంట్ ఫుడ్వర్క్స్ షేరు ఏడాది గరిష్టాన్ని తాకింది. ఆరు శాతం లాభంతో రూ.3128 వద్ద స్థిరపడింది. -
భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. భారీ స్థాయిల్లో లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సోమవారం కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ట్రేడింగ్ ఆరంభించాయి. 50,936 వద్ద స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ కాసేపు లాభాల్లో పయనించింది. తర్వాత ఇంట్రాడేలో 50,975 వద్ద గరిష్టాన్ని తాకి క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. సూచీకి ఏ దశలోనూ మద్దతు లభించలేదు. ఓ దశలో 1,257 పాయింట్లు కోల్పోయి 49,632 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 1,145.44 పాయింట్ల లేదా 2.25 శాతం నష్టంతో 49,744.32కు చేరుకుంటే, నిఫ్టీ 306.05 పాయింట్లు కోల్పోయి 14,675.70 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. స్టాక్ మార్కెట్ లో అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఓఎన్జీసీ షేర్లు లాభపడితే.. ఐటీసీ లిమిటెడ్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్ని చవిచూశాయి. దేశంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నా కరోనా కేసులు మళ్లీ పెరగడంతో ఆ ప్రభావం సూచీలపై పడినట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలో 24 గంటల్లో కేసుల సంఖ్య 7,000పైగా పెరిగాయి. కేసులు ఇలాగే కొనసాగితే త్వరలో లాక్ డౌన్ విధించే సూచనలు ఉన్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
మళ్లీ బుల్ పరుగు..!
ముంబై: జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో స్టాక్ మార్కెట్ సోమవారం మళ్లీ రికార్డుల బాట పట్టింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త శిఖరాలపైన ముగిశాయి. సెన్సెక్స్ 610 పాయింట్లు లాభపడి తొలిసారి 52 వేల శిఖరంపైన 52,154 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్లు ర్యాలీ చేసి 15,314 వద్ద నిలిచింది. మార్కెట్ రికార్డు ర్యాలీలోనూ ఐటీ, మెటల్, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్ 692 పాయింట్లు లాభపడి 52,236 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 15,340 వద్ద కొత్త జీవికాల గరిష్టాలను నమోదు చేశాయి. ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.1.22 లక్షల కోట్లను ఆర్జించగలిగారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.205.14 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలపడి 72.68 వద్ద స్థిరపడింది. ఏడు ట్రేడింగ్ సెషన్ల్లో 1154 పాయింట్లు... ఈ ఫిబ్రవరి 5న సెన్సెక్స్ సూచీ తొలిసారి 51000 స్థాయిని అందుకుంది. నాటి నుంచి కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలోనే సూచీ 1154 పాయింట్లను ఆర్జించి సోమవారం 52,154 వద్ద ముగిసింది. ఇదే ఏడాది జనవరి 07న సెన్సెక్స్ 50000 స్థాయిని అధిగమించింది. కాగా 50వేల నుంచి 51 వేల స్థాయికి చేరుకునేందుకు 11 ట్రేడింగ్ సెషన్ల సమయం తీసుకుంది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్ల అనూహ్య ర్యాలీతో ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ మూడు శాతానికి పైగా లాభపడి జీవితకాల రికార్డు స్థాయి 37306 వద్ద ముగిసింది. ► నిఫ్టీ–50 ఇండెక్స్లో మొత్తం ఏడు స్టాకులు ఏడాది గరిష్టాన్ని తాకగా.., అందులో ఐదు స్టాక్లు ఆర్థిక రంగానికి చెందినవి కావడం విశేషం. ► యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకు షేర్లు నాలుగు నుంచి ఆరు శాతం ర్యాలీ చేశాయి. ► మెరుగైన క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో అపోలో హాస్పిటల్ షేరు 12 శాతం లాభపడి ఏడాది గరిష్టానికి ఎగసింది. ► ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో అమరరాజా బ్యాటరీస్ ఆరు శాతం పతనమై, రూ.928 వద్ద ముగిసింది. మార్కెట్ ఉత్సాహానికి కారణాలు... ► మెరుగైన ఆర్థిక గణాంకాలు... గత వారాంతంలో వెలువడిన డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ను మెప్పించాయి. పారిశ్రామికోత్పత్తి ఆశించిన స్థాయిలో నమోదుకాగా., రిటైల్ ద్రవ్యోల్బణమూ దిగివచ్చింది. అలాగే సోమవారం విడుదలైన జనవరి హోల్సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఆర్థికవేత్తల అంచనాలకు తగ్గట్లు 2.03 శాతంగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం దిగిరావడంతో ఆర్బీఐ ఇక ఇప్పట్లో కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ► కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్కు కలిసొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. యూఎస్ బాండ్ ఈల్డ్ గతేడాది మార్చి తర్వాత పెరిగింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆమోదానికి దాదాపు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఫలితంగా గత శుక్రవారం అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయిలో ముగిశాయి. ఒక సోమవారం జపాన్ ఇండెక్స్ నికాయ్ రెండు శాతం లాభపడి 1990 తర్వాత తొలిసారి 30వేల స్థాయిని తాకింది. సింగపూర్, థాయిలాండ్, దక్షిణ కొరియా దేశాలు అరశాతం నుంచి ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు సైతం రెండుశాతం ఎగిశాయి. ► మెప్పించిన కార్పొరేట్ ఫలితాలు... కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకటన అంకం ముగిసింది. ఆర్థిక పురోగతిపై ఆశలు, పండుగ సీజన్లో నెలకొన్న డిమాండ్ లాంటి అంశాలు కలిసిరావడంతో ఈ క్యూ3 లో కంపెనీలు రెండింతల వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే ఈ క్యూ3లో సుమారు 3087 కంపెనీల సరాసరి నికరలాభం 69 శాతం పెరిగినట్లు ఓ సర్వే తెలిపింది. ► కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు... భారత మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) బుల్లిష్ వైఖరిని కలిగి ఉండటం కూడా సూచీల రికార్డు ర్యాలీకి కొంత తోడ్పడింది. దేశీయ మార్కెట్లో ఈ ఫిబ్రవరి 15 నాటికి ఎఫ్ఐఐలు రూ.20,700 కోట్ల ఈక్విటీ షేర్లను కొన్నారు. కేంద్ర బడ్జెట్ మెప్పించడం, వడ్డీరేట్లపై ఆర్బీఐ సులభతర వైఖరి, లాక్డౌన్ ఎత్తివేత తర్వాత ప్రపంచ దేశాల్లోకెల్లా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా రికవరీ అవుతుండటం, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండటం తదితర కారణాలతో ఎఫ్ఐఐలు భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. -
రికార్డుల ర్యాలీకి చెక్- ఐటీ అప్
ముంబై, సాక్షి: చిట్టచివరికి 9 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 141 పాయింట్లు క్షీణించి 48,036కు చేరింది. నిఫ్టీ సైతం 53 పాయింట్లు తక్కువగా 14,080 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 9 రోజులుగా మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుండటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,130-47,903 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇక నిఫ్టీ సైతం 14,116-14,048 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. మీడియా, రియల్టీ ఓకే ఎన్ఎస్ఈలో మెటల్, పీఎస్యూ బ్యాంకింగ్, ఆటో 1 శాతం స్థాయిలో బలహీనపడగా.. మీడియా, ఐటీ 0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 2.3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇతర బ్లూచిప్స్లో టాటా మోటార్స్, హిందాల్కో, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐవోసీ, కోల్ ఇండియా, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో, బీసీసీఎల్ 3-1.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎంజీఎల్ జోరు డెరివేటివ్ స్టాక్స్లో ఎంజీఎల్, ఐజీఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్అండ్టీ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్, మదర్సన్, జూబిలెంట్ ఫుడ్, జీ, నౌకరీ, ఇండస్టవర్ 4.2- 1.6 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు పిరమల్, ఇండిగో, చోళమండలం, కెనరా బ్యాంక్, భారత్ ఫోర్జ్, ఐడియా, ఆర్తి ఇండస్ట్రీస్, లాల్పాథ్ 2.6-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్స్ 0.2 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,229 నష్టపోగా.. 1149 లాభాలతో ట్రేడవుతున్నాయి. పెట్టుబడులవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 715 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గత శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 506 కోట్లు, డీఐఐలు రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
మెటల్స్ మెరుపులు- సెన్సెక్స్ రికార్డ్
ముంబై, సాక్షి: దేశీయంగా కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. వెరసి 9వ రోజూ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు ఎగసి 48,177 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 114 పాయింట్లు జమ చేసుకుని 14,133 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,220 వద్ద, నిఫ్టీ 14,148 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకడం విశేషం! (స్ట్ర్రెయిన్ ఎఫెక్ట్- పసిడి, వెండి హైజంప్) పీఎస్యూ బ్యాంక్స్ ఓకే ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మెటల్ 5 శాతం, ఐటీ 2.7 శాతం, ఆటో 1.6 శాతం చొప్పున ఎగశాయి. పీఎస్యూ బ్యాంక్స్, ఫార్మా, మీడియా సైతం 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్, హిందాల్కో, ఐషర్, ఓఎన్జీసీ, టీసీఎస్, బీసీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గెయిల్, గ్రాసిమ్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా టాటా మోటార్స్ 8.4-2.5 శాతం మధ్య జంప్చేశాయి. బ్లూచిప్స్లో కేవలం హీరోమోటో, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టైటన్, ఏషియన్ పెయింట్స్, పవర్గ్రిడ్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.6- 0.5 శాతం మధ్య నీరసించాయి. మెటల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో చోళమండలం, జిందాల్ స్టీల్, సెయిల్, నాల్కో, వేదాంతా, ఎన్ఎండీసీ, ఐడియా, కమిన్స్, అశోక్ లేలాండ్, భెల్ 7-5 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోవైపు జీ, జూబిలెంట్ ఫుడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బంధన్ బ్యాంక్, ఐబీ హౌసింగ్ 2.6-0.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,096 లాభపడగా.. 993 మాత్రమే నష్టాలతో ముగిశాయి. పెట్టుబడులవైపు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 506 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1,136 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
9వ రోజూ జోరు- సెన్సెక్స్@ 48,000
ముంబై, సాక్షి: వరుసగా 9వ రోజూ దేశీ స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 250 పాయింట్లు ఎగసి 48,119కు చేరింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు పుంజుకుని 14,102 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 48,168 వద్ద, నిఫ్టీ 14,114 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. చదవండి: (2021లో పెట్టుబడికి 6 స్టాక్స్) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, మీడియా 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, గెయిల్, గ్రాసిమ్, బీసీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్, టీసీఎస్, ఐసీఐసీఐ, ఐవోసీ, ఎస్బీఐ, యాక్సిస్ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్లో కేవలం హీరోమోటో, టైటన్, ఆర్ఐఎల్, ఏషియన్ పెయింట్స్ మాత్రమే అదికూడా 0.5 శాతం స్థాయిలో డీలా పడ్డాయి. ఐడియా జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో ఐడియా, అశోక్ లేలాండ్, సెయిల్, ఫెడరల్ బ్యాంక్, ఎన్ఎండీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్, ముత్తూట్, భెల్, నాల్కో 5.5-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు కాల్గేట్ పామోలివ్ 0.4 శాతం క్షీణించింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,862 లాభపడగా.. 521 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. పెట్టుబడులవైపు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 506 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1,136 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
నిఫ్టీ భళా- 2020కు రికార్డ్స్తో వీడ్కోలు
ముంబై, సాక్షి: భారీ ఆటుపోట్లను చవిచూసిన 2020 ఏడాదికి దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగింపు పలికాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 వణికించినప్పటికీ చెప్పుకోదగ్గ లాభాలతో నిలిచాయి. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే మార్కెట్లు 16 శాతం స్థాయిలో బలపడ్డాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 47,000 పాయింట్లను అధిగమించడంతోపాటు.. 48,000 మార్క్కు చేరువైంది. ఈ బాటలో నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఈ ఏడాది కరోనా వైరస్ కల్లోలంతో ఫార్మా రంగం అత్యధికంగా 61 శాతం దూసుకెళ్లగా.. లాక్డవున్ నేపథ్యంలో కొత్త అవకాశాలతో ఐటీ 55 శాతం జంప్చేసింది. వెరసి ఇన్వెస్టర్లకు అత్యధిక రిటర్నులు అందించిన దిగ్గజాలలో దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ ముందునిలవగా.. ప్రయివేట్ రంగ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ వెనకడుగు వేసింది. ఇదేవిధంగా పీఎస్యూ బ్లూచిప్స్ ఐవోసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా సైతం డీలా పడ్డాయి. (తొలిసారి.. 14,000 మైలురాయికి నిఫ్టీ) నేటి ట్రేడింగ్ ఇలా డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ చివరి రోజు స్వల్ప ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ నామమాత్రంగా 5 పాయింట్లు బలపడి 47,751 వద్ద నిలిచింది. నిఫ్టీ యథాతథంగా 13,982 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో 47,897 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,602 వరకూ డీలా పడగా.. నిఫ్టీ 14,025-13,936 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,766 లాభపడగా.. 1,244 నష్టపోయాయి. 2020లో జోష్ ప్రధానంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ ఊపందుకుంది. ఫలితంగా చౌకగా లభిస్తున్న ప్రపంచ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి వంటి సాధనాలలోకి ప్రవహించాయి. ఫలితంగా యూఎస్తోపాటు భారత్ మార్కెట్లు కూడా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. కోవిడ్-19 భయాలతో ఆగస్ట్లో న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్లో పసిడి 10 గ్రాములు (ఎంసీఎక్స్) రూ. 57,100కు ఎగసింది. ఇది దేశీ బులియన్ మార్కెట్లోనే రికార్డ్కావడం విశేషం! (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? ) రికవరీ ఆశలు కోవిడ్-19 సంక్షోభం నుంచి నెమ్మదిగా యూఎస్, చైనా, భారత్ వంటి దేశాలు బయటపడుతుండటంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగాయి. ఇది సెంటిమెంటుకు బలాన్నిచ్చింది. దీనికితోడు కొన్ని ఎంపిక చేసిన రంగాలలో కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తూ వచ్చాయి. ఇది ఇన్వెస్టర్లకు హుషారునిచ్చింది. వీటికి జతగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు, వివిధ వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షల పలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ప్రధానంగా గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్లు జోష్నిచ్చాయి. దేశీయంగానూ భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్, జైడస్ క్యాడిలా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తదితర సంస్థలు వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీకి ఒప్పందాలు కుదుర్చుకోవడంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తూ వచ్చినట్లు విశ్లేషకులు వివరించారు. -
5 రోజుల ర్యాలీకి బ్రేక్- నష్టాలతో షురూ
ముంబై, సాక్షి: వరుసగా ఐదు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు తాజాగా కన్సాలిడేషన్ బాట పట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 81 పాయింట్లు క్షీణించి 47,532కు చేరగా.. నిఫ్టీ 21 పాయింట్లు తక్కువగా 13,911 వద్ద ట్రేడవుతోంది. గత 20 సెషన్లలో 14సార్లు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు గురువారం డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,808-47,462 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. పీఎస్యూ బ్యాంక్స్ డౌన్ ఎన్ఎస్ఈలో ఐటీ, ఆటో 0.3 శాతం చొప్పున పుంజుకోగా మిగిలిన అన్ని రంగాలూ డీలాపడ్డాయి. ప్రధానంగా పీఎస్యూ బ్యాంకింగ్, ఫార్మా1-0.6 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, ఐషర్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీసీఎల్ టెక్, ఎంఅండ్ఎం 3.5-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎస్బీఐ, ఇండస్ఇండ్, సిప్లా, గ్రాసిమ్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, యాక్సిస్, హిందాల్కో, బ్రిటానియా, ఎల్అండ్టీ, ఆర్ఐఎల్ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. జీఎంఆర్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో జీఎంఆర్, సెయిల్, బాలకృష్ణ, శ్రీరామ్ ట్రాన్స్, ఐసీఐసీఐ లంబార్డ్, పెట్రోనెట్, నౌకరీ, కమిన్స్ 4-1.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు నాల్కో, బీవోబీ, ఎల్ఐసీ హౌసింగ్, ఐడీఎఫ్సీ ఫస్ట్, పీఎన్బీ, అరబిందో, పీఎఫ్సీ, కెనరా బ్యాంక్, సన్ టీవీ, ఆర్ఈసీ 2-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,130 లాభపడగా.. 1,158 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్పీఐల జోరు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,349 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,010 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
19 సెషన్లలో 13 సార్లు కొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: కోవిడ్-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు జంప్చేసి 47,354కు చేరగా.. నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా నాలుగో రోజూ మార్కెట్లు లాభాల బాటలో కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,407 సమీపంలోనూ, నిఫ్టీ 13,885 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ 19 ట్రేడింగ్ సెషన్లలో 13సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన భారీ ప్యాకేజీపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేయడంతో ఇన్వెస్టర్లు హుషారొచ్చినట్లు తెలియజేశారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఫార్మా వీక్ ఎన్ఎస్ఈలో ఫార్మా(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, పీఎస్యూ బ్యాంక్స్ 2.6 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టైటన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఎల్అండ్టీ, గెయిల్, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, ఐవోసీ, కొటక్ బ్యాంక్, గ్రాసిమ్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్ఢీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ 6-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్లో కేవలం హెచ్యూఎల్, సన్ ఫార్మా, సిప్లా, శ్రీసిమెంట్, బ్రిటానియా అదికూడా 0.5-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) గోద్రెజ్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్లో సెయిల్, ఐబీ హౌసింగ్, టాటా పవర్, ఆర్బీఎల్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మదర్సన్, నాల్కో, బెల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, యూబీఎల్, జిందాల్ స్టీల్, పీఎన్బీ, ఫెడరల్ బ్యాంక్ 7.5-3.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు బయోకాన్ 3.5 శాతం పతనంకాగా.. ఎస్కార్ట్స్, ఇండస్ టవర్, అపోలో హాస్పిటల్, కమిన్స్, అమరరాజా, ఎంఆర్ఎఫ్, క్యాడిలా హెల్త్ 1.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,021 లాభపడగా.. 997 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్పీఐల జోరు శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
క్రిస్మస్ టు క్రిస్మస్: చిన్న షేర్లు చిరుతలు
ముంబై, సాక్షి: గతేడాది(2019) క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకూ మార్కెట్లు పలు ఎత్తుపల్లాలను చవిచూశాయి. అంతక్రితం ఏడాది మార్కెట్లు పెద్దగా ర్యాలీ చేయకపోవడంతో నెమ్మదిగా బలపడుతూ వచ్చాయి. అయితే 2020 మార్చికల్లా కోవిడ్-19 దెబ్బకు ఉన్నట్టుండి పతనమయ్యాయి. తిరిగి వెనువెంటనే కోలుకుని బుల్ ధోరణిలో సాగిపోయాయి. ఫలితంగా మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధిస్తూ వచ్చాయి. తాజాగా సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 47,000 పాయింట్ల మైలురానికి అధిగమించగా.. నిఫ్టీ 14,000 పాయింట్లవైపు సాగుతోంది. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ ఏడాది కాలంలో 13 శాతం చొప్పున బలపడగా.. మధ్య, చిన్నతరహా కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 19 శాతం, 32 శాతం చొప్పున ఎగశాయి. ఇతర వివరాలు చూద్దాం.. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) కారణాలేవిటంటే? ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పడగ విప్పడంతో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. తద్వారా భారీ స్థాయిలో నిధులను వ్యవస్థలోకి విడుదల చేయడంతో అటు బంగారం, ఇటు స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సంక్షోభ పరిస్థితుల భయాలతో పసిడి జోరందుకోగా.. లిక్విడిటీ కారణంగా మార్కెట్లు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా తదితర దిగ్గజాలు వేగంగా వ్యాక్సిన్లను రూపొందించడంతో సెంటిమెంటు పుంజుకున్నట్లు తెలియజేశారు. దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1.5 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం ప్రభావం చూపింది. (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్) షేర్లు మరింత స్పీడ్ బీఎస్ఈ-500 ఇండెక్సులో 65 శాతం షేర్లు లాభాలతో నిలిచాయి. వీటిలో 50 శాతం రెండంకెల వృద్ధిని చూపాయి. ప్రధానంగా 36 స్టాక్స్ 100-900 శాతం మధ్య దూసుకెళ్లడం ద్వారా మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. వీటిలో మిడ్, స్మాల్ క్యాప్స్ అధికంగా చోటు సాధించడం విశేషం! ప్రధాన కంపెనీలలో అదానీ గ్రీన్, ఆర్తి డ్రగ్స్, లారస్ లేబ్స్, ఐవోఎల్ కెమికల్స్, ఆల్కిల్ అమైన్స్, బిర్లాసాఫ్ట్, డిక్సన్ టెక్నాలజీస్, ఇండియామార్ట్ ఇంటర్మెష్, గ్రాన్యూల్స్, వైభవ్ గ్లోబల్, టాటా కమ్యూనికేషన్స్, నవీన్ ఫ్లోరిన్, పాలీ మెడిక్యూర్, దీపక్ నైట్రైట్, అఫ్లే ఇండియా, సీక్వెంట్ సైంటిఫిక్, జేబీ కెమికల్స్, అదానీ గ్యాస్, స్ట్రైడ్స్ ఫార్మా, ఫస్ట్సోర్స్, అదానీ ఎంటర్, యాంబర్ ఎంటర్, ఏపీఎల్ అపోలో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జిందాల్ స్టెయిన్, టాటా ఎలక్సీ, దివీస్ లేబ్స్, మైండ్ట్రీ, ఇండియా సిమెంట్స్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎస్కార్ట్స్, రెస్సాన్సివ్, వొకార్డ్ 600-100 శాతం మధ్య జంప్ చేయడం విశేషం! ఇతర కౌంటర్లలో తాన్లా సొల్యూషన్స్ 900 శాతం పురోగమించింది. నేలచూపులో గతేడాది కాలంలో ప్రభుత్వ రంగ కంపెనీలు కొన్ని నేలచూపులకే పరిమితమయ్యాయి. ఈ జాబితాలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, హోటళ్లు, రిటైల్ రంగ కౌంటర్లు సైతం చోటు చేసుకున్నాయి. ఫ్యూచర్ రిటైల్, జీఈ పవర్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, రేమండ్, కెనరా బ్యాంక్, చాలెట్ హోటల్స్, ఇండస్ఇండ్, బీవోబీ, లెమన్ ట్రీ, షాపర్స్స్టాప్, ఎడిల్వీజ్ ఫైనాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, జాగరణ్ ప్రకాశన్, డీసీబీ బ్యాంక్, కోల్ ఇండియా, ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ తదితరాలు 30 శాతం స్థాయిలో నీరసించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. -
రికార్డ్స్కు బ్రేక్- మార్కెట్లు పతనం
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా రికార్డుల సాధనే లక్ష్యంగా సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లకు చెక్ పడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 353 పాయింట్లు పతనమై 45,751కు చేరింది. నిఫ్టీ సైతం 116 పాయింట్లు కోల్పోయి 13,413 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీపై విభేదాలు, టెక్ దిగ్గజాలలో అమ్మకాల కారణంగా బుధవారం యూఎస్ మార్కెట్లు 0.4-2 శాతం మధ్య క్షీణించాయి. దీనికితోడు ఇటీవల వేగంగా దూసుకెళుతున్న దేశీ మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు వెనకడుగు వేస్తున్నట్లు నిపుణులు వివరించారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,743 వద్ద, నిఫ్టీ 13,412 వద్ద కనిష్టాలకు చేరాయి. చదవండి: (46,000 దాటేసిన సెన్సెక్స్ప్రెస్) యూపీఎల్ పతనం ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలహీనపడ్డాయి. ప్రధానంగా మీడియా పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ, మెటల్ 2.6-1.2 శాతం మధ్య డీలా పడ్డాయి. ఫార్మా స్వల్పంగా 0.2 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్ 10.5 శాతం కుప్పకూలగా.. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐవోసీ, అల్ట్రాటెక్, గెయిల్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, బీపీసీఎల్, ఎంఅండ్ఎం 2.5-1.3 శాతం మధ్య క్షీణించాయి. బ్లూచిప్స్లో కేవలం మారుతీ, నెస్లే, టైటన్, దివీస్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.5-0.3 శాతం మధ్య లాభపడ్డాయి. (వ్యాక్సిన్ షాక్- పసిడి ధరల పతనం) పీఎస్యూ షేర్లు వీక్ డెరివేటివ్స్లో ఆర్ఈసీ, పీఎప్సీ, బీహెచ్ఈఎల్, కెనరా బ్యాంక్, రామ్కో సిమెంట్, బీఈఎల్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, జీ, శ్రీరామ్ ట్రాన్స్ 7-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క నౌకరీ, బాలకృష్ణ, డాబర్, బంధన్ బ్యాంక్, అరబిందో, పిడిలైట్, జూబిలెంట్ ఫుడ్, టొరంట్ ఫార్మా 2.4-0.3 శాతం మధ్య బలపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,548 క్షీణించగా.. 662 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,564 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,493 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
జీడీపీ జోష్- మార్కెట్లు గెలాప్
ముంబై, సాక్షి: కోవిడ్-19 నేపథ్యంలోనూ జులై- సెప్టెంబర్లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 506 పాయింట్లు జంప్చేసి 44,655 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 140 పాయింట్లు ఎగసి 13,109 వద్ద నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో ఒక్కసారిగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,730ను అధిగమించగా, నిఫ్టీ 13,128 పాయింట్లను దాటింది. చదవండి: (సిమెంట్ షేర్లు.. భలే స్ట్రాంగ్) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, పీఎస్యూ బ్యాంక్స్, ఐటీ, ఫార్మా, మెటల్ 3.3-1.7 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్ఎంసీజీ యథాతథంగా నిలిచింది. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, యూపీఎల్, ఓఎన్జీసీ, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, జేస్డబ్ల్యూ స్టీల్, శ్రీసిమెంట్ 8-2.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. నెస్లే, కొటక్ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ 2.6-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎఫ్అండ్వోలో డెరివేటివ్ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్, టాటా పవర్, అదానీ ఎంటర్, కెనరా బ్యాంక్, మదర్సన్, యూబీఎల్, భెల్, బీవోబీ, ఫెడరల్ బ్యాంక్, డీఎల్ఎఫ్ 6.7-4.3 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోపక్క శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, మణప్పురం, ఐజీఎల్, అమరరాజా, నౌకరీ, ఎస్కార్ట్స్, జీఎంఆర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, కమిన్స్ 4.3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,927 లాభపడగా.. 973 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక గురువారం ఎఫ్పీఐలు రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టినన విషయం విదితమే. కాగా.. నవంబర్ నెలలో ఎఫ్పీఐలు ఈక్విటీలలో రూ. 60,358 కోట్లు ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
కన్సాలిడేషన్లో మార్కెట్లు- ఆటో స్పీడ్
ముంబై, సాక్షి: డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ తొలిరోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయింట్లు క్షీణించి 44,142 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 27 పాయింట్లు తక్కువగా 12,960 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,407 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,124 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 13,035-12,957 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు క్యూ2(జులై- సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, రియల్టీ, మీడియా, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్ 1.6-0.5 శాతం మధ్య బలపడగా.. మెటల్ 0.35 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఐషర్, గెయిల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, టెక్ మహీంద్రా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్ 4-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్గ్రిడ్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆర్ఐఎల్, యాక్సిస్, శ్రీ సిమెంట్, టీసీఎస్, టాటా స్టీల్, ఎయిర్టెల్ 2-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐజీఎల్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఐజీఎల్ 11 శాతం దూసుకెళ్లగా.. ఎంజీఎల్, భెల్, కేడిలా హెల్త్కేర్, బాలకృష్ణ, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్, అపోలో టైర్, గోద్రెజ్ సీపీ 9-2.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు బాష్, ఐసీఐసీఐ లంబార్డ్, ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్ 1.4-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,276 లాభపడగా.. 556 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్పీఐలు నామమాత్రంగా రూ. 24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,840 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. డీఐఐలు . 2,522 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
రికార్డ్ స్థాయి నుంచి కుప్పకూలిన మార్కెట్లు
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా సరికొత్త రికార్డులతో దూకుడు చూపుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి బోర్లా పడ్డాయి. అయితే తొలుత యథావిధిగా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నప్పటికీ తదుపరి అమ్మకాలు పెరగడంతో వెనకడుగు వేశాయి. మిడ్సెషన్ నుంచీ అమ్మకాలు ఉధృతంకావడంతో చివరికి పతనంతో నిలిచాయి. సెన్సెక్స్ 695 పాయింట్లు కోల్పోయి 43,828 వద్ద ముగిసింది. నిఫ్టీ 197 పాయింట్లు వొదులుకుని 12,858 వద్ద స్థిరపడింది. తొలుత సెన్సెక్స్ 44,825 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. తదుపరి 43,758 వరకూ జారింది. వెరసి ఇంట్రాడే గరిష్టం నుంచి 1,050 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ సైతం 13,146 వద్ద గరిష్టాన్ని తాకగా.. 12,834 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. గురువారం(26న) నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం దెబ్బతీసినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. తొలుత ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 30,000 పాయింట్ల మార్క్ను దాటేసింది. 30,198కు చేరి రికార్డ్ నెలకొల్పింది. పీఎస్యూ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో ప్రధాన రంగాలన్నీ2.5-1 శాతం మధ్య క్షీణించగా.. ప్రభుత్వ రంగ బ్యాంక్స్ 1.7 శాతం ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ 6 శాతం జంప్చేయగా.. గెయిల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా మాత్రమే అదికూడా 1.7-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఐషర్, యాక్సిస్, కొటక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, శ్రీ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటో, యూపీఎల్, సిప్లా, ఎయిర్టెల్ 4-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. చిన్న షేర్లు వీక్ డెరివేటివ్ కౌంటర్లలో బీవోబీ, శ్రీరామ్ ట్రాన్స్, కెనరా బ్యాంక్, పీఎన్బీ, మణప్పురం, టాటా పవర్, బంధన్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, పీవీఆర్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 4.5-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, జూబిలెంట్ ఫుడ్, ఎస్ఆర్ఎఫ్, డీఎల్ఎఫ్, ఇండిగో, జిందాల్ స్టీల్, ఎంఆర్ఎఫ్, కాల్గేట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.4-3.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.7-1 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,126 లాభపడగా.. 1,660 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 4,563 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
13,000 శిఖరంపైకి నిఫ్టీ
ముంబై: వ్యాక్సిన్పై ఆశలతో స్టాక్ మార్కెట్లో మంగళవారమూ రికార్డుల పరంపర కొనసాగింది. బ్యాంకింగ్, మెటల్, ఫార్మా షేర్ల ర్యాలీ అండతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను నమోదుచేశాయి. నిఫ్టీ తొలిసారి 13000 మైలురాయిని అధిగమించడంతో పాటు ఈ స్థాయిపైనే ముగిసింది. దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం, రూపాయి రికవరీ అంశాలు ఇన్వెస్టర్లకు మరింత విశ్వసాన్నిచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 446 పాయింట్లు పెరిగి 44,523 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 13,055 వద్ద స్థిరపడింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కొంత లాభాల స్వీకరణ చేసుకోవడం మంచిదని ఇన్వెస్టర్లు సలహానిస్తున్నారు. మార్కెట్ దిద్దుబాటు తర్వాత నాణ్యమైన షేర్లను పోర్ట్ఫోలియోలో చేర్చుకోవాల్సిందిగా వారు సూచిస్తున్నారు. సూచీలు రికార్డు ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.1.35 లక్షల కోట్లను ఆర్జించారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.174.81 లక్షల కోట్లకు చేరుకుంది. ఆశలు పెంచిన వ్యాక్సిన్లు ... కోవిడ్–19 కట్టడికి ఫైజర్, మోడర్నా, ఆ్రస్టాజెనెకా కంపెనీలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు ఈ ఏడాది చివరికల్లా విడుదల కావచ్చనే వార్తలతో ఇన్వెస్టర్లు ఈక్విటీ కొనుగోళ్లకు ఆసక్తిచూపారు. అలాగే తాము తయారుచేసే వ్యాక్సిన్ తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఉంటుందని ఆ్రస్టాజెనెకా ప్రకటనతో మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడింది. ఫలితంగా ఇంట్రాడేలో జరిగిన విస్తృతస్థాయి కొనుగోళ్లతో సెన్సెక్స్ 524 పాయింట్లు లాభపడి 44,602 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 13,079 వద్ద కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను నమోదుచేశాయి. రూ.50 వేల కోట్లకు చేరిన ఎఫ్ఐఐల పెట్టుబడులు.... దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. నగదు విభాగంలో వారు నవంబర్ 24 నాటికి రూ.50, 501 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకుంటున్నాయి. ఇదే నవంబర్ 24న నాటికి డీఐఐలు రూ.34,272 కోట్లను షేర్లను విక్రయించడం గమనార్హం. మార్కెట్ మరిన్ని విశేషాలు.. ► ఆర్బీఐ మారిటోయం విధింపుతో లక్ష్మీ విలాస్ బ్యాంక్ వరుసగా ఆరోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో పదిశాతం నష్టపోయి రూ.7.30 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకింది. ఈ షేరు కేవలం ఆరురోజుల్లో మొత్తంగా 53 శాతం నష్టపోయింది. ► సీఎల్ఎస్ఏ టార్గెట్ ధరను పెంచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3 శాతం లాభపడింది. ► ఎన్ఎస్ఈలో దాదాపు 178 షేర్లు 52–వారాల గరిష్ట స్థాయిని తాకాయి. రూ.2,500 కోట్లు సమీకరించిన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బాండ్ల జారీ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించింది. వ్యాపార వృద్ధి కోసం ఈ నిధులను వినియోగిస్తామని ఎస్బీఐ పేర్కొంది. ఒక్కొక్కటి రూ.10 లక్షల ముఖ విలువ గల ఇరవై ఐదువేల బాసిల్–త్రి బాండ్ల ద్వారా ఈ నిధులు సమీకరించామని వివరించింది. ఈ బాండ్లకు వార్షికంగా 7.73 శాతం వడ్డీని చెల్లిస్తామని పేర్కొంది. గత నెలలో కూడా ఎస్బీఐ బాసిల్–త్రి బాండ్ల జారీ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది. -
వారెవ్వా.. మార్కెట్లు ధూమ్ధామ్
ముంబై, సాక్షి: ఈ ఏడాది మార్చిలో కుప్పకూలాక జోరందుకున్న మార్కెట్లు బుల్ వేవ్లోనే కదులుతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్నిస్తున్నాయి. దీంతో ఇండెక్సులు రేసు గుర్రాల్లా పరుగు తీస్తున్నాయి. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లలో పలు రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 129 పాయింట్లు ఎగసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి13,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 13,055 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ సైతం 44,523 పాయింట్లు జంప్చేసి 44,523 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్, నిఫ్టీ లైఫ్టైమ్ గరిష్టాలను సాధించాయి. ఈ బాటలో ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 44,601 వద్ద, నిఫ్టీ 13,079 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. కోవిడ్-19 కట్టడికి ఈ ఏడాది చివరికల్లా ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకాసహా పలు కంపెనీలు వ్యాక్సిన్లను విడుదల చేయనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ జోరు కరోనా వైరస్ విలయంతో ఈ ఏడాది మార్చి 24న నిఫ్టీ 7,511 పాయింట్లకు పడిపోయింది. ఇది రెండేళ్ల కనిష్టంకాగా.. తదుపరి ర్యాలీ బాట పట్టింది. 8 నెలల్లోనే 75 శాతం దూసుకెళ్లింది. 13,000 పాయింట్ల మార్క్ను దాటేసింది. అయితే గతేడాదిలో 12,000 పాయింట్ల మార్క్ను అందుకున్నాక 13,000కు చేరేందుకు 18 నెలల సమయం తీసుకోవడం గమనార్హం! బ్యాంక్స్ భేష్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, ఫార్మా, మెటల్ 2.5- శాతం మధ్య వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఐషర్, హిందాల్కో, ఎంఅండ్ఎం, ఐటీసీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ, డాక్టర్ రెడ్డీస్ 4.5-2.8 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో టైటన్, హెచ్డీఎఫ్సీ, బీపీసీఎల్, నెస్లే, గెయిల్, శ్రీ సిమెంట్, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్, ఎయిర్టెల్, ఐవోసీ 1.5-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. బాష్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో బాష్ 10 శాతం జంప్చేయగా.. ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, అరబిందో, ఎస్ఆర్ఎఫ్, పిరమల్ 6-3.5 శాతం మధ్య జంప్చేశాయి. అయితే మరోపక్క జీఎంఆర్, జూబిలెంట్ ఫుడ్, అపోలో హాస్పిటల్స్, టీవీఎస్ మోటార్, యూబీఎల్, ముత్తూట్ 3-1.2 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.9 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,637 లాభపడగా.. 1,174 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. వారాంతాన ఎఫ్పీఐలు రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
రికార్డ్స్ రికార్డ్స్- తొలిసారి 13,000కు నిఫ్టీ
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్నిస్తున్నాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లలో రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. వెరసి నిఫ్టీ.. మార్కెట్ చరిత్రలో తొలిసారి 13,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక సెన్సెక్స్ సైతం ట్రేడింగ్ ప్రారంభంలోనే 44,421 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 320 పాయింట్లు ఎగసి 44,397 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 13,021 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో నిఫ్టీ 13,027 వరకూ జంప్చేసింది. కోవిడ్-19 కట్టడికి ఈ ఏడాది చివరికల్లా ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకాసహా పలు కంపెనీలు వ్యాక్సిన్లను విడుదల చేయనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్యాంక్స్ భేష్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియల్టీ 1 శాతం స్థాయిలో వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, ఐసీఐసీఐ, పవర్గ్రిడ్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్ 3.2-1.2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్లో కేవలం హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా అదికూడా 0.5-0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఇన్ఫ్రాటెల్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో ఇన్ఫ్రాటెల్ 8 శాతం జంప్చేయగా.. మైండ్ట్రీ, జీఎంఆర్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, అపోలో టైర్, ఐడియా, టాటా కెమికల్స్ 3-2 శాతం మధ్య బలపడ్డ్డాయి. అయితే మరోపక్క ముత్తూట్ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ ఫస్ట్, బీహెచ్ఈఎల్, టీవీఎస్ మోటార్, యూబీఎల్, కేడిలా హెల్త్, ఎన్ఎండీసీ, సన్ టీవీ 1-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,255 లాభపడగా.. 526 నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. వారాంతాన ఎఫ్పీఐలు రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మళ్లీ రికార్డుల పరుగు..!
ముంబై: స్టాక్ మార్కెట్ మళ్లీ రికార్డుల బాటపట్టింది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో సూచీలు సోమవారం మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 195 పాయింట్లు పెరిగి 44 వేల పైన 44,077 వద్ద స్థిరపడింది. నిప్టీ 67 పాయింట్లను ఆర్జించి 12900 ఎగువున 12,926 వద్ద నిలిచింది. కోవిడ్–19 కట్టడికి ఫార్మా కంపెనీలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు ట్రయల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయనే వార్తలు ఈక్విటీలకు ఉత్సాహాన్నిచ్చాయి. తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రాజెనికాల సంయుక్త ఆధ్వర్యంలో రూపకల్పన చేసిన వ్యాక్సిన్ సైతం తుది దశలో మెరుగైన ఫలితాలనిచ్చింది. అలాగే రిలయన్స్ – ఫ్యూచర్ గ్రూప్ డీల్కు సీసీఐ ఆమోదం తెలపడంతో రిలయన్స్ షేరు 3 శాతం లాభపడి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి రివకరీ కలిసొచ్చింది. మార్కెట్లో జరిగిన విస్తృతస్థాయి కొనుగోళ్ల భాగంగా చిన్న, మధ్య తరహా షేర్లకు అధికంగా డిమాండ్ నెలకొంది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 1.25% లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 389 పాయింట్లు ఎగసి 44,271 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 12,969 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు... ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితి 26 శాతానికి పెంచాలని ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) ప్రతిపాదనతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2.50 శాతం నుంచి 1% నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1% పతనమైంది. 3 శాతం లాభపడ్డ రిలయన్స్ షేరు... ఆర్ఐఎల్–ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీఐఐ) ఆమోదం తెలపడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3 శాతం లాభపడి రూ.1,951 వద్ద ముగిసింది. ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్, గిడ్డంగుల వ్యాపారాలను కొనుగోలు చేయాలన్న రిలయన్స్ రిటైల్ సంస్థ ప్రతిపాదనకు శుక్రవారం సీఐఐ ఆమోదం తెలిపింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆర్ఐఎల్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించండంతో షేరు ఇంట్రాడేలో 4 శాతం ఎగసి రూ.1,970 స్థాయిని అందుకుంది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.34,892 కోట్లు పెరిగి రూ.13.19 లక్షల కోట్లకు చేరుకుంది. ఫ్యూచర్ గ్రూప్ షేర్లలోనూ కొనుగోళ్లే... రూ.24,173 కోట్ల ఆర్ఐఎల్–ఫ్యూచర్ గ్రూప్ డీల్కు సీఐఐ అనుమతులు లభించడంతో కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ షేర్లు పరుగులు పెట్టాయి. రిటైల్ ఫ్యూచర్ 10% లాభపడి రూ.70 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకింది. ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్ షేరు 10% ఎగిసి రూ.90.30 స్థాయిని తాకింది. ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ షేరు ఇంట్రాడేలో 5% ర్యాలీతో రూ.10.45 స్థాయిని అందుకుంది. -
సెన్సెక్స్@ 43,000- ఫైజర్ రికార్డ్
ముంబై: వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దౌడు తీస్తున్నాయి. వెరసి స్టాక్ మార్కెట్ల చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 43,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం 418 పాయింట్లు జంప్ చేసి 43,015 వద్ద ట్రేడవుతోంది. సోమవారం సైతం ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీ సరికొత్త రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా ఫలితాలనిచ్చినట్లు పేర్కొనడంతో ఫైజర్ లిమిటెడ్ కౌంటర్ జోరందుకుంది. అమెరికన్ పేరెంట్ కంపెనీ ఫైజర్ ఇంక్ షేరు సోమవారం 7.5 శాతం లాభపడటంతో ఈ కౌంటర్ కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. 20 శాతం ప్లస్ జర్మన్ కంపెనీ బయో ఎన్టెక్ తో సంయుక్తంగా రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో 90 శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చినట్లు ఫైజర్ ఇంక్ పేర్కొంది. ఈ నెలాఖరుకల్లా ఎమెర్జీన్సీ ప్రాతిపదికన వినియోగించేందుకు యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతి లభించే వీలున్నట్లు అభిప్రాయపడింది. దీంతో దేశీ అనుబంధ సంస్థ ఫైజర్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్ఎస్ఈలో తొలుత 20 శాతం దూసుకెళ్లింది. రూ. 977 ఎగసి రూ. 5,900ను తాకింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుుకుంది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 5,256 వద్ద ట్రేడవుతోంది. -
కదం తొక్కిన స్టాక్ బుల్- కొత్త రికార్డ్స్
ముంబై: వరుసగా ఆరో రోజు స్టాక్ బుల్ కదం తొక్కింది. దీంతో కేవలం 7 నెలల్లోనే దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ.. చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ఏడాది జనవరి 20న సాధించిన లైఫ్ టైమ్ హైలను రెండు ఇండెక్సులూ తిరిగి ఒకే రోజు అధిగమించడం విశేషం. కోవిడ్-19 ఇచ్చిన షాక్ నుంచి కేవలం 7 నెలల్లోనే దేశీ స్టాక్ మార్కెట్లు సూపర్ ర్యాలీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 752 పాయింట్లు దూసుకెళ్లి 42,645ను తాకింది. నిఫ్టీ సైతం 210 పాయింట్లు ఎగసి 12,474కు చేరింది. వెరసి సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంతక్రితం ఈ ఏడాది జనవరి 20న సెన్సెక్స్ 42,274 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,430 వద్ద ఇంట్రాడేలో రికార్డ్ గరిష్టాలను నమోదు చేసిన విషయం విదితమే. కాగా.. ట్రేడింగ్ ముగిసేసరికి నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 12,461 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 704 పాయింట్లు జంప్ చేసి 42,597 వద్ద స్థిరపడింది. వెరసి ముగింపులోనూ లైఫ్ టైమ్ ‘హై’లను సాధించాయి. కారణాలేవిటంటే? డెమక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ ప్రెసిడెంట్ కానుండటం, కేంద్ర బ్యాంకులు ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సహాయక ప్యాకేజీలకు మద్దతిస్తుండటం వంటి అంశాలు ప్రధానంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. బైడెన్- ప్రధాని మోడీ మధ్య మంచి అవగాహన, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం వంటి అంశాలు సైతం ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్ లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం సైతం ఇందుకు దోహదం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల తొలి ఐదు రోజుల్లోనే ఎఫ్ఐఐలు నగదు విభాగంలో నికరంగా రూ. 8,381 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 0.5-2.7 శాతం మధ్య బలపడ్డాయి. మీడియా యథాతథంగా ముగిసింది. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్, హిందాల్కో, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, శ్రీసిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐషర్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ 5.5-2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ లో కేవలం సిప్లా, అదానీ పోర్ట్స్, మారుతీ, ఐటీసీ, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, 3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. వోల్టాస్ జూమ్ డెరివేటివ్స్లో వోల్టాస్, ఎస్కార్ట్స్, మదర్ సన్, కోఫోర్జ్, ఇండిగో, వేదాంతా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, భారత్ ఫోర్జ్ 6.5-3.5 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. గ్లెన్ మార్క్ 6 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో టొరంట్ పవర్, మణప్పురం, శ్రీరాం ట్రాన్స్, జిందాల్ స్టీల్, బాష్, అశోక్ లేలాండ్, సెయిల్, జీ 2-0.7 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,506 లాభపడగా.. 1,185 నష్టపోయాయి. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 4,870 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,939 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 5,368 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,208 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. -
భళిరా భళి- మార్కెట్ల కొత్త రికార్డ్స్
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ తాజాగా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ఏడాది జనవరి 20న సాధించిన లైఫ్ టైమ్ హైలను రెండు ఇండెక్సులూ తిరిగి ఒకే రోజు అధిగమించడం విశేషం. కోవిడ్-19 ఇచ్చిన షాక్ నుంచి కేవలం 7 నెలల్లోనే దేశీ స్టాక్ మార్కెట్లు సూపర్ ర్యాలీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ తొలుత 673 పాయింట్లు దూసుకెళ్లింది 42,566ను తాకింది. నిఫ్టీ సైతం 173 పాయింట్లు ఎగసి 12,436కు చేరింది. వెరసి సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంతక్రితం ఈ ఏడాది జనవరి 20న సెన్సెక్స్ 42,274 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,430 వద్ద ఇంట్రాడేలో రికార్డ్ గరిష్టాలను నమోదు చేశాయి. ప్రస్తుతం నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 12,420 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 553 పాయింట్లు జంప్ చేసి 42,446 వద్ద కదులుతోంది. కారణలేవిటంటే? డెమక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ ప్రెసిడెంట్ కానుండటం, ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తదితర కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలకు మద్దతిస్తుండటం వంటి అంశాలు ప్రధానంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధాని మోడీతో బైడెన్ కు సత్సంబంధాలుండటం, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్ లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం సైతం ఇందుకు దోహదం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల తొలి ఐదు రోజుల్లోనే ఎఫ్ఐఐలు నగదు విభాగంలో నికరంగా రూ. 8,381 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 0.8-1.7 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, యాక్సిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్యూఎల్, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.5-1.5 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ లో కేవలం కోల్ ఇండియా అదికూడా 0.25 శాతం నీరసించింది. బంధన్ జూమ్ డెరివేటివ్స్లో బంధన్ బ్యాంక్, డీఎల్ఎఫ్, ఇండిగో, మైండ్ ట్రీ, మదర్ సన్, కోఫోర్జ్, మారికో, బీఈఎల్, గోద్రెజ్ సీపీ, ఎంఅండ్ఎం సీపీ 3.5-1.5 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. గ్లెన్ మార్క్ 5 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో అశోక్ లేలాండ్, సెయిల్, మణప్పురం, శ్రీరాం ట్రాన్స్, బాష్, టొరంట్ పవర్, హావెల్స్, పీవీఆర్ 1.5-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,296 లాభపడగా.. 491 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. -
మార్కెట్లలో ముందుగానే దీపావళి
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్.. లాభాలతో బేర్ ఆపరేటర్లపై కాలు దువ్వుతోంది. దీంతో వరుసగా ఐదో రోజు మార్కెట్లు పరుగు తీశాయి. సెన్సెక్స్ 553 పాయింట్లు జంప్ చేసి 41,893 వద్ద నిలిచింది. తద్వారా 42,000 పాయింట్ల మైలురాయికి చేరువలో ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు జమ చేసుకుని 12,264 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు 9 నెలల గరిష్టాలకు చేరాయి. ఈ ఏడాది జనవరి 24న మాత్రమే మార్కెట్లు ఈ స్థాయిలో కదిలాయి. ఫలితంగా జనవరిలోనే నమోదైన చరిత్రాత్మక గరిష్టాలకు మార్కెట్లు కేవలం 2 శాతం దూరంలో నిలవడం విశేషం. ఐదు రోజుల్లోనే సెన్సెక్స్ 2,300 పాయింట్లు పురోగమించడం విశేషం. ఇంట్రాడేలో సెన్సెక్స్ 41,955 వద్ద, నిఫ్టీ 12,280 వద్ద గరిష్టాలను తాకాయి. కారణాలున్నాయ్ మార్కెట్ల జోరుకు పలు కారణాలున్నట్లు స్టాక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా అమెరికాసహా ప్రపంచ మార్కెట్లు ర్యాలీ చేయడం, తాజాగా ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీలకు మొగ్గు చూపడం, స్టిములస్ కు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 190 బిలియన్ డాలర్లను పెంచడం, ఎఫ్ఐఐలు దేశీయంగా పెట్టుబడులు కుమ్మరించడం వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్ నిస్తున్నట్లు తెలియజేశారు. దేశీ స్టాక్స్ లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా 8,530 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అక్టోబర్లోనూ రూ. 14,537 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఫార్మా వీక్ ఎన్ఎస్ఈలో ప్రైవేట్ బ్యాంక్స్ 2.2 శాతం జంప్ చేయగా.. రియల్టీ, ప్రభుత్వ బ్యాంక్స్, ఐటీ, మెటల్ 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఫార్మా 0.7 శాతం వెనకడుగు వేసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్ఐఎల్, బజాజ్ ఫిన్, ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ ద్వయం, కొటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా 3.6-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్ లో మారుతీ, గెయిల్, ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్, నెస్లే, బీపీసీఎల్, సన్ ఫార్మా 3-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎఫ్అండ్ వో.. డెరివేటివ్స్ లో ఐబీ హౌసింగ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మదర్ సన్, అపోలో టైర్, ఆర్ఐఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్, బంధన్ బ్యాంక్, ముత్తూట్, పేజ్ 5.2- 2.5 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే కంకార్, అంబుజా, బాష్, ఏసీసీ, కేడిలా, లుపిన్, ఎల్ఐసీ హౌసింగ్, టొరంట్ ఫార్మా, భెల్ 7-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,512 లాభపడగా.. 1,112 నష్టాలతో నిలిచాయి. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) 5,368 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,208 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు స్వల్పంగా రూ. 146 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు కేవలం రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
స్టాక్ మార్కెట్లు అదుర్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హైజంప్ చేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 528 పాయింట్లు జంప్చేసి 41,144కు చేరగా.. నిఫ్టీ 155 పాయింట్లు పెరిగి 12,063 వద్ద ట్రేడవుతోంది. వెరసి అటు సెన్సెక్స్ 41,000 పాయింట్ల మైలురాయినీ, ఇటు నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్ నూ సులభంగా అధిగమించాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న ట్రంప్, జో బైడెన్ లకు సమాన అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో బుధవారం అమెరికా, యూరోపియన్ స్టాక్ మార్కెట్లు 1.5-4 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ట్రెండ్ కనిపిస్తోంది. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ ఎంసీజీ, మెటల్ 2-1 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎస్బీఐ, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, యూపీఎల్, ఇన్ఫోసిస్, హిందాల్కో, టీసీఎస్, టాటా స్టీల్, విప్రో 5.6-1.4 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ లో కేవలం హీరో మోటో, సన్ ఫార్మా, సిప్లా 1.2-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. హెచ్పీసీఎల్ జూమ్ డెరివేటివ్స్లో హెచ్పీసీఎల్, మెక్డోవెల్, పీవీఆర్, కెనరా బ్యాంక్, జూబిలెంట్ ఫుడ్, గోద్రెజ్ సీపీ, శ్రీరామ్ ట్రాన్స్, మైండ్ ట్రీ, అంబుజా 7-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క గోద్రెజ్ ప్రాపర్టీస్, లుపిన్, అదానీ ఎంటర్, పెట్రోనెట్, అపోలో టైర్, టీవీఎస్ మోటార్ 2-0.4 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1145 లాభపడగా.. 408 నష్టాలతో కదులుతున్నాయి. -
బ్యాంకుల హవా- మార్కెట్ల హైజంప్
వారాంతాన కనిపించిన జోష్ కొనసాగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి లాభాల దౌడు తీశాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో రోజంతా సెన్సెక్స్ 40,000 పాయింట్ల మార్క్ ఎగువనే కదిలింది. చివరికి 449 పాయింట్లు జమ చేసుకుని 40,432 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 111 పాయింట్లు జంప్చేసి 11,873 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,519 వద్ద, నిఫ్టీ 11,898 వద్ద గరిష్టాలను తాకాయి. ఫిబ్రవరికల్లా కోవిడ్-19 నుంచి దేశం బయటపడే వీలున్నట్లు వెలువడిన అంచనాలు, లాభాలతో కదులుతున్న విదేశీ మార్కెట్ల కారణంగా సెంటిమెంటు బలపడినట్లు నిపుణలు పేర్కొన్నారు. ఆటో బోర్లా ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ 3.15 శాతం జంప్చేయగా.. మెటల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. ఫార్మా, మీడియా, ఆటో, ఐటీ 1.7- 0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, నెస్లే, గెయిల్, యాక్సిస్, ఎస్బీఐ, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్, హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, ఐటీసీ, హిందాల్కో, హెచ్యూఎల్ 5.2-1.6 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే దివీస్, ఐషర్, హీరో మోటో, సిప్లా, బజాజ్ ఆటో, టీసీఎస్, ఎంఅండ్ఎం, ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, మారుతీ, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 3.6-0.5 శాతం మధ్య క్షీణించాయి. ఫార్మా వీక్ ఎఫ్అండ్వో కౌంటర్లలో బీవోబీ, ఫెడరల్ బ్యాంక్, భెల్, జిందాల్ స్టీల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, హెచ్పీసీఎల్, పిడిలైట్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఎంఆర్ఎఫ్, అదానీ ఎంటర్, ఐడీఎఫ్సీ ఫస్ట్, బంధన్ బ్యాంక్, కాల్గేట్ 8.2-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు నౌకరీ, జూబిలెంట్ ఫుడ్, గ్లెన్మార్క్, లుపిన్, టొరంట్ ఫార్మా, బయ్కాన్, వొల్టాస్, సన్ టీవీ 3.3-2.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,489 లాభపడగా.. 1,172 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 480 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) సైతం రూ. 430 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వెరసి గత వారం ఎఫ్పీఐలు నికరంగా 1,186 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 5,217 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. -
12,000 సమీపంలో నిలిచిన నిఫ్టీ
వరుసగా ఏడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సెన్సెక్స్ 327 పాయింట్లు జంప్చేసి 40,509 వద్ద నిలవగా.. నిఫ్టీ 80 పాయింట్లు ఎగసి 11,914 వద్ద ముగిసింది. తద్వారా 12,000 పాయింట్ల మైలురాయికి సమీపంలో స్థిరపడింది. ఆర్బీఐ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో బ్యాంకింగ్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లు పాలసీ ప్రకటన తదుపరి మరింత బలపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,585 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,067 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ 11,939- 11,805 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కోవిడ్-19 కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కే సంకేతాలు కనిపిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. క్యూ4 నుంచీ జీడీపీ రికవరీ బాట పట్టనున్నట్లు అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా అవసరమైతే మరిన్నివిధాన చర్యలకు సిద్ధమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఐటీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్యూ, ప్రయివేట్ బ్యాంక్స్ 3 శాతం స్థాయిలో జంప్చేయగా.. ఐటీ 0.7 శాతం పుంజుకుంది. అయితే ఫార్మా, రియల్టీ, మీడియా, ఎఫ్ఎంసీజీ, మెటల్ 1.6-0.5 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, గెయిల్, శ్రీ సిమెంట్, ఓఎన్జీసీ, హీరో మోటో, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, ఇండస్ఇండ్ 4.4-1 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో గ్రాసిమ్, హిందాల్కో, యూపీఎల్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, నెస్లే, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, దివీస్, అల్ట్రాటెక్ 2.5-1 శాతం మధ్య డీలాపడ్డాయి. ఫైనాన్స్ జోరు డెరివేటివ్స్లో ఎల్ఐసీ హౌసింగ్, ఐబీ హౌసింగ్, పీఎన్బీ, బీవోబీ, మైండ్ట్రీ, ఆర్బీఎల్ బ్యాంక్, యూబీఎల్, హావెల్స్, కెనరా బ్యాంక్, హెచ్పీసీఎల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఇండిగో, వేదాంతా, బంధన్ బ్యాంక్ 7-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. బయోకాన్, జీ, కమిన్స్, టాటా కన్జూమర్, ఇన్ఫ్రాటెల్, బాలకృష్ణ, ఐజీఎల్, టొరంట్ ఫార్మా, ఎంఆర్ఎఫ్ 3.8-2.3 శాతం మధ్య నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం స్థాయిలో నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,230 లాభపడగా.. 1454 నష్టపోయాయి. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 978 కోట్లకుపైగా ఇన్వెస్ట్చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) స్వల్పంగా రూ. 20 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 1,094 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,129 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
7 నెలల గరిష్టం- సెన్సెక్స్@ 40,180
దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల పట్టు బిగించిన బుల్ ఆపరేటర్లు మరోసారి తమ హవా చూపారు. దీంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ ఒక్కసారిగా 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఫలితంగా మార్కెట్లు 7 నెలల గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు జంప్చేసి 40,183 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు జమ చేసుకుని 11,835 వద్ద నిలిచింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా ఆరో రోజు మార్కెట్లు హైజంప్ చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,469 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,062 వద్ద కనిష్టం నమోదైంది. నిఫ్టీ 11,906-11,791 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. ప్రపంచ మార్కెట్ల జోరు, ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫార్మా అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ 3.25 శాతం, ఫార్మా 2.5 శాతం చొప్పున జంప్చేయగా.. బ్యాంకింగ్ 1 శాతం రియల్టీ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. మీడియా 0.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, సిప్లా, టీసీఎస్, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హీరో మోటో, ఐసీఐసీఐ, హెచ్యూఎల్ 7.3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే గెయిల్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఐషర్, ఎల్అండ్టీ, కోల్ ఇండియా, పవర్గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, ఆర్ఐఎల్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్, ఇండస్ఇండ్, కొటక్ బ్యాంక్ 3-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐటీ జోరు డెరివేటివ్ కౌంటర్లలో మైండ్ట్రీ, కేడిలా, ఐడియా, బయోకాన్, అపోలో హాస్పిటల్స్, కోఫోర్జ్, మదర్సన్, ఇన్ఫ్రాటెల్, బీవోబీ, భెల్, ఏసీసీ, ఎస్ఆర్ఎఫ్, గ్లెన్మార్క్ 7.3-2.3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. వేదాంతా, అదానీ ఎంటర్, టాటా కన్జూమర్, బాష్, ముత్తూట్, ఆర్బీఎల్ బ్యాంక్, మెక్డోవెల్, టాటా పవర్, టీవీఎస్ మోటార్, పేజ్, చోళమండలం, ఐబీ హౌసింగ్ 4.2-1.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్స్ 0.3 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.25 శాతం డీలా పడింది. ట్రేడైన షేర్లలో 1,246 షేర్లు లాభపడగా.. 1,436 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,094 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,129 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 1,102 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 935 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే. -
టీసీఎస్- విప్రో.. రికార్డ్స్- సెన్సెక్స్ జూమ్
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 501 పాయింట్లు దూసుకెళ్లి 40,380కు చేరగా.. నిఫ్టీ 137 పాయింట్లు జమ చేసుకుని 11,876 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోవైపు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించిన వార్తలతో ఐటీ సేవల బ్లూచిప్ కంపెనీ విప్రో లిమిటెడ్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టీసీఎస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలు సాధించింది. త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 4.8 శాతం పెరిగి రూ. 7,475 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికితోడు ఈక్విటీ షేర్ల బైబ్యాక్నకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 3,000 ధర మించకుండా 1.42 శాతం ఈక్విటీని బైబ్యాక్ చేయనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. 5.33 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఇందుకు రూ. 16,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 5.2 శాతం జంప్చేసి రూ. 2,878కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 4.7 శాతం ఎగసి రూ. 2,866 వద్ద ట్రేడవుతోంది. విప్రో లిమిటెడ్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించినట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఈ నెల 13న సమావేశంకానున్న బోర్డు ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది క్యూ2 ఫలితాలు సైతం అదేరోజు విడుదల చేసే వీలున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే ఐటీ బ్లూచిప్ కంపెనీ టీసీఎస్, మధ్యస్థాయి ఐటీ కంపెనీ మజెస్కో లిమిటెడ్ ఈక్విటీ బైబ్యాక్ను ప్రకటించిన విషయం విదితమే. ఈ బాటలో విప్రో మూడో కంపెనీగా నిలవనున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం జంప్చేసి రూ. 354కు చేరింది. తద్వారా రెండు దశాబ్దాల గరిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2000 ఫిబ్రవరి 22న రూ. 368 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది! -
ఐటీ అదుర్స్- సెన్సెక్స్@ 40,000
దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్ హవా చూపుతోంది. వరుసగా ఐదో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు హైజంప్ చేశాయి. వెరసి సెన్సెక్స్ 40,000 పాయింట్ల మైలురాయిని సులభంగా అధిగమించింది. ప్రస్తుతం 434 పాయింట్లు పెరిగి 10,313ను తాకింది. నిఫ్టీ 127 పాయింట్లు ఎగసి 11,866 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీపై తిరిగి అంచనాలు పెరగడంతో బుధవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో బలపడ్డాయి. దీంతో సెంటిమెంటుకు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆటో అప్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఐటీ 4.25 శాతం జంప్చేయగా.. మెటల్, రియల్టీ, ఆటో 1.6-0.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఫిన్, ఐసీఐసీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, ఎస్బీఐ, మారుతీ, ఇండస్ఇండ్, ఎంఅండ్ఎం, యాక్సిస్ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే గెయిల్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్, టైటన్, కోల్ ఇండియా, టైటన్, ఐటీసీ, ఐవోసీ 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐటీ జోరు డెరివేటివ్ కౌంటర్లలో మైండ్ట్రీ, కోఫోర్జ్, బంధన్ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్, జిందాల్ స్టీల్, గోద్రెజ్ సీపీ, ఎంఅండ్ఎం ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్, ఐబీ హౌసింగ్, ఎన్ఎండీసీ, ఎల్అండ్టీ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, ఐడియా 5.3-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. అదానీ ఎంటర్, అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ ప్రు, టాటా పవర్, ఎంజీఎల్, ఏసీసీ, పేజ్ 1.6-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,111 షేర్లు లాభపడగా.. 593 నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
ర్యాలీ బాటలోనే- సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ
తొలుత అటూఇటుగా ప్రారంభమైనప్పటికీ వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దుమ్ము రేపాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు ఎగసి 39,879 వద్ద నిలవగా.. 76 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 11,739 వద్ద ముగిసింది. ముందురోజు యూఎస్ మార్కెట్లు పతనంకావడంతో తొలుత మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,968- 39,451 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. నిఫ్టీ సైతం 11,763- 11,629 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టైటన్ ప్లస్లో ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్ 1.4-0.6 శాతం మధ్య బలపడగా.. మీడియా 2.5 శాతం క్షీణించింది. రియల్టీ, మెటల్, పీఎస్యూ బ్యాంక్స్, ఫార్మా సైతం 2-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్, బజాజ్ ఆటో, హీరో మోటో, మారుతీ, ఆర్ఐఎల్, ఓఎన్జీసీ, శ్రీ సిమెంట్, ఐషర్, విప్రో, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, నెస్లే, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ, బ్రిటానియా, యాక్సిస్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ 4.5-0.6 శాతం మధ్య ఎగశాయి. అయితే బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, హిందాల్కో, టాటా మోటార్స్, పవర్గ్రిడ్, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, గెయిల్, బజాజ్ ఫిన్, అదానీ పోర్ట్స్ 4-1 శాతం మధ్య వెనకడగు వేశాయి. అంబుజా అప్ డెరివేటివ్ కౌంటర్లలో అంబుజా సిమెంట్, పేజ్, బంధన్ బ్యాంక్, ఏసీసీ, అపోలో హాస్పిటల్స్, టాటా పవర్, టీవీఎస్ మోటార్, రామ్కో సిమెంట్ 4.5-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క వేదాంతా 11 శాతం కుప్పకూలింది. ఇతర కౌంటర్లలో జీ, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఎంజీఎల్, శ్రీరామ్ ట్రాన్స్, భెల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, డీఎల్ఎఫ్, పిరమల్, చోళమండలం, సెయిల్, ఐడియా 4.6-2.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం స్థాయిలో నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,594 నష్టపోగా.. 1,079 లాభపడ్డాయి. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,102 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 935 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 237 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 472 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
నేడు ఓపెనింగ్ ఓకే- తదుపరి?!
నేడు(7న) దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 21 పాయింట్లు పుంజుకుని 11,693 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 11,672 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. స్టిములస్పై చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో క్షీణించాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. వరుసగా మూడు రోజులపాటు ర్యాలీ చేసిన నేపథ్యంలో దేశీయంగా నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆటుపోట్లు కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. కొనుగోళ్ల వేవ్ వరుసగా మూడో రోజు మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ దౌడు తీశాయి. సెన్సెక్స్ 601 పాయింట్లు దూసుకెళ్లి 39,575 వద్ద ముగిసింది. నిఫ్టీ 159 పాయింట్లు జమ చేసుకుని 11,662 వద్ద స్థిరపడింది. తద్వారా ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలోనే మార్కెట్లు నిలిచాయి. 39,624 వద్ద సెన్సెక్స్, 11,680 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాలకు చేరాయి. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,591 పాయింట్ల వద్ద, తదుపరి 11,520 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,707 పాయింట్ల వద్ద, ఆపై 11,752 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,619 పాయింట్ల వద్ద, తదుపరి 22,384 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,991 పాయింట్ల వద్ద, తదుపరి 23,129 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,102 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 935 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 237 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 472 కోట్ల అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
400 పాయింట్లు అప్-39,000కు సెన్సెక్స్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్చేయగా.. నిఫ్టీ లాభాల సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 431 పాయింట్లు జంప్చేసి 39,128ను తాకగా.. నిఫ్టీ 118 పాయింట్లు ఎగసి 11,535 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన యూఎస్ మార్కెట్లు డీలాపడగా.. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఐటీ, బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో ఫార్మా 0.6 శాతం క్షీణించగా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్ 2 శాతం చొప్పున పుంజుకోగా.. పీఎస్యూ బ్యాంక్స్ 1 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, టాటా స్టీల్, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్ 5-1.3 శాతం మధ్య ఎగశాయి. కేవలం ఎంఅండ్ఎం, హెచ్యూఎల్, బీపీసీఎల్ అదికూడా 0.2 శాతం చొప్పున నీరసించాయి. బంధన్ బ్యాంక్ అప్ డెరివేటివ్ కౌంటర్లలో బంధన్ బ్యాంక్, సెయిల్, ఆర్బీఎల్ బ్యాంక్, జిందాల్ స్టీల్, భారత్ ఫోర్జ్, పీవీఆర్, పిరమల్, కోఫోర్జ్ 4-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. టొరంట్ ఫార్మా, ఐజీఎల్, జీ, లుపిన్, గ్లెన్మార్క్, అమరరాజా, సన్ టీవీ, ఎస్కార్ట్స్ 1.5-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,200 లాభపడగా.. 490 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. -
మార్కెట్ల హైజంప్- ప్రైవేట్ బ్యాంక్స్ హవా
రెండు రోజుల కన్సాలిడేషన్ నుంచి బయటపడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. సెన్సెక్స్ 629 పాయింట్లు దూసుకెళ్లి 38,697 వద్ద నిలవగా.. నిఫ్టీ 170 పాయింట్లు జమ చేసుకుని 11,417 వద్ద ముగిసింది. సానుకూల ప్రపంచ సంకేతాలకుతోడు జీడీపీకి దన్నుగా నిలుస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన భరోసా నేపథ్యంలో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడ్డారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,739వరకూ జంప్చేయగా.. నిఫ్టీ 11,429 వరకూ ఎగసింది. ఇండస్ఇండ్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ప్రయివేట్ బ్యాంక్స్ 4.2 శాతం, మీడియా 2.8 శాతం చొప్పున పురోగమించాయి. ఈ బాటలో రియల్టీ, పీఎస్యూ బ్యాంక్స్, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ 1.8-0.6 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్ 12.5 శాతం దూసుకెళ్లగా.. యాక్సిస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్, కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, శ్రీ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, సన్ ఫార్మా 5-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. కేవలం డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఎన్టీపీసీ, టైటన్, హిందాల్కో అదికూడా 1.3-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. పీవీఆర్ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో పీవీఆర్, శ్రీరామ్ ట్రాన్స్, మణప్పురం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, అదానీ ఎంటర్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎంజీఎల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఐజీఎల్, జీఎంఆర్, అరబిందో, పిరమల్, ఆర్ఈసీ, చోళమండలం 8-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, హెచ్పీసీఎల్, ఎస్కార్ట్స్, కంకార్, అపోలో హాస్పిటల్స్, పీఎన్బీ, హావెల్స్, టొరంట్ పవర్, అమరరాజా, ఎక్సైడ్, నౌకరీ, రామ్కో సిమెంట్ 3.7-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,547 లాభపడగా.. 1,124 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 712 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 409 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 1,457 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 577 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
నేడు ఓపెనింగ్లో మార్కెట్ల హైజంప్?!
నేడు(1న) దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 117 పాయింట్లు జంప్చేసి 11,361 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్ 11,244 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా మళ్లీ భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించేందుకు అమెరికన్ కాంగ్రెస్ చర్చిస్తున్న నేపథ్యంలో బుధవారం యూఎస్ మార్కెట్లు 1.2-0.7 శాతం మధ్య ఎగశాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. ఈ అంశాల నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కన్సాలిడేషన్.. వరుసగా రెండో రోజు బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్ 95 పాయింట్లు బలపడి 38,068 వద్ద నిలిచింది. వెరసి 38,000 పాయింట్ల కీలక మార్క్ను అధిగమించింది. ఇక నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,247 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,236 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,828 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదే విధంగా నిఫ్టీ సైతం 11,295- 11,185 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,190 పాయింట్ల వద్ద, తదుపరి 11,132 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,300 పాయింట్ల వద్ద, ఆపై 11,353 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,204 పాయింట్ల వద్ద, తదుపరి 20,957 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,625 పాయింట్ల వద్ద, తదుపరి 21,797 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 712 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 409 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 1,457 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 577 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
మూడో రోజూ సెన్సెక్స్ డబుల్ సెంచరీ
వరుసగా మూడో రోజూ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 233 పాయింట్లు జంప్చేసి 38,215ను తాకగా.. నిఫ్టీ 68 పాయింట్లు ఎగసి 11,295 వద్ద ట్రేడవుతోంది. ఆరు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ శుక్రవారం దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇన్వెస్టర్లు మరోసారి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో సెన్సెక్స్ 38,234 వరకూ ఎగసింది. ఈ బాటలో నిఫ్టీ 11,304 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఆటో జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా, రియల్టీ 1.3-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో, టీసీఎస్, ఎస్బీఐ లైఫ్, హిందాల్కో, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఐషర్, టాటా స్టీల్, మారుతీ 3.4-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇండస్ఇండ్, పవర్గ్రిడ్, ఎయిర్టెల్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ, ఐటీసీ, గెయిల్, బజాజ్ ఫైనాన్స్ 1.5-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. డెరివేటివ్లో.. డెరివేటివ్ కౌంటర్లలో అదానీ ఎంటర్, టాటా కెమికల్స్, ఎస్ఆర్ఎఫ్, నౌకరీ, అంబుజా సిమెంట్, బాటా ఇండియా, గోద్రెజ్ సీపీ 3.5-2.3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు ఐడియా, ఐబీ హౌసింగ్, పీవీఆర్, పీఎన్బీ, కెనరా బ్యాంక్, జీ 2.4-1.3 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,035 లాభపడగా.. కేవలం 527 నష్టాలతో కదులుతున్నాయి. -
బుల్ స్పీడ్- 2 రోజుల్లో 1,428 పాయింట్లు ప్లస్
బుల్ ట్రేడర్లు కొనుగోళ్ల కొమ్ము విసరడంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. వెరసి ఒక దశలో ప్రామాణిక ఇండెక్స్ 600 పాయింట్లకుపైగా దూసుకెళ్లింది. 38,000 పాయింట్ల మార్క్ను సైతం సులభంగా దాటేసింది. చివరికి సెన్సెక్స్ 593 పాయింట్లు జమ చేసుకుని 37,982 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 177 పాయింట్లు జంప్చేసి 11,227 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,036 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,544 పాయింట్ల వద్ద కనిష్టం నమోదైంది. ఇదేవిధంగా నిఫ్టీ 11,239- 11,100 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చూసింది. వారాంతాన సైతం సెన్సెక్స్ 835 పాయింట్లు పెరిగిన సంగతి తెలిసిందే. జోరు ఎందుకంటే? కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఓవైపు అమెరికా కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తుండగా.. మరోవైపు దేశీయంగానూ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు వెలువడిన వార్తలు రెండు రోజుల నుంచీ ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు జోష్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా పీఎస్యూ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ. 20,000 కోట్ల తాజా పెట్టుబడులను సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో వారాంతాన యూఎస్ మార్కెట్లు లాభపడగా.. దేశీయంగానూ మార్కెట్లు బుల్ దౌడు తీస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. బ్యాంకింగ్ స్పీడ్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియల్టీ 5-3 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ సైతం 1.7-0.7 శాతం పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, పవర్గ్రిడ్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, గ్రాసిమ్, ఎంఅండ్ఎం, హిందాల్కో, ఎన్టీపీసీ, గెయిల్, శ్రీ సిమెంట్, మారుతీ, బజాజ్ ఫిన్, ఐషర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ 8-3 శాతం మధ్య జంప్చేశాయి. బ్లూచిప్స్లో కేవలం విప్రో(0.7 శాతం), హెచ్యూఎల్(0.5 శాతం) నీరసించాయి. పీవీఆర్ అప్ డెరివేటివ్ కౌంటర్లలో పీవీఆర్ 11 శాతం దూసుకెళ్లగా, ఎస్కార్ట్స్, అదానీ ఎంటర్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, అపోలో టైర్, బాలకృష్ణ, బంధన్ బ్యాంక్, టీవీఎస్ మోటార్, ఫెడరల్ బ్యాంక్, భెల్, ఆర్బీఎల్ బ్యాంక్, బయోకాన్, జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, బీఈఎల్, నౌకరీ 7.5-5 శాతం మధ్య జంప్చేశాయి. ఈ విభాగంలో కేవలం టొరంట్ ఫార్మా 0.8 శాతం, ఐడియా 0.5 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,927 లాభపడగా.. 757 మాత్రమే నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,080 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,071 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. గురువారం ఎఫ్పీఐలు దాదాపు రూ. 1,886 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు స్వల్పంగా రూ. 189 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
సెన్సెక్స్@ 38000- ఈ చిన్న షేర్లు భళా
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో బుల్ జోరులో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 613 పాయింట్లు జంప్చేసి 38,001 వద్ద ట్రేడవుతోంది. తద్వారా 38,000 పాయింట్ల మార్క్ను అధిగమించింది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం ఊపందుకోగా.. కొన్నిటిలో తగ్గింది. జాబితాలో పీవీఆర్ లిమిటెడ్, మెట్రోపోలిస్ హెల్త్కేర్, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, టిప్స్ ఇండస్ట్రీస్, ఐజీ పెట్రోకెమికల్స్, స్టెర్లింగ్ టూల్స్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. పీవీఆర్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 1,234 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,242 వరకూ లాభపడింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.43 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3.48 లక్షల షేర్లు చేతులు మారాయి. మెట్రోపోలిస్ హెల్త్కేర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం జంప్చేసి రూ. 1,848 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,880 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 16,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1700 షేర్లు మాత్రమే చేతులు మారాయి. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7.3 శాతం ర్యాలీ చేసి రూ. 357 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 372 వరకూ బలపడింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7,000 షేర్లు చేతులు మారాయి. టిప్స్ ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 295 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 11,200 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 20,400 షేర్లు చేతులు మారాయి. ఐజీ పెట్రోకెమికల్స్ బీఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 317 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 11,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 28,500 షేర్లు చేతులు మారాయి. స్టెర్లింగ్ టూల్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం ఎగసి రూ. 180 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 189 వరకూ లాభపడింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2,700 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో కేవలం 350 షేర్లు చేతులు మారాయి. -
టైర్ల తయారీ కంపెనీల షేర్లు జూమ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ జోరులో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 560 పాయింట్లు జంప్చేసి 37,948 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 171 పాయింట్లు ఎగసి 11,221 వద్ద కదులుతోంది. ఈ నేపథ్యంలో టైర్ల తయారీ కంపెనీ కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో పలు కౌంటర్లు 8-3 శాతం మధ్య ఎగశాయి. ఆఫ్రోడ్ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఇతర వివరాలు ఇలా.. కారణాలున్నాయ్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు 7.6 శాతం జంప్చేసి రూ. 1,459 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 9 శాతంపైగా దూసుకెళ్లి రూ. 1,484కు చేరువైంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. బాలకృష్ణ ఇండస్ట్రీస్ వ్యవసాయం, నిర్మాణ రంగం, మైనింగ్, అటవీ పరిరక్షణ తదితర రంగాలలో వినియోగించే వాహనాలకు టైర్లను తయారు చేసే విషయం విదితమే. వెరసి ఆర్థిక రికవరీ నేపథ్యంలో కంపెనీ టైర్లకు డిమాండ్ పెరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న పండుగల సీజన్ నుంచీ వాహనాలకు తిరిగి డిమాండ్ పుట్టవచ్చన్న ఆశలతో టైర్ల తయారీ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లు తాజాగా దృష్టి సారించినట్లు నిపుణులు చెబుతున్నారు. జోరు తీరిలా ఎన్ఎస్ఈలో టైర్ల తయారీ కంపెనీల కౌంటర్లలో ప్రస్తుతం అపోలో టైర్స్ 6.3 శాతం పెరిగి రూ. 128 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో సియట్ లిమిటెడ్ 4.2 శాతం లాభపడి రూ. 943 వద్ద కదులుతోంది. తొలుత రూ. 952 వరకూ ఎగసింది. ఇతర కౌంటర్లలో జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ 4.2 శాతం బలపడి రూ. 60 వద్ద, ఎంఆర్ఎఫ్ 3 శాతం పుంజుకుని రూ. 59,096 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో ఎంఆర్ఎఫ్ రూ. 59,250 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక బీఎస్ఈలో గుడ్ఇయర్ ఇండియా షేరు సైతం దాదాపు 4 శాతం పురోగమించి రూ. 875 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 880 వరకూ పెరిగింది. -
మార్కెట్ల పోల్వాల్ట్- 835 పాయింట్లు అప్
ఆరు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు అనూహ్య బౌన్స్బ్యాక్ను సాధించాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీతోనూ, నిఫ్టీ సెంచరీతోనూ ప్రారంభమయ్యాయి. ట్రేడర్లు షార్ట్ కవరింగ్కు దిగడంతో ఆపై మరింత ఊపందుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 835 పాయింట్లు దూసుకెళ్లి 37,389 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 245 పాయింట్లు జంప్చేసి 11,050 వద్ద స్థిరపడింది. వెరసి ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలోనే మార్కెట్లు ముగిశాయి. ఆటో, ఐటీ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 3.5-2 శాతం మధ్య బలపడ్డాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ 3.5-2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫిన్, హెచ్సీఎల్ టెక్, సిప్లా, ఎయిర్టెల్, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఐషర్, టీసీఎస్, ఐసీఐసీఐ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, మారుతీ 6.7-3 శాతం మధ్య జంప్చేశాయి. బ్లూచిప్స్లో ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, యూపీఎల్ మాత్రమే అదికూడా 1-0.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఎఫ్అండ్వోలో డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, ఐడియా, జీఎంఆర్, కోఫోర్జ్, ఐడీఎఫ్సీ ఫస్ట్, మణప్పురం, ముత్తూట్, జిందాల్ స్టీల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, గ్లెన్మార్క్, ఎక్సైడ్, మదర్సన్, నాల్కో, టాటా పవర్, ఐబీ హౌసింగ్, బయోకాన్, ఎన్ఎండీసీ, కెనరా బ్యాంక్, బీవోబీ, శ్రీరామ్ ట్రాన్స్ 13.5- 4.7 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. ఈ విభాగంలో హావెల్స్, సీమెన్స్ మాత్రమే అదికూడా 1-0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 3-2.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,984 లాభపడగా.. కేవలం 664 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 1,886 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) స్వల్పంగా రూ. 189 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 3,912 కోట్లకు మించి అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 1,629 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
ఈ చిన్న షేర్ల స్పీడ్ చూడతరమా!
వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా బౌన్స్ అయ్యాయి. ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతంసెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు దూసుకెళ్లి 37,350కు చేరింది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. అయితే కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం పుంజుకోగా.. మరికొన్నిటిలో నీరసించింది. జాబితాలో ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, వినతీ ఆర్గానిక్స్, గర్వారే టెక్నికల్ ఫైబర్స్, మజ్దా లిమిటెడ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. ఐఎఫ్బీ ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 617 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 634 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 18,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7,000 షేర్లు మాత్రమే చేతులు మారాయి. గర్వారే టెక్నికల్ ఫైబర్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం జంప్చేసి రూ. 2,001 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,030 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4,200 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1,500 షేర్లు మాత్రమే చేతులు మారాయి. వినతీ ఆర్గానిక్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9.3 శాతం ర్యాలీ చేసి రూ. 1270 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,285 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 20,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 18,000 షేర్లు చేతులు మారాయి. మజ్దా లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం లాభపడి రూ. 506 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 535 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1600 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,000 షేర్లు చేతులు మారాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం ఎగసి రూ. 364 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 386 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 25.41 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 12.11 లక్షల షేర్లు మాత్రమే చేతులు మారాయి. -
అమ్మకాల సునామీ -కుప్పకూలిన సెన్సెక్స్
ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీ స్టాక్ మార్కెట్లకు సైతం షాక్ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో సెన్సెక్స్ 1,115 పాయింట్లు పడిపోయింది. ఫలితంగా 37,000 పాయింట్ల మార్క్ను సైతం కోల్పోయి 36,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 326 పాయింట్లు పతనమై 10,806 వద్ద నిలిచింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల స్థాయికి నీళ్లొదులుకుంది. వెరసి మార్కెట్లు ఇంట్రాడే కనిష్టాల సమీపంలో ముగియడం గమనార్హం! ఏం జరిగిందంటే? కోవిడ్-19 కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతున్నదని, దీంతో ప్రభుత్వం మరింత అధికంగా ఆర్థిక మద్దతును అందించవలసి ఉన్నదని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తాజాగా స్పష్టం చేశారు. అయితే వైట్హౌస్ ప్రభుత్వం ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీపై కాంగ్రెస్లో డెమక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలింది. మరోపక్క సెకండ్ వేవ్లో భాగంగా కోవిడ్-19 చెలరేగుతుండటంతో పలు యూరోపియన్ దేశాలు తాజాగా లాక్డవున్లకు తెరతీశాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత మాంద్యంలోకి నెట్టివేయవచ్చన్న అంచనాలు పెరిగాయి. ఇటీవల పాలసీ సమీక్షను చేపట్టిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలో కొనసాగించేందుకు కట్టుబడుతున్నట్లు ప్రకటించినప్పటికీ మరో ప్యాకేజీపై ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం! ఇలాంటి పలు ప్రతికూల అంశాలతోపాటు.. కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్న యూఎస్ టెక్నాలజీ కౌంటర్లలో ఇటీవల భారీ అమ్మకాలు నమోదవుతుండటం.. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలకు దారితీసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా చైనాతో సైనిక వివాదాలు సైతం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. అన్నిటా నష్టాలే ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ నష్టపోగా.. మెటల్, మీడియా, ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, రియల్టీ 4-3 శాతం మధ్య క్షీణించాయంటే అమ్మకాల తీవ్రతనుఅర్ధం చేసుకోవచ్చు. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫ్రాటెల్(3 శాతం), జీ(1 శాతం), హెచ్యూఎల్(0.25 శాతం) మాత్రమే లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్లో ఇండస్ఇండ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, టీసీఎస్, యూపీఎల్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, ఐవోసీ, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్, ఎస్బీఐ, కోల్ ఇండియా, సిప్లా, యాక్సిస్ 7.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో ఐబీ హౌసింగ్, అశోక్ లేలాండ్, ఇండిగో, శ్రీరామ్ ట్రాన్స్, జిందాల్ స్టీల్, కెనరా బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్, ఆర్బీఎల్, టాటా పవర్, ఎన్ఎండీసీ, ఫెడరల్ బ్యాంక్, అంబుజా, సెయిల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, నాల్కో, మదర్సన్, భెల్ 9-5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. అపోలో హాస్పిటల్స్ 7.3 శాతం జంప్చేయగా.. గోద్రెజ్ సీపీ, కాల్గేట్, వేదాంతా, మారికో, చోళమండలం మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 3-0.5 శాతం మధ్య బలపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2.2 శాతం స్థాయిలో నీరసించాయి. ట్రేడైన షేర్లలో 2,026 నష్టపోగా.. 624 మాత్రమే లాభాలతో నిలిచాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 3,912 కోట్లకు మించి అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,629 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 2,073 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 879 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 540 కోట్లు, డీఐఐలు రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
500 పాయింట్లు డౌన్- అన్ని రంగాలూ వీక్
ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీ స్టాక్ మార్కెట్లకు సైతం షాక్ తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 500 పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ సైతం 150 పాయింట్లు కోల్పోయింది. కోవిడ్-19 కట్టడికాకపోవడం, ఆర్థిక వ్యవస్థల రికవరీపై సందేహాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 540 పాయింట్లు కోల్పోయి 37,128కు చేరగా.. నిఫ్టీ 165 పాయింట్లు దిగజారి 10,967 వద్ద ట్రేడవుతోంది. నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ మంగళవారం యూఎస్ మార్కెట్లు లాభపడినప్పటికీ తిరిగి బుధవారం పతనంకావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నష్టాలలో ఎన్ఎస్ఈలో అన్ని ప్రధాన రంగాలూ 1-3 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫ్రాటెల్(1.8 శాతం), ఎన్టీపీసీ(0.25 శాతం) మాత్రమే లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్లో హిందాల్కో, హెచ్సీఎల్ టెక్, యూపీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎస్బీఐ, యాక్సిస్, సిప్లా, ఐవోసీ, ఎయిర్టెల్, మారుతీ, జీ 4-2 శాతం మధ్య డీలా పడ్డాయి. ఎఫ్అండ్వో లో డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, ఇండిగో, శ్రీరామ్ ట్రాన్స్, సన్ టీవీ, సెయిల్, ఐడియా, మదర్సన్, ఐజీఎల్, బాష్, డీఎల్ఎఫ్, కెనరా బ్యాంక్, నాల్కో, గ్లెన్మార్క్, అపోలో టైర్, భారత్ ఫోర్జ్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. వేదాంతా, టాటా కెమికల్స్, అపోలో హాస్పిటల్స్, నౌకరీ మాత్రమే అదికూడా 1.2-0.25 శాతం మధ్య బలపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.6 శాతం మధ్య నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,387 నష్టపోగా.. 263 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. -
మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, మన మార్కెట్ మాత్రం నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో మొదలై, నష్టాల్లోకి జారిపోయి, భారీ నష్టాల నుంచి ఒకింత రికవరీ అయ్యాయి. ఇంట్రాడేలో 406 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 66 పాయింట్ల నష్టంతో 37,668 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్లు క్షీణించి 11,132 పాయింట్ల వద్దకు చేరింది. స్టాక్ సూచీల నష్టాలు వరుసగా ఐదో రోజూ కొనసాగాయి. మార్చి 2వ తేదీ తర్వాత స్టాక్ సూచీల నష్టాలు ఇన్నేసి రోజులు కొనసాగడం ఇదే మొదటిసారి. యూరప్లో కరోనా కేసులు మరింతగా పెరుగుతుండటం, ఆర్థిక రికవరీపై సంశయాలు కొనసాగుతుండటం ప్రతికూల ప్రభావం చూపాయి. సరిహద్దు స్థావరాల వద్దకు అదనపు బలగాలను పంపించకూడదని, వీలైనంత త్వరలో మళ్లీ చర్చలు జరపాలని భారత్, చైనాలు ఒక అంగీకారానికి రావడం, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి. టెలికం, ఆర్థిక రంగ షేర్లు పతనమయ్యాయి. డాలర్తో రూపాయి మారకం 1 పైసా పెరిగి 73.57 వద్దకు చేరింది. డేటా, స్ట్రీమింగ్ సర్వీసుల సబ్స్క్రిప్షన్లతో కూడిన పోస్ట్పెయిడ్ ప్లాన్లను రిలయన్స్ జియో ప్రకటించిన నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేర్ 8 శాతం నష్టంతో రూ.434 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఇక వొడాఫోన్ ఐడియా షేర్ 10%నష్టంతో రూ.9.22 వద్ద ముగిసింది. దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్టాలకు చేరాయి. హెచ్డీఎఫ్సీ 5000 కోట్ల సమీకరణ: భారత ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) బాండ్ల జారీ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్పై బాండ్లను జారీ చేయనున్నట్లు బుధవారం తెలిపింది. -
భారీ ఆటుపోట్లు- చివరికి స్వల్ప నష్టాలు
వరుస నష్టాలకు చెక్ పెడుతూ తొలుత హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 66 పాయింట్లు క్షీణించి 37,668 వద్ద నిలవగా.. నిఫ్టీ 22 పాయింట్లు తక్కువగా 11,132 వద్ద స్థిరపడింది. అయితే తొలుత సెన్సెక్స్ 400 పాయింట్లు ఎగసి 38,140ను తాకింది. మిడ్సెషన్కల్లా అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాలు పోగొట్టుకోవడంతోపాటు.. 400 పాయింట్లు పతనమైంది. వెరసి 37,313కు చేరింది. ఇదే విధంగా ఇంట్రాడేలో నిఫ్టీ 11,260 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,024 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇటీవల పతన బాటలో సాగిన దేశీ మార్కెట్లలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్కు దిగడంతో తొలుత ఇండెక్సులు ఊపందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ గురువారం ముగియనుండటం ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. అయితే అంతర్గతంగా సెంటిమెంటు బలహీనంగా ఉండటంతో చివర్లో అమ్మకాలదే పైచేయిగా నిలిచినట్లు అభిప్రాయపడ్డారు. ప్రయివేట్ బ్యాంక్స్ ఓకే ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్ 2.4-1.5 శాతం మధ్య క్షీణించగా.. రియల్టీ 0.8 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్ 0.2 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, కోల్ ఇండియా, గెయిల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, నెస్లే, బ్రిటానియా, టైటన్, ఆర్ఐఎల్, మారుతీ, హిందాల్కో, విప్రో, కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐషర్, ఎల్అండ్టీ, యూపీఎల్ 2.5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్ఫ్రాటెల్, ఎయిర్టెల్ 8.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర కౌంటర్లలో టాటా స్టీల్, జీ, ఇండస్ఇండ్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, టీసీఎస్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఎస్బీఐ 3.5-1 శాతం వెనకడుగు వేశాయి. టాటా కెమ్ అప్ డెరివేటివ్ కౌంటర్లలో టాటా కెమ్, పేజ్, టాటా పవర్, ముత్తూట్, జిందాల్ స్టీల్, ఇండిగో, కోఫోర్జ్, బాష్, గ్లెన్మార్క్, బాలకృష్ణ, వేదాంతా, రామ్కో సిమెంట్ 7.3-2.4 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఐడియా, సన్ టీవీ, శ్రీరామ్ ట్రాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, భెల్, మదర్సన్, టాటా కన్జూమర్, టొరంట్ ఫార్మా, లుపిన్, మారికో, అరబిందో, ఐబీ హౌసింగ్, కేడిలా 11-2.4 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం డీలా పడింది. ట్రేడైన షేర్లలో 1,217లాభపడగా.. 1,416 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 2,073 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 879 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 540 కోట్లు, డీఐఐలు రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
38,000 దిగువకు సెన్సెక్స్- ఐటీ, ఫార్మా అప్
తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో రెండో రోజూ దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు క్షీణించి 37,734 వద్ద ముగిసింది. వెరసి 38,000 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11,154 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,210- 37,531 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,302- 11,085 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. గ్లోబల్ బ్యాంకులలో అవకతవకల ఆరోపణలు, కోవిడ్-19 కేసులు పెరగడంతో యూరప్లో తిరిగి లాక్డవున్లు ప్రకటించడం వంటి పలు ప్రతికూల అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదుకున్న ఐటీ ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ఆటో, పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ, మెటల్, రంగాలు 2.6-1.25 శాతం మధ్య క్షీణించగా.. ఐటీ, ఫార్మా 0.7 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ 7 శాతం కుప్పకూలగా.. అదానీ పోర్ట్స్, ఇన్ఫ్రాటెల్, గెయిల్, మారుతీ, ఇండస్ఇండ్, టాటా మోటార్స్, యాక్సిస్, బీపీసీఎల్, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, ఐవోసీ, హెచ్డీఎఫ్సీ, హీరో మోటో, హిందాల్కో, ఐషర్, ఆర్ఐఎల్ 4.7-1.6 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఇతర బ్లూచిప్స్లో హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, అల్ట్రాటెక్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ, సిప్లా, ఎస్బీఐ, ఎయిర్టెల్ 3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. నష్టాలలో.. డెరివేటివ్ కౌంటర్లలో కెనరా బ్యాంక్, మణప్పురం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, జీఎంఆర్, ఇండిగో, భెల్, హెచ్పీసీఎల్, బాష్, ఎంజీఎల్, బీఈఎల్, నాల్కో, బంధన్ బ్యాంక్, గ్లెన్మార్క్, ఐడీఎఫ్సీ ఫస్ట్ 6-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు దివీస్, కోఫోర్జ్, మైండ్ట్రీ, అదానీ ఎంటర్, అరబిందో, సన్ టీవీ 3.4-1.2 శాతం మధ్య ఎగశాయి. .బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.6 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1,874 నష్టపోగా.. 753 మాత్రమే లాభాలతో ముగిశాయి. అమ్మకాలవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 540 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 518 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. వారాంతాన ఎఫ్పీఐలు రూ. 205 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 101 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మళ్లీ నష్టాల బాటలో- చిన్న షేర్లు బేర్
ముందురోజు వాటిల్లిన భారీ నష్టాల నుంచి బయటపడుతూ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు వెనువెంటనే నష్టాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 292 పాయింట్లు క్షీణించి 37,742ను తాకగా.. నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 11,147 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,210- 37,701 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,302- 11,133 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. గ్లోబల్ బ్యాంకులలో అవకతవకల ఆరోపణలు, యూరప్లో తిరిగి కోవిడ్-19 కేసులు పెరగడం వంటి పలు ప్రతికూలతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెబుతున్నారు. ఐటీ ఓకే ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, రియల్టీ, మెటల్, బ్యాంకింగ్, ఆటో 3-1.5 శాతం మధ్య క్షీణించగా.. ఐటీ 0.3 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, జీ, బీపీసీఎల్, గెయిల్, హిందాల్కో, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, బజాజ్ ఫిన్, ఎంఅండ్ఎఎ, మారుతీ 5.4-1.7 శాతం మధ్య నష్టపోయాయి. బ్లూచిప్స్లో కేవలం హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బ్రిటానియా, హెచ్యూఎల్ 1.4-0.8 శాతం మధ్య బలపడ్డాయి. నష్టాలలో.. డెరివేటివ్ కౌంటర్లలో కెనరా బ్యాంక్, జిందాల్ స్టీల్, పిరమల్, ఐడియా, పీవీఆర్, అపోలో టైర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, భెల్, బంధన్ బ్యాంక్, బాష్, మణప్పురం, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 7-4.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ విభాగంలో నిఫ్టీ దిగ్గజాలను మినహాయిస్తే.. లాభపడిన కౌంటర్లు లేకపోగా..బీఎస్ఈలో మిడ్ క్యాప్ 3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,661 నష్టపోగా.. 206 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. -
కుప్పకూలిన మార్కెట్లు- ఐటీ ఎదురీత
తొలుత అటూఇటుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో మిడ్సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 709 పాయింట్లు పతనమై 38,137ను తాకగా.. నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 11,322 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,990- 38,073 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,535- 11,252 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో వరుసగా మూడో రోజు శుక్రవారం యూఎస్ మార్కెట్లు డీలా పడ్డాయి. చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతుండటంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఐటీ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ క్షీణించగా.. ఐటీ 1.6 శాతం ఎగసింది. మెటల్, మీడియా, రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ 3.7-1.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా మోటార్స్, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, గెయిల్, ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్, సిప్లా, నెస్లే, ఐవోసీ, బ్రిటానియా, ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్, అల్ట్రాటెక్, ఎంఅండ్ఎం, జీ, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్7-3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ ద్వయం, విప్రో 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఐబీ హౌసింగ్ పతనం.. డెరివేటివ్ కౌంటర్లలో ఐబీ హౌసింగ్ 13 శాతం కుప్పకూలగా.. జిందాల్ స్టీల్, గ్లెన్మార్క్, పీవీఆర్, బంధన్ బ్యాంక్, ఐడియా, మదర్సన్, పిరమల్, బయోకాన్, బాలకృష్ణ, ఆర్బీఎల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఆర్ఈసీ, టాటా పవర్, పీఎఫ్సీ, సెయిల్, టొరంట్ ఫార్మా, డీఎల్ఎఫ్ 8.5-4.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క మైండ్ట్రీ, అపోలో హాస్పిటల్స్ మాత్రమే అదికూడా 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున డీలా పడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో1969 నష్టపోగా..653 లాభాలతో కదులుతున్నాయి. -
చివర్లో అమ్మకాలు- ఫార్మా ధూమ్ధామ్
తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లను చివరి గంటలో పెరిగిన అమ్మకాలు దెబ్బతీశాయి. వెరసి నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్ 134 పాయింట్లు క్షీణించి 38,846 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ స్వల్పంగా 11 పాయింట్ల వెనకడుగుతో 11,505 వద్ద ముగిసింది. తొలుత ఒక దశలో సెన్సెక్స్ 39,200 వద్ద గరిష్టాన్ని తాకగా.. చివర్లో 38,636 పాయింట్ల దిగువకు సైతం చేరింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 11,584- 11,446 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. అయితే తొలి నుంచీ ఇన్వెస్టర్లు ఫార్మా కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడటంతో బీఎస్ఈలో హెల్త్కేర్ ఇండెక్స్ 20,689 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ఫార్మా జోరు ఎన్ఎస్ఈలో ఫార్మా రంగం 5 శాతం జంప్చేయగా.. రియల్టీ 2 శాతం, ఆటో 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 1.3 శాతం, ఎఫ్ఎంసీజీ 0.6 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ 10 శాతం, సిప్లా 7 శాతం చొప్పున దూసుకెళ్లగా.. అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హిందాల్కో, విప్రో, పవర్గ్రిడ్, హీరో మోటో, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్ 3.7-1.5 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫిన్, కొటక్ బ్యాంక్, మారుతీ, టైటన్, హెచ్యూఎల్, ఎస్బీఐ, ఐవోసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ 2.2-0.75 శాతం మధ్య క్షీణించాయి. డెరివేటివ్స్లోనూ.. డెరివేటివ్ కౌంటర్లలో లుపిన్, దివీస్, కేడిలా, గ్లెన్మార్క్, అపోలో హాస్పిటల్స్, అరబిందో, డీఎల్ఎఫ్, బయోకాన్, సన్ టీవీ 4.5-2.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క టాటా కెమ్, అపోలో టైర్, పెట్రోనెట్, బంధన్ బ్యాంక్, టొరంట్ పవర్, ఐడీఎఫ్సీ ఫస్ట్, పిరమల్, వోల్టాస్, కోఫోర్జ్, అమరరాజా, జూబిలెంట్ ఫుడ్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పీఎన్బీ, జిందాల్ స్టీల్, కమిన్స్ 3.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.25 శాతం పుంజుకోగా, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1308 లాభపడగా.. 1431 నష్టాలతో నిలిచాయి. అమ్మకాలవైపు.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 250 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1068 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్లు ప్లస్- ఈ చిన్న షేర్లు యమస్పీడ్
స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 191 పాయింట్లు ఎగసి 39,235కు చేరింది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్, సొమానీ సిరామిక్స్, టేక్ సొల్యూషన్స్, హిమత్సింగ్కా సీడే, ఆటోమోటివ్ యాక్సిల్స్, స్కిప్పర్ లిమిటెడ్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. ఆటోమోటివ్ యాక్సిల్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 774 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 794 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9,000 షేర్లు చేతులు మారాయి. ఇండోస్టార్ క్యాపిటల్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం జంప్చేసి రూ. 286 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 292 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 9,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 6,000 షేర్లు చేతులు మారాయి. సొమానీ సిరామిక్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం లాభపడి రూ. 183 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 12,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 55,000 షేర్లు చేతులు మారాయి. టేక్ సొల్యూషన్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7.5 శాతం ఎగసింది. రూ. 50 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.83 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.37 లక్షల షేర్లు చేతులు మారాయి. హిమత్సింగ్కా సీడే ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం ర్యాలీ చేసి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.44 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 66,000 షేర్లు మాత్రమే చేతులు మారాయి. స్కిప్పర్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం జంప్చేసి రూ. 52.35 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 16,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 20,000 షేర్లు చేతులు మారాయి. -
సెన్సెక్స్@ 39,000- బ్యాంక్స్ దన్ను
ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడే గరిష్టాల వద్దే నిలవగలిగాయి. దీంతో సెన్సెక్స్ 39,000 పాయింట్ల మైలురాయికి ఎగువన స్థిరపడగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,500ను అధిగమించింది. నేటి ట్రేడింగ్లోనూ యథాప్రకారం ఆటుపోట్లు కనిపించినప్పటికీ చివరికి సెన్సెక్స్ 288 పాయింట్లు బలపడి 39,044 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82 పాయింట్లు ఎగసి 11,522 వద్ద నిలిచింది. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,754 దిగువన కనిష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ ఒక దశలో 11,442 వరకూ నీరసించింది. మీడియా డౌన్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా, ప్రయివేట్ బ్యాంక్స్ 2 శాతం పుంజుకోగా.. ఐటీ 0.6 శాతం లాభపడింది. రియల్టీ, మీడియా 0.7-0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, సిప్లా, యూపీఎల్, యాక్సిస్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, కొటక్ మహీంద్రా, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్ 5-1 శాతం మధ్య ఎగశాయి. అయితే టైటన్, మారుతీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్, ఐటీసీ, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐవోసీ, హెచ్సీఎల్ టెక్ 1.4-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. ఆటో గుడ్ డెరివేటివ్ కౌంటర్లలో మదర్సన్, అశోక్ లేలాండ్, లుపిన్, ఐడీఎఫ్సీ ఫస్ట్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, అరబిందో, నౌకరీ, అంబుజా సిమెంట్, ఐజీఎల్, శ్రీరామ్ ట్రాన్స్, మైండ్ట్రీ, అమరరాజా, కమిన్స్, గోద్రెజ్సీపీ 4-2.4 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క పీవీఆర్, నాల్కో, ఐబీ హౌసింగ్, బీఈఎల్, మారికో, పేజ్, ఎస్కార్ట్స్, అదానీ ఎంటర్, పీఎన్బీ 3.5-01 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.5 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,582 లాభపడగా.. 1,164 నష్టాలతో ముగిశాయి. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 1,176 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డీఐఐలు రూ. 724 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మార్కెట్లు అప్- ఈ చిన్న షేర్లు అదుర్స్
రెండో రోజూ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 222 పాయింట్లు ఎగసి 38,978కు చేరింది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో వినతీ ఆర్గానిక్స్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, టైమ్ టెక్నోప్లాస్ట్, ట్రెంట్ లిమిటెడ్, శ్రీ రాయలసీమ హైస్ట్రెంగ్త్ హైపొ, రీఫెక్స్ ఇండస్ట్రీస్, స్కిప్పర్ లిమిటెడ్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. వినతీ ఆర్గానిక్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం జంప్చేసి రూ. 1,171 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,242 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 21,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 52,000 షేర్లు చేతులు మారాయి. ఐఎఫ్బీ ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 653 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 687 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 24,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 22,000 షేర్లు చేతులు మారాయి. టైమ్ టెక్నోప్లాస్ట్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం లాభపడి రూ. 42 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.02 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 38,500 షేర్లు మాత్రమే చేతులు మారాయి. ట్రెంట్ లిమిటెడ్ బీఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ఎగసింది. రూ. 737 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 742 వరకూ లాభపడింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 32,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 25,000 షేర్లు చేతులు మారాయి. శ్రీ రాయలసీమ హైస్ట్రెంగ్త్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 196 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7,000 షేర్లు చేతులు మారాయి. రీఫెక్స్ ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం ర్యాలీ చేసి రూ. 51.5 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 12,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో లక్ష షేర్లు చేతులు మారాయి. స్కిప్పర్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం జంప్చేసి రూ. 47.60 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 16,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9,000 షేర్లు చేతులు మారాయి. -
డబుల్ సెంచరీతో షురూ -చిన్న షేర్లు గుడ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ డబుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ హాఫ్ సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లు జంప్చేసి 38,956ను తాకగా.. నిఫ్టీ 55 పాయింట్లు పురోగమించి 11,495 వద్ద ట్రేడవుతోంది. టెక్నాలజీ, ఫార్మా దిగ్గజాల అండతో సోమవారం యూఎస్ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో పుంజుకోగా.. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. బ్లూచిప్స్ జోరు ఎన్ఎస్ఈలో ఫార్మా, ఐటీ, పీఎస్యూ బ్యాంక్స్సహా అన్ని రంగాలూ బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్, గ్రాసిమ్, యూపీఎల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, టీసీఎస్, ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, విప్రో, ఎస్బీఐ 1.4-0.6 శాతం మధ్య ఎగశాయి. అయితే కొటక్ మహీంద్రా, ఇండస్ఇండ్, ఐషర్, శ్రీ సిమెంట్ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. సీమెన్స్ ప్లస్ డెరివేటివ్ కౌంటర్లలో సీమెన్స్, ఐడియా, అపోలో హాస్పిటల్స్, అమరరాజా, లుపిన్, మదర్సన్, మైండ్ట్రీ, డీఎల్ఎఫ్, నౌకరీ, ఐజీఎల్ కేడిలా, ఎస్బీఐ లైఫ్ 4-1.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. పీవీఆర్, ఐబీ హౌసింగ్, బీఈఎల్, బంధన్ బ్యాంక్, మణప్పురం, జిందాల్ స్టీల్, ఏసీసీ, సెయిల్, ఎంజీఎల్ 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1069 లాభపడగా. 422 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. -
చివర్లో పతనం- ఐటీ షేర్ల హవా
హుషారుగా మొదలైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి డీలాపడ్డాయి. చివరి గంటన్నర సమయంలో ఊపందుకున్న అమ్మకాలు ఇండెక్సులను దెబ్బతీశాయి. వెరసి సెన్సెక్స్ 98 పాయింట్లు క్షీణించి 38,757 వద్ద ముగిసింది. నిఫ్టీ 24 పాయింట్లు తక్కువగా 11,440 వద్ద స్థిరపడింది. ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ క్వాడ్రపుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సైతం సెంచరీ చేసింది. దీంతో తొలిసెషన్లో సెన్సెక్స్ 400 పాయింట్లవరకూ జంప్చేసి 39,230ను తాకింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు పురోగమించి 11,569కు చేరింది. అయితే ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు పతన బాట పట్టాయి. ఫలితంగా సెన్సెక్స్ 38,573 వద్ద కనిష్టానికి చేరింది. అంటే ఇంట్రాడే గరిష్టం నుంచి 650 పాయింట్లు పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ 11,384 దిగువకు పతనమైంది. ఐటీ జూమ్ ఎన్ఎస్ఈలో ఐటీ 4.5 శాతం, రియల్టీ 3.7 శాతం చొప్పున జంప్చేశాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ దాదాపు 2 శాతం నష్టపోగా.. ఎఫ్ఎంసీజీ, ఫార్మా 0.8 శాతం స్థాయిలో నీరసించాయి. క్యూ2లో పటిష్ట ఫలితాలు సాధించే వీలున్నట్లు తాజాగా పేర్కొనడంతో నిఫ్టీ దిగ్గజాలలో హెచ్సీఎల్ టెక్ 11 శాతం దూసుకెళ్లింది. మరోపక్క యూరోపియన్ కంపెనీ గైడ్విజన్ను కొనుగోలు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించడంతో ఇతర ఐటీ కౌంటర్లు సైతం జోరందుకున్నాయి. వెరసి టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ 5-3 శాతం మధ్య జంప్చేశాయి. టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 9 లక్షల కోట్లను దాటింది. బ్లూచిప్స్ తీరిలా నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టైటన్, హీరో మోటో, శ్రీ సిమెంట్ 3-1.2 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, పవర్గ్రిడ్, ఎస్బీఐ, గ్రాసిమ్, హిందాల్కో, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్, యాక్సిస్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ 4-2 శాతం మధ్య డీలాపడ్డాయి. అశోక్ లేలాండ్ ప్లస్ డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, అపోలో టైర్స్, బాలకృష్ణ, బీఈఎల్, బాటా, వోల్టాస్, పీవీఆర్, మ్యాక్స్ ఫైనాన్స్, మదర్సన్, ఎస్కార్ట్స్, ఏసీసీ, ఐడియా 10-3.6 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క ఐబీ హౌసింగ్, బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రు, భెల్ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.6-4 శాతం చొప్పున జంప్చేశాయి. ట్రేడైన షేర్లలో 1829 లాభపడగా., 927 మాత్రమే నష్టాలతో ముగిశాయి. మల్టీక్యాప్ ఫండ్స్ ఈక్విటీ పెట్టుబడుల నిబంధనలను సెబీ సరళతరం చేయడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకు భారీ డిమాండ్ నెలకొన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,176 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 724 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 838 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 317 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
ఆర్ఐఎల్ దన్ను- 646 పాయింట్ల హైజంప్
కొద్ది రోజులుగా ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా హైజంప్ చేశాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 646 పాయింట్లు పెరిగి 38,840 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 171 పాయింట్లు జంప్చేసి 11,449 వద్ద స్థిరపడింది. బుధవారం మూడు రోజుల పతనానికి చెక్ పెడుతూ యూఎస్ మార్కెట్లు దూసుకెళ్లడం సెంటిమెంటుకు జోష్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ట్రేడర్లు షార్ట్కవరింగ్ చేపట్టడం, ఇండెక్స్ హెవీవెయిట్ ఆర్ఐఎల్ దూకుడు చూపడం వంటి అంశాలు మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఇంట్రాడేలో గరిష్టంగా సెన్సెక్స్ 38,878ను అధిగమించగా.. నిఫ్టీ 11,464ను తాకింది. ప్రభుత్వ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్ 2.5 శాతం పుంజుకోగా.. ప్రయివేట్ బ్యాంక్స్, మీడియా, ఐటీ, రియల్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ 1.3-0.5 శాతం మధ్య బలపడ్డాయి. మెటల్ 1.2 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్ఐఎల్ 7.3 శాతం జంప్చేసింది. దీంతో ఇండెక్సులు దూకుడు చూపగా.. బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, ఐవోసీ, యాక్సిస్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్, ఇండస్ఇండ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్, శ్రీ సిమెంట్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ 6-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్ఫ్రాటెల్, హిందాల్కో, టాటా స్టీల్, ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, టైటన్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. అదానీ ప్లస్ డెరివేటివ్స్లో అదానీ ఎంటర్, ఐడీఎఫ్సీ ఫస్ట్, హెచ్పీసీఎల్, సన్ టీవీ, నౌకరీ, ఐడియా, కెనరా బ్యాంక్, అపోలో టైర్, ఎల్ఐసీ హౌసింగ్, ఏసీసీ, ఐసీఐసీఐ ప్రు 5-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. ఐబీ హౌసింగ్, ఎన్ఎండీసీ, కంకార్, కేడిలా హెల్త్, సెయిల్, శ్రీరామ్ ట్రాన్స్, యూబీఎల్, ఎస్కార్ట్స్, బాటా 3.3-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,824 లాభపడగా.. 887 మాత్రమే నష్టపోయాయి. అమ్మకాల బాటలో నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 959 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 264 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 620 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
నేలచూపులతో నేడు మార్కెట్లు?!
దేశీ స్టాక్ మార్కెట్లు నేడు(9న) నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 11,261 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,302 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. మరోసారి టెక్నాలజీ కౌంటర్లలో భారీ అమ్మకాలు తలెత్తడంతో వరుసగా మూడో రోజు యూఎస్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లన్నీ బలహీనంగా కదులుతున్నాయి. యూఎస్ మార్కెట్ల పతనం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలు మళ్లీ దేశీ స్టాక్ మార్కెట్లను మరోసారి ఆటుపోట్లకు లోనుచేసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చివర్లో అమ్మకాలు మంగళవారం ఆద్యంతం కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి డీలా పడ్డాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు క్షీణించి 38,365 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 11,317 వద్ద నిలిచింది. తొలుత సెన్సెక్స్ 38,746 గరిష్టాన్ని తాకగా.. 38,275 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. నిఫ్టీ సైతం 11,437- 11,290 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,259 పాయింట్ల వద్ద, తదుపరి 11,202 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,406 పాయింట్ల వద్ద, ఆపై 11,495 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,569 పాయింట్ల వద్ద, తదుపరి 22,394 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,992 పాయింట్ల వద్ద, తదుపరి 23,239 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్పీఐల వెనకడుగు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 620 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్పీఐలు నామమాత్రంగా రూ. 7 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు సైతం రూ. 816 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇదే విధంగా గడిచిన శుక్రవారం సైతం ఎఫ్పీఐలు రూ. 1,889 కోట్లు, డీఐఐలు రూ. 457 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
స్వల్ప లాభాలతో సరి
రోజంతా స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన సోమవారం నాటి స్టాక్ మార్కెట్ చివరకు స్వల్ప లాభాలతో గట్టెక్కింది. దీంతో రెండు రోజుల లాభాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. డాలర్తో రూపాయి మారకం విలువ 21 పైసలు క్షీణించి 73.35 వద్దకు చేరడం, ఆర్థిక రికవరీపై సంశయాలు, కరోనా కేసుల విషయంలో బ్రెజిల్ను దాటేసి భారత్ రెండో స్థానంలోకి రావడం, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, శనివారం అమెరికా స్టాక్ సూచీలు నష్టపోవడం.., ప్రతికూల ప్రభావం చూపించాయి. రోజంతా 459 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 60 పాయింట్ల లాభంతో 38,417 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 11,355 పాయింట్ల వద్దకు చేరింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్కు సెలవు. ► హిందుస్తాన్ యూనిలివర్ 2 శాతం లాభంతో రూ.2,162 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. డిక్సన్ టెక్నాలజీస్, వాబ్కో ఇండియా, ఇండియామార్ట్ ఇంటర్మెష్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ఆస్ట్రాజెనెకా ఫార్మా షేర్ జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఆల్టైమ్ హై, రూ.4,670ను తాకిన ఈ షేర్ చివరకు 18 శాతం లాభంతో రూ.4,586 వద్ద ముగిసింది. కరోనా వ్యాక్సిన్ రేసులో ఈ కంపెనీ వ్యాక్సినే ముందంజలో ఉందన్న వార్తలతో ఈ షేర్ జోరుగా పెరుగుతోంది. ► టాటా మోటార్స్ డీవీఆర్(డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్) షేర్ 10% లాభంతో రూ.62 వద్ద ముగిసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ.30 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్ టాటా సన్స్ కొనుగోలు చేసిందన్న వార్తలే దీనికి కారణం. ► వరుసగా ఐదో రోజూ ఫ్యూచర్ రిటైల్ షేర్ లోయర్ సర్క్యూట్ను తాకింది. ఈ క్యూ1లో ఈ కంపెనీకి రూ.478 కోట్ల నికర నష్టాలు రావడమే దీనికి కారణం. ► రూ.25,000 కోట్ల నిధుల సమీకరణ, కొత్త బ్రాండ్ లోగోను ఆవిష్కరించిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేర్ 2 శాతం లాభంతో రూ.12.30 వద్ద ముగిసింది. ► దాదాపు 300 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రెప్కో హోమ్ ఫైనాన్స్, డిష్ టీవీ, తాన్లా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
మార్కెట్లు బేర్- ఈ చిన్న షేర్లు భేష్
విదేశీ షాక్తో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 450 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా కేపిటల్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్, జామ్నా ఆటో ఇండస్ట్రీస్, ఫోర్స్ మోటార్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. ఐఎఫ్బీ ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 15.5 శాతం దూసుకెళ్లి రూ. 558 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 573ను అధిగమించింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 19,000 షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 54,500 షేర్లు చేతులు మారాయి. జామ్నా ఆటో ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతం లాభపడి రూ. 51 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3.2 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3.1 లక్షల షేర్లు చేతులు మారాయి. ఫోర్స్ మోటార్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం ర్యాలీ చేసి రూ. 1,159 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1185 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 11,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,000 షేర్లు చేతులు మారాయి. ఆదిత్య బిర్లా కేపిటల్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.5 శాతం జంప్చేసి రూ. 76 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.68 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో ఏకంగా 9.68 లక్షల షేర్లు చేతులు మారాయి. స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ఎగసి రూ. 273 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 286 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 36,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 50,000 షేర్లు చేతులు మారాయి. -
చివరికి 39,000కు- ఆటో, ఐటీ దన్ను
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 185 పాయింట్లు బలపడి 39,086 వద్ద నిలవగా.. నిఫ్టీ 65 పాయింట్లు పుంజుకుని 11,535 వద్ద స్థిరపడింది. సోమవారంనాటి భారీ పతనం నుంచి మార్కెట్లు మంగళవారం కోలుకున్నప్పటికీ తీవ్ర ఆటుపోట్లను చవిచూసిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా నేటి ట్రేడింగ్లోనూ ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,142 వద్ద గరిష్టాన్ని తాకగా.. 38,736 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ సైతం 11,555- 11,430 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. చైనాతో సరిహద్దు వద్ద వివాదాల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో మీడియా, మెటల్, ఐటీ, ఆటో 3.3-1.5 శాతం మధ్య ఎగశాయి. ఫార్మా, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ సైతం 0.8-0.4 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్యూ బ్యాంక్స్ 0.2 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఆర్ఐఎల్, ఐషర్, బీపీసీఎల్, హెచ్సీఎల్ టెక్ 7.5-2 శాతం మధ్య జంప్చేశాయి. ఇతర బ్లూచిప్స్లో బజాజ్ ఆటో, హీరో మోటో, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, నెస్లే, సన్ ఫార్మా, హెచ్యూఎల్, కొటక్ బ్యాంక్, ఎస్బీఐ, గ్రాసిమ్, ఎన్టీపీసీ, యూపీఎల్ 2.4-0.6 శాతం మధ్య డీలాపడ్దాయి. ఐడియా జోరు ఎఫ్అండ్వో కౌంటర్లలో ఐడియా 12.5 శాతం దూసుకెళ్లగా.. ఎస్కార్ట్స్, యూబీఎల్, నౌకరీ, మైండ్ట్రీ, బాష్, సెయిల్, బంధన్ బ్యాంక్, జూబిలెంట్ ఫుడ్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండిగో, జీఎంఆర్, సీఫోర్జ్ 10-3.5 శాతం మధ్య దూకుడు చూపాయి. కాగా.. మరోపక్క శ్రీరామ్ ట్రాన్స్, కంకార్, పెట్రోనెట్, మ్యాక్స్ ఫైనాన్స్, ముత్తూట్, బాలకృష్ణ, ఐబీ హౌసింగ్, పీఎఫ్సీ, గోద్రెజ్ ప్రాపర్టీస్ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.25-1.7 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1631 లాభపడగా.. 1051 నష్టాలతో నిలిచాయి. ఎఫ్పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 486 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 775 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 3,395 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 681 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
అమ్మకాల షాక్- మార్కెట్లు క్రాష్
వరుసగా ఆరో రోజు హుషారుగా ప్రారంభమైన మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మార్కెట్లకు షాక్ తగిలింది. ప్రస్తుతం సెన్సెక్స్ 674 పాయింట్లు పతనమైంది. 38,793కు చేరింది. వెరసి ఇంట్రాడే గరిష్టం 40,010 నుంచి 1,200పాయింట్లు పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 195 పాయింట్లు కోల్పోయి 11,452 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో గరిష్టంగా 11,794ను తాకింది. లడఖ్ తూర్పు ప్రాంతంలో తిరిగి చైనా బలగాలతో సైనిక వివాదం తలెత్తినట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటుకు షాకిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు ఆరు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు తెరతీసినట్లు తెలియజేశారు. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మీడియా, ఫార్మా, మెటల్, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ 5-2.5 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్, ఐషర్, బజాజ్ ఫిన్, ఎస్బీఐ, శ్రీ సిమెంట్, జీ, సిప్లా, ఎల్అండ్టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, యాక్సిస్ 6-3 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఓఎన్జీసీ, ఇన్ఫ్రాటెల్, విప్రో మాత్రమే 2.5-1 శాతం మధ్య బలపడ్డాయి. అదానీ పోర్ట్స్ 0.3 శాతం పుంజుకుంది. పతన బాటలో డెరివేటివ్ కౌంటర్లలో ఎన్ఎండీసీ, పీవీఆర్, ఐబీ హౌసింగ్, పిరమల్, శ్రీరామ్ ట్రాన్స్, ఫెడరల్ బ్యాంక్, భెల్, డీఎల్ఎఫ్, బాష్, జీఎంఆర్, ఆర్బీఎల్ బ్యాంక్, అరబిందో, మదర్సన్, ఐసీఐసీఐ ప్రు, ఎంఅండ్ఎం ఫైనాన్స్, మెక్వోవెల్, దివీస్ 9.3-5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండిగో, వేదాంతా, ఐడియా మాత్రమే 4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 3-4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 2278 నష్టపోగా... కేవలం 466 లాభాలతో ట్రేడవుతున్నాయి. -
ఎఫ్పీఐల దన్ను- మార్కెట్ల దూకుడు
ఓవైపు కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ తిరోగమన పథంలో పడినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు వెల్తువెత్తుతున్నాయి. దీంతో తాజాగా మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ ఆరు నెలల తదుపరి 40,000 పాయింట్ల మార్క్ను అధిగమించింది. ఇందుకు ప్రధానంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు ఇలా.. ఆగస్ట్లో స్పీడ్ ఈ నెలలో శుక్రవారం వరకూ(3-28) ఎఫ్పీఐలు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో రూ. 47,334 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. వీటిలో రూ. 46,602 కోట్లను ఈక్విటీ కొనుగోలుకి వెచ్చించగా.. రూ. 732 కోట్లను రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేశారు. వెరసి వరుసగా మూడో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. కాగా.. జులైలో ఎఫ్పీఐల పెట్టుబడులు రూ. 3,301 కోట్లకు పరిమితంకాగా.. జూన్లో రూ. 24,053 కోట్ల విలువైన స్టాక్స్ నికరంగా సొంతం చేసుకున్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి ఎఫ్పీఐలు ఈక్విటీలలో నికరంగా రూ. 80,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. వీటిలో ఆగస్ట్ పెట్టుబడులే అధికంకావడం గమనార్హం! కారణాలున్నాయ్ కరోనా వైరస్ విలయంతో ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో దేశ ఆర్థిక వ్యవస్థ 19 శాతం క్షీణించవచ్చన్న అంచనాలున్నప్పటికీ రెండో త్రైమాసికం నుంచీ రికవరీ బాట పట్టవచ్చన్న ఆశలు ఎఫ్పీఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలు, రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న లిక్విడిటీ పెంపు, రేట్ల కోత వంటి చర్యలు దోహదపడనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. లాక్డవున్ల ఎత్తివేత తదుపరి పలు రంగాలలో డిమాండ్ కనిపిస్తుండటంతో కంపెనీలు సైతం మెరుగైన ఫలితాలు ప్రకటించే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పలు అంశాలు.. వర్ధమాన దేశాలలోకెల్లా దేశీ మార్కెట్లను ఆకర్షణీయంగా నిలుపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వీటికి జతగా గత వారాంతాన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సైతం వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలోనే మరికొంత కాలం కొనసాగించనున్నట్లు స్పష్టం చేయడంతో ఇకపైన కూడా విదేశీ పెట్టుబడుల రాక కొనసాగవచ్చని కొటక్ సెక్యూరిటీస్, మార్నింగ్ స్టార్, గ్రో తదితర రీసెర్చ్ సంస్థల నిపుణులు ఊహిస్తున్నారు. -
నేడు మరోసారి లాభాల ఓపెనింగ్!
వరుసగా ఆరో రోజు నేడు (31న) దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 71 పాయింట్లు ఎగసి 11,753 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ తొలి రోజు 11,682 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వారాంతాన యూఎస్ మార్కెట్లు మరోసారి రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. వరుసగా ఆరో రోజు ఎస్అండ్పీ కొత్త గరిష్టానికి చేరగా నాస్డాక్ 40వ సారి రికార్డ్ హై వద్ద నిలిచింది. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. అయితే ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడర్లు కొంతమేర లాభాల స్వీకరణకు దిగే అవకాశమున్నదని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకింగ్ పుష్ ప్రధానంగా బ్యాంకింగ్ కౌంటర్లు జోరు చూపడంతో వారాంతాన దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేశాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు ఎగసి 39,467 వద్ద నిలవగా.. నిఫ్టీ 88 పాయింట్లు బలపడి 11,648 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,686- 11,589 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,596 పాయింట్ల వద్ద, తదుపరి 11,544 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,694 పాయింట్ల వద్ద, ఆపై 11,738 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,878 పాయింట్ల వద్ద, తదుపరి 23,233 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,891 పాయింట్ల వద్ద, తదుపరి 25,258 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1004 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 544 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్పీఐలు రూ. 1,164 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 809 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
సెన్సెక్స్ ట్రిపుల్- ఈ చిన్న షేర్లు హైజంప్
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 310 పాయింట్లు జంప్చేసి 39,424కు చేరగా.. నిఫ్టీ 82 పాయింట్లు ఎగసి 11,641 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లను మార్కెట్లను మించి భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, సందేష్ లిమిటెడ్, ప్రెసిషన్ వైర్స్, టీబీజెడ్ లిమిటెడ్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం జంప్ చేసింది. రూ. 759 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 778 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.6 లక్షల షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 2.24 లక్షల షేర్లు చేతులు మారాయి. కెనరా బ్యాంక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ర్యాలీ చేసి రూ. 112 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5.8 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 11.7 లక్షల షేర్లు చేతులు మారాయి. ఫెడరల్ బ్యాంక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం లాభపడి రూ. 60 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 17.52 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 31 లక్షలకుపైగా షేర్లు చేతులు మారాయి. సందేష్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10.5 శాతం దూసుకెళ్లి రూ. 583 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 633 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 350 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 3,500 షేర్లు చేతులు మారాయి. ప్రెసిషన్ వైర్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం జంప్చేసి రూ. 141 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 146 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 5,500 షేర్లు చేతులు మారాయి. టీబీజెడ్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 43 సమీపంలో ఫ్రీజయ్యింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 30,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2 లక్షల షేర్లు చేతులు మారాయి. -
4వ రోజూ- రియల్టీ, బ్యాంకింగ్ జోరు
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం సెన్సెక్స్ 220 పాయింట్లు జంప్చేసి 39,294కు చేరింది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 11,613 వద్ద ట్రేడవుతోంది. వరుసగా నాలుగో రోజు బుధవారం యూఎస్ ఇండెక్సులు ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త గరిష్టాల వద్ద నిలవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. రియల్టీ దూకుడు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ 3.3 శాతం జంప్చేయగా.. మీడియా, బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఫార్మా 1.8-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, జీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, యాక్సిస్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ, సిప్లా, బీపీసీఎల్, ఐటీసీ 3-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరో మోటో, బజాజ్ ఆటో, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్, శ్రీ సిమెంట్ 1-0.4 శాతం మధ్య నీరసించాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్లస్ ఎఫ్అండ్వో కౌంటర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్, అపోలో టైర్, బంధన్ బ్యాంక్, ఈక్విటాస్, నాల్కో, సెంచురీ టెక్స్, అశోక్ లేలాండ్, మ్యాక్స్ ఫైనాన్స్, జీఎంఆర్ 4.5-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క టీవీఎస్ మోటార్, పెట్రోనెట్, ఎంజీఎల్, కమిన్స్, టాటా కెమ్, ఐజీఎల్, సెయిల్, చోళమండలం 1.6-0.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1194 లాభపడగా.. 688 నష్టాలతో కదులుతున్నాయి. -
39,000కు సెన్సెక్స్- ఫైనాన్స్ షేర్లు జూమ్
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ చేసింది. 6 నెలల తదుపరి తిరిగి సాంకేతికంగా కీలకమైన 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 165 పాయింట్లు జంప్చేసి 38,965 వద్ద కదులుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 11,513 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండో రోజు సోమవారం యూఎస్ ఇండెక్సులు ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త గరిష్టాల వద్ద నిలవగా.. ఆసియాలోనూ ప్రస్తుతం సానుకూల ట్రెండ్ నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. ఐటీ మాత్రమే ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ఐటీ మాత్రమే నామమాత్రంగా వెనకడుగు వేసింది. బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఫార్మా, మెటల్ 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో షేర్ల విభజన చేపట్టిన ఐషర్ మోటార్స్ 3 శాతం లాభపడగా.. ఇండస్ఇండ్, ఎస్బీఐ, టాటా మోటార్స్, యాక్సిస్, ఎన్టీపీసీ, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ, హీరో మోటో 2.2-1 శాతం మధ్య ఎగశాయి. అయితే యూపీఎల్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫ్రాటెల్, బజాజ్ ఆటో, నెస్లే, అల్ట్రాటెక్, అదానీ పోర్ట్స్ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోరు ఎఫ్అండ్వో కౌంటర్లలో మ్యాక్స్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, చోళమండలం, టాటా కెమ్, ఇండిగో, ఆర్బీఎల్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, ఉజ్జీవన్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, డీఎల్ఎఫ్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ముత్తూట్, శ్రీరామ్ ట్రాన్స్ 11-2 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క పేజ్, జూబిలెంట్ ఫుడ్, బీహెచ్ఈఎల్, బాలకృష్ణ, మైండ్ట్రీ, పీవీఆర్ 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పెరిగాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1369 లాభపడగా.. 565 నష్టాలతో కదులుతున్నాయి. -
మార్కెట్లూ..ఈ మిడ్ క్యాప్స్- భలే జోరు
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల పరుగందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 330 పాయింట్లు పురోగమించి 38,765కు చేరగా.. నిఫ్టీ 103 పాయింట్లు జంప్చేసి 11,475 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లను మార్కెట్లను మించి భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో నవ భారత్ వెంచర్స్, వినతీ ఆర్గానిక్స్, బీఏఎస్ఎఫ్ ఇండియా, దీపక్ ఫెర్టిలైజర్స్, మెట్రోపోలిస్ హెల్త్కేర్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. నవ భారత్ వెంచర్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 16 శాతం జంప్ చేసింది. రూ. 66 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 55,000 షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 2.81 లక్షల షేర్లు చేతులు మారాయి. వినతీ ఆర్గానిక్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం ర్యాలీ చేసింది. రూ. 1182 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టం కావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 8,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.1 లక్షల షేర్లు చేతులు మారాయి. బీఏఎస్ఎఫ్ ఇండియా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం ఎగసి రూ. 1,752 వద్ద ట్రేడవుతోంది. తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 1,875ను తాకింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 7,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 46,000 షేర్లు చేతులు మారాయి. దీపక్ ఫెర్టిలైజర్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 11 శాతం జంప్చేసింది. రూ. 181 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4.5 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4.73 లక్షల షేర్లు చేతులు మారాయి. మెట్రోపోలిస్ హెల్త్కేర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం దూసుకెళ్లింది. రూ. 1872 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1918 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 5,100 షేర్లు చేతులు మారాయి. -
సెన్సెక్స్ అదుర్స్- 477 పాయింట్లు అప్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. అయితే తొలి నుంచీ పటిష్టంగా కదిలిన మార్కెట్లు చివరి గంటన్నరంలో మరింత పురోగమించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సెన్సెక్స్ 477 పాయింట్లు జంప్చేసి 38,528 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 138 పాయింట్లు ఎగసి 11,385 వద్ద స్థిరపడింది. వెరసి ఇంట్రాడేలో నమోదైన గరిష్టం 38,571 సమీపంలో నిలిచింది. ఈ బాటలో 11,260 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 11,402 వద్ద గరిష్టాన్నీ, 11,253 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఫార్మా వీక్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఫార్మా స్వల్పంగా 0.1 శాతం నీరసించింది. ప్రధానంగా రియల్టీ 4 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.2 శాతం చొప్పున ఎగశాయి. ఇతర రంగాలలో మీడియా, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ 2.2-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్, అల్ట్రాటెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కొటక్ బ్యాంక్, జీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటన్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, మారుతీ, శ్రీ సిమెంట్ 6.5-2 శాతం మధ్య జంప్చేశాయి. అయితే బీపీసీఎల్, టెక్ మహీంద్రా, సిప్లా, హెచ్సీఎల్ టెక్, గెయిల్, ఐవోసీ, బజాజ్ ఆటో 1.3-0.5 శాతం మధ్య క్షీణించాయి. ఫైనాన్షియల్స్ ప్లస్ డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, చోళమండలం, అదానీ ఎంటర్, ఐడీఎఫ్సీ ఫస్ట్, మ్యాక్స్ ఫైనాన్స్, ఇండిగో, బెర్జర్ పెయింట్స్, అంబుజా, రామ్కో సిమెంట్ 10-4 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. లుపిన్, టొరంట్ పవర్, ఐడియా, కమిన్స్, పేజ్, గ్లెన్మార్క్, పిరమల్, అపోలో టైర్ 2.2-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. రియల్టీ భళా రియల్టీ కౌంటర్లలో శోభా, సన్టెక్, ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒమాక్సీ, ఫీనిక్స్ 8.3-2.25 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.2 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,874 లాభపడగా.. 915 మాత్రమే నష్టపోయాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 333 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 718 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. వారాంతాన ఎఫ్పీఐలు స్వల్పంగా రూ. 46 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 797 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
లాభాలతో షురూ- అన్ని రంగాలూ ప్లస్
ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగి 38,510కు చేరింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 11,355 వద్ద ట్రేడవుతోంది. గురువారం యూఎస్ ఇండెక్సులు ఎస్అండ్పీ, డోజోన్స్ 0.3 శాతం నీరసించగా.. నాస్డాక్ అదే స్థాయిలో లాభపడింది. ఇక ఆసియాలోనూ మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. అయితే దేశీయంగా బలపడ్డ సెంటిమెంటు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆటో మాత్రమే ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఆటో 0.4 శాతం నీరసించింది. మీడియా, ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ 1.2-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, ఎల్అండ్టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, శ్రీ సిమెంట్, యూపీఎల్, విప్రో, బ్రిటానియా 1.8-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐషర్, హీరో మోటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్గ్రిడ్, టాటా మోటార్స్, టాటా స్టీల్ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. ఆటో అటూఇటూ.. డెరివేటివ్స్లో ఎస్కార్ట్స్, అశోక్ లేలాండ్, అమరరాజా, ముత్తూట్ ఫైనాన్స్, గ్లెన్మార్క్, మెక్డోవెల్, పేజ్, నిట్టెక్, అరబిందో 3.2-1.3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క ఇండిగో, భారత్ ఫోర్జ్, శ్రీరామ్ ట్రాన్స్, బాష్, టీవీఎస్ మోటార్, పీఎఫ్సీ, ఐబీ హౌసింగ్, పెట్రోనెట్, ఆర్బీఎల్ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ 0.6 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1126 లాభపడగా.. 619 నష్టాలతో కదులుతున్నాయి. -
స్వల్ప నష్టాలతో సరి- ప్రభుత్వ బ్యాంక్స్ జోరు
పారిశ్రామికోత్పత్తి జూన్లో పాతాళానికి పడిపోవడం, విదేశీ మార్కెట్ల బలహీనతలతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్సెషన్ నుంచీ రికవర్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 37 పాయింట్లు క్షీణించి 38,370 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 14 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,308 వద్ద నిలిచింది. అయితే అమ్మకాలు పెరగడంతో తొలుత సెన్సెక్స్ 38,126 దిగువన కనిష్టాన్ని తాకింది. తదుపరి చివర్లో 38,414 వరకూ ఎగసింది. ఇక నిఫ్టీ 11,243- 11,322 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. ఆటో, మీడియా అప్ ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంక్స్, ఆటో, మీడియా 2.7-2 శాతం మధ్య ఎగశాయి. ఫార్మా, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్ 1.5-0.4 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, ఐషర్, టాటా మోటార్స్, హీరో మోటో, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, యూపీఎల్ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే సిప్లా, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, బీపీసీఎల్, విప్రో, బజాజ్ ఫిన్, ఎల్అండ్టీ, ఐవోసీ, బజాజ్ ఫైనాన్స్ 2-1 శాతం మధ్య క్షీణించాయి. ఇండిగో జూమ్ డెరివేటివ్స్లో ఇండిగో 10 శాతం దూసుకెళ్లగా.. మదర్సన్, బాష్, పీవీఆర్, భారత్ ఫోర్జ్, బీఈఎల్, పెట్రోనెట్, అశోక్ లేలాండ్, ఎక్సైడ్, పీఎన్బీ 8-3 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు నౌకరీ, కంకార్, ముత్తూట్, బయోకాన్, అపోలో హాస్పిటల్స్, కేడిలా, గ్లెన్మార్క్, టొరంట్ ఫార్మా, లుపిన్ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1511 లాభపడగా.. 1214 నష్టపోయాయి. ఎఫ్పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1415 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 303 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
నష్టాలతో నేడు మార్కెట్ల ఓపెనింగ్!
నేడు (12న) దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.10 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 102 పాయింట్లు పతనమై 11,242 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,344 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్యాకేజీపై సందేహాలతో మంగళవారం యూఎస్ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీంతో 0.4-1.7 శాతం మధ్య ఇండెక్సులు నష్టపోయాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అత్యధిక శాతం మార్కెట్లు ప్రతికూలంగా కదులుతున్నాయి. దీంతో నేడు మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నాలుగో రోజూ.. వరుసగా నాలుగో రోజు మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 225 పాయింట్లు ఎగసి 38,407 వద్ద నిలవగా.. 52 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 11,322 వద్ద ముగిసింది. మిడ్సెషన్లో సెన్సెక్స్ 38,313కు వెనకడుగు వేసినప్పటికీ ఒక దశలో 38,556 వద్ద గరిష్టాన్నీ తాకింది. ఇదే విధంగా నిఫ్టీ 11,374- 11,299 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,290 పాయింట్ల వద్ద, తదుపరి 11,257 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,364 పాయింట్ల వద్ద, ఆపై 11,406 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,085 పాయింట్ల వద్ద, తదుపరి 21,944 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,323 పాయింట్ల వద్ద, తదుపరి 22,419 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఎఫ్పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1415 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 303 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
నాలుగో రోజూ లాభపడ్డ మార్కెట్లు
వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 225 పాయింట్లు ఎగసి 38,407 వద్ద నిలవగా.. 52 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 11,322 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకే కట్టుబడటంతో రోజంతా మార్కెట్లు హుషారుగా కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ మిడ్సెషన్లో కాస్త మందగించి 38,313కు వెనకడుగు వేసినప్పటికీ ఒక దశలో 38,556 వద్ద గరిష్టాన్నీ తాకింది. ఇదే విధంగా నిఫ్టీ 11,374- 11,299 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. ఎఫ్ఎంసీజీ ఓకే ఎన్ఎస్ఈలో మీడియా, మెటల్స్, ప్రయివేట్ బ్యాంక్స్ 2 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఎఫ్ఎంసీజీ 0.5 శాతం బలపడింది. అయితే ఫార్మా, రియల్టీ, ఐటీ 1.4-0.6 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్, బీపీసీఎల్, ఇండస్ఇండ్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ 5-2 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో శ్రీ సిమెంట్, టైటన్, యూపీఎల్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, బ్రిటానియా, ఎయిర్టెల్ 4-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. ఐడీఎఫ్సీ జోరు డెరివేటివ్స్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ 7.4 శాతం జంప్చేయగా.. ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, వోల్టాస్, రామ్కో సిమెంట్, మదర్సన్, సీమెన్స్, నాల్కో 5.3- 2.2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క టొరంట్ ఫార్మా, ఐడియా, నౌకరీ, బీవోబీ, బాష్, కేడిలా హెల్త్, ఈక్విటాస్, భారత్ ఫోర్జ్, సెంచురీ టెక్స్, అపోలో టైర్ 4.6-2.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,600 షేర్లు లాభపడగా.. 1160 నష్టాలతో ముగిశాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 303 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 505 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 397 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 439 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఫార్మా ధూమ్ధామ్- మార్కెట్లు అప్
విదేశీ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 144 పాయింట్లు పెరిగి 38,182 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం56 పాయింట్లు బలపడి 11,270 వద్ద ముగిసింది. యూఎస్, ఆసియా మార్కెట్లు అటూఇటుగా ముగిసినప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపారు. ప్రధానంగా ఫార్మా కౌంటర్లు, డిఫెన్స్ రంగ షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ తొలుత గరిష్టంగా 38,431 వరకూ ఎగసింది. చివర్లో కాస్త మందగించి 38,073 వరకూ వెనకడుగు వేసింది. ఈ బాటలో నిఫ్టీ 11,337-11,238 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది. సిప్లా జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఫార్మా అత్యధికంగా 5.5 శాతం జంప్చేసింది. రియల్టీ దాదాపు 3 శాతం ఎగసింది. ఐటీ, మెటల్, ఆటో, బ్యాంకింగ్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా 9.5 శాతం దూసుకెళ్లగా.. ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీ సిమెంట్, ఐసీఐసీఐ, ఐటీసీ, ఎస్బీఐ, టాటా స్టీల్ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐషర్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, బీపీసీఎల్, ఆర్ఐఎల్, బజాజ్ ఫిన్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, నెస్లే, గ్రాసిమ్, టీసీఎస్ 2.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. దివీస్ దూకుడు డెరివేటివ్స్లో దివీస్ ల్యాబ్ 12 శాతం దూసుకెళ్లగా.. బీఈఎల్, లుపిన్, నౌకరీ, ఐబీ హౌసింగ్, అరబిందో, అమరరాజా, మదర్సన్, పీఎఫ్సీ, డీఎల్ఎఫ్, గ్లెన్మార్క్ 9.5- 4.5 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క కంకార్ 15 శాతం కుప్పకూలింది. ఇతర కౌంటర్లలో ఆర్బీఎల్, ముత్తూట్, సీమెన్స్, బాటా, బంధన్ బ్యాంక్, మణప్పురం, మ్యాక్స్ ఫైనాన్స్, పేజ్, ఎంఆర్ఎఫ్ 5.5-1.25 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,763 లాభపడగా.. 995 మాత్రమే నష్టాలతో నిలిచాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 397 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 439 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. ఇక గురువారం ఎఫ్పీఐలు రూ. 637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 468 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ- ఫార్మా జూమ్
ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 309 పాయింట్లు ఎగసి 38,350కు చేరింది. నిఫ్టీ 95 పాయింట్లు బలపడి 11,309 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం యూఎస్, యూరోపియన్ మార్కెట్లు అటూఇటుగా నిలవగా.. ప్రస్తుతం ఆసియాలోనూ మిశ్రమ ట్రెండ్ కనిపిస్తోంది. అయినప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించినట్లు నిపుణులు పేర్కొన్నారు. మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో మెటల్ మాత్రమే(0.3 శాతం) నీరసించగా. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ఫార్మా దాదాపు 4 శాతం జంప్చేయగా.. బ్యాంకింగ్, రియల్టీ, ఆటో 1 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం, శ్రీ సిమెంట్, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, సన్ ఫార్మా 5-1.5 శాతం మధ్య పురోగమించాయి. అయితే ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, హీరో మోటో, టాటా స్టీల్, హిందాల్కో, మారుతీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే 1-0.5 శాతం మధ్య నష్టపోయాయి. దివీస్ దూకుడు ఎఫ్అండ్వో స్టాక్స్లో దివీస్ 15 శాతం దూసుకెళ్లగా.. బీఈఎల్, భారత్ ఫోర్జ్, భెల్, అరబిందో, ఆర్ఈసీ, మదర్సన్, ఐబీ హౌసింగ్, పీఎఫ్సీ 8.3-2 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోవైపు ఎంజీఎల్, ఆర్బీఎల్, టొరంట్ పవర్, రామ్కో సిమెంట్, సీమెన్స్, బాటా, జిందాల్ స్టీల్ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1313 లాభపడగా.. 484 నష్టాలతో కదులుతున్నాయి. -
సెన్సెక్స్ 515 పాయింట్లు జూమ్
సానుకూల ప్రపంచ సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 515 పాయింట్లు జంప్చేసి 37,455కు చేరింది. నిఫ్టీ142 పాయింట్లు ఎగసి 11,033 వద్ద ట్రేడవుతోంది. తద్వారా తిరిగి 11,000 పాయింట్ల కీలక మార్క్ను అధిగమించింది. వెరసి రెండు రోజుల వరుస అమ్మకాల తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ సాధించాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగ కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో మార్కెట్లు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మెటల్, ఎఫ్ఎంసీజీ ఎన్ఎస్ఈలో మీడియా, ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ 2.4-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఐటీ 0.7 శాతం, పీఎస్యూ బ్యాంక్స్ 0.4 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆర్ఐఎల్, హీరో మోటో, మారుతీ, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ 5.4-1.6 శాతం మధ్య జంప్చేశాయి. అయితే ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, విప్రో, ఎస్బీఐ, అల్ట్రాటెక్, బీపీసీఎల్, హెచ్యూఎల్ 2.7-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎక్సైడ్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో అపోలో టైర్, టాటా పవర్, బీఈఎల్, జూబిలెంట్ ఫుడ్, వోల్టాస్, ఇండిగో, టాటా కన్జూమర్ 3.6-2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు శ్రీరామ్ ట్రాన్స్, పీఎన్బీ, ఐజీఎల్, మైండ్ట్రీ, పీవీఆర్, అరబిందో, 2.7-1.3 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1411 లాభపడగా.. 708 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. -
సెన్సెక్స్ 518 పాయింట్లు పతనం
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి మరింత క్షీణించాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 518 పాయింట్లు కోల్పోయి 37,088 కు చేరగా.. నిఫ్టీ 140 పాయింట్ల వెనకడుగుతో 10,933ను తాకింది. తద్వారా సెన్సెక్స్ 37,000 పాయింట్లవైపు కదులుతుంటే .. నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్ దిగువన ట్రేడవుతోంది. ఐటీ, రియల్టీ వీక్ ఎన్ఎస్ఈలో ప్రయివేట్ బ్యాంక్స్ 2.25 శాతం నీరసించగా.. ఐటీ, రియల్టీ దాదాపు 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. అయితే ఫార్మా, పీఎస్యూ బ్యాంక్స్, మెటల్ రంగాలు 1.25 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, టైటన్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, హిందాల్కో, ఎస్బీఐ, ఐషర్, బీపీసీఎల్ 5-0.5 శాతం మధ్య ఎగశాయి. అయితే యూపీఎల్, ఇండస్ఇండ్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, ఐవోసీ, ఆర్ఐఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హీరో మోటో 6-1.6 శాతం మధ్య క్షీణించాయి. చిన్న షేర్లు ఓకే బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3-0.9 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1316 లాభపడగా.. 1069 నష్టాలతో కదులుతున్నాయి. ఎన్ఎస్ఈలో బంధన్ బ్యాంక్ 10 శాతం కుప్పకూలగా.. అపోలో హాస్పిటల్స్, ఆర్బీఎల్, ఎస్బీఐ లైఫ్, ఎస్కార్ట్స్, ఐబీ హౌసింగ్ 3.6-2.7 శాతం మధ్య డీలాపడ్డాయి. కాగా.. మైండ్ట్రీ, ఐడియా, దివీస్, టైటన్, పీఎన్బీ, టొరంట్ ఫార్మా, బీఈఎల్, మదర్సన్ 5-2.2 శాతం మధ్య ఎగశాయి. -
పతన బాటలో- బ్యాంక్స్ వీక్- ఆటో స్పీడ్
కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. తదుపరి పతన బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 315 పాయింట్లు క్షీణించి 37,292కు చేరగా.. నిఫ్టీ 84 పాయింట్ల నష్టంతో 10,989 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా ప్రయివేట్ రంగ బ్యాంక్ కౌంటర్లలో అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆటో జోరు ఎన్ఎస్ఈలో ప్రయివేట్ బ్యాంక్ ఇండెక్స్ 1.7 శాతం క్షీణించగా.. ఆటో 2 శాతం ఎగసింది. పీఎస్యూ బ్యాంక్స్ 0.5 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, ఇండస్ఇండ్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్, పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, గ్రాసిమ్, ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్ 4.2-1 శాతం మధ్య నీరసించాయి. అయితే టాటా మోటార్స్ 7 శాతం జంప్చేయగా.. హీరో మోటో, ఐషర్, మారుతీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, టైటన్, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ, విప్రో 3.2-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. ఎఫ్అండ్వో ఇలా డెరివేటివ్ కౌంటర్లలో మదర్సన్, జూబిలెంట్ ఫుడ్, అశోక్ లేలాండ్, మైండ్ట్రీ, టీవీఎస్, పీఎన్బీ, మణప్పురం 3.6-2.3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు బంధన్ బ్యాంక్ 8.5 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో టాటా కెమ్, ఐడియా, ఐసీఐసీఐ ప్రు 4.5-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 968 లాభపడగా.. 754 నష్టాలతో కదులుతున్నాయి. -
కన్సాలిడేషన్లో.. ఫార్మా షేర్ల జోరు
దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. జులై ఎఫ్అండ్వో సిరీస్ నేడు ముగియనుండటంతో స్వల్ప ఆటుపోట్లు చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 56 పాయింట్లు క్షీణించి 38,015కు చేరగా.. 21 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 11,182 వద్ద కదులుతోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఫార్మా రంగ కౌంటర్లకు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. వెరసి ఎన్ఎస్ఈలో ఫార్మా ఇండెక్స్ 2.5 శాతం ఎగసింది. డాక్టర్ రెడ్డీస్ జూమ్ క్యూ1 ఫలితాల నేపథ్యంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 5 శాతం జంప్చేసింది. రూ. 4520 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4560 వద్ద రికార్డ్ గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో దివీస్ ల్యాబ్స్ 5 శాతం ఎగసి రూ. 2537 వద్ద, గ్లెన్మార్క్ 4.4 శాతం జంప్చేసి రూ. 443 వద్ద, అపోలో హస్పిటల్స్ 4.2 శాతం పెరిగి రూ. 1710 వద్ద ట్రేడవుతున్నాయి. లాభాల బాటలో ఇతర ఫార్మా కౌంటర్లలో లుపిన్ 3.6 శాతం పుంజుకుని రూ. 890కు చేరగా.. టొరంట్ ఫార్మా 3 శాతం బలపడి రూ. 2450ను తాకింది. ఇదేవిధంగా సన్ ఫార్మా, బయోకాన్, అరబిందో ఫార్మా, కేడిలా హెల్త్కేర్ 1.2 శాతం స్థాయిలో లాభపడి కదులుతున్నాయి. కాగా.. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్ 7 శాతం పతనమైంది. ఇతర బ్లూచిప్స్లో ఐవోసీ, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, పవర్గ్రిడ్, హీరో మోటో, యాక్సిస్, గెయిల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ 4-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. -
చివర్లో అమ్మకాల దెబ్బ- మార్కెట్లు డౌన్
మిడ్సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. సెన్సెక్స్ 422 పాయింట్లు పతనమై 38,071 వద్ద నిలవగా.. నిఫ్టీ 98 పాయింట్లు క్షీణించి 11,203 వద్ద ముగిసింది. విదేశీ సంకేతాలు అటూఇటుగా ఉన్న నేపథ్యంలో తొలి నుంచీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,617 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,884 వద్ద కనిష్టాన్నీ చేరింది. ఇక నిఫ్టీ 11,351-11,150 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేడు ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. మరోపక్క దేశీయంగా గురువారం జులై డెరివేటివ్ సిరీస్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆటో, ఐటీ డీలా- ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఫార్మా 3 శాతం ఎగసింది. ఇతర రంగాలలో పీఎస్యూ బ్యాంక్స్ 1.5 శాతం, మెటల్ 0.9 శాతం చొప్పున బలపడగా.. ఆటో, ఐటీ 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్ 6.3 శాతం జంప్చేసింది. క్యూ1 ఫలితాలతో ఇంట్రాడేలో రూ. 4336 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో టాటా స్టీల్, ఇండస్ఇండ్, గ్రాసిమ్, ఇన్ఫ్రాటెల్, యూపీఎల్, సిప్లా, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, గెయిల్, ఐషర్, ఎల్అండ్టీ, యాక్సిస్ 4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇతర బ్లూచిప్స్లో ఆర్ఐఎల్ 4 శాతం పతనంకాగా.. ఎంఅండ్ఎం, హెచ్సీఎల్ టెక్, నెస్లే, హీరో మోటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, మారుతీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టైటన్, ఇన్ఫోసిస్, జీ 2.7-1 శాతం మధ్య క్షీణించాయి. ఎన్ఐఐటీ టెక్ స్పీడ్ డెరివేటివ్ కౌంటర్లలో ఎన్ఐఐటీ టెక్, ఎస్ఆర్ఎఫ్, టొరంట్ ఫార్మా, శ్రీరామ్ ట్రాన్స్, కాల్గేట్ పామోలివ్, టాటా కెమ్, పెట్రోనెట్, టాటా కన్జూమర్ 5-4 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. జీఎంఆర్, పిరమల్, ఆర్బీఎల్ బ్యాంక్, ఈక్విటాస్, హెచ్పీసీఎల్, మణప్పురం, అమరరాజా 4-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1371 లాభపడగా.. 1329 నష్టపోయాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 246 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఇక సోమవారం ఎఫ్పీఐలు రూ. 453 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 978 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
సెన్సెక్స్ప్రెస్.. ఆటో, ఐటీ స్పీడ్
కొద్ది రోజుల కన్సాలిడేషన్ తదుపరి తిరిగి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 558 పాయింట్లు జంప్చేసింది. 38,493 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 169 పాయింట్లు ఎగసి 11,300 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలతో హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడిచేకొద్దీ మరింత ఊపందుకున్నాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,555 వద్ద గరిష్టాన్ని చేరగా.. 37,998 వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. ఇదేవిధంగా నిఫ్టీ 11,318- 11,151 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. యూఎస్, యూరోపియన్ దేశాల ప్యాకేజీలు, ఫెడ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో మీడియా(0.2 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా ఆటో, ఐటీ, మెటల్ 3.2-2.25 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో రియల్టీ 1.6 శాతం, ఫార్మా 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్ 7 శాతం జంప్చేయగా.. కొటక్ బ్యాంక్, టీసీఎస్, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్, హిందాల్కో, శ్రీ సిమెంట్, హీరో మోటో 5-4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐసీఐసీఐ, ఇన్ఫ్రాటెల్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఐవోసీ, జీ 1.8-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. జీఎంఆర్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో జీఎంఆర్, అపోలో హాస్పిటల్స్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఎస్కార్ట్స్, రామ్కో సిమెంట్, అంబుజా సిమెంట్ 8.4-4.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. బీఈఎల్, హావెల్స్, ముత్తూట్, బర్జర్ పెయింట్స్, పెట్రోనెట్, ఐసీఐసీఐ ప్రు, యూబీఎల్ 3.3-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1335 లాభపడగా.. 1311 నష్టపోయాయి. అమ్మకాలవైపు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 453 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 978 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వారాంతాన ఎఫ్పీఐలు రూ. 410 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1003 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
చివర్లో రికవరీ- మార్కెట్లు అక్కడక్కడే
నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరి గంటలో సాధించిన రికవరీతో ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ నామమాత్రంగా 12 పాయింట్లు క్షీణించి 38,129 వద్ద నిలవగా.. నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,194 వద్ద స్థిరపడింది. అమెరికా నుంచి ఆసియా వరకూ మార్కెట్లు బలహీనపడటంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపారు. దీంతో 37,949 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 37,748 వరకూ నీరసించింది. చివర్లో 38,236 వరకూ పుంజుకుంది. ఇక నిఫ్టీ సైతం తొలుత 11,090 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకగా.. తదుపరి 11,225 వరకూ ఎగసింది. మీడియా, ఆటో, ఫార్మా డీలా ఎన్ఎస్ఈలో ఐటీ(1.4 శాతం) మాత్రమే లాభపడగా.. బ్యాంకింగ్, రియల్టీ, మీడియా, ఆటో, ఫార్మా 1.8-0.8 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, హిందాల్కో, యాక్సిస్, ఎస్బీఐ, గెయిల్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ, ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్ 5-2.3 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర బ్లూచిప్స్లో హెచ్సీఎల్ టెక్, ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఇండస్ఇండ్, ఇన్ఫోసిస్, విప్రొ 4.7-1.3 శాతం మధ్య ఎగశాయి. రిలయన్స్ రిటైల్లో అమెజాన్ వాటా కొనుగోలు చేయనుందన్న అంచనాలతో ఆర్ఐఎల్ రూ. 2163 వద్ద సరికొత్త గరిష్టాన్ని చేరింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 14 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశీయంగా లిస్టెడ్ కంపెనీల చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో చోళమండలం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పెట్రోనెట్, ఉజ్జీవన్, బయోకాన్, ఎస్కార్ట్స్ 4.6-3.6 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఐడీఎఫ్సీ ఫస్ట్, నిట్ టెక్, ఆర్బీఎల్ బ్యాంక్, జీఎంఆర్, మారికో, అంబుజా సిమెంట్ 4.4-1.6 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.25 శాతం మధ్య డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1583 నష్టపోగా.. 1070 లాభపడ్డాయి. ఎఫ్పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1740 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 932 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం సైతం ఎఫ్పీఐలు దాదాపు రూ. 1666 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మళ్లీ ర్యాలీ షురూ- 38,000కు సెన్సెక్స్
ఐదు రోజుల ర్యాలీకి ముందు రోజు బ్రేక్ పడినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. తొలుత కొంత కన్సాలిడేషన్ కనిపించినప్పటికీ సమయం గడిచేకొద్దీ బలాన్ని పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ 269 పాయింట్లు జంప్చేసి 38,140 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 83 పాయింట్ల లాభంతో 11,215 వద్ద నిలిచింది. అయితే వరుసగా రెండో రోజు మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,225-37,739 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ 11240 వద్ద గరిష్టాన్నీ, 11103 వద్ద కనిష్టాన్ని తాకింది. ఐటీ వీక్ ఎన్ఎస్ఈలో ఐటీ(0.2 శాతం) మాత్రమే వెనకడుగు వేయగా.. పీఎస్యూ బ్యాంక్స్, ఆటో, ఫార్మా, రియల్టీ రంగాలు 1.4 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, ఐసీఐసీఐ, ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, ఐవోసీ, ఐటీసీ, కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో 5-2 శాతం మధ్య జంప్చేశాయి. అయితే యాక్సిస్, శ్రీ సిమెంట్, హెచ్యూఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా, ఎల్అండ్టీ 4-0.5 శాతం మధ్య క్షీణించాయి. దివీస్ జోరు డెరివేటివ్ కౌంటర్లలో దివీస్, జీఎంఆర్, బీఈఎల్, మణప్పురం, హావెల్స్, అపోలో హాస్పిటల్స్ 6-3.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఎస్కార్ట్స్, శ్రీ సిమెంట్, గోద్రెజ్ సీపీ, ఎంఆర్ఎఫ్, జిందాల్ స్టీల్, పెట్రోనెట్, అంబుజా 3.5-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-0.6 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1453 లాభపడగా.. 1205 నష్టపోయాయి. ఎఫ్పీఐలు భళా.. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 1666 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 2266 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 727 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ జోరు చూడతరమా!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రోత్సాహంతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. మిడ్సెషన్కల్లా సెన్సెక్స్ 509 పాయింట్లు జంప్చేసి 35,425కు చేరగా.. నిఫ్టీ 130 పాయింట్లు జమ చేసుకుని 10,432 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇంతకుమించిన స్పీడ్ను కొన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, నవభారత్ వెంచర్స్, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్, ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్, ఫీమ్ ఇండస్ట్రీస్, బాలాజీ అమైన్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ ఎన్ఎస్ఈలో ఈ ఎన్బీఎఫ్సీ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్చేసి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 232 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 35 లక్షల షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 55.5 లక్షల షేర్లు చేతులు మారాయి. నవభారత్ వెంచర్స్ ఈ డైవర్సిఫైడ్ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం లాభపడి రూ. 55 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 95,000 షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో లక్ష షేర్లు చేతులు మారాయి. ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ వెబ్, డిజిటల్ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 62.3 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 75,000 షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 1.09 లక్షల షేర్లు చేతులు మారాయి. గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఎనర్జీ, ఇన్ఫ్రా తదితర బిజినెస్లు కలిగిన ఈ కంపెనీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 2 శాతం బలపడి రూ. 581 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 615 వరకూ దూసుకెళ్లింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 1,400 షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 700 షేర్లు మాత్రమే చేతులు మారాయి. ఫీమ్ ఇండస్ట్రీస్ ఎన్ఎస్ఈలో ఆటో విడిభాగాల తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం 18 శాతం దూసుకెళ్లి రూ. 420 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 427 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం కేవలం 7,000 షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 47,000 షేర్లు చేతులు మారాయి. బాలాజీ అమైన్స్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఈ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 542 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 558 వద్ద ఏడాది గరిష్టానికి చేరింది. బీఎస్ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 22,000 షేర్లుకాగా.. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 94,000 షేర్లు చేతులు మారాయి. -
మార్కెట్లలో కరోనా నష్టాల వేవ్
ఉన్నట్టుండి అమెరికాలో కోవిడ్-19 బాధితుల సంఖ్య పెరగడం, చైనాలోని బీజింగ్లో రెండో దశ కరోనా వైరస్ తలెత్తడం వంటి ప్రతికూల వార్తలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 552 పాయింట్లు కోల్పోయి 33,229 వద్ద నిలవగా.. నిఫ్టీ 159 పాయింట్లు క్షీణించి 9,814 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకే కట్టుబడటంతో మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. వెరసి సెన్సెక్స్ 33,670 వద్ద ప్రారంభమై 32,924 దిగువకు జారింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 9,943 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకగా.. 9,726 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. పీఎస్యూ బ్యాంక్స్ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్ 4 శాతం పతనంకాగా.. రియల్టీ, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ 3-1.5 శాతం మధ్య నష్టపోయాయి. అయితే పీఎస్యూ బ్యాంక్స్ 1.5 శాతం పుంజుకోగా.. మీడియా 1 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, యాక్సిస్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్, ఐటీసీ 7.2-3.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇతర కౌంటర్లలో గెయిల్, విప్రో, హెచ్సీఎల్ టెక్, ఆర్ఐఎల్, సన్ ఫార్మా మాత్రమే అదికూడా 3.7-0.8 శాతం మధ్య లాభపడ్డాయి. భెల్ వీక్ డెరివేటివ్స్లో బీహెచ్ఈఎల్, బంధన్ బ్యాంక్, డీఎల్ఎఫ్, ఎన్సీసీ, ఫెడరల్ బ్యాంక్, ఆర్బీఎల్, జిందాల్ స్టీల్ 7-4.4 శాతం మధ్య పతనంకాగా.. లుపిన్, టాటా పవర్, పీఎన్బీ, బీవోబీ, మైండ్ట్రీ 3.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి. రియల్టీ కౌంటర్లలో సన్టెక్, ప్రెస్టెజ్, ఒబెరాయ్, ఇండియాబుల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బ్రిగేడ్, ఫీనిక్స్ 4.3-1.6 శాతం మధ్య క్షీణించాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1311 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1945 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. కాగా. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.25 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1332 లాభపడగా.. 1233 నష్టపోయాయి. -
6 రోజుల ర్యాలీకి బ్రేక్- చివరికి నష్టాలే
చిట్టచివరికి ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 129 పాయింట్లు క్షీణించి 33,981 వద్ద నిలవగా.. 32 పాయింట్లు నీరసించిన నిఫ్టీ 10,029 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ 34,000 పాయింట్ల మైలురాయి దిగువన స్థిరపడింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందినప్పటికీ ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు మిడ్సెషన్ నుంచీ నేలచూపులకే పరిమితమయ్యాయి. ఎంపిక చేసిన కౌంటర్లలో తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. వెరసి సెన్సెక్స్ ఇంట్రాడేలో 34,310 వద్ద గరిష్టాన్ని, 33,711 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 10,124- 9944 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. పీఎస్యూ బ్యాంక్స్ ప్లస్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ఫార్మా, ఐటీ, పీఎస్యూ బ్యాంక్స్ 4-1 శాతం మధ్య పుంజుకోగా.. ప్రయివేట్ బ్యాంక్స్ 3 శాతం, రియల్టీ 2 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్, కొటక్ మహీంద్రా, యాక్సిస్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్సర్వ్ 4.7-2.4 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే వేదాంతా, ఎయిర్టెల్, జీ, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, విప్రో, సిప్లా, హెచ్సీఎల్ టెక్, పవర్గ్రిడ్, టీసీఎస్ 7.7-2.4 శాతం మధ్య జంప్చేశాయి. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్స్లో చోళమండలం, బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఉజ్జీవన్, పిరమల్, అపోలో టైర్ 8.3-4 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. ఐడియా, ఇండిగో, జిందాల్ స్టీల్, పీవీఆర్, ఎస్ఆర్ఎఫ్, లుపిన్ 10-5 శాతం మధ్య జంప్చేశాయి. బీఎస్ఈలో 1304 షేర్లు లాభపడగా.. 1148 నష్టాలతో నిలిచాయి. ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,851 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 782 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. -
ర్యాలీ బాట- 32,000 దాటిన సెన్సెక్స్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. ముందురోజు 1,000 పాయింట్లు జమ చేసుకున్న సెన్సెక్స్ తాజాగా మరో 595 పాయింట్లు బలపడింది. వెరసి 32,000 పాయింట్ల మార్క్ను సులభంగా దాటేసింది. 32,200 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 175 పాయింట్లు ఎగసి 9,500కు చేరువలో 9,490 వద్ద నిలిచింది. మే నెల డెరివేటివ్ సిరీస్ చివరి రోజు సైతం ట్రేడర్లు షార్ట్ కవరింగ్ చేపట్టడంతో ఇండెక్సులు బేర్ ర్యాలీ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. పలు దేశాలలో లాక్డవున్ ఎత్తివేస్తుండటం, ఈ ఏడాది ద్వితీయార్థం నుంచీ ఆర్థిక వ్యవస్థలు రికవరీ సాధిస్తాయన్న అంచనాలు ప్రపంచస్థాయిలో ఇన్వెస్టర్లకు జోష్నిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 32,267 వద్ద గరిష్టాన్ని తాకగా.. 31,642 సమీపంలో కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ ఒక దశలో 9,511 పాయింట్ల వద్ద గరిష్టాన్ని అందుకోగా.. 9,337 దిగువకూ చేరింది. మీడియా సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, మీడియా, రియల్టీ, బ్యాంకింగ్ మెటల్ రంగాలు 4-2.5 శాతం మధ్య ఎగశాయి. పీఎస్యూ బ్యాంక్స్ మాత్రమే అదికూడా 0.4 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఐషర్, ఎల్అండ్టీ, హీరో మోటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, మారుతీ, ఇన్ఫ్రాటెల్, హిందాల్కో 10-4 శాతం మధ్య జంప్చేశాయి. అయితే విప్రో, ఐటీసీ, సిప్లా, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1-0.5 శాతం మధ్య నీరసించాయి. ఎన్సీసీ స్పీడ్ డెరివేటివ్స్లో ఎన్సీసీ, ఉజ్జీవన్, భెల్, మదర్సన్, హావెల్స్, భారత్ ఫోర్జ్, నౌకరీ, గోద్రెజ్ సీపీ 9.5-6 శాతం మధ్య దూసుకెళ్లగా.. పీఎన్బీ, యస్ బ్యాంక్, మెక్డోవెల్, అదానీ పవర్, టాటా కెమ్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, టొరంట్ ఫార్మా, ఎల్ఐసీ హౌసింగ్, బాటా, ఆర్బీఎల్ బ్యాంక్ 2.6-1.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1529 లాభపడగా.. 807 నష్టపోయాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 335 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2409 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 4716 కోట్లు, డీఐఐలు రూ. 2841 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
సెన్సెక్స్ లాంగ్జంప్...1000 పాయింట్లు అప్
ఒక్క రోజులో మే నెల డెరివేటివ్ సిరీస్ ముగియనుండగా దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి జోరందుకున్నాయి. బుల్ ఆపరేటర్లు కదం తొక్కడంతో సెన్సెక్స్ ఏకంగా 1,000 పాయింట్లు జంప్చేసింది. ఇక నిఫ్టీ సైతం దాదాపు ట్రిపుల్ సెంచరీ చేసింది. తొలుత బలహీనంగా ప్రారంభమైనప్పటికీ సమయం గడిచేకొద్దీ మార్కెట్లు పరుగందుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 996 పాయింట్లు జమ చేసుకుని 31,605 వద్ద నిలవగా.. నిఫ్టీ 286 పాయింట్లు ఎగసి 9,315 వద్ద ముగిసింది. ఇది దాదాపు రెండు వారాల గరిష్టంకాగా.. సెన్సెక్స్ తొలుత 30,526 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. తదుపరి జోరందుకుని 31,660ను అధిగమించింది. ఇది 1050 పాయింట్ల వృద్ధికిగా.. నిఫ్టీ సైతం ఒక దశలో 9334 వద్ద గరిష్టాన్ని చేరుకోగా, 9004 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల దుమ్మురేపాయి. దీంతో మార్కెట్లకు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. గురువారం(28న) డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న కారణంగా బ్యాంకింగ్ కౌంటర్లలో ట్రేడర్లు భారీ షార్ట్ కవరింగ్ చేపట్టినట్లు తెలియజేశారు. ఐటీ, రియల్టీ జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్ 7.5 శాతం, పీఎస్యూ బ్యాంక్స్ 3.4 శాతం చొప్పున జంప్చేయగా.. ఐటీ దాదాపు 3 శాతం ఎగసింది. ఈ బాటలో రియల్టీ 2 శాతం పుంజుకోగా.. ఫార్మా స్వల్పంగా 0.2 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్ బ్యాంక్ 14 శాతంపైగా దూసుకెళ్లగా.. ఐసీఐసీఐ, విప్రో, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్, యూపీఎల్, కొటక్ మహీంద్రా, బీపీసీఎల్ 9-5 శాతం మధ్య జంప్చేశాయి.అయితే సన్ ఫార్మా, అల్ట్రాటెక్, జీ, టైటన్, ఏషియన్ పెయింట్స్, శ్రీసిమెంట్, మారుతీ 2-0.5 శాతం మధ్య నీరసించాయి. చోళమండలం అప్ డెరివేటివ్స్లో చోళమండలం, బంధన్ బ్యాంక్, ఆర్బీఎల్, ఫెడరల్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, కెనరా బ్యాంక్ 10-6 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క టొరంట్ ఫార్మా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఐజీఎల్, బయోకాన్, టొరంట్ పవర్, ఎస్బీఐ లైఫ్, లుపిన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్ 7-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1380 లాభపడగా.. 946 నష్టపోయాయి. కొనుగోళ్లవైపు.. నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 4716 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2841 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం మార్కెట్లకు సెలవుకాగా.. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 1354 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు సైతం రూ. 344 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
నేడు నిఫ్టీకి 8963-8897 వద్ద సపోర్ట్
నేడు (బుధవారం) దేశీ స్టాక్ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 5 పాయింట్ల నామమాత్ర లాభంతో 9,053 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ మే నెల ఫ్యూచర్స్ 9,048 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచీ ఆర్థిక వ్యవస్థలు బలపడనున్న అంచనాలతో మంగళవారం యూఎస్, యూరోపియన్ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో పుంజుకోగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. దీంతో నేడు దేశీయంగా సెంటిమెంటు బలపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గురువారం మే నెల డెరివేటివ్స్ ముగియనున్న కారణంగా ఇంట్రాడేలో ఆటుపోట్లకు చాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. హుషారుగా మొదలై ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో మంగళవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 63 పాయింట్లు తక్కువగా 30,609 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్లు క్షీణించి 9,029 వద్ద ముగిసింది. అయితే ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిముషాలలోనే సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా జంప్చేసింది. 31,087కు ఎగసింది. తదుపరి మిడ్సెషన్ నుంచీ బలహీనపడుతూ వచ్చింది. చివరికి లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. ఒక దశలో 30,512 వరకూ నీరసించింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 9162- 8997 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 8,963 పాయింట్ల వద్ద, తదుపరి 8,897 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 9,128 పాయింట్ల వద్ద, ఆపై 9,227 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. కొనుగోళ్లవైపు.. నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 4716 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2841 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం మార్కెట్లకు సెలవుకాగా.. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 1354 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు సైతం రూ. 344 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. -
హుషారుగా మొదలై చివర్లో వెనకడుగు`
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 63 పాయింట్లు తక్కువగా 30,609 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్లు క్షీణించి 9,029 వద్ద ముగిసింది. అయితే ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిముషాలలోనే సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా జంప్చేసింది. 31,087కు ఎగసింది. తదుపరి మిడ్సెషన్ నుంచీ బలహీనపడుతూ వచ్చింది. చివరికి లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. ఒక దశలో 30,512 వరకూ నీరసించింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 9162- 8997 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఆసియా, యూరోపియన్ మార్కెట్లు లాభపడినప్పటికీ ఎంపిక చేసిన కొన్ని కౌంటర్లలో ట్రేడర్లు అమ్మకాలకు దిగడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు తెలియజేశారు. గురువారం మే డెరివేటివ్ సిరీస్ ముగియనుండటంతో ఒడిదొడుకులు ఎదురైనట్లు తెలియజేశారు. ఎఫ్ఎంసీజీ సైతం ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్ 2.7-1 శాతం మధ్య పుంజుకోగా.. ఐటీ, ఫార్మా 2-1.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్, టైటన్, అల్ట్రాటెక్, ఇండస్ఇండ్, శ్రీసిమెంట్, హిందాల్కో, నెస్లే, ఐటీసీ, మారుతీ 6-3 శాతం మధ్య జంప్చేశాయి. అయితే ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హీరో మోటో, సిప్లా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, వేదాంతా 6-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. జిందాల్ జూమ్ డెరివేటివ్స్లో జిందాల్ స్టీల్, అదానీ పవర్, మదర్సన్, రామ్కో సిమెంట్, టాటా పవర్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బాలకృష్ణ 14-5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క పిరమల్, ఎస్కార్ట్స్, ఇండిగో, కేడిలా హెల్త్, కాల్గేట్ పామోలివ్ 5-3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్లో 1.2-0.6 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1225 లాభపడగా.. 1124 నష్టపోయాయి. అమ్మకాలవైపు.. నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1354 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) సైతం రూ. 344 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. గురువారం ఎఫ్పీఐలు దాదాపు రూ. 259 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ. 402 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
పార్మా షేర్లపై మక్కువ పెంచుకున్న మ్యూచువల్ ఫండ్లు..!
మ్యూచువల్ ఫండ్లు భారతీయ ఫార్మా షేర్లను ఇంతకు ముందు కన్నా అమితంగా ఇష్టపడుతున్నాయి. ఈ క్రమంలో క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు మ్యూచువల్ ఫండ్ల ఎంపికలో రెండోస్థానానికి దిగివచ్చాయి. ఫార్మా షేర్లకు ఇనిస్టిట్యూషనల్ ఎక్స్పోజర్ 40 నెలల గరిష్ట స్థాయిలో ఉందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. మ్యూచువల్ ఫండ్ల పోర్ట్ఫోలియోలో ఫార్మా స్టాక్ల వెయిటేజీ వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది ఏప్రిల్లో 200 బేసిస్ పాయింట్లు పెరిగి 8 శాతానికి చేరుకుంది. ఈ రంగానికి దేశీయ ఫండ్లు ఓవర్ వెయిట్ను కేటాయించాయి. ఏప్రిల్లో, ఈ రంగం వెయిటేజ్ మార్చి నెలతో పోలిస్తే 90 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఏయూఎం టాప్ 20 ఆస్తి నిర్వహణ సంస్థలలో.. 14 ఫండ్లు ఈ రంగంలో 110-670 బేసిస్ పాయింట్ల మేర ఓవర్ వెయిట్ను కలిగి ఉన్నాయి. ఆదిత్య బిర్లా ఏఎంసీ ఫార్మా రంగానికి అత్యధికంగా 12.9శాతం కేటాయింపులను కలిగి ఉంది. తరువాత ఎల్అండ్టీ, కెనరా రోబెకో మ్యూచువల్ ఫండ్లు తమ పోర్ట్ ఫోలియోలో వరుసగా 12.4శాతం, 11.7 శాతం కేటాయింపులు చేశాయి. అన్ని రంగాలతో పోలిస్తే ఫార్మా రంగం అత్యల్ప ఆదాయ డౌన్గ్రేడ్ను చూసింది. జెనరిక్ వ్యాపారానికి సంబంధించి యూఎస్ మార్కెట్లో వ్యాపార అవుట్లుక్ క్రమంగా మెరుగుపడిన తరువాత కొన్ని షేర్ల ఆదాయాలు మరింత పెరిగాయి. ఫార్మా కంపెనీలకు వచ్చే మొత్తం ఆదాయంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ ఎగుమతులే ఉండటం విశేషం. ఔషధాల అనుమతులు పెరుగుదల, ఉత్పత్తులు పెరగడం, అనుకూలమైన కరెన్సీ కదలికలు తదితర అంశాలు ఫార్మా కంపెనీలపై అంచనాలను పెంచుతున్నాయి. అమెరికాలో ఔషధ ఉత్పత్తుల త్రైమాసిక అమ్మకాలు 1.66- 1.75 బిలియన్ డాలర్ల పరిధిలో ఉన్నాయి. ఇది ధర ఒత్తిడి తగ్గిందని సూచిస్తుంది. పర్యవసానంగా, ఫార్మా కంపెనీల షేర్ల ధరల్ని వారు రీ-రేట్ చేస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో నిఫ్టీ సూచీతో పోలిస్తే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 8శాతం డిస్కౌంట్తో ట్రేడ్ అయ్యేది. ఇప్పుడు నిఫ్టీ ఫార్మా 41.6శాతం ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ గత మూడు నెలల్లో సెన్సెక్స్ను 41శాతం మేర అధిగమించింది. ఇదే కాలంలో సానుకూల రాబడిని అందించే కొన్ని ఇండెక్స్ల్లో ఒకటిగా నిలిచింది. -
తొలుత లాభాలు- తుదకు నష్టాలు
కోవిడ్-19 సృష్టిస్తున్న కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనట్లు ఆర్బీఐ తాజాగా పేర్కొంది. దీంతో ఆర్థిక పురోగతికి వీలుగా రెపో రేటును 0.4 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా మార్చి 1 నుంచి అమలు చేస్తున్న రుణ వాయిదా చెల్లింపులపై నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు తెలియజేసింది. ఫలితంగా కాలావధిగల రుణ చెల్లింపుల వాయిదాలపై ఆగస్ట్ 31వరకూ మారటోరియం కొనసాగనుంది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతానికి దిగివచ్చిన వెంటనే మార్కెట్లు జోరందుకోగా.. రుణ చెల్లింపులపై మారటోరియం కారణంగా బ్యాంకింగ్ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. రుణ చెల్లింపులపై ఆరు నెలల మారటోరియంతో బ్యాంకులకు సవాళ్లు ఎదురుకావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలియజేశారు. వెరసి సెన్సెక్స్ ఆటుపోట్ల మధ్య 260 పాయింట్లు కోల్పోయి 30,673 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 67 పాయింట్లు తక్కువగా 9,039 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 31,108 పాయింట్ల వద్ద గరిష్టాన్నీ, 30,475 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 9150- 8969 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. ప్రయివేట్ బ్యాంక్స్ డౌన్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, రియల్టీ 2.4-1.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే మీడియా, ఐటీ, ఫార్మా 2-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, ఐసీఐసీఐ, టాటా స్టీల్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్ఢీఎఫ్సీ బ్యాంక్ 5.2-2 శాతం మధ్య డీలాపడ్డాయి. ఇతర బ్లూచిప్స్లో జీ, ఎంఅండ్ఎం, సిప్లా, శ్రీ సిమెంట్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, ఐవోసీ 7.2-1.6 శాతం మధ్య ఎగశాయి. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఈక్విటాస్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, పీఎఫ్సీ, ఐబీ హౌసింగ్, అశోక్ లేలాండ్ 6-5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు టాటా కెమికల్స్, నిట్ టెక్, సెంచురీ టెక్స్, ఏసీసీ, టాటా పవర్, జూబిలెంట్ ఫుడ్ 4.5-3.2 శాతం మధ్య జంప్ చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-0.25 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1317 నష్టపోగా.. 969 లాభపడ్డాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 259 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ. 402 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్పీఐలు దాదాపు రూ. 1467 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2373 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 1328 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1660 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
లాభాలతో మొదలైన మార్కెట్
దేశీయ మార్కెట్ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 66 పాయింట్లు పెరిగి 30262 వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు లాభంతో 8887 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. సూచీలకిది వరుసగా రెండో రోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్ 328 పాయింట్ల లాభంతో 30,524.53 వద్ద నిఫ్టీ 96 పాయింట్లు పెరిగి 8,975.50 వద్ద ట్రేడ్ అవుతోంది. అటో, ఐటీ రంగాలకు చెందిన షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ 0.79శాతం లాభంతో 17, 625 వద్ద ట్రేడ్ అవుతోంది. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ పరిమితులను చాలా దేశాలు సడలించినప్పటికీ.., ఆయా దేశాలు వెలువరించిన ప్రతికూల ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహరిచాయి. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్ కొంత బలహీనంగా ఉంది. గత 2 ట్రేడింగ్ సెషన్ల నుంచి ఎఫ్పీఐల అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తుండటం మన మార్కెట్కు కలిసొచ్చే అంశంగా మారింది. ఇక బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ తో 22 కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. కోవిద్-19 వైరస్ వ్యాధి నివారణకు మోడ్నెర్ ఔషధ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయిందని అమెరికా అధికారిక మెడికల్ న్యూస్ వెబ్సైట్ ఎస్టీఏటీ ప్రకటించింది. ఫలితంగా మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్ నష్టాలను చవిచూసింది. ఈ దేశ ప్రధాన ఈక్విటీ సూచీలైన డౌజోన్స్ ఇండెక్స్ 1.50శాతం, ఎస్అండ్పీ ఇండెక్స్ 1శాతం, నాస్డాక్ ఇండెక్స్ అరశాతం నష్టంతో ముగిశాయి. ఇక ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్, తైవాన్, కొరియా దేశాల సూచీలు 1శాతం నుంచి అరశాతం వరకు లాభపడగా, చైనా, సింగపూర్, ఇండోనేషియా దేశాల సూచీలు అరశాతం నష్టపోయాయి. క్రూడాయిల్ను ఉత్పత్తి చేసే దేశాలు ఉత్పత్తిలో కోత విధించవచ్చనే అంచనాలున్పటికీ అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలతో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ చమురు ధర 34.55డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. గెయిల్, శ్రీ సిమెంట్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. కోల్ ఇండియా, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరోమోటోకార్ప్, ఇన్ఫ్రాటెల్ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. -
లాభాల ముగింపు- తొలుత హైజంప్
కోవిడ్-19ను నిలువరించే వ్యాక్సిన్ తొలి దశ పరీక్షలు అమెరికాలో విజయవంతమైన వార్తలతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం జోరందుకున్నాయి. సోమవారం అమెరికా ఇండెక్సులు 4 శాతంవరకూ లాభపడగా.. తొలుత సెన్సెక్స్ 700 పాయింట్లవరకూ జంప్చేసింది. 30,740 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఆపై మిడ్సెషన్ నుంచీ స్పీడ్ తగ్గుతూ వచ్చింది. చివరికి 167 పాయింట్లు మిగిల్చుకుని 30,196 వద్ద ముగిసింది. వెరసి ఇంట్రాడేలో నమోదైన 30,117 పాయింట్ల కనిష్టానికి చేరువలో నిలిచింది. ఇక నిఫ్టీ సైతం 56 పాయింట్లు లాభపడి 8,879 వద్ద స్థిరపడింది. అయితే అంతకుముందు 9030 వద్ద గరిష్టాన్నీ, 8855 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. మోడర్నా ఇంక్ రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి దశ పరీక్షలు ఫలవంతమైనట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మీడియా జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ఆటో, మెటల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు 2-0.75 శాతం మధ్య ఎగశాయి. అయితే పీఎస్యూ బ్యాంక్స్ 2.6 శాతం క్షీణించాయి. రియల్టీ సైతం 0.7 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎయిర్టెల్ 11 శాతం దూసుకెళ్లగా.. అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫ్రాటెల్, ఐటీసీ, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ 9-2.2 శాతం మధ్య జంప్చేశాయి. అయితే సస్యరక్షణకు వినియోగించే కొన్ని ఇన్సెక్టిసైడ్స్పై ప్రభుత్వం నిషేధం విధించనున్న వార్తలతో యూపీఎల్ 10 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో వేదాంతా, ఆర్ఐఎల్, ఇండస్ఇండ్, ఎల్అండ్టీ, ఎస్బీఐ, హెచ్యూఎల్, సిప్లా, యాక్సిస్, నెస్లే 2.7-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐడియా స్పీడ్ డెరివేటివ్స్లో ఐడియా 20 శాతం పురోగమించగా.. అదానీ పవర్, పీవీఆర్, ఎల్ఐసీ హౌసింగ్, అమరరాజా, జిందాల్ స్టీల్, మైండ్ట్రీ 16-4 శాతం మధ్య జంప్చేశాయి. కాగా.. మరోపక్క బీవోబీ, బంధన్ బ్యాంక్, మణప్పురం, బీఈఎల్, ఆర్ఈసీ, ఫెడరల్ బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, పీఎన్బీ, గోద్రెజ్ ప్రాపర్టీస్ 5.5-3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.5 శాతం బలపడగా.. స్మాల్ క్యాప్ 0.2 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1030 లాభపడగా.. 1262 నష్టపోయాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు సోమవారం రూ. 2513 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) సైతం రూ. 152 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. -
రిలీఫ్ ర్యాలీ..!
గత ఆర్థిక సంవత్సరం (2019–20) చివరి రోజైన మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ మాంచి లాభాలతో ముగిసింది. కానీ పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, ఇన్వెస్టర్లకు భారీ నష్టాలనే మిగిల్చింది. సోమవారం భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం ఒకింత ఊపిరి పీల్చుకున్నాయి. సోమవారం అమెరికా స్టాక్సూచీలు 3–4 శాతం లాభాల్లో ముగియడం, మార్చి నెలలో చైనా తయారీ రంగం అంచనాలను మించి పుంజుకోవడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు లాభపడటం, డాలర్తో రూపాయి మారకం విలువ స్వల్పంగా కోలుకోవడం... సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 1,028 పాయింట్లు పెరిగి 29,468 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 317 పాయింట్ల లాభంతో 8,598 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 3.6 శాతం, నిఫ్టీ 3.8 శాతం చొప్పున లాభపడ్డాయి. కరోనా కల్లోలమున్నా... రోజంతా లాభాలే... కరోనా కల్లోలం కొనసాగుతున్నా స్టాక్ మార్కెట్ రోజంతా లాభాల్లోనే ట్రేడైంది. లాభాల్లోనే ఆరంభమై, రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,331 పాయింట్లు, నిఫ్టీ 397 పాయింట్ల మేర లాభపడ్డాయి. కాగా భారత్లో కరోనా కేసుల సంఖ్య 1,200కు, మరణాల సంఖ్య 32కు చేరగా, రికవరీ అయిన వారి సంఖ్య వందకు పెరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8 లక్షలకు, మరణాలు 39,000కు చేరాయి. సోమవారం భారీగా క్షీణించిన ముడిచమురు ధరలు కోలుకున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 3.6% ఎగసి 27.37 డాలర్లకు పెరిగింది. ప్రపంచ మార్కెట్ల పరుగులు... సోమవారం అమెరికా స్టాక్సూచీలు 2–3 శాతం రేంజ్లో లాభపడ్డాయి. ఈ జోష్తో ఆసియా మార్కెట్లు 2–3 శాతం రేంజ్లో పెరగ్గా, యూరప్ మార్కెట్లు కూడా లాభాలతోనే మొదలయ్యాయి. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో 35.7 ఉన్న చైనా తయారీ రంగ పీఎమ్ఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) ఈ ఏడాది మార్చిలో 52కు పెరగడం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిచ్చింది. మరిన్ని విశేషాలు.. ► ఐటీసీ 8 శాతం లాభంతో రూ.172 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ నష్టపోగా, మిగిలిన 26 షేర్లు లాభపడ్డాయి. ► గత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్లర్లో డిపాజిట్లు 10–11 శాతం తగ్గాయన్న వార్తల కారణంగా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 15 శాతం నష్టంతో రూ.351 వద్ద ముగిసింది. ► మార్చిలో చైనా తయారీ రంగం పుంజుకోవడంతో లోహ షేర్లు జోరుగా పెరిగాయి. సెయిల్, టాటా స్టీల్, వేదాంత, హిందుస్తాన్ కాపర్, హిందాల్కో నాల్కో షేర్లు 13 శాతం వరకూ పెరిగాయి. మార్చిలో మరింతగా పతనం... కరోనా వైరస్ కల్లోలంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గత ఆర్థిక సంవత్సరంలో భారీగా నష్టపోయింది. సెన్సెక్స్9,204 పాయింట్లు(23.8%), నిఫ్టీ 3,026 పాయింట్లు (26%) పతనమయ్యాయి. ఒక్క మార్చిలోనే సెన్సెక్స్ 8,829 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో అత్యధిక పాయింట్లు నష్టపోయింది ఈ ఏడాది మార్చిలోనే. స్టాక్ సూచీలు చరిత్రాత్మక గరిష్ట స్థాయిలను దాటింది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే. ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్లపైకి ఎగబాకాయి. స్టాక్ మార్కెట్ అత్యధికంగా నష్టపోయింది కూడా గత ఆర్థిక సంవత్సరంలోనే. ఇన్వెస్టర్ల సంపద రూ.37.59 లక్షల కోట్లు ఆవిరైంది. రూ. 4 లక్షల కోట్లు పెరిగిన సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.113.50 లక్షల కోట్లకు ఎగసింది. ట్రేడింగ్ గంటలు తగ్గించండి.. సెబీని కోరిన ఏఎన్ఎమ్ఐ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈక్విటీ, డెరివేటివ్స్ సెగ్మెంట్లకు సంబంధించి ట్రేడింగ్ వేళలను కుదించాలని సెబీని ఏఎన్ఎమ్ఐ(అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్చంజేస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా) కోరింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఉదయం 9.15కు మొదలై సాయంత్రం 3.30కు ముగుస్తోంది. ఈ వేళలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పరిమితం చేయాలని ఏఎన్ఎమ్ఐ విజ్ఞప్తి చేసింది. కమోడిటీ మార్కెట్ ట్రేడింగ్ను సాయంత్రం 5కే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. మౌలిక రంగం 5.5 శాతం వృద్ధి ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం ఫిబ్రవరిలో 5.5 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య ఈ విభాగం వృద్ధి రేటు కేవలం 1 శాతం. కట్టుతప్పిన ద్రవ్యలోటు: ప్రభుత్వ ఆదాయం–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం(ద్రవ్యలోటు) ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యానికి మించి ఫిబ్రవరినాటికే రూ.10,36,485 కోట్లకు చేరింది. అంటే లక్ష్యంలో 135.2%కి పెరిగిందన్నమాట. 2019–20 లో రూ.7.66 లక్షల కోట్లుగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది 2019–20 జీడీపీ అంచనాల్లో దాదాపు 3.8 శాతం. -
భారీగా పతనమవుతున్న స్టాక్ మార్కెట్లు
-
ఆరంభ లాభాలు ఆవిరి..
ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల బాట పట్టాయి. పవర్ గ్రిడ్, ఏషియన్ పెయిట్స్, ఐటీసీ షేర్లు లాభపడుతుండగా టీసీఎస్, రిలయన్స్ ఇండస్ర్టీస్, బజాజ్ ఆటో నష్టపోతున్నాయి. పలు రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 226 పాయింట్ల నష్టంతో 41,718 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 12,307 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
స్టాక్ మార్కెట్లకు గ్లోబల్ షాక్
ముంబై : గ్లోబల్ మార్కెట్ల పతనంతో పాటు, ట్రేడ్వార్ ఆందోళనలతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల బాటపట్టాయి. ఆర్థిక వ్యవస్ధ స్ధిరీకరణకు చర్యలు చేపడతామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ భరోసా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయలేకపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్ల పైగా నష్టంతో 40వేల పాయింట్ల దిగువన, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 12 వేల పాయింట్ల దిగువన ట్రేడవుతున్నాయి. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, మారుతి సుజుకి, కొటాక్ బ్యాంక్, హెచ్యూల్ తదితర షేర్లు నష్టపోతుండగా, ఇండియాబుల్స్ , వేదాంత, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడుతున్నాయి. -
అప్ట్రెండ్ కొనసాగే ఛాన్స్..!
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందన్న ఉత్సాహభరిత వాతావరణం...మార్కెట్లో మరికొద్దిరోజులు వుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇన్వెస్టర్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటు, దేశీ స్థూల ఆర్థికాంశాలు, అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి నిలుపుతారని కూడా విశ్లేషకులు చెపుతున్నారు. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం చేయడానికి ఈవారంలోనే ముహూర్తం ఖరారైంది. ఈనెల 30న (గురువారం) సాయంత్రం 7 గంటలకు మోదీతో పాటు కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఎంతమంది కేబినెట్ మంత్రులు ఉంటారనే అంశం ఇంకా తెలియకపోవడంతో మార్కెట్ వర్గాలు ఈ అంశంపై దృష్టిసారించాయి. ప్రమాణస్వీకారం రోజునే.. మే సిరీస్ ఎఫ్ అండ్ ఓ ముగింపు ఉన్న కారణంగా ఆరోజున భారీ స్థాయిలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా మార్కెట్లో ఉత్సాహభరిత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని యస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ అన్నారు. ఈవారంలో అయితే సూచీల ప్రయాణం ఎటువైపు ఉంటుందనే అంశంపై పూర్తి అవగాహన రాకపోవచ్చని తాను భావిస్తున్నట్లు సామ్కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్ నోట్ వ్యవస్థాపక సీఈవో జిమీత్ మోడీ వ్యాఖ్యానించారు. తేలికపాటి అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉందని, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా కదలాడవచ్చని విశ్లేషించారు. సంస్కరణల ఆధారంగానే ర్యాలీ.. ‘ఎన్నికలు అనే అతిపెద్ద కార్యక్రమం పూర్తయింది. ఇక్కడ నుంచి ముడిచమురు ధరల కదలికలు, కంపెనీల ఎర్నింగ్స్ గైడెన్స్ మార్కెట్కు కీలకంకానున్నాయి’ అని ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టనున్న నూతన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకుని వెళ్లనున్నాయని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ విజయ్ చందోక్ అన్నారు. వచ్చే ఐదేళ్లు ఆశాజనకంగా ఉన్నందున ఎఫ్ఐఐల పెట్టుబడులు కూడా భారీగా రానున్నాయని అంచనావేస్తున్నట్లు చెప్పారాయన. ‘ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, నూతన ప్రభుత్వ బడ్జెట్ ప్రకటన వెలువడే వరకు మార్కెట్లో వేచిచూసే ధోరణే ఉండవచ్చు. ఇక నుంచి క్రమంగా ఒడిదుడుకులు తగ్గవచ్చని భావిస్తున్నాం’ అని జిమీత్ మోడీ అన్నారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి గత ఆర్థిక సంవత్సరం క్యూ4 (జనవరి–మార్చి) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించనుంది. అదేరోజున ద్రవ్య లోటు, ఇండియా ఇన్ఫ్రా అవుట్పుట్ డేటా విడుదలకానున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల్లో.. బ్యాంక్ ఆఫ్ జపాన్ సీపీఐ, చైనా ఉత్పత్తి డేటా, అమెరికా వ్యక్తిగత వ్యయ సమాచారం వెల్లడికానున్నాయి. ఆర్థిక ఫలితాల ప్రభావం.. అదానీ పోర్ట్స్, కోల్గేట్–పామోలివ్, గెయిల్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఆయిల్ ఇండియా, జీ ఎంటర్టై¯Œ మెంట్, కోల్ ఇండియా, హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, సన్ ఫార్మా, ప వర్ గ్రిడ్ ఫలితాలు ఈవారంలో వెలువడనున్నాయి. ఎఫ్ఐఐల నికర విక్రయాలు.. మే 2–24 మధ్యకాలంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) రూ.4,375 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈ కాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,048 కోట్లు.. డెట్ మార్కెట్ నుంచి రూ.2,310 కోట్లు ఉపసంహరించుకున్నారు. -
‘ఎగ్జిట్ పోల్స్’ లాభాలు
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరో రెండు రోజుల్లో రానుండటంతో స్టాక్ మార్కెట్లో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 38,000 పాయింట్లపైకి ఎగబాకగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,400 పాయింట్ల ఎగువన ముగిసింది. స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడగలదని, సంస్కరణలు కొనసాగుతాయనే అంచనాలతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో రోజు లాభపడగా, ఈ నెలలో స్టాక్ సూచీలకు ఇది మూడో రోజు లాభం. బీఎస్ఈ సెన్సెక్స్ 537 పాయింట్లు పెరిగి 37,931 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 11,407 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రైవేట్ బ్యాంక్, వా హన, ఆర్థిక, రియల్టీ, ఎఫ్ఎమ్సీజీ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరగ్గా, లోహ, ఐటీ, ఫార్మా షేర్లలో అమ్మకాలు కనిపించాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 468 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్లు చొప్పున పెరిగాయి. ప్రపంచ మార్కెట్లు పతనమైనా... అమెరికా– చైనా చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్నా, ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో మంచి లాభాలు వచ్చాయని సెంట్రమ్ బ్రోకింగ్ ఎనలిస్ట్ జగన్నా«థమ్ తునుగుంట్ల వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో జోరుగా కొనుగోళ్లు జరగడం... కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడగలదన్న అంచనాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులున్నా, ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు, బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్ పెరిగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. ఇంట్రాడేలో 608 పాయింట్లు లాభం... ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. మధ్యాహ్నం తర్వాత కొంత జోరు తగ్గినప్పటికీ, ట్రేడింగ్ చివర్లో మళ్లీ పుంజుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 608 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. డాలర్తో రూపాయి మారకం 16 పైసలు క్షీణించి 70 మార్క్కు చేరినా, ముడి చమురు ధరలు పెరిగినా, స్టాక్ సూచీలు ముందుకే దూసుకుపోయాయి. మరిన్ని విశేషాలు.... బజాజ్ ఫైనాన్స్ లాభాలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ షేర్ 6 శాతం లాభంతో రూ.3,301 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. గత క్యూ4లో ఈ కంపెనీ నికర లాభం 50 శాతం ఎగియడంతో గత రెండు రోజులుగా ఈ షేర్ లాభపడుతోంది. ఇంట్రాడేలో ఈ షేర్ ఆల్టైమ్ హై, రూ.3,315 ను తాకింది. ఈ షేరుతో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్టైమ్ హైలను తాకాయి. బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ లాంబార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మెర్క్, ఎస్ఆర్ఎఫ్, టైటాన్, యూపీఎల్, ఆవాస్ ఫైనాన్షియర్స్ ఈ జాబితాలో ఉన్నాయి. క్యూ4లో నికర లాభం 20% పెరగడంతో బజాజ్ ఆటో షేర్ 3.3% పెరిగి రూ.3,042 వద్ద ముగిసింది. ఈ షేర్ ఇంట్రాడేలో 7% ఎగసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,812 కోట్లు పెరిగి రూ.88,020 కోట్లకు చేరింది. మార్కెట్ బలంగా ఉన్న డెల్టా కార్ప్ షేర్ 22 నెలల కనిష్ట స్థాయి, రూ.155కు పడిపోయింది. చివరకు 12 శాతం క్షీణించి రూ.166 వద్ద ముగిసింది. గత ఆరు రోజుల్లో ఈ షేర్ 32 శాతం పతనమైంది. ఈ కంపెనీ భారీ మొత్తంలో జీఎస్టీని ఎగవేసిందనే వార్తలు దీనికి కారణం. లాభాలు ఎందుకు వచ్చాయంటే ఎగ్జిట్ పోల్స్... ఏడు దశల్లో సుదీర్ఘంగా జరుగుతున్న 17వ లోక్సభ ఎన్నికలు ఈ ఆదివారంతో ముగియనున్నాయి. చివరి దశ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. మోదీ సర్కారే మళ్లీ అధికారంలోకి రాగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్కు ముందు ఇన్వెస్టర్లు భారీగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ట్రేడర్లు భారీగా లాంగ్ పొజిషన్లు, షార్ట్ పొజిషన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని, అందుకే షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు భారీగా జరిగాయని విశ్లేషకులంటున్నారు. క్యూ4 ఫలితాల మెరుపులు... ఇటీవల వెలువడిన కొన్ని కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు మెరుపులు మెరిపించాయి. ఒక్క శుక్రవారం రోజే నాలుగు నిఫ్టీ కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఐఓసీ, డాక్టర్స్ రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీల ఫలితాలు అంచనాలను మించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడి కొనుగోళ్లు జోరుగా సాగాయి. హెవీ వెయిట్స్ షేర్ల ర్యాలీ సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న షేర్లు జోరుగా పెరిగాయి. హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐటీసీ, , కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్.. ఈ ఆరు షేర్లు 2–6 శాతం రేంజ్లో పెరిగాయి. సాంకేతిక అంశాలు ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో కీలకమైన 11,260 పాయింట్లపైకి నిఫ్టీ చేరడంతో కొనుగోళ్లు జోరుగా సాగాయని ఎనలిస్ట్లు పేర్కొన్నారు. ఈ వారం మొత్తం 200 పాయింట్ల రేంజ్లో కదలాడిన నిఫ్టీ శుక్రవారం 11,400 పాయింట్ల మార్క్ను మళ్లీ అందుకుంది. దీంతో నిఫ్టీ 11,500–11,550 స్థాయిని చేరొచ్చన్న అంచనాలతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. రూ.1.4 లక్షల కోట్లు ఎగసిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ.1.4 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.1.4 లక్షల కోట్లు ఎగసి రూ.146.59 లక్షల కోట్లకు చేరింది. -
దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు
దేశీ, విదేశీ సంస్థల భారీ నిధుల వరదకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల దన్నుతో సెన్సెక్స్, నిఫ్టీలు కీలక నిరోధ స్థాయిలను అధిగమించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 36,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగబాకాయి. చైనా ఉత్పత్తులపై విధించాలనుకుంటున్న సుంకాల గడువును మార్చి 1 నుంచి పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం మన మార్కెట్పై సానకూల ప్రభావం చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 342 పాయింట్లు పెరిగి 36,213 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 10,880 పాయింట్ల వద్ద ముగిశాయి. దీంతో ఈ ఏడాది సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోకి వచ్చినట్లయింది. కలసివచ్చిన షార్ట్కవరింగ్.... గత శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.631 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.839 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపారు. విదేశీ, దేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో భారీగా నిధులు గుమ్మరించడంతో సోమవారం జోరుగా కొనుగోళ్లు జరిగాయి. డాలర్తో రూపాయి మారకం ఇంట్రాడేలో 17 పైసలు బలపడడం, ఫిబ్రవరి డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం కూడా కలసివచ్చాయి. నిర్మాణంలో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లపై పన్ను రేటును జీఎస్టీ మండలి తగ్గించడం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ జోష్ను పెంచింది. లాభాల్లో ఆరంభమైన సూచీలు రోజంతా అదే జోరును చూపించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్371 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మార్కెట్ కబుర్లు ►రియల్టీ రంగానికి అనుకూలంగా జీఎస్టీ మండలి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, రియల్టీ షేర్లు నష్టపోయాయి. ఈ నిర్ణయాల వల్ల వినియోగదారులకే కా నీ, కంపెనీలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదనే అంచనాలు వెలువడ్డాయి. ట్రేడింగ్ ఆరంభంలో లాభపడ్డ రియల్టీ షేర్లు చివరకు నష్టపోయాయి ►బోనస్ ఇష్యూకు వాటాదారుల ఆమోదం లభించడం, బోనస్కు రికార్డ్ డేట్గా వచ్చే నెల 7ను నిర్ణయించడం వంటి అంశాల నేపథ్యంలో విప్రో షేర్ ఇంట్రాడేలో 4.5 శాతం లాభంతో రూ.396ను తాకింది. ఇది 19 ఏళ్ల గరిష్ట స్థాయి. చివరకు ఈ షేర్ 1.8 శాతం లాభంతో రూ.386 వద్ద ముగిసింది. ►ముంబై ఎయిర్పోర్ట్ కంపెనీలో జీవీకే కంపెనీ మరింత వాటాను పెంచుకోవడంతో జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ షేర్ ఇంట్రాడేలో 16% లాభంతో రూ.8.59ను తాకింది. చివరకు 9% లాభంతో రూ.8 వద్ద ముగిసింది. గత శుక్రవారం ఈ షేర్ 20% అప్పర్ సర్క్యూట్ను తాకిన విషయం తెలిసిందే. ►యస్ బ్యాంక్ షేర్ 3.2% లాభపడి రూ.229 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ముడి చమురు ధరలు భగ్గుమనడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ షేర్లు–బీపీసీఎల్, హెచ్పీసీఎల్ 2.4 శాతం వరకూ నష్టపోయాయి. ► రూ.5,600 కోట్ల ఎన్ఎస్ఈఎల్ స్కామ్లో మోతిలాల్ ఓస్వాల్, ఇండియా ఇన్ఫోలైన్ల కమోడిటీ విభాగాలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించాయంటూ మార్కెట్ నియంత్రణ సంస్త, సెబీ వెల్లడించడంతో సదరు సంస్థలు ఇంట్రాడేలో 5–9 శాతం రేంజ్లో నష్టపోయాయి. చివరకు మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.5 శాతం నష్టంతో రూ.603 వద్ద, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ 0.2 శాతం నష్టంతో రూ.364 వద్ద ముగిశాయి. ►జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్ దాఖలు చేయాలని ఎస్బీఐ యోచిస్తోందని వార్తలు రావడంతో జెట్ ఎయిర్వేస్ షేర్ 3.1 శాతం నష్టపోయి రూ.229 వద్ద ముగిసింది. -
బడ్జెట్ దన్ను; సెన్సెక్స్ లాంగ్ జంప్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ స్టాక్మార్కెట్పై సానుకూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ 500 పాయింట్ల వరకు లాభపడింది. 36,311 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్ సెన్సెక్స్ సూచీ ఒక దశలో 38,989 గరిష్టస్థాయిని అందుకుంది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా రెండు నెలల గరిష్టస్థాయిని అందుకుంది.140 పాయింట్లుపైగా ఎగసి 10,973 పాయింట్లకు చేరింది. కేంద్ర బడ్జెట్లో అన్ని వర్గాలకు తాయిలాలు ప్రకటించడంతో స్టాక్మార్కెట్ దూసుకుపోతోంది. అన్ని షేర్లు లాభాలబాట పట్టడంతో దలాల్ స్ట్రీట్లో సందడి వాతావరణం నెలకొంది. -
తక్షణ అవరోధశ్రేణి 36,200–36,285
జనవరి తొలివారంలో భారత్తో సహా ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ...వాటి ఇటీవలి గరిష్టస్థాయిల వద్ద పరిమితశ్రేణిలో కదిలాయి. అమెరికా–చైనా ట్రేడ్వార్ చర్చలు సానుకూలంగా ముగిసాయన్న వార్తలు కూడా మార్కెట్లను పెద్దగా ఉత్తేజపర్చలేకపోయాయి. ఇక్కడ ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్లతో పాటు ఇండస్ఇండ్ బ్యాంక్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు సైతం మార్కెట్ అంచనాలకంటే దిగువస్థాయిలోనే వున్నాయి. ఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్ ప్రకటించినందున, ఫలితాలు నిరుత్సాహపర్చినా, షేరు గరిష్టస్థాయిలోనే ట్రేడ్కావొచ్చు. అయితే ఇన్ఫోసిస్, ఐటీసీ, కొన్ని కార్పొరేట్ బ్యాంకులు మినహా మిగిలిన హెవీవెయిట్ షేర్లన్నీ ముందడుగు వేయలేకపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనపర్చే అంశం. సంవత్సరాంతపు సెలవుల తర్వాత సాధారణంగా జనవరి రెండోవారం నుంచి మన మార్కెట్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ ఇన్వెస్టర్లు, ఫెడ్ తాజా ప్రకటనతో భారత్ మార్కెట్లో పెట్టుబడుల్ని పునఃప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్ ట్రెండ్ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు.. జనవరి 11తో ముగిసిన వారంలో 36,270–35,750 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 315 పాయింట్ల లాభంతో 36,010 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే సెన్సెక్స్కు 36,200–36,285 శ్రేణి గట్టిగా నిరోధించవచ్చు. గతవారంలో పలుదఫాలు అవరోధం కలిగించిన ఈ శ్రేణిపైన ముగిస్తే 36,285–36,560 పాయింట్ల నిరోధశ్రేణిని అధిగమించడం సెన్సెక్స్ భవిష్యత్ ట్రెండ్కు కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్ నిస్తేజంగా ప్రారంభమైనా 35750 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తేక్రమేపీ 35,380 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ లోపున ముగిస్తే తిరిగి 35000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధశ్రేణి 10830–10,870 గతవారం 10,870– 10,733 పాయింట్ల మధ్య పరిమితశ్రేణిలో ఊగిసలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 68 పాయింట్ల లాభంతో 10,795 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 10830–10,870 శ్రేణి తొలుత తీవ్ర నిరోధాన్ని కల్పించవచ్చు. అటుపైన కీలక నిరోధ శ్రేణి 10925–10,985 పాయింట్లు. గత మూడువారాలుగా పలుదఫాలు ఈ శ్రేణి అవరోధాన్ని కల్గించినందున, ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ వారం పైన సూచించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,730 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. గత వారంరోజులుగా మద్దతునిచ్చిన ఈ స్థాయిలోపున ముగిస్తే 10,630 పాయింట్ల వద్ద క్రమేపీ తగ్గవచ్చు. ఈ స్థాయి దిగువన ముగిస్తే 10,535 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
35,540 దిగువన డౌన్ట్రెండ్
మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్డీఏ ఓటమిచెందడం, రిజర్వుబ్యాంక్ గవర్నర్ ఉర్జిత్పటేల్ రాజీనామా, ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వంటి పలు ప్రతికూలాంశాల నడుమ వరుసగా ఏడురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్ మార్కెట్...శుక్రవారం అంతర్జాతీయ ట్రెండ్కు తలొగ్గింది. అమెరికా మార్కెట్లయితే ఊపిరి పీల్చుకోకుండా పడుతున్నాయి. జపాన్లో సైతం ఇదే తంతు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ పరిమాణం రెట్టింపయ్యింది. అక్కడ ఇదే ట్రెండ్ కొనసాగితే ఇండియాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ తీవ్రమైన బేర్కక్ష్యలోకి మళ్లే ప్రమాదం వుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ రెండోవారం నుంచి విదేశీ, స్వదేశీ ఫండ్స్ మన మార్కెట్లో తీసుకున్న భారీ లాంగ్ పొజిషన్లను జనవరికి రోలోవర్ చేస్తారా లేదా వారి పొజిషన్లను పూర్తిగా ఆఫ్లోడ్ చేస్తారా అనే అంశం ఇక్కడ కీలకం. సెన్సెక్స్ సాంకేతికాలు... డిసెంబర్ 21తో ముగిసిన వారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 35,800 మద్దతును పరిరక్షించుకుని వేగంగా 36,555 గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం భారీ పతనాన్ని చవిచూసి 35,695 కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 221 పాయింట్ల నష్టంతో 35,742 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్కు 200 రోజుల చలనసగటు రేఖ (200 డీఎంఏ) కదులుతున్న 35,540 పాయింట్ల స్థాయి కీలకం. ఈ స్థాయి దిగువన సోమవారం గ్యాప్డౌన్తో మార్కెట్ మొదలైతే వేగంగా 35,445 పాయింట్ల స్థాయికి పడిపోవొచ్చు. ఈ లోపున 50 డీఎంఏ రేఖ చలిస్తున్న 35,175 పాయింట్ల వరకూ సెన్సెక్స్కు సాంకేతిక మద్దతు ఏదీ లేదు. ఈ లోపున ముగిస్తే 34,420 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 36,050 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 36,200 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఆపైన ముగింపు..సెన్సెక్స్ను 36,480 పాయింట్ల స్థాయికి చేర్చవచ్చు. 10,765 దిగువన నిఫ్టీ బలహీనం గతవారం ప్రథమార్ధంలో 10,985 పాయింట్ల వరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 10,738 పాయింట్ల స్థాయికి పతనమయ్యింది. చివరకు అంతక్రితంవారంకంటే 51 పాయింట్ల లాభంతో 10,754 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 200 డీఎంఏ రేఖ 10,765 పాయింట్ల వద్ద కదులుతున్నది. ఈ రేఖ ఎగువకు గత నెలరోజుల్లో రెండోదఫా నిఫ్టీ చేరినప్పటికీ, ఈ రెండు సందర్భాల్లో ఆపైన నిలదొక్కుకోలేకపోయింది. ఈ కీలక స్థాయి దిగువన నిఫ్టీ తిరిగి డౌన్ట్రెండ్లోకి జారుకునే ప్రమాదం వుంది. ఈ స్థాయి దిగువన సోమవారం నిఫ్టీ మొదలైతే వేగంగా 10,650 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున 50 డీఎంఏ రేఖ సంచరిస్తున్న 10,565 పాయింట్ల వద్దకు పతనం కావచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ 10,765 పాయింట్ల స్థాయి ఎగువన స్థిరపడితే 10,820 వరకూ పెరగవచ్చు. అటుపై 10,880 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఆపైన కీలక అవరోధస్థాయి 10,965 పాయింట్లు. -
భారీగా పతనమైన స్టాక్మార్కెట్లు
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్గా పరిగణిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్ల నష్టంతో 35,119 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 10,537 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠతో పాటు రూపాయి క్షీణత, ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా-చైనాల మధ్య వర్తక ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. రిలయన్స్ ఇండస్ర్టీస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, కొటాక్ బ్యాంక్, వేదాంత, యస్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ సహా పలు షేర్లు నష్టాల బాట పట్టాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతుండగా, దేశీయ సంస్ధాగత మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.