song launch
-
‘CM పెళ్లాం’ సినిమా సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
రాజకీయం... సందేశం
ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం రమణా రెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ఇంద్రజ మాట్లాడుతూ– ‘‘మీ రియల్ లైఫ్లో చూసినవి, విన్నవి, జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో దర్శకుడు చక్కగా చూపించారు. ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఆలోచింపజేసే చిత్రం ఇది’’ అన్నారు.‘‘ఈ సినిమాలో నేను సీఎంగా నటిస్తే, నా భార్య పాత్రలో ఇంద్రజ నటించారు. ఈ ప్రమోషనల్ సాంగ్ చూసి ఎమోషనల్ అయ్యాను’’ అని తెలిపారు అజయ్. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు బొల్లా రామకృష్ణ. ‘‘మన నగరం ఎలా ఉంది? అనేది ఈ పాటలో చూపించాను. నేను అమెరికాలో ఉంటాను. కుండపోత వర్షం వచ్చినా చుక్క నీరు నిలవదు. ఇక్కడ వర్షం వస్తే అంతే. నేను ఎవరినీ విమర్శించడం లేదు. నగరం బాగుండాలనే తపనతో చెబుతున్నాను. సామాజిక నేపథ్యం ఉన్న చిత్రం ‘సీఎం పెళ్లాం’’ అని అన్నారు గడ్డం రమణారెడ్డి. -
సిద్ధు - వైష్ణవి చైతన్య ‘జాక్’ మూవీ 'కిస్ సాంగ్' లాంచ్ (ఫొటోలు)
-
ఏడు జన్మల తోడుగా...
‘‘కలల్లో కానరాకున్నా... నీ కోసం నేను వేచున్నా... నిన్నే నా ఏడు జన్మల తోడుగా కోరుకుంటున్నా’’ అంటూ మొదలవుతుంది ‘వీర ధీర శూరన్ పార్టు 2’ సినిమాలోని లవ్ సాంగ్. విక్రమ్ హీరోగా ఎస్.యు అరుణ్కుమార్ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రియా శిబుల నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.తాజాగా ఈ సినిమాలోని ‘కలల్లో..’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. రాజేశ్ గోపిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటను శరత్ సంతోష్, రేష్మ శ్యామ్ పాడారు. దుషారా విజయన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఎస్జే సూర్య, సూరజ్ వెంజరాముడు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
ఓ ప్రేమ... ప్రేమ
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా రతన్ రిషి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టిస్ట్’. ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఓ ప్రేమ ప్రేమ..’ అంటూ సాగే లిరికల్ సాంగ్ని రిలీజ్ చేశారు.‘జారే కన్నీరే అడుగుతుందా.. . నేరం ఏముందో చెప్పమంటూ... నా ప్రేమే ఇలా ఓ ప్రశ్నయ్యేనా... నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా...’ అంటూ భావోద్వేంగా సాగుతుందీ పాట. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని రమ్యా బెహ్రా పాడారు. ‘‘ఒక వినూత్నమైన ప్రేమ కథతో ‘ఆర్టిస్ట్’ సినిమా రూపొందింది.ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘చూస్తూ చూస్తూ..’ సాంగ్కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘సత్యం’ రాజేశ్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, పి.సోనియా ఆకుల, స్నేహా, మాధురి శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమేరా: చందూ ఏజే, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సురేష్ బసంత్, లైన్ ప్రోడ్యూసర్: కుమార్ రాజా. -
కాలేజీ మ్యాజిక్
‘డోన్ట్ నో వై... ఇంకా ఉన్నా... నేనే ఇష్టం లేనిప్రాణాలేమో పోనే పోవే..’ అంటూ మొదలవుతుంది ‘మ్యాజిక్’ సినిమాలోని ‘డోన్ట్ నో వై...’ పాట. సారా అర్జున్, అన్మోల్ కజాని, ఆకాశ్ శ్రీనివాస్, సిద్ధార్థ్ తణుకు ప్రధాన పాత్రధారులుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు, తమిళ చిత్రం ‘మ్యాజిక్’.ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘డోన్ట్ నో వై..’ పాట లిరికల్ వీడియో విడుదలైంది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, ఐశ్వర్యా సురేష్ బింద్రాతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఆలపించారు. ‘‘కాలేజ్ ఫెస్ట్ కోసం పాట చేయడానికి ఓ నలుగురు యువతీ యువకులు చేసే ప్రయత్నమే ఈ సినిమా’’ అని యూనిట్ తెలిపింది. -
మనసు నిన్ను తెలుసుకుందయ్యా...
‘‘తెలివి కన్ను తెరుసుకుందయ్యా... శివలింగామయ్యా... మనసు నిన్ను తెలుసుకుందయ్యా...’’ అంటూ మొదలవుతుంది ‘కన్నప్ప’ సినిమాలోని ‘శివ శివ శంకరా...’పాట. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్. మోహన్బాబు, శరత్కుమార్, మోహన్లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు మోహన్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది.కాగా బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఈ చిత్రంలోని ‘శివ శివ శంకరా...’పాటను రిలీజ్ చేశారు. మోహన్ బాబు, విష్ణు మంచు, ముఖేష్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్లైన్ వెంకటేశ్, నటి సుమలత, భారతీ విష్ణువర్ధన్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ, రామజోగయ్య శాస్త్రి తదితరులుపాల్గొన్నారు. ‘‘రవిశంకర్ గురూజీ ఈ పవిత్ర గీతాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాను.‘కన్నప్ప’ అనేది శివునితో మమేకం చేయబడిన చిత్రం. ఇదే మా ప్రయాణానికి అ΄ారమైన ఆధ్యాత్మిక విలువను జోడిస్తుంది’’ అని తెలి΄ారు మోహన్బాబు. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ స్వరపరచిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, విజయ్ ప్రకాశ్ ఆలపించారు. న్యూజిల్యాండ్లో చిత్రీకరించిన ఈపాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈపాటను హిందీలో జావేద్ అలీపాడగా, శేఖర్ అస్తిత్వ సాహిత్యాన్ని అందించారు. -
వీల్చైర్లో ప్రమోషన్స్కు రష్మిక ‘ఛావా’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
సమాజమే నీ సేవకు సలాం
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్పై బలగం జగదీష్ నిర్మించారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతులమీదుగా విడుదల చేశారు.‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న... కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా....’ అంటూ ఈ పాట సాగుతుంది. శ్రీనివాస్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల మీద వచ్చిన ఈ పాటని నేను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి పోలీస్ ఈ సాంగ్ వింటారు’’ అన్నారు. ‘‘కానిస్టేబుల్..’ పాటని సీవీ ఆనంద్గారు విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. ‘‘కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల. అది నెరవేరకపోవడంతో ఈ సినిమా నిర్మించాను’’ అని బలగం జగదీష్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ అందర్నీ స్పందింపజేస్తుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. -
‘నిన్ను నన్ను కన్న ఆడది..రా!’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
యాక్షన్ ఎంటర్టైనర్
అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించగా, అర్జున్ ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించారు. కాగా ఈ మూవీ నుంచి ‘సవదీక..’ అంటూ సాగే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను అరివు రాయగా, ఆంథోని దాసన్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘విడాముయర్చి’. అజిత్, త్రిషలపై వచ్చే ఈ పాట ఎనర్జిటిక్గా సాగుతుంది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేరా: ఓం ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సుబ్రమణియన్ నారాయణన్. -
నానా హైరానా మెలోడీ సాంగ్ HD స్టిల్స్.. రామ్చణ్, కియారా అదరగొట్టేశారుగా! (ఫోటోలు)
-
ఉగ్రావతారం
‘‘హైదరాబాద్తో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా భర్త ఉపేంద్రగారిని తొలిసారి ఇక్కడే కలిశాను. అందుకే హైదరాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరీర్లో తొలి యాక్షన్ ఫిల్మ్ ‘ఉగ్రావతారం’. ఈ పాత్రకు నేను సరిపోతానని డైరెక్టర్ గురుమూర్తిగారు నమ్మారు. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని నటి ప్రియాంకా ఉపేంద్ర అన్నారు. ప్రియాంకా ఉపేంద్ర లీడ్ రోల్లో గురుమూర్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉగ్రావతారం’.ప్రియాంకా ఉపేంద్ర సమర్పణలో ఎస్జీ సతీష్ నిర్మించిన ఈ సినిమా నవంబరు 1న విడుదలవుతోంది. హైదరాబాద్లో ఈ చిత్రం ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయగా, నిర్మాత కరాటే రాజు, నటుడు సత్యప్రకాశ్ పాటను రిలీజ్ చేశారు. డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలపై మంచి సందేశాత్మాక చిత్రంగా ‘ఉగ్రావతారం’ ఉంటుంది’’ అన్నారు. -
నీలో... నాలో...
భవ భూతి, రేవతి ప్రేమలో పడ్డారు. ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం... లోలో ఎదలో వినిపించసాగే ఓ తాళం...’ అంటూ పాట అందుకున్నారు. భవ భూతిగా శ్రీవిష్ణు, రేవతిగా మీరా జాస్మిన్ నటించిన చిత్రం ‘శ్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం...’ అంటూ సాగే పాటను శనివారం విడుదల చేశారు.ఈ చిత్రంలో శ్రీవిష్ణు చేసిన నాలుగు పాత్రల్లో భవ భూతి ఒకటి. ఆ పాత్ర సరసనే మీరా జాస్మిన్ కనిపించనున్నారు. ఇక చిత్ర సంగీతదర్శకుడు వివేక్ సాగర్ స్వరపరచిన ఈ పాటకు భువనచంద్ర సాహిత్యం అందించగా రాజేశ్ కృష్ణన్, అంజనా సౌమ్య ఆలపించారు. ‘‘ఈ మెలోడీ ట్రాక్లో శ్రీవిష్ణు, మీరా జాస్మిన్ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఈ పాట ప్రేక్షకులను 1980, 90లలోకి తీసుకెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో దక్షా నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
చిన్నారి తల్లీ.. కలకు భయపడకు
గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’ అంటూ సాగేపాటని విడుదల చేసింది చిత్రయూనిట్.‘మొండి తల్లి పిల్ల నువ్వు.. అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి, కలకు భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించిన ఈపాటని సాహితీ చాగంటిపాడారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందిన చిత్రం ‘విశ్వం’. ఇటీవల విడుదలైన తొలిపాట ‘మొరాకో మగువా..’ కి మంచి స్పందన వచ్చింది. ‘తల్లి, కూతురు నేపథ్యంలో వచ్చే ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’పాట కథలోని భావోద్వేగాల లోతును తెలియజేస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్. -
ఫస్ట్ లవ్ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
పదింటికే చలీ జ్వరం...
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది.మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘క్యా లఫ్డా..’ అంటూ సాగే మూడోపాటని సోమవారం రిలీజ్ చేశారు. ‘నరం నరం గరం గరం... పదింటికే చలీ జ్వరం, నీ ఊహలే నిరంతరం... పోతోందిరా నాలో శరం...’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం అందించిన ఈపాటని ధనుంజయ్ సీ΄ాన, సింధూజ శ్రీనివాసన్పాడారు. రామ్, కావ్యాల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి. -
శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ సినిమా ప్రెస్మీట్ (ఫోటోలు)
-
పండగ వచ్చిందే చాన్నాళ్లకి...
గూడెంలోని ప్రజలందరూ ఆ రోజు శుభవార్త విన్నారు. ఆ ఆనందంలో ‘మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందే చాన్నాళ్లకి... అలికీ అలికీ ఊరే అలికీ ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్లకీ...’ అంటూ ΄ాడుకున్నారు. విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’ చిత్రంలోని ΄ాట ఇది. ΄ా. రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో ΄ార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూ΄÷ందింది. బుధవారం ఈ చిత్రంలోని ‘మనకి మనకి...’ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. జీవీ ప్రకాశ్కుమార్ స్వరపరచిన ఈ ΄ాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా సింధూరీ విశాల్ ΄ాడారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. -
మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ
‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్... మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ’ అంటూ మొదలయ్యే ‘స్టెప్పా మార్’ పాట ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలోనిది. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019). ఈ సినిమాకు సీక్వెల్గా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కావ్యా థాపర్ హీరో యిన్. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.ఈ సినిమా నుంచి ‘స్టెప్పా మార్..’ అనే పాట లిరికల్ వీడియోను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సోమవారం విడుదల చేశారు. ‘‘ఇస్మార్ట్ శంకరే.. ఏక్ దమ్ డేంజరే... ఔర్ ఏక్ బార్ ఆయారే.. బేజారే..’ అంటూ సాగుతుంది ‘స్టెప్పామార్’ సాంగ్. తెలుగు వెర్షన్ పాటకు మణిశర్మ సంగీత సారథ్యంలో భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి, సాహితి పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నిశి తొలిచాడు దీపమై...
‘అధర్మాన్ని అణచెయ్యగ యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే... స్వధర్మాన్ని పరిరక్షించగ సమస్తాన్ని ప్రక్షాళించగ సముద్భవించే అవతారమిదే...’ అంటూ మొదలవుతుంది ‘కల్కి’ థీమ్ సాంగ్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్, కమల్హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది.ఈ సందర్భంగా ‘థీమ్ ఆఫ్ కల్కి’ పాటను మంగళవారం విడుదల చేశారు. ‘అధర్మాన్ని అణచేయగా..’ అంటూ మొదలై... ‘నిశి తొలిచాడు దీపమై... నిధనం తన ధ్యేయమై... వాయువే వేగమై...కలియుగ స్థితి లయలే కలబోసే కల్కి ఇతడే...’ అనే లిరిక్స్తో ‘థీమ్ ఆఫ్ కల్కి’ సాగుతుంది. కాలభైరవ, సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా కాలభైరవ పాడారు. -
కలలో బీట్ బాగుంది: సంగీతదర్శకుడు కోటి
‘‘కలలో... కలలో.. .’ పాట చాలా ఫ్రెష్గా ఉంది. ఈ పాట బీట్, లిరిక్స్, నటీనటుల వేషధారణ, నటన అన్నీ బాగా కుదిరాయి. ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు సంగీతదర్శకుడు కోటి. నటుడు అలీ ఫ్యామిలీ నుంచి సదన్ హీరోగా పరిచయమవుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రంలోని ‘కలలో... కలలో...’ అంటూ సాగే పాటను కోటి రిలీజ్ చేశారు.పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ల లింగయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా ప్రసాద్ హీరోయిన్. ‘‘ఫీల్ గుడ్ లవ్స్టోరీతో రూపోందించిన ఈ చిత్రంలోని ‘కలలో..’ అంటూ సాగే ప్రేమ పాటను సహజమైన లొకేషన్స్లో చిత్రీకరించాం. వీనుల విందుగా, కనువిందుగా ఉంటుంది. త్వరలో సినిమాని విడుదల చేస్తాం ’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ, కెమెరా: ఈదర ప్రసాద్. -
రామానుజాచార్యుల చరిత్రతో...
సాయి వెంకట్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. జో శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి భాగం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘జయహో రామానుజ’ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సాయి వెంకట్ మాట్లాడుతూ– ‘‘మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి మెలగాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు రామానుజా చార్యులవారు. ఆయన గొప్పతనం ఈ తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ‘జయహో రామానుజ’ చిత్రాన్ని రూపోందించాను.సంగీత సాహిత్యాలు బాగుండాలని టైమ్ తీసుకుని ఖర్చుకు వెనకాడ కుండా సాంగ్స్ డిజైన్ చేశాం’’ అన్నారు. ‘‘జయహో రామానుజ’ సినిమా మా నాన్నగారు సాయి వెంకట్కి ఒక కల’’ అన్నారు నిర్మాత ప్రవళ్లిక. ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య, వెంకట్, హర్ష. -
గరం గరం యముడయో...
అతనితో పెట్టుకున్నవారి పాలిట యమడవుతాడు... గొడ్డలి చేత పట్టాడా అంతే సంగతులు. శత్రువులను పరుగులు పెట్టించి మరీ రఫ్ఫాడేస్తాడు. ‘సరిపోదా శనివారం’లో నాని చేస్తున్న సూర్య క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘గరం గరం... ’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. ‘గరం గరం యముడయో.. సహనాల శివుడయో..’ అంటూ ఈ పాట సాగుతుంది.హీరో ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చుతాడో ఈ పాటలో నాని లుక్స్, చేసే ఫైట్ ద్వారా చూపించారు. సంగీతదర్శకుడు జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటకు సహపతి భరద్వాజ్ సాహిత్యం అందించగా విశాల్ దద్లానీ పాడారు. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జె సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. ఆగస్టు 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
పీచు మిఠాయ్...
సైకిలు మీద ప్రేమ షికారుకు వెళ్లారు సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి. ఈ జాలీ రైడ్లో ‘పీచు మిఠాయ్...’ అంటూ పాట పాడుకున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’లో సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి ఓ జంటగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరి మధ్య ‘పీచు మిఠాయ్..’ అంటూ సాగే రొమాంటిక్, మెలోడీ సాంగ్ను విడుదల చేశారు.ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా విజయ్ ప్రకాశ్, హరిప్రియ పాడారు. తెలుగు, తమిళ భాషల్లో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 13న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ని ఏషియన్–సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి విడుదల చేయనుంది. -
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
వైవీయూ: ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ‘సిద్ధం’ పాటల సీడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ఆవిష్కరించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీడీని రూపొందించిన సూర్య చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ఎన్ఆర్ఐ సూర్యనారాయణ, పాటల రూపకర్త, ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఎం.ప్రభాకర్లను భారతమ్మ అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లే శక్తి పాటకు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని పాటల రూపంలో గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానులకు ఈ పాటలను అందుబాటులోకి తెస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘సిద్ధం’ పాటల సీడీ రూపకల్పనకు సహకారం అందించిన బి.రామతులసి, డా.వి.ఉష, ఎన్.సుదీప్రెడ్డి పాల్గొన్నారు. -
చెబుతావా రత్నం
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కె. రాజ్కుమార్ విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చెబుతావా..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, సింధూరి విశాల్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘రత్నం’. ‘చెబుతావా..’ పాట మెలోడియస్గా, ఎమోషనల్గా సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఇదొక కొత్త ప్రయత్నం
ఆశిష్, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘లవ్ వీ’. ‘ఇఫ్ యు డేర్’ (నీకు ధైర్యం ఉంటే...) అనేది ఉపశీర్షిక. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రావాలి రా..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదబాద్లో జరిగింది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను చెబోలు అమల, గోమతీ అయ్యర్, అదితీ భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్విన్, సాయి శ్రేయ ఆలపించారు. ‘‘ఓ ఘోస్ట్ లవ్స్టోరీ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రం యూనిట్ పేర్కొంది. ‘‘లవ్ మీ ఒక కొత్త ప్రయత్నం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
పారడైసు పావడేసుకొచ్చెనండి...
‘జరగండి జరగండి... జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చెనండి... జరగండి జరగండి... పారడైసు పావడేసుకొచ్చెనండి...’ అంటూ పాట అందుకున్నారు రామ్చరణ్. ఈ జాబిలమ్మ ఎవరూ అంటే కియారా అద్వానీ. రామ్చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని పాట ఇది. రామ్చరణ్ పుట్టినరోజు ప్రత్యేకంగా బుధవారం ‘జరగండి..’ లిరికల్ సాంగ్ను 150కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ పాడారు. అనిత సమర్పణలో జీ స్టూడియోస్ అసోసియేష¯Œ తో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
రోటీ కపడా రొమాన్స్ మూవీ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
ఎనిమిది భాషల్లో రికార్డు బ్రేక్
నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్యకృష్ణ, కాశీ విశ్వనాథ్ ముఖ్య తారలుగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పై చదలవాడ పద్మావతి నిర్మించిన చిత్రం ‘రికార్డు బ్రేక్’. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 8 భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మళ్లీ పుట్టి వచ్చినవా..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సాబు వర్గీస్ సంగీత సారథ్యంలో వరికుప్పల యాదగిరి ఈ పాటకు లిరిక్స్ అందించి, పాడారు. ‘‘అందరికీ నచ్చేలా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
‘బిచ్చగాడు’ వంటి బ్లాక్బస్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రోమియో’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళినీ రవి హీరోయిన్గా నటిస్తున్నారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్పై విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ ధనశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్కి భాష్యశ్రీ సాహిత్యం అందించగా, ఆదిత్య ఆర్కే పాడారు. ‘‘విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో నటిస్తున్న చిత్రం ‘లవ్ గురు’. ఇందులో మనసుని కదిలించే చెల్లెలి సెంటిమెంట్ కూడా ఉంటుంది. వేసవిలో ఈ చిత్రం విడుదల చేయనున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: ఫరూక్ జే బాష. -
క్రైమ్ థ్రిల్లర్
‘‘కలర్ ఫోటో’ చిత్రానికి ముందు ‘మను చరిత్ర’ సినిమాలో శివ స్నేహితుడిగా చేశాను. నిర్మాత రాజ్ కందుకూరిగారు నన్ను కూడా తన కుమారుడు శివలానే చూసుకునే వారు. నేను హీరో కాకముందే నన్ను ఓ హీరోలా చూశారాయన. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’లోని ‘శివ ట్రాప్ ట్రాన్స్..’ పాట అద్భుతంగా ఉంది. ఈ సినిమాని అందరూ చూడాలి’’ అని హీరో సుహాస్ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ మూవీ మార్చి 1న విడుదల అవుతోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘శివ ట్రాప్ ట్రాన్స్..’ అనే పాటని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ లాంచ్ చేశారు. అనంతరం నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్కి సుహాస్ ముఖ్య అతిథిగా హాజరై, పాట రిలీజ్ చేశారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటని కాలభైరవ పాడారు. ‘‘మా సినిమాని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు శివ కందుకూరి. ‘‘యునిక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు పురుషోత్తం రాజ్. ‘‘మా మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు స్నేహాల్, శశిధర్, కార్తీక్. ఈ వేడుకలో దర్శకుడు విజయ్ కనకమేడల, హీరోయిన్ వర్ష బొల్లమ్మ, నిర్మాత రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల పాల్గొన్నారు. -
Utsavam Movie: ఆకట్టుకుంటున్న ‘ఫస్ట్ కిస్’ సాంగ్
రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాశ్ జంటగా నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ ప్రమోషన్స్ని ప్రారంభించారు మేకర్స్. ‘ఫస్ట్ కిస్..’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేసింది యూనిట్. చిత్ర సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల పాడారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఉత్సవం’ రూపొందింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ‘ఫస్ట్ కిస్..’ పాట యువతను ఆకట్టుకుంటుంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులందరూ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. -
డూడుం డుక్కుడుం బాగుంది
‘‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు–500143’ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాట బాగుంది. ఈ సాంగ్కి క్లాసికల్ టచ్ ఇవ్వడం బాగా నచ్చింది. ఈ సినిమాలోని ఇతర పాటలు ఎలా ఉంటాయో అని ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం తప్పకుండా మ్యూజికల్ హిట్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ అన్నారు. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు– 500143’. కొవ్వూరి అరుణ సమర్పణలో బ్లాక్ యాంట్ పిక్చర్స్పై భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాటని జీవీ ప్రకాశ్ కుమార్ విడుదల చేశారు. శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు. ఈ చిత్రానికి కెమెరా: నిఖిల్ సురేంద్రన్, నేపథ్య సంగీతం: కమ్రాన్. -
‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రంలోని ‘అరెరె అరెరె..’ పాట.
‘ఎగిరెనే ఎగిరెనే అటు ఇటు మనసే..’ అంటూ మొదలవుతుంది ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రంలోని ‘అరెరె అరెరె..’ పాట. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మిస్తున్నారు. కాగా ‘అరెరె అరెరె..’ పాట లిరికల్ వీడియోను సంగీతదర్శకుడు తమన్ విడుదల చేశారు. ఆర్.ఆర్. ధ్రువన్ స్వరపరచిన ఈ పాటను రఘురామ్ రాయగా, కపిల్ కపిలన్ పాడారు. ‘‘అరెరె అరెరె...’ పాటలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ధ్రువన్ మల్టీ టాలెంటెడ్. తను పాటల రచయితగా, సింగర్గా నాకు తెలుసు. ఈ చిత్రంతో అతను సంగీతదర్శకుడిగా మారడాన్ని నమ్మలేకపోతున్నాను’’ అన్నారు తమన్. ‘‘నలుగురి స్నేహితుల కథే ఈ చిత్రం’’ అన్నారు విక్రమ్రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధ్రువన్, వసంత్. జి. -
ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రజాకార్’. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ సినిమాలోని ‘పోతుగడ్డ మీద..’ పాటను విడుదల చేశారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘భీమ్స్గారి సంగీతం, సుద్దాల అశోక్తేజగారి సాహిత్యంలో ఏదో తెలియని భావోద్వేగం ఉంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా మేం అంతే భావోద్వేగానికి లోనయ్యాం’’ అన్నారు. ‘‘సుద్దాల అశోక్తేజ, భీమ్స్గార్లు ఊరికే ఎమోషన్ కాలేదు. మా పూర్వీకుల చరిత్రలో అంతటి ఆవేదన నిండి ఉంది. భీమ్స్గారు పాడిన పాట వింటే పోతుగడ్డ మీద పుట్టిన భూమి బిడ్డల ఆత్మ ఘోషిస్తున్నట్లు ఉంటుంది’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘సుద్దాల హనుమంత, జానకమ్మల బిడ్డను కాకుంటే నా పాటలో ఇంత ఎమోషన్ ఉండేది కాదు. రజాకార్ ఉద్యమంలో మా అమ్మా నాన్న పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం వారు నైజాంకు వ్యతిరేకంగా పోరాడారు. రజాకార్ ఉద్యమంలో ్రపాణాలు కోల్పోయిన కమ్యూనిటీ నుంచి వచ్చిన భీమ్స్ ఉండటం నాకు కలిసొచ్చింది. ఈ తరహా సినిమా తీయాలంటే డబ్బులు ఉంటే సరిపోదు.. ధైర్యం కావాలి. ఆ ధైర్యం గూడూరు నారాయణరెడ్డికి ఉంది’’ అన్నారు సుద్దాల అశోక్తేజ. ‘‘మా తాతగారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ సమాజం ఎంత కష్టానికి గురైందో, ఎన్ని కన్నీళ్లను చూసిందో... వారందరి స్వరాలకు నేను స్వరాన్ని సమకూర్చానని చె΄్పాలి’’ అన్నారు భీమ్స్ సిసిరోలియో. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుష్య త్రిపాఠి, కొరియోగ్రాఫర్ స్వర్ణ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ పోతిరెడ్డి అంజిరెడ్డి పాల్గొన్నారు. -
అన్నదమ్ముల మధ్య ఈగోలు ఉండకూడదు: మంచు మనోజ్
సంపూర్ణేష్ బాబు, సంజోష్,ప్రాచీబంసాల్, ఆరతి గుప్త ప్రధాన తారాగణంగా మన్ మోహన్ మైనంపల్లి దర్శకత్వంలో చంద్ర చాంగల నిర్మిస్తున్న చిత్రం ‘సోదరా’. ఈ సినిమాలోని ‘అన్నంటే దోస్తే సోదరా.. సీక్రేట్సే లేవురా..చిన్నోడై పుడితే సోదరా.. జన్మంత జాతర’ అంటూ సాగేపాటను హీరో మంచు మనోజ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘అన్నదమ్ముల మధ్య ఈగోలు, డబ్బు సమస్యలు ఉండకూడదు. హ్యూమన్స్ ఎమోషన్స్ నేపథ్యంలో ‘సోదర’ సినిమా తీయడం నాకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మంచు మనోజ్ నన్ను ఓ సొంత సోదరుడిలా భావించి, ఈ సాంగ్ ఈవెంట్కు వచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు సంపూర్ణేష్బాబు. ‘‘అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు మన్ మోహన్. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సంజోష్, చంద్ర చగంలా. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్. -
నాకు డ్యాన్స్ చేయాలనిపించింది
‘‘బబుల్గమ్’ సినిమాలోని ‘ఇజ్జత్..’పాట చాలా హుషారుగా అనిపించింది. శ్రీచరణ్ పాకాల చక్కని సంగీతం అందించారు. ‘ఇజ్జత్..’ అనే ర్యాప్ సాంగ్లో రోషన్తో కలసి డ్యాన్స్ చేయాలనిపించింది. ప్రతి క్లబ్, పబ్, యూత్ వేడుకల్లో ఈ పాట మార్మోగుతుంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. రోషన్ కనకాల, మానస చౌదరి జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన చిత్రం ‘బబుల్గమ్’. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఇజ్జత్..’ పాటను చిరంజీవి రిలీజ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాటకి ఎం.ఎస్. హరి సాహిత్యం అందించగా, రోషన్ కనకాల, ఎం.ఎస్. హరి పాడారు. -
నాలాంటి స్టూడెంట్స్కి సహాయం చేయాలి!
‘‘ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ‘సైంధవ్’ నా 75వ చిత్రం. యాక్షన్, భావోద్వేగాలు చాలా అద్భుతంగా వచ్చాయి. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీతో కలిసి అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. చిత్ర సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రాంగ్ యూసేజ్..’ అంటూ సాగే తొలిపాటని సీఎంఆర్ గ్రూప్ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈపాటను నకాష్ అజీజ్పాడారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘కళాశాల దశలో నేను బ్యాక్ బెంచర్ని. ఇప్పుడున్న నాలాంటి విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ విద్యార్థులు, అధ్యాపకులు సహకారం అందించాలి. 35 ఏళ్లుగా నా సినీ జర్నీ కొనసాగుతోంది. నా మొదటి చిత్రం విడుదల అప్పటినుంచి ఇప్పుడున్న యువత తల్లిదండ్రులు నన్ను ఆదరిస్తున్నారు. ఇప్పుడు యువత ఆదరిస్తున్నారు. ఈ తరం వారిని కూడా నా సినిమాలు రీచ్ అవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
అలుపెరుగని కలం యోధుడా...
ప్రముఖ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితం ఆధారంగా రూ΄÷ందిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాళోజీ పాత్రలో మూల విరాట్ నటించారు. విజయలక్ష్మి జైనీ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. యస్యస్ ఆత్రేయ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అలుపెరుగని అవిశ్రాంత కలం యోధుడా...’ పాటను నిర్మాత డి. సురేష్ బాబు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ పాట చాలా బాగుంది. ఇలాంటి వీరుల కథతో సినిమా తీసిన విజయలక్ష్మి, ప్రభాకర్లకు అభినందనలు’’ అన్నారు. ‘‘ప్రజా ఉద్యమ నాయకుడైన కాళోజీగారి బయోపిక్ తీసినందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు. ఇకపైనా ఇలాంటి గొప్ప వ్యక్తుల సినిమాలు తీసేందుకు ప్రేక్షకుల ్ర΄ోత్సాహం కావాలి’’ అన్నారు ప్రభాకర్ జైనీ. ‘‘ఇలాంటి మంచి సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు బిక్కి కృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్ నీర్ల, నేపథ్య సంగీతం: మల్లిక్ యంవీకే. -
సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ సినిమా సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
'ఆదికేశవ'సాంగ్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
నాపై నాకు నమ్మకం వచ్చింది
‘‘జిగర్తాండ డబుల్ ఎక్స్’లో నాకు మేకప్ వాడలేదు. మేకప్ లేకుంటే బాగుండనేమో? అనుకున్నాను. కానీ, స్క్రీన్పై చూసుకున్నాక నా మీద నాకు నమ్మకం ఏర్పడింది’’ అన్నారు రాఘవా లారెన్స్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమాలోని ‘కోరమీసం..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’లో నేను చేయాల్సింది.. కానీ, కుదర్లేదు. ఆ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్కు జాతీయ అవార్డు వచ్చింది. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ కోసం ఓ ఊర్లో రోడ్డు, బ్రిడ్జి నిర్మించారు మా నిర్మాత. ఆయన మంచి మనసు కోసమైనా ఈ చిత్రం బాగా ఆడాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పండగలా ఉంటుంది’’ అన్నారు కార్తికేయన్. ‘‘జిగర్తాండ’ కంటే డబుల్ ఎక్స్ రేంజ్లో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. ‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం’’ అన్నారు ఎస్జే సూర్య. -
నేడు ‘బహుజన బతుకమ్మ’ పాటల ఆవిష్కరణ: విమలక్క
సాక్షి, హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ఏసీఎఫ్) రూపొందించిన ‘పూసే పూల కవాతు’, ‘రావె రావె బతుకమ్మ రావే’అనే పాటల వీడియోలను ఆదివారం(నేడు) ఉదయం 10 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్లో ఆవిష్కరిస్తామని ప్రజాగాయకురాలు విమలక్క తెలిపారు. 13 ఏళ్లుగా నిర్వహిస్తున్న బహుజన బతుకమ్మను ఈ ఏడాది ‘మద్యం రద్దు– మగువల రక్షణ’అనే అంశంపై ప్రకృతి పూల కవాతుగా నిర్ణయించినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పండుగ ఈ నెల 13న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదలై 22న ఖమ్మం జిల్లా ముదిగొండలో ముగుస్తుందని విమలక్క వెల్లడించారు. -
'సగిలేటి కథ' నుంచి 'చికెన్ సాంగ్' లాంచ్
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకుడు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలరిస్తుంది. తాజాగా ఓ క్రేజీ గీతాన్ని విడుదల చేశారు. (ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత) హీరో నవదీప్ ఆధ్వర్యంలో తెలుగు యంగ్ డైరెక్టర్స్ 'బేబీ' ఫేమ్ సాయి రాజేశ్, వెంకటేష్ మహా, సందీప్ రాజ్.. ఈ సాంగ్ లాంచ్కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో రోషం రాజు క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని, అలానే ఈ మూవీలో కామెడీ అందరిని నవ్విస్తుందని, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతిఒక్కరికీ చికెన్ తినాలనిపిస్తుందని నవదీప్ చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది. (ఇదీ చదవండి: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ) -
‘జోరుగా హుషారుగా’ విరాజ్ అశ్విన్
‘ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ’ అంటూ ‘జోరుగా హుషారుగా..’ చిత్రంలోని ‘యువరాణి’ పాట సాగుతుంది. విరాజ్ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అనుప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘యువరాణి యువరాణి నువ్వు..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేసి, ‘‘ఈ సినిమా ఓ జెన్యూన్ లవ్స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రణీత్ స్వరపరచిన ‘యువరాణి’ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా అమ్రాన్ మాలిక్, నవ్య సమీర పాడారు. ‘‘త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. -
రొమాంటిక్ సాంగ్.. స్టేజీపైనే రెచ్చిపోయారు!
సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు దర్శకనిర్మాతలు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏం చేయడానికైనా సరే వెనకాడట్లేదు. ఒకప్పడు ఈవెంట్ ఏర్పాటు చేసి సినిమా గురించి పబ్లిసిటీ చేసేవాళ్లు. ఇప్పుడు కాలేజీల్లో సాంగ్ రిలీజ్ లాంటివి చేస్తున్నారు. అలా విశ్వక్ సేన్ కొత్త మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లోని పాటని తాజాగా రిలీజ్ చేశారు. అయితే విశ్వక్-నేహా స్టేజీపై ఈ సాంగ్కి డ్యాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?) 'సుట్టంలా సూసి' అనే రొమాంటిక్ సాంగ్ తాజాగా హైదరాబాద్లోని ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో హీరోహీరోయిన్ విశ్వక్ సేన్, నేహాశెట్టితోపాటు చిత్రబృందం అంతా పాల్గొంది. అయితే ఈ పాటకు స్టేజీపై డ్యాన్స్ చేసిన విశ్వక్-సేన్.. సినిమాలో ఏ స్టెప్పులైతే ఉన్నాయో.. వాటినే రీక్రియేట్ చేశారు. నేహా చీరని విశ్వక్ నోటితో పట్టుకుని వేసిన స్టెప్ అయితే అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది. గోదావరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న పీరియాడికల్ సినిమా ఇది. క్రూరమైన, నేరపూరితమైన చీకటి సామ్రాజ్యంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథ ఈ చిత్రం. ఈ సినిమాని చైతన్య కృష్ణ దర్శకుడు కాగా, యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. డిసెంబరు 8న థియేటర్లలోకి ఈ మూవీని తీసుకురానున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) -
సాయిధరమ్ తేజ్ ‘ది సోల్ ఆఫ్ సత్య’ సాంగ్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మిస్టర్ ప్రెగ్నెంట్.. అంతా ఉల్టా పల్టా
సయ్యద్ సోహైల్ రియాన్, రూపాకొడవాయుర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కానుంది. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘ఉల్టా పల్టా..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ – ‘‘అమ్మతనం బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ రాశాను. సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి జాగ్రత్తగా రూ΄÷ందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నా సిస్టర్స్ ఇద్దరు ప్రెగ్నెంట్. వాళ్లను చూసి ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నాను’’ అన్నారు సోహైల్. ‘‘పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ చూసి, మంచి సినిమా చేశారని ప్రశంసించారు’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘యూఎస్లో 100 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వెంకట్ అన్నపరెడ్డి. ‘‘అప్పిరెడ్డి జడ్జిమెంట్ మీద నమ్మకంతో ఈ సినిమా చేశాం’’ అన్నారు రవీందర్ రెడ్డి సజ్జల. -
చందమామ కథలోన..
రక్షిత్ అట్లూరి, సంకీర్తన విపిన్ జంటగా వెంకట సత్య దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘చందమామ కథలోన..’ పాట లిరికల్ వీడియోను దర్శకుడు కె. రాఘవేంద్ర రావు విడుదల చేసి, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘చందమామ కథలోన.. అందమైన పిల్లేనా.. కళ్ల ముందు వాలిందా.. తుళ్లి తుళ్లి పడ్డాన..’ అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా హరి చరణ్, గీతా మాధురి పాడారు. శరవణ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి. -
శ్రీలీల.. డేంజర్ పిల్లా!
‘అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా.., ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా.., డేంజర్ పిల్లా..’ అని పాడుతున్నారు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్– ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘డేంజర్ పిల్లా..’ పాటను బుధవారం రిలీజ్ చేశారు. ఈ పాటను కృష్ణకాంత్ రాయగా అర్మాన్ మాలిక్ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. -
‘చచ్చినా చావని ప్రేమిది’ సాంగ్ క్యాచీగా ఉంది
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సందేహం’.‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి మేకర్స్ ‘చచ్చినా చావని ప్రేమిది’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజైంది. ఈ కార్యక్రమంలో దశరథ్తో పాటు మన చౌదరి, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ సతీష్ పరమదేవగారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో రానున్న ‘సందేహం’ మూవీ లిరికల్ సాంగ్ను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పూర్ణాచారిగారు పాటను అద్భుతంగా రాశారు. పాట వింటుంటే చాలా క్యాచీగా ఉంది’ అన్నారు. ‘టీమ్ అంతా ఎంతో కష్టపడి అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని మన చౌదరి అన్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం ఈ చిత్రంలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు. -
‘రాజంపేట రాణి'పాట బాగుంది: శేఖర్ మాస్టర్
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రాజంపేట రాణిని అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శేఖర్ మాస్టర్ విడుదల చేసారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. శాంతి స్వరూప్ సాహిత్యం అందించిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్గా శాంతి కుమార్ అందిరికీ పరిచయమే. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి సినివుమా దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ చిత్రంలోని ‘రాజంపేట రాణిని’ అంటూ సాగే మాస్ బీట్ పాటను చూశా. సంగీతం, కొరియోగ్రఫీ చాలా బావుంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. జబర్దస్త్ నుంచి వెళ్లిన వేణు ‘బలగం’ చిత్రంతో పెద్ద పేరు తెచ్చుకున్నాడు శాంతి కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ ‘జబర్దస్త్ కమెడీయన్గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు , పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. శేఖర్ మాస్టర్ ఈ మాస్ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. -
పల్లెటూరి వినోదం
తెలంగాణ నేపథ్యంలో రూపొందిన పల్లె కథా చిత్రం ‘తురుమ్ ఖాన్లు’. శివ కల్యాణ్ దర్శకత్వంలో ఎండీ ఆసిఫ్ జానీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని ‘రంగు రంగుల చిలక...’ అంటూ సాగే తొలి పాటను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు. ‘‘పల్లెటూరి పగ, ప్రతీకారాలతో వినోదాత్మకంగా, మహబూబ్ నగర్ స్లాంగ్లో రూపొందిన చిత్రం ఇది’’ అని యూనిట్ తెలిపింది. నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, రియాన్. ∙ఆసిఫ్ జానీ, నక్కిన త్రినాథరావు, శ్రీరామ్ -
హారర్ సినిమాలు చేయకూడదనుకున్నా
‘‘హారర్ చిత్రాల్లో నటించకూడదనుకున్నాను. కానీ ‘ఓ మంచి ఘోస్ట్’ సినిమా కథ నచ్చడంతో చేశాను. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని హీరోయిన్ నందితా శ్వేత అన్నారు. శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. అభినిక ఐనాభాతుని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘పాప నువ్వు తోపు..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సింహాచలం లిరిక్స్ అందించిన ఈ పాటను బాలసూరన్న పాడారు. ఈ పాట విడుదల వేడుకలో శంకర్ మార్తాండ్ మాట్లాడుతూ–‘‘హారర్ అండ్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. హారర్ కథలకు మ్యూజిక్ చాలా ముఖ్యం.. అనూప్గారు ప్రాణం పెట్టి ఈ సినిమాకు సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘ఓ పాప నువ్వు తోపు..’ పాట ఆకట్టుకుంటుంది’’ అన్నారు అనూప్ రూబెన్స్. -
గుండెల్లో మోగిందే నీ కబురే!
నిఖిల్, ఐశ్వర్యా మీనన్ జంటగా ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘‘మొదటిసారిగా చూపు తగిలే... గుండెల్లో మోగిందే నీ తొలి కబురే, జుమ్ జుమ్మనే గుండెల్లోన యుద్ధాలే.. సిద్ధంగా ఉంచా నీకే ఏడుజన్మలే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ ఆదివారం విడుదల చేసింది. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా పాడారు. స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్. -
ఇప్పుడే పరిచయమే...
శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మను చరిత్ర’. ఈ మూవీతో భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్.శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఇప్పుడే పరిచయమే...’ పాటని హీరోయిన్ సంయుక్త మీనన్ లాంచ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, ఆర్మాన్ మాలిక్ పాడారు. -
నీలా.. నన్నిలా..
సాహస్, దీపిక జంటగా చైతు మాదాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘7:11’. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నీలా.. నన్నిలా...’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. గ్యానీ స్వర పరచిన ఈ మెలోడీ సాంగ్కు మణి దీపక్ కడిమిశెట్టి సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. ‘‘ఇది టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ క్రైమ్ డ్రామా. 1999లో ఒక ముఖ్యమైన రోజున భవిష్యత్తులో 400 సంవత్సరాలలో వేరే గ్రహం నుండి మానవుల మనుగడకు సంబంధించిన కీలకమైన సమాధానాల కోసం ‘హంసలదీవి’ అనే చిన్న ఇండియన్ టౌన్కి చేరుకుంటారు. అదే రోజున ఆ టౌన్ని నాశనం చేయడానికి కొన్ని ఘటనలు జరుగుతాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
బేబీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసిన స్టార్స్ (ఫొటోలు)
-
35 మంది కొత్తవారితో ‘మేమ్ ఫేమస్’
సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ పతాకాలపై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ సినిమా టీజర్, ‘అయ్యయయ్యో..’ పాటను ప్రదర్శించారు. అనంతరం ఈ చిత్ర హీరో, దర్శకుడు సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రమోషన్స్కు ప్రముఖ హీరోలంతా హెల్ప్ చేస్తుండటంతో నాకు మంచి పేరు వచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘18 ఏళ్ళకే టిక్ టాక్లు చేసిన సుమంత్ 23 ఏళ్ళకే డెరైక్టర్ అయ్యాడు. అంతా యూత్ చేసిన సినిమా ఇది. ఆడియన్స్కు నచ్చుతుంది’’ అన్నారు అనురాగ్ రెడ్డి. ‘‘ఈ సినిమాతో 30 మందికిపైగా నటీనటులను పరిచయం చేయడం గర్వంగా వుంది’’ అన్నారు ‘లహరి ఫిలింస్’ చంద్రు మనోహర్. ‘‘వైజాగ్లో అన్నపూర్ణ స్టూడియోస్, రెండు రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల్లో గీతా ఆర్ట్స్, ఓవర్సీస్లో సరిగమల ద్వారా మా సినిమా విడుదలవుతుంది’’ అన్నారు శరత్ చంద్ర. -
అన్నీ మంచి శకునములే హాయినిస్తుంది
‘‘రాఘవేంద్రరావు, అశ్వినీదత్గార్లతో నాది 30 ఏళ్లు పైబడిన స్నేహం. స్వప్న, ప్రియాంక నా కూతుళ్లులాంటివారు. నేను, దత్గారు యాభై ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ ఇవాళ మా పిల్లల వల్ల ఇంకా ఎక్కువ షైన్ అవుతున్నాం. ‘అన్నీ మంచి శకునములే’ మనందరికీ హాయి ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్. అన్నారు. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెయ్యి చెయ్యి కలిపేద్దాం..’ అంటూ సాగే నాలుగో పాటను డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీ కృష్ణ, వేణు శ్రీరంగం, సందీప్, చైత్ర అంబడిపూడి పాడగా, బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘అన్నీ మంచి శకునములే’ మూవీ ‘పెళ్లి సందడి’ అంత పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు ‘‘రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్గార్లు నాకు మంచి శకునం’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘చిన్నప్పటినుంచి ఈ ముగ్గుర్ని (రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్) చూస్తూ పెరిగాం.. వీరిని ఒకే వేదికపై చూడటం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు ప్రియాంకా దత్, స్వ΄్నా దత్. -
‘అన్నీ మంచి శకునములే’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు చూడరు
‘‘ప్రేక్షకులకు విజయవంతమైన సినిమా ఇవ్వడం అంత తేలిక కాదు. ‘బలగం, దసరా, విరూ పాక్ష’.. ఇలా కొత్తదనంతో నూతన దర్శకులు తీసిన చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయి. కొత్తదనం లేని సినిమాలు చూడటానికి రెడీగా లేరు.. అది ఇవ్వడానికి రాత్రీపగలు కష్టపడాల్సిందే’’ అన్నారు ‘దిల్’ రాజు. ఆశిష్, ఇవానా జంటగా కాశీ విశాల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సెల్ఫిష్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్పై ‘దిల్’ రాజు–శిరీష్ నిర్మిస్తున్నారు. ఆశిష్ పుట్టినరోజు (మే 1)ని పురస్కరించుకుని ‘సెల్ఫిష్’లోని ‘దిల్ ఖుష్..’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. మిక్కీ జె. మేయర్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, జావేద్ అలీ పాడారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను, సుకుమార్ సపోర్ట్గా ఉంటాం. కానీ, ప్రేక్షకులకు నచ్చాల్సింది మాత్రం ఆశిష్. దాని కోసం తను కష్టపడాలి’’ అన్నారు. ‘‘సెల్ఫిష్’ కోసం నేను, కాశీ ప్రాణం పెట్టి కష్టపడుతున్నాం’’ అన్నారు ఆశిష్. ‘‘మాస్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది’’ అన్నారు విశాల్ కాశీ. ఈ చిత్రానికి సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ బండ్రెడ్డి. -
గోపీచంద్ కి దిష్టి తీయాలి..
-
లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ కొడుతున్నాం
-
కర్నూలులో రామబాణం సాంగ్ రిలీజ్.. గోపీచంద్కు పూలమాలతో సత్కారం (ఫొటోలు)
-
నాందిలా ఉగ్రంని హిట్ చేయాలి
‘‘ఉగ్రం’ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన సాహు, హరీష్గార్లకు థ్యాంక్స్. నా కెరీర్లో అత్యధిక బడ్జెట్తో రూపొందిన చిత్రమిది. వేసవిలో మీ ముందుకు వస్తోంది. విజయ్, నా కాంబినేషన్లో వచ్చిన ‘నాంది’ మూవీని హిట్ చేసినట్టు ‘ఉగ్రం’ని కూడా పెద్ద హిట్ చేయాలి’’ అని హీరో ‘అల్లరి’ నరేష్ అన్నారు. ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేష్, మీర్నా మీనన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘దేవేరి..’ అంటూ సాగే పాటను హైదరాబాద్లో విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. విజయ్ కనకమేడల మాట్లాడుతూ– ‘‘నరేష్గారి కెరీర్లో ‘ఉగ్రం’ మరో వైవిధ్యమైన సినిమా అవుతుంది. శ్రీచరణ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో మీర్నా మీనన్, శ్రీచరణ్ పాకాల, సాహు గారపాటి, హరీష్ పెద్ది తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్. -
రాహుల్ సిప్లిగంజ్ పాడిన బుల్..బుల్.. సాంగ్ విన్నారా?
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘బుల్ బుల్ అన్స్టాపబుల్..’ అనే తొలి పాటని హీరో గోపీచంద్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్తో కలసి భీమ్స్ పాడారు. ‘‘ఈ పాటలో సన్నీ, సప్తగిరి మాస్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
‘నువ్వే కావాలి అమ్మ’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వాలంటైన్స్ డే స్పెషల్: వినరో భాగ్యము విష్ణు కథ నుంచి లవ్ ట్రాక్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఇవాళ(ఫిబ్రవరి 14న)'వాలెంటైన్స్ డే' సందర్భంగా ఈ సినిమా నుంచి లవ్ట్రాక్ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. 'ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే..’ అంటూ సాగే ఈ పాటకు సాగుతోంది. హీరోయిన్ వెంట పడుతూ హీరో పాడే పాట ఇది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కాగా ఈ చిత్రంలో మురళీశర్మ, శుభలేఖ సుధాకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. -
వాలంటైన్స్ డే: శాకుంతలం చిత్రం నుంచి మరో మెలోడీ సాంగ్
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణ శేఖర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా శాకుంతలంను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టిజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శాకుంతలం పాటలు అయితే యూట్యూబ్లో ట్రెండింగ్ జాబితాలో నిలిచాయి. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం మరో మెలోడీ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘మధుర గతమా..’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. శ్రీమని సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. కాగా ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సమంత లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించాడు. అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ భరతుడి పాత్ర పోషించగా.. ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాలలు కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శాకుంతం మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
వాలంటైన్స్ డే స్పెషల్: తెలుసా మనసా నుంచి మెలోడీ సాంగ్
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసా మనసా. డెబ్యూ డైరెక్టర్ వైభవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జష్విక హీరోయిన్గా నటిస్తోంది. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్స్టోరిగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్పై వర్షా ముండాడ, మాధవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మెలోడీ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ ఈ పాటను తాజాగా లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాటాడుతూ.. ఈ పాట విన్నానని, చాలా బాగుందన్నారు. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్స్టోరిగా వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపారు. ‘మనసు మనసుతో..’ అంటూ మెలోడియస్గా సాగే ఈ పాట సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోసారి ఈ పాటలో ఆయన తనదైన మార్క్ చూపించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా.. నిజమైన ప్రేమలోని లోతును ఆవిష్కరించేలా, హృదయానికి హత్తుకునేలా ఉంది ఈ పాట. వనమాలి రాసిన ఈ పాటను శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు. ప్రసాద్ ఈదర సినిమాటోగ్రఫీ ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. -
కల్యాణ్ రామ్ అమిగోస్ నుంచి సెకండ్ సింగిల్, బాలయ్య హిట్ సాంగ్కు రీమిక్స్
బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్, పాటలు సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మా’ పాటలను రిలీజ్ చేశారు మేకర్స్. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్కు ఇది రీమిక్స్. గతంలో బాలయ్య నటించిన 'ధర్మక్షేత్రం' సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను దివంగత లెజెండరి సింగర్ బాలు - చిత్ర ఆలపించారు. అదే పాటలను అమిగోస్లో రిమేక్ చేయించాడు కల్యాణ్ రామ్. గిబ్రాన్ సింగీతం అందించిన ఈ పాటను ఎస్పీ చరణ్-సమీరా భరద్వాజ్లు ఆలపించారు. కాగా ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. Evergreen Romantic Melody is here❤️#EnnoRatrulosthayi Full Video Song from #Amigos out now 🕺💃 - https://t.co/foMaW1GPNB#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial #SriVeturi #SpbCharan #SameeraBharadwaj @adityamusic pic.twitter.com/ouc4OQHVmI — Mythri Movie Makers (@MythriOfficial) January 31, 2023 -
శాకుంతలం ఫస్ట్ సింగిల్ రిలీజ్, ఆకట్టుకుంటున్న మెలోడి సాంగ్
మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘మల్లికా మల్లికా మాలతీ మాలికా.. చూడవా చూడవా ఏడి నా ఏలిక’ అంటూ సాగే పాటను బుధవారం విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటను రమ్య బెహ్రా పాడారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. -
బ్లాక్ బస్టర్.. రాసిపెట్టుకోండి
‘‘వీరసింహా రెడ్డి’కి తమన్ అత్యద్భుతమైన పాటలు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రిగారు రాశారు. ‘మాస్ మొగుడు..’ చివర్లో తీసిన పాట. అప్పుడు మా కెమెరామేన్ రిషి పంజాబీ డిఐ వర్క్లో వుండటం వలన నా ‘క్రాక్’ సినిమా కెమెరామేన్ జీకే విష్ణు ఈ పాటని చేశారు. బాలయ్యబాబుని చాలా కలర్ఫుల్గా చూపించారు’’ అన్నారు గోపీచంద్ మలినేని. నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతీహాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రంలోని ‘మాస్ మొగుడు..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తమన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మనో, రమ్య బెహరా ఆలపించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘ఇటీవల ఒంగోలులో జరిగిన వేడుకలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో మామూలుగా ఉండదు. ‘వీరసింహా రెడ్డి’ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్... రాసిపెట్టుకోండి’’ అన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘నేను బాల కృష్ణగారికి అభిమానిని. ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ రాసే చాన్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనికి, మైత్రీ మూవీ మేకర్స్కి కృతజ్ఞతలు. అన్ని పాటలూ అద్భుతంగా ఉంటాయి. బాలకృష్ణగారి మార్క్ ఫైర్ బ్రాండ్ సినిమా ఇది’’ అన్నారు. -
వాల్తేరు వీరయ్య: పూనకాలు లోడింగ్ సాంగ్ లాంచ్ ఈవెంట్(ఫొటోలు)
-
వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్, గొంతు కలిపిన చిరు, రవితేజ
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చదవండి: బాలయ్య ‘అన్స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! ప్రస్తుతం యూట్యూబ్లో ఈ సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే మరో మాస్ సాంగ్ను వదిలారు మేకర్స్. ‘డొంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్’ అంటూ సాగే ఈ పాటను రామ్ మిర్యాల, రోల్రైడాలు ఆలపించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అంతేకాదు మధ్య మధ్యలో చిరు, రవితేజలు కూడా ఈ పాటకు తమ గొంతు కలపడమే కాదు కలిసి స్టెప్పులు కూడా వేశారు. దీంతో ఒకే ఫ్రేంలో చిరు, రవితేజను చూస్తుంటే మెగా, మాస్ మహారాజ ఫ్యాన్స్కి నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంది. చదవండి: రొమాంటిక్ సీన్స్లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు -
సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ అప్పుడే!
సందీప్ కిషన్, దివ్యాంశా కౌశిక్ ‘నువ్వుంటే చాలు...’ అని ప్రేమ పాట పాడుకున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మైఖేల్’ చిత్రంలోని పాట ఇది. సినిమాలోని ఈ తొలి పాటను ఈ 28న విడుదల చేయనున్నారు. ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించి, పాటలోని ఓ పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. రంజిత్ జయకొడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పితో కలిసి డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పకులు. ‘‘సందీప్ కిషన్కి తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ సినిమా కోసం సందీప్ అద్భుతంగా మేకోవర్ అయ్యారు. సామ్ సీఎస్ మంచి పాటలు ఇచ్చారు. రొమాంటిక్ సాంగ్ ‘నువ్వుంటే చాలు..’ని తెలుగు, తమిళ భాషల్లో ఈ 28న విడుదల చేయనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్గా నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: కె. సాంబశివరావు. -
18 పేజెస్’ సినిమా ఒక సాధారణ లవ్స్టోరీ కాదు..: అల్లు అరవింద్
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను తాజాగా చిత్రం విడుదల చేసింది. ‘ఏడు రంగులు వాన.. రెండు కళ్ళల్లోన.. కారణం ఎవరంటే..’ అంటూ సాగే ఈ పాట ఆదివారం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. సిద్ శ్రీ రామ్ ఆలపించాడు. ఈ సాంగ్ రిలీజ్ చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘గత నాలుగు నెలలుగా.. నెలకొక సినిమా రిలీజ్ చేస్తున్నా. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు,సపోర్ట్ చేస్తున్న మీడియాకు మా ధన్యవాదాలు. సుకుమార్ నాతో ఒక విచిత్రమైన లవ్స్టోరీ చేద్దామని చెప్పడంతో వాసు కూడా తెగ సంబరపడిపోయాడు. మేం తీసిన ‘18 పేజెస్’ సినిమా ఒక సాధారణ మైన లవ్స్టోరీ కాదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. గోపి గారు ఇప్పటి వరకు మా బ్యానర్లో ఏడు సినిమాలు చేశారు. అవన్నీ మ్యూజికల్గా బిగ్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని అన్నారు. ఇక నిఖిల్ చాలా డెడికేటెడ్గా వర్క్ చేశాడన్నారు. ఇక అనుపమ నటన చాలా న్చాచురల్గా ఉంటుందని, అందుకే అనుపమ అంటే తనకు ఇష్టమని అల్లు అరవింద్ పేర్కొన్నారు. -
సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో మునిగిపోయిన బాలీవుడ్ జంట
బాలీవుడ్ ప్రేమజంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె నటనతో ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో ఈ ప్రేమజంట రెచ్చిపోయింది. ఓ సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో వేదికపైనే ముద్దుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె జంటగా తాజాగా నటించిన చిత్రం 'సర్కస్'. తాజాగా ఈ చిత్రంలోని 'కరెంట్ లగా రే' అనే పాటను ముంబయిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ పవర్ కపుల్స్ వారి ప్రేమను ఆపుకోలేకపోయారు. వేదికపైనే ముద్దుల్లో మునిగితేలారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో దీపికా పదుకొణె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు జోడిగా 'ప్రాజెక్ట్ కె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. రోహిత్ శెట్టి మూవీ సర్కస్ విలియం షేక్స్పియర్ నాటకం ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో వరుణ్ శర్మ, పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సిద్ధార్థ జాదవ్, జానీ లివర్, సంజయ్ మిశ్రా, వ్రజేష్ హిర్జీ తదితరులు నటించారు. డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Sindhooram: ఆకట్టుకుంటున్న ‘ఓ మాదిరిగా సాగే నా జీవితం..’ సాంగ్
శివ బాలాజీ, ధర్మ , బ్రిగిడ సాగ(పవి టీచర్) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం సిందూరం. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట (ఆనందమో..అవేశమో)కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. "ఓ మాదిరిగా" అంటూ సాగే ఈ పాటను సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరుశురాం గారు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాట చాలా బాగుంది అని, హరి సంగీతం ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందని, సత్య ప్రకాష్, హరిణి చాలా బాగా పాడారని, బాలాజీ గారి సాహిత్యం బాగుందని, లీడ్ పెయిర్ బాగా యాక్ట్ చేశారని కొనియాడారు. మొదటి పాటకు వచ్చినట్టే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం తమకుందని డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి, ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి జంగా అన్నారు. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు. -
వైజాగ్ని వైవిధ్యంగా చూపించాను: ‘కొరమీను’ డైరెక్టర్
‘‘ఏ సినిమాకైనా కథే ముఖ్యం. ‘కొరమీను’కి ఆనంద్ రవిగారు మంచి కథ ఇచ్చారు. నేను పుట్టి పెరిగిన వైజాగ్ని ఈ చిత్రంలో వైవిధ్యంగా చూపించాను. సమన్య రెడ్డిలాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు శ్రీపతి కర్రి. ఆనంద్ రవి, కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరమీను’. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్లో ఓ పవర్ఫుల్ పోలీస్... ప్రధానంగా ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య ఈ చిత్రం సాగుతుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘తెలిసిందే లే..’ అనే పాటను ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ, సింగర్ సునీత విడుదల చేశారు. సమన్య రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆనంద్ రవిగారు కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘మీసాల రాజుకి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందింది’’ అన్నారు ఆనంద్ రవి. -
అబ్బా ఓ అబ్బాయా..
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, అనిత చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గీత సాక్షిగా..’. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పుష్పక్, జేబీహెచ్ఆర్ఎన్కేఎల్ సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ అనే పాటను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘పాట క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘గీత సాక్షిగా’. ఈ పాటకి రెహమాన్ సాహిత్యం అందించగా, సాహితీ చాగంటి పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ హనుమ నరిసేటి. -
మాస్టారు... నా మనసును గెలిచారు
‘‘శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మల్లే నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంత విన్నాలే.. ’ అని ప్రేమగీతం పాడుకున్నారు సంయుక్తా మీనన్. ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘సార్’ (తమిళంలో ‘వాతి’). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి ‘మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు.. అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను గురువారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మాస్టారు ధనుష్ని ఉద్దేశించి సంయుక్త పాడే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శ్వేతా మోహన్ ఆలపించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కాగా, ఈ పాట తమిళ వెర్షన్కు ధనుష్ సాహిత్యం అందించడం విశేషం. -
సుక్కు... సౌండ్ బాగుంది
‘‘శివనాగేశ్వరరావుగారు ‘వన్స్ మోర్’ అని యూట్యూబ్ చానల్ పెట్టి, తన అనుభవాలను అబద్ధం లేకుండా చెబుతున్నారు. నేను ఆయనకు ఫ్యాన్’’ అన్నారు దర్శకుడు సుకుమార్. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, అజయ్ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత. రోహిత్ వర్ధన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సుక్కు.. సుక్కు ....’ అంటూ సాగే పాటని సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘సుక్కు.. సౌండ్ బాగుంది. నా పేరుతో వచ్చే ఈ పాటకు అజయ్ ఘోష్తో డాన్స్ చేయించాలనే ఆలోచన శివ నాగేశ్వర రావుగారికి రావడం హ్యాట్సాఫ్’’ అన్నారు. ఈ పాటను సిరాశ్రీ రాశారు. ‘‘సుక్కు..’ పాటని విడుదల చేయగలరా? అని సుకుమార్కి మెసేజ్ పెట్టాను.. ఓకే అని పది నిమిషాల్లోనే రిప్లయ్ వచ్చింది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ఈ సినిమాకి కెమెరా: ఆర్లి గణేష్, లైన్ ప్రొడ్యూసర్: శామ్ సన్. -
నాపై వాలే ఒక్క నవ్వు చాలే!
యష్రాజ్, నవమి గాయక్ జంటగా రామ కృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం ‘అభిరామ్’. మీనాక్షీ భుజంగ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘చాలే చాలే ఇంకా చాలే.. నాపై వాలే ఒక్క నవ్వు చాలే’ అంటూ సాగే పాటను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ పాట వింటుంటే ఇంకా వినాలనిపించేలా ఉంది. సంగీత దర్శకుడు మీనాక్షీ భుజంగ్ ఈ పాటను పాడటం బాగుంది. కిరణ్ కొరియోగ్రఫీ, సాగర్ నారాయణ లిరిక్స్ బాగున్నాయి. ఈ సినిమా యూనిట్కి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు రామకృష్ణార్జున్. ‘‘లవ్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు జింకా శ్రీనివాసులు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఉల్లగంటి ప్రసాద్. -
‘ఖేలో ఇండియా జీతో ఇండియా’ గీతం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: భారతి సిమెంట్స్ నిర్మాణంలో ప్రముఖ ఆల్బమ్ తయారీ సంస్థ సెవెన్ నోట్స్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఖేలో ఇండియా జీతో ఇండియా’అనే గీతాన్ని ఆదివారం రెడ్ ఎఫ్ఎం వేదికగా ఆవిష్కరించారు. టీ 20 వరల్డ్కప్ క్రికెట్ టోర్నీ ఆదివారం ప్రారంభమైన నేపథ్యంలో ఈ పాటను రూపొందించామని భారతి సిమెంట్స్ యాడ్స్ మేనేజర్ విజయ్ తెలిపారు. రచయిత సిరాశ్రీ రాసిన పాటకు తాళ్లూరి నాగరాజు సంగీతాన్ని సమకూర్చారు. ప్రముఖ గాయకుడు కార్తిక్ గాత్రం అందింగా సత్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. టీ 20 వరల్డ్కప్ సాధించడానికి టీమిండియాకు అన్ని అర్హతలున్నాయని, ఈసారి కప్తో వస్తారని సెవెన్ నోట్స్ క్యూరేటర్ మణి ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ పాటతో టీమిండియాకు అభినందనలు తెలుపుదామని పిలుపునిచ్చారు. -
Sivakarthikeyan: ‘హూ యామ్ ఐ..’
శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రిన్స్’. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మారియా ర్యాబోషప్క హీరోయిన్. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘హూ యామ్ ఐ..’ (నేనెవరు) అనే పాటని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని డింకర్ కల్వల పాడారు. ‘‘కంప్లీట్ ఎంటర్టైనర్ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాత: అరుణ్ విశ్వ. -
సమయం మారింది
ఓ గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే.. ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు ఎలా వ్యతిరేకత కనబరిచారు అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘శరపంజరం’. టి. గణపతిరెడ్డి, మామిడి హరికృష్ణ సహకారంతో నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోని రెండో పాట ‘రావయ్యా నందనా రాజా నందన..’ పాటను ప్రముఖ నటి విజయశాంతి విడుదల చేశారు. మల్లిక్ ఎంవీకే స్వరపరచిన ఈ పాటను జానపద కళాకారుడు గిద్దె రాంనర్సయ్య రాసి, పాడారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఆనాడు దొరలు స్వార్థం కోసం ఆడవాళ్లని ఎలా వాడుకున్నారో తెలిసిన విషయమే. ఈనాటి దొర కూడా ఎలా చేస్తున్నాడో తెలిసిన విషయమే. సమయం మారింది కానీ వ్యక్తి మనస్తత్వం మారలేదనడానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలుస్తుంది’’ అన్నారు. -
న్యాచురల్ స్టార్ 'దసరా' అప్డేట్.. ఊరమాస్ లుక్లో నాని
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'దసరా'. పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. నానికి జోడీగా కీర్తి సురేశ్ ఈ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈనెల 3న 'ధూమ్ ధామ్ దోస్తాన్' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి రిలీజైన పోస్టర్లో నాని లుక్ పక్కా మాస్ను తలపిస్తోంది. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. నాని ఇంతకు ముందెన్నడు చేయని మాస్ లుక్లో అభిమానులను అలరించబోతున్నారు. ఈ సినిమాలో కొత్త నానిని చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల చేయనున్నారు. -
శర్వానంద్ చిత్రంలో హీరో కార్తీ పాడిన పాట విన్నారా?
యంగ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో (తమిళంలో ‘కణం’ పేరుతో) సెప్టెంబర్ 9న విడుదలవుతోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మారిపోయే..’ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్ని విడుదల చేశారు. ఈ పాటని హీరో కార్తీ పాడటం విశేషం. చదవండి: నా బిడ్డకు అలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నా: సోనమ్ కపూర్ అది మాత్రమే కాదు.. ఈ పాటలో ఆయన స్పెషల్గా కనిపించడం మరో ప్రత్యేకత. ‘‘విభిన్నమైన కథాంశంతో రపొందిన చిత్రమిది. శర్వానంద్ కెరీర్లో 30వ చిత్రంగా వస్తున్న చిత్రమిది. ఇందులోని ప్రమోషనల్ సాంగ్ ‘మారిపోయే..’ పాటకు కృష్ణచైతన్య సాహిత్యం అందించగా, కార్తీ ఎనర్జిటిక్గా పాడారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అమల అక్కినేని, నాజరల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిషోర్, ప్రియదర్శి తదితరులు నటించారు. -
Ponniyin Selvan: రాజమౌళి వల్లే ధైర్యం వచ్చింది
‘‘పొన్నియిన్ సెల్వన్’ తీయడం గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, శరత్కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, ప్రకాశ్రాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగాన్ని ‘పీయస్–1’ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ చిత్రంలోని ‘చోళ చోళ..’ అనే పాటను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ వేడుకలో మణిరత్నం మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ, అది ఎందుకనేది చెప్పను. తర్వాత మీకే తెలుస్తుంది. రాజమౌళిగారి వల్లే ఇలాంటి (పొన్నియిన్ సెల్వన్) చిత్రాలు తీయగల మనే ధైర్యం వచ్చింది. రెండు భాగాలుగా ఇలాంటి సినిమాలు తీసి మెప్పించవచ్చని నిరూపించారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. నా బిడ్డలాంటి ఈ చిత్రం తెలు గులో ఇక ‘దిల్’ రాజుగారిదే’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘మణిరత్నంగారి ‘అమృత’ సినిమా వల్లే నిర్మాతగా మారి, 50 చిత్రాలు నిర్మించాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’ని రిలీజ్ చేసే చాన్స్ ఇచ్చిన మణిరత్నంగారికి థ్యాంక్స్’’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ– ‘‘మణి సార్తో గతంలో ‘రావణ్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’. మణిగారితో సినిమా అంటే కల నెరవేరడం వంటిది. మణిగారు, శంకర్గారితో సినిమా చేస్తే ఇక రిటైర్ అవ్వొచ్చని అనుకున్నాను.. అంత అద్భుతమైన చిత్రాలు చేస్తారు’’ అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించేందుకు రాబోతున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో దాదాపు 50 పాత్రలుంటాయి.. నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘అన్ని భాషల్లో నటించి, పాన్ ఇండియన్ నటుడు అవడం వేరు. కానీ దక్షిణాది నుంచి తన మేకింగ్ ఆఫ్ స్టైల్తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన ఏకైక వ్యక్తి మణిరత్నంగారు’’ అన్నారు ప్రకాశ్రాజ్. ‘‘కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను సినిమాగా తెరకెక్కించాలని ఎంజీఆర్, కమల్ వంటి వారెందరో ప్రయత్నించారు. కానీ మణిరత్నంగారి వల్లే సాధ్యం అయింది’’ అన్నారు నాజర్. సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘ఇది మీ డ్రీమ్ ప్రాజెక్టా? అంటే కాదు ఇష్టమైన చిత్రం అని మావారు (మణిరత్నం) అన్నారు. నేను ఆయన్ను ఇష్టపడ్డాను. ఆయన ఈ చిత్రాన్ని ఇష్టపడ్డారు. అంటే మీరు (ప్రేక్షకులు) కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడాలి (నవ్వుతూ)’’ అన్నారు. -
అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘లెహరాయి’ మూవీ సెకండ్ సాంగ్
‘లెహరాయి’ చిత్రం నుంచి మరో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. రామకృష్ణ పరమహంస దర్శకుడిగా పరిచమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టాలెంటెడ్ రంజిత్, సౌమ్య మీనన్ హీరోహీరోయన్లు నటిస్తున్నారు. ధర్మపురి ఫేం గగన్ విహారి, రావు రామేశ్, సీనియర్ నరేశ్, అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదలై ‘గుప్పెడంత’ ఫస్ట్సాంగ్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ అంటూ సాగే ఈ పాటను సింగర్ సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్థలో మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ సినమాను నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామాని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. -
ఒక్క హిట్తో మళ్లీ కమ్ బ్యాక్ కావొచ్చు: నిఖిల్
Aakashame Nuvvani Song Out From Diamond Raja: ‘‘చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాపులు అనేవి సాధారణమే. ఒక్క హిట్టుతో మళ్లీ కమ్ బ్యాక్ కావొచ్చు. ‘డైమండ్ రాజా’ చిత్రంతో వరుణ్ సందేశ్ కూడా ఇండస్ట్రీని రాక్ చేయాలి. యూనిట్కి ఆల్ ది బెస్ట్’’ అని యంగ్ హీరో నిఖిల్ పేర్కొన్నారు. వరుణ్ సందేశ్, డాలీషా జంటగా శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డైమండ్ రాజా’. శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్ రెడ్డి, బి.క్రాంతి ప్రభాత్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘డైమండ్ రాజా’. అచ్చు రాజమణి స్వరాలు అందించిన ఈ చిత్రం నుంచి ‘ఆకాశమే నువ్వని..’ అంటూ సాగే పాటని నిఖిల్ విడుదల చేశారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో అరెరే, నిజంగా, ఏమంటావే..’ వంటి పాటల తర్వాత ఈ చిత్రంలోని ‘ఆకాశమే నువ్వని..’ పాట కూడా అంతే హిట్ అవుతుందని నమ్ముతున్నాను. వినోదాత్మకంగా ఉండే ‘డైమండ్ రాజా’ ని ఫ్యామిలీ అంతా కలసి చూడొచ్చు’’ అని తెలిపారు. ‘‘మా సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ‘‘ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరోయిన్ డాలీషా ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పి. రాజశేఖర్ రెడ్డి, టి. రమేష్, కెమెరా: వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, పవన్ రెడ్డి కోటిరెడ్డి. -
సాంగ్ చూపించేశాం మావా...
పాట వినిపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు.. ఇది ఒకప్పటి ట్రెండ్. పాట చూపించి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది ఇప్పటి ట్రెండ్. ప్రేక్షకులను థియేటర్కి రప్పించాలంటే గతంలో ఆడియో, సినిమా పోస్టర్స్ని పబ్లిసిటీలో భాగంగా విడుదల చేసేవాళ్లు. పాటలు బాగుంటే సినిమా కూడా బాగుంటుందని థియేటర్కి వెళ్లేవారు. ఇప్పుడు ‘సాంగ్ చూపించేశాం మావా..’ అంటూ పాట వీడియోను కూడా చూపించి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా మేకింగ్ మారినట్లుగానే పబ్లిసిటీలో కూడా కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాల వీడియో పాటలను ఓ లుక్కేద్దాం.. ఐయామ్ రెడీ.. ‘‘నేను రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ నితిన్ని ఆటపట్టించారు అంజలి. వీరిద్దరి మధ్య వచ్చే ఈ మాస్ సాంగ్ ‘మాచర్ల నియోజక వర్గం’ లోనిది. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీ శెట్టి, క్యాథరిన్ హీరోయిన్లు. అంజలి స్పెషల్ సాంగ్ చేశారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. మహతి స్వర సాగర్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి..’, ‘అదిరిందే..’ అంటూ సాగే పాటల ఫుల్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ‘మాచర్ల సెంటర్లో మాపటేల నొనొస్తే.. ఐయామ్ రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ అంజలి, నితిన్లపై చిత్రీకరించిన సాంగ్, నితిన్, కృతీపై తీసిన ‘అదిరిందే పసిగుండె.. తగిలిందే హై ఓల్టే’ పాటల వీడియోలు మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. పలికిందేదో ప్రాణం.. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం.. ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం’ అంటూ ఉల్లాసంగా పాడారు కల్యాణ్ రామ్. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీతో ఉంటే చాలు..’ అనే ఫుల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేశారు. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం..’ అంటూ సాగే ఈ ఫ్యామిలీ సాంగ్కి మంచి స్పందన వస్తోంది. అడిగా.. నన్ను నేను అడిగా... ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని..’ అంటూ అనుపమా పరమేశ్వరన్ని అడుగుతున్నారు నిఖిల్. ఈ ప్రేమ పాట నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’లోనిది. కాలభైరవ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని, అడిగా.. నిన్ను నేను అడిగా.. నే నిన్నలా నేనని..’ అంటూ సాగే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. నిఖిల్, అనుపమల మధ్య వచ్చే ఈ ఫీల్ గుడ్ సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవే కాదు... మరికొన్ని చిత్రాల్లోంచి కూడా వీడియో సాంగ్స్ విడుదలయ్యాయి. ఇవన్నీ ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించడానికి కొంతవరకైనా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. -
రుద్రవీణ: శ్రీకాంత్ చేతుల మీదుగా ‘బంగారు బొమ్మ’ పాట
మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో శ్రీరామ్ నిమ్మల, ఎల్సా గోష్, శుభశ్రీ సోనియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కతున్న చిత్రం ‘రుద్రవీణ’. సాయి విల్లా సినిమాస్ పతాకంలో రాగుల గౌరమ్మ సమర్పణలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ దశలో ఉన్న ఈచిత్రం నుంచి బంగారు బొమ్మ పాట రిలీజైంది. చిత్ర బృందం సమక్షంలో నటుడు శ్రీకాంత్ హైదరాబాద్లో ఈ పాటను లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘రుద్రవీణ టైటిల్ బాగుంది. ఈ టైటిల్ మన తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితమే. గతంలో అన్నయ్య చిరంజీవి నటించిన రుద్రవీణ మూవీ మంచి మ్యూజికల్ హిట్గా నిలిచింది. అలాంటి గొప్ప టైటిల్తో వస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన బంగారు బొమ్మ పాట విన్నాను. చాలా బాగా నచ్చింది. ఈ పాటతో పాటు ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నారు. ఇక చివరిగా ఈ సినిమాకు పని చేసిన టెక్నిషియన్స్, ఆర్టిస్టులందరిక ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇక నిర్మాతలు మాట్లాడుతూ.. చిరంజీవి గారి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీస్తున్నామన్నారు. ‘మెగా ఫ్యామిలీది గోల్డెన్ హ్యాండ్ అని ఎలా భావిస్తామో వారి తరువాత శ్రీకాంత్ గారిది కూడా అంతే గోల్డెన్ హ్యాండ్. అలాంటి శ్రీకాంత్ గారి చేతుల మీదుగా మా సినిమా తొలి సాంగ్ను రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది’ అన్నారు. మహావీర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల, ఎల్సా గోష్ , శుభశ్రీ,, రఘు కుంచె, ధనరాజ్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, సోనియా తదితరులు నటిస్తున్నారు. -
బెనారస్ ఏంటో పాటే చెప్పేస్తోంది
‘‘అన్నం ఉడికిందా? లేదా? అని తెలియడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలన్నట్లు ‘బెనారస్’ మూవీ గురించి ‘మాయ గంగ..’ పాట చెప్పేస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. జైద్ ఖాన్, సోనాల్ మోన్టైరో జంటగా జయతీర్థ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెనారస్’. తిలక్ రాజ్ బల్లాల్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మాయ గంగ..’ అంటూ సాగే పాటను సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తిలక్ రాజ్ బల్లాల్ మాట్లాడుతూ– ‘‘జైద్ ఖాన్ ఎంతో డెడికేషన్, హార్డ్ వర్క్తో ఈ సినిమా చేశాడు. ‘పుష్ప’ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మా సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. జయతీర్థ మాట్లాడుతూ– ‘‘నేను చిన్నప్పుడే స్కూల్ మానేశాను. అయితే వీధి నాటకాలు వేస్తూ పెరిగాను. సినిమాలను తెలుగు ప్రేక్షకుల్లా మరెవరూ ప్రేమించలేరు. భాష ఏదైనా మంచి సినిమాలను ఆదరిస్తున్నారు’’ అన్నారు. ‘‘హీరోగా నేను వేస్తున్న తొలి అడుగు ఇది’’ అన్నారు జైద్ ఖాన్. సోనాల్ మోన్టైరో, లిరిక్ రైటర్ కె.కె. మాట్లాడారు. -
‘ది వారియర్’ మూవీ 'విజిల్.. విజిల్..' సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
‘మేజర్’ నుంచి ఎమోషనల్ వీడియో సాంగ్, ఆకట్టుకుంటున్న అమ్మ పాట
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. చదవండి: పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట! మేజర్కు వస్తున్న విశేష స్పందనకు కానుకగా తాజాగా చిత్రం బృందం ఈ మూవీ నుంచి ఓ ఎమోషనల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ‘కన్నా కన్నా’ అంటూ సాగే ఈ పాటలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం నుంచి సైన్యంలో చేరేందుకు బయలుదేరే పలు సన్నివేశాలను చూపించారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. రామజోగయ్య శాస్త్రీ రచించిన ఈ పాటకు శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకుర్చగా.. ప్రముఖ గాయనీ చిత్ర ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటోంది. -
‘థ్యాంక్ యూ’ నుంచి మెలోడీ సాంగ్, ఆకట్టుకుంటున్న లిరిక్స్
నాగచైతన్య అక్కినేని హీరోగా తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా చై విభిన్న లుక్లో అలరించనున్నాడు. రాశీఖన్నా, మళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అవిక గోర్ ఓ కీ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడదులై టీజర్, పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఏంటో ఏంటేంటో అంటూ సాగే ఈ పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. నాగ చైతన్య, మాళవిక నాయర్ల మధ్య తెరకెక్కిన ఈ పాటకు ఆనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. జొనితా గాంధీ ఆలపించారు. తమన్ స్వరాలను సమకూర్చారు. కాగా శ్రీవెంకేటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
ఆకట్టుకున్న నాగ చైతన్య ‘థ్యాంక్ యూ’ మూవీ సాంగ్
నాగచైతన్య అక్కినేని హీరోగా తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ వదులుతుంది చిత్ర బృందం. ఇటీవల టీజల్ రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ‘సై అంటే సై రా.. సంసిద్ధం లేరా..’, ‘మారో మారో యుద్ధం మొదలు..తాడో పేడో..తేల్చెయ్ ఇప్పుడు’ అంటూ సాగుతుంది ఈ యూత్ఫుల్ కాలేజీ సాంగ్. ఇందులో చై హాకీ ఆడుతూ కనిపిస్తాడు. ‘ఇక్కడ ఒకరంటే ఒకరికి పడదు.. గ్యాంగ్.. గ్యాంగ్ బ్రదర్ అంటూ ఒంటినిండా పొగరు’ అంటూ మొదలయ్యే ఈ మారో మారో లిరికల్ పాటకు విశ్వ అండ్ కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. తమన్ సంగీతం అందించగా.. దీపు, పృథ్వీచంద్రలు పాడారు. -
‘ఓ కల’ మూవీ నుంచి ఫస్ట్సాంగ్ విడుదల
దీపక్ కొలిపాక దర్శకత్వంలో గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఓ కల. ఎటిర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై లక్ష్మీ నవ్య మోతూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ని ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు సంయుక్తంగా విడుదల చేశారు. విడుదల అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘ఓ కల మూవీ ఫస్ట్ సాంగ్ చాలా ఫ్రెష్గా, కొత్తగా ఉంది. ఇందులోనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. దర్శకుడు దీపక్ కొలిపాక ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని తెలిపారు. ఇక దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాకి మంచి గుర్తింపుని తీసుకువచ్చిన మన దర్శకనిర్మాతలు గుణ్ణం గంగరాజు, చంద్రశేఖర్ యేలేటి గార్ల చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ విడుదలవడం నిజంగా సంతోషంగా ఉంది. సినిమా విషయానికి వస్తే.. ఇది చక్కని ప్రేమకథ’ అన్నారు. ‘హీరో గౌరీశ్.. టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిగారికి బంధువు. ప్రతి సీన్ని చక్కగా అర్థం చేసుకుని నటించాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. ప్రేక్షకులు మంచి ప్రేమ కథను చూసి చాలా కాలం అవుతుంది. ఆ లోటును మా చిత్రం తీరుస్తుందని ఖచ్చితంగా చెప్పగలను’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈసినిమాలో అలీ, వైవా రాఘవ్, దేవి ప్రసాద్,శక్తి, కమెడియన్ రవితేజ తదితరులు నటిస్తున్నారు. -
అంటే సుందరానికి నుంచి మరోసాంగ్, ‘అయోమయంలో నాని’
నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ'... వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా మించి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. చదవండి: వివాదంలో కరణ్ జోహార్ లేటెస్ట్ మూవీ, నిర్మాతపై వరుస ఆరోపణలు థర్డ్ సింగిల్ పేరుతో రిలీజ్ చేశారు. ‘అనుకుందోటి.. అయిందోటి.. రంగో రంగా’ అంటూ సాగే ఈ పాటకు భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించగా.. కారుణ్య ఆలిపించాడు. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్నిఅందించాడు. ఈ సినిమాలో నటుడు నరేశ్, నదియా, రోహిణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జూన్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే నాని ఈ సినిమాతో పాటు 'దసరా' మూవీ షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. -
ఒక్క బుల్లెట్ సాంగ్కు మూడు కోట్లు ఖర్చు!
‘‘రామ్కు తమిళ భాష తెలియదనుకున్నాను. అయితే ఆయన ఇక్కడ పక్కా తమిళంలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాను. కొన్ని రోజుల క్రితం దర్శకుడు లింగుసామి ‘ది వారియర్’ ఆడియో ఫంక్షన్లో పాల్గొనాల్సిందిగా కోరారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నాను. అవి పూర్తయ్యాకే చేద్దాం అని చెప్పి, 21న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని 22కి మార్చారు’’ అని తమిళనాడు ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రామ్ హీరోగా నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం) ‘ది వారియర్’లోని ‘బుల్లెట్..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. లింగుసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 14న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ‘బుల్లెట్...’ అనే పాటను తమిళ హీరో శింబు తెలుగు, తమిళ భాషల్లో పాడటం విశేషం. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ఆడియోను ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘లింగుసామి దర్శకత్వంలో ఇంతకు ముందు నేనో సినిమా చేయాల్సింది. త్వరలో చేయనున్నాను. ఇక రామ్ నటించిన ‘ది వారియర్’ ఆయన ఇంతకు ముందు నటించిన విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘లింగుసామి ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకుని రూపొందించారు. ఆయన ఈ కథ చెప్పినప్పుడే ఇందులో విలన్గా నటుడు ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు చెప్పడంతో నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఒక్క ‘బుల్లెట్..’ పాట కోసమే నిర్మాత మూడు కోట్లు ఖర్చుపెట్టారు’’ అన్నారు లింగుసామి. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లింగుసామితో సినిమా చేయాలనే ఆకాంక్ష ఈ ద్విభాషా చిత్రంతో నెరవేరింది. ‘బుల్లెట్..’ పాట పాడిన శింబుకు థ్యాంక్స్’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తొలి లిరికల్ సాంగ్తో 'ప్రేమ్ కుమార్' వచ్చేశాడు..
Santosh Shoban Prem Kumar Movie First Lyrical Song Out: పేపర్ బాయ్, ఎక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతోపాటు 'బ్యూటీ అండ్ ది బేకర్' వెబ్ సిరీస్లో అలరించిన యంగ్ హీరో సంతోష్ శోభన్. వరుస సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్కు మంచి రోజులు వచ్చేలా మలుచుకుంటున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తున్న చిత్రం 'ప్రేమ్ కుమార్'. రాశీ సింగ్, కృష్ణ చైతన్య, రుచిత కీలక పాత్రధారులుగా నటిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మాత కాగా ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ను ప్రారంభించిన ఈ మూవీ యూనిట్ తొలిపాటను విడుదల చేసింది. 'నీలాంబరం చూసి నీ కళ్లలో మేఘామృతం.. జారే నా గుండెలో' అంటూ సాగే సాంగ్ను శనివారం (ఫిబ్రవరి 5)న రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ రాశారు. మెలోడీ సాంగ్ అయిన 'నీలాంబరం' సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని నిర్మాత శివ ప్రసాద్ పన్నీరు తెలిపారు. టైటిల్ రోల్లో సంతోష్ శోభన్ కనిపిస్తాడని, పీటల మీద పెళ్లి ఆగితే ప్రేమ్ కుమార్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడన్నదే సినిమా కథ అని డైరెక్టర్ అభిషేక్ మహర్షి పేర్కొన్నారు. -
ఆకట్టుకుంటున్న ‘కన్నుల్లోన...’ సాంగ్
మహేశ్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్ధార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘స్వ’. మను పీవీ దర్శకత్వం వహించారు. జి.ఎం.ఎస్ గాలరీ ఫిల్మ్స్ సంస్థలో జి.ఎం. సురేష్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. కరణం శ్రీ రాఘవేంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కన్నుల్లోన..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. వినోద్ శర్మ, నాదప్రియ పాడారు. జీ.ఎం. సురేష్ మాట్లాడుతూ–‘‘మా చిత్రం ట్రైలర్కి మంచి స్పందన వస్తోంది. ‘కన్నుల్లోన..’ పాట బాగా అలరిస్తోంది. ‘స్వ’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
రౌడీ బాయ్స్ డేట్ నైట్ సాంగ్ రిలీజ్ చేసిన బన్నీ
-
తెలుగు సినిమాలు గెలవాల్సిన సమయమిది
‘‘ఈ సంక్రాంతికి చాలా సినిమాలొస్తున్నాయి.. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా, ఆ సినిమా అని కాదు.. తెలుగు సినిమాలు గెలవాల్సిన సమయమిది. మొత్తం తెలుగు సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక్క తెలుగే కాదు.. అన్ని భాషల్లోని సినిమాలు బాగుండాలి.. మళ్లీ జనాలు థియేటర్లకు రావాలి’’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ‘డేట్ నైట్..’ అంటూ సాగే పాటను అల్లు అర్జున్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘నా ప్రయాణం ‘ఆర్య’ సినిమాతో మొదలుపెట్టా. ‘దిల్’ రాజుగారు నా ప్రయాణంలో ఒక భాగం. ఆయన లేకుంటే ‘ఆర్య’ లేదు. ‘రౌడీ బాయ్స్’ ఫంక్షన్ నాకు చాలా ప్రత్యేకం, స్వీట్ మెమొరీ. ఇది నా కుటుంబ వేడుక.. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఊరు వెళ్లాల్సినా ఇక్కడికొచ్చాను.. అది నేను చేస్తున్న ఫేవర్ కాదు.. నా బాధ్యత. ఆశిష్ని లాంచ్ చేస్తున్న ఈ వేడుకలో నేనూ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ చూస్తుంటే ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాల్సిన సినిమా జనవరి 14నే విడుదల చేస్తున్నట్లు ఉంది. శ్రీహర్ష, ఆశిష్, యూనిట్కి ఆల్ ది బెస్ట్. లవ్ సాంగ్లో ఆశిష్ చాలా బాగా డ్యాన్స్ చేశాడు. లాక్డౌన్ తర్వాత డిసెంబరులో విడుదలైన సినిమాలు (అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్) సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చాలా బాగుంది. నాని, సాయిపల్లవి నటన బాగుంది. డైరెక్టర్ రాహుల్ బాగా తీశాడు. ఎవరైనా సినిమా చూడకుండా ఉంటే ఓటీటీలో వచ్చినప్పుడైనా చూడండి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2004 జనవరి 1న ‘ఆర్య’ సినిమాలోని ‘తకదిమితోం తకదిమి తోం..’ పాట వైజాగ్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆశిష్కి ఏడేళ్లు. ఆ పాటకి బన్ని(అల్లు అర్జున్) డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తున్నాడు. అలాంటిది ఆశిష్ హీరోగా నటించిన సినిమాలోని డ్యాన్స్ సాంగ్ను బన్నీ విడుదల చేయడం నిజంగా ఆశిష్ జీవితంలో మరచిపోలేని రోజు. ఈ సంక్రాంతికి మా బ్యానర్ నుంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ వస్తోంది. ‘ప్రేమదేశం, తొలిప్రేమ, ఆర్య, హ్యాపీడేస్’ ఇలా ఔట్ అండ్ ఔట్ యూత్ కంటెంట్ చిత్రమిది. హర్ష రెండుమూడేళ్లు ప్రయాణం చేసి ఆశిష్ భవిష్యత్తుకు ‘రౌడీ బాయ్స్’ లాంటి మంచి సినిమాని ఇచ్చినందుకు థ్యాంక్స్. మా బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కుటుంబ విలువలతో సాగుతాయి. కానీ ‘రౌడీ బాయ్స్’ కోసం కొన్ని హద్దులు దాటాం. మా సంస్థ నుంచి సంక్రాంతికి ఇప్పటి వరకూ 5 సినిమాలొస్తే అన్నీ హిట్ అయ్యాయి.. ఈ ‘రౌడీ బాయ్స్’ కూడా హిట్ కొడితే సెకండ్ హ్యాట్రిక్ పూర్తి చేసినట్టు అవుతుంది’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆశిష్ మాట్లాడుతూ– ‘‘అల్లు అర్జున్ అన్నకి చాలా అంకితభావం, కమిట్మెంట్ ఉంది.. అలాంటి డెడికేషన్ ఉంటేనే సినిమాల్లోకి రావాలని ‘ఆర్య’ సమయంలో ఫిక్స్ అయ్యాను. ఆయన డ్యాన్స్తో పోలిస్తే నా డ్యాన్స్ కొంచెమే అనిపిస్తోంది. ఆయన ఎప్పటి నుంచో పాన్ ఇండియా స్టారే’’ అన్నారు. ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరం జన్, మాధవన్ పాల్గొన్నారు. -
జనని పాట ఆర్ఆర్ఆర్ ఆత్మ
‘‘జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆత్మలాంటిది. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారు’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). అజయ్ దేవగణ్ కీలక పాత్రలో ఆలియా భట్, ఒలీవియా మోరీస్ కథానాయికలుగా నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నేడు ‘జనని..’ అనే పాటను విడుదల చేయనుంది. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన ఈ పాటను ఒక్కరోజు ముందుగా గురువారం హైదరాబాద్లో విలేకరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ– ‘‘డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తాం. వరుసగా ప్రీ రిలీజ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది’’ అన్నారు. నిర్మాత డీవీవీ దానయ్య పాల్గొన్నారు. -
తేజ్కు సక్సెస్ వస్తే నాకు వచ్చినట్లే!
‘‘సాయితేజ్ని చూస్తే నాకేదో చిన్న ఎమోషనల్ కనెక్ట్. తేజ్కు సక్సెస్ వస్తే నాకు వచ్చినట్లే ఆనందపడతాను’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. సాయితేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో జె. భగవాన్, పుల్లారావు నిర్మించిన చిత్రం ‘రిపబ్లిక్’. ఈ సినిమాలోని ‘ఎయ్ రారో.. ఎయ్ రారో.. ఎయ్రో.. నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం..’ లిరికల్ వీడియోను శనివారం హైదరాబాద్లో కొరటాల శివ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘ఈ పాటలో స్వేచ్ఛ గురించి బాగా చెప్పారు. కంటెంట్ను దేవ కట్టా చాలా ఇంటెన్స్గా చెబుతారని ‘ప్రస్థానం’ చూసినప్పుడే అనుకున్నాను. ‘రిపబ్లిక్’లో కూడా అందరూ ఆలోచించే విషయాన్ని గట్టిగా, ఇంటెన్స్తో చెప్పి ఉంటారని ఆశిస్తున్నాను. మణిశర్మగారిని మెలోడీ బ్రహ్మ అని ఎందుకు అన్నారో తెలిసింది. భగవాన్, పుల్లారావు ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. సాయితేజ్ మాట్లాడుతూ – ‘‘పెద్ద స్క్రీన్లో సాంగ్ చూసి చాలా రోజులయింది. నా పాట అనే కాదు... ఏ సినిమా పాటనైనా పెద్ద స్క్రీన్లో చూస్తే ఉండే కిక్కే వేరు. ఒక ఆర్టిస్ట్ నటనను వెండితెరపై చూస్తే ఆ సంతోషమే వేరు. ‘రిపబ్లిక్’ను థియేటర్స్లోనే విడుదల చేస్తాం. నా చిన్నప్పుడే మణిశర్మగారి పాటలు విన్నాను. అప్పట్నుంచే నా మైండ్లో ఆయనతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నానేమో. అది ఇప్పుడు కుదిరింది. మంచి స్క్రిప్ట్, మంచి రోల్ ఇచ్చిన దేవాగారికి, రాజీ పడకుండా తీసిన భగవాన్, పుల్లారావు, జీ స్టూడియోస్కు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మణిశర్మగారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మంచి లిరిక్స్ ఇచ్చిన రెహమాన్కు థ్యాంక్స్’’ అన్నారు దేవ కట్టా. మణిశర్మ మాట్లాడుతూ – ‘‘తేజ్తో సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. భగవాన్తో ఎప్పట్నుంచో మంచి పరిచయం ఉంది. దేవాతో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటున్నాను. ‘రిపబ్లిక్’తో కుదిరినందుకు సంతోషం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని తొలి పాట కొరటాల శివగారి చేతుల మీదగా లాంచ్ కావడమే మా సినిమా సక్సెస్కు నిదర్శనం’’ అన్నారు భగవాన్. కో ప్రొడ్యూసర్ జయ ప్రకాష్, ‘జీ’ సంస్థ ప్రతినిధి ప్రసాద్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్, రచయిత–దర్శకుడు రవి పాల్గొన్నారు అలాగే నేడు (జూలై 11) మణిశర్మ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో చిత్రబృందం సెలబ్రేట్ చేసింది. -
మాస్ మాయలోడా...
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘1978 పలాస’ చిత్రదర్శకుడు కరుణకుమార్ తెరకెక్కిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ‘భలే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మందులోడా ఓరి మాయలోడా... మామ రారా మందుల సిన్నోడా..’ అంటూ సాగే మాస్ సాంగ్ని హీరో చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘శ్రీదేవి సోడా సెంటర్’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి మా సినిమాపై క్రేజ్ మొదలయ్యింది. అదే విధంగా మొదటి లుక్కి, గ్లింప్స్కి విపరీతమైన స్పందన వచ్చింది. ‘మందులోడా ఓరి మాయలోడా..’ పాటకి కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా, మణిశర్మ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ పాట లిరికల్ వీడియోలో సుధీర్ బాబు వేసిన స్టెప్స్కి అనూహ్య స్పందన లభిస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్దత్ సైనుద్దీన్. -
అదరగొడుతన్న ‘కత్తి ఖతర్నాక్’ పాట
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా నటించిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా వ్యాస్ హీరోయిన్. జామి లక్ష్మీప్రసన్న సమర్పణలో తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు నిర్మించారు. ‘కత్తి ఖతర్నాక్..’ అంటూ సాగే ఈ చిత్రంలోని ప్రత్యేక పాటను శివాజీరాజా విడుదల చేశారు. రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ –‘‘మా చిత్రానికి గ్యానీ సింగ్ మంచి సంగీతం అందిచారు. ‘కత్తి ఖతర్నాక్..’ పాటకు స్పందన బావుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని దర్శకుడు బాగా తీశాడు.’’ అన్నారు తూము నరసింహ పటేల్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్రమ్ రమణ. -
అదిరిపోయిన పుష్పక విమానంలో సిద్ శ్రీరాం పాట
హైదరాబాద్: యూత్లో విజయ్ దేవరకొండకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు, మరీ అతని యాటిట్యూడ్కు ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. అంత క్రేజ్ ఉన్న నటుడికి తమ్ముడిగా టాలీవుడ్లో హీరోగా సినీ ఆరంగ్రేటం చేసిన ఆనంద్ దేవరకొండ తన మొదటి సినిమా ‘దొరసాని’ నటనపరంగా మంచి మార్కులే పడినా, కలెక్షన్ల విషయంలో యావరేజ్గా నిలిచింది. ఇక రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’తో హిట్ కొట్టడంతో ట్రాక్లో పడినట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ యువ నటుడు ‘పుష్పక విమానం’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా గీతా షైనీ నటిస్తోంది. ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్గా ‘కల్యాణం’ పాట విడుదల అయ్యింది. అగ్రకథానాయిక సమంత సోషల్మీడియా వేదికగా ఈ పాటను విడుదల చేయగా విజయ్ దేవరకొండ సమంతకు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’ అంటూ సాగే ఈ పెళ్లి పాటను ప్రముఖ గాయకుడు సిద్శ్రీరామ్, మంగ్లీ పాడారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల స్వరాలు అందించారు. విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ‘పుష్పకవిమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. Thank you Sammmm 🤗🤍 Big hugs and love!#Kalyanam#PushpakaVimanam https://t.co/t35wuEnmjg — Vijay Deverakonda (@TheDeverakonda) June 18, 2021 చదవండి: ఇట్స్ అఫిషియల్: ధనుష్తో శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం -
‘సన్ ఆఫ్ ఇండియా’ రేపు తొలి రిలికల్ సాంగ్
మోహన్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించాయి. ఈ నెల 15న ఈ చిత్రంలోని ‘జయ జయ మహావీర..’ అంటూ సాగే తొలి లిరికల్ సాంగ్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మోహన్బాబు. ఆ ప్రకటన సారాంశం ఈ విధంగా... ‘నా కెరీర్లో సువర్ణాధ్యాయం లిఖించిన చిత్రం ‘పెదరాయుడు’. 1995 జూన్ 15న ‘పెదరాయుడు’ రిలీజైన సరిగ్గా 26 సంవత్సరాల తర్వాత ఈ జూన్ 15న ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో రిలీజ్ కావడం శుభసూచికంగా భావిస్తున్నాను. అప్పుడు ‘పెదరాయుడు’ చిత్రానికి నిర్మాత నేనైతే ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా’కు నా కొడుకు విష్ణువర్ధన్ బాబు నిర్మాత కావడం సంతోషదాయకం. ‘పెదరాయుడు’ రిలీజ్ అయిన శుభ తరుణాన ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి సంబంధించి 11వ శతాబ్దపు ప్రసిద్ధ రఘువీర గద్యాన్ని మ్యాస్ట్రో ఇళయరాజాగారి సంగీత సారథ్యంలో రాహుల్ నంబియార్ గళంతో సాగే లిరికల్ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. శ్రీరాముడికి సంబంధించిన ఈ గత్యాన్ని ఆ మర్యాదా పురుషోత్తముడైన ఆయనకే అంకితమిస్తున్నాను’అని మోహన్బాబు పేర్కొన్నారు. -
Namasthe Set Ji: ఆకట్టుకుంటున్న ‘మాయదారి కరోనా’ సాంగ్
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘నమస్తే సేట్ జీ’.తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ సినిమా లో రెండో లిరికల్ సాంగ్ ‘మాయా దారి కరోనా’ ని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. ‘నమస్తే సేట్ జీ సినిమా లో డప్పు మల్లన్న అనే పాత్ర చాలా కీలకమైనది. నటుడు శోభన్ బాబు ఈ పాత్ర లో యాక్ట్ చేశాడు. సమకాలీన పరిస్థితుల్ని చూపిస్తూ, ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి కూడా తెలుపుతున్న ఈ పాటకి రిటైర్డ్ ఐఏఎస్ డా చింతల శ్రీనివాస్ లిరిక్స్ అందించారు. వి.ఆర్.ఏ.ప్రదీప్ అద్భుత సంగీతం అందించారు’అని అన్నారు. లిరిసిస్ట్ డాక్టర్ చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ.‘నమస్తే సేట్ జీ సినిమా కి నేను ఈ పాటని అందించడం చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని పాట రూపంలో ప్రేక్షకులకు అందించాం. ఈ పాట విని తర్వాతనైనా కొంతమంది బాధ్యత గా మెదులుకుంటారు అని ఆకాంక్షిస్తున్నాను’అని తెలిపారు. -
Bazaar Rowdy: పిల్లా నా మతి చెడగొట్టావే...
సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘బజార్ రౌడి’. డి. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. మహేశ్వరి వద్ది హీరోయిన్. బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యంలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ‘నీ వంటికి మెరుపులు బాగా చుట్టేశావే.. నా కంటికి ఏవో రంగులు చూపించావే.. పిల్లా నా మతి చెడగొట్టావే..’ అంటూ సాగే రెండో పాటని రిలీజ్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్లో అలరిస్తారు. మా చిత్రం టీజర్కి సోషల్ మీడియాలో 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కరోనా తీవ్రత తగ్గిన వెంటనే మా ‘బజార్ రౌడి’ని విడుదల చేస్తాం. మరుధూరి రాజా మాటలు రాయగా, గౌతంరాజు ఎడిటింగ్ చేశారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఎస్ ఫ్యాక్టరీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శేఖర్ అలవలపాటి. -
బుజ్జులు.. బుజ్జులు...
రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమా ఎంత హిట్టో తెలిసిందే. తాజాగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందడి’ సినిమా రూపొందుతోంది. ఆదివారం (మే 23) న రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని రెండవ పాట ‘బుజ్జులు.. బుజ్జులు’ను విడుదల చేశారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. కె. కృష్ణ మోహన్రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ‘‘పాలకుండ నెత్తినెట్టి పంజగుట్ట పోతవుంటే.. బుజ్జులు.. బుజ్జులు కొనిపెడతా బంగరు గజ్జెలు...’’ అని సాగే పాటను రిలీజ్ చేశారు. గౌరి మాట్లాడుతూ – ‘‘డైరెక్టర్గా ఈ సినిమా నాకో ఛాలెంజ్. రాఘవేంద్రరావు, కీరవాణిగార్ల హిట్ కాంబినేష¯Œ లో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్రతి పాట అలరిస్తుంది’’ అన్నారు. ‘‘ఏడు రోజులు ప్యాచ్వర్క్ ఉంది. లాక్డౌన్ ముగిశాక పూర్తి చేసి, జూ¯Œ లేదా జూలైలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెల -
Gully Rowdy: దుమ్మురేపుతున్న రామ్ మిర్యాల పాట
‘పుట్టినే ప్రేమ పడగొట్టెనే ప్రేమ.. ఏం చేశావో ఏమో కదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలాకుతలం అవుతున్నానమ్మా..’ అంటూ ప్రేయసిని చూసి పాడేస్తున్నాడు గల్లీరౌడీ. ఈ రౌడీ ప్రేమ కహానీ తెలుసుకోవాలంటే మా ‘గల్లీరౌడీ’ సినిమా చూడాల్సిందే అంటున్నారు ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలోని ‘పుట్టినే ప్రేమ..’ పాటను సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. రామ్ మిర్యాల సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న మా సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్. -
ఏక్ మినీ కథ: సామిరంగా సాంగ్ రిలీజ్
‘పేపర్ బాయ్’ సినిమా ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ అయిన యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా బ్యానర్స్పై రూపొందుతోన్న చిత్రమిది. కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ‘సామిరంగా..’ అంటూ సాగే పాట విడుదల చేశారు. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించారు. ‘‘ఈ మధ్యే విడుదలైన ‘ఈ మాయలో..’ లిరికల్ సాంగ్కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ‘సామిరంగా..’ అతి కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో విశేష స్పందన అందుకుంటూ చాట్ బస్టర్గా మారింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. చదవండి: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ.. ఫొటోలు, ఫ్లెక్సీలతో హల్చల్! -
గుప్పెడు గుండెను తట్టింది ఎవరో..
‘ఎంత బావుందో.. పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా... గుప్పెడు గుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది.. పైకే చెప్పనంటోంది.. హాయో.. మాయో అంతా కొత్తగా ఉంది.. అయినా ఇదే బాగుంది.. బహుశా ఎదురుపడనంది’ అంటూ ప్రేయసిని చూసి పాడేస్తున్నారు మధునందన్. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పాపులర్ అయిన మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వంలో క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప నిర్మిస్తున్నారు. స్వాతిష్ట కృష్ణన్ , శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఎంత బావుందో...’ అంటూ సాగే లిరికల్ సాంగ్ని హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తాజాగా విడుదలైన ‘ఎంత బావుందో..’ మెలోడీకి కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆలపించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రవి వర్మన్ నీలిమేఘం, సురేష్ భార్గవ్. చదవండి: ఆస్కార్లో మన సినిమా -
101 జిల్లాల అందగాడు: నిజాన్ని దాచేస్తే..!
అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడు. రుహానీ శర్మ కథానాయికగా నటించారు. ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మనసా వినవా..’ అనే పాట బుధవారం విడుదలయింది. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, శ్రీరామచంద్ర, ధన్య బాలకృష్ణ పాడారు. రచయిత భాస్కర భట్ల మాట్లాడుతూ– ‘‘ప్రేమలో నిజాయతీ ఉండాలనుకునే అమ్మాయి... దొరక్క దొరికిన ప్రేమను, ప్రేయసిని వదులుకోకూడదనుకునే యువకుడు కొన్ని నిజాలను దాస్తాడు. ఆ నిజం బయటపడితే వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి? వారి మధ్య ఊసులు కరువై ఊహలే ఊసులైన వేళ ఎలా ఉంటుంది? తన ప్రేమలో నిజాయతీ ఉందని, తాను ఊరకనే మోసం చేయలేదని ప్రేమికుడు.. తెలిసి నిజాన్ని దాచి పెట్టడం తప్పు అనే ప్రేయసి పాడుకునే పాట ‘మనసా వినవా..’’ అన్నారు. చదవండి: వైరల్: కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్ -
మంగ్లీ పాటను లాంచ్ చేసిన మెగాస్టార్
ప్రముఖ గాయని మంగ్లీ పాడిన ‘యోగితత్వం’ పాటను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. దాము రెడ్డి దర్శకత్వం వహించిన ఈ పాటకు బాజి సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాస్ తత్వసంకీర్తన నుంచి సేకరించినది. ‘నా గురుడు నన్నింకా యోగి గమ్మననె’ అంటూ సాగే ఈ పాటలో యోగితత్వాన్ని అద్భుతంగా వివరించారు. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. -
'ఏ జిందగీ' వచ్చేస్తోంది..
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై ‘బన్నీ’ వాసు, వాసూ వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా ఈ చిత్రంలో ‘ఏ జిందగీ..’ అంటూ సాగే పాటని ఈ నెల 5న విడుదల చేయనున్నారు. ‘‘రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. ప్రారంభం నుంచి ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అఖిల్ ఫస్ట్ లుక్కి కూడా మంచి స్పందన వచ్చింది. గోపీ సుందర్ సంగీతం అందించగా, సి«ద్ శ్రీరామ్ పాడిన ‘మనసా మనసా..’ పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజర్కు సోషల్ మీడియాలో, అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఆమని, మురళీ శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రదీశ్ ఎమ్ వర్మ. -
ఆచార్య ఫస్ట్ సాంగ్: సీనియర్ నటి స్పెషల్ అట్రాక్షన్
మెగా అభిమానులకు సర్ప్రైజ్. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మిస్తున్నారు. చెర్రి ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిరంజీవి 152వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ జనవరి 29 విడుదలైన సంగతి తెలిసిందే. రీలిజైన క్షణాల్లోనే టీజర్ లక్షవ్యూస్ సంపాదించి యూట్యూబ్ సంచలనమైంది. బ్యాక్గ్రౌండ్లో చెర్రి వాయిస్ వస్తుండగా చీరు ఎంట్రీ ఇచ్చిన ఈ టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆచార్యలోని మొదటి లిరికల్ సాంగ్ను బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం. ‘లాహే లాహే’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ఇందులో సీనియర్ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చందమామ కాజల్ అగర్వాల్ ఆమెతో కలిసి కాలు కదిపింది. గుడి సమీపంలో సాగే ఈ పాటకు మధ్యలో చిరు తనదైన శైలిలో స్టెప్పులేశాడు. కాగా గేయ రచయిత రామజోగయ్య శాస్రీ సాహిత్యం అందించగా.. మణిశర్మ స్వరాలు సమకుర్చారు. సింగర్స్ హరిక నారాయణ్, సాహితి చాగంటిలు ఆలపించిన ఈ పాటకు దినేష్ కొరియోగ్రాఫి అందించాడు. చదవండి: మెగాస్టార్ ఆన్ ద వే.. మే 13కు 'ఆచార్య' రెడీ మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్లో ఫ్యాన్స్! -
నోరే ఊరేలా... కూరే కావాలా!
టేస్టీ టేస్టీ కూరను రుచి చూపించనున్నారు పూర్ణ. ఫుడ్ మేళా పెట్టారేమో అనుకుంటున్నారా? అదేం కాదు.. ‘బ్యాక్డోర్’ సినిమాలో రుచికరమైన కూర నేపథ్యంలో ఓ పాట ఉంటుంది. సినిమాలో నటీనటులు ఎలాగూ టేస్ట్ చేస్తారనుకోండి. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ దర్శకత్వంలో సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బ్యాక్ డోర్’. ఈ చిత్రంలోని రెండో పాట ‘నోరే ఊరేలా... కూరే కావాలా’ పాటను చెఫ్ సంజయ్ తుమ్మ చేతుల మీదగా విడుదల చేయించారు. ప్రణవ్ స్వరపరచిన ఈ పాటకు చాందిని సాహిత్యం అందించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. -
వ్యవసాయం లాభసాటిగా మారాలి
‘‘జనాభా పెరిగే కొద్దీ తినేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అలాంటప్పుడు వ్యవ సాయం లాభసాటిగా మారాలి కానీ, నష్టాల్లో కూరుకుపోతోంది. దానికి పరిష్కారం చెప్పడానికి ‘శ్రీకారం’ ద్వారా ప్రయత్నం చేశాడు కిషోర్. ఈ చిత్రకథ ఆసక్తికరంగా ఉంది’’ అని డైరెక్టర్ త్రివిక్రమ్ అన్నారు. శర్వానంద్ హీరోగా కిషోర్ బి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న రిలీజ్ కానుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ‘శ్రీకారం’ చిత్రంలోని టైటిల్ సాంగ్ని త్రివిక్రమ్ విడుదల చేశారు.‘‘నాలుగేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. ‘శ్రీకారం’తో ఫ్యూచర్ ఫిల్మ్ చేశాను. ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే విధంగా చాలా విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు బి. కిషోర్. ‘‘అత్యధిక థియేటర్స్లలో గ్రాండ్గా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు రామ్ ఆచంట. -
పాట చాలా బాగుంది: వైఎస్ షర్మిల
‘‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్రంలోని రెండో పాట చాలా బాగుంది.. సినిమా కూడా మంచి విజయం సాధించాలి’’ అని వైఎస్ షర్మిల అన్నారు. పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా అభిరామ్ ఎమ్. తెరకెక్కించిన చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మాధవి సమర్పణలో రాజేశ్ నాయుడు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ సాంగ్ను వైఎస్ షర్మిల విడుదల చేశారు. ‘‘ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే ఎలిమెంట్స్కి ఎంటర్టైన్ మెంట్ జోడించి అభిరామ్ ఈ చిత్రాన్ని రూపొందించారు’’ అన్నారు రాజేశ్ నాయుడు. ‘‘పవన్ తేజ్ కొణిదెలకు ఇది పర్ఫెక్ట్ లాంచింగ్ అవుతుంది’’ అన్నారు అభిరామ్ ఎమ్. -
చుక్కలాంటి అమ్మాయి చక్కగా ఉంది
నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘విక్రమ్’. హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ నిర్మించారు. దివ్యా రావు కథానాయిక. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని మొదటి పాట ‘చుక్కలాంటి అమ్మాయి...’ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదగా విడుదల చేయించారు. సురేశ్ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటను పృథ్వీ చంద్ర పాడారు. కోటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని పాటలన్నీ బావున్నాయి. కథ కూడా బాగుంది. నా ప్రియ శిష్యుడు సురేశ్ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ప్రేమలో పడే ఓ సినిమా రైటర్ సమాజంలోని కొన్ని కారణాల వల్ల ప్రేయసి నుంచి విడిపోవాల్సి వస్తుంది. మళ్లీ కలిసే ఒక అవకాశం వస్తే ఎలా ఉంటుందనేది ప్రధాన ఇతివృత్తం’’ అన్నారు నాగవర్మ. ‘లవ్ థ్రిల్లర్ చిత్రమిది. ఓ సినిమా రచయిత ప్రేమకథ ఇది’’ అన్నారు దర్శకుడు హరిచందన్. -
పిచ్చోడి చేతిలో రాయి
దర్శకుడు రామ్గోపాల్ వర్మపై వస్తున్న చిత్రం ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. నిర్మాతగానే కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం వహించిన నట్టి కుమార్ కొంత గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. కృష్ణప్రియ, సంపూర్ణ మలకర్ హీరోయిన్లు. శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నట్టి కరుణ, అనురాగ్ కంచర్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన ప్రత్యేక గీతాన్ని నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ– ‘‘పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్కు మంచి స్పందన వచ్చింది. ఈ పాటకు క్రాంతి చేసిన డ్యాన్స్కి ప్రశంసలు లభిస్తున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.ఎ. ఖుద్దూస్. -
క్వశ్చన్ మార్క్ (?): రామసక్కనోడివిరో...
అదా శర్మ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘క్వశ్చన్ మార్క్ (?)’ విప్రా దర్శకత్వంలో గౌరు ఘనా సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించారు. విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రంలోని ‘రామసక్కనోడివిరో..’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను రఘు కుంచె స్వరపరచగా బండి సత్యం సాహిత్యాన్ని సమకూర్చారు. మంగ్లీ ఆలపించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ పాట క్రెడిట్ అంతా రఘు కుంచెగారికి వెళ్తుంది. ఆయన ఈ సినిమాకి నేపథ్య సంగీతం కూడా బాగా ఇచ్చారు. అదా శర్మగారు ఎంత మంచి డ్యాన్సరో ఈ సినిమాతో తెలుస్తుంది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘కరోనా సమయంలో సినిమా చేయడమనేది ఎంతో రిస్క్. మా నిర్మాత సహకారం వల్లే చేయగలిగాం. మా టీమ్ కూడా ఎంతో సహకరించారు’’ అన్నారు విప్రా. ‘‘నిజానికి ‘రామసక్కనోడివిరో..’ పాట పెట్టాలనుకోలేదు. షూటింగ్ పూర్తయ్యాక అనుకొని చేశాం’’ అన్నారు రఘు కుంచె. ‘‘ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా వస్తోంది. నా గత చిత్రాల్లోలానే ఈ సినిమాలో కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను. కరోనా టైమ్లో స్టార్ట్ చేసి కరోనా టైమ్లో రిలీజ్కి రెడీ అవుతోన్న మొదటి సినిమా మాది’’ అన్నారు అదా శర్మ. సంజయ్, అభయ్, భానుశ్రీ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ ప్రకాష్. -
రాయే నువ్వు రాయే..
నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్ జంటగా నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్బస్టర్’. రాజ్ విరాట్ దర్శకత్వంలో విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించారు. ‘రాయే నువ్వు రాయే’ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటని హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా సినిమా టైటిల్, టీజర్కి అటు ప్రేక్షకుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్ అభిమానిగా నందు నటించాడు. నందు పాత్రకు సమానంగా రష్మి పాత్ర కూడా ఉంటుంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజాతా సిద్ధార్థ్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
ఏడు పాత్రల మథనం
మానస్ నాగులపల్లి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అక్షత సోనావని హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘క్షీర సాగర మథనం’. అనిల్ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేష¯Œ ్స ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని ‘నీ పేరు పిలవడం... నీ పేరు పలకడం..’ గీతాన్ని దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమణి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అజయ్ అరసాడ సంగీతం అందించారు. ‘‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అన్నారు అనిల్ పంగలూరి. ఈ చిత్రానికి కెమెరా: సంతోష శానమోని, సహదర్శకుడు: కిషోర్ కృష్ణ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి. -
తంగేడు పువ్వు
అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక నిర్మించారు. టి.డి. ప్రసాద్వర్మ దర్శకత్వం వహించారు. యం.యం. శ్రీలేఖ జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలోని ‘తంగేడు పువ్వు...’ పాటను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నిర్మల్ బొమ్మల నేపథ్యంలో లవ్స్టోరీని తెరకెక్కించారు ప్రసాద్వర్మ. హీరో అనురాగ్కి ఈ సినిమాతో మంచి పేరు రావాలి. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. చిత్రనిర్మాణ సారధి కృష్ణకుమార్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే విడుదలైన ‘కొట్టుకొట్టు..’ అనే సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘తంగేడు పువ్వు...’ పాటకు కూడా మంచి పేరు వస్తుందనుకుంటున్నా. ఈ పాట రాసిన అనంత్ శ్రీరామ్కి, పాట పాడిన శ్రుతికి అభినందనలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సమర్పకులు శ్రీనివాస్ రెడ్డి, యం.యం. శ్రీలేఖ, హీరో అనురాగ్, దర్శకుడు టి.డి. ప్రసాద్వర్మ, రాథోడ్ రాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సువర్ణా.. ఇన్నావా
క్రిష్ హీరోగా, అశ్విత, త్రిష హీరోయిన్లుగా బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వంలో తెరక్కిన చిత్రం ‘రావణలంక’. కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్పై క్రిష్ బండిపల్లి నిర్మించారు. ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా బి.ఎన్.ఎస్ రాజు మాట్లాడుతూ –‘‘యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్ని ఎంజాయ్ చేసే ఆడియ¯Œ ్సతో పాటు ఫ్యామిలీ ఆడియ¯Œ ్స కూడా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మా సినిమా ఆడియో హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్ వారు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తాజాగా విడుదల చేసిన ‘సువర్ణా ఇన్నావా...’ పాట యూత్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ పాటను ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ పాడారు’’ అన్నారు. -
నీ నీడై వెంటాడనా..
నాగార్జున, టబు జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా నటిస్తున్నారు. వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు. అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు నిర్మిస్తున్నారు. సిద్ధిక కథానాయికగా నటిస్తోంది. ‘నేనే నీ నీడై వెంటాడనా.. వేసే అడుగుల్లో తారాడనా...’ అంటూ సాగే ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేశారు. ఈ పాటను చైతన్య ప్రసాద్ రచించగా, చిన్మయి ఆలపించారు. బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు మాట్లాడుతూ– ‘‘ మా చిత్రం టైటిల్ను నాగార్జునగారే విడుదల చేసి, మాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరపాల్సి ఉంది’’ అన్నారు. -
‘నిన్నే పెళ్లాడతా’ సాంగ్: మంచు లక్ష్మి ట్వీట్
క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. అమన్ సరసన సిద్దికా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు తొలి పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని రెండో లిరికల్ వీడియో సాంగ్ను రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ‘సఖుడా’ అంటూ సాగే ఈ పాటను నవనీత్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించాడు. చిన్మయి శ్రీపాద ఆలపించారు. (అంతరిక్షానికి వెళ్తున్నట్లుగా ఉంది: రకుల్) ‘సఖుడా చెలికాడా తెగువె కలవాడా సరదా వరదై రారా.. సఖుడా చెలికాడా సరసపు మొనగాడా మదిలో మదివై పోరా’ అంటూ సాగే ఈ ప్రేమ పాట యూత్ను ముఖ్యంగా లవర్స్ను తెగ ఆకట్టుకుంటోంది. నటి మంచు లక్ష్మి కూడా ఈ పాట తనను ఎంతగానో ఆకట్టుకుందని, లిరిక్స్ సూపర్బ్ అని ట్విటర్లో పేర్కొంటూ పాటకు సంబంధించిన లింక్ను షేర్ చేశారు. దీంతో ఈ పాట మరింత వైరల్ అయింది. ఇక ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను కింగ్ నాగార్జున విడుదల చేయడంతో అందరి దృష్టి ‘నిన్నే పెళ్లాడతా’ పై పడింది. ఈశ్వరి, అంబిక ఆర్ట్స్ పతాకంపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయికుమార్, అన్నపూర్ణ, సీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కలాదర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (నాన్న అర్థమవడానికి ఏళ్లు పట్టింది) What beautiful lyrics and how nice you look my darling @AmanPreetOffl https://t.co/S5IwuB1c9t.. Can't wait for the movie now — Lakshmi Manchu (@LakshmiManchu) June 18, 2020 -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
ఆదిత్య, ప్రణవ్య జంటగా కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తెరకెక్కిన చిత్రం ‘గుండమ్మ కథ’. ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై లక్ష్మీ శ్రీవాత్సవ నిర్మించిన ఈ సినిమాలోని ‘రింగ్ ట్రింగ్..’ అంటూ సాగే మొదటి పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘లవ్, కామెడీ, సెంటిమెంట్ తదితర అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. సతీష్ సాధన్ చక్కటి పాటలు అందించారు. ‘రింగ్ ట్రింగ్..’ అంటూ సాగే ఈ పాటను వేగ్నేశ్న శ్రీ విజయ రచించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘గెటప్’ శ్రీను, భాష నటించిన ఈ చిత్రానికి కెమెరా: మోనీష్ భూపతి, దర్శకత్వం: లక్ష్మీ శ్రీవాత్సవ, కృష్ణంరాజు. -
కేటీఆర్ అన్నా మీకు థ్యాంక్స్: ప్రియదర్శి
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. అదేవిధంగా ఆయన రచించిన తెలుగాంగ్ల మిశ్రసమాస నిఘంటువును కూడా ఆవిష్కరించినట్లు మంత్రి తన అధికారిక ట్విటర్లో పేర్కొన్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో జరిగిన పాట విడుదల కార్యక్రమంలో ప్రియదర్శి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ పాటకు వి.రాధ సంగీతాన్ని సమకూర్చగా సినీ నేపథ్య గాయకులు కృష్ణచైతన్య, కల్పన, హరిణి, సాయిచరణ్లు ఆలపించిన ఈ గీతం అందరినీ ఆకట్టుకుంటోంది. ‘ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు రచించిన తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసే అవకాశం లభించింది ఈ రోజు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్ప కళను గురించి వర్ణించే ఈ పాట మనసుని హత్తుకుంది. అలాగే వారు రచించిన తెలుగాంగ్ల మిశ్రసమాస నిఘంటువును కూడా ఆవిష్కరించడం జరిగింది. భారతీయ భాషలలో ఇటువంటి రచనలలో ఇది మొదటిది’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలతో పాటు పాట యూట్యూబ్ లింక్ను కూడా షేర్ చేశారు. ఇక తన తండ్రి రచించిన పాటను ఆవిష్కరించిన కేటీఆర్కు ప్రియదర్శి ధన్యవాదాలు తెలిపాడు. ‘అన్న, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా నాన్నగారి పాటను నిఘంటువును ఆవిష్కరించారు. కవులను విద్యావంతులను ఇలా ఇంతగా గౌరవించే మీ సంస్కారానికీ సభ్యతకూ బహుథా కృతజ్ఞతలము’ అంటూ ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్న, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా నాన్నగారి పాటను నిఘంటువును ఆవిష్కరించారు. కవులను విద్యావంతులను ఇలా ఇంతగా గౌరవించే మీ సంస్కారానికీ సభ్యతకూ బహుథా కృతజ్ఞతలము🙏 https://t.co/V3zte4JceM — Priyadarshi (@priyadarshi_i) June 12, 2020 -
క్రిమితో సమరం
కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్ దేశాలు శక్తి మేర కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల చాలామంది వివిధ రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పట్లో కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా బారిన పడకుండా మనందరం జాగ్రత్తగా ఉంటూ, లాక్డౌన్ సమయంలో ఎలా అయితే మనం పోలీసులకు, వైద్య సిబ్బందికి సహకరించామో అదే రీతిన ఇకపై కొనసాగాలని, కరోనా వల్ల దెబ్బతిన్న మన జీవితాలను మళ్లీ మనమే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని అర్థం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి యంగ్ హీరో నిఖిల్తో కలిసి ఓ పాటను సిద్ధం చేయించారు. మనం అంతా కలిసి కరోనాని అడ్డుకోవాలి అని చాటి చెప్పే రీతిన ఉన్న ఈ పాటను విజయ సాయిరెడ్డి విడుదల చేశారు. ఈ పాటకు దర్శకుడు చందు మొండేటి కాన్సెప్ట్ని రెడీ చేశారు. పాటలో ‘కనిపించని క్రిమితో సమరం’ అని ఉన్న ఈ పాటకు సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అలానే ఈ పాటలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కనిపించారు. వారిలో కాజల్ అగర్వాల్, నిధీ అగర్వాల్, ప్రణీతా సుభాష్, సుధీర్బాబు, పీవీ సింధు తదితరులు ఉన్నారు. -
ఎన్ని రోజులు సింగిల్గా ఉంటావో నేనూ చూస్తా: నితిన్
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న హీరో ‘సాయిధరమ్ తేజ్’. ప్రస్తుతం తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పెళ్లి అంటే ఆమడ దూరం పారిపోయే వ్యక్తి పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు చెందిన ఓ పాటను హీరో నితిన్ రిలీజ్ చేశారు. ‘నో పెళ్లి, దాని తల్లి.. ఈ తప్పే చేయకురా వెళ్లి’ అంటూ సాగే ఈ పాటలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. సాయికి తోడుగా వరుణ్ సైతం పాటలో రాగం అందించాడు. (‘ ఆ విషయంలో దీపిక చాలా క్రూరం’) Loved the gift darling @IamSaiDharamTej v happy to release this song frm #SoloBrathukeSoBetter https://t.co/hYUqWQHhAD BUT Nenu chustha enni rojulu ilaage SINGLE gaa untaavo..Konni saarlu cheskodam lo TIME gap untadhemo gaani,CHESKODAM maatram PAKKKAAA.💥🤗#NoPelliFromSBSB — nithiin (@actor_nithiin) May 25, 2020 ఈ సందర్భంగా నితిన్ ట్వీట్ చేశారు. సినిమా నుంచి సాంగ్ను విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉంటావో నేను చూస్తానని సాయిని ఉద్ధేశించి సరదా వ్యాఖ్యలు చేశారు. కొన్ని సార్లు చేసుకోవడంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమోగానీ చేసుకోవడం మాత్రం పక్కా అంటూ ఫన్నీ కామెంట్ పెట్టాడు. ఇక దీనిపై వెంటనే సాయి ధరమ్ తేజ్ స్పందించి.. నేను ట్రెండ్ ఫాలో అవ్వను బ్రదర్, ట్రెండ్ సెట్ చేస్తా అంటూ బదులిచ్చారు. ‘మింగిల్ అయినా మా లాంటి సింగిల్స్ కోసం ఈ సాంగ్ లాంచ్ చేసినందుకు థ్యాంక్యూ డార్లింగ్’. అని రీట్వీట్ చేశాడు. (ఏంటి బావ పెళ్లంట.. వాళ్లు మోసం చేశారు!) -
కన్నడ స్టార్స్.. కరోనా పాట
కరోనా మీద అవగాహన పెంచేందుకు, పోరాటానికి కావాల్సిన స్ఫూర్తిని అందిస్తూ ప్రతీ ఇండస్ట్రీకు సంబంధించిన స్టార్స్ కరోనాకు సంబంధించిన పాటలను విడుదల చేస్తున్నారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీ కూడా కరోనా పై ఓ ప్రత్యేక గీతాన్ని తయారుచేసింది. ఈ పాట నేడు (మే 25) విడుదల కానుంది. కన్నడ దర్శకుడు పవన్ వడియార్ ఈ పాటకు సంబంధించిన కాన్సెప్ట్ను రెడీ చేశారు. హరికిషన్ స్వరపరిచిన ఈ పాటను ప్రథ్యుమ్న రాశారు. విజయ్ ప్రకాష్, రాజేశ్ ఆలపించారు. ఈ పాటలో కన్నడ స్టార్స్ ఉపేంద్ర, పునీత్ రాజ్ కుమార్, శివరాజ్కుమార్, సుమలత అంబరీష్, దర్షన్, రమేష్ అరవింద్, రవిచంద్రన్, రక్షిత్ శెట్టి, శాన్వీ, అభిషేక్ అంబరీష్తో పాటు మిగత స్టార్స్ కూడా కనిపించనున్నారు. క్రికెట్ స్టార్ అనిల్ కుంబ్లే కూడా ఈ పాటలో కనిపిస్తారట. ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ పాటలో కనిపించే స్టార్స్ అందరూ ఎవరింట్లో వారు ఉండి ఈ పాటను షూట్ చేశారట. -
మీ సేవలకు సలామ్
కరోనా మీద ప్రస్తుతం ప్రపంచం పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో కరోనాను కట్టడి చేయడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ముందుండి పోరాడుతున్నారు. వాళ్ల సేవలకు సలామ్ చేస్తూ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ ఓ పాటను రూపొందించారు. రచయిత బాలాజీ రచించిన ఈ పాటను సుమారు పది మంది (మనో, టిప్పు, శ్రీకృష్ణ, సాయి చరణ్, నిహాల్, గీతా మాధురి, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణి, బేబి) గాయనీ గాయకులు ఆలపించారు. ఈ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేసి, ‘‘మనకోసం పోరాడుతున్న వాళ్ల సేవలను గుర్తిస్తూ ఓ పాటను చేయడం మంచి విషయం. టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘కరోనా నుంచి మనల్ని కాపాడుతున్న అందరికీ చేతులెత్తి మొక్కాలి. నాకు సహకారం అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు సంగీత దర్శకుడు మహిత్. -
గల్లీ కుర్రాడి ప్రేమకథ
నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘సూర్య’. ఈ చిత్రం ద్వారా ఉమామహేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విట్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నిజమేనా...’ అంటూ సాగే పాటను దర్శకుడు రామ్గోపాల్ వర్మ, నటీనటులు కస్తూరి, శివబాలాజీ, మధుమిత విడుదల చేశారు. నట్టి క్రాంతి మాట్లాడుతూ –‘‘చిన్నప్పటి నుంచి సినిమా రంగం అంటే ఇష్టం. ఓ వైపు చదువుకుంటూనే అసోసియేట్ డైరెక్టర్గా పని చేశాను. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటన, దర్శకత్వంలో శిక్షణ పొందాను. వైజాగ్ సత్యానంద్గారి దగ్గర కూడా నటనలో శిక్షణ తీసుకున్నాను’’ అన్నారు. ‘‘సైకాలజీ కోర్సు పూర్తి చేసిన నేను ‘ముద్ర’ సినిమాతో నిర్మాతగా మారి, వరుసగా సినిమాలు తీస్తున్నాను. చక్కటి ప్రేమకథా చిత్రం ‘సూర్య’. అల్లరి చిల్లరగా తిరిగే ఓ గల్లీ కుర్రాడు ప్రేమలో పడిన నేపథ్యంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి? అనేదే ఈ చిత్రకథ. లాక్ డౌన్ ముగిసిన తర్వాత మిగతా చిత్రీకరణను పూర్తి చేస్తాం’’ అన్నారు నట్టి కరుణ. ఈ చిత్రానికి కెమెరా: వల్లీ ఎస్.కె., సంగీతం: సుకుమార్ పి, సమర్పణ: నట్టి కుమార్. -
ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ..!
‘ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ’.. ఈ ఒక్కమాట చాలు లాక్డౌన్ కష్టకాలంలో పేదలు, వలస కూలీల దీనస్థితిని అద్దం పట్టేందుకు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆదేశ్ రవి.. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని వలస వెళ్లిన శ్రమజీవుల కరోనా లాక్డౌన్ కష్టాలను అక్షరబద్దం చేసిన పాటలోని ఆవేదన ఇది. పాట వింటే కళ్లు చెమ్మగిల్లుతాయి. ‘పూట పూట జేసుకోని బతికేటోళ్లం.. పూట గడవా ఇంత దూరం వచ్చినోళ్లం..’ అంటూ మొదలై, ‘ఇంటికాడ పిల్ల జెల్ల ఎట్ల ఉన్నరో.. నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతున్నదో.. ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ.. ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ.. అనే విన్నపంతో పాట ముగుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాటను విన్న దేశపతి శ్రీనివాస్, చంద్రసిద్ధార్థ, ఆర్పీ పట్నాయక్, సుకుమార్, మరికొంత మంది ప్రముఖులు రవిని అభినందించారు. ఇదే పాటను రవి ఇప్పుడు హిందీలో కూడా పాడబోతున్నారు. ‘పేద రోగం కంటే పెద్ద రోగముందా..? అయినవాళ్ల కంటే అండ ఉందా..? అనే చరణంలో.. కష్టకాలంలో అయినవాళ్ల వద్ద ఉండాలనే తపన, ఆరాటం.. పాటలో వ్యక్తం అవుతున్నాయి. సౌండ్ ఇంజినీర్ అయిన రవి వందకు పైగా సినిమాలకు పని చేశారు. కొన్ని చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. బాధ.. సంఘర్షణ నుంచి పుట్టిన పాట దక్షిణాది నుంచి ఉత్తరాదికి.. ఉత్తరాది నుంచి దక్షిణానికి వేలాది వలస జీవులు నడిచి వెళ్తున్నారు. నాకేమైనా ఫర్వాలేదు.. నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకుని ఎర్రటి ఎండలో మైళ్లకు మైళ్లు నడుస్తున్న వలస జీవుల్ని మీడియాలో.. సోషల్ మీడియాలో చూసి.. ఎట్లాంటి స్థితిలో ఉన్నాం.. అని బాధనిపించింది. ఆ బాధ, సంఘర్షణలోంచి ఈ పాట పుట్టింది. – ఆదేశ్ రవి – గుర్రాల మహేశ్, సాక్షి, కరీంనగర్ -
ప్రేమను పంచుదాం
ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలోనూ స్ఫూర్తిని పెంచి, ప్రేమను పంచాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ కరోనా వైరస్ పోరాటంపై ‘అరివుమ్ అన్బుమ్’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఓ పాటను సిద్ధం చేశారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను పాడటంతో పాటు కమల్ హాసనే స్వయంగా రాశారు. ఈ పాటకు కమల్ తో పాటు సుమారు 12 మంది ప్రముఖులు గొంతు కలిపారట. శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ఎవరింట్లో వాళ్లు ఉండి రికార్డ్ చేశారు. ‘‘ఈ పాటను కమల్ హాసన్ గారు కేవలం రెండు గంటల్లో రాసేశారు. పాటలో 12 మంది వాయిస్ మాత్రమే కాదు 37 మంది కోరస్ వాయిస్లు వినిపిస్తాయి. వాళ్లను ఆన్ లైన్ ఆడిషన్ చేసి సెలక్ట్ చేశాను’’ అని ఈ పాటకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు జిబ్రాన్. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. -
ప్యార్ కరోనా
‘ఈ కష్టసమయంలో ఇతరుల మీద ద్వేషం చూపొద్దు. కేవలం ప్రేమను మాత్రమే పంచండి’ అంటున్నారు సల్మాన్ ఖాన్. ఈ మాటలను పాట రూపంలో చెప్పాలనుకున్నారు. ‘ప్యార్ కరోనా’ అంటూ సాగే ఈ పాటను హుస్సేన్ దలాల్ తో కలసి రచించారు సల్మాన్. సాజిద్ వాజిద్ కంపోజ్ చేసిన ఈ పాటను సల్మానే స్వయంగా పాడారు. ఈ పాట ఇవాళ విడుదల కానుంది. -
కథే ప్రాణం
అల్లు వంశీ, ఇతీ ఆచార్య జంటగా నటిస్తున్న చిత్రం ‘పసివాడి ప్రాణం’. ధన్శ్రీ ఆర్ట్స్ పతాకంపై ఎన్.ఎస్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లిరికల్ ఆడియో సాంగ్ను దర్శకులు కోదండరామిరెడ్డి, వీవీ వినాయక్లతో కలిసి నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్. మూర్తి మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రానటువంటి వినూత్నమైన లైవ్ కమ్ యానిమేషన్ చిత్రం ‘పసివాడి ప్రాణం’. మోషన్ క్యాప్చర్, యానిమేషన్, గ్రాఫిక్స్ టెక్నాలజీలతో నిర్మితమైన 3డీ, 2డీ క్యారెక్టర్స్ సినిమాలో ఉన్నాయి. 2డీ బేబి, 3డీ టెడ్డీ బేర్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాకు కథ ప్రాణం అయితే గ్రాఫిక్స్ ఊపిరి’’ అన్నారు. -
నీ కన్ను నీలి సముద్రం
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీ కన్ను నీలి సముద్రం..’ అనే పాటను డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను జావెద్ అలీ ఆలపించారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘ఈ వేసవికి ‘ఉప్పెన’ కంటే చల్లనైన, చక్కనైన సినిమా రాదనేది నా ప్రగాఢ నమ్మకం. బుచ్చిబాబు కథ చెప్పిన విధానం చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందోననిపించింది. నాకు తెలిసి ఇంత చక్కని పల్లెటూరి ప్రేమ కథ ఈ మధ్య కాలంలో రాలేదు. నాకు బాగా స్ఫూర్తినిచ్చిన ‘సీతాకోకచిలక’ లాంటి అనుభూతి ఉన్న సినిమా ఇది. వైష్ణవ్ తేజ్కు ఇంతకంటే బెటర్ డెబ్యూ రాదనుకుంటున్నా. ‘ఉప్పెన’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ఏప్రిల్ 2న ‘ఉప్పెన’ సినిమాని విడుదల చేయడానికి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్, వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్దత్ సైనుద్దీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి, సీఈఓ: చెర్రీ. -
22 పెద్ద విజయం సాధించాలి
రూపేష్ కుమార్, సలోని మిశ్రా జంటగా నటించిన చిత్రం ‘22’. శివకుమార్ .బి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలోని తొలి పాటను ప్రభాస్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సాంగ్ లిరికల్ వీడియో చూశాను. బాగుంది. బి.ఎ. రాజుగారు, జయగారి అబ్బాయి శివకుమార్కి దర్శకుడిగా ఇది తొలి సినిమా. పోలీస్ డ్రెస్లో రూపేష్ బాగున్నాడు. టీజర్ ఆసక్తికరంగా ఉంది. డిఫరెంట్ మూవీ అనిపిస్తోంది. ‘22’ బిగ్ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ప్రభాస్ వంటì స్టార్ పోలీస్ డ్రెస్లో నేను బాగున్నానని చెప్పడాన్ని అవార్డులా భావిస్తున్నా’’ అన్నారు రూపేష్. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చెప్పారు నిర్మాత సుశీలాదేవి. ‘‘ఈ సినిమా కాన్సెప్ట్ను ప్రభాస్గారు అడిగి తెలుసుకుని కథలో మంచి డెప్త్ ఉందన్నారు. బిగ్ హిట్ అవుతుందన్నారు. మా సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన రూపేష్గారికి థ్యాంక్స్. కాస్లర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్ మ్యాడీ బాగా పాడారు’’ అన్నారు శివకుమార్. ‘‘మా అబ్బాయి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఫస్ట్ సాంగ్ను విడుదల చేసి, సినిమా పెద్ద విజయం సాధించాలన్న ప్రభాస్గారికి థ్యాంక్స్’’ అన్నారు బి.ఎ. రాజు. ‘‘చంటిగాడు’తో గీతరచయితగా నన్ను పరిచయం చేశారు జయగారు. వారి అబ్బాయి శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాటలు రాయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కాసర్ల శ్యామ్. ‘‘రూపేష్కి, శివకు ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అన్నారు సాయి కార్తీక్. కెమెరామేన్ రవికిరణ్, ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు, సింగర్ మ్యాడీ మాట్లాడారు.