Summons
-
లాలూ, రబ్రీ, తేజ్ ప్రతాప్లకు ఈడీ సమన్లు
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)కు ఇప్పట్లో కష్టాలు తీరేలా కనిపించడంలేదు. లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసి, విచారణకు పిలిచింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భూమికి ప్రతిగా ఉద్యోగం కుంభకోణానికి సంబంధించిన కేసులో వారిని విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిని పట్నాలో విచారించనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు అతని భార్య రబ్రీ దేవి(Rabri Devi), పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ లకు ఈడీ సమన్లు జారీ చేసింది. మార్చి 19న లాలూ యాదవ్ను విచారణకు పిలిచారు. ఈ విచారణ పట్నా జోనల్ కార్యాలయంలో జరగనుంది. ‘భూమికి ప్రతిగా ఉద్యోగం’ కుంభకోణంపై లాలూను విచారించనున్నారు. ఈ ఉదంతంలో మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై గత ఏడాది ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఆయన కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్లతో పాటు మరికొందరిని కూడా నిందితులుగా చేర్చారు.ఇది కూడా చదవండి: దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి -
జుకర్బర్గ్ వ్యాఖ్యలు.. మెటాకు భారత్ సమన్లు
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్రం సమన్లు జారీ చేయనుంది. లోక్సభ ఎన్నికలపై ఆ సంస్థ బాస్ మార్క్ జుకర్బర్గ్ చేసిన ‘అసత్య ప్రచారపు’ వ్యాఖ్యలే అందుకు కారణం. గతేడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్బర్గ్ (Mark Zuckerberg) ఇటీవల ఓ పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించారు. అయితే.. జుకర్బర్గ్ చేసిన వాదనను భారత ప్రభుత్వం ఖండించింది. బీజేపీ ఎంపీ, ఐటీ & కమ్యూనికేషన్ పార్లమెంటరీ హౌజ్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దుబే మెటాకు సమన్లు పంపే విషయాన్ని ధృవీకరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకే సమన్లు అని ఎక్స్ వేదికగా తెలిపారాయన. मेरी कमिटि इस ग़लत जानकारी के लिए @Meta को बुलाएगी । किसी भी लोकतांत्रिक देश की ग़लत जानकारी देश की छवि को धूमिल करती है । इस गलती के लिए भारतीय संसद से तथा यहाँ की जनता से उस संस्था को माफ़ी माँगनी पड़ेगी https://t.co/HulRl1LF4z— Dr Nishikant Dubey (@nishikant_dubey) January 14, 2025ప్రజాస్వామ్య దేశం విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ తప్పునకు భారత దేశ ప్రజలకు, చట్ట సభ్యులకు క్షమాపణ చెప్పాల్సిందే అని దుబే ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అంతకు ముందు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో.. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కౌంటర్ బదులిచ్చారు.‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్-19 తర్వాత భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయి అని జుకర్బర్గ్ చెప్పడంలో వాస్తవం లేదు. .. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220కోట్ల వ్యాక్సిన్లు అందించడంతోపాటు కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోదీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయి’’ అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే జుకర్బర్గ్ అలా మాట్లాడటం నిరాశకు గురిచేసిందన్న అశ్వినీ వైష్ణవ్.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటాను టాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.జుకర్బర్గ్ ఏమన్నారంటే..జనవరి 10వ తేదీన ఓ పాడ్కాస్ట్లో జుకర్బర్గ్ మాట్లాడారు. 2024 సంవత్సరం భారీ ఎన్నికల సంవత్సరంగా నిలిచింది. ఉదాహరణగా.. భారత్తో సహా ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే అన్నిచోట్లా అక్కడి ప్రభుత్వాలు అక్కడ ఓడిపోయాయి. దీనికి కరోనాతో ఆయా ప్రభుత్వాలు డీల్ చేసిన విధానం.. అది దారితీసిన ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం అని అన్నారాయన. -
బంగ్లాదేశ్కు భారత్ కౌంటర్..రాయబారికి సమన్లు
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్(Bangladesh) నుంచి భారత్(India)లోకి చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దులో కంచె నిర్మాణంపై బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను బంగ్లాదేశ్ విదేశాంగశాఖ ఆదివారం పిలిచి వివరణ కోరింది.ఈ వ్యవహారంపై భారత్ కూడా ధీటుగా స్పందించింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నురల్ ఇస్లామ్కు విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది.దీంతో ఆయన సోమవారం(జనవరి13) విదేశాంగశాఖ కార్యాలయానికి చేరుకుని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.సరిహద్దులో అయిదుచోట్ల కంచెల ఏర్పాటుకు భారత్ ప్రయత్నిస్తోందని,ఇది రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్ ఇప్పటికే ఆరోపణలు చేసింది.ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ(Pranay Verma)కు బంగ్లాదేశ్ సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్కు వివరణ ఇచ్చిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ కంచెల విషయంలో రెండు దేశాల రక్షణ దళాలు బీఎస్ఎఫ్,బీజీబీ (బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్)లు ఓ అవగాహనతో ఉన్నాయన్నారు.సరిహద్దు వెంట నేరాల నియంత్రణకు ఈ అవగాహన కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
సరిహద్దుల్లో ఫెన్సింగ్ నిర్మాణం.. భారత హై కమిషనర్కు బంగ్లా సమన్లు
ఢాకా: రెండు దేశాల సరిహద్దుల్లోని ఐదు ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించిందంటూ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆదివారం ఢాకాలోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసింది. కంచె నిర్మాణం ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ప్రణయ్ వర్మ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి విదేశాంగ శాఖ కార్యదర్శి జషీముద్దీన్తో దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ బీఎస్ఎస్ తెలిపింది. ఈ పరిణామంపై అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సమావేశం అనంతరం హైకమిషనర్ వర్మ మీడియాతో మాట్లాడారు. ‘రెండు దేశాల సరిహద్దులను బీఎస్ఎఫ్, బీజీబీలు కాపలాకాస్తున్నాయి. ఈ రెండు విభాగాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి కూడా. సరిహద్దుల వెంట నేరాల కట్టడికి రెండు దేశాల మధ్య ఉన్న అంగీకారానికి అనుగుణంగా సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నాం’అని చెప్పారు. అంతకుముందు, బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి మీడియాతో మాట్లాడుతూ..ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దుల్లో భారత్ ఫెన్సింగ్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలను బంగ్లా జవాన్లు, స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. 1974లో కుదిరిన ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని చెప్పారు. -
6న విచారణకు రండి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ల రేస్లో కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కంటే ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్కు ఏసీబీ అధికారులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ను 11న, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈడీ కన్నా ముందే.. ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లించారంటూ ఏసీబీ కేసు నమోదు చేయడం, దాని ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేయడం తెలిసిందే. ఈ అంశంలో వేగంగా స్పందించిన ఈడీ ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు జారీ చేయగా.. అంతకంటే ఒకరోజు ముందే కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీ చర్యలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. అరెస్టు చేయకుండా హైకోర్టు ఊరటతో.. ఫార్ములా–ఈ రేసు నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు పీసీ యాక్ట్ 13(1) (ఏ), 13(2), ఐపీసీ 409, 120–బీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశా రు. ఇవన్నీ నాన్బెయిలబుల్ సెక్షన్లు. అయితే కేటీఆర్ తనపై నమోదైన కేసు కక్షపూరితమని, ఆ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. అయితే తుది తీర్పు వెలువడే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని, కేసు దర్యాప్తు చేసుకోవచ్చని ఏసీబీని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు కేటీఆర్కు సమన్లు జారీ చేశారు. అంతేకాదు ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్కుమార్లను కూడా ఈడీ కంటే ముందే ఏసీబీ విచారించనుండటం ఆసక్తికరంగా మారింది. పలు వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు రూ.54.88 కోట్లు బదిలీ చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఫిర్యాదుతో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషŒన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజిద్ అలీఖాన్న్డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. ఇప్పటికే దానకిశోర్ స్టేట్మెంట్ నమోదు చేయడంతోపాటు పలు కీలక వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగా ఆయా అంశాలపై కేటీఆర్ను, అధికారులను విచారించేందుకు సిద్ధమయ్యారు. న్యాయవాదులతో సమావేశమైన కేటీఆర్ ఏసీబీ సమన్ల నేపథ్యంలో కేటీఆర్ శుక్రవారం తన న్యాయవాదులతో సమావేశమైనట్టు తెలిసింది. వారి సూచనలు, సలహాల మేరకు ఏసీబీ సమన్లపై ఏ విధంగా స్పందించాలనే నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. శని లేదా ఆది వారం ఈ అంశంపై కేటీఆర్ స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవైపు తాము ఫార్మర్స్ (రైతుల) కోసం పోరాడుతుంటే.. ప్రభుత్వం ఫార్ములా–ఈ అంటూ వేధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సీఆర్టీల సమ్మె విరమణ సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్(సీఆర్టీ)లు సమ్మె విరమించారు. ఇరవై రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి లిఖితపూర్వకంగా తెలిపారు. శుక్రవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. సమ్మె చేస్తున్న సీఆర్టీలతో చర్చలు జరిపారు. సీఆర్టీల డిమాండ్లలో ఉద్యోగాల క్రమబద్దికరణ, మినిమం టైం స్కేల్ కేటగిరీలు మినహా మిగిలిన వాటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి వివరించారు. ప్రతినెలా ఐదో తేదీలోపు వేతన చెల్లింపులు, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, డెత్ బెనిఫిట్స్ మంజూరు చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఉద్యోగ క్రమబద్దికరణ, మినిమం టైం స్కేల్ డిమాండ్లపై ముఖ్యమంత్రితో చర్చించి మరోసారి సీఆర్టీలతో సమావేశమవుతామని ఆమె హామీ ఇచ్చారు. ఆదివాసీ, గిరిజన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వానికి సహకరించాలని సీఆర్టీలను కోరారు. సీఆర్టీల సర్వీసును రెన్యువల్ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఆర్టీలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
ఈ-కార్ రేస్ కేసులో అధికారులకు ఈడీ మళ్లీ సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఈ-కార్ రేస్ కేసులో అధికారులకు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరుకావాలని హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి, అరవింద్కుమార్లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే, నేడు ఈడీ విచారణకు వారు హాజరు కావాల్సి ఉండగా.. విచారణకు మరింత సమయం కావాలని ఈడీ అధికారులను కోరారు. దీంతో 8, 9 తేదీల్లో హాజరుకావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది.తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. రేపు ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు హాజరవనున్నారు. ఈనెల ఏడో తేదీన కేటీఆర్.. ఈడీ ఎదుట హాజరు కానున్నారు.ఈ కేసులో కేటీఆర్ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్-ఏ1, ఐఏఎస్ అరవింద్ కుమార్-ఏ2, బీఎల్ఎన్ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే, కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది. ఇందులో భాగంగానే ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ.55కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్ఈవోకు సంబంధించిన బదిలీలపై ఈడీ విచారించనుంది.ఇదీ చదవండి: రెండు రోజుల్లో సర్కార్ అవినీతి స్కాం బయటపెడతా: ఏలేటి మహేశ్వర్రెడ్డి -
రేపు కేటీఆర్కు ఈడీ నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులకు సమన్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు ఏ–2గా ఉన్న పురపాలకశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, ఏ–3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ సోమవారం సమన్లు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఏసీబీ నుంచి ఫార్ములా–ఈ కారు రేసు ఒప్పందాలకు సంబంధించి సేకరించిన పత్రాలు, ఎఫ్ఐఆర్తోపాటు బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. హెచ్ఎండీఏ సాధారణ నిధుల నుంచి యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు రూ.45,71,60,625 సొమ్మును విదేశీ కరెన్సీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ చేశారు. దీంతో సదరు బ్యాంకు అధికారుల వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకు అధికారులను సైతం ప్రశ్నించనున్నారు. ఓవైపు ఈ కేసులో ఈడీ అధికారులు వేగం పెంచగా మరోవైపు తెలంగాణ ఏసీబీ సైతం కీలకాంశాలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని.. కానీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు ఆదేశించడంతో ఆధారాల సేకరణపై ఏసీబీ దృష్టి పెట్టింది. తొలుత హెచ్ఎండీఏ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్ వాంగ్మూలం నమోదుతో దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించనుంది. ఈడీ, ఏసీబీ దర్యాప్తులో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఏసీబీ సేకరించే పత్రాలు ఈడీకి ఉపయోగపడినట్లే ఈడీ దర్యాప్తులో మనీలాండరింగ్ కోణంలో ఏవైనా ఆధారాలు లభిస్తే ఈ కేసు మరో మలుపు తిరుగుతుందన్న చర్చ నడుస్తోంది. -
అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్లకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్(యూఎస్ ఎస్ఈసీ) సమన్లు అందజేసినట్లు పీటీఐ తెలిపింది. అయితే విదేశీ పౌరులకు సమన్లు జారీ చేసి వారిని పిలిపించే అధికారం యూఎస్ ఎస్ఈసీకి లేదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.సోలార్ పవర్ ప్రాజెక్ట్లకు సంబంధించి అదానీ సహా మరో ఏడుగురు అధికారులు భారత ఉన్నతాధికారులకు లంచం ఇచ్చారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సదరు అదానీ గ్రూప్ అధికారులపై అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లు అదానీ గ్రీన్ వంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టడంతో యూఎస్ ఎస్ఈసీకి ఈమేరకు ఫిర్యాదు అందింది. దాంతో దర్యాప్తు జరిపి అధికారులకు లంచం ఇవ్వజూపారని ప్రాథమికంగా తేల్చారు. ఈ కేసును మరింత సమగ్రంగా విచారిస్తున్నారు.ఇదీ చదవండి: ‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లోని అదానీ శాంతివన్ ఫామ్ హౌస్, ఇదే నగరంలోని సాగర్కు చెందిన బోదక్దేవ్ నివాసానికి సమన్లు పంపినట్లు సమాచారం. ఈ సమన్లకు 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉందని విశ్వసనీయ సమచారం. ఒకవేళ వీటికి స్పందించకపోతే వారికి వ్యతిరేకంగా తీర్పు వెలువడుతుందని అందులో అధికారులు తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: విచారణకు బీఆర్ఎస్ నేత గైర్హాజరు
హైదరాబాద్,సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. మొదటిసారిగా ఓ రాజకీయ నాయకుడిని పోలీసులు విచారణకు పిలిచారు. తమ ఎదుట హాజరుకావాలంటూ బీఆర్ఎస్ పార్టీ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు. అయితే సోమవారం(నవంబర్ 11) లింగయ్య ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయానని పోలీసులకు కబురందించారు. ఈ నెల 14వ తేదీన విచారణకు హాజరవుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న బృందం.. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం కేంద్రంగా తమ విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేసింది. ఇప్పటిదాకా కేవలం పోలీస్ అధికారులు(మాజీ)లనే విచారణ జరిపిన దర్యాప్తు బృందం.. తొలిసారి ఓ రాజకీయ నేతను ప్రశ్నిస్తుండడం గమనార్హం. లింగయ్యనే కాకుండా పలువురు ఇతర నేతలను కూడా ఈకేసులో విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
విచారణకు రావాలి.. సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కేసు కర్ణాటకలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. అయితే.. తాజాగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లోకాయుక్త పోలీసులు విచారణకు పిలిచారు.అందులో భాగంగా ఆయనకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక..బుధవారం (నవంబర్ 6) ఉదయం సీఎం సిద్ధరామయ్య తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో కోరినట్లు లోకాయుక్త సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు.. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు.‘‘ముడాకు సంబంధించి మైసూర్ లోకాయుక్త పోలీసులు నోటీసు జారీ చేశారు. నవంబర్ 6న మైసూర్ లోకాయుక్తకు వెళ్లుతా’ అని అన్నారు. ఇక.. ఇదే కేసులో ఇటీవల సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి లోకాయుక్త ప్రశ్నించిన విషయం తెలిసిందే.సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో మైసూరులోని లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.Haveri: Karnataka CM Siddaramaiah says, "Yes, Mysore Lokayukta has issued a notice regarding MUDA. I will go to Mysore Lokayukta on 6th November." pic.twitter.com/cWNydSusOR— ANI (@ANI) November 4, 2024ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది.ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది.కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు.‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు.అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్లో రద్దుచేశారు.అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. -
జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్(ఉద్యోగ కుంభకోణం) కేసులో అక్టోబర్ 7న తమ ఎదుట హాజరుకావాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విశాల్ గోగ్నే ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ కేసులో నిందితుడిగా లేనటువంటి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.నిందితులపై దాఖలైన సప్లిమెంటరీ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలకాగా 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులకు భూమి బదాయింపునకు బదులుగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా కొందరు వ్యక్తులకు పలు రైల్వే జోన్లలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.ఈ కేసులో లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి ఢిల్లీ కోర్టు మార్చి 2023లో బెయిల్ మంజూరు చేసింది. ఇక లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ను జూన్లో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఆగస్ట్ 6న తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. -
కోల్కతా డాక్టర్ కేసు: ఇద్దరు డాక్టర్లు, బీజేపీ నేతకు నోటీసులు
కోల్కతా: కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్దఎత్తున నిసన తెలియజేస్తున్నారు. అయితే మరోవైపు.. హత్యాచార ఘటనప తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. తాజాగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై కోల్కతా పోలీసులు ఆదివారం ఇద్దరు ప్రముఖ వైద్యులు, సీనియర్ బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు లాల్బజార్లోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో డాక్టర్ కునాల్ సర్కార్, డాక్టర్ సుబర్ణ గోస్వామి, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.హత్యాచారం కేసు దర్యాప్తు, పోస్ట్మార్టం నివేదికకు సంబంధించి డాక్టర్ సర్కార్, డాక్టర్ గోస్వామి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ సుబర్ణ గోస్వామి.. ఈ ఘటను సామూహిక అత్యాచారమని పేర్కొన్నారు. 150 మిల్లీగ్రాముల వీర్యం, శరీరంలో పలు ఎముకలు విరిగిపోయినట్లు పోస్ట్మార్టం నివేదిక తెలిజేస్తోందని ఆయన మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. హత్యాచార బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశారనే ఆరోపణలపై బీజేపీ మాజీ ఎంపీ, లాకెట్ ఛటర్జీపై కోల్కతా పోలీసులు ఆరోపణలు చేశారు. బాధితురాలి పేరు, చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు పోలీసులు ఆమెను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. పోలీసులు చేసిన నోటీసులపై లాకెట్ ఛటర్జీ స్పందించారు. ‘కోల్కతా పోలీసులు బాధితురాలికి న్యాయం చేయడం కంటే సోషల్ మీడియా పోస్ట్లను చూడటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’అని ఆరోపించారు.ఇక.. ఇప్పటికే జూనియర్ డాక్టర్పై వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని కోల్కతా పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపారు. -
యడ్యూరప్పపై అరెస్టు వారెంట్
బెంగళూరు: లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం(పోక్సో) కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప(81)పై బెంగళూరు కోర్టు గురువారం నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే ఆయనకు సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ, యడ్యూరప్ప హాజరు కాకపోవడంతో సీఐడీ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, తిరిగివచి్చన తర్వాత సీఐడీ ఎదుట హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అకృత్యానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐసీసీ సెక్షన్ 354 కింద ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే కర్ణాటక డీజీపీ ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తనపై వచి్చన ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యడ్యూరప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ గత నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు అంతకుముందే రికార్డు చేశారు. పోక్సో కేసులో యడ్యూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు. దీనిపై సీఐడీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. -
స్వాతి మాలీవాల్ ఎపిసోడ్: బిభవ్ కుమార్కు ఎన్డబ్ల్యూసీ సమన్లు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆమె చేసిన ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ ఎంపీ సంజయ్ సింగ్ నిజమేనని ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంపై గురువారం జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరై.. స్వాతి మాలీవాల్పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సమన్లలో ర్కొంది. ఈ నోటీసులను జాతీయ మహిళా కమిషన్.. సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి పంపించటం గమనార్హం.సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ తనపై తీవ్రంగా దాడి చేశారని ఎంపీ స్వాతిమాలీవాల్ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. అయితే ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా సుమోటోగా తీసుకున్నామని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. తనపై దాడి జరిగినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్ సోమవారం బయటపెట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
బెంగళూరు: రిజర్వేషన్లపై సోషల్ మీడియలో అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్యాకు బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో తమ ముందు విచారణకు హాజరవ్వాలని సమన్లలో కోరారు. కాగా, ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వగా ఆయన తన రాతపూర్వక సమాధానాన్ని న్యాయవాది ద్వారా పంపారు. -
లిక్కర్ కేసు.. ‘ఆప్’ మరో కీలక నేతకు ‘ఈడీ’ సమన్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)ని నీడలా వెంటాడుతోంది. ఏకంగా ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు తగ్గించడం లేదు. ఇదే కేసులో ఈడీ తాజాగా ఆప్ ఎమ్మెల్యే, గోవా ఆప్ ఇంఛార్జ్ దుర్గేష్ పాఠక్కు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరింది. దుర్గేష్ పాఠక్కు ఈడీ నోటీసులు పంపడం ఇది రెండవసారి. 2022లో కూడా ఇదే కేసు విషయమై పాఠక్కు ఈడీ నోటీసులు పంపింది. అప్పట్లో లిక్కర్ కేసు నిందితుడు ఆప్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్నాయర్ ముంబై ఇంట్లో ఈడీ సోదాలు జరిపినపుడు పాఠక్ అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో విజయ్నాయర్తో ఉన్న సంబంధాలు, డిజిటల్ ఆధారాలపై పాఠక్ను ప్రశ్నించడానికే ఈడీ తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవితకు దక్కని ఊరట -
Delhi liquor scam: అమెరికా జోక్యంపై అభ్యంతరం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్పై అమెరికా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది దేశ అంతర్గత, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని స్పష్టంచేసింది. బుధవారం ఢిల్లీలో అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన అసంతృప్తిని తెలియజేసింది. భారత్లో అమెరికా మహిళా దౌత్యవేత్త, యాక్టింగ్ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీచేసింది. దీంతో బుధవారం ఆమె ఢిల్లీలోని సౌత్బ్లాక్లో విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. విదేశాంగ శాఖ అధికారులతో దాదాపు 30 నిమిషాలు సమావేశమయ్యారు. ‘స్వేచ్ఛగా, పారదర్శకంగా, వేగవంతంగా, చట్టపరంగా న్యాయం పొందే అర్హత సీఎం కేజ్రీవాల్కు ఉంది’ అని మంగళవారం అమెరికా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. భారత న్యాయప్రక్రియపై అమెరికా వ్యాఖ్యలను తప్పుబడుతూ భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘దౌత్య సంబంధాలకు సంబంధించి దేశాలు తోటి దేశాల సార్వభౌమత్వం, అంతర్గత వ్యవహారాలకు గౌరవం ఇవ్వాలి. తోటి ప్రజాస్వామ్య దేశాల పట్ల ఇదే బాధ్యతతో మెలగాలి. బాధ్యత విస్మరిస్తే బాగుండదు. భారత్లో న్యాయవ్యవస్థ స్వతంత్రమైంది. సత్వర న్యాయమే దాని అంతిమ లక్ష్యం. దానిపై ఇతరుల అభిప్రాయాలు అవాంఛనీయం’’ అని ఆ ప్రకటనలో భారత్ తన అసంతృప్తిని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్పై వ్యాఖ్యలు చేసిన జర్మనీ దౌత్యవేత్త, డెప్యూటీ చీఫ్ మిషన్కు ఇటీవల భారత్ సమన్లు జారీచేసిన నేపథ్యంలో మళ్లీ అలాంటి ఘటనే జరగడం గమనార్హం. -
కేజ్రీవాల్పై స్పందన.. అమెరికా దౌత్యవేత్తకు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై అమెరికా విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలకు భారత్.. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు పంపింది. బుధవారం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను.. భారత విదేశి వ్యవహారాల కార్యాలయానికి పిలిపించుకొని సుమారు 40 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్పై అమెరికా స్పందించిన విషయం తెలిసిందే కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను ఆమెరికా ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సాహిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. ‘ఈ కేసులో సమయానుకూల, పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని సీఎం కేజ్రీవాల్ అరెస్ట్పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అంతకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్పై జర్మనీ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన కూడా దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ అనవసర వ్యాఖ్యలు చేసింది జర్మనీ. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ దేశ రాయబారికి కూడా సమన్లు పంపిన విషయం తెలిసిందే. -
Delhi Jal Board case: జలమండలి కేసులోనూ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ గైర్హాజరుల పర్వం ఢిల్లీ జలమండలి కేసులోనూ పునరావృతమైంది. మద్యం అవకతవకల కేసులో కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు సమన్లు జారీచేయడం ఆయన గైర్హాజరవడం తెల్సిందే. తాజాగా ఢిల్లీ జల్బోర్డ్లో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ విచారణ కోసం సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సమన్లు జారీచేయగా కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్కు రాలేదు. తనకు సమన్లు పంపడం చట్టవ్యతిరేకమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్ సంబంధించిన సమన్లు అందుకున్న రెండో కేసు ఇది. మద్యం ఎక్సయిజ్ కేసులో ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు అందుకోవడం, ప్రతిసారీ ఆఫీస్కు రాకుండా మిన్నకుండిపోవడం తెల్సిందే. మద్యం కేసులో విచారణ నిమిత్తం మార్చి 21వ తేదీన తమ ఆఫీస్కు రావాలని ఈడీ తాజాగా ఆయనకు తొమ్మిదోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం. -
Kejriwal: ఈడీ విచారణకు మరోసారి డుమ్మా
న్యూఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డు స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఇప్పటికే లిక్కర్ కేసులో సమన్లకు స్పందించని కేసులో కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చిందని, అయినా ఈడీ మళ్లీ ఎందుకు సమన్లు పంపిందో తెలియడం లేదని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్కు ఈడీ పంపిన సమన్లు చట్ట విరుద్ధమని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో సోమవారం(మార్చ్ 18) తమ ముందు హాజరవ్వాలని ఆదివారం ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అంతకుముందు లిక్కర్ కేసులో ఈడీ వరుస సమన్లకు స్పందించని కేసులో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు శనివారం కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. నేడు కవిత భర్త విచారణ -
‘ఈడీ’ ట్విస్ట్.. కేజ్రీవాల్కు ఒకేరోజు రెండు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్(ఈడీ) నీడలా వెంటాడుతోంది. ఆదివారం ఒకే రోజు కేజ్రీవాల్కు రెండు కేసుల్లో ఈడీ సమన్లు పంపడం కలకలం రేపుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో తొమ్మిదోసారి సమన్లు జారీ చేయగా ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని మరో సమన్లు పంపింది. లిక్కర్ కేసులో మార్చ్ 21 విచారణకు పిలవగా, జల్ బోర్డు కేసులో 18న రావాలని ఈడీ కోరింది. కాగా, లిక్కర్ కేసులో విచారణ కోసం గతంలో ఈడీ పంపిన ఎనిమిది సమన్లకు కేజ్రీవాల్ స్పందించలేదు. విచారణకు హాజరవలేదు. దీంతో ఈడీ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్పై ఫిర్యాదు కూడా చేసింది. అయితే సమన్లకు స్పందించని కేసులో కేజ్రీవాల్కు శనివారమే(మార్చ్ 16) కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో బెయిల్ తీసుకున్న మరుసటి రోజే లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు ఈడీ మళ్లీ సమన్లు పంపడం గమనార్హం. ఇదీ చదవండి.. ఈడీ కస్టడీలో కవిత -
నేడు అఖిలేశ్ను ప్రశ్నించనున్న సీబీఐ
న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్కు రావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆయనకు సమన్లు జారీచేసింది. సాక్షిగా హాజరైతే వాంగ్మూలం నమోదుచేసుకుంటామని ఆ సమన్లతో పేర్కొంది. ఈ–టెండర్ ప్రక్రియను పూర్తిగా ఉల్లంఘించారని, ప్రభుత్వ అధికారులు ఈ మైనింగ్ లీజుల కేటాయింపుల్లో పాలుపంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఆదేశించింది. అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న 2012–16కాలంలోనే జాతీయ హరిత ట్రిబ్యూనల్ నిషేధించినా ఈ అక్రమ మైనింగ్కు తెరలేపారని సీబీఐ పేర్కొంది. 2019లో నమోదైన కేసులో భాగంగా అఖిలేశ్కు సమన్లు పంపామని, ఆయన ఈ కేసులో నిందితుడు కాదని, సాక్షి మాత్రమేనని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సీబీఐ సమన్లపై అఖిలేశ్ స్పందించారు. ‘‘ఎన్నికలొచి్చనప్పుడల్లా నాకు నోటీసులొస్తాయి. 2019 లోక్సభ ఎన్నికల వేళా ఇలాగే జరిగింది. బీజేపీ ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నది మా పారీ్టనే. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉంటూ ఎంతో అభివృద్ధిచేశామని చెబుతుంటారు. అలాంటపుడు సమాజ్వాదీ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత కంగారు?. యూపీలో ఎక్స్ప్రెస్వేపై హెర్క్యులెస్ రకం విమానంలో మోదీ దిగారు. కానీ ఆ ఎక్స్ప్రెస్వేలను కట్టింది ఎస్పీ సర్కార్. అలాంటి జాతీయ రహదారులను మీరు వేరే రాష్ట్రాల్లో ఎందుకు కట్టలేకపోయారు?’’ అంటూ బీజేపీపై అఖిలేశ్ నిప్పులు చెరిగారు. ఏమిటీ కేసులు? హమీర్పూర్ జిల్లా గనుల్లో తక్కువ విలువైన ఖనిజాలను లీజుకిచ్చి లీజు హక్కుదారుల నుంచి ప్రభుత్వ అధికారులు ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఏడు కేసులు నమోదుచేసింది. 2012–17లో అఖిలేశ్ సీఎంగా ఉంటూనే 2012–13లో గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. అప్పుడే 2013 ఫిబ్రవరి 17న ఒకేరోజు 13 ప్రాజెక్టులకు సీఎం ఈ–టెండర్లను పక్కనబెట్టి పచ్చజెండా ఊపారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసుల్లో నాటి హమీర్పూర్ జిల్లా మేజి్రస్టేట్, ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేశ్కుమార్ సహా 11 మందిపై సీబీఐ కేసులు వేసింది. -
రాహుల్కు త్వరలో అస్సాం సీఐడీ సమన్లు !
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు పంపనున్నట్లు సమాచారం. గత నెలలో గువహతిలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై రాహుల్ను అస్సాం సీఐడీ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రాహుల్గాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, జైరామ్ రమేష్, శ్రీనివాస్ బివి, కన్నయ్యకుమార్, గౌరవ్ గొగొయ్ తదితరుల పేర్లను పోలీసులు చేర్చారు. కాగా, గత నెలలో అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాజధాని గువహతిలో యాత్ర ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ వార్నింగ్ ఇచ్చారు. అయినా రాహుల్గాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గువహతి శివార్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులపై స్వల్ప లాఠీఛార్జ్ కూడా చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టినప్పటికీ యాత్ర గువహతిలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారి(ఎన్హెచ్-27) మీద నుంచి వెళ్లిపోయింది. తాము బారికేడ్లను బద్దలు కొడతాం కాని నిబంధనలను ఉల్లంఘించమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. తాము రాహుల్ గాంధీని ఈ కేసులో లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. హోం మంత్రి కూడా తానే అయిన సీఎం హిమంత ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. మళ్లీ మొదటికి -
కేజ్రీవాల్ సర్కారు విశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ సర్కారుపై శుక్రవారం శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంలో ప్రశ్నించేందుకు ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా గైర్హాజరవడంతో శనివారం తమ ముందు హాజరుకావాలని సిటీ కోర్టు కేజ్రీవాల్ను ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ చర్యకు దిగడం గమనార్హం. విశ్వాస తీర్మానంపై శనివారం సభలో చర్చించనున్నారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో కేజ్రీవాల్ బలపరీక్షకు సిద్ధపడటం ఇది రెండోసారి. ఆప్కు 62 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీ బలం రెండుకు పడిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేయడమే ఇందుకు కారణం. శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారు. కానీ వారెక్కడ జారిపోతారోననే భయంతోనే ఆయన బలపరీక్షకు దిగారని బీజేపీ ఎద్దేవా చేసింది. -
కేజ్రీవాల్కు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న హాజరు కావాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఐదుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ నెల 17న కేజ్రీవాల్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్లు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇక.. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవంటూ తొలి నుంచి అరవిండ్ కేజ్రీవాల్ విచారణకు హజరు కావడం లేదు. ఇది రాజకీయ ప్రతీకార చర్యగా.. ఢిల్లీ ప్రభుత్వానికి కూలదోసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు ప్రతిగా.. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత కార్యక్రమాలకు కేజ్రీవాల్ హజరవుతూ వచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కేజ్రీవాల్కు కిందటి ఏడాది నవంబర్ 2వ తేదీన తొలిసారి సమన్లు పంపింది ఈడీ. అప్పటి నుంచి సమన్లు పంపిన ప్రతీసారి(నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 19, ఫిబ్రవరి 2) ఆయన అరెస్ట్ అవుతారంటూ చర్చ తీవ్రంగా నడిచింది. చదవండి: యూసీసీపై ఎంఐఎం చీఫ్ కీలక వ్యాఖ్యలు -
కేజ్రీవాల్కు ఐదోసారి ఈడీ సమన్లు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇవాళ ఈడీ ఐదోసారీ సమన్లు ఇచ్చింది. ఇప్పటివరకూ ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరుకాని విషయం తెలిసిందే. లిక్కర్ కేసులో మొదటిసారి ఆయన నవంబర్ 2వ తేదీన సమన్లు ఇచ్చింది ఈడీ. ఆపై డిసెంబర్ 21న రెండోసారి, జనవరి 3వ తేదీన మూడోసారి, జనవరి 13వ తేదీన నాలుగోసారి సమన్లు జారీ చేసింది. అయితే పార్టీ వ్యవహారాల పేరిట ఆయన విచారణకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. తాజాగా ఐదోసారి నేడు జారీ చేసిన సమన్లలో ఫిబ్రవరి 2వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ కోరింది. ఈసారి గనుక ఆయన హాజరు కాకుంటే.. అరెస్ట్ వారెంట్ కోసం ఈడీ కోర్టును ఆశ్రయించవచ్చు. మరోవైపు తొలి నుంచి ఆయన ఈడీ నోటీసులను బీజేపీ ప్రతీకార రాజకీయ చర్యగా.. సార్వత్రిక ఎన్నికల ముందు జరుపుతున్న కుట్రగా అభివర్ణిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో ప్రతీకార రాజకీయాలాంటిదేం లేదని.. మాత్రం దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా తమ పని తాము చేసుకుంటున్నాయని బీజేపీ చెబుతోంది. -
రబ్రీ దేవికి ఢిల్లీ కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ కోర్టు బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టులో విచారణకు రావాలంటూ స్పెషల్ కోర్టు జడ్జి విశాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన చార్జిషీటులో ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కట్యాల్ను సైతం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. -
సోరెన్కు ఈడీ మళ్లీ సమన్లు
రాంచీ: భూ మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సమన్లు జారీ చేసింది. వచ్చే వారంలో 29 లేదా 31వ తేదీల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు విచారణకు రావాలంటూ అందులో కోరింది. తేదీని ఖరారు చేయాలని అందులో స్పష్టం చేసింది. అంతకుముందు, ఈడీ అధికారులు ఈ నెల 27 లేదా 31వ తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు రావాల్సి ఉందంటూ సీఎం సోరెన్ను కోరగా ఆయన స్పదించలేదు. దీంతో, తాజాగా మరోసారి ఆయనకు సమన్లు ఇచ్చారు. -
మహువా అవినీతి కేసు: జై అనంత్ దేహద్రాయ్కు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: టీఎంసీ నేత, బహిష్కృత లోక్సభ ఎంపీ మహువా మొయిత్రా అనివీతి కేసులో వాదనలు వినిపిస్తున్న సుప్రీం కోర్టు లాయర్ జై అనంత్ దేహద్రాయ్కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం సమన్లు జారీ చేసింది. మహువా అవినీతి కేసుకు సంబంధించి గురువారం విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొంది. పార్లమెంట్లో అడిగే ప్రశ్నలకు డబ్బులు తీసుకున్న కేసులో మహువా డిసెంబర్లో లోక్సభ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. కేంద్రం, అదానీ సంస్థలపై విమర్శలు చేయడానికి మహువా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పదం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై పార్లమెంట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. చివరకు ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. మహువా మొయిత్రా లోక్సభ నుంచి బహిష్కరించారు. ఎంపీ హోదాలో ఆమెకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ (DEO) కూడా ఇటీవలే నోటీసులు పంపింది. అయితే తనకు ఆ బంగ్లాను కొనసాగించాలని మహువా కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆమె ఎదురుదెబ్బ తగలటంతో తన కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. చదవండి: రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత -
సీఎం కేజ్రీవాల్కు నాలుగోసారి ఈడీ సమన్లు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ED) తాజాగా నాలుగోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 18 విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లలో పేర్కొంది. జనవరి 3న మూడోసారి ఈడీ ఇచ్చిన సమన్ల విచారణకు సీఎం కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈడీ పంపిన సమన్లు చట్టపరమైనవి కావని, కేవలం తనను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా జారీ చేసినవి కేజ్రీవాల్ మండిపడ్డ విషయం తెలిసిందే. ఇక గతంలో ఈడీ నవంబర్2, డిసెంబర్ 21న సీఎం కేజ్రీవాల్కు.. రెండుసార్లు సమన్లు పంపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా 2023 ఫిబ్రవరి నుంచి జైల్లోనే ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను అక్టోబర్లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. ఈసారైనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లకు స్పందించి విచారణ వెళ్లుతారో? లేదో? అని ఆప్ పార్టీలో చర్చజరుగుతోంది. చదవండి: తిరస్కరణ సీఎంను కాదు.. మాజీ సీఎంను: శివరాజ్ సింగ్ చౌహన్ -
అశ్లీల కంటెంట్... యూట్యూబ్కు సమన్లు
ఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ భారత్ విభాగానికి నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సమన్లు జారీ చేసింది. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అటువంటి ఛానెల్ల జాబితాతో జనవరి 15న తమ ముందు హాజరు కావాలని యూట్యూబ్ సంస్థ భారత్ విభాగ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్ని కోరింది. ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో ఈ మేరకు భారతదేశంలోని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ అధిపతి మీరా చాట్కు లేఖ రాశారు. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన చర్యలను చిత్రీకరించే యూట్యూబ్ ఛానెల్లలో ఆందోళనకరమైన ధోరణిని కమిషన్ గుర్తించిందని ప్రియాంక కనూంగో అన్నారు. ‘వీడియోలలో’ తల్లులు, కొడుకుల మధ్య అసభ్యకరమైన చర్యలు, తల్లులు, యుక్తవయస్సులో ఉన్న కొడుకుల మధ్య ముద్దులు వంటివి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ వీడియోలు లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే (పోక్సో) చట్టం- 2012ను ఉల్లంఘిస్తున్నాయి.' అని కమిషన్ గుర్తించిందని తెలిపారు. “యూట్యూబ్ దీన్ని పరిష్కరించాలి. నేరస్థులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వీడియోలను కమర్షియల్గా మార్చడం అంటే పోర్న్ అమ్మడం లాంటిది. పిల్లలు లైంగిక వేధింపులకు గురైన వీడియోలను ప్రదర్శించే ఏదైనా ప్లాట్ఫామ్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది.”అని ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో తెలిపారు. ఇదీ చదవండి: అతిపెద్ద సముద్ర వంతెన.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం -
తేజస్వీకి ఈడీ తాజా సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్నకాలంలో కొందరి భూములు రాయించుకుని వారికి రైల్వేలో గ్రూప్–డీ ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు పాత్ర ఉందంటూ ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. జనవరి ఐదో తేదీన తమ ఆఫీస్కు రావాలని తేజస్వీకి సూచించింది. డిసెంబర్ 22వ తేదీనే రావాలని గతంలో సమన్లు జారీచేయగా ఆయన రాలేదు. దీంతో మళ్లీ సమన్లు ఇచ్చారు. ఇదే కేసులో డిసెంబర్ 27వ తేదీన హాజరుకావాలని లాలూకు సైతం ఈడీ సమన్లు పంపడం తెల్సిందే. ‘ సమన్లలో కొత్తదనం ఏదీలేదు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈడీ ఆఫీస్కెళ్లాను. ఇదో రోటీన్ పనిలా తయారైంది’ అని తేజస్వీ వ్యాఖ్యానించారు. యూపీఏ–1 హయాంలో 2004– 2009 కాలంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ కాలంలో కొందరికి వేర్వేరు రైల్వేజోన్లలో గ్రూప్–డీ ఉద్యోగాలిచ్చి, లాలూ కుటుంబసభ్యుల, వారికి చెందిన ఏకే ఇన్ఫోసిస్టమ్స్ సంస్థ పేరు మీదకు ఆ లబ్దిదారుల భూములను బదలాయించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ సంస్థకు డైరెక్టర్గా ఉన్న అమిత్ కాత్యాల్ను ఈడీ ఇటీవల అరెస్ట్చేసింది. ఈ సంస్థ రిజి్రస్టేషన్ అడ్రస్లో ఉన్న ఇల్లు లాలూదేనని ఈడీ పేర్కొంది. లబి్ధదారుల భూముల బదలాయింపు సంస్థలోకి జరిగాక ఆ వాటాలను 2014 ఏడాదిలో లాలూ కుటుంబసభ్యుల పేరు మీదకు బదిలీచేశారని ఈడీ చెబుతోంది. ఈ ఉదంతంపై గతంలో సీబీఐ నమోదుచేసిన కేసును ఆధారంగా చేసుకుని ఈడీ కొత్తగా కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తోంది. -
Sakshi Cartoon: ఎక్కడికెళ్లారో అస్సలు అంతుపట్టడం లేదు!
ఎక్కడికెళ్లారో అస్సలు అంతుపట్టడం లేదు! -
లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: తాను రైల్వేమంత్రిగా ఉన్న కాలంలో భూములు రాయించుకుని కొందరికి రైల్వేలో గ్రూప్–డీ ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు ఈడీ సమన్లు జారీచేసింది. ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కూ సమన్లు పంపింది. ఈనెల 22వ తేదీన ఢిల్లీ ఆఫీస్కు రావాలని తేజస్వీని, డిసెంబర్ 27న రావాలని లాలూకు ఈడీ సూచించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో వీరిద్దరి నుంచి అధికారులు వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఈడీ ఇప్పటికే ఇదే కేసులో ఏప్రిల్లో ఎనిమిది గంటలపాటు తేజస్వీని విచారించింది. లాలూ ప్రసాద్కు ఈ కేసులో సమన్లు పంపడం ఇదే తొలిసారి. గత నెలలో లాలూ కుటుంబానికి ఆప్తుడైన అమిత్ కాత్యాల్ను ఈడీ అరెస్ట్చేసిన నేపథ్యంలో వీరికి సమన్లు జారీకావడం గమనార్హం. -
విచారణకు కేజ్రీ డుమ్మా!
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకల కేసులో గురువారం విచారణకు రావాలన్న ఈడీ సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బేఖాతరు చేసినట్టు సమాచారం. బుధవారమే ఆయన పంజాబ్లోని హోషియార్పూర్లో విపాసన ధ్యానం కోర్సులో చేరేందుకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ‘‘ఆయన ఏటా చలికాలంలో విపాసనకు వెళ్తారని అందరికీ తెలుసు. అయినా ఈడీ కావాలనే ఇప్పుడు సమన్లు ఇచ్చింది’’ అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. దీనిపై ఈడీ తదుపరి చర్యలేమిటనేది తెలియాల్సి ఉంది. నవంబర్ 2న కేజ్రీవాల్ను ఈడీ విచారణకు పిలవగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందంటూ హాజరు కాలేదు. -
Land For Jobs Case: లాలూ, తేజస్వీ యాదవ్లకు ఈడీ నోటీసులు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తేజస్వీ డిసెంబర్ 22న, లాలూ డిసెంబర్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో 17 మంది నిందితులపై సీబీఐ జూలైలో రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్లు ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా.. అక్టోబర్లో వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లాలూ, అతని కుటుంబ సభ్యులపై ఇది రెండవ ఛార్జిషీట్. అంతేగాక తేజస్వి యాదవ్ను నిందితుడిగా పేర్కొన్న కేసులో మొదటి ఛార్జిషీట్. ఇక 2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి ప్రకటనలు, పబ్లిక్ నోటీసు లేకుండా తనకు అనుకూలమైన వారిని రైల్వేలో నియమించారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. క్విడ్ ప్రోకో కింద ఆ అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబాం తక్కువ ధరలకు భూమిని కొనుగోలు చేసినట్లు అభియోగాలు మోపాయి. ఈ క్రమంలో సీబీఐ గత ఏడాది మేలో లాలూ, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో లాలూ, భార్య రబ్రీ దేవి, అతని కుమారుడు తేజస్వి, కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్, లబ్ధిదారులతో సహా 17 మంది వ్యక్తుల పేర్లను నిందితులుగా పేర్కొంది. ఇదిలా ఉండగా బెయిల్ మంజూరైన రెండు నెలల తర్వాత లాలూ, తేజస్వికి తాజాగా ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. చదవండి: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ హత్యకు కుట్ర.. తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ -
ఢిల్లీ లిక్కర్ స్కాం: కేజ్రీవాల్కు ఈడీ సమన్లు
ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ను అధికారులు మరోమారు ప్రశ్నించనున్నారు. డిసెంబర్ 21న హాజరవ్వాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ED summons Delhi CM and AAP national convener Arvind Kejriwal once again for questioning in connection with Delhi Excise Policy matter. The agency has asked him to appear before them on 21st December. (File photo) pic.twitter.com/wOtaZ41c6d — ANI (@ANI) December 18, 2023 ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ నవంబర్ 2న కేజ్రీవాల్ను విచారణకు పిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న ఈ కేసులో కేజ్రీవాల్నుసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది. ఈ కేసులో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. మద్యం కుంభకోణంలో అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అరెస్టు చేసింది. అదే రోజు ఆయన నివాసం సహా సంబంధించిన ఆస్తులపై సోదాలు చేసింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనీస్ సిసోడియాను ఫిబ్రవరి 26న ఈడీ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ప్రభుత్వం 2022లో నూతన మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఈ విధానంలో భాగంగా కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బును గోవా సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఫండ్ కోసం వినియోగించారని ఈడీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కేజ్రీవాల్ ప్రభుత్వం ఖండిస్తోంది. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర.. 8మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు -
రాహుల్ గాంధీకి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోసారి న్యాయస్థానం సమన్లు జారీ అయ్యాయి. ఉత్తర ప్రదేశ్ ప్రజా ప్రతినిధుల కోర్టు ఆయనకు శనివారం సమన్లు జారీ చేసింది. జనవరి 6వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో రాహుల్ను కోరింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్ గాంధీపై కేసు నమోదు అయ్యింది. షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నాలుగేళ్ల కిందట(2018, ఆగస్టు 4వతేదీన) బీజేపీ నేత విజయ్ మిశ్రా కేసు వేశారు. సుల్తాన్పూర్లోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. చివరకు.. నవంబర్ 18వ తేదీతో వాదనలు పూర్తి కాగా, జడ్జి యోగేష్ యాదవ్ తీర్పును రిజర్వ్చేశారు. తర్వాత విచారణ నవంబర్ 27వ తేదీన జరగ్గా.. రాహుల్ గాంధీని డిసెంబర్ 16వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే.. ఈ కేసులో విచారణ కోసం కోర్టుకు రాహుల్ గాంధీ రాలేదు. దీంతో జనవరి 6వ తేదీన కచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని సమన్లు జారీ అయ్యాయని విజయ్ మిశ్రా తరఫు లాయర్ సంతోష్పాండే వెల్లడించారు. -
జార్ఖండ్ సీఎం సోరేన్కు ఆరోసారి ఈడీ సమన్లు..
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఆరోసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు లావాదేవీలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ సోరేన్పై కేసు నమోదు చేసింది.ఈ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందుకు రావాల్సిందిగా ఈడీ హేమంత్ సోరెన్కు వరుసగా ఆరోసారి సమన్లు పంపింది. సోరేన్ మంగళవారం తమ ముందు హాజరయ్యే అవకాశం ఉందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. రాంచీలోని జోనల్ ఆఫీసులో ఆయనను విచారించనున్నట్లు చెప్పారు. గతంలో ఇదే కేసులో ఐదోసారి ఈడీ పంపిన సమన్లపై సోరేన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఈడీ పంపిన సమన్లపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఇదీచదవండి..ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్ప్రెస్ రైళ్లు -
ప్రకాశ్ రాజ్కు ఈడీ షాక్.. నోటీసులు జారీ!
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్ మనీలాండరింగ్ కేసులో ఈడీ నోటీసులిచ్చింది. ప్రస్తుతం ఆయన ప్రణవ్ జువెలర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ నుంచి అందుకున్న చెల్లింపుల వివరాలను సమర్పించాలంటూ ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దాదాపు రూ.100 కోట్ల స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చెన్నైలో విచారణకు హాజరు కావాలని సూచించింది. కాగా.. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నందునే విచారణకు పిలిచింది. కాగా.. గత కొంతకాలంగా బీజేపీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈడీ దాడులు.. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ కంపెనీపై నవంబర్ 20న ఈడీ దాడులు చేసింది. ఆ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు సేకరించిందని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అమెరికా కోటీశ్వరుడు సింఘంకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: న్యూస్క్లిక్ ఆన్లైన్ పోర్టల్పై నమోదైన మనీల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అమెరికన్ బిలియనీర్ నెవిల్లె రాయ్ సింఘంకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. భారత్లో చైనాకు అనుకూలంగా కథనాలు రాసేందుకు న్యూస్క్లిక్కు డ్రాగన్ దేశం నుంచి నిధులు అందుతున్నట్లు గతంలో న్యూయార్క్టైమ్స్, తదితర పత్రికల్లో కథనాలు వచ్చాయి. నెవిల్లె రాయ్ సింఘం, ఆయనకు చెందిన న్యూస్క్లిక్ను అత్యంత ప్రమా దకరమైనవని పేర్కొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన ఈడీ..న్యూస్క్లిక్ ఫౌండర్, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థకు చెందిన ఢిల్లీలోని రూ.4.52 కోట్లు విలువ చేసే భవనాన్ని, రూ.41 లక్షల బ్యాంకు డిపాజిట్లను అటాచ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సింఘం ప్రస్తుతం చైనాలోని షాంఘైలో ఉన్నారు. దీంతో, ఆయ నకు విదేశాంగ శాఖ ద్వారా నోటీసులు పంపింది. కాగా, ఈడీ ఆరోపణలను సింఘం ఖండించారు. దర్యాప్తు చేపట్టిన ఈడీ మొదటిసారిగా 2021లో సింఘంకు నోటీసు పంపింది. -
అభిషెక్ బెనర్జీకి ఈడీ సమన్లు
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషెక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. పాఠశాల ఉద్యోగాల కుంభకోణం దర్యాప్తులో భాగంగా నవంబర్ తొమ్మిదో తేదీన(నేడు) కోల్కతాలో తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మహిళా మంత్రి, పార్టీ అధికార ప్రతినిధి అయిన శశి పంజా చెప్పారు. ‘ మా పార్టీ జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శి అభిషెక్ను ఈడీ కక్షపూరిత రాజకీయాలకు బాధితుడిగా మార్చేసింది’ అని ఆమె ఆరోపించారు. సమన్లలో పేర్కొన్న మేరకు అభిషెక్ బెనర్జీ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ‘‘వచ్చే సంవత్సరం కీలకమైన ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ నేతలను బెదిరించడానికి బీజేపీ ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతోంది’’ అని శశి అన్నారు. దీనిపై పశి్చమబెంగాల్ బీజేపీ రాష్ట్ర విభాగం స్పందించింది. ‘ కక్షసాధింపు రాజకీయాలపై మాకు నమ్మకం లేదు. జాతీయ దర్యాప్తు సంస్థలు కోర్టు ఆదేశాల మేరకే ఇలా సమన్లు జారీ చేస్తాయి. మీకేమైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించండి’ అని బీజేపీ అధికార ప్రతినిది సంబిత్ పాత్రా అన్నారు. ఇప్పటికే అక్టోబర్లో బెనర్జీ ఈడీ ఎదుట హాజరైన విషయం విదితమే. సెపె్టంబర్ 13వ తేదీన ఆయనను ఈడీ అధికారులు ఏకంగా తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. కీలక ‘ఇండియా’ కూటమి సమావేశంలో పాల్గొనకుండా టీఎంసీ నేతలను అడ్డుకునేందుకే ఈడీ ఆనాడు అలా చేసిందని అప్పుడే అభిషెక్ ఆరోపించారు. గతంలో బొగ్గు కుంభకోణం కేసులో 2021, 2022 సంవత్సరాల్లో అభిషేక్ను ఈడీ అధికారులు రెండు పర్యాయాలు ప్రశ్నించారు. -
రాజస్తాన్ సీఎం గెహ్లోత్ కుమారుడికి ఈడీ సమన్లు
జైపూర్: రాజస్తాన్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీల్యండరింగ్ ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, పాఠశాల విద్యాశాఖ మాజీ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరిపింది. అదేవిధంగా, విదేశీ కరెన్సీ నిబంధనల ఉల్లంఘన కేసులో సీఎం అశోక్ గెహ్లోత్ కుమారుడు వైభవ్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆయన్ను కోరింది. సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు నడుమ గురువారం ఈడీ అధికారుల బృందం జైపూర్, సికార్లలోని గోవింద్ సింగ్ ఇళ్లలో సోదాలు చేపట్టారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన సికార్ జిల్లాలోని లచ్చమన్గఢ్ నుంచి పోటీలో ఉన్నారు. అదేవిధంగా, దౌసా జిల్లాలోని మహువా సీటుకు పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాశ్ హుడ్లా, మరికొందరి ఇళ్లలో కూడా సోదాలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. 2022 డిసెంబర్లో రాజస్తాన్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ నిర్వహించిన సీనియర్ టీచర్ గ్రేడ్–2 పరీక్షలో జనరల్ నాలెడ్జి ప్రశ్నపత్రం లీకైంది. అప్పటి విద్యాశాఖ మంత్రి గోవింద్సింగ్ తదితరులు కలిసి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసి, ఈ దందాకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. వైభవ్పై ఆరోపణలేంటీ? సీఎం గెహ్లోత్ కుమారుడు వైభవ్ విదేశీ మాదక ద్రవ్య మారి్పడి చట్టం కేసును ఎదుర్కొంటున్నారు. 2011 నుంచి ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సమకూర్చుకోవాల్సి ఉన్నందున వైభవ్ శుక్రవారం విచారణకు హాజరుకాకపోవచ్చని ఈడీ అంటోంది. విచారణ వాయిదా కోరవచ్చని భావిస్తోంది. రాజస్తాన్కు చెందిన ట్రిటాన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, వార్ధా ఎంటర్ ప్రైజెస్ సంస్థల ప్రమోటర్లకు చెందిన జైపూర్, ఉదయ్పూర్, ఢిల్లీల్లోని పలు ప్రాంతాల్లో ఆగస్ట్లో ఈడీ సోదాలు జరిపింది. వీరికి వైభవ్ గెహ్లోత్తో సంబంధాలున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. దాడుల్లో రూ.1.2 కోట్ల లెక్కల్లో చూపని నగదును గుర్తించింది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. స్టార్ హీరోయిన్కు సమన్లు!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో రణ్బీర్ కపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్, హ్యూమా ఖురేషికి సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరో నటి శ్రద్ధా కపూర్కు సైతం నోటీసులిచ్చారు. ఇవాళ ఈడీ ముందు హాజరవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించగా.. రణ్బీర్ కపూర్ హాజరయ్యేందుకు రెండు వారాల గడువు కోరారు. అయితే ఈరోజు శ్రద్ధా కపూర్ ఈడీ ముందుకు హజరవుతారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: బాలీవుడ్లో బెట్టింగ్ యాప్ ప్రకంపనలు.. ప్రముఖులకు ఈడీ సమన్లు..!) ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్లకు కూడా వేర్వేరు తేదీల్లో సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరంతా కూడా ఈడీ ముందు హాజరు కావడానికి రెండు వారాల సమయం కోరినట్లు తెలిపారు. అయితే ఈ కేసులో వీరందరినీ నిందితులుగా ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం యాప్ ప్రమోటర్లు వారికి చేసే చెల్లింపు విధానం మాత్రమే ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ మహదేవ్ యాప్ను ప్రమోట్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
బాలీవుడ్లో బెట్టింగ్ యాప్ ప్రకంపనలు.. ప్రముఖులకు ఈడీ సమన్లు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో బాలీవుడ్ నటులైన హుమా ఖురేషి, కపిల్ శర్మ, హీనా ఖాన్లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షుల హోదాలో ముగ్గురు నటులను విచారించనున్నట్లు సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సమాచారం ప్రకారం వీరు ముగ్గురూ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వీరు డబ్బును కూడా స్వీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహానికి కూడా కపిల్ శర్మ హాజరైనట్లు టాక్ వినిపిస్తోంది. (ఇది చదవండి: సినిమానే తన జీవితంగా మలచుకున్న నిత్యవిద్యార్థి: ఆయనపై మెగాస్టార్ ప్రశంలు) గడువు కోరిన రణ్బీర్ కపూర్! అయితే ఇప్పటికే అక్టోబర్ 6న అధికారుల ముందు హాజరు కావాలని నటుడు రణబీర్ కపూర్కు ఈడీ సమన్లు పంపిన సంగతి తెలిసిందే. అయితే హాజరయ్యేందుకు రెండు వారాల మినహాయింపు కోరినట్లు తెలుస్తోంది. అతని అభ్యర్థనపై ఈడీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మహదేవ్ యాప్కి సంబంధించిన ప్రమోషన్ల కోసం అతను అందుకున్న మొత్తం... అతనితో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తుల గురించి వివరణ కోరాలని ఈడీ భావిస్తోంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ ఏంటి? మహాదేవ్ బుక్ యాప్ అనేది ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్. దీని ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కాగా.. ఈ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ ఫిబ్రవరి 2023లో దుబాయ్లో తన వివాహ వేడుక కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత విలాసవంతంగా ఈ వేడుక జరిగింది. ఈ పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు టైగర్ ష్రాఫ్, సన్నీలియోన్, నేహా కక్కర్, విశాల్ దద్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ భరుచ్చా, అతీఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, కృష్ణ, అభిషేక్ సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు. కాగా.. చంద్రాకర్.. మరో ప్రమోటర్ రవి ఉప్పల్తో కలిసి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ల ముసుగులో బినామీ ఖాతాల ద్వారా మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. (ఇది చదవండి: రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?) ED has summoned comedian Kapil Sharma and actor Huma Qureshi in connection with the Mahadev betting app case: ED Sources (file pics) pic.twitter.com/rKXxUgtucl — ANI (@ANI) October 5, 2023 -
బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్
Mahadev App Scam Case మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కాం (ఎంఓబి) కేసు బాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో దాదాపు 17మంది బాలీవుడ్ ప్రముఖులకు సమన్లు ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సన్నద్ధమవుతోంది. బీ-టౌన్ నటుడు టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, గాయని నేహా కక్కర్, నుష్రత్ భరుచ్చా, తదితరులకు సమన్లు పంపేందుకు దర్యాప్తు సంస్థ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్ మహదేవ్ బుక్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా కోల్కతా, భోపాల్, ముంబై వంటి నగరాల్లో 39 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. రూ.417 కోట్ల డబ్బు, డాక్యుమెంట్లను ఈడీ సీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో యుఎఇలో రస్అల్ఖైమాలో జరిగిన మహదేవ్ బుక్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుకకు పలువురు నటులు , గాయకులు హాజరయ్యారు.టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, విశాల్ దడ్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బండా, నుష్రత్ భరుచ్చా, కృష్ణ అభిషేక్, గాయకులు సులీ ప్రముఖులకు ఈడీ షాక్ ఇవ్వనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈడీ సేకరించిన సాక్ష్యం ప్రకారం, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి హవాలా ద్వారా రూ. 112 కోట్లు ముట్టాయి. హోటల్ బుకింగ్ల కోసం చెల్లింపు రూ. 42 కోట్లు చెల్లించారు. అంతేకాదు వివాహ బృందంలోని కుటుంబ సభ్యులను నాగ్పూర్ నుండి యుఎఇకి తీసుకెళ్లడానికి ప్రైవేట్ జెట్లను అద్దెకు తీసుకున్నారు, వివాహంలో పాల్గొనడానికి ముంబై నుండి వెడ్డింగ్ ప్లానర్లు, డ్యాన్సర్లు, డెకరేటర్లు మొదలైన వారిని అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది. మహాదేవ్ బుక్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణంపై అనేక రాష్ట్రాల ఈడీ పోలీసు విభాగాలచే విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సౌరభ్ చంద్రకర్ , రవి ఉప్పల్ ప్రమోట్ చేసిన కంపెనీ కొత్త వినియోగదారులను చేర్చుకొని యూజర్ ఐడిలను క్రియేట్చేసి, బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బును లాండర్ చేయడానికి ఆన్లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్ను ఉపయోగిస్తోందని ఈడీ ఆరోపిస్తోంది.బెట్టింగ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్షోర్ ఖాతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే దుబాయ్లోని సెవెన్ స్టార్ లగ్జరీ హోటల్లో గత ఏడాది సెప్టెంబర్ 18 నాటి పార్టీకి హాజరయ్యేందుకు బెట్టింగ్ ప్లాట్ఫారమ్ ప్రమోటర్లు రూ.40 కోట్లు చెల్లించారని ఆరోపణలతో కొంతమంది తారలను ఇప్పటికే ఈడీ పరిశీలిస్తోంది. బాలీవుడ్ పెద్దలు రెండు ఈవెంట్లకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల నుండి హవాలా ద్వారా నగదు చెల్లింపులు అందుకున్నారనేది ప్రధాన ఆరోపణ. పాకిస్తాన్కు చెందిన ఒక అసోసియేట్తో ఎంఓబి సమన్వయంతో బెట్టింగ్ యాప్ను లాంచ్ చేసిందన్న ఆరోపణలను కూడా ఈ విచారణ ధృవీకరిస్తున్నట్లు ఇడి వర్గాలు తెలిపాయి. -
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరోసారి ఈడీ సమన్లు
-
SpiceJet-Credit Suisse Case: సుప్రీంకోర్టులో స్పైస్జెట్ ఎండీకి భారీ షాక్!
Credit Suisse vs SpiceJet: విమానయాన సంస్థ స్పైస్జెట్ చీఫ్ అజయ్ సింగ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ ధిక్కార కేసుపై నాలుగు వారాల్లోగా స్పందించాలని అజయ్ సింగ్ను అత్యున్నత న్యాయస్థానం కోరంది. అజయ్ సింగ్, స్పైస్జెట్లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (గుడ్ న్యూస్: రూ.1515కే విమాన టికెట్, ఫ్రీ ఫ్లైట్ వోచర్ కూడా!) కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారన్న క్రెడిట్ సూయిస్ అరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరుపక్షాల మధ్య జరిగిన సెటిల్మెంట్ ప్రకారం 3.9 మిలియన్ల డాలర్ల బకాయిలు చెల్లించడంలో విఫలమైనందుకు సింగ్, స్పైస్జెట్లపై ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ క్రెడిట్ సూయిస్ మార్చిలో సుప్రీంను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజా సమన్లు జారీ అయ్యాయి. (బడ్జెట్ ధరలో అద్భుతమైన మోటో ఈ13 స్మార్ట్ఫోన్: స్పెషాల్టీ ఏంటంటే?) కాగా 2015 నుంచి క్రెడిట్ సూయిస్ స్పైస్జెట్ మధ్య వివాదం నడుస్తోంది. స్పైస్జెట్ యాజమాన్యం సుమారు 24 మిలియన్లు డాలర్లు బకాయలను ఎగ్గొట్టారని క్రెడిట్ సూయిస్ ఆరోపిస్తోంది. దీనిపై చివరికి 2021లో మద్రాస్ హైకోర్టు ఎయిర్లైన్ను మూసివేయాలని సూచించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్లో సుప్రీంకోర్టు మూసివేత ప్రక్రియను తాత్కాలికంగానిలిపివేసింది, ఇరుపక్షాలు ఒక పరిష్కారానికి చర్చలు జరిపేందుకు అనుమతి నిచ్చింది. ఆగస్ట్ 2022లో తమ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తమ ఒప్పందం గురించి సుప్రీంకోర్టుకు తెలిపాయి. అయితే, ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించలేదనే ఆరోపణలతో మార్చిలో క్రెడిట్ సూయిస్ అజయ్ సింగ్పై ధిక్కార కేసు నమోదు చేసింది. దీంతోరాబోయే విచారణ సమయంలో హాజరు కావాలని అజయ్ సింగ్ను సుప్రీం ఆదేశించింది. దీంతో ముగిసిపోనుందని భావించిన కేసు కాస్తా మళ్లీ మొదటి కొచ్చినట్టైంది. -
ఇదేనా మీ విచారణ.. మణిపూర్ డీజీపీకి సుప్రీం కోర్టు సమన్లు
సాక్షి, ఢిల్లీ: మణిపూర్ హింసపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ఇవాళ(మంగళవారం) మణిపూర్ పోలీస్ శాఖపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలకొద్ది ఎఫ్ఐఆర్లు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్లు జరగలేదని, విచారణలోనూ నిర్లక్ష్యం కనిపించిందని వ్యాఖ్యానించింది. అసలు ఎఫ్ఐఆర్లు ఇలాగేనా? నమోదు చేసేదని మణిపూర్ పోలీస్ శాఖపై మండిపడింది. వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలంటూ మణిపూర్ డీజీపీని సమన్లు జారీ చేసింది. మణిపూర్లో శాంతి భద్రతల అనే మాటే లేదు. రాష్ట్ర యంత్రాగం పూర్తిగా విఫలమైంది. హింస చెలరేగి మూడు నెలలైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు. అరెస్టులు జరగలేదు. విచారణలో అడుగడుగునా నిర్లక్ష్యం, నిర్లిప్తత కనిపిస్తోందంటూ మణిపూర్ పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. సీజేఐ చంద్రచూడ్ కామెంట్లు.. ► మే నుండి జులై చివరి వరకు రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విచ్ఛిన్నమైంది ► జూలై 25, 2023 నాటికి 6496 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని మణిపూర్ తరపున దాఖలు చేసిన నివేదిక పేర్కొంది. అధికారిక నివేదికల ప్రకారం 150 మరణాలు సంభవించాయని, 502 మంది గాయపడ్డారని, 5,101 కేసులు ఉన్నాయని స్టేటస్ రిపోర్ట్ పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కాల్పులు మరియు 6,523 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్లలో 252 మందిని అరెస్టు చేయగా, నివారణ చర్యల కోసం 1,247 మందిని అరెస్టు చేశారు. 11 ఎఫ్ఐఆర్లకు సంబంధించి 7 మందిని అరెస్టు చేసినట్లు స్టేటస్ నివేదిక పేర్కొంది. ► 11 ఎఫ్ఆఐర్లు మహిళలపై జరిగిన వేధింపుల ఘటనకు సంబంధించినవి పేర్కొన్నారు. అసలు వీటిలో ఎన్ని జీరో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి? ఎఫ్ఐఆర్ల నమోదులో గణనీయమైన లోపం కనిపిస్తోంది. కాబట్టి.. మణిపూర్ డీజీపీ శుక్రవారం(ఆగష్టు 4వ తేదీ) మధ్యాహ్నం 2 గంటలకు ఈ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలి. కోర్టుకు ఆయన సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి అని తెలిపింది. ఆ సమయంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేయడంతో.. సోమవారం(ఆగష్టు 7వ తేదీకి) మధ్యాహ్నానికి డీజీపీ హాజరు కావాలని ఆదేశాలు సవరించింది ధర్మాసనం. సమగ్ర నివేదికతో తమ ముందుకు రావాలని ఆదేశించారు సీజేఐ డీవై చంద్రచూడ్. ఎవరు బాధితుడు.. ఎవరు నేరస్తుడు అనేదాంతో సంబంధం లేదు. ఎవరు నేరం చేసినా కోర్టు తీరు ఇలాగే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ► ఘటన జరిగిన తేదీ, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీ, సాధారణ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీ, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయబడిన తేదీ, సెక్షన్ 164 సిఆర్పిసి కింద స్టేట్మెంట్లు నమోదు చేయబడిన తేదీ, అరెస్టుల తేదీ.. మొత్తం అన్నింటితో స్టేట్మెంట్ రూపొందించాలని తెలిపారు. ► రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టే పరిస్థితుల్లో మనం లేం. కాబట్టి.. ఒక యంత్రాంగం అవసరం. 6,500 ఎఫ్ఐఆర్ల దర్యాప్తును సీబీఐకి అప్పగించడం అసాధ్యమన్న విషయంపై మాకు స్పష్టత ఉంది. అదే సమయంలో.. రాష్ట్ర పోలీసులకు అప్పగించబడదు. అందుకే.. ► ప్రభుత్వ పనితీరును పరిశీలించడం, పరిహారం, పునరుద్దరణ పనులు, దర్యాప్తు స్వతంత్ర్యంగా జరిగేలా చూడడం, స్టేట్మెంట్లు నమోదు చేయడం.. ఇలా అన్ని వ్యవహారాలను చూసుకునేందుకు మాజీ న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సొలిసిటర్ జనరల్కు సుప్రీంకోర్టు సూచించింది. Supreme Court says government shall prepare a statement setting out date of occurrence, date of registration of zero FIR, date of registration of regular FIR, date on which witness statements have been recorded, date on which statements under section 164 CrPC have been recorded,… pic.twitter.com/exn7hAaI2B — ANI (@ANI) August 1, 2023 -
కీలక పరిణామం.. బ్రిజ్భూషణ్కు ఢిల్లీ కోర్టు సమన్లు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగిక వేదించడంతో పాటు బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్కు సమన్లు జారీ చేసింది. జూలై 18న కోర్టుకు హాజరుకావాలని కోరింది. బ్రిజ్ భూషణ్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 2న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లతో పాటు 10 ఫిర్యాదులు నమోదు చేశారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్పై వచ్చిన ఫిర్యాదుల్లో మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకడం, వారి చాతీపై చేయి వేయడం, నడుము బాగాన్ని చేతితో తడమడం లాంటివి చేసేవాడంటూ పేర్కొన్నారు. చదవండి: #ManchesterUnited: ఇంగ్లండ్ స్టార్కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా! #HappyBirthdayMSD: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' -
పరువునష్టం దావా.. రాజస్థాన్ సీఎంకు సమన్లు
సాక్షి, ఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ సమన్లలో పేర్కొంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గెహ్లాట్పై వేసిన పరువు నష్టం దావా ఆధారంగా ఈ సమన్లు జారీ అయ్యాయి. సుమారు 900 కోట్ల రూపాయలకు సంబంధించి గెహ్లాట్ చేసిన ఆరోపణలకుగానూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ దావా వేశారు. సంజీవని స్కామ్పై చేసిన వ్యాఖ్యలతో గెహ్లాట్ తన పరువు తీశారంటూ కోర్టుకెక్కారు కేంద్ర మంత్రి. అయితే.. నేరపూరిత పరువు నష్టం కేసులో సీఎంకు సమన్లు పంపాలా? వద్దా? అని తర్జనభర్జనలు చేసి.. ఆ ఉత్తర్వులను ఇదివరకే రిజర్వ్ చేసింది కోర్టు. ఇక ఇవాళ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ హజ్రీత్ సింగ్ జస్పాల్ ఇవాళ సీఎం గెహ్లాట్కు సమన్లు జారీ చేశారు. ఇంతకు ముందు మోదీ ఇంటి పేరు వ్యవహారంలో పరువు నష్టం దావా ద్వారా కోర్టు కేసు ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దోషిగా తేలి రెండేళ్ల శిక్ష పడడంతో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: కాళ్లు కడిగి మరీ క్షమాపణలు కోరిన సీఎం -
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ కీలక నేతలకు సమన్లు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ కీలక నేతలకు మరో షాక్ తలిగింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో బుధవారం కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు సైతం సమన్లు జారీ అయిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓ పేపర్ ప్రకటనే ఇందుకు కారణమైంది. మే 5వ తేదీన పబ్లిష్ అయిన పత్రికల్లో కాంగ్రెస్ పార్టీ ఓ యాడ్ ఇచ్చింది. బీజేపీని 40 శాతం అవినీతి పార్టీగా ఎద్దేవా చేస్తూ.. అందులో గత నాలుగేళ్లలో బీజేపీ లక్షన్నర కోట్ల డబ్బు దోచుకుందని ఆరోపించింది. ఈ ప్రకటన ఆధారంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేశవప్రసాద్ మే 9వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్.. రాహుల్ గాంధీతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు సైతం సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చేసిన మోదీ వ్యాఖ్యలు.. పరువు నష్టం దావాకి దారి తీయగా, ఈ ఏడాది మొదట్లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ఆ శిక్ష కారణంగానే ఆయన తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది కూడా. ఇదీ చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీం! -
మల్లికార్జున ఖర్గేకు షాక్.. పంజాబ్ కోర్టు సమన్లు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో జులై 10 న న్యాయస్థానం ముందు హాజరు కావాలని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బజరంగ్ దళ్ సంస్థను నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడంతో వివాదానికి దారితీసింది. దీనిపై బజరంగ్ దళ్ కోర్టును ఆశ్రయించింది. విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ ఫౌండర్ హితేష్ భరద్వాజ్ సంగ్రూర్ కోర్టులో పిటిషన్ కేసు దాఖలు చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా భజరంగ్దళ్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఖర్గేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు. దీనిపై సినీయర్ డివిజన్ బెంజ్ విచారణ చేపట్టింది. మల్లికార్జున ఖర్గేను జులై 10 న కోర్టుకు హాజరు కావాలని సివిల్ జడ్జి రమణదీప్ కౌర్ ఏఐసీసీ అధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భజరంగ్ దళ్ను దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని భరద్వాజ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే ఆ సంస్థను నిషేధిస్తామని కూడా హామీ ఇచ్చిందని తెలిపారు. చదవండి: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు -
సత్యపాల్ మాలిక్కు సీబీఐ సమన్లు
Satya Pal Malik News: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(76)కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) శుక్రవారం సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో సత్యపాల్ మాలిక్ను ప్రశ్నించాలని సీబీఐ భావించింది. ఈ మేరకు ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసులో సాక్షిగానే తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ సమన్లలో కోరింది. 2018లో కంపెనీ కాంట్రాక్ట్ను ఆ సమయంలో జమ్ము కశ్మీర్ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఆ ఫైల్స్ను స్వయంగా పర్యవేక్షించానని చెబుతూ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్కు సంబంధించి స్కాం ఇది. దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగులు 2018 సెప్టెంబర్లో ఇందులో చేరారు. అయితే.. అవకతవకలు ఉన్నాయంటూ నెలకే ఈ కాంట్రాక్ట్ను రద్దు చేస్తూ సంచలనానికి తెర తీశారు అప్పుడు గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో పాటు ట్రినిటీ రీఇన్సూరెన్స్ బ్రోకర్స్ను నిందితులుగా చేర్చింది సీబీఐ. ఇందులో మోసం జరిగిందని మాలిక్ ఆరోపించడంతో.. ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించేందుకే సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. CBI has asked me to come to their Delhi office to give clarification regarding the alleged insurance scam in J&K on 27th or 28th April: Former J&K Governor Satyapal Malik on alleged insurance scam involving Reliance General Insurance (file photo) pic.twitter.com/t9kLr3Dvrp — ANI (@ANI) April 21, 2023 ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఏప్రిల్లో మాలిక్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది సీబీఐ. అందులో ఒకటి పైన చెప్పుకున్న ఇన్సూరెన్స్ స్కీమ్ది కాగా, రెండోది జమ్ము కశ్మీర్ దాదాపు రూ.2,200 కోట్ల వ్యయంతో చేపట్టిన కిరూ హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలు. రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని సత్యపాల్ మాలిక్ ఏప్రిల్ 14న కరణ్ థాపర్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి ముందు, డీబీ లైవ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మాలిక్ ఈ ప్రస్తావన చేశారు. ఈ లైవ్ ప్రసారం కాగానే సత్యపాల్ మాలిక్కు రామ్ మాధవ్ పరువునష్టం నోటీసు పంపారు కూడా. సంచలనంగా సత్యపాల్ మాలిక్ చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సత్యపాల్ మాలిక్. ఆ తర్వాత భారతీయ లోక్దల్ పార్టీలో చేరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మాలిక్.. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు కూడా. ఆపై బీహార్, జమ్ము కశ్మీర్, గోవా, మేఘాలయాకు గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్రం వెనక్కి తీసుకున్న సమయంలో ఈయనే గవర్నర్గా ఉన్నారు. రైతుల ఉద్యమ సమయంలో ఈయన రైతులకు మద్దతు ప్రకటించడం, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. పుల్వామా దాడి, నరేంద్ర మోదీ మీద తాజాగా (ఏప్రిల్ 14వ తేదీన) కరణ్ థాపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనానికి తెర తీసింది. అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు పుల్వామా దాడి సమయంలో మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గవర్నర్గా ఉన్న తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 300 కేజీల ఆర్డీఎక్స్ పాక్ నుంచి రావడం, జమ్ము కశ్మీర్లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్ వ్యాఖ్యలు చేశారు. -
కేజ్రీవాల్ సీబీఐ ఎదుట హాజరవుతారు: ఆప్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో పాటు రాజకీయ ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కాంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో సీబీఐ ఆయన్ని కోరింది. ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ తన సమన్లలో పేర్కొంది. ఈ కుంభకోణం మొత్తానికి కారణమైన.. కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఆయన్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆదివారం ఆయన సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సీబీఐ ఈ స్కాంలో సిసోడియాను విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్ట్ చేసింది. సిసోడియా రిమాండ్ రిపోర్ట్లో కేజ్రీవాల్ పేరు ఉంది కూడా. ‘‘జాతీయ పార్టీ హోదా దక్కించుకున్న నేపథ్యంలోనే ఆప్పై ఒత్తిడి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. కానీ, ఆయన సీబీఐ ఎదుట హాజరు అవుతారు. పై నుంచి కిందిదాకా అవినీతిలో కూరుకుపోయింది మీరు(ప్రధాని మోదీని ఉద్దేశించి), మీ ప్రభుత్వమే. సీబీఐ సమన్లతో కేజ్రీవాల్ తన పోరాటం ఆపరు. సీబీఐ ఎదుట హాజరవుతారు. అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆయన తన గళం వినిపించడం ఆపరు’’ అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఖలీస్తానీ మద్ధతుదారుల దుశ్చర్య.. భారత్ కౌంటర్
లండన్లోని భారత హైకమిషనర్ వద్ద ఆదివారం జరిగిన పరిణామాలకు భారత్ తక్షణ కౌంటర్ ఇచ్చింది. పంజాబ్లో ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ అరెస్ట్కు నిరసనగా.. లండన్ హైకమిషనర్ ఆవరణలో భారత జాతీయ జెండాను ఖలీస్తానీ మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని కిందకు లాగేయాలని యత్నించడం.. ఆ వెంటనే అధికారులు స్పందించడం, తదనంతరం భారీ జాతీయ జెండాను ఎగరేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్ అల్డివిచ్ ఇండియా హౌజ్ బయట ఈ భారీ భారతీయ జాతీయ జెండాను ఎగరేయగా.. పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఈ పరిణామంపై ఝండా ఊంచా రహే హమారా అంటూ ట్విటర్లో పోస్ట్ ఉంచారు. భారత జెండాను అవమానించేలా వ్యవహరించిన వాళ్లపై యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జాతి సంరక్షణకు, పలు రకాల సేవలు అందించిన ఖ్యాతి పంజాబ్కు, పంజాబీలకు ఉందని పేర్కొన్నారు ఆయన. “Jhanda Ooncha Rahe Hamara”- UK Govt must act against those miscreants who attempted to disrespect Indian Flag at High Commission,London.Punjab & Punjabis have a glorious track record of serving/protecting the Nation.Handful of jumping jacks sitting in UK do not represent Punjab. pic.twitter.com/TJrNAZcdmf — Jaiveer Shergill (@JaiveerShergill) March 20, 2023 ఇదిలా ఉంటే.. జాతీయ జెండాను కిందకు లాగేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో భారత హైకమిషనర్ అధికారులు తక్షణం స్పందించారు. కౌంటర్గా ఖలీస్తానీ జెండాను విసిరేయడంపై.. పలువురు నెటిజన్స్ ప్రశసంలు గుప్పిస్తున్నారు. ఇక ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆదివారం అర్ధరాత్రి భారత్లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ క్రిస్టియానా స్కాట్కు ఈ ఘటనపై వివరణ కోరుతూ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మరోవైపు యూకే మంత్రి తారీఖ్ అహ్మద్ ఈ ఘటనను ఖండిస్తూ ఓ ట్వీట్ చేశారు. Salute to the Brave Indian High Commission Official 🙏🇮🇳 He not only took back the Indian flag but stopped the extremist from installing the K-Flag.#UK #London pic.twitter.com/4X0DJQo9hV — Megh Updates 🚨™ (@MeghUpdates) March 19, 2023 ఇదీ చదవండి: ఒకేసారి.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం -
తేజస్వి యాదవ్కు సీబీఐ సమన్లు
పాట్నా: బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్లో దర్యాప్తు చేపట్టిన సీబీఐ, లాలూ కుటుంబాన్ని వరుసగా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా లాలూ తనయుడిని ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు పంపింది. తేజస్వికి సీబీఐ సమన్లు ఇవ్వడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 4న ఆయనకు తొలిసారి సమన్లు జారీ చేశారు. అంతేకాదు తేజస్వి తల్లిదండ్రులు లాలూ, రబ్రీదేవిలను ప్రశ్నించారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ కుంభకోణానికి సంబంధించి మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా శుక్రవారం నాడు తేజస్వి యాదవ్ నివాసాలతో పాటు 24 చోట్ల రైడ్స్ నిర్వహించింది. మరోవైపు దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తోందని బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని తేజస్వి యాదవ్ మండిపడుతున్నారు. 2004 నుంచి 2009 మధ్యలో లాలు రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య రైల్వే బోర్డు రిక్రూట్మెంట్లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఐఆర్సీటీసీలో గ్రూప్ డీ సంబంధిత పోస్టులను దొడ్డిదోవన కొందరికి కట్టబెట్టినట్లు తేల్చింది. ఆ సమయంలో రైల్వే మంత్రిగా లాలూ ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పించినందుకుగానూ.. కొంతమంది అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూముల్ని కారుచౌక ధరకే పొందారన్న అభియోగాలు లాలూ కుటుంబ సభ్యులపైనా నమోదు అయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కిందటి ఏడాది మే నెలలో సీబీఐ కేసు నమోదు చేసి.. అక్టోబర్ నెలలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. -
Delhi Liquor Scam: మనీశ్ సిసోడియాకు మరోసారి సమన్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ మరోసారి సమన్లు పంపింది. డిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఆదివారం విచారణకు రావాలని ఆదేశించింది. సిసోడియాపై తాజాగా లభించిన ఆధారాలు చూసే ఆయనకు సీబీఐ నోటీసులు పంపినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. తనకు నోటీసులు పంపిన విషయాన్ని సిసోడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సీబీఐ తనను మరోసారి విచారణకు పిలిచిందని పేర్కొన్నారు. కేంద్రం తన అధికారాలను ఉపయోగించి ఈడీ, సీబీఐని తనపైకి ప్రయోగిస్తోందని విమర్శించారు. 'నా ఆఫీసు, ఇల్లు వెతికారు. బ్యాంకు లాకర్ చెక్ చేశారు. కానీ నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లభించలేదు. ఢిల్లీ పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నా. కానీ వాళ్లు నన్ను ఆపాలని చూస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నా. దాన్నే కొనసాగిస్తా.' అని సిసోడియా ట్వీట్ చేశారు. सीबीआई ने कल फिर बुलाया है. मेरे ख़िलाफ़ इन्होंने CBI, ED की पूरी ताक़त लगा रखी है, घर पर रेड, बैंक लॉकर तलाशी, कहीं मेरे ख़िलाफ़ कुछ नहीं मिला मैंने दिल्ली के बच्चों के लिए अच्छी शिक्षा का इंतज़ाम किया है। ये उसे रोकना चाहते हैं। मैंने जाँच में हमेशा सहयोग किया है और करूँगा. — Manish Sisodia (@msisodia) February 18, 2023 ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముడుపులు తీసుకుని కొందరికి ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలకు మార్పులు చేశారని ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గతేడాది ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. మనీశ్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారించింది. చదవండి: బ్రెడ్ కోసం లొట్టలు వేస్తున్న భారతీయులు.. నెలకు రూ.800 వరకు ఖర్చు! -
రేపు విచారణకు రావాలని డిప్యూటీ సీఎం సిసోడియాకు సమన్లు
-
Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్!
న్యూఢిల్లీ: టెక్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 10వేల ఉద్యోగాల కోత ప్రకటన తరువాత వచ్చే పరిణామాలను ఎదుర్కొ నేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఈ మేరకు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఇండియన్ టెకీలను వేడు కుంటోంది. అంతేకాదు అలా చేసిన వారికి భారీ ప్రయోజనాలు అందిస్తామని కూడా ప్రకటించింది. దీంతో ఈ అంశం హాట్టాపిక్గా నిలిచింది. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?) అమెజాన్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ టీమ్లో L1 నుండి L7 బ్యాండ్లో పని చేస్తున్న భారతీయ ఉద్యోగులు కంపెనీ వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్కు అర్హులని పేర్కొంది. ఈ పథకం కింద ఈ సంవత్సరం నవంబర్ 30 లోపు రాజీనామా చేస్తే వారికి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇస్తోంది. దీంతో పలువరు ఇండియన్ ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామాలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?) కార్మిక మంత్రిత్వ శాఖ సమన్లు భారతీయఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విమరణకు అమెజాన్ ప్రయత్నాలపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అమెజాన్కు కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసు లిచ్చింది. దీనిపై విచారణకు హాజరు కావాలని మంగళవారం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఏ అంజనప్ప కంపెనీకి నోటీసులు పంపారు. భారతదేశంలో అమెజాన్ చేసిన తొలగింపులపై ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఫిర్యాదు మేరకు, బెంగళూరులోని ఈకామర్స్ దిగ్గజం సీనియర్ పబ్లిక్ పాలసీ మేనేజర్ స్మితా శర్మను (బుధవారం నవంబర్ 23న జరిగే) విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఐటి/ఐటిఇఎస్ ఉద్యోగుల యూనియన్ గత వారం కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్కు రాసిన లేఖలో, దేశంలోని అమెజాన్ ఉద్యోగులను స్వచ్ఛందంగా కంపెనీ నుండి వైదొలగాల్సి వస్తోందన్న ఫిర్యాదులు అందాయని పేర్కొంది. దేశంలోని కార్మిక చట్టాలను అమెజాన్ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించిన ఉద్యోగులకు భారీ పరిహారం అందించాల్సి ఉంటుంది. అందుకే నవంబర్ 30, 2022న భారత ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలలోపు స్మార్ట్ ఫారమ్ల ద్వారా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటూ ఉద్యోగులకు ఒక నోట్ పంపింది. అయితే ఉద్యోగులు రాజీనామా చేసిన తర్వాత ఎంత సమయంలోపు ఈ పరిహారం అందిస్తుంది అనేది అమెజాన్ స్పష్టం చేయలేదు. ఈ స్కీం కింద 22 వారాల బేస్ పే; అలాగే ప్రతి ఆరు నెలల సర్వీస్కు ఒక వారం మూల వేతనం (సమీప 6 నెలల వరకు ఉంటుంది) గరిష్ట ప్రయోజనం ఇరవై వారాల వరకు చెల్లింపు, బీమా బెనిఫిట్ పాలసీ ప్రకారం 6 నెలల పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదా దానికి బదులుగా సమానమైన బీమా ప్రీమియం మొత్తం తదితర ప్రయోజనాలను ఆఫర్ చేసింది.ఒక ఉద్యోగిని కంపెనీ తొలగించినట్లయితే, తొలగింపును చట్టపరంగా సవాలు చేయవచ్చు. కానీ ఒక ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు, న్యాయస్థానంలో ఉద్యోగం కోల్పోవడంపై సవాలు చేసే హక్కును కోల్పోతారు. ఇదే కంపెనీ ఎత్తుగడ అని లానోజిఎమ్బిహెచ్ ఎంప్లాయిమెంట్ లా ప్రాక్టీషనర్, జనరల్ కౌన్సెల్ భాగ్యశ్రీ పాంచోలో వ్యాఖ్యానించారు. కాగా ఆర్థికమందగమనం, ఆదాయాలు క్షీణత నేపథ్యంలో తన గ్లోబల్ వర్క్ఫోర్స్ను విభాగాల్లో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు వచ్చే ఏడాది కూడా ఈ తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు: అమెజాన్ కీలక నిర్ణయం) -
‘ఈ నాన్చుడెందుకు.. డైరెక్ట్గా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్
రాంచీ: ‘నేను తప్పు చేసినట్లయితే, ఈ ప్రశ్నించటాలేంటి? నేరుగా వచ్చి అరెస్ట్ చేయండి.’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. బొగ్గు కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ట్రైబల్ ముఖ్యమంత్రిని వేధింపులకు గురిచేసే కార్యక్రమంలో భాగంగానే ఈడీ సమన్లు జారీ చేసినట్లు ఆరోపించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘నాకు ఛత్తీస్గఢ్లో కార్యక్రమంలో ఉన్న క్రమంలో ఈరోజు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. నేను పెద్ద నేరం చేసినట్లు అయితే, రండి, నన్ను అరెస్ట్ చేయండి. ఈ ప్రశ్నించటాలేందుకు?. ఈడీ ఆఫీస్ వద్ద భద్రత పెంచారు. జార్ఖండ్ ప్రజలను చూసి ఎందుకు భయపడుతున్నారు?. అధికార బీజేపీని వ్యతరేకిస్తున్న వారి గొంతు నొక్కేందుకు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయటమే ఇది. ఈ కుట్రకు తగిన సమాధానం లభిస్తుంది.’అని పేర్కొన్నారు సీఎం హేమంత్ సోరెన్. రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ వెళ్లకుండా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంతకు ముందు బీజేపీ పేరు చెప్పకుండానే ట్విటర్ వేదికగా పరోక్ష విమర్శలు చేశారు సీఎం. ‘నన్ను వేధించేందుకు జరుగుతున్న ఈ దాడుల వెనుక అసలు కుట్ర ట్రైబల్స్, వెనకబడినవారు, మైనారిటీల హక్కులను కాలరాసేందుకే. నాకు రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల మద్దతు ఉన్నంత వరకు వారి కుట్రల్లోనే ఏ ఒక్కటి ఫలించదు.’అని పేర్కొన్నారు. బొగ్గు మైనింగ్ కుంభకోణం కేసులో ఇప్పటికే ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రా సహా మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసింది ఈడీ. జులైలో దాడులు నిర్వహించి మిశ్రా బ్యాంకు ఖాతాల్లోని రూ.11.88 కోట్లు సీజ్ చేసింది. అలాగే ఆయన ఇంట్లో రూ.5.34 కోట్ల అక్రమ నగదు లభించినట్లు వెల్లడించింది. #WATCH | I've been summoned by ED today when I already have a program in Chhattisgarh today. If I've committed a crime that big, come & arrest me. Why the questioning?... Security near ED office has increased. Why, are you scared of Jharkhandis?, says Jharkhand CM Hemant Soren pic.twitter.com/41cR92FCHM — ANI (@ANI) November 3, 2022 ఇదీ చదవండి: Hemant Soren: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం -
తల్లి పాదాలను తాకి...సీబీఐ కార్యాలయానికి సిసోడియా!
న్యూఢిల్లీ: గుజరాత్లో సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే తనపై ఇలాంటి చర్యలకు దిగుతోందంటూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బీజేపీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ మనీష్ సిసోడియాని లిక్కర్ కేసు విషయమై సోమవారం ఉదయం హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా ట్విట్టర్లో... గుజరాత్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా తనపై ఇలా సీబీఐ దాడులు చేయించి, జైల్లో పెట్లాలనుకుంటుంది. ఐతే తాను జైలుకి వెళ్లినప్పటికీ గుజరాత్ ఎన్నికల ప్రచార ర్యాలీని మాత్రం ఆపలేరంటూ సవాలు విసిరారు. మొదటగా సీబీఐ ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయమై తన ఇంటిపై దాడులు నిర్వహించింది. ఐతే వారికి అక్కడ ఏమి దొరకలేదు. దీంతో బీజేపీకి గుజరాత్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే తనను జైల్లో పెట్టే కుట్రకు ప్లాన్ చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సీబీఏ కార్యాలయానికి వెళ్లే ముందు తల్లి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుని మరీ వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. मेरे ख़िलाफ़ पूरी तरह से फ़र्ज़ी केस बनाकर इनकी तैयारी मुझे गिरफ़्तार करने की है. मुझे आने वाले दिनों में चुनाव प्रचार के लिए गुजरात जाना था। ये लोग गुजरात बुरी तरह से हार रहे हैं। इनका मक़सद मुझे गुजरात चुनाव प्रचार में जाने से रोकना है। 1/N — Manish Sisodia (@msisodia) October 17, 2022 (చదవండి: మనీష్ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్ చేస్తుంది: ఆప్) -
మనీష్ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్ చేస్తుంది: ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సీసోడియాకు సమన్లు జారీ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. సీబీఐ రేపు మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తుందని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ జోస్యం చెప్పారు. ఈ సమన్లు త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికలకు సంబంధించి వచ్చాయని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఆప్ గట్టి పోటీ ఇవ్వనుందని, దీంతో బీజేపీకి భయం పట్టుకుందని విమర్శించారు. ఈ క్రమంలోనే సిసోడియాకు సమన్లు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సీబీఐ తాజాగా సమన్లు జారీ చేయడంపై సిసోడియా ట్విటర్ ద్వారా స్పందించారు. గతంలో తన ఇళ్లు, బ్యాంక్, స్వస్థలంలో సీబీఐ 14 గంటలు సోదాలు చేసినప్పటికీ.. ఏం దొరకలేదని తెలిపారు. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు. అయినప్పటికీ సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. मेरे घर पर 14 घंटे CBI रेड कराई, कुछ नहीं निकला. मेरा बैंक लॉकर तलाशा, उसमें कुछ नहीं निकला. मेरे गाँव में इन्हें कुछ नहीं मिला. अब इन्होंने कल 11 बजे मुझे CBI मुख्यालय बुलाया है. मैं जाऊँगा और पूरा सहयोग करूँगा. सत्यमेव जयते. — Manish Sisodia (@msisodia) October 16, 2022 ఇదిలా ఉండగా మనీష్ సిసోడియాకు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతుగా నిలిచారు. డిప్యూటీ సీఎం సిసోడియాను స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్తో పోల్చారు. ఆనాడు జైలు, ఉరికంబం సింగ్ ధృడ సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయని గుర్తు చేశారు. ఇది స్వేచ్ఛ కోసం జరుగుతున్న రెండో పోరాటమని అభివర్ణించారు. మనీష్, సత్యేంధ్ర జైన్ నేటి భగత్ సింగ్లు అని ట్వీట్ చేశారు. जेल की सलाख़ें और फाँसी का फंदा भगत सिंह के बुलंद इरादों को डिगा नहीं पाये ये आज़ादी की दूसरी लड़ाई है।मनीष और सत्येंद्र आज के भगत सिंह है 75 साल बाद देश को एक शिक्षा मंत्री मिला जिसने ग़रीबों को अच्छी शिक्षा देकर सुनहरे भविष्य की उम्मीद दी करोड़ों ग़रीबों की दुआएँ आपके साथ है https://t.co/slc3lb1Mqp — Arvind Kejriwal (@ArvindKejriwal) October 16, 2022 -
ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైస్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియాకు సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. సీబీఐ సమన్లు జారీ చేయటంపై స్పందించారు సిసోడియా. గతంలో సీబీఐ దాడులు చేపట్టగా తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే, దర్యాప్తు సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ‘నా ఇంటిలో సీబీఐ 14 గంటల పాటు సోదాలు నిర్వహించింది. కానీ, ఏమీ లభించలేదు. వారు నా బ్యాంకు లాకర్ను సైతం తనిఖీ చేశారు. అక్కడా ఏమీ లభించలేదు. మా గ్రామంలోనూ వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. నేను వెళ్లి వారికి పూర్తిగా సహకారం అందిస్తాను.’ అని తెలిపారు సిసోడియా. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 15 మంది నిందితుల్లో మనీశ్ సిసోడియా పేరును కూడా చేర్చింది. ఇప్పటికే ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. అవినీతి ఆరోపణలను ఆప్ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వేలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ఇదీ చదవండి: రైతులకు శుభవార్త.. రేపే పీఎం కిసాన్ 12వ విడత నిధుల విడుదల -
మేము డేంజరా? మరి అణ్వాయుధాలున్న భారత్ ప్రమాదం కాదా?
ఇస్లామాబాద్: అణ్వాయుధ సమన్వయం లేని పాకిస్థాన్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బైడెన్ వాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఇస్లామాబాద్లోని అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్కు సమన్లు పంపింది. పాకిస్థాన్ తన సమగ్రత, భద్రత విషయంలో మొండిగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు. ఒకవేళ ప్రశ్నలు లేవనెత్తాల్సి వస్తే భారత్లో అణ్వాయుధాలపై కూడా ప్రశ్నించాలని పేర్కొన్నారు. బైడెన్ కామెంట్లు తనను షాక్కు గురిచేశాయని భుట్టో అన్నారు. సమన్వయ లోపం వల్లే బైడెన్ పొరబడి ఉంటారని చెప్పారు. లాస్ ఏంజెల్స్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్థాన్ అత్యంత ప్రమాదకర దేశమని బైడెన్ అన్నారు. పాక్ ప్రధాని అమెరికాతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: పాకిస్తాన్పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు -
నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే సోదరులకు ఈడీ సమన్లు
బనశంకరి: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఆయన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు పిలిచారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను కొనుగోలు చేసిన యంగ్ ఇండియా ట్రస్ట్కు డీకే సోదరులు చెక్ ఇచ్చినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈడీ సమన్లపై శివకుమార్ స్పందించారు. ఈడీకి తనపై చాలా ప్రేమ ఉందని, అందుకే పదేపదే సమన్లు పంపిస్తోందని అన్నారు. ఈ నెల 7వ తేదీన రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో తాను తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉందని, విచారణకు హాజరు కావడానికి మరో గడువు ఇవ్వాలని కోరుతూ ఈడీకి మెయిల్ చేశామని చెప్పారు. -
ఈడీ ముందుకు కేపీసీసీ చీఫ్ శివకుమార్
సాక్షి బెంగళూరు: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(60) సోమవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణకు రావాలంటూ గురువారం డీకే శివకుమార్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శివకుమార్ వైద్యులతో పాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో 30 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లు, అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న శివకుమార్ను ఈడీ విచారణకు పిలవడం గమనార్హం. రూ.75 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై 2020లో సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించిన రెండో మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన కుమార్తె ఐశ్వర్యను కూడా ప్రశ్నించింది. -
అర్షదీప్ వ్యవహారం.. కేంద్రం తీవ్రస్పందన
టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్పై కొందరు టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆదివారం పాక్తో మ్యాచ్ సందర్భంగా.. మ్యాచ్ను మలుపు తిప్పే కీలకమైన క్యాచ్ను వదిలేశాడంటూ అర్షదీప్ను తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో పాటు పలువురు ఆటగాళ్లు, మాజీల మద్దతు అతనికి లభిస్తోంది. అయితే.. అర్షదీప్ సింగ్ వ్యవహారంలో అనుచితమైన చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు. అతనిపై దాడి చేస్తామని, చంపేస్తామని కొందరు బైకులపై తిరుగుతూ గోల చేయడం తెలిసిందే. తాజాగా అతనికి నిషేధిత సంస్థ ఖలీస్తానీతో సంబంధం ఉందంటూ తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. అతని వికీపీడియా పేజీలో భారత్ స్థానంలో ఖలిస్తాన్ అంటూ ఎడిట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. అయితే.. ఈ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. వికీపీడియా పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల మత సామరస్యం దెబ్బతింటుందని, పైగా అర్షదీప్ కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది. తప్పుడు సమాచారం ఎలా ప్రచురితమైందో వివరణ ఇవ్వాలని అందులో కోరింది. ఇదిలా ఉంటే.. అర్షదీప్ వికీపీడియా పేజీలో భారత్ అని ఉన్న చోట.. ఖలిస్తాన్ అని జత చేశారు. అది అన్రిజిస్టర్డ్ అకౌంట్ నుంచి జత అయినట్లు తెలుస్తోంది. అయితే.. 15 నిమిషాలోపే వికీపీడియా ఎడిటర్స్ ప్రొఫైల్ను సవరించారు. ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పాలైన తర్వాత అర్షదీప్ సింగ్పై కొందరు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మ్యాచ్లో భాగంగా 18వ ఓవర్లో మూడో బంతికి రవి బిష్ణోయ్ వేసిన బంతిని అసిఫ్ అలీ స్వీప్ షాట్ అడగా.. సలువైన క్యాచ్ను అర్షదీప్ జారవిడిచాడనే విమర్శ చెలరేగింది. అయితే.. ఉత్కంఠభరితమైన చివరి ఓవర్లో అర్షదీప్ సింగ్ పరుగుల కట్టడికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్షదీప్కు విపరీతమైన మద్దతు లభిస్తోంది. Catch drop by arshdeep singh 😭#arshdeepsingh #INDvPAK #INDvsPAK2022 pic.twitter.com/ttxabkCArI — Girish Singh rajput (@GirishSinghraj3) September 4, 2022 Senior pro Virat Kohli backs youngster Arshdeep Singh, who had a volatile day at the field today#AsiaCup2022 #INDvsPAK #ViratKohli #ArshdeepSingh pic.twitter.com/FYPl5N4PMx — OneCricket (@OneCricketApp) September 4, 2022 He is best in death overs , we can’t blame for his one match.. I stand with #arshdeepsingh #INDvsPAK2022 pic.twitter.com/pDkbYTrBWY — Karan Sandhu (@Karanbi03633746) September 5, 2022 #NewProfilePic pic.twitter.com/ksSXCNMOgC — Aakash Chopra (@cricketaakash) September 5, 2022 ఇదీ చదవండి: చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా? -
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ అమలుకు సంబంధించిన అవినీతి వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం ముగ్గురు నిందితులను తమ ప్రధాన కార్యాలయానికి రప్పించి, ప్రశ్నించింది. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. పూర్తి వివరాలను అధికారులు బహిర్గతం చేయడం లేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి తెలిసిందే. సీబీఐ శనివారం కొందరు నిందితులకు సమన్లు జారీ చేసింది. శుక్రవారం మనీశ్ సిసోడియా నివాసం సహా వివిధ ప్రాంతాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నన్లు అధికారులు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొందరు నిందితులకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. వారందరినీ పిలిపించి, లిక్కర్ కుంభకోణంపై లోతుగా విచారిస్తామని అన్నారు. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం దృష్టి పెట్టింది. ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లోని సమాచారాన్ని సీబీఐ.. ఈడీకి అందజేసింది. -
కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా!
బీజింగ్: జీ7 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు విడుదల చేసిన ప్రకటనలో కెనడా పాల్గొనడం విషయమైన చైనా మండిపడుతోంది. ఈ మేరకు ఈ విషయమై కెనడా దౌత్యవేత్త జిమ్ నికెల్ని పిలిపించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఐతే తైవాన్ జలసంధి చుట్టూ ఉన్న ఉద్రిక్తతను శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవాల్సిందిగా జీ 7 దేశాలు పిలిపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీజింగ్ తాజాగా కెనడా పై ఈ విధమైన దౌత్యపరమైన బెదిరింపులకు దిగింది. ఈ మేరకు చైనా డిప్యూటి విదేశాంగ మంత్రి క్సీ ఫెంగ్ కెనడా దౌత్యవేత్త నికెల్ని పిలిపించి...తైవాన్ విషయమై కెనడా తక్షణమైన తన తప్పులను సరిదిద్దుకోవాలని హెచ్చరించింది. అలా కాకుంటే జరబోయే పరిణామాలను భరించాల్సిం వస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. (చదవండి: తైవాన్పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. భయానక దృశ్యాలు వైరల్) -
రౌత్కు మళ్లీ ఈడీ సమన్లు
న్యూఢిల్లీ/ముంబై: మనీ లాండరింగ్ కేసులో శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వాస్తవానికి సంజయ్ రౌత్ బుధవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఈడీ ఎదుటకు రాలేదు. ఆగస్టు మొదటి వారం వరకూ సమయం ఇవ్వాలని కోరుతూ సంజయ్ రౌత్ తన లాయర్ల ద్వారా ఈడీకి ఒక లేఖ పంపించారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్నానని, ఈడీ ఎదుటకు రాలేనని పేర్కొన్నారు. దీంతో ఈడీ ఆయనకు కొంత ఉపశమనం కలిగించింది. 27న హాజరు కావాలంటూ మరోసారి సమన్లు జారీ చేసింది. -
ఢిల్లీ మంత్రి భార్యకు ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య పూనమ్ జైన్కి ఈడీ సమన్లు జారీ చేసింది. జులై 14న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కోల్కతాకు చెందిన కంపెనీల్లో హవాలా లావాదేవీలకు సంబంధించి సత్యేంద్ర జైన్ అరెస్టు (మే 30) తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. జైన్ భార్య, తదితరులపై నమోదైన అక్రమ ఆస్తులు, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఏప్రిల్లో రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2017, ఆగస్టు 25న, సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సత్యేందర్ జైన్పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. జైన్ ఢిల్లీలో పలు షెల్ కంపెనీలను కొనుగోలు చేసినట్లు సమాచారం. 2010 నుండి 2014 వరకు కోల్కతాకు చెందిన ముగ్గురు హవాలా ఆపరేటర్లకు చెందిన 54 షెల్ కంపెనీల ద్వారా 16.39 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రి అయిన తరువాత ప్రయాస్, ఇండో, అకించన్ కంపెనీల వాటాలను 2015లో భార్య పూనమ్కు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. మరోవైపు జైన్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక సీబీఐ కోర్టు జూలై 11 వరకు పొడిగించింది. -
వివాదాస్పద వ్యాఖ్యలు.. నుపుర్ శర్మకు సమన్ల వెల్లువ
థానె: ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సస్పెండైన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మకు సమన్లు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల పోలీసులు ఆమెకు ఇప్పటికే నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా కోల్కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన నర్కెల్దంగా పోలీస్స్టేషన్లో హాజరు కావాలని కోరారు. టీఎంసీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సొహైల్ ఫిర్యాదు మేరకు నోటీసులిచ్చారు. నుపుర్ శర్మ అభ్యర్థన మేరకు ఆమె హాజరు కావాల్సిన గడువును మరికొద్ది రోజులు పొడిగించినట్లు మహారాష్ట్రలోని థానె జిల్లా భివాండి పోలీసులు తెలిపారు. ఈనెల 22వ తేదీన హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నుపుర్ శర్మకు నోటీసులు ఇచ్చినట్లు థానెలోని ముంబ్రా పోలీసులు, 25న హాజరు కావాలంటూ ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. బెంగాల్లో ఇంకా ఉద్రిక్తతే బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైలు మార్గాలపై నుపుర్ దిష్టిబొమ్మలను దహనం చేసి, బైఠాయించడంతో సియల్డా–హష్నాబాద్ మార్గంలో సోమవారం ఉదయం 20 నిమిషాలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఈస్టర్న్ రైల్వే తెలిపింది. ముర్షిదాబాద్, నడియా జిల్లాలతోపాటు హౌరాలోని కొన్ని ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలవుతోంది. యూపీలో 325 మంది అరెస్ట్ శుక్రవారం నాటి అల్లర్లకు సంబంధించి యూపీలోని 8 జిల్లాలకు చెందిన 325 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్ల్లర్లకు సూత్రధారి జావెద్ అహ్మద్ అక్రమంగా నిర్మించుకున్న ఇంటిని అధికారులు కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇది అన్యాయం, అక్రమమని బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఆరోపించారు. -
మనీ ల్యాండరింగ్ కేసులో.. సోనియా, రాహుల్కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం నోటీసులు జారీ చేసింది. గురువారం రాహుల్, జూన్ 8న సోనియా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరవాలని ఆదేశించింది. ఈ మేరకు వారికి సమన్లు పంపినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. సోనియా, రాహుల్లకు సమన్ల జారీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇలాంటి వాటికి భయపడబోమని కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వి, రణదీప్ సుర్జేవాలా అన్నారు. కేంద్రం కుట్రలకు తలవంచేది లేదని స్పష్టం చేశారు. ‘‘తప్పుల తడకల కేసులు పెట్టినంత మాత్రాన బీజేపీ కుట్రలేవీ ఫలించవు. మోదీ ప్రభుత్వం ఇది తెలుసుకోవాలి. స్వాతంత్య్రోద్యమ వాణి వినిపించిన పత్రిక నేషనల్ హెరాల్డ్. దాన్ని అడ్డు పెట్టుకుని సోనియాను, రాహుల్ను భయపెట్టలేరు’’ అన్నారు. కేంద్రం కుట్రలను చట్టపరంగా, సామాజికంగా, రాజకీయంగా కాంగ్రెస్ ఎదుర్కొంటుందని చెప్పారు. రాహుల్ విదేశాల్లో ఉన్నందున విచారణ తేదీని వాయిదా వేయాలని కోరినట్టు సింఘ్వి తెలిపారు. జూన్ 5 తర్వాత అందుబాటులో ఉంటానంటూ ఈడీకి లేఖ రాశారని మీడియాకు వెల్లడించారు. చట్టం తన పని చేస్తుంది: ఠాకూర్ కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. దర్యాప్తు సంస్థలు తమ పని చేసుకుంటూ వెళ్తాయని స్పష్టం చేసింది. తప్పు చేయకపోతే వారి నిర్దోషిత్వం కోర్టులో రుజువవుతుందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. అలాంటప్పుడు ఆందోళన దేనికని మంత్రులు ఠాకూర్, కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఏమిటీ కేసు? నేషనల్ హెరాల్డ్ పత్రికను స్వాతంత్రోద్యమ సమయంలో 1938లో నెహ్రూతో పాటు పలువురు స్వాతంత్య్ర యోధులు రూ.5 లక్షల మూలధనంతో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక కాంగ్రెస్ హయాంలో హెరాల్డ్ ప్రచురణ సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు భూములు, భవనాల రూపంలో ఎన్నో ఆస్తులు కట్టబెట్టాయి. 2008కల్లా పత్రిక మూతపడింది. జీతాలు తదితర బకాయిల చెల్లింపు కోసమంటూ పార్టీ నిధి నుంచి ఏజేఎల్కు రూ.90 కోట్లు కాంగ్రెస్ అప్పుగా ఇచ్చింది. తర్వాత రెండేళ్లకు సోనియా, రాహుల్ మూడొంతుల వాటాదార్లుగా రూ.5 లక్షల మూలధనంతో యంగ్ ఇండియన్ అనే సంస్థ పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ నేతలు, గాంధీల నమ్మకస్తులైన మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ అందులో మిగతా వాటాదార్లు. రూ.90 కోట్ల రుణాన్ని ఏజేఎల్ ఎటూ తీర్చలేదు గనుక దాని తరఫున ఏక మొత్త పరిష్కారంగా 50 లక్షలు చెల్లిస్తానంటూ యంగ్ ఇండియన్ ఇటు కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. అటు రుణం తీర్చినందుకు బదులుగా ఏజేఎల్ నుంచి నేషనల్ హెరాల్డ్ వాటాలను తనకు బదలాయించుకుంది. అలా వేల కోట్లు చేసే హెరాల్డ్ ఆస్తులన్నీ కారుచౌకగా సోనియా, రాహుల్ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ పరమయ్యాయని ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. యంగ్ ఇండియన్ పేరిట హెరాల్డ్ ఆస్తులను గాంధీలు అక్రమంగా సొంతం చేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. దాంతో 2013లో ఈ ఉదంతంపై ఈడీ కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్లను విచారించింది. యంగ్ ఇండియన్, ఏజేఎల్ ఆర్థిక లావాదేవీలు, ప్రమోటర్ల పాత్ర, షేర్హోల్డింగ్ తదితరాలపై స్పష్టత కోసం రాహుల్, సోనియాలను విచారించి వారి స్టేట్మెంట్లు నమోదు చేయనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. చదవండి: కాంగ్రెస్పై పీకే ఆసక్తికర వ్యాఖ్యలు -
ధనుష్కు మద్రాస్ హైకోర్టు షాక్.. సమన్లు జారీ
తమిళ స్టార్ ధనుష్కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ధనుష్ తమ కొడుకేనంటూ ఓ వృద్ధ దంపతులు దాఖలు చేసిన పిటిషన్పై ధనుష్కు కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా ధనుష్ తమ కొడుకేనంటూ కతిసేరన్, మీనాక్షి అనే దంపతులు 2016లో మదురై జిల్లాలోని మేలూర్లోని మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొన్ని ఏళ్లుగా కోర్టులో కేసు పెండింగ్లోనే ఉంది. ధనుష్ సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రాలు ఫేక్ అని ఆరోపిస్తూ కేసు వేశారు. ధనుష్ తమ మూడో కొడుకని, సినిమాల్లో నటించేందుకు చిన్నతనంలోనే ఇంటినుంచి పారిపోయి చెన్నై వచ్చాడని పిటిషన్లో పేర్కొన్నారు. ధనుష్ అసలైన తల్లిదండ్రులమని, అతని నుంచి రూ. 65 వేలు పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. ఇందుకు సదరు దంపతులు ధనుష్ బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి మెమో, ఫిజికల్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ను కూడా సమర్పించారు. దీంతో కేసును పరిష్కరించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయాలని కోర్టు సూచించగా.. ధనుష్, అతని తరపు న్యాయవాది ఈ అభ్యర్థనను తిరస్కరించారు. అయితే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ సరిపోతాయో లేదో చెక్ చేసేందుకు ధనుష్కు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ వైద్య పరీక్షల ఫలితాలు ధనుష్కు అనుకూలంగా రావడంతో దంపతుల ఆరోపణలు రుజువు చేసేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని 2020లో కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. చదవండి: హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు కాగా జ్యూడీషియల్ మెజిస్ట్రేట్లో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ కతిసేరన్ దంపతులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు ధనుష్ అందించిన ఆధారాలపై పోలీసులతో విచారణ జరిపించాలని కోరారు. ఈ క్రమంలోనే వివరణ ఇవ్వాలంటూ ధనుష్కు హైకోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ధనుష్ కొట్టిపారేశాడు. తాను తమిళ నిర్మాత కస్తూరి రాజా, విజయలక్ష్మిల కుమారుడినంటూ పేర్కొన్నారు. తన నుంచి డబ్బులు రాబట్టే ఉద్ధ్యేశంతో తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నాడు. చదవండి: Pooja Bhatt: నాన్నను బాత్రూమ్లో ఉంచి గడియ పెట్టడంతో ఫుల్ ఏడ్చేశా: నటి -
భీమా–కోరేగావ్ కేసులో పవార్కు సమన్లు
ముంబై: 2018 జనవరి 1న చోటుచేసుకున్న భీమా–కోరేగావ్ హింసాకాండ కేసులో దర్యాప్తు కమిషన్ నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్కు సమన్లు జారీ చేసింది. మే 5, 6న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఆయన సాక్ష్యాన్ని నమోదు చేస్తామని తెలిపింది. దర్యాప్తు కమిషన్కు శరద్ పవార్ ఏప్రిల్ 11న సమర్పించిన అదనపు అఫిడవిట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. భీమా–కోరేగావ్ సంఘటన విషయంలో తనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన జరగడానికి దారితీసిన పరిస్థితుల గురించి తనకు సమాచారం లేదన్నారు. భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 124ఏ(దేశద్రోహానికి సంబంధించినది) దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని శరద్ పవార్ కోరారు. ఈ సెక్షన్ను పూర్తిగా రద్దు చేయాలని లేదా ఇందులో మార్పులు చేయాలని విన్నవించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయడానికి 1870లో బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన సెక్షన్ 124ఏను ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశ సమగ్రతను కాపాడానికి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సరిపోతుందని సూచించారు. భీమా–కోరేగావ్ కేసులో దర్యాప్తు కమిషన్ 2020లో శరద్ పవార్కు సమన్లు జారీ చేసింది. కానీ, అప్పట్లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆయన హాజరు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సమన్లు జారీ చేయగా, గైర్హాజరయ్యారు. -
గ్లోబల్ టెక్ దిగ్గజాలకు సమన్లు
న్యూఢిల్లీ: పోటీని అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తున్న ఆరోపణలతో పలు గ్లోబల్ టెక్ దిగ్గజాలకు సమన్లు జారీ కానున్నాయి. ఇందుకు గురువారం పార్లమెంటరీ కమిటీ నిర్ణయాన్ని తీసుకుంది. వెరసి గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ట్విటర్ తదితరాలకు సమన్లు జారీ కానున్నాయి. తద్వారా ఆయా కంపెనీల పోటీతత్వ విధానాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై తదుపరి సమావేశాన్ని పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల 12న నిర్వహించే అవకాశముంది. పలు టెక్ దిగ్గజాలు పోటీ నివారణా పద్ధతులు అవలంబిస్తున్న ఆరోపణలపై ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూలంకషంగా చర్చించింది. చదవండి: హైదరాబాద్లో గూగుల్ క్యాంపస్, యువతకు ఐటీ ఉద్యోగాల రూప కల్పనే లక్ష్యంగా! ఆపై కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు ఈ అంశాలను నివేదించింది. కాగా.. పోటీ నివారణ పద్ధతులపై సరైన రీతిలో స్పందించేందుకు వీలుగా డిజిటల్ మార్కెట్స్ అండ్ డేటా యూనిట్ను ఏర్పాటు చేసినట్లు సీసీఐ పేర్కొంది. తద్వారా గ్లోబల్ టెక్ దిగ్గజాలపై యాంటీకాంపిటీషన్ చర్యలు చేపట్టేందుకు సీసీఐ చట్ట సవరణల కోసం కొత్త బిల్లును తీసుకురానున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా డిజిటల్ విభాగంలో పలు పరిశోధనలను చేపట్టినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, యాపిల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మేక్మైట్రిప్–గోఐబిబో, స్విగ్గీ, జొమాటో తదితరాలున్నట్లు పేర్కొంది. -
Yediyurappa: యడ్యూరప్పకు భారీ షాక్
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు గట్టి షాక్ తగిలింది. ఆయనపై నమోదు అయిన భూ ఆరోపణలకు సంబంధించి.. ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యడ్యూరప్పకు సమన్లు కూడా జారీ చేసింది. భూ సంబంధిత ‘డీనోటిఫికేషన్ వ్యవహారం’లో అవినీతికి పాల్పడ్డారంటూ యడ్యూరప్పపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు చేయాలని ఆదేశించింది బెంగళూరులోని ప్రత్యేక కోర్టు. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి క్రిమినల్ కేసులపై విచారణ కోసమే ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం గమనార్హం. మరోవైపు యడ్యూరప్పపై ఈ ఫిర్యాదు 2013లోనే నమోదు అయ్యింది. యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న టైంలో ఈ అవినీతి జరిగిందని, వాసుదేవ రెడ్డి అనే బెంగళూరువాసి ఈ ఫిర్యాదు నమోదు చేశారు. బెంగళూరు వైట్ఫీల్డ్-ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఉన్న ఐటీకారిడార్లో స్థలానికి సంబంధించి ఈ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. డీనొటిఫికేషన్ తర్వాత ఆ స్థలాలను పలువురు ఎంట్రప్రెన్యూర్లకు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో.. అవినీతి వ్యతిరేక నిరోధక చట్టం 1988 కింద.. యడ్యూరప్పపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్పెషల్ జడ్జి బీ జయంత కుమార్ ఆదేశించారు. అంతేకాదు తన ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో యడ్యూరప్పను ఆదేశించారు కూడా. చదవండి: హత్యా రాజకీయాలు బీజేపీ సంస్కృతి కాదు-షా -
జయలలిత మరణం మిస్టరీ: పన్నీరుకు సమన్లు..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. అలాగే, జయలలిత నివాసంలో సుదీర్ఘ కాలం ఉన్న చిన్నమ్మ శశికళ వదిన ఇలవరసికి కూడా సమన్లు జారీ అయ్యాయి. దివంగత సీఎం జే జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రెండో రోజుగా అపోలో వైద్యులు పలువురు విచారణకు హాజరయ్యారు. జయలలిత గుండెపోటు రావడంతోనే మరణించారని వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆమెకు రక్తనాళాల మార్పిడి శస్త్ర చికిత్స విషయంగా జయలలిత నెచ్చెలి శశికళ తరపు న్యాయవాది రాజ చెందూర్ పాండియన్క్రాస్ ఎగ్జామిన్లో ప్రశ్నలు సంధించారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరు కావాలని పన్నీరుసెల్వంకు ఆ కమిషన్ సమ న్లు జారీ చేసింది. అయితే, ఆ సమయంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉండటంతో విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు. తాజాగా ఆయన్ని ఈనెల 21వ తేది విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే, కేసు విచారణ సమయంలో శశికళ వదిన ఇలవరసి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను కూడా విచారించేందుకు కమిషన్ నిర్ణయించింది. శశికళతో పాటుగా జయలలిత నివాసం పోయేస్ గార్డెన్లో సుదీర్ఘ కాలం ఇలవరసి కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. -
జయలలిత మరణం మిస్టరి.. అపోలో వైద్యులకు సమన్లు
సాక్షి, చెన్నై: ఆర్ముగస్వామి కమిషన్ ఎయిమ్స్ వైద్యుల సహకారంతో ఈనెల 7వ తేదీ నుంచి దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఇందులో భాగంగా బుధవారం అపోలో వైద్యులకు సమన్లు జారీ అయ్యాయి. జయలలిత మరణం మిస్టరి నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ను గత అన్నాడీఎంకే ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో తమను విచారణ పరిధిలోకి ఈ కమిషన్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రెండేళ్ల కాలం వృథా అయ్యింది. గత ఏడాది పగ్గాలు చేపట్టిన డీఎంకే సర్కారు సైతం ఈ కమిషన్ పదవీ కాలాన్ని పొడిగించి విచారణను త్వరితగతిన ముగించాలని ఆదేశించింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఆర్ముగ స్వామికి సహకారంగా ఎయిమ్స్ వైద్యులను సుప్రీంకోర్టు రంగంలోకి దించింది. గత నెల ఈ వైద్య బృందంతో కమిషన్ వర్గాలు సమావేశమయ్యాయి. వైద్యపరంగా తమకు ఉన్న అనుమానాల్ని నివృతి చేసుకున్నారు. ఇక, వీరి సహకారంతో విచారణను వేగవంతం చేసి ప్రభుత్వానికి మరికొన్ని నెలల్లో నివేదిక సమర్పించేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అప్పట్లో జయలలితకు చికిత్స అందించిన అపోలో వైద్యులను ఈ కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. -
శశికళ, ఇళవరసికి సమన్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలులో ఖరీదైన జీవితం చిన్నమ్మ శశికళను మళ్లీ కష్టాలపాలు చేసింది. జైలు పక్షిలా కారాగారానికి పరిమితం కాకుండా జల్సా కోసం చేసిన పని ఆమెను చిక్కుల్లో పడేసింది. అంతేకాదు ఆమెతోపాటూ జైలు అధికారులు, వైద్యుడు సైతం కోర్టు బోనెక్కే పరిస్థితి నెలకొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్ నాలుగేళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడులయ్యారు. శిక్షాకాలంలో శశికళ తన పలుకుబడిని వినియోగించి ప్రత్యేకసెల్, లగ్జరీ వసతులతో కూడిన జీవితాన్ని అనుభవించారు. తన వదిన ఇళవరసికి సకల సౌకర్యాలు సమకూర్చడంతోపాటూ ఇరువురూ చెట్టాపట్టాల్ వేసుకుని బెంగళూరు నగరంలో షాపింగ్ చేసి గుట్టుగా జైలుకు చేరుకునేవారు. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో విషయం బట్టబయలైంది. అప్పటి జైళ్లశాఖ డీఐజీ రూప తీగలాగడంతో డొంక కదిలింది. జైళ్లశాఖ ఉన్నతాధికారులకు రూ.2 కోట్లు లంచం ముట్టజెప్పి శశికళ తన దందాను నడిపినట్లు కర్ణాటక ప్రభుత్వానికి ఆమె నివేదిక పంపారు. దీంతో రిటైర్డు ఐఏఎస్ అధికారి వినయ్కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం దర్యాప్తు జరిపించగా డీఐజీ రూప చేసిన ఈ ఆరోపణలు నిజమయ్యాయి. షాపింగ్ ముగించుకుని శశికళ, ఇళవరసి జైల్లోకి వస్తుండగా సీసీ టీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఇందుకు సంబంధించి చెన్నై ఆళ్వార్పేటకు చెందిన గీత అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టులో గత ఏడాది ఆగష్టు 25వ తేదీన తొలివిడత చార్జిషీటు దాఖలైంది. పోలీసులకు లంచం ఎరవేసిన వ్యవహారంలో శశికళ, ఇళవరసికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ తరపు న్యాయవాది మన్మోహన్ తుది చార్జిషీటు దాఖలు చేశారు. తొలి నిందితునిగా (ఏ వన్)గా పోలీస్ అధికారి కృష్ణకుమార్, ఏ 2గా డాక్టర్ అనిత, ఏ 3గా సురేష్, ఏ 4గా గజరాజ్ మాకనూరు, ఏ 5గా శశికళ, ఏ 6గా ఇళవరిసిని చార్జిషీటులో చేర్చారు. అవినీతి కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి లక్ష్మీ నారాయణన్ భట్ ముందుకు శుక్రవారం ఇది విచారణకు వచ్చింది. చార్జిషీటులో చేర్చిన మొత్తం ఆరుగురూ మార్చి 1వ తేదీన కోర్టుకు ప్రత్యక్షంగా హాజరయ్యేలా సమన్లు జారీ చేయాల్సిందిగా న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. అంటే చిన్నమ్మ, ఇళవరసి మరోసారి కోర్టు బోనెక్క తప్పదన్నమాట. -
సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీలకు నోటీసులు.. టీఆర్ఎస్లో ‘ప్రివిలేజ్’ సంకటం!
సాక్షి, హైదరాబాద్: బండి సంజయ్ దీక్ష భగ్నం, అరెస్టుతో మొదలైన రాజకీయవేడి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఆ ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులకు ప్రివిలేజ్ కమిటీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు ప్రభుత్వపరం గానే సమాధానం ఇవ్వాల్సి ఉన్నా.. రాజ కీయ పరిణామాలపై అందరి దృష్టి పడింది. దీక్ష భగ్నం తర్వాతి పరిణామాల నేపథ్యం లో పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమ ర్శలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తోపాటు పలువురు టీఆర్ ఎస్ నేతలు ఆ విమర్శలను తిప్పికొట్టారు కూడా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీలపై బెదిరింపులకు పాల్పడు తోందని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రివిలేజ్ కమిటీ నోటీసులకు ఏం సమాధానమిస్తారు, కమిటీ ఏం చేస్తుందన్న ది ఉత్కంఠగా మారింది. బీజేపీ నేతలు ఈ అంశంపై రాజకీయ విమర్శలు చేస్తే.. తా ము కూడా స్పందించాల్సి వస్తుందని టీఆర్ఎస్కు చెందిన ఓ ముఖ్య నేత వెల్లడిం చారు. ఈ అంశాన్ని తాము రాజకీయం చేయదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. -
సంజయ్పై దాడి సంగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉద్యోగుల సమస్య లపై దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ను కార్యాలయంలోకి వెళ్లి అరెస్టు చేసిన అంశంలో రాష్ట్ర సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీ, ఇతర పోలీసు అధికారులకు లోక్సభ ప్రివి లేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ అంశంలో బండి సంజయ్ ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. దాడి, అరెస్టు ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ వాదనలు విని.. ఆయన సమ ర్పించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను పరిశీలించింది. తర్వాత కొద్దిగంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమన్లు్ల జారీ అయ్యాయి. ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ శని వారం ఆదేశించారు. సమన్లు జారీ అయిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, హుజూరా బాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి, జమ్మికుంట ఇన్ స్పెక్టర్ కొమ్మినేని రాంచందర్రావు, హుజూరా బాద్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస్, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాసరావు, కరీంనగర్ టూటౌన్ ఇన్స్పెక్టర్ చలమల్ల నరేశ్ ఉన్నారు. -
ఎయిర్పోర్టు దాడి: విజయ్ సేతుపతికి కోర్టు సమన్లు
Summons Issued to Vijay Sethupathi After Maha Gandhi Files Complaint: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అతడి మెనేజర్ జాన్సన్లకు చెన్నై సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. విజయ్ బృందం తనపై దాడి చేసిందంటూ మహా గాంధీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్కి సమన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎయిర్పోర్టులో విజయ్ సేతుపతిపై జరిగిన దాడి సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయ్ని తన్నేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించిన విజువల్స్ బయటకు వచ్చాయి. ఆ వ్యక్తే ఈ మహా గాంధీ. చదవండి: నాకు ‘పుష్ప’ కథ తెలియదు: రష్మిక షాకింగ్ కామెంట్స్ అయితే గత నెల జాతీయ అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లిన విజయ్ నవంబర్ 2న చెన్నైకి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో చెన్నై ఎయిరోపోర్టులో విజయ్ని చూసిన మహా గాంధీ ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో విజయ్ టీంలో ఓ వ్యక్తి తనతో అభ్యంతరకరంగా వ్యవహరించి తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసినట్లు మహా గాంధీ ఆరోపిస్తూ కోర్టులో అతడు పటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో విజయ్ టీంకు, తనకు మధ్య ఘర్షణ జరిగిందని, ఈ వాగ్వాదం అనంతరం బెంగళూరు విమానాశ్రయం వెలుపల విజయ్ మేనేజర్ జాన్సన్ తనపై దాడి చేసినట్టు మహాగాంధీ చెన్నై కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో విజయ్, అతడి మేనేజర్కు చెన్నై కోర్టు నోటీసులు పంపింది. చదవండి: కరీనా కుటుంబంపై బీఎంసీ అధికారులు ఆగ్రహం -
కంగనా రనౌత్కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు, డిసెంబర్ 6న హాజరవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభకు చెందిన ‘శాంతి, సామరస్యం కమిటీ’ బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు సమన్లు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆక్షేపించింది. డిసెంబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు తమ ముందు హాజరై, వివరణ ఇవ్వాలని కంగనాను ఆదేశించినట్లు కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 20న ఇన్స్టాగ్రామ్లో ఆమె పెట్టిన ఓ పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. సిక్కు మతస్థులను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా కంగన అభివర్ణించినట్లు ఫిర్యాదుదారులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి పోస్టులు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయని, ఓ వర్గం ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తాయని రాఘవ్ చద్ధా పేర్కొన్నారు. శాంతి, సామరస్యం కమిటీని ఢిల్లీ అసెంబ్లీ 2020లో ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీలో కొన్ని నెలల క్రితం జరిగిన అల్లర్లకు సంబంధించిన ఫిర్యాదులపై ఈ కమిటీ విచారణ జరుపుతోంది. -
సీబీఐ డైరెక్టర్కు సమన్లు
ముంబై: మహారాష్ట్ర మాజీ డీజీపీ, సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్కు ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఫోన్ట్యాపింగ్, డేటా లీక్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ–మెయిల్ ద్వారా జైశ్వాల్కు సమాచారమిచి్చనట్లు సైబర్ విభాగం పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలో పోలీసు బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని అనిపించేలా, కావాలనే ఈ నివేదికను లీక్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో జైశ్వాల్కు తాజాగా సమన్లు పంపారు. -
కమెడియన్ వడివేలుకు షాక్.. నోటీసులు జారీ చేసిన కోర్టు
Court Issues Summons To Comedian Vadivelu: విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని సినీ నటుడు వైగై పుయల్ వడివేలుకు గురువారం ఎగ్మూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వడివేలు ఇంట్లో గతంలో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాంబరం సమీపంలో రూ .1.93 కోట్లకు 3.5 ఎకరాల స్థలాన్ని విక్రయించి, దానిని ఐటీ లెక్కల్లో చూపించనట్లు అధికారులు గుర్తించారు. దీంతో వడివేలు కంగుతిన్నాడు. ఈ స్థలం విషయంలో సహచర నటుడు సింగముత్తు తనను మోసం చేసినట్టు ఆరోపిస్తూ.. ఆయన సెంట్రల్ క్రైం బ్రాంచ్ను ఆశ్రయించారు.చదవండి: చార్లీ చాప్లిన్లా 'ఇస్మార్ట్ బ్యూటీ' 2007లో కొనుగోలు చేసిన ఈ స్థలాన్ని తన ప్రమేయం లేకుండా సింగముత్తుతో పాటుగా మరికొందరు విక్రయించినట్లు ఆరోపించారు. ఈ కేసు గత కొన్నేళ్లుగా ఎగ్మూర్ కోర్టులో ఉంది. కాగా విచారణకు రావాలని వడివేలుకు గతంలోనే సమన్లు జారీ అయ్యా యి. అయితే, ఆయన హాజరు కాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గురువారం పిటిషన్ విచారణకు రాగా, సింగముత్తు తరపు న్యాయవాదులు హాజరై పన్ను ఎగవేత కేసు నుంచి తప్పించుకునేందుకు వడివేలు ప్రయత్నిస్తున్నట్లు తమ వాదనలు వినిపించారు. ఆ స్థలాన్ని తాంబరం సమీపంలోని శేఖర్ అనే వ్యక్తికి విక్రయించి, ఇప్పుడేమో సింగముత్తు మోసం చేసినట్టు ఆరోపిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం విచారణకు తప్పక హాజరు కావాలని వడివేలుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎగ్మూర్కోర్టు న్యాయమూర్తి నాగరాజన్ డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు.చదవండి: ‘రిపబ్లిక్’ మూవీ చూసి రివ్యూ ఇచ్చిన టాలీవుడ్ పాప్ సింగర్ -
సీబీఐ, ఈడీపై పశ్చిమ బెంగాల్ స్పీకర్ ఆగ్రహం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్టంలోని శాసన సభ్యులపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ బీమన్ బాంద్యోపాధ్యాయ మీరు నా అనుమతి లేకుండా ఎలా చార్జిషీట్ దాఖలు చేశారంటూ సీబీఐ, ఈడీ అధికారులను ప్రశ్నించారు. (చదవడండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం..) ఈ క్రమంలో బాంద్యోపాధ్యాయ సెప్టెంబర్ 22న సీనియర్ సీబీఐ, ఈడీ అధికారులను అసెంబ్లీకి హాజరు కావాలంటూ...సమన్లు జారీ చేశానని తెలిపారు. ఈ మేరకు ముందస్తుగా సమాచారం గానీ , అనుమతి గానీ లేకుండా ఎందుకు చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. అధికార తృణమాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పోంజీ స్కాం, నారద స్టింగ్ ఆపరేషన్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిపై దర్యాప్తు సంస్థలు చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.(చదవండి: దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి) -
టీఎంసీ ఎంపీకి మూడోసారి ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21 న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో అభిషేక్కు సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి. బొగ్గు అక్రమ రవాణా కేసులో విచారణకు బెనర్జీ శుక్రవారం హాజరు కావాల్సి ఉంది కానీ సమయం తక్కువగా ఉందంటూ అభిషేక్ బెనర్జీ హాజరు కాలేదు. దాంతో ఈ నెల 21 న హాజరుకావాలని మరోసారి సమన్లు ఇచ్చింది. అలాగే సెప్టెంబరు 1న విచారణకు హాజరు కావాలని అభిషేక్ భార్య రుజిరాను ఈడీ సమన్లు జారీచేసింది. అయితే కోవిడ్ పరిస్థితులు కారణంగా చిన్నపిల్లలతో తాను ఢిల్లీకి కాలేనని, దీనికి బదులుగా ఆమె కోల్కతా ఇంటిలో ఆమెను ప్రశ్నించాలని ఈడీని కోరారు. సోమవారం (సెప్టెంబర్ 6) ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్లో ఈడీ అధికారులు అభిషేక్ బెనర్జీని ఎనిమిది గంటలకు పైగా విచారించారు. కుటుంబ సభ్యులతో సంబంధమున్న రెండు సంస్థలు అందుకున్న లెక్కకు మించిన డబ్బు గురించి ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విషయంలో పూర్తి సమాచారాన్ని అందించడంలో బెనర్జీని విఫలమైనట్టు తెలుస్తోంది.బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన నగదు విషయంలో వినయ్ మిశ్రా కీలక పాత్ర పోషించారని ఈడీ ఆ రోపిస్తోంది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడైన టీఎంసీ యువనేత వినయ్ మిశ్రాతో ఉన్న సంబంధాలపై బెనర్జీని సోమవారం ప్రశ్నించగా ఈ ఆరోపణలన్నింటిని తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రంపై పట్టు సాధించేందుకు తృణమూల్ కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది. 2023 లో అసెంబ్లీ ఎన్నికలే లక్క్ష్యంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ రానున్న బుధవారం (సెప్టెంబరు 15 ) త్రిపురలోని అగర్తలాలో రోడ్షో నిర్వహించ నున్నారని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ వెల్లడించారు. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: కెల్విన్కు నాంపల్లి కోర్టు సమన్లు
ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్ కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్కు తాజాగా నాంపల్లి కోర్టు సమన్లు జారి చేసింది. బోయినాపల్లి మాదక ద్రవ్యాల కేసులో టాస్క్ఫోర్స్ పోలీసులు కెల్విన్ను అరెస్టు చేసి ఎల్ఎస్డి రకం మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సీసీఎస్లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అవ్వడం.. పూర్తిస్థాయిలో విచారణ జరపకపోవడం, సకాలంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేకపోవడంతో బెయిల్పై బయటకు వచ్చాడు. 2016లో మళ్లీ ఎక్సైజ్శాఖ కెల్విన్ కేసు మరోసారి అరెస్టు చేయడంతో టాలీవుడ్ డ్రగ్ వ్యవహరం బయట పడింది. ఈ నేపథ్యంలో సీసీఎస్లోని నార్కోటిక్స్ విభాగం.. తాజాగా నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంతో కోర్టు ఆ ఛార్జ్సీట్ను విచారణకు స్వీకరించింది. దీంతో ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కెల్విన్కు కోర్టు సమన్లు జారీ చేసింది. -
2018లో బాడీగార్డు మృతి.. బీజేపీ నేత సువేందుకు సమన్లు
కోల్కతా: పశి్చమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారికి రాష్ట్ర సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. సువేందుకు బాడీగార్డుగా పని చేసిన సబ్ ఇన్స్పెక్టర్ సుభభ్రత చక్రవర్తి మరణానికి సంబంధించిన కేసులో ఆయనకు సీఐడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు కోల్కతాలోని భవాని భనవ్ సీఐడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా చెప్పింది. 2018లో బాడీగార్డు చక్రవర్తి మరణించారు. తుపాకీతో తనకు తానే కాల్చుకొని మరణించినట్లు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఏడాది జూలైలో తన భర్త కేసును మళ్లీ దర్యాప్తు చేయాల్సిందిగా చక్రవర్తి భార్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో కేసు సీఐడీ చేతికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సువేందు అధికారికి సీఐడీ సమన్లు జారీ చేసింది. (చదవండి: వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ) -
‘ఇద్దరు పిల్లల తల్లిని.. విచారణకు హాజరుకాలేను’
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. విచారణ కోసం ఢిల్లీకి రావాలంటూ ఆమెకు లేఖను పంపింది. అయితే తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని, మహమ్మారి వ్యాప్తి కారణంగా తాను ఢిల్లీకి ప్రయాణం చేయడం వలన తనతో పాటు తన పిల్లల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోల్కతాలోనే తన ఇంట్లో విచారించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఈడీని అభ్యర్ధిస్తూ ఓ లేఖను పంపింది. కాగా సెప్టెంబర్ ఆరో తేదీ లోగా ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ తన ఆదేశాల్లో పేర్కొంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడే ఎంపీ అభిషేక్ బెనర్జీ. కేవలం రాజకీయ ఎజెండాలో భాగంగానే తన మేనల్లుడు, అతని భార్యపై కేంద్రం ఇలాంటి చర్యలు చేపడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. కేంద్రం మాకు వ్యతిరేకంగా ఈడీని ఉపయోగిస్తోంది. అందుకు తిరిగి ఎలా పోరాడాలో మాకు తెలుసు. అలాగే గుజరాత్ చరిత్ర కూడా మాకు తెలుసని వ్యాఖ్యానించారు. కాగా కేంద్రం, మమత మధ్య గత కొన్నాళ్ల నుంచి వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. బెంగాల్లోని ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్లో అక్రమ బొగ్గు మైనింగ్తో లింకు ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణ చేపడుతోంది. చదవండి: ‘అమ్మ ఆవేదన’కు కదిలిన హృదయాలు -
ఈడీ సమన్లు: దీదీ తాజా సవాల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ సర్కార్పై మరోసారి విరుచుకుపడ్డారు. బొగ్గు స్మగ్లింగ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజీరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీచేసిన నేపథ్యంలో ఆమె కేంద్రంపై మండిపడ్డారు. దేశాన్ని తెగనమ్మేసిన బీజేపీ బొగ్గు కుంభకోణంలో టీఎంసీని వేలెత్తి చూపినందువల్ల ప్రయోజనం లేదని, అది కేంద్ర పరిధిలోనిదన్నారు. దమ్ముంటే తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె సవాల్ విసిరారు. చదవండి : Coal scam: అభిషేక్, భార్య రుజీరాకు ఈడీ సమన్లు బొగ్గు స్కాం వ్యవహారంలో తమ పార్టీపై దాడిచేయడాన్ని ప్రశ్నించిన మమతా అది కేంద్రం పరిధిలోనిదని పేర్కొన్నారు. మరి బొగ్గు గనుల స్వాహాలో బీజేపీ మంత్రుల సంగతేంటి? బెంగాల్, అసన్సోల్ ప్రాంతంలోని కోల్ బెల్ట్ను దోచుకున్న బీజేపీ నాయకుల సంగతేంటని ప్రశ్నించారు. గుజరాత్ చర్రిత ఏంటో తెలుసు.. తమపై ఒక కేసు పెడితే, తాము మరిన్ని కేసులను వెలుగులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా దీదీ హెచ్చరించారు. దీనిపై తిరిగి ఎలా పోరాడాలో తమకు తెలుసని ఆమె పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా ఈడీని ఎందుకు వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు వంటి సహజ వనరుల హక్కుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని మమతా గుర్తు చేశారు. -
సీఎం, మాజీ సీఎంలకు షాక్.. కోర్టుకు రండి
సాక్షి, చెన్నై: పుహలేంది దెబ్బకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళనిస్వామిలకు ఏర్పడింది. ఆ మేరకు మంగళవారం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా బెంగళూరు పుహలేంది ఇది వరకు వ్యవహరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి తొలగించారు. తనను అకారణంగా తొలగించారంటూ కోర్టు తలుపుల్ని పుహలేంది తట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు ఈ పిటిషన్ మంగళవారం చేరింది. వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి స్పందిస్తూ పన్నీరుసెల్వం, పళనిస్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేశారు. విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు. అయితే ఈ ఆదేశాలపై స్టే కోరడమే కాకుండా, పిటిషన్ విచారణ యోగ్యం కాదని ప్రకటించాలని కోరుతూ మరో కోర్టులో పిటిషన్ల దాఖలకు అన్నాడీఎంకే సన్నద్ధం అవుతోంది. -
మనీలాండరింగ్ కేసు: మాజీ పోలీసు అధికారికి ఈడీ సమన్లు..
ముంబై: మహరాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై మనీలాండరింగ్ వివాదంలో గతంలోనే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇదే కేసులో ఈడీ ముంబై మాజీ పోలీసు అధికారి పరమ్బీర్ సింగ్కు సమన్లను జారీ చేసింది. కాగా, అనిల్ దేశ్ముఖ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు పబ్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పరమ్ బీర్ సింగ్ మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రెకు రాసిన లేఖ అప్పట్లో పెద్ద దుమారాన్నిరేపింది. దీంతో గత మార్చిలో అనిల్ దేశ్ముఖ్పై కేసు నమోదయ్యింది. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ.. బాంబె హైకోర్ట్ ఆదేశాల ప్రకారం, పరమ్ బీర్ సింగ్పై కూడా మనీలాండరింగ్ కేసుతో ఆరోపణల నేపథ్యంలో సమన్లు జారీచేశామని తెలిపింది. ఇప్పడికే ఈడీ నోటిసులను జారీ చేసి వారం గడిచింది. అయితే, అనారోగ్యం కారణంగా మరికొంత సమయం కావాలని పరమ్ బీర్ సింగ్ కోరినట్టు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే, బాంబె కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బలమైన ఆధారాలు లభించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అలాగే ముంబై, నాగపూర్లో అనిల్ దేశ్ముఖ్ నివాసంలో, బంధువులు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. అదే విధంగా ఆయన వ్యక్తిగత సహాయకుడి నివాసంలోనూ సోదాలు నిర్వహించామని సీబీఐ అధికారులు తెలిపారు. -
పెళ్లైన కొద్ది రోజులకే హీరోయిన్కు ఈడీ షాక్!
సాక్షి, ముంబై: హీరోయిన్ యామీ గౌతంకు మరోసారి ఈడీ షాక్ ఇచ్చింది. ఇటీవల చిత్రనిర్మాత ఆదిత్య ధార్ను వివాహమాడిన యామీకి మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా సమన్లు జారీ చేసింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చే వారం ఈడీ ముందు హాజరు కావాలని కోరింది. యామీకి ఈడీ నోటీసులివ్వడం ఇది రెండోసారి. విక్కీ డోనర్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన యామీ గౌతం హృతిక్ రోషన్తో కాబిల్, వరుణ్ ధావన్ నటించిన బద్లాపూర్ సహా పలు బిగ్ బాలీవుడ్ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఒక థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఇటీవల బాలీవుడ్ భారీ చిత్రాలపై ఈడీ దృష్టిపెట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులను, ఇతర ప్రముఖులను విచారించిన సంగతి తెలిసిందే. కాగా తెలుగులో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ కరోనా కాలంలో ఆదిత్యను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వెల్లడించి ఫ్యాన్స్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
ఫేస్బుక్, గూగుల్కు సమన్లు
సాక్షి,న్యూఢిల్లీ: పౌరుల హక్కుల పరిరక్షణ,ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల దుర్వినియోగం నివారణపై దృష్టి పెట్టిన కేంద్రం సోషల్మీడియా సంస్థలకు మరోసారి సమన్లు ఇచ్చింది. ఈ అంశాలపై చర్చించేందుకు ఫేస్బుక్ ఇండియా, గూగుల్ ఇండియాకు ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ప్యానెల్ రేపు(జూన్ 29వ తేదీ) కమిటీ ముందు హాజరుకావాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. ఆన్లైన్లో మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో సహా, పౌరుల హక్కులను రక్షించడం, ఆన్లైన్ న్యూస్ మీడియా దుర్వినియోగం అంశంపై ఫేస్బుక్, గూగుల్ సంస్థల అభిప్రాయాలను కమిటీ సేకరించనుంది. రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కమిటీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఇదే సమస్యలపై చర్చించేందుకు రానున్న రోజుల్లో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫాంల ప్రతినిధులకు కూడా నోటీసులివ్వనుంది. ఇప్పటికే ఇదే అంశంపై జూన్ 18వ తేదీన ట్విటర్ను స్టాయీ సంఘం ప్రశ్నించిన విషయం తెలిసిందే. చదవండి : కోవిషీల్డ్కు గ్రీన్ పాస్ షాక్! సీరం సీఈవో భరోసా DRDO: 2-డీజీ డ్రగ్, కమర్షియల్ లాంచ్ -
టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసుకు సంబంధించిన ఈడీ నామాకు సమన్లు జారీ చేసింది. మధుకాన్ కేసులో నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది. మధుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవల ఈడీ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. సోదాల్లో హార్డ్డిస్క్లు, డాక్యుమెంట్లు, రూ.లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. చదవండి: నామాకు బిగుస్తున్న ఉచ్చు.. త్వరలోనే భారీ షాక్ -
ట్విటర్కు మరోసారి నోటీసులు
సాక్షి,న్యూ ఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం మరోసారి ట్విటర్పై గురిపెట్టింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 18న హాజరుకావాలని ట్విటర్కు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. కొత్త ఐటీ నిబంధనలు పాటించకపోవడంపై ట్విటర్పై మరోసారి కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇటీవల తుది నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. పదే పదే నోటిసులిచ్చినా తగిన వివరణ ఇవ్వడంలో ట్విటర్ విఫలమైందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) లోని సైబర్ లా గ్రూప్ కోఆర్డినేటర్ రాకేశ్ మహేశ్వరి ట్విటర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వార్తలను దుర్వినియోగంపై కమిటీ తాజా నోటీసులిచ్చింది. జూన్ 18, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు కాంప్లెక్స్లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని తెలిపింది. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు, ఫేక్న్యూస్ నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చదవండి : కొత్త సీపాప్ మెషీన్: కరోనా బాధితులకు వరం? -
‘నా కుమారుడి చావును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు’
ఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపివేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సుశాంత్ మరణంపై పలు అనుమానాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్లో సినీ ప్రముఖులు ప్రతిభను ప్రోత్సాహించరని.. కేవలం బంధుప్రీతి చూపిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం బాలీవుడ్లో సుశాంత్ సింగ్ జీవితంపై రెండు, మూడు బయోపిక్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఈ చిత్రాలను నిలిపివేయాల్సింది కోరుతూ మంగళవారం ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. అతడి వాదనలు విన్న కోర్టు సుశాంత్పై తెరకెక్కుతున్న చిత్రాలను నిలిపివేయాల్సిందిగా నిర్మాతలకు సమన్లు జారీ చేసింది. తన కొడుకు చావును పలు నిర్మాణ సంస్థలు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయనీ సుశాంత్ సింగ్ తండ్రి ఆరోపించారు. అంతేకాకుండా తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు. కాగా, సుశాంత్ సింగ్ తండ్రి తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టులో వాదనలను వినిపించారు. సుశాంత్ సింగ్ కేసు ఇంకా పెండింగ్లో ఉందని, అతనిపై వచ్చే బయోపిక్ సినిమాలు కేసుపై ప్రభావం చూపుతాయని కోర్టుకు విన్నవించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడిన కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తోందని, తీర్పు ఇంకా పెండింగ్లో ఉందని కోర్టుకు తెలిపారు. పిటిషన్లో ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాస్ లాస్ట్ అండ్ శశాంక్’ వంటి చిత్రాలను ప్రస్తావించారు. అంతేకాకుండా కుటుంబసభ్యుల సమ్మతి లేకుండా ఈ సినిమాలను తీస్తున్నారని కోర్టుకు వివరించారు. ప్రస్తుతం బాలీవుడ్ సుశాంత్ జీవితం ఆధారంగా ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్ అండ్ శశాంక్’ సినిమాలు రూపొందుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత ఇప్పటివరకు అతని జీవితంపై మూడు సినిమాలు తెరపైకి వచ్చాయి. ఒక వార్తా నివేదిక ప్రకారం, సుశాంత్ సింగ్ రాజ్పుత్ బయోగ్రఫీ, సుశాంత్, రాజ్పుత్: ది ట్రూత్ విన్స్ , ది అన్సాల్వ్డ్ మిస్టరీ సినిమాలకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. చదవండి: సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు -
ఆలియా భట్కి షాకిచ్చిన ముంబై కోర్టు
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ‘గంగూభాయ్ కతియావాడీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ముంబై రెడ్ లైట్ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూరా కథ తిరగనుంది. గంగూబాయ్ కతియావాడి టైటిల్ రోల్లో ఆలియాభట్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కథాంశం తన తల్లిని కించపరిచేలా ఉందని ఆమె నలుగురు దత్తపుత్రుల్లో ఒకరైన బాబూజీ రాజీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. సినిమా కథాంశం చనిపోయిన తన తల్లి గోప్యత హక్కును హరించేలా ఉందని షా తన పిటిషన్లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన కోర్టు..ఆలియా భట్, దర్శకుడు భన్సాలీతో పాటు మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబైఅనే పుస్తకాన్ని రచించిన హుస్సేన్ జైదీలకు సమన్లు జారీ చేసింది. దీనిపై మార్చి 21 లోగా సమాధానం చెప్పాలని ముంబై కోర్టు ఆదేశించింది. మాఫియా క్వీన్గా పేరు పొందిన ముంబయ్లోని కామాటిపురా ప్రాంత వేశ్యలకు నాయకురాలిగా వ్యవహరించిన గంగూబాయ్ కోఠేవాలీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముంబయ్ ఫిల్మ్సిటీలో కామాటిపురా సెట్ వేశారు.గంగూబాయ్ పాత్రను ఆలియా చేస్తున్నారు. అయితే ఈనెల ప్రారంభంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా సోకడంతో షూటింగ్కి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయనకు కోవిడ్ నెగిటివ్ వచ్చినందున మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్పైకి వెళ్లనుంది. జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. చదవండి : గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో.. పాట కోసం బ్రేక్ -
మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేసిన ఈడీ
కశ్మీర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు పంపింది. దీనిపై ముఫ్తీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘భారత ప్రభుత్వం తన చర్యల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోంది. విపక్షాలు.. కేంద్రం పాలసీలను, విధానాలను ప్రశ్నించడం ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇలాంటి చర్యలతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది. కానీ ఇవేం పని చేయవు’’ అంటూ ముఫ్తీ ట్వీట్ చేశారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన నేపథ్యంలో ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీని గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జమ్ముకశ్మీర్ ఏకీకరణ కోసం స్థానిక పార్టీలన్నీ కలిసి గుప్కార్ డిక్లరేషన్ కింద ప్రజల కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి అధ్యక్షుడు, కశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల ఆస్తులను మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో గత ఏడాది ఈడీ జప్తు చేసింది. ఈ ఆరోపణలపై తాజాగా మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ చేసింది. -
అమిత్ షాకు బెంగాల్ కోర్టు సమన్లు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధుల(ఎంపీ, ఎమ్మెల్యే) కోర్టు శుక్రవారం అమిత్ షాకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న వ్యక్తిగతంగా లేదా లాయర్ ద్వారా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అమిత్ షాపై దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా ‘‘ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు అమిత్ షా వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టు ముందు హాజరు కావాలి’’ అని బిధన్నగర్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. అంతేకాక అమిత్ షా మీద ఐపీసీ సెక్షన్ 500 కింద నమోదైన పరువు నష్టం కేసులో సమాధానం ఇవ్వాలని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. 2018 ఆగస్టు 11న కోల్కతాలో మాయో రోడ్లో బీజేపీ చేపట్టిన ఓ ర్యాలీలో టీఎంసీ ఎంపీ బెనర్జీని కించపరిచేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని.. బెనర్జీ లాయర్ సంజయ్ బసు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. చదవండి: దమ్ముంటే నా మేనల్లుడిపై పోటీ చేయ్ -
ఫేస్బుక్, ట్విటర్కు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధానంగా ఉన్న ఫేస్బుక్, ట్విటర్కు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దుర్వినియోగంపై సమన్లు జారీ చేసి ఈనెల 21వ తేదీన తమ ముందుకు హాజరుకావాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు పంపించింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు అందించిన ఆధారాలతో పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులు ఆ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన అంశంపై మాట్లాడనున్నారు. డిజిటల్ రంగంలో పౌరుల హక్కుల రక్షణ, సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ప్రధానంగా మహిళల భద్రత విషయమై ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల సోషల్ మీడియా సంస్థలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఒక పార్టీకి.. కొందరు నాయకులకు మద్దతుగా సోషల్ మీడియా వ్యవహరిస్తోందని గుర్తించారు.దీనిపై కొన్ని నెలల కిందట పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే. రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. మొత్తంగా సోషల్ మీడియా దుర్వినియోగంపై నియంత్రణ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫేస్బుక్, ట్విటర్కు సమన్లు జారీ చేసింది. ఆ సంస్థల ప్రతినిధులతో 21వ తేదీన సమావేశమై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. లేదా కొత్తగా నిబంధనలు విధించి వీటిని తప్పనిసరిగా అమలయ్యేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వాట్సాప్ వ్యక్తిగత వివరాల అప్డేట్పై రేగిన వివాదం నేపథ్యంలో ఈ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి: నిన్న ట్రంప్.. నేడు గ్రేసీ) -
సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు
ముంబై : పీఎంసీ బ్యాంక్ నగదు అక్రమ రవాణా కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ముంబైలోని ఈడీ కార్యాలయంలో డిసెంబర్ 29న విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెకు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది మూడో సారి. తొలి రెండుసార్లు అనారోగ్య కారణాలు చూపుతూ ఆమె విచారణకు హాజరుకాలేదు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్లో రుణ కుంభకోణంపై ఈ కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు పవన్ రౌత్ భార్యకు, వర్షా రౌత్కు మధ్య 50 లక్షల రూపాయల నగదు లావాదేవీలకు సంబంధించి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ మొత్తాన్ని వర్షా రౌత్ ఆస్తి కొనుగోలు కోసం వినియోగించినట్లు సమాచారం. (చదవండి: ప్రతీకారం కాదు, అంతా చట్ట ప్రకారమే!!) ఇక ఎవరికైనా ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేస్తే.. వారు స్పందించపోతే.. సదరు వ్యక్తులపై లీగల్ యాక్షన్ తీసుకునే అధికారం ఈడీకి ఉంటుంది. ఇక సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయంపై బీజేపీ నాయకులు స్పందించారు. శివసేన రెండు నాల్కల ధోరణిని విడిచిపెట్టి.. ఈ ఆరోపణలపై స్పందించాలని.. వాస్తవాలను ప్రజలకు బహిరంగపర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల చర్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని తెలిపారు. -
తమళనాట హీటెక్కిన రాజకీయం..రజనీకి సమన్లు
చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని, జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ఇదివరకే అనౌన్స్ చేసేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు పాత కేసులు పలకరిస్తున్నాయి. తాజాగా తూత్తుకుడి కేసు విచారణకు హాజరు కావల్సిందిగా రజనీకి సమన్లు జారీ చేశారు. ఈ విషయంపై జనవరి 19 లోపు సమాధానం ఇవ్వాలని సింగిల్ జడ్జి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 2018 మేలో తూత్తుకుడిలోని స్టెరిలైట్కు కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీలో ఫైరింగ్ జరగడంతో 13మంది ప్రాణాలు కోల్పోయారు. (లతా రజనీకాంత్కు హైకోర్టు నోటీసులు) దీనిపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్ట్ జస్టిస్ అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, దీని వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని రజనీకాంత్ సంచలన ఆరోపణలు చేశారు. తూత్తుకుడి ఘటనలో పోలీసుల చర్యను సైతం ఆయన తప్పుబట్టారు. దీనిపై విచారణకు హాజరు కావాల్సిందిగా రజినీకి కమిషన్ సమన్లు జారీ చేయగా మినహాయింపు కోరారు. తాజాగా ప్రజలు ప్రతీ అంశంలో నిరసనలు ప్రారంభిస్తే అప్పుడు తమిళనాడు మొత్తం స్మశానవాటిక అవుతుందని పేర్కొన్నాడు. రజినీ రాజకీయాల్లో చేరబోయే కొద్దిసేపటి క్రితమే ఈ వ్యా్ఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా రజనీ పార్టీ అనౌన్స్మెంట్ చేశాక ఒక్కసారిగా కేసులు చుట్టుముట్టడంతో గమనార్హం. (రజనీతో పొత్తుకు సిద్ధం: కమల్హాసన్) -
మమత సర్కార్పై గవర్నర్ ధన్కర్ తీవ్ర వ్యాఖ్యలు
-
నడ్డాపై దాడి: బెంగాల్ డీజీపీ, సీఎస్లకు సమన్లు
కోల్కతా: రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్ వెళ్లిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగాల్లో బీజేపీ, టీఎంసీ నాయకుల మధ్య మాటల వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో తమ నాయకుడిపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. వడ్డితో సహా చెల్లిస్తామని బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ హెచ్చరించారు. ‘మేం మారుస్తాం.. మేం ప్రతీకారం తీర్చుకుంటాం. వడ్డీతో సహా చెల్లిస్తాం’ అంటూ దిలీప్ ఘోష్ ఫేస్బుక్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. డైమండ్ హర్బర్లో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్తుండగా.. టీఎంసీ కార్యకర్తలు నడ్డా కాన్వాయ్ని అడ్డుకోవడమే కాక రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన అనంతరం బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెంగాల్ డీజీపీకి సమన్లు ఇక నడ్డా కాన్వాయ్పై దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ బెంగాల్ సీఎస్, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందిగా హోం మంత్రి అమిత్ షా గవర్నర్ని కోరిన సంగతి తెలిసిందే. బీజేపీ రియాక్షన్.. నడ్డాపై దాడిని బెంగాల్ బీజేపీ నాయకులు సీరియస్గా తీసుకున్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. ఈ క్రమంలో సయంతన్ బసు ‘మీరు ఒక్కరిని చంపితే.. మేం నలుగురిని చంపుతాం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నడ్డా కాన్వాయ్పై దాడి అనంతరం ఢిల్లీలోని అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీన్ని ఉద్దేశిస్తూ.. బసు ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ముందు ముందు చాలా ఉంటాయి’ అంటూ హెచ్చరించారు. -
రిలయన్స్ డీల్: అమెజాన్కు సమన్లు
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. రిలయన్స్కు చెందిన రిలయన్స్ రీటైల్, కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) డీల్కు సంబంధించి అమెజాన్కు కోర్టు సమన్లు జారీ చేసింది. సింగపూర్ ఆర్బిట్రేటర్ మధ్యంతర ఉత్తర్వులతో ఈ ఒప్పందంలో అమెజాన్ జోక్యంపై ఫ్యూచర్స్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు మంగళవారం విచారించింది. దీనిపై స్పందించాల్సిందిగా అమెజాన్ను కోరింది. (అమెజాన్కు భారీ ఊరట : రిలయన్స్ డీల్కు బ్రేక్) ఒక రోజంతా ఎఫ్ఆర్ఎల్, ఎఫ్సిపిఎల్, రిలయన్స్, అమెజాన్ తరఫున రోజువారీ వాదనలు విన్న జస్టిస్ ముక్త గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే దీనిపై 30 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఎఫ్ఆర్ఎల్ దావాపై అమెజాన్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్సిపిఎల్), రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ఆర్ఆర్ఎల్) లకు సమన్లు జారీ చేసింది స్టేట్మెంట్లను దాఖలు చేయాలని కోరింది. అమెజాన్ లేవనెత్తిన దావా నిర్వహణ సామర్థ్యాన్ని కూడా బహిరంగంగా ఉంచుతామని కోర్టు తెలిపింది. దీనిపై బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. (రిలయన్స్ చేతికి ‘ఫ్యూచర్’ రిటైల్) కాగా రిలయన్స్ రీటైల్ ఫ్యూచర్ రీటైల్ డీల్ను వ్యతిరేకించిన అమెజాన్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు అక్టోబర్ 25 న అమెజాన్కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు
ముంబై: మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సోదాలు నిర్వహించింది. నవంబర్ 11న విచారణకు హాజరుకావ్సాలిందిగా ఎన్సీబీ రాంపాల్కి సమన్లు జారీచేసింది. సబర్బన్ బాంద్రాలోని ఆయన ఇంటి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎన్సీబీ ఆయన డ్రైవర్ను విచారించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వాడకంపై ఎన్సీబీ విచారణను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూహూ ప్రాంతంలోని బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నదియాద్వాలా ఇంటిపై దాడిచేసి, మాదకద్రవ్యాలు కలిగి ఉన్నారంటూ ఆయన భార్యని ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఎన్సీబీ ఎదుట హాజరైన నదియాద్వాలా తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదివరకే అరెస్టు అయిన వహీద్ అబ్దుల్ ఖాదిర్ షేక్ అలియాస్ సుల్తాన్ ఇచ్చిన సమాచారంతో ఎన్సీబీ అధికారులు నదియాద్వాలా ఇంటిపై దాడిచేసి, పది గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాదకద్రవ్యాల కేసులో ఎన్సీబీ, తాజాగా మరో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఇప్పటివరకు 727.1 గ్రాము గంజా, 74.1 గ్రాముల ఇతర మాదకద్రవ్యాలను, రూ.3.58 లక్షల నగదును వారి వద్దనుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. -
దీపికా మేనేజర్కు మరోసారి ఎన్సీబీ సమన్లు
న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ కేసు దర్యాప్తు భాగంగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాష్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్(ఎన్సీబీ) మరోసారి సమన్లులు జారీ చేసింది. గత నెలలో ఎన్సీబీ ఆమెకు సమాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కరిష్మా ప్రకాష్ విచారణకు గైర్హాజరు కావడంతో కరిష్మా పరారీలో ఉన్నట్లు అధికారుల గుర్తించారు. దీంతో ఇవాళ (సోమవారం) ఎన్సీబీ ఆమెకు మరోసారి సమన్లు జారీ చేసి, ఆ నోటీసులు ఆమె తల్లి మితాక్షర పురోహిత్కు అందచేశారు ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే దీపికా పదుకొనెతో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్ను ప్రశ్నించాం. ఈ క్రమంలో కరిష్మా ఇంటిలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో 1.7 కిలోగ్రాముల చరాస్, మూడు సీసాల సీబీడీ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కరిష్మాను మరోసారి విచారించేందుకు సమన్లు జారీ చేశాం. అయితే అప్పటికే ఆమె పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేశాం’ అని తెలిపారు. (చదవండి: పరారీలో హీరోయిన్ దీపిక మేనేజర్) అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నటి రియా చక్రవర్తి ఎన్సీబీ విచారణలో పలువురు బాలీవుడ్ నటీనటులు పేర్లను వెల్లడించింది. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ల పేర్లు ఉన్నాయి. అంతేగాక దీపికా, ఆమె మేనేజర్ కరిష్మాల పాత వాట్సప్ డ్రగ్స్ చాట్ కూడా వెలుగులోకి రావడంతో వీరిద్దరిని ఎన్సీబీ విచారణకు పిలిచింది. అలాగే వీరితోపాటు శ్రద్దా కపూర్, సారా, రకుల్లకు కూడా ఎన్బీసీ అధికారులు సమన్లు ఇచ్చారు. వీరిపై ఎలాంటి నేరారోపణలు రుజువు కాకపోవడంతో వారిని ఎన్సీబీ తిరిగి పంపించిన విషయం తెలిసిందే. చదవండి: మరిన్ని కోడ్ వర్డ్లు బయటపెట్టిన దీపికా!) -
పరారీలో హీరోయిన్ దీపిక మేనేజర్
సాక్షి, ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధ కపూర్, దీపికా పదుకొనేలను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపిక టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్కి ఎన్సీబీ అధికారులు మంగళవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. బాలీవుడ్ డ్రగ్స్ దర్యాప్తు కేసులో అరెస్టయిన డ్రగ్ పెడ్లర్ను విచారించినప్పుడు కరిష్మా ప్రకాష్ పేరు వెలుగులోకి వచ్చిందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. వెర్సోవాలోని కరిష్మా నివాసంలో మంగళవారం ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో 1.7 గ్రాముల హషీష్, సీబీడీ ఆయిల్ మూడు బాటిళ్లనిస్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెకు సమన్లు జారీ చేశారు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. (చదవండి: ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి) కరిష్మా ప్రకాష్కు డ్రగ్ పెడ్లర్తో సంబంధాలుండటం, ఆమె నివాసం నుంచి డ్రగ్స్ రికవరీ, ఎన్సీబీకి సహకరించకపోవడం, సమన్లు జారీ చేశాక విచారణకు హాజరుకాకపోవడం వంటి పనులు ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టవచ్చని.. ఎన్సీబీ ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. డ్రగ్స్ కేసు విచారణలో ఎన్సీబీ అధికారులు కరిష్మా ప్రకాష్, దీపికా పదుకొనే మధ్య జరిగిన అనుమానాస్పద మెసేజ్లను గుర్తించారు. దీని ఆధారంగా ఈ ఇద్దరినీ గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కరిష్మా ప్రకాష్ మాత్రమే కాక, ఆమె సహోద్యోగి జయ సాహా, నటులు రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్లను కూడా గత నెలలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని సమాచారం. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..) సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేసింది. అతని స్నేహితురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. ఒక నెల జైలు శిక్ష తరువాత ఆమె బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. -
రిపబ్లిక్ టీవీ సీఎఫ్ఓకు సమన్లు
ముంబై: ముంబైలో వెలుగు చూసిన టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టీఆర్పీ) స్కామ్కు సంబంధించి ‘రిపబ్లిక్ టీవీ’ సీఎఫ్ఓ సుందరానికి పోలీసులు శుక్రవారం సమన్లు జారీ చేశారు. అక్టోబర్ 10న విచారణకు హాజరు కావాలన్నారు. ఈ స్కామ్లో రిపబ్లిక్తో పాటు మరో 2 మరాఠీ చానళ్ల పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. వినియోగదారులతో ఒప్పందాలు ముంబైలో టీఆర్పీల నిర్వహణను హంస అనే ఎజెన్సీ చూస్తోంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగుల సాయంతో, వినియోగదారులకు డబ్బులు ఇచ్చి, తమ చానళ్లనే చూడాలని, చూడకపోయినా తమ చానెళ్లనే ఆన్లో ఉంచాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా ఎంపిక చేసిన చానళ్లను నిర్ధిష్ట సమయంలో చూసినందుకు నెలవారీ కొంత డబ్బు ఇస్తామని చెప్పడం వల్ల ఒప్పుకున్నానని ఒక వినియోగదారుడు చెప్పారు. ఇందులో రిపబ్లిక్ చానల్తో పాటు రెండు మరాఠీ చానెళ్లు కూడా ఉన్నాయి స్టాండింగ్ కమిటీ ముందుకు! టీఆర్పీ స్కామ్ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం.. పార్లమెంటరీ కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చీఫ్ శశి థరూర్కు లేఖ రాశారు. ఒక జాతీయ వార్తా చానల్ సహా 3 చానళ్లు ఈ స్కామ్లో ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని, అందువల్ల తదుపరి కమిటీ మీటింగ్లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కార్తి చిదంబరం ఆ లేఖలో కోరారు. -
కోర్టు ఆదేశం ఆశాజనకంగా ఉంది
లక్నో: హత్రాస్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి పక్షాలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఘటనకు సంబంధించి అలహాబాద్ హై కోర్టు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ని బలమైన, ప్రోత్సాహకరమైన పరిణామంగా ప్రశంసించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘హత్రాస్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరుతుంది. యూపీ ప్రభుత్వం తన కుటుంబానికి చేసిన అమానవీయ, దారుణ అన్యాయం నేపథ్యంలో హై కోర్టు తీర్పు కటిక చీకటిలో చిరుదివ్వెలా ఆశాజనకంగా ఉంది’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అలహాబాద్ హై కోర్టు లక్నో బెంచ్ యూపీ పోలీసులు, పరిపాలన ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న వారు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. (చదవండి: ఇదేమి సంస్కృతి?) A strong and encouraging order from the Lucknow bench of Alld HC. The entire nation is demanding justice for the Hathras rape victim. The HC order shines a ray of hope amidst the dark, inhuman and unjust treatment meted out to her family by the UP Govt.https://t.co/kj55XGMK3B — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 2, 2020 అంతేకాక బాధితురాలి కుటుంబ సభ్యులను కూడా కోర్టుకు హాజరుకావాల్సిందిగా సూచించింది. వారు కూడా వస్తే దహన సంస్కారల విషయంలో అసలు ఏం జరగిందనేది తెలుస్తుందని కోర్టు అభిప్రాయ పడింది. అంతేకాక ‘ఈ కేసు అపారమైన ప్రజా ప్రాముఖ్యత, ప్రజాప్రయోజనంతో కూడుకున్నది. ఎందుకంటే ఈ కేసులో రాష్ట్ర అధికారులు అధికంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరణించిన బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల ప్రాథమిక మానవ హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయి. నేరానికి పాల్పడిన వారు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఈ కేసుకు సంబంధించి సంచలన ఆరోపణలు వినవస్తున్నాయి. అవన్ని నిజమైతే అధికారులు ఆ కుటుంబానికి శాశ్వత దుఃఖాన్ని మిగిల్చిన వారవుతారు. వారి ప్రవర్తన పుండు మీద ఉప్పు రుద్దిన చందంగా ఉన్నట్లు జనాలు గుర్తిస్తారు’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. -
అనురాగ్ కశ్యప్కు సమన్లు
ముంబై: సినీనటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు దర్శకుడు అనురాగ్ కశ్యప్పై ముంబై పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు. విచారణకు హాజరు కావాలని అనురాగ్ కశ్యప్కు సమన్లు జారీ చేశారు. గురువారం వెర్సోవా పోలీసు స్టేషన్కు రావాలని పేర్కొన్నారు. అనురాగ్పై సెప్టెంబర్ 22న పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయన తనపై 2013లో తనను వేధించాడని పాయల్ ఘోష్ ఫిర్యాదు చేశారు. అనురాగ్ను కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
లైంగిక వేధింపులు: దర్శకుడికి సమన్లు
ముంబై: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు పంపించారు. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత అనురాగ్ కశ్యప్పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే తనకు న్యాయం చేయాలంటూ పాయల్ ప్రధాని నరేంద్ర మోదీని కోరిన విషయం తెలిసిందే. పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో పోలీసులు అనురాగ్పై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు పోలీసు స్టేషన్లో అనురాగ్ కశ్యప్ హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (రూపా దత్తా లైంగిక ఆరోపణలు : నిజమేనా?) ఇప్పటికే అనురాగ్పై ఐపీసీ సెక్షన్లు 376(ఐ), 354, 341, 342 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరింత లోతుగా విచారణ చేయడానికి అనురాగ్కు బుధవారం సమన్లు పంపించినట్లు తెలుస్తోంది. ఇక 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో కశ్యప్ తనపై అత్యాచారం చేశారని ఇటీవల నటి పాయల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై విచారణలో భాగంగా అనురాగ్ కశ్యప్ను పోలీసులు విచారణ జరపనున్నారు. చదవండి: (అనురాగ్ కశ్యప్పై కేసు నమోదు) -
ఎన్సీబీ నోటీసులు అందాయి: రకుల్
బాలీవుడ్లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి దీపికా పదుకోనె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్తో పాటు రకుల్ ప్రీత్ సింగ్లకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు ఎలాంటి నోటిసులు అందలేదంటుంది రకుల్ ప్రీత్. హైదరాబాద్లో కానీ.. ముంబైలో కానీ తనకు ఎన్సీబీ పంపిన సమన్లు అందలేని తెలిపింది. ఈ మేరకు రకుల్ ప్రీత్ మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమకు ఇంకా సమన్లు అందలేదని తెలిపారు. ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కోసం హైదరాబాద్ వచ్చిన రకుల్ బుధవారం రాత్రి ముంబై వెళ్లారు. అయితే ఆమె వ్యాఖ్యలను ఎన్సీబీ ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ అధికారి కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ, ‘ఆమెకు సమన్లు జారీ చేశాం.. తను ఫోన్లో అందుబాటులోకి రాలేదు. వివిధ ప్లాట్ఫారమ్ల ద్వారా ఆమెను సంప్రదించాము. ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. పైగా ఇది కేవలం ఒక సాకు.. ఆమె ఈ రోజు దర్యాప్తుకు హాజరు కాలేదు’ అని తెలిపారు. అంతేకాక ‘రకుల్ ప్రీత్ మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆమె హైదరాబాద్లో ఉందా లేక ముంబైలో ఉన్నారా అనే విషయం మాకు తెలియదు. ఒకవేళ ఆమె ముంబైలో ఉంటే.. హెచ్ అండ్ ఎం లేదా గార్డెన్ అపార్ట్మెంట్లో ఉన్నారా అనే విషయం తెలియదు. ఎందుకంటే మూడు నెలల క్రితం ఆమె హెచ్ అండ్ ఎం అపార్ట్మెంట్కు మారింది. మేము ఆమెకు వాట్సాప్లో కూడా సమన్లు పంపించాము. ఒకవేళ రేపు కూడా ఆమె విచారణకు హాజరుకాకపోయినా.. ఏవైనా సాకులు చెప్పినా రకుల్కి నాన్ బెయిలబుల్ సమన్లు జారీ చేస్తాం’ అని ఎన్సీబీ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో సమన్లు అందలేదంటూ ప్రకటన విడుదల చేసిన రకుల్ తాజా హెచ్చరికల నేపథ్యంలో సమన్లు అందినట్లు ప్రకటించడం గమనార్హం. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్తో పాటు, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకోనెలను కూడా ఎన్సీబీ విచారణకు పిలిచింది. వీరితోపాటు దీపికా మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా ప్రశ్నించడానికి పిలిచింది. రోజు (సెప్టెంబర్ 24) శ్రుతి మదీ, సిమోన్ ఖంబట్టా, రకుల్ ప్రీత్లు ఎన్సీబీ దర్యాప్తుకు హాజరుకావాల్సి ఉంది. దీపికా పదుకొనేను సెప్టెంబర్ 25 (శుక్రవారం)న.. సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26 (శనివారం) దర్యాప్తుకు హాజరు కావాల్సిందిగా అధికారులు ఆదేశించారు. (చదవండి: నా పరువు తీస్తున్నారు!) -
రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్లో డ్రగ్స్ కోణంపై సాగుతున్న విచారణ కీలక మలుపు తిరిగింది. అందరూ ఊహిస్తున్నట్టుగానే నటీమణులు దీపికా పదుకొనె, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్లకు ఎన్సీబీ సమన్లు పంపింది. బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై మరింత దృష్టి సారించిన ఎన్సీబీ ‘‘ఏ’’లిస్ట్లో ఉన్న ప్రముఖుల్ని తొలుత విచారించడానికి నిర్ణయించినట్టుగా ఎన్సీబీ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్, సుశాంత్ ట్యాలెంట్ మేనేజర్ శ్రుతి మోదీ, డిజైనర్ సైమన్ ఖంబటాలను ఎన్సీబీ కార్యాలయానికి గురువారమే రావాల్సిందిగా చెప్పినట్టుగా ఆ అధికారి వెల్లడించారు. హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్లను 26వ తేదీ శనివారం ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్లను విచారించనున్నట్టు ఎన్సీబీ అధికారులు తెలిపారు. గోవా షూటింగ్లో దీపిక ప్రస్తుతం గోవా షూటింగ్లో ఉన్న దీపిక పదుకొనె 12 మంది సభ్యులున్న తన న్యాయ బృందంతో చర్చలు జరిపారు. ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలో న్యాయవాదులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో దీపిక భర్త రణవీర్ సింగ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్టు సమాచారం. నోటీసుల నేపథ్యంలో రాత్రికి దీపిక గోవా నుంచి ముంబై వచ్చారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ వాట్సాప్ గ్రూప్ చాట్లలో హీరోయిన్ పేరులో ఇంగ్లిష్ అక్షరాలతో జరిగిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. అందులో డి అంటే దీపిక, ఎస్ అంటే శ్రద్ధ అని భావించిన విషయం తెలిసిందే. ఇక కరిష్మా ప్రకాశ్కు కూడా ఇప్పటికే సమన్లు పంపినప్పటికీ ఆమె అనారోగ్య కారణాలతో ఎన్సీబీ ఎదుట హాజరు కాలేదు. దీంతో శుక్రవారం వరకు ఆమెకు మినహాయింపునిచ్చారు. దీపికతో పాటు కరిష్మా కూడా ఎన్సీబీ విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. బాలీవుడ్ డ్రగ్స్ వినియోగంలో హీరోల పాత్రపై కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కన్నేశారు. రియా చక్రవర్తి, జయ సాహా ఇచ్చిన సమాచారం ఆధారంగా అగ్ర హీరోలపై కూడా ఓ కన్నేసి ఉంచినట్టు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కీలక సమాచారమిచ్చిన జయ! గత మూడు రోజులుగా జయ సాహాను ప్రశ్నిస్తున్న అధికారులు పలు విషయాలను రాబట్టారు. అత్యంత కీలకమైన సమాచారాన్ని జయ సాహా బయటపెట్టినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. సుశాంత్తో పాటు నటి శ్రద్ధా కపూర్, రియా చక్రవర్తి, మధు, తాను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆమె ఎన్సీబీ విచారణలో అంగీకరించినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. సీబీడీ ఆయిల్ అనే నిషేధిత డ్రగ్స్ని వారు సేవించినట్టుగా తెలుస్తోంది. మాదక ద్రవ్యాల చీకటి కోణంపై 2016లో వచ్చిన బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ సహ నిర్మాత అయిన మధు మాంతెనాను బుధవారం ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. జయ సాహా తన విచారణలో మధు పేరుని బయట పెట్టడంతో ఆయనను డగ్స్ర్ వినియోగంపై గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. -
డ్రగ్ కేసు: స్టార్ జంటకు సమన్లు
సాక్షి, బెంగళూరు: ప్రస్తుతం డ్రగ్స్ కేసు అటూ బాలీవుడ్ను ఇటూ శాండల్ వుడ్ను కుదిపేస్తోంది. కన్నడ డ్రగ్ వ్యవహరంలో ఇప్పటికే కన్నడ హీరోయిన్లు సంజన గల్రానీ, రాగిణి ద్వివేదీలతో పాటు పలువురిని బెంగళూర్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ స్టార్ జంట దిగంత్ మంచలే, ఐంద్రిత రేలకు సీసీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు. దర్యాప్తు నిమిత్తం రేపు ఉదయం 11 గంటలకు సీసీబీ కార్యాలయానికి హాజరు కావాలని వారిని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: డ్రగ్స్ కేసు: మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో సోదాలు) అదే విధంగా ఈ కేసులో కీలక నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలోని ఐ బార్టనే అనే క్యాసినోకు ఈ జంటను ఆహ్వానించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో డ్రగ్స్ సప్లయర్స్తో వీరికి కూడా ఎమైన సంబంధం ఉందని భావించిన సీసీబీ వారికి సమన్లు జారీ చేసింది. మరోవైపు కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపై కూడా కేసు నమోదైంది. ఆయనకు చెందిన రిసార్ట్ పై ఇవాళ(మంగళవారం) ఉదయం సీసీబీ పోలీసులు తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆదిత్య పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: డేటా మొత్తం డిలీట్ చేసిన సంజనా, రాగిణి) -
ఫేస్బుక్ ఇండియా ఎండీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.ఈ ఏడాది ఆరంభంలో చోటు చేసుకున్న ఢిల్లీ అల్లర్లలో ఫేస్బుక్కు పాత్ర ఉందంటూ, ఫేస్బుక్ ఇండియా అధికారులకు తాజా నోటీసులు జారీ అయ్యాయి. ద్వేషపూరిత కంటెంట్ పై చర్య తీసుకోవడంలో విఫలమైందంటూ ఆరోపించిన ఢిల్లీ అసెంబ్లీ కమిటీ సెప్టెంబర్ 15 న ఢిల్లీ విధానసభ ముందు హాజరుకావాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. తమ వాదనను వినిపించేందుకు సెప్టెంబర్ 15 మంగళవారం హాజరు కావాలని ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య పూర్వక కమిటీ,, ఫేస్బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ కు సమన్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజేంద్రనగర్ చెందిన ఎమ్మెల్యే రాఘవ చాదా నేతృత్వంలోని కమిటీ ఈ సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై కొంతమంది సాక్షులను, సాక్ష్యాలను పరిశీలించిన మీద ఈ సమన్లు జారీ చేశామని కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు తీవ్రతరం కావడానికి ఫేస్బుక్ కారణమైందని ఆగస్టు 31వ తేదీన జరిగిన రెండో విచారణలో కమిటీ నిర్ధారించింది. రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న ఫేస్ బుక్ మరోసారి వివాదంలో పడింది. ప్రధానంగా అధికార బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ సంస్థ వ్యవహరిస్తోందని, హింసను ప్రేరేపించే విద్వేషపూరిత కంటెంట్ విషయంలో పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్లో ఇటీవల వచ్చిన ఆరోపణల మధ్య తాజా నోటీసులు జారీ అయ్యాయి. -
వీవీ అల్లుడికి ఎన్ఐఏ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అల్లుడు, ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు పంపింది. భీమా-కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విషయంలో వరవరరావు అల్లుడు, ఫ్రొఫెసర్ సత్యనారాయణ ఇంట్లో 2018లోనే ఎన్ఐఏ సోదాలు జరిపింది. అయితే తాజాగా ఎన్ఐఏ ఆయనకు నోటీసులు పంపింది. (ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!) ఈ నెల 9న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ఆదేశించింది. ఎన్ఐఏ పంపిన నోటీసులపై స్పందించిన ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమా-కొరెగావ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తామంతా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఈ తరుణంలో మళ్లీ ఇలా తనకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు
-
ఫేస్బుక్కు పిలుపు
న్యూఢిల్లీ: కొందరు బీజేపీ నాయకుల విద్వేషపూరిత పోస్టులను ఫేస్బుక్ చూసీచూడనట్లు వదిలేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో... సెప్టెంబర్ 2న తమముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫేస్బుక్కు సమన్లు జారీచేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఫేస్బుక్ ప్రతినిధులతో చర్చించనుంది. పౌరుల హక్కులకు రక్షణ కల్పించడం, అంతర్జాలంలో మహిళల భద్రత అంశాలపై కూడా చర్చించే ఈ సమావేశానికి ఫేస్బుక్ ప్రతినిధులతో పాటు ఐటీ మంత్రిత్వశాఖ అధికారులను కూడా పిలిచింది. అలాగే ఇంటర్నెట్ నిలిపివేతలపై సెప్టెంబర్ ఒకటో తేదీన స్టాండింగ్ కమిటీ సమాచార ప్రసారశాఖ అధికారులు, హోంశాఖ అధికారులతో భేటీ కానుంది. బిహార్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. వచ్చేనెల ఒకటి, రెండో తేదీల్లో జరిగే ఐటీ స్టాండింగ్ కమిటీ సమావేశాల ఎజెండాను లోక్సభ సచివాలయం గురువారం ఒక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. థరూర్ను తొలగించాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ను, ఆ పదవి నుంచి తప్పించాలని, అదే కమిటీకి చెందిన సభ్యుడు, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకి రాసిన లేఖలో కోరారు. లోక్సభ నియమాలను అనుసరించి, ఆయన స్థానంలో మరో సభ్యుడిని చైర్మన్గా నియమించాలని కోరారు. శశిథరూర్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ అయినప్పటినుంచీ, కమిటీ వ్యవహారాలను పద్ధతి ప్రకారం నిర్వహించడంలేదని, తన వ్యక్తిగత ఎజెండాని ముందుకు తీసుకెళుతూ, పుకార్లు వ్యాప్తిచేస్తూ, తమ పార్టీపై బురదచల్లుతున్నారని దూబే ఆ లేఖలో పేర్కొన్నారు. ఫేస్బుక్ ప్రతినిధులను స్టాండింగ్ కమిటీ ముందుకు పిలిచే విషయాన్ని కమిటీ సభ్యులకు చెప్పకుండా శశిథరూర్ మొదట మీడియాకు వెల్లడించారని, ఇది హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని దూబే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినప్పటికీ, ఫేస్బుక్ అధికారులు చర్యలు చేపట్టలేదని శశిథరూర్ ఆరోపించారు. -
ఏడేళ్ల బాలికకు సమన్లు
సాక్షి, తిరువళ్లూరు: పాఠశాల భవనాలకు మరమ్మతులు చేయాలని కోర్టు మెట్లు ఎక్కిన ఏడేళ్ల బాలికను విచారణకు హాజరు కావాల్సిందిగా మీంజూరు పోలీసులు సమన్లు జారీ చేయడం కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా మీంజూరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. పాఠశాల భవనం శిధిలావస్థకు చేరడంతో పాటు గోడలకు బీటలు వారాయి. దీంతో ఆందోళన చెందిన రెండో తరగతి బాలిక ముత్తరసి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ కలెక్టర్ సహా పలువురు ఉన్నత అధికారులకు విన్నవించుకుంది. అయితే వారు చర్యలు చేపట్టకపోవడంతో తన తండ్రి సాయంతో హైకోర్టులో పిటిషన్ను వేసింది. బాలిక వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు, మీంజూరు పాఠశాలకు ఆరు నెలల్లో మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాలికకు మీంజూరు పోలీసులు బుధవారం ఉదయం నోటీసులు జారీ చేశారు. మీంజూరు పోలీస్స్టేషన్కు నేరుగా వచ్చి హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
సుశాంత్ సింగ్ కేసు.. నటికి సమన్లు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన నాటి నుంచి ఇండస్ట్రీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్లోని బంధుప్రీతి కారణంగానే సుశాంత్ మరణించాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సుశాంత్ మరణించిన నాటి నుంచి సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని.. అందుకోసం ఎంత దూరమైన వెళ్తానని కంగనా స్పష్టం చేశారు. సుశాంత్ మరణించిన తర్వాత ఓ వీడియో విడుదల చేసిన కంగనా, ఆదిత్య చోప్రా తన స్నేహితుడైన కరణ్ జోహార్తో కలిసి, కావాలనే సుశాంత్ కెరీర్ను నాశనం చేశాడని ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా ముంబై పోలీసులు సుశాంత్ కేసులో ప్రశ్నించేందుకు కంగనాకు సమన్లు జారీ చేశారు. నటి లాయర్ ఈ విషయాన్ని వెల్లడించారు. (ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు) అంతేకాక మార్చి 17 నుంచి కంగనా మనాలీలో ఉన్నారని.. ఓ బృందాన్ని అక్కడకు పంపి ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయాల్సిందిగా పోలీసులను కోరినట్లు కంగనా లాయర్ తెలిపారు. సుశాంత్ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు తాను మనాలీ ఉండగా ఫోన్ చేశారని, అయితే తన స్టేట్మెంట్ను తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా ఎవరూ రాలేదని కంగనా గతంలోనే తెలిపారు. అంతేకాక ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడనని, తాను పారిపోయే మనషిని కాదని స్పష్టం చేశారు. తన విమర్శలను నిరూపించుకోలేకపోతే, పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి ఇచ్చేస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటివరకూ సుశాంత్ కేసులో ముంబై పోలీసులు 39మందిని విచారించారు. వీరిలో కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా, యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) చైర్మన్ ఆదిత్య చోప్రా, వైఆర్ఎఫ్ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్ ఉన్నారు. (‘ఇక చాలు.. రాజీనామా చేస్తున్నాను’) -
సుప్రీంను ఆశ్రయించిన ప్రేమ్జీ దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ: విప్రో ప్రమోటర్ అజీమ్ ప్రేమ్జీ, ఆయన భార్య యాసీమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రేమ్జీ గ్రూపు యాజమాన్యంలోని మూడు సంస్థల విలీనం వివాదంలో కర్ణాటక హైకోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యా, రీగల్, నేపియన్ అనే మూడు సంస్థలను హాషమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీతో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఎన్ జీవో ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు సమన్లు జారీ చేసిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుందని టైమ్స్ఆఫ్ ఇండియా నివేదించింది. చెన్నైకి చెందిన ఇండియా అవేక్ ఫర్ ట్రాన్సపరెన్సీ(ఐఏటీ) అనే సంస్థ మూడు కంపెనీలను అక్రమంగా విలీనం చేశారని ఆరోపిస్తూ ప్రేమ్జీ దంపతులు సహా, మరో ముగ్గురుపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. మూడు కంపెనీల నుండి 45,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొత్తగా ఏర్పాటుచేసిన సంస్థకు చట్టవిరుద్ధంగా బదిలీ చేశారని ఆరోపించింది. డైరెక్టర్లుగా ఉన్న నిందితులు 2010-2012 మధ్య ఈ మూడు కంపెనీల 13,602 కోట్ల రూపాయలను ఆస్తులను బహుమతుల రూపంలో తీసుకున్నారని, మిగిలిన 31,342 కోట్ల రూపాయల ఆస్తులను హషమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం చేశారని ఐఏటి ఆరోపించింది. ఈ కేసులో మూడు సంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జనవరి 27న నగర కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఈ సమన్లను రద్దు చేయాలని కోరుతూ ప్రేమ్జీ, యాసీమ్ ప్రేమ్జీ, శ్రీనివాసన్, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రాంతీయ డైరెక్టర్ ఎం.ఆర్.భట్, చార్టర్డ్ అకౌంటెంట్ జీ వెంకటేశ్వరరావు హైకోర్టుకు వెళ్లారు. కానీ ఫిర్యాదుదారు ఆరోపణలను సమర్ధించిన కర్ణాటక హైకోర్టు వీరి పిటిషన్ ను మే15 న కొట్టివేసింది. దీంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. 1974 లో ఏర్పడిన విద్యా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, రీగల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, నేపియన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మూడు కంపెనీలు, 1980 లో వాటాలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయనీ, ఆర్ బీఐ సూత్రప్రాయం ఆమోదంతోపాటు కర్నాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తరువాత 2015 లో హషంతో విలీనం చేశామని ప్రేమ్జీ న్యాయవాది మహేష్ అగర్వాల్ పేర్కొన్నట్లు దినపత్రిక నివేదించింది. వ్యాపారవేత్త ఆర్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలోని సుభిక్ష సంస్థతో వ్యాపార భాగస్వామ్య వివాదం, 2013లో కోట్ల రూపాయల విలువైన చెక్ బౌన్స్ ఆరోపణలతో ప్రేమ్జీ గ్రూపు సుబ్రమణియన్ యాజమాన్యంలోని సంస్థపై క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేసింది. ఇది ఇంకా పెండింగ్లో ఉంది. దీంతో సుబ్రమణియన్ ప్రోద్బలంతోనే ఐఏటీ తమపై ఆరోపణలు చేస్తోందని అగర్వాల్ వాదిస్తున్నారు. -
‘యస్’ షేర్ల ట్రేడింగ్పై ఆంక్షలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షేర్ల ట్రేడింగ్పై హఠాత్తుగా ఆంక్షలు విధించడం.. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) సహా ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లలో పాతిక శాతానికి మించి విక్రయించడానికి లేకుండా విధించిన నిబంధనతో సోమవారం మదుపరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. షేరు ఏకంగా 50 శాతం పైగా ఎగిసినప్పటికీ తమ దగ్గరున్న వాటిని విక్రయించే పరిస్థితి లేకుండాపోయింది. క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్లో తమ పొజిషన్లను వదిలించుకోలేకపోవడంపై పలువురు సీనియర్ ఫండ్ మేనేజర్లు, ఎఫ్పీఐలు, సంస్థాగత ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ నిబంధనను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీగా పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయినట్లయిందని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత నియంత్రణ సంస్థను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ఆంక్షల గురించి సోమవారం ఉదయానికి మాత్రమే ఇన్వెస్టర్లకు తెలిసింది. అంతే కాకుండా యస్ బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్ను మొబైల్ యాప్స్ ద్వారా కుదరదని, డెస్క్టాప్ ద్వారా మాత్రమే చేయాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితర బ్రోకింగ్ సంస్థలు .. ఇన్వెస్టర్లకు సమాచారమిచ్చాయి. ఒకవేళ యస్ బ్యాంక్ షేర్లలో ఈ–మార్జిన్ పొజిషన్లు గానీ ఉంటే సోమవారం వాటిని డెలివరీ కింద మారుస్తామని, అందుకు తగినంత స్థాయిలో నిధులు తమ అకౌంట్లలో ఉంచుకోవాలని సూచించాయి. 19నే సూచీల నుంచి నిష్క్రమణ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో అనుకున్న దానికంటే ముందుగానే యస్ బ్యాంక్ను నిఫ్టీ సహా వివిధ సూచీల నుంచి తొలగించాలని ఎన్ఎస్ఈ ఇండిసెస్ ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్–కమిటీ నిర్ణయించింది. దీంతో ముందుగా అనుకున్నట్లు మార్చి 27న కాకుండా 19 నుంచే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 100, నిఫ్టీ 500 వంటి అన్ని ఈక్విటీ సూచీల నుంచి యస్ బ్యాంక్ నిష్క్రమించనుంది. 18 నుంచి పూర్తి సేవలు: ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం నుంచి యస్ బ్యాంక్పై మారటోరియం తొలగిపోయి, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ గవ ర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతో ఖాతా దారులు .. ఆంక్షలేమీ లేకుండా విత్డ్రాయల్స్ లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నారు. కార్పొరేట్లకు ఈడీ సమన్లు.. యస్ బ్యాంక్ మాజీ వ్యవస్థాపకుడు రాణా కపూర్ తదితరులపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా పలువురు కార్పొరేట్ దిగ్గజాలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చందద్ర, జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఇండియాబుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లాట్లను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అటు అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా ఈ నెల 19న హాజరు కానున్నారు. యస్ బ్యాంక్ అప్గ్రేడ్ .. తాజాగా పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో యస్ బ్యాంక్ రేటింగ్ను సానుకూల అంచనాలతో అప్గ్రేడ్ చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. బోర్డు పునర్వ్యవస్థీకరణకు ఓకే .. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్.. కొత్త ఎండీ, సీఈవోగా బోర్డు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. -
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
ముంబై : యస్ బ్యాంక్ వ్యవహారంలో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. యస్ బ్యాంక్ కేసులో తమ ముందు హాజరు కావాలని అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. యస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ రూ 12,800 కోట్లు రుణాలు పొందింది. ఇవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఈ రుణాలకు సంబంధించి ప్రశ్నించేందుకు అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఆరోగ్య కారణాల దృష్ట్యా తమకు సమయం కావాలని ఆయన కోరారు. కాగా అనిల్ అంబానీ గ్రూప్, ఎస్సెల్, ఐఎల్ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, వొడాఫోన్ తదితర కంపెనీలకు యస్ బ్యాంక్ ఇంచిన రుణాల వసూళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 6న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంక్లో పెట్టుబడులకు పలు ప్రైవేట్ బ్యాంకులు, సంస్థలు ముందుకురావడంతో పునరుద్ధరణ ప్రణాళిక ఊపందుకుంది. యస్ బ్యాంక్ షేర్ సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో ఏకంగా 33 శాతం మేర పెరిగింది. చదవండి : అంబానీ వద్ద చిల్లి గవ్వ లేదా?! -
కాజల్ అగర్వాల్కు సమన్లు?
సాక్షి, పెరంబూరు: నటి కాజల్ అగర్వాల్కు క్రైమ్బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్లో గత నెల 19వ తేదీన క్రేన్ కిందపడి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ముగ్గురు యూనిట్ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదం ఘటికలు మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రమాద సంఘటన కేసును క్రైమ్బ్రాంచ్ పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న వారిని విచారించారు. అంతేకాకుండా చిత్ర దర్శకుడు శంకర్, కథానాయకుడు కమలహాసన్కు సమన్లు జారీచేశారు. దర్శకుడు శంకర్, ఆ తరువాత నటుడు కమలహాసన్ చెన్నైలోని క్రైమ్బ్రాంచ్ అధికారులు ఎదుట హాజరై విచారణను ఎదుర్కొన్నారు. తదుపరి ఆ ఘటన ప్రాంతంలో ఉన్న ఇండియన్–2 చిత్ర కథానాయకి కాజల్అగర్వాల్ను విచారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆమెకు క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు సమన్లను జారీ చేయనున్నట్లు తాజా సమాచారం. -
కమల్, శంకర్, కాజల్ విచారణకు హాజరు కావాలంటూ..!
సాక్షి, పెరంబూరు: ఇండియన్–2 చిత్ర షూటింగ్లో క్రేన్ కిందపడి ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్న ఘటన కోలీవుడ్లో దిగ్భ్రాంతిని కలిగించింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ కార్మికులకు భద్రత కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ ఘటన బాధాకరం అని నటుడు కమల్ హాసన్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాకుండా సినీ కార్మికులకు ఇక్కడ తగిన భద్రత లేకపోవడం బాధాకరమన్నారు. గురువారం సాయంత్రం గాయాలపాలైన ఇతర చిత్ర యూనిట్ సభ్యులను పరామర్శించడానికి స్థానిక కీల్పాకంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల సాయాన్ని ప్రకటించారు. దర్శకుడు శంకర్, ఇండియన్– 2 చిత్ర నిర్మాత సుభాస్కరన్ తదితరు యూనిట్ సభ్యులు క్షతగాత్రులను పరామర్శించారు. చదవండి: దర్శకుడు శంకర్కు తీవ్ర గాయాలు లైకా సంస్థ అధినేత సుభాస్కరన్ మృతుల కుటుంబానికి రూ.2 కోట్ల సాయాన్ని ప్రకటించారు. అదేవిధంగా ఇండియన్ 2 చిత్ర యూనిట్ మరణించిన యూనిట్ సభ్యుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించి సతాంపం తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే పూంవమల్లి, నసరద్పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విచారణకు నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్, నటి కాజల్ అగర్వాల్కు సమన్లు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరి తప్పిదం వంటి విషయాలపై వారిని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఒక సేవా సంస్థ కమలహాసన్, దర్శకుడు శంకర్పై చెన్నై పోలీస్కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ లైకాపై 4 సెక్షన్లలో కేసు నమోదయ్యింది. అదేవిధంగా క్రేన్ యజమానిపై ఒక కేసు, చిత్ర నిర్వాహకుడిపై మరో కేసు నమోదు అయ్యాయి. తాజాగా ఈ సంఘటనపై విచారణను క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారన్నది తాజా సమాచారం. ఇండియన్–2 చిత్రం మరింత చిక్కుల్లో పడనుందని సమాచారం. చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క భద్రత ధ్రువీకరణ కలిగిన స్టూడియోల్లో.. భద్రత ధ్రువీకరణ కలిగిన స్టూడియోల్లోనే సినీ కార్మికులు పనిచేస్తారని దక్షిణ భారత సీనీ సమాఖ్య (ఫెప్సీ) అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి చెప్పారు. ఇండియన్–2 చిత్ర షూటింగ్ ప్రాంతంలో జరిగిన సంఘటనపై ఈయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్కే.సెల్వమణి శుక్రవారం ఇచ్చిన భేటీలో పేర్కొంటూ షూటింగ్లో ఆంగ్ల చిత్రాలకు సమారంగా తమిళ్, మొదలగు ఇతర భాషా చిత్రాల కార్మికులకు భద్రత వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇండియన్ 2 చిత్ర షూటింగ్లో మృతి చెందిన కృష్ణ, మధు ఇద్దరూ ఫెప్సీ సభ్యులని తెలిపారు. వారితో పాటు మరణించిన చంద్రన్ నిర్మాత మండలి సభ్యుడని, ఆయన మండలిలో పలు శాఖల్లో బాధ్యతలు నిర్వహించారని చెప్పారు. ఇండియన్ 2 చిత్రానికి సినిమాలకు ఉపయోగించే క్రేన్ కాకుండా ఇతర వృత్తలకు వాడే క్రేన్ను ఉపయోగించడం వల్లే ఈ ఘోరం జరిగిందని అన్నారు. ఇండియన్ 2 చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్న ఈవీపీ ఫిలింసిటీలోనే ఇంతకుముందు కాల చిత్ర కార్మికులు ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోయారని గుర్తుచేశారు. ఇకపై భద్రతా ధ్రువపత్రం లేని స్టూడియోల్లో ఫెప్సీ సభ్యులు పని చేయరని సెల్వమణి స్పష్టం చేశారు. ఆంగ్ల చిత్రాలకు దీటుగా చిత్రాలు చేసేవారు కార్మికుల భద్రత సౌకర్యాలు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా స్టూడియోలో పనిచేసే కార్మికులకు వైద్య బీమా కల్పించాలన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాథమిక వైద్య వసతులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా మృతి చెందిన ఫెప్సీ సభ్యులైన మధు, చంద్రన్కు వారి సంఘాలు తలా రూ.6 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా లైకా సంస్థ మరణించిన వారికి వైద్య ఇన్సూరెన్స్ను చేసినట్లు ఆర్కే.సెల్వమణి తెలిపారు. చదవండి: 'ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా' -
ఈడీ ముందుకు శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. దివంగత గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ రాజ్కుంద్రాకు సమన్లు జారీ చేసింది. కుంద్రా ఉదయం 11 గంటలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. కుంద్రాను నవంబర్ 4న హాజరు కావాలని దర్యాప్తు సంస్థ కోరగా, ఆ సమయంలో తాను అందుబాటులో ఉండలేని కారణంగా ముందస్తు తేదీని కోరినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి రంజీత్ బింద్రా, బాస్టియన్ హాస్పిటాలిటీ సంస్థలతో కుంద్రాకు గల సంబంధాలు, వడ్డీలేని రుణాలు అందించిన విషయంపై ఈడీ పరిశీలిస్తోంది. -
శిల్పాశెట్టి భర్తకు ఈడీ మరోసారి షాక్
సాక్షి, ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. 2013లో చనిపోయిన గ్యాంగ్స్టర్ ఇక్బాల్కు మిర్చికి సంబంథించిన కేసులో రాజ్ కుంద్రాపై ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ, ఈ కేసుకు సంబంధించి రంజీత్ బింద్రా , బాస్టియన్ హాస్పిటాలిటీ అనే సంస్థతో కుంద్రాకున్న లావాదేవీలను పరిశీలిస్తోంది. ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని వ్యాపార లావాదేవీలపై కీలక సమాచారం అందిన నేపథ్యంలో సమన్లు జారీ చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా స్టేట్ మెంట్ ను రికార్డు చేయాల్సి వున్నందున ముంబైలోని విచారణ అధికారుల ముందు హాజరు కావాలని నోటిసులిచ్చినట్టు తెలిపారు. బాస్టియన్ హాస్పిటాలిటీ సంస్థతో రంజీత్ బింద్రాకు ప్రమేయం ఉందని, రజనీత్ తో కుంద్రా దగ్గరి సంబంధాలను నెరిపాడని అధికారులు అంటున్నారు. ముంబైలో విలువైన ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో మిర్చిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత 2013లో గుండెపోటుతో మిర్చి మరణించాడు. పలు ఆర్థిక అవకతవకల నేపథ్యంలో రంజిత్ బింద్రాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుంద్రా ఖండించారు కాగా ఇటీవల ( సెప్టెంబర్ 9 ) 44 ఏళ్ళు నిండిన భర్త రాజ్ కుంద్రా పుట్టినరోజు వేడుకలను శిల్పా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను , వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. -
భారత రాయబారికి పాక్ సమన్లు
న్యూఢిల్లీ : పాకిస్తాన్ విదేశాంగ శాఖ భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియాకు సమన్లు జారీచేసింది. పాక్ అక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 4 ఉగ్రస్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పాక్ సైనికులతో పాటు, పలువురు ఉగ్రవాదులు మరణించారని భారత ఆర్మీ పేర్కొంది. అయితే భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి.. తమ దేశ పౌరులను పొట్టనబెట్టుకుందని ఆరోపించింది. దీంతో పాక్ మరోసారి భారత్పై తన ద్వేషాన్ని ప్రదర్శించినట్టయింది. భారత కాల్పుల్లో ఓ పాక్ సైనికుడితో పాటు ముగ్గురు పౌరులు చనిపోయారని పాక్ ఆర్మీ అధికారులు చెప్పారు. అలాగే ఇద్దరు సైనికులు, ఐదుగురు పౌరులు చనిపోయినట్టు తెలిపారు. ఎక్కడ కూడా ఉగ్ర స్థావరాలు గానీ, ఉగ్రవాదులు గానీ మరణించినట్టు పాక్ పేర్కొనక పోవడం గమనార్హం. కాగా, తాంగ్ధర్ సెక్టార్లో శనివారం సాయంత్రం పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిందని భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. భారత్లోకి తీవ్రవాదులను పంపేందుకు పాక్ ఆర్మీ ఈ కాల్పులు జరిపిందని తెలిపాయి. అందువల్లే తాము పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేయాల్సి వచ్చిందని వెల్లడించాయి. -
డీకే శివకుమార్కు మరో షాక్
బెంగళూరు : కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో శివకుమార్ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా ఆయన కుమార్తె ఐశ్వర్యకు సమన్లు జారీచేశారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని ఐశ్వర్యకు సమన్లు జారీ చేసినట్టు సీనియర్ ఈడీ అధికారి ఒకరు తెలిపారు. శివకుమార్ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న సమయంలో ఈడీ అధికారులు.. ఆయన కుమార్తె నిర్వహిస్తున్న ఒక ట్రస్టుకు సంబంధించిన పత్రాలను కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా 2017 జూలైలో శివకుమార్, ఆయన కుమార్తె కలిసి ఒక బిజినెస్ డీల్ కోసం సింగపూర్ వెళ్లడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి శివకుమార్కు సన్నిహితుడైన సచిన్ నారాయణ్ విచారించారు. కాగా, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివకుమార్ను సెప్టెంబర్ 13 వరకు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : శివకుమార్కు 13 వరకు కస్టడీ -
ఈడీ ముందు హాజరైన డీకే శివకుమార్
బెంగళూరు: మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. బెంగళూరు నుంచి బయలుదేరిన ఆయన ఢిల్లీ ఖాన్ మార్కెట్లోని లోక్ నాయక్ భవన్ ఈడీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. ‘ఈడీ ఎదుట హాజరవడం నా బాధ్యత. వారు నాకు సమన్లు ఇచ్చారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వారెందుకు పిలిచారో అర్థం కావడం లేదు. వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని శివకుమార్ చెప్పారు. మనీలాండరింగ్ కేసులో హాజరు కావాల్సిందిగా గతంలో ఈడీ సమన్లు జారీ చేయడంతో, వాటిని సవాల్ చేస్తూ శివకుమార్ హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టులో గురువారం ఆయనకు చుక్కెదురవడంతో ఈడీ తాజాగా శుక్రవారం మధ్యాహ్నం కల్లా హాజరు కావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది. తాను ఈ సమన్లపై న్యాయపరమైన పోరాటం చేస్తానని, కుటుంబ కారణాలు, ఇతర కార్యక్రమాల వల్ల ఈడీ ఎదుట హాజరు కాలేనని ఉదయం చెప్పారు. అయినప్పటికీ తనకు చట్టంమీద గౌరవం ఉందంటూ సాయంత్రం ఆరున్నర గంటలకు ఈడీ ఎదుట హాజరయ్యారు. 2017 గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలను బీజేపీకి దొరక్కుండా బెంగళూరు రిసార్ట్లలో దాచడంలో కీలక పాత్ర పోషించినందుకే బీజేపీ ఐటీ, ఈడీ దాడులు జరుపుతోందని ఆరోపించారు. హవాలా మార్గం ద్వారా కోట్ల రూపాయలను బెంగళూరు, ఢిల్లీలలో దాచారని ఆరోపిస్తూ ఏ1గా శివకుమార్తో పాటు సచిన్ నారాయణ్, ఆంజనేయ హనుమంతయ్య, ఎన్ రాజేంద్రలపై గతేడాది సెప్టెంబర్లో కేసులు నమోదయ్యాయి. వీరు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగ్గొట్టే కుట్ర పన్నారని ఆదాయపన్ను శాఖ ఆరోపించింది. 2017 ఆగస్టులో శివకుమార్కు చెందిన దాదాపు రూ. 20 కోట్ల నల్లధనాన్ని పట్టుకున్నట్లు తెలిపింది. -
‘టెన్షన్ ఎందుకు..నేనేం రేప్ చేయలేదు’
బెంగళూర్ : కర్ణాటక మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్కు మనీల్యాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ సమన్లపై డీకే స్పందిస్తూ తాను దీనిపై ఎలాంటి టెన్షన్ తీసుకోవడం లేదని, తాను ఎలాంటి పొరపాటూ చేయలేదని, తాను ఎవరి వద్దా డబ్బు తీసుకోలేదని, లైంగిక దాడి చేయలేదని పేర్కొన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని బీజేపీ సర్కార్పై ఆయన నిప్పులు చెరిగారు. రూ కోట్లలో పన్ను ఎగవేతలకు పాల్పడటంతో పాటు అక్రమ లావాదేవీలు సాగించారనే ఆరోపణలపై డీకే శివకుమార్ మరికొందరిపై గత ఏడాది సెప్టెంబర్లో ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో డీకేతో పాటు ఢిల్లీలోని కర్ణాటక భవన్కు చెందిన ఉద్యోగి సహా మరికొందరి పేర్లను ఈడీ చేర్చింది. గత రెండేళ్లుగా తన 84 ఏళ్ల తల్లికి చెందిన యావదాస్తినీ బినామీ ఆస్తులుగా దర్యాప్తు సంస్థలు అటాచ్ చేశాయని, తమ రక్తం మొత్తం పీల్చేశారని డీకే ఆందోళన వ్యక్తం చేశారు. -
రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో అక్రమాస్తులకు సంబంధించి మనీల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. దర్యాప్తు ఏజెన్సీ అధికారుల ఎదుట గురువారం ఉదయం హాజరు కావాలని కోరింది. లండన్లో 2 కోట్ల పౌండ్ల ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన క్రమంలో వాద్రాపై మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 1న వాద్రాకు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించరాదని కూడా వాద్రాను కోర్టు కోరింది. ఇదే కేసులో వాద్రా సన్నిహితుడు మనోజ్ అరోరాకు కూడా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
పాక్ హైకమిషనర్కు భారత్ సమన్లు..!
-
పాకిస్తాన్కు భారత్ సమన్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలపై చర్యలను తీసుకోవల్సిందిగా పాకిస్తాన్ హైకమిషనర్కు భారత్ సమన్లు జారీ చేసింది. భారత జవాన్లపై ఆత్మహుతి దాడికి పాల్పడిన పాకిస్తాన్కు చెందిన జేషే ఏ మహ్మద్ ఉగ్రసంస్థపై చర్యలు తీసుకుకోని, వాటిని వెంటనే నిషేధించాలని భారత్ అదేశించింది. ఈమేరకు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం పాకిస్తాన్ హైకమిషనర్కు సమన్లు జారీచేశారు. పుల్వామాలో జరిగిన దాడికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని, ఉగ్రవాద మూలాలున్న గ్రూపులను, వ్యక్తులను నిలువరించాలని పాక్ను భారత్ ఆదేశించింది. భారత్ సైనికులపై దాడికి పాల్పడ్డ సంస్థలను నిషేధించకుంటే చర్యలు తప్పవని భారత్ హెచ్చరించింది. పుల్వామా దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. -
నాగేశ్వరరావుపై సీజేఐ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనే ఆరోపణలపై గత ఏడాది మోదీ ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక చీఫ్గా నియమించిన ఎం నాగేశ్వరరావుకు గురువారం సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 12న న్యాయస్ధానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా ముజఫర్పూర్ షెల్టర్ హోంలో బాలికలపై లైంగిక దాడి కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను బదిలి చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీం కోర్టు ప్రాథమికంగా నిర్ధారించింది. తన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సీబీఐ ప్రాసిక్యూషన్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎస్ వాసూరాంను కూడా కోర్టు ఎదుట హాజరు కావాలని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. ఏకే శర్మ బదిలీ ప్రక్రియలో భాగస్వాములైన అధికారుల పేర్లను ఇవ్వాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ సందర్భంగా సీజేఐ రంజన్ గొగొయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశాలతో ఆడుకున్నారు. దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎప్పుడూ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆడుకోకండి.’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ముజఫర్పూర్ షెల్టర్ హోమ్ కేసు విచారణను సుప్రీంకోర్టు ఇవాళ ఢిల్లీసాకేత్ పోక్సో కోర్టుకు బదిలీ చేయడమే కాకుండా, విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ముజఫర్పూర్లో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న షెల్టర్ హోంలో పలువురు బాలికలపై హోం నిర్వాహకులు లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
డొల్ల కంపెనీలపై సుజనాను ప్రశ్నించిన ఈడీ
సాక్షి, చెన్నై : బ్యాంకులకు రూ 6000 కోట్ల మేర రుణాల ఎగవేత కేసులో టీడీపీ రాజ్యసభ ఎంపీ, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరిని ఈడీ అధికారులు మంగళవారం రెండో రోజూ సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా నిన్న సుజనాను లంచ్కు అనుమతించిన అధికారులు మంగళవారం మాత్రం మధ్యాహ్న భోజన విరామానికి బయటకు అనుమతించలేదు. సీబీఐ నమోదు చేసిన మూడు కేసుల్లో బ్యాంకులకు రుణాల ఎగవేతపైనే ఈడీ అధికారులు సుజనాను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నిధుల మళ్లింపుపై ఆరా.. విదేశాలకు నిదుల తరలింపుపై అధికారులు ఆయనను ప్రశ్నించారు. 120 డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా నిధుల తరలింపుపైనా ఈడీ అధికారులు సుజనాను పలు కోణాల్లో ప్రశ్నించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కాగా, బ్యాంకుల నుంచి అడ్డగోలుగా రుణాలు పొందేందుకు సుజనా ఏకంగా 126 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రూ.6,000 కోట్ల రుణాలు తీసుకొని వాటిని షెల్ కంపెనీల ద్వారా బినామీ సంస్ధలకు బదలాయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పగడ్బందీగా ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు మరింత లోతుగా విచారించేందుకు చెన్నైలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సుజనా చౌదరిని ఆదేశించారు. ఈడీ విచారణను తప్పించుకునేందుకు సుజనా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవటంతో తాజాగా చెన్నై నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన శాస్త్రి భవన్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు సుజనా హాజరయ్యారు. ఇక ఈడీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధుల కంటపడకుండా ఉండేందుకు సుజనా చౌదరి ప్రయత్నించారు. -
రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : బికనీర్ భూ ఒప్పందం కేసుకు సంబంధించి సోనియా గాంధీ అల్లుడు, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. బికనీర్లో భూముల కొనుగోలుకు అధిక వడ్డీతో ఓ కంపెనీ రుణం సమకూర్చిందని, ఈ రుణం వాద్రాకు పన్ను ఎగవేతలకు ఉపకరించిందని, ఆదాయ పన్ను సెటిల్మెంట్ నుంచి ఉపశమనం కలిగిందనే వార్తలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఈడీ నుంచి సమన్లు రావడం గమనార్హం. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నిర్వాసితులకు ఉద్దేశించిన కోయాపేట్ ప్రాంతంలోని భూ లావాదేవీల్లో అక్రమాలపై ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ 2015లో మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది. చట్టవిరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల పేరుతో కేటాయింపులు జరిగాయని రెవెన్యూ శాఖ నిర్ధారించడంతో రాజస్ధాన్ ప్రభుత్వం 374 హెక్టార్ల భూమి హక్కుల బదలాయింపులను రద్దు చేసింది. హర్యానాలోని గురుగ్రామ్లోనూ 2008లో ఓ భూ కుంభకోణానికి సంబంధించిన మరో కేసులోనూ వాద్రా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వాద్రా వివరణ బికనీర్ భూ కుంభకోణంపై ఈడీ సమన్లు జారీ చేయడంపై రాబర్ట్ వాద్రా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ తరహా కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. రాఫేల్ డీల్, ఇతర అంశాలపై బీజేపీని ప్రశ్నించిన ప్రతిసారీ తన పేరును బయటికి లాగుతున్నారని మండిపడ్డారు. తనపై వచ్చిన అభియోగాలన్నీ న్యాయస్ధానాల పరిధిలో ఉన్నాయన్నారు. -
గూగుల్ సీఈవోకు సమన్లు
వాషింగ్టన్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కి నోటీసులు అందాయి. గూగుల్ సెర్చిఇంజీన్లో చైనీస్ వెర్షన్ రూపొందించే ప్రణాళికలపై సెనేటర్లు తీవ్రంగా స్పందించారు. అమెరికా సెనేట్లోని ఆరుగురు సభ్యులు పిచాయ్కు సమన్లు జారీ చేశారు. పిచాయ్కు. తాజా మీడియా నివేదిలకపై వివరణ ఇవ్వాల్సిందిగా ఒక లేఖ రాశారు. గుగుల్ నిర్ణయానికి కొత్తగా ఏం మారిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇదే నిజమైతే ఇది చాలా ప్రమాదకరమైన పరిణామంగా తమ లేఖలో పేర్కొన్నారు. చైనాలో కఠినమైన సెన్సార్షిప్ నిబంధనల్లో 2010నుంచి కొత్తగా ఏది మారిందని సెనేటర్లు ఘాటుగా స్పందించారు. ఇంటెలిజన్స్ కమిటీ ఉపాధ్యక్షుడు వార్నర్, సెనేట్ ఫారిన్ రిలేషన్స్ అండ్ ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడైన ఫ్లోరిడా రిపబ్లికన్ రూబియో సహా పలు సెనేటర్లు సుందర్ పిచాయ్ను ప్రశ్నించారు. గూగుల్కు సౌకర్యవంతమైన సహకారం అందించడానికి సంబంధించిన పరిస్థితులపై వారు లేఖలో ప్రశ్నించారు. ఇది చైనా ప్రభుత్వ కుట్ర అని సెనేటర్లు తప్పు పట్టారు. చైనాలో గూగుల్ ప్రాజెక్ట్ ప్రమాదకరమైన చర్య అని పేర్కొన్నారు. అలాగే సెన్సార్షిప్ నిబంధనలకు లోబడి, ప్రధాన విలువలతో రాజీ లేకుండా వ్యవహరిస్తున్న ఇతర టెక్ కంపెనీలకు ఆందోళనకర పరిణామమని వ్యాఖ్యానించారు. కాగా చైనా కోసం గూగుల్ ఒక కొత్త సెర్చి ఇంజీన్ రూపొందించనుందనంటూ మీడియా నివేదికలు గత వారం వెలుగులోకి వచ్చాయి. మరోవైపు చైనాకు చెందిన చైనా సెక్యూరిటీస్ డైలీ గత వారం ఈ నివేదికలను తిరస్కరించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్ కమ్యూనిటీ చైనాలో సొంతం. దాదాపు 772 మిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. -
అవినీతి కేసులో లాలూకు సమన్లు
సాక్షి,న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాద్ సహా ఇతర నిందితులకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఓ ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు కేటాయింపులో అక్రమాలు చోటుచేసుకున్న కేసులో ఆగస్టు 31న కోర్టు ఎదుట హాజరు కావాలని నిందితులను ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ ఆదేశించారు. కేసుకు సంబంధించి నిందితులపై తగిన సాక్ష్యాధారాలున్నాయని ఏప్రిల్ 16న చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పేర్కొంది. లాలూ కుటుంబ సభ్యులతో పాటు మాజీ కేంద్ర మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, బీకే అగర్వాల్, అప్పటి ఐఆర్సీటీసీ ఎండీ, డైరెక్టర్ రాకేష్ సక్సేనాల పేర్లు చార్జిషీట్లో పొందుపరిచారు. ఐఆర్సీటీసీ అప్పటి గ్రూప్ జనరల్ మేనేజర్లు వీకే ఆస్ధానా, ఆర్కే గోయల్, విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్, సుతాజా హోటల్స్ డైరెక్టర్లు, చాణక్య హోటల్ అధినేతల పేర్లు సైతం చార్జిషీట్లో నమోదయ్యాయి. -
ఆన్లైన్లోనే ఎన్ఆర్ఐ భర్తలకు నోటీసులు
న్యూఢిల్లీ: భార్యలను వేధిస్తున్న, పరారీలో ఉన్న ఎన్ఆర్ఐ భర్తలకు సమన్లు జారీచేసేందుకు పోర్టల్ను రూపొందిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఒకవేళ నిందితుడు స్పందించకుంటే, అతడిని ప్రకటిత నేరస్థుడిగా నిర్ధారించి, అతడి ఆస్తులను అటాచ్ చేస్తామని తెలిపారు. పోర్టల్ ఏర్పాటుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందన్నారు. పోర్టల్లో పొందుపరచిన వారెంట్లను నిందితుడికి జారీచేసినట్లుగానే భావించాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఏర్పాటైన అంతర మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సుల మేరకు 8 మంది నిందితులకు సమన్లు జారీచేసి, వారి పాస్పోర్టులు రద్దుచేశామని వెల్లడించారు. -
కొత్త ఆర్డినెన్స్ : విజయ్ మాల్యాకు సమన్లు
సాక్షి, ముంబై: ప్రభుత్వ బ్యాంకులకు భారీ రుణ ఎగవేత దారుడు, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు తాజాగా మాల్యాకు సమన్లు జారీ చేసింది. భారీగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరస్తులపై కొరడా ఝుళిపించేందుకు కొత్తగా ప్రకటించిన ఆర్డినెన్స్ కింద ఆగష్టు 27న, లేదా అంతకుముందు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. లేదంటే ‘పరారీలో ఉన్న నేరస్థుడి’గా ప్రకటించడంతోపాటు మాల్యాకు చెందిన రూ. 12,500కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. పెండింగ్లో ఉన్నబ్యాంకు బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాననీ, ఇందుకు బ్యాంక్ ఆఫ్ కన్సార్షియంతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు మాల్యా సంసిద్ధత వ్యక్తం చేసిన సందర్భంలో సమన్లు జారీ చేయడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరస్థుల ఆర్డినెన్స్ ప్రకారం రుణదాతల "అన్ని లింక్డ్ ఆస్తులను" స్వాధీనం చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. దేశంలో ఈ ఆర్డినెన్స్ తరువాత ఈడీ తీసుకున్న మొదటి కేసు.. మొదటి చర్య మాల్యాపైనే. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులు, వజ్రాల వ్యాపారి నీరవ్మోదీ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీ పై చర్యలకు ఈడీ సిద్ధం కానుంది. మరోవైపు మాల్యా బేరానికి దిగొచ్చారన్న వార్తలపై మాల్యా నేడు(శనివారం) స్పందించారు. తనది బేరమైతే..ఈడీ అధికారులు కూడా అదే సిద్ధాంతాన్ని అనుసరించాలంటూ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో ఈడీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాను బేరసారాలకు ప్రయత్నిస్తున్నానని చెప్పిన ఈడీ అధికారులు ముందు ఈడీ ఛార్జ్షీట్ చదవాలని సలహా యిచ్చారు. అదే నిజమైతే ఈడీ అధికారులుకూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి.. ఎక్కడైతే తనఆస్తులు ఉన్నాయో ఆ కోర్టుల్లో ఇలాంటి బేరసారాల ఒప్పందానికి రావాలని ఆహ్వానిస్తున్నానంటూ మాల్యా ట్వీట్ చేశారు. -
ఎయిర్ ఏసియా డైరెక్టర్కు సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఎయిర్ ఏసియా ఇండియా డైరెక్టర్ ఆర్ వెంకటరామనన్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. జూలై 3వ తేదీన విచారణకు హాజరు కావాలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్లైన్స్ చెందిన ఫైనాన్షియల్ ఆఫీసర్ దీపక్ మహేంద్రను ఇటీవల ప్రశ్నించిన సీబీఐ ఇపుడు వెంకటరామన్ను ప్రశ్నించనుంది. మరోవైపు వాణిజ్యపరిశ్రమల శాఖనుంచి ఎఫ్డీఐ పెట్టుబడుల ఆమోదానికి సంబంధించిన పత్రాలను తాజాగా ఈడీ సేకరించింది. అంతర్జాతీయ విమానయానానికి కావాలసిన పర్మిట్లను తెచ్చుకొనేందుకు ఎయిర్ ఆసియా భారీ కుంభకోణానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) నిబంధనలను కూడా ఉల్లంఘించారంటూ ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసింది. 5/20 నిబంధన అంటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహించేందుకు లైసెన్స్ పొందాలంటే 20 విమానాలు, 5 ఏళ్ళ అనుభవం ఉండాలి. ఇవి లేకుండా విదేశీ లైసెన్స్ పొందారనేది సీబీఐ ఆరోపణ. ఈ కేసులో ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ గ్రూప్ ఎయిర్ ఏషియా, మలేషియా గ్రూప్ సీఈఓ, ట్రావెల్ ఫుడ్ ఓనర్ సునీల్ కపూర్, డైరెక్టర్ ఆర్ వెంకట్రామన్, ఏవియేషన్ కన్సల్టెంట్ దీపక్ తల్వార్, సింగపూర్కు చెందిన ఎస్ఎన్ఆర్ ట్రేడింగ్ రాజేంద్ర దూబేతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చిన సంగతి తెలిసిందే. -
వాట్సప్ ద్వారా కోర్టు సమన్లు
గాంధీనగర్, సూరత్ : భారత న్యాయ వ్యవస్థ చర్రితలో తొలిసారి ఓ కోర్టు సామాజిక మాధ్యమం (వాట్సప్) ద్వారా ఓ వ్యక్తికి సమన్లు జారిచేసింది. గుజరాత్లోని సూరత్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో బాధితుడి న్యాయవాది అభ్యర్ధన మేరకు వాట్సప్ ద్వారా సమన్లు పంపింది. వివరాలు... సూరత్కు చెందిన ఓ టీ కప్స్ వర్తకుడు 2017లో రాజస్తాన్లోని జైపూర్లో ఓ హోల్ సెల్ వ్యాపారి వద్ద టీ కప్స్ కొరకు ఆర్డర్ ఇచ్చాడు. సరకు సరఫర చేసేందుకు అడ్వాన్స్గా లక్షా ముఫై వేలు చెల్లించాడు. ఎనిమిది నెలలు గడిచినా సరుకు పంపక పోవడంతో తాను చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. దానికి అంగీకరించిన వ్యాపారి చెక్ రూపంలో నగదు చెల్లించాడు. తనకు వేసిన చెక్ బౌన్స్ అయిందని, ఆ విషయంపై వ్యాపారితో చర్చిద్దాం అనుకున్నాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందన లేకపోవడంతో తనకు న్యాయం చేయవలసిందిగా సూరత్లోని అదనపు న్యాయ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు మూడు సార్లు సమన్లు పంపినా అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో న్యాయవాది అభ్యర్ధన మేరకు వాట్సప్ ద్వారా సమన్లు జారిచేసింది. తన అభ్యర్ధన మన్నించి దేశంలోనే మొదటిసారిగా వాట్సప్ ద్వారా కోర్టు సమన్లు పంపిందని భాదితుడు తరుఫున న్యాయవాది అశ్విన్ జోగడియా తెలిపారు. -
ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలకు చెక్..
సాక్షి, న్యూఢిల్లీ : కుటుంబ వివాదాల్లో చిక్కుకుని కోర్టు సమన్లను ఖాతరు చేయకుండా తప్పించుకు తిరిగే ఎన్ఆర్ఐ భర్తలకు సర్కార్ షాక్ ఇవ్వనుంది. కోర్టు సమన్లను లెక్కచేయని ఎన్ఆర్ఐ భర్తల ఉమ్మడి ఆస్తిలో వాటాను సీజ్ చేస్తూ చట్ట సవరణలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. విలాసవంతమైన జీవనశైలితో ఆకట్టుకుని పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలను వదిలివేస్తున్న ఎన్ఆర్ఐ భర్తల ఉదంతాలు పెరుగుతున్న క్రమంలో వీరికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. జీవిత భాగస్వామి దాఖలు చేసిన ఫిర్యాదుపై పోలీసుల విచారకు, సమన్లకు స్పందించకుండా దేశ విదేశాల్లో తిరుగుతూ, గుర్తింపును సైతం మార్చుకుంటూ న్యాయప్రక్రియను ఎదుర్కోని వారి పేర్లను వెబ్సైట్లోపొందుపరచాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వారిని పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో పాటు వారి ఆస్తుల స్వాధీనం, పాస్పోర్టుల రద్దు వంటి తీవ్ర చర్యలూ చేపట్టాలని యోచిస్తోంది. మరోవైపు ఇటీవల ప్రకటించిన వివాహమైన 48 గంటల్లోగా ఎన్ఆర్ఐ వివాహాలను విధిగా రిజిస్టర్ చేయించాలన్న నిబంధనను సత్వర అమలుకు ప్రభుత్వం పూనుకుంది. భార్యలను మోసం చేసి తప్పించుకుతిరిగే ఎన్ఆర్ఐలను చట్టం ముందు దోషిగా నిలిపేందుకు చట్ట సవరణలను సత్వరమే చేపట్టాలని సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్, మనేకా గాంధీ వంటి సీనియర్ మంత్రులతో కూడిన మంత్రుల బృందం నిర్ణయించింది. -
సునంద హత్య కేసులో శశిథరూర్కు సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : సునంద పుష్కర్ హత్య కేసులో మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్కు ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. కేసులో నిందితుడైన శశి థరూర్ను జులై 7న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నేరానికి పాల్పడినట్టు థరూర్కు వ్యతిరేకంగా స్పష్టమైన అనుమానాలున్నాయని సమన్లు జారీ చేస్తూ కోర్టు అభిప్రాయపడింది. కేసులో నిందితుడిగా ఆయనకు సమన్లు జారీ చేయాలా అనే అంశంపై కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్లో ఉంచిన వారం రోజుల తర్వాత తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. తన భార్య సునందా పుష్కర్కు తీవ్రంగా వేధించి ఆత్మహత్యకు పురిగొల్పేలా శశి ధరూర్ వ్యవహరించారనే ఆరోపణలను కూలంకషంగా పరిశీలించిన మీదట అదనపు చీఫ్ మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ సమర్ విశాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సునంద పుష్కర్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా శశి థరూర్పై తగినన్ని ఆధారాలున్నాయని, ఆయనను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయాల్సిందిగా మే 14న ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. భార్య సునంద పుష్కర్ పట్ల ఆయన క్రూరంగా వ్యవహరించేవారని, నాలుగున్నరేళ్ల కిందటి ఈ కేసులో ఆయన ఒక్కరే నిందితుడని 3000 పేజీల చార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో 2014, జనవరి 17న సునందా పుష్కర్ విగతజీవిగా పడిఉన్న విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. శశిథరూర్పై భార్యను తీవ్రంగా వేధించడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో శశిథరూర్ ఇంట్లో పనిచేసే నారాయణ్ సింగ్ను కీలక సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నారు.