Shane Warne
-
IPL 2025: రాయల్స్ మునుపటి వైభవం సాధిస్తుందా?
మొట్ట మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ గెలుచుకున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. ప్రపంచ ప్రఖ్యాత ఆస్ట్రేలియా స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ (Shane Warne) నాయకత్వంలో 2008లో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ 2022లో రన్నర్ అప్ గా నిలవడంతో పాటు.. మొత్తంగా ఆరుసార్లు ప్లేఆఫ్లకు చేరుకుంది. రాయల్స్ కెప్టెన్గా టీమిండియా వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (Sanju Samson) కొనసాగుతున్నాడు. 2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని రూ.18 కోట్ల భారీ ధరకు రెటైన్ చేసుకుంది.భారత్ క్రికెట్ లో అపార నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల లో ఒకడిగా 30 ఏళ్ళ ఈ కేరళ వికెట్ కీపర్ ఖ్యాతి వహించాడు. సామ్సన్ నాయకత్వం, సామర్థ్యాలపై ఉన్న అపార విశ్వాసాన్ని రాయల్స్ పునరుద్ఘాటించింది. సీజన్లోని మొదటి మ్యాచ్ నుంచే అతను పూర్తిగా ఫిట్గా, అందుబాటులో ఉండాలని ఫ్రాంచైజీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐపీల్ రెండో రోజున (మార్చి 23న) హైదరాబాద్ వేదిక గా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ తో రాయల్స్ ఈ సీజన్ లో తన టైటిల్ వేట ప్రారంభిస్తుంది.గాయం నుంచి కోలుకున్న సామ్సన్ ఇంగ్లండ్తో జరిగిన ఐదో టి20 మ్యాచ్ సందర్భంగా సామ్సన్ కుడి చూపుడు వేలు కి గాయమైంది. కొన్ని రోజుల తర్వాత అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది, రెండు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్న సామ్సన్ మళ్ళీ కోలుకున్నట్టు తెలుస్తోంది. అయితే అతను ఇంకా జట్టు శిక్షణ శిబిరంలో చేరలేదు. సంజు సామ్సన్ పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే సామ్సన్ బ్యాటింగ్ ఫిట్నెస్ పరీక్షలో విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, వికెట్ కీపింగ్ విధులను తిరిగి ప్రారంభించడానికి ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది. అయితే రాయల్స్ జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నందున వికెట్ కీపింగ్ బాధ్యతలు అతనికి అప్పగించే అవకాశముంది. బౌలింగ్ లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పునరాగమనం తో రాయల్స్ కొత్త ఉత్సాహం తో ఉంది. గత సంవత్సరం చివరి దశలో తడబడిన తర్వాత, మెగా వేలంలో రాయల్స్ తమ జట్టును స్మార్ట్ కొనుగోళ్ల ద్వారా పునర్నిర్మించింది.ప్రధాన కోచ్ గా చేరిన రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంతో రాయల్స్ విధానంలో మార్పు కనిపిస్తోంది. మానసిక దృఢత్వం, వ్యూహాత్మక ఖచ్చితత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టింది. సామ్సన్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్మైర్, రియాన్ పరాగ్, మరియు ధ్రువ్ జురెల్ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నందున బ్యాటింగ్, బౌలింగ్ రెండింటినీ బలోపేతం చేయడానికి రాయల్స్ జోఫ్రా ఆర్చర్, నితీష్ రాణాతో సహా వేలంలో కీలకమైన చేర్పులను చేసింది.రాయల్స్ జట్టులో వ్యూహాత్మక మార్పులు రాయల్స్ 2025 సీజన్ కోసం జట్టులో వ్యూహాత్మక మార్పులు చేసింది. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్లను వదులుకోవడం వారి జట్టు యొక్క ప్రధాన వ్యూహంలో మార్పును సూచిస్తుంది. జోఫ్రా ఆర్చర్ను కొనుగోలు చేయడంతో బౌలింగ్ కి గణనీయమైన పదును లభించింది. ఇంకా ఫజల్హాక్ ఫరూఖీ , తుషార్ దేశ్పాండే లతో పాటు స్పిన్ విభాగంలో వానిందు హసరంగా, మహేష్ తీక్షణ ఉన్నందున మిడిల్ ఓవర్ల లలో వైవిధ్యం, పొదుపుగా బౌలింగ్ చేసే అవకాశముంది. నితీష్ రాణా చేరికతో బ్యాటింగ్ యూనిట్ బలోపేతమయ్యింది. కోల్కతా నైట్ రైడర్స్ తరపున నిలకడగా రాణించిన రాణా బ్యాటింగ్ ని బలోపేతం చేస్తాడనడంలో సందేహం లేదు. ఇంకా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కొనుగోలు ఫ్రాంఛైజీ దీర్ఘకాలిక దృక్పథాన్ని నొక్కి చెబుతుంది.రాయల్స్ ప్రధాన ఆటగాళ్లు:సంజు సామ్సన్కెప్టెన్గా, అత్యంత నమ్మకమైన బ్యాటర్గా, సామ్సన్ ముందు నుండి నాయకత్వం వహించే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఈ సీజన్లో జోస్ బట్లర్ లేనందున సామ్సన్ పై బాధ్యత మరింత పెరిగే అవకాశముంది. జట్టుకి స్థిరత్వాన్నివ్వడం, క్లిష్టమైన సమయాల్లో ఆదుకోవడం ఇప్పుడు సామ్సన్ పైనే ఉంటుంది.యశస్వి జైస్వాల్అపార నైపుణ్యం ఉన్న యువ బ్యాటర్ జైస్వాల్ ఇటీవలి ఫామ్ అంత నిలకడగా లేనందున, భారత పరిమిత ఓవర్ల జట్టులోకి మళ్ళీ రావడానికి ఐపీఎల్ అతనికి మరో అవకాశం కల్పిస్తోంది.నితీష్ రాణాకోల్కతా నైట్ రైడర్స్ నుండి రాయల్స్ కి మారడం రాణా ఐపీఎల్ కెరీర్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ అతని బహుముఖ ప్రజ్ఞ రాజస్థాన్కు గట్టి బలాన్నిస్తోంది.జోఫ్రా ఆర్చర్గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్ తిరిగి రావడంతో రాజస్థాన్ బౌలింగ్ కు మళ్ళీ పదును చేకూరింది. వ్యక్తిగతంగా సంవత్సరాల గాయాల వైఫల్యాల తర్వాత, ఐపీఎల్ 2025 ఇంగ్లాండ్ పేసర్కు తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు అవకాశాన్ని కల్పిస్తుండంలో సందేహం లేదు.రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టుసంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, వనిందు హసరంగా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, తుషార్ దేశ్పాండే, శుభమ్ దూబే, ఎఫ్ యుధ్వీర్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.చదవండి: టీ20, వన్డేలు చాలు.. టెస్టుల్లో ఆడలేను.. కారణం ఇదే: వరుణ్ చక్రవర్తి -
అశ్విన్ ద గ్రేట్.. మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ..!
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్బై చెప్పాడు. అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 765 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్లతో పోలిస్తే టెస్ట్ క్రికెట్ ఎక్కువగా ఆడిన యాష్.. ఒక్క సుదీర్ఘ ఫార్మాట్లోనే 537 వికెట్లు తీశాడు. అశ్విన్ టెస్ట్ల్లో 37 సార్లు ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ ఏడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800) కొనసాగుతున్నాడు. మురళీ తర్వాతి స్థానాల్లో షేన్ వార్న్ (708), ఆండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్గ్రాత్ (563) ఉన్నారు.మురళీథరన్, షేన్ వార్న్ కంటే ఎక్కువ సార్లు..!టెస్ట్ల్లో మురళీథరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ స్పిన్నర్లు అశ్విన్ కంటే ఎక్కువ వికెట్లు తీశారు. వికెట్ల సంఖ్యా పరంగా లేదా ఇతరత్రా రికార్డుల విషయంలో వీరంతా అశ్విన్ కంటే మెరుగ్గా ఉన్నా, ఒక్క విషయంలో మాత్రం అశ్విన్ పై ముగ్గురిని తలదన్నాడు.టెస్ట్ సిరీస్ల్లో అత్యధిక సార్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత అశ్విన్కే దక్కుతుంది. అశ్విన్ తన కెరీర్లో ఏడు సార్లు టెస్ట్ సిరీస్ల్లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీయగా.. షేన్ వార్న్, మురళీథరన్ ఆరు సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అశ్విన్ 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరు సిరీస్ల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలవడం విశేషం. అశ్విన తన కెరీర్లో మొత్తం 12 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్నాడు. -
షేన్ వార్న్ నా హీరో.. ఇప్పటికీ నేను బాధపడుతునే ఉన్నా: కుల్దీప్
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ శుక్రవారం ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ని సందర్శించాడు. ఈ సందర్భంగా ఏంసీజీలో ఏర్పాటు చేసిన దివంగత ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ విగ్రహం ముందు కుల్దీప్ నివాళులర్పించాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను కుల్దీప్ తన ఇన్స్టాగ్రామ్లో ఖాతాలో షేర్ చేశాడు. షేన్ వార్న్ బౌలింగ్లో ఎప్పటికి ఒక అద్భుతం అంటూ కుల్దీప్ క్యాప్షన్గా ఇచ్చాడు. అదే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడిన కుల్దీప్.. వార్న్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు."షేన్ వార్న్ నా ఆరాధ్య క్రికెటర్. షేన్ నా హీరో. అతడితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. వార్నీని గుర్తుచేసుకునే ప్రతీసారి నేను భావోద్వేగానికి లోనవుతాను. నా కుటుంబంలోని ఒకరిని నేను కోల్పోయినట్లు ఇప్పటికీ అనిపిస్తుందని" కుల్దీప్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పేర్కొన్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అనంతరం అతడు దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమ్ Aకు కుల్దీప్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆ తర్వాత వరుస టెస్టు సిరీస్లతో కుల్దీప్ బీజీబీజీగా గడపనున్నాడు. కాగా టీ20 వరల్డ్కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో కుల్దీప్ది కీలక పాత్ర. -
బాల్ ఆఫ్ ద సెంచరీ.. బ్యాటర్ ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
క్రికెట్కు సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో ఓ స్పిన్ బౌలర్ నమ్మశక్యంకాని రీతిలో బంతిని స్పిన్ చేసి బ్యాటర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కువైట్ పేరు గల జెర్సీతో కనిపించిన సదరు బౌలర్ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ శైలిలో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. pic.twitter.com/TipPaTbbOS — Out Of Context Cricket (@GemsOfCricket) February 12, 2024 ఆఫ్ స్టంప్ ఆవల పడిన ఫుల్టాస్ బంతి నమ్మశక్యంకాని రీతిలో లెగ్ స్టంప్ను గిరాటు వేసింది. బంతి స్పిన్ అయిన విధానం చూసి బ్యాటర్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎలా స్పందించాలో తెలియక గమ్మున పెవిలియన్ బాటపట్టాడు. ఈ వీడియోని చూసిన వారంతా షేన్ వార్న్ బాల్ ఆఫ్ ద సెంచరీని మించిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను బట్టి చూస్తే ఈ మ్యాచ్ ఏదో దేశవాలీ టోర్నీలో జరిగనట్లుగా తెలుస్తుంది. Rest in Peace to the man who gave us the Ball of the Century. There will never be another like Shane Warne. pic.twitter.com/ddFaUoiTGD — Derek Alberts (@derekalberts1) March 4, 2022 కాగా, 1993లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో షేన్ వార్న్.. మైక్ గ్యాటింగ్ను నమ్మశక్యంకాని రీతిలో క్లీన్ బౌల్డ్ చేశాడు. వార్న్ వేసిన లెగ్ స్పిన్ బంతిని అంచనా వేయలేక గ్యాటింగ్ తికమకపడిపోయాడు. ఎక్కడో లెగ్ స్టంప్ అవతల పడిన బంతి గింగిరాలు తిరుగుతూ గ్యాటింగ్ డిఫెన్స్ను తప్పించుకుని ఆఫ్ స్టంప్ను తాకింది. ఈ బంతిని బాల్ ఆఫ్ ద సెంచరీగా పిలుస్తారు. ఇదిలా ఉంటే, దివంగత షేన్ వార్న్ ఇలాంటి బంతులను చాలా సందర్భాల్లో సంధించిన విషయం తెలిసిందే. 90వ దశకంలో షేన్ వార్న్ స్పిన్ మాయాజాలానికి బ్యాటర్లు బెంబేలెత్తిపోయేవారు. వార్న్ సంధించే బంతులను ఎలా ఆడాలో తెలియక తికమకపడిపోయేవారు. ఏ బంతి ఎక్కడ ల్యాండై ఎలా టర్న్ అవుతుందో అర్ధంకాక జట్టు పీక్కునేవారు. వార్న్ టెస్ట్ క్రికెట్లో రెండో అత్యధిక వికెట్ టేకర్గా ఉన్నాడు. వార్న్ 2022లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. -
క్యూరేటర్ నుంచి ఆసీస్ స్పిన్ లెజెండ్గా.. ఏకంగా షేన్ వార్న్ సరసన!
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానం.. తర్వాతి మ్యాచ్ కోసం క్యురేటర్ల బృందం పిచ్ తయారు చేస్తోంది. అందులో ఒక 24 ఏళ్ల కుర్రాడు అమితోత్సాహంతో అందరికంటే వేగంగా చకచకా పని పూర్తి చేస్తున్నాడు. ముఖ్యంగా పిచ్ చివర్లో స్టంప్స్ వద్ద స్పిన్ బంతి టర్నింగ్కు సంబంధించి సహచరులకు ప్రత్యేక సూచనలు ఇస్తూ వాటరింగ్ చేయిస్తున్నాడు. అతను కొన్నాళ్ల క్రితమే ఆ మైదానానికి బదిలీపై వచ్చాడు. అంతకు ముందు నాలుగేళ్ల పాటు కాన్బెర్రాలోని మనుకా ఓవల్ గ్రౌండ్లోనూ ఇదే పని చేశాడు. పిచ్ తయారీపై బేసిక్స్ నేర్చుకొని అక్కడే పూర్తి స్థాయిలో శిక్షణ కూడా పొందాడు. అయితే క్యురేటర్గా అనుభవం మాత్రమే కాదు ఒక ఆటగాడి తరహాలో అతనికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ అడిలైడ్లోని కోచ్లను ఆకర్షించింది. అనంతరం జట్లు ప్రాక్టీస్కు సిద్ధమైనప్పుడు నెట్ బౌలర్లు తక్కువ పడటంతో నువ్వు బౌలింగ్ చేయగలవా అని కోచ్ డారెన్ బెరీ ఈ కుర్రాడిని అడిగాడు. కచ్చితంగా అని బదులిచ్చిన అతను వెంటనే బంతితో బరిలోకి దిగిపోయాడు. అతని స్పిన్ బౌలింగ్ శైలి, టర్నింగ్ రాబడుతున్న తీరు కోచ్ను అమితాశ్చర్యానికి గురి చేశాయి. అతని వివరాలను తెలుసుకోగా.. తాను అప్పటికే చాలా చోట్ల క్రికెట్ ఆడానని, అయితే అవేవీ గుర్తింపు పొందిన స్థాయిలో కాదని ఆ బౌలర్ చెప్పాడు. దాంతో నీకు తగిన అవకాశం కల్పిస్తానన్న కోచ్ బెరీ మాట తప్పలేదు. అతని ప్రతిభ గురించి అందరికీ చెప్పి అడిలైడ్ టి20 టీమ్ రెడ్బ్యాక్స్లోకి ఎంపిక చేశాడు. అంతే.. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తొలి అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని సత్తా చాటడంతో వరుసగా మ్యాచ్లు దక్కాయి. ఆపై ఫార్మాట్ మారి ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడే అవకాశమూ లభించింది. దానిని అందిపుచ్చుకొని ఆ బౌలర్ ఉవ్వెత్తున ఎగశాడు. ఏడు నెలల వ్యవధిలోనే జాతీయ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పుష్కరకాలంగా ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్న ఆ బౌలర్ పేరే నాథన్ లయన్. క్యురేటర్గా మొదలై టెస్టుల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందడం వరకు ఆఫ్స్పిన్నర్ లయన్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. స్టూవర్ట్ మెక్గిల్, మైకేల్ బీర్, డోహర్తి, క్రేజా, మెక్గెయిన్, హారిట్జ్, స్టీవ్ స్మిత్, హాగ్, హాలండ్, వైట్, కాసన్.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మందితో కూడిన జట్టు ఇది. ఆల్టైమ్ గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ రిటైర్మెంట్ తర్వాత ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అన్వేషణ సుదీర్ఘంగా సాగింది. ఆ ప్రయత్నంలో భాగంగా వారు ప్రయత్నించిన 11 మంది స్పిన్నర్ల పేర్లు ఇవి. కానీ ఇందులో ఏ ఒక్కరూ ప్రతిభపరంగా వార్న్ దరిదాపుల్లోకి రావడం అటుంచి.. కనీసం పోలికకు కూడా అర్హత లేని స్థాయి వారిది. అందుకే ఎన్ని అవకాశాలు కల్పించినా ప్రతిభను చూపించలేక అతి తక్కువ సమయంలోనే కనుమరుగైపోయారు. వార్న్ స్థాయిలో కాకపోయినా, కనీసం ఉపఖండంలో సిరీస్లు ఆడేందుకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు తగినట్లుగా కొంతయినా ప్రభావం చూపించేవాడు ఉంటే చాలని ఆసీస్ క్రికెట్ భావించినా.. అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఇక స్పిన్నర్ల వేటను మానేసి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచవ్యాప్తంగా ఏ మైదానంలో ఆడినా తమ పేసర్ల బలాన్ని నమ్ముకుంటూ బరిలోకి దిగుతూ వచ్చింది. అలాంటి సమయంలో నాథన్ లయన్ వచ్చాడు. ఎలాంటి గందరగోళం లేకుండా సంప్రదాయ స్పిన్ బౌలింగ్, క్లాసికల్గా బంతిని ఫ్లయిట్ చేయడానికి ఇష్టపడే స్పిన్నర్గా లయన్ వెలుగులోకి వచ్చాడు. ఇలాంటి స్పిన్నర్లు సాధారణంగా ఉపఖండంలోనే గుర్తింపు దక్కించుకుంటారు. కానీ ఆసీస్కు లయన్ రూపంలో అలాంటి ఆటగాడు దక్కాడు. అందుకే వారు అతడిని కళ్లకు అద్దుకొని జట్టులోకి తీసుకున్నాడు. లయన్ కూడా తన ఎంపికకు న్యాయం చేస్తూ వారిని ఎప్పుడూ నిరాశపరచలేదు. అటు ఉపఖండం పిచ్లపై కూడా సత్తా చాటడంతో పాటు స్పిన్ను ఏమాత్రం అనుకూలించని ఆసీస్ మైదానాల్లోనూ ప్రత్యర్థులపై చెలరేగి తాను లేకుండా ఆసీస్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడలేని స్థాయికి చేరుకున్నాడు. వార్న్కు సరైన వారసుడినని నిరూపించుకుంటూ 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఏకంగా 500 టెస్టు వికెట్లతో ఇప్పుడు శిఖరాన నిలిచాడు లయన్. అలా మొదలైంది.. 2011, సెప్టెంబర్ 1.. గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు. లయన్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్కు దిగాడు. రౌండ్ ద వికెట్గా వచ్చి బంతిని సంధించాడు. గ్రిప్, ఫ్లయిట్, టర్న్, బౌన్స్.. అనూహ్యంగా వచ్చిన బంతిని ఆడలేక లంక దిగ్గజం సంగక్కర గందరగోళానికి గురయ్యాడు. బ్యాట్ను తాకిన బంతి స్లిప్స్లో కెప్టెన్ క్లార్క్ చేతుల్లో పడింది. అంతే.. అటు లయన్తో పాటు ఇటు ఆసీస్ బృందంలో సంబరాలు. టెస్టు క్రికెట్లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన అత్యంత అరుదైన జాబితాలో లయన్కు చోటు లభించింది. ఈ మ్యాచ్లో ఆరు వికెట్లతో అతనికి ఘనారంభం దొరికింది. అద్భుతంగా మొదలైన కెరీర్ ఆపై మరిన్ని ఘనతల దిశగా సాగింది. నాలుగేళ్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా తరఫున వికెట్లపరంగా అత్యుత్తమ ఆఫ్స్పిన్నర్గా లయన్ గుర్తింపు తెచ్చేసుకున్నాడు. యాషెస్తో మేలిమలుపు.. ఆటలో ఎంత సత్తా ఉన్నా, అద్భుతాలు చేసే నైపుణ్యం ఉన్నా ఆటగాళ్లకు తగిన అవకాశం, సరైన వేదిక ఎంతో ముఖ్యం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లకు సంబంధించి యాషెస్ సిరీస్ అలాంటిదే. ఈ చిరకాల ప్రత్యర్థుల జట్లలో ఎంతో మంది ఆటగాళ్లను యాషెస్ సిరీస్ హీరోలను చేస్తే, మరెంతో మందిని జీరోలను చేస్తుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటున్న క్రమంలో 2011 యాషెస్ సిరీస్ కోసం లయన్కు చాన్స్ లభించింది. ఎంతో ఉత్సాహంతో తన టాలెంట్ చూపించేందుకు లయన్ సిద్ధం కాగా, వేర్వేరు పరిస్థితులను కారణాలుగా చూపుతూ టీమ్ మేనేజ్మెంట్ తొలి రెండు టెస్టుల్లో అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది. అయితే తర్వాతి మూడు టెస్టుల్లో అవకాశం సాధించి కీలక దశలో తొమ్మిది వికెట్లు పడగొట్టిన లయన్ రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ను కట్టడి చేసి ఆసీస్ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే జరిగిన రిటర్న్ యాషెస్ సిరీస్తో లయన్ విలువేమిటో ఆసీస్ మేనేజ్మెంట్కు బాగా తెలిసొచ్చింది. సొంత గడ్డపై 19 వికెట్లతో సత్తా చాటిన లయన్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఆ వెంటనే దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడా తన స్పిన్ పదును చూపించడంలో అతను సఫలమయ్యాడు. ఆ తర్వాత 2022లో గాయం కారణంగా ఒక మ్యాచ్ దూరమయ్యే వరకు లయన్ లేకుండా ఆస్ట్రేలియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదంటే అతిశయోక్తి కాదు. ఆసీస్ దిగ్గజంగా ఎదిగి.. షేన్వార్న్ తర్వాత ఆస్ట్రేలియా అత్యుత్తమ స్పిన్నర్గా లయన్కు ఎప్పుడో గుర్తింపు దక్కింది. స్పిన్నర్లకు వికెట్లే దక్కవని భావించే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజీలండ్లాంటి దేశాల్లో కూడా అతను పెద్ద సంఖ్యలో వికెట్లు పడగొట్టాడు. కానీ ఏదో అసంతృప్తి. అతడిని ప్రత్యేకంగా నిలబెట్టే మరి కొన్ని ప్రదర్శనలు కావాలి. ఒక స్పిన్నర్ గుర్తింపు దక్కించుకునేందుకు భారత్కంటే సరైన వేదిక ఏముంటుంది. భారత గడ్డపై సత్తా చాటి స్పిన్కు అనుకూలించే మైదానాలే అయినా భారతీయేతర స్పిన్నర్లు ఎవరూ ఇక్కడ తమదైన ముద్ర వేయలేకపోయారు. ఇక్కడా రాణిస్తే అతని కీర్తి రెట్టింపవుతుంది. లయన్ సరిగ్గా అదే చేసి చూపించాడు. భారత గడ్డపై ఆడిన 11 టెస్టుల్లో కేవలం 27.35 సగటుతో 56 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన విదేశీ బౌలర్గా నిలిచాడు. అతని కెరీర్ సగటు (30.85) కంటే ఇది తక్కువ కావడం విశేషం. షేన్ వార్న్ సరసన లయన్ కెరీర్లో మూడు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (8/50, 8/64, 7/94) భారత దేశంలోనే వచ్చాయి. లయన్ సాధించిన ఈ తొలి 8 వికెట్ల ప్రదర్శనకు బెంగళూరు వేదికైంది. సొంత గడ్డపై కంటే విదేశాల్లోనే ఎక్కువ వికెట్లు (258) సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో లయన్ కూడా ఉన్నాడు. కాగా స్వదేశంలో ఇటీవల పాకిస్తాన్ మూడో టెస్టు(2024) సందర్భంగా 250 వికెట్ల మైలురాయి అందుకుని షేన్ వార్న్ సరసన నిలిచాడు లయన్. ఆసీస్ ఓడిన మ్యాచ్లలో తీసిన వికెట్లకంటే (138) ఆ జట్టు గెలిచిన మ్యాచ్లలో అతను పడగొట్టిన వికెట్లు (301) అతని విలువను చూపిస్తూ దిగ్గజ స్థాయిని అందించాయి. ఆస్ట్రేలియా జట్టు అవసరాలు, కూర్పు కారణంగా లయన్ వన్డే కెరీర్ 29 మ్యాచ్లకే పరిమితం అయినా.. టెస్టుల్లో అతని కీర్తి శాశ్వతం. 36 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్తో చెలరేగుతున్న లయన్ టెస్టు క్రికెట్లో మున్ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయం. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్ బతికుంటే సంతోషించేవాడు
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుటెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఆసీస్ రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇక రెండోటెస్టు ఇరుజట్ల మధ్య జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది. అయితే ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఆల్రౌండర్ మొయిన్ అలీ అంతగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు రెండో ఇన్నింగ్స్లో అలీ గాయపడ్డాడు. దీంతో లార్డ్స్ టెస్టుకు మొయిన్ అలీ దూరమయ్యాడు. అయితే అతని స్థానంలో ఎవరు ఊహించని రీతిలో 18 ఏళ్ల కుర్రాడికి ఈసీబీ అవకాశం ఇచ్చింది.లెగ్ స్పిన్నర్ అయిన 18 ఏళ్ల రిహాన్ అహ్మద్ను మొయిన్ అలీకి రీప్లేస్గా తీసుకోవడం ఆసక్తి కలిగించింది. అయితే ఇదే రిహాన్ అహ్మద్కు గతంలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ షేక్హ్యాండ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. రిహాన్ 13 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గ్రౌండ్లో బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. అతని బౌలింగ్ను నిశితంగా పరిశీలించిన షేన్ వార్న్.. కాసేపటికి అతని దగ్గరికి వచ్చి.. ''నిజంగా సూపర్గా బౌలింగ్ చేస్తున్నావ్. నేను అప్పటినుంచి నిన్ను గమనిస్తున్నా. త్వరలోనే నీ గురించి కామెంట్ చేస్తానేమో. 15 ఏళ్ల వయసులోనే నువ్వు ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.. అంతేకాదు చిన్న వయసులోనే ఇంగ్లండ్ జట్టులో చోటు సంపాదిస్తావు'' అని చెప్పుకొచ్చాడు. వార్న్ ఆ మాటలు ఏ శుభ ముహుర్తానా అన్నాడో తెలియదు కానీ అదే ఇప్పుడు నిజమయ్యింది. మొయిన్ అలీ స్థానంలో ఎంపికవడం.. అదీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సందర్భంగా ఇది జరగడం రిహాన్ అహ్మద్ది అదృష్టం అని చెప్పొచ్చు. ఒకవేళ రెండో టెస్టులో అవకాశం లభించి మంచి ప్రదర్శన ఇస్తే మాత్రం ఇంగ్లండ్ జట్టులో శాశ్వత స్పిన్నర్గా పాతుకుపోయే అవకాశం రావొచ్చు. ఇక రిహాన్ అహ్మద్ తన ఎంపికపై స్పందిస్తూ.. ''ఏదో ఒకరోజు ఇంగ్లండ్కు ఆడుతానని తెలుసు.. కానీ ఇలా ఎంపికవుతానని ఊహించలేదు. సరిగ్గా ఐదేళ్ల క్రితం దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నన్ను ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు ఇవాళ నిజమయ్యాయి. వార్న్ బతికి ఉంటే తప్పకుండా సంతోషించేవాడు'' అంటూ పేర్కొన్నాడు. The King Shane Warne knew. Rehan Ahmed. pic.twitter.com/pCl6oaXkk3 — M (@anngrypakiistan) June 23, 2023 చదవండి: 'రంజీలెందుకు ఆడించడం.. ఐపీఎల్తోనే కానిచ్చేయండి!' -
వీడిన మిస్టరీ.. వార్న్ ఆకస్మిక మరణానికి కారణం అదేనా!
ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ గతేడాది మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షేన్ వార్న్ గతేడాది థాయ్లాండ్ వెకేషన్లో ఉన్నప్పుడు విల్లాలోనే గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణం అప్పట్లో మిస్టరీగా ఉండిపోయింది. పోస్టుమార్టం రిపోర్టు పరిశీలించిన వైద్యులు వార్న్ గుండెపోటు వల్ల మరణించాడని ద్రువీకరించారు. ఇక వార్న్ మరణం వెనుక ఉన్న మిస్టరీ తాజాగా వీడినట్లు తెలుస్తోంది. వార్న్ మరణానికి కారణం గుండెపోటు అయినప్పటికి పరోక్షంగా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడమేనని భారత సంతతికి చెందిన డాక్టర్ ఆసీమ్ మల్హోత్రా తాజాగా మంగళవారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన లండన్లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్గా పని చేస్తున్నారు. డాక్టర్ ఆసీమ్ మల్హోత్రాతో పాటు ఆస్ట్రేలియా మెడికల్ ప్రొఫెషనల్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ క్రిస్ నిల్ షేన్ వార్న్ మరణం వెనుక ఉన్న కారణంపై రీసెర్చీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ''వార్న్ మరణించడానికి తొమ్మిది నెలల ముందు కోవిడ్ వ్యాక్సిన్ అయిన పీ-ఫైజర్(PFizer mRNA) వ్యాక్సిన్ను రెండు డోసులు తీసుకున్నాడు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వార్న్ తన ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకపోగా.. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడంతో పాటు స్మోకింగ్ చేసినట్లు తేలింది. దీనివల్ల వ్యాక్సిన్ ప్రభావం మందగించింది. అందువల్ల గుండెల్లో రక్తనాళాలు మూసుకుపోయాయి. దీనివల్లే అతను కార్డియాక్ అరెస్టుకు గురయ్యి చనిపోయాడు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు కూడా ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అతని బాడీలో బయోమెకానిజమ్ సరిగ్గా లేదు. ఇది కూడా వార్న్ మరణానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ నిబంధనలు సరిగ్గా పాటించి ఉంటే మాత్రం వార్న్ చనిపోయే అవకాశాలు తక్కువగా ఉండేవని'' అభిప్రాయపడ్డారు. కాగా టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఈ స్పిన్ మాంత్రికుడు 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 194 వన్డేల్లో 293 వికెట్లు.. ఓవరాల్గా వెయ్యి వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం. చదవండి: #ShaneWarne: షేన్ వార్న్ బయోపిక్.. శృంగార సన్నివేశం చేస్తూ ఆస్పత్రిపాలు -
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్ లో ఏం జరిగిందో చూడండి
-
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్లో ఏం జరిగిందో చూడండి..!
-
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు!
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంస్ ధోని ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్గా ధోని నిలిచాడు. ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన తొలి మ్యాచ్లో సీఎస్కే సారథిగా బరిలోకి దిగిన ధోని ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ధోని 41 ఏళ్ల 267 రోజుల వయస్సులో ఈ ఘనత నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు దివంగత ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ పేరిట ఉండేది. ఐపీఎల్-2011 సీజన్లో 41 ఏళ్ల 249 వయస్సులో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా షేన్ వార్న్ వ్యవహరించారు. తాజా మ్యాచ్తో వార్న్ 12 ఏళ్ల రికార్డును మిస్టర్ కూల్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి మ్యాచ్లో సీఎస్కేకు నిరాశ ఎదురైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 5వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్మన్ గిల్ (63) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ 3 బంతుల్లో 10 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చదవండి: GT Vs CSK: చెన్నై పేసర్ అరుదైన ఘనత.. టోర్నీ చరిత్రలోనే మొదటిసారి ఇలా! గుజరాత్ కూడా.. Not bad for a 41 year old who hasn’t picked up a bat since last May. #dhoni #ipl2023 pic.twitter.com/QMdvWhwOJp — simon hughes (@theanalyst) March 31, 2023 -
షేన్ వార్న్ పూనాడా ఏంది కుల్దీప్, అంతలా తిప్పేశావు..?
చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మహ్మద్ సిరాజ్ (7-1-37-2), అక్షర్ పటేల్ (8-0-57-2), హార్ధిక్ పాండ్యా (8-0-44-3), కుల్దీప్ యాదవ్ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కానప్పటికీ టీమిండియా ముందు రీజనబుల్ టార్గెట్ను ఉంచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మినహా (0) జట్టులో ప్రతి ఒక్కరు రెండంకెల స్కోర్ చేశారు. ట్రవిస్ హెడ్ (33), మిచెల్ మార్ష్ (47), డేవిడ్ వార్నర్ (23), లబూషేన్ (28), అలెక్స్ క్యారీ (38), స్టోయినిస్ (25), సీన్ అబాట్ (26), అస్టన్ అగర్ (17), స్టార్క్ (10), జంపా (10 నాటౌట్) తమకు లభించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక భారీ స్కోర్లు చేయలేకపోయారు. Peach of a Delivery by Kuldeep Yadav to dismiss Alex Carey 🔥pic.twitter.com/9vxNV4fJ81 — Kriti Singh (@kritiitweets) March 22, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్.. అలెక్స్ క్యారీని క్లీన్బౌల్డ్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. తొలి బంతి నుంచే గింగిరాలు తిరిగే బంతులతో ఆసీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన కుల్దీప్.. 39వ ఓవర్ తొలి బంతికి స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ పునాడా అని డౌట్ వచ్చేలా బంతిని మెలికలు తిప్పి క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు. బంతి అంతలా టర్న్ అవుతుందని ఊహించని క్యారీ, బౌల్డ్ అయ్యాక పెట్టిన ఎక్స్ప్రెషన్ ప్రస్తుతం వైరలవతోంది. 10 years ago today !!! This is one of my favourite deliveries.... Thanks boys.... pic.twitter.com/MXGlDNVHTV — Shane Warne (@ShaneWarne) July 6, 2015 వాస్తవానికి కుల్దీప్ కూడా ఆ బంతి అంతలా టర్న్ అవుతుందని ఊహించి ఉండడు. లెగ్ స్టంప్ అవల పడ్డ బంతి ఏకంగా హాఫ్ స్టంప్ను గిరాటు వేయడంతో బ్యాటర్తో పాటు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. ఈ తరహా బంతులు ఎక్కువగా లెజెండరీ షేన్ వార్న్ వేయడం చూశాం. తాజాగా కుల్దీప్ అలాంటి బంతి వేయడంతో ఇతనికి షేన్ వార్న్ ఏమైనా పూనాడా అని నెటిజన్లు అనుకుంటున్నారు. కుల్దీప్ కూడా మంచి టర్నరే అయినప్పటికీ, బంతి ఇంతలా టర్న్ అయిన దాఖలాలు లేవు. కుల్దీప్ మ్యాజిక్ డెలివరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. -
నిన్ను చాలా మిస్ అవుతున్నా.. స్వర్గంలో నువ్వు..: సచిన్ భావోద్వేగం
Shane Warne Death Anniversary- Sachin Tendulkar Emotional Note: ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్ను తలచుకుని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ భావోద్వేగానికి లోనయ్యాడు. నిన్ను చాలా మిస్ అవుతున్నా వార్న్ అంటూ ఆసీస్ లెజెండ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. కాగా గతేడాది మార్చి 4న స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. మొదటి వర్ధంతి థాయ్లాండ్లో ఉన్న సమయంలో గుండెపోటుతో కుప్పకూలిన వార్న్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. ఈ విషాదకర వార్త తెలిసి క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. స్వదేశంలో అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ ప్రభుత్వ లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా వార్న్ మొదటి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచర ఆటగాళ్లు అతడిని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు. నువ్వు ఆ స్వర్గాన్ని కూడా.. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ వార్న్తో కలిసి ఉన్న ఫొటో పంచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘‘మైదానంలో మనం పోటాపోటీగా ఆడిన సందర్భాలున్నాయి.. అదే సమయంలో మైదానం వెలుపలా మనకంటూ కొన్ని మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక గొప్ప క్రికెటర్గా మాత్రమే కాదు.. ఓ మంచి స్నేహితుడిగా కూడా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీ చరిష్మా, హాస్యచతురతతో నువ్వు ఆ స్వర్గాన్ని మరింత అందమైన ప్రదేశంగా మారుస్తూ ఉంటావని నాకు తెలుసు వార్నీ!’’ అంటూ సచిన్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సచిన్- వార్న్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఒక్క ముక్క చికెన్ తినగానే.. వామ్మో.. గతంలో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణ సందర్భంగా షేన్ వార్న్ సచిన్ ఇంట్లో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. ‘ఒకరోజు ముంబైలో ఉన్న వాళ్లింటికి వెళ్లాను. డిన్నర్ చేసి తర్వాత హోటల్కి వెళ్దామని అనుకున్నా. అక్కడ ఒక్క చికెన్ ముక్క తినగానే నాకు దిమ్మతిరిగిపోయింది. అయినా సరే మెల్లమెల్లగా తినడానికి ప్రయత్నించా. ఎందుకంటే నాకు సచిన్ పట్ల, అతడి కుటుంబం పట్ల ఎంతో గౌరవం ఉంది. వాళ్లు నాపై ప్రేమను కురిపిస్తారు’’ అని వార్న్ పేర్కొన్నాడు. మా కోసం భరించాడు ఇందుకు స్పందించిన సచిన్.. ‘నీకు ఇండియన్ ఫుడ్ ఇష్టమేనా అని అడిగాడు. అందుకు వార్న్.. అవును.. నాకు చాలా చాలా ఇష్టమని సమాధానమిచ్చాడు. మిగతా వాళ్లకు భోజనం వడ్డిస్తున్న సమయంలో షేన్ తనే తన ప్లేట్లో ఫుడ్ పెట్టుకున్నాడు. తను ఆ స్పైసీ ఫుడ్ తినలేకపోతున్నాడని నాకు అర్థమైంది. కానీ మమ్మల్ని బాధపెట్టడం ఇష్టంలేక తను కాసేపు అలాగే ఉండిపోయాడు. మా మేనేజర్ను పిలిచి విషయం చెప్పాడు. తర్వాత తనే కిచెన్లోకి వెళ్లి బీన్స్, చిదిమిన ఆలుగడ్డలతో ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాడు’’ అని వార్న్ గురించి గొప్పగా చెప్పాడు. చదవండి: Ind vs Aus: ఇంకెప్పుడు బ్యాట్ ఝులిపిస్తారు? సూర్యను తీసుకోండి: పాక్ మాజీ స్పిన్నర్ అగ్రస్థానానికి ఎగబాకిన ఇంగ్లండ్ -
Shane Warne: అప్పుడే ఏడాది గడిచిపోయిందా? నమ్మలేకున్నా!
Shane Warne Death Anniversary: ‘‘అత్యంత విచారకరం. అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే నిజంగా నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ దివంగత షేన్ వార్న్ను గుర్తు చేసుకున్నాడు. కాలం గిర్రున తిరిగిపోయిందని.. వార్న్ లేడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశాడు. అద్భుతమైన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే వార్న్ లేనిలోటు ఎవరూ పూడ్చలేరన్నాడు. ‘మాంత్రికుడు’ మరో లోకానికి.. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఈ లోకాన్ని వీడి నేటికి సరిగ్గా ఏడాది. థాయ్లాండ్లో ఉన్న సమయంలో గుండెపోటుకు గురైన అతడు హఠాన్మరణం చెందాడు. ఛాతీ నొప్పితో కుప్పకూలిన వార్న్.. థాయ్లాండ్ పర్యటనలోనే కన్నుమూశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అతడి అంత్యక్రియలు నిర్వహించింది. వార్న్ను కడసారి చూసుకునేందుకు తరలివచ్చిన అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. క్రికెట్ అంటే పిచ్చి ఈ నేపథ్యంలో షేన్ వార్న్ను గుర్తు చేసుకున్న మార్క్ టేలర్.. వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. స్పిన్ మాంత్రికుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇండియాలో బంతి అద్భుతంగా టర్న్ అవుతున్న సందర్భాల్లో కచ్చితంగా వార్న్ మనందరికీ మరీ మరీ గుర్తుకువస్తాడు. తన స్పిన్ మాయాజాలంతో వార్న్ చేసిన అద్భుతాలు, మైదానంలో వదిలిన జ్ఞాపకాలు అలాంటివి. అతడు లేని లోటు ఎన్నటికీ ఎవ్వరూ పూడ్చలేరు. అతడి అభిప్రాయాలన్నింటితో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ ఆట పట్ల వార్న్కు ఉన్న ప్రేమ, అంకితభావానికి మాత్రం ఫిదా కాకుండా ఉండలేం’’ అని మార్క్ టేలర్ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీసి వార్న్ ‘ఆల్టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి టైటిల్ గెలిచిన సారథిగానూ రికార్డులకెక్కాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇక ప్రస్తుతం టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ వార్న్ పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొడుతూ సత్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది. మరోవైపు.. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ind Vs Aus: ఇండోర్ పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు -
Ind Vs Aus: షేన్ వార్న్ రికార్డు బద్దలు.. నాథన్ లియోన్ అరుదైన ఘనత
Ind Vs Aus 3rd Test Indore Day 1 Nathan Lyon Record: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో భాగంగా టీమిండియాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. ఇండోర్లో మొదలైన బుధవారం నాటి తొలి రోజు ఆటలో.. ఆరంభంలో పేస్కు అనుకూలిస్తుందనుకున్న పిచ్పై స్పిన్ బౌలర్లు చెలరేగుతున్నారు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్ ప్రభావం చూపలేకపోయిన వేళ.. మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్ వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతున్నారు. స్పిన్నర్ల విజృంభణ వీరిద్దరు చెలరేగడంతో మొదటి రోజు ఆటలో 12 ఓవర్లలో టీమిండియా 46 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేసి కుహ్నెమన్ ఆసీస్కు శుభారంభం అందించగా.. లియోన్ దానిని కొనసాగించాడు. వార్న్ రికార్డు బద్దలు.. లియోన్ అరుదైన ఘనత భారత ఓపెనర్లు రోహిత్, శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వికెట్లను కుహ్నెమన్ తన ఖాతాలో వేసుకోగా.. నాథన్ లియోన్ ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో జడ్డూను అవుట్ చేయడం ద్వారా లియోన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్గా చరిత్ర సృష్టించాడీ వెటరన్ స్పిన్నర్. తొలి రెండు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన జడేజా వికెట్ తీసి రికార్డు సృష్టించాడు. కాగా ఆసియాలో లియోన్కు ఇది 128వ వికెట్. ఈ క్రమంలో అతడు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్లు(ఇప్పటి వరకు) ►నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా స్పిన్నర్)- 128 ►షేన్ వార్న్(ఆస్ట్రేలియా స్పిన్నర్) 127 ►డానియెల్ వెటోరీ(న్యూజిలాండ్ స్పిన్నర్)- 98 ►డెయిల్ స్టెయిన్(సౌతాఫ్రికా పేసర్)-92 ►జేమ్స్ ఆండర్సన్(ఇంగ్లండ్ పేసర్)- 82 ►కోర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్ పేసర్)- 77 చదవండి: పుజారా చెత్త రికార్డు.. భారత్ తరపున రెండో క్రికెటర్గా Steve Smith: 'లెక్క సరిచేస్తా'.. నీకంత సీన్ లేదు! -
BGT 2023: అలెక్స్ క్యారీ వికెట్ ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన రికార్డు
India vs Australia, 2nd Test - Ravichandran Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(111 వికెట్లు) తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన బౌలర్గా నిలిచాడు. వంద వికెట్ల ఘనత బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి రోజు ఆటలో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీని డకౌట్ చేసి.. ఆస్ట్రేలియాపై వంద వికెట్ల మార్కును అందుకున్నాడు. ఇక సమకాలీన క్రికెటర్లలో రవీంద్ర జడేజా(71) తప్ప అశ్విన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అగ్రస్థానంలో వార్న్ ఇదిలా ఉంటే.. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దివంగత ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్తో టెస్టుల్లో అతడు.. 195 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీ బ్రేక్ సమయానికి అశ్విన్ మూడు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో మూడో సెషన్ ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 199(56 ఓవర్లు) చేయగలిగింది. ఇక క్యారీ కంటే ముందు అశూ.. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: Tom Blundell: కివీస్ బ్యాటర్ టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు! IND Vs AUS: పాపం వార్నర్.. మళ్లీ షమీ చేతిలోనే! వీడియో వైరల్ GONEEEEE!#TeamIndia bowlers have the ball talking and Aussie batters dancing to their tunes! Ashwin gets two huge wickets of Labuschagne and Smith! 🔥 Tune-in to the action in the Mastercard #INDvAUS Test on Star Sports & Disney+Hotstar! #BelieveInBlue #TestByFire pic.twitter.com/xxgiqyrRau — Star Sports (@StarSportsIndia) February 17, 2023 -
NZ Vs Eng: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో..
New Zealand vs England, 1st Test: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల జంట జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్లో సంయుక్తంగా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జంటగా చరిత్రకెక్కింది. న్యూజిలాండ్తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించింది. తద్వారా సంప్రదాయ క్రికెట్లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్ల జంటగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ ద్వయం గ్లెన్ మెగ్రాత్- షేన్ వార్న్ 1000 వికెట్ల రికార్డు నెలకొల్పారు. పేసర్ మెగ్రాత్- స్పిన్నర్ షేన్ వార్న్ 104 టెస్టు మ్యాచ్లలో కలిసి ఆడి సంయుక్తంగా 1001 వికెట్లు పడగొట్టి ఆండర్సన్- బ్రాడ్ జంట కంటే ముందుగా ఈ ఘనత సాధించారు. కివీస్తో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో ఆండర్సన్ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, రెండో రోజు మొదటి సెషన్లో బ్రాడ్ నైట్ వాచ్మన్ నీల్ వాగ్నర్ వికెట్ పడగొట్టాడు. దీంతో జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ జంట 1000 వికెట్ల క్లబ్లో చేరింది. ఇక ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో టాప్-5 వికెట్ టేకర్ల జాబితాలో కొనసాగుతున్నారు. 178 టెస్టుల్లో 40 ఏళ్ల ఆండర్సన్ 677 వికెట్లు పడగొట్టగా.. 36 ఏళ్ల బ్రాడ్ 160 మ్యాచ్లలో 567 వికెట్లు తీశాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు, షేన్ వార్న్ ఖాతాలో 708 వికెట్లు ఉన్నాయి. భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మౌంట్ మాంగనీయ్ వేదికగా న్యూజిలాండ్తో మొదటి టెస్టులో ఇంగ్లండ్ 325/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. చదవండి: Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?! నటాషా నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్ -
షేన్వార్న్కు ఆసీస్ బోర్డు సముచిత గౌరవం
దివంగత క్రికెటర్ షేన్వార్న్ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. ఇకపై ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్టు క్రికెటర్ అవార్డును షేన్వార్న్ పేరిట ఇవ్వనుంది. ఇకపై ఈ అవార్డు ‘షేన్ వార్న్ బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆస్ట్రేలియా’గా వ్యవహరిస్తారు. గత మార్చిలో షేన్ వార్న్ మృతి చెందిన తర్వాత అతని సొంత మైదానం మెల్బోర్న్ గ్రౌండ్లో మొదటి టెస్టు జరుగుతున్న సందర్భంగా సోమవారం ఈ విషయాన్ని ఆసీస్ బోర్డు ప్రకటించింది. లెగ్స్పిన్ దిగ్గజం వార్న్ 145 టెస్టుల్లో ఆసీస్కు ప్రాతినిధ్యం వహించి 708 వికెట్లు పడగొట్టాడు. -
నాకంటే అతడే బెటర్.. చాలా నేర్చుకున్నా: ముత్తయ్య మురళీధరన్
1990లలో ప్రత్యర్ధి బ్యాటర్లను తమ స్పిన్ మయాజాలంతో ఈ ఇద్దరు స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టేవారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియా దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్.. మరొకరు శ్రీలంక లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. తాజాగా గ్రేట్ షేన్ వార్న్ను గుర్తుచేసుకుని ముత్తయ్య మురళీధరన్ భావోద్వేగానికి లోనయ్యాడు. వార్న్ను చాలా మిస్స్ అవుతున్నాము అని అతడు తెలిపాడు. నేను క్రికెట్ ఆడే రోజుల్లో వార్న్ స్పిన్ మ్యాజిక్ను దగ్గరి నుంచి చూసే వాడిని అని ముత్తయ్య అన్నాడు . "వార్న్ నాకంటే చాలా గొప్పవాడు అని నేను ఎప్పుడూ భావిస్తున్నాను. నేను శ్రీలంక తరపున ఆడుతున్నప్పుడు అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడు అల్టైమ్ గ్రేట్ స్పిన్నర్. మేము అందరం షేన్ను మిస్ అవుతున్నాం" అని మురళీధరన్ పేర్కొన్నాడు కాగా భారత్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో మురళీధరన్ ఆడనున్నాడు. ఈ టోర్నీలో మణిపాల్ టైగర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: Ind A vs NZ A: న్యూజిలాండ్తో సిరీస్.. కెప్టెన్గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన -
'భౌతికంగా మాత్రమే దూరం'.. హ్యాపీ బర్త్డే
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్.. లెజెండరీ షేన్ వార్న్ భౌతికంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో థాయ్లాండ్లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన వార్న్ క్రీడాలోకాన్ని కంటతడి పెట్టించాడు. అతను భౌతికంగా లేకపోయినా..వార్న్ జ్ఞాపకాలు మాత్రం చిరకాలం మిగిలిపోనున్నాయి. కాగా ఇవాళ(సెప్టెంబర్ 13) దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ పుట్టినరోజు. 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న వార్న్కు ప్రత్యేక నివాళి. కాగా వార్న్ పుట్టినరోజు సందర్భంగా అతని ట్విటర్లో ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతని ట్విటర్ నుంచి వచ్చిన మెసేజ్ అందరిని ఆకట్టుకుంటుంది.'' భౌతికంగా దూరమైన మీరిచ్చిన వారసత్వం ముఖ్యమైన వాటిపై గొప్ప దృక్పథాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి జీవితం గొప్పతనాన్ని సూచిస్తుంది. జీవితంలో మీరేం సాధించారన్నది అక్కడి ప్రజలు, ప్రదేశాలపై స్పష్టమైన ప్రభావం చూపిస్తుంది. షేన్ వారసత్వం ఎన్నటికి బతికే ఉంటుంది.. హ్యాపీ బర్త్డే షేన్ వార్న్.. మీరెప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటారు.'' అంటూ ట్వీట్ చేశారు. ఇక షేన్ వార్న్ 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 15 ఏళ్ల కెరీర్లో వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. A legacy gives you a perspective on what's important. It is about the richness of an individual's life, including what they accomplished and the impact they had on people and places. Shane’s Legacy will live on. Happy birthday - always in our hearts 🤍🤍🤍 pic.twitter.com/qL5NPIZnUk — Shane Warne (@ShaneWarne) September 12, 2022 చదవండి : FIFA-23 Ratings: మెస్సీ,చదవండి రొనాల్డోలకు ఊహించని షాక్.. నాకసలు ఈ జాబ్ అవసరమే లేదు.. కానీ ఇప్పుడు -
చనిపోయి నాలుగు నెలలు దాటింది.. ఇంకెన్నాళ్లు ఈ కథలు!
ఆస్ట్రేలియా దిగ్గజం.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మనల్ని భౌతికంగా విడిచివెళ్లి నాలుగు నెలలు దాటిపోయింది. గత మార్చిలో వార్న్ థాయిలాండ్లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించాడు. అతని మరణం యావత్ క్రీడా ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. బతికినంతకాలం క్రికెట్లో రారాజుగా వెలుగొందినప్పటికి బయటి వివాదాల్లోనూ అంతే పేరు సంపాదించాడు. ఇక వార్న్కు ప్లేబాయ్ అనే ముద్ర కూడా ఉంది. ఎంతో మంది అమ్మాయిలతో ఎఫైర్లు నడిపాడన్న వార్తలు వచ్చాయి. వీటిలో నిజమెంత అనేది తెలియకపోయినప్పటికి.. అతను భౌతికంగా దూరమైన తర్వాత కూడా యువతులతో ఎఫైర్ వార్తలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా బ్యూటీ గినా స్టివార్ట్.. వార్న్ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు నాతో ఎఫైర్ నడపాడంటూ తెలిపింది. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియని సీక్రెట్ ఎఫైర్ అని పేర్కొంది. ''వార్న్ థాయిలాండ్లోని విల్లాలో మరణించడానికి ముందు నాతో రెగ్యులర్ కాంటాక్ట్ ఉండేది. అయితే ఆ ఎఫైర్ స్నేహపూరిత వాతావరణం మాత్రమే. ఒక స్నేహితుడిగా.. గైడ్గా నాకు సలహాలిచ్చేవాడు. ఈ క్రమంలోనే మా మధ్య సన్నిహిత్యం పెరిగింది. అలా అతనితో డేటింగ్ చేశాను. ఇక దగ్గరయ్యాడనుకునే లోపే వార్న్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని మరణం కొన్ని నెలల పాటు నన్ను మాములు మనిషిని చేయలేకపోయింది.'' అంటూ 51 ఏళ్ల గినా స్టివార్ట్ తెలిపింది. కాగా గినా స్టివార్ట్ ఆస్ట్రేలియాలో ఒక సెలబ్రిటీ. 51 ఏళ్ల వయసులోనూ హాట్ ఫోటోలకు ఫోజిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఇటీవలే గివార్ట్ తనను తాను ''వరల్డ్ హాటెస్ట్ గ్రాండ్ మా'' అని బిరుదు ఇచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. ఇక 2018లో గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా వార్న్ను తొలిసారి కలిసినట్లు గినా పేర్కొంది. ''ఒకరినొకరు పరిచయం పెంచుకోవడంతో పాటు ఆ రాత్రంతా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అలా మా మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ఇద్దరం మరింత దగ్గరయ్యాము. అయితే ఇదంతా బయటి ప్రపంచానికి తెలియకూడదని వార్న్ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. అందుకే అతను మరణించిన తర్వాతే ఈ విషయాలు వెల్లడిస్తున్నా'' అంటూ తెలిపింది. ఇక క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరు పొందిన షేన్ వార్న్ తన లెగ్స్పిన్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఈ స్పిన్ దిగ్గజం 145 టెస్టుల్లో 708 వికెట్లు.. 193 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. OnlyFans star Gina Stewart has made a startling revelation about the late great Shane Warne, five months after his tragic death > https://t.co/qc6mpq2Wty pic.twitter.com/Wzbg06oiw2 — Herald Sun (@theheraldsun) August 16, 2022 చదవండి: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్మ్యాన్ Sanju Samson: నేను, నా భార్య ఖాళీగా ఉన్నపుడు చేసే పని అదే! నా ముద్దు పేరు.. -
యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు
టెస్టు క్రికెట్లో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఆస్ట్రేలియన్ దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. జూన్ 4, 1993న వార్న్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైక్ గాటింగ్ను ఔట్ చేసిన విధానం ఎవరు మరిచిపోలేరు. పూర్తిగా లెగ్స్టంప్ దిశగా వెళ్లిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్స్టంప్ వికెట్ను ఎగురగొట్టి.. క్రీజులో ఉన్న మైక్ గాటింగ్ సహా.. ఆసీస్ తోటి ఆటగాళ్లు, అభిమానులు సహా యావత్ క్రీడా ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు. క్రికెట్ బతికున్నంతవరకు షేన్ వార్న్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. ఆ తర్వాత ఎంతో మంది బౌలర్లు వార్న్ లాగే ఆ ఫీట్ అందుకున్నప్పటికీ వార్న్ వేసిన బంతికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ స్టార్ యాసిర్ షా కూడా అచ్చం వార్న్ తరహాలోనే వేసిన బంతిని క్రికెట్ అభిమానులు సహా కామెంటేటర్స్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా అభివర్ణిస్తున్నారు. అయితే యాసిర్ వేసిన బంతిని దిగ్గజ బౌలర్తో పోల్చడం ఏంటని కొందరు అభిమానులు కొట్టిపారేసినప్పటికి.. అచ్చం వార్న్ బౌలింగ్ యాక్షన్ను పోలి ఉండే.. యాసిర్ షా వేసిన బంతి కూడా అదే తరహాలో చరిత్రలో నిలిచిపోనుంది. పాకిస్తాన్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్లో ఈ అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. యాసిర్ షా డెలివరీకి అప్పటికే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న కుషాల్ మెండిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. కుషాల్ 74 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ 56వ ఓవర్లో యాసిర్ షా బౌలింగ్కు వచ్చాడు. క్రీజులో ఉన్న కుషాల్కు పూర్తిగా లెగ్స్టంప్ అవతల వేసిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్ స్టంప్ను ఎగురగొట్టింది. తాను వేసిన బంతి అంతలా టర్న్ అవుతుందని యాషిర్ షా కూడా ఊహించి ఉండడు. అందుకే వికెట్ పడగానే గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టులో లంక పాక్ ముందు 342 పరుగుల టార్గెట్ ఉంచింది. ప్రస్తుతం పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 3, బాబర్ ఆజం 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 185 పరుగులు దూరంలో ఉండగా.. మరొక రోజు ఆట మిగిలిఉన్న నేపథ్యంలో శ్రీలంక మిగిలిన 8 వికెట్లు తీయగలిగితే విజయం సాధిస్తుంది. Ball of the Century candidate❓ Yasir Shah stunned Kusal Mendis with a stunning delivery which reminded the viewers of Shane Warne’s ‘Ball of the Century’.#SLvPAK pic.twitter.com/uMPcua7M5E — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 18, 2022 The greatest Test delivery ever? pic.twitter.com/MQ8n9Vk3aI — cricket.com.au (@cricketcomau) March 4, 2022 చదవండి: సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం ఆ అద్భుతాన్ని చూసింది.. ఐసీసీ ట్వీట్ Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్తో అదరగొట్టిన పాక్ బౌలర్ -
టెస్టు క్రికెట్లో ఆండర్సన్ అరుదైన ఫీట్.. మూడో బౌలర్గా..!
ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్తో జరుగుతోన్న రెండో టెస్టులో టామ్ లాథమ్ను ఔట్ చేసిన అండర్సన్.. తన కెరీర్లో 650వ టెస్టు వికెట్ని సాధించాడు. తద్వారా టెస్టుల్లో 650 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా అండర్సన్ రికార్డులెక్కాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, మురళీధరన్ తొలి రెండు స్ధానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 539 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓలీ పోప్(145), జో రూట్(176) పరుగులతో రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 553 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో మిచెల్(190),టామ్ బ్లండల్(106) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. 14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన కివీస్ 140 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఆడుతోంది. చదవండి: Dilip Vengsarkar: టీమిండియాకి ఆడాలంటే ఇది సరిపోదా.. ఇంకా ఏం చేయాలి? -
Shane Warne: సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం ఆ అద్భుతాన్ని చూసింది!
Ball Of The Century : ‘‘1993.. సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం షేన్ వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీని చూసింది’’ అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్, దివంగత షేన్ వార్న్ను గుర్తు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా 1993 యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్లో పర్యటించింది. ఈ క్రమంలో మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా జూన్ 3 తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను 289 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్కు ఓపెనర్ గ్రాహమ్ గూచ్ శుభారంభం అందించాడు. 65 పరుగులతో జోరు మీదున్న సమయంలో వార్న్ అతడిని పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత రెండో రోజు(జూన్ 4) వన్డౌన్లో వచ్చిన మైక్ గాటింగ్ను అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. బాల్ను నేరుగా గాటింగ్ కాళ్ల ముందు వేసి.. ఆఫ్ వికెట్ను ఎగురగొట్టాడు. అసలు బంతి ఎక్కడ పడుతుందో బ్యాటర్ అంచనా వేసే లోపే ఈ విధంగా అద్భుతం చేశాడు వార్న్. దీంతో గాటింగ్ సమా అంపైర్ కూడా బిక్కమొహం వేశారంటే ఈ స్పిన్ మాంత్రికుడి మాయాజాలం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీనిని బాల్ ఆఫ్ ది సెంచరీగా పేర్కొంటూ వార్న్పై ప్రశంసల వర్షం కురిసింది. ఇక ఈ మ్యాచ్లో మొత్తంగా 8 వికెట్లు పడగొట్టిన వార్న్.. ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇంగ్లండ్తో నాటి మొదటి టెస్టులో ఆసీస్ 179 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే విధంగా ఆరు మ్యాచ్ల ఈ టెస్టు సిరీస్ను గెలిచి ప్రతిష్టాత్మక యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. కాగా ఈ ఏడాది మార్చి 4న షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. థాయ్లాండ్లోని విల్లాలో విగతజీవిగా కనిపించాడు. 1993 యాషెస్ సిరీస్: ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టెస్టు స్కోర్లు ఆస్ట్రేలియా: 289 & 432/5 డిక్లేర్డ్ ఇంగ్లండ్: 210 & 332. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షేన్ వార్న్ చదవండి: T20 WC 2022: అస్సలు బాలేదు.. కోహ్లి, రోహిత్ తమ మార్కు చూపించాలి.. లేదంటే కష్టమే! On this day in 1993, the world witnessed Shane Warne's 'Ball of the Century' 🔥 pic.twitter.com/E47RM3BpwA — ICC (@ICC) June 4, 2022 -
IPL 2022: రాజస్తాన్కు ఆర్సీబీ విషెస్.. గుండెల్ని పిండే ట్వీట్తో!
IPL 2022 RR Vs RCB: ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం శుక్రవారంతో ముగిసింది. కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. ఫైనల్ చేరి ట్రోఫీ గెలుస్తుందంటూ ఆశగా ఎదురుచూసిన లక్షలాది మంది అభిమానుల హృదయాలు ముక్కలు చేసింది. కాగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయంతో లక్కీగా ప్లే ఆఫ్స్ చేరిన ఫాఫ్ డుప్లెసిస్ బృందం.. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించి క్వాలిఫైయర్-2కు అర్హత సాధించింది. కానీ, అహ్మదాబాద్ వేదికగా సాగిన కీలక పోరులో మాత్రం రాజస్తాన్ ముందు తలవంచకతప్పలేదు. అయితే, ఓటమి బాధలో కూరుకుపోయినా ఆర్సీబీ క్రీడాస్ఫూర్తి మరువలేదు. ఆస్ట్రేలియా లెజెండ్, తొలి సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ఐపీఎల్ టైటిల్ అందించిన షేన్ వార్న్ను గుర్తుచేస్తూ రాజస్తాన్కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ మేరకు.. ‘‘ది గ్రేట్ షేన్ వార్న్ మిమ్మల్ని చూసి చిరునవ్వులు చిందిస్త ఉంటారు. మీరు చాలా బాగా ఆడారు. ఫైనల్కు గుడ్లక్’’ అంటూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఇందుకు స్పందించిన రాజస్తాన్ రాయల్స్ ఇరు జట్ల జెర్సీ రంగులను ప్రతిబింబించేలా రెండు హార్ట్ ఎమోజీలతో ప్రేమను కురిపించింది. ఈ ట్వీట్లు క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకుంటున్నాయి. ఐపీఎల్ క్వాలిఫైయర్-2: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ టాస్: రాజస్తాన్ రాయల్స్ బెంగళూరు స్కోరు: 157/8 (20) రాజస్తాన్ స్కోరు: 161/3 (18.1) విజేత: ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం.. ఫైనల్లో అడుగు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు- నాటౌట్) చదవండి 👇 Sachin Tendulkar On RR Bowlers: వాళ్లిద్దరు అద్భుతం చేశారు.. ఆర్సీబీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు: సచిన్ ప్రశంసలు IPL 2022: 'ఓవైపు తల్లికి సీరియస్.. అయినా మ్యాచ్లో అదరగొట్టాడు' The Great late Shane Warne is smiling on you. Well played tonight, @rajasthanroyals and good luck for the final. 👍🏻#PlayBold #IPL2022 #RRvRCB — Royal Challengers Bangalore (@RCBTweets) May 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); WHAT. A. WIN for @rajasthanroyals! 👏 👏 Clinical performance by @IamSanjuSamson & Co. as they beat #RCB by 7⃣ wickets & march into the #TATAIPL 2022 Final. 👍 👍 #RRvRCB Scorecard ▶️ https://t.co/orwLrIaXo3 pic.twitter.com/Sca47pbmPX — IndianPremierLeague (@IPL) May 27, 2022 -
IPL 2022: అంచనాలు లేకుండా బరిలోకి.. వార్న్ గర్వపడుతూ ఉంటాడు: బట్లర్
IPL 2022- Jos Buttler: ‘‘ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగాను. అయితే, యాజమాన్యం, సహచర ఆటగాళ్ల ప్రోత్సాహంతో ఇక్కడి దాకా వచ్చాను. సమిష్టి కృషితో ఫైనల్స్లో ప్రవేశించాం. కుమార సంగక్కర, ట్రెవార్ పెన్నీతో సంభాషణలు ఎప్పటికీ మరచిపోలేను’’ అని క్వాలిఫైయర్-2 హీరో, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ అన్నాడు. ఐపీఎల్-2022 మధ్యలో కాస్త తడబడ్డానని, అప్పుడు ఒత్తిడికి గురయ్యానన్న బట్లర్.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో పుంజుకోవడంతో ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నానని పేర్కొన్నాడు. కాగా సీజన్ ఆరంభంలో అద్భుతంగా ఆకట్టుకున్న బట్లర్.. ఆ తర్వాత కాస్త వెనుబడ్డాడు. అయితే గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫైయర్-1లో 89 పరుగులతో అజేయంగా నిలిచి తిరిగి ఫామ్ అందుకున్నాడు. ఈ క్రమంలో క్వాలిఫైయర్-2లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించిన బట్లర్.. 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్ నిలిచి రాజస్తాన్ను ఫైనల్కు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. ఆర్సీబీతో మ్యాచ్లో బ్యాటింగ్ను పూర్తిగా ఆస్వాదించినట్లు తెలిపాడు. వేలాది మంది ప్రేక్షకుల మధ్య, అభిమానుల మద్దతు నడుమ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం తనకు తృప్తినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఈ సందర్భంగా ఆస్ట్రేలియా లెజెండ్, రాజస్తాన్కు ఐపీఎల్ టైటిల్ అందించిన దివంగత షేన్ వార్న్ను గుర్తు చేసుకున్న బట్లర్.. అతడిని తాము మిస్ అవుతున్నామని భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘రాజస్తాన్ రాయల్స్ను ప్రభావితం చేసిన వ్యక్తి షేన్ వార్న్. మొదటి సీజన్లోనే కప్ సాధించిపెట్టాడు. ఆయనను చాలా మిస్ అవుతున్నాం. మా విజయాన్ని ఆయన పై నుంచి చూస్తూనే ఉంటారు. ఈరోజు మా ఆట తీరు చూసి చాలా గర్వపడతారు’’ అని వ్యాఖ్యానించాడు. చదవండి 👇 Jos Buttler: వారెవ్వా.. బట్లర్ విధ్వంసకర ఆట తీరు.. అరుదైన రికార్డు సొంతం! Trolls On RCB Fan Girl: 'ఆర్సీబీ కప్ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు' Moments we'll never forget. 😍 #RRvRCB pic.twitter.com/yhVLY254vq — Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022 𝑷𝒂𝒅𝒉𝒂𝒓𝒐. 🏨💗 pic.twitter.com/37uqOuC0MP — Rajasthan Royals (@rajasthanroyals) May 27, 2022 -
'నాకు రాజస్తాన్ ఒక కుటుంబం వంటిది.. వార్న్ సార్ ఆశీస్సులు నాకు ఉన్నాయి'
ఐపీఎల్-2022లో తొలి క్వాలిఫైయర్లో మంగళవారం గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. అయితే ఈ కీలక పోరుకు ముందు రాజస్తాన్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్.. లెజెండరీ లెగ్-స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ను గుర్తు చేసుకున్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో గుండెపోటుతో వార్న్ మరణించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్లో నాకు ఇది మొదటి సీజన్. కానీ నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఆడుతున్నట్లు అనిపిస్తుంది. "నాకు రాజస్తాన్ ఒక కుటుంబం వంటిది. నేను ఇక్కడ చాలా రిలాక్స్గా ఉన్నాను. నాతో ఆడే జట్టు సభ్యులే కాకుండా మేనేజ్మెంట్ కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు. మరోవైపు వార్న్ సార్ రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాడు. అతను తొలి ఐపీఎల్ ఛాంపియన్గా ఉన్నారు. ఆదే విధంగా అతని ఆశీస్సులు నాకు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అతను నన్ను పై నుంచి చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది" అని రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో చాహల్ పేర్కొన్నాడు. చదవండి: Nikhat Zareen: ఒలంపిక్ పతకం సాధిస్తా.. రెట్టింపు కృషి ఉంటేనే.. అందుకోసం! -
ఆ క్రికెటర్ను బూతులు తిట్టారు.. నెలల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు..!
క్రికెట్ ఆస్ట్రేలియా రెండు నెలల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను కోల్పోయింది. ఇదే ఏడాది మార్చి 4న షేన్ వార్న్ (52) గుండెపోటుతో మరణించగా.. తాజాగా (మే 14) ఆండ్రూ సైమండ్స్(46) కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఇద్దరూ ఈ శతాబ్దపు ఆరంభంలో ఆస్ట్రేలియాను తిరుగులేని జట్టుగా నిలబెట్టారు. ఆటలోనే కాకుండా వివాదాల విషయంలో ఈ ఇద్దరూ క్రికెట్ ఆస్ట్రేలియాకు పోటీ పడి మరీ అపవాదు తెచ్చారు. సైమండ్స్ అకాల మరణ వార్త తెలియగానే వీరిద్దరికి సంబంధించిన ఓ పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 2021 భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్ సందర్భంగా వార్న్, సైమోలిద్దరూ మోడ్రన్ స్మిత్గా పిలువబడే ఆసీస్ క్రికెటర్ మార్నస్ లబుషేన్పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ మ్యాచ్కు కామెంటేటర్లు వ్యవహారించిన వార్న్, సైమండ్స్లు లబుషేన్ను బండ బూతులు తిడుతూ అడ్డంగా దొరికిపోయారు. లబూషేన్ విషయంలో వారి సంభాషణను ఫాక్స్ స్పోర్ట్స్ లైవ్లో ప్రసారం చేయడంతో విషయం బయటపడింది. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో లబూషేన్ 91 పరుగుల వద్ద ఔట్ కావడంతో తొలుత వార్న్ లబూషేన్ను విమర్శించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సైమండ్స్ అందుకుని.. లబుషేన్కి అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ ఉంది. దాన్ని తగ్గించడానికి ఏదైనా మందులు (హాగ్ పైల్) ఇవ్వాలంటూ బూతు పురాణం మొదలుపెట్టాడు. దీన్ని వార్న్ కొనసాగించాడు. ఈ తతంగం మొత్తం ప్రత్యక్ష ప్రసారం కావడంతో వార్న్-సైమోలిద్దరూ మరోసారి విమర్శలపాలయ్యారు. కాగా, రెండు నెలల వ్యవధిలో వార్న్-సైమోలిద్దరు హఠాణ్మరణం చెందడంతో లబూషేన్ విషయం నెట్టింట ట్రెండింగ్లో నిలిచింది. ఆ యువ క్రికెటర్ను అనరాని మాటలు అన్నారు.. అనుభవించారు అంటూ కొందరు ఆకతాయిలు పోస్ట్లు పెడుతున్నారు. చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే.. -
ఇలాంటి బౌలింగ్ అరుదు.. దిగ్గజ ఆటగాడు గుర్తురావడం పక్కా!
లంకాషైర్ లెగ్ స్పిన్నర్ మాట్ పార్కిన్సన్ కౌంటీ క్రికెట్ చాంపియన్షిప్లో అద్బుత బంతితో మెరిశాడు. కౌంటీలో భాగంగా లంకాషైర్, వార్విక్షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వార్విక్షైర్ రెండో ఇన్నింగ్స్లో ప్రత్యర్థి బ్యాటర్ లెగ్స్టంప్ అవతల బంతిని వేశాడు. దానిని డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బ్యాటర్ క్రీజు నుంచి ముందుకు వచ్చాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్ స్టంప్ వికెట్ను పడగొట్టింది. పార్కిన్సన్ ఇలాంటి బంతి వేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు 2021లో నార్త్ హంప్షైర్ కెప్టెన్ ఆడమ్ రోసింగ్టన్ను అచ్చం ఇలాంటి బంతితోనే బోల్తా కొట్టించాడు. ఇంకో విషయం ఏంటంటే.. వార్నర్ బాల్ ఆఫ్ ది సెంచరీని గుర్తు చేస్తూ పార్కిన్సన్ సెలబ్రేషన్స్ చేయడం వైరల్గా మారింది. పార్కిన్సన్ ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో ఐదు వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్లు ఆడాడు. ఇక షేన్ వార్న్ ఇంగ్లండ్ బ్యాటర్ మైక్ గాటింగ్ను ఔట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో బాల్ ఆఫ్ ది సెంచరీగా మిగిలిపోయింది. ఇక ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఈ ఏడాది మార్చిలో థాయ్లాండ్లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చదవండి: Sri Lanka Economic Crisis: దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది : లంక మాజీ క్రికెటర్లు Lionel Messi: అర్జెంటీనా స్టార్ మెస్సీ కొత్త చరిత్ర.. 61 వ స్థానంలో కోహ్లి How good is this delivery from @mattyparky96? 🤯 Unplayable.#LVCountyChamp pic.twitter.com/qPvxKwDuHs — LV= Insurance County Championship (@CountyChamp) May 10, 2022 Ball of the century? 😳 @mattyparky96 #LVCountyChamp live: https://t.co/SyebMiubg3 pic.twitter.com/Wf93spCqz3 — LV= Insurance County Championship (@CountyChamp) April 16, 2021 -
ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనున్న రాజస్థాన్..కారణం ఏంటో తెలుసా?
రాజస్థాన్ రాయల్స్ తమ మాజీ కెప్టెన్, దివంగత షేన్ వార్న్కు నివాళిగా శనివారం ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనుంది. రాజస్థాన్ ఆటగాళ్ల జెర్సీ కాలర్ పైనా, 'SW23' అని ఎంబ్రాయిడరీ చేయబడి ఉంది. ఈ ప్రత్యేక జెర్సీకు సంబంధించిన ఓ వీడియోను రాజస్తాన్ రాయల్స్ ట్విటర్లో షేర్ చేసింది. కాగా 2008లో వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. అదే విధంగా డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్కు ముందు వార్న్కు నివాళులర్పించేందుకు రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది. ఇక ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన రాజస్తాన్.. 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చదవండి: IPL 2022: "బ్యాటింగ్లో చెత్తగా ఆడాం.. బౌలర్లు అద్భుతంగా రాణించారు" #ForWarnie 💗 pic.twitter.com/vsgAX1LaMR — Rajasthan Royals (@rajasthanroyals) April 30, 2022 -
షేన్ వార్న్కు నివాళిగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్లో (2008) ఏ మాత్రం అంచనాలు లేని రాజస్థాన్ రాయల్స్ను ఛాంపియన్గా నిలబెట్టిన ఘనత లెజెండరీ షేన్ వార్న్దే అన్నది ఎవరూ కాదనలేని నిజం. ఐపీఎల్ అరంగేట్రం సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు నాయకత్వం వహించి, ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన వార్న్ ఇటీవలే గుండెపోటుతో మరణించాడు. ఆటగాడిగా, కెప్టెన్గా, మెంటార్గా తమతో ప్రత్యేక అనుబంధం కలిగిన వార్న్కు రాజస్థాన్ రాయల్స్ ఘనంగా నివాళులర్పించాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం వార్న్ ఆర్ఆర్కు టైటిల్ అందించిన మైదానంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన 2008 ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్... చెన్నై సూపర్ కింగ్స్ను మట్టికరిపించి ఐపీఎల్ తొలి విజేతగా అవతరించింది. ఇప్పుడదే మైదానంలో రాజస్థాన్ రాయల్స్ షేన్ వార్న్ను స్మరించుకునేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఏప్రిల్ 30న డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్కు ముందు ఆర్ఆర్ యాజమాన్యం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వార్న్ కుటుంబానికి చెందిన పలువురు దగ్గరి వ్యక్తులకు ఆహ్వానం పంపింది. వార్న్ సోదరుడు జేసన్ వార్న్ ఈ కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించాడు. ఈ ప్రోగ్రాం స్టార్ స్పోర్ట్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా హ్యాండిల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం సందర్భంగా రాజస్థాన్ ఆటగాళ్లు తమ జెర్సీ కాలర్ పైనా, ప్లేయింగ్ కిట్లపైనా 'SW23' అనే స్టిక్కర్లు పెట్టుకోనున్నారు. చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి అతడే సరైనోడు..! -
షేన్ వార్న్కు కడసారి వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్లు
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్ ఆటగాడు షేన్ వార్న్కు లెజెండరీ క్రికెటర్లు కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. బుధవారం మెల్బోర్న్లోని ఎంసీజీ గ్రౌండ్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులతో పాటు పలువురు ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. గ్లెన్ మెక్గ్రాత్, మైకెల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ తదితర క్రికెటర్లంతా వార్న్తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా ఇయాన్ బోథమ్, గ్లెన్ మెక్గ్రాత్లు వార్న్ సేవలను గుర్తుచేసుకుంటూ కడసారి వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను స్కై స్పోర్ట్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో సచిన్ మాట్లాడుతూ.. ''గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత నేను లండన్కు వెళ్లాను. అక్కడ అనుకోకుండా నా చిరకాల మిత్రుడు షేన్ వార్న్ ఎదురుపడ్డాడు. చాలా కాలం తర్వాత ఇద్దరం కలవడంతో చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఈ సందర్భంలోనే ఇద్దరం కలిసి లండన్లో గోల్ఫ్ క్రీడను ప్రారంభించాలనుకున్నాం. కానీ ఈరోజు వార్న్ అది నెరవేరకుండానే దూరమయ్యాడు. మా ఇద్దరి బంధానికి గుర్తుగా లండన్లో త్వరలోనే గోల్ఫ్ కోర్సును ప్రారంభిస్తాను. కడసారి నా మిత్రునికి వీడ్కోలు పలుకుతున్నా.. భౌతికంగా దూరమైనా మా గుండెల్లో చిరకాలం నిలిచిపోతావు'' అంటూ తెలిపాడు. సచిన్తో పాటు మెక్గ్రాత్, ఇయాన్ బోథమ్లు వార్న్తో తమకున్న అనుబంధాన్ని ఫోటోల రూపంలో వీడియోలో పంచుకున్నారు. చదవండి: Symonds-Shane Warne: 'వార్న్.. సాక్సుల్లో నోట్ల కట్టలు దాచేవాడు' Sachin Tendulkar, Glenn McGrath and Ian Botham pay their tributes to Shane Warne at the memorial service at the MCG. pic.twitter.com/2PJo9hYMFe — Sky Sports Cricket (@SkyCricket) March 30, 2022 Shane Warne's father Keith pays tribute to his son at the memorial service at the MCG as the world remembers the legendary Australian cricketer. pic.twitter.com/07TFQHPxTW — Sky Sports Cricket (@SkyCricket) March 30, 2022 -
'వార్న్.. సాక్సుల్లో నోట్ల కట్టలు దాచేవాడు'
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ భౌతికంగా దూరమై నెలరోజులు కావొస్తుంది. బుధవారం మెల్బోర్న్ వేదికగా వార్న్ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహించనుంది. మరికొద్ది గంటల్లో వార్న్ అంత్యక్రియలు ముగియనున్నాయి. ఇప్పటికే ఆసీస్ ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సహా చాలా మంది క్రికెట్ అభిమానులు వార్న్కు కడసారి వీడ్కోలు పలికేందుకు మెల్బోర్న్కు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్.. దిగ్గజ స్పిన్నర్తో ఉన్న జ్ఞాపకాలను పంచకున్నాడు. ''కొన్నేళ్ల పాటు డ్రెస్సింగ్రూమ్లో మా ఇద్దరి మధ్య చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక విషయం మాత్రం ఎప్పటికి మరిచిపోను. సౌతాఫ్రికాతో బాక్సింగ్ టెస్టు అనుకుంటా.. ఆ మ్యాచ్ మూడోరోజు ఆట ప్రారంభమైంది. ఆ సందర్భంలో ఒక పని విషయమై వార్న్ దగ్గరికి వెళ్లాను. అయితే అప్పటికే వార్న్ తన హెల్మెట్ పక్కన సాక్సులను గది మొత్తం పరిచాడు. ఆ సాక్సుల్లో వంద ఆస్ట్రేలియన్ డాలర్ల నోట్ల కట్టలు ఉండలుగా చుట్టు ఉన్నాయి. ఇదంతా చూసి ఏంటిదంతా.. డబ్బు అంతా ఎక్కడిది అని అడిగాను. రాత్రి కాసినో ఆడాను. ఆ గేమ్లో ఈ డబ్బును సొంతం చేసుకున్నాను. . దాదాపు 40 నోట్ల కట్టలు ఉంటాయి.. లెక్కపెట్టడానికి ఒకరోజు పడుతుంది. డబ్బు కింగ్ అన్నది ఇది చూస్తే నీకు అర్థమవుతుంది కదా బ్రదర్ అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి వార్న్ దగ్గర సాక్స్, బూట్లు చాలా ఉండేవి. మేం ఏం పర్యటనకు వెళ్లినా వార్న్ తన వెంట చాలా జతల సాక్స్లు, బూట్లు పట్టుకొచ్చేవాడు.'' అని సైమండ్స్ పేర్కొన్నాడు. చదవండి: ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్లో పాక్ను వెనక్కునెట్టి ఆరో స్థానానికి చేరుకున్న బంగ్లాదేశ్ ICC Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆసీస్ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్ ర్యాంక్లు -
'మా కెప్టెన్ది విచిత్ర వైఖరి.. లేటుగా వచ్చారని బస్ నుంచి దింపేశాడు'
మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2022 షురూ కానుంది. ఈసారి కూడా ప్రారంభ వేడుకలు లేకుండానే సీజన్ ఆరంభం కానుంది. ఇక విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ మనకు భౌతికంగా దూరమైనప్పటికి అతని జ్ఞాపకాలు మాత్రం చాలానే ఉన్నాయి. మార్చి 30న మెల్బోర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అలాంటి వార్న్కు ఐపీఎల్తోనూ విడదీయరాని అనుబంధం ఉంది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్లో తొలి విన్నర్ రాజస్తాన్ రాయల్స్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. అండర్డాగ్స్గా కనిపిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ చాంపియన్గా అవతరించింది. వార్న్ తన కెప్టెన్సీతో పెద్దన్న పాత్ర పోషించగా రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, యూసఫ్ పఠాన్, అజింక్యా రహానే, అప్పటి పాక్ బౌలర్ సోహైల్ తన్వీర్, కమ్రాన్ అక్మల్ లాంటి ఆటగాళ్లు మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. తాజాగా పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ రాజస్తాన్ రాయల్స్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యూసఫ్ పఠాన్, జడేజా, వార్న్ల మధ్య జరిగిన ఒక సంఘటన గురించి వివరించాడు. ''మ్యాచ్కు ముందురోజు ప్రాక్టీస్ చేయడానికి మేం స్టేడియానికి వెళ్లాం. ఆరోజు యూసఫ్ పఠాన్, జడేజాలు ట్రెయినింగ్కు కాస్త ఆలస్యంగా వచ్చారు. వాస్తవానికి నేను కూడా లేటుగానే వచ్చాను. కానీ వార్న్ మా ముగ్గురిని ఒక్క మాట అనలేదు.. క్లాస్ పీకుతాడేమోనని భయపడ్డాం. అయితే ప్రాక్టీస్ ముగించుకొని హోటల్ రూమ్కు బస్సులో బయలేదేరాం. కొద్దిదూరం వెళ్లాకా వార్న్ బస్సు డ్రైవర్తో బస్సు ఆపండి అన్నాడు. ఆ తర్వాత జడేజా, పఠాన్ల వైపు తిరిగి మీరిద్దరు ఇక్కడ దిగి హోటల్ రూమ్ వరకు నడుచుకుంటూ రండి అని చెప్పాడు. అంతే పఠాన్, జడేజా ముఖాలు వాడిపోయాయి. వార్న్ సైలెంట్గా పనిష్మెంట్ ఇస్తాడని ఆ క్షణమే మనసులో అనుకున్నా. ఆ సందర్బం గుర్తొచ్చినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది.'' అంటూ పేర్కొన్నాడు. ఇక 2008 మినహా మరోసారి టైటిల్ గెలవని రాజస్తాన్ రాయల్స్ ఈసారి కప్ కొట్టాలనే కసితో ఉంది. అందుకు తగ్గట్లే.. మెగావేలంలో అశ్విన్, చహల్, హెట్మైర్, జేమ్స్ నీషమ్ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ఈసారి కప్ సాధించాలనే పట్టదలతో ఉన్నాడు. మార్చి 29న ఎస్ఆర్హెచ్తో రాజస్తాన్ రాయల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: IPL 2022: టోక్యో ఒలింపిక్స్ విజేతలను సత్కరించనున్న బీసీసీఐ CSK VS KKR: ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ రికార్డులేంటో చూద్దాం..! -
Shane Warne: ‘నా గుండె నొప్పితో విలవిల్లాడుతోంది’
‘‘నా గుండె ముక్కలవుతోంది. నొప్పితో విలవిల్లాడుతోంది. షేన్ అంత్యక్రియలకు హాజరుకాలేకపోవడం బాధను రెట్టింపు చేస్తోంది. గత రాత్రి షూట్ వల్ల నేను అక్కడికి వెళ్లలేకపోతున్నా. ఈ ఫొటోలు మా ఎంగేజ్మెంట్ సందర్భంగా శ్రీలంకలో తీసుకున్నవి. అప్పుడు మా పిల్లలంతా మాతోనే ఉన్నారు. అవి సంతోషకర క్షణాలు. తను వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ షేన్ వార్న్ మాజీ ప్రేయసి ఎలిజబెత్ హర్లే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాగా ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మార్చి 4న థాయ్లాండ్లోని తన విల్లాలో హఠాన్మరణం చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో మార్చి 20న అతడి భౌతిక కాయానికి ఆస్ట్రేలియాలో అంత్యక్రియలు(ప్రైవేట్ ప్యునరల్) నిర్వహించారు. అత్యంత ఆప్తుల నడుమ అంతిమ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే, షూటింగ్ కారణంగా వార్న్ మాజీ ప్రేయసి, నటి ఎలిజబెత్ ఇందులో భాగం కాలేకపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె భావోద్వేగ నోట్ షేర్ చేశారు. తన నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఫొటోలను పంచుకుంటూ వార్న్ కడసారి చూపునకు నోచుకోలేదంటూ ఉద్వేగానికి లోనయ్యారు. భౌతికంగా వార్న్ దూరమైనా అతడి జ్ఞాపకాలు చిరకాలం నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన వార్న్, ఎలిజబెత్ 2011 సెప్టెంబరులో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ, రెండేళ్లకే వీరి బంధం బీటలు వారింది. 2013లో ఈ జంట విడిపోయింది. ఇక వార్న్ సంతానం విషయానికొస్తే.. భార్య సిమోనే కాలన్తో అతడు ముగ్గురు పిల్లలు కలిగారు. వీరిద్దరు 2005లో విడిపోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: IND VS SL Pink Ball Test: పింక్బాల్ టెస్ట్పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Elizabeth Hurley (@elizabethhurley1) -
ఆప్తుల నడుమ స్పిన్ దిగ్గజం షేర్వార్న్ అంత్యక్రియలు (ఫొటోలు)
-
కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ స్పిన్ మాంత్రికుడికి కడసారి వీడ్కోలు
స్పిన్ మాంత్రికుడు, క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఈనెల (మార్చి) 4న థాయ్లాండ్లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ (మార్చి 20) వార్న్ భౌతిక దేహానికి కుటుంబసభ్యులు, అత్యంత ఆప్తుల నడుమ ప్రైవేట్ ఫ్యునరల్ నిర్వహించారు. మెల్బోర్న్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం 80 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో వార్న్ తల్లిదండ్రులు కీత్, బ్రిగెట్, అతడి ముగ్గురు పిల్లలు, వార్న్కు ఆన్ ఫీల్డ్లో అత్యంత ఆప్తులైన గ్లెన్ మెక్గ్రాత్, మార్క్ వా, ఆండ్రూ సైమండ్స్, మైకేల్ క్లార్క్, మార్క్ టేలర్, ఆసీస్ మాజీ పేసర్ మెర్వ్ హ్యూస్, ఆసీస్ మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తదితరులు ఉన్నారు. Shane Warne's family and friends bid the cricketing legend farewell at a private memorial service at the St Kilda Football Club in Melbourne — ESPNcricinfo (@ESPNcricinfo) March 20, 2022 ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధ్వర్యంలో వార్న్ అంత్యక్రియలు ఈనెల 30న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమం సుమారు లక్షల మంది అభిమానుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనుంది. ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు, వార్న్తో అనుబంధమున్న ఆటగాళ్లు ఈ ఈవెంట్కు హాజరయ్యే అవకాశముంది. వార్న్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇదివరకే ఐపీఎల్ యాజమాన్యం నుంచి అనుమతి పొందాడు. కాగా, వార్న్ తన పదిహేనేళ్ల కెరీర్లో వెయ్యికి పైగా వికెట్లు పడగొట్టాడు. ఇందులో 708 టెస్ట్ వికెట్లు, 293 వన్డే వికెట్లు ఉన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: షేన్ వార్న్ అంత్యక్రియలకు తేదీ ఖరారు -
వారం తర్వాత మెల్బోర్న్ చేరిన వార్న్ భౌతిక కాయం..
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ స్పిన్ లెజెండ్ షేన్వార్న్ పార్థివ దేహం మెల్బోర్న్కు చేరుకుంది. బ్యాంకాక్లో గత శుక్రవారం గుండెపోటుతో 52 ఏళ్ల వార్న్ హఠాన్మరణం చెందాడు. అతని భౌతిక కాయంపై ఆస్ట్రేలియా జాతీయ పతాకాన్ని ఉంచారు. థాయ్లాండ్ నుంచి ప్రైవేటు జెట్ విమానంలో అతని పార్థివ దేహాన్ని సన్నిహితులు, వ్యక్తిగత సహాయకుడు స్వదేశానికి తీసుకొచ్చారు. తన కెరీర్కే వన్నె తెచ్చిన ఎంసీజీలో ఈ నెల 30న ప్రభుత్వ లాంఛనాలతో వార్న్ అంత్యక్రియలు చేసేందుకు ఆస్ట్రేలియా నిర్ణయించింది. సుమారు లక్ష మంది ఇందులో పాల్గొనే అవకాశముంది. చదవండి: Jofra Archer: ఖుషీలో ముంబై ఇండియన్స్.. రాడనుకున్న ఆర్చర్ వచ్చేస్తున్నాడు..! వీడియో: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
వార్న్ అంత్యక్రియలకు వార్నర్.. ఆందోళనలో ఢిల్లీ క్యాపిటల్స్
David Warner To Attend Warne Funeral: ఇటీవల కన్నుమూసిన స్పిన్ మాంత్రికుడు, లెజెండరీ బౌలర్ షేన్ వార్న్ అంత్యక్రియలకు తప్పక హాజరు కావాలని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న వార్నర్.. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే తన అభిమాన క్రికెటర్ తుది వీడ్కోలు కార్యక్రమానికి హాజరవుతానని వెల్లడించాడు. పాక్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఈనెల 25తో ముగియనుండగా, వార్న్ అంతిమ సంస్కారాలు ఈనెల 30న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్నాయి. ఇదిలా ఉంటే, వార్నర్ తీసుకున్న ఈ నిర్ణయం అతని ఐపీఎల్ జట్టైన ఢిల్లీ క్యాపిటల్స్పై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఈనెల 26 నుంచి ప్రారంభంకానుండగా, వార్నర్ తాజా నిర్ణయంతో డీసీ జట్టు పలు మ్యాచ్లకు అతని సేవలు కోల్పోనుంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం వార్నర్.. ఈ తేదీలో పాక్ పర్యటనలోనే ఉండాలి. అయితే, ఏప్రిల్ 6 వరకు సాగే ఈ పర్యటనలో వన్డే సిరీస్ (3 వన్డేలు)తో పాటు ఏకైక టీ20లో పాల్గొనని వార్నర్ ముందుగానే ప్రకటించాడు. ఐపీఎల్ మ్యాచ్లు మిస్ కాకూడదనే ఉద్దేశంతో వార్నర్ ఇదివరకే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాడు. మరోవైపు పాక్ పర్యటన కారణంగా పలువురు ఆసీస్ ఆటగాళ్లు.. ఐపీఎల్ 2022 ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. ఏప్రిల్ 6తో పాక్ సిరీస్ ముగిసినప్పటికీ, భారత్లో క్వారంటైన్ నిబంధనల కారణంగా వారు మరో వారం రోజులపాటు బెంచ్కే పరిమితమవుతారు. ఈలోపు లీగ్లో దాదాపు 25 మ్యాచ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లను సొంతం చేసుకున్న ఆయా ఫ్రాంచైజీలు గగ్గోలు పెడుతున్నాయి. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ జట్టు వార్నర్ను రూ. 6.5 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: భారత జట్టు నుంచి ఔట్.. ఇంగ్లండ్లో ఆడనున్న పుజారా! -
చనిపోవడానికి 8 గంటల ముందు మెసేజ్ చేశాడు.. అప్పుడు: గిల్క్రిస్ట్
హఠాన్మరణం చెందిన దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ను తలచుకుని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్క్రిస్ట్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చనిపోవడానికి ఎనిమిది గంటల ముందు తనకు మెసేజ్ చేశాడంటూ సహచర ఆటగాడిని గుర్తు చేసుకున్నాడు. తన నుంచి వచ్చిన ఆ సందేశాన్ని ఎన్నడూ డెలిట్ చేయనంటూ ఉద్వేగానికి గురయ్యాడు. కాగా మార్చి 4న థాయ్లాండ్లోని విల్లాలో వార్న్ అకాల మరణం చెందిన విషయం విదితమే. అప్పటి వరకు సరాదాగా గడిపిన స్పిన్ మాంత్రికుడు హఠాన్మరణం చెందాడు. ఈ నేపథ్యంలో అతడి భౌతిక కాయాన్ని శుక్రవారం నాటికి ఆస్ట్రేలియాకు పంపించనున్నారు. ఈ క్రమంలో ఏబీసీ న్యూస్తో మాట్లాడిన గిల్క్రిస్ట్ వార్న్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘తనతో మాట్లాడి వారం కావస్తోంది. బహుశా తను చనిపోవడానికి ఎనిమిది గంటల ముందు అనుకుంటా.. నాకో చక్కని సందేశం పంపాడు. నన్ను ముద్దుగా చర్చ్ అని పిలిచేవాడు. ఈ నిక్నేమ్ మా స్నేహితుల్లో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. చనిపోవడానికి ముందు పంపిన మెసేజ్లో.. ‘‘చర్చ్, రాడ్ మార్ష్కు నువ్వు ఘన నివాళి అర్పించావు’’ అని కొనియాడాడు. అదే చివరిసారి తను నాకు పంపిన సందేశం. దానిని నా జీవితంలో డెలిట్ చేయను’’ అని గిల్క్రిస్ట్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఆసీస్ క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ మృతి చెందిన గంటల వ్యవధిలోనే వార్న్ సైతం తుదిశ్వాస విడవడం గమనార్హం. చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే! -
ఆస్ట్రేలియాకు షేన్ వార్న్ భౌతికకాయం
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించేందుకు థాయ్లాండ్ అధికారులు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం బ్యాంకాక్ ఎయిర్పోర్టుకు వార్న్ మృతదేహాన్ని తరలించారు. రేపటిలోగా మృతదేహం ఆస్ట్రేలియాకు తరలించేలా అధికారులు ప్లాన్ చేశారు. ఇక వార్న్ శవపరీక్షకు సంబంధించి అటాప్సీ రిపోర్టు సోమవారం వచ్చిన సంగతి తెలిసిందే. రిపోర్టులో వార్న్ది సాధారణ మరణమేనని పోలీసులు ధ్రువీకరించారు. ఇక వార్న్ అంత్యక్రియలు మార్చి 30న ప్రభుత్వ అధికార లాంచనాలతో నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈ నెల 30న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో వార్న్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అతని అభిమానులు, సన్నిహితులు, బంధువులు కడసారి వీడ్కోలు పలికేందుకు వీలుగా ఎంసీజీని వేదికగా చేశామని విక్టోరియా రాష్ట్ర ముఖ్యమంత్రి డానియెల్ అండ్రూస్ వెల్లడించారు. ఎంసీజీ వార్న్కు విశిష్టమైన వేదిక. అక్కడే 1994లో జరిగిన యాషెస్ సిరీస్లో హ్యాట్రిక్తో అందరికంటా పడ్డాడు. తర్వాత 2006లో అచ్చొచ్చిన ఆ వేదికపైనే 700వ వికెట్ తీశాడు. బ్యాంకాక్లోని విల్లాలో స్నేహితులతో గడిపేందుకు వచ్చిన 52 ఏళ్ల వార్న్ ఈనెల 4న గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. చదవండి: Shane Warne: 'వార్న్ భుజాలు బలమైనవి'... రహస్యం తెలుసన్న అశ్విన్ -
వార్న్ చనిపోవడానికి నాలుగు గంటల ముందు రూంలో ఏం జరిగింది.. ఆ నలుగురు ఎవరు..?
స్పిన్ మాంత్రికుడు, లెజెండరీ బౌలర్ షేన్ వార్న్ ఈనెల (మార్చి) 4న థాయ్లాండ్లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే. వార్న్ది సహజ మరణమేనని (గుండెపోటు) అటాప్సి రిపోర్టు సైతం దృవీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ఫుటేజ్ రకరకాల అనుమానాలకు తావిస్తూ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వార్న్ మృతి చెందడానికి నాలుగు గంటల ముందు నలుగురు యువతులు అతని రూమ్లో వెళ్లిన దృశ్యాలు విల్లాలోని సీసీ కెమరాల్లో రికార్డై ఉన్నాయి. వార్న్ బ్రతికుండగా చివరిసారిగా చూసింది ఈ నలుగురేనని స్థానిక పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ నలుగురు ఎవరు.. వార్న్ రూమ్లో వారు ఏం చేస్తున్నారని పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. చనిపోయిన రోజు మధ్యాహ్నం (1: 53 గంటల సమయం) వార్న్.. నలుగురు మసాజ్ చేసే అమ్మాయిలను రూంకు పిలిపించుకున్నాడని, వారిలో ఇద్దరు వార్న్ స్నేహితుల రూంలోకి వెళ్లగా మరో ఇద్దరు వార్న్తో గంటకు పైగా గడిపారని, అనంతరం వారంతా తిరిగి 2: 58 గంటల సమయంలో రూం నుంచి వెళ్లిపోయారని సీసీ కెమరాల్లో రికార్డైన టైమ్ ఆధారంగా తెలుస్తోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనానికి వస్తానన్న వార్న్ ఎంతకీ రాకపోవడంతో అతని స్నేహితులు సాయంత్రం 5: 15 గంటలకు వార్న్ రూంకు వెళ్లారు. అయితే అప్పటికే వార్న్ ప్రాణాలు కోల్పోయి బెడ్పై నిర్జీవంగా పడి ఉన్నాడు. ఈ క్రమంలో స్నేహితులు వార్న్కు సీపీఆర్ చేస్తుండగా రక్తం కక్కుకున్నట్లు, అవే మరకలు టవల్పై, ఫ్లోర్పై పడ్డాయని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని వార్న్ స్నేహితులు కూడా అంగీకరించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీసిన పోలీసులు.. వార్న్ అతని స్నేహితులు మసాజ్ కోసం అమ్మాయిలను పిలిపించుకున్న మాట వాస్తవమేనని, అయితే అప్పటికే వార్న్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని, ఈ కేసులో వార్న్ స్నేహితులకు కాని, మసాజ్ చేసిన అమ్మాయిలకు కాని ఎటువంటి సంబంధం లేదని, వార్న్ అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే మరణించాడని నిర్ధారించారు. వార్న్ను చివరిసారిగా చూసిన అమ్మాయిలను గుర్తించాల్సి ఉందని థాయ్ పోలీసులు పేర్కొన్నారు. చదవండి: షేన్ వార్న్ అంత్యక్రియలకు తేదీ ఖరారు -
షేన్ వార్న్ అంత్యక్రియలకు తేదీ ఖరారు
Shane Warne Funeral: ఈనెల (మార్చి) 4న థాయ్లాండ్లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అంత్యక్రియలు ఘనంగా జరపాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీ సాయంత్రం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య వార్న్ తుది వీడ్కోలు కార్యక్రమం నిర్వహించేందుకు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. There's nowhere in the world more appropriate to farewell Warnie than the 'G. Victorians will be able to pay tribute to Shane and his contribution our state, and his sport, at a memorial service at the MCG on the evening of March 30th. Info and tickets will be available soon. — Dan Andrews (@DanielAndrewsMP) March 9, 2022 ఎంసీజీతో వార్న్కు ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా అంతిమ సంస్కారాలు ఇక్కడే నిర్వహించాలనుకున్నామని విక్టోరియా రాష్ట్ర సర్వోన్నతాధికారి డేనియల్ ఆండ్రూస్ బుధవారం వెల్లడించారు. వార్న్ విగ్రహం కూడా ఎంసీజీ బయటే ఉండటంతో అభిమానులంతా అక్కడే నివాళులర్పిస్తున్నారు. వార్న్ పార్ధివ దేహం థాయ్లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు రావాల్సి ఉంది. కాగా, 1969 సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో జన్మించిన వార్న్.. అండర్-19 విభాగంలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1992లో సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వార్న్.. తన స్పిన్ మాయాజాలంతో పదిహేనేళ్ల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాశించాడు. ఈ క్రమంలో 145 టెస్ట్ల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సమకాలీన క్రికెట్లో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చదవండి: Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి -
'వార్న్ భుజాలు బలమైనవి'... రహస్యం తెలుసన్న అశ్విన్
ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 52 ఏళ్ల వార్న్ మార్చి 4న థాయ్లాండ్లోని తన విల్లాలో అచేతన స్థితిలో మృతి చెందడం అందరిని కలిచివేసింది. వార్న్ మరణంపై క్రీడాలోకం తమ అశ్రు నివాళి అర్పిస్తోంది. వార్న్ది సహజ మరణమేనని తేల్చిన పోలీసులు.. భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం వార్న్ అంత్యక్రియలను అధికార లాంచనాలతో జరుపుతామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా వార్న్ మృతిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నివాళి అర్పించాడు. దిగ్గజ స్పిన్నర్గా క్రికెట్ను ఏలిన వార్న్ సేవలు మరువలేనివని.. అతని కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి ప్రకటించాడు. ఈ సందర్భంగా వార్న్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సాధారణంగా వార్న్ భుజాలు చాలా బలంగా ఉండేవని.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తనకు తెలిసిందని అశ్విన్ పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్తో జరిగిన చిట్చాట్లో వార్న్ గురించి కొన్ని విషయాలు తెలిశాయని తెలిపాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా అశ్విన్ మాట్లాడుతూ.. '' కోచ్ ద్రవిడ్తో సంభాషణ సందర్భంగా వార్న్ మృతి ప్రస్తావన మా మధ్య వచ్చింది. దిగ్గజ స్పిన్నర్గా ఆయన సేవలు మరువలేనివి. ఒక స్పిన్నర్కు భుజాలతో పాటు శరీరంలో నడుము పై భాగం బలంగా ఉండాలి.. ఎందుకంటే వివిధ రొటేషన్లు ఉపయోగిస్తూ స్పిన్ బౌలింగ్ చేయాలి. అందుకోసం నెట్స్లో తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఒక లెగ్ స్పిన్నర్ బౌలర్కు భుజాలు మరింత బలంగా ఉండాలి.. అప్పుడే ఆ బౌలర్కు అది అడ్వాంటేజ్గా మారుతుంది. ఈ విషయంలో వార్న్ అదృష్టవంతుడు. అతని భుజాలు చాలా బలమైనవి. ఈ విషయం నాకు రాహుల్ ద్రవిడ్ వల్ల తెలిసింది. వార్న్ బలమైన భుజాల వెనుక ఒక చిన్న కథ ఉంది. వార్న్ పిల్లాడిగా ఉన్నప్పుడు.. ఒక సందర్భంలో తన రెండు కాళ్లు గాయానికి గురయ్యాయి. తన స్నేహితుడు ఆడుకుంటూ కాస్త ఎత్తు నుంచి వార్న్ కాళ్ల మీదకు దూకాడంట. దీంతో అతని రెండు కాళ్లు కాస్త దెబ్బతిన్నాయి. మూడు, నాలుగు వారాల పాటు వార్న్ నడవలేక బెడ్కే పరిమితమయ్యాడు. ఆ సమయంలో తన చేతులను కిందపెట్టి నడవడం అలవాటు చేసుకున్నాడు. ఇది వార్న్లో కసిని పెంచింది. ఆ తర్వాత క్రికెటర్గా మారే సమయంలో.. ఎక్కువగా భుజాలపై ఒత్తిడి తెస్తూ బలంగా తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత వార్న్కు ఎదురు లేకుండా పోయింది. ఒక రకంగా వార్న్ దిగ్గజ స్పిన్నర్గా తయారు కావడానికి తన భుజాలే సక్సెస్ ఫార్ములాగా నిలిచింది.'' అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్విన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక షేన్ వార్న్ 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 15 ఏళ్ల కెరీర్లో వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: 'భయమేస్తే గట్టిగా హత్తుకునేదాన్ని.. మిస్ యూ నాన్న' Shane Warne: ‘నేను వార్న్ను అంతమాట అనకుండా ఉండాల్సింది’ Prithvi Shaw: నా బ్యాటింగ్ చూస్తే అసహ్యమేస్తోంది: పృథ్వీ షా -
'భయమేస్తే గట్టిగా హత్తుకునేదాన్ని.. మిస్ యూ నాన్న'
ఆస్ట్రేలియన్ దిగ్గజం షేన్ వార్న్ భౌతికంగా దూరమై నాలుగు రోజులు కావొస్తుంది. ఇప్పటికి వార్న్కు ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా వార్న్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. కాగా పెద్ద కూతురు సమ్మర్ ''నాన్నకు ప్రేమతో.. అంటూ రాసిన నోట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ''ఇప్పటికే నిన్ను చాలా మిస్సవుతున్నా. చిన్నప్పుడు భయమేస్తే నిన్ను గట్టిగా హత్తుకొని నిద్రపోయేదాన్ని.. కానీ ఇకపై ఆ అవకాశం లేకుండా పోయింది. నీ చివరి క్షణాల్లో నేను పక్కన లేకపోవడం దురదృష్టంగా భావిస్తున్నా. ఆ సమయంలో నీ పక్కన ఉండి ఉంటే.. చేతిని పట్టుకొని ఏం కాదు అంతా సవ్యంగా జరుగుతుంది అని చెబుదామనుకున్నా. అడగకుండానే అన్నీ ఇచ్చారు.. బెస్ట్ డాడీగా ఉండడం మాకు వరం.'' అని పేర్కొంది. ''చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచారు. మీ జోకులతో మమ్మల్ని ఎన్నోసార్లు నవ్వించారు. ఈరోజు భౌతికంగా దూరమయ్యారంటే తట్టుకోలేకపోతున్నా.. మిస్ యూ నాన్న అంటూ వార్న్ చిన్న కూతురు బ్రూక్ ట్వీట్ చేసింది. ''నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటావు. నువ్వో గొప్ప తండ్రివి, స్నేహితుడివి'' అంటూ వార్న్ పెద్ద కుమారుడు జాక్సన్ తన బాధను వ్యక్తం చేశాడు. ''ఇది ఎప్పటికీ ముగిసిపోని పీడకలలాంటిది. వార్న్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాం. అతను అందించిన జ్ఞాపకాలతో బతికేస్తాం’' అని అతని తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్ ఆవేదనతో కుమిలిపోయారు. ఇక గత శుక్రవారం థాయ్లాండ్లోని కోయ్ సమూహ్ ప్రాంతంలోని తన విల్లాలో వార్న్ అచేతన స్థితిలో మరణించాడు. అతని మృతిపై పలు రకాల అనుమానాలు వచ్చినప్పటికి.. వార్న్ది సహజ మరణమేనని థాయ్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. వార్న్ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. వార్న్ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలకు నెలవైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎంసీజీ బయట వార్న్ విగ్రహం ఉండగా, మైదానంలో ఒక స్టాండ్కు కూడా అతని పేరు పెట్టనున్నారు. ఇంకా తేదీ ధ్రువీకరించకపోయినా... వచ్చే రెండు వారాల్లోగా అంత్యక్రియలు నిర్వహించవచ్చు. చదవండి: PAK vs AUS: దంపతులిద్దరు ఒకేసారి గ్రౌండ్లో.. అరుదైన దృశ్యం Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్ల వార్నింగ్.. పది రోజులు ఉండాల్సిందే Shane Warne Death: ‘షేన్ వార్న్ది సహజ మరణమే’ -
‘నేను వార్న్ను అంతమాట అనకుండా ఉండాల్సింది’
ముంబై: ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనికి నివాళులు అర్పి స్తూ నాలుగు మంచి మాటలు చెప్పడం సహజం. బతికినప్పుడు ఎలా ఉన్నా చనిపోయినప్పుడు ప్రత్యర్థులు కూడా ఏదో ఒక మంచి అంశాన్ని ఎంచుకొని తమ స్పందనను తెలియజేస్తారు. కానీ వార్న్ మృతి సమయంలో టీవీ చర్చలో పాల్గొంటూ భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్య తీవ్ర విమర్శలకు దారి తీసింది. వార్న్ గొప్పతనం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘నా దృష్టిలో వార్న్ అత్యుత్తమ స్పిన్నర్ కాదు. భారత స్పిన్నర్లు, ముత్తయ్య మురళీధరన్ అంతకంటే మెరుగైన వాళ్లు. భారత్లో అతని రికార్డు చాలా సాధారణంగా ఉంది. ఒక్కసారి మాత్రమే అది టెయిలెండర్ జహీర్ గుడ్డిగా బ్యాట్ ఊపితే అతను ఐదు వికెట్లు తీయగలిగాడు. భారత్పై రాణించలేకపోయిన వార్న్కంటే మురళీనే గొప్పోడు’ అని గావస్కర్ అన్నాడు. దాంతో అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వార్న్ను విమర్శించేందుకు ఇదా సమయం అనడంతో పాటు పోలికలు తీసుకురావడమేమిటని క్రికెట్ అభిమానులు విరుచుకుపడ్డారు. దాంతో సోమవారం గావస్కర్ దీనిపై వివరణ ఇచ్చాడు. ‘ఆ ప్రశ్న అడిగేందుకు, దానికి నేను జవాబు ఇచ్చేందుకు కూడా అది సరైన సమయం కాదు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో వార్న్ ఒకడు’ అని సన్నీ వ్యాఖ్యానించాడు. నిజానికి భారత గడ్డపై మురళీ సగటు (45.45)కంటే వార్న్ సగటే (43.11) కాస్త మెరుగ్గా ఉంది. చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్పై విమర్శలు! Shane Warne Death: వార్న్ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది -
‘షేన్ వార్న్ది సహజ మరణమే’
మెల్బోర్న్: స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి విషయంలో అనుమానించాల్సిన అంశమేమీ లేదని తేలింది. అతనిది సహజ మరణమేనని, గుండె పోటు కారణంగానే చనిపోయినట్లు థాయ్లాండ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వార్న్ మృతదేహానికి పోస్ట్మార్టమ్ నిర్వహించిన వైద్యుడు థాయ్ పోలీసులకు నివేదిక ఇవ్వగా, దానిని వారు ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి అందజేశారు. ‘వార్న్ మృతికి సంబంధించి సందేహించాల్సిన అంశాలేమీ కనపడలేదు. ఇది హత్య కాదు. అతను సహజంగానే చనిపోయినట్లు పోస్ట్మార్టమ్ చేసిన డాక్టర్ వెల్లడించారు. అంతకుముందే తనకు ఛాతీలో కొంత నొప్పి వస్తోందని, థాయ్లాండ్ నుంచి తిరిగి రాగానే వైద్యులను కలుస్తానని వార్న్ తన తండ్రితో కూడా చెప్పాడు’ అని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సురచటే హక్పర్న్ స్పష్టం చేశారు. మరోవైపు సెలవుల కోసం థాయ్లాండ్ వెళ్లడానికి ముందే వార్న్ ఛాతీ నొప్పితో బాధపడినట్లు, అతని డైట్లో మార్పు కూడా అందుకు కారణం కావచ్చని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కైన్ వెల్లడించాడు. ‘బరువు తగ్గే క్రమంలో వార్న్ కఠోర ఆహార నియమాలను అలవాటు చేసుకున్నాడు. థాయ్ వెళ్లే ముందు రెండు వారాలుగా అతను కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ వచ్చాడు. అతను తన జీవితంలో చాలా ఎక్కువగా ధూమపానం చేసేవాడు. బహుశా అది కూడా గుండెపోటుకు కారణం కావచ్చేమో’ అని అతను వివరించాడు. అధికారిక లాంఛనాలతో... వార్న్ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. వార్న్ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలకు నెలవైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎంసీజీ బయట వార్న్ విగ్రహం ఉండగా, మైదానంలో ఒక స్టాండ్కు కూడా అతని పేరు పెట్టనున్నారు. ఇంకా తేదీ ధ్రువీకరించకపోయినా... వచ్చే రెండు వారాల్లోగా అంత్యక్రియలు నిర్వహించవచ్చు. దేశ ప్రధాని స్కాట్ మోరిసన్, విక్టోరియా ముఖ్యమంత్రి డానియెల్ ఆండ్రూస్ అంత్యక్రియలకు హాజరవుతారు. ‘ఇది ఎప్పటికీ ముగిసిపోని పీడకలలాంటిది. వార్న్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాం. అతను అందించిన జ్ఞాపకాలతో బతికేస్తాం’ అని అతని తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్ ఆవేదనగా చెప్పగా... ‘నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటావు. నువ్వో గొప్ప తండ్రివి, స్నేహితుడివి’ అంటూ అతని కుమారుడు జాక్సన్ తన బాధను వ్యక్తం చేశాడు. థాయ్లాండ్ నుంచి వార్న్ మృతదేహం ఇంకా అతని ఇంటికి చేరలేదు. -
షేన్ వార్న్లా గుండెపోటుకు గురైన మరో క్రికెటర్.. గంటన్నరలో 40 సార్లు..!
Madhya Pradesh Cricketer Had Heart Attack In Clinic: ఇటీవలి కాలంలో చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా గుండెపోటు సమస్య అన్ని వయస్కుల వారి ప్రాణాలను హరిస్తుంది. నిత్యం మైదానంలో గడుపుతూ, పూర్తి ఫిట్ నెస్తో ఉన్న వారిని కూడా ప్రాణాంతక సమస్య వదిలి పెట్టడం లేదు. ఇటీవలి కాలంలో క్రికెటర్లు ఎక్కువగా హార్ట్ ఎటాక్ బారిన పడటమే ఇందుకు ఉదాహరణ. మొన్నటికి మొన్న కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీలు గుండెపోటు కారణంగా ఆస్పత్రి పాలవ్వగా.. తాజాగా దిగ్గజ స్పిన్నర్, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అదే గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21న బేతుల్లోని ఆమ్లాలో నివసిస్తున్న 25 ఏళ్ల క్రికెటర్కు విపరీతమైన ఛాతీ నొప్పి వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో నొప్పి భరించలేని స్థాయికి వెల్లడంతో కుటుంబ సభ్యులు అతన్ని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్ కోసం రిసెప్షన్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ యువకుడికి గంటన్నర సమయంలో ఏకంగా నలభై సార్లు గుండె ఆగిపోయింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మరో డాక్టర్ యువకుడికి ప్రథమ చికిత్స అందించి ఐసీయులోకి తీసుకెళ్లాడు. కార్డియాక్ మసాజ్తో పాటు కరెంట్ షాక్ లాంటివి ఇస్తూ అతని గుండెను మళ్లీ కొట్టుకునేలా చేశాడు. ఈ తతంగం మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. కాగా, ప్రధమ చికిత్స అనంతరం ఆ యువకుడిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించగా గుండెలో 80 శాతం బ్లాకేజ్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. సర్జరీ అనంతరం ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటున్నాడు. చదవండి: షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..! -
షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..!
Shane Warne Had Been On Extreme Liquid Diet Before Death: స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణంపై థాయ్ పోలీసులు జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. తొందరగా బరువు తగ్గాలనే ఆలోచనలో వార్న్ 14 రోజుల కఠినమైన లిక్విడ్ డైట్ (ద్రవ రూపంలో ఉన్న ఆహారం) ఫాలో అయ్యాడని, ఇదే అతని మరణానికి పరోక్షంగా కారణమైందని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మృతి చెందడానికి ఒక్క రోజు ముందే వార్న్ తన డైట్ షెడ్యూల్ను పూర్తి చేశాడని, గతంలో కూడా అతను ఇలాంటి అర్థం పర్థం లేని డైట్లు ఫాలో అయ్యేవాడని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ తెలిపాడు. థాయ్లాండ్ వెకేషన్కు బయల్దేరే ముందు ఛాతీలో నొప్పి వస్తుందని, విపరీతంగా చమటలు పడుతున్నాయని వార్న్ తనతో చెప్పాడని ఎర్స్కిన్ వెల్లడించాడు. ఇటీవలే హార్ట్ చెకప్ కోసం డాక్టర్ను కూడా కలిశాడని ఆయన పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, వార్న్ గుండెపోటుతోనే మరణించాడని అటాప్సి నివేదికలో వెల్లడైనట్లు థాయ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. వార్న్ విల్లా గదిలో ఫ్లోర్తో పాటు టవల్స్పై రక్తపు మరకల్ని గుర్తించిన మాట వాస్తవమేనని, సీపీఆర్ చేసే క్రమంలో వార్న్ రక్తపు వాంతులు చేసుకున్నాడని వారు పేర్కొన్నారు. వార్న్ మరణానికి ముందు మద్యం తీసుకోలేదని, గత కొంతకాలంగా అతను మద్యం తీసుకున్నట్లు రుజువులు లేవని స్పష్టం చేశారు. Operation shred has started (10 days in) & the goal by July is to get back to this shape from a few years ago ! Let’s go 💪🏻👏🏻 #heathy #fitness #feelgoodfriday pic.twitter.com/EokgT2Hyhz — Shane Warne (@ShaneWarne) February 28, 2022 వార్న్కు గుండెపోటు రావడానికి కఠినమైన డైట్తో పాటు తీవ్రమైన వర్కౌట్స్ కారణమయ్యాయని, ఫిబ్రవరి 28 వార్న్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తుందని వెల్లడించారు. వార్న్ చేసిన ట్వీట్లో తన ఫోటోను షేర్ చేసి మరికొద్ది రోజుల్లో ఇలా తయారవుతానని, ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభమై 10 రోజులు అవుతుందని, జూలై కంతా ఫిట్గా తయారవ్వడమే లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా, వెకేషన్ ఎంజాయ్ చేయడానికి థాయ్లాండ్కు వెళ్లిన వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతికి గురైంది. చదవండి: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! -
వార్న్ లెజెండ్, గొప్ప వ్యక్తి అని విని షాకయ్యా: పాక్ క్రికెటర్
తొందరపాటు చర్యల వల్ల ఒక్కోసారి విమర్శలపాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో చేసే పోస్టుల్లో చిన్న తప్పు దొర్లితే చాలు ట్రోలింగ్ బారిన పడాల్సి వస్తుంది. పాకిస్తాన్ వివాదాస్పద క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మరణం చెందిన విషయం విదితమే. మార్చి 4న థాయ్లాండ్లోని విల్లాలో తుది శ్వాస విడిచాడు. ఈ క్రమంలో లెజెండ్ మృతి పట్ల దిగ్భ్రాంతి చెందిన సహచర ఆటగాళ్లు, ఇతర క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. ఆమిర్ సైతం వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించాడు. అయితే, ఇందుకు సంబంధించి అతడు చేసిన ట్వీట్లో అన్వయ దోషం వల్ల పూర్తిగా అర్థమే మారిపోయింది. ‘‘అతడు క్రికెట్ లెజెండ్, గొప్ప వ్యక్తి అనడం విని షాకయ్యాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి లెజెండ్’’ అంటూ ఆమిర్ ట్వీట్ చేశాడు. ఒక్క ఫుల్స్టాప్ పెట్టి ఉంటే... ‘‘ఈ విషయం విని షాకయ్యాను. ఆయన లెజెండ్. మంచి మనసున్న వ్యక్తి’’ అనే అర్థం వచ్చేది. కానీ ఆమిర్ ఇది మిస్ కావడంతో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘నీ ఇంగ్లిష్ వింటే వార్న్ ఏడ్చేసేవాడు. చచ్చిపోయి బతికిపోయాడు’ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్లో భాగమయ్యాడన్న కారణంగా ఆమిర్ కొంతకాలం పాటు నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్పై విమర్శలు! Shane Warne: స్పిన్ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! shocked to hear that he was legend of the game and equally a good person . RIP LEGEND 🙏 😔 pic.twitter.com/bv9z0RojyT — Mohammad Amir (@iamamirofficial) March 4, 2022 -
'వార్న్ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది'
'ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం వార్త నా గుండెను ముక్కలు చేసింది' అంటూ అతని మాజీ ప్రియురాలు.. నటి ఎలిజెబెత్ హార్లీ పేర్కొంది. వార్న్ మరణాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ ఎమెషనల్ అయింది. ఈ సందర్భంగా తన మాజీ ప్రియుడికి కడసారి వీడ్కోలు పలుకుతూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వార్న్తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ''వార్న్ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది. అతనితో అనుబంధం విడదీయలేనిది. సూర్యుడు ఎప్పటికి మేఘాల వెనుక దాక్కోవడానికి వెళ్లినట్లుగానే వార్న్ మరణాన్ని ఫీలవుతున్నా.. ఐ మిస్ యూ మై లవ్లీ వార్న్'' అంటూ రాసుకొచ్చింది. ఇక 2007లో మొదటి భార్య సిమోన్తో విడాకుల అనంతరం.. నటి ఎలిజెబెత్ హర్లీతో వార్న్ ప్రేమాయణం నడిపాడు. 2011 సెప్టెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ ఇద్దరు రెండేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. 2013 డిసెంబర్లో వార్న్, హార్లీలు విడిపోయారు. కాగా వార్న్ మృతిపై పలు సందేహాలు ఉన్నాయంటూ థాయ్ పోలీసులు ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వార్న్ మరణించిన గదిలో ఫ్లోర్, టవల్స్పై అధిక మోతాదులో రక్తపు మరకలు గుర్తించామని పేర్కొన్నారు. వార్న్ మరణించడానికి ముందు భయాందోళనలకు గురై, నరక యాతన అనుభవించి ఉంటాడని తెలిపారు. ఆదివారం థాయ్ అధికారులు వార్న్ భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారు. ఒక వేళ వార్న్ది అసాధారణ మరణం అయితే పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది. పోస్టుమార్టం అనంతరం ఆదివారమే వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం స్పిన్ దిగ్గజం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్పై విమర్శలు! Shane Warne: స్పిన్ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! Shane Warne: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు View this post on Instagram A post shared by Elizabeth Hurley (@elizabethhurley1) -
విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్పై విమర్శలు!
టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్పై ఆస్ట్రేలియా మీడియా విరుచుకుపడింది. ఒకవైపు తమ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అస్తమయంతో తామంతా బాధలో ఉంటే.. మీకు ఇప్పుడు ఎవరు గొప్ప అనేది అంత అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇండియా టుడే టెలివిజన్ షోలో గావస్కర్ పాల్గొన్నాడు. వార్న్ గొప్ప సిన్నర్ అనేది మీరు నమ్ముతున్నారా అంటూ ప్రశ్నించారు. దీనిపై గావస్కర్ మాట్లాడుతూ.. ''నా దృష్టిలో వార్న్ కంటే శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, టీమిండియా స్పిన్నర్ల తర్వాతే వార్న్కు స్థానం ఉంటుంది. ఎందుకంటే వార్న్ గొప్ప స్పిన్నర్ కావొచ్చు.. కానీ టీమిండియాపై అతనికి ఫేలవ రికార్డు ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా చెలరేగిపోయే వార్న్ భారత్కు వచ్చేసరికి సాధారణ బౌలర్గా మారిపోయేవాడు. గతంలో నాగ్పూర్ వేదికగా జరిగిన ఒక టెస్టులో వార్న్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అది కూడా జహీర్ఖాన్ రూపంలో వార్న్కు ఐదో వికెట్ లభించింది. అది కూడా కష్టంగానే వచ్చింది. టీమిండియా ఆటగాళ్లు స్పిన్ బాగా ఆడగలరని దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే వార్న్ను గ్రేట్ స్పిన్నర్గా అభివర్ణించలేను. కానీ శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ మాత్రం టీమిండియా ఆటగాళ్లను చాలా ఇబ్బంది పెట్టాడు. అతనికి భారత్పై మంచి రికార్డు ఉంది. అందుకే నా పుస్తకంలో మురళీధరన్ను వార్న్ కంటే ముందు స్థానంలో ఉంచాను.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గావస్కర్ ఇచ్చిన సమాధానంపై ఆసీస్ మీడియాతో పాటు ఫాక్స్ స్పోర్ట్స్, హెరాల్డ్ సన్ లాంటి పత్రికలు.. చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ''గావస్కర్ రికార్డులు గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయమేనా అని ఒకసారి ఆలోచించండి. ఎంతకాదన్న అతను ఒక దిగ్గజ స్పిన్నర్. అలాంటి ఆటగాడు ఇక లేరన్న వార్త క్రికెట్ ప్రపంచంలో విషాదాన్ని నింపిన వేళ మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం అనర్థం. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది.'' అంటూ ఆసీస్ మీడియా ఏకిపారేసింది. ''36 పరుగులు చేయడానికి 174 బంతులు తీసుకున్నావు. జిడ్డు ఆటకు పర్యాయపదంగా మారావు. నీ ఆటను మేం తప్పుబట్టం. కానీ ఇలాంటి భావోద్వేగ సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం బాధాకరం..'' అంటూ ఆసీస్ అభిమాని ట్వీట్ చేశాడు. @SunilGavaskar hopefully someone will bring up your 36 run’s off 174 balls batting through the innings in a 60 over one day match when you’re gone and can’t defend yourself, poor taste no class — peter Jetski (@JetskiPeter) March 7, 2022 ''వార్న్పై గావస్కర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టం. పేరులో సన్నీ ఉన్నంత మాత్రానా మీరు ఇప్పుడు మండిపోవాలా.. వార్న్ శరీరం ఇంకా చల్లబడలేదు.. నిజాయితీగా చెప్పాలంటే ఎవరు గొప్ప అనేది ఇప్పుడు మాట్లాడడం సరికాదు'' అంటూ జాక్ మెండల్ ట్వీట్ చేశాడు. చదవండి: Shane Warne: స్పిన్ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! Shane Warne: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు Shane Warne: దిగ్గజ ఫుట్బాలర్స్తో వార్న్కు దగ్గరి పోలికలు.. మరణం కూడా! Sunil Gavaskar uses Shane Warne's death an an opportunity to say that Indian spinners and Muralitharan were better, because of their records against India. Honestly, Sunny, it's not the time.. could have just sidestepped it. The body isn't even cold yethttps://t.co/jiTzlCQxAX — Jack Mendel 🗞️ (@Mendelpol) March 5, 2022 Very poor commentary by Sunil Gavaskar... How can u nitpick Shane Warne's death and stat, tat too at the time when the entire cricketing fraternity is mourning and shocked by the legends' loss... As days go by, Gavaskar commentary is becoming cringe.. — Biswajoy Kumar Das 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 (@DasBiswajoy) March 5, 2022 Shane Warne's passing away is a big shock....He mastered the art which is very difficult to master which is leg spin: Sunil Gavaskar. #NewsToday #Cricket #RIPShaneWarne | @sardesairajdeep pic.twitter.com/6KqSHf6Tes — IndiaToday (@IndiaToday) March 4, 2022 -
Shane Warne: వార్న్ను తలచుకుని ఒక్కసారిగా ఏడ్చేసిన రికీ పాంటింగ్
‘‘మిగతా వాళ్లలాగే నేను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. పొద్దున నిద్ర లేవగానే మెసేజ్లు వెల్లువెత్తాయి. నా కుమార్తెను పొద్దున్నే నెట్బాల్ ఆడటానికి తీసుకువెళ్లాలనే ప్లాన్తో గత రాత్రి నిద్రపోయాను. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. తనతో మడిపడిన జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. నా జీవితంలో తనొక భాగం’’ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాడు షేన్ వార్న్ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా ఆసీస్ క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. థాయ్లాండ్లోని విల్లాలో ప్రాణాలు వదిలారు. ఈ విషాదం నుంచి క్రీడా ప్రపంచం ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో వార్న్ సహచర ఆటగాళ్లు, అభిమానులు అతడిని తలచుకుని ఉద్వేగానికి లోనవుతున్నారు. మణికట్టుతో మాయ చేసే కింగ్ ఆఫ్ స్పిన్ను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ సైతం దుఃఖం ఆపుకోలేక బోరున ఏడ్చేశాడు. ఇక 15 ఏళ్ల వయసులో క్రికెట్ అకాడమీలో వార్న్ను కలిశానన్న 47 ఏళ్ల పాంటింగ్... వార్న్ తనకు ఓ నిక్నేమ్ పెట్టాడంటూ గుర్తు చేసుకున్నాడు. దశాబ్దకాలం పాటు కలిసి క్రికెట్ ఆడామని, కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామంటూ అతడితో సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ నివాళి అర్పించాడు. కాగా రికీ పాంటింగ్ సారథ్యంలో వార్న్ అనేక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలో వీరి మధ్య అనుబంధం ఏర్పడింది. చదవండి: Shane Warne: స్పిన్ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! -
షేన్ వార్న్ మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..!
స్పిన్ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) శుక్రవారం థాయ్లాండ్లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ ఆకస్మిక మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన థాయ్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. వార్న్ మరణించిన గదిలో ఫ్లోర్, టవల్స్పై అధిక మోతాదులో రక్తపు మరకలు గుర్తించామని పేర్కొన్నారు. వార్న్ మరణించడానికి ముందు భయాందోళనలకు గురై, నరక యాతన అనుభవించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, వార్న్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి, ఆసుపత్రికి తరలించడానికి ముందు సీపీఆర్ చేశామని, గుండెపై ఒత్తిడి తెచ్చే క్రమంలో అతను రక్తపు వాంతులు చేసుకున్నాడని వార్న్ స్నేహితులు ప్రాధమిక విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఆదివారం థాయ్ అధికారులు వార్న్ భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు సోమవారం వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ వార్న్ది అసాధారణ మరణం అయితే పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది. పోస్టుమార్టం అనంతరం ఆదివారమే వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం స్పిన్ దిగ్గజం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, 1992-2007 మధ్య 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్కు సేవలందించిన వార్న్..145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా వార్న్ రికార్డుల్లో నిలిచాడు. చదవండి: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు -
దిగ్గజ ఫుట్బాలర్స్తో వార్న్కు దగ్గరి పోలికలు.. మరణం కూడా!
ఆస్ట్రేలియన్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ క్రికెట్లో రారాజు అనడంలో సందేహం లేదు. బంతిని నైపుణ్యంతో తిప్పడంలో అతనికి ఎవరు సాటిరారు. గింగిరాలు తిరిగే బంతి పిచ్పై పడి ఎటు వెళుతుందో తెలుసుకునే లోపే ప్రత్యర్థిని పెవిలియన్ చేర్చడం వార్న్ శైలి. క్రికెట్లో రారాజుగా వెలుగొందిన వార్న్కు.. ఆఫ్ ఫీల్డ్లో మాత్రం మాయని మచ్చలు చాలానే ఉన్నాయి. -సాక్షి, వెబ్డెస్క్ ముఖ్యంగా డ్రగ్స్, ఆల్కాహాల్, మహిళలతో ప్రేమాయణాలు, అమ్మాయిలకు అసభ్యకర సందేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మైదానం వెలుపల ఇన్ని చేసినప్పటికి వార్న్కు అభిమానగణం ఇసుమంతైనా తగ్గలేదు. తాజాగా వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. తమ అభిమాన క్రికెటర్కు వీడ్కోలు పలుకుతూ తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో వార్న్కు ఎవరు పోటీ లేరు అనుకుంటున్న మనకు.. క్రికెట్ వెలుపల మాత్రం ఇద్దరు ఫుట్బాల్ స్టార్ ఆటగాళ్లతో షేన్ వార్న్కు చాలా పోలికలు ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా అయితే.. రెండో వ్యక్తి నార్తన్ ఐరిష్ స్టార్ ఫుట్బాలర్ జార్జ్ బెస్ట్.. మీకు తెలుసో లేదో.. ఈ ముగ్గురి జీవితాలు పరిశీలిస్తే ఒకే రీతిలో ఉంటాయి. వార్న్, మారడోనా, జార్జ్ బెస్ట్ ఆటలో ఎంత పేరు సంపాదించారో.. వ్యక్తిగత జీవితంలో అంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురిలో ఉన్న పోలికలు ఒకసారి తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం. అవేంటో ఒకసారి చూడండి. ►వార్న్ క్రికెట్లో రారాజుగా వెలుగొందితే.. మారోడనా, జార్జ్ బెస్ట్లు తమ కాలాల్లో ఫుట్బాల్లో స్టార్ ప్లేయర్లుగా సత్తా చాటారు. ఫుట్బాల్ ఆటలో మారడోనా, బెస్ట్లు తమ పాదాలతో గోల్ కొట్టడంలో నైపుణ్యం ప్రదర్శిస్తే.. వార్న్ లెగ్ స్పిన్నర్గా క్రికెట్లో తన మణికట్టు మాయజాలాన్ని ప్రదర్శించి వికెట్లు తీసేవాడు. ►వార్న్ లాగే మారడోనా, జార్జ్ బెస్ట్ మద్యానికి, డ్రగ్స్కు అలవాటు పడినవారే.. అమ్మాయిలతో రాసలీలలు.. అసభ్యకరమైన సందేశాలు పంపించడం చేశారు. ఈ విషయంలో మాత్రం జార్జ్ బెస్ట్కు మినహాయింపు జార్జ్ బెస్ట్ నార్తన్ ఐర్లాండ్ స్టార్ ఫుట్బాలర్ ► 1974లో జార్జ్ బెస్ట్ మాంచెస్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఒక మ్యాచ్ సందర్భంగా ఫుల్లుగా తాగి వచ్చాడు. విషయం తెలుసుకున్న జట్టు మేనేజర్ బెస్ట్ను డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు గెంటేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బెస్ట్ మ్యాచ్లు ఆడకుండా మాంచెస్టర్ సిటీ అతడిపై నిషేధం విధించింది. ► మారడోనా కూడా 1994 వరల్డ్కప్కు ముందు ఈఫిడ్రైన్ అనే నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. టెస్టులు చేయగా పాజిటివ్ రావడంతో ఫిఫా అతనిపై నిషేధం విధించింది. దీంతో మారడోనా వరల్డ్కప్కు దూరమయ్యాడు. మారడోనా విగ్రహం ►వార్న్ కూడా 2003 వరల్డ్కప్ ప్రారంభానికి ముందు డోపింగ్ టెస్టులో పట్టుబడడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వార్న్పై నిషేధం విధించింది. ►ఇక నిషేధం తర్వాత మారడోనా లాగే వార్న్ కూడా స్టెరాయిడ్స్కు దూరంగా ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి ►మారడోనాకు ఫుట్బాల్లో ''గోల్ ఆఫ్ ది సెంచరీ'' ఉన్నట్లే.. క్రికెట్లో వార్న్కు ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' ఉండడం విశేషం. ►1986 ఫిఫా వరల్డ్కప్ సందర్భంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో మారడోనా 60 గజాల దూరం నుంచి బంతిని గోల్పోస్ట్లోకి తరలించడం చరిత్రలో నిలిచిపోయింది. 2002లో ఫిఫా డాట్కామ్ నిర్వహించిన సర్వేలో మారోడోనా కొట్టిన గోల్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో మారడోనా గోల్ను ఫిఫా.. ''గోల్ ఆఫ్ ది సెంచరీ''గా పేర్కొంది. మారడోనా గోల్ ఆఫ్ ది సెంచరీ; వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ ►ఇక వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ విషయానికి వస్తే.. 1993లో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్లో మాంచెస్టర్ వేదికగా తొలి టెస్టు జరిగింది. ఆట రెండోరోజు వార్న్ మైక్ గాటింగ్కు అద్బుత బంతి వేశాడు. లెగ్స్టంప్ అవతల నుంచి వెళ్లిన బంతి అనూహ్యంగా టర్న్ అయి ఆఫ్ స్టంప్ వికెట్ను ఎగురగొట్టడం క్రీడా పండితుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. అసలు బంతి ఎలా తిరిగిందన్నది ఇప్పటికి మిస్టరీగానే ఉండిపోయింది. బ్యాట్స్మన్ మైక్ గాటింగ్తో పాటు అంపైర్ కూడా ఆశ్చర్యపోయారు. అందుకే వార్న్ బంతి ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా చరిత్రలో నిలిచిపోయింది. ►1986 ఫిఫా ప్రపంచకప్ అర్జెంటీనా గెలవడంలో మారడోనా పాత్ర కీలకం.. అటు క్రికెట్లో 1999 వన్డే వరల్డ్కప్ ఆస్ట్రేలియా గెలవడంలో వార్న్ కీలకపాత్ర పోషించాడు. 1986 ఫిఫా వరల్డ్కప్తో మారడోనా; 1999 వన్డే వరల్డ్కప్తో షేన్ వార్న్ ►ఇక ఈ ముగ్గురి మరణాలు కూడా దాదాపు ఒకే రీతిలో జరగడం విశేషం. ముగ్గురు తాము చనిపోయేటప్పుడు అచేతనా స్థితిలోనే మరణించారు. చదవండి: Shane Warne: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? Shane Warne: భారత్కు ఆప్తుడు.. స్వదేశంలో మాత్రం ఘోర అవమానం! -
శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ లోకాన్ని విడిచి రెండోరోజులు కావొస్తోంది. వార్న్ అకాల మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల సంతాపాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కాగా థాయ్ అధికారులు ఆదివారం షేన్వార్న్ భౌతికకాయానికి అటాప్సీ (శవ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ మేరకు పోస్టుమార్టం కొరకు భౌతికకాయాన్ని ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వార్న్ చనిపోయే ముందు ఎలాంటి ఆల్కాహాల్.. మత్తు పదార్థాలు తీసుకోలేదని వార్న్ మేనేజర్ చెప్పినట్లు థాయ్ పోలీసులు తమ దర్యాప్తులో స్పష్టం చేశారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అటాప్సీ రిపోర్టు ద్వారా బయటపడే అవకాశాలున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు సోమవారం వచ్చే అవకాశం ఉంది. ఇక పోస్టుమార్టం అనంతరం వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిపింది. సోమవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కుమారుడు జాక్సన్తో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కాగా థాయ్లాండ్లోని కోయ్ సమూయ్ ప్రాంతంలోని తన విల్లాలో 52 ఏళ్ల వార్న్ అచేతనంగా పడి ఉండడం.. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసినట్లు తెలిసింది. వార్న్ స్నేహితులు కూడా దాదాపు 20 నిమిషాల పాటు అతన్ని బతికించే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకుండా పోయింది. వార్న్ మృతిపై అతని కుటుంబసభ్యులు ఇప్పటికీ షాక్లోనే ఉన్నారు. తండ్రి మృతిపై అతని పెద్ద కుమారుడు బోరున విలపించాడు. జాక్సన్ మాట్లాడుతూ..'' నాన్న ఇంకా మా కళ్ల ముందు తిరుగుతున్నట్లే ఉంది.. మా ఇంటి డోర్ నుంచి లోపలికి వస్తున్నట్లు అనిపిస్తుంది. నిజంగా ఇది చెడ్డ కల అయితే బాగుండు'' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక వార్న్ 1992-2007 మధ్య 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్కు తన సేవలందించాడు. మొత్తంగా వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. చదవండి: Shane Warne: వార్న్ మృతిపై థాయ్ పోలీసులు ఏమన్నారంటే.. Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి -
గుండెల్లో కరోనా కల్లోలం
చూడటానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినవారు కూడా ఇటీవల ఉన్నట్టుండి మృత్యువాతపడ్డారు. వీరందరూ 50 ఏళ్లకు అటుఇటుగా ఉన్నవారే. ఈ పరిస్థితికి కోవిడ్ తదనంతర పరిణామాలే కారణమని వైద్యనిపుణులు అంటున్నారు. ఇటీవల ఒక ఆరోగ్యవంతుడైన రాజకీయవేత్త అకస్మాత్తుగా మరణించిన విషయం మరవక ముందే ఆస్ట్రేలియాకు చెందిన సుప్రసిద్ధ క్రికెటర్ షేన్ వార్న్(52) అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలొదిలాడు. వీరిద్దరూ ఇదివరకే కోవిడ్ సోకినవారు కావడం గమనార్హం. ఈ రెండు ఘటనలు కోవిడ్ మహమ్మారి, గుండెపై దాని దుష్ప్రభావం, పరిణామాలను చర్చనీయాంశం చేశాయి. కరోనా వైరస్ మానవ శరీరంలోని గుండెను ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో ప్రభావితం చేస్తున్నట్టు ఇప్పటికే వెల్లడైందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్నవారు కోవిడ్ సోకిన తర్వాత పూర్తిస్థాయిలో కోలుకునేందుకు ఏడాది కూడా పట్టొచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెపై కరోనా ప్రభావం తదితర అంశాలపై ‘సాక్షి’తో నిమ్స్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఓరుగంటి సాయిసతీశ్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డి.శేషగిరిరావు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లో... – సాక్షి, హైదరాబాద్ బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్స్కు కోవిడ్ ప్రమాదసూచిక కోవిడ్–19 ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్ స్ట్రోక్కు, హార్ట్ స్ట్రోక్కు ప్రమాదసూచికగా పరిగణిస్తున్నారు. అంతర్జాతీయస్థాయిలో శాస్త్రీయంగా ఇది నిరూపితమైంది. వీటితోపాటు బీపీ, షుగర్, పొగతాగడం వంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. కోవిడ్ సోకనివారితో పోల్చితే దాని నుంచి కోలుకున్నవారిలో హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ల ప్రమాదం అధికంగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా బయటపడినా వివిధ అవయవాలు, ముఖ్యంగా రక్తనాళాలపై దాని ప్రభావం ఎక్కువ కాలం కొనసాగడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదముంటుంది. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ‘పల్మనరీ ఎంబాలిజం’వచ్చే అవకాశముంది. అంతవరకు గుండె సంబంధిత సమస్యలు లేకపోయినా గుండె అత్యంత వేగంగా కొట్టుకుని, గుండె నుంచి మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడంతో నిముషాల్లోనే మరణాలు సంభవిస్తున్న ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. అందువల్ల కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా డయాబెటీస్, బీపీతోపాటు ధూమపానం అలవాటు ఉన్నవారు, కుటుంబంలో గుండెజబ్బులున్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక జీవనశైలిని మార్చుకోవాలి. జంక్, ఫాస్ట్ఫుడ్ తినడం మానేయాలి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలి. రెగ్యులర్ మెడికల్ చెకప్లు చేయించుకోవాలి. – డాక్టర్ ఓరుగంటి సాయి సతీశ్,ప్రొఫెసర్ కార్డియాలజీ, హెడ్ యూనిట్ 1, నిమ్స్ రక్తనాళాలు చిక్కబడి.. మరణాలు కోవిడ్ కారణంగా రోగుల్లో రక్తం చిక్కబడటం పెరిగింది. కరోనా వచ్చి తగ్గాక కొన్నిరోజుల దాకా రక్తం గడ్డకట్టడం అనేది కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు అవి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాలను కూడా బ్లాక్ చేస్తాయి. దీనిని ‘పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం’అని పిలుస్తాం. గుండె ధమనుల్లో అవరోధాలు (బ్లాక్లు) ఉన్నా, వాటిపై రక్తం గడ్డకట్టినా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశముంది. శరీరంలో కొవ్వు పెరిగితే రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టడం, చిక్కబడటం పెరుగుతుంది. ఇలా రక్తనాళాల్లో అకస్మాత్తుగా రక్తం గడ్డకట్డడంతో గుండెపోటుకు గురై చనిపోవడం సంభవిస్తుంది. పుట్టుకతోనే కండరాలు దళసరిగా ఉన్నవారిలోని గుండె లయ మార్పుల వల్ల కూడా అకస్మాత్తు మరణాలు సంభవించవచ్చు. పోస్ట్ కోవిడ్లో కొందరు పేషెంట్లు రొటీన్ మందులు వాడుతున్నా పరిస్థితి అదుపు తప్పుతోంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీనొప్పి వంటివి వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. మందులు వాడటం ఆపోద్దు. గుండె సంబంధిత సమస్యలు దీర్ఘకాలంపాటు ఉంటాయని అధ్యయనాల్లో వెల్లడైంది. కరోనా తదనంతరం గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటు కేసులు పెరిగినట్టు స్పష్టమైంది. అంతకు ముందు ఆరోగ్యంగా ఉన్న పేషెంట్లు కూడా అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్, గుండె సమస్యలకు గురికావడం చూస్తున్నాం. గతంలో గుండె జబ్బులున్నవారికి కరోనా సోకితే సమస్య తీవ్రంగా మారుతోంది. వైరస్ గుండెను ప్రభావితం చేశాక రక్తం చిక్కబడటం, గుండె లయలు పెరగడం, తగ్గడం.. గుండె వైఫల్యాలకు దారితీస్తోంది. – డాక్టర్ డి.శేషగిరిరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ -
వార్న్కు ఘన నివాళి
మెల్బోర్న్: శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందిన స్పిన్ దిగ్గజం షేన్వార్న్కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా నివాళులు అర్పించారు. ఎంసీజీ బయట ఉన్న అతని విగ్రహం వద్ద పూలు ఉంచి ఆస్ట్రేలియా ఫ్యాన్స్ స్పిన్ దిగ్గజం జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మరోవైపు వార్న్ కుటుంబ సభ్యులు అనుమతిస్తే అధికారిక లాంఛనాలతో అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ‘మా దేశానికి చెందిన గొప్ప వ్యక్తుల్లో ఒకడిగా వార్న్ నిలిచిపోతాడు. అతని బౌలింగ్లో ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వార్న్ తన జీవితాన్ని కూడా అద్భుతంగా జీవించాడు’ అని ఆయన సంతాపం ప్రకటించారు. ఎంసీజీలోని గ్రేట్ సదరన్ స్టాండ్కు షేన్ వార్న్ పేరు పెడుతున్నట్లు కూడా ఆసీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వార్న్ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఇంగ్లీష్ కౌంటీ ‘హాంప్షైర్’ ప్రధాన కేంద్రమైన సౌతాంప్టన్లో కూడా అతనికి సంతాపం ప్రకటిస్తూ పలు కార్యక్రమాలు జరిగాయి. రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లండ్ అభిమానులు వార్న్కు నివాళులు అర్పించారు. -
Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి
స్పిన్ మాంత్రికుడు, ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్(51) శుక్రవారం థాయ్లాండ్లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే మెల్బోర్న్ క్రికెట్ మైదానం ముందు ఏర్పాటు చేసిన అతని కాంస్య విగ్రహం వద్దకు బారులు తీరిన అభిమానులు స్పిన్ మాంత్రికుడికి ప్రత్యేకంగా నివాళులర్పిస్తున్నారు. రకరకాల పూలతో పాటు తమ ఆరాధ్య క్రికెటర్కు ఎంతో ప్రీతిపాత్రమైన మద్యం (బీర్), మాంసం, సిగరెట్లను విగ్రహం ముందు ఉంచి అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే వారికి ఇష్టమైన వాటిని సమాధి ముందుంచడం ఆనవాయితీ. ఈ క్రమంలో వార్న్కు ఇష్టమైన బీర్ను, మాంసాన్ని, సిగరెట్లను అభిమానులు అతని విగ్రహం ముందుంచుతున్నారు. కాగా, క్రికెటింగ్ కెరీర్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వార్నీ.. వ్యసనాలకు బానిసై వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన విషయం తెలిసిందే. మద్యం, సిగరెట్లతో పాటు స్త్రీ వ్యామోహం కూడా అధికంగా కలిగిన అతను.. చాలా సందర్బాల్లో వీటిని సేవిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సమకాలీన క్రికెట్లో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చదవండి: Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం -
వార్న్ మృతిపై థాయ్ పోలీసులు ఏమన్నారంటే..
ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. థాయిలాండ్లోని తన విల్లాలో వార్న్ అచేతనంగా పడి ఉండడం.. తన వెంట ఉన్న స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించడం చకచకా జరిగిపోయాయి. వైద్యులు కూడా దాదాపు 20 నిమిషాల పాటు వార్న్ను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వార్న్ గుండెపోటుతో మృతి చెందినట్లు దృవీకరించారు. అయితే వార్న్ మృతి వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయేమోనన్న కారణంతో థాయ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా దర్యాప్తులో థాయ్ పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వార్న్ మృతిలో ఎలాంటి తప్పులు జరగలేదని.. తీవ్ర గుండెపోటు రావడంతోనే దిగ్గజ స్పిన్నర్ మరణించినట్లు థాయ్ పోలీసులు పేర్కొన్నారు. థాయ్లాండ్లోని కోహ్ సమూయ్ ప్రాంతంలో వార్న్ తన విల్లాలో హాలిడే ఎంజాయ్ చేయడానికి వచ్చాడని తెలిపారు.వార్న్తో పాటు అతని స్నేహితులు కూడా విల్లాకు వచ్చారు. వార్న్ స్నేహితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వార్న్ మృతి చెందిన రోజు వారంతా క్రికెట్ మ్యాచ్ను చూశారు. వార్న్ ఎలాంటి అల్కాహాల్.. మత్తు పదార్థాలు తీసుకోలేదని తేలింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో వార్న్ తన రూంలో పడుకున్నాడు. అదే సమయంలో తన స్నేహితులు తినడానికి రమ్మని పిలిచారు.. కానీ అప్పటికే అతను సృహ కోల్పోయాడు. వెంటనే వార్న్ను థాయ్ ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు దాదాపు 20 నిమిషాల పాటు వార్న్ను బతికించే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకపోయింది. దీంతో వార్న్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఇక వార్న్ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ ఇక లేడన్న వార్తను తట్టుకోలేకపోతున్నారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ బయట వేలాది మంది అభిమానులు వార్న్ విగ్రహానికి నివాళి అర్పించేందుకు వస్తున్నారు. కొందరు వార్న్కు ఇష్టమైన బీర్, సిగరేట్ ప్యాకెట్లను, మాంసాన్ని విగ్రహం వద్ద గుర్తుగా పెట్టారు. ఇక వార్న్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్.. ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయాం అంటూ ట్వీట్ చేశారు. వార్న్ అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికార లాంచనాలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: Shane Warne: భారత్కు ఆప్తుడు.. స్వదేశంలో మాత్రం ఘోర అవమానం! Shane Warne: వార్న్ను బతికించడానికి 20 నిమిషాలు కష్టపడ్డారు.. అయినా కానీ -
Shane Warne: మిస్ యూ షేన్ వార్న్
-
వార్న్ను బతికించడానికి 20 నిమిషాలు కష్టపడ్డారు.. అయినా కానీ!
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ ఆకాల మరణంతో క్రీడా లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. థాయిలాండ్లోని కోహ్ సమీయులో తన విల్లాలో గుండెపోటుతో వార్న్ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వార్న్ మృతికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. షేన్ వార్న్ను బతికించడానికి తన ముగ్గురు స్నేహితులు విశ్వప్రయత్నాలు చేశారని థాయ్లాండ్ పోలీసులు తెలిపారు. వార్న్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి థాయిలాండ్లోని కోహ్ సమీయులోని విల్లాలో ఉంటున్నారని, వార్న్ డిన్నర్కు రాకపోవడంతో స్నేహితుడు వెళ్లి చూసే సరికి వార్న్ విగిత జీవిగా పడి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. "వార్న్కు తన స్నేహితుడు సీపీఆర్ చేశాడు. వెంటనే అంబులెన్స్కు కాల్ చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ వచ్చి 10-20 నిమిషాల పాటు మరో సీపీఆర్ చేసింది. తరువాత థాయ్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చి అతన్ని తీసుకువెళ్లింది. హాస్పిటల్ వెళ్లాక ఐదు నిమిషాలు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేదని, అతడు మరణించాడు" అని థాయ్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Shane Warne: మా గుండె పగిలింది.. మాటలు రావడం లేదు: రాజస్తాన్ రాయల్స్ భావోద్వేగం -
భారత్కు ఆప్తుడు.. స్వదేశంలో మాత్రం ఘోర అవమానం!
క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మృతి పట్ల క్రీడాలోకం అశ్రు నివాళి అర్పిస్తోంది. 52 ఏళ్ల వయసులోనే హఠాన్మరణం చెందిన వార్న్పై క్రికెట్కు అతీతంగా అన్ని వైపుల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి. అలాంటి వార్న్కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల నుంచి వార్న్తో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. భారత్కు అత్యంత ఆప్తుడిగా ఉన్న వార్న్కు ఒక సందర్భంలో మాత్రం సొంత దేశంలో ఘోర అవమానం జరిగింది. ఇది 2012 నాటి మాట. ఆ దేశానికి చెందిన జూ వీక్లీ అనే మ్యాగజైన్.. వార్న్ను ఘోరంగా అవమానించింది. షేన్ వార్న్.. బ్రిటీష్ మోడల్.. నటి లిజ్ హర్లేతో జరిపిన ప్రేమాయణమే ముఖ్య అంశంగా తీసుకొని ఆ ఏడాదికి గాను ''అన్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్గా'' పరిగణించింది. లిజ్ హార్లేతో రిలేషన్ సమయంలో వార్న్ ఒక ప్లేబాయ్గా మారిపోయాడని.. విచ్చలవిడిగా తినడం.. తాగడం.. తిరగడం చేసేవాడని తెలిపింది. 42 ఏళ్ల వయసులో నవ మన్మథుడిగా ముద్రించుకోవడం అతనికే చెల్లిందంటూ మ్యాగజైన్ అవమానపరుస్తూ రాసుకొచ్చింది. క్రికెట్లో ఎంత పేరు సంపాదించాడో.. ఆటకు వెలుపల అన్నే వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి. ఆటలో ఏనాడు ఒక మచ్చ కూడా లేని ఈ దిగ్గజం బయట మాత్రం వివాదాలకు కేంద్ర బింధువుగా మారాడు. 2006లో భార్య సిమోన్తో విడాకుల అనంతరం వార్న్ నడిపిన రాసలీలలకు అంతే లేదు. చాలా మంది అమ్మాయిలకు పర్సనల్గా అసభ్యకర సందేశాలు పంపుతూ ఎప్పుడు వార్తల్లో ఉండేవాడు. చదవండి: Shane Warne Demise:'ఇప్పటికీ షాక్లోనే.. జీవితం మనం ఊహించినట్లు ఉండదు' Shane Warne: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఇప్పటికీ షాక్లోనే.. జీవితం మనం ఊహించినట్లు ఉండదు'
ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. వార్న్ మరణాన్ని తోటి క్రికెటర్లు సహా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 52 ఏళ్ల వయసులోనే అర్థంతరంగా తనువు చాలించిన దిగ్గజానికి క్రీడాలోకం అశ్రు నివాళి అర్పిస్తోంది. టీమిండియా క్రికెటర్లు సైతం వార్న్కు నివాళి అర్పిస్తూ అతనితో ఉంద అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా మిగతా క్రికెటర్లు వార్న్కు నివాళి ప్రకటించారు. ఈ సందర్భంగా టీమిండియా మెషిన్గన్ విరాట్ కోహ్లి వార్న్ను తలచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. '' నిన్న రాత్రి దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ దూరమయ్యాడన్న వార్త తెలిసింది. వార్న్ చనిపోయాడన్న వార్త మొదట నేను నమ్మలేదు. అతను చనిపోవడం ఏంటని అనుకున్నా. కానీ అది నిజమని తెలిసిన తర్వాత దుఃఖం ఆపుకోలేకపోయా. నిజంగా జీవితం మనం ఊహించినట్లు ఉండదు. ఈ క్షణంలో బాగానే ఉన్నామనిపిస్తుంది.. కానీ మరుక్షణంలో ఏం జరగబోయేది ఎవరు చెప్పలేరు. జీవితం అనూహ్యమైంది.. కానీ ఊహించలేనిది. వార్న్ తన 15 ఏళ్ల క్రికెట్ జీవితంలో చాలానే చూశాడు. క్రికెట్ బంతిని అతనికంటే గొప్పగా ఎవరూ టర్న్ చేయలేరు. క్రికెట్ తర్వాత కూడా జీవితంలో చాలా చూస్తాడు అనుకున్నా.. కానీ 52 ఏళ్లకే ఇలా భౌతికంగా దూరమవుతాడని అనుకోలేదు. వార్న్తో కలిసి ఆడే అదృష్టం మాకు లేకపోయినప్పటికి.. మాకు బూస్టప్ కావాలంటే ఇప్పటికి వార్న్ బౌలింగ్ వీడియోలను పెట్టుకొని చూస్తుంటా. ఆ పర్సనాలిటి.. చరిష్మా కనబడదు అంటే జీర్ణించుకోలేకపోతున్నా. అతనికి ఇదే నా ప్రగాడ సానుభూతి'' అంటూ ముగించాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ''వార్న్ గురించి తెలుసుకోవడం నేను అదృష్టంగా భావిస్తా. నా దృష్టిలో అతను ఎవర్గ్రీన్ స్పిన్నర్.. అతనితో కలిసి ఆడకపోవడం నేను చేసుకున్న దురదృష్టం. ఇంత తొందరగా మమ్మల్ని వదిలివెళతాడని ఊహించలేదు. ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టూ షేన్ వార్న్. ఈ సందర్భంగా వార్న్ కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతి ప్రకటిస్తునా. అలాగే వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా''అంటూ ముగించాడు. బీసీసీఐ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: Shane Warne-Sachin: 'చిన్న వయసులోనే వెళ్లిపోయావా మిత్రమా'.. సచిన్ భావోద్వేగం Shane Warne: ఉదయమే ట్వీట్.. సాయంత్రానికి మరణం; ఊహించని క్షణం "Life is fickle and unpredictable. I stand here in disbelief and shock."@imVkohli pays his tributes to Shane Warne. pic.twitter.com/jwN1qYRDxj — BCCI (@BCCI) March 5, 2022 -
షేన్వార్న్ మృతి పట్ల భారత్, శ్రీలంక ఆటగాళ్లు సంతాపం..
ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ శుక్రవారం హాఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అదే విధంగా మరో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రాడ్ మార్ష్ కూడా శుక్రవారం మృతి చెందారు. ఈ క్రమంలో భారత్-శ్రీలంక తొలి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు ఈ ఇద్దరు ఆటగాళ్ల మృతి పట్ల ఇరు జట్ల ఆటగాళ్లు సంతాపం పాటించారు. షేన్వార్న్,రాడ్ మార్ష్ మృతికి సంతాపంగా ఒక నిముషం పాటు మౌనం పాటించారు. అలాగే ఈ మ్యాచ్లో ఆటగాళ్లంతా చేతులకు నల్ల బ్యాడ్జ్లను ధరించి బరిలోకి దిగారు. “శుక్రవారం మృతి చెందిన రాడ్ మార్ష్ షేన్ వార్న్ల కోసం మొదటి టెస్టు 2వ రోజు ఆట ప్రారంభానికి ముందు ఇరు జట్లు ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటించారు. భారత క్రికెట్ జట్టు కూడా ఈరోజు నల్ల బ్యాండ్లు ధరించనుంది' అని బీసీసీఐ ట్విటర్లో పేర్కొంది. ఇక రెండో రోజు ఆటను టీమిండియా దూకుడుగా ఆరంభించింది. రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగగా, అశ్విన్ ఆర్ధ సెంచరీతో మెరిశాడు. రెండో రోజు లంచ్ విరామానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(102), జయాంత్ యాదవ్(2) పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs SL 1st Test: ఏంటి రోహిత్.. డుప్లెసిస్ బ్యాటింగ్ను కాపీ కొడుతున్నావా..? A minute’s silence was observed before the start of play on Day 2 of the first Test for Rodney Marsh and Shane Warne who passed away yesterday. The Indian Cricket Team will also be wearing black armbands today.@Paytm #INDvSL pic.twitter.com/VnUzuqwArC — BCCI (@BCCI) March 5, 2022 -
మా గుండె పగిలింది.. మాటలు రావడం లేదు: రాజస్తాన్ రాయల్స్ భావోద్వేగం
"షేన్ వార్న్.. ఆ పేరే ఓ మ్యాజిక్. మా ఫస్ట్ రాయల్... అసాధ్యమనేది ఏదీ ఉండదని నిరూపించిన వ్యక్తి. మమ్మల్ని ముందుండి నడిపించిన నాయకుడు. అండర్డాగ్స్ ను చాంపియన్లుగా నిలిపిన సారథి. గొప్ప మెంటార్. ఆయన పట్టిందల్లా బంగారమే. ఈ క్షణంలో మా మనసులో చెలరేగుతున్న భావనలు, విషాదాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. మా గుండె పగిలింది. యావత్ క్రికెట్ ప్రపంచం, అభిమానుల హృదయం ముక్కలైంది. వార్న్.. నువ్వు ఎల్లప్పుడూ మా కెప్టెన్వే, మా నాయకుడివే, మా రాయల్వే. నీ ఆత్మకు శాంతి చేకూరాలి లెజెండ్" అంటూ ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ భావోద్వేగ నోట్ షేర్ చేసింది. తమకు తొలి టైటిల్ అందించిన సారథి, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కు హృదయ పూర్వక నివాళి అర్పించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఉద్వేగభరిత క్యాప్షన్ జత చేసింది. కాగా అశేష అభిమానులను శోక సంద్రంలో ముంచుతూ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ శుక్రవారం హఠాన్మరణం చెందిన విషయం విదితమే. సుదీర్ఘ కెరీర్లో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న వార్న్.. ఐపీఎల్లోనూ తన పేరిట చెక్కు చెదరని రికార్డు లిఖించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ వేలంలో భాగంగా 2008లో వార్న్ను రాజస్తాన్ రాయల్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సారథిగా జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చిన వార్న్ ఆరంభ సీజన్లోనే ట్రోఫీ సాధించి సత్తా చాటాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టును చాంపియన్గా నిలిపి ఫ్రాంఛైజీకి మధురానుభూతిని మిగిల్చాడు. ఇక కామెంటేటర్గానూ రాణించిన వార్న్.. ఇంగ్లండ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడానికి నేను సిద్దంగా ఉన్నానంటూ ఇటీవలే తన మనసులోని మాటను బయటపెట్టాడు. జట్టును విజయ పథంలో నడిపించగలనన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. కానీ ఇంతలోనే 52 ఏళ్ల వయసులో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. చదవండి: IND vs SL 1st Test: ఏంటి రోహిత్.. డుప్లెసిస్ బ్యాటింగ్ను కాపీ కొడుతున్నావా..? 💔 pic.twitter.com/eq48Smxugi — Rajasthan Royals (@rajasthanroyals) March 4, 2022 -
ఐపీఎల్ తొలి టైటిల్ను ముద్దాడిన వార్న్..
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకంలో తీవ్ర విషాదం నిపింది. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన లెజెండ్.. ఇక లేడన్న వార్తను అతడు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన 15 ఏళ్ల కేరిర్లో ఎన్నో రికార్డులను తన పేరిట వార్న్ లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు.. ఐపీఎల్లో కూడా వార్న్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఐపీఎల్లో ఆరంభ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు వార్న్ సారథ్యం వహించాడు. తొలి సీజన్లో ఏ మాత్రం గెలుపు అంచనాలు లేకుండానే యువకులతో బరిలోకి దిగిన రాజస్తాన్.. తొలి టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో తొలి ట్రోఫీని ముద్దాడడంలో షేన్ వార్న్దే కీలక పాత్ర. తన అంతర్జాతీయ అనుభవాన్నంతా రంగరించి అతను యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. ప్రతీ దశలోనూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ విజయం దిశగా నడిపించడం విశేషం. అంతేకాకుండా రీటైర్డ్ అయ్యిన తర్వాత అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా వార్న్ రికార్డు సృష్టించాడు. 2008 ఐపీఎల్ వేలంలో వార్న్ను రాజస్తాన్ రాయల్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. చదవండి: PAK Vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. చెలరేగి ఆడుతోన్న పాక్ -
వార్న్ వెళ్లిపోయాడు.. జ్ఞాపకాలు పదిలం ( అరుదైన ఫోటోలు )
-
Shane Warne: ‘మాంత్రికుడు’ మరో లోకానికి
క్రికెట్ బంతి అతను చెప్పినట్లు మలుపులు తిరిగింది. స్పిన్ ఆనవాలు కూడా కనిపించే అవకాశం లేని పిచ్లపైనా బంతి గిర్రున బొంగరంలా మారిపోయింది. చక్కటి నియంత్రణ, కచ్చితత్వం అతని బౌలింగ్ను మరింత పదునుగా మార్చాయి. జట్టు ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా ఆ మాయాజాలం ముందు తలొంచినవారే... దశాబ్దంన్నర కాలంపాటు ఆస్ట్రేలియా క్రికెట్ ఆ మణికట్టును నమ్ముకొని ప్రపంచాన్ని ఏలింది. అతని మాయాజాలం కారణంగానే పుష్కర కాలం చిరకాల ప్రత్యర్థికి ‘బూడిద’ కూడా దక్కలేదు. అతని వల్లే ప్రపంచకప్ కంగారూల చెంత చేరింది. ఒకటా రెండా... లెక్క లేనన్ని అసాధారణ ఘనతలు ఖాతాలోకి అలవోకగా వచ్చి చేరాయి. ఆ బౌలింగ్ లయను చూస్తే అంకెలు మాత్రమే ఆ గొప్పతనాన్ని కీర్తించలేవని అర్థమవుతుంది. అంతకు మించిన ఆకర్షణ అందులో ఉంది. క్రికెట్పై ఎప్పటికీ చెరిగిపోలేని ఆ ముద్ర ఉంది. హీరోగా, విలన్గా తనకు నచ్చినట్లుగా జీవించిన స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్కు చివరి గుడ్బై! –సాక్షి క్రీడా విభాగం అతను వేసిన బంతి పిచ్పై పడిన తర్వాత ఇరవై నాలుగు అంగుళాలు లోపలికి దూసుకొచ్చి స్టంప్స్ను ఎగరగొట్టేసింది. మణికట్టు స్పిన్ అంతర్ధానం అయిపోయిందనుకున్న రోజుల్లో అతని బంతి ఆటకు కొత్త జీవం పోసింది. లెగ్బ్రేక్, ఫ్లిప్పర్, జూటర్, స్లయిడర్, టాపీ, బ్యాక్ స్పిన్నర్... మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, అతని నుంచి దూసుకొచ్చిన బంతి బ్యాటర్ను క్రీజ్లో విగ్రహంలా మార్చేసింది. అతని బంతి ఎంతగా స్పిన్ అయిందో చూడాలంటే మైదానంలో కోణమానినితో కొలవాల్సిందే... సూదిమొనల ‘స్పైక్స్’ జుట్టు, రిస్ట్ బ్యాండ్, అరుదైన నీలి, ఆకుపచ్చ కళ్లతో హాలీవుడ్ నటుల లుక్ను తలపిస్తూ క్రికెట్లో అడుగుపెట్టిన 23 ఏళ్ల కుర్రాడు తర్వాతి రోజుల్లో ప్రపంచ క్రికెట్ను శాసించాడు. అతని ‘తిప్పుడు’ బారిన పడకపోతే చాలు అంటూ అన్ని జట్ల ఆటగాళ్లు అనుకునేలా చేశాడు. నెమ్మదిగా నాలుగు అడుగులు, చక్కటి యాక్షన్తో లెగ్స్పిన్ను కూడా ఒక అందమైన కళగా చూపించడం అతనికే చెల్లింది. మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్ అభిమానులను విషాదంలో ముంచిన అనూహ్య వార్త. స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా స్టార్ షేన్ వార్న్ శుక్రవారం హఠాన్మరణం చెందాడు. థాయ్లాండ్లోని కోహ్ సమూయ్లో ఉన్న తన విల్లాలో తీవ్ర గుండెపోటుకు గురైన 52 ఏళ్ల వార్న్ మృతి చెందినట్లు అతని మేనేజర్ మైకేల్ కోహెన్ వెల్లడించాడు. ‘తన విల్లాలో వార్న్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నించినా అతని ప్రాణాలకు కాపాడలేకపోయింది’ అని అతను వెల్లడించాడు. భార్య సిమోన్తో చాలా కాలం క్రితమే విడాకులు తీసుకున్న వార్న్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. శుక్రవారం ఉదయమే మరో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రాడ్ మార్‡్ష మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసిన వార్న్... కొన్ని గంటల్లోనే దురదృష్టవశాత్తూ తానూ మరణించడం విషాదం. క్రికెట్ కామెంటేటర్గా చురుగ్గా బాధ్యత లు నిర్వహిస్తూ వచ్చిన వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వనే ్డల్లో 293 వికెట్లు తీసి వార్న్ ‘ఆల్టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ‘బాల్ ఆఫ్ ద సెంచరీ’... జూన్ 4, 1993... మాంచెస్టర్లో తొలి యాషెస్ టెస్టు... ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గ్యాటింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. షేన్ వార్న్ వేసిన మొదటి బంతి ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. ఎక్కడో లెగ్స్టంప్ బయట పడిన బంతి ఏకంగా రెండు అడుగులు స్పిన్ అయి ఆఫ్స్టంప్ బెయిల్ను తాకింది. ఏం జరిగిందో అంపైర్కు అర్థం కాలేదు. తానే కాస్త తలవంచి చూస్తుండిపోయాడు. అటు గ్యాటింగ్ అయితే అసలు నమ్మలేకపోయాడు. షాక్కు గురై ఆగిపోయిన అతడిని ‘బౌల్డ్’ అంటూ గుర్తు చేసి పెవిలియన్కు పంపించాల్సి వచ్చింది. ఈ అద్భుత దృశ్యం వార్న్ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించింది. క్రికెట్ చరిత్రలో ‘బాల్ ఆఫ్ సెంచరీ’గా నిలిచిపోయిన ఈ బంతితో వార్న్ ఘన ప్రస్థానం మొదలైంది. తొలి టెస్టులో 45 ఓవర్లు వేస్తే దక్కింది ఒక వికెట్! తర్వాతి మ్యాచ్లో 23 ఓవర్లలో అదీ లేదు. స్పిన్కు అనుకూలించే తర్వాతి టూర్ శ్రీలంకలోనూ దాదాపు అదే పరిస్థితి. విండీస్లో మెల్బోర్న్లో 7 వికెట్లు తీయడం మినహా తొలి 18 టెస్టుల్లో వార్న్ బౌలింగ్లో ప్రమాదకర ఛాయలు ఏమీ కనిపించలేదు. కానీ తర్వాతి యాషెస్ సిరీస్ అసలైన వార్న్ను ప్రపంచానికి చూపించింది. అద్భుత బంతితో చిరకాల ఖ్యాతిని అందుకున్న అతను ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్ 12 ఏళ్ల పాటు వార్న్ బంతిని అర్థం చేసుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు. వార్న్ దెబ్బతో 1993 నుంచి 2005 వరకు ఇంగ్లండ్ ‘యాషెస్’ అందుకోలేకపోయింది. చివరకు 2005లో సాధించినా ఆ సిరీస్లోనూ 40 వికెట్లతో వార్న్ పైచేయి ప్రదర్శించడం విశేషం. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్... ఇలా ప్రతీ జట్టుపై ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ విజయాల్లో అతను కీలకపాత్ర పోషించాడు. భారత్ మినహా (14 టెస్టుల్లో 43 వికెట్లు, 47.18 సగటు) ప్రతీ జట్టుపై ఈ స్టార్ బౌలర్ ఆధిపత్యం కనబర్చాడు. అయితే చివరకు 2004లో ‘ఫైనల్ ఫ్రాంటియర్’ అంటూ భారత్లో అడుగు పెట్టిన ఆసీస్... సిరీస్ను గెలుచుకోవడంతో వార్న్ సంతృప్తిగా ముగించాడు. టెస్టు క్రికెట్లో 700 వికెట్ల మైలురాయిని దాటిన తొలి బౌలర్గా నిలిచిన వార్న్... సొంతగడ్డపై యాషెస్లో ఇంగ్లండ్ను 5–0తో చిత్తు చేసిన అనంతరం 2007 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్కు సగర్వంగా వీడ్కోలు పలికాడు. వన్డేల్లోనూ సూపర్... వార్న్ ఘనతలను టెస్టు కోణంలోనే ఎక్కువగా చూడటం వల్ల అతని వన్డే ఘనతల ప్రస్తావన తక్కువగా వినిపిస్తుంది. అయితే 12 ఏళ్ల వన్డే కెరీర్లో ఎన్నో అసమాన విజయాలు అతను అందించాడు. ముఖ్యంగా 1996 ప్రపంచకప్లో వెస్టిండీస్తో జరిగిన సెమీఫైనల్లో అతను పదునైన బౌలింగ్తో (4/36) జట్టును గెలిపించి ఫైనల్ చేర్చాడు. అయితే వార్న్ చిరస్మరణీయ ప్రదర్శన 1999 ప్రపంచకప్లో వచ్చింది. ఈ టోర్నీ ఫైనల్లో కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (4/33)గా నిలిచిన వార్న్... అంతకంటే అద్భుత బౌలింగ్ను అంతకుముందు సెమీస్లో నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో బర్మింగ్హామ్లో జరిగిన ఈ ’ఆల్టైమ్ గ్రేటెస్ట్ వన్డే మ్యాచ్’లో కిర్స్టెన్, గిబ్స్, క్రానే, కలిస్ వికెట్లతో వార్న్ పండగ చేసుకున్నాడు. ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వివాదాలతో సహవాసం... షేన్ వార్న్ అద్భుత కెరీర్లో మరో పార్శ్వంలో పలు వివాదాలు కనిపిస్తాయి. పిచ్ వివరాలను అందించి బుకీ నుంచి డబ్బులు తీసుకోవడం, రణతుంగపై తీవ్ర వ్యాఖ్యలు చేసి రెండు మ్యాచ్ల సస్పెన్షన్కు గురయ్యాడు. అయితే అతని కెరీర్లో పెద్ద దెబ్బ 2003 ప్రపంచకప్కు ముందు తగిలింది. నిషేధిత ఉత్ప్రేరకం డ్యురెటిక్ను తీసుకున్న అతను డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. దాంతో ఏడాది పాటు సస్పెండ్కు గురై వరల్డ్కప్ ఆరంభానికి ముందే తప్పుకోవాల్సి వచ్చింది. బిగ్బాష్ లీగ్లో కూడా సామ్యూల్స్తో గొడవ పడి మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. అయితే అన్నింటికి మించి అతని వ్యక్తిగత జీవితంలో అమ్మాయిల వ్యవహారాలకు సంబంధించే పలు వివాదాలు ఉన్నాయి. వేర్వేరు మహిళలకు అసభ్యకర మెసేజ్లు పంపడం, అసభ్యకర చిత్రాలతో కనిపించడం వంటివి చెడ్డపేరు తేవడంతో పాటు కుటుంబ జీవితాన్ని కూడా నష్టపరిచాయి. పదేళ్ల వివాహం బంధం తర్వాత తన భార్య సిమోన్తో 2005లోనే విడిపోయిన వార్న్... బ్రిటిష్ నటి ఎలిజబెత్ హర్లీతో పెళ్లికి ప్రయత్నించినా చివరకు అది సాధ్యం కాలేదు. గొప్ప నాయకత్వ లక్షణాలతో కెప్టెన్సీకి సరిగ్గా సరిపోయే అర్హతలున్నా ఆస్ట్రేలియాకు టెస్టు సారథిగా వ్యవహరించే అవకాశం అతనికి ఈ కారణాల వల్లే ఎప్పటికీ రాలేదు. ఐపీఎల్ తొలి విజేతగా... రిటైర్మెంట్ తర్వాత కూడా షేన్ వార్న్ విలువ తగ్గలేదు. అందుకే 2008లో జరిగిన తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ అతడిని కెప్టెన్గా ఎంచుకుంది. పెద్దగా పేరు లేని కుర్రాళ్లు, అనామక ఆటగాళ్లతో కూడిన ఆ జట్టు తొలి టైటిల్ సాధించిందంటే అది పూర్తిగా వార్న్ చలవే. తన అంతర్జాతీయ అనుభవాన్నంతా రంగరించి అతను యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. ప్రతీ దశలోనూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ విజయం దిశగా నడిపించడం విశేషం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) షేన్ వార్న్ కెరీర్ గ్రాఫ్ టెస్టులు 145 వికెట్లు 708 ఉత్తమ బౌలింగ్ 8/71 ఇన్నింగ్స్లో 5 వికెట్లు 37 సార్లు మ్యాచ్లో 10 వికెట్లు 10 సార్లు చేసిన పరుగులు 3,154 అత్యధిక స్కోరు 99 వన్డేలు 194 వికెట్లు 293 ఉత్తమ బౌలింగ్ 5/33 చేసిన పరుగులు 1,018 అత్యధిక స్కోరు 55 708 టెస్టుల్లో షేన్వార్న్ వికెట్ల సంఖ్య. మురళీధరన్ (800) తర్వాత రెండో స్థానం. 96 2005లో వార్న్ తీసిన వికెట్ల సంఖ్య. ఒక ఏడాదిలో ఇదే అత్యధిక వికెట్ల రికార్డు 3154 టెస్టుల్లో వార్న్ పరుగులు. కెరీర్లో ఒక సెంచరీ కూడా లేకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు -
సచిన్ వల్ల షేన్ వార్న్కు నిద్రలేని రాత్రులు..
ఆటలో ఇద్దరు దిగ్గజాలు తలపడితే ఆ మజా వేరుగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎదురుపడిన ప్రతీసారి ఒక్కరే ఆధిపత్యం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది. అచ్చం అలాంటిదే షేన్ వార్న్.. భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వల్ల ఎదుర్కొన్నాడు. తన బౌలింగ్తో ఎందరో మేటి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన వార్న్కు సచిన్ మాత్రం కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో వార్న్- సచిన్లు 29 సార్లు ముఖాముఖి తలపడితే.. అందులో కేవలం నాలుగుసార్లు మాత్రమే సచిన్ని వార్న్ ఔట్ చేయడం విశేషం.టెస్టు సిరీస్ ల సందర్బంగా.. చెన్నై (1998), కాన్పూర్ (1999), అడిలైడ్ (1999), మెల్బోర్న్ (1999) లలో జరిగిన మ్యాచులలో మాత్రమే సచిన్ వార్న్ కు ఔటయ్యాడు. మిగిలిన సందర్బాల్లో మాస్టర్ బ్లాస్టర్ దే పైచేయి. 1998 షార్జా కప్లో ఆస్ట్రేలియాపై మ్యాచ్లో సచిన్ 148 పరుగులు తుఫాన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. ఈ మ్యాచ్లో వార్న్కు సచిన్ తన బ్యాటింగ్తో చుక్కలు చూపించాడు. ఇదొక్కటి చాలు సచిన్- వార్న్ల వైరం ఏ రేంజ్లో ఉండేదో చెప్పుకోవడానికి. ఒక సందర్భంలో సచిన్ హిట్టింగ్కు తాను కొన్నేళ్ల పాటు నిద్రలేని రాత్రులు గడిపానని షేన్ వార్న్ స్వయంగా చెప్పుకోవడం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? వన్డేల్లో వార్న్పై సచిన్ సగటు 100.00గా ఉండడం విశేషం. ఈ జోడీ మధ్య వైరం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అయితే ఆటలో మాత్రమే సచిన్- వార్న్లు శత్రువులు.. బయట మాత్రం మంచి మిత్రులు. ఎక్కడ కలిసినా ఈ ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగేది. కాగా తన ఆప్తమిత్రుడు వార్న్ భౌతికంగా దూరమవడం సచిన్ను కలిచివేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వార్న్కు కన్నీటి నివాళి అర్పించాడు. చాలా చిన్న వయసులో వెళ్లిపోయావ్ మిత్రమా.. అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘దిగ్బ్రాంతికరమైన వార్త.. వార్నీ నిన్ను చాలా మిస్ అవుతాను. మైదానంలో, మైదానం వెలుపల నీతో ఎప్పుడూ నీరసంగా అనిపంచలేదు. మన ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ చర్యలు ఎల్లప్పుడూ విలువైనదిగా పరిగణిస్తాను.. భారత్ లో నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా చిన్న వయసులో వెళ్లిపోయావ్ మిత్రమా..’అంటూ ట్వీట్ చేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Shocked, stunned & miserable… Will miss you Warnie. There was never a dull moment with you around, on or off the field. Will always treasure our on field duels & off field banter. You always had a special place for India & Indians had a special place for you. Gone too young! pic.twitter.com/219zIomwjB — Sachin Tendulkar (@sachin_rt) March 4, 2022 -
చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'
ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్.. స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. లెగ్ స్పిన్నర్గా ఆటకు వన్నె తెచ్చిన వార్న్ లెక్కలేనన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్(708 వికెట్లు) ఇప్పటికీ రెండో స్థానంలో కొనసాగడం విశేషం. మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో బ్యాట్స్మెన్లను హడలెత్తించడమే కాకుండా ప్రత్యర్థి జట్లకు సవాల్గా నిలిచేవాడు. మరి అలాంటి వార్న్ కెరీర్లో ఒక బంతి బాల్ ఆఫ్ ది సెంచరీగా నిలిచిపోయింది. 1993లో యాషెస్ సిరీస్లో భాగంగా మైక్ గాటింగ్ను వార్న్ ఔట్ చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. వార్న్ మృతికి సంతాపంగా మరోసారి ఆ సంఘటనను గుర్తుచేసుకుందాం. సరిగ్గా 27 ఏళ్ల క్రితం 1993లో ఇంగ్లండ్తో వారి దేశంలో జరిగిన యాషెస్ సిరీస్లో భాగంగా తొలి టెస్టులో వార్న్ ఒక అద్భుతమైన బంతిని సంధించాడు. ఆ టెస్టు మ్యాచ్ జూన్ 3వ తేదీన ఆరంభం కాగా, రెండో రోజు ఆట(జూన్ 4వ తేదీన)లో ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు మైక్ గాటింగ్ను బోల్తా కొట్టించిన తీరు వార్న్ కెరీర్ను మలుపు తిప్పింది. బంతిని నేరుగా గాటింగ్ కాళ్లకు ముందు అవుట్సైడ్ లెగ్స్టంప్పై వేసి ఆఫ్ వికెట్ను ఎగరుగొట్టిన తీరు ఇప్పటికీ చిరస్మరణీయమే. అసలు బంతి ఎక్కడ పడుతుందా అని గాటింగ్ అంచనా వేసే లోపే ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. ఆ బంతికి గాటింగ్ షాక్ కాగా, ఫీల్డ్లో ఉన్న అంపైర్కు కూడా కాసేపు ఏమీ అర్థం కాలేదంటే అది ఎంతలా స్పిన్ అయ్యి ఉంటుందో( ఎంతలా స్పిన్ చేశాడో) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో వార్న్దే కీలక పాత్ర. ప్రతీ ఇన్నింగ్స్లోనూ నాలుగేసి వికెట్లు సాధించి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు. వార్న్ కెరీర్కు పునాది పడిన సందర్భం కచ్చితంగా అదే టెస్టు మ్యాచ్. 1992లో భారత్తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన వార్న్.. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ దిగ్గజాల సరసన నిలిచిపోయాడు. చదవండి: Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం Shane Warne: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
ప్రపంచ క్రికెట్లో విషాదం.. షేన్వార్న్ మృతి, సంతాపాల వెల్లువ..
ప్రపంచ క్రికెట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్వార్న్ శుక్రవారం హఠాన్మరణం చెందారు. థాయ్లాండ్లోని ఓ విల్లాలో విగతజీవిగా కనిపించారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇక వార్న్ మృతిపట్ల యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. తమ అభిమాన సహచరుడు లేడనే వార్త విని క్రికెట్ ప్రముఖులు విషాదంలో మునిగారు. వార్న్ కుటుంబానికి ఈ కష్ట కాలంలో ధైర్యాన్ని ప్రసాదించాలని దేవున్ని ప్రార్థించారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందించారు. ‘షేన్ వార్న్ మృతి విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. మాటలు రావడం లేదు. క్రికెట్ ప్రపంచంలో లెజెండ్. ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి. ఇంత త్వరగా కాలం చేయడం విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అని వీవీఎస్ లక్ష్మణ్ సంతాపం తెలిపారు. This is absolutely unbelievable. Shocked beyond words. A legend and one of the greatest players ever to grace the game.. Gone too soon... Condolences to his family and friends. https://t.co/UBjIayR5cW — VVS Laxman (@VVSLaxman281) March 4, 2022 ‘అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. కూల్ స్పిన్కు వార్న్ పెట్టింది పేరు.. సూపర్ స్టార్ షేన్వార్న్ ఇకలేరనే విషయం బాధాకరం. మనిషి జీవితంలో ఎప్పుడేమవుతుందో చెప్పలేం. జీవితాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వార్న్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి’ అని వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్లో సంతాపం తెలిపారు. Cannot believe it. One of the greatest spinners, the man who made spin cool, superstar Shane Warne is no more. Life is very fragile, but this is very difficult to fathom. My heartfelt condolences to his family, friends and fans all around the world. pic.twitter.com/f7FUzZBaYX — Virender Sehwag (@virendersehwag) March 4, 2022 ‘క్రికెట్ దిగ్గజం షేన్వార్న్ మృతి చెందారనే విధ్వంసకర వార్త విన్నా. నోట మాట రావడం లేదు. షాకింగ్గా ఉంది. గొప్ప ఆటగాడు, మంచి మనిషి’ అని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు. Just heard the devastating news about legendary Shane Warne passing away. No words to describe how shocked & sad i am. What a legend. What a man. What a cricketer. pic.twitter.com/4C8veEBFWS — Shoaib Akhtar (@shoaib100mph) March 4, 2022 హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేసిన షమీ.. షేన్ వార్న్కు నివాళి అర్పించాడు. RIP 💔💔💔💔 pic.twitter.com/MIcsBEjfL6 — Mohammad Shami (@MdShami11) March 4, 2022 ‘షేన్వార్న్ ఇక లేరనే వార్త నమ్మలేకపోతున్నా.. ఇది అబద్ధమని చెప్పండి’ అని దినేష్ కార్తీక్ విస్మయం వ్యక్తం చేశాడు. Shane Warne ... Really !!!!! ☹️ Tell me it's not true please — DK (@DineshKarthik) March 4, 2022 ఒకే రోజు ఇద్దరు దిగ్గజాలు కన్నుమూయడం విషాదకరం. మార్ష్, వార్న్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని డేవిడ్ వార్నర్ ట్వీట్ చేశాడు. Two legends of our game have left us too soon. I’m lost for words, and this is extremely sad. My thoughts and prayers go out to the Marsh and Warne family. I just can not believe it. #rip, you will both be missed https://t.co/gduLY9bIwg — David Warner (@davidwarner31) March 4, 2022 -
క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన మొదటి బౌలర్ షేన్ వార్న్
క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లు ఎందరో ఉంటారు.. కానీ తమ ఆటతో ప్రత్యర్థులనే ఓ ఆటాడించి, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని లెజెండ్గా మారేది మాత్రం కొందరే. అటువంటి దిగ్గజ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా స్పిన్నింగ్ దిగ్గజం షేన్ వార్న్ ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వార్న్ తన క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాయిలు అధిగమించాడు. అలానే చెరిగిపోని రికార్డులు మరెన్నో తన పేరుమీద లిఖించుకున్నాడు. ఇలాంటివి బోలెడు ఉన్నా షేన్ వార్న్కి క్రికెట్ కెరీర్లో మర్చిపోలేని రోజు ఏదైనా ఉందంటే 2006 ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో 700వ వికెట్ సాధించడమనే చెప్పాలి. విక్టోరియన్ గ్రౌండ్లో 89,155 మంది ప్రేక్షకుల మధ్య ఇంగ్లాండ్తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ ఆండ్రూ స్ట్రాస్ వికెట్ తీసి అంతవరకు ఎవరికీ సాధ్యపడని ఘనతను సాధించి చూపాడు. ఆ వికెట్తో ప్రపంచ క్రికెట్ చరిత్రోలో 700 వికెట్లు తీసిన మొదటి బౌలర్గా ఈ మైలురాయిని చేరుకున్నాడు. అనంతరం అదే మ్యాచ్లో వార్న్ నలుగురు బ్యాట్స్మెన్లను పెవిలియన్కు తన టెస్ట్ కెరీర్లో ఐదు వికెట్లను పడగొట్టడం ద్వారా 37వ చివరి ఐదు వికెట్ల హాల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. -
షేన్ వార్న్ హఠాన్మరణం అసలేం జరిగింది ??
-
ఉదయమే ట్వీట్.. సాయంత్రానికి మరణం
బంతిని తిప్పడంలో అతనికి ఎవరు సాటిరారు.. తన లెగ్ స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్థులకు ముచ్చెటమలు పట్టించాడు.. ఎన్నోసార్లు వివాదాలకు కేంద్ర బిందువు అయినప్పటికి.. తన ఆటతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో తన పేరును సుస్థిరం చేసుకున్నాడు.. సమకాలీన క్రికెట్లో మరో దిగ్గజ స్నిన్నర్తో పోటీ పడుతూ వికెట్ల మీద వికెట్లు సాధించి చరిత్ర లిఖించాడు.. అతనెవరో కాదు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్.. 52 ఏళ్ల వయసులోనే తనువు చాలిస్తానని బహుశా వార్న్ ఊహించి ఉండడు. శుక్రవారం ఉదయమే వార్న్ తన దేశానికి చెందిన మరో మాజీ క్రికెటర్ రాడ్ మార్ష్ మృతికి ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించాడు.. అదే సయమంలో తనను మరణం వెంటాడుతుందని అతను ఊహించలేకపోయాడు... క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేస్తూ గుండెపోటుతో అకాల మరణం చెందిన వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక కథనం... Sad to hear the news that Rod Marsh has passed. He was a legend of our great game & an inspiration to so many young boys & girls. Rod cared deeply about cricket & gave so much-especially to Australia & England players. Sending lots & lots of love to Ros & the family. RIP mate❤️ — Shane Warne (@ShaneWarne) March 4, 2022 1969, సెప్టెంబర్ 13న ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామంలో జన్మించాడు. 1983-84 మధ్య కాలంలో అండర్-16 విభాగంలో యునివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ తరపు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత అండర్-19 విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వార్న్ అనతికాలంలోనే మంచి క్రికెటర్గా ఎదగాడు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడానికి ముందు వార్న్ కేవలం ఏడు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడడం విశేషం. ఇక సిడ్నీ వేదికగా 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా షేన్ వార్న్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లో రవిశాస్త్రిని ఔట్ చేయడం ద్వారా తొలి వికెట్ అందుకున్నాడు. కెరీర్ మొదట్లో సాధారణ బౌలర్గా కనిపించిన వార్న్.. ఆ తర్వాత శ్రీలంకతో సిరీస్లోనూ పెద్దగా రాణించలేదు. ఇక వార్న్ కెరీర్ను మలుపు తిప్పింది మాత్రం వెస్టిండీస్ సిరీస్ అని చెప్పొచ్చు. మెల్బోర్న్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో వార్న్ తొలిసారి తన బౌలింగ్ పవర్ను చూపించాడు. లెగ్ స్పిన్ మ్యాజిక్తో రెండో ఇన్నింగ్స్లో 52 పరుగులకే ఏడు వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక అక్కడి నుంచి వార్న్ తన కెరీర్లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బాల్ ఆఫ్ ది సెంచరీ.. 1993లో ప్రతిష్టాత్మక యాషెస్ టూర్కు వార్న్ ఎంపికయ్యాడు. ఆరు టెస్టు మ్యాచ్ల సిరీస్లో మొత్తంగా 34 వికెట్లు తీసిన వార్న్ సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సిరీస్లో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ మైక్ గాటింగ్ను ఔట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో మిగిలిపోయింది. లెగ్స్టంప్ దిశగా వెళ్లిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్స్టంప్ వికెట్ను ఎగురగొట్టడం క్రీడా పండితులను సైతం ఆశ్చర్యపరించింది. అందుకే వార్న్ వేసిన ఆ బంతిని బాల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించారు. ఇక ఆ ఏడాది క్యాలెండర్ ఇయర్లో 71 వికెట్లు తీసిన వార్న్ .. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించాడు. అప్పటినుంచి 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్కు సేవలందించిన వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్లోనే వార్న్ టెస్టుల్లో 3154 పరుగులు సాధించాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. షేన్ వార్న్ సాధించిన రికార్డులు.. విశేషాలు ►అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన తొలి బౌలర్గా షేన్ వార్న్. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు ►టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్ల హాల్.. 10 సార్లు 10 వికెట్ల హాల్ ఘనత ►టెస్టుల్లో 700 వికెట్ల మార్క్ అందుకున్న తొలి బౌలర్గా వార్న్ రికార్డు ►రెండుసార్లు అల్మానిక్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు పొందిన క్రికెటర్గా వార్న్ చరిత్ర. ►అంతేకాదు విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు రెండుసార్లు ఎంపికైన క్రికెటర్గా గుర్తింపు ►ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్గా షేన్ వార్న్ గుర్తింపు.. (1993లో ఒకే క్యాలండర్ ఇయర్లో 71 వికెట్లు) చదవండి: ప్రపంచ క్రికెట్లో విషాదం.. షేన్వార్న్ మృతి, సంతాపాల వెల్లువ.. Shane Warne: క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన మొదటి బౌలర్ షేన్ వార్న్ -
Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం
-
దిగ్గజ స్పిన్నర్ షేన్వార్న్ ఆన్ఫీల్డ్ ఫొటోలు
-
Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం
ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వార్న్ మరణ వార్త తెలిసి.. క్రికెట్ ప్రముఖులతో పాటు ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతి గురవుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మేటి స్పిన్నర్గా పేరుపొందిన షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరపున 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు షేన్ వార్న్ సొంతం. టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్ల హాల్ అందుకున్నాడు. అనూహ్యంగా బంతి తిప్పడంలో మేటి అయిన వార్న్.. 2013లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్గా నిలిచాడు. 1999 వన్డే వరల్డ్కప్ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో వార్న్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్తోనూ షేన్ వార్న్కు అనుబంధం ఉంది. 2008 ఆరంభ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు వార్న్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ సీజన్లో రాజస్తాన్ టైటిల్ గెలవడంలో అటు కెప్టెన్గా.. ఆటగాడిగా షేన్ వార్న్ కీలకపాత్ర పోషించాడు. -
'ఇప్పుడు నా టార్గెట్ అదే.. ఆ జట్టుకు హెడ్ కోచ్గా'
యాషెస్ సిరీస్లో ఘోర పరాభవం తర్వాత ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి క్రిస్ సిల్వర్వుడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాల్ కాలింగ్వుడ్ తాత్కాలిక ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా హెడ్ కోచ్ పదవి కోసం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తదుపరి ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టడానికి ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఆసక్తి చూపుతున్నాడు. కాగా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్.. ది హండ్రెడ్ లీగ్లో లండన్ స్పిరిట్ జట్లకు మెంటార్గా వార్న్ ఉన్నాడు. 'ఇంగ్లండ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడానికి నేను సిద్దంగా ఉన్నాను. జట్టును విజయ పథంలో నడిపించగలను అని అనుకుంటున్నాను. ఇంగ్లండ్లో చాలా మంది అత్యత్తుమ ఆటగాళ్లు ఉన్నారు. ప్రాథమికంగా జట్టులో కొన్ని మార్పులను చేస్తే చాలు. అదే విధంగా జట్టులో అద్భుతమైన బౌలర్లతో పాటు, ఫీల్డర్లు ఉన్నారు. కానీ ప్రస్తుతం వారు అంతగా రాణించలేకపోతున్నారు' అని వార్నర్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ కోచ్ పదవికోసం ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ కూడా పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి జస్టిన్ లాంగర్ తప్పుకున్నాడు. చదవండి: Prasidh Krishna: బౌలింగ్లో దుమ్మురేపాడు.. రాజస్తాన్ రాయల్స్ పంట పండినట్లే -
అతనో చేత కాని బౌలర్.. నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడు..!
తాను లంచం ఆఫర్ చేశానంటూ ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వార్న్ చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ స్పందించాడు. వార్న్.. ఓ చేత కాని బౌలర్ అని, అప్పట్లో నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడని, ఆ కసితోనే నాపై ఫిక్సింగ్ ఆరోపణలకు పాల్పడ్డాడని కౌంటరిచ్చాడు. ఈ మధ్య కాలంలో చాలా మందికి తమ పుస్తకావిష్కరణల సందర్భంగా వివాదాలు క్రికెట్ చేయడం అలవాటుగా మారిందని, ఈ వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీని వారు క్యాష్ చేసుకుంటున్నారని, వార్న్ కూడా అలాంటి చీప్ స్టంట్నే ప్లే చేశాడని ధ్వజమెత్తాడు. వార్న్కు తాను లంచం ఆఫర్ చేసిన విషయం 26 ఏళ్ల తర్వాత గుర్తుకు వచ్చిందా, ఒక వేళ అదే నిజమైతే అతను ఇన్నాళ్లు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించాడు. తన డ్యాక్యుమెంటరీని మార్కెట్ చేసుకోవడం కోసమే వార్న్ ఇదంతా చేస్తున్నాడని, అతని ఆరోపణల్లో ఇది తప్ప, మరో ఉద్దేశం కనిపించ లేదని, 26 ఏళ్లు గడిచినా వార్న్ నన్ను గుర్తుపెట్టుకోవడం సంతోషమేనని మాలిక్ చెప్పుకొచ్చాడు. కాగా, తన డాక్యుమెంటరీ "షేన్" కోసం ఇచ్చిన ఇంటర్వూ సందర్భంగా షేన్ వార్న్.. సలీం మాలిక్పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 1994 పాక్ పర్యటనలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు సలీం మాలిక్.. తనకు 2,76,000 అమెరికన్ డాలర్ల లంచం ఆఫర్ చేశాడని వార్న్ ఆరోపించాడు. తనతో పాటు సహచర ఆటగాడు టిమ్ మేకు కూడా సలీం లంచం ఆఫర్ చేశాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు -
Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి కూడా!
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శల పర్వం కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో మూడో రోజు ఆట సందర్భంగా కోహ్లి వ్యవహరించిన తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. కాగా ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ విషయంపై టీమిండియా ఆటగాళ్లు.. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్ మైకు దగ్గరకు వెళ్లి ప్రసారకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే కోహ్లిది చెత్త ప్రవర్తన అంటూ విమర్శించాడు. ఇక ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ వాన్ కోహ్లికి భారీ జరిమానా వేయాలని.. లేదంటే నిషేధం విధించాలని ఐసీసీకి సూచించాడు. ప్రతి ఒక్కరు భావోద్వేగాలు ప్రదర్శించడం సహజమని.. అయితే నాయకుడు ఇలా చేయడం సరికాదన్నాడు. ఈ విషయంలో ఐసీసీ వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ డారిల్.. భారత కెప్టెన్ చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ సైతం టీమిండియా సారథి తీరుపై పెదవి విరిచాడు. ప్రతి విషయంలోనూ ఓ హద్దు ఉంటుందని... అది దాటితే తప్పును ఉపేక్షించాల్సిన అవసరం లేదని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. షేన్ వార్న్ మాట్లాడుతూ... ‘‘అంతర్జాతీయ జట్టు కెప్టెన్ ఇలా వ్యవహరిస్తాడని నేను అనుకోను. ఒక్కోసారి అసహనం హద్దు దాటుతుంది. నిజమే.. అయితే పదే పదే ఇలా చేయడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. సహించాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో భాగంగా టీమిండియా ఆటలో వైఫల్యం కంటే కూడా ఇలాంటి వాగ్యుద్దాలు, గొడవలతోనే ఎక్కువ అప్రదిష్టను మూటగట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చదవండి: View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 -
పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు
Shane Warne: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 1994 పాక్ పర్యటన సందర్భంగా నాటి పాక్ కెప్టెన్ సలీం మాలిక్ తనకు లంచం(2, 76,000 అమెరికన్ డాలర్లు) ఆఫర్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సామర్ధ్యం మేరకు ఆడకూడదని, తనతో పాటు మరో ఆసీస్ ఆటగాడు టిమ్ మేకు వార్నింగ్ కూడా ఇచ్చాడని బాంబు పేల్చాడు. త్వరలో అమెజాన్ ప్రైమ్లో విడుదల కానున్న తన డాక్యుమెంటరీ "షేన్" కోసం ఇచ్చిన ఇంటర్వూలో ఈ సంచలన ఆరోపణలు చేశాడు. నాటి పాక్ పర్యటనలో భాగంగా కరాచీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో సామర్ధ్యం మేరకు బౌలింగ్ చేయకూడదని, వికెట్లు తీసే ప్రయత్నం చేయకుండా వైడ్ బంతులు విసరాలని తనతో పాటు టిమ్ మేకు సలీం మాలిక్ ప్రలోభాలతో కూడిన వార్నింగ్ ఇచ్చాడని వార్న్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్లో పాక్ ఓటమి అంచుల్లో ఉండిందని, అదే జరిగితే ఆ దేశ ఆటగాళ్ల ఇళ్లపై అభిమానులు దాడి చేస్తారని మాలిక్ తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడని వార్న్ తెలిపాడు. సదరు విషయాన్ని తాను, మే.. నాటి ఆసీస్ కెప్టెన్ మార్క్ టేలర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నాడు. వార్న్ చేసిన ఈ వ్యాఖ్యలతో పాక్ క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. వివాదాలకు కేంద్ర బిందువు అయిన వార్న్ ఆరోపణల్లో ఎంత మేరకు నిజం ఉందో వేచి చూడాలి. కాగా, వార్న్.. 2003 ప్రపంచకప్కు ముందు డోపింగ్ పరీక్షలో పట్టుబడి ఏడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: ఎగిరెగిరిపడకండి.. ఇంకో మ్యాచ్ ఉంది.. సఫారీలకు బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్ -
'కెప్టెన్సీ పోతే పోయింది.. నా టాప్-5లో నువ్వు ఒకడివి'
Shane Warne Top-5 Test Batsmen List.. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తన టాప్-5 టెస్టు బ్యాట్స్మన్ జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో నిలిచాడు. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లిని పరిమిత ఓవర్ల నుంచి బీసీసీఐ కెప్టెన్గా తొలగించింది. వన్డేలు, టి20ల్లో రోహిత్ కెప్టెన్ కాగా.. కోహ్లి ఇకపై టెస్టుల్లో మాత్రమే కెప్టెన్సీ చేయనున్నాడు. ఇక బ్యాట్స్మన్గానూ కోహ్లి అంతగా రాణించడం లేదు. కోహ్లి సెంచరీ చేసి దాదాపు రెండేళ్లవుతుంది. చదవండి: IND Vs SA: సౌతాఫ్రికాతో సిరీస్.. కోహ్లి కీలక నిర్ణయం! ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్స్మిత్ను ఎన్నుకున్నాడు. తన దృష్టిలో టెస్టు ఫార్మాట్లో స్మిత్ మోస్ట్ ఔట్స్టాండింగ్ బ్యాట్స్మన్.. అందుకే స్మిత్కు నెంబర్వన్ స్థానం ఇచ్చా. అంటూ తెలిపాడు. ఇక యాషెస్ సిరీస్లో భాగంగా తొలి టెస్టులో 11 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న జో రూట్ను రెండోస్థానం ఇచ్చాడు. ఇక మూడో స్థానాన్ని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు ఇచ్చాడు. ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ను కివీస్ గెలవడంలో కేన్మామ కీలకపాత్ర పోషించాడు. టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేన్ విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్లో 49.. రెండో ఇన్నింగ్స్లో 52 పరుగులు సాధించాడు. చివరగా ఐదో స్థానంలో మరో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్కు చోటు కల్పించాడు. అతి తక్కువ కాలంలోనే టెస్టుల్లో నాణ్యమైన బ్యాట్స్మన్గా పేరుపొందిన లబుషేన్ ఆసీస్ తరపున 19 టెస్టులు ఆడాడు. ఈ 19 టెస్టుల్లో అతని పేరిట 5 సెంచరీలు.. 11 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐసీసీ ఇటీవలే ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రూట్, స్మిత్, విలియమ్సన్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలవగా.. లబుషేన్ నాలుగో స్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ ఐదు.. కోహ్లి ఆరో స్థానంలో ఉన్నారు. చదవండి: Virat Kohli: వన్డే, టి20లకు గుడ్బై చెప్పే యోచనలో కోహ్లి! -
Ashes- Shane Warne: మొదటి టెస్టుకు జట్టు ఇదే.. అలెక్స్ క్యారీ వద్దు!
Ashes 2021 22 Aus Vs Eng: Shane Warne Ideal Australian Playing XI 1st Test: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ మొదటి రెండు టెస్టులు ఆడనున్న 15 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టును గురువారం ప్రకటించింది. కాగా డిసెంబరు 8 నుంచి బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా తొలి టెస్టు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం షేన్ వార్న్ మొదటి టెస్టుకు తన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్ను ఓపెనర్లుగా ఎంచుకున్న వార్న్... మూడు, నాలుగు స్థానాల్లో మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్కు అవకాశం వచ్చాడు. ఆ తర్వాతి స్థానాలకు బ్యాటింగ్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ను ఎంచుకున్నాడు. ఇదిలా ఉండగా... మహిళకు అసభ్య సందేశాలు పంపినట్లు తేలడంతో టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన టిమ్ పైన్కు క్రికెట్ ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ఆడే అవకాశం ఇవ్వలేదు. ఇక అతడి స్థానంలో పాట్ కమిన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్తో వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ టెస్టులో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే, వార్న్ మాత్రం జోష్ ఇంగ్లిస్కే ఓటు వేశాడు. మొదటి టెస్టుకు షేన్ వార్న్ ప్రకటించిన జట్టు ఇదే! డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జై రిచర్డ్సన్, నాథన్ లియాన్, జోష్ హాజిల్వుడ్. చదవండి: Ind Vs SA 2021- Virat Kohli: వారం రోజుల్లో తేలనున్న కోహ్లి భవితవ్యం.. కొనసాగిస్తారా? లేదంటే! 🔒 it in! Alex Carey will take the gloves for the first two matches of the Vodafone Men's #Ashes Series against England. pic.twitter.com/Ui6JDEfD0f — Cricket Australia (@CricketAus) December 2, 2021 -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన షేన్ వార్న్..
Former Australian Cricketer Shane Warne Injured In Bike Accident: ఆస్ట్రేలియా లెజండరీ స్పిన్నర్ షేన్ వార్న్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కొడుకు జాసన్తో కలిసి రైడ్కు వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతడి కాలికి గాయమైనట్లు సమాచారం. ఆస్ట్రేలియన్ మీడియా నివేదికల ప్రకారం.. షేన్ వార్న్ మెల్బోర్న్లో రైడ్కు తన కూమారుడితో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే స్పోర్ట్స్ బైక్ను అతివేగంగా నడిపినందునే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంపై స్పందించిన షేన్ వార్న్ మాట్లాడూతూ.. "నేను అదుపు తప్పి బైక్పై నుంచి కిందపడిపోయాను. ఆసమయంలోనేనే కాస్త బయపడ్డాను. స్పల్పగాయాలతో బయటపడ్డాను. అప్పుడు నేను బాగానే ఉన్నానని అనుకున్నాను. కానీ మరుసటి రోజుకి గాయం తీవ్రమైంది. దీంతో పూర్తిగా నడవలేకపోయాను. తర్వాత ఆసుపత్రికి వెళ్లగా నా కాలికి గాయమైందని వైద్యలు తెలిపారు. యాషెస్ సిరీస్లో భాగంగా గబ్బాలో జరిగే తొలి టెస్ట్కు నేను అక్కడే ఉంటాను" అని వార్న్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా తరపున 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు సాధించాడు. చదవండి: PAK Vs BAN: ఏంటి బాబర్ ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకున్నావా.. -
న్యూజిలాండ్ స్పిన్నర్ చెత్త రికార్డు.. 21 ఏళ్ల తర్వాత
William Somerville Was 2nd Spinner After Shane Warne Without Wicket In India.. న్యూజిలాండ్ స్పిన్నర్ విలియమ్ సోమర్విల్లే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. భారత్లో జరిగిన టెస్టు మ్యాచ్లో ఒక విదేశీ స్పిన్నర్(రెండు ఇన్నింగ్స్లు) అత్యధిక ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇది రెండోసారి. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో సోమర్ విల్లే తొలి ఇన్నింగ్స్లో 24 ఓవర్లు వేసి 60 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేదు.. ఇక రెండో ఇన్నింగ్స్లో 16 ఓవర్లు వేసిన అతను 38 పరుగులిచ్చి వికెట్ తీయలేదు. చదవండి: IND Vs NZ: ఆరంగేట్ర మ్యాచ్లో మరో రికార్డు సాధించిన శ్రేయస్ అయ్యర్.. ఓవరాల్గా 40 ఓవర్లు వేసి 98 పరుగులిచ్చిన సోమర్విల్లే ఒక్క వికెట్ తీయలేక చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంతకముందు 1997-98లో టీమిండియా పర్యటనలో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఒక టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి 47 ఓవర్ల వేసి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. దాదాపు 21 ఏళ్ల తర్వాత కివీస్ స్పిన్నర్ సోమర్విల్లే దీనిని రిపీట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా రెండో ఇన్నింగ్స్ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా ఇంగ్లండ్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగోరోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. 2 పరుగులు చేసిన యంగ్ అశ్విన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆట ఐదోరోజులో న్యూజిలాండ్ గెలవాలంటే 280 పరుగులు అవసరం కాగా.. టీమిండియా 9 వికెట్లు కావాలి. చదవండి: Cheteshwar Pujara: మాట నిలబెట్టుకోలేదు.. అజిత్ వాడేకర్ చెత్త రికార్డు సమం -
క్రికెట్కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్లో నలిగిన ఆటగాళ్లు
క్రికెట్ చరిత్రలో కొంతమంది ఆటగాళ్లు ఎంతమంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వారి వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులు కెరీర్కు మాయని మచ్చగా మిగిలిపోతాయి. తాజాగా టిమ్ పైన్ ఉదంతం అందుకు ఉదాహరణ. బాల్ టాంపరింగ్ ఉదంతంతో స్మిత్ కెప్టెన్సీ కోల్పోగా.. అతని నుంచి బాధ్యతలు స్వీకరించిన టిమ్ పైన్ ఆస్ట్రేలియాను బాగానే నడిపించాడు. అయితే కీలకమైన యాషెస్ సిరీస్కు ముందు టిమ్పైన్పై సెక్స్ ఆరోపణలు వచ్చాయి. 2017లో ఒక మహిళతో అసభ్యకరమైన చాటింగ్ చేసినట్లు తేలింది. ఇది నిజమేనని ఒప్పుకున్న పైన్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆటగాడిగా మంచిపేరు తెచ్చుకున్నప్పటికి సెక్స్ స్కాండల్ ఉదంతం అతని కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోనుంది. ఈ నేపథ్యంలో గతంలోనూ క్రికెటర్లు సెక్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. - సాక్షి, వెబ్డెస్క్ షాహిద్ అఫ్రిది: మేటి ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది వివాదాల్లోనూ అంతే గుర్తింపు పొందాడు. ఒక దశలో రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వెనక్కి వచ్చిన అఫ్రిది సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించాడు తన కెరీర్లాగే ఆఫ్రిదీ జీవితంలో వివాదాలు చాలా ఎక్కువే. ఓ టోర్నీ కోసం సింగపూర్ వెళ్లిన అఫ్రిది.. అక్కడ మరో క్రికెటర్తో కలిసి ఇద్దరు అమ్మాయిలతో గడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆఫ్రిదీని 2000 ఐసీసీ ఛాంపియన్స్ట్రోఫీ నుంచి తప్పిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా నిలిచింది. చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్ కెప్టెన్సీకి రాజీనామా అబ్దుల్ రజాక్: పెళ్లయిన తర్వాత తనకు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ స్వయంగా వెల్లడించాడు. ఒక టీవీ కార్యక్రమంలో, 39 ఏళ్ల మాజీ క్రికెటర్ తనకు ఆరుగురు మహిళలతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు ఒప్పుకున్నాడు. అందులో ఒక మహిళతో ఒకటిన్నర సంవత్సరాలు డేటింగ్ చేశాడని ఒప్పుకున్నాడు. షాహిన్ అఫ్రిది: ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో షాహిన్ అఫ్రిది ఒక సంచలనం. రోజురోజుకు ఆటలో పదును పెంచుకుంటున్న షాహిన్ అఫ్రిది వ్యక్తిగత జీవితంలో మాత్రం బ్యాడ్బాయ్గా ముద్ర వేసుకున్నాడు. చాలా మంది అమ్మాయిలతో రొమాంటిక్ రిలేషన్షిప్ను ఏర్పరచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయ్. షాహీన్ ప్రైవేట్ చాట్ స్క్రీన్ షాట్ను ఓ బాధితురాలు పోస్ట్ చేసింది. అమ్మాయిల్ని ట్రాప్ చేయడంలో అఫ్రిది ముందుంటాడని ఆమె ఆరోపించింది. షేన్ వార్న్ : సెక్స్ స్కాండల్ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది ఆసీస్ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్. క్రికెట్ చరిత్రలో మేటి స్పిన్నర్గా నిలిచిపోయిన వార్న్ కెరీర్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అతను హాంప్షైర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కొందరు మోడళ్లతో సరసాలాడడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మెల్బోర్న్లో హోటల్ గదిలో పలువురు మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఇక యాషెస్ సిరీస్ లో భాగంగా.. బ్రిటిష్ నర్సును లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి హర్షలే గిబ్స్: దక్షిణాఫ్రికా ఓపెనర్గా ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న హర్షలే గిబ్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచేవాడు. అమ్మాయిలతో తాను ప్రవర్తించిన తీరును గిబ్స్ తన తన ఆత్మకథ (టు ది పాయింట్) లో స్వయంగా వెల్లడించడం విశేషం. ఆ ఆత్మకథలో తాను మహిళలతో ప్రవర్తించిన తీరును గూర్చి వివరించడం వివాదాలకు దారి తీసింది. క్రిస్ గేల్: యూనివర్సల్ బాస్ అని ముద్దుగా పిలుచుకునే క్రిస్ గేల్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఎంజాయ్కు కేరాఫ్ అడ్రస్ అయిన గేల్.. 2012లో శ్రీలంక వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ సమయంలో ముగ్గురు బ్రిటిష్ మహిళలను తన హోటల్ గదులకు బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. హోటల్ బాడీగార్డ్ సాయంతో ఆ ముగ్గురు మహిళలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజమనేది తెలియరాలేదు. కెవిన్ పీటర్సన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్.. కెవిన్ పీటర్సన్ కూడా సెక్స్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికా 'బిగ్ బ్రదర్' సెలబ్రిటీ వెనెస్సా నిమ్మోతో ఎఫైర్ కలిగి ఉన్నాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇది పీటర్సన్ కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇయాన్ బోథమ్: క్రికెట్ లో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సర్ ఇయాన్ బోథమ్ కూడా సెక్స్ ఆరోపణలు ఎదుర్కోవడం విశేషం. మైదానంలో హుందాగా ప్రవర్తించే ఈ క్రికెటర్ బయట అపకీర్తిని మూటగట్టుకున్నాడు. భోథమ్ తన భార్యను మోసం చేస్తూ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేగాక బోథమ్కు ఆస్ట్రేలియన్ వెయిట్రెస్తో కూడా ఎఫైర్ ఉంది.ఇక మాజీ మిస్ యునివర్స్ బార్బడోస్ లిండీ ఫీల్డ్తో భోథమ్ నడిపిన అఫైర్ 1980లలో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసింది. మహ్మద్ షమీ: టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై ఇలాంటి ఆరోపణలు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. స్వయంగా షమీ భార్య హసిన్ జహాన్ .. నా భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ పేర్కొనడం సంచలనం సృష్టించింది. దీంతో షమీ ఇబ్బందుల్లో పడ్డాడు. అతను ఇతర మహిళలతో షమీ చాట్ చేస్తున్న ఫోటోలను జహాన్ మీడియాతో పంచుకుంది. ప్రస్తుతం వీరిద్దరు వేరువేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. చదవండి: Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్గా మరోసారి స్టీవ్ స్మిత్! -
Shane Warne: ఆ జట్టే ప్రపంచకప్ విజేత.. కచ్చితంగా..
T20 World Cup 2021: They can win the WC - Shane Warne: ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021 తుది దశకు చేరుకుంటోంది. నవంబరు 14న ఈ మెగా టోర్నీ విజేత ఎవరో తేలనుంది. ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టైటిల్ గెలిచే క్రమంలో హోరాహోరీ పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజండరీ స్పిన్నర్ షేన్ వార్న్ వరల్డ్కప్ విన్నర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆసీస్కు ట్రోఫీ గెలిచే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ఇంతవరకు నిలకడైన ప్రదర్శన కనబరిచిన అత్యుత్తమ జట్టుకు టైటిల్ అందుకునే అర్హత ఉందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ బాగుందని.. అందరూ ఫామ్లో ఉండటం శుభపరిణామమని చెప్పుకొచ్చాడు. మాజీ సారథి స్టీవ్ స్మిత్ నిలకడగా ఆడుతూ.. మార్ష్, స్టొయినిస్, మాక్స్వెల్ మెరుగ్గా రాణిస్తే తిరుగే ఉండదని వార్న్ అభిప్రాయపడ్డాడు. పూర్తి విశ్వాసంతో ఉన్నాం గ్రూపు-1లో ఉన్న ఆస్ట్రేలియా... ఐదింట నాలుగు మ్యాచ్లు గెలిచి ఇంగ్లండ్తో పాటు సెమీస్కు దూసుకెళ్లింది. ఇక గ్రూపు-2 టాపర్ అయిన పాకిస్తాన్తో సెమీ ఫైనల్లో ఆసీస్ అమీతుమీ తేల్చుకోనుంది. నవంబరు 11 దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టుకే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయాల నేపథ్యంలో మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. ‘‘టాస్ అంతగా ప్రభావం చూపుతుందని నేను అనుకోను. అయితే, ఇక్కడ టాష్ గెలిచిన దాదాపు అన్ని జట్లు తొలుత బౌలింగ్ చేసేందుకే మొగ్గుచూపాయి. కానీ.. గత రెండు మ్యాచ్లలో మంచు అంతగా లేనట్లు అనిపించింది. నిజానికి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు కచ్చితంగా భారీ స్కోరు నమోదు చేయగలగాలి. అదే విధంగా స్కోరును కాపాడుకోగలగాలి. మేము ఇప్పుడు సెమీ ఫైనల్లో ఉన్నాం. పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఏం జరుగుతుందో ఊహించడం కష్టం’’ అని పేర్కొన్నాడు. కాగా ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా ఇంతవరకు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్కప్ గెలవలేదన్న సంగతి తెలిసిందే. చదవండి: Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్ యూ భాయ్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇది కదా క్రికెట్ అంటే: వార్న్
వచ్చే ఏడాది ఐపీఎల్కు మరో రెండు జట్లు కొత్తగా రావడం ఒక ఎత్తైతే.. రికార్డు స్థాయిలో టెండర్లు దాఖలు చేసి రావడం మరొక ఎత్తు. ఐపీఎల్ కొత్త జట్ల కోసం సోమవారం జరిగిన జరిగిన బిడ్డింగ్లో రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా (ఆర్పీఎస్జీ) వెంచర్స్ లిమిటెడ్ రూ.7,090 కోట్లు వెచ్చించి లక్నో ఫ్రాంచైజీని సొంతం చేసుకోగా, సీవీసీ క్యాపిటల్స్ రూ. 5,625 కోట్లకు అహ్మదాబాద్ ప్రాంఛైజీని సొంతం చేసుకుంది. దాంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు రూ. 12,715 కోట్లు వచ్చిపడింది. ఓవరాల్గా 22 కంపెనీలు బిడ్డింగ్లపై ఆసక్తి చూపడం క్రికెట్ గేమ్ సత్తా ఎలా ఉంటుందో మరొకసారి ప్రపంచానికి తెలిసేలా చేసింది. రెండు జట్ల కోసం భారీ పోటీ నెలకోవడం క్రికెట్ ప్రేమికుల్ని, విశ్లేషకుల్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ తన ట్వీటర్ హ్యాండిల్లో స్పందించాడు. ‘ వావ్.. కొత్తగా రాబోతున్న రెండు జట్లకు కంగ్రాట్స్. రెండు జట్ల కోసం జరిగిన పోటీలో ఇంతటి భారీ స్థాయిలో ధనం చేకూరడం క్రికెట్ అంటే ఏమిటో ప్రపంచానికి చాటేలా చేసింది. ఇది కదా క్రికెట్ అంటే. ఈ గ్రహంపై క్రికెట్ రెండో అతి పెద్ద ఆట ఎలా అయ్యిందో ఐపీఎల్ బిడ్డింగ్ ద్వారా తెలుస్తోంది. వెల్డన్ సౌరవ్ గంగూలీ, బీసీసీఐ’ అని వార్న్ పోస్ట్ చేశాడు. చదవండి: IPL New Teams: అదానీని తలదన్నేసిన గోయెంకా గ్రూప్.. మరి సీవీసీ క్యాపిటల్ గురించి తెలుసా? -
భారత్పై విజయం.. ఇప్పుడు పాకిస్తానే టైటిల్ ఫేవరెట్: షేన్ వార్న్
Shane warne comments Pakistan: టీ20 ప్రపంచకప్-2021లో భారత్పై సంచలన విజయం నమోదు చేసిన పాకిస్తాన్పై ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్పై విజయం సాధించడంతో పాకిస్తానే టైటిల్ ఫేవరెట్ అని అతడు అన్నాడు. ఈ మ్యాచ్లో ఒత్తిడిని తట్టుకుంటూ రిజ్వాన్, బాబర్ అద్బుతంగా ఆడారాని వార్న్ కొనియాడాడు. "టీ20 ప్రపంచకప్లో భారత్పై విజయం సాధించి పాక్ సత్తా చాటింది. నా అభిప్రాయం ప్రకారం ఈసారి పాకిస్తాన్ ఛాంపియన్గా నిలుస్తుంది. ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శనతో పాక్ ఆదరగొట్టింది. బాబర్ ఆజం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా తన ఖ్యాతిని పెంచుకుంటూనే ఉన్నాడు" అని వార్న్ ట్వీట్ చేశాడు. కాగా మ్యాచ్లో తొలుత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి చేసింది. ఛేదనలో దూకుడుగా ఆడేసిన పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ అజామ్, రిజ్వాన్ అలవోకగా ఆ జట్టుని గెలిపించారు. దీంతో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. చదవండి: T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్ ఏంటి?’ -
టీ20 ప్రపంచకప్ ఫేవరెట్ ఆ రెండు జట్లే: షేన్ వార్న్
Shane Warne Choose These 2 as favourites to win T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్2021లో భాగంగా సూపర్ 12 రౌండ్ మ్యాచ్లు రేపు(ఆక్టోబర్ 23)నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఏ జట్టు టైటిల్ను గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. తాజాగా ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ టైటల్ గెలుచుకోనే తన పేవరేట్ జట్లును అంచనా వేశాడు. టీ20 ప్రపంచకప్2021 టైటిల్ విజేతగా ఇంగ్లండ్, భారత్ జట్లు ఫేవరెట్గా ఉన్నాయని షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. మరో వైపు ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆస్ట్రేలియాను ఏ విధంగానూ తేలికగా తీసుకోవద్దని వార్న్ హెచ్చరించాడు. పాకిస్తాన్ , వెస్టిండీస్ జట్లు నుంచి మిగతా జట్లు గట్టి పోటీ ఎదుర్కొంటాయి అతడు తెలిపాడు. "టీ20 ప్రపంచకప్లో టైటిల్ బరిలో భారత్, ఇంగ్లండ్ నిలుస్తాయని నేను అనుకుంటున్నాను. న్యూజిలాండ్ కూడా ఐసీసీ ఈవెంట్లలో ఆద్బతుంగా ఆడుతుంది. మరో వైపు ఆసీస్ జట్టులో చాలా మంది హిట్టర్లు ఉన్నందున వారిని తక్కువగా అంచనా వేయకూడదని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్, భారత్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని షేన్ వార్న్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆడిన రెండు వార్మప్ మ్యాచ్ల్లోనూ విజయం సాధించి టీమిండియా మంచి ఊపుమీద ఉంది. కాగా తొలి వార్మప్ మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమి చెందిన ఇంగ్లండ్.. రెండో వార్మప్ మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించి తిరిగి ట్రాక్లో పడింది. అక్టోబర్ 24 కోహ్లి సేన దాయాది దేశం పాకిస్తాన్తో తలపడనుంది. చదవండి: ఒకే ఓవర్లో 8 సిక్సర్లు.. ఆస్ట్రేలియా ఆటగాడు సరికొత్త రికార్డు -
మోర్గాన్ తప్పు లేదు.. అశ్విన్ను అడ్డుకునే హక్కు ఉంది
Ravichandran Ashwin- Eoin Morgan Controversy.. ఐపీఎల్ 2021 సెకండ్ఫేజ్లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో విజయం ఎవరు సాధించారనే దానికంటే అశ్విన్- మోర్గాన్ గొడవ ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. సౌథీ బౌలింగ్లో ఔటై వెళ్తున్న అశ్విన్పై సౌథీ నోరు జారగా.. అతనికి కెప్టెన్ మోర్గాన్ మద్దతుగా నిలిచాడు. ఇది నచ్చని అశ్విన్ మోర్గాన్కు కోపంగా బ్యాట్ను చూపిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అశ్విన్ తన బౌలింగ్లోనే మోర్గాన్ను డకౌట్ చేయడం ద్వారా గట్టిగా అరుస్తూ పెవిలియన్ వెళ్లు అంటూ బదులు తీర్చుకున్నాడు. వీరి వివాదం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అంతకముందు రిషబ్- అశ్విన్ జోడి ఒక పరుగు అదనంగా తీయడమే ఈ గొడవకు మూల కారణం. కాగా దీనిపై పలువురు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు తాజాగా ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అశ్విన్- మోర్గాన్ వివాదంపై స్పందించాడు. క్రికెట్లో ఇలాంటివి జరగడం సాధారణం. దీనిపై రెండుగా చీలిపోయి చర్చ పెట్టడం కూడా వ్యర్థమే. నిన్న జరిగిన గొడవలో నా దృష్టిలో అశ్విన్దే తప్పు. ఒక పరుగు అదనంగా తీయడం పెద్ద నేరం కాకపోవచ్చు.. కానీ ఒక బౌలర్ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేస్తే.. అతనికి ధీటుగా బదులివ్వడం వరకు ఓకే. కానీ గొడవను ఆపుదామని వచ్చిన మోర్గాన్పై కోపం వ్యక్తం చేయడం ఏం బాలేదు. తన బౌలింగ్లో మోర్గాన్ డకౌట్ అయి వెళ్లేటప్పుడు గట్టిగా అరుస్తూ ఆవేశాన్ని వ్యక్తం చేసి తన గౌరవాన్ని కించపరుచుకున్నాడు. ముమ్మాటికి మోర్గాన్కు అశ్విన్ను అడ్డుకునే హక్కు ఉంది. అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్దిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కేకేఆర్ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చదవండి: IPL 2021: డెబ్యూ మ్యాచ్లోనే గొడవ.. మోర్గాన్ మద్దతు -
టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు
సిడ్నీ: ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా బెస్ట్ టీమ్ను చూశానంటూ ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ పేర్కొన్నాడు. కాగా కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దుపై ఈసీబీ నిర్ణయాన్ని సమర్థించిన మాజీ క్రికెటర్లలో షేన్ వార్న్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా వార్న్ టీమిండియా ప్రదర్శనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి:టీమిండియాను ట్రోల్ చేసిన వాన్.. పీటర్సన్ కౌంటర్ ''టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ రద్దవడం కాస్త ఆశ్చర్యపరిచింది. కానీ నష్టం జరగకముందే ఈసీబీ, బీసీసీఐ మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవడం సంతోషించాల్సిన విషయం. ఒకవేళ మ్యాచ్ మధ్యలో ఉండగా ఆటగాళ్లకు కరోనా సోకి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఆ ప్రభావం ఐపీఎల్ సీజన్పై పడి ఉండేది. ఇక ఈ సిరీస్లో టీమిండియా ప్రదర్శన అద్భుతం. వారు క్రికెట్ ఆడిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. ఇంగ్లండ్ గడ్డ నుంచి టీమిండియా వెళుతూ వెళుతూ.. సిరీస్ ఆధిక్యంతో పాటు నా టోపీని ఎత్తుకెళ్లారు. టెస్టు చాంపియన్షిప్ ప్రవేశపెట్టినప్పటి నుంచి టెస్టు మ్యాచ్లు ఆసక్తికరంగా మారాయి. టేబుల్లో టాప్ స్థానంలో ఉండేదుకు ఇరు జట్లు మంచి పోటీతో క్రికెట్ ఆడాయి. అయితే టీమిండియా తన అద్భుత ఆటతీరుతో 2-1 తేడాతో సిరీస్ గెలిచి ఆధిక్యంలో ఉంది. టీమిండియా ఇంగ్లండ్ను వారి గడ్డపై ఓడించాలనుకుంది. డ్యూక్స్, స్వింగ్, సీమింగ్ బంతులతో ఫలితం రాబట్టింది. అని చెప్పుకొచ్చాడు. నిర్ణయాత్మకమైన ఐదో టెస్టు కోవిడ్ కారణంగా రద్దు కావడంతో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్లో విజేత ఎవరనేది తేల్చలేదు. అయితే వచ్చే ఏడాది జూలైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటన(పరిమిత ఓవర్ల క్రికెట్) నేపథ్యంలో అప్పుడు ఈ టెస్టు మ్యాచ్ నిర్వహించేలా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 22న సౌరవ్ గంగూలీ టెస్టు మ్యాచ్ నిర్వహణపై లండన్కు బయలుదేరి వెళ్లనున్నాడు. ఆ ఫలితం ఆధారంగానే సిరీస్ విజేతను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Sunil Gavaskar: నాడు ఇంగ్లండ్ చేసిన పనిని మరవొద్దు.. ఉగ్రదాడి జరిగినా..! -
భూగ్రహం మొత్తంలో కోహ్లిని మించినోడే లేడు: షేన్ వార్న్
లండన్: ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా చేరాడు. తొలుత ట్విటర్ వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపించిన వార్న్.. ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఆకాశానికెత్తాడు. Congratulations .@imVkohli & the entire Indian team on another terrific win. What you guys have all achieved together over the last 12 months is absolutely magnificent ! Clearly the best test team in the world & that title is thoroughly deserved too ! Long live test cricket ❤️❤️ — Shane Warne (@ShaneWarne) September 6, 2021 'మరో అద్భుతమైన విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. గత ఏడాది కాలంగా మీరు జట్టుగా సాధించిన విజయాలు న భూతో న భవిష్యత్. ప్రపంచంలోనే టీమిండియా అత్యుత్తమ టెస్టు జట్టు. ఇందుకు మీరు మాత్రమే నిజమైన అర్హులు. లాంగ్ లివ్ టెస్ట్ క్రికెట్' అంటూ వార్న్ ట్వీట్ చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓవల్ టెస్ట్లో కోహ్లి భారత జట్టును ముందుండి నడిపించిన తీరు అత్యద్భుతమని కొనియాడాడు. కోహ్లి.. టెస్ట్ క్రికెట్కు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల సాంప్రదాయ ఫార్మాట్ స్థాయి పెరిగిందని, అతని సారధ్యంలో టీమిండియా ప్రపంచ క్రికెట్లో పవర్ హౌస్గా మారిందని ప్రశంసించాడు. టెస్ట్ క్రికెట్ పట్ల టీమిండియా కెప్టెన్కున్న ప్యాషన్ అతన్ని భూగ్రహంలోనే అత్యుత్తమ ఆటగాడిగా మార్చిందని ఆకాశానికెత్తాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్ట్లో 368 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 157 పరుగుల తేడాతో ఓటమిపాలై 5 టెస్ట్ల సిరీస్లో 1-2తో వెనుకపడింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ సూపర్ శతకం(127)తో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌటైంది. కీలక తరుణంలో శతక్కొట్టిన హిట్ మ్యాన్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చదవండి: అశ్విన్ విషయంలో టీమిండియా కెప్టెన్ నిర్ణయం సరైందే: ఏబీ డివిలియర్స్ -
కోహ్లీసేనకు కంగ్రాట్స్ .. షేన్ వార్న్
-
వార్న్కు స్పిన్ పాఠాలు.. నవ్వాపుకోలేకపోయిన సెహ్వాగ్
సౌతాంప్టన్: లెజెండరీ స్పిన్నర్లలో ఒకడిగా పేరుపొందిన షేన్ వార్న్కు ఒక అభిమాని స్పిన్ పాఠాలు చెప్పడం వైరల్గా మరింది. విషయంలోకి వెళితే.. భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు న్యూజిలాండ్ జట్టు ఒక్క స్పిన్నర్ను కూడా తీసుకోకుండా బరిలోకి దిగింది. దీనిని తప్పుబడుతూ షేన్ వార్న్ ఓ ట్వీట్ చేశాడు. ''ఫైనల్లో న్యూజిలాండ్ స్పిన్నర్ను ఆడించకపోవడం చాలా నిరాశ కలిగించింది. ఈ పిచ్ స్పిన్కు అనుకూలించనుంది. ఇప్పటికే పిచ్పై అడుగుల మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పిన్ అయ్యేలా కనిపిస్తోందంటే కచ్చితంగా అవుతుంది. ఇండియా 275/300 కంటే ఎక్కువ చేసిందంటే మ్యాచ్ ముగిసినట్లే'' అని వార్న్ ట్వీట్ చేశాడు. కాగా వార్న్ ట్వీట్పై ఓ అభిమాని రిప్లై ఇచ్చాడు. '' షేన్ అసలు స్పిన్ ఎలా అవుతుందో నీకు తెలుసా? పిచ్ పొడిగా మారితేనే.. కానీ ఇక్కడ వర్షం కారణంగా పిచ్ పొడిగా మారే అవకాశమే లేదు'' అని ట్వీట్ చేశాడు. వార్న్కు అభిమాని ఇచ్చిన రిప్లైపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. '' ఆల్టైమ్ దిగ్గజ స్పిన్నర్లలో ఒకడిగా పేరు పొందిన షేన్ వార్న్కే స్పిన్ పాఠాలు చెబుతున్నావు. ఇది నా నవ్వును ఆపలేకపోతుంది. షేన్ అసలు స్పిన్ ఎలా అవుతుందో తెలుసుకో అంటూ'' లాఫింగ్ ఎమోజీలను షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆటలో తొలిరోజు వర్షార్పణం కాగా.. రెండో రోజు ఆట వెలుతురులేమితో 66.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (124 బంతుల్లో 44 బ్యాటింగ్; 1 ఫోర్), అజింక్య రహానే (79 బంతుల్లో 29 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. చదవండి: WTC Final: కివీస్కు ఫీల్డ్ అంపైర్ సాయం.. ఫ్యాన్స్ ఆగ్రహం కోహ్లిని ఔట్ చేయాలంటే ఇలా చేయాల్సిందే: స్టెయిన్ Frame this, @ShaneWarne and try to understand some spin 🤣 pic.twitter.com/jHpacxg9CQ — Virender Sehwag (@virendersehwag) June 19, 2021 -
కివీస్ తుదిజట్టు ఎంపిక నిరాశకు గురిచేసింది: మాజీ క్రికెటర్
సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కై న్యూజిలాండ్ తుదిజట్టు ఎంపిక పట్ల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ పెదవి విరిచాడు. అత్యంత కీలకమైన మ్యాచ్లో స్పిన్నర్ లేకుండా కివీస్ బరిలోకి దిగడం తనను నిరాశకు గురిచేసిందన్నాడు. కాగా సౌతాంప్టన్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శనివారం ఆట ఆరంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు వర్షం కారణంగా టాస్ పడకుండానే ఆట రద్దు కాగా.. రెండో రోజు వరుణుడు కనికరించడంతో ఎట్టకేలకు మ్యాచ్ మొదలైంది. ఈ నేపథ్యంలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల(అశ్విన్, జడేజా)తో టీమిండియా బరిలోకి దిగింది. ఇక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ మాత్రం.. పేసర్ల వైపే మొగ్గుచూపింది. ఇంగ్లండ్తో ఇటీవలి టెస్టు సిరీస్ రెండో మ్యాచ్లో అద్భుతంగా రాణించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ను పక్కనపెట్టింది. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించిన షేన్ వార్న్.. ‘‘వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఒక్క స్పిన్నర్ లేకుండానే న్యూజిలాండ్ మైదానంలో దిగడం నన్ను పూర్తి నిరాశకు గురిచేసింది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అర్థమవుతోంది. ఇండియా 275 లేదా 300 స్కోరు చేస్తుంది! వాతావరణం అనుకూలిస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా. న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్నీ నికోలస్, బీజే వాట్లింగ్(వికెట్ కీపర్), కోలిన్ డీ గ్రాండ్హోమ్, కైలీ జెమీషన్, నీల్ వాగ్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్. చదవండి: WTC Final Day 2: టీమిండియా స్కోరు- 134/3 Very disappointed in Nz not playing a spinner in the #ICCWorldTestChampionship as this wicket is going to spin big with huge foot marks developing already. Remember if it seems it will spin. India make anything more than 275/300 ! The match is over unless weather comes in ! — Shane Warne (@ShaneWarne) June 19, 2021 -
ఆ దిగ్గజ ఆటగాడు గ్రౌండ్లోకి వచ్చే ముందు సిగరెట్ కాల్చేవాడు..
మెల్ బోర్న్: స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సంచలన విషయాలు వెల్లడించాడు. వార్న్కు మైదానంలోకి అడుగుపెట్టే ముందు సిగరెట్ కాల్చే అలవాటు ఉండేదని బహిర్గతం చేశాడు. కెరీర్ మొత్తంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన స్పిన్ మాంత్రికుడు.. అఫ్ ద ఫీల్డ్ విషయాల గురించి ఉపశమనం పొందేందుకే ఆ విధంగా చేసేవాడని చెప్పుకొచ్చాడు. వార్న్కు మానసిక స్థైర్యం ఎక్కువని, అదే అతని బలమని పేర్కొన్నాడు. వార్న్.. ఆన్ ఫీల్డ్లో ఏరకంగా రెచ్చిపోయేవాడో, అఫ్ ద ఫీల్డ్ కూడా అదే రకంగా ప్రవర్తించి వివాదాలను కొని తెచ్చుకునేవాడని కుండ బద్దలు కొట్టాడు. దీంతో అతను మీడియా నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు సిగరెట్ కాల్చేవాడని, తన వ్యక్తిగత విషయాలు ఆటపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే అతను అలా చేసే వాడని వివరించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్గా గుర్తింపు తెచ్చుకున్న వార్న్.. తన హయాంలో ఆస్ట్రేలియాను జగజ్జేతగా నిలిపాడని కొనియాడాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సందర్భాల్లో మీడియా వార్న్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసేదని, దానికి అతడు గ్రౌండ్లోనే బదులిచ్చేవాడని చెప్పుకొచ్చాడు. మైదానం వెలుపల అతని ప్రవర్తన ఎలా ఉన్నా, దాని తాలూకా ప్రభావాన్ని మాత్రం ఆన్ ఫీల్డ్ ఎప్పుడూ చూపించేవాడు కాదని వార్న్ను వెనకేసుకొచ్చాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న వార్న్.. 145 మ్యాచ్ల్లో 708 వికెట్లు సాధించాడు. -
శతాబ్దంలోనే అరుదైన రికార్డ్ ఈ బౌలర్ సొంతం..
అబుదాబీ: అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రస్తుత తరంలో ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ శతాబ్దంలో ఒకే టెస్ట్లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్లో రషీద్ ఏకంగా 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు. 2002లో కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ 98 ఓవర్లు వేశాడు. ఆ రికార్డును తాజాగా రషీద్ బ్రేక్ చేశాడు. అయితే 1998లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 113.5 ఓవర్లు బౌల్ చేశాడు. ఆధునిక టెస్ట్ క్రికెట్లో మురళీ పేరిట ఈ రికార్డ్ నమోదైవుండగా 21వ శతాబ్దంలో మాత్రం రషీద్ ఖాన్ పేరిటే ఈ రికార్డ్ లిఖించబడింది. కాగా, 2 టెస్ట్ల సిరీస్లో భాగంగా అబుదాబీ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్లో అఫ్గనిస్థాన్ 6 వికెట్లతో అద్భుత విజయం సాధించి, సిరీస్ను 1-1 తేడాతో సమం చేసుకుంది. ఈ మ్యాచ్లో రషీద్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఇదే వేదికగా మార్చి 17 నుంచి మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. -
'అంతా బాగుంది.. నోబాల్స్ జీర్ణించుకోలేకపోతున్నా'
బ్రిస్బేన్: ఆసీస్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన టి.నటరాజన్ తొలి సిరీస్లోనే ఆకట్టుకునే ప్రదర్శనతో అదరగొట్టాడు.మూడు మ్యాచ్లు కలిపి 6.92 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీశాడు.ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్లో మాత్రం నటరాజన్కు తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే టీమిండియా ప్రధాన బౌలర్లంతా గాయపడడంతో బ్రిస్బేన్లో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా నటరాజన్ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో మూడు కీలక వికెట్లు తీశాడు... కానీ నటరాజన్ విషయంలో నో బాల్స్ అంశం మాత్రం బాగా కలవరపెడుతుంది. మంచి ఫుట్వర్క్ కలిగిన నటరాజన్ ఆడిన తొలి టెస్టులోనే ఏడు నోబాల్స్ వేయడం విశేషం. టెస్టు మ్యాచ్లో నోబాల్స్ పడడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఇదే అంశంపై ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందించాడు. 'నటరాజన్ బౌలింగ్ శైలి అద్భుతంగా ఉంది.. అతను వికెట్ తీసే విధానం కూడా చాలా బాగుంది. కానీ నో బాల్స్ విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నా. టెస్టుల్లో నో బాల్స్ వేయడం అరుదు.. అలాంటిది నటరాజన్ మాత్రం ఏడు నోబాల్స్ వేశాడు. దీంతోపాటు ఒక ఓవర్ ప్రారంభంలోనే మొదటి బంతి సరిగా వేయడానికి ఐదు నో బాల్స్ వేయడం కాస్త ఆశ్యర్యం వేసింది. ఆ సమయంలో నటరాజన్కు ఆ బంతులు జీర్ణించుకోవడం కాస్త కష్టంగా మారి ఉంటుంది.' అని తెలిపాడు. (చదవండి: ఆసీస్ క్రికెటర్పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు) కాగా గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు భారత్కు భారీ టార్గెట్ను నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం 33 పరుగులతో కలిపి ఓవరాల్గా టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ (4), శుభ్మన గిల్ (0) క్రీజులో ఉన్నారు. ఇక ఇప్పటివరకు మూడు టెస్టులు జరగ్గా.. చెరో విజయంతో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఒక టెస్టు డ్రాగా అయింది. దాంతో తాజా టెస్టు విజయం నిర్ణయాత్మకంగా మారింది.(చదవండి: రోహిత్ కావాలనే అలా చేశాడా!) -
ఆసీస్ క్రికెటర్పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ క్రికెటర్గా ఎంత పేరు సంపాదించాడో.. వివాదాల్లోనూ అంతే పేరు మూటగట్టుకున్నాడు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో రెండో రోజు మొదటి సెషన్లో వార్న్ మరో మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్తో కలిసి కామెంటరీ చేశాడు. ఈ సందర్భంగా ఆసీస్ బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్పై వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. లబుషేన్ క్రీజులో చూపిస్తున్న మేనరిజమ్స్పై సైమండ్స్ ఏదో చెప్పగా..వార్న్ దానికి అడ్డుపడుతూ..'జీసస్..చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది..మొదట బ్యాట్ను సరిగా పట్టుకోమను' అంటూ దూషించాడు. లబుషేన్పై వార్న్ చేసిన వ్యాఖ్యలను సైమండ్స్ సమర్థిస్తూ ఒక బూతు పదాన్ని ఉపయోగించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను లెన్నీ పిలిఫ్స్ తన ట్విటర్లో షేర్ చేశాడు. వార్న్కు ఎవరైనా ఒక్కటే.. తనకు నచ్చకపోతే ప్రత్యర్థి ఆటగాళ్లను ఎంతలా ద్వేషిస్తాడో.. సహచర క్రికెటర్లను కూడా అదే తీరుతో చూస్తాడంటూ కామెంట్లు పెడుతున్నారు.(చదవండి: 'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది') Ahh Kayo, thank you for this pic.twitter.com/Jy6PfTpvYK — Lenny Phillips (@lenphil29) January 8, 2021 లెజెండరీ స్పిన్నర్గా పిలవబడే వార్న్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో చాలా ముందుంటాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో స్టీవ్ వా, పాంటింగ్ కెప్టెన్సీలో ప్రత్యర్థి ఆటగాళ్లపై బాహంటగానే స్లెడ్జింగ్కు దిగేవాడు. ప్రొఫెషనల్గా మాత్రమే గాక వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నోసార్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఈ మధ్యనే టీమిండియా, ఆసీస్ల మధ్య తొలి టెస్టు సమయంలో చతేశ్వర్ పుజారాను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పుజారా పేరు పలకడం తనకు ఇబ్బందిగా ఉంటుందని.. అందుకే అతన్ని స్టీవ్ అని పిలుస్తానని చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో షేన్ వార్న్ను నెటిజన్లు ఒక రేంజ్లో ఆడుకున్నారు. దీంతో షేన్ వార్న్ దెబ్బకు దిగివచ్చి తాను చేసిన పనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది.(చదవండి: రిషభ్ పంత్పై ట్రోలింగ్.. సైనీ తొలి వికెట్) -
'కోహ్లి రనౌట్.. మాకు పెద్ద అవమానం'
అడిలైడ్ : ఆసీస్తో జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రనౌట్ అవుతాడని ఎవరు ఊహించి ఉండరు. రహానేతో సమన్వయ లోపం వల్ల కోహ్లి రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. కోహ్లి లాంటి బిగ్ వికెట్తో ఆసీస్కు ఉపశమనం కలగగా.. అతని అవుట్ అభిమానులకు నిరాశ కలిగించింది. తాజాగా కోహ్లి రనౌట్పై ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందించాడు. కోహ్లి రనౌట్ కావడం నన్ను బాధించింది. అతను క్రీజులోకి వచ్చినప్పుడే పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా దూసుకెళ్తున్న కోహ్లి అనూహ్యంగా రనౌట్ కావడం బాధాకరం. ఇది మాలాంటి క్రికెట్ అభిమానులకు పెద్ద అవమానం' అని ట్వీట్ చేశాడు. (చదవండి : పృథ్వీ షా డకౌట్.. వైరలవుతున్న ట్వీట్స్) పుజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే నిలదొక్కుకోవడంతో వీరిద్దరి మధ్య 88 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది. అప్పటికే కోహ్లి 180 బంతుల్లో 74 పరుగులతో క్రీజులో పాతుకుపోయి సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. ఈ నేపథ్యంలో లయన్ బౌలింగ్లో రహానే ఫ్లిక్ చేయగా మిడాఫ్లో ఉన్న హాజల్వుడ్ బంతిని లయన్కు అందించగా అతను నేరుగా వికెట్లను గిరాటేశాడు. కాగా రహానే కాల్తో అప్పటికే సగం పిచ్ దాటేసిన కోహ్లి ఏం చేయలేక నిరాశగా వెనుదిరిగాడు. Nightmare scenario for India, pure joy for Australia! Virat Kohli is run out after a mix up with Ajinkya Rahane! @hcltech | #AUSvIND pic.twitter.com/YdQdMrMtPh — cricket.com.au (@cricketcomau) December 17, 2020 ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా మొదటి రోజు ఆట ముగిసేసరికి 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లి (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టార్క్ 2 వికెట్లు తీయగా... హాజల్వుడ్, కమిన్స్, లయన్లకు తలా ఒక వికెట్ దక్కింది. వృద్ధిమాన్ సాహా (9 బ్యాటింగ్), అశ్విన్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.(చదవండి : పుజారా గోడ.. ద్రవిడ్ కంటే బలమైనదట!) -
'క్రికెట్లో ఇలాంటి సూపర్స్టార్ చాలా అవసరం'
సిడ్నీ : టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఆసీస్తో జరిగే టెస్టు సిరీస్కు కూడా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. వాస్తవానికి ఆసీస్ టూర్కు సంబంధించి బీసీసీఐ ఎంపిక చేసిన టెస్టు జట్టులో హార్ధిక్కు చోటు లభించలేదు. దీంతో పాండ్యా స్వదేశానికి వెళ్లి కుటుంబంతో సరదాగా గడపనున్నాడు. ఇదే విషయమై వార్న్ ట్విటర్ వేదికగా స్పందించాడు. (చదవండి : నేను అసలు ఊహించలేదు: హార్దిక్) 'హార్దిక్ పాండ్యాను టెస్టు జట్టుకి కూడా ఎంపిక చేయల్సింది. అతను ఉన్న చోట మంచి ఎనర్జీతో పాటు మిగిలిన ఆటగాళ్లకు తన చేష్టలతో మంచి బూస్ట్ అందిస్తాడు. ఇలాంటి సూపర్ స్టార్.. పరిణితి గల ఆటగాడు క్రికెట్కు చాలా అవసరం. పరిమిత ఓవర్లలో నాణ్యమైన ఆల్రౌండర్గా పేరు తెచ్చకున్న పాండ్యా టీమిండియాకు బ్యాటింగ్లోనూ కీలకంగా మారుతున్నాడు. అందుకు ఆసీస్తో జరిగిన వన్డే, టీ20 సిరీస్లే నిదర్శనం. వన్డే సిరీస్లో మూడు మ్యాచ్లు కలిపి భారత్ తరపున టాప్ స్కోరర్గా నిలిచిన పాండ్యా టీ20 సిరీస్లోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఒకవేళ హార్దిక్ను టెస్టు సిరీస్కు ఎంపిక చేసి ఉంటే కచ్చితంగా తనదైన ముద్ర వేసేవాడు.'అని చెప్పుకొచ్చాడు. పాండ్యా విషయమై గత ఆదివారం టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా టెస్టు జట్టులో అతను ఉంటే ఆ మజా వేరుగా ఉండేదని తెలిపాడు. కాగా ఐపీఎల్ 13వ సీజన్ నుంచి మంచి ఫామ్ కనబరుస్తున్న పాండ్యా ఆసీస్ టూర్లోనూ అదే స్థాయి ప్రదర్శన నమోదు చేశాడు. వన్డే సిరీస్లో 210 పరుగులు.. టీ20 సిరీస్లో 78 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు. మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ఆతిథ్య జట్టుకు 2-1 తేడాతో కోల్పోగా.. టీ20 సిరీస్ను మాత్రం 2-1 తేడాతో గెలిచి లెక్క సరిచేసింది. ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి డే నైట్ టెస్టు మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి జరగనుంది. (చదవండి : బెన్ స్టోక్స్ ఇంట తీవ్ర విషాదం) -
క్రికెట్ ఆస్ట్రేలియాపై షేన్ వార్న్ అసంతృప్తి
సిడ్నీ : ఆసీస్ స్పిన్ దిగ్గజం.. మాజీ బౌలర్ షేన్ వార్న్ క్రికెట్ ఆస్ట్రేలియాపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాన్బెర్రా వేదికగా నేడు జరుగుతున్న మూడో వన్డేకు కమిన్స్ను పక్కనపెట్టడంపై తప్పుబట్టాడు. వాస్తవానికి ఐపీఎల్ 13 వ సీజన్ తర్వాత ఆసీస్ ఆటగాళ్లు నేరుగా టీమిండియాతో వన్డే సిరీస్ ఆడాల్సి వచ్చింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. దీంతో రానున్న టెస్టు సిరీస్ను దృష్టిలో పెట్టుకొని ఆసీస్ ప్రధాన బౌలర్గా ఉన్న కమిన్స్కు మూడో వన్డే నుంచి విశ్రాంతి కల్పించారు. సుదీర్ఘమైన ఐపీఎల్ ఆడడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. (చదవండి : 21 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు) అయితే షేన్ వార్న్ ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ కామెంట్స్ చేశాడు. 'పాట్ కమిన్స్కు విశ్రాంతినివ్వడంపై నేను నిరాశకు లోనయ్యా. ఐపీఎల్ ఆడినంత మాత్రానా ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తారా? ఇలా అయితే ఆటగాళ్లను ఐపీఎల్కు పంపించాల్సింది కాదు.. ఏ లీగ్ ఆడినా ఆటగాళ్లకు దేశం తరపున ఆడడమే మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. అలసిపోయారనే భావనతో కమిన్స్ లాంటి ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం సరికాదు. ఐపీఎల్ అనేది ఒక లీగ్.. ఏడాదికి ఇలాంటి లీగ్లు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఆడుతున్నది అంతర్జాతీయ వన్డే మ్యాచ్. మూడో వన్డేలో కమిన్స్ ఆడిస్తే బాగుండేది. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం నాకు నచ్చలేదు' అని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్ స్టార్ బౌలర్గా పేరు పొందిన కమిన్స్ ఐపీఎల్ 13వ సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. రూ.16 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న కోల్కతా నైట్రైడర్స్ యాజమాన్యానికి నిరాశనే మిగిల్చాడు. 14 మ్యాచ్లాడిన కమిన్స్ 7.86 ఎకానమి రేటుతో 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
శామ్యూల్స్కు మతి చెడింది : వార్న్
దుబాయ్ : ఆస్ట్రేలియా మాజీ బౌలర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వెస్టీండీస్ క్రికెటర్ మార్లన్ శామ్యూల్స్ పై ట్విటర్ వేదికగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. వార్న్ శామ్యూల్స్పై ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే... ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 13వ సీజన్లో ఆడడానికి ముందు రెండు వారాలు క్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. తన లైఫ్లో అత్యంత శత్రువుగా భావించే వ్యక్తితో కలిసి రెండు వారాలు క్వారంటైన్లో ఉండడలేని పరోక్షంగా శామ్యూల్స్ పేరును ప్రస్తావించాడు. దీనికి వార్నర్ స్పందిస్తూ 'నువ్వు చెప్పింది నిజం' అంటూ స్టోక్స్కు మద్దతు తెలిపాడు. అయితే శామ్యూల్స్ స్పందిస్తూ.. తన ఇన్స్టాగ్రామ్లో బెన్ స్టోక్స్, షేన్ వార్న్లనుద్దేశించి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక తనకు ఉన్నతమైన స్కిన్ టోన్ ఉందంటూ జాత్యహంకార వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతోపాటు స్టోక్స్ భార్యపై కూడా అసభ్యకరవ్యాఖ్యలు చేయడం సోషల్మీడియాలో వైరల్గా మారింది. (చదవండి : అతని ఆట నాకు ఆశ్చర్యం కలిగించింది) దీనిపై తాజాగా వార్న్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'నాతో పాటు స్టోక్స్పై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడే తిరిగి శామ్యూల్స్కు పంపించా. అతని వ్యాఖ్యలు సరైనవి కావు. ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడంతో పాటు కుటుంబసభ్యులను కూడా ఇందులోకి లాగడం బాధాకరమైన విషయం. శామ్యూల్స్కు మతి చెడింది.. ఇప్పుడు అతనికి సహాయం అవసరం... కానీ దురదృష్టం కొద్దీ అతనికి స్నేహితులు ఎవరు లేరు.. కనీసం తోటి క్రికెటర్లు కూడా అతనికి సాయంగా రారు.ఎందుకంటే అతనొక సాధారణ క్రికెటర్.. అందుకే ఎవరి వద్ద నుంచైనా వెంటనే సాయం కోరు 'అంటూ చురకలంటించాడు. కాగా స్టోక్స్ ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. షేన్ వార్న్ అదే జట్టుకు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. ఇంతకముందు కూడా స్టోక్స్, వార్న్లతో శామ్యూల్స్కు విభేదాలు ఉన్నాయి. అయితే తాజా గొడవ ఇప్పట్లో ముగిసేలా లేదు. దీనిపై శామ్యూల్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి. కాగా ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అంచనాలు అందుకోలేక చతికిలపడుతుంది. మొత్తం 12 మ్యాచ్ల్లో 5 విజయాలు, 7 ఓటములతో టేబుల్లో 7వ స్థానంలో ఉన్న రాజస్తాన్ ప్లేఆఫ్కు చేరడం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. -
‘అతనే మా ఆయుధం.. దడ పుట్టిస్తాడు: వార్న్
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు మెంటార్గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్.. ఆ జట్టుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. గతంలో తాను కెప్టెన్గా ఉండగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన తొలినాటి జ్ఞాపకాలతో పాటు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్తో షార్జాలోని అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు. ప్రత్యేకంగా 1998లో సచిన్ తుపాన్ ఇన్నింగ్స్ ఇప్పటికీ తనకు పీడకలగానే ఉంటుందన్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్కు మెంటార్గా వ్యవహరించడంతో గొప్ప అనుభూతిని తీసుకొచ్చిందన్నాడు. (చదవండి: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్) స్టాండ్స్లో కూర్చొని మ్యాచ్లను వీక్షించడంతో పాటు హెడ్ కోచ్ మెక్ డొనాల్డ్, కెప్టెన్ స్టీవ్ స్మిత్లతో మాట్లాడుతూ వారితో చర్చించడం గొప్పగా ఉందన్నాడు. తమ జట్టులో స్మిత్ కెప్టెన్సీ స్టైల్ను కొనియాడిన వార్న్.. జోఫ్రా ఆర్చర్ గురించి ప్రధానంగా ప్రస్తావించాడు. తమ జట్టుకు ప్రధాన బౌలింగ్ ఆయుధం జోఫ్రా ఆర్చర్ అని ప్రశంసించాడు. ప్రత్యర్థులకు దడపుట్టిస్తూ పైచేయి సాధించడంలో ఆర్చర్ది భిన్నమైన శైలి అని వార్న్ ప్రస్తావించాడు.ఇక సంజూ శాంసన్ కూడా మ్యాచ్ను శాసింగల సామర్థ్యం ఉన్న ఆటగాడని కొనియాడాడు. రెండు దశాబ్డాల క్రితం షార్జా ఎడారిలో సచిన్తో నాకు ఎదురైన అనుభవం ఇప్పటికీ పీడకలే. మమ్మల్ని చీల్చి చెండాడిన సచిన్ మాకు చేదు జ్క్షాపకాల్ని మిగిల్చాడు. ప్రత్యేకంగా నన్ను టార్గెట్ చేసి రెచ్చిపోయిన తీరు ఇప్పటికీ నాకు గుర్తు. ఆనాటి రెండు సచిన్ ఇన్నింగ్స్లు ఇప్పటికీ చిరస్మరణీయమే. నాకు ఇక్కడ ఎదురైన చేదు అనుభవాల్ని చెరిపేశాను. ఇక్కడ ప్రతీ జ్ఞాపకాన్ని మది నుంచి తీసేశాను. ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్ కోసం ఇక్కడికి రావడంతో వాటిని మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఈ సీజన్లో షార్జాలో ఆడే మ్యాచ్లను రాజస్తాన్ గెలుస్తుంది. మా ప్రధాన బౌలింగ్ ఆయుధం ఆర్చర్. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ కూడా మాకు బలం. శాంసన్ టాలెంటెడ్ క్రికెటర్. నేను స్టాండ్స్లో కూర్చొని మ్యాచ్లను వీక్షిస్తున్నాను. హెడ్ కోచ్, స్మిత్లతో వ్యూహాలని షేర్ చేసుకుంటున్నాను. ఇది గొప్పగా అనిపిస్తోంది’ అని వార్న్ పేర్కొన్నాడు. -
రాజస్తాన్ జట్టు మెంటార్గా వార్న్
దుబాయ్: ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఇప్పటికే ప్రచారకర్తగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం షేన్వార్న్ ఇప్పుడు మరో పాత్రలోకి ప్రవేశిస్తున్నాడు. జట్టులోని యువ ఆటగాళ్లను తీర్చి దిద్దేందుకు వార్న్ను టీమ్ మెంటార్గా ఎంపిక చేసినట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. టీమ్ కోచ్, తన విక్టోరియా జట్టు మాజీ సహచరుడు అయిన ఆండ్రూ మెక్డొనాల్డ్తో కలిసి వార్న్ పని చేస్తాడు. ‘నా కుటుంబంలాంటి జట్టు రాజస్తాన్తో రాయల్స్తో మళ్లీ జత కట్టడం సంతోషంగా ఉంది. ఈ జట్టు కోసం ఏ రూపంలో అయినా పని చేయడాన్ని నేను ప్రేమిస్తాను. అందుకే ఇకపై ద్విపాత్రాభినయానికి సిద్ధమయ్యాను’ అని వార్న్ వ్యాఖ్యానించాడు. జట్టు మెంటార్గా పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాన్ని ఈ మాజీ లెగ్స్పిన్నర్ తాజా సీజన్లో రాయల్స్ మంచి ప్రదర్శన ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ను షేన్ వార్న్ నాయకత్వంలోనే రాజస్తాన్ గెలుచుకుంది. అప్పటినుంచి ఏదో ఒక రూపంలో టీమ్తో అతను తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. శనివారమే అతను తన 51వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. -
‘టీ20ల్లో ఆ మార్పు చేసి చూడండి.. ’
సౌతాంప్టన్: ఇప్పటివరకూ టీ20 ఫార్మాట్లో బ్యాట్స్మన్దే ఆధిపత్యం అనేది ఒప్పుకోక తప్పదు. బ్యాటింగ్కు బౌలింగ్కు సమతూకం రావాలంటే ఒక్క మార్పు కచ్చితంగా చేయాలని అంటున్నాడు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్. టీ20 ఫార్మాట్లో ఒక బౌలర్ గరిష్టంగా నాలుగు ఓవర్లు వేసే నిబంధనను మార్చాలని అంటున్నాడు వార్న్. ఒక్కో బౌలర్ ఐదు ఓవర్లు వేస్తే బ్యాటింగ్, బౌలింగ్ల మధ్య పోరు సమానంగా ఉంటుందన్నాడు. ‘ బౌలర్లను కుదించండి. ఐదు బౌలర్లతో 20 ఓవర్ల కోటాను పూర్తి చేసే బదులు నలుగురు బౌలర్లతో ఐదేసి ఓవర్లు వేయించండి. ఈ మార్పు చేసి చూడండి.. పోరు మజాగా ఉంటుంది. ఒక బౌలర్ ఐదు ఓవర్లు వేయడాన్ని టీ20ల్లో చూడాలనుకుంటున్నా. మీ జట్టులో ఎనిమిది మంది బౌలింగ్ చేసే వారు ఉండవచ్చు.. కానీ బౌలర్ ఓవర్ల కోటాను పెంచడంతో బ్యాట్స్మెన్-బౌలర్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది. (చదవండి: విజిల్ పోడు.. నెట్,సెట్, గో!) మధ్య ఓవర్లలో ఆదిల్ రషీద్ వంటి స్పిన్నర్ ఐదు ఓవర్లు వేయగలడు. ఇలా ఒక స్పిన్నర్ ఐదు ఓవర్లు వేయడం వల్ల అది స్పిన్కు బ్యాట్స్మెన్కు మంచి పోరులా ఉంటుంది. అదే సమయంలో మీరు మ్యాచ్ ప్రారంభంతో పాటు చివరిలో మీ త్వరతగతిన బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది బిట్స్ అండ్ పీస్కు చెరమగీతం పాడినట్లు అవుతుంది. ఇక జట్టును ఎన్నుకునేటప్పుడు ఉత్తమ బ్యాట్స్మన్, ఉత్తమ బౌలర్లను ఎంచుకోవడానికి మార్గం మరింత సులభతరం అవుతుంది’ అని వార్న్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20కి కామెంటరీ చెప్పే క్రమంలో స్కై స్పోర్ట్స్ క్రికెట్తో మాట్లాడిన వార్న్ పేర్కొన్నాడు. ఆదివారం జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. తద్వారా సిరీస్ను ఇంకా మ్యాచ్ ఉండగానే ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఆపై లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి నెగ్గింది. (చదవండి: ఎంటర్టైన్మెంట్ ఫీవర్.. సక్సెస్ ఫియర్) -
‘4 వేల ఓవర్లు వేసిన నేనే బిత్తరపోయాను’
సౌతాంప్టన్: దాదాపు 19 ఏళ్ల నాటి ఈడెన్ గార్డెన్ టెస్టు మ్యాచ్ను ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ల ఊచకోతకు తాము ఎంతలా గురయ్యామో వివరించాడు. ఆ మ్యాచ్ తమ చేతుల్లో ఉందనే భావిస్తే, దాన్ని ద్రవిడ్, లక్ష్మణ్లు తమ బ్యాటింగ్తో వారి చేతుల్లోకి తీసుకుపోవడం ఇప్పటికీ ఒక కలగానే ఉందన్నాడు. వారిద్దరి దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్లో అప్పటికే నాలుగు వేల ఓవర్లు పూర్తి చేసిన తనకు మతిభ్రమించిందన్నాడు. సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-పాకిస్తాన్ల జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా వార్న్.. 2001 కోల్కతా టెస్టును నెమరువేసుకున్నాడు. (చదవండి: ఫ్రీబాల్కు పట్టుబడుతున్న అశ్విన్!) ‘నాకు బాగా గుర్తు. నేను స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్నా. ద్రవిడ్, లక్ష్మణ్ల దాటికి చేసేది లేక నా పక్కనే ఉన్న ఆడమ్ గిల్క్రిస్ట్తో మూవీస్ గురించి చర్చించడం మొదలుపెట్టా. మేము క్యాప్లు కూడా మార్చుకున్నాం. ఏమి చేయాలో తెలియక ప్రతీది యత్నించాం. వారి గురించి ఆలోచన పక్కకు పెట్టడానికి నా ఫేవరెట్ సాంగ్లు కూడా పాడా. మొత్తంగా మాకు ఒక మతిభ్రమించినట్లు చేశారు ద్రవిడ్, లక్ష్మణ్లు. వారు చాలా అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారు. నేను ఆడుతున్న సమయంలో వారిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే. ఇక్కడ లక్ష్మణ్ ఇన్నింగ్స్ చాలా స్పెషల్. ద్రవిడ్ కూడా అసాధారణ ఆటను కనబరిచాడు. కొన్నిసార్లు మీరు దేవుడనే చెప్పాలి’ అని వార్న్ తెలిపాడు. ఆసీస్తో జరిగిన ఆ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో లక్ష్మణ్ 281 పరుగుల సాధిస్తే, ద్రవిడ్ 180 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్సి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ఫాలో ఆన్ ఆడింది. భారత్ ఫాలో ఆన్ ఆడుతూనే ద్రవిడ్-లక్ష్మణ్ల అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆసీస్కు సవాల్ విసిరింది. భారత్ నిర్దేశించిన 384 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 212 పరుగులకే ఆలౌటైంది. దాంతో భారత్ 171 పరుగుల తేడాతో విజయం చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్లో ఆసీస్ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుందనుకుంటే లక్ష్మణ్-ద్రవిడ్ల దెబ్బకు ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. (చదవండి: ‘తప్పు చేశాం.. వరల్డ్కప్ చేజార్చుకున్నాం’) -
‘అతనేమీ వార్న్ కాదు.. కుంబ్లే అనుకోండి’
సౌతాంప్టన్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా రాణించాలంటే ప్రస్తుతం పాకిస్తాన్తో జరుగుతున్న సిరీస్లో స్పిన్నర్ యాసిర్ షాను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని నేర్చుకోవాలని ఇంగ్లిష్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సూచించాడు. పాక్తో స్వదేశంలో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఆఖరి టెస్టులో యాసిర్ షా బౌలింగ్ ఆడటానికి భయపడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లను ఉద్దేశించి హుస్సేన్ మాట్లాడాడు. అసలు యాసిర్ షా బౌలింగ్ను ఎదుర్కోవడానికి ఎటువంటి భయాందోళనలు వద్దని, మానసికంగా దృఢంగా ఉంటే అతని బౌలింగ్ను ఆడటం కష్టం కాదన్నాడు. అదే సమయంలో లెగ్ బ్రేక్ బౌలర్ యాసిర్ షాను ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్లా ట్రీట్ చేయవద్దని చురకలంటించాడు. (చదవండి: ఇంగ్లండ్తో సిరీస్పై క్లారిటీ ఇచ్చిన దాదా) యాసిర్ షా ఒక సాధారణ స్పిన్నర్ మాత్రమేనని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే తరహా బౌలర్గా యాసిర్ షాను భావించాలన్నాడు. ఇక్కడ తానేమీ కుంబ్లేను తక్కువ చేయడం లేదన్నాడు. మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో సిబ్లే, ఓలీ పోప్లు యాసిర్ షాకు ఔట్ కావడంపై నాసిర్ హుస్సేన్ స్పందించాడు. సిబ్లే ఎల్బీగా పెవిలియన్ చేరగా, ఓలీ పోప్లు బౌల్డ్ అయ్యాడు. ఈ ఇద్దరూ బ్యాక్ఫుట్ ఆడుతూ వికెట్లు సమర్పించుకోవడంతో హుస్సేన్ కాస్త సెటైరిక్గా మాట్లాడాడు. దానిలో భాగంగానే వార్న్, కుంబ్లే ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘ యాసిర్ షాను మరో వార్న్ అనుకోకండి. అతనొక సాధారణ లెగ్ స్పిన్నర్. కుంబ్లే తరహా బౌలర్ అనుకోండి. నేను ఇక్కడ కుంబ్లేను కించపరచడం లేదు. కేవలం విషయం చెబుతున్నా. వార్న్ ఏ వికెట్పైనైనా తొలి రోజు నుంచే టెస్టుల్లో ఆధిపత్యం చెలాయిస్తాడు. కుంబ్లే అలా కాదు. క్రమంగా వికెట్పై పట్టు సాధిస్తాడు. దాంతోనే వార్న్-కుంబ్లేల పోలిక తెచ్చా’ అని హుస్సేన్ పేర్కొన్నాడు. ఈ మూడు టెస్టుల సిరీస్లో ఇప్పటివరకూ యాసిర్ షా 11 వికెట్లు సాధించాడు. ఈ సిరీస్లో తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు శనివారం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జాక్ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీ... జోస్ బట్లర్ (152; 13 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ సాధించారు. ఆపై బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 93 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్కు 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాక్ కెప్టెన్ అజహర్ అలీ (141 నాటౌట్) సెంచరీ సాధించాడు. అలాగే టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయిని దాటి అరుదైన జాబితాలో చేరిపోయాడు.(చదవండి: ‘ఇదేనా ధోనికిచ్చే గౌరవం’) -
10 నిమిషాలు మైండ్ బ్లాక్: కుల్దీప్
న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మార్కు స్పిన్తో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాడు. 2014లో యూఏఈలో జరిగిన అండర్-19 వరల్డ్కప్లో రాణించడంతో కుల్దీప్ యాదవ్ ఒక్కసారిగా జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కానీ 2017లో అతని అరంగేట్రం షురూ అయ్యింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా కుల్దీప్ టెస్టు అరంగేట్రం జరిగింది. అయితే ఆ సమయంలోనే దిగ్గజ స్పిన్నర్ షేన్వార్న్ను కలిసే కుల్దీప్కు లభించింది. అప్పుడు టీమిండియా కోచ్గా ఉన్న అనిల్ కుంబ్లే.. కుల్దీప్ను వార్న్కు పరిచయం చేశాడంట. తాను వార్న్ను కలుస్తానంటూ అనిల్ భాయ్ను కోరి మరీ కలిశానంటూ కుల్దీప్ తెలిపాడు. టీవీ ప్రెజెంటర్ మడోనా టిక్సియారా ఇన్స్టాగ్రామ్ లైవ్చాట్లో పాల్గొన్న కుల్దీప్.. ఈ విషయాన్ని వెల్లడించాడు. అదొక మధుర జ్ఞాపకంగా పేర్కొన్న కుల్దీప్.. వార్న్తో తన బౌలింగ్ గురించి చాలా విషయాలను చెప్పినట్లు తెలిపాడు. (మరో రెండేళ్లు ‘కింగ్స్’లో ధోని) ‘నేను పుణెలో జరిగిన టెస్టు మ్యాచ్లో వార్న్ను కలిశా. వార్న్ను కలవడం అదే తొలిసారి. ఆసమయంలో మాకు ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే భాయ్ ఉన్నారు. షేన్ వార్న్ను కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు కుంబ్లేకు చెప్పా. చివరికు కుంబ్లే సాయంతో వార్న్ను కలిశా. కానీ పది నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోయా. వార్న్ కలిశాక మైండ్ బ్లాక్ అయ్యింది. కుంబ్లే-వార్న్లు మాట్లాడుకుంటూ ఉంటే చాలాసేపు అలా వింటూనే ఉన్నా. చివరగా మాట్లాడం ఆరంభించా. చాలా విషయాలను వార్న్తో పంచుకున్నా. నా భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనేది వార్న్కు చెప్పుకొచ్చా. వికెట్కు రెండు వైపులా బంతిని ఎలా సంధిస్తాను అనే విషయాన్ని వార్న్కు వివరించా. అయితే అంతా విన్న వార్న్.. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావ్ అని అన్నాడు. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ వార్న్ తెలిపాడు. బ్యాట్స్మన్ మదిలో ఏమి ఆలోచిస్తూ ఉండవచ్చు అనే దానిని ఊహిస్తూ బౌలింగ్ చేయమని వార్న్ సలహా ఇచ్చాడు’ అని కుల్దీప్ తెలిపాడు. కాగా, ఆ తర్వాత వార్న్ను చాలాసార్లు కలిసే అవకాశం దక్కిందన్నాడు. ఐపీఎల్లో కేకేఆర్కు ఆడుతుండగా వార్న్ కామెంటేటర్గా ఉండగా కలిసే అవకాశం దొరికిందన్నాడు. ఒక కోచ్ ఎలా అయితే చెబుతాడో అలానే పలు విషయాల్ని వార్న్ తనకు చెప్పాడన్నాడు. అవి తన కెరీర్కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కుల్దీప్ పేర్కొన్నాడు.(మరో ‘హోరాహోరీ’కి రంగం సిద్ధం) -
‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ని మళ్లీ చూద్దామా!
న్యూఢిల్లీ: షేన్ వార్న్.. ఆస్ట్రేలియా క్రికెట్ స్పిన్కు వన్నె తెచ్చిన దిగ్గజం. స్పిన్ మాంత్రికుడు అనే పేరుకు సరిగ్గా సరిపోతాడు వార్న్. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్(708 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడంటే అతని ప్రతిభ ఏపాటిదో మనకు అర్థమైపోతుంది. మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో బ్యాట్స్మెన్లను హడలెత్తించడమే కాకుండా ప్రత్యర్థి జట్లకు సవాల్గా నిలిచేవాడు. కాగా, సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్లో భాగంగా వార్న్ వేసిన ఒక బంతి ఇప్పటికీ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గానే పిలవబడుతోంది.1993లో ఇంగ్లండ్తో వారి దేశంలో జరిగిన యాషెస్ సిరీస్లో భాగంగా తొలి టెస్టులో వార్న్ ఒక అద్భుతమైన బంతిని సంధించాడు. (షోయబ్ అక్తర్కు సమన్లు) ఆ టెస్టు మ్యాచ్ జూన్ 3వ తేదీన ఆరంభం కాగా, రెండో రోజు ఆట(జూన్ 4వ తేదీన)లో ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు మైక్ గాటింగ్ను బోల్తా కొట్టించిన తీరు వార్న్ కెరీర్ను మలుపు తిప్పింది. లెగ్ స్పిన్లో ఒక విలక్షమైన బౌలర్గా పేరు తెచ్చుకున్న వార్న్.. బంతిని నేరుగా గాటింగ్ కాళ్లకు ముందు అవుట్సైడ్ లెగ్స్టంప్పై వేసి ఆఫ్ వికెట్ను ఎగరుగొట్టిన తీరు ఇప్పటికీ చిరస్మరణీయమే. అసలు బంతి ఎక్కడ పడుతుందా అని గాటింగ్ అంచనా వేసే లోపే ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. ఆ బంతికి గాటింగ్ షాక్ కాగా, ఫీల్డ్లో ఉన్న అంపైర్కు కూడా కాసేపు ఏమీ అర్థం కాలేదంటే అది ఎంతలా స్పిన్ అయ్యి ఉంటుందో( ఎంతలా స్పిన్ చేశాడో) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో వార్న్దే కీలక పాత్ర. ప్రతీ ఇన్నింగ్స్లోనూ నాలుగేసి వికెట్లు సాధించి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు. వార్న్ కెరీర్కు పునాది పడిన సందర్భం కచ్చితంగా అదే టెస్టు మ్యాచ్. 1992లో భారత్తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన వార్న్.. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ దిగ్గజాల సరసన నిలిచిపోయాడు. బోర్డర్ నమ్మకాన్ని నిలబెట్టిన వేళ.. ఆ టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా 68 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఆసీస్ ఆరంభం బాగానే ఉన్నా ఆపై వరుస వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటలో మార్క్ టేలర్ సెంచరీ, స్లేటర్ హాఫ్ సెంచరీ మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ను 289 పరుగుల వద్ద ముగించింది. దాంతో రెండో రోజు ఆటను ఇంగ్లండ్ ఆరంభించింది. ఆ సమయంలో యువ సంచలనంగా పేరు తెచ్చుకున్న మైక్ అథర్టన్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ఆరంభించగా, అతనికి జతగా ఇంగ్లండ్ కెప్టెన్ గ్రాహం గూచ్ ఫీల్డ్లోకి వచ్చాడు. అయితే అథర్టన్ను తొలి వికెట్గా హ్యూజ్ ఔట్ చేసిన తర్వాత ఇంగ్లండ్ పతనం ఆరంభమైంది.(బాల్కనీ నుంచి దూకేద్దామనుకున్నా: ఊతప్ప) తొలి వికెట్ పడ్డ తర్వాత గ్రాహం గూచ్కు మైక్ గాటింగ్ జత కలిశాడు. అప్పటికే గాటింగ్ దిగ్గజ క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో ఆసీస్ కెప్టెన్ అలెన్ బోర్డర్.. లెగ్ స్పిన్ ప్రయోగాన్ని ఇంగ్లండ్పై ప్రయోగించాడు. ఆ క్రమంలోనే వార్న్ చేతికి బంతి ఇవ్వాలని నిశ్చయించాడు. ఆ నమ్మకాన్ని వార్న్ వమ్ము చేయలేదు. గాటింగ్ను ఒక వైవిధ్యమైన బంతికి ఔట్ చేయడమే కాకుండా ఆ ఇన్నింగ్స్లో మరో మూడు వికెట్లు సాధించి ఆసీస్ పైచేయి సాధించేలా చేశాడు. షేన్ వార్న్ తన కెరీర్లో ఎన్ని అద్భుతమైన బంతులు వేసినా ఇప్పటికీ గాటింగ్కు వేసిన బంతే బాల్ ఆఫ్ ది సెంచరీగా ఉంది. వార్న్ కెరీర్కు పునాది పడిన ఆనాటి మ్యాచ్లోని గాటింగ్ ఔట్ను మరొకసారి చూద్దాం. -
‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ని మళ్లీ చూద్దామా!
-
ఆ బౌలర్ నన్నొక మూర్ఖుడిలా చూశాడు: కోహ్లి
హైదరాబాద్ : టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి ఎంతో మంది ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో అరవీరభయంకర బౌలర్లుగా పేరుగాంచిన వారి బౌలింగ్ను చీల్చిచెండాడి పరుగుల వరద పారించాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులు, ఘనతలు అందుకొని ప్రపంచంమొత్తం ప్రశంసించే స్థాయికి కోహ్లి ఎదిగాడు. అయితే తన కెరీర్ ఆరంభంలో కొన్ని అవమానాలను ఎదుర్కొన్నానని తాజాగా ఓ కార్యక్రమంలో కోహ్లి పేర్కొన్నాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ బౌలింగ్ను నేను ఎదుర్కొలేదు. కానీ ఐపీఎల్లో అతడి బౌలింగ్లో ఆడే అవకాశం దక్కింది. అయితే ఐపీఎల్ 2009లో నన్నొక మూర్ఖుడిలా వార్న్ చూసినా అంతగా పట్టించుకోలేదు. ఇక 2011లో మరోసారి వార్న్ను ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే అప్పుడు ఎలాంటి అనూహ్య సంఘటనలేమీ జరగలేదు. ఎందుకటే అతడు (వార్న్) నన్ను ఔట్ చేయలేదు. నేను అతడి బౌలింగ్ను చితక్కొట్టలేదు. ఇక ఓ మ్యాచ్ సందర్భంగా వార్న్ నా దగ్గరకు వచ్చి మాటలతో జవాబు ఇవ్వకు అని చెప్పాడు. కానీ నేనేమీ ఆ సూచనను పట్టించుకోలేదు’ అంటూ కోహ్లి సరదాగా పేర్కొన్నాడు. ఇక గతంలో షేన్ వార్న్ సైతం కోహ్లిని ఎలా ఔట్ చేయాలో, ఇబ్బందులకు గురిచేయొచ్చో యువ బౌలర్లకు సూచించిన విషయం తెలిసిందే. చదవండి: పాంటింగే అత్యుత్తమ కోచ్: భారత బౌలర్ ‘కశ్మీర్ గురించి పట్టించుకోవడం మానేయ్’ -
స్టీవ్ వా మోస్ట్ సెల్ఫిష్: వార్న్
మెల్బోర్న్: ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్పై సుతి మెత్తని విమర్శలు చేసిన షేన్ వార్న్.. తాజాగా మరో మాజీ కెప్టెన్ స్టీవ్పై కూడా కామెంట్స్ చేశాడు. లాక్డౌన్ కారణంగా క్రికెటర్లంతో ఇళ్లకే పరిమితమై సోషల్ మీడియాలో ముచ్చటించే క్రమంలో గతాన్ని తవ్వి మరీ వెలిక్కి తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వార్న్ బదులిచ్చాడు. అది స్టీవ్ వా గురించి అడగ్గా అతనొక స్వార్థ క్రికెటర్ అంటూ సంచలన వ్యాక్యలు చేశాడు. ఇక్కడ తానేమీ స్టీవ్ వా అంటే ద్వేషం లేదని, కేవలం అతను మోస్ట్ సెల్ఫిష్ క్రికెటర్ అనే విషయాన్ని మాత్రమే చెబుతున్నానన్నాడు. (ఆ బ్యాట్ను అఫ్రిది సొంతం చేసుకున్నాడు..) అతను అత్యధిక రనౌట్లలో భాగమైన గణాంకాలు ఒక ఉదాహరణ అని పేర్కొన్నాడు. స్టీవ్ వా తన బ్యాటింగ్తో ఆసీస్కు ఎన్నో విజయాలను అందించాడు. ఆసీస్కు ఒక వరల్డ్కప్ను కూడా సాధించి పెట్టిన ఘనత కూడా స్టీవ్ వాది. కానీ, ఒక్క చెత్త రికార్డు కూడా స్టీవా పేరిట ఉంది. అది రనౌట్లలో భాగమైన రికార్డు. స్టీవ్ వా ఓవరాల్గా 104 సార్లు రనౌట్లలో భాగమైతే, అందులో 73 సార్లు తన సహచర బ్యాటింగ్ పార్టనర్లనే ఔట్ అయ్యారు. దీన్ని ఉద్దేశిస్తూనే ఒక ప్రశ్నను వార్న్ను అడగ్గా అందుకు సమాధానంగా స్టీవ్ వా కచ్చితంగా స్వార్థ క్రికెటరే అని పేర్కొన్నాడు. తాను ఆడిన క్రికెటర్లలో స్టీవ్ వానే మోస్ట్ సెల్ఫిష్ అని అన్నాడు. కొన్ని రోజుల క్రితం 2005 యాషెస్ సిరీస్ ఎడ్జ్బాస్టన్ టెస్టు గురించి మాట్లాడుతూ ఆనాటి మ్యాచ్లో తమ ఓటమికి రికీ పాంటింగ్ తీసుకున్న నిర్ణయమే కారణమన్నాడు. బ్యాటింగ్ అనుకూలించే వికెట్పై టాస్ గెలిచిన పాంటింగ్ బౌలింగ్ ఎంచుకోవడం అతి పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. ఆ నిర్ణయం ఇంగ్లండ్కు మేలు చేయడంతోనే తాము రెండు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యామన్నాడు. ('సందేహం లేదు.. జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్') -
'పాంటింగ్ నిర్ణయం మా కొంప ముంచింది'
సిడ్నీ : క్రికెట్లో దాయాదుల పోరు అంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఉదాహరణకు భారత్- పాకిస్తాన్ తలపడ్డాయంటే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. సరిగ్గా అలాంటి ఘటనలే యాషెస్ సిరీస్లోనూ చోటుచేసుకుంటుంది. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ను ఇరు దేశాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. టెస్ట్ మ్యాచ్లు అంటేనే బోర్గా ఫీలయ్యే ఈ రోజుల్లో కూడా యాషెస్ సిరీస్కు భారీ సంఖ్యలో ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఎందుకంటే యాషెస్ అనగానే ఇరు జట్లు కొదమ సింహాల్లా తలపడడంతో సిరీస్ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. దీనికి తోడు ఆటగాళ్ల స్లెడ్జింగ్ అభిమానులకు కావాల్సిన మజానిస్తుంది. అందులో 2005 ఎడ్జ్బాస్టన్ టెస్ట్ ఒకటి. ఈ మ్యాచ్లో ఆఖరి వరకు ఊరించిన విజయం ఇంగ్లండ్ను వరించింది. ఆ జట్టు అనూహ్యంగా 2 పరుగులతో విజయాన్నందుకుంది. ('ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లి ముందుంటాడు') అయితే ఈ మ్యాచ్లో నాటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తీసుకున్న చెత్త నిర్ణయమే తమ కొంప ముంచిందని ఆ జట్టు మాజీ ప్లేయర్ షేన్ వార్న్ తెలిపాడు. పాంటింగ్ కెప్టెన్సీలోనే ఇది అత్యంత చెత్త నిర్ణయమని విమర్శించాడు. బ్యాటింగ్కు అనుకూలించే ఆ వికెట్పై టాస్ గెలిచిన పాంటింగ్ బౌలింగ్.. ఎంచుకోవడమే అతను చేసిన పెద్దతప్పుగా చెప్పుకొచ్చాడు. ‘ఓ కెప్టెన్గా పంటర్ తీసుకున్న ఆ నిర్ణయం అత్యంత చెత్తది. అతని నిర్ణయం ఇంగ్లండ్కు మేలు చేసింది. ఆ సిరీస్లో ఇంగ్లండ్ పోరాడిన తీరు అద్భుతం. బ్రెట్లీ, మైకెల్ కస్ప్రోవిక్స్ దాదాపు తమ విజయాన్ని ఖాయం చేసినా ఇంగ్లండ్ పట్టువదల్లేదు. ఆ మ్యాచ్లో నేను హిట్ వికెట్ అయిన తీరు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఆ రాత్రి ముందు చివరి ఓవర్లో స్టీవ్ హర్మిసన్ స్లోయర్ బంతితో మైకెల్ క్లార్క్ను బౌల్ట్ చేశాడు. అప్పటికి మా విజయానికి 107 పరుగులు కావాలి. బ్రెట్ లీ, మైకెల్ కస్ప్రోవిక్స్ ఉండటంతో మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకున్నా. కానీ ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. బంతి రివర్స్ స్వింగ్ అవుతుండటంతో 90 మైళ్ల వేగంతో బంతులు విసిరి ఫలితాన్ని రాబట్టారు. హార్మీసన్, ఫ్లింటాఫ్ సూపర్బ్గా బౌలింగ్ చేశారు. నా బ్యాటింగ్ సమయంలో ముందుకొచ్చి ఆడాలని నిర్ణయించుకున్నా. కానీ నా కాలు స్టంప్స్ తాకడంతో హిట్ వికెట్గా వెనుదిరిగా. దీంతో నేను హిట్ వికెట్ అవ్వడం ఇప్పటికీ మరిచిపోలేదంటూ' షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు. ('జాగ్రత్త.. నేను బరిలోకి దిగుతున్నా') కాగా మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 407 రన్స్ చేసింది. అనంతరం ఆసీస్ 308 పరుగులు చేసి 99 రన్స్ వెనుకబడింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 182 పరుగులకే కుప్పకూలడంతో ఆసీస్ ముందు 282 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ టార్గెట్ చేజింగ్లో తడబడిన ఆసీస్.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పుతూ లక్ష్యం వైపు దూసుకెళ్లింది. బ్రెట్లీ(43 నాటౌట్)తో కలిసి షేన్ వార్న్(42) విజయం దిశగా నడిపించారు. కానీ వార్నర్ హిట్ వికెట్ అవ్వగా.. చివరి బ్యాట్స్మన్ను హర్మిసన్ ఔట్ చేశాడు. దీంతో రెండు పరుగుల దూరంలో ఆసీస్ ఓటమికి తలవంచింది. -
అది షేన్ వార్న్కే సాధ్యం: యూసఫ్
న్యూఢిల్లీ: ఆసీస్ దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్పై టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. అతని సారథ్యంలో రాజస్తాన్ రాయల్స్ తరఫున మూడేళ్ల పాటు ఆడిన యూసఫ్ అదొక గొప్ప అవకాశమన్నాడు. కానీ వార్న్ కెప్టెన్సీలో మూడు సీజన్ల కంటే ఎక్కువ ఆడకపోవడం తన దురదృష్టమన్నాడు. ఈ సందర్భంగా వార్న్ నాయకత్వంలో మూడేళ్లు ఆడిన విషయాన్ని యూసఫ్ గుర్తు చేసుకున్నాడు. అతి తక్కువ వనరులతో ఆరంభ టైటిల్ను గెలుచుకోవడం వార్న్ నాయకత్వానికి అద్దం పడుతుందన్నాడు. ఏదో కొద్దిపాటి వనరులతో జట్టును ఫైనల్కు చేర్చడమే కాకుండా విజేతగా నిలపడం అది వార్న్కే దక్కుతుందన్నాడు. 2008 ఐపీఎల్ ఆరంభమైన ఏడాది రాజస్తాన్ రాయల్స్ టైటిల్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. (అక్తర్పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) తాజాగా క్రికెట్ ట్రాకర్ లైవ్ సెషన్లో మాట్లాడిన యూసఫ్.. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఐపీఎల్లో వార్న్ నాయకత్వంలో మూడేళ్లు ఆడా. వార్న్తో చాలా మధుర స్మృతులు ఉన్నాయి. మమ్మల్ని వార్న్ మార్గ నిర్దేశం చేసిన తీరు అమోఘం, బ్యాట్స్మన్ను ఎలా పెవిలియన్కు పంపాలనే విషయంలో వార్న్ ఎన్నో టెక్నిక్స్ నేర్పాడు. అతనితో సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడకపోవడం నిజంగా నా బ్యాడ్ లక్. ఐపీఎల్ ఆరంభమైన ఏడాదే టైటిల్ను సాధించడంలో వార్న్ పాత్ర చాలా ఉంది. ఎక్కువ మంది దేశవాళీ ఆటగాళ్లతో ఉన్న జట్టును విజేతగా నిలిపాడు. అలా టైటిల్ గెలవడం మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు’ అని యూసఫ్ పేర్కొన్నాడు. ఇక భారత క్రికెటర్లు ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్లను యూసఫ్ కొనియాడాడు. ధోని ఒక తెలివైన క్రికెటర్ అని పేర్కొన్న యూసఫ్.. యువరాజ్ను ఒక రాక్స్టార్గా అభివర్ణించాడు. (ఖవాజా, షాన్ మార్ష్లను తప్పించారు..!) -
‘తుఫాన్ ఇన్నింగ్స్’ చూపించాడు
-
‘తుఫాన్ ఇన్నింగ్స్’ చూపించాడు
ముంబై : క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్లు అభిమానులకు గుర్తుండిపోతాయనడంలో సందేహం అవసరం లేదు. మరీ అలాంటి మ్యాచ్లో తమ ఆరాధ్య క్రికెటర్ చెలరేగి ఆడాడంటే ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయని చెప్పొచ్చు. అలాంటి ఇన్నింగ్స్నే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరిగ్గా 22ఏళ్ల క్రితం(ఏప్రిల్ 22, 1998లో) షార్జా కప్లో భాగంగా ఆసీస్తో జరిగిన మ్యాచ్లో చూపించాడు. ఇప్పటివరకు సచిన్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడినా దేనికదే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ మ్యాచ్లో సచిన్ 131 బంతుల్లో 143 పరగులు చేశాడు. ఇన్నింగ్స్లో మొత్తం 9ఫోర్లు ,4 సిక్సర్లు ఉన్నాయి. ('బ్రెట్ లీ బ్యాటింగ్ అంటే భయపడేవాడు') సాధారణంగా చూస్తే ఇది మాములుగానే కనిపిస్తుంది కానీ.. జట్టును ఫైనల్ చేర్చాలన్న తపన సచిన్ ఇన్నింగ్స్లో స్ఫష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినా ఫైనల్కు చేరుకుంది. అదెలాగో తెలుసుకోవాలంటే మళ్లీ ఒకసారి ఆ మ్యాచ్ను గుర్తు చేసుకోవాల్సిందే. 1998 ఏప్రిల్ నెలలో కోకకోలా కప్ను దుబాయ్ వేదికగా షార్జాలో నిర్వహించారు. ఈ సిరీస్లో భారత్తో పాటు న్యూజిలాండ్తో ఆస్ట్రేలియా పాల్గొనగా, మ్యాచ్లన్నీ డే అండ్ నైట్ పద్దతిలోనే జరిగాయి. ఫైనల్కు ముందు ఆస్ట్రేలియా, భారత్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఏంచుకొంది. ఆసీస్ ఆటగాడు మైఖేల్ బెవాన్ సెంచరీతో రాణించడంతో ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ కాకుండా ఇండియా ఫైనల్కు చేరుకోవాలంటే 46ఓవర్లలో 254 పరుగులు చేయాలి.. అయితే ఇసుకతుఫానుతో మ్యాచ్కు 25 నిమిషాల పాటు అంతరాయం కలగడంతో లక్ష్యాన్ని 46 ఓవర్లలో 276కు కుదించారు.ఆటకు అంతరాయం కలగడంతో 46 ఓవర్లలో 237 పరుగులు చేస్తే టీమిండియా ఫైనల్కు చేరుకుంటుంది. ఇక్కడే సచిన్ టెండూల్కర్ తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఆసీస్ బౌలర్లు షేన్ వార్న్, డామియన్ ప్లెమింగ్, మైఖెల్ కాస్ప్రోవిచ్ బౌలింగ్ను చీల్చి చెండాడుతూ అరవీర భయంకరంగా బ్యాటింగ్ చేశాడు. ఇన్నింగ్స్ మొత్తంలో 131 బంతులెదుర్కొన్న సచిన్ 9 ఫోర్లు , 4 సిక్స్ల సాయంతో 143 పరుగులు చేసి జట్టు స్కోరు 242 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఒకదశలో సచిన్ బ్యాటింగ్ ముందు లక్ష్యం చాలా చిన్నదిగా అనిపించింది. అయితే సచిన్ ఓటయ్యాక ఒత్తిడికి తలొగ్గిన భారత్ 46 ఓవర్లలో 250 పరుగులు చేసింది.(' స్వీట్హార్ట్.. డిన్నర్ ఎక్కడ చేద్దాం') అయితే ఫైనల్కు చేరుకోవాలంటే చేయాల్సిన పరుగులు అప్పటికే పూర్తి చేయడంతో టీమిండియా ఫైనల్కు చేరుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో సచిన్ మరోసారి సెంచరీతో మెరవడంతో భారత జట్టు కోకకోలా కప్ను ఎగరేసుకపోయింది. ప్లేయర్ ఆఫ్ ది సరీస్గా సచిన్ నిలవడం విశేషం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. సచిన్ వల్ల తనకు నిద్రలేని రాత్రులు గడిచాయని ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ ఈ సిరీస్ తర్వాత పేర్కొన్నాడు. -
ఇప్పుడు చెప్పండి అది ఎలా నాటౌట్?
మెల్బోర్న్: ప్రస్తుతం భారత క్రికెట్లో విరాట్ కోహ్లి శకం నడుస్తోంది. అంతకుముందు దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ శకం నడించిదనేది మనకు తెలిసిన విషయమే. ఆ సమయంలో భారత్తో ఏ జట్టైనా పోరుకు సిద్ధమయ్యిందంటే తొలుత సచిన్నే టార్గెట్ చేసేది. సచిన్ ఔట్ చేస్తే సగం పని అయిపోయినట్లేనని ప్రత్యర్థి జట్లు భావించేవి. ఈ క్రమంలోనే సచిన్-మెక్గ్రాత్ల పోరు, సచిన్-అక్తర్ల పోరు, సచిన్- షేన్ వార్న్ల పోరు ఎక్కువగా కనువిందు చేసేది. వీరిలో మెక్గ్రాత్, అక్తర్లు పేస్ బౌలర్లైతే, వార్న్ లెగ్ స్పిన్నర్. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్గా ఉన్న వార్న్పై సచిన్ పైచేయి సాధించిన సందర్బాలు ఎన్నో. అదే సమయంలో సచిన్పై వార్న్ కూడా ఆధిక్యం చెలాయించిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. కాగా, 1998లో చెన్నైలో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా, రెండో ఇన్నింగ్స్లో వీరవిహారం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో వార్న్ బౌలింగ్ సచిన్ నాలుగు పరుగుల వద్ద ఉండగా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో సచిన్ వీరవిహారం చేశాడు. 155 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆనాడు అంపైర్ తప్పిదంతో సచిన్ ఆదిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడనే తలంపుతో ఉన్న వార్న్ దానికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశాడు. అప్పుడు వార్న్ అప్పీల్ చేసినా దాన్ని ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. ఇప్పుడు చెప్పండి.. అది ఔటా.. నాటౌటా? అంటూ ఒక వీడియో క్లిప్ను అభిమానుల ముందుంచాడు. ఇది ఎలా నాటౌట్ అనే విషయాన్ని చెప్పాలంటూ సవాల్ విసిరాడు. ‘ ఇది నిజంగా చాలా సీరియస్. కమాన్ చెప్పండి.. అది ఎలా నాటౌట్’ అని ప్రశ్నించాడు. Seriously ? Come on @robelinda2 !!!!!! How’s that not out 😩😂😩😂😩😂😩 https://t.co/Dbhq9GfvLn— Shane Warne (@ShaneWarne) April 6, 2020 -
‘గంగూలీ కోసం లక్ష్మణ్ను తప్పించాను’
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చను తెరదీశాడు. తను క్రికెట్ ఆడిన కాలంలోని 11 మంది ఆటగాళ్లతో కూడిన అత్యుత్తమ భారత జట్టును షేన్ వార్న్ ప్రకటించాడు. ఈ జట్టుకు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సారథిగా వ్యవహరిస్తాడని తెలిపాడు. అయితే ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు కలిగిన సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్కు వార్న్ తన జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దీనిపై వివరణ ఇచ్చిన వార్న్ జట్టు కూర్పులో భాగంగానే లక్ష్మణ్కు చోటు ఇవ్వలేదని తెలిపాడు. అంతేకాకుండా సారథి గంగూలీ కోసమే లక్ష్మణ్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని సరదాగా పేర్కొన్నాడు. తను ఎంపిక చేసిన 11 మందిలో సారథిగా ఎవరిని ఎంపిక చేయాలో తెలియక లక్ష్మణ్ను తప్పించి గంగూలీని జట్టులోకి తీసుకొని సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపాడు. అయితే కపిల్ దేవ్, అజహరుద్దీన్లను ఎంపిక చేసినప్పటికీ వారికి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడానికి వార్న్ అనాసక్తి కనబర్చడం విశేషం. ఇక ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లిలతో తను అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడంతో వారిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాడు. ఓపెనర్లుగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ, వీరేంద్ర సెహ్వాగ్లవైపే వార్న్ మొగ్గు చూపాడు. స్పిన్ బౌలింగ్లో ముఖ్యంగా తన బౌలింగ్లో ఏమాత్రం ఇబ్బంది పడని సిద్దూను ఓపెనర్గా ఎంపిక చేసినట్లు తెలిపిన అతడు.. సచిన్, ద్రవిడ్లు లేకుండా అత్యుత్తమ భారత జట్టును ఎంపిక చేయడం కష్టం అని పేర్కొన్నాడు. ఇక తన స్పిన్తో ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెట్టే వార్న్కు భారత్పై మాత్రం మెరుగైన రికార్డు లేకపోవడం విడ్డూరం. టీమిండియాతో జరిగిన 24 టెస్టు ఇన్నింగ్స్ల్లో కేవలం 43 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. వార్న్ అత్యుత్తమ భారత జట్టు: సౌరవ్ గంగూలీ(కెప్టెన్), నవజ్యోత్ సింగ్ సిద్దూ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజహరుద్దీన్, నయాన్ మోంగియా, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ చదవండి: ఆసీస్ బెదిరిపోయిన వేళ.. సిలిండర్ పేలి క్రికెటర్ భార్యకు గాయాలు -
బాస్ గుర్తులేడా వార్న్..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వాయిదా పడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు. ‘ఐపీఎల్ వాయిదా పడిందా.. ఇది నిజమేనా.. ఇప్పుడే ఈ సమాచారం తెలుసుకున్నా’ అని నిన్న ట్వీటర్లో అనుమానం వ్యక్తం చేశాడు వార్న్. ఇంతవరకూ బాగానే ఉంది. ఎందుకంటే ఐపీఎల్ వాయిదా పడుతుందని ఎవరూ అనుకోలేదు. చివరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం మొన్నటి వరకూ ఐపీఎల్ జరిగి తీరుతుందని తెగేసి మరీ చెప్పాడు. కాగా, కరోనా వైరస్ను మహమ్మారిగా డబ్యూహెచ్వో ప్రకటించిన తరుణంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. అనవసరపు తలనొప్పులు తెచ్చుకునే కంటే ముందుస్తు జాగ్రత్తలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం సైతం క్రీడలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రేక్షకులు లేకుండా క్రికెట్ మ్యాచ్లు, మిగతా టోర్నీలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు ఐపీఎల్కు రాబోయే విదేశీ ఆటగాళ్ల వీసాలపై ఆంక్షలు పెట్టింది. దాంతో ఐపీఎల్ను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. (ఐపీఎల్ ఆలస్యం) బీసీసీఐ బాస్ గుర్తులేడా.. దీనిపై షేన్ వార్న్ ఆశ్చర్యంతో కూడిన ట్వీట్ చేశాడు. దానిలో భాగంగా విరాట్ కోహ్లి, మైకేల్ వాన్, కెవిన్ పీటర్సన్, వీరేంద్ర సెహ్వాగ్, రాజస్తాన్ రాయల్స్, స్టార్స్పోర్ట్స్ ఇండియా, అజింక్యా రహానే, రికీ పాంటింగ్ ఇలా అందర్నీ ట్యాగ్ చేశాడు. చివరకు కుల్దీప్ యాదవ్ను కూడా వార్న్ ట్యాగ్ చేశాడు. అయితే ఇక్కడ బీసీసీఐ బాస్, తన సమకాలీన క్రికెటర్ సౌరవ్ గంగూలీని వార్న్ మరిచాడు. దాంతో నెటిజన్లు సెటైర్లకు దిగారు. ‘ బాస్ను మరిచావా వార్న్. ఎందుకిలా’ అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా, ‘ వార్న్ ఏంటీ నువ్వు చిన్న పిల్లాడిలా.. కుల్దీప్ను అడిగావు.. కానీ గంగూలీని అడగలేదు ఎందుకు’ అని మరొకరు ప్రశ్నించారు. ‘ వార్న్.. నీకు న్యూస్ చూడటం రాదా.. అంతమందికి ట్యాగ్ చేశావ్’ అని మరొక అభిమాని సెటైర్ వేశాడు. (అందుకే మంజ్రేకర్పై వేటు పడిందా?) -
‘క్రికెట్ జ్ఞాపకాని’కి రికార్డు ధర
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల కోసం ఆ దేశ దిగ్గ క్రికెటర్ షేన్ వార్న్ తన బ్యాగీ గ్రీన్(ఆస్ట్రేలియా క్రికెటర్లు ధరించే క్యాప్)ను వేలానికి పెట్టగా దానికి ఆల్టైమ్ రికార్డు ధర పలికింది. తన బ్యాగీ గ్రీన్ క్యాప్ను సోమవారం వేలానికి తీసుకురాగా, అది రోజు వ్యవధిలోనే ఊహించని ధరకు అమ్ముడుపోయింది. వార్న్ బ్యాగీ గ్రీన్కు లభించిన ధర 5,29,500 డాలర్లు. సిడ్నీకి చెందిన ఓ వ్యక్తి ఆ క్యాప్ను వేలంలో కొనుగోలు చేశాడు. దాంతో అత్యంత ధరకు అమ్ముడుపోయిన ఓ ‘క్రికెట్ జ్ఞాపకం’గా వార్న్ బ్యాగీ గ్రీన్ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఆ దేశ దిగ్గజ క్రికెటర్ సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ బ్యాగీ గ్రీన్ను అధిగమించింది.(ఇక్కడ చదవండి: ‘ప్రతీ సిక్స్ను డొనేట్ చేస్తా’) గతంలో బ్రాడ్మన్ బ్యాగీ గ్రీన్ను వేలం పెట్టగా అది 4,25,00 డాలర్లకు అమ్ముడుపోగా ఇప్పుడు దాన్ని వార్న్ బ్యాగీ గ్రీన్ బ్రేక్ చేసింది. ఈ జాబితాలో వార్న్ బ్యాగీ గ్రీన్ తర్వాత స్థానంలో బ్రాడ్మన్ బ్యాగీ గ్రీన్ ఉండగా, మూడో స్థానంలో ఎంఎస్ ధోని బ్యాట్ విలువ ఉంది. 2011 వరల్డ్కప్ ఫైనల్లో ధోని ఆడిన బ్యాట్ను తర్వాత వేలంగా వేయగా దాని విలువ సుమారు కోటి రూపాయిలు పలికింది.వార్న్ బ్యాగీ గ్రీన్ను వేలంలో పెట్టిన మరుక్షణమే ఆసక్తికరమైన పోటీ ఏర్పడింది. రెండు గంటల వ్యవధిలో అది 2,75,000 డాలర్లను దాటింది చివరికి ఎంసీ అనే వ్యక్తి దాన్ని రికార్డు ధరకు సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఆస్ట్రేలియాను కార్చిచ్చు దహించి వేస్తున్న సంగతి తెలిసిందే. కార్చిచ్చు బాధితులను ఆదుకునేందుకు నడుంబిగించిన వార్న్.. టెస్టు కెరీర్ ఆసాంతం ధరించిన బ్యాగీ గ్రీన్ టోపీని వేలం వేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రతి ఒక్కరు నిధుల సేకరణలో భాగం కావాలని వార్న్ పిలుపునిచ్చాడు. వార్న్ తన అంతర్జాతీయ క్రికెట్లో 145 టెస్టులు ఆడి 708 వికెట్లు సాధించాడు. ప్రపంచంలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో వార్న్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్(800 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. -
మైదానంలో మరోసారి రచ్చచేసిన స్మిత్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ‘బాక్సింగ్ డే టెస్టు’తొలి రోజు చిన్నపాటి వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ సీనియర్ అంపైర్ నిగెల్ లాంగ్ తీరుపై ఆసీస్ స్టార్ బ్యాట్స్మన స్టీవ్ స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. ఇదే క్రమంలో కామెంటరీ బాక్స్లో ఉన్న షేన్ వార్న్ సైతం అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతడికి ఐసీసీ నిబంధనల పుస్తకాన్ని ఇవ్వాలని ఎద్దేవాచేశాడు. అయితే ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. అయితే స్మిత్ క్రీడా స్పూర్థికి విరుద్దంగా ప్రవర్తించాడని కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. అంతేకాకుండా ఆసీస్ ఆటగాళ్లకు దురుసు ఎక్కువ అనే విషయం ఈ ఒక్క సంఘటన నిరూపితమైందని మరి కొంత మంది పేర్కొంటున్నారు. ‘టెస్టు క్రికెట్లో ఒక్క పరుగు కోసం అది కూడా న్యాయబద్దం కాని దాని కోసం పోట్లాడిన ఏకైక బ్యాట్స్మన్ స్మిత్’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అసలేం జరిగిందంటే.. టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ పరుగుల వేట ప్రారంభించింది. అయితే ఆరంభంలేనే ఆతిథ్య జట్టుకు గట్టి షాక్ తగిలింది 61 పరుగులకే వార్నర్, బర్స్న్ వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో స్మిత్, లబుషేన్లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ 26వ ఓవర్(బ్రేక్కు ముందు ఓవర్) సందర్భంగా కివీస్ బౌలర్ వాగ్నర్ వేసిని షార్ట్ పిచ్ బాల్ స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో సింగిల్ తీసే ప్రయత్నం చేశారు. అయితే బ్యాట్స్మెన్ సింగిల్ తీసే ప్రయత్నాన్ని అంపైర్ నిగేల్ లాంగ్ అడ్డుకున్నాడు. ఎందుకంటే అ బంతిని స్మిత్ ఆడాలనుకోలేదు. వదిలేద్దామనుకున్నాడు. కానీ ఆ బంతి స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లడంతో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాట్స్మన్ బంతిని కొట్టడానికి చేసే ప్రయత్నంలో బంతి బ్యాట్ను మిస్సై శరీరానికి తగిలిన సమయంలో తీసే పరుగే కౌంట్ అవుతుందని.. ఇదే విషయాన్ని స్మిత్కు అంపైర్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలా అంతకుముందు ఓవర్లో కూడా జరగడంతో స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ స్మిత్ వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. అయితే కామెంటరీ బాక్స్లో ఉన్న షేన్ వార్న్ అంపైర్ తీరును తప్పుపట్టారు. అంపైర్ది చెత్త నిర్ణయం అంటూ మండిపడ్డాడు. షార్ట్ పిచ్ బంతికి బ్యాట్స్మన్ శరీరంలో ఎక్కడ తగిలినా పరుగు తీయవచ్చనే నిబందన ఉందని పేర్కొన్నాడు. ‘నాకు తెలిసి అంపైర్కు ఐసీసీ నిబంధనల బుక్ అవసరం ఉందునుకుంటున్నా. బ్రేక్ సమయంలో ఎవరైనా ఇవ్వండి’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక ఈ వివాదంపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. You make the call - should this be a dead ball? #AUSvNZ pic.twitter.com/CMp4Q9AHvW — #7Cricket (@7Cricket) December 26, 2019 Poor sportsmanship. But we’ve come to expect that from you Steve. Terrible example for kids. You are an embarrassment to the game. #NZvAUS #BoxingDayTest #MCG #stevesmith pic.twitter.com/xi0VqVjUF1 — Davidthompson420695000 (@Davidthompson42) December 26, 2019 -
‘వార్న్.. నా రికార్డులు చూసి మాట్లాడు’
బ్రిస్బేన్: తన రికార్డులను చూసి షేన్ వార్న్ మాట్లాడితే బాగుంటుందని ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఘాటుగా బదులిచ్చాడు. ‘ నీవు అప్పుడప్పుడు ఆడే ఏవో కొన్ని మెరుపు ఇన్నింగ్స్లు ఆసీస్ జట్టులో కొనసాగడానికి ఉపయోగపడవు. ముందుగా ఆసీస్ జట్టులో ఆడాలంటే ఎటువంటి ప్రదర్శన చేయాలో తెలుసుకో. ఖవాజాను తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం భేష్’ అంటూ వార్న్ పేర్కొన్నాడు. దాంతో వార్న్-ఖవాజాల మధ్య వార్ మొదలైంది. ఆస్ట్రేలియా జట్టులో కొనసాగాలంటే తాను ఏమి చేయాలో తనకు తెలుసంటూ ఖవాజ్ మండిపడ్డాడు. అదే సమయంలో ఒకవేళ నీకు ఏమైనా అవసరం ఉంటే అలా చేయడానికి యత్నించు అంటూ చురకలంటించాడు. ‘నేను ఎప్పుడూ కూల్గా ఉంటాను. అసలు వార్న్ క్వశ్చన్కు ఆన్సర్ చెప్పాల్పిన అవసరం నాకు లేదు. నేను బ్యాట్స్మన్. నాకు పరుగులు చేయడం మాత్రమే తెలుసు. అదే నాకు కరెన్సీతో సమానం. నా రికార్డులు చూసి మాట్లాడు. నా షీల్డ్ రికార్డు చూశావా. దేశవాళీ క్రికెట్లో నా వన్డే రికార్డు నీకు తెలుసా. ఆస్ట్రేలియా తరఫున నేను సాధించిన రికార్డు కూడా చూడు. అలాగే బీబీఎల్ రికార్డును కూడా పర్యవేక్షించుకో. నేను ఎక్కడ ఆడినా పరుగులే చేసే జట్టులో కొనసాగా. అంతేగానీ నువ్వు ఏదో సలహా చెబితే నా బాడీ లాంగ్వేజ్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా మార్పు కావాలంటే నువ్వు ట్రై చేయ్’ అంటూ వార్న్కు ఖవాజా కౌంటర్ ఇచ్చాడు.పాకిస్తాన్తో టెస్టు సిరీస్కు ఖవాజాపై వేటు పడింది. ఎప్పట్నుంచో ఆసీస్ తరఫున టెస్టుల్లో ఓపెనర్గా కొనసాగుతున్న ఖావాజాను పాకిస్తాన్తో సిరీస్కు తప్పించారు. ఇటీవల కాలంలో ఖవాజా ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోవడంతో అతనిపై తప్పిస్తూ సీఏ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దాంతో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్ధించిన వార్న్.. ఖవాజాను కించపరిచేలా మాట్లాడాడు. ఆసీస్ జట్టులో కొనసాగాలంటే ఆడపా దడపా ప్రదర్శనలు సరిపోవంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. -
కోహ్లి, దాదాలకు వార్న్ విన్నపం ఇదే!
కోల్కతా : భారత గడ్డపై తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ డేనైట్ టెస్ట్కు క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తుండటంపై బీసీసీఐ ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పింక్ బాల్ టెస్టుపై అభిమానులు అమితమైన ఆసక్తి కనబర్చుతున్నట్లు పేర్కొంది. ఇక రెండు టెస్టుల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. ఈ చారిత్రక టెస్టులో ఇన్నింగ్స్ విజయంతో మూడో రోజే ఆటను ముగించే అవకాశం ఉంది కోహ్లి సేన. ఇక డేనైట్ టెస్టు విజయవంతం చేసినందుకు స్వదేశీ, విదేశీ తాజా, మాజీ క్రికెటర్లు బీసీసీఐపై, టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ టెస్టు క్రికెట్కు ఇది శుభపరిణామని పేర్కొన్నాడు. కాగా షేన్ వార్న్ ఓ అడుగు ముందుకేసి తన మనసులోని మాటను బయటపెట్టాడు. తొలి డేనైట్ టెస్టుతో భారత్ సంతృప్తితో ఉండటంతో భవిష్యత్లో ఇలాంటి మరిన్ని టెస్టులు ఆడాలని ఆకాంక్షించాడు. అంతేకాకుండా వచ్చే ఏడాది టీమిండియా ఆసీస్ పర్యటన నేపథ్యంలో అడిలైడ్లో డేనైట్ టెస్టు ఆడేలా చర్యలు తీసుకోవాలని సారథి విరాట్ కోహ్లి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీలకు వార్న్ కోరాడు. ఇక ఈ టెస్టు ఆరంభానికి ముందు ఆసీస్లో కూడా డేనైట్ మ్యాచ్లు ఆడేందకు సిద్దంగా ఉన్నామని కోహ్లి పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే పింక్ బాల్ క్రికెట్కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆడిలైడ్లో తమకు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఏర్పాటు చేయాలన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పింక్ బాల్ టెస్టుపై ఆమితాసక్తి కనబర్చిడు. వెంటనే తన ఆలోచనలను ఆచరణలో పెట్టాడు. సారథి కోహ్లిని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఒప్పించి కోల్కత్లో డేనైట్ టెస్టుకు ఏర్పాట్లు చేశాడు. ఇక ఈ మ్యాచ్ విజయంవంతం కావడంతో అందరికంటే దాదా రెట్టింపు ఆనందంతో ఉన్నాడు. గతేడాదే టీమిండియా ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు డేనైట్ టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిపాదన పెట్టగా బీసీసీఐ సున్నితంగా తిరస్కరించింది. ఇక ఈ పర్యటనలో ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలుచుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. -
షేన్ వార్న్పై ఏడాది నిషేధం!
లండన్: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఏడాది పాటు సస్పెన్షన్కు గురయ్యాడు. అదేంటి షేన్ వార్న్ క్రికెట్ను వదిలేసి చాలా కాలమే అయ్యింది.. ఇప్పుడు నిషేధం ఏమిటా అనుకుంటున్నారా.. ఇది క్రికెట్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నిషేధం కాదు. మితిమీరిన వేగంతో కారు డ్రైవ్ చేయడంతో అతని డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు నిషేధించారు. షేన్ వార్న్ ఆరోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా అతను ఏడాది పాటు కారు నడపకుండా ఉండాలని వింబుల్డన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాగ్వర్ కారును అద్దెకు తీసుకున్న వార్న్.. 40 మైళ్ల వేగంతో వెళ్లాల్సిన కెన్సింగ్టన్ జోన్లో 47 మైళ్ల వేగంతో వెళ్లడంతో అతనిపై నిషేధానికి కారణమైంది. అంతకుముందు ట్రాఫిక్ ఉల్లంఘనల్లో భాగంగా వార్న్ పేరిట 15 పాయింట్లు ఉన్నాయి. 2016 మొదలుకొని గతేడాది ఆగస్టు వరకూ వార్న్ లైసెన్స్పై 15 పాయింట్లు ఉండటం గమనార్హం. దాంతో మరోసారి ట్రాఫిక్ నిబంధనల్ని అతి క్రమించడంతో వార్న్కు శిక్ష తప్పలేదు. దాంతో పాటు రూ.1.62 లక్షల జరిమానా కూడా వార్న్పై పడింది. -
షేన్వార్న్ మరో ‘సెక్స్’బాగోతం
లండన్ : ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ స్పిన్ బౌలర్ షేన్వార్న్ శృంగార పురుషుడనే ప్రపంచానికి తెల్సిందే. ఈ విషయంలో ఆయన ఎప్పుడు వార్తల్లో వ్యక్తిగా ఉంటూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన తన అజ్ఞాత (బయటి ప్రపంచానికి ఇంకా ఆమె పేరు తెలియదు) ప్రేయసి ఒకరు 19 ఏళ్ల డవీనా, 27 ఏళ్ల పాప్పిలనే ఇద్దరు సెక్స్ వర్కర్లను నేరుగా ఇంటికి తీసుకరాగా నలుగురు కలిసి సరస సల్లాపాల్లో మునిగి తేలారట. పైగా షేన్ వార్న్ తన పడక గది కిటికీ తలుపులు తెరచి ఉంచడంతో ఇరుగు పొరుగు వారి దృశ్యాలను చూసినంత సేపు చూసి చివరకు ఓ స్థానిక టీవీ ఛానల్కు ఫిర్యాదు చేశారట. టీవీ బృందం పరుగెత్తుకొచ్చే సరిగా ఇద్దరు సెక్స్ వర్కర్లను తీసుకొని ఆ అజ్ఞాత ప్రేయసితో తన కారులో ఉడాయించారట. ఈ బాగోతమంతా లండన్ వాయువ్య ప్రాంతంలోని షేన్వార్న్కు చెందిన 30 కోట్ల రూపాయల విలువైన ‘మైడా వాలే’ నివాసంలో జరిగిందట. ఈ వార్తా కథనాన్ని ప్రచురించిన ‘ది సన్’ పత్రిక డవీనా రెండు గంటలకు 40 వేలు, పొప్పి ప్రతి రెండు గంటలకు 50 వేల రూపాయలు చార్జి చేస్తారని తెలిపింది. డవీనాకు మార్కెట్లో ‘పాకెట్ రాకెట్’ అని పాప్పిని ‘పార్టీ గర్ల్’ అని పిలుస్తారట. షేన్వార్న్ తన జీవితంలో ఇప్పటికే పలువురు అమ్మాయిలను ప్రేమించారు. వారిలో ఒకరిద్దరిని పెళ్లి చేసుకొని వదిలేశారు. మిగతా వారిని పెళ్లి చేసుకోకుండానే వదిలేశారు. స్త్రీ లోలుడన్న కారణంగానే ఆయన కొన్నిసార్లు ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. షేన్ వార్న్ వ్యక్తిగత జీవితంలోని విచ్చలవిడితనం వల్ల కాకుండా, తెల్లార్లు శృంగార లీలల్లో పాల్గొంటూ నిద్ర మత్తుతో క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టడమే అందుకు ప్రధాన కారణమని తోటి క్రికెటర్లు చెబుతారు. ఆయన కూడా తన శృంగార లీలల గురించి ఎప్పుడూ దాచుకోలేదు. ‘నేనేమి నేరం చేయడం లేదు. ఎవరికేమీ అన్యాయం చేయడం లేదు. నాకు అందమైన అమ్మాయిలతో శృంగారమంటే మహా పిచ్చి. అమ్మాయిల అనుమతితోనే నేను వారితో గడుపుతాను’ అని షేన్ పలు సందర్భాల్లో తన గురించి తాను చెప్పుకున్నారు. ‘లవ్ ఐలాండ్’ పోటీల్లో పొల్గొన్న 21 ఏళ్ల లూసి డన్లాన్ను ఈ ఏడాది మొదట్లో ‘ఇన్స్టాగ్రామ్’లో చూసి ముచ్చటపడ్డారు. ఆ తర్వాత అనతి కాలంలోనే వారిద్దరు కలిసి తిరగడం చూసిన ప్రజలు ఆశ్చర్య పడ్డారు. షేన్వార్న్ పెద్ద కూతురుకంటే లూసి వయస్సులో చిన్నదట! షేన్వార్న్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు 1993లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రముఖ బౌలర్గా గుర్తింపు పొందారు. 1995లో సైమన్ కల్లాహన్ను షేన్ పెళ్లి చేసుకున్నారు. 2003లో నిషేధిత డ్రగ్ వాడడంతో క్రికెట్ టీమ్ నుంచి తప్పించారు. అందుకని ఆయన ఆ ఏడాది వరల్డ్ కప్ సిరీస్లో ఆడలేక పోయారు. 2005లో సైమన్కు షేన్ విడాకులు 2006లో కెరీర్లో 703 వికెట్లు తీసుకొన్న షేన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పారు. 2011లో లిజ్ హర్లీతో రెండేళ్లు ప్రేమాయణం నడిపారు. 2014లో ‘ప్లే బాయ్’ మోడల్ ఎమిలీ స్కాట్తో ప్రేమాయణం. 2019లో అజ్ఞాత ప్రేయసితో సంసారం. -
ఓవర్ త్రో: ఇలా చేస్తే బాగుండు: వార్న్
క్రికెట్లో ఓవర్ త్రో సహజం. కానీ ఆ ఒక్క ఓవర్ త్రో న్యూజిలాండ్కు ప్రపంచకప్ను దూరం చేసింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్లో గప్టిల్ విసిరిని బంతి స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్లు ఇంగ్లండ్కు ఆరు పరుగులు కేటాయించారు. ఈ ఓవర్ త్రో కివీస్ ఓటమికి ప్రధాన కారణమైంది. అయితే అంపైర్ ఆరు పరగులు కేటాయించడం పెద్ద వివాదస్పదమైంది. దీంతో మరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్సీసీ) ఓవర్ త్రో నిబంధనలపై సమీక్ష చేపట్టింది. అయితే ఎమ్సీసీ సభ్యుడు, ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రపంచకప్ ఫైనల్ ఓవర్త్రోపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఓవర్ త్రో నిబంధనలపై ఎమ్సీసీ సమీక్ష నిర్వహిస్తున్నాం. ఎమ్సీసీలో సభ్యుడిగా నా వాదన వినిపించాను. ఫీల్డర్ విసిరిన బంతి క్రీజులో ఉన్న బ్యాట్స్మన్ శరీరానికి, బ్యాట్కు తగిలి బౌండరీ వెళితే దానిని డెడ్బాల్గా పరిగణించాలి. అంతేకాకుండా బ్యాట్స్మెన్ పరుగు కూడా తీయొద్దు. ఎందుకంటే అది క్రీడా స్పూర్తికి విరుద్దం. ఓవర్ త్రో పరుగులు అనేవి మైదానంలో ఉన్న ఫీల్డింగ్ జట్టు తప్పిదం వల్లనే రావాలి కానీ.. ఎవరి తప్పిదం లేనప్పుడు వచ్చిన పరుగులను కౌంట్ చేయోద్దు అనేది నా వాదన ఇక ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ను నేను స్వాగతిస్తున్నా. టెస్టు క్రికెట్ను బతికించేందుకు ఐసీసీ ముందడుగేసింది. అయితే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు టెస్టు ప్రమాణాలను పెంపొందించేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక టెస్టుల్లో ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నంబర్లను కొందరు తప్పుబడుతున్నారు. కానీ అందులో ఏం తప్పు ఉందో అర్థం కావడం లేదు. జెర్సీలపై నంబర్లు, పేర్లు ఉంటే అభిమానులు ఆటగాళ్లను సులువుగా గుర్తుపట్టవచ్చు’అంటూ వార్న్ పేర్కొన్నాడు. చదవండి: ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్ నేను పొరపాటు చేశా: వరల్డ్కప్ ఫైనల్ అంపైర్ -
స్మిత్కు అతనే సరైనోడు: వార్న్
లండన్: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ టెస్టు అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. యాషెస్ సిరీస్లో భాగంగా బుధవారం లార్డ్స్ వేదికగా ఆరంభం కానున్న రెండో టెస్టులో ఆర్చర్ ఆడటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ గాయం కారణంగా రెండో టెస్టుకు సైతం దూరం కావడంతో ఆర్చర్ తుది జట్టులో ఎంపికకు మార్గం సుగుమమైంది. తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టులోనే ఆర్చర్ ఉన్నప్పటికీ, చిన్నపాటి గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేపోయాడు. అయితే సెకండ్ ఎలెవన్ చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లిష్ కౌంటీ జట్టు ససెక్స్ తరఫున ఆడిన ఆర్చర్ ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో చెలరేగిన ఆర్చర్.. బ్యాటింగ్లో శతకంతో ఆకట్టుకున్నాడు. దాంతో అతని ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఫలితంగా రెండో టెస్టు కోసం ప్రకటించిన 12 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆర్చర్ తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే యాషెస్ తొలి టెస్టులో రెండు భారీ శతకాలు సాధించి ఆసీస్ ఘన విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టీవ్ స్మిత్ను నిలువరించాలంటే ఆర్చర్ను రంగంలోకి దింపాలన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్చర్ను ఎదుర్కోవడం చాలా కష్టమని వార్న్ అభిప్రాయపడ్డాడు. స్మిత్ చాలెంజ్కు ఇంగ్లండ్ ధీటుగా బదులివ్వాలంటే ఆర్చర్ రంగ ప్రవేశం అనివార్యమన్నాడు. ‘ స్మిత్ను నిలువరించే ప్రణాళిక ఆర్చర్ వద్ద కచ్చితంగా ఉంటుంది. సుమారు 145 కి.మీ వేగంతో బంతుల్ని ఆర్చర్ సంధిస్తున్నాడు. ఆర్చర్ సవాల్ను స్మిత్ ఎదుర్కోవడం కష్టమే. రెండో టెస్టుకు అండర్సన్ దూరమయ్యాడు. దాంతో ఆర్చర్ అవసరం ఇంగ్లండ్కు ఉంది. అతని బౌలింగ్లో వేడి ఏమిటో ఇప్పటికే చూపించాడు. అంతకముందు స్మిత్-ఆర్చర్లు ఇద్దరూ ఒకే నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. ఐపీఎల్లో ఇద్దరూ రాజస్తాన్ రాయల్స్కు ఆడారు. దాంతో స్మిత్ ఆట తీరుపై ఆర్చర్కు ప్రణాళిక ఉంటుంది. ఆర్చర్ ఎక్స్ట్రా పేస్తో బ్యాట్స్మెన ఇబ్బందులు పెడతాడు. దాంతో పాటు అతని బౌలింగ్లో వేగం కూడా నియంత్రణలో ఉంటుంది. యాషెస్లో మంచి ఫామ్లో ఉన్న స్మిత్ను ఆపాలంటే ఆర్చర్ సరైనోడు’ అని వార్న్ తెలిపాడు. -
‘ఇక చాలు.. అది ధోనికి తెలుసు’
సిడ్నీ : టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనిపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్వార్న్ అన్నాడు. భారత క్రికెట్కు ధోని ఎన్నో సేవలు చేశాడని చెప్పుకొచ్చాడు. ‘భారత క్రికెట్కు ధోని అద్బుతమైన సేవకుడు. భారత క్రికెట్కు కావాల్సిన ప్రతి ఒక్కటి అతను అందజేశాడు. కానీ కొంతమంది అదేపనిగా ధోనిపై విమర్శలు చేయడం, ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయవద్దని వ్యాఖ్యానించడం నాకు అర్థం కావడం లేదు. అసలు ధోని ఎందుకు రిటైర్ కావాలో విమర్శకులు చెప్పాలి. ఒక ఆటగాడికి ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో అనేది అతనికి తెలుసుంటుంది. ధోని కూడా అంతే. అయితే ధోని రిటైర్మెంట్ ప్రపంచకప్ అనంతరమా? లేక మరో ఐదేళ్ల తర్వాతా? అనేది పూర్తిగా అతని నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అతనికి కావాల్సింది సాధించే వరకు ధోని రిటైర్ అవ్వడు’ అని షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ధోని తన సారథ్యంలో భారత్కు టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీలు అందజేసిన విషయం తెలిసిందే. ఇక గతేడాదిగా ధోని కూడా అద్భుతమై ఫామ్లో ఉన్నాడు. 2018లో 9 మ్యాచ్లు ఆడిన ధోని 81.75 సగటుతో 327 పరుగులు చేశాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీతో అదరగొట్టాడు. 12 ఇన్నింగ్స్లు ఆడి 83.20 సగటుతో 416 పరుగుల చేశాడు. ఇక రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ పోరులో ధోని సూచనలు, అతని కీపింగ్ కోహ్లిసేనకు ఉపయోగపడనున్నాయి. -
చెన్నై వీధుల్లో హేడెన్ మారువేషంలో ఇలా..!
-
చెన్నై వీధుల్లో హేడెన్ ఇలా..!
చెన్నై: ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ విసిరిన సవాల్ను చాలెంజ్గా స్వీకరించాడు ఆ దేశానికి చెందిన మరో మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్. ప్రస్తుత ఐపీఎల్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న హేడెన్.. చెన్నై టి.నగర్లో మారువేషంలో షాపింగ్ చేశాడు. తెల్ల పట్టు లుంగీ, లైట్ పింక్ కలర్ షర్ట్ ధరించడంతోపాటు తనను ఎవరూ గుర్తు పట్టకుండా గడ్డం పెట్టుకున్న హేడెన్ షాపింగ్ చేశాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం చెన్నైలో షాపింగ్ చేయాలంటూ హేడెన్ను వార్న్ సవాల్ చేశాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న హేడెన్.. ఇలా షాపింగ్ చేసి చూపించాడు. -
నేనైతే కోహ్లిని అలా ఔట్ చేయను: బెన్ స్టోక్స్
జైపూర్ : ‘మన్కడింగ్ ఔట్’ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్పై ఇంగ్లండ్ స్టార్ బౌరల్, రాజస్తాన్ ఆటగాడు బెన్స్టోక్స్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతకు ముందు అశ్విన్ తీరుపై రాజస్తాన్ రాయల్స్ మెంటర్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ ట్విటర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వరుస ట్వీట్లతో అశ్విన్పై విమర్శలు గుప్పించాడు. కెప్టెన్గా, వ్యక్తిగతంగా అశ్విన్ తనను నిరాశపరిచాడని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, కెప్టెన్లందరూ క్రీడాస్పూర్తితో ఆడుతామని ఐపీఎల్ వాల్పై సంతకం చేశారని గుర్తు చేశాడు. అసలు ఆ సమయంలో అశ్విన్కు ఆ బంతి వేసే ఆలోచన లేదని.. అందుకే బట్లర్ను రనౌట్ చేశాడని.. దాన్ని డెడ్బాల్గా పరిగణించాల్సి ఉండేదని వార్న్ తెలిపాడు. ఐపీఎల్లో ఇలాంటివి మంచిది కాదని బీసీసీఐని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. ఈ విజయం ఆటగాళ్ల మానసిక స్థితిని చెడగొడుతుందని, క్రికెట్లో అన్నిటి కంటే క్రీడాస్ఫూర్తే ముఖ్యమని పేర్కొన్నాడు. భావితరాలకు ఆదర్శంగా ఉండాలని షేన్ వార్న్ సూచించాడు. బెన్ స్టోక్స్ కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని అశ్విన్లానే ఔట్ చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించాడు. అశ్విన్ క్రీడా సమగ్రతను కాపాడుతాడనుకుంటే నిరాశపరిచాడని.. ఈ ఘటనపై బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు షేన్ వార్న్ మరో ట్వీట్లో ప్రస్తావించాడు. అయితే షేన్వార్న్ బెన్ స్టోక్స్ పేరు ప్రస్తావించడంతో ఈ ఇంగ్లీష్ పేసర్ స్పందించాడు. ‘ప్రపంచకప్ ఫైనల్ ఆడుతూ.. విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తూ.. నేను బౌలింగ్ చేస్తుండగా.. మన్కడింగ్ విధానంలో ఔట్ చేసే అవకాశం వచ్చినా నేను చేయను. ఎప్పుడు ఎక్కడా అలా చేయను. నా పేరు ప్రస్తావించారు కాబట్టే ఈ వివరణ ఇస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు. క్రికెట్ అభిమానులు సైతం అశ్విన్ తీరుపై మండిపడుతున్నారు. నిజానికి అశ్విన్ అలా చేయకుంటే కింగ్స్ పంజాబ్ మ్యాచ్ గెలిచి ఉండేది కాదు. అప్పటికే బట్లర్ 43 బంతుల్లో 69 పరుగులు చేసి బీకరంగా ఆడుతున్నాడు. బట్లర్ ఔట్తో రాజస్తాన్ 14 పరుగులతో సొంతగడ్డపై పరాజయం పాలైంది. Hopefully I’m playing in the World Cup final and if @imVkohli is batting when I’m bowling I would never ever ever ever ever ever.....just clarifying to the mentions I’ve received 😊 #hallabol — Ben Stokes (@benstokes38) March 26, 2019 Sorry - one more thing to add. If Ben Stokes did what Ashwin did to @imVkohli it would be ok ? I’m just very disappointed in Ashwin as I thought he had integrity & class. Kings lost a lot of supporters tonight. Especially young boys and girls ! I do hope the BCCI does something — Shane Warne (@ShaneWarne) March 25, 2019 చదవండి: మన్కడింగ్ ఔట్ అంటే ఏంటో తెలుసా? అశ్విన్ ఏందీ తొండాట..! -
ధోని విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా-టీమిండియాల మధ్య జరిగిన నాలుగో వన్డే అనంతరం ఎంఎస్ ధోనిని విమర్శించిన వాళ్ల నోళ్లు మూత పడ్డాయని మాజీ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ పేర్కొన్నాడు. ధోనిని రిటైర్మెంట్ తీసుకొమ్మని ఉచిత సలహాలు ఇచ్చిన వారికి అతడి విలువ ఏంటో ఇప్పటికైనా తెలిసిందా అంటూ ప్రశ్నించారు. ఆసీస్తో జరిగిన నాలుగో వన్డేల్లో ధోని లేని లోటు స్పష్టంగా కనిపించిందన్న వార్న్.. మూడు వందలకు పైగా పరుగులు లక్ష్యాన్ని కూడా టీమిండియా కాపాడుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నాలుగో వన్డేలో వికెట్ల వెనుకాలా ఉండి ప్రశాంతంగా అతను రచించే వ్యూహాలు మిస్సయ్యాయని, టీమిండియా సారథి విరాట్ కోహ్లి కూడా ధోని సూచనలు లేక అయోమయానికి గురయ్యాడని వార్న్ పేర్కొన్నాడు. ఇలా ఆడితే ప్రపంచకప్ ఆసీస్దే ఇప్పటికైనా ప్రపంచకప్లో ధోని అవసరం ఎంత ఉందో అందరూ అర్థం చేసుకోవాలన్నాడు. బ్యాటింగ్లో ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ధోనికి ఉందన్నాడు. రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, చహల్ వంటి యువ ఆటగాళ్లు చేసిన పొరపాట్ల నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలన్నాడు. ఇక ఆసీస్ ఆటగాళ్ల ప్రదర్శన ఇప్పుడు మంచి పీక్స్లో ఉందన్నాడు. ఆటగాళ్లు సమిష్టిగా ఆడటం నేర్చుకుంటున్నారని కితాబిచ్చాడు. ప్రపంచకప్ వరకు పాత ఆసీస్ జట్టు ఆటను చూడవచ్చన్నాడు. ఇదే ఆటను కొనసాగిస్తే ప్రపంచకప్ గెలిచే అవకాశాలు ఆసీస్కు పుష్కలంగా ఉన్నాయన్నాడు. అయితే ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ జట్లు మాత్రమే ప్రపంచకప్లో హాట్ ఫేవరెట్ అంటూ వార్న్ అభిప్రాయపడ్డాడు. ధోని లేకపోవడం వల్లనే ఓటమి: మాజీ క్రికెటర్ పంత్లో ధోనిని వెతకడం ఆపండి.. -
కోహ్లికి బౌలింగ్ చేయండిలా..
సిడ్నీ: పరుగుల మెషీన్ విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయడమంటే ప్రత్యర్థి బౌలర్లకు కత్తిమీద సామే. కోహ్లిని ఔట్ చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సన్నద్ధమవుతున్నా అతను మాత్రం పరుగుల దాహంతో చెలరేగిపోతున్నాడు. అయితే అయితే, కోహ్లిని ఎలా కట్టడి చేయాలనే దానిపై ఆస్ట్రేలియా లెగ్స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ బౌలర్లకు విలువైన సలహాలు ఇచ్చాడు. ‘వికెట్కు ఇరువైపులా షాట్లు ఆడడంలో కోహ్లి దిట్ట. అతడికి బౌలింగ్ చేస్తున్నప్పుడు లెగ్ స్టంప్ను టార్గెట్ చేస్తే ఆన్సైడ్ ఫీల్డింగ్ మోహరించాలి. ఒకవేళ ఆఫ్ స్టంప్కు దూరంగా బంతులేస్తే ఆఫ్సైడ్ ఫీల్డింగ్ పెట్టాలి. అంతేకాని నేరుగా స్టంప్స్కు గురిపెట్టొద్దు’ అని వార్న్ సూచించాడు. కోహ్లిని కట్టడి చేయాలంటే.. తానైతే ఆఫ్ స్టంప్కు దూరంగా బంతులేస్తూ స్లిప్స్, షార్ట్ కవర్లో ఫీల్డర్లను మోహరించి షాట్లు ఆడకుండా అడ్డుకునే వ్యూహాన్ని రచిస్తానని వార్న్ చెప్పాడు. ‘ఆఫ్ స్టంప్కు బంతులేసినప్పుడు స్లిప్, షార్ట్ కవర్స్ మీదుగా కవర్ డ్రైవ్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. షాట్ మిస్సయితే ఎక్కడో అక్కడ దొరికిపోతాడు. ఒకవేళ వికెట్ టు వికెట్ బంతిని విసిరితే మాత్రం కోహ్లి రెండు వైపులా ఆడగలడు. రెండు వైపులా కాకుండా ఏదైనా ఒకవైపు ఫీల్డింగ్ సరిచేస్తే సరిపోతుంది. మంచి ఆటగాళ్లకు ఇలాగే బంతులేయాలి’అని క్రిక్ ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో వార్న్ అన్నాడు. కాగా, వన్డే ఫార్మాట్లో కోహ్లి తరహా ఆటగాడ్ని ఇంతవరకూ చూడలేదని వార్న్ అన్నాడు. తన దృష్టిలో సచిన్, లారాల కంటే కోహ్లినే అత్యుత్తమ ఆటగాడన్నాడు. -
వారు రెచ్చిపోవడం ఖాయం: వార్న్
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు తిరిగి చేరడం దాదాపు ఖాయం కావడంతో వరల్డ్కప్లో తామే మళ్లీ హాట్ ఫేవరెట్స్మని ఆ దేశ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ స్పష్టం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్గా ప్రపంచకప్కు సిద్ధమవుతున్న తమ జట్టు.. దాన్ని నిలబెట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ‘ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ల పునరాగమనంతో మా జట్టు మరింత బలోపేతం అవడం ఖాయం. వరల్డ్కప్కు వెళ్లే మా జట్టులో వారిద్దరూ కీలక ఆటగాళ్లు. నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడటంతో వీరిపై ఏడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులో వారిపై నిషేధం తొలగిపోనుంది. ఇక్కడ 2003లో తాను డోప్ టెస్టులో పాజిటివ్గా రావడంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న విషయాన్ని వార్న్ ప్రస్తావించాడు. ‘ఆ సమయంలో డోపీగా తేలడంతో నాపై 12 నెలల నిషేధం విధించారు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో నా మార్క్ స్పిన్తో సత్తా చాటా. ఈ నిషేధాన్ని నాలాగే ఉపయోగించుకోవచ్చు. మరింత తాజాదనంతో వారు ఫీల్డ్లోకి అడుగుపెట్టడం ఖాయం. ఈ క్రమంలోనే వారు రెచ్చిపోయి ఆడతారు. వారికి క్రికెట్ ఎంత ముఖ్యమో తెలుసు. ఇప్పుడు వారిద్దరికీ నిరూపించుకొనే అవకాశం వచ్చింది. తొలుత కొన్ని మ్యాచుల్లో ఆందోళన ఉంటుంది. ఇది వారికి మంచి చేస్తుంది. ఆ తర్వాత వారు అద్భుతంగా ఆడతారు’ అని షేన్వార్న్ అన్నాడు. -
నేను అలా అనలేదు: వార్న్
ఢిల్లీ: ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్గా ఎంపికైన రికీ పాంటింగ్ను త్వరలో ఆరంభం కానున్న ఐపీఎల్లో ఢిల్లీ కేపిటల్స్ కోచ్గా తప్పించాలంటే తాను వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలను షేన్ వార్న్ ఖండించాడు. తాను పాంటింగ్ను ఢిల్లీ కోచ్గా తప్పించమంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ను కోరినట్లు వచ్చినట్లు వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నాడు. ‘ పాంటింగ్ను ఐపీఎల్ నుంచి తప్పించాలంటూ నేను కోరినట్లు మీడియాలో వెలుగు చూసినవి రూమర్స్ మాత్రమే. వాటిలో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఇటువంటి చెత్త న్యూస్ను ఆపండి. ఒకవేళ పాంటింగ్ను ఢిల్లీ కోచ్గా తీసేయమని నేను కోరితే అది కచ్చితంగా అది ఒక అవివేకమైన చర్య. అది బీసీసీఐ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది’ అని వార్న్ తెలిపాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అంశాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకుని పాంటింగ్ను ఐపీఎల్లో ఢిల్లీ కోచ్గా కొనసాగేందుకు అడ్డుపడితే.. అందుకు అంగీకరించేందుకు కూడా పాంటింగ్ సిద్ధంగా ఉండాలని వార్న్ ముక్తాయింపు ఇచ్చాడు. -
ఓపెనర్గా పంత్ను ఆడించాల్సిందే
ముంబై : టీమిండియా హార్డ్ హిట్టర్, యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ను ప్రపంచకప్లో ఆడించాల్సిందేనని దిగ్గజ క్రికెట్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే పంత్ను ఓపెనర్గా ఆడించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ సూచించిన విషయం తెలిసిందే. అయితే వార్న్ సలహా మంచిదేనని, ఈ దిశగా టీమిండియా ఆలోచించాలని గవాస్కర్ పేర్కొన్నాడు. రిషభ్ పంత్ ఓపెనర్గా ఆడించడం వల్ల వచ్చే నష్టం ఏం లేదని, అతను చెలరేగితో మిడిలార్డర్పై ఎలాంటి ఒత్తిడి ఉండదని ఓ జాతీయ ఛానెల్కు తెలిపాడు. ‘పంత్ ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్. ఎడమ-కుడి బ్యాట్స్మెన్ కాంబినేషన్ను ఎదుర్కొవడం బౌలర్లకు కష్టమైన పని. ఇలానే రోహిత్-ధావన్ కాంబినేషన్ విజయవంతమైంది. గతంలో సచిన్-గంగూలీ, సెహ్వాగ్-గంగూలీలు జోడిలు కూడా ఓపెనర్లుగా రాణించాయి. పంత్ కూడా ఓపెనర్గా రాణిస్తాడు. ఇది జట్టుకు కలిసొచ్చే అంశం’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. గావస్కరే కాదు మరో భారత మాజీ క్రికెటర్ ఆశిశ్ నెహ్రా సైతం పంత్ను ప్రపంచకప్కు ఎంపిక చేయాలని ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘బ్యాటింగ్లో కుడి–ఎడమ కాంబినేషన్ ముఖ్యం. టీమిండియాలో చూస్తే ధావన్ తప్ప ఏడో స్థానం వరకు ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ లేరు. పంత్ మ్యాచ్ విన్నర్. రోహిత్శర్మలా అలవోకగా సిక్స్లు బాదుతాడు. బ్యాకప్ ఓపెనర్గానూ పనికొస్తాడు. 1 నుంచి 7వ స్థానం వరకు ఎక్కడైనా ఆడగలడు. కోహ్లి... అతడిని ఏవిధంగానైనా ఉపయోగించుకోవచ్చు.’ అని పేర్కొన్నాడు. ఇక షేన్ వార్న్ ధోని కోసం పంత్ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదని, వికెట్కీపర్గా కాకుండా బ్యాట్స్మన్గా పరిగణించి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియా సిరీస్లోనే పంత్ను ఓపెనర్గా పంపించి ప్రయోగం చేయాలన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధావన్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ జట్టు గెలుపు కోసం కొన్ని త్యాగాలు చేయలన్నాడు. -
‘పంత్, రోహిత్లు ఓపెనర్లుగా రావాలి’
సిడ్నీ: ఇంగ్లండ్-వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ప్రపంచకప్ 2019లో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలంటే తన సూచనలు పాటించాలంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్. కోహ్లి సేన ఈ మెగా టోర్నీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న వార్న్.. జట్టులో కొన్ని మార్పులు జరగాలని సూచించాడు. ప్రపంచకప్లో ప్రత్యర్థి జట్టును అయోమయానికి గురిచేసేందుకు టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రిషబ్ పంత్లు రావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ప్రపంచకప్ గెలవాలంటే మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. అయితే దీనిపై సరైన వివరణే ఇచ్చాడు ఈ ఆసీస్ దిగ్గజ క్రికెటర్. ప్రపంచకప్ 1992లో భాగంగా న్యూజిలాండ్ ఓపెనర్లను మార్చిందని, అదేవిధంగా తొలి ఓవర్ను స్పిన్నర్తో బౌలింగ్ వేయించి సఫలీకృతమైన విషయాన్ని గుర్తుచేశాడు. ఇలాంటి మార్పులు చేయడంతో ప్రత్యర్థి జట్టు గందరగోళానికి గురవుతుందన్నాడు. ఇలాంటి విభిన్న మార్పులతోనే టీమిండియా బరిలోకి దిగితే గెలుపు తథ్యమన్నాడు. అతడిని బ్యాట్స్మెన్గా ఎందుకు పరిగణించడం లేదు ప్రపంచకప్లో పాల్గొనబోయే టీమిండియాలో సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని తప్పకుండా ఉంటాడని వార్న్ ధీమా వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లతో కూడిన కోహ్లి సేనకు ధోని సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నాడు. అంతేకాకుండా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడం ధోని అదనపు బలమంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. అయితే ధోని కోసం పంత్ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదన్నాడు. పంత్ను వికెట్కీపర్గా కాకుండా బ్యాట్స్మన్గా పరిగణించి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియా సిరీస్లోనే పంత్ను ఓపెనర్గా పంపించి ప్రయోగం చేయాలన్నాడు. భవిష్యత్ క్రికెట్ పంత్దే అంటూ కితాబిచ్చాడు. ఇక బౌలింగ్లోనూ టీమిండియా ఎప్పుడూ లేనివిధంగా బలంగా ఉందన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధావన్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ జట్టు గెలుపు కోసం కొన్ని త్యాగాలు చేయలన్నాడు. -
‘టీమిండియాదే భవిష్యత్తు’
ముంబై: సుదీర్ఘకాలం వరల్డ్ క్రికెట్ను శాసించే సత్తా టీమిండియాకు ఉందని ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స్పష్టం చేశాడు. ఇందుకు గత కొంతకాలంగా భారత క్రికెట్ సాధిస్తున్న అద్భుత విజయాలే ఉదాహరణగా పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో భారత జట్టు విదేశీ గడ్డపై అమోఘంగా రాణిస్తూ దూసుకుపోతుందన్నాడు. ‘ నా దృష్టిలో చాలాకాలం పాటు వరల్డ్ క్రికెట్లో భారత్ హవానే కొనసాగే అవకాశం ఉంది. ఆ జట్టులోని కీలక ఆటగాళ్లను గాయాల బారిన పడకుండా కాపాడుకుంటే భారత్కు తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. ప్రతీ ఒక్క భారత ఆటగాడు అవకాశం కోసం ఎదురుచూస్తూ తామేంటో నిరూపించుకుంటున్నారు. ప్రధానంగా టెస్టు క్రికెట్లో భారత జట్టు తనదైన ముద్రను వేస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ను ఓడించిన భారత్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుతం తమ జట్టు పటిష్టంగా లేకపోయినప్పటికీ స్వదేశంలో మేము ఎప్పుడూ ప్రమాదమే. అయినా మమ్మల్ని మట్టికరిపించిన తీరు అమోఘం. ముఖ్యంగా బూమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మల త్రయం విశేషంగా రాణించడంతో ఆసీస్కు స్వదేశంలో సైతం ఘోర ఓటమి తప్పలేదు. ఇక్కడ బూమ్రా అసాధారణ బౌలర్గానే చెప్పాలి. తన వైవిధ్యమైన బౌలింగ్తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు’ అని వార్న్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో నైపుణ్యమున్న ఆటగాళ్లకు కొదవలేదన్న వార్న్.. ఆటగాళ్లను కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిల అభీష్టం మేరకే ఎంపిక చేయడం కూడా ఒక మంచి పరిణామమన్నాడు. -
‘కోహ్లి కంటే వారిద్దరే సమర్ధులు’
ముంబై: కొన్ని అంశాలను లోతుగా అంచనా వేసి చూస్తే ప్రస్తుత ప్రపంచ అత్యత్తుమ క్రికెట్ కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లికి స్థానం ఉండదని అంటున్నాడు ఆసీస్ దిగ్జజ స్పిన్నర్ షేన్వార్న్. కేవలం కోహ్లి నాయకుడు మాత్రమేనని పేర్కొన్న వార్న్.. సమర్థుడైన సారథి ఎంతమాత్రం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్కు కోహ్లినే తగిన సారథిగా వార్న్ పేర్కొన్నాడు. అదే సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆసీస్ తాత్కాలిక టెస్టు కెప్టెన్ టిమ్ పైన్లను సమర్థులైన కెప్టెన్లని వార్న్ అన్నాడు. (రాజస్తాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్గా షేన్ వార్న్) ఆదివారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయకత్వం, సమర్దవంతమైన సారథ్యం, లీడర్ ఆప్ ద టీమ్ తదితర అంశాల గురించి మాట్లాడిన వార్న్.. ఈ మూడింటిని వేర్వేరుగా చూడాలన్నాడు. ప్రస్తుతం ఒక జట్టుకు కోహ్లి ఒక బెస్ట్ లీడర్గా మాత్రమే ఉన్నాడని విశ్లేషించాడు. తాను కోహ్లికి పెద్ద అభిమానిగా పేర్కొన్న వార్న్.. గేమ్ పరంగా చూస్తే కోహ్లిని అసాధారణ ఆటగాడిగా తెలిపాడు. ‘ భారత జట్టును కోహ్లి ముందుండి నడిపిస్తున్న తీరు బాగుంది. కానీ సమర్ధవంతంగా జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడు. ఒక జట్టుకు సరైన వ్యూహ రచన చేస్తూ నడిపిస్తున్న ప్రస్తుత కెప్టెన్ల జాబితాలో విలియమ్సన్, టిమ్ పైన్లే కోహ్లి కంటే మెరుగ్గా ఉన్నారు. కోహ్లి కంటే వారిద్దరే సమర్దవంతమైన కెప్టెన్లు అనేది నా అభిప్రాయం’ అని వార్న్ తెలిపాడు. -
రాజస్తాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్గా షేన్ వార్న్
ముంబై: వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్న మెంట్లో పాల్గొనే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. వార్న్ సారథ్యంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు 2008లో ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. 2011 వరకు రాయల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అతను ఆ తర్వాత క్రికెట్కు గుడ్బై చెప్పాడు. గత సీజన్లో రాయల్స్ జట్టుకు వార్న్ మెంటార్గా ఉన్నాడు. మరోవైపు ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇన్నాళ్లు బ్లూ జెర్సీలతో ఆడిన రాయల్స్ జట్టు ఈ సీజన్లో పింక్ జెర్సీలు ధరించనుంది. -
‘ఆ జట్లే వరల్డ్కప్ హాట్ ఫేవరెట్స్’
సిడ్నీ: ఇంకా వరల్డ్కప్ ప్రారంభం కావడానికి దాదాపు మూడు నెలల సమయం ఉండగానే ఏ జట్టు టైటిల్ గెలుస్తుందనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు క్రీడా విశ్లేషకులు వరల్డ్కప్ గెలిచే సత్తా భారత్, ఇంగ్లండ్ జట్లకు మాత్రమే ఉందని స్పష్టం చేయగా, ఆ జాబితాలో ఇప్పుడు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా చేరిపోయాడు. మెగా టైటిల్ను ఎగురేసుకుపోయే జాబితాలో భారత్, ఇంగ్లండ్ జట్లు ముందు వరుసలో ఉన్నాయని పేర్కొన్నాడు. ఈ రెండు జట్లు వరల్డ్కప్కు హాట్ ఫేవరెట్స్గా బరిలో దిగుతున్నాయన్నాడు. ఇక ఆసీస్కు కూడా అవకాశాలు లేకపోలేదని తెలిపాడు. అయితే ఇక్కడ తాను అనుకున్న జట్టుతో ఆసీస్ పోరుకు సిద్ధమైతే వరల్డ్కప్ వేటలో తమ జట్టు కూడా ఫేవరెట్గా ఉంటుందన్నాడు. ‘ఈసారి భారత్, ఇంగ్లండ్ జట్లు ప్రపంచకప్లో హాట్ ఫేవరెట్లుగా టైటిల్ వేటకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు గట్టిపోటీ ఇచ్చే జట్లే. ఇరు జట్లలోనూ మంచి బ్యాట్స్మెన్, బౌలర్లు ఉన్నారు. అయితే ఆసీస్ సెలక్టర్లు వారి బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే ఆసీస్ కప్ గెలవడానికి 100శాతం అవకాశముంది. ప్రధానంగా భారత్, ఇంగ్లండ్లతో పాటు ఆసీస్ కూడా వరల్డ్కప్ గెలిచే అవకాశం ఉంది’ అని షేన్ వార్న్ తెలిపాడు. -
ఐసీసీకి కామన్సెన్స్ ఉందా?: వార్న్
నార్త్సౌండ్: ఇంగ్లండ్తో రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం విధించడాన్ని ఆసీస్ స్పిన్ దిగ్జజం షేన్ వార్న్ తీవ్రంగా తప్పుబట్టాడు. అసలు హోల్డర్పై నిషేధం విధించే ముందు ఐసీసీ కనీసం కామన్సెన్స్ లేకండా వ్యవహరించిందంటూ మండిపడ్డాడు. ఈ విషయంలో ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేయాల్సిందిగా హోల్డర్కు సూచించాడు. ‘ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మూడు రోజులు మించి జరగలేదు. అటువంటప్పుడు స్లో ఓవర్రేట్ అంటూ హోల్డర్పై మ్యాచ్ నిషేధం విధించడం నిజంగానే చెత్త నిర్ణయం. ఇక్కడ ఐసీసీ కనీసం ఇంగితం కూడా లేకుండా వ్యవహరించింది. హోల్డర్.. ఐసీసీ నిర్ణయంపై అప్పీల్కు వెళ్లు’ అని వార్న్ పేర్కొన్నాడు. అదే సమయంలో ఇంగ్లండ్పై 10 వికెట్లతో రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ను ఇంకో మ్యాచ్ ఉండగానే కైవసం చేసకున్న విండీస్ను వార్న్ అభినందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ ఎంత బలమైనదో మరోసారి నిరూపించిందన్న వార్న్... ఇదే విజయ పరంపరను భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్నాడు. ఇక్కడ చదవండి: వెస్టిండీస్ ఎన్నాళ్లకెన్నాళ్లకు.. -
ఆసీస్ క్రికెటర్ వల్లే కుల్దీప్కు వికెట్లు దక్కాయి
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తుంది. ఏమైనా అద్భుతాలు జరిగితే డ్రా అయ్యే అవకాశం తప్పా.. కోహ్లి సేనకు ఓటమి అవకాశమే లేదు. దీంతో కంగారూల గడ్డపై తొలి చారిత్రక సిరీస్ విజయానికి టీమిండియా చేరువలో ఉంది. సిడ్నీ టెస్టులో అనూహ్యంగా ఇద్దరు స్పిన్నర్లతో దిగాలన్న సారథి విరాట్ కోహ్లి వ్యూహం ఫలించింది. చివరి టెస్టు మూడో రోజు ఆటలో స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా- కుల్దీప్ యాదవ్లు ఆసీస్ ఆటగాళ్లను కట్టడి చేశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో సారథి టిమ్ పైన్ వికెట్ను సాధించిన కుల్దీప్ మూడో రోజు ఆటలో హైలెట్గా నిలిచాడు. పైన్ను అద్భుతమైన బంతితో బోల్తాకొట్టించాడు. అయితే ఈ క్రెడిట్ ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్కే చెందుతుందని భారత మాజీ ఆటగాడు మురళీ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. మూడో రోజు ఆట ముగిసిన అనంతరం చర్చా కార్యక్రమంలో మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. ‘అడిలైడ్ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి టెస్టు ప్రారంభానికి ముందు కుల్దీప్కు వార్న్ సలహాలు ఇచ్చాడు. కుల్దీప్ బౌలింగ్ యాక్షన్లోని చిన్న లోపాలను అతడికి వివరించాడు. ఆ సలహాలు సిడ్నీ టెస్టులో కుల్దీప్కు ఎంతగానో ఉపయోగపడ్డాయని భావిస్తున్నా. టిమ్ పైన్ ఔట్ తర్వాత ఇది స్పష్టమైంది’ అంటూ కార్తీక్ వివరించాడు. ఇక మైకెల్ క్లార్క్ కూడా కుల్దీప్ బౌలింగ్పై ప్రశంసల జల్లు కురిపించాడు. Kuldeep Yadav beat Tim Paine all ends up to pick up the 6th Aussie wicket! 😍 LIVE on SONY SIX and SONY TEN 3.#ChhodnaMat #AUSvIND #SPNSports pic.twitter.com/ae5Y7Q6OGf — SPN- Sports (@SPNSportsIndia) 5 January 2019 -
ఇది చాలా జుగుప్సాకరం: షేన్ వార్న్
హైదరాబాద్: ఇంగ్లండ్లోని ఓ పాఠశాలలో సిరియా శరణార్థిపై మరో విద్యార్థి దాడికి సంబంధించిన ఘటనపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విద్యార్థుల గొడవకు సంబంధించిన వీడియోపై తాజాగా వార్న్ ట్వీట్ చేశారు. పశ్చిమ యార్క్షైర్లోని హడ్డర్ ఫీల్డ్లోని ఓ కమ్యూనిటీ స్కూల్లో సిరియా విద్యార్థి జమాల్పై స్థానిక విద్యార్థి దాడికి దిగాడు. జమాల్ అనే విద్యార్థిపై మరో విద్యార్థి చేయి చేసుకోవడంతో పాటు అతడి నోట్లో నీళ్లు పోస్తూ ఆనందాన్ని పొందాడు. ఈ సంఘటనను పక్కనే ఉన్న మరో విద్యార్థి వీడియో తీయడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ‘ పిల్లలకు ఇళ్లు తర్వాత అత్యంత భద్రతనిచ్చేది పాఠశాలలే. కానీ ఓ సిరియా శరణార్థిపై దాడి జుగుప్పాకరమైనది. దీనిపై వెంటనే ఏదో ఒక చర్య తీసుకోండి’అంటూ వార్న్ ట్వీట్ చేశారు. ఇక దీనిపై విచారణ చేపట్టామని పశ్చిమ యార్క్షైర్ పోలీసులు తెలిపారు. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్కూలు నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నా పేరు కైఫ్... కైఫ్... కైఫ్!
న్యూఢిల్లీ: తొలి ఐపీఎల్లో షేన్ వార్న్ నాయకత్వంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టు అనూహ్యంగా రాణించి చాంపియన్గా నిలిచింది. చెప్పుకోదగ్గ స్టార్లు లేని, కుర్రాళ్లతో నిండిన ఆ టీమ్ను వార్న్ సమర్థంగా నడిపించి, వారి ద్వారా అద్భుత ఫలితాలు రాబట్టాడు. తన ఆత్మ కథ ‘నో స్పిన్’లో 2008 ఐపీఎల్ సీజన్కు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. భారత జట్టు తరఫున ఆడిన క్రికెటర్ల ఆలోచనలు ఎలా ఉంటాయో, తాము ఇతరులకంటే ఎక్కువ అనే భావనతో ఎలా ప్రవర్తిస్తారో చెబుతూ అతను మొహమ్మద్ కైఫ్తో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. మునాఫ్ పటేల్, రవీంద్ర జడేజాల గురించి కూడా అతను ఇందులో ప్రస్తావించాడు. ‘రాజస్తాన్ జట్టు హోటల్లోకి ప్రవేశించిన తర్వాత అందరు ఆటగాళ్లు ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోయారు. అయితే కైఫ్ మాత్రం రిసెప్షన్ వద్దకు వెళ్లి నా పేరు కైఫ్ అని చెప్పాడు. రిసెప్షనిస్ట్ తనకు తెలుసన్న చెప్పిన తర్వాత మరోసారి నా పేరు కైఫ్ అని గుర్తు చేశాడు. నేను దగ్గరకు వెళ్లి ఏమైనా సమస్య ఉందా అని అడిగితే అవును, నా పేరు కైఫ్ అని మూడోసారి అదే మాట అన్నాడు. నువ్వెవరో వారికి తెలుసు కానీ ఇబ్బందేమిటని నేనే అడిగాను. అందరిలాగే నాకు చిన్న గది ఇచ్చారు. నా పేరు కైఫ్ అని అతను మళ్లీ చెప్పాడు! దాంతో అతని ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. నేను సీనియర్ను, భారత్ తరఫున ఆడిన వాడిని, కాబట్టి నాకు పెద్ద గది కావాలనేది అతని మాటల్లో ధ్వనించింది. ఎక్కువగా ఆలోచించవద్దని, అందరు ఆటగాళ్లకు ఒకే తరహా గది ఇచ్చారని, నేను ఎక్కువ మందితో కలవాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద గది ఇచ్చారని నేను చెప్పడంతో అతను వెళ్లిపోయాడు. భారత సీనియర్ ఆటగాళ్లు ప్రత్యేక ప్రాధాన్యత కోరుకుంటారని నాకు అర్థమైంది’ అని వార్న్ నాటి ఘటన గురించి వెల్లడించాడు. మునాఫ్ పటేల్ను అతని వయసు గురించి అడిగితే ‘అసలు వయసా లేక ఐపీఎల్ వయసా’ అని అతను తిరిగి ప్రశ్నించాడని... చివరకు ఐపీఎల్ ప్రకారం తనకు 24 ఏళ్లని, అసలు వయసు ఒకవేళ 34 అయినా ఐపీఎల్లో మరిన్ని అవకాశాలు దక్కించుకునేందుకు 24 ఏళ్లే చెబుతానంటూ తనలోని హాస్య చతురతను బయట పెట్టాడని వార్న్ గుర్తు చేసుకున్నాడు. జడేజాను క్రమశిక్షణలో పెట్టేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని కూడా దిగ్గజ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. ప్రతీసారి జడేజా ఆలస్యంగా వచ్చేవాడని, ఒకసారి హోటల్కు తిరిగి వెళుతుండగా మధ్యలో బస్సు నుంచి దించేసి నడుస్తూ రమ్మని శిక్ష విధించడంతో ఆ తర్వాత అంతా మారిపోయిందని వార్న్ వెల్లడించాడు. -
నాకు భారీ మొత్తంలో లంచం ఆఫర్ చేశాడు: వార్న్
లండన్: ఇటీవల ఆసీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా స్వార్థపరడంటూ తన ఆత్మకథ ‘నో స్పిన్’లో పేర్కొన్న షేన్ వార్న్.. మరో సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తన క్రికెట్ కెరీర్లో ప్రత్యర్థి జట్టు క్రికెటర్ ఒకరు భారీ మొత్తం లంచం ఇవ్వడానికి యత్నించిన విషయాన్ని వార్న్ వెల్లడించాడు. ప్రధానంగా క్రికెటర్లతో ఉన్న రిలేషన్షిప్స్తో పాటు తన వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు గురించి పేర్కొన్న వార్న్.. 1994-95 సీజన్లో పాకిస్తాన్తో కరాచీలో జరిగిన టెస్టు మ్యాచ్లో సలీం మాలిక్ లంచాన్ని ఆఫర్ చేసినట్లు తెలిపాడు. తాను ఆఫ్ స్టంప్ బంతులు వేయాలని కోరిన మాలిక్, అందుకు దాదాపు రెండు లక్షల యూఎస్ డాలర్లను ఇవ్వబోయాడన్నాడు. మరొక సందర్భంలో ఒక బుకీ కూడా తనను కొనుగోలు చేయడానికి యత్నించాడన్నాడు. అతను శ్రీలంకకు చెందిన బుకీగా వార్న్ పేర్కొన్నాడు. ఒకానొక సమయంలో ఐదువేల డాలర్లను తాను పొగొట్టుకున్నానని, దాన్ని సహచర క్రికెటర్ మార్క్ వా ఇవ్వబోతే వద్దనన్నాడు. ఇదిలా ఉంచితే, తన వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి వార్న్ వివరించాడు. ‘ నా వైవాహిక జీవితం గురించి చెప్పుకోవాలంటే సిమోన్తో 10 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకడం ఒకటైతే, అటు తర్వాత ఎలిజిబెత్ హర్లీతో తెగతెంపులు. ఈ రెండే నా వివాహ జీవితంలో చవిచూసిన చేదు జ్ఞాపకాలు. వారితో విడిపోయినప్పటికీ ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్గానే ఉన్నాం’ అని వార్న్ పేర్కొన్నాడు. చదవండి: స్టీవ్ వా స్వార్థపరుడు -
స్టీవ్ వా స్వార్థపరుడు
లండన్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వాపై అతని మాజీ సహచరుడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ తీవ్రంగా విరుచుకు పడ్డాడు. స్టీవ్ స్వార్థపరుడని వార్న్ తన ఆత్మకథ ‘నో స్పిన్’లో పేర్కొన్నాడు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలో అప్పటి తన కెప్టెన్తో ఎదురైన చేదు అనుభవాలను వార్న్ వివరించాడు. తనను అవమానకరంగా తప్పించేందుకు స్టీవ్ ప్రయత్నించాడని అందులో పేర్కొన్నాడు. 1999లో స్టీవ్ వా తనను తప్పించేందుకే నిర్ణయించుకున్నాడని చెప్పాడు. ‘వెస్టిండీస్తో టెస్టు సిరీస్ కోసం ఫామ్ సాకుతో నన్ను తప్పిస్తున్నట్లు వా చెప్పాడు. అప్పుడు నేను వైస్ కెప్టెన్ను. నా బౌలింగ్ కాస్త సాధారణంగా ఉంది. ఇదే అదనుగా కెప్టెన్ స్టీవ్ వా సెలక్షన్ మీటింగ్లో నన్ను తప్పించాల్సిందేనని పట్టుబట్టాడు. కోచ్ జెఫ్ మార్‡్ష, సెలక్టర్ అలెన్ బోర్డర్ వారించినా వినిపించుకోలేదు’ అని వార్న్ ఆ అనుభవాన్ని వివరించాడు. తన మెరుగైన ప్రదర్శనపై ఒక్కోసారి స్టీవ్ అసూయ చెందేవాడని ఈ ఆత్మకథలో పేర్కొన్నాడు. నాటి సహచరులు లాంగర్, హెడెన్, గిల్క్రిస్ట్లు కూడా తనను ఇరికించే ప్రయత్నం చేశారని వార్న్ తన పుస్తకంలో రాశాడు. ఆసీస్ క్రికెటర్లకు బ్యాగీ గ్రీన్ (టీమ్ క్యాప్) పెద్ద గౌరవం. వింబుల్డన్ మ్యాచ్కు నేను దానిని ధరించి వెళ్లేలా వారు ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. అదే చేస్తే బ్యాగీ గ్రీన్ను అవమానించినట్లుగా మళ్లీ నాపై దుష్ప్రచారం చేసేలా అది వారికి ఉపయోగపడేది’ అని వార్న్ చెప్పాడు. స్టీవ్వా సారథ్యంలో ఆడిన 38 టెస్టుల్లో 26.57 సగటుతో 175 వికెట్లు తీసిన వార్న్... 1999 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
వాళ్లే అత్యుత్తమ బ్యాట్స్మెన్: లారా
సాక్షి, స్పోర్ట్స్: ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్మన్గా టీమిండియా సారథి విరాట్ కోహ్లి నిలుస్తాడని వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ 2019 ప్రచారంలో భాగంగా న్యూయార్క్లో వున్న లారా పలు విషయాలు క్రికెట్ అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుత క్రికెట్లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్మెన్ ఎవరంటే తను కోహ్లి, ఇంగ్లండ్ టెస్టు సారథి జోయ్ రూట్లకే ఓటు వేస్తానని స్పష్టంచేశాడు. ఇంగ్లండ్-టీమిండియాల మధ్య జరగుతున్న సిరీస్లో వీరిద్దరూ పోటిపడి పరుగులు చేస్తున్నారని కొనియాడాడు. ఇక 29 ఏళ్ల టీమిండియా సారథి పరుగుల సునామీ తగ్గటం లేదన్నాడు. గత పర్యటను చేదు అనుభవాలను చెరిపివేస్తూ ప్రస్తుత సిరీస్లో అదరగొడుతూ ఇప్పటికే 544 పరుగులు సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. టెస్టుల్లో తాను ఎందుకు నంబర్ వన్ బ్యాట్స్మనో ప్రపంచానికి కోహ్లి చాటి చెప్పాడని వివరించాడు. వార్న్, ముత్తయ్య భయపెట్టారు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీథరన్ బౌలింగ్లో తాను ఇబ్బందులకు గురైన మాట వాస్తవమేనని లారా అంగీకరించాడు. తన క్రికెట్ కెరీర్లో వీరిద్దరి బౌలింగ్ తనను భయపెట్టిందన్నాడు. పక్కా ప్రణాళికతో వారి బౌలింగ్ను ఎదుర్కొడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని వివరించాడు. అంతర్జాతీయ ఒక టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు(400*) సాధించిన లారా స్పిన్ దిగ్గజాల(వార్న్, ముత్తయ్య)కు భయపడ్డానని చెప్పడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒలంపిక్స్లో క్రికెట్ ఉండాలి మూడు గంటల ఆటైన టీ20 క్రికెట్ని ఒలంపిక్స్లో ప్రవేశపెట్టాలని బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. అత్యంత ప్రజాధరణ కలిగిన క్రికెట్ ఒలంపిక్స్లో లేకపోవడం ఆశ్యర్యాన్ని కలిగిస్తుందన్నాడు. అతి త్వరలోనే ఒలంపిక్స్లో క్రికెట్ ఉండాలని ఆశిద్దామని పేర్కొన్నాడు. నాణ్యమైన క్రికెట్ను ఆడాలనుకునే దేశాలు మాత్రమే లాంగ్ ఫార్మట్ క్రికెట్ను ప్రోత్సహిస్తాయని ఓ ప్రశ్నకు సమాధానంగా లారా వివరించాడు.