song launch
-
ఓ ప్రేమ... ప్రేమ
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా రతన్ రిషి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టిస్ట్’. ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఓ ప్రేమ ప్రేమ..’ అంటూ సాగే లిరికల్ సాంగ్ని రిలీజ్ చేశారు.‘జారే కన్నీరే అడుగుతుందా.. . నేరం ఏముందో చెప్పమంటూ... నా ప్రేమే ఇలా ఓ ప్రశ్నయ్యేనా... నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా...’ అంటూ భావోద్వేంగా సాగుతుందీ పాట. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని రమ్యా బెహ్రా పాడారు. ‘‘ఒక వినూత్నమైన ప్రేమ కథతో ‘ఆర్టిస్ట్’ సినిమా రూపొందింది.ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘చూస్తూ చూస్తూ..’ సాంగ్కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘సత్యం’ రాజేశ్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, పి.సోనియా ఆకుల, స్నేహా, మాధురి శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమేరా: చందూ ఏజే, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సురేష్ బసంత్, లైన్ ప్రోడ్యూసర్: కుమార్ రాజా. -
కాలేజీ మ్యాజిక్
‘డోన్ట్ నో వై... ఇంకా ఉన్నా... నేనే ఇష్టం లేనిప్రాణాలేమో పోనే పోవే..’ అంటూ మొదలవుతుంది ‘మ్యాజిక్’ సినిమాలోని ‘డోన్ట్ నో వై...’ పాట. సారా అర్జున్, అన్మోల్ కజాని, ఆకాశ్ శ్రీనివాస్, సిద్ధార్థ్ తణుకు ప్రధాన పాత్రధారులుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు, తమిళ చిత్రం ‘మ్యాజిక్’.ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘డోన్ట్ నో వై..’ పాట లిరికల్ వీడియో విడుదలైంది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, ఐశ్వర్యా సురేష్ బింద్రాతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఆలపించారు. ‘‘కాలేజ్ ఫెస్ట్ కోసం పాట చేయడానికి ఓ నలుగురు యువతీ యువకులు చేసే ప్రయత్నమే ఈ సినిమా’’ అని యూనిట్ తెలిపింది. -
మనసు నిన్ను తెలుసుకుందయ్యా...
‘‘తెలివి కన్ను తెరుసుకుందయ్యా... శివలింగామయ్యా... మనసు నిన్ను తెలుసుకుందయ్యా...’’ అంటూ మొదలవుతుంది ‘కన్నప్ప’ సినిమాలోని ‘శివ శివ శంకరా...’పాట. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్. మోహన్బాబు, శరత్కుమార్, మోహన్లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు మోహన్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది.కాగా బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఈ చిత్రంలోని ‘శివ శివ శంకరా...’పాటను రిలీజ్ చేశారు. మోహన్ బాబు, విష్ణు మంచు, ముఖేష్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్లైన్ వెంకటేశ్, నటి సుమలత, భారతీ విష్ణువర్ధన్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ, రామజోగయ్య శాస్త్రి తదితరులుపాల్గొన్నారు. ‘‘రవిశంకర్ గురూజీ ఈ పవిత్ర గీతాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాను.‘కన్నప్ప’ అనేది శివునితో మమేకం చేయబడిన చిత్రం. ఇదే మా ప్రయాణానికి అ΄ారమైన ఆధ్యాత్మిక విలువను జోడిస్తుంది’’ అని తెలి΄ారు మోహన్బాబు. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ స్వరపరచిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, విజయ్ ప్రకాశ్ ఆలపించారు. న్యూజిల్యాండ్లో చిత్రీకరించిన ఈపాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈపాటను హిందీలో జావేద్ అలీపాడగా, శేఖర్ అస్తిత్వ సాహిత్యాన్ని అందించారు. -
వీల్చైర్లో ప్రమోషన్స్కు రష్మిక ‘ఛావా’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
సమాజమే నీ సేవకు సలాం
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్పై బలగం జగదీష్ నిర్మించారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతులమీదుగా విడుదల చేశారు.‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న... కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా....’ అంటూ ఈ పాట సాగుతుంది. శ్రీనివాస్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల మీద వచ్చిన ఈ పాటని నేను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి పోలీస్ ఈ సాంగ్ వింటారు’’ అన్నారు. ‘‘కానిస్టేబుల్..’ పాటని సీవీ ఆనంద్గారు విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. ‘‘కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల. అది నెరవేరకపోవడంతో ఈ సినిమా నిర్మించాను’’ అని బలగం జగదీష్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ అందర్నీ స్పందింపజేస్తుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. -
‘నిన్ను నన్ను కన్న ఆడది..రా!’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
యాక్షన్ ఎంటర్టైనర్
అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించగా, అర్జున్ ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించారు. కాగా ఈ మూవీ నుంచి ‘సవదీక..’ అంటూ సాగే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను అరివు రాయగా, ఆంథోని దాసన్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘విడాముయర్చి’. అజిత్, త్రిషలపై వచ్చే ఈ పాట ఎనర్జిటిక్గా సాగుతుంది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేరా: ఓం ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సుబ్రమణియన్ నారాయణన్. -
నానా హైరానా మెలోడీ సాంగ్ HD స్టిల్స్.. రామ్చణ్, కియారా అదరగొట్టేశారుగా! (ఫోటోలు)
-
ఉగ్రావతారం
‘‘హైదరాబాద్తో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా భర్త ఉపేంద్రగారిని తొలిసారి ఇక్కడే కలిశాను. అందుకే హైదరాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరీర్లో తొలి యాక్షన్ ఫిల్మ్ ‘ఉగ్రావతారం’. ఈ పాత్రకు నేను సరిపోతానని డైరెక్టర్ గురుమూర్తిగారు నమ్మారు. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని నటి ప్రియాంకా ఉపేంద్ర అన్నారు. ప్రియాంకా ఉపేంద్ర లీడ్ రోల్లో గురుమూర్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉగ్రావతారం’.ప్రియాంకా ఉపేంద్ర సమర్పణలో ఎస్జీ సతీష్ నిర్మించిన ఈ సినిమా నవంబరు 1న విడుదలవుతోంది. హైదరాబాద్లో ఈ చిత్రం ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయగా, నిర్మాత కరాటే రాజు, నటుడు సత్యప్రకాశ్ పాటను రిలీజ్ చేశారు. డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలపై మంచి సందేశాత్మాక చిత్రంగా ‘ఉగ్రావతారం’ ఉంటుంది’’ అన్నారు. -
నీలో... నాలో...
భవ భూతి, రేవతి ప్రేమలో పడ్డారు. ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం... లోలో ఎదలో వినిపించసాగే ఓ తాళం...’ అంటూ పాట అందుకున్నారు. భవ భూతిగా శ్రీవిష్ణు, రేవతిగా మీరా జాస్మిన్ నటించిన చిత్రం ‘శ్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘నీలో... నాలో కదలాడు భావమీ రాగం...’ అంటూ సాగే పాటను శనివారం విడుదల చేశారు.ఈ చిత్రంలో శ్రీవిష్ణు చేసిన నాలుగు పాత్రల్లో భవ భూతి ఒకటి. ఆ పాత్ర సరసనే మీరా జాస్మిన్ కనిపించనున్నారు. ఇక చిత్ర సంగీతదర్శకుడు వివేక్ సాగర్ స్వరపరచిన ఈ పాటకు భువనచంద్ర సాహిత్యం అందించగా రాజేశ్ కృష్ణన్, అంజనా సౌమ్య ఆలపించారు. ‘‘ఈ మెలోడీ ట్రాక్లో శ్రీవిష్ణు, మీరా జాస్మిన్ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ఈ పాట ప్రేక్షకులను 1980, 90లలోకి తీసుకెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో దక్షా నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
చిన్నారి తల్లీ.. కలకు భయపడకు
గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’ అంటూ సాగేపాటని విడుదల చేసింది చిత్రయూనిట్.‘మొండి తల్లి పిల్ల నువ్వు.. అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి, కలకు భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించిన ఈపాటని సాహితీ చాగంటిపాడారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూ΄పొందిన చిత్రం ‘విశ్వం’. ఇటీవల విడుదలైన తొలిపాట ‘మొరాకో మగువా..’ కి మంచి స్పందన వచ్చింది. ‘తల్లి, కూతురు నేపథ్యంలో వచ్చే ‘మొండి తల్లి పిల్ల నువ్వు..’పాట కథలోని భావోద్వేగాల లోతును తెలియజేస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్. -
ఫస్ట్ లవ్ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
పదింటికే చలీ జ్వరం...
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తోంది.మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘క్యా లఫ్డా..’ అంటూ సాగే మూడోపాటని సోమవారం రిలీజ్ చేశారు. ‘నరం నరం గరం గరం... పదింటికే చలీ జ్వరం, నీ ఊహలే నిరంతరం... పోతోందిరా నాలో శరం...’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం అందించిన ఈపాటని ధనుంజయ్ సీ΄ాన, సింధూజ శ్రీనివాసన్పాడారు. రామ్, కావ్యాల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి. -
శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ సినిమా ప్రెస్మీట్ (ఫోటోలు)
-
పండగ వచ్చిందే చాన్నాళ్లకి...
గూడెంలోని ప్రజలందరూ ఆ రోజు శుభవార్త విన్నారు. ఆ ఆనందంలో ‘మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందే చాన్నాళ్లకి... అలికీ అలికీ ఊరే అలికీ ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్లకీ...’ అంటూ ΄ాడుకున్నారు. విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’ చిత్రంలోని ΄ాట ఇది. ΄ా. రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో ΄ార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూ΄÷ందింది. బుధవారం ఈ చిత్రంలోని ‘మనకి మనకి...’ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. జీవీ ప్రకాశ్కుమార్ స్వరపరచిన ఈ ΄ాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా సింధూరీ విశాల్ ΄ాడారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. -
మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ
‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్... మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ’ అంటూ మొదలయ్యే ‘స్టెప్పా మార్’ పాట ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలోనిది. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019). ఈ సినిమాకు సీక్వెల్గా రామ్, పూరి కాంబినేషన్లోనే ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కావ్యా థాపర్ హీరో యిన్. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.ఈ సినిమా నుంచి ‘స్టెప్పా మార్..’ అనే పాట లిరికల్ వీడియోను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సోమవారం విడుదల చేశారు. ‘‘ఇస్మార్ట్ శంకరే.. ఏక్ దమ్ డేంజరే... ఔర్ ఏక్ బార్ ఆయారే.. బేజారే..’ అంటూ సాగుతుంది ‘స్టెప్పామార్’ సాంగ్. తెలుగు వెర్షన్ పాటకు మణిశర్మ సంగీత సారథ్యంలో భాస్కరభట్ల సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి, సాహితి పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో సంజయ్ దత్, అలీ, గెటప్ శీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నిశి తొలిచాడు దీపమై...
‘అధర్మాన్ని అణచెయ్యగ యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే... స్వధర్మాన్ని పరిరక్షించగ సమస్తాన్ని ప్రక్షాళించగ సముద్భవించే అవతారమిదే...’ అంటూ మొదలవుతుంది ‘కల్కి’ థీమ్ సాంగ్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్, కమల్హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది.ఈ సందర్భంగా ‘థీమ్ ఆఫ్ కల్కి’ పాటను మంగళవారం విడుదల చేశారు. ‘అధర్మాన్ని అణచేయగా..’ అంటూ మొదలై... ‘నిశి తొలిచాడు దీపమై... నిధనం తన ధ్యేయమై... వాయువే వేగమై...కలియుగ స్థితి లయలే కలబోసే కల్కి ఇతడే...’ అనే లిరిక్స్తో ‘థీమ్ ఆఫ్ కల్కి’ సాగుతుంది. కాలభైరవ, సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా కాలభైరవ పాడారు. -
కలలో బీట్ బాగుంది: సంగీతదర్శకుడు కోటి
‘‘కలలో... కలలో.. .’ పాట చాలా ఫ్రెష్గా ఉంది. ఈ పాట బీట్, లిరిక్స్, నటీనటుల వేషధారణ, నటన అన్నీ బాగా కుదిరాయి. ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు సంగీతదర్శకుడు కోటి. నటుడు అలీ ఫ్యామిలీ నుంచి సదన్ హీరోగా పరిచయమవుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రంలోని ‘కలలో... కలలో...’ అంటూ సాగే పాటను కోటి రిలీజ్ చేశారు.పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ల లింగయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా ప్రసాద్ హీరోయిన్. ‘‘ఫీల్ గుడ్ లవ్స్టోరీతో రూపోందించిన ఈ చిత్రంలోని ‘కలలో..’ అంటూ సాగే ప్రేమ పాటను సహజమైన లొకేషన్స్లో చిత్రీకరించాం. వీనుల విందుగా, కనువిందుగా ఉంటుంది. త్వరలో సినిమాని విడుదల చేస్తాం ’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ, కెమెరా: ఈదర ప్రసాద్. -
రామానుజాచార్యుల చరిత్రతో...
సాయి వెంకట్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. జో శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి భాగం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘జయహో రామానుజ’ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సాయి వెంకట్ మాట్లాడుతూ– ‘‘మహిళల్ని గౌరవించాలని, కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి మెలగాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు రామానుజా చార్యులవారు. ఆయన గొప్పతనం ఈ తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ‘జయహో రామానుజ’ చిత్రాన్ని రూపోందించాను.సంగీత సాహిత్యాలు బాగుండాలని టైమ్ తీసుకుని ఖర్చుకు వెనకాడ కుండా సాంగ్స్ డిజైన్ చేశాం’’ అన్నారు. ‘‘జయహో రామానుజ’ సినిమా మా నాన్నగారు సాయి వెంకట్కి ఒక కల’’ అన్నారు నిర్మాత ప్రవళ్లిక. ఈ చిత్రానికి సంగీతం: జయసూర్య, వెంకట్, హర్ష. -
గరం గరం యముడయో...
అతనితో పెట్టుకున్నవారి పాలిట యమడవుతాడు... గొడ్డలి చేత పట్టాడా అంతే సంగతులు. శత్రువులను పరుగులు పెట్టించి మరీ రఫ్ఫాడేస్తాడు. ‘సరిపోదా శనివారం’లో నాని చేస్తున్న సూర్య క్యారెక్టర్ ఇలానే ఉంటుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘గరం గరం... ’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. ‘గరం గరం యముడయో.. సహనాల శివుడయో..’ అంటూ ఈ పాట సాగుతుంది.హీరో ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చుతాడో ఈ పాటలో నాని లుక్స్, చేసే ఫైట్ ద్వారా చూపించారు. సంగీతదర్శకుడు జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటకు సహపతి భరద్వాజ్ సాహిత్యం అందించగా విశాల్ దద్లానీ పాడారు. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్జె సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. ఆగస్టు 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
పీచు మిఠాయ్...
సైకిలు మీద ప్రేమ షికారుకు వెళ్లారు సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి. ఈ జాలీ రైడ్లో ‘పీచు మిఠాయ్...’ అంటూ పాట పాడుకున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’లో సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి ఓ జంటగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరి మధ్య ‘పీచు మిఠాయ్..’ అంటూ సాగే రొమాంటిక్, మెలోడీ సాంగ్ను విడుదల చేశారు.ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా విజయ్ ప్రకాశ్, హరిప్రియ పాడారు. తెలుగు, తమిళ భాషల్లో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 13న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ని ఏషియన్–సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి విడుదల చేయనుంది. -
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
వైవీయూ: ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ‘సిద్ధం’ పాటల సీడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ఆవిష్కరించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీడీని రూపొందించిన సూర్య చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ఎన్ఆర్ఐ సూర్యనారాయణ, పాటల రూపకర్త, ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఎం.ప్రభాకర్లను భారతమ్మ అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లే శక్తి పాటకు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని పాటల రూపంలో గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానులకు ఈ పాటలను అందుబాటులోకి తెస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘సిద్ధం’ పాటల సీడీ రూపకల్పనకు సహకారం అందించిన బి.రామతులసి, డా.వి.ఉష, ఎన్.సుదీప్రెడ్డి పాల్గొన్నారు. -
చెబుతావా రత్నం
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కె. రాజ్కుమార్ విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చెబుతావా..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, సింధూరి విశాల్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘రత్నం’. ‘చెబుతావా..’ పాట మెలోడియస్గా, ఎమోషనల్గా సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఇదొక కొత్త ప్రయత్నం
ఆశిష్, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘లవ్ వీ’. ‘ఇఫ్ యు డేర్’ (నీకు ధైర్యం ఉంటే...) అనేది ఉపశీర్షిక. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రావాలి రా..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదబాద్లో జరిగింది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను చెబోలు అమల, గోమతీ అయ్యర్, అదితీ భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్విన్, సాయి శ్రేయ ఆలపించారు. ‘‘ఓ ఘోస్ట్ లవ్స్టోరీ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రం యూనిట్ పేర్కొంది. ‘‘లవ్ మీ ఒక కొత్త ప్రయత్నం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
పారడైసు పావడేసుకొచ్చెనండి...
‘జరగండి జరగండి... జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చెనండి... జరగండి జరగండి... పారడైసు పావడేసుకొచ్చెనండి...’ అంటూ పాట అందుకున్నారు రామ్చరణ్. ఈ జాబిలమ్మ ఎవరూ అంటే కియారా అద్వానీ. రామ్చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని పాట ఇది. రామ్చరణ్ పుట్టినరోజు ప్రత్యేకంగా బుధవారం ‘జరగండి..’ లిరికల్ సాంగ్ను 150కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఎస్ఎస్ తమన్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ పాడారు. అనిత సమర్పణలో జీ స్టూడియోస్ అసోసియేష¯Œ తో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
రోటీ కపడా రొమాన్స్ మూవీ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
ఎనిమిది భాషల్లో రికార్డు బ్రేక్
నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్యకృష్ణ, కాశీ విశ్వనాథ్ ముఖ్య తారలుగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పై చదలవాడ పద్మావతి నిర్మించిన చిత్రం ‘రికార్డు బ్రేక్’. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 8 భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మళ్లీ పుట్టి వచ్చినవా..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సాబు వర్గీస్ సంగీత సారథ్యంలో వరికుప్పల యాదగిరి ఈ పాటకు లిరిక్స్ అందించి, పాడారు. ‘‘అందరికీ నచ్చేలా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
‘బిచ్చగాడు’ వంటి బ్లాక్బస్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రోమియో’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళినీ రవి హీరోయిన్గా నటిస్తున్నారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్పై విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ ధనశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్కి భాష్యశ్రీ సాహిత్యం అందించగా, ఆదిత్య ఆర్కే పాడారు. ‘‘విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో నటిస్తున్న చిత్రం ‘లవ్ గురు’. ఇందులో మనసుని కదిలించే చెల్లెలి సెంటిమెంట్ కూడా ఉంటుంది. వేసవిలో ఈ చిత్రం విడుదల చేయనున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: ఫరూక్ జే బాష. -
క్రైమ్ థ్రిల్లర్
‘‘కలర్ ఫోటో’ చిత్రానికి ముందు ‘మను చరిత్ర’ సినిమాలో శివ స్నేహితుడిగా చేశాను. నిర్మాత రాజ్ కందుకూరిగారు నన్ను కూడా తన కుమారుడు శివలానే చూసుకునే వారు. నేను హీరో కాకముందే నన్ను ఓ హీరోలా చూశారాయన. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’లోని ‘శివ ట్రాప్ ట్రాన్స్..’ పాట అద్భుతంగా ఉంది. ఈ సినిమాని అందరూ చూడాలి’’ అని హీరో సుహాస్ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ మూవీ మార్చి 1న విడుదల అవుతోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘శివ ట్రాప్ ట్రాన్స్..’ అనే పాటని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ లాంచ్ చేశారు. అనంతరం నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్కి సుహాస్ ముఖ్య అతిథిగా హాజరై, పాట రిలీజ్ చేశారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ పాటని కాలభైరవ పాడారు. ‘‘మా సినిమాని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు శివ కందుకూరి. ‘‘యునిక్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు పురుషోత్తం రాజ్. ‘‘మా మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు స్నేహాల్, శశిధర్, కార్తీక్. ఈ వేడుకలో దర్శకుడు విజయ్ కనకమేడల, హీరోయిన్ వర్ష బొల్లమ్మ, నిర్మాత రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల పాల్గొన్నారు. -
Utsavam Movie: ఆకట్టుకుంటున్న ‘ఫస్ట్ కిస్’ సాంగ్
రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాశ్ జంటగా నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ ప్రమోషన్స్ని ప్రారంభించారు మేకర్స్. ‘ఫస్ట్ కిస్..’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేసింది యూనిట్. చిత్ర సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల పాడారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఉత్సవం’ రూపొందింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ‘ఫస్ట్ కిస్..’ పాట యువతను ఆకట్టుకుంటుంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులందరూ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. -
డూడుం డుక్కుడుం బాగుంది
‘‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు–500143’ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాట బాగుంది. ఈ సాంగ్కి క్లాసికల్ టచ్ ఇవ్వడం బాగా నచ్చింది. ఈ సినిమాలోని ఇతర పాటలు ఎలా ఉంటాయో అని ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం తప్పకుండా మ్యూజికల్ హిట్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ అన్నారు. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు– 500143’. కొవ్వూరి అరుణ సమర్పణలో బ్లాక్ యాంట్ పిక్చర్స్పై భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఈ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘డూడుం డుక్కుడుం..’ పాటని జీవీ ప్రకాశ్ కుమార్ విడుదల చేశారు. శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు. ఈ చిత్రానికి కెమెరా: నిఖిల్ సురేంద్రన్, నేపథ్య సంగీతం: కమ్రాన్. -
‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రంలోని ‘అరెరె అరెరె..’ పాట.
‘ఎగిరెనే ఎగిరెనే అటు ఇటు మనసే..’ అంటూ మొదలవుతుంది ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రంలోని ‘అరెరె అరెరె..’ పాట. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఇది. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మిస్తున్నారు. కాగా ‘అరెరె అరెరె..’ పాట లిరికల్ వీడియోను సంగీతదర్శకుడు తమన్ విడుదల చేశారు. ఆర్.ఆర్. ధ్రువన్ స్వరపరచిన ఈ పాటను రఘురామ్ రాయగా, కపిల్ కపిలన్ పాడారు. ‘‘అరెరె అరెరె...’ పాటలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ధ్రువన్ మల్టీ టాలెంటెడ్. తను పాటల రచయితగా, సింగర్గా నాకు తెలుసు. ఈ చిత్రంతో అతను సంగీతదర్శకుడిగా మారడాన్ని నమ్మలేకపోతున్నాను’’ అన్నారు తమన్. ‘‘నలుగురి స్నేహితుల కథే ఈ చిత్రం’’ అన్నారు విక్రమ్రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధ్రువన్, వసంత్. జి. -
ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రజాకార్’. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ సినిమాలోని ‘పోతుగడ్డ మీద..’ పాటను విడుదల చేశారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘భీమ్స్గారి సంగీతం, సుద్దాల అశోక్తేజగారి సాహిత్యంలో ఏదో తెలియని భావోద్వేగం ఉంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా మేం అంతే భావోద్వేగానికి లోనయ్యాం’’ అన్నారు. ‘‘సుద్దాల అశోక్తేజ, భీమ్స్గార్లు ఊరికే ఎమోషన్ కాలేదు. మా పూర్వీకుల చరిత్రలో అంతటి ఆవేదన నిండి ఉంది. భీమ్స్గారు పాడిన పాట వింటే పోతుగడ్డ మీద పుట్టిన భూమి బిడ్డల ఆత్మ ఘోషిస్తున్నట్లు ఉంటుంది’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘సుద్దాల హనుమంత, జానకమ్మల బిడ్డను కాకుంటే నా పాటలో ఇంత ఎమోషన్ ఉండేది కాదు. రజాకార్ ఉద్యమంలో మా అమ్మా నాన్న పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం వారు నైజాంకు వ్యతిరేకంగా పోరాడారు. రజాకార్ ఉద్యమంలో ్రపాణాలు కోల్పోయిన కమ్యూనిటీ నుంచి వచ్చిన భీమ్స్ ఉండటం నాకు కలిసొచ్చింది. ఈ తరహా సినిమా తీయాలంటే డబ్బులు ఉంటే సరిపోదు.. ధైర్యం కావాలి. ఆ ధైర్యం గూడూరు నారాయణరెడ్డికి ఉంది’’ అన్నారు సుద్దాల అశోక్తేజ. ‘‘మా తాతగారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ సమాజం ఎంత కష్టానికి గురైందో, ఎన్ని కన్నీళ్లను చూసిందో... వారందరి స్వరాలకు నేను స్వరాన్ని సమకూర్చానని చె΄్పాలి’’ అన్నారు భీమ్స్ సిసిరోలియో. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుష్య త్రిపాఠి, కొరియోగ్రాఫర్ స్వర్ణ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ పోతిరెడ్డి అంజిరెడ్డి పాల్గొన్నారు. -
అన్నదమ్ముల మధ్య ఈగోలు ఉండకూడదు: మంచు మనోజ్
సంపూర్ణేష్ బాబు, సంజోష్,ప్రాచీబంసాల్, ఆరతి గుప్త ప్రధాన తారాగణంగా మన్ మోహన్ మైనంపల్లి దర్శకత్వంలో చంద్ర చాంగల నిర్మిస్తున్న చిత్రం ‘సోదరా’. ఈ సినిమాలోని ‘అన్నంటే దోస్తే సోదరా.. సీక్రేట్సే లేవురా..చిన్నోడై పుడితే సోదరా.. జన్మంత జాతర’ అంటూ సాగేపాటను హీరో మంచు మనోజ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘అన్నదమ్ముల మధ్య ఈగోలు, డబ్బు సమస్యలు ఉండకూడదు. హ్యూమన్స్ ఎమోషన్స్ నేపథ్యంలో ‘సోదర’ సినిమా తీయడం నాకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మంచు మనోజ్ నన్ను ఓ సొంత సోదరుడిలా భావించి, ఈ సాంగ్ ఈవెంట్కు వచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు సంపూర్ణేష్బాబు. ‘‘అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు మన్ మోహన్. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సంజోష్, చంద్ర చగంలా. ఈ సినిమాకు సంగీతం: సునీల్ కశ్యప్. -
నాకు డ్యాన్స్ చేయాలనిపించింది
‘‘బబుల్గమ్’ సినిమాలోని ‘ఇజ్జత్..’పాట చాలా హుషారుగా అనిపించింది. శ్రీచరణ్ పాకాల చక్కని సంగీతం అందించారు. ‘ఇజ్జత్..’ అనే ర్యాప్ సాంగ్లో రోషన్తో కలసి డ్యాన్స్ చేయాలనిపించింది. ప్రతి క్లబ్, పబ్, యూత్ వేడుకల్లో ఈ పాట మార్మోగుతుంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. రోషన్ కనకాల, మానస చౌదరి జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన చిత్రం ‘బబుల్గమ్’. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఇజ్జత్..’ పాటను చిరంజీవి రిలీజ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాటకి ఎం.ఎస్. హరి సాహిత్యం అందించగా, రోషన్ కనకాల, ఎం.ఎస్. హరి పాడారు. -
నాలాంటి స్టూడెంట్స్కి సహాయం చేయాలి!
‘‘ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ‘సైంధవ్’ నా 75వ చిత్రం. యాక్షన్, భావోద్వేగాలు చాలా అద్భుతంగా వచ్చాయి. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీతో కలిసి అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. చిత్ర సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రాంగ్ యూసేజ్..’ అంటూ సాగే తొలిపాటని సీఎంఆర్ గ్రూప్ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈపాటను నకాష్ అజీజ్పాడారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘కళాశాల దశలో నేను బ్యాక్ బెంచర్ని. ఇప్పుడున్న నాలాంటి విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ విద్యార్థులు, అధ్యాపకులు సహకారం అందించాలి. 35 ఏళ్లుగా నా సినీ జర్నీ కొనసాగుతోంది. నా మొదటి చిత్రం విడుదల అప్పటినుంచి ఇప్పుడున్న యువత తల్లిదండ్రులు నన్ను ఆదరిస్తున్నారు. ఇప్పుడు యువత ఆదరిస్తున్నారు. ఈ తరం వారిని కూడా నా సినిమాలు రీచ్ అవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
అలుపెరుగని కలం యోధుడా...
ప్రముఖ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితం ఆధారంగా రూ΄÷ందిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాళోజీ పాత్రలో మూల విరాట్ నటించారు. విజయలక్ష్మి జైనీ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. యస్యస్ ఆత్రేయ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అలుపెరుగని అవిశ్రాంత కలం యోధుడా...’ పాటను నిర్మాత డి. సురేష్ బాబు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ పాట చాలా బాగుంది. ఇలాంటి వీరుల కథతో సినిమా తీసిన విజయలక్ష్మి, ప్రభాకర్లకు అభినందనలు’’ అన్నారు. ‘‘ప్రజా ఉద్యమ నాయకుడైన కాళోజీగారి బయోపిక్ తీసినందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు. ఇకపైనా ఇలాంటి గొప్ప వ్యక్తుల సినిమాలు తీసేందుకు ప్రేక్షకుల ్ర΄ోత్సాహం కావాలి’’ అన్నారు ప్రభాకర్ జైనీ. ‘‘ఇలాంటి మంచి సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు బిక్కి కృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్ నీర్ల, నేపథ్య సంగీతం: మల్లిక్ యంవీకే. -
సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ సినిమా సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
'ఆదికేశవ'సాంగ్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
నాపై నాకు నమ్మకం వచ్చింది
‘‘జిగర్తాండ డబుల్ ఎక్స్’లో నాకు మేకప్ వాడలేదు. మేకప్ లేకుంటే బాగుండనేమో? అనుకున్నాను. కానీ, స్క్రీన్పై చూసుకున్నాక నా మీద నాకు నమ్మకం ఏర్పడింది’’ అన్నారు రాఘవా లారెన్స్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమాలోని ‘కోరమీసం..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’లో నేను చేయాల్సింది.. కానీ, కుదర్లేదు. ఆ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్కు జాతీయ అవార్డు వచ్చింది. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ కోసం ఓ ఊర్లో రోడ్డు, బ్రిడ్జి నిర్మించారు మా నిర్మాత. ఆయన మంచి మనసు కోసమైనా ఈ చిత్రం బాగా ఆడాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పండగలా ఉంటుంది’’ అన్నారు కార్తికేయన్. ‘‘జిగర్తాండ’ కంటే డబుల్ ఎక్స్ రేంజ్లో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. ‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం’’ అన్నారు ఎస్జే సూర్య. -
నేడు ‘బహుజన బతుకమ్మ’ పాటల ఆవిష్కరణ: విమలక్క
సాక్షి, హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ఏసీఎఫ్) రూపొందించిన ‘పూసే పూల కవాతు’, ‘రావె రావె బతుకమ్మ రావే’అనే పాటల వీడియోలను ఆదివారం(నేడు) ఉదయం 10 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్లో ఆవిష్కరిస్తామని ప్రజాగాయకురాలు విమలక్క తెలిపారు. 13 ఏళ్లుగా నిర్వహిస్తున్న బహుజన బతుకమ్మను ఈ ఏడాది ‘మద్యం రద్దు– మగువల రక్షణ’అనే అంశంపై ప్రకృతి పూల కవాతుగా నిర్ణయించినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పండుగ ఈ నెల 13న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదలై 22న ఖమ్మం జిల్లా ముదిగొండలో ముగుస్తుందని విమలక్క వెల్లడించారు. -
'సగిలేటి కథ' నుంచి 'చికెన్ సాంగ్' లాంచ్
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకుడు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలరిస్తుంది. తాజాగా ఓ క్రేజీ గీతాన్ని విడుదల చేశారు. (ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత) హీరో నవదీప్ ఆధ్వర్యంలో తెలుగు యంగ్ డైరెక్టర్స్ 'బేబీ' ఫేమ్ సాయి రాజేశ్, వెంకటేష్ మహా, సందీప్ రాజ్.. ఈ సాంగ్ లాంచ్కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో రోషం రాజు క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని, అలానే ఈ మూవీలో కామెడీ అందరిని నవ్విస్తుందని, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతిఒక్కరికీ చికెన్ తినాలనిపిస్తుందని నవదీప్ చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది. (ఇదీ చదవండి: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ) -
‘జోరుగా హుషారుగా’ విరాజ్ అశ్విన్
‘ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ’ అంటూ ‘జోరుగా హుషారుగా..’ చిత్రంలోని ‘యువరాణి’ పాట సాగుతుంది. విరాజ్ అశ్విన్, పూజితా పొన్నాడ జంటగా అనుప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘యువరాణి యువరాణి నువ్వు..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేసి, ‘‘ఈ సినిమా ఓ జెన్యూన్ లవ్స్టోరీలా అనిపిస్తోంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రణీత్ స్వరపరచిన ‘యువరాణి’ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా అమ్రాన్ మాలిక్, నవ్య సమీర పాడారు. ‘‘త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. -
రొమాంటిక్ సాంగ్.. స్టేజీపైనే రెచ్చిపోయారు!
సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు దర్శకనిర్మాతలు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏం చేయడానికైనా సరే వెనకాడట్లేదు. ఒకప్పడు ఈవెంట్ ఏర్పాటు చేసి సినిమా గురించి పబ్లిసిటీ చేసేవాళ్లు. ఇప్పుడు కాలేజీల్లో సాంగ్ రిలీజ్ లాంటివి చేస్తున్నారు. అలా విశ్వక్ సేన్ కొత్త మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లోని పాటని తాజాగా రిలీజ్ చేశారు. అయితే విశ్వక్-నేహా స్టేజీపై ఈ సాంగ్కి డ్యాన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?) 'సుట్టంలా సూసి' అనే రొమాంటిక్ సాంగ్ తాజాగా హైదరాబాద్లోని ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో హీరోహీరోయిన్ విశ్వక్ సేన్, నేహాశెట్టితోపాటు చిత్రబృందం అంతా పాల్గొంది. అయితే ఈ పాటకు స్టేజీపై డ్యాన్స్ చేసిన విశ్వక్-సేన్.. సినిమాలో ఏ స్టెప్పులైతే ఉన్నాయో.. వాటినే రీక్రియేట్ చేశారు. నేహా చీరని విశ్వక్ నోటితో పట్టుకుని వేసిన స్టెప్ అయితే అక్కడున్న వారందరినీ అవాక్కయ్యేలా చేసింది. గోదావరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న పీరియాడికల్ సినిమా ఇది. క్రూరమైన, నేరపూరితమైన చీకటి సామ్రాజ్యంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కథ ఈ చిత్రం. ఈ సినిమాని చైతన్య కృష్ణ దర్శకుడు కాగా, యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. డిసెంబరు 8న థియేటర్లలోకి ఈ మూవీని తీసుకురానున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) -
సాయిధరమ్ తేజ్ ‘ది సోల్ ఆఫ్ సత్య’ సాంగ్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మిస్టర్ ప్రెగ్నెంట్.. అంతా ఉల్టా పల్టా
సయ్యద్ సోహైల్ రియాన్, రూపాకొడవాయుర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కానుంది. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘ఉల్టా పల్టా..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వింజనంపాటి మాట్లాడుతూ – ‘‘అమ్మతనం బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ రాశాను. సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి జాగ్రత్తగా రూ΄÷ందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నా సిస్టర్స్ ఇద్దరు ప్రెగ్నెంట్. వాళ్లను చూసి ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నాను’’ అన్నారు సోహైల్. ‘‘పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ చూసి, మంచి సినిమా చేశారని ప్రశంసించారు’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘యూఎస్లో 100 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వెంకట్ అన్నపరెడ్డి. ‘‘అప్పిరెడ్డి జడ్జిమెంట్ మీద నమ్మకంతో ఈ సినిమా చేశాం’’ అన్నారు రవీందర్ రెడ్డి సజ్జల. -
చందమామ కథలోన..
రక్షిత్ అట్లూరి, సంకీర్తన విపిన్ జంటగా వెంకట సత్య దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘చందమామ కథలోన..’ పాట లిరికల్ వీడియోను దర్శకుడు కె. రాఘవేంద్ర రావు విడుదల చేసి, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘చందమామ కథలోన.. అందమైన పిల్లేనా.. కళ్ల ముందు వాలిందా.. తుళ్లి తుళ్లి పడ్డాన..’ అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా హరి చరణ్, గీతా మాధురి పాడారు. శరవణ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి. -
శ్రీలీల.. డేంజర్ పిల్లా!
‘అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా.., ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా.., డేంజర్ పిల్లా..’ అని పాడుతున్నారు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్– ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘డేంజర్ పిల్లా..’ పాటను బుధవారం రిలీజ్ చేశారు. ఈ పాటను కృష్ణకాంత్ రాయగా అర్మాన్ మాలిక్ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. -
‘చచ్చినా చావని ప్రేమిది’ సాంగ్ క్యాచీగా ఉంది
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సందేహం’.‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా నుంచి మేకర్స్ ‘చచ్చినా చావని ప్రేమిది’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజైంది. ఈ కార్యక్రమంలో దశరథ్తో పాటు మన చౌదరి, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ సతీష్ పరమదేవగారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో రానున్న ‘సందేహం’ మూవీ లిరికల్ సాంగ్ను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పూర్ణాచారిగారు పాటను అద్భుతంగా రాశారు. పాట వింటుంటే చాలా క్యాచీగా ఉంది’ అన్నారు. ‘టీమ్ అంతా ఎంతో కష్టపడి అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని మన చౌదరి అన్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం ఈ చిత్రంలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు. -
‘రాజంపేట రాణి'పాట బాగుంది: శేఖర్ మాస్టర్
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజపుత్ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రాజంపేట రాణిని అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శేఖర్ మాస్టర్ విడుదల చేసారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. శాంతి స్వరూప్ సాహిత్యం అందించిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్గా శాంతి కుమార్ అందిరికీ పరిచయమే. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి సినివుమా దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ చిత్రంలోని ‘రాజంపేట రాణిని’ అంటూ సాగే మాస్ బీట్ పాటను చూశా. సంగీతం, కొరియోగ్రఫీ చాలా బావుంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. జబర్దస్త్ నుంచి వెళ్లిన వేణు ‘బలగం’ చిత్రంతో పెద్ద పేరు తెచ్చుకున్నాడు శాంతి కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ ‘జబర్దస్త్ కమెడీయన్గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాటలు , పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. శేఖర్ మాస్టర్ ఈ మాస్ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు. -
పల్లెటూరి వినోదం
తెలంగాణ నేపథ్యంలో రూపొందిన పల్లె కథా చిత్రం ‘తురుమ్ ఖాన్లు’. శివ కల్యాణ్ దర్శకత్వంలో ఎండీ ఆసిఫ్ జానీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని ‘రంగు రంగుల చిలక...’ అంటూ సాగే తొలి పాటను దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు. ‘‘పల్లెటూరి పగ, ప్రతీకారాలతో వినోదాత్మకంగా, మహబూబ్ నగర్ స్లాంగ్లో రూపొందిన చిత్రం ఇది’’ అని యూనిట్ తెలిపింది. నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, రియాన్. ∙ఆసిఫ్ జానీ, నక్కిన త్రినాథరావు, శ్రీరామ్ -
హారర్ సినిమాలు చేయకూడదనుకున్నా
‘‘హారర్ చిత్రాల్లో నటించకూడదనుకున్నాను. కానీ ‘ఓ మంచి ఘోస్ట్’ సినిమా కథ నచ్చడంతో చేశాను. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని హీరోయిన్ నందితా శ్వేత అన్నారు. శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో నందితా శ్వేత, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. అభినిక ఐనాభాతుని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘పాప నువ్వు తోపు..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సింహాచలం లిరిక్స్ అందించిన ఈ పాటను బాలసూరన్న పాడారు. ఈ పాట విడుదల వేడుకలో శంకర్ మార్తాండ్ మాట్లాడుతూ–‘‘హారర్ అండ్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. హారర్ కథలకు మ్యూజిక్ చాలా ముఖ్యం.. అనూప్గారు ప్రాణం పెట్టి ఈ సినిమాకు సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘ఓ పాప నువ్వు తోపు..’ పాట ఆకట్టుకుంటుంది’’ అన్నారు అనూప్ రూబెన్స్. -
గుండెల్లో మోగిందే నీ కబురే!
నిఖిల్, ఐశ్వర్యా మీనన్ జంటగా ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘‘మొదటిసారిగా చూపు తగిలే... గుండెల్లో మోగిందే నీ తొలి కబురే, జుమ్ జుమ్మనే గుండెల్లోన యుద్ధాలే.. సిద్ధంగా ఉంచా నీకే ఏడుజన్మలే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్రయూనిట్ ఆదివారం విడుదల చేసింది. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా పాడారు. స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్. -
ఇప్పుడే పరిచయమే...
శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మను చరిత్ర’. ఈ మూవీతో భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్.శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఇప్పుడే పరిచయమే...’ పాటని హీరోయిన్ సంయుక్త మీనన్ లాంచ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, ఆర్మాన్ మాలిక్ పాడారు. -
నీలా.. నన్నిలా..
సాహస్, దీపిక జంటగా చైతు మాదాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘7:11’. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నీలా.. నన్నిలా...’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. గ్యానీ స్వర పరచిన ఈ మెలోడీ సాంగ్కు మణి దీపక్ కడిమిశెట్టి సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. ‘‘ఇది టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ క్రైమ్ డ్రామా. 1999లో ఒక ముఖ్యమైన రోజున భవిష్యత్తులో 400 సంవత్సరాలలో వేరే గ్రహం నుండి మానవుల మనుగడకు సంబంధించిన కీలకమైన సమాధానాల కోసం ‘హంసలదీవి’ అనే చిన్న ఇండియన్ టౌన్కి చేరుకుంటారు. అదే రోజున ఆ టౌన్ని నాశనం చేయడానికి కొన్ని ఘటనలు జరుగుతాయి’’ అని యూనిట్ పేర్కొంది. -
బేబీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసిన స్టార్స్ (ఫొటోలు)
-
35 మంది కొత్తవారితో ‘మేమ్ ఫేమస్’
సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ పతాకాలపై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ సినిమా టీజర్, ‘అయ్యయయ్యో..’ పాటను ప్రదర్శించారు. అనంతరం ఈ చిత్ర హీరో, దర్శకుడు సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రమోషన్స్కు ప్రముఖ హీరోలంతా హెల్ప్ చేస్తుండటంతో నాకు మంచి పేరు వచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘18 ఏళ్ళకే టిక్ టాక్లు చేసిన సుమంత్ 23 ఏళ్ళకే డెరైక్టర్ అయ్యాడు. అంతా యూత్ చేసిన సినిమా ఇది. ఆడియన్స్కు నచ్చుతుంది’’ అన్నారు అనురాగ్ రెడ్డి. ‘‘ఈ సినిమాతో 30 మందికిపైగా నటీనటులను పరిచయం చేయడం గర్వంగా వుంది’’ అన్నారు ‘లహరి ఫిలింస్’ చంద్రు మనోహర్. ‘‘వైజాగ్లో అన్నపూర్ణ స్టూడియోస్, రెండు రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల్లో గీతా ఆర్ట్స్, ఓవర్సీస్లో సరిగమల ద్వారా మా సినిమా విడుదలవుతుంది’’ అన్నారు శరత్ చంద్ర. -
అన్నీ మంచి శకునములే హాయినిస్తుంది
‘‘రాఘవేంద్రరావు, అశ్వినీదత్గార్లతో నాది 30 ఏళ్లు పైబడిన స్నేహం. స్వప్న, ప్రియాంక నా కూతుళ్లులాంటివారు. నేను, దత్గారు యాభై ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ ఇవాళ మా పిల్లల వల్ల ఇంకా ఎక్కువ షైన్ అవుతున్నాం. ‘అన్నీ మంచి శకునములే’ మనందరికీ హాయి ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్. అన్నారు. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెయ్యి చెయ్యి కలిపేద్దాం..’ అంటూ సాగే నాలుగో పాటను డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీ కృష్ణ, వేణు శ్రీరంగం, సందీప్, చైత్ర అంబడిపూడి పాడగా, బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘అన్నీ మంచి శకునములే’ మూవీ ‘పెళ్లి సందడి’ అంత పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు ‘‘రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్గార్లు నాకు మంచి శకునం’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘చిన్నప్పటినుంచి ఈ ముగ్గుర్ని (రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్) చూస్తూ పెరిగాం.. వీరిని ఒకే వేదికపై చూడటం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు ప్రియాంకా దత్, స్వ΄్నా దత్. -
‘అన్నీ మంచి శకునములే’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు చూడరు
‘‘ప్రేక్షకులకు విజయవంతమైన సినిమా ఇవ్వడం అంత తేలిక కాదు. ‘బలగం, దసరా, విరూ పాక్ష’.. ఇలా కొత్తదనంతో నూతన దర్శకులు తీసిన చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయి. కొత్తదనం లేని సినిమాలు చూడటానికి రెడీగా లేరు.. అది ఇవ్వడానికి రాత్రీపగలు కష్టపడాల్సిందే’’ అన్నారు ‘దిల్’ రాజు. ఆశిష్, ఇవానా జంటగా కాశీ విశాల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సెల్ఫిష్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్పై ‘దిల్’ రాజు–శిరీష్ నిర్మిస్తున్నారు. ఆశిష్ పుట్టినరోజు (మే 1)ని పురస్కరించుకుని ‘సెల్ఫిష్’లోని ‘దిల్ ఖుష్..’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. మిక్కీ జె. మేయర్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, జావేద్ అలీ పాడారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను, సుకుమార్ సపోర్ట్గా ఉంటాం. కానీ, ప్రేక్షకులకు నచ్చాల్సింది మాత్రం ఆశిష్. దాని కోసం తను కష్టపడాలి’’ అన్నారు. ‘‘సెల్ఫిష్’ కోసం నేను, కాశీ ప్రాణం పెట్టి కష్టపడుతున్నాం’’ అన్నారు ఆశిష్. ‘‘మాస్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది’’ అన్నారు విశాల్ కాశీ. ఈ చిత్రానికి సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ బండ్రెడ్డి. -
గోపీచంద్ కి దిష్టి తీయాలి..
-
లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ కొడుతున్నాం
-
కర్నూలులో రామబాణం సాంగ్ రిలీజ్.. గోపీచంద్కు పూలమాలతో సత్కారం (ఫొటోలు)
-
నాందిలా ఉగ్రంని హిట్ చేయాలి
‘‘ఉగ్రం’ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన సాహు, హరీష్గార్లకు థ్యాంక్స్. నా కెరీర్లో అత్యధిక బడ్జెట్తో రూపొందిన చిత్రమిది. వేసవిలో మీ ముందుకు వస్తోంది. విజయ్, నా కాంబినేషన్లో వచ్చిన ‘నాంది’ మూవీని హిట్ చేసినట్టు ‘ఉగ్రం’ని కూడా పెద్ద హిట్ చేయాలి’’ అని హీరో ‘అల్లరి’ నరేష్ అన్నారు. ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేష్, మీర్నా మీనన్ జంటగా రూపొందిన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘దేవేరి..’ అంటూ సాగే పాటను హైదరాబాద్లో విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. విజయ్ కనకమేడల మాట్లాడుతూ– ‘‘నరేష్గారి కెరీర్లో ‘ఉగ్రం’ మరో వైవిధ్యమైన సినిమా అవుతుంది. శ్రీచరణ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో మీర్నా మీనన్, శ్రీచరణ్ పాకాల, సాహు గారపాటి, హరీష్ పెద్ది తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్. -
రాహుల్ సిప్లిగంజ్ పాడిన బుల్..బుల్.. సాంగ్ విన్నారా?
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘బుల్ బుల్ అన్స్టాపబుల్..’ అనే తొలి పాటని హీరో గోపీచంద్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్తో కలసి భీమ్స్ పాడారు. ‘‘ఈ పాటలో సన్నీ, సప్తగిరి మాస్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
‘నువ్వే కావాలి అమ్మ’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వాలంటైన్స్ డే స్పెషల్: వినరో భాగ్యము విష్ణు కథ నుంచి లవ్ ట్రాక్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఇవాళ(ఫిబ్రవరి 14న)'వాలెంటైన్స్ డే' సందర్భంగా ఈ సినిమా నుంచి లవ్ట్రాక్ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. 'ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే..’ అంటూ సాగే ఈ పాటకు సాగుతోంది. హీరోయిన్ వెంట పడుతూ హీరో పాడే పాట ఇది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కాగా ఈ చిత్రంలో మురళీశర్మ, శుభలేఖ సుధాకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. -
వాలంటైన్స్ డే: శాకుంతలం చిత్రం నుంచి మరో మెలోడీ సాంగ్
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణ శేఖర్ పౌరాణిక ప్రేమ కావ్యంగా శాకుంతలంను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టిజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శాకుంతలం పాటలు అయితే యూట్యూబ్లో ట్రెండింగ్ జాబితాలో నిలిచాయి. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం మరో మెలోడీ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘మధుర గతమా..’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. శ్రీమని సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. కాగా ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సమంత లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించాడు. అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ భరతుడి పాత్ర పోషించగా.. ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాలలు కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శాకుంతం మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
వాలంటైన్స్ డే స్పెషల్: తెలుసా మనసా నుంచి మెలోడీ సాంగ్
‘కేరింత’ ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెలుసా మనసా. డెబ్యూ డైరెక్టర్ వైభవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జష్విక హీరోయిన్గా నటిస్తోంది. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్స్టోరిగా ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్పై వర్షా ముండాడ, మాధవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మెలోడీ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ ఈ పాటను తాజాగా లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాటాడుతూ.. ఈ పాట విన్నానని, చాలా బాగుందన్నారు. న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్స్టోరిగా వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపారు. ‘మనసు మనసుతో..’ అంటూ మెలోడియస్గా సాగే ఈ పాట సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోసారి ఈ పాటలో ఆయన తనదైన మార్క్ చూపించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా.. నిజమైన ప్రేమలోని లోతును ఆవిష్కరించేలా, హృదయానికి హత్తుకునేలా ఉంది ఈ పాట. వనమాలి రాసిన ఈ పాటను శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు. ప్రసాద్ ఈదర సినిమాటోగ్రఫీ ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. -
కల్యాణ్ రామ్ అమిగోస్ నుంచి సెకండ్ సింగిల్, బాలయ్య హిట్ సాంగ్కు రీమిక్స్
బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్, పాటలు సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మా’ పాటలను రిలీజ్ చేశారు మేకర్స్. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్కు ఇది రీమిక్స్. గతంలో బాలయ్య నటించిన 'ధర్మక్షేత్రం' సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను దివంగత లెజెండరి సింగర్ బాలు - చిత్ర ఆలపించారు. అదే పాటలను అమిగోస్లో రిమేక్ చేయించాడు కల్యాణ్ రామ్. గిబ్రాన్ సింగీతం అందించిన ఈ పాటను ఎస్పీ చరణ్-సమీరా భరద్వాజ్లు ఆలపించారు. కాగా ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. Evergreen Romantic Melody is here❤️#EnnoRatrulosthayi Full Video Song from #Amigos out now 🕺💃 - https://t.co/foMaW1GPNB#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial #SriVeturi #SpbCharan #SameeraBharadwaj @adityamusic pic.twitter.com/ouc4OQHVmI — Mythri Movie Makers (@MythriOfficial) January 31, 2023 -
శాకుంతలం ఫస్ట్ సింగిల్ రిలీజ్, ఆకట్టుకుంటున్న మెలోడి సాంగ్
మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘మల్లికా మల్లికా మాలతీ మాలికా.. చూడవా చూడవా ఏడి నా ఏలిక’ అంటూ సాగే పాటను బుధవారం విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ రాసిన ఈ పాటను రమ్య బెహ్రా పాడారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. -
బ్లాక్ బస్టర్.. రాసిపెట్టుకోండి
‘‘వీరసింహా రెడ్డి’కి తమన్ అత్యద్భుతమైన పాటలు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రిగారు రాశారు. ‘మాస్ మొగుడు..’ చివర్లో తీసిన పాట. అప్పుడు మా కెమెరామేన్ రిషి పంజాబీ డిఐ వర్క్లో వుండటం వలన నా ‘క్రాక్’ సినిమా కెమెరామేన్ జీకే విష్ణు ఈ పాటని చేశారు. బాలయ్యబాబుని చాలా కలర్ఫుల్గా చూపించారు’’ అన్నారు గోపీచంద్ మలినేని. నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతీహాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రంలోని ‘మాస్ మొగుడు..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తమన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మనో, రమ్య బెహరా ఆలపించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ– ‘‘ఇటీవల ఒంగోలులో జరిగిన వేడుకలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో మామూలుగా ఉండదు. ‘వీరసింహా రెడ్డి’ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్... రాసిపెట్టుకోండి’’ అన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘నేను బాల కృష్ణగారికి అభిమానిని. ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ రాసే చాన్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనికి, మైత్రీ మూవీ మేకర్స్కి కృతజ్ఞతలు. అన్ని పాటలూ అద్భుతంగా ఉంటాయి. బాలకృష్ణగారి మార్క్ ఫైర్ బ్రాండ్ సినిమా ఇది’’ అన్నారు. -
వాల్తేరు వీరయ్య: పూనకాలు లోడింగ్ సాంగ్ లాంచ్ ఈవెంట్(ఫొటోలు)
-
వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్, గొంతు కలిపిన చిరు, రవితేజ
మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చదవండి: బాలయ్య ‘అన్స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! ప్రస్తుతం యూట్యూబ్లో ఈ సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే మరో మాస్ సాంగ్ను వదిలారు మేకర్స్. ‘డొంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్’ అంటూ సాగే ఈ పాటను రామ్ మిర్యాల, రోల్రైడాలు ఆలపించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అంతేకాదు మధ్య మధ్యలో చిరు, రవితేజలు కూడా ఈ పాటకు తమ గొంతు కలపడమే కాదు కలిసి స్టెప్పులు కూడా వేశారు. దీంతో ఒకే ఫ్రేంలో చిరు, రవితేజను చూస్తుంటే మెగా, మాస్ మహారాజ ఫ్యాన్స్కి నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంది. చదవండి: రొమాంటిక్ సీన్స్లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు -
సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ అప్పుడే!
సందీప్ కిషన్, దివ్యాంశా కౌశిక్ ‘నువ్వుంటే చాలు...’ అని ప్రేమ పాట పాడుకున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మైఖేల్’ చిత్రంలోని పాట ఇది. సినిమాలోని ఈ తొలి పాటను ఈ 28న విడుదల చేయనున్నారు. ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించి, పాటలోని ఓ పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. రంజిత్ జయకొడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పితో కలిసి డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పకులు. ‘‘సందీప్ కిషన్కి తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ సినిమా కోసం సందీప్ అద్భుతంగా మేకోవర్ అయ్యారు. సామ్ సీఎస్ మంచి పాటలు ఇచ్చారు. రొమాంటిక్ సాంగ్ ‘నువ్వుంటే చాలు..’ని తెలుగు, తమిళ భాషల్లో ఈ 28న విడుదల చేయనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్గా నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: కె. సాంబశివరావు. -
18 పేజెస్’ సినిమా ఒక సాధారణ లవ్స్టోరీ కాదు..: అల్లు అరవింద్
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '18 పేజిస్'. ఈ సినిమాను జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని 'ఏడురంగుల వాన' అనే పాటను తాజాగా చిత్రం విడుదల చేసింది. ‘ఏడు రంగులు వాన.. రెండు కళ్ళల్లోన.. కారణం ఎవరంటే..’ అంటూ సాగే ఈ పాట ఆదివారం అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. సిద్ శ్రీ రామ్ ఆలపించాడు. ఈ సాంగ్ రిలీజ్ చేసిన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘గత నాలుగు నెలలుగా.. నెలకొక సినిమా రిలీజ్ చేస్తున్నా. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు,సపోర్ట్ చేస్తున్న మీడియాకు మా ధన్యవాదాలు. సుకుమార్ నాతో ఒక విచిత్రమైన లవ్స్టోరీ చేద్దామని చెప్పడంతో వాసు కూడా తెగ సంబరపడిపోయాడు. మేం తీసిన ‘18 పేజెస్’ సినిమా ఒక సాధారణ మైన లవ్స్టోరీ కాదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. గోపి గారు ఇప్పటి వరకు మా బ్యానర్లో ఏడు సినిమాలు చేశారు. అవన్నీ మ్యూజికల్గా బిగ్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని అన్నారు. ఇక నిఖిల్ చాలా డెడికేటెడ్గా వర్క్ చేశాడన్నారు. ఇక అనుపమ నటన చాలా న్చాచురల్గా ఉంటుందని, అందుకే అనుపమ అంటే తనకు ఇష్టమని అల్లు అరవింద్ పేర్కొన్నారు. -
సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో మునిగిపోయిన బాలీవుడ్ జంట
బాలీవుడ్ ప్రేమజంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె నటనతో ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో ఈ ప్రేమజంట రెచ్చిపోయింది. ఓ సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో వేదికపైనే ముద్దుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె జంటగా తాజాగా నటించిన చిత్రం 'సర్కస్'. తాజాగా ఈ చిత్రంలోని 'కరెంట్ లగా రే' అనే పాటను ముంబయిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ పవర్ కపుల్స్ వారి ప్రేమను ఆపుకోలేకపోయారు. వేదికపైనే ముద్దుల్లో మునిగితేలారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో దీపికా పదుకొణె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు జోడిగా 'ప్రాజెక్ట్ కె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. రోహిత్ శెట్టి మూవీ సర్కస్ విలియం షేక్స్పియర్ నాటకం ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో వరుణ్ శర్మ, పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సిద్ధార్థ జాదవ్, జానీ లివర్, సంజయ్ మిశ్రా, వ్రజేష్ హిర్జీ తదితరులు నటించారు. డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Sindhooram: ఆకట్టుకుంటున్న ‘ఓ మాదిరిగా సాగే నా జీవితం..’ సాంగ్
శివ బాలాజీ, ధర్మ , బ్రిగిడ సాగ(పవి టీచర్) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం సిందూరం. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట (ఆనందమో..అవేశమో)కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. "ఓ మాదిరిగా" అంటూ సాగే ఈ పాటను సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరుశురాం గారు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాట చాలా బాగుంది అని, హరి సంగీతం ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందని, సత్య ప్రకాష్, హరిణి చాలా బాగా పాడారని, బాలాజీ గారి సాహిత్యం బాగుందని, లీడ్ పెయిర్ బాగా యాక్ట్ చేశారని కొనియాడారు. మొదటి పాటకు వచ్చినట్టే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం తమకుందని డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి, ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి జంగా అన్నారు. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు. -
వైజాగ్ని వైవిధ్యంగా చూపించాను: ‘కొరమీను’ డైరెక్టర్
‘‘ఏ సినిమాకైనా కథే ముఖ్యం. ‘కొరమీను’కి ఆనంద్ రవిగారు మంచి కథ ఇచ్చారు. నేను పుట్టి పెరిగిన వైజాగ్ని ఈ చిత్రంలో వైవిధ్యంగా చూపించాను. సమన్య రెడ్డిలాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు శ్రీపతి కర్రి. ఆనంద్ రవి, కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరమీను’. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్లో ఓ పవర్ఫుల్ పోలీస్... ప్రధానంగా ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య ఈ చిత్రం సాగుతుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘తెలిసిందే లే..’ అనే పాటను ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ, సింగర్ సునీత విడుదల చేశారు. సమన్య రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆనంద్ రవిగారు కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘మీసాల రాజుకి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందింది’’ అన్నారు ఆనంద్ రవి. -
అబ్బా ఓ అబ్బాయా..
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, అనిత చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గీత సాక్షిగా..’. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పుష్పక్, జేబీహెచ్ఆర్ఎన్కేఎల్ సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ అనే పాటను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘పాట క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘గీత సాక్షిగా’. ఈ పాటకి రెహమాన్ సాహిత్యం అందించగా, సాహితీ చాగంటి పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ హనుమ నరిసేటి.