sikkim
-
ఆదాయపన్ను కట్టని ఏకైక భారత రాష్ట్రం
ఏటా బడ్జెట్ వస్తుందంటే చాలు.. తమకు ఏమైనా ఊరట లభిస్తుందేమోననే ఆశ వేతన జీవుల్లో కనిపిస్తుంది. ఆదాయపన్నులో ఏమైనా రాయితీలు కల్పించారా అనే లెక్కల్లో మునిగిపోతారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మనదేశంలో పన్ను చెల్లించే ఉద్యోగుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు బడ్జెట్ రోజున ఐటీ శ్లాబ్(IT Slabs)ల గురించి ఆరా తీస్తారు. అయితే, దేశం మొత్తం ఈ లెక్కలతో బిజీగా ఉన్నా.. ఒక్క రాష్ట్రంలోని ప్రజలు మాత్రం తమకేం సంబంధం లేనట్టుగా ఉంటారు. ఎందుకంటే వారు ఆదాయపన్ను అనేదే కట్టరు. అదేంటి పన్ను కట్టకుంటే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అనే డౌట్ వస్తుందా? అవును ఆ వెసులుబాటు ఇచ్చిందే కేంద్రం. ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటో తెలుసా?.. సిక్కిం. 330 ఏళ్లకుపైగా రాచరిక రాజ్యంగా స్వతంత్రంగా ఉన్న సిక్కిం(Sikkim).. 1975లో 22వ రాష్ట్రంగా భారత్లో విలీనమైంది. అయితే ఆ సమయంలో సిక్కిం ఓ షరతు పెట్టింది. తాము భారత్లో విలీనమైనా.. తాము అంతకుముందు తమ పాలనలో ప్రజలకు పన్నులు విధించలేదని, ఇప్పుడు కూడా ఆ విధానాన్నే అనుసరిస్తామని స్పష్టం చేసింది. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించడంతో సిక్కిం ప్రజలకు ఆదాయ పన్ను కట్టే భారం తప్పింది. ఈమేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఎఫ్ ప్రకారం సిక్కింకు ప్రత్యేక హోదా ఉంటుంది.తలసరి ఆదాయంలో నంబర్వన్..దేశంలో సేంద్రియ రాష్ట్రంగా గుర్తింపు పొందిన సిక్కిం తలసరి ఆదాయం కూడా అదుర్స్. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.5,88,000 తలసరి ఆదాయంతో దేశంలోనే సిక్కిం టాప్లో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరం జాతీయ సగటులో సిక్కిం తలసరి ఆదాయం 320 శాతంగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇక సిక్కిం తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) దేశ తలసరి జీడీపీ కంటే మూడు రెట్లు ఎక్కువ.ఇదీ చదవండి: ఏఐను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వ విభాగాలుఎవరికి మినహాయింపు ఉంటుంది?ఇదంతా విన్న తర్వాత అర్జెంటుగా సిక్కిం వెళ్లిపోతే ఈ ఐటీ బాధలేమీ ఉండవు అనుకుంటున్నారా? అలాంటి పప్పులేమీ ఉడకవు.. 1975 కంటే ముందు నుంచి అక్కడ ఉన్న సిక్కిం నివాసితులకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వలస వెళ్లినవారికి ఇది వర్తించదు. ఈ మేరకు 2008లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను(Income Tax) చట్టంలో సెక్షన్ 10 (26 ఏఏఏ)ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక వ్యక్తి సిక్కింకి చెందిన వారు అయి ఉండి ఏ రకంగానైనా ఆదాయం సంపాదిస్తున్నట్లయితే పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కంపెనీ వేరే రాష్ట్రంలో ఉండి డివిడెండ్లు, సెక్యూరిటీల ద్వారా ఆదాయం వస్తే కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. -
టీ20 క్రికెట్లో పెను సంచలనం.. హార్దిక్ పాండ్యా లేకుండానే ప్రపంచ రికార్డు!
టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. కృనాల్ పాండ్యా కెప్టెన్సీలోని బరోడా జట్టు 349 పరుగులతో ప్రపంచ రికార్డు సాధించింది. భారత దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా ఈ ఫీట్ నమోదు చేసింది. ఇండోర్ వేదికగా సిక్కింపై ఈ మేర పరుగుల విధ్వంసం సృష్టించింది.ఆది నుంచే దంచికొట్టారుఈ నేపథ్యంలో జింబాబ్వే పేరిట ఉన్న ఆల్టైమ్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన బరోడా.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. హార్దిక్ పాండ్యా బ్యాట్తో రంగంలోకి దిగకుండానే.. బరోడా ప్లేయర్లు తమ వీరబాదుడుతో ఈ అరుదైన ఘనతను జట్టు ఖాతాలో వేశారు.కాగా ఇండోర్లోని ఎమరాల్డ్ హై స్కూల్ గ్రౌండ్లో గురువారం సిక్కిం జట్టుతో బరోడా తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బరోడాకు ఓపెనర్లు శశ్వత్ రావత్(16 బంతుల్లో 43), అభిమన్యు సింగ్(53) అదిరిపోయే ఆరంభం అందించారు.ఊచకోత.. 15 సిక్సర్లువీళ్లిద్దరు మెరుపు ఇన్నింగ్స్ ఆడితే.. వన్డౌన్లో వచ్చిన భాను పనియా మాత్రం తుఫాన్ ఇన్నింగ్స్తో సిక్కిం బౌలింగ్ను ఊచకోత కోశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 51 బంతులు ఎదుర్కొని ఏకంగా 134 పరుగులతో అజేయంగా నిలిచాడు. భాను పనియా ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు ఉంటే.. సిక్సర్లు ఏకంగా 15 ఉండటం విశేషం.మిగతా వాళ్లలో శైవిక్ శర్మ(17 బంతుల్లో 55), వికెట్ కీపర్ విష్ణు సోలంకి(16 బంతుల్లో 50) బ్యాట్తో వీరవిహారం చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన బరోడా జట్టు 349 పరుగులు చేసింది. సిక్కిం బౌలర్లలో పల్జోర్ తమాంగ్, రోషన్ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. తరుణ్ శర్మ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే రికార్డు బ్రేక్కాగా టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్లో భాగంగా జింబాబ్వే ఇటీవల గాంబియాపై 344-4 స్కోరు చేసింది. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో ఇదే అత్యధిక స్కోరు. అయితే, ఈ రికార్డును ఇప్పుడు బరోడా అధిగమించింది.చదవండి: Ind vs Aus 2nd Test: పింక్ బాల్ టెస్టు.. అడిలైడ్ పిచ్ వారికే అనుకూలం! క్యూరేటర్ కీలక వ్యాఖ్యలు -
భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం..ప్రకృతి అందాలకు నెలవు..!
భారతదేశంలో రైల్వేస్టేషన్ లేని రాష్ట్రం ఉందంటే నమ్ముతారా..?. అరచేతిలో ప్రపంచాన్ని చూసేలా టెక్నాలజీ శరవేగంగా దూసుకుపోతున్న రోజుల్లో ఇంకా అలాంటి రాష్ట్రం కూడా ఉందా..? అని ఆశ్చర్యపోకండి. అయితే ఆ ప్రాంతం ప్రకృతి ఒడిలో ఉన్న భూతల స్వర్గంలా అందంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి రాష్ట్రానికి పర్యాటకుల తాకిడి తప్పక ఉంటుంది కదా..! అంటారేమో..అయినప్పటికీ రైల్వే నిర్మాణ సాధ్యం కాలేదు. ఈ ఆధునాత కాలంలో టెక్నాలజీనే శాసించే స్థాయిలో ఉండి కూడా ఎందుకు ఆ రాష్ట్రంలో ఈ రైల్వే నిర్మాణం సాధ్యం కాలేదని సందేహాలు మెదులుతున్నాయి కదూ..! ఇంకెందుకు ఆలస్యం అది ఏ రాష్ట్రం, దాని కథాకమామీషు ఏంటో తెలుసుకుందామా..!.భారతదేశం అత్యంత ప్రశంసనీయమైన రైల్వే నెట్వర్క్ను కలిగి ఉన్న దేశం. అలాంటి దేశంలో రైల్వే లైన్లు లేని రాష్ట్రం కూడా ఉందంటే.. నమ్మశక్యంగా లేదు కదా!. ఈ రాష్ట్రం మన హిమాలయాల ఒడిలో ఉంది. సినిమా వాళ్ల ఫేమస్ లోకేషన్ పాయింట్ కూడా ఇదే. మంచు కొండల్లో పాట అనగానే మనవాళ్లు చకచక వచ్చి వాలిపోయే రాష్టం. అదేనండి సిక్కిం. ఈ రాష్ట్రం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రకృతి రమ్యతకు ఎలాంటి వారైనా పరవశించిపోవాల్సిందే. అంతలా మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రానికి ఎందుకు రైల్వే సౌకర్యం లేదంటే..అక్కడ ప్రతికూల వాతావరణమే ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ భూభాగంలో అనేక రకాల ప్రకృతి సవాళ్లు ఉన్నాయి. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మిచడం సాధ్యం కాలేదు.అదీగాక ఇక్కడ తరుచుగా కొండచరియలు విరిగిపడతాయి. అక్కడ ఆ ప్రమాదం అత్యంత సర్వసాధారణం. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇంతవరకు రైల్వే నిర్మాణం ఏర్పాట్లు చేయడం సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి క్రమంగా మారనుంది. ఇటీవలే మోదీ అక్కడ రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఈ సిక్కిం రంగ్పో స్టేషన్ను టూరిజం, డిఫెన్స్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని చెప్పారు రైల్వే మేనేజర్ అమర్జీత్ అగర్వాల్. ఇక్కడ సరస్సుల ప్రసిద్ధ ఆకర్షణ. తప్పక సందర్శించాల్సిన టూరిజం స్పాట్లు కూడా ఈ సరస్సులే. రత్నాల వలే భూమిలో పొదిగి ఉన్న ఆ సరస్సుల సహజ సౌందర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ రాష్ట్రంలో సందర్శించాల్సిన సరస్సులివే..క్రోస్ లేక్, ఉత్తర సిక్కింక్రోస్ లేక్, స్థానికంగా కల్పోఖ్రి సరస్సు అని పిలుస్తారు. ఇది ఉత్తర సిక్కింలో దాచిన రత్నం. 4,260 మీటర్ల ఎత్తులో టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. చోళము సరస్సు, ఉత్తర సిక్కించోళము సరస్సు, ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి. ఇది 5,330 మీటర్ల ఎత్తులో ఉత్తర సిక్కింలోని ఇండో-చైనా సరిహద్దులో ఉంది.కథోక్ సరస్సు, పశ్చిమ సిక్కింపశ్చిమ సిక్కింలోని ప్రసిద్ధ పట్టణం యుక్సోమ్ సమీపంలో ఉన్న కథోక్ సరస్సు ప్రశాంతమైన ప్రదేశం. ఈ అందమైన సరస్సు చుట్టూ పచ్చదనంతో నిండి ఉంది. ఇది సిక్కిం మొదటి చోగ్యాల్ (రాజు) చారిత్రక పట్టాభిషేకంతో ముడిపడి ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం.(చదవండి: శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని) -
మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే..
సిక్కింలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో కడుపు నొప్పితో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంటే.. నొప్పి తగ్గకపోగా.. ఎక్కువైంది. మళ్లీ ఏ ఆసుపత్రిలో చూపించుకున్నా ప్రయోజనం లేకపోయింది. అలా 12 ఏళ్ల పాటు నొప్పిని భరిస్తూనే ఉంది. తాజాగా ఈనెలలో మరోసారి ఆసుపత్రికి వెళ్లగా.. కడుపు నొప్పికి గల కారణం తెలిసి కుటుంబం షాక్కు గురైంది. సదరు మహిళ కడుపులో గత 12ఏళ్లుగా కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.అసలేం జరిగిదంటే.. 45 ఏళ్ల మహిళ 2012లో గాంగ్టక్లోని సర్ థుటోబ్ నామ్గ్యాల్ మెమోరియల్ హాస్పిటల్లో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంది. ఈ తరువాత ఊడా ఆమెకు కడుపులో నొప్పి కొనసాగుతూనే ఉంది. చాలా మంది వైద్యులను సంప్రదించి మందులు ఇచ్చినప్పటికీ నొప్పి తగ్గలేదు. తిరిగి వస్తూనే ఉంది. ఇలా పదేళ్లకుపైగా బాధపడుతూనే ఉంది. అక్టోబర్ 8న, ఆమె మళ్లీ ఎస్టీఎన్ఎమ్ ఆసుపత్రికి వెళ్లింది. ఎక్స్-రేలో ఆమె కడుపులో శస్త్రచికిత్స కత్తెర ఉన్నట్లు బయటపడింది. 12 క్రితం అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్న సమయంలో వైద్యులు ఆమె కడపులో ఓ కత్తెరను పెట్టి మర్చిపోయినట్లు తేలింది.అయితే ఇన్నేళ్లుగా డాక్టర్లు ఆమె కడుపులో కత్తెర ఉందన్న విషయం కనిపెట్టలేకపోవడం గమనార్హం. తాజాగా వైద్య నిపుణుల బృందం వెంటనే మళ్లీ ఆమెకు ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే విషయం బయటకు పొక్కడంతో ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ.. హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కాలువలో సిక్కిం మాజీ మంత్రి మృతదేహం
గాంగ్టక్: సిక్కిం మాజీ మంత్రి ఆర్సీ పౌడ్యాల్ (80) మృతదేహం పశ్చిమ బెంగాల్లో దొరికింది. సిలిగురి సమీపంలోని తీస్థా కాలువలో మంగళవారం మృతదేహం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. చేతి వాచ్, ధరించిన దుస్తుల ఆధారంగా ఆయన్ను గుర్తించారు. మృతదేహం తీస్థా నదిలో కొట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. పౌడ్యాల్ జూలై 7న తన స్వస్థలమైన పాక్యోంగ్ జిల్లా చోటాసింగ్టామ్లో ఇంటి నుంచి సోదరి వద్దకు బయల్దేరి తిరిగి రాలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి గాలించారు. 9 రోజుల తరువాత ఆయన మృతదేహం లభించింది. పౌడ్యాల్ మృతి పట్ల సీఎం తమాంగ్ సంతాపం వ్యక్తం చేశారు. -
సిక్కింలో వర్ష బీభత్సం.. చిక్కుకుపోయిన పర్యాటకులు
సిక్కింలో వర్ష బీభత్సం నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. బుధవారం రాత్రి ఉత్తర సిక్కింలో 220 మి.మీకు మించిన వర్షం కురిసింది. దీంతో తీస్తాలో వరదలు సంభవించాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. తీస్తా నదిలో నీటిమట్టం పెరగడంతో ఒడ్డున ఉన్న ఇళ్లలోకి భారీగా నీరు చేరింది.వాతావరణం అనుకూలించిన అనంతరం పర్యాటకులను ఇక్కడి నుంచి తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. రోడ్డు మరమ్మతులకు ఐదు నుంచి ఆరు రోజులు పట్టవచ్చని సమాచారం. ఉత్తర సిక్కింలో శుక్రవారం కూడా భారీ వర్షం నమోదయ్యింది. ఈ విపత్తు బారిన పడి మృతిచెందినవారి సంఖ్య ఆరుకు చేరింది. గురువారం ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు గల్లంతయ్యారు.సిక్కింలోని సంక్లాంగ్ ప్రాంతంలో వంతెన కొట్టుకుపోవడంతో చుంగ్తాంగ్, లాచుంగ్ ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విపత్తు పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బాధిత ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితులపై సమాచారం సేకరించి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన పర్యాటకులను ప్రత్యేక విమానంలో తరలించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ భూషణ్ పాఠక్ తెలిపారు. #WATCH | One person dead, five missing and houses damaged due to heavy rain in Mangan, Sikkim (Video source: SSP Mangan) pic.twitter.com/lo7iD8tAFH— ANI (@ANI) June 13, 2024 -
ఎమ్మెల్యేగా సీఎం సతీమణి ప్రమాణం.. 24 గంటల్లోనే రాజీనామా ఎందుకంటే?
గ్యాంగ్టక్: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణ కుమారి రాయ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.కాగా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ తరఫున నామ్చి-సింగితాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణ కుమారి రాయ్ విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అనూహ్యంగా ఆమె మరుసటి రోజే(గురువారం) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక, కృష్ణ కుమారి రాజీనామాను సిక్కిం స్పీకర్ ఎంఎన్ షేర్పా ఆమోదించినట్టు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ తెలిపారు.అయితే, కృష్ణ కుమారి రాయ్ రాజీనామాపై సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నా జీవిత భాగస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించింది. ఎస్కేఎం పార్టీ పార్లమెంటరీ కమిటీ అభ్యర్థన మేరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఆమె తన పదవి నుంచి వైదొలగినట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె మాకు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ కామెంట్స్ చేశారు. Sikkim Chief Minister Prem Singh Tamang’s wife Krishna Kumari Rai resigns as MLA,a day after taking oath. pic.twitter.com/asimdk98Uh— KGFChandra (@FieldsKolar) June 13, 2024 -
Sikkim: ఎస్కేఎం శాసనసభాపక్ష నేతగా తమాంగ్
గ్యాంగ్టక్: సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్కేఎం) శాసనసభా పక్ష నేతగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ అసెంబ్లీలోని 32 సీట్లకు గాను 31 సీట్లను కైవసం చేసుకోవడం తెల్సిందే. ఆదివారం రాత్రి సీఎం తమాంగ్ అధికార నివాసంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎస్కేఎం సెక్రటరీ జనరల్ అరుణ్ ఉప్రెటి శాసనసభా పక్ష నేతగా తమాంగ్ పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యే సోనమ్ లామా బలపరిచారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి తమాంగ్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. -
సిక్కింలో ఎస్కేఎం
గాంగ్టక్: సిక్కిం శాసనసభ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) సంచలన విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో 32 స్థానాలకు గాను ఏకంగా 31 తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. ఎస్కేఎం అధినేత, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీకి దిగి రెండింటా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకున్న ఎస్కేఎం ఈసారి క్లీన్స్వీప్ చేయడం విశేషం. పోలైన మొత్తం ఓట్లలో 58.28 శాతం సాధించింది! 2019 దాకా 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన విపక్ష సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఎస్డీఎఫ్ అధ్యక్షుడు, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ అనూహ్య ఓటమి చవిచూశారు. బీజేపీ, కాంగ్రెస్ అయితే ఖాతాయే తెరవలేదు! 31 సీట్లలో పోటీ చేసిన బీజేపీకి కేవలం 5.18 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్కైతే 0.32 శాతం ఓట్లే వచ్చాయి. భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెపె్టన్, ఎస్డీఎఫ్ ఉపాధ్యక్షుడు బైచుంగ్ భూటియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే దిల్లీరామ్ థాపా కూడా ఓటమి చవిచూశారు. నామ్చీ జిల్లా బర్ఫుంగ్ నుంచి పోటీ చేసిన భూటియా ఎస్కేఎం అభ్యర్థి డోర్జీ భూటియా చేతిలో ఓటమి చవిచూశారు. డోర్జీకి 8,358 ఓట్లు, భూటియాకు 4,012 ఓట్లు లభించాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే భూటియా ఎస్డీఎఫ్లో చేరారు.మోదీ అభినందనలు ఎస్కేఎంకు, సీఎం తమాంగ్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు. బీజేపీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రధానికి తమాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.టీచర్ నుంచి సీఎం దాకా తమాంగ్ ఆసక్తికర ప్రస్థానం ప్రేమ్సింగ్ తమాంగ్. సిక్కింలో ఎస్కేఎం క్లీన్స్వీప్ వెనుక ఉన్న శక్తి. 56 ఏళ్ల తమాంగ్ వ్యక్తిగత చరిష్మాతోపాటు పరిపాలనాదక్షుడిగా ఆయనకున్న పేరు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఘన విజయానికి కారణమయ్యాయి. తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లిదండ్రులు కాలూసింగ్ తమాంగ్, ధన్మాయ తమాంగ్. పశి్చమబెంగాల్లోని డార్జీలింగ్లో కాలేజీ విద్య పూర్తిచేశారు. 1990లో ప్రభుత్వ ఉపాధ్యయుడిగా ఉద్యోగంలో చేరారు. మూడేళ్ల తర్వాత రాజీనామా చేసి ఎస్డీఎఫ్లో చేరారు. 15 ఏళ్లపాటు మంత్రిగా చేశారు. 2009లో నాటి సీఎం పవన్ కుమార్ చామ్లింగ్తో విభేదించి ఎస్డీఎఫ్ నుంచి బయటకొచ్చారు. 2013లో ఎస్కేఎం ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో పార్టీ 10 సీట్లు సాధించింది. అవినీతికి కేసుల్లో అరెస్టయిన తమాంగ్ ఏడాదిపాటు జైల్లో ఉండి 2017లో బయటికొచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 17 సీట్లు గెలిచి రెండేళ్లకే సీఎం అయ్యారు. అనంతరం పార్టీని మరింత పటిష్టపరిచారు. -
తమాంగ్ దెబ్బ.. ‘ఎస్కేఎమ్’ కనీవినీ ఎరుగని విజయం
గ్యాంగ్టక్: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్కేఎం) దూసుకుపోయింది. మొత్తం 32 స్థానాలకు గాను ఏకంగా 31 చోట్ల పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్)ను నామరూపాల్లేకుండా చేసింది. పాతికేళ్లపాటు నిరంతరాయంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీకి 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఓటమిని రుచి చూపించిన ఎస్కేఎం అధ్యక్షుడు, సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి సీఎం కుర్చీని అధిష్టించబోతున్నారు. ఈ ఘన విజయాల వెనుక తమాంగ్ వ్యూహాలు, కృషి దాగి ఉన్నాయి.ప్రేమ్ సింగ్ తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న నేపాలీ దంపతులకు జన్మించారు. డార్జిలింగ్లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. మూడేళ్ల పాటు పాఠాలు బోధించిన తర్వాత సామాజిక సేవపై ఆసక్తి చూపించి రాజకీయం వైపు మళ్లారు. తమాంగ్ను పీఎస్ గోలేగా కూడా పిలుచుకుంటారు.1994లో పవన్ చామ్లింగ్ స్థాపించిన ఎస్డీఎఫ్ చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎస్డీఎఫ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు పలు రకాల మంత్రిత్వశాఖలను నిర్వహించారు.2009 ఎన్నికల తర్వాత తమాంగ్కు ఎస్డీఎఫ్తో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేగా గెలిచినా పవన్ చామ్లింగ్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రి పదవికి బదులు నామినేటెడ్ పదవి ఇచ్చారు. దీనిని తిరస్కరించిన తమాంగ్, చామ్లింగ్ బంధుప్రీతి, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించి రాజకీయ గురువుపైనే తిరుగుబాటు చేశారు. 2009 డిసెంబర్ 21న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎస్డీఎఫ్పై నిప్పులు చెరిగారు. చివరికి 2013లో ఎస్కేఎం పేరుతో పార్టీని స్థాపించి తాజా గెలుపుతో రెండోసారి అధికారం చేపట్టబోతున్నారు. -
సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఘన విజయం
గ్యాంగ్టక్: సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) ఘన విజయం సాధించింది. ఇటిప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎస్కేఎం 29 స్థానాల్లో గెలిచింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మేజిక్ ఫిగర్ 17 స్థానాలు.విపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి కేవలం ఒకే స్థానంలో గెలిచి.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రెండు పార్టీలు మొత్తం 32 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక బీజేపీ అక్కడ 31 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కొన్ని పార్టీలతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసింది. ఆ పార్టీ ఖాతా తెరవలేదు. -
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: 44 సీట్లలో బీజేపీ విజయం
Counting Updates అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ఘన విజయంఅరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 44 సీట్లలో విజయం2 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లలో గెలుపు10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమేజిక్ ఫిగర్ స్థానాలు 30పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 సీట్లలో గెలుపునేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1 స్థానం గెలుపు , 2 ముందంజ ఇండిపెండెంట్లు 3 గెలుపు సిక్కింలో అధికార కాంత్రికారి మోర్చా ఘన విజయంసిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ 26 సీట్లలో విజయం5 స్థానాల్లో సీకేఎం లీడింగ్మేజిక్ ఫిగర్ 17 సీట్లుసిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1 స్థానం గెలుపుసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ ప్రేమ్ సింగ్ తమంగ్ రెనోక్ స్థానంలో 7044 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ దూసుకుపోతోంది11 సీట్లలో సీకేఎం పార్టీ విజయం20 స్థానాల్లో సీకేఎం లీడింగ్సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక్కస్థానంలో లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది26 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీనేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 18 సీట్లలో విజయం సాధించింది28 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజపీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 స్థానాల్లో లీడింగ్10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీ#WATCH | Celebration begins at the BJP office in Itanagar as the party is set to return to power in Arunachal Pradesh The ruling BJP crossed the halfway mark; won 17 seats leading on 29. National People's Party is leading on 6 seats. The majority mark in the State Assembly is… pic.twitter.com/GEEfXggrEO— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిసిక్కిం క్రాంతికారి మోర్చా రెండు స్థానాల్లో గెలుపు29 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానంలో లీడింగ్లో ఉంది.#WATCH | Sikkim: Pintso Namgyal Lepcha from the Sikkim Krantikari Morcha (SKM) wins from the Djongu Assembly constituency He says, "I thank all the voters who supported me and made me win with a huge margin. I also thank my party president who gave me the ticket..." pic.twitter.com/BHVMQJvwB2— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్కేఎంసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ తమంగ్ గోలే.. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమంగ్ గోలే భార్య కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్లో ముందంజలో ఉన్నారు.Sikkim CM and Sikkim Krantikari Morcha (SKM) chief Prem Singh Tamang, who is contesting the Assembly elections from Rhenock and Soreng-Chakung seats, is leading on both the seats.SKM crossed the halfway mark; leading on 29 seats. The majority mark in the Sikkim Assembly is 17… pic.twitter.com/1NIYCEmihZ— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న కమలం10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమిగిలిన 50 స్థానాల్లో 29 చోట్ల కమలం హవామొత్తం 39 సీట్లలో బీజేపీ ఆధిక్యం8 చోట్ల లీడింగ్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకాంగ్రెస్ ఒకచోట మాత్రమే ఆధిక్యంసిక్కింలో మరోసారి అధికారం దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చాఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్కేఎంసిక్కింలో క్లీన్ స్వీప్ చేసే దిశగా క్రాంతికారి మోర్చా పార్టీమొత్తం 32 సీట్లకుగాను 29 స్థానాల్లో ఎస్కేఎం ఆధిక్యంఒక స్థానంలో ఎస్ డీఎఫ్ లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్నేషల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్ ఫిగర్ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) 8 సీట్లలో లీడింగ్పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో లీడింగ్ఇండిపెండెంట్ ఒక స్థానంలో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎస్కేఏం భారీ లీడింగ్లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒక స్థానంలో లీడింల్ ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్లో కౌంటింగ్ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) 2 సీట్లలో లీడింగ్లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు. -
Election Commission of India: నేడే అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు
ఈటానగర్/గ్యాంగ్టక్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పారీ్ట–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు. -
రామ్లల్లా దర్శనానికి మూడు రాష్ట్రాల గవర్నర్లు!
గుజరాత్, సిక్కిం, మేఘాలయ గవర్నర్లు రామ్లల్లాను దర్శించుకునేందుకు అయోధ్య చేరుకున్నారు. వారికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్వాగతం పలికింది. ఈ ముగ్గురు గవర్నర్లు వేర్వేరు సమయాల్లో రామ్లల్లాను దర్శించుకున్నారు. మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్ తమ పూర్వీకుల స్వస్థలమైన అజంగఢ్ నుండి రోడ్డు మార్గంలో ముందుగా అయోధ్య చేరుకున్నారు. అనంతరం రామజన్మభూమిలోని ఆలయంలో కొలువైన రామ్లల్లాను దర్శించుకున్నారు. అలాగే సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య విమానాశ్రయం నుంచి నేరుగా సర్క్యూట్ హౌస్కు చేరుకున్నారు. అక్కడి భద్రతా సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ శ్రీరామ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తరువాత వారు రామ్లల్లాను దర్శించుని పూజలు చేశారు. సర్క్యూట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య రామ్లల్లాను చూశాక ఎంతో ఆనందం కలిగిందన్నారు. -
రెండు స్థానాల్లో పోటీ చేయనున్న సిక్కిం సీఎం
సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) పార్టీ.. రాష్ట్రంలో వున్న మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానానికి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. లోక్సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ 'ఇంద్ర హంగ్ సుబ్బా' పేరును ప్రకటించింది. అయితే సిక్కిం ముఖ్యమంత్రి 'ప్రేమ్ సింగ్ తమాంగ్' (Prem Singh Tamang) రాబోయే ఎన్నికలలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య 'కృష్ణ కుమారి రాయ్' నామ్చి-సింఘితాంగ్ స్థానంలో ప్రతిపక్ష SDF అధ్యక్షుడు పవన్ కుమార్ చామ్లింగ్తో పోటీపడనుంది. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల నుంచి ప్రేమ్ సింగ్ తమంగ్ పోటీ చేయనున్నారు. దీనిపైన SKM పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుందని అసెంబ్లీ స్పీకర్ అరుణ్ కుమార్ ఉప్రేటి (Arun Upreti) గ్యాంగ్టక్లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. -
అసెంబ్లీ ఎన్నికలు: ఆ రెండు రాష్ట్రాల కౌంటింగ్ తేదీల్లో మార్పు
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ తేదీల్లో మార్పులు చేసింది సీఈసీ. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ను సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కంటే రెండు రోజుల ముందే జూన్ 2వ తేదీన చేపట్టనున్న ఈసీ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ రెండో తేదీన ముగియనున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక.. ఏప్రిల్ 19న మొదటి విడతలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలో 32 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తాజా మార్పు ప్రకారం ఫలితాలు జూన్ రెండున వెల్లడికానున్నాయి. -
జనంపైకి పాల ట్యాంకర్ .. ముగ్గురు మృతి, 150 మందికి గాయాలు!
సిక్కింలోని గ్యాంగ్టక్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపోల్ ప్రాంతంలో ఒక పాల ట్యాంకర్ రోడ్డుపైనున్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 150 మంది గాయపడ్డారు. వీరిలో 30 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన సిక్కింలోని రాణిపూల్లోని తాంబ్లా గేమ్ ఫెయిర్లో ఆదివారం రాత్రి 7.13 గంటలకు జరిగింది. ఆ సమయంలో రాణిపూర్ టాటా మైదానం జనంతో కిటకిటలాడింది. ఈ సమయంలో హఠాత్తుగా సిక్కిం మిల్క్ యూనియన్ ట్యాంకర్ రోడ్డుపై ఉన్న నాలుగు కార్లను ఢీకొని నేరుగా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో పలువురు ట్యాంకర్ కింద నలిగిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు 150 మంది గాయపడ్డారు. సిక్కిం పోలీసులు క్షతగాత్రులను రాణిపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో జనం హాహాకారాలు మిన్నంటాయి. CCTV footage of Sikkim Milk Union truck accident at Ranipool Mela, Sikkim pic.twitter.com/wStmjBfilp — Jyoti Mukhia (@jytmkh) February 10, 2024 -
బ్యాట్తో రాణించిన నితీశ్ రెడ్డి.. ఆంధ్ర 188 ఆలౌట్
Ranji Trophy 2023-24- Assam vs Andhra, Elite Group B- దిబ్రూగఢ్: అస్సాం జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 72.1 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును షోయబ్ మొహమ్మద్ ఖాన్ (63; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (49; 4 ఫోర్లు) ఏడో వికెట్కు 113 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆంధ్ర జట్టు చివరి 4 వికెట్లను ఐదు పరుగుల తేడాలో కోల్పోయింది. అస్సాం బౌలర్లలో రాహుల్ సింగ్ (6/46), ముక్తార్ (2/45), ఆకాశ్ సేన్గుప్తా (2/37) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. మెరిసిన తనయ్, తన్మయ్, మిలింద్ సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే నాగాలాండ్, మేఘాలయ జట్లపై ఇన్నింగ్స్ విజయాలు నమోదు చేసిన హైదరాబాద్ వరుసగా మూడో విజయంపై కన్నేసింది. సిక్కిం జట్టుతో శుక్రవారం మొదలైన మూడో మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 302 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిక్కిం జట్టును హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ (6/25), సీవీ మిలింద్ (4/30) హడలెత్తించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్ తనయ్, మీడియం పేసర్ మిలింద్ దెబ్బకు సిక్కిం తొలి ఇన్నింగ్స్లో 27.4 ఓవర్లలో కేవలం 79 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు సాధించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (125 బంతుల్లో 137; 11 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీ చేయగా... రాహుల్ సింగ్ గహ్లోత్ (64 బంతుల్లో 83; 10 ఫోర్లు, 5 సిక్స్లు), రోహిత్ రాయుడు (111 బంతుల్లో 75; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తన్మయ్, రాహుల్ తొలి వికెట్కు 18 ఓవర్లలో 132 పరుగులు జో డించడం విశేషం. తన్మయ్, రోహిత్ రాయుడు రెండో వికెట్కు 138 పరుగులు జత చేశారు. ప్రస్తుతం కెప్టెన్ తిలక్ వర్మ (66 బంతుల్లో 70 బ్యాటింగ్; 5 ఫోర్లు, 3 సిక్స్లు), చందన్ సహని (8 బ్యాటింగ్; 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. -
తొలిరోజే దంచికొట్టిన హైదరాబాద్ బ్యాటర్లు.. 302 రన్స్ ఆధిక్యం
Hyderabad vs Sikkim Day 1 - Hyderabad lead by 302 runs: టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ రంజీల్లో తిరిగి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ-2024 సీజన్లో హైదరాబాద్ కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్.. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ ఆరంభమైన తర్వాత దేశవాళీ జట్టుకు దూరమయ్యాడు. మొహాలీ వేదికగా అఫ్గన్తో జరిగిన తొలి టీ20లో వన్డౌన్లో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో 22 బంతులు ఎదుర్కొన్న తిలక్ 26 పరుగులు సాధించాడు. ఇక రెండో టీ20తో విరాట్ కోహ్లి పునరాగమనం చేసిన నేపథ్యంలో తిలక్పై వేటు పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు ఈ హైదరాబాద్ బ్యాటర్. ఈ క్రమంలో శుక్రవారం నాటి హైదరాబాద్- సిక్కిం మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు. 79 పరుగులకే సిక్కిం ఆలౌట్ ఈ మ్యాచ్లో సిక్కిం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, హైదరాబాద్ బౌలర్లు టి.త్యాగరాజన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సీవీ మిలింద్ 4 వికెట్లతో సత్తా చాటాడు. వీరిద్దరి దెబ్బకు సిక్కిం 79 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(137), గహ్లోత్ రాహుల్ సింగ్(83) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వన్డౌన్ బ్యాటర్ రోహిత్ రాయుడు సైతం 75 పరుగులతో రాణించాడు. వరుసగా రెండు విజయాలు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ తిలక్ వర్మ 66 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా మరో ఎండ్లో సహకారం అందిస్తున్న చందన్ సహానీ 8 పరుగులు చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి వీరిద్దరు అజేయంగా నిలవగా.. హైదరాబాద్ ఏకంగా 302 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. రంజీ తాజా సీజన్లో ప్లేట్ గ్రూపులో ఉన్న హైదరాబాద్ జట్టు ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లలో విజయాలు సాధించింది. తిలక్(అజేయ సెంచరీ) సారథ్యంలో నాగాలాండ్పై, గహ్లోత్ రాహుల్ సింగ్ కెప్టెన్సీలో మేఘాలయపై గెలుపొందింది. తాజాగా మళ్లీ తిలక్ నేతృత్వంలో ఆడుతున్న హైదరాబాద్ ఈసారి సిక్కింను కూడా ఓడించాలని పట్టుదలగా ఉంది. ఇక రంజీ సీజన్-2024లో హైదరాబాద్కు ఇది మూడో మ్యాచ్! చదవండి: Ranji Trophy 2024: బ్యాట్తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై! -
Agapi Sikkim: ప్రకృతి ఇచ్చిన ప్రేమ కానుక గెలుపు దారి
పెద్ద నగరాలలో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ రిన్జింగ్ భూటియా మనసులో ఏదో లోటు ఉండేది. విశాలమైన ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన రిన్జింగ్ రణగొణ ధ్వనులకు దూరంగా తన మూలాలను వెదుక్కుంటూ సిక్కిం వెళ్లింది. హిమాలయాలలోని అరుదైన మొక్కలతో తయారు చేసే స్కిన్కేర్ ప్రాడక్ట్స్కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ స్టార్టప్తో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. సొంతకాళ్ల మీద నిలబడడానికి పునరావాస కేంద్రాల్లోని మహిళల కోసం ఉచిత వర్క్షాప్లు నిర్వహిస్తోంది. సిక్కింలోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య పుట్టి పెరిగిన రిన్జింగ్ వృత్తిరీత్యా దిల్లీ, బెంగళూరు, కోల్కత్తాలాంటి మహానగరాల్లో గడిపింది. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఏదో లోటుగా అనిపించేది. ప్రకృతి మధ్య తాను గడిపిన కాలాన్ని గుర్తు చేసుకునేది. మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సిక్కిం బాట పట్టింది. ఎంటర్ప్రెన్యూర్ కావాలనే రిన్జింగ్ చిరకాల కల అక్కడ రెక్కలు విప్పుకుంది. ‘ఉద్యోగ జీవితానికి సంబంధించి ఏ లోటు లేకపోయినప్పటికీ పెద్ద నగరాలలో కాలుష్యం, ఇరుకు ప్రదేశాలలో నివసించాల్సి రావడంతో బాగా విసుగెత్తిపోయాను. నా బిడ్డ పచ్చని ప్రకృతి ప్రపంచంలో పెరగాలనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను’ అంటుంది రిన్జింగ్. ఉద్యోగం లేదు కాబట్టి బోలెడంత ఖాళీ సమయాన్ని చర్మ సంరక్షణకు సంబంధించిన పరిశోధనకు కేటాయించింది. ప్రకృతిలోని ఎన్నో వనమూలికల గురించి లోతుగా అధ్యయనం చేసింది. హిమాలయాలలో లభించే అరుదైన మొక్కలతో హ్యాండ్ క్రాఫ్టెడ్ స్కిన్కేర్ ప్రాడక్ట్స్కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ అనే అంకుర సంస్థను ఆరంభించింది. ‘అగాపి’ అనేది గ్రీకు పదం. దీని అర్థం... ప్రేమ. సిక్కింలోని అనేక ప్రాంతాలలో చర్మవ్యాధులకు ఔషధంగా తమ చుట్టుపక్కల ఉండే మొక్కలను ఉపయోగించడం అనేది తరతరాలుగా జరుగుతోంది. ఈ సంప్రదాయమే తనకొక దారి చూపింది. చర్మవ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాల వాడకం పరంపరగా వస్తున్నప్పటికీ వాటి గురించి స్కిన్కేర్ ఇండస్ట్రీకి తెలియదు. బిజినెస్ మోడల్ను డిజైనింగ్ చేసుకున్న తరువాత కబీ అనే ప్రాంతంలో తొలిసారిగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది రిన్జింగ్. ఇరవైమందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాలలో మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది.‘మా వర్క్షాప్లో శిక్షణ తీసుకున్న పదిమందికి పైగా మహిళలు సొంత ప్రాజెక్ట్లు మొదలు పెట్టడం సంతోషంగా అనిపించింది. ఏదో సాధించాలనే పట్టుదల వారిలో కనిపించింది. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను’ అంటుంది రిన్జింగ్. మాదక ద్రవ్యాలు, మద్యవ్యసనంతో శిథిలం అవుతున్న వారికి ఆ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చే సాధనంగా వర్క్షాప్లను ఉపయోగించుకుంటోంది రిన్జింగ్. పునరావాస కేంద్రాల్లో కూడా వర్క్షాప్లు నిర్వహించి వారిలో ఆర్థికస్థైర్యాన్ని నింపింది. మాస్కులు, షాంపులు, స్క్రబ్లు, ఫేషియల్ ఆయిల్... మొదలైనవి ఎన్నో ఉత్పత్తి చేస్తుంది అగాపి సిక్కిం. స్థానిక రకాల కలబంద, జనపనార... మొదలైన వాటిని తమ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగించుకుంటోంది. మొదట సిక్కిం చుట్టుపక్కల నగరాలలో ప్రాడక్ట్స్ను విక్రయించేవారు. ఆ తరువాత బెంగళూరు, కోల్కతాతో పాటు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు మార్కెట్ విస్తరించింది. ‘అగాపి’ చెప్పుకోదగిన బ్రాండ్గా ఎదిగినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోవడం లేదు రిన్జింగ్. స్కిన్ కేర్ సైన్స్కు సంబంధించి ఎప్పటికప్పుడు తన పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంగ్లాండ్లోని ‘ఫార్ములా బొటానికా’కు సంబంధించి ఆన్లైన్ కోర్సులు చేస్తోంది. ప్రాచీన ఔషధాలపై కొత్త వెలుగు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయ ఔషధాలు వెలుగు చూసేలా, ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తోంది రిన్జింగ్. తాను కంపెనీ స్థాపించడమే కాదు ఇతరులు కూడా స్థాపించేలా వర్క్షాప్లు నిర్వహిస్తోంది. ‘ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికింది. అగాపి విజయం నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది’ అంటుంది రిన్జింగ్ భూటియ. -
గల్లంతైన వారిలో 62 మంది సురక్షితం
గ్యాంగ్టక్/జల్పాయ్గురి: సిక్కింలో తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిలో 62 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో, గల్లంతైన వారి సంఖ్య 143 నుంచి 81కి తగ్గిపోయింది. మరోవైపు, వరదల్లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. మరో వైపు, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన 22 మంది ఆర్మీ సిబ్బందిలో మరో రెండు మృతదేహాలు శనివారం బయటపడ్డాయి. దీంతో, ఇప్పటి వరకు 9 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. నాలుగు జిల్లాల్లోని సుమారు 42 వేల మంది ప్రజలపై వరదలు ప్రభావం చూపగా, 1,320 నివాసాలు దెబ్బతిన్నాయని, 13 వంతెనలు కొట్టుకుపోయాయని రాష్ట్ర యంత్రాంగం శనివారం తెలిపింది. తీవ్రంగా గాయపడిన 26 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మంగన్ జిల్లాలోని లచెన్, లచుంగ్ల్లో వరద ముంపులో చిక్కుకున్న సుమారు 3వేల మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకు తరలించేందుకు వైమానిక దళానికి చెందిన ఎంఐ–17 హెలికాప్టర్లతో ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించలేదని అధికారులు చెప్పారు. చుంగ్థంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు హెలికాప్టర్ ద్వారా అత్యవసరాలను సరఫరా చేశారు. సింగ్టమ్, బర్దంగ్, రంగ్పోల్లోని వారిని రక్షించే పనుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తలమునకలై ఉన్నాయి. అనూహ్య వరదలతో చుంగ్థంగ్ పట్టణం 80 శాతం మేరకు తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రభావిత మాంగన్ జిల్లాను సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ శనివారం సందర్శించారు. సహాయక కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో కూడిన అధికారుల కేంద్ర బృందం ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాలకు పంపుతున్నట్లు కేంద్ర మంత్రి అజయ్కుమార్ మిశ్రా చెప్పారు. ఇలా ఉండగా, వచ్చే అయిదు రోజులపాటు మంగన్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ 150 మంది తృటిలో తప్పించుకున్నారు తీస్తా నదికి సమీపంలోని సిక్కిం– పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో రైల్వే సొరంగం పనుల్లో పాల్గొంటున్న సుమారు 150 మంది కార్మికులు ఆకస్మిక వరదల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎగువ నుంచి భారీగా వరద ముంచుకొస్తున్న సమాచారాన్ని అధికారులు కాలింపాంగ్ జిల్లా జీరో మైల్ ప్రాంతం వద్ద ఉన్న ప్రైవేట్ రైల్వే కాంట్రాక్ట్ సంస్థకు చేరవేశారు. సంస్థ అధికారులు వెంటనే ఒక సెక్యూరిటీ గార్డును హుటాహుటిన కార్మికులుండే క్యాంపునకు పంపించారు. పగలంతా పనులు చేసి, అలసిపోయి క్యాంపుల్లో నిద్రిస్తున్న కార్మికులను గార్డు అప్రమత్తం చేశారు. దాదాపు 150 మంది కార్మికులు ఉన్నఫళంగా విలువైన పత్రాలు, దగ్గరున్న డబ్బు, కట్టుబట్టలతో అక్కడి నుంచి అడ్డదారిన బయలుదేరారు. దాదాపు 20 నిమిషాల అనంతరం ప్రధాన రహదారికి వద్దకు చేరుకున్నారు. అప్పటికే వరద దిగువనున్న వారి క్యాంపును మింగేయడం కళ్లారా చూసి కార్మికులు షాక్ అయ్యారు. అప్పటికే అక్కడున్న ట్రక్కుల్లో 2 కిలోమీటర్ల దూరంలోని రాంబి బజార్లో ఏర్పాటు చేసిన క్యాంప్నకు చేరుకున్నారు. వీరంతా అస్సాం, బిహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు. -
సిక్కిం వరదల్లో గల్లంతైన టాలీవుడ్ సీనియర్ నటి..!
ఇటీవల సిక్కింలో అనూహ్యంగా సంభవించిన వరదల్లో అలనాటి నటి సరళ కుమారి ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ఆచూకీని కనిపెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (ఇది చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) 1983లో మిస్ ఆంధ్రప్రదేశ్గా ఎంపికైన సరళ కుమారి.. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన దాన వీర శూరకర్ణ, ఆ తర్వాత సంఘర్షణ లాంటి చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఆమె నివాసముంటున్నారు. ఈ నెల అక్టోబరు 2న ఆమె తన మిత్రులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన గురించి అమెరికాలో ఉంటున్న కుమార్తె నబితకు కూడా ఆమె సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సిక్కింలో ఆకస్మాత్తుగా వచ్చిన వరదల తర్వాత సరళ కుమారి ఆచూకీ గల్లంతవ్వడంతో ఆమె కుమార్తె నబిత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరు 3న చివరిసారిగా నేను అమ్మతో మాట్లాడినట్లు నబిత తెలిపింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదని.. వార్తల్లో వరదల గురించి తెలుసుకున్నా.. ఆర్మీ నంబర్లకు ప్రయత్నించినా అవీ కూడా పనిచేయడం లేదు. దయచేసి మా అమ్మను కనిపెట్టండి అంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఆర్మీ జవాన్లు సైతం గల్లంతయ్యారు. (ఇది చదవండి: మూగ అమ్మాయితో సినిమాలా?.. నీకేమైనా పిచ్చా అన్నారు: అభినయ తండ్రి ఎమోషనల్!) -
సిక్కిం కకావికలం.. అంతకంతకూ పెరుగుతున్న మరణాలు
ఆకస్మిక వరదలు, క్లౌడ్బర్స్ట్తో సిక్కిం రాష్ట్రం కకావికలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన కుంభవృష్టి వర్షం, చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో తీస్తా నదికి భారీ వరద పోటెత్తింది. దీంతో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా నదిలో నీటిమట్టం పెరగి వరద నీరు ఉప్పొంగి ప్రవహించింది. ఈ వరదల్లో ఆర్మీ జవాన్లు సహా వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్వీరామంగా గాలిస్తున్నాయి. పెరుగుతున్న మరణాలు సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. వరదల్లో చిక్కుకొని మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం 53కు చేరింది. వీరిలో ఏడుగురు జవాన్లు కూడా ఉన్నారు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్లోని తీస్తా నదిలో ఇప్పటి వరకు 27 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ఇంకా 140 మంది ఆచూకీ తెలియడం లేదు. రాష్ట్రంలో 1,173 ఇళ్లు దెబ్బతిన్నాయని, రద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 2,413 మంది ప్రజలను రెస్క్యూ బృందాలు రక్షించినట్లు సిక్కిం ప్రభుత్వం పేర్కొంది. జల విలయానికి 13 వంతెనలు ధ్వంసమయ్యాయని, రోడ్ల కనెక్టివీటి తెగిపోయిందని తెలిపింది. అయితే 6,875 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, రాష్ట్రవ్యాప్తంగా 22 సహాయ శిబిరాల్లో వీరంతా ఆశ్రయం పొందుతున్నాదరని తెలిపింది. తీస్తా-V జల విద్యుత్ కేంద్రానికి దిగువన ఉన్న అన్ని వంతెనలు మునిగిపోయి వరదలో కొట్టుకుపోయాయని పేర్కొంది. ఉత్తర సిక్కింలో కమ్యూనికేషన్కు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించింది. సీఎం ఉన్నతస్థాయి సమావేశం వదరల నేపథ్యంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ తమాంగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు, పునరుద్దరణ పనులపై సమీక్షించారు. చుంగ్తంగ్ వరకు రోడ్డు కనెక్టివిటీని ప్రారంభించేందుకు చర్యలుచేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగా నుంచి టూంగ్ వరకు వీలైనంత త్వరగా రహదారిని నిర్మించాలని పేర్కొన్నారు. కుంభవృష్టి వర్షాలు, వరదలతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు. #सिक्किम में बदलफाड़ तबाही के अभी कई लोग लापता, एक्शन में सीएम प्रेम सिंह तमांग, नागा गांव मंगन में बाढ़ प्रभावित इलाकों और राहत शिविरों में पहुंचकर स्थिति का लिया जायजा।#Sikkim #sikkimflood @PSTamangGolay #SikkimCloudburst @BJP4Sikkim pic.twitter.com/uboYFaWOMC — हिंद उवाच (@TheHindUVAACH) October 7, 2023 నదిలో కొట్టుకొస్తున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తీస్తా నది వరదల్లో ఆర్మీకి చెందిన పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కొట్టుకొని వచ్చిన ఆయుధం పేలి ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడటం కలవరపెడుతోంది. దీంతో నదిలో కొట్టుకువచ్చే పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులను ముట్టుకోవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సిక్కిం ప్రభుత్వం కూడా అడ్వైజరీ జారీ చేసింది. నదీ తీరం వెంట వాటిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను సైన్యం రంగంలోకి దింపింది. The rescue of 68 people stranded for 3 days in the Glacier Lake Outburst Flood (GLOF) in North Sikkim by @ITBP_official Himveers needs to be appreciated for their heroic efforts. Respect! 👏👍👌💐👏 @ndmaindia @NDRFHQ https://t.co/m0mDOz0Gzs — Vinod Menon (@nvcmenon) October 7, 2023 మరో అయిదు రోజులు వర్షాలు భారత వాతావరణ శాఖ రాబోయే ఐదు రోజులలో మంగన్ జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. లాచెన్, లాచుంగ్ లోయలలో ప్రతికూల వాతావరణం కారణంగా గత రెండు రోజులుగా Mi-17 హెలికాప్టర్లతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను నిర్వహించడానికి చేస్తున్న అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని భారత వైమానిక దళం వెల్లడించింది. వాతావరణం అనుకూలిస్తే నేడు ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్లు తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపింది. రూ. 44 కోట్లు విడుదల రాష్ట్రానికి మరోవైపు చుంగ్తాంగ్ డ్యామ్ తెగిపోవడానికి గత ప్రభుత్వాలు నాసిరకంగా నిర్మించడమే కారణమని ఆరోపించారు. చుంగుతాంగ్ డ్యామ్ నిర్మాణం సరైన పద్ధతిలో జరగలేదని, ఈ కారణంగానే డ్యామ్ కొట్టుకుపోయి ఇంతటి విపత్తుకు దారి తీసిందని తెలిపారు. ఇక వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డిడీర్ఎఫ్) కేంద్ర వాటా నుంచి ముందస్తుగా ₹ 44.8 కోట్ల విడుదలకు హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT)ని కూడా ఏర్పాటు చేసింది. -
సిక్కిం వరదలు.. 26కు చేరిన మరణాలు
గ్యాంగ్టక్: సిక్కింలోని తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరి్వరామంగా గాలిస్తున్నాయి. ఇప్పటి దాకా 26 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో ఏడుగురు జవాన్ల మృతదేహాలున్నాయి. బర్దంగ్ ఏరియాలో సంభవించిన వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైన విషయం తెలిసిందే. జవాన్లు సహా మొత్తం 143 మంది జాడ తెలియాల్సి ఉంది. జల దిగ్బంధానికి గురైన మొత్తం 2,413 మందిని రక్షించి, సహాయక శిబిరాలకు తరలించామని అధికారులు చెప్పారు. బర్దంగ్ ప్రాంతంలో ఇసుక మేటను తొలగించి ఆయుధ డిపోను వెలికితీసినట్లు రక్షణ శాఖ తెలిపింది. అన్వేషణ కార్యకలాపాల్లో స్పెషల్ రాడార్లు, జాగిలాలను రప్పించామని తెలిపింది. సింగ్టమ్–బర్దంగ్ మధ్య ధ్వంసమైన రహదారిని వాహనాల రాకపోకలకు వీలుగా పునరుద్ధరించినట్లు తెలిపింది. ఇలా ఉండగా, రాష్ట్రానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని సీఎం తమాంగ్ చెప్పారు. అడ్వాన్సుగా రూ.44.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా చెప్పారన్నారు. ఆకస్మిక వరద నష్టం అంచనాకు హోం శాఖ, ఇతర విభాగాల అధికారులతో కూడిన బృందాన్ని కూడా పంపుతామని అమిత్ షా తెలిపినట్లు సీఎం వెల్లడించారు. -
సిక్కింలో భారీ ప్రాణనష్టం.. డ్యామ్ నిర్మాణంపై సీఎం సంచలన కామెంట్స్
గ్యాంగ్టక్: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 40కి చేరుకోగా.. వారిలో 22 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా, 22 మంది ఆర్మీ అధికారులు సహా గల్లంతైన వారి సంఖ్య 98కు పెరిగింది. ఈ నేపథ్యంలో వరదలపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాసి రకం నిర్మాణం కారణంగా సిక్కింలోని చుంగుతాంగ్ డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. కాగా, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్యామ్ నిర్మాణం సరైన పద్ధతిలో జరగలేదు. ఫలితంగా ఇది కొట్టుకుపోయింది. రాష్ట్రం ఉత్తరభాగంతో మిగిలిన ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. క్లౌడ్ బర్ట్సింగ్ కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో డ్యామ్ పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిపారు. 1200 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ కూడా వరదల కారణంగా కొట్టుకుపోయినట్టు స్పష్టం చేశారు. ఇది సిక్కిం రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు ధ్వంసమయ్యాయి. తీస్తాపై 13 వంతెనలు కొట్టుకుపోయాయని తమాంగ్ వివరించారు. #SikkimFlashFloods | Sikkim CM #PremSinghTamang said that the previous Sikkim Democratic Front government should be blamed for the tragedy of their sub-standard workhttps://t.co/bhUCNypX0B — Mint (@livemint) October 6, 2023 ఇదిలా ఉండగా.. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు సైజు గత 30 ఏళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా చుంగుతాంగ్ డ్యామ్కు గండి పడిన సమయంలో లోనాక్ సరస్సు నుంచి పూర్తి నీరు డ్యామ్లోకి చేరలేదు. ఈ సరస్సులో ఇంకా నీరు ఉన్నట్లు శాటిలైట్ ఫొటోలు వివరిస్తున్నారు. ఈ నీరు కూడా డ్యామ్లోకి చేరితే పెనువిపత్తు చోటు చేసుకునేదని నిపుణులు చెబుతున్నారు. సిక్కింలో ఇలాంటి సరస్సులు మొత్తం 14 వరకు ఉన్నాయి. వీటిల్లో కుంభవృష్టిలు, భారీ మంచు పెళ్లలు విరిగిపడినా.. ఇవి గట్లు తెంచుకొని ఊళ్లపై పడతాయి. లోనాక్ సరస్సు ప్రదేశం సెస్మిక్ జోన్లో ఉండటంతో భూకంపాల కారణంగా ఇది లీకయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. VIDEO | "There have been damages worth Rs 1,000 crore. We cannot give exact details about damages, it will be revealed once a committee is formed and it completes its analysis. Our first priority is to save those who are stranded and provide them immediate relief," Sikkim CM… pic.twitter.com/cUcgjHdChO — Press Trust of India (@PTI_News) October 6, 2023 మరోవైపు.. ఆకస్మిక వరదలతో చుంగ్థంగ్ డ్యామ్ ధ్వంసం కావడం.. విద్యుత్ మౌలిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతినడంతోపాటు నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగన్ జిల్లాలోని 8 వంతెనలు సహా మొత్తం 11 బ్రిడ్జీలు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి పదో నంబర్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. చుంగ్థంగ్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. తీస్తా నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నందున, పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ఎస్ఎస్డీఎంఏ కోరింది. సిక్కింలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన వేల మంది పర్యాటకుల్లో విదేశీయులూ ఉన్నారు. Tista Dam near Chungthang , North sikkim. Dam at loc was swept away, which cauSes 50 feet hike in tista river. Massive water force has swept away everything in his route. Massive destruction in area reported. Urgent help needed #sikkimfloods #ANI #Aajtak #Ndtv #PMO pic.twitter.com/R2PkruFf9p — Anand Mishra (@Anand55587175) October 6, 2023 -
సిక్కిం వరదల్లో నిజామాబాద్ ఆర్మీ జవాన్ మృతి
సాక్షి, నిజాబాద్: సిక్కింలో మంగళవారం అర్ధరాత్రి సంభవించిన వరదల్లో చిక్కుకొని చనిపోయిన ఆర్మీ జవాన్లలో నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్పల్లికి చెందిన నీరడి గంగాప్రసాద్ ఉన్నట్టు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. గురువారం మృతదేహం లభ్యం కాగా, పోస్టుమార్టం కోసం పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గిరి జిల్లా ఆస్పత్రికి ఆర్మీ అధికారులు తరలించారు. శుక్రవారం స్వగ్రామానికి మృతదేహం చేరుకునే అవకాశాలున్నా యి. ఎమ్మెల్యే షకీల్ సమకూర్చిన విమానంలో మృతుడి తమ్ముడు సుధాకర్, మరో బంధువు దిలీప్ బయలుదేరి వెళ్లి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పశ్చి మబెంగాల్లోని బినాగుడి ఆర్మీ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్న గంగాప్రసాద్ శిక్షణలో భాగంగా 20 రోజుల క్రితం సిక్కింలోని జులుక్ ప్రాంతానికి వెళ్లి తీస్తా నది వరదల్లో గల్లంతయ్యారు. గంగాప్రసాద్ది నిరు పేద దళిత కుటుంబం. గంగాప్రసాద్కు భార్య శిరీష, ఇద్దరు కుమారులు హర్ష(6), ఆదిత్య(3) ఉన్నారు. -
సిక్కిం వరదలు..18కి చేరిన మరణాలు
గ్యాంగ్టక్: సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. అదేవిధంగా, 22 మంది ఆర్మీ అధికారులు సహా గల్లంతైన వారి సంఖ్య 98కు పెరిగింది. ఉత్తర సిక్కింలో తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలోని ఎల్హొనాక్ సరస్సు ఉప్పొంగి సంభవించిన వరదల్లో గల్లంతైన మరో ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో మరణాల సంఖ్య 18కు చేరుకుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్ఎస్డీఎంఏ) గురువారం బులెటిన్లో తెలిపింది. ఇప్పటివరకు 2,011 మందిని కాపాడినట్లు పేర్కొంది. గల్లంతైన 22 మంది జవాన్ల ఆచూకీ కోసం దిగువ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వివరించింది. ఇలా ఉండగా, వరదల్లో కొట్టుకువచ్చిన 18 మృతదేహాల్లో నాలుగు జవాన్లవని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ఇవి సిక్కింలో గల్లంతైన జవాన్ల మృతదేహాలా కాదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలతో చుంగ్థంగ్ డ్యామ్ ధ్వంసం కావడం.. విద్యుత్ మౌలిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతినడంతోపాటు నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగన్ జిల్లాలోని 8 వంతెనలు సహా మొత్తం 11 బ్రిడ్జీలు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి పదో నంబర్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. చుంగ్థంగ్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. తీస్తా నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నందున, పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ఎస్ఎస్డీఎంఏ కోరింది. సిక్కింలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన వేల మంది పర్యాటకుల్లో విదేశీయులూ ఉన్నారు. -
సిక్కిం కుంభవృష్టి.. 102 మంది మిస్సింగ్
గాంగ్టక్: భారీ వర్షాలు, వరదలతో సిక్కిం రాష్ట్రం వణికిపోతోంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో తీర ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 14 మంది పౌరులు మరణించారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 102 మంది గల్లంతయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. వారి ఆచూకీ కనిపెట్టేంందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరో 25 మంది క్షతగాత్రులు సహా వరదల్లో చిక్కుకున్న 45 మందిని రక్షించామని తెలిపాయి. ⚡️⚠️ 𝐄𝐍𝐃 𝐓𝐈𝐌𝐄 𝐒𝐂𝐄𝐍𝐀𝐑𝐈𝐎⚠️⚡️ 𝐃𝐞𝐯𝐚𝐬𝐭𝐚𝐭𝐢𝐧𝐠 𝐟𝐥𝐨𝐨𝐝 𝐢𝐧 𝐒𝐢𝐤𝐤𝐢𝐦,𝐈𝐧𝐝𝐢𝐚 As many as 10 civilians have died and 82 people, including 22 Army personnel, are missing after a cloudburst over the Lhonak Lake in north Sikkim caused it to overflow,… pic.twitter.com/rBOrPhUjkK — {Matt} $XRPatriot (@matttttt187) October 5, 2023 కూలిన 14 వంతెనలు సింగ్తామ్ వద్ద వరద ప్రవాహంలో మొత్తం 23 మంది ఆర్మీ జవాన్లు కొట్టుకుపోగా బుధవారం సాయంత్రం నాటికి ఓ సైనికుడిని సహాయక బృందాలు రక్షించాయి. రాష్ట్రంలో 14 వంతెనలు కూలిపోయాయి. వివిధ ప్రాంతాల్లో దాదాపు 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత వరద బీభత్సం ప్రారంభమైంది. బుధవారం చుంగ్థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత భీతావహంగా మారిందని తెలియజేశాయి. सिक्किम में सेना के 23 जवान लापता। उत्तरी सिक्किम में अचानक बादल फटने से तीस्ता नदी में बाढ़ आ गई। अचानक आई इस बाढ़ के कारण सेना के 23 जवान लापता हो गए हैं। खोज एवं बचाव अभियान जारी है। ईश्वर से सभी की कुशलता के लिए प्रार्थना 🙏🏽#sikkimflood#IndianArmy#TeestaRiver#Sikkim pic.twitter.com/Gy7Nv1ooZP — JAGDISH PALIWAL (@JAGDISH_BAP) October 5, 2023 లోతట్టు ప్రాంతాలు జలమయం రాజధాని గాంగ్టక్కు 30 కిలోమీటర్ల దూరంలోని సింగ్తామ్ ఉక్కు వంతెన బుధవారం తెల్లవారుజామున పూర్తిగా కొట్టుకుపోయిందంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు నీట మునిగాయి. రహదారులపై రాకపోకలు స్తంభించాయి. సిక్కిం రాష్ట్రాన్ని దేశంలోని ఇతర భూభాగంతో అనుసంధానించే పదో నెంబర్ జాతీయ రహదారి పలుచోట్ల పూర్తిగా ధ్వంసమైంది. People being rescued and taken to a safe shelter. They didn’t have any say in large infrastructure project, but pay the price of the disaster. #Sikkim pic.twitter.com/KdKu3yIOdT — Aparna (@chhuti_is) October 4, 2023 జనం అప్రమత్తంగా ఉండాలని సూచన వర్షాలు, వరద విలయాన్ని సిక్కిం ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. మాంగాన్, గాంగ్టక్, పాక్యోంగ్, నామ్చీ జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 8 దాకా సెలవు ప్రకటించింది. ఉత్తర బెంగాల్కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. తీస్తా నది ప్రవాహ ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చుంగ్తాంగ్లోని తీస్తా స్టేజ్ 3 డ్యామ్ వద్ద పనిచేస్తున్న దాదాపు 14 మంది కార్మికులు ఇప్పటికీ టన్నెల్లో చిక్కుకొని ఉన్నారు. చుంగ్తాగ్, ఉత్తర సిక్కింలో చాలా వరకు మొబైల్ నెట్వర్క్లు, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లకు అంతరాయం ఏర్పడింది.. చుంగ్తాంగ్లోని పోలీస్ స్టేషన్ కూడా ధ్వంసం అయ్యింది. #earthquake #GayatriJoshi #SikkimCloudburst #SanjaySinghArrested #ElvishYadav #AishwaryaRai #ChampionsLeague 14 Dead, 102 Missing In Sikkim Flash Flood, Missing Armyman Rescued Over 3,000 tourists are feared stranded, said a government official. The Army said it has rescued… pic.twitter.com/AleFmJgiL3 — shakir Berawala (@shakirBerawala) October 5, 2023 -
వరదలో కొట్టుకుపోయిన 23 మంది ఆర్మీ సిబ్బంది..
-
సిక్కింలో ఆకస్మిక వరదలు.. గల్లంతైన జవాన్లలో ముగ్గురి మృతదేహాలు లభ్యం
Update: ఆకస్మిక వరదలు సిక్కిం రాష్ట్రాన్ని అల్లాడించాయి. కుండపోత వాన, వరదతో రెండు జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. గల్లంతైన 23 మంది జవాన్లలో ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బది గుర్తించింది. మిగిలిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఒక్కసారిగా భారీ వరదలు ముంచెత్తాయి. లాచెన్లోయలో మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి తీస్తానదిలో అకస్మాత్తుగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో అక్కడి ఆర్మీ శిబిరాలపై వరదల ప్రభావం పడింది. ఊహించని రీతిలో వరదలు పోటెత్తడంతో 23 మంది భారత జవాన్లు గల్లంతైనట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఆర్మీ అధికారుల వాహనాలు కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు పేర్కొంది. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ఈ వరద ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైనదిగా మారింది. దీనివల్ల దిగువకు 15 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. దీంతో అర్ధరాత్రి సమయంలోఈ అకస్మిక వరదలు సంభవించాయి. ఆకస్మిక వరద లాచెన్ లోయలో ఉన్న ఆర్మీపోస్టులకు కూడా నష్టం కలిగించింది. సింగ్తమ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరద తీవ్రతకు 23 మంది సిబ్బంది గల్లంతైనట్లు ఈస్ట్రన్ కమాండ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. Shocking News A sudden #cloudburst over #Lhonak Lake in North #Sikkim led to flooding in Teesta river. In which 23 army soldiers went missing. Search and rescue operations are underway. Praying to God for everyone's well being 🙏🏽 #earthquake #teesta #Elvisha #TejRan pic.twitter.com/k9YdYMtXeh — Rocky Yadav (@YadavYadavrocky) October 4, 2023 తీస్తా నది పొంగి ప్రవహించడంతో సింగ్తమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. పశ్చిమ బెంగాల్ను సిక్కింను కలిపే 10వ నెంబర్ జాతీయ రహదారి పలు చోట్లకొట్టుకుపోయింది. ఆకస్మిక వరదల నేపథ్యంలో చాలా రోడ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. #WATCH | Sikkim: A flood-like situation arose in Singtam after a cloud burst. (Video source: Central Water Commission) pic.twitter.com/00xJ0QX3ye — ANI (@ANI) October 4, 2023 -
చైనీయుడనుకుని సిక్కిం వాసిపై దాడి
బనశంకరి: సిక్కిం రాష్ట్రానికి చెందిన వ్యక్తిని చైనా పౌరునిగా భావించిన కొందరు దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన ఆగస్టు 16న బెంగళూరులోని ఎలక్ట్రానిక్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పశి్చమ సిక్కింలోని రించేస్పాంగ్కు చెందిన దినేశ్ సుబ్బా (31) ఏడు నెలలుగా బెంగళూరులోని ఒక రెస్టారెంటులో పనిచేస్తున్నాడు. 15వ తేదీ రాత్రి స్నేహితుల రూంలో పార్టీ చేసుకుని తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. చైనా వాడికి ఇక్కడేం పని అని దూషిస్తూ ఇనుపరాడ్తో కొట్టారు. తీవ్రంగా గాయపడిన దినేశ్ సుబ్బా రోడ్డుపై పడి ఉండగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
మహిళా అధికారులకు 12 నెలలు ప్రసూతి సెలవులు
గాంగ్టక్: సిక్కిం రాష్ట్ర సివిల్ సర్వీస్ ఆఫీసర్ల అసోషియేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులైన మహిళలకు ఏడాది పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులపాటు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిక్కిం స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్(SSCSOA) సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా సర్వీసు రూల్స్ లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం తమాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పరిపాలనలో అధికార యంత్రాంగం పాత్ర చాలా ముఖ్యమైనదని, రాష్ట్ర ఎదుగుదలకు, అభివృద్ధికి వారు వెన్నుముకగా నిలిచారని అన్నారు. ఇకపై మహిళా అధికారులకు 12 నెలల పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీని వలన విధినిర్వహణలో భాగంగా ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఉండే అధికారులకు కుటుంబంతోనూ పిల్లలతోనూ కొంత సమయం గడిపే అవకాశముంటుందని అన్నారు. అతి త్వరలోనే సర్వీస్ రూల్స్ లో ఈ సవరణలు చేస్తామని చెబుతూ, కొత్తగా ఎంపికైన ఐఏఎస్, సిక్కిం సివిల్ సర్వీసెస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం ప్రస్తుతం 6 నెలలు లేదా 28 వారాల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. ఇప్పుడది సంవత్సరం పాటు పెంచడంతో మహిళా అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: జనం మీకు ఎర్ర జెండా ఊపడం ఖాయం..ప్రధానికి రాజస్థాన్ సీఎం కౌంటర్ -
దేశంలో నేటికీ రైళ్లు నడవని రాష్ట్రం అది.. భారీ నెట్వర్క్ ఉన్నా..
మన దేశంలో ప్రతిరోజూ కొన్ని కోట్లమంది రైలు ప్రయాణం సాగిస్తుంటారు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ కలిగిన వ్యవస్థగా గుర్తింపు పొందింది. నేడు భారతీయరైల్వే దేశంలోని ప్రతీ ప్రాంతానికీ విస్తరించింది. మనం దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ మనకు రైల్వే స్టేషన్ తప్పనిసరిగా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు సాగించేవారు తప్పనిసరిగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. భారతీయ రైల్వే లైన్ పొడవు ఒక లక్షా 15 వేల కిలోమీటర్లు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా రైలులో వెళ్లవచ్చు. నేటికీ రైలు మార్గం లేని రాష్ట్రం అయితే మనదేశంలోని ఒక రాష్ట్రం.. నేటికీ ఎటువంటి రైలు రాకపోకలకు నోచుకోలేదు. ఈ మాట వినగానే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ మాట వినగానే కొందరు దేశంలోని రైలు నడవని రాష్ట్రం కూడా ఉందా అనే ఆలోచనలోపడతారు. అందుకే ఇప్పుడు ఆ రాష్ట్రం ఎక్కడుందో తెలుసుకుందాం. నేటికీ రైల్వే లైన్ లేని రాష్ట్రం సిక్కిం. ఈ రాష్ట్రంలో రైలు అన్నదే కనిపించదు. దేశంలోని రైలు వ్యవస్థలేని రాష్ట్రం ఇదొక్కటే. అత్యంత పెద్ద నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే సిక్కింనకు చేరుకోలేకపోయింది. అయితే ఇప్పుడు అక్కడ అత్యంత వేగంగా రైల్వే లైన్కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. 2024 నుంచి రాష్ట్రంలో రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. -
సిక్కింలో భారీ హిమపాతం.. ఏడుగురు పర్యాటకులు సజీవ సమాధి..
గ్యాంగ్టాక్: మంచుసోయగాలు, ప్రకృతి రమణీయతను చూసేందుకు వచ్చిన పర్యాటకులను ప్రకృతి హిమపాతం రూపంలో కబళించింది. సిక్కింలోని హిమాలయ పర్వతసానువుల్లోని లోయ మార్గం నాథూలా ప్రాంతంలో మంగళవారం సంభవించిన భారీ హిమపాతం ధాటికి ఏడుగురు పర్యాటకులు మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నారు. 11 మంది గాయపడ్డారు. ఐదారు వాహనాలతోసహా దాదాపు 30 మంది మంచు దిబ్బల కింద చిక్కుకున్నారన్న అనుమానాలతో అక్కడ అన్వేషణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్యాంగ్టాక్, నాథూ లాను కలిపే జవహర్లాల్ నెహ్రూ మార్గంలోని 14వ నంబర్ మైలురాయి వద్ద ఉదయం 11.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వద్దన్నా వినకుండా.. ప్రమాదం విషయం తెలియగానే సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) సిబ్బంది, రాష్ట్ర విపత్తు స్పందన దళం, స్థానికులు అక్కడికి చేరుకుని 23 మందిని కాపాడారు. నెహ్రూ మార్గ్లో ఆగిపోయిన 80 వాహనాల్లోని 350 మందికిపైగా పర్యాటకులను సురక్షితంగా వెనక్కి పంపించారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా 13వ నంబర్ మైలురాయి దాటాక సాధారణంగా పర్యాటకులకు అనుమతి ఉండదు. కానీ, పర్యాటకులు ఘటనాస్థలి దాకా తీసుకెళ్లాలని టూర్ ఆపరేటర్లు, డ్రైవర్లను బలవంతపెట్టారని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు. చైనా సరిహద్దు సమీపంలో నాథూ లా మార్గముంది. వాణిజ్య సంబంధ రాకపోకలకు భారత్, చైనాలు వినియోగిస్తున్న మూడు సరిహద్దు పోస్ట్లలో నాథూ లా ఒకటి. సముద్రమట్టానికి 14,450 అడుగుల ఎత్తులోని మంచుమయమైన ఈ ప్రాంతాలను చూసేందుకు ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలిరావడం తెల్సిందే. గ్యాంగ్టాక్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతముంది. ప్రమాదం జరిగాక క్షతగాత్రులను గ్యాంగ్టాక్కు పంపించి చికిత్సనందిస్తున్నారు. చదవండి: విషాదం.. సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఊపిరాడట్లేదని అరిచిన పారిశుద్ధ్య కార్మికులు.. కాసేపటికే.. -
సిక్కింలో మంచులో చిక్కిన 900 మంది యాత్రికులు
గ్యాంగ్టాక్: సిక్కింలో పర్యాటకులు తీవ్రమైన మంచులో చిక్కుకున్నారు. నాథులా, టోంగో లేక్ నుంచి రాజధాని గ్యాంగ్టాక్ వైపు శనివారం సాయంత్రం బయలుదేరిన 89 వాహనాలు దట్టమైన మంచులో చిక్కినట్టు అధికారులు చెప్పారు. వీటిలో సుమారు 900 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారన్నారు. ఆర్మీ సాయంతో వీరిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. అడ్డంకులను తొలగిస్తుండటంతో ఇప్పటికే 15 వాహనాలు గ్యాంగ్టాక్ వైపు బయలుదేరాయని చెప్పారు. కొందరు ప్రయాణికులను దగ్గరల్లోని క్యాంపులకు తీసుకెళ్తామని వెల్లడించారు. -
భారత్లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో 3 రాష్ట్రాల్లో ప్రకంపనలు..
న్యూఢిల్లీ: తుర్కియే, సిరియాలో భారీ భూకంపం అనంతరం భారత్లో కూడా భూకంపాలు సంభవించే ముప్పు ఉందని నిపుణలు అంచనావేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవి నిజరూపం దాల్చుతున్నాయి. దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. గుజరాత్లో శనివారం, అస్సాంలో ఆదివారం భూప్రకంపనలు రాగా.. తాజాగా సోమవారం ఉదయం సిక్కింలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 4.3 తీవ్రత నమోదైంది. ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని యుక్సోం ప్రాంతంలో 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం ట్విట్టర్లో తెలిపింది. ఉదయం 4:15 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు పేర్కొంది. Earthquake of Magnitude:4.3, Occurred on 13-02-2023, 04:15:04 IST, Lat: 27.81 & Long: 87.71, Depth: 10 Km ,Location: 70km NW of Yuksom, Sikkim, India for more information Download the BhooKamp App https://t.co/FgmIkxe9Q2@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/1FuxFI7Ire — National Center for Seismology (@NCS_Earthquake) February 13, 2023 అస్సాం, గుజరాత్లోనూ ఆదివారం అస్సాంలోనూ భూకంపం వచ్చింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది. అంతుకుముందు రోజు గుజరాత్ సూరత్లోనూ 3.8 తీవ్రతో భూమి కంపించింది. దేశంలో 60శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది. జోన్ 5 ► వెరీ హై రిస్క్ జోన్ : రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 11% ► ఈ జోన్లోని ప్రాంతాలు: కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం, గుజరాత్లో రణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్ నికోబర్ దీవులు జోన్ 4 ► హైరిస్క్ జోన్ : భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం ► ఈ జోన్లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 8 వరకు వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 18% ► ఈ జోన్లోని ప్రాంతాలు: కశ్మీర్లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్లో మిగిలిన భాగాలు పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిమ్, యూపీæ ఉత్తర ప్రాంతం, బిహార్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్థాన్ జోన్ 3 ► మధ్య తరహా ముప్పు: ఈ జోన్లో భూకంప తీవ్రత 7 వరకు వచ్చే అవకాశం ► దేశ భూభాగంలో ఇది 31% ► ఈ జోన్లోని ప్రాంతాలు: కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణాలో కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కూడా జోన్ 3లోకి వస్తాయి జోన్ 2 ► లో రిస్క్ జోన్ : భూకంప తీవ్రత 6 అంతకంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ► దేశ భూభాగంలో ఇది 40% ► ఈ జోన్లోని ప్రాంతాలు: రాజస్థాన్, హరియాణా, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు. చదవండి: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. మనకు ముప్పు ఎంత? -
పిల్లల్ని కనండి ఇంక్రిమెంట్ పొందండి.. ఉద్యోగులకు సిక్కిం సీఎం వరాలు!
భారత దేశ జనభా ఇప్పటికే దాదాపు 140 కోట్లు క్రాస్ చేసింది. జనాభా నియంత్రణ విషయంలో పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఒక్కరు ముద్దు.. ఇద్దరు వద్దు అంటూ ప్రకటనలు చేశాయి. కానీ, ఇందుకు భిన్నంగా ఈశాన్య రాష్ట్రం సిక్కిం సీఎం మాత్రం కొత్త పాలసీకి తెరలేపారు. జనాభాను పెంచాలన్నారు. పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్ ఉంటుందని భరోసా ఇచ్చారు. వివరాల ప్రకారం.. సిక్కింలో మాఘే సంక్రాంతి సందర్బంగా సీఎం ప్రేమ్సింగ్ తమాంగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమాంగ్ మాట్లాడుతూ సిక్కింలో తమ జాతి జనాభాను పెంచాలన్నారు. మూడో పిల్లాడ్ని కంటే డబుల్ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధంగా చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు అందుతాయని ఆఫర్ ఇచ్చారు. అలాగే.. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్ ఇక్రిమెంట్తో పాటు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతి ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే, సిక్కింలో ఇటీవలి కాలంలో సంతనోత్పత్తి రేటు చాలా తగ్గిపోయిందన్నారు. అందుకే తమ జాతి జనాభాను పెంచాలని సూచించారు ఇదే క్రమంలో ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు అవసరమైన డబ్బును కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనే ఉద్యోగినులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తమాంగ్ వెల్లడించారు. ఐవీఎఫ్ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 38 మంది మహిళలు గర్భం దాల్చారని, కొందరు తల్లులు కూడా అయ్యారని తెలిపారు. కాగా, సర్వీసులో ఉన్న మహిళలకు 365 రోజుల ప్రసూతీ సెలవులు ఇస్తున్నారు. మగ ఉద్యోగులకు 30 రోజుల పితృత్వ సెలవులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా, సీఎం హామీలపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. -
దటీజ్ సీఎం యోగి.. అమర జవాన్ల కుటుంబాలకు భారీ సాయం!
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ఓ మూల మలుపు వద్ద అదుపు తప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 16 మంది జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో పలువురు జవాన్లు గాయపడ్డారు. అయితే, రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో యూపీకి చెందిన నలుగురు జవాన్లు ఉన్నారు. దీంతో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచారు. కాగా, ప్రమాదంలో చనిపోయిన నలుగురు జవాన్ల కుటుంబాటకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాట్టు సీఎం యోగి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, నలుగురు జవాన్ల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు యూపీ సీఎంవో నుంచి లేఖను విడుదల చేశారు. దీంతో, సీఎం యోగి నిర్ణయంపై జవాన్ల కుటుంబాలతో పాటుగా యూపీ ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సిక్కింలో జరిగిన ప్రమాదం మృతుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులు, 13 మంది సైనికులు ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. UP CM Yogi Adityanath has announced to provide financial assistance of Rs 50 lakhs each to the families of four Army soldiers of the state who lost their lives in a road accident in Sikkim yesterday. CM also announced to give a govt job to a family member of the soldiers: CMO pic.twitter.com/AXYnbCAfX8 — ANI UP/Uttarakhand (@ANINewsUP) December 24, 2022 -
ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. తొమ్మిది మంది ‘సున్నా’లే! మరీ చెత్తగా
Vijay Merchant Trophy- సూరత్: భారత దేశవాళీ క్రికెట్లో ఈశాన్య రాష్ట్ర జట్ల పేలవ ప్రదర్శనపై తరచుగా వస్తున్న విమర్శలకు మరింత బలమిచ్చే మ్యాచ్ మరొకటి ముగిసింది. బీసీసీఐ అధికారిక అండర్–16 టోర్నీ (విజయ్ మర్చంట్ ట్రోఫీ)లో మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సిక్కిం 9.3 ఓవర్లలో కేవలం ‘6’ పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ అన్వీష్ ఒక ఫోర్ కొట్టగా, తొమ్మిదో స్థానంలో వచ్చిన అక్షద్ 2 పరుగులు సాధించాడు. మిగతా తొమ్మిది మంది ‘సున్నా’లే! ఈ మ్యాచ్లో ముందుగా మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 414 పరుగులు చేసి డిక్లేర్ చేయగా... తొలి ఇన్నింగ్స్లో సిక్కిం 43 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్లోనైతే మరీ చెత్తగా ఆడి అనూహ్య రికార్డు నమోదు చేయడంతో మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టు ఇన్నింగ్స్, 365 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. టీమిండియా ప్లేయర్ల పేర్లు ముడిపెట్టి.. ‘‘మరీ ఇంత దారుణ వైఫల్యమా.. సీనియర్లను బాగా ఫాలో అవుతున్నట్లున్నారు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. సిక్కిం ఓపెనర్ రోహిత్ తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో సున్నాకే అవుట్ కావడంతో భారత సారథి రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక సిక్కిం కెప్టెన్ దిన్రీ రెండు ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. మరోవైపు మధ్యప్రదేశ్ కెప్టెన్ మనాల్ చౌహాన్ 170 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్? Sikkim bowled out for 6 in the Vijay Merchant Trophy against Madhya Pradesh. — Mufaddal Vohra (@mufaddal_vohra) December 23, 2022 -
సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన ఆర్మీ ట్రక్కు
-
ఘోర ప్రమాదం.. భారత జవాన్ల దుర్మరణం
గ్యాంగ్టక్: ఘోర రోడ్డు ప్రమాదంలో భారత జవాన్లు మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కిం జెమా వద్ద జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. మృతుల్లో 13 మంది జవాన్లు, ముగ్గురు అధికారులు ఉన్నట్లు సమాచారం. భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో.. చాటేన్నుంచి తంగూ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు మలుపు తీసుకునే సమయంలో.. వాహనం వెనక్కి ఒరిగి లోయలో పడిపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎంత మంది గాయపడ్డారన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది. ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి జవాన్లు అందించిన సేవలు మరువలేనివని, ఘటన తీవ్రంగా బాధించిందని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Deeply pained by the loss of lives of the Indian Army personnel due to a road accident in North Sikkim. The nation is deeply grateful for their service and commitment. My condolences to the bereaved families. Praying for the speedy recovery of those who are injured. — Rajnath Singh (@rajnathsingh) December 23, 2022 -
భారత్లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి..
వైవిధ్యమైన సంస్కృతికి, గొప్ప వారసత్వ సంపదకు నిలయం భారత్. పర్యాటకులను కట్టిపడేసే ఎన్నో ప్రకృతి సోయాగాలు మన దేశంలో ఉన్నాయి. అయితే భారత ఉపఖండంలోని మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించడం ఒకేలా ఉండదు. ముఖ్యంగా 6 పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఇన్నర్ లోన్ పర్మిట్(ఐఎల్పీ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేకపోతే ఆ చోటుకు అసలు అనుమతించరు. ఐఎల్పీ పర్మిషన్ అంటే? ఇన్నర్ లోన్ పర్మిట్ అనేది కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో అమల్లో ఉన్నదే. ఇతర దేశాలతో సరిహద్దు పంచుకునే సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ పర్యటనలకు వెళ్లేవారికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఆదివాసీ తెగల సంక్షేమంతో పాటు పర్యాటకులకు భద్రత కల్పించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆరు ప్రదేశాలు ఇవే.. అరుణాచల్ ప్రదేశ్: గొప్ప సంస్కృతికి నిలయమైన ఈ ఈశాన్య రాష్ట్రం.. చైనా, భూటాన్, మయన్మార్ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. అందుకే ఈ ప్రాంతంలో పర్యటించాలనుకునే సందర్శకులు కోల్కతా, ఢిల్లీ, షిల్లాంగ్, గువాహటి రెసిడెంట్ కమిషనర్ల నుంచి ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో సందర్శకుడు రూ.100 చెల్లించాలి. నెల రోజుల పాటు అనుమతి ఉంటుంది. నాగలాండ్.. సంప్రదాయ తెగలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్తో సరిహద్దు కలిగి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతంలో పర్యటించాలనుకునే వారు ఢిల్లీ, కోల్కతా, కోహిమా, దిమాపూర్, షిల్లాంగ్, మొక్కోచుంగ్ డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవచ్చు. లక్షద్వీప్.. భారత్లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇదీ ఒకటి. అందమైన బీచ్లు, రుచికరమైన ఆహారానికి నిలయం. ఈ ప్రాంతంలో పర్యటించాలంటే పోలీస్ క్లియరెన్స్తో పాటు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. మిజోరం.. ప్రకృతి సోయగాలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్, బంగ్లాదేశ్తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. ఆదివాసీలకు నిలయమైన ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఏఎల్పీ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిల్చార్, కోల్కతా, షిల్లాంగ్, ఢిల్లీ, గువాహటి లీయాసోన్ అధికారుల నుంచి దీన్ని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విమానంలో వెళ్తే.. ఎయిర్పోర్టులోని సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ప్రత్యేక పాసులు తీసుకోవాలి. సిక్కిం.. భారత్లోని అతిచిన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. హిమాలయాలకు ప్రవేశ ద్వారం. అందమైన పచ్ఛికభూములు, అద్భుతమైన వంటకాలు, అనేక మఠాలు, స్పటిక సరస్సులు, కట్టిపడేసే ప్రకృతి అందాలకు నిలయం. మునుపెన్నడూ పొందని అనుభూతిని పర్యాటకులు ఇక్కడ పొందుతారు. సిక్కింలోని సోమ్గో, బాబా మందిర్ ట్రిప్, సింగలీలా ట్రెక్, నాథ్లా పాస్, జోంగ్రీ ట్రెక్, తంగు చోప్తా వ్యాలీ ట్రిప్, యుమెసామ్డాంగ్, యమ్తాంగ్, జోరో పాయింట్ ట్రిప్ వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లద్దాక్.. ప్రతి పర్యాటకుడు ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతం ఇది. ఐఎల్పీ లేనిదే ఇక్కడకు రానివ్వరు. నుబ్రా వ్యాలీ, ఖార్డంగ్ లా పాస్, తో మోరిరి సరస్సు, పాంగాంగ్ త్సో సరస్సు, దాహ్, హను విలేజ్, న్యోమా, టర్టక్, డిగర్ లా, తంగ్యార్ వంటి ప్రదేశాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. -
మెరిసిన నితిన్, అశ్వద్
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నీలో భాగంగా సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 355 పరుగుల భారీ ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఆల్రౌండర్ నితిన్ సాయి యాదవ్ (34 పరుగులు; 11 వికెట్లు) హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవర్నైట్ స్కోరు 462/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 106 ఓవర్లలో 9 వికెట్లకు 541 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సిక్కిం 72 పరుగులకే ఆలౌటైంది. నితిన్ సాయి యాదవ్ (3/23), అశ్వద్ రాజీవ్ (4/15) సిక్కిం జట్టును దెబ్బ తీశారు. ఫాలోఆన్ ఆడిన సిక్కిం రెండో ఇన్నింగ్స్లో నితిన్ సాయి యాదవ్ (8/34) స్పిన్ మ్యాజిక్కు 114 పరుగులకే ఆలౌటైంది. -
శతక్కొట్టిన బ్యాటర్లు.. భారీ స్కోర్ దిశగా హైదరాబాద్
Under 19 Cooch Behar Trophy 2022-23: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నీలో భాగంగా సిక్కిం జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 462 పరుగులు సాధించింది. ఓపెనర్ అమన్ రావు (113; 10 ఫోర్లు, 6 సిక్స్లు), రితీశ్ రెడ్డి (110; 8 ఫోర్లు) సెంచరీలతో ఆకట్టుకున్నారు. అరవెల్లి అవినాశ్ (92; 8 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ కోల్పోగా... ధీరజ్ గౌడ్ (68; 2 ఫోర్లు, 3 సిక్స్లు), విఘ్నేశ్ రెడ్డి (39; 4 ఫోర్లు) కూడా రాణించారు. అమన్, అవినాశ్ తొలి వికెట్కు 206 పరుగులు జోడించడం విశేషం. -
సహోద్యోగులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ పోలీస్ తన వద్ద ఉన్న తుపాకీతో ముగ్గురు సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పోలీసులూ మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిణి ప్రాంతంలోని హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో సిక్కిం రాష్ట్రానికి చెందిన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ సిక్కిం పోలీస్(32) తోటి సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సంఘటన స్థలంలోనే మరణించారు. మృతులను కమాండర్ పింటో నామ్గ్యాల్ భూటియా, ఇంద్ర లాల్ చెత్రీగా పోలీసులు గుర్తించారు. మరొకరు దన్హంగ్ సుబ్బాకు తీవ్ర గాయాలవ్వగా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ అతను కూడా మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితుడిని ప్రబిన్ రాయ్గా గుర్తించిన ఢిల్లీ పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా రాయ్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్స్, సిక్కిం పోలీసులకు చెందిన వాడు. రాయ్, భూటియా 2012 బ్యాచ్ నుంచి గ్రాడ్యూయెట్ పూర్తి చేయగా.. సుబ్బా, చెత్రీ 2013 బ్యాచ్కు చెందిన వారు. -
చల్లటి పంటలు
ఈశాన్య రాష్ట్రాలు అనగానే ముందుగా అక్కడి పచ్చటి తోటలు గుర్తుకు వస్తాయి. వీపున బుట్ట తగిలించుకున్న మహిళలు మనోఫలకం మీద మెదలుతారు. వేళ్లతో అలవోకగా తేయాకు చిగుళ్లను గిల్లుతూ బుట్టలో వేస్తున్న దృశ్యం కూడా. అదే ప్రాంతం నుంచి ఓ మహిళ సేంద్రియ పంటలను బుట్టలో వేయసాగింది. ఇప్పుడు... బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డును కూడా బుట్టలో వేసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో మనకు ఒక మోస్తరుగా తెలిసిన రాష్ట్రం సిక్కిమ్, ఆ రాష్ట్రానికి రాజధాని గాంగ్టక్, ఆ నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరాన ఉంది రాణిపూల్ అనే చిన్న పట్టణం. అది పట్టణమో, గ్రామమో స్పష్టంగా చెప్పలేం. నివాస ప్రదేశాలకు ఒకవైపు కొండలు, మరోవైపు రాణిఖోలా నది, వాటి మధ్య పచ్చగా విస్తరించిన నేల. ఈ నేలనే తన ప్రయోగశాలగా మార్చుకున్నారు దిల్లీ మాయా భట్టారాయ్. ప్రోగ్రెస్ రిపోర్ట్ టెకీగా సిటీలైఫ్ చట్రంలో జీవితాన్ని కట్టిపడేయడం నచ్చలేదామెకు. ‘మనల్ని మనం పరిరక్షించుకుంటాం, అలాగే భూమాతను కూడా పరిరక్షించాలి’... అంటారు మాయా భట్టారాయ్. అందుకోసం గ్రామంలో సేంద్రియ సేద్యాన్ని, సేంద్రియ ఉత్పత్తుల దుకాణాన్ని కూడా ప్రారంభించారామె. ‘పర్యావరణాన్ని పరిరక్షించడంలో సేంద్రియ వ్యవసాయం ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకే ఈ రంగంలో అడుగుపెట్టాను’ అని చెప్తున్నారామె. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్గానిక్ మిషన్లో భాగస్వామి అయిన తర్వాత ఆమెకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. శాస్త్ర సాంకేతికతను జోడిస్తూ వ్యవసాయం చేయడంలోనూ, ఆర్థిక సంక్షేమాన్ని సాధించడంలో ఆమె కృతకృత్యులయ్యారు. మన నేలకు పరిచయం లేని పాశ్చాత్య దేశాల్లో పండే అనేక పంటలను ఇక్కడ పండించారామె. ఆ పంటలకు తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని, ఎక్కువ ఎండ తగలకుండా తెల్లని పై కప్పుతో సస్యాలను రక్షించారు. మన అల్లం, వంకాయలతోపాటు పశ్చిమాన పండే బ్రోకలి వంటి కొత్త పంటల సాగులోనూ పురోగతి సాధించారు. ఆమె ప్రోగ్రెస్ రిపోర్ట్కు మంచి గుర్తింపు వచ్చింది. మాయా భట్టారాయ్ అనుసరించిన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మీద స్థానిక మీడియా చానెళ్లు ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. సోషల్ మీడియా కూడా అందుకుంది. ఆమె ఫార్మింగ్ ఫార్ములా విపరీతంగా ప్రజల్లోకి వెళ్లింది. వాతావరణాన్ని కలుషితం కానివ్వకుండా కాపాడడంలో ఆమె తనవంతుకంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని అందించింది. ఆమె స్ఫూర్తితో అనేక మంది మహిళలు పర్యావరణానికి హానికలిగించని విధంగా సాగు చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె ప్రయత్నాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆమెను ‘బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు 2021’తో గౌరవించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్కు చెందిన నార్త్ ఈస్టర్న్ హిల్ రీజియన్ 48వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇటీవల మేఘాలయలోని ఉమియమ్లో ఆమె ఈ అవార్డు అందుకున్నారు. పంటకు పురస్కారం రాణిపూల్లోని హాత్ బజార్లో మాయా భట్టారాయ్ దుకాణాన్ని, స్థానిక మహిళలు సేంద్రియసాగులో పండిస్తున్న కూరగాయలను చూపిస్తూ ‘ఇదంతా దిల్లీ మాయా భట్టారాయ్ బాటలో మన మహిళలు సాధించిన విజయం. బయటి నుంచి కూరగాయలు మాకక్కరలేదు... అని చెప్పే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం’ అని కథనాలు ప్రసారం చేసింది స్థానిక ‘వాయిస్ ఆఫ్ సిక్కిమ్’ మీడియా. ‘నేలకు గౌరవం అందాలి. పంటకు పురస్కారాలు రావాలి. పంట పండించే రైతు శ్రమను గౌరవించే రోజులు రావాలి’ అంటారామె. -
Eksha Hangma Subba: సూపర్ ఉమన్!
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు విమానాలను కూడా అవలీలగా నడిపేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నైపుణ్యంతో రాణిస్తూంటే ‘ఇక్షా హంగ్మా సుబ్బ’ మాత్రం నాలుగు నైపుణ్యాలతో వందమందిలో ఒక్కటిగా దూసుకుపోతుంది. ఇక్షా హంగ్మా సుబ్బ.. ఏంటీ అనిపిస్తుంది కదూ! అవును ఈ పేరు పలకడానికి, వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నట్టుగానే ఇక్షా వృత్తినైపుణ్యాలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోయినప్పటికీ, తనదైన శైలిలో రాణిస్తూ అందరిచేత సూపర్ ఉమన్ అనిపిస్తోంది. బోల్డ్ అండ్ బ్యూటిపుల్గా పేరొందిన ఇక్షా.. సిక్కిం పోలీస్ ఆఫీసర్, జాతీయ స్థాయి బాక్సర్, బైకర్, ఎమ్టీవీ సూపర్ మోడల్. సిక్కిం రాష్ట్రంలోని పశ్చిమ జిల్లా సొంబారియా గ్రామంలో ఐతరాజ్, సుకర్ణి సుబ్బా దంపతులకు 2000 సంవత్సరంలో ఇక్షా జన్మిచింది. ఒక సోదరుడు ఉన్నాడు. ప్రైమరీ,సెకండరీ విద్యాభ్యాసం అంతా సొంతూరులోనే పూర్తి చేసింది. తరువాత గ్యాంగ్టక్లోని బహదూర్ భండారీ కాలేజీలో డిగ్రీలో చేరింది. ఈ సమయం లోనే ఎన్ఎస్ఎస్లోలో చేరింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే ఇక్షాకు నటన అన్నా... మోడలింగ్ అన్నా అమితాసక్తి. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా డిగ్రీ చదువుతూనే పోలీసు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో సిక్కిం పోలీస్ విభాగంలో చేరింది. 14 నెలల శిక్షణ తరువాత ‘యాంటీ రైట్ ఫోర్స్’ విభాగంలో పోలీస్ ఆధికారిగా చేరింది. ఉద్యోగంలో చేరి, కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతున్నప్పటికీ చిన్నప్పటినుంచి ఉన్న మోడలింగ్ ఆసక్తి వెలితిగా తోచింది తనకు. మిస్ సిక్కిం.. పోలీస్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్కూల్లో ఉన్నప్పుడు వివిధ మోడలింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లలో పాల్గొని గెలిచిన సందర్భాలు, కాలేజీలో ‘మిస్ ఫ్రెషర్’గా టైటిల్ను గెలుచుకున్న సందర్భాలు తనకి గుర్తొచ్చేవి. తన గ్రామం నుంచి రాష్ట్రస్థాయి మోడలింగ్ పోటీలలో పాల్గొని మిస్ సిక్కిం టైటిల్ను గెలుచుకుంది. దీంతో ఇక్షాకు మోడలింగ్లోకి వెళ్లేందుకు నమ్మకం కుదిరింది. అక్కడి నుంచి వివిధ రకాల మోడలింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఎమ్టీవీ సూపర్ మోడల్ –2 రియాల్టీ షో ఆడిషన్స్కు హాజరై సెలక్ట్ అయింది. ఈ సెలక్షన్స్ ద్వారా ఇక్షా గురించి అందరికీ తెలిసింది. మొత్తం పదిహేనుమంది పాల్గొన్న ఈ షోలో మొదట టాప్ నైన్లో చోటు సంపాదించుకుని పాపులర్ అయ్యింది. పోటాపోటీగా జరుగుతున్న ఈ షోలో ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతూ అందర్ని ఆకట్టుకుంటోంది. టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సూపర్ మోడల్గా ఇక్షాను పొగుడుతూ ట్వీట్ చేయడం, షో న్యాయనిర్ణేతలు కూడా ఇక్షాను అభినందిస్తుండంతో అంతా ఆమెను అభినందనలలో ముంచెత్తుతున్నారు. ఇక్షా ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి శారీరకంగా ఫిట్గా ఉండేందుకు ఆటలు బాగా పనికొస్తాయని ప్రోత్సహించడంతో స్థానికంగా నిర్వహించే బాక్సింగ్ తరగతులకు హాజరై బాక్సింగ్ నేర్చుకుని జాతీయస్థాయి బాక్సర్గా ఎదిగింది. అలా ఒకపక్క బాక్సింగ్ చేస్తూనే మరోపక్క ఉద్యోగం చేస్తూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ సూపర్ ఉమన్గా నిలుస్తోంది. ఇక్షాకు మోడలింగ్తోపాటు డ్రైవింగ్ కూడా చాలా ఇష్టం. అందుకే ఆమె కేటీఎమ్ ఆర్సీ 200 మోటర్ బైక్ నడుపుతూ లాంగ్ రైడ్స్కు వెళ్తుంటుంది. చిన్న వయసులో ఇన్ని రకాల నైపుణ్యాలతో దూసుకుపోతూ ఎంతోమంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది ఇక్షా. -
కేసీఆర్ కుటుంబ పాలనను విడిచిపెట్టే ప్రసక్తే లేదు: ఎంపీ అర్వింద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కంటే కూడా సిక్కిం ఎక్కువ అభివృద్ధిని సాధించిందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. చిన్న రాష్ట్రమైనా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోందంటూ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము సాధిస్తున్న పురోగతితో దేశాన్ని నడుపుతున్నామని, ఎన్నో అంశాల్లో ఆదర్శంగా నిలుస్తామని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు.. ఆదాయం కోసం ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీవెళ్లిన సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వంలోని ముఖ్యశాఖల మంత్రులు, తమ పార్టీ పెద్దలను కలిసి వచ్చినా.. టీఆర్ఎస్ను, కేసీఆర్ కుటుంబ పాలనను బీజేపీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. బీజేపీతో టీఆర్ఎస్కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు బాగా ఉంటే పదేపదే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చదవండి: ‘కోదండరాం బట్టలు చినిగిపోయేలా దాడి చేయడం దారుణం’ కోల్కతా కోర్టు తీర్పుతోనైనా స్పీకర్ కళ్లు తెరవాలి: దాసోజు సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పీకర్ వ్యవస్థకే చెంపపెట్టని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్ పేర్కొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరచి ఫిరాయింపు నిరోధక చట్టానికి వ్యతిరేకంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని చెప్పారు. ఈ మేరకు మంగళవారం శ్రావణ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. టీఎంసీ ఎమ్మెల్యే ముకుల్రాయ్ అనర్హత పిటిషన్పై అక్టోబర్ 7లోగా నిర్ణయం తీసుకోవాలని పశి్చమబెంగాల్ స్పీకర్కు కోల్కతా హైకోర్టు ఆదేశాలిచ్చిందని ఆయన వివరించారు. ఆ తీర్పును గౌరవించి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. -
చైనాతో మళ్లీ ఘర్షణ
న్యూఢిల్లీ: ఉత్తర సిక్కింలోని 16 వేల అడుగుల ఎత్తైన నాకు లా ప్రాంతంలో ఉన్న సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య గతవారం స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ బాహాబాహీలో రెండు దేశాల సైనికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. సుమారు 20 మంది చైనా సైనికులు, నలుగురు భారత జవాన్లు గాయపడ్డారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల స్థానిక కమాండర్లు ఈ సమస్యను పరిష్కరించారని ఆర్మీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే లక్ష్యంతో ఇరుదేశాల మధ్య 9వ విడత చర్చలు ఆదివారం ఉదయం ప్రారంభమై.. సోమవారం మధ్నాహ్నం వరకు కొనసాగాయి. తాజా ఘటనను భూతద్దంలో చూసి, అనవసర, అబద్ధపు ప్రచారం చేయవద్దని మీడియాను కోరుతున్నామని భారతీయ ఆర్మీ ప్రకటించింది. ఈ నెల 20న ఉత్తర సిక్కింలోని నాకు లా వద్ద వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించారు. భారత సైనికులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీనిపై తమ వద్ద సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ వ్యాఖ్యానించారు. ‘సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు చైనా దళాలు కట్టుబడి ఉన్నాయన్నారు. అహంకార ధోరణి సరికాదు: జిన్పింగ్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్)ను ఉద్దేశించి జిన్పింగ్ సోమవారం ప్రత్యేకంగా ప్రసంగించారు. వారంపాటు జరిగే ఈ డబ్ల్యూఈఎఫ్ ఆన్లైన్ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ గురువారం ప్రసంగిస్తారు. సొంత ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇతర దేశాలను ఇబ్బంది పెడ్తూ అహంకార పూరిత ధోరణితో వ్యవహరించే దేశాలు ఒంటరిగా మిగిలిపోతాయని హెచ్చరించారు. ఏ దేశం పేరునూ ప్రస్తావించనప్పటికీ.. అమెరికా, భారత్లను ఉద్దేశించే జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. -
చైనా వక్రబుద్ధి: భారత జవాన్లకు గాయాలు
గ్యాంగ్టక్: సందు దొరికితే చాలు భారత భూభాగంలో చొచ్చుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది చైనా. కన్ను మూసి తెరిచేలోగా దొరికిన కాడికి దోచుకునేందుకు గుంటనక్కలా కాచుకుని కూర్చుంటుంది. భారత సైన్యం ఎన్నిసార్లు హెచ్చరించినా డ్రాగన్ ఆర్మీ తన వక్రబుద్ధిని పోనిచ్చుకోలేదు. తాజాగా చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అలర్ట్ అయిన భారత సైనికులు వారిని వెనక్కు వెళ్లగొట్టి డ్రాగన్ తోక ముడిచేలా చేశారు. గతవారం సిక్కింలోని నాకులా లోయలో సుమారు 20 మంది చైనా సైనికులు సరిహద్దు దాటి రహస్యంగా భారత్లోకి వచ్చేందుకు కుట్ర పన్నారు. వీరి ఎత్తుగడ అర్థమైన జవాన్లు వెంటనే వారిని వెళ్లిపొమ్మని హెచ్చరించారు. మాట చెవికెక్కించుకోని డ్రాగన్ ఆర్మీ ఆయుధాలు బయటకు తీసింది. (చదవండి: 63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!) ఈ క్రమంలో భారత్-చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరగ్గా సైనికులు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. ఈ దాడిలో నలుగురు భారత జవాన్లు గాయాలపాలయ్యారు. పైగా అక్కడి వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ తీవ్రంగా పోరాడిన సైనికులు వారిని విజయవంతంగా వెనక్కు వెళ్లగొట్టారు. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ లోకల్ కమాండర్ల చర్చలతో సద్దుమణిగిందని ఇండియన్ ఆర్మీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా భారత్- చైనా ఆర్మీ అధికారులు సమావేశమైన మరుసటి రోజే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. గతేడాది జూన్ 15న కూడా లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా మధ్య ఘర్షణ తలెత్తగా.. 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. (చదవండి: బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు) -
మరోసారి చైనా దుస్సాహసం, తిప్పి కొట్టిన సైనికులు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మరోసారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది.లడాఖ్లో భారతీయ సైనికులను పొట్టన పెట్టుకున్న వివాదం ఇంకా సమపిపోక ముందే చైనా దళాలు మరో దుస్సాహసానికి పూనుకున్నాయి. హద్దు మీరి చొరబాటుకు ప్రయత్నించడంతో వారిని భారత జవాన్లు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. సిక్కిం సెక్టార్లోని నాథూ లా సమీపంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసి) మూడు రోజుల క్రితం ఈ ఉదంతం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఏ) సైనికులకు భారతీయ జవాన్లు సరియైన రీతిలో బుద్ధి చెప్పారు. ఈ ఘర్షణలో ఇరువైపులా సైనికులు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై భారత సైన్యం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఉత్తర సిక్కింలోని నాకూలాలో చైనా సైనికులు ఇండియాలోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించిన ఘటన గతవారం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో 20 మంది గాయపడినట్టు సమాచారం. గాయనపడిన వారిలో నలుగురు భారత జవాన్లు కూడా ఉన్నారు. అలాగే ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా తూర్పు లడాఖ్లో చైనా దుశ్చర్య కారణంగా జూన్ 2020 లో, గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు మరణించడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ ప్రతిష్టంభను తొలగింపునకు సంబంధించి భారత్, చైనా మధ్య ఈ రోజు (జనవరి,25) తొమ్మిదో రౌండ్ సైనిక చర్చలను నిర్వహించనున్నాయి. Troops of India and China involved in a physical brawl along the Line of Actual Control (LAC) last week near Naku La area in Sikkim. Soldiers from both sides are injured. More details awaited: Sources pic.twitter.com/Sff5eVDP1K — ANI (@ANI) January 25, 2021 -
బైక్పై భారీయాత్రకు సిద్ధమైన స్టార్ హీరో!
నటుడు అజిత్ ఇటీవల తన రాబోయే తమిళ చిత్రం వాలిమై యొక్క హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తీ చేసాడు. తర్వాత తుది షెడ్యూల్ కోసం "వాలిమై" చిత్ర బృందం మొరాకోకు వెళ్లనున్నారు. ఈ గ్యాప్ లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భారీ బైక్ యాత్రకు సిద్దమయ్యాడు. హీరో అజిత్కు బైక్లు, రేసింగ్ అంటే ఎంత పిచ్చో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వీలైనంత వరకు తను బైక్ ప్రయాణాల వైపే అజిత్ మొగ్గు చూపుతాడు. ఆ మధ్య తాను షూటింగ్ పూర్తీ అయ్యాక తిరుగు ప్రయాణంలో బైక్ మీద హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరిన సంగతి మనకు తెలిసిందే.(చదవండి: అజిత్తో ఉన్నది ఎవరో తెలుసా?) తాజాగా ఇప్పుడు అజిత్ చెన్నై నుంచి సిక్కింకు(2400కి.మీ) బైక్పై వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నెలాఖరుకు చెన్నై తిరిగి రానున్నాడు. సోలోగా 4500 కి.మీ బైక్ యాత్ర చేయాలని అజిత్ ప్లాన్ చేసుకున్నారు. ఈ రోడ్ ట్రిప్లో వారణాసి దగ్గర ఒక అభిమానితో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీక్ అయిన చిత్రంలో అజిత్ బిఎండబ్ల్యూ బైక్ నడుపుతూ శీతాకాలపు బట్టలు ధరించి కనిపించాడు. ఈ పర్యటన నుండి తిరిగి వచ్చిన తరువాత అతను "వాలిమై" తుది షెడ్యూల్ కోసం మొరాకోకు వెళ్లనున్నారు. చిత్రంలో అజిత్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా, ఇందులో కథనాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుంది. టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్గా కనిపించనున్నారు. -
కేంద్ర విపత్తు సాయం రూ. 4381 కోట్లు
న్యూ ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం ఆరు రాష్ట్రాలకు అదనపు విపత్తు సహాయం కింద రూ.4381.88 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఉంపున్ తుఫాన్ సహాయం కింద అత్యధికంగా బెంగాల్ రాష్ట్రానికి రూ. 2,707.77 కోట్లను అందజేయనుంది. అస్పాం రాష్ట్రానికి 128.23 కోట్లు, జూన్లో నిసర్గ తుఫాన్కి నష్టపోయిన మహరాష్ట్రకు రూ.268.59 కోట్లు, వరదలతో దెబ్బతిన్న కర్ణాటక రాష్ట్రానికి రూ.577.84 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.611.61 కోట్లు, సిక్కింకు రూ.87.84 కోట్లుగా ప్రకటించింది. ఈ నిధులన్ని జాతీయ విపత్తు సహాయనిధి ద్వారా ఆయా రాష్ట్రాలకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఉంపున్, నిసర్గ తుఫాన్లు, వరదలు, కొండచరియలు విరిగిపడ్డ విపత్తులతో పలు రాష్ట్రాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. వీటిలో మే నెలలో పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో వచ్చిన ఉంఫున్ తుఫాను ధాటికి 100 మంది చనిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 6 లక్షల పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మే 20న తూర్పు తీర ప్రాంతంలోని సుందర్బన్ అడవుల్లో 20 కిలోమీటర్ల మేర భూమి కుంగిపోయింది. 185 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు టెలికమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల రోడ్లు కోతకు గురవగా, మరి కొన్ని చోట్ల పాడయ్యాయి. తుఫాన్ వచ్చిన మరుసటి రోజు ప్రధానమంత్రి ఆ రాష్ట్రాలకు పర్యవేక్షణకు వెళ్లి, తక్షణ సహాయంగా పశ్చిమ బెంగాల్కు రూ.1000 కోట్లు, ఒడిశాకు రూ. 500 కోట్లు తక్షణ సహాయంగా అందజేశారు. తుఫాన్ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50000 ఎక్స్గ్రేషియాను అందజేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సహాయం కన్నా ఎక్కువ. -
చైనా సరిహద్దుల్లో రాజ్నాథ్ ఆయుధ పూజ
సాక్షి, న్యూఢిల్లీ: విజయదశమి సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉదయం ఆయుధ పూజ నిర్వహించారు. వాస్తవాధీన రేఖకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సిక్కిం షెరాథాంగ్ వద్ద ఆయన సైనికులతో ‘శాస్త్ర పూజ’ చేశారు. ఆయుధాలు, పరికరాలు, సాయుధ వాహనాలను పూజించారు. అనంతరం సైనికులతో రాజ్నాథ్ ముచ్చటించారు. దసరా సందర్భంగా వారికి తన శుభాకాంక్షలు తెలిపారు. దేశ సరిహద్దుల రక్షణలో సేవలు చేస్తున్న వారి అంకితభావాన్ని ప్రశంసించారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని ప్రశంసలు కురిపించారు. ఇక చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ సైనికులతో గడపటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ... చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న వివాదం త్వరగా ముగిసిపోవాలని భారత్ కోరుకుంటోందని ఆకాంక్షించారు. శాంతి నెలకొల్పడమే తమ ఉద్ధేశ్యమని, ఈ విషయంలో తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన ఆకాంక్షించారు. భారత జవాన్లు దేశంలోని ఒక్క ఇంచు భూమిని కూడా ఇతరుల చేతుల్లోకి పోనివ్వరని రాజ్నాథ్ స్పష్టం చేశారు. అంతకు ముందు తన పర్యటనలో భాగంగా డార్జిలింగ్లోని సుక్నా యుద్ధ స్మారకాన్ని ఆయన, ఆర్మీ ఛీప్ ఎంఎం నరవాణేతో కలిసి సందర్శించారు. యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. కాగా ఇవాళ ఉదయం రక్షణమంత్రి ట్విటర్లో దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘విజయదశమి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా ఈ రోజు సిక్కింలోని నాథులా ప్రాంతాన్ని సందర్శించి భారత సైన్యం సైనికులను కలుస్తా. ఆయుధ ఆరాధన కార్యక్రమంలో కూడా పాల్గొంటా’ అని ట్వీట్ చేశారు. గత ఏడాది ఫ్రాన్స్ ఓడరేవు నగరం బోర్డాలో రక్షణ మంత్రి రాఫేల్ యుద్ధ విమానాలకు శాస్త్ర పూజ నిర్వహించారు. -
ముగ్గురు చిన్నారులను కాపాడి.. ప్రాణాలు వదిలాడు
వాషింగ్టన్: అమెరికాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నదిలో మునిగిపోతున్న ముగ్గురూ పిల్లలను కాపాడే క్రమంలో భారత సంతతికి చెందిన 29 ఏళ్ల వ్యక్తి తన ప్రాణాలను కొల్పోయాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడగా మరో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కాలిఫోర్నియా అధికారులు తెలిపారు. స్థానిక మీడియా ప్రకారం... కాలిఫోర్నియాకు చెందిన ఇద్దరు ఎనిమిదేళ్ల బాలికలు, ఓ పదేళ్ల బాలుడు కలిసి నదిలో సరదాగా ఈతకు వెళ్లారు. (చదవండి: విషాదం: తండ్రి మరణంతో కూతుళ్లు కూడా..) వారు ఆడుకుంటుండగా ఒక్కసారిగా నది ప్రవాహం పెరగడంతో వారు నీటిలో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఒడ్డు మీద నిలుచున్న మజీద్ సింగ్ వారిని చూసి కాపాడేందుకు నదిలో దూకాడు. వారిని కాపాడే క్రమంలో మజీద్ నీటిలో మునిగిపోయాడు. ఈ సంఘటన జరిగిన దాదాపు 40 నిమిషాల అనంతరం మజీద్ మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నుంచి బయటపడిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరూ సురక్షితం ఉన్నారని, మరో ఎనిమిదేళ్ల చిన్నారి పరిస్థితి విషయంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి) -
తనెంత డేంజరో తెలపడానికే ఇంత దారుణం
గాంగ్టక్: ఈ మధ్య కాలంలో నోరులేని మూగ జీవాలను చంపుతున్న మానవ మృగాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మూగ జీవాలను దారుణంగా హింసించి సైకోల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి సిక్కింలో చోటు చేసుకుంది. బంధువులతో గొడవ పడిన ఓ వ్యక్తి వారి పెంపుడు కుక్కను అత్యంత దారుణంగా చంపేశాడు. కుక్కల పండుగ నాడే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వివరాలు.. తూర్పు సిక్కిం మానే దారా గ్రామానికి చెందిన నరెన్ తమంగ్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 3న నరెన్కు అతడి బంధువుకు మధ్య చిన్న వివాదం జరిగింది. ఆ కోపాన్ని నిందితుడు అతడి పెంపుడు కుక్క మీద చూపించాడు. (కర్రలతో కొట్టి.. పిన్నులతో గుచ్చి) బంధువు పెంపుడు కుక్కను దారుణంగా హత్య చేశాడు నరెన్. అనంతరం మృతదేహాన్ని కొండపై నుంచి విసిరి సాక్ష్యాలను దాచడానికి ప్రయత్నించాడు. కానీ బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. కుక్క మృతదేహాన్ని గుర్తించారు. దానికి పోస్ట్మార్టం నిర్వహించిన డాక్టర్లు నరెన్ కృరత్వానికి భయపడిపోయారు. ‘నిందితుడు కుక్క తలపై, నోటిపై పొడిచాడు. దాని నాలుకను ముక్కలు చేశాడు. పాపం ఆ మూగజీవి తన ప్రాణాలు కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. సాయం కోసం అరిచింది. దురదృష్టవశాత్తు దాని యజమానురాలు దారుణం జరుగుతున్నప్పుడు అక్కడే ఉంది కానీ.. నరెన్ చేష్టలకు భయపడి పోయింది. సగం స్పృహలో ఉన్న ఆ కుక్కపిల్ల పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ నరెన్ మళ్లీ దాన్ని పట్టుకుని చెవి కత్తిరించి.. తలపై కొట్టాడు. ఆ తర్వాత దాన్ని తన ఇంటి దగ్గర ఉన్న కొండపైకి విసిరాడు’ అని తెలిపారు పోలీసులు. తాను ఎంత ప్రమాదకరమైన వాడో తన బంధువులకు తెలియజెప్పేందుకే నరెన్ ఈ నేరానికి పాల్పడ్డాడన్నారు పోలీసులు. మూగజీవిని ఇంత దారుణంగా హింసించి చంపిన నరెన్కు కఠిన శిక్ష విధించాలని జంతు ప్రేమికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (వణికించిన బర్మా కొండచిలువ) -
ఆగని డ్రాగన్ ఆగడాలు
న్యూఢిల్లీ: డ్రాగన్ దేశం మళ్లీ బుసలు కొడుతోంది. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారక ముందే మరోవైపు నుంచి దురాక్రమణకు సిద్ధమైంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో లిపులేఖ్ పాస్లో సైనికుల్ని మోహరించింది. వెయ్యి మందికి పైగా చైనా సైనికులు లిపులేఖ్లో మోహరించినట్టుగా భారత్ మిలటరీ సీనియర్ కమాండర్ చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు లద్దాఖ్లో సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని జాతీయ భద్రతా సలహాదారు దోవల్, చైనా విదేశాంగ మంత్రి చాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చినా చైనా మాట నిలబడలేదు. లిపులేఖ్ పాస్, ఉత్తర సిక్కింలో కొన్ని ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్లో చైనా లిబరేషన్ ఆర్మీ సైన్యం తిష్ట వేసిందని అధికారి చెప్పారు. చైనా ఆగడాలను దీటుగా ఎదుర్కోవడానికి భారత్ కూడా సన్నాహాలు చేస్తోంది. హిమాలయాల్లో గడ్డకట్టే చలిని తట్టుకోవడానికి భారతీయ సైన్యానికి దుస్తులు, టెంట్లను అమెరికా, రష్యా, యూరప్ నుంచి కొనుగోలు చేయనుంది. ఏమిటీ లిపులేఖ్ పాస్? హిందువులకి అత్యంత సాహసోపేతమైన యాత్ర మానస సరోవరానికి వెళ్లే మార్గంలో లిపులేఖ్ పాస్ ఉంది. 1992లో చైనాతో వాణిజ్య సంబంధాల కోసం ఈ లిపులేఖ్ మార్గంలో తొలిసారిగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ప్రతీ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో సరిహద్దులకి రెండు వైపులా ఉండే ఆదివాసీలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో హిమాలయాల వరకు భారత్ 80కి.మీ. రోడ్డుని నిర్మించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో లిపులేఖ్ పాస్ తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు చైనా ఈ మార్గంపైనే కన్నేసింది. ఐరాసకు నేపాల్ కొత్త మ్యాప్ భారత్ వ్యతిరేక ధోరణిని నేపాల్ మరింత తీవ్రతరం చేస్తోంది. మన దేశ భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలను నేపాల్లో అంతర్భాగంగా చూపిస్తూ తయారు చేసిన మ్యాప్ను ఐక్యరాజ్య సమితికి. గూగుల్కి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాంతాలను తమ దేశ భాగంలో చూపించడానికి నేపాల్ రాజ్యాంగ సవరణ చేసిన విషయం తెలిసిందే. నేపాల్ ఈ చర్యల వెనుక చైనా ఒత్తిడి ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. -
బెంగాల్, సిక్కింకు రెడ్ అలర్ట్ జారీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్, సిక్కిం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. జూలై 12 నుంచి 16 మధ్య భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కోల్కతాలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది. హిమాలయాల పర్వత ప్రాంతాల మధ్య రుతుపవనాల పతనం, బెంగాల్ బే నుంచి బలమైన తేమ చొరబాటు కారణంగా వాతావరణ పరిస్థితిలో మార్పులు తలెత్తినట్లు పేర్కొంది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం, నీటి మట్టాలు పెరగవచ్చని బులెటిన్లో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బెంగాల్, సిక్కిం సహా వర్షాల ప్రభావం ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు చేసింది. చదవండి: 15 రోజుల్లో కేసులు రెట్టింపు కావొచ్చు -
ఇద్దరు అమ్మల కరోనా కథ
బ్రహ్మ నుదుటిన నాటకీయత రాస్తాడని అంటారు. ఇప్పుడు కరోనా రాస్తోంది. సినిమా రచయితలు గుండెలు పిండేసే సన్నివేశాలను సృష్టిస్తారని అంటారు. ఇప్పుడు కరోనా సీన్ పేపర్ అందిస్తోంది. సిక్కిమ్లో ఇద్దరు తల్లులను పాత్రలుగా చేసి కరోనా ఆడిన వింత నాటకం ఇప్పుడు ఎందరి గుండెలనో కదిలిస్తోంది. గడిచిన ఆదివారం (జూన్ 14) అందరూ ఇళ్లల్లో కుటుంబాలతో గడుపుతూ ఉండి ఉంటారు. కాని సిక్కిమ్ రాజధాని గాంగ్టక్లో ఇద్దరు తల్లుల జీవితంలో ఆ ఆదివారం ఒక నాటకీయ సన్నివేశాన్ని తెచ్చింది. అందుకు కోవిడ్ వైరస్ అసలు పాత్రను పోషించింది. సిక్కిం రాష్ట్రం ముందు నుంచి కరోనా విషయంలో తక్కువగానే వార్తలలో ఉంది. మే నెలలో అది కరోనా ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించబడింది. కాని లాక్డౌన్ సడలించాక మహారాష్ట్ర, బెంగాల్ల నుంచి సిక్కిం వాసులు తిరిగి రావడం మొదలెట్టాక అక్కడ కోవిడ్ కేసుల నమోదు పెరిగింది. ప్రస్తుతం అక్కడ 60కి పైగా యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇద్దరు తల్లులకు, వారి చంటిపిల్లలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఒక తల్లికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆమెకు మూడేళ్ల బాబు ఉన్నాడు. వాడికి నెగెటివ్ వచ్చింది. మరో తల్లికి కోవిడ్ నెగెటివ్ వచ్చింది. ఆమెకు రెండేళ్ల పాప ఉంది. ఆ పాపకు పాజిటివ్ వచ్చింది. ఇది అధికారులకు ఒక చిక్కు సందర్భంగా మారింది. ఒక కేసులో తల్లి హాస్పిటల్లో ఉండాల్సిన పని లేదు. ఒక కేసులో బాబు ఉండాల్సిన పని లేదు. తల్లి కోసం బాబును ఉంచినా, పాపకోసం తల్లిని ఉంచినా వారు కోవిడ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ‘ఏం చేద్దాం’ అని ఆలోచించారు. ఒకరి బిడ్డను ఒకరు మార్చుకుంటే అనే ఐడియా వచ్చింది. ‘ఇది నియమాలకు వ్యతిరేకం. కాని సురక్షితం’ అని గాంగ్టక్లోని ఈ ఇద్దరు తల్లులు తమ పిల్లలతో వచ్చి చేరిన ఎస్.టి.ఎన్.ఎమ్ హాస్పిటల్ వైద్యాధికారి అన్నారు. ‘మీరే ఆలోచించుకుని నిర్ణయానికి రండి’ అని తల్లులిద్దరికీ సూచించారు. తల్లులిద్దరూ మాట్లాడుకున్నారు. ఏ తల్లికీ తన సంతానాన్ని విడిచి ఉండడానికి మనసొప్పదు. కాని తాము తమ సంతానాన్ని ఇస్తున్నది మరో తల్లి వొడిలోకే అని సమాధాన పడ్డారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన తల్లి తన మూడేళ్ల కొడుకును కోవిడ్ నెగెటివ్ వచ్చిన తల్లికి అప్పజెప్పింది. కోవిడ్ నెగెటివ్ వచ్చిన తల్లి కోవిడ్ పాజిటివ్ వచ్చిన తన రెండేళ్ల పాపను ఎదుటి తల్లికి అప్పజెప్పింది. ఇప్పుడు ఆస్పత్రిలో కోవిడ్ వచ్చిన తల్లి–పాప ఉన్నారు. గ్యాంగ్ టక్లోని ఒక స్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో కోవిడ్ నెగెటివ్ వచ్చిన తల్లి– బాబు ఉన్నారు. ఆస్పత్రిలో ఉన్న తల్లి తన వైద్యం పొందుతూ పాప వైద్యాన్ని చూసుకోవాలి. క్వారంటైన్లో ఉన్న తల్లి తన బాగు చూసుకుంటూ బాబును చూసుకోవాలి. గడులు మారిన బంట్లలా ఉన్న ఈ తల్లుల హృదయాలు ఎంత మాత్రం ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. ఆస్పత్రిలో ఉన్న ఇద్దరూ క్షేమంగా బయటకు వస్తేనే ఇరువురికీ సంతృప్తి. ఇవన్నీ భవిష్యత్తులో భావితరాలు చెప్పుకోబోయే కరోనా గాథలు. సినిమాలుగా మారనున్న కథలు. కరోనా... ఇంకా ఇలాంటివి ఎన్ని చూపించనున్నావు? -
సిక్కిం మరో దేశంగా ప్రభుత్వ ప్రకటన!
న్యూ ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం తప్పులో కాలేస్తూ జారీ చేసిన ఓ పత్రికా ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఇందులో సిక్కింను ప్రత్యేక దేశంగా పరిగణించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఢిల్లీ ప్రభుత్వం హుటాహుటిన తప్పును సరిదిద్దుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ డిఫెన్స్ కార్పొరేషన్లో వాలంటీర్లుగా చేరాలనుకునేవారి కోసం ప్రకటన విడుదల చేసింది. పలు పత్రికల్లోనూ ఈ యాడ్ అచ్చయింది. అందులో భూటాన్, నేపాల్ దేశాల సరసన సిక్కింను కూడా చేర్చింది. దేశంలో అంతర్భాగమైన సిక్కింను ప్రత్యేక దేశంగా పరిగణించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. (ఈ రోడ్డు చాలా ‘హైట్’ గురూ...) కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి ఇదే అదనుగా భావించిన బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రంగా మండిపడింది. ఈశాన్య ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసిన అర్వింద్ కేజ్రీవాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టింది. దీనిపై స్పందించిన ఆప్.. హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్రకటన జారీ చేశామని వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ ప్రకటన సిక్కిం ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్ ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సదరు ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఈ దారుణ తప్పుకు కారణమైన సంబంధిత అధికారిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. కాగా సిక్కిం ప్రత్యేక రాష్ట్రంగా 1975 మే 16న అవతరించింది. వారం రోజుల కిందటే రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంది. (క్రమశిక్షణతో కొమ్ములు వంచారు) -
సిక్కింలో హిమపాతం.. జవాను గల్లంతు
న్యూఢిల్లీ: సిక్కింలో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న భారత సైనిక బృందంపై పెద్ద ఎత్తున మంచు చరియలు విరిగిపడ్డాయి. వివరాలు.. ఉత్తర సిక్కిం ప్రాంతంలోని లుగ్నాక్ లాలో సుమారు 17 నుంచి 18 మంది సైనికులు పెట్రోలింగ్-కమ్-స్నో క్లియరెన్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి మంచు చరియలు ఈ బృందంపై విరుచుకు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక సైనికుడిని మినహా మిగతా వారందరిని రక్షించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గల్లైంతన సైనికుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. మిగతా జవాన్లంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
క్రమశిక్షణతో కొమ్ములు వంచారు
అవన్నీ వెనుకబడిన రాష్ట్రాలు.. ప్రతీ రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దులున్నాయి.. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్ ఇలా ఏదో ఒక దేశంతో సరిహద్దుల్ని పంచుకున్నాయి.. ఆరోగ్య సదుపాయాలు అంతంత మాత్రం అయినా కరోనాని కట్టడి చేశాయి.. ఎనిమిది రాష్ట్రాలకు గాను అయిదు రాష్ట్రాలు ఇప్పుడు కరోనా ఫ్రీ.. భారత్లో గోవా తర్వాత అందరూ ఈశాన్య రాష్ట్రాలవైపే చూస్తున్నారు. చైనా సహా అం తర్జాతీయ సరిహద్దులున్న అస్సాం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని మొదట్లో ఆందోళన ఉండేది. కానీ సిక్కిం, నాగాలాండ్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అస్సాంలో నాగాలాండ్ వాసి ఒకరు కరోనా బారిన పడ్డారు. కానీ సిక్కింవాసులెవరికీ ఈ వైరస్ సోకలేదు. ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించడం, ప్రజలు క్రమశిక్షణతో ప్రభుత్వం గీసిన గీత దాటకపోవడంతో అయిదు రాష్ట్రాలు కరోనా కొమ్ములు వంచాయి. అయితే ఇప్పు డు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఈ రాష్ట్రాలకు వస్తున్నాయి. దీనివల్ల ఎక్కడ కేసులు పెరుగుతాయా అన్న ఆందోళనైతే నెలకొంది. ఇక త్రిపురలో కేసులు పెరగడం, అస్సాంలో కూడా ప్రతీరోజూ కేసులు నమోదు అవుతూ ఉండడంతో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి 100 కేసులకి చేరడానికి 40 రోజులు పడితే కేవలం నాలుగు రోజుల్లోనే రెట్టింపై 200 దాటేశాయి. సిక్కిం కేసుల్లేవ్ ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. సిక్కింకి చైనాతో పాటు భూటాన్, నేపాల్ సరిహద్దులుగా ఉన్నాయి. జనవరిలో భారత్లో తొలి కేసు నమోదవగానే కేంద్రం ఆదేశాల గురించి సిక్కిం వేచి చూడలేదు. సరిహద్దుల వెంబడి నాలుగు చెక్పోస్టులు ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్కి తరలించింది. మార్చి 5 నుంచే అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసేసింది. విదేశీ పర్యాటకులెవరినీ రానివ్వలేదు. ముఖ్యంగా చైనాతో వాణిజ్యం జరిగే నాథులా మార్గాన్ని బంద్ చేసింది. మార్చి రెండోవారం నుంచి రద్దీ ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు, థియేటర్లు, పార్కులు వంటివి మూసేసింది. ఇక పూర్తి స్థాయి లాక్డౌన్ మార్చి 25 నుంచి అమలు చేసింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ స్వయంగా కోవిడ్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఒక్క కేసు నమోదు కాకుండా చూసుకున్నారు. మిజోరం మిజోరం రాష్ట్రానికి మయన్మార్తో 510 కి.మీ. సరిహద్దు, బంగ్లాదేశ్తో 318 కి.మీ. సరిహద్దు ఉంది. అయినా మిజోరంలో కేవలం ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. 45 రోజుల పాటు కరోనాతో పోరాటం చేసిన కరోనా రోగిని శనివారం డిశ్చార్జ్ చేశారు. 50 ఏళ్ల వయసున్న చర్చి ఫాదర్ అయిన అతను ఆమ్స్టర్డ్యామ్కి వెళ్లి వచ్చారు. ఏప్రిల్ 27న ఆయనకి కరోనా పా జిటివ్ వచ్చింది. ఆయన కోలుకోవడంతో మిజోరం కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరించింది. సాధించింది ఇలా .. ► ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న భూభాగానికి 99శాతం చైనా, మయన్మార్, సహా వివిధ దేశాల సరిహద్దులున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉన్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్ని దేశవ్యాప్త లాక్డౌన్కి చాలా రోజుల ముందే మూసేశాయి. ► ఈ ప్రాంత ప్రజల్లో క్రమశిక్షణ చాలా ఎక్కువ. ప్రభుత్వం నిర్దేశించిన లాక్డౌన్ నిబంధనల్ని ఎవరూ ఉల్లంఘించలేదు. ఇంటిపట్టునే ఉంటూ మరెక్కడ లేని విధంగా ప్రభుత్వాలకి ప్రజలు సహకరిస్తున్నారు. ► ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో ప్రకృతి విధ్వంసం జరగలేదు. ప్రజలంతా కాలుష్యం లేని గాలి పీలుస్తూ, కల్తీ లేని తిండి తింటూ ఆరోగ్యంగా ఉంటారు. సంప్రదాయాలను గౌరవిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటారు. ► ఎనిమిది రాష్ట్రాలకి కలిపి కేంద్రంలో డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్ అనే మంత్రిత్వ శాఖ ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్రం కూడా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటోంది. ► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్కి తరలించడం వంటి చర్యలన్నీ అత్యంత పకడ్బందీగా అమ లు చేశారు. ఇతర రాష్ట్రాలన్నీ మొదట్లో 14 రోజుల క్వారంటైన్ అమలు చేస్తే ఈశాన్యంలో 21 రోజులు లాక్డౌన్ని అమలు చేశారు. -
భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ..
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా జవాన్ల మధ్య ఆదివారం ఉదయం ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిక్కిం సెక్టార్ ‘నకులా’ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘర్షణ సమయంలో దాదాపు 150 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత చైనా జవాన్లు కవ్వింపు చర్యలకు దిగడంతో.. ఇరువురి మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. అనంతరం చిన్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారి ఘర్షణకు కారణమైందని సమాచారం. అయితే ఈ ఘర్షణ అనంతరం ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నారు. ఈ సంఘటనలో నలుగురు భారత జవాన్లు గాయపడ్డారని ఆర్మీ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. కాగా చాలా కాలం తర్వాత ఇలాంటి ఘటన జరిగింది. సాధారణంగా.. భారత్-పాక్ సరిహద్దుల వద్ద ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే చైనా, భారత్ల మధ్య ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో డోక్లామ్ విషయంలో భారత్, చైనా జవాన్ల మధ్య యుద్దవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరు దేశాల జవాన్ల మధ్య అనేక ఘర్షణలులు చోటుచేసుకున్నాయి. తాజాగా అదే తరహా ఘటన నకులా సెక్టార్లో చోటు చేసుకుంది. చదవండి: ఆశలు రేపుతున్న ఫేజ్–2 ట్రయల్ వైట్హౌస్కి కరోనా దడ -
కరోనా నుంచి బయటపడ్డ 5 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, త్రిపుర కోవిడ్-19 లేని రాష్ట్రాలుగా నిలిచాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలోని మిగతా మూడు రాష్ట్రాలైన అసోం, మిజోరం, మేఘాలయా.. కరోనా ఫ్రీ కానప్పటికీ తాజాగా కోవిడ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ముప్పు తక్కువగా ఉందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్ల నుంచి ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు. (కరోనా వైరస్.. మరో దుర్వార్త) ‘దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యవసర సరుకుల కొరత రాకుండా కార్గో విమానాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు తరలిస్తున్నాం. ఎయిర్ ఇండియా, ఇండియన్ వాయుసేన ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్లకు ప్రాధాన్యతా క్రమంలో సరుకులు పంపిస్తున్నామ’ని జితేంద్ర సింగ్ తెలిపారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కట్టడికి షిల్లాంగ్లోని ఈశాన్య అభివృద్ధి మండలితో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ కంటే ముందే కేంద్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. (లాక్డౌన్ సడలింపా.. అదేం లేదు: సీఎం) -
ఈ యాప్స్ గురించి ఎందరికి తెలుసు ?!
సాక్షి, న్యూఢిల్లీ : భూకంపాలు, సునామీలు రావడం, అగ్ని పర్వతాలు రాజుకోవడం, అడవులు తగలబడడం, అధిక వర్షాలతో వరదలు ముంచెత్తడం లాంటి ప్రకృతి ప్రళయాలు సంభవించినప్పుడే కాకుండా కరోనా వైరస్, సార్స్, మెర్స్లాంటి వైరస్లు విజృంభించినప్పుడు మానవ జాతి ఎంతో నష్టపోతోంది. అలాంటప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు భారత్ సంక్షోభ నివారణ వ్యవస్థ ఒకటి ఏర్పాటై ఉంది. అయితే నష్టాన్ని అరికట్టడం ఆ ఒక్క సంస్థ వల్ల సాధ్యమయ్యే పనికాదు. ప్రజలంతా ఒకరికొకరు సాయం చేసుకోవడమే కాకుండా ఎక్కడ, ఎవరికి, ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో? అందుకు ఎలాంటి సాయం అవసరం అవుతుందో ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయాల్సిన బాధ్యత ప్రజలకుంది. నేటి ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో ఆ బాధ్యత మరింత పెరిగింది. అలా సమాచారాన్ని చేరవేయడానికి భారత్లో 33 యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఉచితంగా లభించే యాప్స్. ఆండ్రాయిడ్ బేస్డ్గా ఉన్న ఈ యాప్స్ అన్నీ ‘గూగుల్ ప్లే స్టోర్’లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఈ యాప్ల గురించి ఎవరికి పెద్దగా తెలియదని, తెల్సినా వినియోగం తక్కువేనని జపాన్లోని కియో యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. వీటిలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు ప్రవేశపెట్టినవి ఉన్నాయి. 2005లో ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్’ తీసుకొచ్చాక ఈ యాప్లన్నీ పుట్టుకొచ్చాయి. ఈ 33 యాప్స్లో ఐయోవా లీగల్ ఎయిడ్, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్, బిల్డింగ్ ఇవాక్ అనే యాప్స్ మాత్రం భారత్ను దష్టిలో పెట్టుకొని రూపొందించినవి ఎంతమాత్రం కాదు. అవి అందించే విషయ పరిజ్ఞానం భారతీయులకు కూడా ఎంతో అవసరం కనుక ఆ మూడింటిని కూడా 30 యాప్స్తో కలిపి కియో యూనివర్శిటీ బృందం, ఎందుకు వీటికి ఎక్కువ ఆదరణ లేకుండా పోతుందనే విషయంపై ఈ అధ్యయనం జరిపింది. వీటిలో 18 యాప్స్ ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించేవి మాత్రమేనట. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్తో వచ్చిన ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాప్’ను ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారట. ఇది పలు రకాల ప్రకతి వైపరీత్యాల గురించి సమాచారం అందించడమే కాకుండా కొన్ని ముందు జాగ్రత్తలు సూచిస్తోందట. ఐదు యాప్స్ మాత్రం రాష్ట్రానికి, సిటీకి మాత్రమే పరిమితమై ఉన్నాయట. ‘సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ’ యాప్ కేవలం సిక్కిం రాష్ట్రానికే పరిమితమైనది. వీటిలో ఏడింటికి మాత్రమే జీపీఎస్ సెన్సర్లు కలిగి ఉన్నాయి. వాటిలో నాలుగు యాప్స్ ప్రాథమిక ఫంక్షన్నే కలిగి ఉన్నాయి. ఇలా ప్రతి దానిలో ఏదో ఒక లోపం ఉండడమే వల్లనే వీటికి ఎక్కువగా ఆదరణ లేకపోయిందని యూనివర్శిటీ బందం కేంద్రానికి ఓ నివేదికను సమర్పించింది. ఆ మధ్య ముంబై నగరంతోపాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వరదలు వచ్చినప్పుడు వీటిలో కొన్ని యాప్స్ బాగానే ఉపయోగపడ్డాయట. -
ఢిల్లీలో అదృశ్యమైన ఇద్దరు వైద్యుల ఆచూకీ లభ్యం
-
తెలుగు వైద్యుల ఆచుకీ లభ్యం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదృశ్యమైన ఇద్దరు తెలుగు వైద్యుల ఆచూకీ లభించింది. డిసెంబర్ 25వ తేదీన కనిపించకుండా పోయిన హిమబిందు, ఆమె స్నేహితుడు దిలీప్ సత్యలు సిక్కింలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని సురక్షితంగా ఢిల్లీకి తరలించారు. సోషల్ మీడియా సాయంతో పోలీసులు వీరిని వెతికి పట్టుకున్నారు. డిసెంబర్ 31వ తేదీన దిలీప్ సిక్కింలో ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆదృశ్యానికి గల కారణాలపై పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాగా, శ్రీధర్, దిలీప్, హిమబిందు ముగ్గురు ఎంబీబీఎస్లో క్లాస్మేట్స్. అలాగే ఆత్మీయ మిత్రులు. శ్రీధర్ అతని భార్య హిమబిందు ప్రస్తుతం ఢిల్లీలో వైద్యులుగా పనిచేస్తున్నారు. మరోవైపు చండీగఢ్లో పీజీ చేసిన దిలీప్, అక్కడే సీనియర్ రెసిడెన్సీసిగా చేసి.. 2 నెలల క్రితం మానేశాడు. ప్రస్తుతం ఉన్నత చదువులకు సన్నద్దమవుతున్నాడు. అయితే 25వ తేదీన మధ్యాహ్నం బయటకు వెళ్లిన హిమబిందు, దిలీప్లు కనిపించకుండా పోయారు. ఆ తర్వాత వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో శ్రీధర్ ఢిల్లీ హాజ్కాస్ పోలీసులను ఆశ్రయించాడు. చంఢీగడ్లో ఉంటున్న దిలీప్ భార్య దివ్య.. భర్త ఆచూకీ తెలియకపోవడంతో అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుంది. శ్రీధర్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వారి గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. రెండు ఫోన్లు సిచ్ఛాఫ్ రావడం.. వారిద్దరు రోడ్డుపై నడుస్తున్న ఓ వీడియో మాత్రమే లభించడంతో కేసు దర్యాప్తు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఎన్నో అనుమానాలు తలెత్తాయి. చివరకు సోషల్ మీడియా సాయంతో పోలీసులు వారి ఆచూకీని గుర్తించారు. చదవండి : ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం -
ఆ బిల్లుకు నేను పూర్తి వ్యతిరేకం: మాజీ కెప్టెన్
గ్యాంగ్టక్: వివాదాస్పద పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లు 'అత్యంత ప్రమాదాకారి' అని భారత పుట్బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా(43) అన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి భారత్కు తరలి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు తాను పూర్తి వ్యతిరేకిని అని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లు సిక్కిం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేయలేదని సిక్కింకు చెందిన ఈ ఫుట్బాల్ దిగ్గజం అభిప్రాయపడ్డారు. ‘బంగ్లాదేశ్కు దగ్గరగా ఉన్న కారణంగా ఇప్పటికే బెంగాల్, ఇతర ఈశాన్య రాష్ట్రాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇక సిక్కిం రాష్ట్రం కూడా బంగ్లాదేశ్కు చాలా దగ్గరగా ఉన్న కారణంగా దీర్ఘకాలంలో ప్రభావితమవుతుంది’ అని 'హమ్రో సిక్కిం పార్టీ' అధినేత భైచుంగ్ భూటియా పేర్కొన్నారు. సిక్కిం క్రాంతికారి మోర్చా, బీజేపీ సారథ్యంలో నడుస్తున్న సిక్కిం ప్రభుత్వం.. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతర ఈశాన్య బీజేపీ మిత్రపక్షాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంతేకాక శాసనసభలో ఈ అంశానికి సంబంధించి తాను, తన పార్టీ వ్యతిరేకంగా వాదిస్తామన్నారు. సిక్కిం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హమ్రో సిక్కిం పార్టీ సిద్ధంగా ఉందని, అవసరమైతే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసేందుకు సిద్ధమని భైచుంగ్ అన్నారు. సిక్కింలో ఆర్టికల్ 371 (ఎఫ్)లో సిక్కిం సబ్జెక్ట్ యాక్ట్, రాజ్యాంగం ఉందన్నారు. కాగా ముస్లింలపై వివక్ష చూపేందుకు బీజేపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని, ఈ మతతత్వ బిల్లుకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు వాదిస్తున్న విషయం తెలిసిందే. -
ఆ టీచర్ డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా..
గాంగ్టక్ : బాలల దినోత్సవం నాడు తమ పాఠశాల చిన్నారులను ఉత్తేజపరిచేందుకు సిక్కిం స్కూల్కు చెందిన ఓ టీచర్ చేసిన డ్యాన్స్ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటూ వైరల్గా మారింది. రణ్వీర్సింగ్ హీరోగా నటించి 2015లో విడుదలైన బాజీరావు మస్తానిలోని హిట్ సాంగ్ మల్హారికి స్కూల్కు చెందిన సాంస్కృతిక అంశాలు బోధించే టీచర్ షెరింగ్ దొమ భూటియా చేసిన నృత్యం విద్యార్ధులతో పాటు తోటి టీచర్లు, పాఠశాల సిబ్బందినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటకు ఆమె హుషారుగా వేసిన స్టెప్స్ రణ్వీర్సింగ్ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఆమె చూపిన జోరు వీక్షకులను కట్టిపడేసింది. రణ్వీర్ స్టెప్పులను సరిపోలినట్టుగా ఆమె నృత్యరీతులు ఆకట్టుకున్నాయి. మెల్లి గవర్న్మెంట్ సెకండరీ స్కూల్లో షెరింగ్ ఇచ్చిన డ్యాన్స్ ఫెరఫామెన్స్ వీడియోను స్కూల్ ఫేస్బుక్లో షేర్ చేసింది. -
ఈ రోడ్డు చాలా ‘హైట్’ గురూ...
గ్యాంగ్టక్ : సిక్కింలోని కెరంగ్-జొడాంగ్ల మధ్య 18,600 అడుగుల ఎత్తులో 19 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండో రహదారిగా నిలుస్తుంది. 2021కల్లా రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సరిహద్దు రోడ్ల సంస్థ (బీఆర్ఓ) అధికారి తెలిపారు. 2015లో మంజూరైన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కొండలను తవ్వే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రోడ్డు 3.75 మీటర్ల వెడల్పు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతం టూరిజం పరంగా అభివృద్ధి చెందుతున్నందున సాధారణ పౌరులు తిరిగేందుకు కూడా ఆర్మీ అనుమతించే అవకాశం ఉందని తెలిపారు. -
బీజేపీలోకి 10 మంది ఎమ్మెల్యేలు
గ్యాంగ్టక్: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేని లేదా అధికార సంకీర్ణంలో లేని రాష్ట్రం సిక్కిం ఒక్కటే. తాజాగా ఆ రాష్ట్రంలోనూ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కమలదళం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈశాన్య రాష్ట్రాల పార్టీ ఇన్చార్జి రాంమాధవ్ల సమక్షంలో మంగళవారం వారు బీజేపీలో చేరారు. ప్రస్తుతం సిక్కింలో ఎస్కేఎం అధికారంలో ఉంది. ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 32 స్థానాలకు గానూ 17 సీట్లను ఎస్కేఎం గెలుచుకుంది. పవన్ కుమార్ చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్ 15 సీట్లను గెలుచుకుంది. వారిలో ఇద్దరు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి ప్రస్తుతం 13 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలో 10 మంది ఇప్పుడు బీజేపీలో చేరడంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీకి ఇప్పుడు సిక్కిం లో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించనుంది. మూడింట రెండు వంతులకు పైగా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినందున ఫిరాయింపుల నిరోధక చట్టం వారికి వర్తించదు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని రాంమాధవ్ చెప్పారు. -
బీజేపీ తదుపరి ఆపరేషన్ ఆకర్ష్.. సిక్కిం?
గ్యాంగ్టక్ : సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ(సీడీఎఫ్) నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సిక్కింలో బీజేపీకి ఒక్క సీటుకూడా లేకపోవడం గమనార్హం. దీంతో సిక్కింలో ప్రతిపక్షపార్టీ అయిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీని తాజా చేరికలతో బీజేపీ విలీనం చేసుకోవడంతో ఆ పార్టీ అక్కడ రెండోస్థానంలో నిలిచింది. 25 సంవత్సారలకుపైగా సిక్కిం డెమోక్రటిక్పార్టీ అధ్యక్షుడు పవన్కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా పాలన అందించారు. ఆయన దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2019లో పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. ఇప్పుడీ తాజా చేరికలతో ఆ పార్టీలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు. 2019లో మొత్తం 32 స్థానాలకు ఎన్నికలు జరుగగా 17 స్థానాలు గెలుచుకొని ప్రేమ్సింగ్ తమంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అక్కడ బీజేపీ పోటీచేసినా ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. ఇప్పుడు ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు చేరడంతో అక్కడ కూడా బీజేపీ పార్టీ బలపడినట్లయింది. పార్టీమారిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ప్రధాని నరేంద్రమోదీ లుక్ ఈస్ట్ విధానం నచ్చిందని, మేం సిక్కింలో కమల వికాసం కోరుకుంటున్నామని’ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ సిక్కింలో ఇక నుంచి మేం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలో ఎమ్మెల్యేలు చేరితే ఫిరాయింపులను ప్రోత్సహించిందనే నిందను మోయకుండా మూడింట రెండు వంతుల సంఖ్యలో పార్టీలో చేర్చుకుంటూ రాజ్యాంగబద్దంగానే బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీడీఎఫ్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు విమర్శించారు. సిక్కింలో కూడా పాగా వేస్తే సెవెన్ సిస్టర్స్ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలలో పది సంవత్సరాల క్రితం ఉనికిలో కూడా లేని బీజేపీ నేడు సిక్కిం మినహా మిగతా అన్ని ఈశాన్యరాష్ట్రాలలో ఏదో ఒక విధంగా అధికారంలో ఉంది. ఇక సిక్కింలో తాజా చేరికలతో ఆ పార్టీ అధికారానికి కేవలం ఆరుగురు ఎమ్మెల్యేల దూరంలో ఉంది. అక్కడ రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, అలాగే అధికార పార్టీకి మెజార్టీ తక్కువ ఉండటం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టులో బీజేపీ కేసు వేయడం చూస్తుంటే అతి దగ్గరలోనే మరో కర్ణాటక, గోవా రాజకీయాలను సిక్కింలో చూస్తామనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా సిక్కిం రాష్ట్రం నేపాల్, చైనా, భూటాన్ దేశాల సరిహద్దులో ఉండటంతో వ్యూహాత్మకంగా భారత్కు కీలకమైన రాష్ట్రంగా ఉంది. -
సిక్కిం సీఎంగా ప్రేమ్సింగ్ ప్రమాణస్వీకారం
గ్యాంగ్టక్ : సిక్కిం క్రాంతికారి మోర్ఛా(ఎస్కేఎమ్) అధ్యక్షుడు ప్రేమ్సింగ్ తమాంగ్ సోమవారం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రేమ్ సింగ్ తమాంగ్తో గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేపించారు. పల్జోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిక్కిం క్రాంతికారి మోర్ఛా మద్దతు దారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రేమ్ సింగ్ నేపాలి భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కిం అసెంబ్లీలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎస్కేఎమ్, ఎస్డీఎఫ్ పార్టీల మధ్య హోరాహోరి పోరు జరిగింది. ఎస్కేఎమ్ 17 స్థానాల్లో గెలుపొందగా, ఎస్టీఎఫ్ 15 స్థానాలతో తృటిలో అధికారాన్ని కోల్పోయింది. -
ఓటేసి మురిసిన 107 ఏళ్ల బామ్మ
గ్యాంగ్టక్ : లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇక సిక్కింలో 107 సంవత్సరాల సుమిత్రా రాయ్ దక్షిణ సిక్కింలోని పాక్లోక్ కమ్రాంగ్ పోలింగ్ కేంద్రానికి వీల్ ఛైర్లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆమె ఉత్సాహంగా తన ఓటరు గుర్తింపు కార్డును ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. మరోవైపు 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన 126 ఏళ్ల చంద్రవదియ అజిబెన్ సిదభాయ్ అత్యధిక వయసు కలిగిన ఓటరుగా నిలిచారు. -
అక్కడ మామూలు వ్యక్తులు ఓటు వేయలేరు!
గ్యాంగ్టక్: ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలంటే ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలి. కానీ, సిక్కింలోని ఓ నియోజకవర్గంలో ఓటువేయాలంటే మాత్రం ప్రత్యేక వర్గానికి చెందిన సంఘాల ద్వారా గుర్తింపు పొందాలి. రాష్ట్రంలోని 32 నియోజకవర్గాలను ‘సంఘా’ అనే సన్యాసిల వర్గానికి కేటాయించారు. 2800 ఓటర్లున్న సంఘా నియోజకవర్గంలో.. ఎన్నికల్లో పోటీచేయాలన్నా, ఓటు హక్కు వినియోగించాలనుకున్నా దాదాపు 111 మఠాల్లో ఏదైనా ఒక మఠం ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. అందుకేనేమో భౌగోళిక చిత్రపటంలో సంఘా అసెంబ్లీ నియోజకవర్గం లేకుండాపోయింది. కనీసం దీని సరిహద్దులను కూడా ఇప్పటివరకు నిర్ణయించలేదు. ఎన్నికల సమయంలోనూ వీరికి ప్రత్యేకమైన ఈవీఎంలను కేటాయిస్తారు. సిక్కింలో జరిగే త్రిముఖపోటీలో పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీపీ), పీ.ఎస్ గోలే ఆధ్వర్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎమ్), మాజీ ఫుట్బాల్ క్రిడాకారుడు బైచుంగ్ భూటీయ నెలకొల్పిన హమ్రో సిక్కిం పార్టీ(హెచ్ఎస్పీ), భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పోటీలో ఉన్నాయి. ప్రస్తుత సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్.. ఈ ఎన్నికలలో విజయం సాధించి వరుసగా ఆరోసారి అధికారాన్ని చేపట్టి రికార్డు సృష్టించేందుకు సిద్దమయ్యారు. ఇదిలా ఉండగా చామ్లింగ్ పోక్లోక్-కమరంగ్, నామ్చీ-సింగీథాంగ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయగా, భూటీయ గ్యాంగ్టక్, ట్యూమెన్ లింగి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ రాష్ట్రంలో 4,23,325 మంది ఓటర్లు ఉండగా..32 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్సభ స్థానాలు ఉన్నాయి. -
సిక్కింలో చిన్న పార్టీలే లక్కీ
దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలే ఎక్కువగా అధికారంలో ఉంటాయి. అప్పుడప్పుడు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా మొత్తం మీద చూస్తే జాతీయ పార్టీ ప్రభుత్వాలదే మెజారిటీ. సిక్కిం దీనికి పూర్తిగా మినహాయింపు. 1975లో ఈ రాష్ట్రం భారత్లో విలీనమైనప్పటి నుంచి ఇంత వరకు ఇక్కడ ఏ జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకున్నాయి. 1979, అక్టోబర్లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో నర్బహదూర్ భండారీ నాయకత్వంలోని సిక్కిం జనతా పరిషత్ (ఎస్జేపీ) 31 సీట్లకుగాను 16 సీట్లలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో రెండు ప్రాంతీయ పార్టీలు సిక్కిం కాంగ్రెస్ (రివల్యూషనరీ)11, సిక్కిం ప్రజాతంత్ర కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకున్నాయి. తర్వాత ఎస్జేపీ కాంగ్రెస్లో విలీనమైంది. కొంత కాలం తర్వాత భండారీ బయటకొచ్చేసి సిక్కిం సంగ్రామ్ పరిషత్ (ఎస్ఎస్పీ) పేరుతో ప్రాంతీయ పార్టీ పెట్టారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 30 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1989 ఎన్నికల్లో భండారీ పార్టీ మొత్తం 32 స్థానాలను గెలుచుకుంది. 1990లో ఎస్జేపీ నేత పవన్కుమార్ చామ్లింగ్ భండారీపై తిరుగుబాటు చేశారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 1994 ఎన్నికల్లో ఆ పార్టీ 19 సీట్లు గెలుచుకుని గద్దెనెక్కింది. 1999 ఎన్నికల్లో 24 సీట్లతో ఎస్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఎస్ఎస్పీ ప్రధాన ప్రతిపక్షమైంది. 2004, 2009, 2014 ఎన్నికల్లో కూడా చామ్లింగ్ పార్టీ ఘన విజయం సాధించి ఐదుసార్లు వరసగా అధికారం చేపట్టిన పార్టీగా రికార్డు సృష్టించింది. ఈసారి అసెంబ్లీకి, లోక్సభ(ఒకటే సీటు)కు కలిసి ఏప్రిల్ 11న ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని 371(ఎఫ్) అధికరణం సిక్కిం ప్రజల ప్రత్యేక హక్కుల పరిరక్షణకు హామీ ఇస్తోంది. తమ హక్కులను ప్రాంతీయ పార్టీలే పరిరక్షించగలవన్న గట్టి నమ్మకం ప్రజల్లో పాతుకుపోయిందని, జాతీయ పార్టీలను వేటినీ వారు నమ్మరని, అందుకే వారు జాతీయ పార్టీలను ఆదరించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. -
55 బంతుల్లోనే 147 పరుగులు
ఇండోర్: ముంబై యువ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి రోజు రికార్డు శతకంతో మెరిశాడు. సిక్కింతో జరిగిన మ్యాచ్లో 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్లతో 147 పరుగులు సాధించాడు. టి20 క్రికెట్లో (అంతర్జాతీయ మ్యాచ్లు కలిపి) భారత్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. గత ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ తరఫున సన్రైజర్స్పై రిషభ్ పంత్ (128 నాటౌట్) చేసిన స్కోరును అయ్యర్ అధిగమించాడు. ఈ క్రమంలో అయ్యర్ 38 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. అతని దూకుడుకు సిక్కిం మీడియం పేసర్ తషీ భల్లా ఒకే ఓవర్లో 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రిషభ్ పంత్ (12) రికార్డునే సవరిస్తూ 15 సిక్సర్లు బాదిన అయ్యర్ ఓవరాల్గా టి20ల్లో నాలుగో స్థానంలో నిలిచాడు. శ్రేయస్ జోరుతో ముంబై 154 పరుగుల భారీ తేడాతో సిక్కింను చిత్తుగా ఓడించింది. అయ్యర్కు తోడు సూర్య కుమార్ యాదవ్ (63) రాణించడంతో ముందుగా ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 258 పరుగులు చేసింది. రహానే (11), పృథ్వీ షా (10) విఫలమయ్యారు. అనంతరం సిక్కిం 20 ఓవర్లలో 7 వికెట్లకు 104 పరుగులు చేయగలిగింది. 61 బంతుల్లో పుజారా సెంచరీ ఇండోర్: భారత టెస్టు బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా తనపై అందరికీ ఉన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగిపోయాడు. రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్ర తరఫున ఓపెనర్గా బరిలోకి దిగి పుజారా (61 బంతుల్లో 100 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. అయితే చివరకు మ్యాచ్లో 5 వికెట్లతో రైల్వేస్కే విజయం దక్కింది. ముందుగా సౌరాష్ట్ర 3 వికెట్లకు 188 పరుగులు చేయగా... రైల్వేస్ 5 వికెట్లకు 190 పరుగులు సాధించింది. ►4టి20ల్లో భారత్ తరఫున అయ్యర్ (38 బంతుల్లో) నాలుగో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. పంత్ (32), రోహిత్ (35), యూసుఫ్ పఠాన్ (37) ఈ జాబితాలో ముందున్నారు. -
సిక్కిం మ్యూజియం అవినీతి
నవాంగ్ గ్యాట్సో లాచెంపా ఒక నవ యువకుడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లి చదువుకున్న విద్యావంతుడు. చాలామంది వలె విదేశాల్లోనే స్థిరపడి అక్కడ డాలర్లు సంపాదించాలనుకునే (వి)దేశ భక్తుడు కాదు నవాంగ్. తన ప్రాంతానికి రావాలని, అక్కడ తన చదువుతో ఏమైనా చేయాలని అనుకున్న వాడు. కాని తీరా సిక్కింకు చేరుకున్న తరువాత అతనికి అవినీతి విలయతాండవం చేస్తూ కనబడింది. అక్కడా ఇక్కడా వ్యాపించిన భ్రష్టాచారాన్ని ఏ విధంగా ఆపడం? చివరకు మ్యూజియంలో కూడా అవినీతి. కనిపించిన దారి ఆర్టీఐ. ఆర్టీఐకి దరఖాస్తు దాఖలు చేశాడు. మ్యూజియం గ్రాంట్ స్కీం పైన నిపుణుల సంఘం 29.12.2016నాడు జరిపిన 14వ సమావేశం నిర్ణయాలు (మినిట్స్) ప్రతులు ఇవ్వాలన్నాడు. ఈ సమావేశం జరిగిందని సాంస్కృతిక మంత్రిత్వశాఖ అంతర్జాల వేదికమీద రాశారని, ఈ సమావేశం సిక్కిం రాష్ట్ర మ్యూజియం ప్రాజెక్టు (అంచనా 1574 లక్షల రూపాయలు) గురించి జరిగిందని చెప్పారు. 31 డిసెంబర్ నాడు ఈ మెయిల్లో ప్రస్తావించిన నియమాలను పాటించకుండా రాష్ట్రం తన వంతు నిధులు ఇవ్వకపోతే ఏ చర్యలు తీసుకుంటారని కూడా అడిగారు. సీపీఐఓ ఏ సమాధానమూ ఇవ్వలేదు. సిక్కిం రాష్ట్రానికి మ్యూజియం గ్రాంట్ స్కీంను మంజూరు చేసిన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ స్కీం అమలులో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై తగినచర్యలు తీసుకోవాలని రెండో అప్పీల్లో కోరారు. డిసెంబర్ 31, 2016 న కేంద్రం మంజూరు చేసిన నిధులను సిక్కిం రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల వారసత్వ శాఖ కార్యాలయంలో అధికారులు మింగారని కమిషన్కు విన్నవించారు. మ్యూజియం గ్రాంట్ స్కీంకు 1574 లక్షలు కేటాయించి, 500 కోట్లు విడుదల చేశారు. దీంతో సిక్కిం రాష్ట్ర మ్యూజియంను పునరుద్ధరించి ఆధునీకరించేందుకు రాష్ట్రం వంతుగా 10 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఎనిమిదినెలలు గడిచినా ప్రాజెక్టు మొదలు కాలేదు. రాష్ట్రంలో వివరాలు ఇవ్వకపోవడంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి 8.4. 2018న ఫిర్యాదు చేశారు. సిక్కిం మ్యూజియం స్కీంలో నిధుల గల్లంతు జరిగిందని, ప్రాజెక్టు నిధులు లక్ష్యాల సాధనకు వినియోగించడం లేదని నవాంగ్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ పనులపైన నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మంజూరీ లేఖ నుంచి మ్యూజియం గ్రాంట్ స్కీంపైన నిపుణుల కమిటీ 29 డిసెంబర్ 2016 నాటి 14వ మీటింగ్ నిర్ణయాల నివేదిక దాకా అన్ని పత్రాలు పరిశీలించిన తరువాత రూ. 3.44 కోట్లు మాత్రమే సిక్కిం రాష్ట్ర వాటాగా ఇచ్చిందని తేలింది. నవాంగ్కు అన్ని పత్రాలు ఇవ్వడంతోపాటు ఈ ఆర్టీఐ దరఖాస్తును అప్పీలును మోసంపైన ఫిర్యాదుగా భావించి, విచారణ జరిపించాలని సమాచార కమిషన్ సూచించింది. నిజానికి నవాంగ్ అడిగిన సమాచారాన్ని నిరాకరించడానికిగానీ, వాయిదా వేయడానికిగానీ వీలు లేదు. ఇటువంటి సమస్యల మీద ఫైళ్లలో సమాచారం నమోదై ఉండకపోవచ్చు. కనుక సమాధానం ఇవ్వడానికి ఏమీ ఉండకపోవచ్చు. కానీ తమ వద్ద ఈ అంశంపై ఉన్న ఏ సమాచారమైనా సరే ఇవ్వకపోవడం తప్పవుతుంది. మ్యూజియం పునరుద్ధరణ ఫైళ్లను, సంబంధిత కాగితాలను అన్నీ దరఖాస్తు దారుడికి చూపడం ద్వారా పీఐఓ తన బాధ్యతను నిర్వర్తించవచ్చు. లేదా ఆయన అడిగిన ప్రశ్నలకు తమ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా సమాధానాలు ఇవ్వాలి. లేదా పై అధికారుల ముందు ఫైల్ ఉంచి సమస్య వివరించి అధికారులు తీసుకున్న నిర్ణయాలను వివరించాలి. సమాచార హక్కు చట్టం నిష్క్రియపైన సవాలుచేసే అవకాశాన్ని కల్పిస్తుంది. నెలరోజులలోగా నిర్ణయం తీసుకోలేకపోతే ఆ విషయం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. నెలరోజులలో ఏ విషయమూ చెప్పనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని కమిషన్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ప్రభుత్వంలో నిష్క్రియ, నిష్పాలన, నిర్లజ్జ ప్రధాన సమస్యలు. సిక్కిం మ్యూజియంలో అవినీతి జరిగిందని అనేక పర్యాయాలు ఈ యువకుడు ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడు లేడు. నిష్క్రియ నిశ్చేతనంపై సవాలు చేయడానికి ఆర్టీఐని నమ్మి ఆయన సమాచారం అడిగాడు. దానికి ఏవో కారణాలుచెప్పి కేంద్రం, రాష్ట్రం తప్పించుకోజూస్తున్నాయి. ఏవైనా చర్యలు తీసుకుంటే తప్ప ఏ చర్యలు తీసుకున్నారో చెప్పడానికి ఉండదు. చర్యలు తీసుకోరు కనుక జవాబు చెప్పకుండా కుంటిసాకులు చూపుతుంటారు. ఇందుకు సిక్కిం మ్యూజియం అవినీతి కేసు మరొక ఉదాహరణ. అంతే. (నవాంగ్ గ్యాట్సో లాచెంగ్పా కేసు CIC/MCULT/A/2017/607024 లో íసీఐసీ తీర్పు ఆధారంగా) వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
సిక్కిం: విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
-
భారత వృద్ధికి చోదకశక్తి
పాక్యాంగ్ (సిక్కిం): భారత్ అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలను చోదకశక్తిగా మారుస్తామనీ, ఇందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం లో అభివృద్ధి మందగించిందన్నారు. సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని సోమవారం ఇక్కడి పాక్యాంగ్ పట్టణంలో ఆవిష్కరించిన మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మాట్లాడుతూ..‘హవాయి చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా విమానయానం చేయాలనే దిశగా మేం కృషి చేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ దేశంలో 65 విమానాశ్రయాలు ఉండేవి. కానీ గత నాలుగేళ్లలో కొత్తగా 35 విమానాశ్రయాలను మేం ప్రారంభించాం. గతంలో సగటున ఏడాదికి ఓ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే, ఇప్పుడు ఆ సంఖ్య 9 కి చేరుకుంది’ అని మోదీ చెప్పారు. పాక్యాంగ్ పట్టణంలో సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో కొండలపై 201 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. దీన్ని మోదీ ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించారు. కొత్తగా ఓ ప్రాంతంలో పూర్తిస్థాయిలో నిర్మించే ఎయిర్పోర్టును గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా పిలుస్తారు. విమానాశ్రయం ఆవిష్కరణ సందర్భంగా మోదీ నేపాలీ భాషలో ప్రసంగాన్ని ప్రారంభించారు. సిక్కిం ప్రజలు ఇక్కడి ప్రకృతి అంత అందమైనవారన్నారు. ఉదయాన్నే చల్లటిగాలి వీస్తుండగా కొండలపై నుంచి సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యం అద్భుతంగా ఉందనీ, ఈ సందర్భంగా ఫొటోలు తీసుకోకుండా తనను తాను నియంత్రించుకోలేకపోయానన్నారు. -
ఆ రాష్ట్రంలో ప్రారంభమైన తొలి ఎయిర్పోర్ట్
గ్యాంగ్టక్ : సిక్కిం తొలి ఎయిర్పోర్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. గ్యాంగ్టక్కు 33 కిలోమీటర్ల దూరంలోని పయోంగ్ వద్ద 2009లో శంకుస్ధాపన జరిగిన ఎయిర్పోర్ట్ను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా దీన్నిఅభివృద్ధి చేశారు. ఆదివారం సాయంత్రం ఎంఐ-8 విమానంలో ఇక్కడికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ గంగా ప్రసాద్, సీఎం పవన్ చామ్లింగ్ తదితరులు లివింగ్ ఆర్మీ హెలిపాడ్లో స్వాగతం పలికారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని రాజ్భవన్లో బస చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రయాణీకులకు మిగిలిన ప్రపంచంతో కనెక్టివిటీ పెరిగేందుకు ఈ విమానాశ్రయం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. -
23 ఏళ్లుగా సీఎం పదవిలో..
సాక్షి, గ్యాంగ్టక్ : ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రికార్డు ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేసిన జ్యోతి బసు సొంతం కాగా, ఇప్పుడా రికార్డును సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ చెరిపివేశారు. పాలక సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) వ్యవస్థాపకుడు పవన్ చామ్లింగ్ సిక్కిం సీఎంగా 23 ఏళ్ల నాలుగు నెలల 17 రోజల నిరాంటక సర్వీసును ఆదివారంతో పూర్తిచేసుకున్నారు. 68 ఏళ్ల పవన్ చార్మింగ్ సిక్కిం సీఎంగా తొలిసారి 1994 డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. మెట్రిక్యులేషన్ వరకూ చదివిన పవన్ 32 ఏళ్లకే రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1992లో నార్ బహదూర్ భండారి క్యాబినెట్లో పలు హోదాల్లో మంత్రిగా పనిచేశారు. రాజకీయ ఎగుడుదిగుళ్లను చవిచూసిన అనంతరం 1993లో ఆయన ఎస్డీఎఫ్ను స్ధాపించారు. 23 ఏళ్లకు పైగా సీఎం పదవిలో విధులు నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఇక విశ్రాంతి తీసుకోవాలని సిక్కిం ప్రజలు భావిస్తే సీఎం పదవి నుంచి వైదొలుగుతానని, తన సేవలు వారు కోరితే తాను కొనసాగుతానని పవన్ చామ్లింగ్ స్పష్టం చేశారు. తనకు ప్రజా సేవ మినహా సొంత ఎజెండా ఏమీ లేదన్నారు. -
ప్రజలు 6 లక్షలు.. కార్లు 50 వేలు
సాక్షి, గ్యాంగ్టక్ : సిక్కి రాష్ట్రంలో కొన్నేళ్లుగా టూరిజం, పారిశ్రామిక అభివృద్ధిలో దూసుకు పోతోందని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని చిన్న రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి. ఇక్కడ జిల్లాలు నాలుగు.. మొత్తం జనాభా 6 లక్షలు. అయితే సిక్కింలో రిజిస్టరయిన కార్ల సంఖ్య 53,636. జనాభా సగటుతో చూస్తే.. రిజిస్టరయిన కార్ల సంఖ్య చాలా ఎక్కువని రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ శాఖ చెబుతోంది. హిమాలయ రాష్ట్రంలో కొంతకాలంగా టూరిజం విపరీతంగా పెరగడంతో.. కార్ల సంఖ్య పెరుగుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి కార్ల సంఖ్య లక్షకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సిక్కిం రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ శాఖ చెబుతోంది. సిక్కింకు వాయు, రైలు రవాణా వ్యవస్థలు లేకపోవడంతో ప్రజలు అధికంగా ప్రభుత్వ, వ్యక్తిగత వాహనాల మీద ఆధారపడుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 90 శాతం ప్రజలు ప్రభుత్వ, ప్రయివేట్ టాన్స్పోర్ట్ను వినియోగిస్తున్నట్లు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ విభాగం స్పష్టం చేస్తోంది. వ్యక్తిగత కార్లు, బైక్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ఇక్కడ కూడా కాలుష్య ప్రభావం బాగానే కనిపిస్తోంది. -
ఇండియా-చైనా యుద్ధం వస్తే ఎవరికి నష్టం!
భారత్-చైనా సరిహద్దులోని సిక్కిం సెక్టర్లోని డోక్లామ్వివాదం ఫలితంగా రెండు ఆసియా దేశాల మధ్య యుద్ధమే వస్తే చైనాకే ఎక్కువ నష్టమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రపంచ జనాభాలో 35 శాతం(260 కోట్లు) నివసించే ఈ రెండు భారీ దేశాలూ ఓ చిన్నపాటి సరిహద్దు గొడవతో అసలు పోరుకు దిగుతాయా? అన్నదే ప్రస్తుత ప్రశ్న. ఈశాన్య సరిహద్దులో భారత, చైనా సేనలు కేవలం 150 మీటర్ల ఎడంలో నిలబడి ఉన్నాయి. ఒకవేళ యుద్ధమే మొదలైతే పోరు ఒక్క సిక్కిం సెక్టర్కే పరిమితం కాదనీ, అరుణాచల్నుంచి జమ్మూకశ్మీర్వరకూ దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని నిపుణుల అంచనా. 1962లో మాదిరిగా పూర్తిస్థాయి యుద్ధమే జరిగితే చైనాకు ఎదురయ్యే అననుకూల పరిస్థితులు ఎక్కువ. చైనాకు 80 శాతానికి పైగా ముడి చమురు రవాణా జరిగే మలాకా జలసంధి(మలేసియా, ఇండొనేషియా మధ్య) అండమాన్దీవులకు సమీపంలో ఉన్న కారణంగా ఈ రవాణాపై యుద్ధం ప్రభావం పడుతుంది. అండమాన్నికోబార్దీవుల్లో భారత్కు భారీ నౌకాదళ కేంద్రం ఉంది. పోరు సమయంలో చైనాకు ముడి చమురు నౌకల ప్రయాణం సాఫీగా సాగదు. ఇండియన్నేవీ చురుకుగా రంగంలోకి దిగితే, చైనా ఓడలు అండమాన్సముద్రం పక్క నుంచి పోవడం కష్టమే. భారత నేవీకున్న అతి పెద్ద స్థావరాల్లో ఇదొకటి. ఈ కారణంగానే 1999 కార్గిల్యుద్ధసమయంలో పాకిస్థాన్కు సాయం చేయడానికి చైనా ముందుకు రాలేదు. పొరుగు దేశాలన్నిటితోనూ చైనాకు తగవులే! చైనా చెప్పినట్టు డోక్లామ్వివాదం యుద్ధంగా మారితే, అది సిక్కిం సెక్టర్కే పరిమితం కాదనీ, భారత ఉత్తర సరిహద్దు యావత్తూ యుద్ధరంగమౌతుందని చైనా ఇటీవల హెచ్చరించింది. ఇదే నిజమైతే, చైనాపాకిస్థాన్ఆర్థిక కారిడార్ప్రాజెక్టులో భాగంగా పాక్ఆక్రమిత కశ్మీర్లో చైనా భారీగా పెట్టిన పెట్టుబడులు, ఆర్థిక, పారిశ్రామిక మౌలిక సౌకర్యాలు భారత సేనల దాడులకు లక్ష్యంగా మారతాయి. అప్పుడు చైనా భారీగా నష్టపోతుంది. ఇప్పటికే చైనా సర్కారు ఇక్కడ 4,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే, బర్మా రేవు చిట్టగాంగ్, మయన్నార్లోని కోకోస్కీలింగ్పోర్టులో చైనా ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ. ఇంకా ఇటీవల శ్రీలంకలోని హంబంతోతట్ రేవు, పాక్లోని గ్వాదర్పోర్టులో చైనా కొన్ని సౌకర్యాలు పొందడానికి ఒప్పందాలు కూడా చేసుకుంది. ఆఫ్రికా ‘కొమ్ము’ దేశం జిబూటీలో చైనా సైనిక స్థావరం శరవేగంతో పూర్తిచేస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆరంభమయ్యాక ఈ ప్రాంతాలన్నీ భారత నౌకాదళ దాడుల పరిధిలోకి వస్తాయి. చైనాకు తన సరిహద్దుల్లోని 14 దేశాలతో సరిహద్దు వివాదాలున్నాయి. ఇప్పటివరకూ అదుపులో ఉన్న ఈ వివాదాలు ఒకసారి భారత్, చైనాల మధ్య పోరు మొదలైతే మళ్లీ వేడెక్కుతాయని అంచనా. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు కారణంగా అమెరికా, జపాన్సైతం ప్రత్యర్థులుగా మారాయి. భారత్తో యుద్ధంలో చైనా నేవీ నిమగ్నమైతే, దక్షిణ చైనా సముద్రంలో దాని పరిస్థితి బలహీనమౌతుందని రక్షణ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్కు చెందిన తెలుగువారి ఔషధాల కంపెనీ గ్లాండ్ఫార్మాలోని 86 శాతం మూలధనవాటాను కొనుగోలు చేయడానికి చైనా ఫార్మా దిగ్గజం ఫోసన్ఫార్మా చేసిన ప్రతిపాదనకు ఈ డోక్లామ్గొడవ కారణంగా తాజాగా కేంద్ర సర్కారు అనుమతివ్వలేదని వార్తలొస్తున్నాయి. ఇండియాకూ ఇబ్బందులే! ఆసియాలో చైనా, జపాన్తర్వాత మూడో పెద్ద ఆర్థికశక్తిగా అవతరించిన భారత్కు కూడా చైనాతో తలపడితే కష్టాలు తప్పవు. చైనా అధీనంలోని టిబెట్ఎత్తయిన పీఠభూమి కావడంతో అక్కడ నుంచి పోరాటం జరిపే చైనా సైనిక దళాలకు ఇండియాపై దాడులు సులువని అంచనా. అతి శీతల వాతావరణమున్న సరిహద్దుల్లో భారత సాధారణ సైనిక దళాలు చాకచక్యంగా పోరుసాగించలేవనీ, అస్సాం రైఫిల్స్, ఇండోటిబెటన్బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్వంటి ప్రత్యేక దళాలపై ఎక్కువ ఆధారపడాల్పి ఉంటుందని రక్షణరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అదీగాక చైనాను ఆనుకుని ఉన్న ఈశాన్య ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఇంకా పూర్తికాకపోవడం కూడా ఇండియాకు యుద్ధకాలంలో ఇబ్బంది కలిగించే అంశమే. -
సిక్కింలో 158 మంది జవానులు హతం: పాక్ మీడియా
న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దులో 158 మంది భారత జవానులు మరణించారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. సోమవారం చైనా రాకెట్లతో సిక్కిం సరిహద్దులో దాడి చేసిందని చెప్పింది. ఈ ఘటనలో 158 మంది భారత జవానులు అమరులయ్యారని తెలిపింది. చైనాతో సిక్కిం సరిహద్దులో వివాదం ఉన్న సమయంలో పాకిస్తాన్ మీడియా ఈ వార్తను ప్రచురించడంతో అది వైరల్గా మారింది. పాక్ మీడియాలో వస్తున్న కథనంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అవన్నీ నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో మరో దేశ మీడియా ఇలాంటి వార్తలను ప్రచురించడం గర్హనీయమని మండిపడింది. దీనిపై మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే.. ఇలాంటి కథనాలను బాధ్యత గల మీడియా ప్రచురించదని అన్నారు. భారత్పై దుష్ప్రచారం చేసేందుకే పాకిస్తానీ మీడియా ఇలాంటి అవాస్తవ కథనాలను వండుతోందని వ్యాఖ్యానించారు. -
అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా: సీఎం
గ్యాంగ్టక్: ప్రత్యేక గుర్ఖాలాండ్ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ డిమాండ్ చేశారు. గుర్ఖాలాండ్ సమస్య కేవలం బెంగాల్ ప్రజల సమస్య మాత్రమే కాదని, అక్కడ ఉద్యమాల కారణంగా తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం సత్వరమే ఈ విషయమై జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించని పక్షంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగించడానికి తాము ఉన్నతస్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధమని సిక్కిం సీఎం చామ్లింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సిక్కిం రాష్ట్రం భౌగోళికంగా చైనా, భూటాన్, నేపాల్ రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉండటంతో ఓవైపు విదేశాల నుంచి దాడుల ముప్పు ఉండగా.. మరోవైపు పొరుగురాష్ట్రం బెంగాల్లో జరుగుతున్న ఆందోళన కారణంగా సిక్కిం సరిహద్దు ప్రాంతాల్లో రవాణా, వస్తు సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. వీటి కారణంగా సిక్కిం ప్రజలు భారీ పరిణామాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఓ వైపు చైనా, మరోవైపు బెంగాల్ల మధ్య తమ రాష్ట్రం నలిగిపోతోందని పవన్ చామ్లింగ్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. గత ముప్ఫై ఏళ్లుగా గుర్ఖాలాండ్ ఉద్యమం వల్ల సిక్కిం రూ. 60 వేల కోట్లు నష్టపోయిందని, కేవలం చైనా, బెంగాల్ల మధ్య నలిగిపోవడానికి సిక్కిం రాష్ట్రం భారత భూభాగంలో ఐక్యం కాలేదని ప్రకటనలో పేర్కొన్నారు. దేశానికి సిక్కింతో ఉన్న ఏకైక రోడ్డు మార్గమైన జాతీయ రహదారి 10 బెంగాల్లోని కల్లోల ప్రాంతంలో ఉంది. గత నెల15వ తేదీ నుంచి కల్లోల ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది. ఎన్హెచ్ 10 గత 30 ఏళ్లుగా సిక్కిం రాష్ట్ర వీక్ పాయింట్గా మారిందన్న పవన్ చామ్లింగ్.. గుర్ఖాలాండ్ ఉద్యమం చెలరేగిన ప్రతిసారీ తమ రాష్ట్రం భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని ఈ నేపథ్యంలో కేంద్ర ఇప్పటికైనా ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. -
భారత్కు వెళ్తున్నారా జాగ్రత్త
భారత్కు వెళ్లే తమ పౌరులకు చైనా భద్రతా సూచన బీజింగ్: సిక్కిం సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్కు పయనమవుతున్న తమ దేశ పౌరులకు చైనా సలహాలతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది. భారత్కు వెళ్లే వారు స్వీయ భద్రతపై పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ‘చైనా ప్రయాణికులకు ఇది హెచ్చ రిక కాదు (ట్రావెల్ అలర్ట్). జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెబుతున్నాం’అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. శనివారం తేదీతో, చైనా భాషలో ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.చైనా ప్రయాణికులు భారత్లో స్థానిక భద్రత విషయంలో స్వీయ రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనవస రమైన ప్రయాణాలు తగ్గించుకోవాలని, తమ వస్తువుల భద్రతపై జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటి కప్పుడు తమ వివరాలను కుటుంబ సభ్యులకు అందజేస్తూ ఉండాలని సూచించింది. గుర్తింపు కార్డులను ఎప్పుడూ వెంట తీసుకెళ్లాలని, భారతీయ చట్టాలకు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే సంప్రదించాల్సిందిగా చైనా రాయబార కార్యాల యం ఫోన్ నంబర్లను కూడా అందులో పేర్కొంది. సిక్కిం వద్ద భారత్, చైనా మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్కు వెళ్లే తమ ప్రయా ణికులకు భద్రతపై ‘ట్రావెల్ అలర్ట్’ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చైనా జూలై 5న పేర్కొంది. చైనా పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది. -
చైనా, బెంగాల్ల మధ్య నలిగిపోతున్నాం: సిక్కిం సీఎం
ఓ వైపు చైనా, మరోవైపు బెంగాల్ల మధ్య సిక్కిం రాష్ట్రం నలిగిపోతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ అన్నారు. గత ముప్ఫై ఏళ్లుగా గుర్ఖాలాండ్ ఉద్యమం వల్ల రాష్ట్రం రూ. 60 వేల కోట్లు నష్టపోయిందని పేర్కొన్నారు. చైనా, బెంగాల్ల మధ్య నలిగిపోవడానికి 1975లో సిక్కిం భారత భూభాగంలో ఐక్యం కాలేదని వ్యాఖ్యానించారు. జాతీయ రహదారి 10 బెంగాల్లోని కల్లోల ప్రాంతాల గుండా సిక్కింలోకి ప్రయాణిస్తుంది. గత నెల 15వ తేదీ నుంచి కల్లోల ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది. మరో వైపు నాథులా సరిహద్దులో చైనా, భారత్ల మధ్య యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో సిక్కిం ప్రజలు బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు. సిలిగురి ప్రాంతం నుంచి వచ్చే పెట్రోల్ తదితర వస్తువులను అడ్డుకుంటామని ఆందోళనకారులు చెబుతున్నారు. దీంతో వీటిపై మాట్లాడిన చామ్లింగ్.. జాతీయ రహదారి 10 గత 30ఏళ్లుగా సిక్కిం రాష్ట్ర వీక్ పాయింట్గా మారిందని అన్నారు. గూర్ఖా ఉద్యమం చెలరేగిన ప్రతిసారీ తమ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. ఉద్యమ కాలంలో ముఖ్యంగా పర్యాటక రంగం ఘోరం విఫలం చెందిందని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు పర్యాటకులు రాక వెలవెలబోయాయని చెప్పారు. -
సిక్కింపై చైనా దూకుడు!
టిబెట్లో ఆర్మీ ప్రత్యేక కసరత్తులు అధునాతన ఆయుధాలతో విన్యాసాలు బీజింగ్: సిక్కింలో భారత్తో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. టిబెట్లో ఎత్తయిన ప్రాంతాల్లో నిజమైన యుద్ధంలో ఎదురయ్యే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించుకుని చైనాæ సైన్యం కసరత్తులు చేస్తోంది. తేలికపాటి యుద్ధ ట్యాంకులు సహా ఇతర ఆయుధ వ్యవస్థను పరీక్షిస్తోంది. సముద్ర మట్టానికి 5,100 మీటర్ల ఎత్తులో ఈ విన్యాసాలు జరుగుతున్నాయని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రతిఘటన కార్యకలాపాలు, శత్రువును సమైక్యంగా ఎదుర్కోవడం, ఫైర్ షూటింగ్, ఆయుధాల సమగ్ర పరిశీలన తదితరాలను కసరత్తులో భాగం చేశారని పేర్కొంది. రక్షణ, దాడి చేసే శిక్షణా పద్ధతులను కూడా ఇందులో చేర్చారని తెలిపింది. ఈ కసరత్తుల ఫొటోలను కూడా జిన్హువా తన వెబ్సైట్లో పొందుపరిచింది. మిలిటరీ విన్యాసాల్లో భాగంగా సుమారు 35 కిలోల బరువున్న యుద్ధ ట్యాంకులపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు గత వారం చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ వు కిన్ వెల్లడించారు. ‘సిక్కిం’పై పునరాలోచిస్తాం.. తాజా సరిహద్దు వివాదం నుంచి భారత్ వెనక్కి తగ్గాలని.. లేదంటే స్వాతంత్య్రం కోసం సిక్కింలో వస్తున్న డిమాండ్లకు బీజింగ్ మద్దతివ్వాల్సి వస్తుందని చైనా మీడియా భారత్ను హెచ్చరించింది. చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వెలువడే ‘గ్లోబల్ టైమ్స్’ఈ మేరకు భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ‘‘గతంలో భారత్ దలాలైమా కార్డు ఉపయోగించి చైనాను అడ్డుకునేది. కానీ ఇప్పుడు ఆ కార్డు పనికిరాకుండా పోయింది. ప్రస్తుతం ఆ కార్డు టిబెట్పై ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. కానీ భారత్కు సంబంధించిన సున్నితమైన అంశాలపై బీజింగ్ తన వైఖరి మార్చుకుంటే.. అది ఢిల్లీతో డీల్ చేయడానికి పవర్ఫుల్ కార్డుగా పనిచేస్తుంది’’అని పేర్కొంది. సిక్కింను భారత్లో కలుపుకోవడానికి చైనా 2003లో గుర్తింపునిచ్చినా.. దీనిపై చైనా తన వైఖరిని మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. ‘‘ప్రత్యేక దేశంగా సిక్కిం చరిత్రను గుర్తుంచుకున్న వారు ఇంకా అక్కడ ఉన్నారు. సిక్కిం సమస్యను ప్రపంచం ఎలా చూస్తోందనే అంశాన్ని వారు గమనిస్తున్నారు. చైనాపై భారత్–వియత్నాం చర్చలు న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా రెచ్చగొట్టే చర్యలపై భారత్–వియత్నాం తాజాగా చర్చలు జరిపాయి. ఇరు దేశాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు స్పష్టమైన, ఆచరణయోగ్యమైన చర్యలు తీసుకోవాలని ద్వైపాక్షిక చర్చల్లో నిర్ణయించాయి. వియత్నాం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఫామ్ బిన్ మిన్హ్.. నాలుగు రోజుల భారత పర్యటన గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో సమావేశమై చైనా సహా పలు కీలక అంశాలపై చర్చించారు. -
రూ.60,000 కోట్ల కోసం బెంగాల్కు సిక్కిం షాక్
గాంగ్టక్: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సిక్కిం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. బెంగాల్లో గుర్ఖాలాండ్ ఉద్యమం కారణంగా తమ రాష్ట్రానికి 60 వేల కోట్ల ఆదాయం నష్టం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక గుర్ఖాలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి పక్కనే సిక్కిం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో గత 32 ఏళ్లుగా గుర్ఖాలాండ్ ఉద్యమం జరుగుతుందని, అది జరిగిన ప్రతిసారి తమ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయని, ఆ కారణంగా ఈ 32 ఏళ్ల కాలంలో మొత్తం 60వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటూ ఈ విషయంలో తమకు న్యాయం చేసేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సిక్కిం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
చైనా మరో నిర్ణయం.. మోదీతో భేటీకి నై
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీతో తమ అధ్యక్షుడు జీ జిన్పింగ్ సమావేశమయ్యేటంత సాధారణ పరిస్థితులు లేవని చైనా స్పష్టం చేసింది. త్వరలో హాంబర్గ్లో జరగనున్న జీ 20 సదస్సులో జిన్పింగ్ ప్రధానితో మోదీతో అవనున్న భేటీని రద్దు చేసుకున్నట్లు తెలిపింది. సిక్కింలో ఏర్పడిన సరిహద్దు వివాదంపై గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ నేడు హాంబర్గ్ వెళ్లనున్నారు. జీ 20 సదస్సులో భాగంగా ఆయా దేశాల నేతలను మోదీ మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈ జాబితాలో తొలుత జీ జిన్పింగ్ కూడా ఉన్నట్లు తెలిసినా భారత్ నుంచి మాత్రం అది ఉంటుందా లేదా అనే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ లోగానే ప్రస్తుతం తమ అధ్యక్షుడు జిన్పింగ్ భేటీని రద్దు చేసుకున్నట్లు చైనా తెలిపింది. -
‘సిక్కింను భారత్ నుంచి విభజించాలి’
ప్రత్యేక దేశంగా సిక్కిం డిమాండ్కు మద్దతునివ్వాలి చైనా మీడియా కుతంత్రపు రాతలు బీజింగ్: సిక్కిం సెక్టార్లో రోడ్డు నిర్మాణం విషయమై భారత సైనికులతో ఘర్షణ మొదలైన నాటినుంచి చైనా మీడియా కుతంత్రపు రాతలు కొనసాగిస్తూనే ఉన్నది. సిక్కింను భారత్ నుంచి విభజించి.. స్వతంత్ర దేశాన్ని చేయాలంటూ చైనా అధికారిక మీడియా తాజాగా పిలుపునిచ్చింది. చైనా సరిహద్దుల్లో ఉన్న సిక్కిం రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమానికి చైనీస్ పౌరులు ఆజ్యం పోయాలంటూ నేరుగా భారత రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టాలనేరీతిలో వ్యాఖ్యలు చేసింది. సిక్కింను భారత్ క్రూరంగా తన దేశంలో కలుపుకున్నదని, సిక్కింపై చైనా తన వైఖరిని మార్చుకొని.. ఇప్పుడు స్వాతంత్ర్య సిక్కిం డిమాండ్కు అండగా నిలువాలని సూచించింది. ’సిక్కిం విషయంలో చైనా తన వైఖరిని పునరాలోచించాలి. 2003లో సిక్కిం భారత్లో కలుపుకోవడాన్ని చైనా గుర్తించినప్పటికీ.. ఇప్పుడు ఆ వైఖరిని మార్చుకోవచ్చు’ అంటూ అధికారిక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఒక సంపాదకీయాన్ని వండివార్చింది. సిక్కిం సెక్టార్లోని డొకాలం ప్రాంతంలో భారత బలగాలు వెనుకకు తగ్గాలని, లేదంటే సిక్కింపై చైనా వైఖరి మారుతుందనే సంకేతాలను ఈ సంపాదకీయంలో ఇచ్చింది. ‘గతంలో దలైలామా కార్డును భారత్ వాడుతుందేమోనని చైనా ఆందోళన చెందేది. కానీ, ఈ కార్డు ఇప్పుడు పనిచేయదు. టిబేట్ విషయంలో దీని ప్రభావం ఏమీ లేదు. కాబట్టి భారత్కు సంబంధించిన సున్నితమైన అంశాలలో చైనా తన వైఖరి మార్చుకోవాలి. ఇది భారత్ను ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన కార్డుగా పనిచేస్తుంది’ అని రాసుకొచ్చింది. భూటాన్ విషయంలో భారత్ జోక్యాన్ని తగ్గించాలని, భూటాన్ దౌత్య, రక్షణ సార్వభౌమాత్వాన్ని కాపాడాలంటూ రాసుకొచ్చింది. -
సరిహద్దులో చైనా ఆట
డొక్లామ్ వద్ద రోడ్డు నిర్మాణం చేయడానికి చైనా ప్రయత్నించిన నాటి నుంచి భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆనాటి నుంచి రోజుకో కామెంట్తో గ్లోబల్ టైమ్స్ పత్రికలో కథనాలు వస్తున్నాయి. తప్పు తమదే అని తెలిసి కూడా సమర్ధించుకునేందుకు గొంతెత్తి అరచే ప్రయత్నం చేస్తోంది అక్కడి మీడియా. అలాంటి కథనాలలో మరో కీలక కథనమే పంచశీల సూత్రాల ఉల్లంఘన. వాస్తవానికి పంచశీల సూత్రాలను ఎన్నడూ ఉల్లంఘించే ప్రయత్నం భారత్ చేయలేదు. చైనానే అరుణాచల్ ప్రదేశ్ భూభాగానికి పేర్లు పెట్టి పంచశీల సూత్రాలకు తూట్లు పొడిచింది. అలాంటిది ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. భారత్కు అంతర్జాతీయ నియమాలను గౌరవించే అలవాటు లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు విచిత్రం. అసలు అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా చైనా నడుచుకుంటే భారత్కు నీతులు చెప్పొచ్చు. అంటే ఆయన ఉద్దేశంలో భారత్కు మాత్రమే అంతర్జాతీయ నియమాలు వర్తిస్తాయేమో. ఇప్పటివరకూ తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ వస్తున్న చైనాకు మొదటిసారిగా ప్రతిఘటన ఎదురుకావడంతో మింగుడుపడటం లేదు. 1962 యుద్ధం అనంతరం పెద్ద ఎత్తున సరిహద్దులో భారత బలగాలను మొహరించడం ఇదే తొలిసారి. దీంతో పంచశీల సూత్రాలను అడ్డం పెట్టుకుని భారత్పై బురదజల్లే ప్రయత్నాన్ని ప్రారంభించింది చైనా. డొక్లామ్ భారత భూభాగం. అక్కడికి చేరువలో భూటాన్ దేశ సరిహద్దు కూడా ఉంది. ఆ దేశం కూడా చైనా రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకించింది. దీనిపై చైనా అంటున్న మాట భారత్-భూటాన్లు చైనాకు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాట. 'చైనా అధికార ప్రతినిధి మాట.. పంచశీల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించింది. పొరుగుదేశం సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తూ భారత్ ప్రవర్తిస్తోంది. ముందుగా సిక్కింలో బలగాలను వెనక్కు పిలవాలి. ఆ తర్వాతే చర్చలకు రావాలి లేదా తీవ్ర పరిణామాలను చూడాల్సివుంటుంది. భారత దళాలు అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించాయి. పంచశీల నియమాలను ఉల్లంఘిస్తూ చైనా సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్ధకంగా భారత్ మారుస్తోంది. భారత్ పంచశీల ఒప్పందాన్ని ఉల్లంఘించింది.' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెన్ షువాంగ్ అన్నారు. -
చైనా గొడవ
-
చైనా దుందుడుకుతనం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో శిఖరాగ్ర సమావేశంలో తలమునకలైన వేళ మన సరిహద్దుల్లో చైనా హడావుడి సృష్టించింది. సిక్కిం వైపున్న సరిహద్దుల్లో తమ భూభాగంలో భారత జవాన్లు అడుగు పెట్టి అక్కడ రహదారి నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఆరోపించింది. అయితే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులే మన భూభాగంలోకి ప్రవేశించి రెండు బంకర్లను ధ్వంసం చేశారన్నది మన సైన్యం వాదన. సిక్కిం– భూటాన్–టిబెట్లు కలిసే ఈ ప్రాంతంలో... సరిగ్గా పశ్చిమబెంగాల్లోని సిలి గుడి కారిడార్కు అయిదు కిలోమీటర్ల దూరంలో ఇరుపక్షాల దళాలూ ప్రస్తుతం మోహరించి ఉన్నాయి. నిజానికిది పదిరోజులుగా నడుస్తున్న వివాదం. సమస్య తేలేవరకూ నాథూలావైపు నుంచి కైలాస మానససరోవర్ యాత్రీకులను వెళ్ల నివ్వబోమని చైనా చెబుతోంది. పర్యవసానంగా దాదాపు 350మంది యాత్రీకులు వెనక్కు రావాల్సివచ్చింది. భారత్–చైనాల మధ్య జమ్మూ–కశ్మీర్ నుంచి అరు ణాచల్ప్రదేశ్ వరకూ 3,488 కిలోమీటర్ల నిడివిలో సరిహద్దులుంటే అందులో సిక్కిం రాష్ట్రంలో 220 కిలోమీటర్ల మేర ఉంది. పీఎల్ఏ సైనికులు మన భూభా గంలోకి ప్రవేశించిన ఉదంతాలు జమ్మూ–కశ్మీర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ప్రదేశ్ లలో గతంలో చోటుచేసుకున్నాయి. కానీ సిక్కిం ప్రాంతం ఎప్పుడూ ప్రశాంతం గానే ఉంది. ఇప్పుడు జరిగిన పరిణామాలను గమనిస్తే ఇకనుంచి అక్కడ కూడా సమస్యలు మొదలవుతాయని భావించాల్సివస్తుంది. చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్లో టిబెట్ మత గురువు దలైలామా ఇటీవల అడుగుపెట్టినప్పటినుంచీ చైనా కారాలు మిరియాలు నూరుతోంది. దలైలామాను అనుమతించడం రెండు దేశాల సంబంధాలనూ దెబ్బతీస్తుందని ఆ సందర్భంగా హెచ్చరించింది. దానికి కొనసాగింపుగా ప్రశాంతంగా ఉండే సిక్కింలో కూడా చైనా గిల్లికజ్జాలకు దిగిందా అన్న అనుమానం ఎవరికైనా రాకమానదు. ఒక్క దలైలామా పర్యటనపై మాత్రమే కాదు... ఇటీవలికాలంలో దక్షిణ చైనా సముద్ర వివాదంతోసహా వివిధ అంశాల విషయంలో మన దేశం వైఖరి చైనాకు ససేమిరా నచ్చడం లేదు. అందుకే అణు సరఫరా దేశాల బృందం(ఎన్ఎస్జీ)లో ప్రవేశించకుండా మన దేశాన్ని అడ్డుకుంటోంది. ఇలాంటి వ్యతిరేకత ఉండబట్టే హిజ్బుల్ మొజాహిదీన్ నేత సయ్యద్ సలాహుద్దీన్ను ‘ప్రపంచ ఉగ్రవాది’గా ప్రకటిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంపైనా, తమ భూభాగాన్ని ఉగ్రవాద స్థావ రంగా మారనీయరాదని పాకిస్తాన్కు చెప్పడంపైనా అది పరోక్షంగా వ్యాఖ్యానాలు చేసింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై సాగే పోరులో పాక్ అగ్రభాగాన ఉంటు న్నదని ప్రశంసించడం ద్వారా ఆ దేశంపై అమెరికా వ్యక్తం చేసిన అభిప్రాయాలు తప్పని చెప్పడానికి ప్రయత్నించింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబై నగరంలో సాగించిన నరమేథం, పఠాన్కోట్ వైమానిక దళ స్థావరంపై జరిపిన దాడులు, అడపా దడపా కశ్మీర్లో జరిగే ఉగ్రవాద ఉదంతాలు తెలియ నంత అమాయకత్వంలో చైనా ఉన్నదని అనుకోనవసరం లేదు. ఉగ్రవాదంపై నిజంగా పాకిస్తాన్ పోరాడుతుంటే ముంబై, పఠాన్కోట ఉదంతాలకు బాధ్యులైన వారిని అప్పగించడంలో అది ఎందుకని జాప్యం చేస్తున్నదో చైనాయే చెప్పాలి. దాని తరఫున వకాల్తా తీసుకోవడానికి ప్రయత్నిస్తే చాలావాటికి చైనా సంజాయిషీ ఇవ్వాల్సివస్తుంది. కైలాస్ మానససరోవర్ యాత్ర మొదటినుంచీ లిపులేఖ్ ప్రాంతం మీదుగా మాత్రమే జరిగేది. అయితే 2013లో వచ్చిన ఉత్తరాఖండ్ వరదల తర్వాత ఆ తోవ బాగా దెబ్బతింది. ఇప్పుడు ఆ ప్రాంతంవైపు కూడా యాత్ర సాగుతున్నా అటు వైపునున్న ఎత్తయిన పర్వతాలు దాటుకుంటూ వెళ్లడం అంత సులభమేమీ కాదు. రెండేళ్లక్రితం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ శిఖరాగ్ర చర్చల కోసం మన దేశం వచ్చినప్పుడు కైలాస్ మానససరోవర్ వెళ్లేందుకు నాథులా మార్గాన్ని కూడా తెరవడానికి ఆయన అంగీకరించారు. 2006లో తొలిసారి వాణిజ్య రాకపోకల కోసం దీన్ని ప్రారంభించారు. లిపులేఖ్తో పోలిస్తే ఇదెంతో సురక్షితమైనది. తక్కువ ఇబ్బందులతో కూడుకున్నది. నాథులా నుంచి కైలాస్ వరకూ ఉన్న దాదాపు 2,000 కిలోమీటర్ల దూరాన్ని మూడు రోజుల్లో చేరుకోవచ్చు. మెరుగైన రహదారి సౌకర్యంవల్లా, యాత్రీకులు సేదతీరడానికి చైనా కల్పించిన సౌకర్యాల వల్లా ఆ మార్గంలో యాత్రకు వెళ్లేందుకు ఎక్కువమంది మొగ్గుచూపుతారు. ఇరుగు పొరుగు దేశాలన్నాక వివాదాలు వస్తూ ఉంటాయి. కేవలం రెండేళ్లక్రితం తమ దేశాధినేత భారత్ సందర్శన సందర్భంగా ఆయన చొరవతో సాధ్యమైన నాథులావైపు యాత్రీకులను అనుమతించబోమని చెప్పడం వల్ల చైనా సాధిం చేదేమిటో తెలియదు. నిజానికి ఇరు దేశాల మధ్యా సరిహద్దు వివాదాలున్నా వాణిజ్య, సౌహార్ద సంబంధాలకు అవి అడ్డు రాలేదు. దేశాల మధ్య సంబం ధాలెలా ఉండాలో చెప్పడానికి చాలాచోట్ల దీన్ని ఉదాహరిస్తారు. చైనాయే అనేక సార్లు దీన్ని గొప్పగా చెప్పుకుంది. తీరా సమస్య వచ్చేసరికి అతిగా స్పందించి తన నైజాన్ని బయటపెట్టుకుంది. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు ఏర్పడే సమస్యలపై ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం దుందుడుకు చర్య అవుతుంది. సరిహద్దు తగాదాలపై దూర దృష్టితో, విశాల దృక్పథంతో ఆలోచించి వ్యవహరించడమే వివేకం అనిపిం చుకుంటుంది. ఏదో విషయంలో తలెత్తిన అభిప్రాయభేదాలను దృష్టిలో ఉంచు కుని మరేదో సాధిద్దామనుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని చైనా తెలు సుకోవాలి. ఇటీవలికాలంలో సరిహద్దు ప్రాంతాల్లో వివిధచోట్ల చైనా చేపడుతున్న రహదారి నిర్మాణాలు మన దేశానికి కలవరం కలిగిస్తున్నాయన్నది వాస్తవం. ఆ నిర్మాణాల విషయంలో ముందుగానే అపోహలకు తావులేకుండా చూస్తే సమస్యలే రావు. కానీ చైనా తీరు మాత్రం అపోహల్ని మరింత పెంచడానికే దోహదపడుతోంది. నాథులా వద్ద యాత్రీకులను ఆపిన తీరు దీనికి అద్దం పడుతోంది. -
సరిహద్దులో భారత్, చైనా సైనికుల కొట్లాట
- సిక్కింలో బరితెగించిన డ్రాగన్.. వీడియో వైరల్ - ఇండియన్ చెక్పోస్టు ధ్వంసం.. అక్రమంగా చొరబడే యత్నం - తిప్పికొట్టిన భారత బలగాలు.. ఘటనపై సర్వత్రా ఆగ్రహం గ్యాంగ్టక్: సరిహద్దులో డ్రాగన్ దేశం చైనా కవ్వింపు చర్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. సిక్కింలోని భూటాన్ సరిహద్దు వద్ద జరిగినట్లు భావిస్తోన్న ఘటనలో చైనీస్ సైన్యం.. భారత బలగాలను రెచ్చగొట్టడం, ప్రతిగా మనవాళ్లు డ్రాగన్లను అవతలికి నెట్టేయడం లాంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన భారత యాత్రీకుల బృందాన్ని భూటాన్ సరిహద్దుల్లో అడ్డుకున్న చైనా తీరును భారత్ నిరసించిన సంగతి తెలిసిందే. ఆ వివాదం సర్దుమణగకముందే డ్రాగన్స్ దూకుడుకు సంబంధించిన వీడియో బయటికి రావడం సంచలనంగా మారింది. భారత బలగాలను రెచ్చగొడుతూ, ఉద్దేశపూర్వకంగా సరిహద్దు దాటి ఇవతలికి వచ్చిన చైనీస్ సైనికుల తీరుపై సర్వత్రా ఆగ్రహ్యం వ్యక్తమవుతోంది. సిక్కిం-భూటాన్ సరిహద్దులోని ‘డోకా లా’ ప్రాంతంలో ఈ కొట్లాట జరినట్లు సమాచారం. అయితే ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టతే రాలేదు. కాగా, పదిరోజుల కిందట ఇదే డోకాలా ప్రాంతంలో భారత్ పునర్నిర్మించిన ఓ చెక్పోస్టును చైనీస్ ఆర్మీ ధ్వసం చేసినట్లు తెలిసింది. ఈ చర్యను భారత్ తీవ్రంగా నిరసించినందునే ప్రతీకారంగా చైనా.. భారత యాత్రీకులను అడ్డుకుందనే విమర్శలున్నాయి. కైలాస మానస సరోవర యాత్రీకులను చైనీస్ సైనికులు అడ్డుకున్న ఘటనలో మొదట ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు. అటుపై వాతావరణ సమస్యలున్నందువల్లే యాత్రను ఆపేసినట్లు చైనా ప్రకటించింది. ఇక సైనికుల కొట్లాటకు సంబంధించి వైరల్గా మారిన వీడియోపై ఇరుదేశాల అధికారారులు స్పందించాల్సిఉంది. సిక్కిం సరిహద్దులోని భూటాన్ నిజానికి స్వతంత్ర దేశం. కానీ దాని స్వతంత్రతను గుర్తించని చైనా.. ఇప్పటికే కీలక భూభాగాలను స్వాధీనం చేసుకుని ఆధిపత్యం చలాయిస్తోంది. -
ప్రత్యేక గుర్ఖాల్యాండ్ డిమాండ్కు సీఎం మద్దతు!
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న గూర్ఖాల్యాండ్ ప్రజలకు అనూహ్య మద్దతు లభించింది. పొరుగున ఉన్న సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ గురువారం ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలికారు. సిక్కిం అధికార పార్టీ ఎస్డీఎఫ్ కూడా గూర్ఖాల్యాండ్ ఉద్యమానికి సంఘీభావం పలికింది. గూర్ఖాల్యాండ్ ఏర్పాటు కోసం గత ఎనిమిది రోజులుగా జీజేఎం నేతృత్వంలో బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. గూర్ఖాల్యాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వవధిక బంద్తో డార్జిలింగ్ లోయ ప్రాంతంలో ప్రజాజీవనం దాదాపు స్తంభించిపోయింది. అంబులెన్స్ వంటి అత్యవసర సేవలు సైతం నిలిపివేయడం, టీవీ కేబుళ్ల ప్రసారాలు ఆగిపోవడంతో డార్జిలింగ్ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. -
సిక్కింలో బీజేపీకి షాక్!
సిక్కిం ఉప ఎన్నికలో అధికార సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) అభ్యర్థి దిల్లీ రామ్ థాపా సమీప బీజేపీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు. ఇటీవల అప్పర్ బర్తుక్ అసెంబ్లి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన 8వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 9,427 ఓట్లు పోలవ్వగా.. అందులో అధికార పార్టీ ఎమ్మెల్యేకు 8,406 ఓట్లు వచ్చాయి. ఆయనకు గట్టి పోటీ ఇస్తారని భావించిన బీజేపీ అభ్యర్థి సురేష్ ఖనల్ శర్మకు కేవలం 374 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర రాయ్కి నోటా కన్న రెండు తక్కువగా 98 ఓట్లు రావడం గమనార్హం. బరిలో మొత్తం ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉండగా వారందరికీ కలిపి 449 ఓట్లు వచ్చాయి. నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ తమంగ్ అనర్హతకు గురికావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. -
సిక్కింలో భూకంపం
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో నమోదైందని భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. శనివారం సైతం ఈశాన్య ప్రాంతంలో భూకంపం సభవించింన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 5.0 పాయింట్ల తీవ్రతతో నమోదైన భూకంపంతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు మయన్మార్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు ప్రపంచంలో భూకంపాలు అత్యధికంగా సంభవించే ప్రాంతాల జాబితాలో ఆరోస్థానంలో ఉన్నాయి. -
శ్రీవారి సేవలో సిక్కీం హైకోర్టు న్యాయమూర్తి
-
సిక్కింలో స్వచ్ఛమైన దీపావళి !
గ్యాంగ్టక్: ధ్వని, గాలి కాలుష్యం జరగకుండా దీపావళి జరుపుకుని చిన్న రాష్ట్రం సిక్కిం ఆదర్శంగా నిలిచింది. ఇతర రాష్ట్రాలు చేయని విధంగా బాణాసంచాపై నిషేధం విధించి, ‘క్లీన్ అండ్ గ్రీన్’ దీపాల పండగను నిర్వహించింది. 2014లో దీపావళికి వెలువడిన శబ్ద కాలుష్యం, బాణాసంచా చెత్త వల్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అదే ఏడాది డిసెంబర్ 19న అన్ని రకాల బాణాసంచాను సర్కారు నిషేధించింది. దీంతో 2015లో టపాసుల వాడకం 50 శాతానికి తగ్గింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈసారి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వీధుల్లో చిన్నారులతో నాటకాలు వేయించారు. వీటికి ప్రజలు ముఖ్యంగా యువత నుంచి ఊహించని స్పందన లభించింది. -
గ్రామీణ స్వచ్ఛ భారత్ విజేత సిక్కిం
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతలో సిక్కిం దేశంలో మొదటి స్థానంలో, జార్ఖండ్ చివరి స్థానంలో నిలిచాయి. గుజరాత్ 14 ర్యాంకు సాధించింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు గతేడాది మొత్తం 26 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే వివరాల్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి తోమర్ విడుదల చేశారు. ఏపీ 16 వ స్థానంలో నిలిచింది. 2015 మే-జూన్ మధ్యలో ఎన్ఎస్ఎస్ఓ ఈ సర్వే నిర్వహించింది. స్వచ్ఛ భారత్ అమలు అనంతరం జాబితాలో మార్పులు జరిగాయని, అందులో కూడా సిక్కిం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ జాబితాలో తెలంగాణ 22వ స్థానంలో నిలిచింది. మైదాన ప్రాంతాల్లోని 53 జిల్లాల్లో పరిశుభ్రతపై నిర్వహించిన సర్వేలో మహరాష్ట్రలోని సింధుదుర్గ్ మొదటిస్థానంలో నిలిచింది. పర్వత ప్రాంతంలోని మొత్తం 22 జిల్లాల్లో సర్వే నిర్వహించగా హిమాచల్ప్రదేశ్లోని మండీ తొలి స్థానం దక్కించుకుంది. -
మినరల్ బాటిళ్ల వినియోగంపై ఆంక్షలు
గ్యాంగ్టక్: పర్యావరణానికి అనుకూలంగా వ్యర్ధాల నిర్వహణకు సిక్కిం ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులోభాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో మినరల్ వాటర్ బాటిళ్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. దీంతోపాటు నురగతో కూడిన ఆహార కంటైనర్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఇటీవల రెండు నోటిఫికేషన్లు జారీచేసింది. -
రేప్పై తీవ్రంగా స్పందించిన సీఎం
గ్యాంగ్టక్: తమ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన బాలికపై లైంగిక దాడి జరగడం పట్ల సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకులతో స్నేహభావంగా ఉండే రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. ఈ నెల (మే) 15న సిక్కింలో ఓ ట్యాక్సీ డ్రైవర్ బెంగాల్ కు చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న 16 ఏళ్ల బాలిక మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వచ్చారు. ఓ ట్యాక్సీ తీసుకొని ముగ్గురు స్నేహితులు ప్రయాణిస్తుండగా ఆ ప్రేమ్ రాయ్ అనే ట్యాక్సీ డ్రైవర్ స్నాక్స్ తోపాటు ఏదో డ్రింక్ ఇచ్చాడు. అందులో మత్తుమందు కలిపాడు. అది తాగిన ఆ ముగ్గురు మత్తులోకి జారకుంటుండగా ఒకరిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో మరో ఇద్దరు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని బలంగా కొట్టి కిందకు తోసి ఆ బాలికతో పారిపోయాడు. దీంతో ఆ ఇద్దరు ఏడ్చుకుంటూ ఇంట్లోవారికి బంధువులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ట్యాక్సీ డ్రైవర్ ను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ వార్త సిక్కింలో కలకలం రేపడంతో స్వయంగా ముఖ్యమంత్రి మంగళవారం ప్రకటన చేశారు. ఆ నేరస్థుడిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని, బహిర్గతం చేయాలని, నలుగురిలో నిలబెట్టాలని సీఎం పోలీసులకు ఆదేశించారు. -
సేంద్రియ వ్యవసాయం పెంచాలి
సిక్కిం.. సంపూర్ణ సేంద్రియ రాష్ట్రం సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించాలని రాష్ట్రాలకు మోదీ పిలుపు సిక్కింను ఆదర్శంగా తీసుకోవాలని వ్యాఖ్య; నేడు అసోంలో పర్యటన గ్యాంగ్టక్: ఈశాన్య రాష్ట్రం సిక్కింను దేశంలోనే తొలి సంపూర్ణ సేంద్రియ రాష్ట్రంగా ప్రధాని మోదీ ప్రకటించారు. త్వరలో సేంద్రీయ వ్యవసాయంలో దేశానికే కాదు ప్రపంచానికే సిక్కిం దిక్సూచిగా మారుతుందంటూ నేపాలీ భాషలో అభినందనలు తెలిపారు. సిక్కింను సుఖిస్తాన్గా అభివర్ణించారు. ఈ సందర్భంగా ‘ఆర్గానిక్ సర్టిఫికెట్’ను సిక్కిం సీఎం చామ్లింగ్కు అందజేశారు. రాష్ట్రంలో విమానాశ్రయ ఏర్పాటుపై సంకేతాలిచ్చారు. విమానాశ్రయం ఉంటే సిక్కిం స్పెషల్ పూలు సహా సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ సులభమవుతుందన్నారు. గ్యాంగ్టక్లో సమ్మిళిత వ్యవసాయం, రైతుల సంక్షేమం’ అంశంపై జరిగిన జాతీయ సదస్సునుద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు. సదస్సులో దాదాపు అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, రైతులకు ఉపయోగపడేలా మొబైల్ యాప్స్, ఆన్లైన్ మండీలు.. మొదలైన సాంకేతిక ఆవిష్కరణలు రావాలన్నారు. ప్రకృతి ప్రకోపాలతో కుదేలవుతున్న రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై దృష్టి పెట్టాలంటూ ఓ సూచన చేశారు. ‘మీ భూమిని మూడు భాగాలు చేసుకోండి. ఒక భాగంలో పంటలు వేయండి. మరో భాగంలో కలప కోసం చెట్లు పెంచండి. మూడో భాగాన్ని పశువుల పెంపకం కోసం వినియోగించండి. పంటలు సరిగ్గా పండని సమయంలో మిగతా రెండు మీకు ఆర్థికంగా సహకరిస్తాయి’ అని మోదీ సూచించారు. రైతులు, సాగు, గ్రామాలు.. వీటిని వేర్వేరుగా చూడడం వల్ల అభివృద్ధి చెందలేమని, వీటన్నిటి సమ్మిళితంగా వ్యవసాయాన్ని చూసే దృష్టికోణం అలవర్చుకోవాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూనే వ్యవసాయంలో సిక్కిం రాష్ట్రం కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం విజయగాధను ప్రశంసిస్తూ.. అది అంత సులభంగా సాధించే ఘనత కాదన్నారు. ‘సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లాలనుకున్నప్పుడు కొందరినుంచి వ్యతిరేకత వచ్చి ఉంటుంది. కానీ సిక్కిం రైతులు వెనకడుగు వేయలేదు. దశాబ్దం పాటు తమ ఆలోచననే నమ్ముకుని విజయం సాధించారు’ అని కొనియాడారు. సిక్కిం విజయాన్ని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ‘100-150 గ్రామాలున్న ఒక జిల్లానో, తాలూకానో ఎంపిక చేసుకుని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించండి. అక్కడ విజయవంతం అయితే, రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. నాయకులు, శాస్త్రజ్ఙులు చెప్పే ప్రసంగాలను రైతులు నమ్మరు. వారు ప్రత్యక్షంగా చూస్తేనే నమ్ముతారు’ అన్నారు. సేంద్రీయ పంటలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్న మోదీ.. ఆ మార్కెట్ దిశగా రాష్ట్రాలు దృష్టి పెట్టాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల రెండ్రోజుల పర్యటనలో భాగంగా సిక్కిం చేరుకున్న ప్రధానికి గవర్నర్ పాటిల్, సీఎం స్వాగతం పలికారు. మంగళవారం రిడ్జ్ పార్క్లో నిర్వహించనున్న ఉద్యాన, పూల ఉత్సవంలో ప్రధాని పాల్గొంటారు. ‘వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి సాధించాలి’ వ్యవసాయ రంగంలో సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. సవాళ్లను ఎదుర్కొని సాగు రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించాలన్నారు. నిలకడైన వ్యవసాయం, రైతుల సంక్షేమం అనే అంశంపై సదస్సులో ఆయన ప్రసంగించారు. తాము ప్రవేశపెట్టిన నేల ఆరోగ్య కార్డు, వేప పూత యూరియా, పీఎంకేఎస్వై తదితర పథకాలతో రైతులకు ప్రయోజనాలు సమకూరుతాయన్నారు. గత పథకాల్లోని లోటుపాట్లను గుర్తించి, సవరించి కొత్త పథకాలు తీసుకొచ్చామని వివరించారు. సిక్కిం సీఎం చామ్లింగ్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా తమ రాష్ట్రం నిలవడం గర్వకారణమన్నారు. రసాయన ఎరువులు ఏ విధంగా బ్యాన్ చేసింది, సేంద్రియ వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రోత్సహించింది వివరించారు. -
పూలమొక్కలకు పేరుపెట్టిన మోదీ
గ్యాంగ్ టక్: ప్రధాని నరేంద్రమోదీ రెండు కొత్త పుష్పాలకు నామకరణం చేశారు. 'వ్యవసాయం, రైతు సంక్షేమం'పై సోమవారం సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ లో జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన సందర్భంగా మోదీ మూడు కొత్త రకాల పూలమొక్కలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిక్కిం ఆర్గానిక్ మిషన్ బుక్ లెట్ ను కూడా ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన పూల మొక్కల ప్రదర్శనా క్షేత్రంలో కలియతిరిగిన మోదీ అనంతరం కొత్తగా అభివృద్ధి చేసిన మూడు పూల మొక్కలను ఆవిష్కరించి వాటిలో రెండు పూల మొక్కలకు సింబిడియం సర్దార్, లైకాస్ట్ దీన్ దయాల్ అని పేరు పెట్టారు. ఇక మూడో పూలమొక్కకు సిక్కిం ముఖ్యమంత్రి సింబిడియం నమో అని పేరు పెట్టారు. -
సిక్కింలో స్వల్ప భూకంపం, తీవ్రత 4 గా నమోదు
న్యూఢిల్లీ : నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ముఖ్యంగా సిక్కిం కేంద్రంగా ఈ ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0 గా నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 36 కిలోమీటర్ల నాభ్యంతరంగా ఈ స్వల్ప ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. ఎటువంటి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకూ అధికారిక ప్రకటనలు వెలువడలేదు. -
విశ్వభారతి వర్సిటీ వీసీపై ఫిర్యాదు
కోల్ కతా: విశ్వభారతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుశాంత్ దత్తా గుప్త్రాపై విద్యార్థిని తండ్రి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార కేసును ఉపసంహరించుకోవాలంటూ తనపై గుప్త్రా ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్సిటీలోని కళాభవన్ లో ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం చదువుతున్న సిక్కింకు చెందిన విద్యార్థినిపై కొందరు విద్యార్థులు ఆగస్టులో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారు. ఈ కేసులో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఈ కేసులో రాజీకి రావాలని, పోలీసులను సంప్రదించవద్దని తనపై వైస్ ఛాన్సలర్ గుప్తా ఒత్తిడి తెచ్చారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఆయన ఆ పదవిని 5వ సారి అలంకరిచబోతున్నారు!
గ్యాంగ్టాక్: పవన్ చామ్లింగ్ అయిదవసారి సిక్కిం ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్టించనున్నారు. ఈ నెల 21 బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ సారథిగా చామ్లింగ్ను 22 మంది ఎమ్మెల్యేలు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మే 16 నాటి ఎన్నికల ఫలితాల్లో 32 మంది సభ్యులున్న సిక్కిం అసెంబ్లీలో 22 చోట్ల ఎస్డీఎఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలోనే ఎక్కువకాలం 23 ఏళ్లపాటు సీఎంగా జ్యోతి బసు రికార్డును సృష్టించారు. వరుసగా ఐదో సారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించనున్న చామ్లింగ్ ఆ రికార్డును అధిగమించాలంటే మూడేళ్లలో అధిగమించనున్నారు. -
జ్యోతిబసు రికార్డుకు చేరువలో చామ్లింగ్
గ్యాంగ్టక్: దేశంలో అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వ్యక్తిగా దివంగత జ్యోతిబసు నెలకొల్పిన రికార్డును సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్ బద్దలు కొట్టనున్నారు. సిక్కింలో వరుసగా ఐదో సారి ఆయన అధికార పీఠం అధిష్టించనున్నారు. చామ్లింగ్ 1994 డిసెంబర్ 12న సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు. కమ్యూనిస్టు నాయకుడు దివంగత జ్యోతిబసు 23 ఏళ్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన 1977 జూన్ 21న సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 2000 నవంబర్ 5 వరకూ పదవిలో కొనసాగారు. శుక్రవారం నాటి సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రాటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్) మూడింట రెండొంతుల మెజారిటీని సాధించింది. మొత్తం 32 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 22 చోట్ల ఎస్డీఎఫ్ ఘన విజయం సాధించింది. రంగాంగ్-యంగాంగ్, నంచీ-సింగితాంగ్ స్థానాల నుంచి పోటీ చేసిన చామ్లింగ్ రెండు చోట్లా రికార్డు మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలోని ఒకే ఒక్క లోక్సభ స్థానంలో కూడా ఎస్డీఎఫ్ అభ్యర్థి పీడీ రాయ్ సుమారు 42 వేల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. -
జ్యోతిబసు రికార్డుకు పవన్ చామ్లింగ్ ఎసరు!
ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడపటమే గగనంగా మారిన ఈ రోజుల్లో వరుసగా 20 ఏళ్లపాటు అధికారంలో కొనసాగడమంటే మామూలు విషయం కాదు. సిక్కింలో పవన్ కుమార్ చామ్లింగ్ త్వరలోనే ఓ రికార్డును సొంతం చేసుకోనున్నారు. వరుసగా 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన జ్యోతిబసు రికార్డుపై చామ్లింగ్ కన్నేశారు. త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ యోధుడు జ్యోతిబసు రికార్డును తిరగరాసేందుకు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ సిద్దమవుతున్నారు. ఈ సంవత్సరం జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో చామ్లింగ్ విజయం సాధిస్తే వరుసగా ఐదవసారి ఎన్నికైన ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కుతారు. 1994 డిసెంబర్ 12 తేది నుంచి సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎస్ డీఎఫ్) ప్రభుత్వాన్ని నడుపుతున్న చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన రికార్డు జ్యోతిబసుపై ఉంది. జ్యోతిబసు 1977 జూన్ 21 నుంచి 2005 నవంబర్ 5 తేది వరకు అధికారంలో కొనసాగారు. ఆతర్వాత బుద్దదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 12 తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చామ్లింగ్ ప్రభుత్వం విజయం సాధిస్తే జ్యోతిబసు రికార్డును అధిగమించే అవకాశం ఉంది. జ్యోతిబసు రికార్డును చామ్లింగ్ అధిగమించే అంశాన్ని సిక్కిం రాష్ట్రంలోని 3,70,000 లక్షల ఓటర్లు ఏప్రిల్ 12 తేదిన నిర్ణయించనున్నారు. 2009 ఎన్నికలల్లో ఎస్ డీఎఫ్ 32 సిట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. చామ్లింగ్ కు ఓటర్లు అవకాశాన్ని అందిస్తారా లేదా అనే విషయం త్వరలోనే స్పష్టమవ్వడం ఖాయం. -
మోడీ కంటే మంచి సీఎం, గుజరాత్ కన్నా మంచి రాష్ట్రం!
నరేంద్ర మోడీని భుజం మీద మోసుకుంటే తిరిగే నమో అభిమానులారా మీకు నమో నమ! మీ మోడీ గారికి కూడా అసూయ కలిగించేంత గొప్ప రికార్డున్న మరో సీఎం ఉన్నాడు. ఆయనకి 1994 నుంచి ఓటమి తెలియదు. గత అయిదేళ్లుగా ఆయన శాసన సభలో ఉన్న అన్ని సీట్లూ ఆయన పార్టీవే. అంతే కాదు. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రం ఆయనదే. ప్రతి మారుమూల గ్రామంనుంచి రాజధానికి మోటర్లో వెళ్లే రోడ్లున్న రాష్ట్రం ఆయనదే. గొడవలు, కొట్లాటలు లేని రాష్ట్రం ఆయనదే. మరో రెండేళ్లాగితే పూర్తి స్థాయి రుణముక్త రాష్ట్రం ఆయనదే అవుతుంది. అసలాయనకు ప్రతిపక్షమే లేదు. దేశం లో ప్లాస్టిక్ వాడకం అసలే లేని రాష్ట్రం ఆయనదే. ఆయనెవరా అని అనుకుంటున్నారా? ఆయన పేరు పవన్ కుమార్ చామ్లింగ్. ఆ రాష్ట్రం పేరు సిక్కిం. సిక్కిం లోకసభకి పంపేది ఒకే ఒక ఎంపీని. అందుకే అక్కడ ఎంపీ ఎన్నికలపై ఎవరికీ ఆసక్తి లేదు. ఎంపీ ఎన్నికలతో పాటు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే అందరి ఆసక్తి. 32 మంది ఎంఎల్ ఏల కోసమే ఇప్పుడు అసలు పోటీ. ఆయన గ్రామపంచాయత్ అధ్యక్ష పదవి నుంచి పైకెదిగారు. మొదట్లో సిక్కిమ్ సంగ్రామ పరిషద్ లో ఎమ్మెల్యే అయ్యారు. తరువాత అప్పటి ముఖ్యమంత్రి నర బహదూర్ భండారీ నియంతృత్వ పోకడలని నిరసించి సిక్కిం డెమాక్రటిక్ ఫ్రంట్ ను స్థాపించారు. ఆయన భండారీకి వ్యతిరేకంగా గట్టిపోరే చేశారు. ఒక సందర్భంలో ఆయన అసెంబ్లీలోకి ఒక కొవ్వొత్తిని వెలిగించి మరీ తీసుకొచ్చారు. ఏమిటి సంగతి అని అందరూ అడిగితే 'నేను అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఎక్కడనా కనిపిస్తుందేమో అని వెతుకుతున్నాను' అని జవాబిచ్చారట. పవన్ చామ్లింగ్. ఆయన పార్టీ ఈ సారి కూడా క్లీన్ స్వీప్ చేస్తారా? లేక కొత్త రాజకీయ శకం మొదలవుతుందా అన్నది ఇప్పుడు సిక్కింలో అసలు ప్రశ్న. అక్కడ రాహుల్ వర్సెస్ మోడీ పోటీ లేదు. అసలు వారిద్దరి గురించి ఎవరికీ పెద్దగా పట్టింపు లేదు. ఒక్క ఊరు తన మనసు మార్చుకున్నా అక్కడ ఎన్నికల ఫలితం తారుమారైపోతుంది. అందుకే అందరికీ సిక్కిం ఎన్నికలంటే అంత ఆసక్తి. -
నడమంత్రపు నంబర్ ‘గేమ్’ !
రూపాయికి 64రెట్లు ఆశతో చిత్తవుతున్న పేదల జీవితాలు చల్లపల్లి కేంద్రంగానే... పట్టించుకోని పోలీసులు నంబర్లాట... ఇదో మాయా జూదం... రూపాయికి 64 రెట్ల ప్రతిఫలం...ఈ నడమంత్రపుసిరితో భాగ్యవంతులమవుదామనే అత్యాశే పేదల బతుకులను బజారున పడేస్తుంది. చల్లపల్లిలోని ఓ స్టూడియోలో పనిచేసే వ్యక్తి ఈ మోజులో పడి రెండు నెలల వ్యవధిలో రూ.25వేలు పోగొట్టుకుని రోడ్డునపడ్డాడు. చల్లపల్లి-పెదకళ్లేపల్లి రోడ్డులో ఓ షాపులో పనిచేస్తున్న మరోవ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోయి కట్టుబట్టలతో మిగిలాడు. ఇలా ఎంతోమంది బలవుతున్నా...పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారనే విమర్శలున్నాయి. చల్లపల్లి, న్యూస్లైన్ : సిక్కిం, మణిపాల్ తదితర లాటరీ ఫలితాలు వెలువడడానికి ముందు రోజే ఈ నంబర్లాట జోరందుకుంటుంది.ఫలితం రానున్న సంఖ్యల్లోని ఏవైనా రెండంకెలు కోరుకుంటారు. పది నుంచి 99లోపు ఉన్న ఏ రెండు అంకెలనయినా కోరుకోవచ్చు. ఇలా రెండంకెలు ఎన్నయినా కట్టవచ్చు. ఇలా అంకెలను కోరుకుని రూపాయి నుంచి వేల రూపాయలతో ఆట సాగిస్తారు. వారు కోరుకున్న అంకెలు వస్తే రూపాయికి రూ.64 ఇస్తారు. ఈ ఆశే మధ్య తరగతి ప్రజలను ఈ నంబర్లాటవైపు మళ్లేలా చేస్తోంది. ‘డబుల్డిజిట్ గేమ్’గా పిలిచే ఈ ఆటను ఆడేందుకు చాలా మంది ఆశపరులు ఉత్సాహం చూపుతున్నారు. చల్లపల్లి కేంద్రంగా... చల్లపల్లి, మోపిదేవి మండలాల్లోని దాదాపు 15కేంద్రాల్లో ఈ ఆట జోరుగా సాగుతున్నట్లు సమాచారం. చల్లపల్లి కేంద్రంగా ఓ వ్యక్తి ఈ కేంద్రాలన్నింటినీ పర్యవేక్షణ చేస్తుంటాడు. ఈ ఆట ద్వారా ఇప్పటికే ఆ వ్యక్తి లక్షలాది రూపాయలు వెనకేసుకున్నట్లు తెలిసింది. పోలీసుల ఉదాసీనతను అడ్డుపెట్టుకుని మోపిదేవి మండలం వెంకటాపురంలో మూడుచోట్ల, పెదప్రోలులో ఒకటి, చల్లపల్లి పడమరవీధిలో ఒకటి, చల్లపల్లి బస్టాండు సెంటరు నుంచి లక్ష్మీపురం వరకు ఏడు, చల్లపల్లి మండలంలోని నడకుదురు, పురిటిగడ్డ, యార్లగడ్డలో ఒక్కోచోట ఈ ఆట నిర్వహించేందుకు ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. బందరు రోడ్డులోని థియేటర్ల సెంటర్లో ఈ నంబర్లాట విచ్చలవిడిగా సాగుతోంది. పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోని బందరు రోడ్డులో ఈ ఆట జోరుగా సాగుతున్నా.... పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. వచ్చిన లాటరీలోనూ దోపిడీ! ఎవరైనా ఓ వ్యక్తికి అనుకోకుండా నంబరు తగిలితే అతనికి రూ.10కి 64రెట్లు.... రూ.640 ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏజెంట్లు ఇతనికి రూ.600 మాత్రమే ఇస్తూ ఇందులోనూ కమీషన్ పేరుతో దోపిడీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రతి రోజూ సాయంత్రం ఆ రోజు కాసిన నంబర్ల లిస్టు అంతా చల్లపల్లిలోని ఓ వ్యక్తికి అందజేస్తుంటారు. ఆ రోజు సాయంత్రం చల్లపల్లిలోని కొన్ని ఇంటర్నెట్ సెంటర్ల వద్దకు వెళ్లి మరుసటి రోజు కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) ప్రచురితమయ్యే లాటరీ రిజల్టును తీసుకుంటారు. ఎవరికైతే వారు కట్టిన నంబర్లు వస్తాయో వారికి మరుసటి రోజు ఈ మొత్తాన్ని ఏజెంట్లు అందజేస్తారు. జోరందుకున్న నంబర్లాట... ఏడాది నుంచి అక్కడక్కడా సాగుతున్న ఈ నంబర్లాట మూడు నెలల నుంచి మరింత జోరందుకుంది. మధ్య తరగతి, బడుగు, బలహీన వర్గాల రక్తాన్ని పిండుకుంటున్న ఈ నంబర్లాటపై పోలీసులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మరికొన్ని ప్రాంతాలకు ఈ నంబర్లాట విస్తరించే అవకాశం ఉంది. మూడేళ్ల క్రితం జిల్లాస్థాయి పోలీసు అధికారి ఈ నంబర్లాటపై ఉక్కుపాదం మోపగా అప్పట్లో కనుమరుగైంది. ఏడాది నుంచి అక్కడక్కడా మొదలైన నంబర్లాట చాపకింద నీరులా నేడు చల్లపల్లి, మోపిదేవి మండలాల్లోని పలు గ్రామాలకు విస్తరించింది. చల్లపల్లి కేంద్రంగా చుట్టు పక్కల గ్రామాల్లో ఈ నంబర్లాట జోరుగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు!
సార్వత్రిక ‘సమరం’పై ఈసీ యోచన ఐదారు విడతల్లో నిర్వహించే అవకాశం లోక్సభతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నిక లు కూడా.. హర్యానా అసెంబ్లీకీ ముందే ఎన్నికలు ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటివారంలో షెడ్యూల్! జూన్ 1తో ముగియనున్న ప్రస్తుత లోక్సభ గడువు జూన్ 2వ తేదీతో ముగియనున్న రాష్ట్ర అసెంబ్లీ గడువు సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఐదారు విడతల్లో లోక్సభకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఫిబ్రవరి చివరి రోజుల్లో లేదా మార్చి మొదటి మూడురోజుల్లోగా షెడ్యూల్ వెలువడవచ్చని ఈసీలోని అత్యున్నతస్థారుు వర్గాలు వెల్లడించాయి. జమ్మూ-కాశ్మీర్, ఈశాన్య భారతం, ఛత్తీస్గఢ్, యూపీ, బీహార్, బెంగాల్ వంటి సమస్యాత్మక రాష్ట్రాలు, ఇతర కీలక అంశాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఒకే విడత ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సార్వత్రిక ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని వెల్లడించాయి. హర్యానా ప్రభుత్వం కోరితే ఆ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ముందే ఎన్నికలను నిర్వహించే అంశాన్ని కూడా ఈసీ గట్టిగా పరిశీలిస్తోందని తెలిపాయి. భద్రతా దళాల రవాణా ఏర్పాట్లు, ఎండల తీవ్రత, స్కూళ్లు, కాలేజీల సెలవులను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ రెండోవారం తర్వాత, మే మొదటివారంలోగా పలు విడతల్లో ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తున్నట్టు వివరించాయి. ఈసీ వర్గాల కథనం ప్రకారం... ఎన్నికల సన్నాహకాల విషయమై ఇప్పటికే ఓ రోడ్మ్యాప్ సిద్ధమైంది. ఈ మేరకు ఫిబ్రవరిలో సంబంధితులందరితో చర్చించిన తర్వాత షెడ్యూల్ వెలువడుతుంది. దీనితో పాటే మే, జూన్ మాసాల్లో కాలపరిమితి ముగియనున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ షెడ్యూల్ను ప్రకటించే ప్రతిపాదనను ఈసీ పరిశీలిస్తోంది. అలాగే, అక్టోబర్లో కాలపరిమితి ముగియనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలను కూడా ముందుకు జరిపి లోక్సభతోపాటే నిర్వహించే అంశం కూడా ఎన్నికల కమిషన్ దృష్టిలో ఉంది. రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఆయూ రాష్ట్రాల డీజీపీలతో బలగాల లభ్యతపై ఇప్పటికే చర్చలు కొనసాగిస్తున్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించారుు. లోక్సభ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకులుగా నియమించడానికి ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలను తయారుచేసే పని కొనసాగుతున్నట్టు కూడా తెలిపాయి. 80 కోట్ల మందికి ఓటు హక్కు! ఓటరు జాబితాల్లో కొత్త ఓటర్ల చేర్పు తర్వాత రానున్న ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారి సంఖ్య దాదాపు 80 కోట్లు ఉంటుందని అంచనా. ఓటరు జాబితాల తుది విడత సవరణ ప్రస్తుతం జరుగుతోంది. 2004 ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 67.10 కోట్లుగా ఉంది. 2009 లోక్సభ ఎన్నికల్లో ఈ సంఖ్య 71.4 కోట్లు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 1.1 కోట్లమంది పోలింగ్ సిబ్బంది (భద్రతాబలగాలతో కలుపుకొని) అవసరమని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా కనీసం 8 లక్షల పోలింగ్ కేంద్రాలు నెలకొల్పనున్నారు. ఎన్నికల్లో వినియోగించేందుకు ఇప్పటికి సిద్ధం చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు దాదాపు 12 లక్షలు. ఫిబ్రవరి మధ్యనాటికి మరో 2.5 లక్షల కొత్త ఈవీఎంలను ఈసీ సమకూర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్సభ గడువు వచ్చే జూన్ 1వ తేదీతో ముగుస్తుంది. మే 31వ తేదీకల్లా కొత్త సభ ఏర్పడాల్సి ఉంటుంది. షెడ్యూల్కు ముందు లోక్సభ సమావేశం కొత్త పార్లమెంటులో కొత్త ప్రభుత్వం పూర్తిస్థారుు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయమిచ్చేలా.. 2014-15 ఆర్థిక సంవత్సరంలోని ఆరు నెలల వ్యయ నిమిత్తం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపేందుకు, ఎన్నికల ప్రకటనకు ముందు చివరిసారిగా ప్రస్తుత లోక్సభ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అవినీతి వ్యతిరేక చర్యలకు ఆమోదం పొందేలా త్వరలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చని కూడా ఊహాగానాలు సాగుతున్నారుు. ఐదు దశల్లో 2009 ఎన్నికలు గత లోక్సభ ఎన్నికలు 2009 ఏప్రిల్ 16 నుంచి మే 13 వరకు అయిదు విడతలుగా జరిగాయి. ఏప్రిల్ 22, 23 తేదీల్లో రెండో విడత, 30న మూడో విడత, మే 7న నాలుగో దశ, చివరిగా 13న ఐదో దశ ఎన్నికలు జరిగారుు. ఫలితాలు మే 16న వెలువడ్డాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలు ప్రకటన 2009 మార్చి 2న వెలువడింది. -
సిక్కింలో భూకంపం
సిక్కింలో గురువారం స్వల్పంగా భూమి కంపించింది. రెక్టార్ స్కేల్పై దీని తీవ్రత 5గా నమోదైనట్టు ప్రాంతీయ భూకంప హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. ఉదయం 11.43 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు వెల్లడించింది. భూకంప ప్రభావానికి గ్యాంగ్టక్లో కొన్ని భవనాలకు బీటలు బారినట్టు అధికారులు తెలిపారు. భయబ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లల్లో నుంచి వీధులోకి వచ్చారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు. -
దారిద్య్ర నిర్మూలనలో సిక్కిం రికార్డు
గాంగ్టక్: దారిద్య్ర నిర్మూలనలో సిక్కిం ఘనమైన రికార్డు సాధించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి సంఖ్య సిక్కింలో గణనీయంగా తగ్గింది. తలసరి వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రణాళికా సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. సిక్కింలో 2004-05 ఆర్థిక సంవత్సరంలో దారిద్య్రరేఖకు దిగువన 30.9 శాతం ఉండగా, 2011-12 నాటికి ఈ సంఖ్య 8.19 శాతానికి తగ్గింది. దారిద్య్రరేఖకు దిగువనున్న జనాభా శాతం తక్కువగా నమోదైన రాష్ట్రాల్లో గోవా (5.9 శాతం), కేరళ (7.05 శాతం), హిమాచల్ప్రదేశ్ (8.06 శాతం), సిక్కిం (8.19 శాతం), పంజాబ్ (8.26 శాతం), ఆంధ్రప్రదేశ్ (9.20 శాతం) ఉన్నాయి.