Sushanth SIngh Rajput
-
సినిమాల్లేవుగా సంపాదన ఎలా? హీరో సుశాంత్ ప్రేయసి సమాధానమిదే!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరు తలుచుకున్నప్పుడల్లా చిన్న వయసులో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అని ఫ్యాన్స్ ఇప్పటికీ బాధపడుతుంటారు. సుశాంత్ చనిపోయిన తర్వాత అతడి ప్రేయసి, హీరోయిన్ రియా చక్రవర్తిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఈమె వల్లే చనిపోయాడని కూడా అన్నారు. ఇప్పటికే పూర్తిగా యాక్టింగ్కి దూరమైపోయిన రియా.. ఏం చేస్తున్నాను? సంపాదన ఎలా అనే విషయాల్ని తన పాడ్కాస్ట్లో బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్కి కూడా!)'ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను. నా జీవనాధారం ఏంటని కొందరు అడుగుతున్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. మోటివేషనల్ స్పీకర్గా మారి డబ్బులు సంపాదిస్తున్నాను. నా జీవితంలో ఇది రెండో ఛాప్టర్ అని చెప్పొచ్చు. గతంలో ఏం జరిగిందో, ఎలాంటి బాధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించని, నా గురించి అన్ని తెలిసినట్లు చాలా విమర్శలు చేశారు. ఇంకొందరైతే నేను చేతబడి చేశానని అన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజాయతీగా ఉన్నా, ధైర్యంగా ముందుకు సాగుతున్నాను' అని రియా చక్రవర్తి చెప్పుకొచ్చింది.బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్లోకి వచ్చిన సుశాంత్ సింగ్.. 'చిచ్చోరే' లాంటి సినిమాలతో హీరోగా చాలా ఫేమ్ సంపాదించాడు. కానీ ఏమైందో ఏమో గానీ 2020 జూన్లో ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి బాలీవుడ్లోని నెపోటిజం కల్చరే కారణమని, బడా హీరోలే ఇతడికి అవకాశాలు రాకుండా చేసి, మానసికంగా హింసపెట్టి చంపేశారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇతడి ప్రేయసి రియాపై కూడా విపరీతమైన ట్రోల్స్ రావడంతో ఇప్పుడు ఆమె పూర్తిగా నటనకు దూరమైపోయింది. తాజాగా ఈ విషయాన్ని ఈమెనే బయటపెట్టింది.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్) -
సుశాంత్ వర్ధంతి.. వెక్కివెక్కి ఏడ్చిన బుల్లితెర నటి!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరు బాలీవుడ్లో తెలియనివారు ఉండరు. ఎంఎస్ ధోని చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఊహించని విధంగా 2020లో ముంబయిలోని తన నివాసంతో సూసైడ్ చేసుకున్నారు. ఇవాళ అతని నాలుగో వర్ధంతి సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుశాంత్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి సుశాంత్ సన్నిహితురాలు, సహనటి క్రిస్సన్ బారెట్టో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుశాంత్ను తలుచుకుని బోరున విలపించారు. అతనికి ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ వెక్కివెక్కి ఏడ్చారు. సుశాంత్ తనతో ప్రతి చిన్న విషయంలోనూ ఎప్పుడు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉండేవాడని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. సుశాంత్.. ఎంఎస్ ధోని మూవీతో పాటు డ్రైవ్, చిచోరే, కేదార్నాథ్, దిల్ బేచారా లాంటి సినిమాల్లో నటించారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్లో హీరోయిన్ మకాం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ పేరు చెప్పగానే చాలామంది ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే ఎంతో పెద్ద కెరీర్ ఉన్న హీరో.. ఊహించని విధంగా తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. హిందీ ఇండస్ట్రీలోని నెపోటిజం వల్ల ఇలా జరిగిందని రచ్చ రచ్చ జరిగింది.(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?)అలాంటిది ఆ ఫ్లాట్లో యంగ్ హీరోయిన్ అదాశర్మ మకాం పెట్టేసింది. దాదాపు నాలుగు నెలల క్రితమే తాను ఈ ప్లేసులోకి షిఫ్ట్ అయినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. 'ద కేరళ స్టోరీ' సినిమాతో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్న అదా.. సుశాంత్ ఫ్లాట్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.'నేను నాలుగు నెలల క్రితమే ఈ ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యాను. కానీ నా సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉండటం వల్ల సర్దుకోవడం కుదర్లేదు. ఈ మధ్య పూర్తిగా వస్తువులు, సామాన్లు అన్నీ సర్దేసుకున్నాను. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కేరళ, ముంబయిలోని మా ఇళ్ల చుట్టూ చెట్లు ఉంటాయి. అందుకే చుట్టూ పచ్చని వాతావరణం ఉన్న ఈ ఇంటికి మారాను. అలానే ఈ ఫ్లాట్లోకి వేరే ఏం ఆలోచించకుండా మారిపోయాను' అని అదాశర్మ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్గా 'పరువు' ట్రైలర్) -
నీళ్లలాంటి ఆహారం.. టాయిలెట్ పక్కనే పడుకున్నా..: హీరోయిన్
బాలీవుడ్ నటుడు, ఎంఎంస్ ధోని హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. యంగ్ హీరో సూసైడ్ చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కు గురైంది. అయితే సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు జైలులో ఉన్న రియా ఆ తర్వాత బెయిల్పై రిలీజై బయటికొచ్చారు. తాజాగా ఓ షోకు హాజరైన రియా జైలులో ఉన్నప్పటి చేదు అనుభవాలను పంచుకున్నారు. రియా మాట్లాడుతూ.. 'నాకు జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం పెట్టేవాళ్లు. కేవలం అవీ పేరుకే గానీ మొత్తం నీళ్లలాగే ఉండేది. అయినప్పటికీ ఆకలిగా ఉండటంతో గతిలేక తినేసేదాణ్ని. నేను పడుకునే ప్లేస్ పక్కనే బాత్రూమ్ ఉండేది. ఇలాంటివి దుర్భర పరిస్థితులు జైలులో చవిచూశా. ఆ సమయంలో పడిన శారీరక బాధల కన్నా.. మానసిక క్షోభనే ఎక్కువ అనుభవించా. కానీ మిగిలిన వారితో పోలిస్తే నా పరిస్థితి కాస్తా ఫరవాలేదనిపించేది. కొందరు బెయిల్ వచ్చినా రూ.5 వేలు, రూ.10 వేలు కూడా కట్టలేక అక్కడే ఉండేవారు. నాకు బెయిల్ వచ్చినప్పుడు.. మీరు హీరోయిన్ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్ చేసి చూపిచండని కొందరు అడిగారు. అందుకే ఆ సమయంలో నాగిని పాటకు డ్యాన్స్ చేశా' అని జైలులోని అనుభవాలను చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
సుశాంత్తో బ్రేకప్పై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆయన మరణించి మూడేళ్లు దాటిన(2020 జూన్లో ఆత్మహత్య చేసుకున్నాడు).. ఇప్పటికీ ఆయన గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన మాజీ ప్రియురాలు అంకిత లోఖండేతో పాటు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న రియా చక్రవర్తి.. ఇప్పటికీ సుశాంత్ని తలచుకొని బాధపడుతుంటారు. తాజాగా హీరోయిన్ అంకితా లోఖండే..సుశాంత్తో బ్రేకప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ని తాను ఎంతగానో ప్రేమించానని, కానీ ఇతరుల మాటలను విని తనకు బ్రేకప్ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. ‘మేమిద్దరం విడిపోవడానికి పెద్ద కారణాలేవి లేవు. సుశాంత్ విడిపోదామని చెప్పగానే నేను షాకయ్యాను. ఆయన నిర్ణయంతో రాత్రికి రాత్రే నా జీవితంలోని పరిస్థితులన్నీ మారిపోయాయి. బ్రేకప్ ఎందుకు చెప్పాడో తెలియదు. కానీ అతని నిర్ణయాన్ని మాత్రం తప్పుబట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎదుట వాళ్ల మాటలు విని ఆయన నాకు బ్రేకప్ చెప్పాడేమో అనిపిస్తుంది’అని అంకితా లోఎఖండే చెప్పుకొచ్చింది. కాగా, సుశాంత్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అంకితతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఓ సీరియల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే సుశాంత్ హీరోగా మారిన తర్వాత పరిస్థితులు మారాయి. వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్.. రియా చక్రవర్తితో ప్రేమాయణం కొనసాగించాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అనుహ్యంగా 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. -
మూన్పై ల్యాండ్ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!
చంద్రయాన్-3 సాప్ట్ ల్యాండ్ అయింది. దీంతో చందమామపై మనుషులు జీవించేందుకు ఆస్కారం కలుగుతుందా? అక్కడ ల్యాండ్ ఎంత ఉంటుంది. మూన్ ఎస్టేట్, చందమామ విల్లాస్, జాబిల్లి రిసార్ట్స్ అంటూ అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారం సోషల్మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్హీరో షారుఖ్ ఖాన్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చంద్రుడిపై సైట్ కొన్నారన్న వార్తల నేపథ్యంలో మరింత చర్చ జోరుగా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బిజినెస్కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ధనిక వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు చంద్రునిపై ప్రాపర్టీ కొన్నారు. మరికొందరు అంతరిక్షంపై వారి ఆసక్తి, అభిరుచి కారణంగా కొందరు దీనిని భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తారు. చంద్రునిపై భూమిని కొనగలరా? చంద్రునిపై భూమిని సొంతం చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. భూమిని కొనుగోలు చేయవచ్చు,కానీ దాని యాజమాన్య హక్కులు పొంద లేరు. దానిని క్లెయిమ్ చేసుకోలేరు. దీనికి సంబంధించి 1967లో భారత్తో 104 దేశాలు ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడు పెద్ద దేశాలు, సోవియట్ యూనియన్, అమెరికా, యూఏ కలిసి బఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించాయి. దీని ప్రకారం చందమామపై సైట్(Lunar Land Purchase)ని కొనుగోలు చేయడానికి ఒక మార్గం ఉంది. లూనార్ రిజిస్ట్రీ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించి, కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ వంటి అనేక ప్రాంతాలుంటాయి. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ, ప్రైవేట్ యాజమాన్యం కోసం భూమిని కొనుగోలు చేయడం అసాధ్యం, చట్టవిరుద్ధం. కానీ, ది లూనార్ రిజిస్ట్రీ వంటి ఏజెన్సీలు ఇప్పటికీ ఖగోళ భూమిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. చంద్రునిపై ల్యాండ్ కొన్న కొందరు ప్రముఖులు చంద్రునిలోని లాకస్ ఫెలిసిటాటిస్ (ఆనంద సరస్సు) ప్రాంతంలో చంద్రునిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసినట్లు AIIMS జోధ్పూర్ నర్సింగ్ ఆఫీసర్ మీనా బిష్ణోయ్ (Meena Bishnoi) ఇద్దరు కుమార్తెల కోసం చంద్రునిపై భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. లూనా సొసైటీ జారీ చేసిన సర్టిఫికెట్ను కూడా ఆమె చూపించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) 52వ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా వెల్లడించినట్టుగా ఆస్ట్రేలియాలోని ఓ అభిమాని చంద్రుడిపై ప్రాపర్టీని(Land On Moon) బహుమతిగా ఇచ్చాడట. అలాగే అంతరిక్షం, నక్షత్రాలు, సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్న యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్(Sushanth Singh Rajput). సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్న ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా 'మస్కోవి సీ' అని పిలుస్తారు.మూన్ ల్యాండ్ను 2018, జూన్ 25న సుశాంత్ తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. అలాగే సూరత్కి చెందిన ఒక బిజినెస్ మేన్ తన రెండేళ్ల కూతురి కోసం చంద్రుడిపై కొంత భూమిని కొనుగోలు చేశాడు. అజ్మీర్కు చెందిన ధర్మేంద్ర అనిజా తన వివాహ వార్షికోత్సవం సందర్బంగా తన భార్య సప్నా అనిజాకు చంద్రునిపై మూడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. 20 ఏళ్ల క్రితమే 5 ఎకరాలు రాజీవ్ వి బగ్ధి దాదాపు 20ఏళ్ల క్రితమే 5 ఎకరాల ప్లాట్ను కొనుగోలు చేయడం గమనార్హం.2003లో చంద్రునిపై ఒక ప్లాట్ను కేవలం 140 డాలర్లకు (సుమారు రూ. 9,500)కి కొనుగోలు చేశారు.లూనార్ రిపబ్లిక్ జారీ చేసిన అన్ని అధికారిక పత్రాలప్రకారం జూలై 27, 2003న న్యూయార్క్లోని లూనార్ రిజిస్ట్రీ ద్వారా 'రాజీవ్ బగ్దీ 32.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 15.6 డిగ్రీల పశ్చిమాన మారే ఇంబ్రియం (వర్షాల సముద్రం) వద్ద ఉన్న ఆస్తికి నిజమైన, చట్టపరమైన యజమాని. రేఖాంశ ట్రాక్ -30'. అంతేకాదు 2030 నాటికి మూన్ టూరిజం ప్రారంభమవుతుందని బగ్ది ఆశాభావం వ్యక్తం చేశారు. -
సుశాంత్ బర్త్డే సెలబ్రేట్ చేసిన సారా, వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ లోకాన్ని విడిచి మూడేళ్లపైనే అవుతున్నా అభిమానుల గుండెల్లో మాత్రం సజీవంగానే ఉన్నాడు. సోషల్ మీడియాలో తరచూ అతడి పేరు వినిపిస్తూనే ఉంది. శనివారం (జనవరి 21న) ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని హీరోయిన్ సారా అలీ ఖాన్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసింది. ఎన్జీవోలోని చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసిన సారా పిల్లలతో కలిసి చప్పట్లు కొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్డే సుశాంత్, ఇతరులను నవ్వించడమంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. పై నుంచి మమ్మల్ని చూస్తున్న నీ ముఖంలో మేమంతా కలిసి చిరునవ్వు తెప్పించామని భావిస్తున్నాం. ఈ రోజును ఇంత స్పెషల్గా మార్చినందుకు సునీల్ అరోరాకు ప్రత్యేక ధన్యవాదాలు. మీలాంటివాళ్లు ఈ ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా, సురక్షితంగా, సంతోషకరంగా మార్చుతారు. మీరు కూడా ఇతరులకు సంతోషాన్ని పంచండి' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారగా సారా చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్లు. అదే సమయంలో కొందరు మాత్రం ఇదంతా వట్టి డ్రామా అని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా సుశాంత్, సారా.. కేదార్నాథ్ (2018) సినిమాలో కలిసి పని చేశారు. ఈ చిత్రంతోనే సారా ఇండస్ట్రీకి పరిచయమైంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) చదవండి: ఈ ఏడాది ఏ హీరోయిన్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా? -
ప్రియుడ్ని పెళ్లాడిన అంకిత లోఖండే, ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్
Ankita Lokhande- Vicky Jain Are Married: సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి అంకితా లోఖండే ప్రియుడు విక్కీ జైన్ను వివాహమాడింది. ఈ వేడుకకు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ వేదికైంది. వధువు అంకిత గోల్డెన్ కలర్ లెహంగా ధరించగా, వరుడు విక్కీ జైన్ కూడా వధువుకు సరిపోలే బంగారు- తెలుపు రంగు షేర్వాణీ ధరించాడు. వేదిక వద్దకు వధూవరులిద్దరు పాతకాలపు కారులో రావడం ఆకట్టుకుంది. వీరి పెళ్లి వేదికను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. కాగా కరోనా నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహ కార్యక్రమం ఈరోజు(డిసెంబర్ 14) ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తన మెహందీ, ఎంగేజ్మెంట్, హల్దీ, సంగీత్ కార్యక్రమాలకు సంబధించిన ఫొటోలను అంకిత కొద్ది రోజులుగా షేర్ చేస్తూ వచ్చింది. దీంతో ఆమె ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇండోర్లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు 'టాలెంట్ హంట్' రియాలిటీ షోలో పాల్గొంది. చదవండి: (భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్) నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్తో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సీరియల్తో పరిచయమైన సుశాంత్ సింగ్తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్తో ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంది. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. సుశాంత్తో బ్రేకప్ తర్వాత మరో బాలీవుడ్ నటుడు విక్కీజైన్తో ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. చదవండి: (Katrina Kaif: సల్మాన్, రణ్బీర్ నుంచి కత్రినాకు ఖరీదైన బహుమతులు, అవేంటంటే..) -
ఏం జరిగిందో....ఎప్పుడు తేలుస్తారు ?
-
వైరల్ వీడియో: ప్రియురాలితో సుశాంత్ సింగ్ స్టెప్పులు
-
Sushant Singh Rajput: ఏడాది పూర్తి.. ఏం తేల్చారు?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి చెంది ఏడాది పూర్తయ్యింది. అతనిది ఆత్మహత్యా లేదంటే అభిమానులు ఆరోపిస్తున్నట్లు బాలీవుడ్ మాఫియా ప్రొద్భలం వల్ల జరిగిన హత్య అనే విషయంపై ఎటూ తేలకుండా పోయింది. సోషల్ మీడియాలో దాదాపు ఏడాదిగా సుశాంత్ మీదే చర్చ. ఒక టాలెంటెడ్ నటుడి మరణంతో సినీ వర్గాల్లో నెపొటిజం చర్చ మాత్రం విపరీతంగా కొనసాగింది. అనుమానాలు, ఆరోపణలు, విచారణ, వివాదాలు.. వీటి నడుమే సుశాంత్ మరణం కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది. సాక్షి, వెబ్డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్పుత్ నిష్క్రమణతో సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. హిందీ సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. ముఖంలో అమాయకత్వం.. అలరించిన అతని నటన్ని తల్చకుంటూ హఠాత్తుగా అతను లేడనే వార్తని అభిమానులు తట్టుకోలేకపోయారు. అందుకే అతని మరణం పూర్తైన ఏడాది రోజున మళ్లీ అతన్ని గుర్తు చేసుకుంటున్నారు. సుశాంత్ బాల్యం, అతని చదువు, వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు, సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. పనిలో పనిగా సుశాంత్ కేసులో న్యాయం కావాలని కోరుకుంటూ.. ఇదొక ‘చీకటి రోజు’గా ప్రకటించారు. మరణం తర్వాత.. 34 ఏళ్ల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న బాంద్రాలోని తన ఇంట్లో ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించాడు. ముంబై పోలీసులు అది ఆత్మహత్య అని పేర్కొనడంతో మొదలైన చర్చ.. ఏడాది అయినా నడుస్తూనే ఉంది. డిప్రెషన్ సుశాంత్ ప్రధాన సమస్య అని మాజీ ప్రేయసి, సన్నిహితులు చెప్పగా, కాదు.. బాలీవుడ్లో కొందరు అతనికి అవకాశాల్లేకుండా చేసి అతన్ని మానసికంగా చంపేసి ఆపై ఆత్మహత్యకు ఉసిగొల్పారనేది ఫ్యాన్స్ వాదన. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు కూడా ఇదే వాదనతో ఏకీభవించడంతో ఈ చర్చ ప్రముఖంగా నడిచింది. ఇంకోపక్క ఈ కేసులో అనుమానాలున్నాయని సుశాంత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. చదవండి: ఇంతకీ ఈ దిశ ఎవరు? చివరికి సీబీఐకి.. ఈ కేసులో సుశాంత్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నటి రియా చక్రవర్తి మీదే అందరికీ అనుమానాలు రేకెత్తాయి. బాలీవుడ్ మాఫియాతో చేతులు కలిపి ఆమె సుశాంత్ను చంపేసిందని అభిమానులు ఆగ్రహం వెల్లకక్కారు. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ముంబై పోలీసుల దర్యాప్తు, అదే టైంలో అతని సొంతం రాష్ట్రం బిహార్ పోలీసుల దర్యాప్తు నడుమ కేసు గందరగోళంగా సాగింది. విచారణలో ముంబై పోలీసులు సహకరించడం లేదన్న బిహార్ ప్రభుత్వం ఆరోపణతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. దీన్నొక హై ప్రొఫైల్ కేసుగా అభివర్ణిస్తూ.. కేసును ఆగస్టు 19న సీబీఐకి అప్పజెప్పింది. మరోవైపు ఆర్థిక లావాదేవీల కోణంలో ఈడీ, డ్రగ్స్ లింకుల నేపథ్యంలో ఎన్సీబీ.. సుశాంత్ కుటుంబ సభ్యుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల దాకా వీలైనంత ఎక్కువ మందిని ప్రశ్నించాయి.. అనుమానితుల్ని అరెస్ట్ చేశాయి. ఏదైతేనేం ఏడాది పూర్తయ్యింది. సీబీఐ నుంచి, ఇతర విభాగాల నుంచి సుశాంత్ కేసులో ఎలాంటి అప్డేట్ లేదు. అందుకు సోషల్ మీడియా గట్టిగా #JusticeForSushantSinghRajput అని నినాదం చేస్తోంది. -
ట్రెండింగ్లో #JusticeForDisha
సుశాంత్ సింగ్ రాజ్పుత్తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు పీఆర్ మేనేజర్గా వ్యవహరించింది దిశా సలియాన్. ఆమె మరణించి నేటికి(జూన్ 8) సరిగ్గా ఏడాది పూర్తి అయ్యింది. దిశ చనిపోయిన ఆరు రోజులకి సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయాడు. దిశ మరణం ఈనాటికీ ఒక మిస్టరీనే. ఈ తరుణంలో దిశ చావుకి, సుశాంత్ చావుకి ఏదో లింక్ ఉందనేది సుశాంత్ ఫ్యాన్స్ అనుమానం. అందుకే ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు ట్విట్టర్లో జస్టిస్ ఫర్ దిశ హ్యాష్ట్యాగులతో క్యాంపెయిన్ నడిపించారు. ముంబై: దిశ సలియాన్ పోయినేడాది జూన్ 8న చనిపోయింది. ముంబైలో మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని జన్కళ్యాణ్ అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆమె మరణించిందని పోలీసులు వెల్లడించారు. ఆమె చాలా కాలంగా డిప్రెషన్లో ఉందని, అందుకే సూసైడ్ చేసుకుందని దిశ కాబోయే భర్త రోహన్ రాయ్ మీడియాతో చెప్పాడు. అయితే ఆమె మృతిపై అందరికీ అనుమానాలున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటుంటే.. శవంగా కింద ఉన్న టైంలో ఆమె ఒంటి మీద బట్టలు లేవని, ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని, ఆమె మరణానికి ముందు ఆమె అపార్ట్మెంట్కి కొందరు వచ్చారని, సామూహిక అత్యాచారం చేశారని, ఒకానొక దశలో నటుడు సూరజ్ పంచోలీ ఆమెను గర్భవతిని చేశాడని.. ఇలా రకరకాల పుకార్లు వినిపించాయి. అయితే యాక్సిడెంటల్ డెత్గా నమోదు చేసుకున్న ముంబై పోలీసులు కేసును క్లోజ్ చేశారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసు దర్యాప్తును సీబీఐ తీసుకున్నాక.. దిశ కేసును కూడా పరిశీలించాలని నిర్ణయించుకుంది. ఒక సెలబ్రిటీ ఫిగర్ విషయంలో ఇంతకాలమైనా ఎటు తేలకపోవడంపై చాలా మందిలో అసంతృప్తి నెలకొంది. ఏది ఏమైనా ఈ కేసు చాలామందికి ముఖ్యంగా సుశాంత్ అభిమానులకు ఆమె పట్ల సానుభూతి క్రియేట్ అయ్యింది. మే 26.. దిశ డే దిశ సలియాన్ కర్ణాటకలోని ఉడిపిలో పుట్టింది. ముంబైలో చదువుకున్న దిశ.. మాస్ మీడియా కోర్సులో డిగ్రీ చేసి పీఆర్ ఏజెన్సీలోకి అడుగుపెట్టింది. టైమ్స్ గ్రూప్ లాంటి ప్రముఖ కంపెనీల్లో పని చేసింది. కొన్నాళ్లపాటు సుశాంత్ పీఆర్వోగా వ్యవహరించింది. ఆమె తండ్రి ఓ వ్యాపారవేత్త. టీవీ యాక్టర్ రోహన్ రాయ్తో ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్పై వరల్డ్ రికార్డు స్థాయిలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో వారంలో కనీసం మూడు రోజులైనా ట్వీట్లతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఈ తరుణంలో సింపథీతో దిశా కోసం కూడా ఉద్యమిస్తున్నారు. మే 26న ఆమె పుట్టినరోజుకాగా.. ఆ రోజును ఏకంగా దిశ దినోత్సవంగా ట్విట్టర్లో జరిపారు కూడా. చదవండి: సుశాంత్కి పట్టిన గతే పడుతుంది -
సుషాంత్ కేసు: సిద్ధార్థ్ కస్టడీకి కోర్టు అనుమతి
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో నటుడి పీఆర్ మేనేజర్ సిద్ధార్థ్ పితానిని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సిద్దార్థ్ అరెస్ట్పై తాజాగా ఎన్సీబీ ప్రెస్నోట్ను విడుదల చేసింది. '' ఈ నెల 26న సిద్థార్ధ్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశాం. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా .. సిద్థార్ధ్ స్పందించలేదు. దీంతో సిద్ధార్థ్ను అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. హైదరాబాద్ నుంచి ట్రాన్సిట్ వారెంట్పై ముంబైకి తరలించి ముంబై కోర్టులో సిద్థార్ధ్ను హాజరుపరిచాం. కోర్టు జూన్ 1 వరకు సిద్ధార్థ్ను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇచ్చింది.'' అని తెలిపింది. కాగా అతడు గతంలో సుశాంత్ నివసించిన ఫ్లాట్లోనే మూడేళ్లపాటు ఉన్నాడు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా సిద్ధార్థ్తో మాట్లాడినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ఇతడిపై విచారణ జరిపారు. అలాగే ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలోనూ ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్ను పలుమార్లు విచారించారు. చదవండి: సుశాంత్ కేసు: నటుడి పీఆర్ మేనేజర్ అరెస్ట్ -
‘నా కుమారుడి చావును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు’
ఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపివేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సుశాంత్ మరణంపై పలు అనుమానాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్లో సినీ ప్రముఖులు ప్రతిభను ప్రోత్సాహించరని.. కేవలం బంధుప్రీతి చూపిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం బాలీవుడ్లో సుశాంత్ సింగ్ జీవితంపై రెండు, మూడు బయోపిక్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఈ చిత్రాలను నిలిపివేయాల్సింది కోరుతూ మంగళవారం ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. అతడి వాదనలు విన్న కోర్టు సుశాంత్పై తెరకెక్కుతున్న చిత్రాలను నిలిపివేయాల్సిందిగా నిర్మాతలకు సమన్లు జారీ చేసింది. తన కొడుకు చావును పలు నిర్మాణ సంస్థలు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయనీ సుశాంత్ సింగ్ తండ్రి ఆరోపించారు. అంతేకాకుండా తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు. కాగా, సుశాంత్ సింగ్ తండ్రి తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టులో వాదనలను వినిపించారు. సుశాంత్ సింగ్ కేసు ఇంకా పెండింగ్లో ఉందని, అతనిపై వచ్చే బయోపిక్ సినిమాలు కేసుపై ప్రభావం చూపుతాయని కోర్టుకు విన్నవించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడిన కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తోందని, తీర్పు ఇంకా పెండింగ్లో ఉందని కోర్టుకు తెలిపారు. పిటిషన్లో ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాస్ లాస్ట్ అండ్ శశాంక్’ వంటి చిత్రాలను ప్రస్తావించారు. అంతేకాకుండా కుటుంబసభ్యుల సమ్మతి లేకుండా ఈ సినిమాలను తీస్తున్నారని కోర్టుకు వివరించారు. ప్రస్తుతం బాలీవుడ్ సుశాంత్ జీవితం ఆధారంగా ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్ అండ్ శశాంక్’ సినిమాలు రూపొందుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత ఇప్పటివరకు అతని జీవితంపై మూడు సినిమాలు తెరపైకి వచ్చాయి. ఒక వార్తా నివేదిక ప్రకారం, సుశాంత్ సింగ్ రాజ్పుత్ బయోగ్రఫీ, సుశాంత్, రాజ్పుత్: ది ట్రూత్ విన్స్ , ది అన్సాల్వ్డ్ మిస్టరీ సినిమాలకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. చదవండి: సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు -
సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు
పాట్నా: 2020లో అత్యంత విషాదం నింపిన ఘటన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య. అతడి ఆత్మహత్య అనంతరం జరిగిన పరిణామాలు మరింత ఆవేదనకు గురి చేశాయి. అయితే ఇప్పుడు సుశాంత్ సింగ్ బంధువు బిహార్ మంత్రిగా నియమితులయ్యారు. ఈ వార్తపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు నీరజ్ సింగ్ బబ్లూ సుశాంత్కు చుట్టం అవుతారు. బిహార్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంగళవారం చేపట్టారు. కొత్తగా 17 మంది మంత్రులుగా నియమితులు కాగా వారిలో సుశాంత్ కజిన్ నీరజ్ సింగ్ బబ్లూ ఉన్నారు. సీఎం నితీశ్ కుమార్ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. రాఘోపూర్ స్థానం నుంచి 2005లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2010, 2015, 2020 ఎన్నికల్లో ఉంబర్పూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. బీహార్ బీజేపీ అగ్రనేతల్లో నీరజ్ సింగ్ బబ్లూ ఒకరు. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ‘సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు’ అని ప్రకటించిన వ్యక్తి నీరజ్ సింగ్ బబ్లూ. సోషల్ మీడియాలో ‘జస్టిస్ ఫర్ ఎస్ఎస్ఆర్’ అనే ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. సుశాంత్ మరణం తర్వాత అతడి కుటుంబానికి నీరజ్ సింగ్ బబ్లూ అండగా నిలిచారు. -
దయచేసి నన్ను ఫాలో కావొద్దు
ముంబయి: బాలీవుడ్ నటి రియాచక్రవర్తి బాంద్రాలోని రోడ్డు పక్కన ప్రత్యక్షమైంది. బుధవారం ముంబైలోని బాంద్రాలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో రియా చక్రవర్తి పూల బొకే కొనుగోలు చేసింది. రియా చక్రవర్తి కారు దిగి పూల దుకాణంలో బొకే కొనుగోలు చేసిన తర్వాత కారు వైపు నడుస్తున్నప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులు ఆమెను గుర్తు పట్టి తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీయడం మొదలు పెట్టారు. దింతో ఆమె వారిని దయచేసి నన్ను ఫాలో కావొద్దు, వీడియోలు తీయకండి అని వారిని వేడుకుంది. ఇప్పడు దీనికి సంబందించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.(చదవండి: క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) రియా పూలు కొన్న తర్వాత తన కారు దగ్గరకు వెళ్తుండగా ఫొటోగ్రాఫర్లు ఆమెను ఫాలో అయ్యారు. "అబ్ మెయిన్ జా రాహి హూన్, పీచే మాట్ ఆనా" అని ఆమె అనడం మనం వీడియోలో గమనించవచ్చు. జనవరి 21న సుశాంత్ సింగ్ రాజ్పుత్ జన్మదినానికి ఒక రోజు ముందు రియా పువ్వులు కొన్నట్లు అభిమానులు గుర్తించారు. అయితే రియా మాత్రం వీటిపై స్పందించలేదు. రియా వదులుగా ఉండే బూడిద రంగు చొక్కా, నల్ల లెగ్గింగ్ ధరించింది. ఆమె నల్ల మాస్కు ధరించి వీడియోలో కనిపించింది. డ్రగ్స్ లింక్స్ కేసులో జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. -
ఏడాదిని మింగేసిన కరోనా మహమ్మారి
కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోతోంది. ఒక ఉద్యమంతో మొదలై, ఒక మహమ్మారితో తీవ్రంగా వణికిపోయి, మరో మహోద్యమంతో 2020 ముగుస్తోంది. ఈ ఏడాదంతా కరోనా, కరోనా, కరోనా అంతే.. మరో మాటకి తావు లేదు. వేరే చర్చకి ఆస్కారం లేదు. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తూనే దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కరోనా నేర్పిన పాఠాలను అర్థం చేసుకుంటూనే సామాజిక, ఆర్థిక మార్పులకి అలవాటు పడుతూ ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి అడుగులు పడుతున్నాయి. వ్యాక్సిన్తో కరోనా పీడ విరగడైపోతుందన్న ఉత్సాహంతో యావత్ భారతావని కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి సిద్ధమైంది. ఉవ్వెత్తున ఉద్యమాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లో మైనార్టీలకు భారత పౌరసత్వాన్ని ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబుకిన ఆగ్రహంతో మొదలైన ఈ ఏడాది కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు కన్నెర్ర చేయడంతో ముగుస్తోంది. ప్రపంచ దేశాల దృష్టిని కూడా ఈ రెండు ఉద్యమాలు ఆకర్షించాయి. పౌరసత్వ సవరణ చట్టంతో (సీఏఏ)అభద్రతా భావంలో పడిపోయిన మైనార్టీలు ఢిల్లీలో షహీన్బాగ్ వేదికగా కొన్ని నెలల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం చప్పున చల్లారిపోయింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, పంజాబ్ సరిహద్దుల్లో గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా అన్నదాతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలతో వ్యవసాయం కార్పొరేటీకరణ జరుగుతుందని, కనీస మద్దతు ధరకే ఎసరు వస్తుందన్న ఆందోళనతో రైతన్న నెలరోజులై ఆందోళనలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. వామ్మో కరోనా కంటికి కనిపించని సూక్ష్మక్రిమి ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఏడాదంతా కరోనా తప్ప మరే మాట వినిపించలేదు. చైనాలోని వూహాన్లో తొలి సారిగా బట్టబయలైన ఈ వైరస్ అక్కడ్నుంచి వచ్చిన ఒక విద్యార్థి ద్వారా జనవరి 30న భారత్లోని కేరళకి వచ్చింది. ఆ తర్వాత మార్చికల్లా ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరుకి విస్తరించింది. దీంతో కేంద్రం మార్చి 25 నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ విధించింది. సరిహద్దులన్నీ మూసివేసి కార్యకలాపాలన్నీ నిలిపివేయడంతో సామాజికంగా, ఆర్థికంగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయి ఆ తర్వాత దశల వారీగా పాక్షికంగా లాక్డౌన్ని కొనసాగించిన∙కేంద్రం జూన్ 1 నుంచి అన్లాక్ ప్రక్రియ ప్రారంభించింది. ప్రపంచ దేశాల పట్టికలో కోటికి పైగా కేసులతో రెండో స్థానంలో ఉన్నప్పటికీ పోరాట పటిమ ప్రదర్శించిన భారత్ను డబ్ల్యూహెచ్వో కూడా ప్రశంసించింది. బతుకు నడక 130 కోట్ల జనాభా కలిగిన భారత్ వంటి దేశంలో కరోనా కట్టడికి లాక్డౌన్ మినహా మరో మార్గం లేకపోవడంతో కేంద్రం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంది. దీంతో అతి పెద్ద మానవీయ సంక్షోభం తలెత్తింది. కేంద్రం నిర్ణయం 4 కోట్ల మంది వలస కార్మికులపై తీవ్రమైన ప్రభావం పడింది. పనులు లేకపోవడం, కరోనా మహమ్మారి ఎలాంటి ఆపద తీసుకువస్తుందోన్న ఆందోళనలతో వలస కార్మికులు చావైనా బతుకైనా సొంత గడ్డపైనేనని నిర్ణయించుకొని స్వగ్రామాలకు పయనమయ్యారు. కాళ్లు బొబ్బలెక్కేలా మైళ్లకి మైళ్లు నడిచారు. ఈ క్రమంలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రమైన జీవితం కోసం వారు పడ్డ ఆరాటం, సాగించిన నడక మనసుని బరువెక్కించే దృశ్యంగా నిలిచింది. మూగబోయిన స్వరాలు కరోనా మహమ్మారి గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆగస్టు 5న కరోనా సోకడంతో చెన్నైలో ఆసుపత్రిలో చేరిన ఆయన 40 రోజుల పాటు మహమ్మారితో పోరాడి సెప్టెంబర్ 25న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హిందూస్తానీ సంగీతంలో సుప్రసిద్ధులైన పండిట్ జస్రాజ్ 90 ఏళ్ల వయసులో గుండె పోటు రావడంతో అమెరికాలో తుది శ్వాస విడిచారు. ఈ ఇద్దరు సంగీత సామ్రాట్లను కోల్పోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆలయాలకి భూమి పూజ శ్రీరాముడి భక్తుల కలలు ఫలించే అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటు, ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి పార్లమెంటు కొత్త భవనానికి ఈ ఏడాది భూమి పూజ మహోత్సవాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరానికి పునాది రాయి పడింది. 40కేజీల బరువున్న వెండి ఇటుకని శంకుస్థాపన కోసం వాడారు. మరోవైపు పార్లమెంటు కొత్త భవనానికి డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచుతూ ఉండడంతో 1,224 మంది సభ్యులు కూర్చొనే సామర్థ్యంతో ఈ భవనం నిర్మాణం జరుపుకుంటోంది. ఒక హత్య, మరో ఆత్మహత్య ఈ ఏడాది జరిగిన క్రైమ్ సీన్లో హాథ్రస్ అత్యాచారం, హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తదనంతరం బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై జరిగిన విచారణ అంతే ప్రకంపనలు రేపింది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా బూల్హరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతి సెప్టెంబర్ 14న వ్యవసాయ క్షేత్రానికి వెళితే అగ్రవర్ణానికి చెందినవారుగా అనుమానిస్తున్న కొందరు పశువుల్లా మారి గ్యాంగ్ రేప్ చేయడంతో తీవ్రగాయాలతో బాధపడుతూ ఢిల్లీ ఆస్పత్రిలో బాధితురాలు సెప్టెంబర్ 29న మరణించింది. యూపీ పోలీసులు ఆమె మృతదేహానికి పోస్టు మార్టమ్ నిర్వహించకుండా 30 తెల్లవారుజామున 2.30 గంటలకు హడావుడిగా అంత్యక్రియలు చేయడంతో ఈ రేప్ కేసు రాజకీయ ప్రకంపనలు రేపింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని బాంద్రాలో తన స్వగృహంలో జూన్ 14న ఆత్మహత్య చేసుకోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు బాలీవుడ్ని ఒక్క కుదుపు కుదిపేశాయి. బాలీవుడ్లో ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన నెపోటిజంపై చర్చ మళ్లీ మొదలైంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని మించిన మలుపులతో సాగిన ఈ ఉదంతం బాలీవుడ్ మాఫియా లింకుల్ని కూడా బయటకు లాగడంతో ప్రకంపనలు సృష్టించింది. సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అరెస్ట్ చేయడంతో బాలీవుడ్ తారలకే చుక్కలు కనిపించాయి. దీపిక పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ వంటి వారు ఎన్సీబీ ఎదుట హాజరవాల్సి వచ్చింది. సరిహద్దుల్లో సై నాలుగు దశాబ్దాల తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కయ్యాలమారి చైనా నిబంధనలన్నీ తుంగలో తొక్కి, ఆయుధాలు వాడకూడదన్న ఒప్పందాల్ని తోసి రాజని మన జవాన్లపై జూన్ 15 అర్ధరాత్రి దాడులకు దిగింది. మన సైన్యం కూడా గట్టిగా ఎదురుదాడికి దిగడంతో డ్రాగన్ తోక ముడిచింది. ఈ ఘర్షణల్లో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా నుంచి జరిగిన ప్రాణ నష్టాన్ని ఆ దేశం ఇప్పటివరకు బయట పెట్టలేదు. చైనాను దీటుగా ఎదుర్కోవడానికి వాస్తవాధీన రేఖలో జవాన్లకు అత్యద్భుమైన సదుపాయాలను కల్పించడంతో పాటు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన క్షిపణుల్ని మోహరించి భారత్ సైనిక రంగంలో తన సత్తా చాటుకుంది. అవీ.. ఇవీ.. ► నిర్భయ హత్యాచారం కేసులో ఆమె తల్లిదండ్రుల పన్నెండేళ్ల పోరాటం ఫలించింది. దోషులైన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముఖేష్ కుమార్లకు మార్చి 20న ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉరి శిక్ష అమలు చేశారు. ► మహారాష్ట్రలోని పాలగఢ్ జిల్లాలో ఏప్రిల్లో జరిగిన మూకదాడిలో ఇద్దరు సాధువులు సహా ముగ్గురు మరణించారు. యూపీలోని ఒక ఆలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలు మతం రంగు పులుముకోవడంతో బీజేపీ, శివసేన మాటల యుద్ధానికి దిగాయి. ► ఒకవైపు కోవిడ్ మహమ్మారితో సతమతమవుతూ ఉంటే మేలో అంఫా తుఫాన్ ఈశాన్య భారతాన్ని కలవరపెట్టింది. బెంగాల్లో తుపాన్ ధాటికి 72 మంది ప్రాణాలు కోల్పోతే, లక్ష కోట్ల రూపాయల నష్టం కలిగింది. ► ఐరాసభద్రతా మండలికి నాన్ పర్మెనెంట్ సభ్యదేశంగా భారత్ జూన్ 18న ఎన్నికైంది. వచ్చే జనవరి నుంచి కొత్త మండలిలో భారత్ చేరనుంది. ► ముంబైని పీఓకేతో పోల్చడం, రాష్ట్ర పోలీసుల్ని విమర్శిస్తూ ట్వీట్లు పెట్టడంతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు, శివసేన సర్కార్ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. సెప్టెంబర్లో ఆమె నివాసాన్ని కూడా కూల్చివేయడానికి ముంబై నగరపాలక సంస్థ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కంగనాకు కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించడం విమర్శలకు దారి తీసింది. -
మత్తులో మనోళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్న చీకటి కోణాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డ్రగ్స్ వినియోగంపై సర్వేల వివరాలు వెలువడుతున్నాయి. టాప్–10 నగరాల్లో ఢిల్లీ, ముంబై.. జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ ఏబీసీడీ ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్స్ వినియోగంపై డేటా ఆధారంగా జాబితాను రూపొందించింది. ఏబీసీడీ జాబితా ప్రకారం.. ► ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ వినియోగం న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ► పాకిస్తాన్లోని కరాచీ నగరం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్స్ను వినియోగిస్తారు. ► ప్రపంచంలోని టాప్–10 నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో, దేశ ఆర్థి క రాజధాని ముంబై ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీవాసులు ప్రతీ సంవత్సరం 34 వేల 708 కిలోల డ్రగ్స్ వినియోగించగా, ముంబై వాసులు ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. ► నాలుగోస్థానంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ( 32,713 కిలోలు), ఐదోస్థానంలో ఈజిప్ట్లోని కైరో ( 29,565 కిలోలు), ఏడో స్థానంలో ఇంగ్లండ్ రాజధాని లండన్ (28,485 కిలోలు), ఎనిమిదోస్థానంలో అమెరికాలోని షికాగో (22,262 కిలోలు), తొమ్మిదోస్థానంలో రష్యా రాజధాని మాస్కో ( 20,747 కిలోలు), పదో స్థానంలో కెనడా రాజధాని టొరంటొ ( 20,638 కిలోలు) ఉన్నాయి. 5 ఏళ్లలో 14.74 లక్షల కిలోల డ్రగ్స్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2019లో 3.42 లక్షల కిలోల కంటే ఎక్కువ మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. 35,310 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన వారిలో 35 వేల మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 2015 – 2019 మధ్య దేశవ్యాప్తంగా ఎన్సీబీ 14.74 లక్షల కిలోల డ్రగ్స్ని స్వాధీనం చేసుకుంది. 2018 లో అత్యధికంగా 3.91 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రోజుకు 23 మంది మృతి.. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసౖలైన వారు ఆ వ్యసనాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. డ్రగ్స్ వినియోగంతోనూ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. డ్రగ్స్ దొరకని పరిస్థితుల్లోనూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని ఎన్సీబీ గణాంకాలు సూచిస్తున్నాయి. గతేడాది 7,860 మంది డ్రగ్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ అధిక మోతాదు కారణంగా 704 మంది మరణించారు. 2019లో డ్రగ్స్ కారణంగా 8,564 మంది మృతి చెందారు. దీని ప్రకారం ప్రతిరోజూ 23 మంది మాదకద్రవ్యాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. -
కామెడీ క్వీన్కు ఎన్సీబీ సెగ
సాక్షి, ముంబై: బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్కు మరో షాక్ తగిలింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత మాదకద్రవ్యాల తుట్టె కదిలింది. బాలీవుడ్ ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని విచారించింది. తాజాగా నటి భారతీ సింగ్ ముంబై నివాసంపై శనివారం ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడి చేసింది. భారతి సింగ్తోపాటు, ఆమె భర్తపైనా నిషేధిత పదార్థాలు తీసుకున్న ఆరోపణలు వచ్చాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. డ్రగ్ పెడ్లర్ విచారణలో భారతి సింగ్ పేరు వెలుగులోకి రావడంతో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం ఈ దాడులు చేపట్టింది. కొద్దిమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ అధికారి తెలిపారు. దీంతో భారతి, ఆమె భర్త హర్ష్ లింబాచియాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలో నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు చేసింది. రాంపాల్, అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించింది. అయితే తన నివాసంలో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్నవి ప్రిస్క్రిప్షన్లో భాగమని రాంపాల్ చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నాను తప్ప, తనకు డ్రగ్స్తో సంబంధం లేదనీ పేర్కొన్నాడు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అర్నాబ్ గోస్వామి అరెస్ట్ అన్యాయమేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ స్టార్ యాంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఆయన అభిమానులతోపాటు మరి కొంత మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ‘ఇది పత్రికా స్వేచ్ఛ పై జరిగిన దాడి, భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు’ అంటూ కొందరు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులను, ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్లను విమర్శించినందుకు గోస్వామిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం అన్యాయమేనా? అది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం అవుతుందా? బాలీవుడు వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ తార రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలంటూ కొన్ని నెలలపాటు అర్నాబ్ గోస్వామి తన టీవీ ఛానెల్ ద్వారా గోల చేసిన విషయం తెల్సిందే. రియా చక్రవర్తిని అనుమానితురాలిగా ముందుగా అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేవంటూ వదిలేశారు. తన ఆత్మహత్యకు ఫలానా, ఫలానా వారు బాధ్యులంటూ సుశాంత్ ఎలాంటి ఆత్మహత్య లేఖలో పేర్కొనలేదు. అయినప్పటికీ ఆమె కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని, రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి, కేసు పెడితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయంటూ గోస్వామి పదే పదే డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని 2018 నాటి ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేయడం తప్పెలా అవుతుంది ? పైగా ఆ డిజైనర్ తనకు అర్నాబ్ గోస్వామి, ఆయన ఇద్దరు మిత్రులు ఇవ్వాల్సిన దాదాపు ఐదు కోట్ల రూపాయలను చెల్లించక పోవడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆ డిజైనర్ తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రియా అరెస్ట్ను పదే పదే డిమాండ్ చేసిన గోస్వామికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు కూడా ఉన్నప్పుడు అరెస్ట్ చేయకూడదా ? అది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనా? సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్, విరసం కవి వరవర రావు, జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్తోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక మంది జర్నలిస్టులను అనేక కేసుల్లో అరెస్ట్ చేసి నిర్బంధించగా, కొన్నేళ్లుగా వారు బెయిల్ దొరక్క జైళ్లలో అలమటిస్తున్నారు. నేడు గోస్వామి అరెస్ట్ను ఖండిస్తున్నావారు వారి నిర్బంధాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నదే ఇక్కడ ప్రశ్న. క్వారంటైన్లో ఉన్న గోస్వామి తన మిత్రుడి సెల్ఫోన్ ద్వారా తన వారందరితో మంతనాలు జరుపుతున్నారనే ఫిర్యాదుపై పోలీసులు ఆ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకొని క్వారంటైన్ నుంచి ఆదివారం తెల్లవారు జామున తలోజి జైలుకు పంపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాను తన న్యాయవాదులతో ఫోన్లో కూడా సంప్రతించేందుకు వీల్లేకుండా తనను అన్యాయంగా జైలుకు తరలించారంటూ గోస్వామి కూడా మీడియాతో మొరపెట్టుకున్నారు. ఒక్క గోస్వామికే కాదు, ఆయన స్థానంలో ఓ సామాన్యుడు ఉన్నా న్యాయవాదులను సంప్రతించేందుకు ఫోన్ అనుమతించడం కూడా రాజ్యాంగం కల్పిస్తున్న హక్కే. సెల్ఫోన్ను అనుమతించకపోయినా జైల్లో ఉండే ఫోన్లను అనుమతించాల్సిందేగదా!? పారిపోయే అవకాశం లేనందునా గోస్వామికైనా ఈ కేసులో బెయిలివ్వాల్సిందే. ‘బెయిల్ నాట్ జెయిల్’ అన్న అర్నాబ్ నినాదంలో నిజం లేకపోలేదు. -
సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆ దిశగా విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడిని అరెస్టు చేసింది. అతనికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలడంతో ఎన్సీబీ అతనిని రిమాండ్లోకి తీసుకుంది. ఇక దక్షిణాఫ్రికా జాతీయుడైన అగిసిలాస్ను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన ఎన్సీబీ స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతనిని కస్టడీకి పంపారు. ఇప్పటికే సుశాంత్ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్ను, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్సావంత్ తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రియా ఈ కేసులు 28రోజుల జైలు జీవితం గడిపి బెయిల్పై విడుదలయ్యింది. వీరినే కాకుండా ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, సారా ఆలీఖాన్, శ్రద్ధాకపూర్ లాంటి వారిని కూడా ఎన్సీబీ విచారించింది. సుశాంత్సింగ్ రాజ్పుత్ జూన్ 14న ముంబాయిలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. మాదకద్రవ్యాలకు సంబంధించిన పలు ఆరోపణలు తెరపైకి వచ్చిన తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు ఎన్సీబీ కేసు నమోదు చేసింది. చదవండి: ప్రముఖ టీవీ ఛానెల్పై రూ.200 కోట్ల దావా -
పొరుగింటామెను అరెస్ట్ చేయండి: రియా
ముంబై: తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పొరుగింటావిడ డింపుల్ తవానిపై చర్యలు తీసుకోవాలని రియా చక్రవర్తి సీబీఐకిలేఖ రాసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య విషయంలో రియా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అంటే జూన్ 13న రియాను తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి సుశాంత్ వచ్చాడని డింపుల్ ఒక మీడియాతో చెప్పారు. అయితే ఆమె సీబీఐ విచారణలో నేను వారిని చూడలేదని ఎవరో చెబితే విన్నానని వెల్లడించారు. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసును తప్పుదోవ పట్టించడానికి చూసిన డింపుల్పై చర్యలు తీసుకోవాలని రియా సీబీఐని లేఖ ద్వారా కోరింది. మీడియా తన టీర్పీల కోసం తనను అపకీర్తి పాలు చేస్తోంది లేఖలో పేర్కొంది. ఇక సుశాంత్ కేసులో రియాను సీబీఐ సెప్టెంబర్లో అదుపులోకి తీసుకుంది. ఆమెకు అక్టోబర్7 వతేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న రియా తమ్ముడు షోవిక్కు మాత్రం ఇంకా కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఇక రియా తరుపు న్యాయవ్యాది ఈ కేసులో మీడియా ముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల పేర్లు సీబీఐ ముందు ఉంచుతామని తెలిపారు. చదవండి: సుశాంత్ కేసు ఇంకెన్నాళ్లు..? -
రోజూ వార్తల్లో ఉండకపోతే కంగనాకు భయం
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై సీనియర్ నటి షబనా ఆజ్మీ ఘాటుగా స్పందించారు. దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణం తరువాత వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్న కంగనాపై షబనా తనదైన శైలిలో విమర్శలకు దిగారు. ప్రధానంగా బాలీవుడ్కు తానే స్త్రీవాదాన్ని, జాతీయవాదాన్ని నేర్పించానన్న కంగనా వ్యాఖ్యలపై షబనా స్పందించారు. కంగనా తన సొంత పురాణాన్ని విశ్వసించడం మొదలు పెట్టిందనీ, తన మాయలో తాను బతుకుతోందని విమర్శించారు. ఇకనైనా వీటికి స్వస్తి చెప్పి తన పని తాను చేసుకుంటే మంచిదని కంగనాకు సూచించారు. అంతేకాదు రోజూ వార్తల హెడ్ లైన్స్ లో లేకపోతే ఆమెకు భయం.. అందుకే ఎపుడూ వార్తల్లో ఉండేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు, దారుణమైన ప్రకటనలు చేస్తుందంటూ కంగనాపై మండిపడ్డారు. ఆమె చాలా బాగా నటిస్తుంది...నటనపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదంటూ కంగనాకు షబనా ఆజ్మీ హితవు పలకడం విశేషం. ముంబై మిర్రర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘డ్రగ్ మాఫియా’, టెర్రరిస్టుల నుంచి బాలీవుడ్ను రక్షించాలన్న కంగనా వ్యాఖ్యలను షబానా తిప్పికొట్టారు. చిత్ర పరిశ్రమకు తన కుండే సమస్యలున్నాయని, కానీ మొత్తం పరిశ్రమను ఒకే గాటన కట్టడం అన్యాయమన్నారు. సామాజికంగా నిబద్ధతతో మాట్లాడేవారు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారని షబనా పేర్కొన్నారు. నిజమైన సమస్యల నుండి దృష్టిని మళ్ళించే క్రమంలోనే ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో యాంటి నేషనల్ అంటూ షబనా ఆజ్మీపై విమర్శలు గుప్పించిన కంగనా ఆమె భర్త జావేద్ అక్తర్ పై కూడా ఆరోపణలు చేసింది. కాగా సుశాంత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో నెపోటిజం, మాదక ద్రవ్యాలవినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సుశాంత్ ది ఆత్మహత్య కాదు అని నిరూపించలేని రోజు తన పద్మశ్రీ పురస్కారాన్ని వదులుకుంటానని కంగనా గతంలో ప్రకటించారు. అయితే తాజాగా సుశాంత్ ది ఆత్మహత్యే అని వైద్యుల బృందం ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద దుమారమే రేగుతోంది. -
సుశాంత్ కేసు ఇంకెన్నాళ్లు..?
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ది హత్యా? ఆత్మహత్యా ? ఎప్పటికి తేలుతుందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ సీబీఐని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ కొనసాగిస్తున్న విచారణపై ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని అన్నారు. శుక్రవారం మంత్రి దేశ్ముఖ్ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ మృతిపై ముంబై పోలీసులు సరైన దిశగా విచారణ చేస్తున్న సమయంలో హఠాత్తుగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేతుల్లోకి ఈ కేసు వెళ్లిందన్నారు. వీలైనంత త్వరగా సీబీఐ అసలు నిజాలను రాబట్టాలన్నారు. ఇప్పటికే సీబీఐ విచారణ చేపట్టి 45 రోజులు గడిచినా ముందుకు అడుగు పడలేదని మంత్రి దేశ్ముఖ్ తెలిపారు. (సుశాంత్ కేసులో మరో మలుపు) -
సుశాంత్ మృతి కేసులో ఎయిమ్స్ వైద్యుల నివేదిక
-
సుశాంత్ మృతిపై ఎయిమ్స్ కీలక రిపోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ యంగ్హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కీలక రిపోర్టును సమర్పించింది. సుశాంత్ అనుమానాస్పద మృతిని సుదీర్ఘం పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు మంగళవారం తుది నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు. సుశాంత్ మృతదేహంలో ఎలాంటి విషం లేదని స్పష్టం చేశారు. ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని ఎయిమ్స్ వర్గాలు ధృవీకరించాయి. సుశాంత్ డీఎన్ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరంలేదని పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే తమ పరిశీలనలో తేలాయని వివరించారు. తాజా నివేదిక ఆధారంగా మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. (నలుగురిదీ ఒక్కటే మాట..) జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ మృతిపై తొలుత అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన కుమారుడిని ఎవరో గొంతునులిమి హత్య చేసిఉంటారని, ఇది ముమ్మాటికి హత్యేనని అతని తండ్రి బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక వివాదాలు, ఆరోపణల నడుమ సుశాంత్ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎయిమ్స్ తన రిపోర్టును సమర్పించింది. సుశాంత్కు ముమ్మాటికి ఆత్మహత్యేనని తేల్చింది. మరోవైపు అతని మరణాంతరం వెలుగుచూసిన డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో తొలినుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరుపుతోంది. మరోవైపు సీబీఐ సైతం ఎంక్వైరీ చేస్తోంది. (సుశాంత్ మృతి: మర్డర్ కేసుగా మార్చండి!) మరోవైపు గొంతు నులమడం వల్లనే సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయాడని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపిస్తున్నారు. తాను పంపిన సుశాంత్ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేస్తున్న జాప్యం దారుణమన్నారు. సుశాంత్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తును పక్కనబెట్టి, ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. -
ఉడ్తా బాలీవుడ్
-
సుశాంత్ కేసు క్లైమాక్స్కు చేరుకున్నట్లేనా?
సాక్షి, న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు ఇక క్లైమాక్స్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తిని విచారిస్తున్న సీబీఐకు ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం కొన్ని రిపోర్టులను అందించింది. సోమవారం ఉదయం 11గంటల సమయంలో ఎయిమ్స్కు చెందిన నలుగురు ఎయిమ్స్ వైద్యులు సీబీఐ అధికారులను కలిసి వారికి రిపోర్టులు అందించారు. వారి మధ్య దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. సుశాంత్ మరణించిన సమయంలో అతని ఇంటికి దగ్గరలో ఉన్న కూపర్ ఆసుపత్రిలో సుశాంత్ పంచనామా నిర్వహించారు. అనంతరం ఈ కేసును రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సీబీఐ పోస్ట్మార్టం రిపోర్టు విషయంలో సహకరించాలని ఎయిమ్స్ను కోరింది. దీంతో రంగంలోకి దిగిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం సుశాంత్ ఇంటిని కూడా పరిశీలించింది. సుశాంత్ మరణం వెనుక ఏదైనా కుట్రదాగుందా, ఇది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో ఎయిమ్స్ వైద్యులు రిపోర్టును, సుశాంత్ మరణించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీబీఐకి తన రిపోర్టును అందించారు. ఇక సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో సీబీఐతో పాటు ఎన్సీబీ కూడా రంగంలోకి దిగి పలువురును విచారిస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు, బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ -
ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించింది. ఇదే కేసులో శుక్రవారం విచారించిన ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ను అరెస్టు చేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న ఎన్సీబీ గెస్ట్హౌస్కు శనివారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో చేరుకున్న దీపికా పదుకొణె మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు. దీపికను, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ను కలిపి విచారించినట్లు సమాచారం. కరిష్మా డ్రగ్స్ గురించి జరిపిన వాట్సాప్ చాట్లో ‘డి’అనే అక్షరం ఎవరిని ఉద్దేశించిందనే కోణంలో అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కరిష్మాను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం వీరిరువురూ పది నిమిషాల వ్యవధిలోనే వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. వీరి విచారణ సమయంలో ఎన్సీబీ కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో మీడియా సిబ్బంది గుమికూడారు. దక్షిణ ముంబైలో..బల్లార్డ్ ఎస్టేట్లో ఉన్న ఎన్సీబీ జోనల్ కార్యాలయంలో శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్లను శనివారం సాయంత్రం ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఎన్సీబీ కార్యాలయానికి మధ్యాహ్నం 12గంటలకు శ్రద్ధాకపూర్ చేరుకోగా ఒక గంట తర్వాత సారా అలీఖాన్ వచ్చారు. వీరిద్దరినీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. దాదాపు నాలుగున్నర గంటల అనంతరం సాయంత్రం 5.30 గంటలకు సారా, 6 గంటల ప్రాంతంలో శ్రద్ధాకపూర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇలా ఉండగా, డ్రగ్స్ కేసులో శుక్రవారం ప్రశ్నించిన నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్ను శనివారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. వెర్సోవాలో ఉన్న ఆయన నివాసం నుంచి తీసుకెళ్లి, రోజంతా ప్రశ్నించినట్లు సమాచారం. తాజా అరెస్టుతో డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. మీడియాకు పోలీసుల వార్నింగ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరై తిరిగి వెళ్లే సినీ ప్రముఖుల వాహనాలను వెంబడించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్సింగ్ మీడియా సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై వెళ్లే వారిని ప్రమాదంలోకి నెట్టవద్దని కోరారు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు తేలితే ఆ వాహనాలను సీజ్ చేయడంతోపాటు సంబంధిత డ్రైవర్పై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం శ్రద్ధా కపూర్, దీపికా పదుకొణె ఎలాగోలా మీడియా కంటబడకుండా తప్పించుకోగా, మీడియా సిబ్బంది సారా అలీఖాన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఎన్సీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో దీపిక పదుకొణె ప్రయాణిస్తున్న వాహనాన్ని మీడియా వెంబడించింది. అనంతరం పోలీసుల హెచ్చరికల ఫలితంగా శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ విచారణ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ‘ఛేజింగ్’ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శాండల్వుడ్ కేసులో టీవీ యాంకర్.. మంగళూరు: శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీని శనివారం బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసులు ప్రశ్నించారు. స్నేహితుడు తరుణ్ రాజ్తోపాటు అనుశ్రీ పార్టీలకు హాజరైందంటూ ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన డ్యాన్సర్–కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి వెల్లడించడంతో పోలీసులు అనుశ్రీకి సమన్లు జారీ చేశారు. తరుణ్ డ్రగ్స్ వాడకంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. విచారణలో వీరేమన్నారు ఈ సుదీర్ఘ విచారణలో అధికారులు ముగ్గురి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ సందర్భంగా దీపిక.. 2017లో తన మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు అంగీకరించారు. అయితే, డ్రగ్స్ తీసుకున్నదా లేదా అనేది వెల్లడికాలేదని సమాచారం. ఎన్సీబీ విచారణను ఎదుర్కొన్న సారా, శ్రద్ధా తమకు డ్రగ్స్ అలవాటు లేదని తెలిపారు. వీరి ఫోన్లను అధికారులు సీజ్చేశారు. -
బాలీవుడ్ ఒక్కటే వాడుతుందా: పూజా బేడీ
ముంబై: బాలీవుడ్ ఒక్క పరిశ్రమే డ్రగ్స్ వాడుతున్నట్లు మీడియా హడావుడి చేస్తుందని ప్రముఖ బాలీవుడ్ నటి పూజా బేడీ విమర్శించారు. బాలీవుడ్ కాకుండా మిగతా రంగాలలో విపరీతంగా డ్రగ్స్(మాదక ద్రవ్యాల) వాడుతన్నా, మీడియాకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యతో డ్రగ్స్ ప్రమేయం ఏమైనా ఉన్నదా అని దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను ప్రశ్నించనున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) పేర్కొంది. ఈ అంశంపై ఎన్సీబీ పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులను ప్రశ్నిస్తోంది. వీరిలో దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ప్రీత్ సింగ్లకు సమన్లు జారీ చేసన విషయం తెలిసిందే. మరోవైపు 39 మంది బాలీవుడ్ సెలబ్రిటీలపై డ్రగ్స్ కేసు సంబంధించి విచారించే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. సంచలన అంశాలను మీడియా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని పూజా బేడీ పేర్కొంది. -
డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో ఎవరి పేర్లను వెల్లడించలేదని ఆమె తరఫు న్యాయవాది సతీశ్ మానేషిండే అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మినహా ఇతర నటుల గురించి ఆమె మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన సతీశ్.. ‘‘ఎన్సీబీ ఎదుట వాంగ్మూలం ఇచ్చే సమయంలో రియా ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవం. సుశాంత్తో ఉన్నన్ని రోజులు అతడు మత్తు పదార్థాలు తీసుకునేవాడని మాత్రమే రియా చక్రవర్తి ఎన్సీబీకి తెలిపారు. అంతేతప్ప ఇతరుల గురించి ఆమె మాట్లాడలేదు’’అని పేర్కొన్నారు. (చదవండి: టీవీ నటులను తాకిన డ్రగ్స్ సెగ) అదే విధంగా రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేశారు. ‘‘సుశాంత్ ఇంటి మనిషిగా ఉన్నందున తన గురించి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదు’’అని పేర్కొన్నారు. అయితే జయా సాహా ఇతర డ్రగ్ డీలర్లతో రియా వాట్సాప్ చాట్స్ గురించి సతీశ్ను ప్రశ్నించగా.. ‘‘రియా, సుశాంత్లతో జయా ఏం మాట్లాడారన్న దానిపై స్పష్టతనివ్వాలనుకుంటున్నా. గంజాయి ఆకుల నుంచి తీసిన సీబీడీ ఆయిల్ ఇవ్వాలని మాత్రమే వాళ్లు ఆమెను అడిగారు. నిజానికి అది మత్తు పదార్థం కాదు. ఎవరికైనా అనుమానం ఉంటే ఆ ఆయిల్ బాటిల్ను చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి మాదక ద్రవ్యాలు లేవని దానిపై రాసి ఉంటుంది’’అని పేర్కొన్నారు. (చదవండి: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) కాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టు కాగా, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకునె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ సహా రకుల్ ప్రీత్సింగ్కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీపికా సెప్టెంబరు 25న, సారా, శ్రద్ధ సెప్టెంబరు 26న ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. రకుల్, సుశాంత్ మేనేజర్ శృతి మోదీ, సిమోన్ ఖంబట్టా నేడు విచారణ ఎదర్కొంటున్నారు. అయితే రియా చెప్పడంతోనే వీరందరి పేర్లు బయటపడ్డాయనే ప్రచారం నేపథ్యంలో లాయర్ సతీశ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
అమెజాన్లో సీబీడీ ఆయిల్: మీరా చోప్రా
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుతో బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్ హీరోయిన్లు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు సంచలన వార్తలు వెలుగు చూస్తున్నాయి. వీరిలో కొందరు సీబీడీ ఆయిల్ (కానబిడియోల్ ఆయిల్) వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నటి మీరా చోప్రా చేసిన ఓ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సీబీడీ ఆయిల్ కోసం ఆన్లైన్లో సర్చ్ చేశానని.. ఇది అమెజాన్లో దొరుకుతుందని తెలిపారు. ఈ మేరకు ఆమెకు ట్వీట్ చేశారు. ‘ఊరికే అడుగుతున్నాను. సీబీడీ ఆయిల్ని భారత్లో నిషేధించినప్పుడు అది ఆన్లైన్లో ఎలా అందుబాటులో ఉంది. ఇది అమెజాన్లో లభిస్తుంది. నేను చూశాను. నిషేధించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు’ అంటూ మీరా చోప్రా ప్రశ్నించింది. ఇక సీబీడీ ఆయిల్ గంజాయి నుంచి లభిస్తుంది. దీన్ని మన దేశంలో నిషేధించారు. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా సంచలన విషయాలను వెల్లడించింది. (చదవండి: సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు) సుశాంత్, రియా చక్రవర్తితో పాటు తన కోసం కూడా సీబీడీ ఆయిల్ను ఆర్డర్ చేసినట్లు జయ సాహా అంగీకరించిందని సమాచారం. అలాగే రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా సుశాంత్కు ఇచ్చే డ్రగ్ను ఎలా వినియోగించాలో చెప్పిందని సమాచారం. సీబీడి ఆయిల్ని సుశాంత్ తాగే టీలో నాలుగైదు చుక్కలు కలిపి ఇవ్వాలని, అలా అరగంటకోసారి ఇవ్వాలని రియా చక్రవర్తికి సూచించానని జయ సాహా తెలిపినట్లుగా సమాచారం. ఇక రియా లాయర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సీబీడి గురించి మాట్లాడారు. దీనిలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని బాటిల్ మీద ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రియా తన బెయిల్ పిటిషన్లో సుశాంత్కి మాదక ద్రవ్యాల అలవాటు ఉందని.. అతని కోసం తాను అప్పుడప్పుడు చిన్న చిన్న పరిమాణంలో డ్రగ్స్ తీసుకున్నానని తెలిపింది. అయితే తాను డ్రగ్ సిండికేట్లో భాగం కానని రియా వెల్లడించింది. బాంబే హై కోర్టు ఈ రోజు ఆమె బెయిల్ పిటిషన్ని విచారించనుంది. -
రియా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ విచారణను ముంబై హైకోర్టు బుధవారం వాయిదా వేసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో బాంబే హైకోర్టు సెలవులో ఉంది. దీంతో రేపు(గురువారం) బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది. నేడు రియా బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసినట్లు బాంబే హైకోర్టు తెలిపింది. ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24గంటల్లో 173 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు నాయరో కోవిడ్-19 ఆస్పత్రి నీట మునిగింది. వర్షం కారణంగా ముంబైలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. రైల్వే ట్రాక్పై వర్షపు నీరు నిలవడంతో పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. చదవండి: (రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా) -
రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాల్లో చేరడానికి పాండే రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 బిహార్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి గుప్తేశ్వర్ పాండే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పాండే రాజీనామా అభ్యర్థనకు సంబంధించి నోటిఫికేషన్ హోంశాఖ జారీ చేసింది. ఇక నిన్నటితో ఆయన వర్కింగ్ డేస్ పూర్తయ్యాయి.(చదవండి: ‘రియాకు ఆ అర్హత లేదు.. అందుకే’) ఇక డీజీపీ రాజకీయాల్లో చేరతారంటూ వస్తోన్న వార్తలపై పాండే స్పందించారు. ‘నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు.. దీని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు సమాజ సేవ చేయాలని ఉంది. అందుకుగాను రాజకీయాల్లోనే చేరాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఇక పాండే గతంలో కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లో చేరి.. బీజేపీ టికెట్ పొందాలని ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన 9 నెలల తర్వాత తిరగి తనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా బిహార్ ప్రభుత్వాన్ని కోరారు. అతని అభ్యర్థన మేరకు నితీష్ కుమార్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు పాండేని విధుల్లోకి తీసుకున్నారు. -
అక్టోబర్ 6 వరకు రియా జైల్లోనే
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన మిగతా నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెడుతామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పందే తెలిపారు. నిందితుల్లో రియా సోదరుడు షోవిక్ కూడా ఉన్నారు. ఇక సెప్టెంబర్ 11న రియా, మిగతా ఐదుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. నిందితులు ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు. మరోవైపు రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానుంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని బాంద్రాలో నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. రియా చక్రవర్తికి సుశాంత్ మాజీ ప్రియురాలు కావడంతో ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు సీబీఐకి చేతికి వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ విభాగం సైతం రంగంలోకి దిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా పరిస్థితి మారింది. ఈక్రమంలోనే బాలీవుడ్కు చెందిన హీరోయిన్లు సారా అలీ ఖాన్, మరో 15 మంది పేర్లను రియా విచారణలో వెల్లడించినట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. -
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కంగనా!
అహ్మదాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతితో పాటు మాదకద్రవ్యాల అంశానికి సంబంధించి బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు హిందీ చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయంగా సైతం సంచలనం సృష్టిస్తున్నాయి. కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై బాలీవుడ్తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ రామ్దాస్ అథవాలే కంగనాకు మద్దతుగా నిలిచారు. దీంతో కంగనా రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా గుజరాత్లోని వడోదరలో వెలుగుచూసిన ఓ పోస్టర్ చర్చనీయాంశమైంది. త్వరలో జరగబోయే వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆర్పీఐ కంగనా ఫొటోలతో ఉన్న పోస్టర్ను వాడింది. (చదవండి: ఎన్ని నోళ్లు మూయించగలరు?) కాలాఘోడా ప్రాంతంలో వెలిసిన ఈ పోస్టర్లో అథవాలే, కంగనా ఉన్నారు. కంగనాకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆర్పీఐ వడోదర చీఫ్ రాజేశ్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. ముంబై వచ్చేందుకు కంగానా ఇబ్బందులు పడుతున్న సమయంలో తమ పార్టీ అధినేత అథవాలే ఆమెకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కాగా, యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి బంధుప్రీతి కారణమని వార్తల్లో నిలిచిన కంగనా, బాలీవుడ్ను డ్రగ్స్ మాఫియా శాసిస్తోందని చెప్పి తీవ్ర విమర్శలు చేసింది. దాంతోపాటు సుశాంత్ మృతి కేసు విచారణలో ముంబై పోలీసులపై నమ్మకం లేదని తేల్చి చెప్పింది. కంగనా వ్యాఖ్యలపై శివసేన పార్టీ నేతలు అభ్యంతరం తెలపడంతో వివాదం ముదిరింది. ఈక్రమంలోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ముంబై కార్పొరేషన్ కంగనా కార్యాలయంలో కొంత భాగాన్ని కూల్చేసింది. కక్ష సాధింపు చర్యలు చేపట్టారంటూ ఆమె హైకోర్టుకు వెళ్లడంతో.. అధికారుల దుందుడుకు చర్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్: కంగనా) -
మలుపులు తిరుగుతున్న సుశాంత్ మృతి కేసు
-
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం
-
సుశాంత్ విసెరాను సరిగా భద్రపరచలేదు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన కేసులో మరో కీలక విషయం వెలుగు చూసింది. సుశాంత్ మృతదేహం నుంచి సేకరించిన కీలమైన అవయవాలు(విసెరా) సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ బృందం పలు అనుమానాలను వ్యక్తం చేసింది. అదే విధంగా అవయవాల (విసెరా)ను సరిగా భద్రపరచలేదని తెలిపింది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగానికి అందిన విసెరా చాలా తక్కువ పరిమాణంలో ఉందని, కొంత మేరకు క్షీణించిందని అధికారులు తెలిపారు. (సస్పెన్స్ థ్రిల్లర్కు ఏమాత్రం తీసిపోని కేసు) ఎయిమ్స్ బృందం ఆదివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిట్)ను కలువనుంది. ఎయిమ్స్ బృందం సుశాంత్కి సంబంధించిన పలు నివేదికలు సిట్కి అందించనున్నారు. సుశాంత్ మృతికి గల కారణాన్ని నిర్ధారించడంలో కీలకమైన విసెరాను శుక్రవారం ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం పరీక్షించింది. అయితే సుశాంత్ అవయవాల (విసెరా) క్షీణించిందని, దాని వల్ల రసాయన, టాక్సికాలజికల్ విశ్లేషణ చేయడం కష్టతరంగా మారిందని ఎయిమ్స్ అధికారులు పేర్కొన్నారు. జూన్ 14న సుశాంత్ తన ముంబై ఇంటిలో ఉరివేసుకుని చనిపోయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావటంతో సీబీఐ విచారణ జరుపుతోంది. (కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై ఎన్సీబీ కన్ను) -
జయప్రదను టార్గెట్ చేసిన నగ్మ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ మాదకద్రవవ్యాల వినియోగం అంశం దగ్గర ఆగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కోణం వెలువడటంతో కేసు మరో మలుపు తిరిగింది. పార్లమెంట్ వేదికగా దీనిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక మాదకద్రవ్యాల కోణం గురించి వ్యాఖ్యలు చేసిన కంగనకు, ఇతర నటులకు మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మ.. బీజేపీ నాయకులు, సీనియర్ నటి జయప్రదను టార్గెట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు నుంచి ప్రజలను దారి మళ్లించడానికి మాదకద్రవ్యాలు, బాలీవుడ్లో డ్రగ్ కల్చర్ అంశాలను తెర మీదకు తెచ్చారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు నగ్మ ట్వీట్ చేశారు. (చదవండి: విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు) CBI , NCB , ED pls answer to #BJP Member #JayaPrada Ji on what’s happening to #SSR case it’s been so long we are all waiting for what’s the outcome but no result and to cover up suddenly all #bjp members r talking about drugs in #Bollywood as Nation is still waiting #SSRDeathCase — Nagma (@nagma_morarji) September 17, 2020 ‘సీబీఐ, ఎన్సీబీ,ఈడీ దయచేసి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో బీజేపీ నాయకులు, జయప్రద గారికి తెలియజేయండి. సుశాంత్ చనిపోయి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. దేశప్రజలంతా సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఫలితం లేదు. దీన్ని కవర్ చేయడానికి ఉన్నట్లుండి బీజేపీ నాయకులు బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వినియోగం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా దేశ ప్రజలు సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని భావిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. ఎంపీ రవికిషన్ బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం ఉందంటూ చేసిన వ్యాఖ్యలకు జయప్రద మద్దతిచ్చారు. దాంతో నగ్మ ఈ వ్యాఖ్యలు చేశారు. టీవీ నటి కావ్యా పంజాబీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘తొలుత జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ ప్రారంభమైంది.. తరువాత జస్టిస్ ఫర్ కంగనగా మారి ఇప్పుడు జస్టిస్ ఫర్ రవి కిషన్ అయ్యింది. మరి సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎక్కడ అంటూ’ ట్వీట్ చేసింది. -
నన్ను మీడియా వేధిస్తోంది
-
గవర్నర్తో కంగన భేటీ
ముంబై: అధికార శివసేనను, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను తీవ్రంగా విమర్శిస్తున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో సమావేశమయ్యారు. తనకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్కు వివరించి, న్యాయం చేయాలని కోరానని ఆ తరువాత ఆమె వెల్లడించారు. ‘గవర్నర్ని కలిశాను. ఒక పౌరురాలిగా ఆయనను కలిసేందుకు వచ్చాను. ఒక కూతురుగా నన్ను చూశారు. నా సమస్య విన్నారు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు’ అని గవర్నర్తో భేటీ అనంతరం కంగన వ్యాఖ్యానించారు. సోదరి రంగేలితో కలిసి ఆమె రాజ్భవన్లో కోశ్యారీని కలిశారు. ఆ సందర్భంగా గవర్నర్కు ఆమె పాదాభివందనం చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ముంబైపై, ముంబై పోలీసులపై కంగన తీవ్ర విమర్శలు చేశారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోలుస్తూ ఒకసారి, మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులకు భయపడ్తున్నానని మరోసారి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. ఇది ముంబై పోలీసులను అవమానించడమేనని, ముంబైకి రావద్దని కోరుతున్నామని సేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో బాంద్రాలోని కంగన కార్యాలయ భవనాన్ని అక్రమ నిర్మాణమని పేర్కొంటూ బీఎంసీ(బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. ఆ తరువాత, శివసేనపై, ఉద్ధవ్ఠాక్రేపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముంబైని అవమానించిన వారికి మద్దతా? ముంబైని పీఓకేతో పోలుస్తూ అవమానించిన కంగనకు బీజేపీ మద్దతిస్తోందని, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ అలా వ్యవహరిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ముంబై ప్రాముఖ్యతను దెబ్బతీసి, నగరాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోందని సామ్నా పత్రికలోని తన కాలమ్ ‘రోక్తోక్’లో పేర్కొన్నారు. మరాఠా ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం ఇదన్నారు. కంగన వ్యాఖ్యలను ఖండిస్తూ మహారాష్ట్రకు చెందిన ఒక్క బీజేపీ నేత కూడా ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. కంగన వ్యాఖ్యలను బాలీవుడ్ నటులెవరూ ఖండించకపోవడాన్ని ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో మౌనంగా ఉన్న పాండవులతో పోల్చారు. ‘ముంబై వల్ల పేరు, డబ్బు అన్నీ సంపాదించుకున్న మీరు.. అదే ముంబైని సహ నటి విమర్శిస్తే ఖండించరా? డబ్బే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు. నటుడు అక్షయ్కుమార్ మినహా ఎవరూ దీనిపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మేం మర్చిపోం, మర్చిపోనివ్వం: ఫడ్నవీస్
పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీపై మండిపడ్డారు. అందుకే బిహార్లో సుశాంత్ పోస్టర్లను దేవేంద్ర ఫడ్నవీస్ పెట్టించారని ఆరోపించారు. సుశాంత్ మరణాన్ని అడ్డుపెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ఫడ్నవీస్ సారథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిహార్లో వెలిసిన సుశాంత్ పోస్టర్లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీని గురించి ఫడ్నవీస్ స్పందిస్తూ ‘మేం సుశాంత్ సింగ్ మరణాన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకోవడంలేదు. సుశాంత్ విషయం జరగకముందు నుంచే నేను బిహార్ ఎన్నికల కోసం పని చేస్తున్నాను. ఈ విషయం కామన్ మ్యాన్ భావాలకు స్పందించింది. సుశాంత్కు తప్పకుండా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. అందుకే మేం చెబుతున్నాం మర్చిపోము, మర్చిపోనివ్వము’ అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ అనుకోని పరిస్థితులలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక శివసేన ప్రభుత్వంపై ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర గవర్నమెంట్ కరోనాపై యుద్ధం ముగిసిందని భావించి ప్రస్తుతం కంగనాపై యుద్ధం మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. చదవండి: ‘సుశాంత్ రోజుకు 5 సార్లు డ్రగ్స్ తీసుకునేవాడు’ -
రియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ముంబై: సుశాంత్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తికి ముంబై కోర్టులో చుక్కెదురైంది. సోదరుడి షోవిక్తో పాటు ఎనిమిది మందికి బెయిల్ ఇచ్చేందుకు ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో రియాను, ఆమె సోదరుడు షోవిక్తో పాటు మరో ముగ్గురిని నార్కోటిక్ శాఖ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొదటిసారి రియా బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో రియా బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈసారి కూడా రియాతో పాటు మరో ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు నిందితుల తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారు. తన చేత బలవంతంగా నేరాన్ని ఒప్పించారని, కస్టడిలో తనకు రేప్ అండ్ మర్డర్ బెదిరింపులు వస్తున్నాయని రియా బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇలాగే ఉంటే తన మానసిక పరిస్థితి మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రియా తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రియా ఏ నేరం చేయలేదని, అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రియను ముంబైలోని బైకులా జైలులో ఉంచారు. ఆ జైలులో కేవలం రియా మాత్రమే మహిళ ముద్దాయిగా ఉన్నారు. చదవండి: మగ ప్రపంచంపై.. రియా కోపంగా ఉందా? -
‘సుశాంత్ రోజుకు 5 సార్లు డ్రగ్స్ తీసుకునేవాడు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని, అతని తమ్ముడిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీబీ వద్ద రియా తమ్ముడు షోవిక్ చక్రవర్తి అనేక విషయాలు వెల్లడించాడు. తాను అనేక సార్లు సుశాంత్ సింగ్కు మరిజువానా, హాష్, వీడ్ సరఫరా చేసినట్లు పేర్కొన్నాడు. లాక్డౌన్కు ముందు, లాక్డౌన్లో కూడా ఇచ్చినట్లు తెలిపాడు. దానికి సంబంధించిన బిల్లులు అన్ని రియా కార్డు నుంచే చెల్లించినట్లు అధికారులకు తెలిపాడు. ఇప్పటికే ఎన్సీబీ అరెస్టు చేసిన డ్రగ్స్ పెడ్లర్లు బసిత్ పరిహార్, సూర్దీప్ మల్హోత్రా తనకు డ్రగ్స్ అందించేవారని షోవిక్ వెల్లడించాడు. సుశాంత్ డ్రగ్స్ వాడతాడని శ్యామ్యూల్ మిరండా, సిద్దార్థ్ పితానీ తనతో చెప్పారాని తెలిపాడు. రియా, బసిత్ పరిహార్ వాట్సప్ చాట్ను షోవిక్ నిర్ధారించారు. ‘నేను మార్చి 16, 2020లో సుశాంత్ తనతో డ్రగ్స్ గురించి మాట్లాడాడని చెప్పగా సుశాంత్ రోజుకు 5 సార్లు వీడ్ తీసుకుంటాడని రియా చెప్పింది. అందుకే తనకి నేను ఐదు గ్రాముల వీడ్ను ఏర్పాటు చేశాను. అది 20 సార్లు వాడొచ్చు. అప్పుడు నేను బసిత్ను కలిశాను’ అని తెలిపారు. చదవండి: ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి -
రియా అరెస్టు: అదొక మూర్ఖపు చర్య!
న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాన్ని బిహార్ నటుడి మృతిగా ప్రచారం చేస్తూ బీజేపీ ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్లు రాబట్టుకునేందుకు ‘జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ’పేరిట బీజేపీ బిహార్ విభాగం బ్యానర్లు, పోస్టర్లు విడుదల చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇండియన్ యాక్టర్. కానీ ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ ఆయనను బిహార్ నటుడిగా మార్చివేసింది’’ అంటూ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. అదే విధంగా సుశాంత్ మృతి కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి పట్ల దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న తీరును అధీర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. (చదవండి: బలవంతంగా ఒప్పించారు: రియా ) ఈ మేరకు.. ‘‘ పొలిటికల్ మాస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర సంస్థలు తమ వంతు పాత్ర పోషించాయి. సముద్రాన్ని మధించి మకరందానికి బదులు మాదక ద్రవ్యాలను కనుగొన్నాయి. అసలైన హంతకుడిని పట్టుకునేందుకు ఇప్పటికీ చీకట్లో వారి వెదుకులాట కొనసాగుతూనే ఉంది’’అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రియా చక్రవర్తిని ఎన్డీపీఎస్ చట్టం(నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెన్)కింద అరెస్టు చేయడాన్ని ఒక మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ఇక మరో ట్వీట్లో..‘‘రియా తండ్రి మాజీ ఆర్మీ అధికారి. ఆయన దేశానికి సేవ చేశారు. రియా బెంగాలీ బ్రాహ్మణ మహిళ, సుశాంత్ సింగ్ రాజ్పుత్కు న్యాయం చేయడాన్ని బిహారీకి న్యాయం చేసినట్లుగా చిత్రీకరించడం సరికాదు’’ అంటూ ప్రత్యర్థి పార్టీని విమర్శిస్తూనే రియా బెంగాలీ అంటూ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా కొత్తగా ఎన్నికైన అధీర్ రంజన్ చౌదరి తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించారు. (చదవండి: ‘బిహార్లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలం’) అదే విధంగా సుశాంత్ కేసులో ‘మీడియా విచారణ’ న్యాయ వ్యవస్థకు అరిష్టంగా దాపురిచిందంటూ మండిపడ్డారు. కాగా సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రేమపేరిట తన కొడుకును మోసం చేసి, అతడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుందంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈడీ ఎదుట రియా విచారణకు హాజరయ్యారు. అంతేగాక సుశాంత్ను ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బిహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం విదితమే. Rhea's father is a former military officer, served the nation. Rhea is a Bengalee Brahmin lady, justice to actor sushant rajput should not be interpreted as a justice to Bihari.#SushantSinghRajputCase (4/n) — Adhir Chowdhury (@adhirrcinc) September 9, 2020 -
నేనెప్పుడూ అలా అనలేదు: అంకిత
ముంబై: సుశాంత్సింగ్ రాజ్పుత్ను హత్య చేశారని తాను ఎప్పుడూ అనలేదని ఆయన మాజీ ప్రేయసి అంకితా లోఖాండే తెలిపారు. సుశాంత్కు, అతని కుటుంబానికి న్యాయం జరగాలని మాత్రమే కోరానని పేర్కొంది. సుశాంత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అంటూ సోషల్మీడియా వేదికగా నిరసనలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన నార్కోటిక్ అధికారులు ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. 🙏🏻 pic.twitter.com/Hu985iz6Od — Ankita lokhande (@anky1912) September 9, 2020 ఈ విషయంపై స్పందించిన అంకిత ‘ఇది అనుకోకుండా జరిగింది కాదని, చేసుకున్న కర్మ ఫలితం’ అని ట్వీట్ చేసింది. ఇక సుశాంత్ ఆత్మహత్య గురించి మీరు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించగా, తాను కేవలం సుశాంత్ మానసిక స్థితి గురించి మాట్లాడానని, సుశాంత్ను హత్య చేశారని ఎప్పుడూ అనలేదని పేర్కొన్నారు. తాను ఎవరిని అనుమానిస్తున్నట్లు కూడా పేర్కొనలేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు సుశాంత్ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని చెప్పారు. ఈ కేసులో ఉన్న నిజానిజాలు బయటకు రావాలని మాత్రమే తాను పోరాడుతున్నట్లు తెలిపారు. JUSTICE ⚖️ pic.twitter.com/O5aRCirGPD — Ankita lokhande (@anky1912) September 8, 2020 ఇక అంకిత, రియాకు పలు ప్రశ్నలు సంధించారు. సుశాంత్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వాళ్లు డాక్టర్ చెప్పిన మందులు కాకుండా డ్రగ్స్ను తీసుకోవడానికి ప్రోత్సహిస్తారా? అసలు ఎవరైనా అలా చేస్తారా? అని ప్రశ్నించారు. రియా కేవలం సుశాంత్ అనారోగ్యం గురించి మాత్రమే ఆయన కుటుంబ సభ్యులకు చెప్పింది. అంతేకాని సుశాంత్ డ్రగ్స్ వాడుతున్నట్లు చెప్పిందా? లేదు. ఎందుకంటే తాను కూడా ఆ డ్రగ్స్ను తీసుకుంటూ ఆనందించింది. అందుకే నేను ఖర్మ తప్పదూ అంటూ పేర్కొన్నాను అని అంకిత తెలిపింది. చదవండి: రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?! -
శివసేన సర్కారు దూకుడు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మరణించి నప్పటినుంచి రాజుకుంటున్న వివాదం అనేకానేక మలుపులు తిరిగి చివరకు మంగళవారం అతని స్నేహితురాలు, నటి రియా చక్రవర్తి అరెస్టుకు దారితీసింది. అది జరిగిన మరునాడే నటి కంగనా రనౌత్ నివాసం ఆవరణలో అనుమతుల్లేని నిర్మాణాలున్నాయంటూ బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేతలు మొదలుపెట్టడం, ముంబై హైకోర్టు ఆదేశాలతో మధ్యలో అవి నిలిచి పోవడం, ఆ విషయంలో శివసేనపై కంగనా విరుచుకుపడటం వంటి పరిణామాలన్నీ చకచకా జరిగాయి. రియా చక్రవర్తి అరెస్టుతో సుశాంత్ మరణంపై రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడిందని అందరూ అనుకునేలోగానే ఇప్పుడు కంగనా ఇంటి కూల్చివేత వివాదం ఎజెండాలో కొచ్చింది. ఈ రెండు ఉదంతాలూ పరస్పర సంబంధమైనవి కాకపోయివుంటే ఈ కూల్చివేత ఇంత ఆదరా బాదరాగా జరిగేది కాదు. అలాగే ఇంత ప్రముఖంగా చర్చకొచ్చేది కూడా కాదు. ఎందుకంటే ఇంతక్రితం షారుఖ్ ఖాన్, సోనూసూద్ వంటి బాలీవుడ్ ప్రముఖుల నివాసాల్లో సైతం బీఎంసీ అక్రమ నిర్మాణాల పేరిట కొన్నింటిని కూల్చివేసింది. ఇటీవలకాలంలో శివసేనపై, ముంబై మహా నగరంపై కంగనా చేస్తున్న వ్యాఖ్యానాలు ఆ పార్టీకి ఆగ్రహం కలిగిస్తున్నాయి. సుశాంత్సింగ్ కేసులో ముంబై పోలీసుల వ్యవహారశైలిని ఆక్షేపిస్తూ ఆ నగరాన్ని కంగనా పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చారు. ఇక్కడ జీవనం సాగించాలంటే భయంగా వుందని వ్యాఖ్యానించారు. అందుకు జవాబుగా శివసేన సైతం ఆమెపై నోరు పారేసుకుంది. దాంతో తన ప్రాణాలకు ముప్పువుందంటూ ఆమె కేంద్రానికి విన్నవించుకుని వై ప్లస్ సెక్యూరిటీ కూడా సాధించుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేసిన ప్పుడు శివసేన ప్రతీకారం ఏ స్థాయిలో వుంటుందో అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నందువల్లా, ఆ అధికారాన్ని ఎన్సీపీ, కాంగ్రెస్లతో పంచుకుంటూన్నందువల్లా ఆ పార్టీ ఈసారి భౌతిక దాడులకు బదులు వాగ్యుద్ధానికి మాత్రమే పరిమితమైంది. కానీ అధికారాన్ని విని యోగించి తన చేతనైంది చేయడానికి సిద్ధపడింది. దాని పర్యవసానమే బుధవారంనాటి కూల్చివేత. కంగనా బంగ్లాలో కొన్ని అక్రమ నిర్మాణాలున్నాయని బీఎంసీ మొన్న సోమవారం ఆమెకు నోటీసులు జారీ చేసింది. అది అవాస్తవమని ట్విటర్లో కంగనా జవాబిచ్చారు. ఆమె సిబ్బంది కూడా బీఎంసీకి లిఖితపూర్వక సమాధానం పంపారు. అది అందుకున్న వెంటనే బుధవారం ఉదయం బీఎంసీ కూల్చివేత మొదలుపెట్టింది. మధ్యాహ్నానికి స్టే రావడంతో అది తాత్కాలికంగా నిలిచింది. ముంబై మహానగరంలో అధికారుల కుమ్మక్కు కారణంగా అనేకానేక అక్రమ నిర్మాణాలు బయల్దేరు తున్నాయని, పర్యవసానంగా వర్షాకాలంలో నగరం వరదల్లో చిక్కుకుంటున్నదని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్న నిర్మాణాలు నగరంలో నిరుపేదలు, సాధారణ పౌరుల బతుకుల్ని నరకప్రాయం చేస్తున్నాయని వారంటున్నారు. కనుక అక్రమ నిర్మాణాలు కూల్చేయాల్సిందే. కానీ అందుకు తగిన విధివిధానాలు అనుసరించాలి తప్ప ఇష్టానుసారం చేయడం ఎవరూ హర్షించరు. ఇది హఠాత్తుగా చేసింది కాదని...ఆమెకు 2018లోనే నోటీసులిచ్చామని బీఎంసీ చెబుతోంది. అది నిజమే కావొచ్చు... కానీ దానిపై ఆమె కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఇచ్చిన నోటీసుకు సైతం కంగనా సిబ్బంది జవాబిచ్చారు. ఆ వెంటనే కూల్చివేత ప్రారంభించాల్సిన అగత్యం ఏమొచ్చిందో బీఎంసీ సంతృప్తికరమైన జవాబివ్వలేక పోతోంది. ఒకపక్క ఆమెకూ, శివసేనకూ మధ్య వివాదం రాజుకుని తారస్థాయికి వెళ్లిన సమయంలో ఇది చోటుచేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇది వేధింపుగానే అందరూ భావిస్తారు. ఈ వివాదం మొత్తానికి మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు. సుశాంత్ మరణానికి మానసిక ఒత్తిళ్లే కారణమని, ఇలాంటి ఒత్తిళ్లను అయినవాళ్లు సకాలంలో గుర్తించకపోతే బాధితులు ఆత్మహత్య చేసుకునేవరకూ వెళ్తారని చానెళ్ల నిండా నిపుణులు చర్చిస్తున్న సమయంలో కంగనా రనౌత్ రంగ ప్రవేశం చేసి పూర్తి భిన్నమైన కథనం వినిపించారు. బాలీవుడ్లో బంధుప్రీతిని ప్రోత్సహించే మూవీ మాఫియా అతన్ని మృత్యు ఒడిలోకి నెట్టిందని ఆరోపించారు. ఇందులో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా వున్నదని ఆమె చెప్పారు. ఆ తర్వాత మొత్తం మారిపోయింది. అది చూస్తుండగానే కంగనాకూ, శివసేనకూ... కంగనాకూ, ఇతర బాలీవుడ్ నటీ మణులకూ మధ్య వివాదంగా మారింది. బిహార్ ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బీజేపీ ఉద్దేశపూర్వకంగా ముంబై పోలీసులపై బురద జల్లుతున్నదని, వారి తరఫున కంగనా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని శివసేన ఆరోపిస్తోంది. అందులో వాస్తవం కూడా ఉండొచ్చు. కానీ ఒక నటి చేసిన వ్యాఖ్యలు సీరియస్గా తీసుకుని, ఆమెపై కక్ష సాధిస్తున్నట్టు కనబడేలా వ్యవహరించడం శివసేన అపరిపక్వతను పట్టిచూపుతుంది. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శివసేన గతంలో ఎన్నోసార్లు దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంది. స్థానికుల ఉపాధి కాజేస్తున్నారన్న వంకతో స్థానికేతరులపై ఆ పార్టీ దాడులు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తూ ఇంత అసహనం, ఇంత తొందరపాటు ప్రదర్శించడం ఆ పార్టీకే కాదు... కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కూడా రాజకీయంగా ఇబ్బందులు తెస్తుంది. లాక్డౌన్ పర్యవసానంగా మన దేశంలో సామాన్యుల జీవనం ఎంత దుర్భరంగా మారిందో కళ్లకు కట్టే కథనాలు అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. కరోనా మహమ్మారి జోరు ఇంకా తగ్గలేదు. కానీ మన మీడియా మాత్రం రెండున్నర నెలలుగా బాలీవుడ్ పరిధి దాటి బయటకు రావడం లేదు. కనీసం ఇప్పటికైనా ఈ వివాదానికి తెరపడి జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అందరూ దృష్టి కేంద్రీకరిస్తే మంచిది. -
రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘కొన్నేళ్లుగా మానసిక ఆందోళనతో బాధ పడుతూ అక్రమంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, వాటిని అధిక మొత్తంలో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ప్రేమించిన పాపానికి నేడు ఓ యువతిని మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వెంటాడుతున్నాయి. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే’ అని బాలివుడ్ సినీ తార రియా చక్రవర్తిని మంగళవారం నాడు ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ అరెస్ట్ చేయడం పట్ల ఆమె తరఫు న్యాయవాది సతీష్ మనెషిండే చేసిన వ్యాఖ్యలివి. రియా చక్రవర్తిని ప్రేమిస్తూ ఆమెతో సన్నిహిత సంబంధాలు కలిగిన బాలీవుడ్ వర్ధమాన హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెల్సిందే. ఆ కేసులో ఇంతకుముందే ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేయగా మంగళవారం నాడు రియాను అరెస్ట్ చేశారు. (చదవండి : ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి) న్యాయవాది సతీష్ వాదన మేరకు రియా చక్రవర్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారా ? ఏ చట్టం కింద ఆమెను అరెస్ట్ చేశారు ? ఆ చట్టం ఏం చెబుతోంది ? చట్టంలో లోపాలు ఏమైనా ఉన్నాయా ? అన్న అంశాలపై ఆమెను అరెస్ట్ చేయడం సబబా, కాదా ! అన్న విషయం ఆధారపడి ఉంది. ‘నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్’ కింద ఆమెను అరెస్ట్ చేశారు. దేశంలో మాదక ద్రవ్యాలు లేదా మానసిక ప్రేరణ కలిగించే ద్రవ్యాలను ఉత్పత్తి చేయడం, సరఫరా చేయడం, కొనుగోలు చేయడం, కలిగి ఉండడం, ఉపయోగించడాలను నిషేధిస్తూ 1985లో భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్పై అమెరికా యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీన్ని తెచ్చింది. ఈ చట్టంతోపాటు మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రపంచ దేశాలతో చేసుకున్న పలు ఒప్పందాలు, ఒడంబడికలను పటిష్టంగా అమలు చేయడం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ఓ చట్టం ద్వారా ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ ఏర్పాటు చేసింది. ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టయిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. నేరం తీవ్రతను బట్టి చట్టంలోని 31, ఏ సెక్షన్ కింద మరణ శిక్షను కూడా విధించేందుకు ఆస్కారం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2001లో చట్టాన్ని సవరించింది. ‘ఇండియన్ హార్మ్ రిడక్షన్ నెట్వర్క్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో మరణ శిక్షకు వ్యతిరేకంగా ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. మాదక ద్రవ్యాల కేసులో మరణ శిక్షను అమలు చేయాల్సిందేనంటూ పంజాబ్ ప్రభుత్వం 2018లో కేంద్రానికి సిఫార్సు చేసింది.(చదవండి : రియా చక్రవర్తి అరెస్ట్ ) ఎన్టీపీఎస్ చట్టంలో ఎంతో గందరగోళం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోని ఈ చట్టంలో ఎంతో గందరగోళం ఉంది. ఈ చట్టంలో ‘అడిక్షన్ (బానిసవడం)’ అన్న పదంగానీ, దానికి నిర్వచనంగానీ లేదు. కాకపోతే వైద్య అవసరాల కోసం మాదక ద్రవ్యాలను ప్రభుత్వమే సరఫరా చేయవచ్చు అని ఉంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి చికిత్స చేయడానికి లేదా వారి చేత వాటిని మాన్పించేందుకు మళ్లీ మాదక ద్రవ్యాలనే చికిత్సలో భాగంగా ఉపయోగించాల్సి వస్తుంది. ఇక్కడ వైద్య అవసరాలకు ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సరఫరా చేయవచ్చంటే ‘డి అడిక్షన్’ సెంటర్లకు ప్రభుత్వం వీటిని సరఫరా చేయవచ్చని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్క డి అడిక్షన్ కేంద్రం కూడా లేదు. స్వచ్ఛంద సంస్థలు, మాదక ద్రవ్యాల ప్రభావం నుంచి బయట పడిన వ్యక్తులు, సమూహాలు వీటిని నడుపుతున్నారు. వీటికి ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సరఫరా చేసే పద్ధతి కూడా అమలులో లేదు. అమెరికా, కెనడా, నార్వే, బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి దేశాలు మాదక ద్రవ్యాల నిర్మూలనా చట్టంలో భారీ సవరణలను తీసుకొచ్చి ‘అడిక్ట్స్ ట్రీట్మెంట్’కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అమెరికా ‘సస్టేన్ అబ్యూస్ అండ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్’ పేరిట ఓ చట్టాన్నే తీసుకొచ్చింది. డ్రగ్ అడిక్షన్ను నైతిక పరమైన అంశంగా పరిగణించడం వల్లనే భారత ప్రభుత్వాలు ఈ చట్టంలో సవరణలు తీసుకొచ్చేందుకు ఇంతవరకు సాహసించలే కపోయాయి. ‘డ్రగ్ అడిక్షన్’ను ఇతర దేశాలు ఓ జబ్బుగా, అంటే ‘జీవమనోసామాజిక’ స్థితిగా గుర్తించడం వల్ల సవరణలు తీసుకొచ్చాయి. చట్టంలో గందరగోళం ఉండడం వల్ల భారత్లో డ్రగ్స్కు సంబంధించిన కేసుల్లో న్యాయవాదులు స్పష్టంగా వాదించలేకపోతున్నారు. న్యాయమూర్తులు స్పష్టమైన తీర్పులు చెప్పలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిచా నేరం చేశారా? అంటే నైతికంగా చేసినట్లు, ‘అడిక్షన్’ పరంగా చేయనట్లని అర్థం చేసుకోవచ్చు! -
కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ
ముంబై: బాంద్రాలో ఉన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు బుధవారం కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన నాటి నుంచి కంగనా రనౌత్, శివసేన పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన మండిపడింది. 'నా ముంబై ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్' అంటూ మరోసారి ట్విట్టర్ పోస్ట్ చేశారు. దీంతోపాటు బీఎంసీ సిబ్బంది తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను షేర్ చేసింది. ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ముంబై అనేది మరో పీఓకే అనే విషయాన్నినా శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బాబర్, అతని సైన్యం' అంటూ కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫొటోలను షేర్ చేసింది. ‘ఇది కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు, నా వరకు ఇది రామ మందిర్. గుర్తుంచుకోండి బాబర్, అతని సైన్యం రామ మందిరాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశారు. కానీ దాన్ని మళ్లీ ఇప్పుడు నిర్మించారు. నా భవనం విషయంలో కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్’ అని ట్వీట్ చేసింది. కంగన ఇటీవలే రూ. 48 కోట్లతో ఈ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. Babur and his army 🙂#deathofdemocracy pic.twitter.com/L5wiUoNqhl — Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020 దీనిపై బీఎంసీ మేయర్ కిషోర్ పెడ్నేకర్ మాట్లాడుతూ, ‘ కంగనా తనకు నచ్చినట్లు మాట్లాడుతుంది. ఆమె తన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఈ పని చేసిది శివసేన పార్టీ కాదు, బీఎంసీ. ఫిర్యాదు అందిన తరువాత మేం భవానాన్ని కూల్చివేశాం’ అని పేర్కొన్నారు. దీనిపై కంగనా తరుపు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన కార్యాలయం కూల్చివేతను నిలిపేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కూల్చివేతపై స్టే ఇచ్చింది. मणिकर्णिका फ़िल्म्ज़ में पहली फ़िल्म अयोध्या की घोषणा हुई, यह मेरे लिए एक इमारत नहीं राम मंदिर ही है, आज वहाँ बाबर आया है, आज इतिहास फिर खुद को दोहराएगा राम मंदिर फिर टूटेगा मगर याद रख बाबर यह मंदिर फिर बनेगा यह मंदिर फिर बनेगा, जय श्री राम , जय श्री राम , जय श्री राम 🙏 pic.twitter.com/KvY9T0Nkvi — Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020 చదవండి: పీఓకేను తలపిస్తున్న ముంబై : కంగన -
డ్రగ్స్ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ తెలిపింది. సాయంత్రం 4:30 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను ఎన్సీబీ నాలుగు రోజుల పాటు రియాను విచారించింది. విచారణలో ఆమె 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. (8 గంటలు ప్రశ్నల వర్షం) ఈ క్రమంలోనే విచారణను మరింత వేగవంత చేసిన ఎన్సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్ను అరెస్టు చేశారు. రియా సూచనల మేరకు సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని షోవిక్ విచారణలో వెల్లడించాడు. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్సీబీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్, ల్యాప్ట్యాప్ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటినుంచి కీలక ఆధారాలను సేకరించారు. అలాగే డ్రగ్స్ స్మగ్లర్ బాసిత్ను ఐదు సార్లు కలిసినట్టు రియా అంగీకరించడంతో మంగళవారం అరెస్ట్ చేశారు. అయితే రియా డ్రగ్ కేసులో బాలీవుడ్కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్సీబీ అధికారులు సమీర్ వాంఖడే, కేపీఎస్ మల్హోత్రా ఆధ్వర్యంలో రియా విచారణ కొనసాగుతోంది. -
ఆ మెడిసిన్ వల్లే సుశాంత్ చనిపోయాడు : రియా
సాక్షి, ముంబై: దివంగత నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మరణానికి అతని సోదరి ప్రియాంక సింగ్ కారణమంటూ రియా చక్రవర్తి ఆరోపించింది. సుశాంత్ ఇద్దరు అక్కలు ప్రియాంక సింగ్, నీతూ సింగ్ సుశాంత్కు సంబంధించిన బోగస్ మెడికల్ ప్రిస్కిప్షన్ను ఇచ్చారని, ఆ మెడిసిన్ తీసుకున్న 5 రోజుల్లోనే సుశాంత్ మరణించాడని రియా సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ ఆత్మహత్యకు అతని సిస్టర్స్ కారణమంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కు చెందిన డాక్టర్ తరణ్పై కూడా రియా ఈ ఫిర్యాదులో పేర్కొంది. గతంలో సుప్రీం ఆదేశాల మేరకు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు నిమిత్తం ముంబై పోలీసులు సీబీఐకి బదలాయించారు. (నేను విఫలమయ్యాను: సుశాంత్ సోదరి) ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఔట్ పేషెంట్గా సుశాంత్కు జూన్ 8వ తేదిన బోగస్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని... ఆ సమయంలో సుశాంత్ ముంబైలోనే ఉన్నట్లు తెలిపింది. చట్టవిరుద్ధంగా అతనికి సైకోట్రోపిక్ మెడిసిన్ను ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని ఆరోపించింది. సుశాంత్కు ఈ బోగస్ ప్రిస్క్రిప్షన్తో వైద్యం చేయడం వల్లే మరణించాడని ఇందుకు కారణమైన సుశాంత్ సోదరి ప్రియాంక, నీతూ సింగ్ డాక్టర్ తరుణ్లతో పాటు తదితరులను విచారించాల్సిందిగా రియా తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక సుశాంత్ మృతికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో వరుసగా మూడోరోజు కూడా నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకొంటోన్న బాలీవుడ్కు చెందిన కొందరి పేర్లను కూడా రియా వెల్లడించినట్లు తెలుస్తోంది. (8 గంటలు ప్రశ్నల వర్షం) -
శివసేన ఎంపీపై రెచ్చిపోయిన కంగనా
ముంబై: తనపై విమర్శలు చేస్తున్నవారిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా శివసేన ఎంపీ సంజయ్రౌత్ పురుష అహంకారి అని విమర్శించారు. భారతీయ మహిళలపై ఇన్న ఘోరాలు, అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమేనని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మహారాష్ట్రవాసిని కాదన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని అన్నారు. గతంలో ముంబై మహా నగరంలో బతకలేకపోతున్నామని చెప్పిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా ప్రశ్నించారు. ఒక మహిళను అయినందునే శివసేన ఎంపీ రెచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కంగనా ట్విటర్లో వీడియో విడుదల చేశారు. (చదవండి: నేను విఫలమయ్యాను: సుశాంత్ సోదరి) సెప్టెంబర్ 9 న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని ఆమె విమర్శకులకు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆమె సిమ్లాలోని తన సొంతింట్లో ఉన్నారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. మంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడకు రావొద్దని సంజయ్ రౌత్ కంగనాకు కౌంటర్ ఇచ్చారు. ఎంపీ సంజయ్ బహిరంగంగా తనకు వార్నింగ్ ఇస్తున్నారని, ఇప్పడు తనకు ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్లా కనిపిస్తోందని కంగనా కామెంట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో కంగనాకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. (చదవండి:కంగనా కామెంట్లు; అందుకు నేను సిద్ధం) -
శివసేన ఎంపీపై రెచ్చిపోయిన కంగనా
-
సుశాంత్ సోదరి ఎమోషనల్ పోస్ట్!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ కొంత పురోగతిని సాధించింది. ఈ సందర్భంగా సుశాంత్ సోదరి, శ్వేతా సింగ్ కీర్తి అతనిని గుర్తుచేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్లో సుశాంత్ తాను కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. మేం ఒకరిని ఒకరం ఎప్పుడూ కాపాడుకుంటాం అని వాగ్దానం చేశాము. కానీ భాయ్ నేను నా మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాను. అయితే ఇప్పుడు నేను, దేశం మొత్తం నీకు మరో వాగ్ధానం చేస్తున్నాం. మేం నిజం కనుక్కుంటాం, నీకు న్యాయం చేస్తాం. నా సోదరుడు ఎలాంటి వ్యక్తి అంటే అతని జీవితం ఆనందంతో నిండినది. అతను చిన్న పిల్లవాడిలా ఉంటాడు. అతను కోరుకున్నది ప్రేమ మాత్రమే. ఎవరైనా ఒకసారి తన తల నిమురుతూ ప్రేమతో మాట్లాడితే సుశాంత్కు అది చాలు. తన ప్రాణాలు బలవంతంగా తీసుకునే వ్యక్తి కాదు. అది నమ్మడానికి నా మనసు సిద్ధంగా లేదు. మన ఉద్దేశాలను స్పష్టంగా ఉంచుకుందాం. సుశాంత్ మరణానికి నిజమైన కారణం ఏంటో తెలుసుకుందాం. ఇది సత్యానికి వచ్చిన ఆగ్రహం’ అని శీర్షికను జోడించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. అతడు డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నాడని బాంద్రా పోలీసులు తెలిపారు. అయితే సుశాంత్ అత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, అతని మరణం వెనుక ఏదో నిజం ఉండే ఉంటుందని కుటుంబ సభ్యులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనేక నిరసనలు వెల్లువెత్తడంతో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించారు. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబం అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో రియా సోదరుడిని నార్కోటిక్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram We promised each other that we will protect each other forever. But,I failed Bhai...I failed! But here is another promise I and the whole country make to you, we will find the truth, we will get you justice!I knew my brother, the kind of person he was, full of life and joy. He was like a child, the only thing he wanted was love. Koi ek baar, pyaar se haath pher de uske sar pe, pyaar se baat karle, bas that was enough for him to make him happy. He was not a person who would take his own life. My heart is not ready to believe it. Let’s keep our intentions clear, we want to know what is the cause of Sushant’s death, nothing less will suffice! It is Satya ka Agrah, #SatyagrahForSSR A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Sep 6, 2020 at 10:29am PDT చదవండి: సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా.. -
సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా..
ముంబై: సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సీబీఐ, ఎన్సీబీ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్కి సంబంధించిన డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు, నటి రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆదివారం ఆరుగంటల పాటు విచారించింది. తిరిగి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సోమ వారం కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా రియాకు సమన్లు జారీచేసినట్టు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్ మీడియాకి వెల్లడించారు. సుశాంత్ సింగ్ కోసం తన సోదరుడు షోవిక్ చక్రవర్తి, మరో నిందితుడి ద్వారా తాను మాదకద్రవ్యాలను కొనుగోలు చేసేదానినని రియా అంగీకరించినట్టు తెలు స్తోంది. డ్రగ్స్ కొన్నానని, అయితే తానెప్పుడూ వాటిని వాడలేదని ఆమె చెప్పారు. రక్త నమూ నాలు ఇవ్వడానికి సిద్ధమని, ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదని తెలిపారు. ఈ ఏడాది మార్చి 17న జైద్ నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసేం దుకు మేనేజర్ మిరాండా వెళ్ళిన విషయం కూడా తనకు తెలుసునని ఎన్సీబీ ఎదుట రియా ఒప్పుకున్నారు. మార్చి 15న తన సోదరుడు షోవిక్కు, తనకు మధ్య మాదకద్రవ్యాలపై జరిగిన వాట్సాప్ చాట్ వాస్తవమేనని కూడా ఎన్సీబీ ఎదుట ఆమె అంగీకరించినట్టు సమా చారం. కాగా, రియా చక్రవర్తి విచారణ పూర్తి అయిన తరువాత, షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్లను రియాతో కూర్చోబెట్టి విడివిడిగా ఒక్కొక్కరి పాత్రపై వివరాలు సేకరిస్తామని ఎన్సీబీ తెలిపింది. తాజాగా అనూజ్ కేశ్వాని అనే వ్యక్తి ఇంటిపై ఎన్సీబీ దాడిచేసింది. ఈ దాడిలో 590 గ్రాముల హశీష్, 0.64 గ్రాముల ఎల్ఎస్డి షీట్స్, 304 గ్రాముల గంజాయి, 1,85,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై సీబీఐ, అతని అకౌంట్ల నుంచి కోట్ల రూపాయల డబ్బును బదలాయించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను కూడా రియా ఎదుర్కొంటున్నారు. ప్రశ్నల వర్షం... ఎన్సీబీ జాయింట్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ బృందం, కొంత మంది మహిళా పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారు జామున పశ్చిమ శాంతా క్రజ్లోని రియా చక్రవర్తి ఇంటికి వెళ్ళి, ఆమెకు సమన్లు అంద జేసింది. పోలీసు ఎస్కార్ట్తో రియాను మధ్యాహ్నం 12 గంటలకు బల్లార్డ్ ఎస్టేట్లోని సంస్థ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. ఆమె నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈడీ ఇచ్చిన రిపోర్టుతో ఎన్సీబీ మాదక ద్రవ్యాల కోణంలో విచారణ ప్రారంభించింది. డ్రగ్స్ ముఠాతో రియాచక్రవర్తికి ఉన్న సంబంధాలపై ఎన్సీబీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం, రియా చక్ర వర్తి వివిధ టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాను ఎప్పుడూ మాదక ద్రవ్యాలు సేవించలేదని చెప్పారు. సుశాంత్ సింగ్ గంజాయి తీసుకునే వాడని, ఇదే విషయాన్ని మిరాండా కూడా విచారణలో చెప్పినట్లు ఎన్సీబీ తెలిపింది. షోవిక్ ఆదేశాల మేరకు మిరాండా డ్రగ్స్ని సరఫరా చేసేవాడని ఎన్సీబీ వెల్లడించింది. ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. 2018 సెప్టెంబర్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ గంజాయి సేవిస్తున్నప్పుడు తాను చూశానని వ్యక్తిగత సలహాదారు దీపేశ్ సావంత్ అంగీకరించినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. మార్చి 13న రియా సోదరుడు షోవిక్ నుంచి డ్రగ్స్ తీసుకురావాలని సుశాంత్ చెప్పారని, అవి తీసుకొచ్చేందుకు మిరాండాతో కలిసి వెళ్ళానని దీపేశ్ చెప్పారు. అంతేకాకుండా ఏప్రిల్ 17న రియా చక్రవర్తి కోసం కూడా తాను డ్రగ్స్ సేకరించినట్లు దీపేశ్ ఎన్సీబీకి వెల్లడించారు. ప్రేమించడమే నేరమా? ‘‘రియాచక్రవర్తి అరెస్టుకి సిద్ధంగా ఉన్నారు. ఎవరినైనా ప్రేమించడం నేరమైతే, తన ప్రేమ కోసం ఆమె ఎన్నికష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె అమాయకురాలు. ఆమెపై బీహార్ పోలీసులు, సీబీఐ, ఈడీ, ఎన్సీబీలతో కలిసి పెట్టిన కేసుల్లో ముందస్తు బెయిలు కోసం రియా చక్రవర్తి ఏ కోర్టునీ ఆశ్రయించలేదు’’అని ఆమె న్యాయవాది సతీష్ మనేషిండే ట్వీట్ చేశారు. -
డ్రగ్స్ కేసు: రియా చక్రవర్తి అరెస్టు!
-
రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
బాలీవుడ్: విదేశాలలో సైతం నిరసన సెగలు
సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకొని నెలలు గడుస్తున్న ఆయన కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ సుశాంత్కు న్యాయం జరగాలంటూ పోరాడుతూనే ఉన్నారు. సామాజక మాధ్యమాల ద్వారా ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అంటూ న్యాయం కోసం తపిస్తున్నారు. సుశాంత్ మరణించిన నాటి నుంచి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇక దీంతో పాటు బాలీవుడ్లో ఉన్న నెపోటిజం, స్టార్ కిడ్స్పై వ్యతిరేకత కూడా అదే రేంజ్లో పెరుగుతూ వస్తుంది. బాలీవుడ్ ఈ వ్యతిరేకతను కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం బ్రిటన్లో ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ మూమెంట్ ఉదృతంగా సాగుతుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 14వ తేదీన బ్రిటన్లోని మల్టీప్లెక్స్ల ముందు నిరసన తెలియజేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ ఆన్లైన్ ద్వారా ఈ నిరసనలో పాలుపంచుకోబోతున్నారు. సుశాంత్ సోదరి శ్వేత సింగ్ ఆధ్వర్యంలో జస్టిస్ ఫర్ సుశాంత్ క్యాంపెయిన్ జరుగుతున్న విషయం తెలిసిందే. వారందరూ సీబీఐ సుశాంత్ మరణం వెనుక ఉన్న వ్యక్తులను, నిజాలను బయటకు తీసుకురావాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతూ, బాలీవుడ్ ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం ఫ్యాన్స్ అని ఆ విషయాన్ని స్టార్స్గా ఎదిగిన వారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మర్చిపోకూడదు అని అన్నారు. దీంతో నిరసన సెగలు వీధుల నుంచి సినిమా హాల్ సీట్ల వరకు చేరినట్లు తెలుస్తోంది. ఇతర స్టార్ కిడ్స్ సినిమాలు చూడటానికి ఫ్యాన్స్ అంతగా ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా వారి వీడియోలను డిస్లైక్ చేయాలంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. దేశాన్ని దాటి ఖండాతరాలలో కోసం ఇలా జరగడంతో బాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. చదవండి: సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ అదుపులో మరొకరు -
సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ అదుపులో మరొకరు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధం ఉన్న మరో అనుమానితుడు బాసిత్ పరిహార్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సిబి) ప్రశ్నిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఇప్పటికే అరెస్టు అయిన జైద్ విలాత్రా ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయన్ను సెప్టెంబర్ 9 వరకు ఎన్సీబీ కస్టడీకి అప్పగించారు. జైద్ విచారణ సందర్భంగా బాసిత్ పరిహార్ పేరు బయటపడింది. రాజ్పుత్ కేసులో రియాచక్రవర్తిపై నమోదైన మాదకద్రవ్యాల కేసుకి, బాసిత్కి సంబంధం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. రియాచక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ మొబైల్ చాట్స్లో బాసిత్ ప్రస్థావన ఉన్నట్లు వారు చెప్పారు. షోవిక్ని, రాజ్పుత్ మేనేజర్ సామ్యూల్ మిరందాని మాదకద్రవ్యాల కేసు విచారణకు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, గోవా, ఢిల్లీలోని మరికొంత మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు చదవండి: సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ -
అమెరికాలో సుశాంత్ బిల్ బోర్డులు తొలగింపు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన బిల్ బోర్డులను తొలగించడానికి అమెరికా మీడియా సంస్థ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఈ మెయిల్ ద్వారా సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్కు తెలిపింది. ఈ మెయిల్కు సంబంధించిన స్క్రీన్ షాట్లను శ్వేత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంది. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో కొన్ని బిల్ బోర్డులను అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రచారం ద్వారా ఆయనతో సంబంధం ఒక మహిళను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆ మీడియా సంస్థ మెయిల్లో తెలిపింది. ఆ కారణంగానే ఆ బిల్ బోర్డులను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. It seems the paid PR has it’s reach everywhere. Hollywood Billboard company reached out telling they will not keep the Billboard any longer! The wordings on the billboard only demanded fair trial and justice! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR pic.twitter.com/YrMrLH3eIX — shweta singh kirti (@shwetasinghkirt) September 3, 2020 దీనిపై శ్వేత సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పెయిడ్ పీఆర్ ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తోంది. ఈ కారణంగానే హాలీవుడ్ బిల్బోర్డు సంస్థ సుశాంత్ బిల్బోర్డును తొలగిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. బిల్బోర్డు ద్వారా న్యాయమైన విచారణ, న్యాయం మాత్రమే కోరుతున్నాము! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR అని ఆమె ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14 వ తేదిన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. తరువాత ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ ప్రచారం సాగుతోంది. View this post on Instagram Thanks Chicago! 🙏❤️🙏 Lets Stay United and keep demanding justice for Sushant. #JusticeForSushantSinghRajput #GlobalParyerForSSR A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Sep 1, 2020 at 12:38pm PDT చదవండి: సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ -
సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బుధవారం అరెస్ట్ చేసింది. ముంబై బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్ను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారులు మాట్లాడుతూ, ‘అతనికి శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉంది. షోవిక్ చక్రవర్తి (రియా చక్రవర్తి సోదరుడు) సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి’ అని తెలిపారు. శామ్యూల్ మిరాండా సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంటిలో మేనేజర్గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించడాని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్తో పాటు ముంబైకు చెందిన జైద్ విలాత్రాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు రియా చక్రవర్తి తల్లిదండ్రులను బుధవారం విచారించారు. ఈ కేసులో మొదటిసారిగా రియా తల్లిదండ్రులు సీబీఐ ముందు హాజరయ్యారు. ఇక గతవారం రియా తమ్ముడు షోవిక్ను కూడా విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ డబ్బును కాజేసి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు అంటూ సుశాంత్ కుటుంబసభ్యులు రియా కుటుంబ సభ్యులందరిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇక రియాను సీబీఐ అధికారులు నాలుగు రోజులలో 35 గంటల పాటు విచారించారు. చదవండి: ‘సుశాంత్కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’ -
ముంబై: సీబీఐ ఆఫీస్కు చేరుకున్న రియా చక్రవర్తి
-
సుశాంత్ విచిత్రంగా ప్రవర్తించేవాడు
-
‘సుశాంత్కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’
ముంబై: హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి విషయంలో రోజుకొక కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమెకు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సుశాంత్ తండ్రి తరపున వాదిస్తున్న న్యాయవాది రియాపై మరో ఆరోపణ చేశారు. రియా, సుశాంత్కు తెలియకుండా అతనికి నిషేధించిన డ్రగ్స్ను ఇచ్చిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు. ఈ విషయం గురించి లాయర్ కేకేసింగ్ మాట్లాడుతూ, ‘సుశాంత్కు తెలియకుండా కొన్ని నిషేధిత డ్రగ్స్ను ఆయనకు ఇచ్చారు. ఇదే అతడు చనిపోవడానికి కారణమయ్యింది. మొదటి నుంచి కూడా సుశాంత్కు తనకు తెలియకుండానే ఏదో మందులు ఇస్తున్నారని కుటుంబ సభ్యులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొన్నాం. సుశాంత్కు తెలియకుండానే డాక్టర్లు రాసి ఇవ్వని డ్రగ్స్ను సుశాంత్కు ఇచ్చారని అందులో ఫిర్యాదు చేశారు’ అని తెలిపారు. ఒకవేళ అలాంటి డ్రగ్స్ ఇచ్చి సుశాంత్ను ఆత్మహత్యకు ప్రేరేపించారా లేదా హత్య చేయడానికి ప్రయత్నించారా అన్న అనుమానాలను సుశాంత్ తండ్రి తరుపు న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి డ్రగ్స్ వాడటం చట్టవిరుద్దమని ఆయన తెలిపారు. ఇంకా సుశాంత్ ఆత్మహత్య విషయంలో అనేక విషయాలు బయటపడ్డాయి. సుశాంత్ ఫస్ట్ ఫ్లోర్లో నిద్రపోయేవాడని రియా పై అంతస్తులో పార్టీలు చేసుకునేదని ఇంట్లో ఉండే పనివాళ్ల ద్వారా తెలిసింది. అలాగే రియా డ్రగ్ డీలర్స్తో మాట్లాడినట్లు, వాళ్లకు మెసేజ్లు చేసినట్లు కొన్ని ఆధారాలను ఈడీ డిపార్ట్మెంట్ సీబీఐకు అందించింది అనే కథనాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ లింక్ గురించి రియా తరుపు న్యాయవాది మాట్లాడుతూ రియాకు కావాలంటే రక్త పరీక్ష నిర్వహించవచ్చని, రియా తన జీవితంలో డ్రగ్స్ తీసుకోలేదని తెలిపారు. చదవండి: సుశాంత్ కేసు: ఆ అంబులెన్స్లు ఎందుకు వచ్చాయి? -
సైకలాజికల్ అటాప్సీ..!
-
డెత్ మిస్టరీ
-
సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు
-
రియాకు ఆస్థాయి లేదు: డీజీపీ
పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రియా చక్రవర్తిపై బీహార్ డీజీపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ విషయంలో మీడియా రాద్ధాంతం చేస్తుందని రియా కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో రియా దాఖలు చేసిన పిటిషన్లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరును కూడా ప్రస్తావించారు. దీనిపై బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి రియాకు లేదన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సుశాంత్ కేసులో రాద్ధాంతం చేస్తున్నారని రియా తన పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను బీహార్లో నమోదు చేశారని, దీని వెనుక సీఎం నితీశ్ కుమార్ ఉన్నారని రియా ఆరోపించింది. దీనిపై బీహార్ డీజీపీ పై విధంగా స్పందించారు. సుశాంత్ రాజ్పుత్ కేసును సీబీఐకు అప్పగించిన సంగతి తెలిసిందే. చదవండి: సీబీఐకి సుశాంత్ సింగ్ మృతి కేసు -
సుశాంత్ మృతి కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు
-
మూవీ మాఫియాపై కంగనా ఫైర్
ముంబై: యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సెలబ్రిటీల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తన ట్విటర్ ఖాతాను కొందరు సస్పెండ్ చేస్తున్నారని, మూవీ మాఫియా కుట్రతోనే ఇదంతా జరుగుతుందని కంగనా ఆరోపిస్తుంది. బాలీవుడ్లో నెపోటిజం వేళ్లూనుకుపోయిందంటూ, ప్రతిభ ఉన్న వాళ్లకు ప్రాధాన్యం ఉండదని, కేవలం స్టార్ కిడ్స్కు మాత్రమే అవకాశాలు, అవార్డులు ఉంటాయని ఆమె ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన వారిలో కంగనా ముందు వరుసలో నిలిచారు. చదవండి: ‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’ -
సుశాంత్ కేసు: ఆ అంబులెన్స్లు ఎందుకు వచ్చాయి?
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణానికి సంబంధించి మరిన్ని సందేహాలు లేవనెత్తారు. సుశాంత్ చనిపోయిన తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు ఎందుకు ఉన్నాయని, ఆయనకు నమ్మకస్తుడైన శ్యామ్యూల్ హోకిప్ అదృశ్యం అవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి అని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్లో సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ మరణిస్తే బాంద్రాలోని ఆయన నివాసానికి రెండు అంబులెన్సులు రావడంపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ముంబై పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టకపోవడంపై ఎంపీ సుబ్రమణ్యస్వామి తాజాగా అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణిండానికి ముందు రోజు అంటే జూన్ 13 తేదీ రాత్రి ఆయనతో పాటు ఇంట్లో శామ్యూల్ హెకిప్ కూడా ఉన్నారనే విషయాన్ని ఇటీవల ఒక టీవీ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్లో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం తర్వాత నుంచి శ్యామ్యూల్ కనిపించకుండా పోవడం, ఎవరికి అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ శామ్యూల్ హెకిప్ బతికే ఉన్నాడా? లేదా చనిపోయాడా? సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నిస్తున్నారు. రెండు అంబులెన్సులు ఎందుకు వచ్చాయి? వాటి కోసం ఎవరు కాల్ చేశారు? సుశాంత్ మరణం రోజున రెండు మృతదేహాలు అంటూ సోషల్ మీడియాలో ఆ ఇంటి నుంచి రెండు దేహాలు వెళ్లాయనే ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒక ఫోటోలో కాళ్లు స్ట్రెయిట్గా ఉంటే మరో ఫోటోలో కాళ్లు ముడుచుకొని ఉన్న దేహాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. తాజాగా సుబ్రమణ్యస్వామి అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ ఫోటోలకు సంబంధించిన విషయం మరోసారి చర్చనీయాంశమవుతుంది. ఈ నేపథ్యంలోనే సుశాంత్కు పోస్ట్మార్టం చేసిన డాక్టర్ను ప్రశ్నించాలని సుబ్రహ్మణ్య స్వామి సీబీఐను గతంలో కోరారు. చదవండి: ‘నా కొడుకు ఉరి వేసుకోడాన్ని ఎవరూ చూడలేదు’ -
‘ఆర్ఆర్ఆర్’కు అలియా మైనస్ కానుందా?
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన నాటి నుంచి బాలీవుడ్లో నెపోటిజం మీద విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్టార్ కిడ్స్ అయిన అలియా భట్, సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్ లాంటి వారిపై తీవ్రస్థాయిలో సుశాంత్ అభిమానులు విరుచుకుపడ్డారు. వారిని అన్ఫాలో చేశారు. అంతే కాకుండా సోషల్మీడియాలో తీవ్రంగా విమర్శించడంతో సోనాక్షి సిన్హా లాంటివారు తమ అకౌంట్లను కూడా డియాక్టివేట్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ విషయంలో అలియాభట్, ఆమె తండ్రి మహేష్ భట్ చేసిన కామెంట్స్ విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా అలియా నటించిన సడక్ 2 ట్రైలర్ ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలైంది. దానికి ఎక్కువగా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. దాదాపు 4 మిలియన్ల మంది డిస్లైక్ చేశారు. ఇదిలా ఉండగా అలియా భట్ సౌత్లో దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తోంది. అలియాభట్ వల్ల ఈ సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రాజమౌళి ఏ నిర్ణయం తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది. చదవండి: సడక్ 2: ట్రైలర్ను వేటాడేస్తున్న నెటిజన్లు -
ముగ్గురిపై దిశ తండ్రి ఫిర్యాదు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సతీష్ సలియన్, దిశ మరణం గురించి పుకార్లు వ్యాప్తి చేసినందుకు గాను ముగ్గురు వ్యక్తులపై శుక్రవారం లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చట్టపరమైన అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాన్ని దిశా సలియన్ మరణంతో కలిపి అనేక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు, సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్, దిశా సలియన్ మరణ కేసుల మధ్య సంబంధం ఉందని పలువురు రాజకీయ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తన కుమార్తె పరువు తీశారని, ఆమె గురించి పలు పుకార్లు సృష్టించారని సతీష్ సలియన్ ముంబైలోని మల్వాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టులు తమను మానసికంగా ఎలా వేధిస్తున్నాయో ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు నకిలీ కథలను ప్రచారం చేస్తున్నారని తన ఫిర్యాదులో తెలిపారు. వారిని పునీత్ వసిష్ఠ, సందీప్ మలాని, నమన్ శర్మలుగా ఆయన తెలిపారు. ఈ ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. (‘సుశాంత్ సోదరి నన్ను వేధించారు’) సతీష్ సలియన్ ఇచ్చిన ఫిర్యాదును చాలా సీరియస్గా తీసుకుంటున్నామని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. సరైన చట్టపరమైన అభిప్రాయాలను తీసుకున్న తరువాత, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులను పిలిచి ఈ విషయంపై దర్యాప్తు చేస్తారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన నాటి నుంచి ఆయన మేనేజర్గా పని చేసిన దిశ మరణంపై కూడా పలు కథనాలు ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సుశాంత్ మాజీ మేనేజర్ మరణంపై సంచలన ఆరోపణలు -
సుశాంత్ కేసు: మనవడికి పవార్ మందలింపు
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బిహార్, మహారాష్ట్రల మధ్య వివాదాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సుశాంత్ రాజ్పుత్ మృతి దర్యాప్తుపై స్పందించారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులకు మొదటి అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరద్ పవార్ మనవడు పార్థ్ పవార్(అజిత్ పవార్ కుమారుడు) కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై పవార్ స్పందించారు. ఇవి పరిణితి లేని వ్యాఖ్యలు అని.. వాటిని తాము సీరియస్గా తీసుకోవడం లేదని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని మనవడిని బహిరంగంగా మందలించారు పవార్. (బాంద్రా డీసీపీ- రియా ఫోన్ కాల్స్) సుశాంత్ మృతిపై ముంబై పోలీసుల దర్యాప్తు సరిగా సాగడం లేదని.. వారి మీద తమకు నమ్మకం లేదని సుశాంత్ కుటుంబ సభ్యులు బిహార్ ముఖ్యమంత్రిని కోరిన సంగతి తెలిసిందే. దాంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు నితీష్ కుమార్. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బిహార్ సీఎం ఇలా చేశారని.. శివసేన ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు నాకు గత 50 ఏళ్ల నుంచి తెలుసు. వారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఆరోపణలను నేను పట్టించుకోను. ముందు వారిని లోతుగా దర్యాప్తు చేయనిద్దాం. తర్వాత కేసును సీబీఐకి లేదా ఇతర ఏజెన్సీలకు అప్పగించినా మేము వ్యతిరేకించం’ అన్నారు పవార్. (సీబీఐ దర్యాప్తు: రియా స్పందన) ఈ కేసులో రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉన్నట్లు వస్తోన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అసలు ఆదిత్య పేరును ఇందులోకి ఎందుకు లాగుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు పవార్. ఆదిత్య పేరును బీజేపీనే వివాదంలోకి లాగిందని ఆయన ఆరోపించారు. ‘సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుతో ఆదిత్య ఠాక్రేకు ఏం సంబంధం ఉంది. రాష్ట్రంలో మా మద్దతుతో శివసేన అధికారంలోకి రావడాన్ని ప్రతిపక్షాలు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాయి. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి’ అని సీనియర్ సేన నాయకుడు సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (బాలీవుడ్తో సంబంధాలు నిజమే: ఆదిత్య ఠాక్రే) -
‘సుశాంత్పై మానసిక రోగి ముద్ర వేశారు’
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై విచారణకు సంబంధించి, తమ కుటుంబంపై జరుగుతున్న దుష్ర్పచారంపై సుశాంత్ కుటుంబ సభ్యులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. సుశాంత్కు తన కుటుంబంతో సరైన సంబంధాలు లేవని శివసేన పత్రిక సామ్నాలో ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ రాసిన సంపాదకీయం అనంతరం ఈ లేఖను సుశాంత్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. నటుడకి తాము చాలా సన్నిహితులమని చెబుతూ కొందరు మీడియాలో ప్రకటనలు చేస్తున్నారని ఈ లేఖలో సుశాంత్ కుటుంబం మండిపడింది. నటి రియా చక్రవర్తి పేరును ప్రకటనలో ప్రస్తావించకపోయినా సుశాంత్ను దారుణంగా హత్య చేశారని పేర్కొంది. ఈ కేసులో ఖరీదైన న్యాయవాదులను నియమించుకున్నారని, వారు న్యాయాన్ని హతమారుస్తారా అని లేఖలో సుశాంత్ కుటుంబం విస్మయం వ్యక్తం చేసింది. సుశాంత్పై మానసిక రోగి ముద్ర వేసి, మృతదేహం ఫోటోలను బహిర్గతం చేసి తమకు సంతాపం తెలిపేందుకూ సమయం ఇవ్వలేదని పేర్కొంది. ముంబై పోలీసుల విచారణ కొద్దిమంది సంపన్నుల ఉద్దేశాలను వెల్లడించేలా సాగిందని ఆరోపించింది. తమ కుటుంబం పోలీసులను ముందుగానే సంప్రదించినా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని లేఖ సూటిగా ప్రశ్నించింది. సుశాంత్ నలుగురు అక్కలతో పాటు తండ్రినీ బెదిరిస్తున్నారని, తమ కుటుంబం ప్రతిష్ట మసకబార్చేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సుశాంత్ జ్ఞాపకాలకూ కళంకం ఆపాదిస్తున్నారని మండిపడింది. ఇక సుశాంత్ ఆయన సోదరిల గురించి లేఖలో ప్రస్తావిస్తూ పెద్ద కుమార్తె విదేశాల్లో ఉంటారని, రెండో కుమార్తె జాతీయ క్రికెట్ టీమ్లో ఆడారని, మూడో కుమార్తె లా చదవగా, నాలుగో కుమార్తె ష్యాషన్ డిజైనింగ్లో డిప్లమో చేశారని ఈ ప్రకటన పేర్కొంది. ఐదో సంతానంగా సుశాంత్ తన తల్లికి గారాల బిడ్డని తెలిపింది. తమ కుటుంబం ఏ ఒక్కరి నుంచి ఏమీ ఆశించలేదని, ఎవరికీ హాని తలపెట్టలేదని స్పష్టం చేసింది. చదవండి : సుశాంత్ కేసు : ఫోరెన్సిక్ నివేదికలో కీలక విషయాలు -
‘సుశాంత్ సోదరి నన్ను వేధించారు’
న్యూఢిల్లీ/ముంబై : దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన సోదరి ప్రవర్తనపై బాధపడుతూ తనతో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లను నటి రియా చక్రవర్తి షేర్ చేశారు. సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ తన పట్ల వ్యవహరించిన తీరుపై సుశాంత్ కలత చెందాడని ఆ వాట్సాప్ చాట్ తేటతెల్లం చేస్తోందని రియా చెప్పారు. తమ మధ్య దూరం పెంచేందుకు సుశాంత్ రూమ్మేట్ సిద్ధార్ధ్ పిధానిని ప్రియాంక ప్రేరేపించేదని పలు వాట్సాప్ మెసేజ్ల్లో రియాతో సుశాంత్ పేర్కొన్నట్టు ఆ స్క్రీన్షాట్లలో ప్రస్తావించారు.కాగా రియా ఆరోపణలను సుశాంత్ మరో సోదరి శ్వేతా సింగ్ కీర్తి తోసిపుచ్చారు. ప్రియాంకతో పాటు తనతోనూ సుశాంత్ అన్యోన్యంగా ఉండేవారని చెప్పారు. ప్రియాంకతో తన అనుబంధంపై సుశాంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన వీడియోను శ్వేత షేర్ చేశారు. కాగా సుశాంత్ మృతికి ఆయన గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమంటూ దివంగత నటుడి కుటుంబ సభ్యులు బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. ఇక సుశాంత్ విషాదాంతం నేపథ్యంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా సోమవారం మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ఆమె ముంబైలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్కు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారి మళ్లించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాపై ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. చదవండి : సుశాంత్ కేసు : క్వారంటైన్లో బిహార్ పోలీసుల విచారణ -
సుశాంత్ కేసు: రియా నోరు విప్పుతుందా?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణం నేపథ్యంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా సోమవారం రెండోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ఆమె ముంబైలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్కు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారి మళ్లించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాపై ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. (రియా చక్రవర్తిపై సంచలన ఆరోపణలు చేసిన లాయర్) సుశాంత్ నుంచి నీళ్ల బాటిల్, లెటర్ మాత్రమే అందుకున్నా ఆయన మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి రియా సహా, ఆమె కుటుంబ సభ్యులు, మరికొంతమందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం రియాను ఈడీ ఎనిమిది గంటల పాటు ప్రశ్నించినప్పటికీ సంతృప్తికర స్థాయిలో సమాధానాలు రాలేవు. కేవలం ఓ వాటర్ బాటిల్, లెటర్ మాత్రమే సుశాంత్ నుంచి తీసుకున్నాన్నానంటూ ఆమె అనేక ప్రశ్నలకు దాటవేసే సమాధానాలిచ్చారు. (ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?) రియా తమ్ముడిని 18 గంటల పాటు విచారించిన ఈడీ దీంతో మరోసారి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు ఆమె మళ్లీ ఈడీ కార్యాలయానికి వచ్చింది. ఈసారైనా అధికారులు అడిగే ప్రశ్నలకు రియా సరైన సమాధానాలు చెప్తుందో లేదో చూడాలి. మరోవైపు శనివారం ఆమె సోదరుడిని ఈడీ 18 గంటల పాటు విచారించింది. శనివారం మధ్యాహ్న ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి వెళ్లిన షోవిక్ ఆదివారం ఉదయం 6.30 నిమిషాలకు బయటకు వచ్చాడు. ఇదిలా వుండగా సీబీఐ దర్యాప్తును ఆపివేయాలంటూ రియా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు మంగళవారం విచారణకు రానుంది. (సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి ఇదే : రియా) -
సుశాంత్ కేసు : క్వారంటైన్లో బిహార్ పోలీసుల విచారణ
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ మృతిపై బిహార్ పోలీసుల విచారణను అడ్డుకుంటున్నారని, ఈ కేసును క్వారంటైన్లోకి నెట్టారని మహారాష్ట్ర తీరును బిహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీ తప్పుపట్టారు. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు తనను క్వారంటైన్ చేయలేదని సుశాంత్ కేసు విచారణను క్వారంటైన్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ దాఖలైన నేపథ్యంలో కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముంబై చేరుకున్న పట్నా ఎస్పీ వినయ్ తివారీని కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా బీఎంసీ అధికారులు క్వారంటైన్ చేశారు. ఆగస్ట్ 15 వరకూ క్వారంటైన్లో ఉండాలని, ఆయనకు బీఎంసీ అధికారులు క్వారంటైన్ ముద్ర వేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జోక్యంతో క్వారంటైన్ నుంచి తివారీని బీఎంసీ అధికారులు విడుదల చేశారు.క్వారంటైన్లో ఉన్న బిహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని ఆయన స్వరాష్ట్రానికి వెళ్లేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు అనుమతించారు. కాగా తివారీని విడుదల చేయాలని బిహార్ పోలీసులు కోరడంతో క్వారంటైన్ గడువుకు వారం ముందుగానే ఆయనను విడుదల చేశామని బీఎంసీ అధికారి తెలిపారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై దర్యాప్తునకు సంబంధించి రియా చక్రవర్తి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ముంబైలోనీ ఈడీ కార్యాలయానికి చేరుకున్న రియాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. సుశాంత్కు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారి మళ్లించినట్టు రియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూన్ 14న బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని బాంద్రా నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. చదవండి : ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా? -
సరైన నిర్ణయం
మరణమే విషాదకరమైనదనుకుంటే అది వివాదస్పదమైనప్పుడు మరింత బాధిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మొన్న జూన్ 14న చనిపోయాక జరిగింది అదే. ఈ ఉదంతంపై అనేకులు కోరుతున్నట్టు సీబీఐ దర్యాప్తు చేయిస్తామని బుధవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది గనుక అటువంటి వారందరికీ ఉపశమనం దొరుకుతుందని భావించాలి. సుశాంత్ సింగ్ది ఆత్మహత్య కాదని, అది హత్యని కుటుంబసభ్యులు, మరికొందరు అంటుంటే... బాలీవుడ్ను శాసిస్తున్న కొందరు ప్రముఖులు అతన్ని అవమానించి, అతనికి అన్నివిధాలా అవరోధాలు సృష్టించి ఆత్మ హత్యకు ప్రేరేపించారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులు కోరుకుంటున్నట్టు సీబీఐ దర్యాప్తు జరపడమే సరైన నిర్ణయం అనడంలో సందేహం లేదు. చలనచిత్ర పరిశ్రమతో సంబంధం లేని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బాలీ వుడ్లో నిలదొక్కుకోవడం, విజయం సాధించడం మాటలు కాదు. ప్రతిభాపాటవాలు పుష్కలంగా వుంటే తప్ప ఎంతమాత్రం సాధ్యం కాదు. సినీ పరిశ్రమ కోట్లాది రూపాయల పెట్టుబడితో ముడిపడి వున్న రంగం. దాంతోపాటు బంధుప్రీతి కూడా అక్కడ అధికమే. అలాంటిచోట సుశాంత్ తనేమిటో నిరూపించుకున్నాడు. అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారూ, భిన్న సందర్భాల్లో ఆయన్ను దగ్గరగా చూసినవారూ ఆయన వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైన దని, మానవీయత గుండె నిండా నింపుకున్న వ్యక్తని చెబుతున్నారు. అటువంటి వ్యక్తి తన మరణ కారణం గురించి క్లుప్తంగానైనా చెప్పకుండా నిష్క్రమించాడంటే వారెవరూ సమాధానపడలేక పోతున్నారు. సుశాంత్ మరణంపై ఇన్నిరోజులుగా సాగిన వివాదం అవాంఛనీయమైనది. కుటుంబసభ్యులు, సన్నిహితులు సందేహాలు వ్యక్తం చేసిన వెంటనే వారికి సంతృప్తికలిగే విధంగా తగిన దర్యాప్తునకు ఆదేశించివుంటే ఈ వివాదం ఇలా ముదిరేది కాదు. సుశాంత్ది బలవన్మరణమైతే అందుకు కారకు లెవరో నిర్ధారించి, వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది హత్యే అయితే దుండగుల్ని సాధ్యమైనంత త్వరగా పట్టుకుని తగిన శిక్ష పడేలా చూడాలని ఆశి స్తారు. ఆత్మహత్య లేదా అసహజమైన మరణం జరిగినప్పుడు సీఆర్పీసీ సెక్షన్ 174 కింద ఆకస్మిక మరణంగా నమోదు చేస్తారు. ఆత్మహత్యగా కనబడితే ఎలాంటి లేఖ అయినా వదిలివెళ్లారా లేదా అనేది చూస్తారు. మరణించినవారి సన్నిహితుల్ని, సమీప ప్రాంతాల వారిని పోలీసులు ప్రశ్నిస్తారు. వారు చెప్పిన వివరాలను నమోదు చేస్తారు. పోస్టుమార్టం జరిపించి మృతుల శరీరంపై గాయాలే మైనా వున్నాయా అన్నది పరిశీలిస్తారు. వుంటే ఏ రకమైన వస్తువు లేదా ఆయుధంతో దాడి జరిగి వుంటుందో అంచనాకొస్తారు. మరణించినవారు ఏ లేఖ వదిలి వెళ్లకపోతే, సన్నిహితులు కూడా ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయకపోతే ఏసీపీ స్థాయి అధికారి ఆ దశలోనే కేసును మూసి వేస్తారు. హత్యగా భావిస్తే ఐపీసీ 302కింద, ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలొస్తే ఐపీసీ 306కింద కేసు నమోదు చేస్తారు. ముంబైలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి నగరానికి వచ్చిన ఆయన కుటుంబసభ్యులు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదని ముంబై పోలీసులు చెబుతున్నారు. అయితే బిహార్ పోలీసుల కథనం మరోలా వుంది. సుశాంత్ సన్నిహితురాలు రియా చక్రవర్తి ఈ ఆత్మహత్యకు పురిగొల్పిందని కుటుం బసభ్యులు ఆరోపించారని వారు చెబుతున్నారు. అందువల్లే ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటున్నారు. 2013నాటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం వారు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి ఉదంతం జరిగిన పరిధిలోని పోలీస్స్టేషన్కు బదిలీ చేయాలి. వారలా చేయకుండా దర్యాప్తు కోసం ముంబై వెళ్లారు. అయితే వారిపట్ల ముంబై పోలీసుల ప్రవర్తన కూడా సరిగా లేదు. ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారని, ఎవరినో కాపాడటమే ధ్యేయంగా అడుగులేస్తున్నారని వస్తున్న ఆరోపణల్ని బలపరిచే రీతిలో వారు అతిగా ప్రవర్తించారు. దర్యాప్తు కోసం వచ్చిన బిహార్ సీనియర్ ఐపీఎస్ అధి కారిని 14 రోజులు క్వారంటైన్లో వుండాలని శాసించి దిగ్భ్రాంతిపరిచారు. అంతేకాదు... పోస్టు మార్టం నివేదిక అడిగినా ఇవ్వలేదు. ఏమైతేనేం మొత్తానికి సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు త్వరలో మొదలవుతుంది. అయితే ఈ ఉదంతంలో భిన్న వర్గాలు స్పందించిన తీరు గురించి మాట్లాడుకోవాలి. కొన్ని చానెళ్లు ఈ ఉదం తంపై క్యాంపెయిన్ నడిపాయి. కొందర్ని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పులిచ్చాయి. ఇతరులు సరేసరి. సుశాంత్ సన్నిహితురాలు రియా చక్రవర్తిపై ఎవరికైనా అనుమానాలుండటం తప్పేమీ కాదు. కానీ ఆమె దోషిగా నిర్ధారణ అయినట్టే భావించి ఆమెను, ఆమె స్వరాష్ట్రమైన బెంగాల్ మహిళలను దూషిం చడం... నిజమో కాదో తేలకుండానే కోట్లాది రూపాయలు రియా కైంకర్యం చేసిందని ఆరోపించడం అనాగరికం. ముంబైలో మానవత చచ్చిపోయిందని, ఇది సురక్షితమైన ప్రాంతం కాదని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భార్య ట్వీట్ చేయడం కూడా పెను వివాదం రేపింది. ముంబై పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఆగి, వారు తేల్చేదేమిటో చూశాక మాట్లాడితే వేరుగా వుండేది. బిహార్కు చెందిన అన్ని పార్టీలూ దీన్ని బిహారీల ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బగా చూశాయి. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి గనుకే ఈ పార్టీలన్నీ ఈ స్థాయిలో స్పందించాయని, ఫిర్యాదు చేయా లంటూ సుశాంత్ కుటుంబసభ్యులపైనా ఒత్తిళ్లు వచ్చాయని కొందరి ఆరోపణ. ఏదేమైనా నిరాధా రమైన ఆరోపణలకూ, అనవసర నిందలకూ ప్రభావితం కాకుండా సీబీఐ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలి. కారకులెవరో తేలితే వారెంతటివారైనా కఠిన శిక్ష పడేలా చూడాలి.