T20 World Cup 2022
-
'పర్ఫెక్ట్ రివెంజ్' అంటే ఇదే.. ఇంగ్లండ్ లెక్క సరి చేసిన టీమిండియా
టీ20 వరల్డ్కప్ 2024 రెండో సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో గెలుపుతో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. గత వరల్డ్కప్ సెమీస్లో ఇంగ్లండ్ టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇందుకు ప్రతిగా టీమిండియా ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్లో ఇంగ్లండ్ 10 వికెట్లు పడగొట్టి చిత్తు చేసింది. టీమిండియా ఇంగ్లండ్ లెక్క సరి చేయడంతో భారత క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'పర్ఫెక్ట్ రివెంజ్' అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.THE WINNING CELEBRATION OF TEAM INDIA. 🇮🇳- History will be rewritten tomorrow. 🏆pic.twitter.com/atRTQyA1ZA— Mufaddal Vohra (@mufaddal_vohra) June 28, 20242022 ప్రపంచకప్ సెమీస్లో టీమిండియాను ఓడించి ఫైనల్స్కు చేరిన ఇంగ్లండ్.. తుది సమరంలో పాకిస్తాన్ను ఓడించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రస్తుత వరల్డ్కప్ సెమీస్లో ఇంగ్లండ్కు ఓడించి ఫైనల్స్కు చేరని భారత్.. తుది సమరంలో సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరిస్తుందని భారత క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.INDIA TOOK A PERFECT REVENGE OF 2022 SEMIS. 🇮🇳- England defeated India by 10 wickets in the 2022 Semi Final.- India took all 10 wickets of England in the 2024 Semi Final. pic.twitter.com/7OKz2yvrsT— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2024కాగా, నిన్న (జూన్ 27) జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్పై విజయం సాధించిన టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోహ్లి (9), దూబే (0) మరోసారి విఫలం కాగా.. పంత్ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్ టాప్లీ, జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో దక్కించుకున్నారు.అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్ (23), హ్యారీ బ్రూక్ (25), జోఫ్రా ఆర్చర్ (21), లివింగ్స్టోన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
CWC 2023: టీ20 వరల్డ్కప్ 2022 సీన్ను ఇంగ్లండ్ మళ్లీ రిపీట్ చేస్తుందా..?
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగి పటిష్టమైన ఇంగ్లండ్ను మట్టికరిపించారు. ప్రపంచకప్ టోర్నీల్లో తమకంటే చిన్న జట్ల చేతుల్లో ఓడటం ఇంగ్లండ్కు ఇది తొలిసారేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఈ జట్టు పసికూనల చేతుల్లో పరాభవాలు ఎదుర్కొంది. 1992లో జింబాబ్వే చేతిలో, 2011లో ఐర్లాండ్ చేతిలో, 2015 వరల్డ్కప్లో బంగ్లాదేశ్ చేతిలో, తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ టీమ్ ఊహించని ఎదురుదెబ్బలు తినింది. వన్డే ప్రపంచకప్ల్లో పరిస్థితి ఇదైతే.. టీ20 వరల్డ్కప్లోనూ ఇంగ్లండ్కు ఇలాంటి అనుభవమే ఓసారి ఎదురైంది. 2022 ఎడిషన్లో హేమాహేమీలతో నిండిన ఇంగ్లండ్ టీమ్.. ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో ఐర్లాండ్ ప్రత్యక్షంగా ఇంగ్లండ్ను ఓడించనప్పటికీ.. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఐర్లాండ్ను విజేతగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. నాడు తమకంటే చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న ఇంగ్లీష్ టీమ్.. ఆతర్వాత ఏకంగా టైటిల్నే ఎగరేసుకుపోయి వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది. ప్రస్తుత వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ మరోసారి 2022 టీ20 వరల్డ్కప్ సీన్ను రిపీట్ చేస్తుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, నిన్నటి (అక్టోబర్ 15) మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. -
WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఐసీసీ ఈవెంట్లో టాప్ స్కోరర్ జోస్ బట్లర్ అని అంచనా వేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వరల్డ్కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. తొలి మ్యాచ్ అక్కడే డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మెగా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెమీస్ చేరే జట్లపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రొటిస్ లెజెండ్ జాక్వెస్ కలిస్ వన్డే వరల్డ్కప్-2023లో అత్యధిక పరుగుల వీరుడిగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ నిలుస్తాడని జోస్యం చెప్పాడు. ఈ మేరకు ఐసీసీ షోలో మాట్లాడుతూ.. భారత పిచ్లపై అతడు ఈసారి మెరుగ్గా రాణిస్తాడని భావిస్తున్నా. ఇక ఇంగ్లండ్ ఈ వరల్డ్కప్లో కూడా మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉంది. భారత్లో వన్డే రికార్డు అంతంత మాత్రమే! ఈసారి బట్లర్ లీడ్ రన్ స్కోరర్గా నిలుస్తాడని విశ్వసిస్తున్నా’’ అని జాక్వెస్ కలిస్ చెప్పుకొచ్చాడు. కాగా ఇయాన్ మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా జోస్ బట్లర్ గతేడాది సారథ్య బాధ్యతలు చేపట్టాడు. తన కెరీర్లో ఇప్పటి వరకు అంతర్జాతీయ స్ధాయిలో 165 వన్డేలు ఆడిన బట్లర్ 41.49 సగటుతో 4647 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, భారత్లో మాత్రం అతడి వన్డే రికార్డు అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు భారత గడ్డపై 8 వన్డే మ్యాచ్లు ఆడిన బట్లర్.. కేవలం 83 పరుగులు చేశాడు. బెస్ట్ స్కోరు 31. ఈ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో జోస్ బట్లర్ టాప్ స్కోరర్గా నిలుస్తాడని జాక్వెస్ కలిస్ అంచనా వేయడం విశేషం. టీ20 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ ఇదిలా ఉంటే.. 2019 వరల్డ్కప్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘జోస్ బట్లర్ అద్భుతమైన నాయకుడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడు. బట్లర్ లాంటి ఆటగాడిని కెప్టెన్గా కలిగి ఉండటం ఇంగ్లండ్కు అదనపు బలం. కూల్ కెప్టెన్సీతో ఒత్తిడిని జయించి వరల్డ్కప్లో జట్టు రాణించేలా కృషి చేస్తాడనే నమ్మకం ఉంది’’ అని బట్లర్పై ప్రశంసలు కురిపించాడు. కాగా బట్లర్ సారథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్కప్-2022ను ఇంగ్లండ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కలిస్ వ్యాఖ్యల నేపథ్యంలో.. మరి వన్డేల్లో అద్భుత రికార్డులు కలిగి ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను బట్లర్ వెనక్కి నెట్టగలడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: వారెవ్వా.. నీరజ్! అత్యుత్తమ ప్రదర్శనతో ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత -
Virat Kohli: మళ్లీ రారాజుగా అవతరించు అని ఆ దేవుడే ఇలా!
Virat kohli Completes 15 Years As International Cricketer: ‘‘ఆ మ్యాచ్ ఆసాంతం విరాట్ కోహ్లి గురించే చర్చ. క్రికెట్ దేవుళ్లు అతడు పని పూర్తి చేయాలని దీవించారు. అప్పటికి అతడు అత్యుత్తమ ఫామ్లో లేడు. సొంత ప్రేక్షకుల నుంచే విమర్శలు. మీడియా అయితే.. అతడి వెంట పడింది. కానీ.. దేవుడు మాత్రం.. ఇది నీకై వేచిన వేదిక.. మునుపటి వైభవం అందుకో.. మళ్లీ రారాజుగా అవతరించు అని అతడిని ఆశీర్వదించినట్లుగా అనిపించింది. ఆరోజు మ్యాచ్ చూసిన వాళ్లకు విషయం అర్థమయ్యే ఉంటుంది. దాదాపు లక్ష మంది నేరుగా చూస్తుండగా.. 1.3 బిలియన్ల భారతీయులు, 30 కోట్ల మంది పాకిస్తానీలు ఆ అద్భుతాన్ని వీక్షించారు. ఆ రెండు సిక్సర్లు మహాద్బుతం క్రికెట్ ప్రపంచమంతా కోహ్లి ఆట కోసం ఎదురుచూసిన తరుణంలో.. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో ఆ రెండు సిక్సర్లు.. మహా అద్భుతం. అతడు తన రాజ్యంలోకి తిరిగి అడుగుపెట్టాడు. ఆరోజు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇలా జరగాలని అతడి విధిరాతలో రాసి ఉంది’’ అంటూ పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఆకాశానికెత్తాడు. కోహ్లి ఎల్లప్పుడూ కింగ్ కోహ్లిగానే ఉంటాడంటూ రన్మెషీన్పై ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20 వరల్డ్కప్-2022లో పాకిస్తాన్పై పరుగుల యంత్రం అద్భుత ఇన్నింగ్స్ను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో కొనియాడాడు. కాగా 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో శ్రీలంకతో వన్డే సిరీస్లో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్థానంలో ఓపెనర్గా బరిలోకి దిగాడు. పద్దెనిమిదేళ్ల వయసులో అరంగేట్ర మ్యాచ్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన విఫలమైన ఈ అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్.. అంచెలంచెలుగా ఎదుగుతూ రికార్డుల రారాజుగా పేరొందాడు. అయితే, ఆసియా టీ20 కప్-2022 ముందు వరకు కెరీర్లో తొలిసారి అత్యంత గడ్డుకాలం ఎదుర్కొన్న కోహ్లి.. ఈ మెగా ఈవెంట్ సందర్భంగా సెంచరీతో మునుపటి లయను అందుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్తో మ్యాచ్లో అతడి ఇన్నింగ్స్ వింటేజ్ కోహ్లిని గుర్తు చేసింది. సెంచరీల వీరుడిపై రావల్పిండి ఎక్స్ప్రెస్ ప్రశంసలు మెల్బోర్న్ మ్యాచ్లో 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి పాక్పై భారత్ మరోసారి పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్తో మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేశాడు. నేటి(ఆగష్టు 18)తో కోహ్లి అంతర్జాతీయ కెరీర్కు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్.. ఈ మేరకు తమ జట్టుపై కోహ్లి విధ్వంసకర ఇన్నింగ్స్ను గుర్తు చేస్తూ అతడికి శుభాభినందనలు తెలియజేశాడు. కాగా కోహ్లి ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 76 సెంచరీలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్! -
టీ20 వరల్డ్కప్ మాదిరే ఈసారి కూడా! ఇషాన్ను ఆడిస్తే రోహిత్ ‘డ్రాప్’.. మరి కోహ్లి?
India's decision-making ahead of the WC 2023 Big Worry Is: వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి టీమిండియా సన్నద్ధత సరిగా లేదంటూ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. మెగా ఈవెంట్కు ముందు అనవసర ప్రయోగాలతో సమయం వృథా చేస్తున్నట్లు అనిపిస్తోందన్నాడు. సొంతగడ్డపై ఐసీసీ టోర్నమెంట్ జరుగనున్న తరుణంలో అత్యుత్తమ తుదిజట్టు కూర్పు.. ముఖ్యంగా టాపార్డర్ విషయంలో తడబాటుకు లోనుకావడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నాడు. పిచ్చి ప్రయోగాలతో భారీ మూల్యం కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది. ఈ క్రమంలో మెగా ఈవెంట్కు ముందు టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో మూడు వన్డేలు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో స్వదేశంలో మరో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, విండీస్లో పిచ్చి ప్రయోగాలకు పోయి టీమిండియా భారీ మూల్యం చెల్లించిన సంగతి తెలిసిందే. తొలి వన్డే లోస్కోరింగ్ మ్యాచ్లో ఎలాగోలా గట్టెక్కిన టీమిండియా.. రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చి.. వన్డే వరల్డ్కప్నకు అర్హత సాధించని విండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఆగష్టు 1 నాటి నిర్ణయాత్మక మూడో వన్డేలో గనుక తేడా జరిగితే.. ఘోర పరాభవం తప్పదు. టీ20 వరల్డ్కప్ మాదిరే జరగదు కదా! ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘టీ20 వరల్డ్కప్-2022లో భారత జట్టు కుప్పకూలిన విధానం గుర్తుకువస్తోంది. మళ్లీ అదే పునరావృతం కాబోతోందా అన్న సందేహం నన్ను ఆందోళనకు గురి చేస్తోంది’’ అని పేర్కొన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాలో సెమీస్లోనే రోహిత్ సేన ఇంటిబాట పట్టిన తీరును ప్రస్తావించాడు. రోహిత్ను డ్రాప్ చేస్తే.. మరి కోహ్లి? ఇక.. బ్యాటింగ్ ఆర్డర్లో తరచూ మార్పులు సరికావన్న ఆకాశ్ చోప్రా.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కుదిరే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్లో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశమే లేదు. ఒకవేళ అదే జరిగితే అంతకంటే ఆశ్చర్యకర విషయం మరొకటి ఉండదు. కిషన్- శుబ్మన్ గిల్తో ఓపెనింగ్ చేస్తే రోహిత్ను మిడిలార్డర్కు డ్రాప్ చేస్తారా? ఇలాంటి నిర్ణయాలతో నేనైతే అస్సలు ఏకీభవించను. అలా జరగడానికి వీల్లేదు ఒకవేళ ఇదే జరిగితే.. విరాట్ కోహ్లిని నంబర్ 3 నుంచి తప్పించి తనను కూడా మిడిలార్డర్కు పంపించాల్సి వసుంది. ఇది అస్సలు సాధ్యమయ్యే పనే కాదు’’ అని ఆకాశ్ చోప్రా.. మేనేజ్మెంట్ తీరును ఉటంకిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్- కిషాన్లతో లెఫ్ట్- రైట్ కాంబినేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో వీలుపడదని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఇషాన్ను నాలుగో స్థానంలో ఆడించాలనుకున్నా.. అతడి నంబర్ 4 గణాంకాలు అత్యంత సాధారణంగా ఉన్నాయంటూ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! అసలు బుమ్రాకు ఏమైందని? పంత్ ఇన్నాళ్లుగా! డబ్బుంటే సరిపోదు: టీమిండియా దిగ్గజం -
ఇంగ్లండ్ క్రికెటర్ వలలో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని!
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన చర్యతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారారు. టి20 వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రిషి సునాక్ సరదాగా గడిపారు. తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్ స్ట్రీట్కు ఇంగ్లండ్ ఆటగాళ్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు. కెప్టెన్ బట్లర్ సహా సామ్ కరన్, డేవిడ్ మలాన్, ఫిల్ సాల్ట్, టైమల్ మిల్స్, రిచర్డ్ గ్లెసన్, క్రిస్ జోర్డాన్లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని రిషి సునాక్ వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ముందు బ్యాటింగ్లో కవర్ డ్రైవ్తో అలరించిన రిషి సునాక్ ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ వలలో చిక్కుకున్నాడు. జోర్డాన్ బంతిని పుల్ చేయబోయి స్లిప్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బౌలింగ్లో సామ్ కరన్ను క్లీన్బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సర్రీ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ఇక టి20 ఛాంపియన్స్గా నిలిచిన ఇంగ్లండ్ జట్టును అభినందించడానికి ప్రధాని రిషి సునాక్ తన నివాసానికి ఆహ్వనించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. స్వతహగా క్రికెట్ అభిమాని అయిన రిషి సునాక్ తమ దేశం పొట్టి క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్స్గా అవతరించడంతో వారిని సత్కరించాలని భావించారు. అందుకే ఆటగాళ్లకు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. కాగా గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. -
కోహ్లితో నాడు వాగ్వాదం.. పాక్ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు! కొడుకా అంటూ..
Virat Kohli: వన్డే వరల్డ్కప్ 2015.. ఫిబ్రవరి 15.. అడిలైడ్ ఓవల్ మైదానంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్.. చిరకాల ప్రత్యర్థుల పోరులో ఎప్పటిలాగే టీమిండియాదే పైచేయి.. ఈ విజయంలో ముఖ్యపాత్ర వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లిది! రన్మెషీన్ కోహ్లి దెబ్బకు.. దాయాది శిబిరంలో పేసర్ సొహైల్ ఖాన్ తీసిన ఐదు వికెట్లకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ మ్యాచ్లో మొత్తంగా 10 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చిన ఈ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, మహేంద్ర సింగ్ ధోని, అజింక్య రహానే వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక వికెట్లు తీసి సత్తా చాటినప్పటికీ కోహ్లి అద్భుత సెంచరీకి తోడు, రైనా 74 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు స్కోరు చేసింది టీమిండియా. భారత బౌలర్ల విజృంభణతో చతికిలపడ్డ పాకిస్తాన్ 224 పరుగులకే కుప్పకూలి 76 పరుగుల తేడాతో చిత్తైంది. కోహ్లి- సొహైల్ వాగ్వాదం అయితే, నాటి భారత్- పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లి- సొహైల్ ఖాన్ మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఆ ఘటన గురించి గుర్తు చేసుకున్న సొహైల్ ఖాన్.. కోహ్లితో గొడవ సందర్భంగా అన్న మాటలు వివాదాస్పదంగా మారాయి. బిడ్డా నువ్వు అండర్ 19లో ఆడుతున్నపుడే నాదిర్ అలీ పాడ్కాస్ట్లో మాట్లాడిన సొహైల్.. ‘‘నేను బ్యాటింగ్కి వెళ్లినపుడు.. విరాట్ కోహ్లి నా దగ్గరకొచ్చి.. కొత్తగా వచ్చావు.. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అన్నాడు. అప్పుడు నేను.. ‘‘కొడుకా(బిడ్డా).. నువ్వు అండర్ 19 క్రికెట్ ఆడుతున్నపుడు.. మీ బాపు (తనను తాను ఉద్దేశించి) టెస్టు క్రికెటర్ అని చెప్పాను’’ అన్నాడు. ఇక 2006 నుంచి తాను పాకిస్తాన్కు ఆడుతున్నానన్న సొహైల్.. గాయం కారణంగా కొన్నాళ్లు జట్టుకు దూరమైన విషయాన్ని చెప్పానన్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన సొహైల్కు అనూహ్యంగా నాటి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. అంత గొప్పగా ఏం లేదు ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2022లోనూ కోహ్లి ఒంటిచేత్తో పాక్తో మ్యాచ్లో భారత్ను గెలిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ బౌలింగ్లో కోహ్లి కొట్టిన సిక్స్ హైలైట్గా నిలిచింది. అయితే, సొహైల్ మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘హారిస్ రవూఫ్ బౌలింగ్లో కోహ్లి కొట్టిందేమీ మరీ అంత చెప్పుకోదగ్గ షాట్ కాదు. తనకు బౌలర్ ఇచ్చిన అవకాశాన్ని కోహ్లి సద్వినియోగం చేసుకున్నాడు అంతే’’ అని పేర్కొన్నాడు. కింగ్ ఫ్యాన్స్ ఫైర్ కాగా సొహైల్ ఖాన్ 2008 జనవరిలో జింబాబ్వేతో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టగా.. 2009లో శ్రీలంకతో మ్యాచ్లో టెస్టుల్లో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక కోహ్లి శ్రీలకంతో వన్డేలో 2008 ఆగష్టులో టీమిండియా తరఫున అరంగ్రేటం చేశాడు. 2011లో భారత్ తరఫున వెస్టిండీస్తో సిరీస్లో మొదటి టెస్టు ఆడాడు. ఇక సొహైల్ తాజా ఇంటర్వ్యూ నేపథ్యంలో కింగ్ కోహ్లి ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. ‘‘ఎప్పుడొచ్చామని కాదు.. ఎలా ఆడామన్నది ముఖ్యం. వయసు రాగానే సరిపోదు.. అందుకు తగ్గట్లు సంస్కారంగా ఉండటం నేర్చుకోవాలి. అవేవో గొప్ప మాటలు అయినట్లు మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నావా’’అని 38 ఏళ్ల సొహైల్కు చురకలు అంటిస్తున్నారు. కోహ్లి ముందు నువ్వు ఏమాత్రం పనికిరావంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్కు సచిన్ రావాల్సిందే! WC 2023: ప్రపంచకప్ టోర్నీ ‘అర్హత’ కోసం దక్షిణాఫ్రికా, లంక పోరు! ఆ సిరీస్ల ఫలితాలు తేలితేనే -
టీమిండియా కెప్టెన్గా హార్దిక్! సారథిగా రోహిత్ చివరి టీ20 అక్కడే!?
Hardik Pandya- Rohit Sharma- India ODI, T20I captain: టీమిండియాలో కెప్టెన్సీ విషయంలో మార్పు చోటు చేసుకోనుందా? పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథిగా రోహిత్ శర్మకు ఉద్వాసన పలికేందుకు బీసీసీఐ సిద్ధమవుతోందా? త్వరలోనే అతడి స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త కెప్టెన్గా నియమితుడు కావడం లాంఛనమే! అంటూ గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. 35 ఏళ్ల రోహిత్ శర్మ తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ వాదనలకు బలం చేకూరుతోంది. టెస్టు కెప్టెన్గా తొలి టూర్లో భాగంగా సౌతాఫ్రికాతో సిరీస్కు గాయం వల్ల రోహిత్ దూరమైన విషయం తెలిసిందే. అదే విధంగా ఇటీవల వివిధ సిరీస్లలోనూ విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉన్నాడు. కీలక సమయాల్లో వైఫల్యం ఇదిలా ఉంటే.. టీ20 కెప్టెన్గా ద్వైపాక్షిక సిరీస్లలో విజయవంతమైనా.. కీలకమైన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్-2022 టోర్నీల్లో మాత్రం తేలిపోయాడు ‘హిట్మ్యాన్’. బ్యాటర్గానూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక బంగ్లాదేశ్తో టూర్లో రెండో వన్డే సందర్భంగా గాయపడ్డ రోహిత్.. ఇంకా కోలుకోలేదు. దీంతో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అందుకేనా?! ఇక.. ఈ టూర్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వరుస సిరీస్లు ఆడాల్సి ఉంది. రోహిత్ ఇలాగే ఫిట్నెస్ సమస్యలతో సతమతమైతే గతంలో మాదిరే తరచూ కెప్టెన్లను మార్చాల్సిన దుస్థితి వస్తుంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఇప్పటికే పొట్టి క్రికెట్ ప్రపంచకప్ ఈవెంట్లో వైఫల్యం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ.. కెప్టెన్సీ విషయంలోనూ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రోహిత్ గైర్హాజరీలో ఇప్పటికే టీమిండియా టీ20 జట్టు సారథిగా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యాను పరిమిత ఓవర్ల క్రికెట్లో పూర్తిస్థాయి కెప్టెన్గా నియమించేందుకు సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్కు సమాచారం ఈ విషయం గురించి ఇప్పటికే హార్దిక్కు సమాచారం కూడా అందినట్లు కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ ఆలోచనపై స్పందించిన హార్దిక్.. తనకు కొంత సమయం కావాల్సిందిగా కోరినట్లు బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఏమో చూడాలి అయితే, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కెప్టెన్సీ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదని, సెలక్షన్ కమిటీ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. మరోవైపు... గాయం నుంచి రోహిత్ ఇంకా కోలుకోకపోవడంతో శ్రీలంకతో స్వదేశంలో టీ20 సిరీస్కు మాత్రమే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనున్నాడని ఇన్సైడ్ స్పోర్ట్ కథనం పేర్కొంది. అక్కడే రోహిత్కు ‘వీడ్కోలు’! కానీ, బీసీసీఐ మాజీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ముంబైలోని వాంఖడేలో శ్రీలంకతో తొలి మ్యాచ్. ఇది రోహిత్ హోం గ్రౌండ్. ఒకవేళ రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనుకుంటే సెలక్టర్లు, జై షా కలిసి అతడికి అక్కడే.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఘనమైన వీడ్కోలు ఇవ్వొచ్చు కదా!’’ అని పేర్కొనడం గమనార్హం. చదవండి: Ind VS Ban 2nd Test: టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్ను తప్పించి.. 12 ఏళ్ల తర్వాత.. 10 వికెట్లతో చెలరేగిన చైనామన్ స్పిన్నర్.. కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్ -
సూర్యకుమార్ యాదవ్.. ఈ ఏడాది టీ20ల్లో ప్రకంపనలు సృష్టించిన డైనమైట్
Year Ender 2022: పొట్టి క్రికెట్లో మునుపెన్నడూ లభించని మజా 2022లో దొరికిందనడం అతిశయోక్తి కాదు. టీ20 ఫార్మాట్లో ఈ ఏడాది జరిగిన అన్ని మ్యాచ్లు క్రికెట్ ప్రేమికుల ఊహలకు మించిన కనువిందు కలిగించాయని అనడం కాదనలేని సత్యం. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్కప్ టోర్నీలు ప్రేక్షకులను తారా స్థాయిలో రంజింపజేశాయి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ హోరాహోరీగా సాగిన ఈ సమరాల్లో సహజంగానే బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగింది. పొట్టి ఫార్మాట్లో బౌలర్లపై ఆనవాయితీగా కొనసాగుతున్న బ్యాటర్ల ఆధిపత్యం ఈ ఏడాది మరింత పెరిగిందనే చెప్పాలి. దాదాపు అన్ని దేశాలకు చెందిన కీలక ఆటగాళ్లు.. తమ విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. వీరి ధాటికి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ ఏడాది బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచిన బ్యాటర్ల జాబితాలో టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముందువరుసలో ఉన్నాడు. స్కై.. ఈ ఏడాది టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆడిన ప్రతి మ్యాచ్లో పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ బిరుదుకు న్యాయం చేశాడు. ఈ ఏడాది టీ20ల్లో స్కై ఆడిన కొన్ని షాట్లు చూసి విశ్లేషకులు నివ్వెరపోయారు. స్కై.. తొలి 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్కు ఏమాత్రం తీసిపోడని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఏడాది మొత్తం 31 టీ20 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్.. 46.56 సగటున, 187.43 స్ట్రయిక్ రేట్తో 1164 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. 32 ఏళ్ల సూర్యకుమార్ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగుల (1164) వీరుడిగా, అత్యధిక సిక్సర్లు (98) బాదిన ధీరుడిగా కొనసాగుతున్నాడు. ఓవరాల్గా 42 టీ20లు ఆడిన స్కై.. 44 సగటున, 181 స్ట్రయిక్ రేట్తో 1408 పరుగులు చేశాడు. ఓవరాల్గా సూర్య టీ20 కెరీర్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలే కాకుండా సూర్య ఈ ఏడాది టీ20ల్లో ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు, అంతకుమించిన అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే (2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ) ఆకాశమంత ఎత్తు ఎదిగిన సూర్యకుమార్.. ఈ ఏడాది టీమిండియాకు లభించిన ఆణిముత్యమని యావత్ క్రీడాప్రపంచం వేనోళ్లతో కొనియాడుతుంది. ఈ ఏడాది టీ20ల్లో సూర్యకుమార్ గణాంకాలు.. - వెస్టిండీస్తో 7 టీ20లు ఆడిన స్కై.. 179.25 స్ట్రయిక్ రేట్తో 242 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. - శ్రీలంకతో ఒక టీ20 ఆడిన స్కై.. 117.24 స్ట్రయిక్ రేట్తో 34 పరుగులు చేశాడు. - సౌతాఫ్రికాతో 4 టీ20లు ఆడిన స్కై.. 185.14 స్ట్రయిక్ రేట్తో 187 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. - ఐర్లాండ్తో 2 టీ20లు ఆడిన స్కై.. 250 స్ట్రయిక్ రేట్తో 15 పరుగులు చేశాడు. - ఇంగ్లండ్తో 4 టీ20లు ఆడిన స్కై.. 180.14 స్ట్రయిక్ రేట్తో 185 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. - ఆస్ట్రేలియాతో 3 టీ20లు ఆడిన స్కై.. 185.48 స్ట్రయిక్ రేట్తో 115 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - న్యూజిలాండ్తో 2 టీ20లు ఆడిన స్కై.. 124 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర సెంచరీ ఉంది. - బంగ్లాదేశ్తో ఒక టీ20 ఆడిన స్కై.. 185.50 స్ట్రయిక్ రేట్తో 30 పరుగులు చేశాడు. - ఆఫ్ఘనిస్తాన్తో ఒక టీ20 ఆడిన స్కై.. 300 స్ట్రయిక్ రేట్తో 6 పరుగులు చేశాడు. - హాంగ్కాంగ్తో ఒక టీ20 ఆడిన స్కై.. 261.53 స్ట్రయిక్ రేట్తో 63 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది. - నెదర్లాండ్స్తో ఒక టీ20 ఆడిన స్కై.. 204 స్ట్రయిక్ రేట్తో 51 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. - పాకిస్తాన్తో 3 టీ20లు ఆడిన స్కై.. 123.91 స్ట్రయిక్ రేట్తో 46 పరుగులు చేశాడు. - జింబాబ్వేతో ఓ టీ20 ఆడిన స్కై.. 244 స్ట్రయిక్ రేట్తో 61 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధసెంచరీ ఉంది. టీ20 వరల్డ్కప్-2022లో సూర్యకుమార్.. - 6 మ్యాచ్లు ఆడిన స్కై.. 189.68 స్ట్రయిక్ రేట్తో 239 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. సూర్య.. ఈ మెగా టోర్నీలో మూడో అత్యధిక రన్ స్కోరర్గా నిలిచాడు. ఆసియా కప్-2022లో సూర్యకుమార్.. - 5 మ్యాచ్లు ఆడిన స్కై.. 163.52 స్ట్రయిక్ రేట్తో 139 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ గణాంకాలతో పాటు సూర్యకుమార్ టీ20 ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అనతి కాలంతో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డుల్లోకెక్కాడు. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (నవంబర్) ఎవరంటే..?
Jos Buttler: నవంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు కోసం సహచరుడు ఆదిల్ రషీద్, పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదిల నుంచి పోటీ ఎదుర్కొన్న జోస్.. అత్యధిక శాతం ఓటింగ్తో ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన టీ20 వరల్డ్కప్-2022లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఇంగ్లండ్ను జగజ్జేతగా నిలిపిన బట్లర్.. తొలిసారి ఈ ఐసీసీ అవార్డును అందుకున్నాడు. వరల్డ్కప్ సెమీస్లో టీమిండియాపై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ను (49 బంతుల్లో 80 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరిగణలోకి తీసుకున్న ఐసీసీ ఈ అవార్డుకు జోస్ను ఎంపిక చేసింది. తనకు ఈ అవార్డు లభించడంపై బట్లర్ స్పందించాడు. తనకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ అతను ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫిమేల్ అవార్డును పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ సిద్రా అమీన్ గెలుచుకుంది. అమీన్.. నవంబర్లో ఐర్లాండ్లో జరిగిన వన్డే సిరీస్లో విశేషంగా రాణించి ఈ అవార్డుకు ఎంపికైంది. కాగా, ఈ అవార్డుకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్లో పాక్ ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డును గెలుచుకోగా, అక్టోబర్లో పాక్ మహిళా క్రికెటర్ నిదా దార్ ఈ అవార్డును దక్కించుకుంది. -
BCCI: తన గురించి వస్తున్న వార్తలను ఖండించిన మాజీ ఆల్రౌండర్
BCCI Selection Committee: జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టుకు తాను దరఖాస్తు చేసుకున్నానన్నంటూ వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ హేమంగ్ బదానీ స్పందించాడు. మీడియాలో తన గురించి వస్తున్న కథనాలు అవాస్తవమని కొట్టిపడేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ పానెల్లో భాగం కావడం గొప్ప గౌరవమని.. అయితే తాను మాత్రం ప్రస్తుతం ఎలాంటి పోస్టుకు అప్లై చేయలేదని స్పష్టం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లోనూ టీమిండియా సెమీస్లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా మేజర్ ఈవెంట్లలో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కొత్త సెలక్షన్ కమిటీ నియామకం నేపథ్యంలో దరఖాస్తులు స్వీకరించేందుకు నవంబరు 28ని చివరి తేదీగా ప్రకటించింది. ఈ క్రమంలో హేమంగ్ బదానీ కూడా అప్లై చేశారని, అంతేగాక సెలక్షన్ కమిటీ చైర్మన్ రేసులో కూడా ఉన్నాడంటూ అతడి పేరు వార్తల్లో నిలిచింది. నేనసలు అప్లై చేయలేదు ఈ విషయంపై స్పందించిన హేమంగ్ బదానీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘నా అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు.. మీ అందరికీ ఓ విషయంలో స్పష్టతనివ్వాలనుకుంటున్నాను. బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడిగా ఉండటం గొప్ప గౌరవం. అయితే, మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా నేను సెలక్షన్ కమిటీ పోస్టుకు దరఖాస్తు చేయలేదు. అప్లై చేసుకున్న వాళ్లందరికీ ఆల్ ది బెస్ట్’’ అంటూ బుధవారం ట్వీట్ చేశాడు. కాగా తమిళనాడు ఆల్రౌండర్ హేమంగ్ బదానీ.. 2000- 2004 వరకు టీమిండియా తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా, లెగ్ స్పిన్నర్ ఎల్ శివరామకృష్ణన్, సలీల్ అంకోలా తదితరులు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టులకు అప్లై చేసుకున్నారు. చదవండి: IND VS NZ 3rd ODI: చెత్త ఫామ్పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్ IND vs NZ: అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్ మాజీ క్రికెటర్ 🙏🏽🙏🏽 pic.twitter.com/WX2I1vXRxf — Hemang Badani (@hemangkbadani) November 30, 2022 -
పాకిస్తానీల మనసులు దోచుకున్న బెన్ స్టోక్స్.. ఫిదా అయిన ఫ్యాన్స్
3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. డిసెంబర్ 1 నుంచి రావల్పిండి వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం డిసెంబర్ 9 నుంచి రెండో టెస్ట్ (ముల్తాన్), 17 నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ (కరాచీ) ఆడుతుంది. ఇంగ్లండ్-పాక్ల మధ్య మరో రెండు రోజుల్లో తొలి టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం క్రికెట్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఇటీవల పాకిస్తాన్లో వరదలు ఊహించని భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రకృతి సృష్టించిన ఈ మహా విళయంతో పాక్లోని చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో పాక్లో వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుకు వచ్చాడు. I’m donating my match fees from this Test series to the Pakistan Flood appeal ❤️🇵🇰 pic.twitter.com/BgvY0VQ2GG — Ben Stokes (@benstokes38) November 28, 2022 తనవంతు సాయంగా పాక్తో ఆడే టెస్ట్ సిరీస్ ద్వారా వచ్చే మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని వరద బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. క్రికెట్ నాకు చాలా ఇచ్చింది, అందులో కొంత కష్టకాలంలో ఉన్న ప్రజలకు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది, నేను చేస్తున్న ఈ చిన్న సాయం వరద బాధితులకు ఏదో ఓ రకంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా అంటూ ఓ నోట్లో రాసుకొచ్చాడు. ఇంగ్లండ్ కెప్టెన్ చూపిన ఔదార్యం గురించి తెలిసి క్రికెట్ అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పాకిస్తానీలయితే స్టోక్స్ను ఆకాశానికెత్తుతున్నారు. రాజువయ్యా, మహరాజువయ్యా అంటూ కొనియాడుతున్నారు. టీ20 వరల్డ్కప్-2022 ఫైనల్లో అద్భుతంగా ఆడి టైటిల్ తమకు దక్కకుండా చేసినా స్టోక్స్ను శభాష్ అంటున్నారు. నీ దయా గుణానికి హ్యాట్సాఫ్ అంటూ సోషల్మీడియాను హోరెత్తిస్తున్నారు. -
‘పాపం పంత్’.. తప్పంతా వాళ్లదే! కొన్నాళ్లు అతడికి బ్రేక్ ఇస్తేనే వరల్డ్కప్లో
India tour of New Zealand, 2022- ‘‘ముందు అతడికి బ్రేక్ ఇవ్వండి. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ జట్టులోకి రావొచ్చని చెప్పండి. నిజానికి మేనేజ్మెంట్ తన విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది’’ అని టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ను ఉద్దేశించి భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చినప్పటికీ పంత్ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. వరుస వైఫల్యాలు.. అయినా అవకాశాలు అయినప్పటికీ, న్యూజిలాండ్తో ద్వైపాక్షిక సిరీస్లో ఆడే అవకాశం దక్కించుకున్న ఈ వికెట్ కీపర్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మెగా ఈవెంట్ అనంతరం కివీస్లో పర్యటనలో భాగంగా భారత జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైన అతడు.. టీ20 సిరీస్లో రెండు మ్యాచ్లలో ఓపెనర్గా చేసిన స్కోర్లు.. వరుసగా 6, 11. ఇక ఆరంభ వన్డేలో నాలుగో స్థానంలో వచ్చి 15 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్లో 36 పరుగులు చేశాడు. అయినప్పటికీ అతడికి రెండో వన్డలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పంత్పై విమర్శల వర్షం కురిపిస్తూ.. సంజూకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఫ్యాన్స్ బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో.. మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ పంత్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ తనను పూర్తిగా నిరాశపరిచాడని పేర్కొన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పు పంత్ది కాదు! ఎన్నడరా ఇది.. ‘‘రిషభ్ పంత్ విషయంలో మేనేజ్మెంట్ సరిగా లేదు. అతడిని సరిగ్గా హాండిల్ చేయలేకపోతున్నారు. తనకు కొంతకాలం బ్రేక్ ఇవ్వొచ్చు కదా! ఇంకో రెండు మూడు మ్యాచ్లలోనూ ఇలాగే వైఫల్యం చెందితే.. ఆ తర్వాత విశ్రాంతినివ్వడం లేదంటే పూర్తిగా పక్కన పెట్టేయడం చేస్తారా? నిజానికి రిషభ్ పంత్కు యాజమాన్యం ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో అతడు విఫలమవుతున్నాడు. అతడి ఆట తీరు నన్ను పూర్తిగా నిరాశ పరిచింది. ఎన్నడ పంతూ ఇది’’ అని చిక్కా.. పంత్ పట్ల మేనేజ్మెంట్ వైఖరిని విమర్శించాడు. లోపాల్ని సరిదిద్దుకుంటేనే.. ‘‘నీకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే ఎంతో బాగుండేది. ఒకవేళ ఈ మ్యాచ్లలో నువ్వు మెరుగ్గా స్కోరు చేసి ఉంటే.. మున్ముందు మరిన్ని కీలక మ్యాచ్లు ఆడే ఛాన్స్ వస్తుంది. వచ్చే ఏడాది వరల్డ్కప్ టోర్నీ ఉంది కదా! ఇప్పటికే చాలా మంది.. ‘‘పంత్ అస్సలు సరిగ్గా ఆడటం లేదు.. అతడికి జట్టులో చోటు అవసరమా?’’ అంటూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఇలాంటి సమయంలో నీపై ఒత్తిడి పెరగడం సహజం. కాబట్టి లోపం ఎక్కడ ఉందో నీకు నీవుగా తెలుసుకో! ప్రతిసారి ఎందుకు అంత తొందరగా వికెట్ పారేసుకోవాల్సి వస్తుందో ఆలోచించుకో’’ అని మాజీ ఓపెనర్ శ్రీకాంత్ యూట్యూబ్ వేదికగా పంత్కు సలహాలిచ్చాడు. చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్గా లక్ష్మణ్.. ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందుడుగు వేసిన అఫ్గనిస్తాన్ -
ఉమ్రాన్ ప్రపంచకప్లో ఆడకపోవడం మంచిదైంది.. మాలిక్ తండ్రి ఆసక్తికర వాఖ్యలు
న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమిపాలైనప్పటికీ.. భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు. తన తొలి వన్డే మ్యాచ్లోనే పేస్ బౌలింగ్తో పత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ మ్యాచ్లో తన 10 ఓవర్ల కోటాలో 66 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఐదు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఉమ్రాన్.. అఖరి ఐదు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఓవరాల్గా భారత్ మూడు వికెట్లు సాధిస్తే.. వాటిలో రెండు ఉమ్రాన్వే కావడం గమనార్హం. కాగా ఈ ఏడాది ఐపీఎల్ అదరగొట్టిన ఉమ్రాన్కు భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఐర్లాండ్ సిరీస్కు ఎంపికైన ఉమ్రాన్ అద్భుతంగా రాణించాడు. అయితే టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా సీనియర్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సెలక్టర్లు మాలిక్ను పక్కన పెట్టారు. అయితే టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభావం తర్వాత భారత జట్టులో ఉమ్రాన్ వంటి పేస్ బౌలర్లు ఉంటే బాగుండేది అని చాలా మంది మాజీలు అభిప్రాయపడ్డాడు. సెమీఫైన్లలో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేదు. దీంతో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక టీ20 ప్రపంచకప్కు ఉమ్రాన్ను ఎంపికచేయకపోవడంపై అతడి తండ్రి అబ్దుల్ రషీద్ తాజాగా స్పందించాడు. ఉమ్రాన్ అంతర్జాతీయ వన్డే ఆరంగ్రేటం గురించి న్యూస్ 18తో రషీద్ మాట్లాడుతూ.. "ఉమ్రాన్ టీ20 ప్రపంచకప్లో ఆడి ఉంటే బాగుండేది అందరూ అభిప్రాయపడుతున్నారు. మేము అయితే అతడు వరల్డ్కప్లో ఆడకపోవడం మంచిదైంది భావించాము. ఎందకుంటే ఏది ఎప్పడు జరగాలో అప్పుడే జరుగుతోంది. మనం అనుకున్న వెంటనే జరిగిపోదు కదా. మనం దేని వెనుక పరుగెత్తాల్సిన అవసరం లేదు. మాలిక్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. అనుభవజ్ఞులైన వారితో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకుంటున్నాడు. అతడు తన సీనియర్లు నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. ఉమ్రాన్ త్వరలోనే కీలక బౌలర్గా మారుతాడు. అందుకు మనం తొందరపడనవసరం లేదు. ఇప్పటికే జట్టులో చాలా మంది సీనియర్ బౌలర్లు ఉన్నారు. వారి తర్వాత ఉమ్రాన్కు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ తరపున ఆడుతున్నప్పుడు కేన్ విలియమ్సన్కు నెట్స్లో బౌలింగ్ చేసేవాడు. ఇప్పుడు ఒకరికొకరు ప్రత్యర్థులుగా నా భార్యకు చెప్పాడు. ఇది గురువు- శిష్యుడి మధ్య పోటీలా అనిపించింది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: మరోసారి విలన్గా మారిన వర్షం.. న్యూజిలాండ్- భారత్ రెండో వన్డే రద్దు -
‘టీమిండియాను ఓడించిన పాక్ లేకుండా.. అసలు ఆ టోర్నీ ఎవరు చూస్తారు?’ అంటూ..
ODI World Cup 2023- India Vs Pakistan- Ramiz Raja: ‘‘ఒకవేళ వాళ్లు ఇక్కడికి వస్తేనే మేము వరల్డ్కప్ టోర్నీ ఆడటానికి అక్కడికి వెళ్తాం. భారత జట్టు ఇక్కడికి రాకపోతే.. పాకిస్తాన్ లేకుండానే మెగా టోర్నీ ఆడుకోమనండి. భారత్లో వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ పాల్గొనపోతే.. ఆ ఈవెంట్లోని మ్యాచ్లను అసలు ఎవరు చూస్తారు?’’ అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా ప్రగల్భాలు పలికాడు. తమ జట్టు దూకుడైన ఆట తీరుకు మారుపేరుగా మారిందని.. ప్రపంచంలోని సంపన్న బోర్డుకు చెందిన జట్టును కూడా మట్టికరిపించిందంటూ గొప్పలకు పోయాడు. కాగా ఆసియా కప్-2023 టోర్నీ పాకిస్తాన్ వేదికగా నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. అక్కడ ఆసియా కప్.. ఇక్కడ వరల్డ్కప్ అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా.. భారత జట్టు పాక్కు వెళ్లే ప్రసక్తి లేదని గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పీసీబీ తమతో చర్చించకుండా.. తమకు సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా మాట్లాడతారంటూ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందిస్తూ.. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలా వద్దా అన్న అంశం ప్రభుత్వ పరిధిలోనిది అని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగానే తాము నడుచుకుంటామని పేర్కొన్నారు. వాళ్లను ఓడించాం కదా ఈ విషయం గురించి తాజాగా ఉర్దూ న్యూస్తో మాట్లాడిన పీసీబీ చీఫ్ రమీజ్ రాజా.. తమ విషయంలో బీసీసీఐ ప్రవర్తించే తీరుపైనే వరల్డ్కప్ ఆడాలా వద్దా అన్న నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ మార్కెట్కు చెందిన జట్టును మేము ఓడించాం. మా ఆట తీరు మెరుగుపరుచుకుని.. అత్యుత్తమంగా ఆడుతుంటేనే పాక్ క్రికెట్ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని నేను నమ్ముతాను. అందుకు తగ్గట్లుగానే టీ20 ప్రపంచకప్-2021లో మేము రాణించాం. టీమిండియాను ఓడించాం. తర్వాత ఆసియా కప్ టోర్నీలోనూ వాళ్లని మట్టికరిపించాం.బిలియన్ డాలర్ ఎకానమీ ఉన్న బోర్డుకు చెందిన జట్టును మేము రెండుసార్లు ఓడించాం. అంతేకాదు టీ20 వరల్డ్కప్-2022 ఫైనల్కు కూడా చేరుకున్నాం. రమీజ్ రాజా వాళ్లు ఇక్కడికి రాలేమని చెబితే.. మేమూ అక్కడికి వెళ్లం. పాక్లేని వరల్డ్కప్ టోర్నీని ఎవరు చూస్తారు?’’ అంటూ తమ జట్టును ప్రశంసిస్తూ.. టీమిండియాను తక్కువ చేసే విధంగా మాట్లాడాడు రమీజ్ రాజా. అతడి వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కాగా.. తాజా వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా చేతిలో ఓడిన విషయాన్ని మర్చిపోయారా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఆత్మవిశ్వాసం మంచిదేనని.. అయితే అతి విశ్వాసం ప్రదర్శిస్తే బొక్కబోర్లా పడకతప్పదంటూ రమీజ్ రాజాను ట్రోల్ చేస్తున్నారు. భారత జట్టును ఓడిస్తేనే మీది గొప్ప జట్టుగా మారిందన్న నీ వ్యాఖ్యలు మాత్రం నిజమని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రపంచకప్ టోర్నీలో ఆడకపోతే పాకిస్తాన్కు నష్టమని చురకలు అంటిస్తున్నారు. కాగా విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్తో ప్రపంచకప్-2022 టోర్నీలో పాక్ భారత్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. చదవండి: Umran Malik: ఉమ్రాన్ బౌలింగ్లో వైవిధ్యం లేదు.... ఇక వన్డేల్లోనే! అర్ష్దీప్ భేష్.. Ravindra Jadeja: వివాదాస్పదంగా జడేజా తీరు.. గాయం పేరు చెప్పి టూర్కు దూరం; కట్చేస్తే ఎన్నికల ప్రచారంలో -
టీమిండియాకు గుడ్ న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్తో పాటు పొట్టి ప్రపంచకప్కు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు బుమ్రా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది అతడు త్వరంలోనే మైదానంలోనే అడుగుపెట్టనున్నాడు. బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చేందుకు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన వర్కౌట్లకు సంబంధిచిన వీడియోను బుమ్రా ట్విటర్లో షేర్ చేశాడు. "అంత సులభమేం కాదు.. కానీ ఎల్లప్పుడూ విలువైనది" అంటూ క్యాప్షన్ పెట్టాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా బుమ్రా లేని లోటు టీ20 ప్రపంచకప్లో సృష్టంగా కన్పించింది. ఇంగ్లండ్తో సెమీఫైనల్లో భారత బౌలర్లు కేవలం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. దీంతో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన భారత్ అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. Never easy, but always worth it 💪 pic.twitter.com/aJhz7jCsxQ — Jasprit Bumrah (@Jaspritbumrah93) November 25, 2022 చదవండి: IPL 2023 Mini Auction: యువ బ్యాటర్ కోసం సంజూ శాంసన్ ప్లాన్! కేరళ ఆటగాడిపై రాజస్తాన్ కన్ను! -
‘వచ్చే ప్రపంచకప్ టోర్నీలోనైనా గెలవాలంటే ఐపీఎల్ ఆడడం మానేయండి'.. లేకుంటే
ద్వైపాక్షిక సిరీస్లలో తిరుగులేని జట్టుగా అవతరించిన భారత జట్టు.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం బోల్తా పడుతోంది. ఐసీసీ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుని దాదాపు పదేళ్లు కావస్తోంది. చివరిగా 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. ఆ తర్వాత నుంచి ఐసీసీ ట్రోఫీ భారత జట్టుకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక ఎన్నో అంచనాలతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లోకి బరిలోకి దిగిన భారత జట్టు సెమీఫైనల్లోనే తమ ప్రయాణాన్ని ముగించింది. మరోసారి ఐసీసీ టోర్నీల్లో నిరాశపరిచిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు వర్షం కురిసింది. భారత ఆటగాళ్లు తమ జట్టు కంటే ఐపీఎల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఆటగాళ్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ చేరాడు. జట్టులో స్ధిరత్వం లేకపోవడమే టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ ఇంటిముఖం పట్టింది అని ఆయన అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ కీడాతో లాడ్ మాట్లాడుతూ.. గత ఏడు- ఎనిమిది నెలల్లో భారత జట్టులో స్ధిరత్వం లేదు. ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీకి సిద్ధమైనప్పడు.. అందుకు తగ్గట్టు జట్టును తయారు చేసుకోవాలి. గత ఏడు నెలలో భారత ఇన్నింగ్స్ను ఒక్కోసారి ఒక్కొక్కరు ప్రారంభించారు. బౌలింగ్ విభాగంలో కూడా ప్రతీ సిరీస్కు బౌలర్లు మారుతునే ఉన్నారు. పనిభారం పేరుతో ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నామంటున్నారు. ప్రపంచ క్రికెట్లో మిగితా ఆటగాళ్లకు లేని వర్క్లోడ్ కేవలం భారత ఆటగాళ్లకు మాత్రమే ఉందా? ఒక వేళ పనిభారం ఎక్కవైతే ఐపీఎల్లో ఎందుకు ఆడుతున్నారు? మీరు ప్రపంచకప్ గెలవాలనుకుంటే ఐపీఎల్ ఆడకండి. వాళ్లు ప్రొఫెషనల్ క్రికెటర్లు కాబట్టి ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్కు అందుబాటులో ఉండాలి అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు -
ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు? జట్టుకు భారం.. అతడిని తీసుకుంటే: మాజీ క్రికెటర్
New Zealand vs India- Sanju Samson: ‘‘అతడు టీమిండియాకు భారంగా మారుతున్నాడు. వైఫల్యం ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోవడం ఎందుకు? అతడి స్థానంలో సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకురండి. ఒక ఆటగాడు తరచుగా విఫలమవుతున్నా.. అతడికి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇవ్వడం సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో భారీ మూల్యం చెల్లించకతప్పదు. కాబట్టి కొత్తవాళ్లకు కూడా ఛాన్స్లు ఇవ్వాలి’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ రితీందర్ సోధి అన్నాడు. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారని.. అయినా అతడు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని విమర్శించాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కారణంగా పంత్ ఎక్కువగా మ్యాచ్లు ఆడలేకపోయాడు. అయితే, కీలక మ్యాచ్లలో ఛాన్స్ ఇచ్చినా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఐసీసీ టోర్నీలో జింబాబ్వేతో మ్యాచ్లో 3, ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో 6 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. రిషభ్ పంత్ ఇక ఈ మెగా ఈవెంట్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్తో టీ20 సిరీస్లోనూ పంత్ విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. రెండో టీ20లో ఓపెనర్గా వచ్చి 6 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆఖరిదైన మూడో మ్యాచ్లో 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మరోవైపు మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు మాత్రం జట్టులో అవకాశాలు కరువయ్యాయి. సంజూకు అన్యాయం! తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ప్రతిభను నిరూపించుకుంటున్నప్పటికీ తుది జట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పంత్ స్థానంలో సంజూకు అవకాశం ఇవ్వాలంటూ.. ఈ కేరళ బ్యాటర్ పట్ల వివక్ష తగదని నెటిజన్లు బీసీసీఐ తీరును ఎండగడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సంజూ పేరును ట్రెండ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. పక్కన పెట్టేయండి! ఇక న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆరంభం నేపథ్యంలో పంత్ను విమర్శిస్తూ.. సంజూకు అవకాశం ఇవ్వాలంటూ రితీందర్ సోధి అతడికి మద్దతుగా నిలిచాడు. ‘‘పంత్కు ఇంకెన్ని అవకాశాలు వస్తాయో కాలమే నిర్ణయిస్తుంది. సమయం మించిపోకముందే అతడు కళ్లు తెరవాలి. అయినా ప్రతిదానికి ఓ హద్దంటూ ఉంటుంది. సుదీర్ఘ కాలం పాటు ఒకే ఆటగాడిపై ఆధారపడటం ఎంత వరకు సమంజసం. ఒకవేళ అతడు సరిగ్గా ఆడకపోతే.. నిర్మొహమాటంగా అతడిని పక్కనపెట్టాలి’’ అని సోధి.. సెలక్టర్లకు సూచించాడు. సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు ఇకనైనా అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. కాగా టీమిండియా తరఫున 25 పంత్ ఇప్పటి వరకు 27 వన్డేలు, 66 టీ20లు ఆడగా.. 28 ఏళ్ల సంజూ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇప్పటి వరకు కేవలం 26 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కాగా శుక్రవారం టీమిండియా కివీస్తో మొదటి వన్డేలో తలపడనుంది. చదవండి: Dinesh Karthik Retirement?: దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! భావోద్వేగ పోస్టు.. ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్ FIFA WC: అంతర్యుద్ధంతో కుటుంబం విచ్చిన్నం; అన్న ఘనాకు.. తమ్ముడు స్పెయిన్కు -
దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం..! ప్లీజ్ డీకే.. వద్దు అంటున్న ఫ్యాన్స్
Dinesh Karthik Shares Emotional Video: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తర్వలోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. ప్రపంచకప్లో ఆడాలన్న తన కలను నెరవేర్చుకోవడంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్లకు, తన అభిమానులకు కార్తీక్ కృతజ్ఞతలు తెలపడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఎన్నెన్నో జ్ఞాపకాలు.. డీకే భావోద్వేగం ఇన్స్టాగ్రామ్ వేదికగా కార్తీక్ భావోద్వేగ వీడియో ఇందుకు కారణమైంది. "టీమిండియా తరపున టీ20 ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో మేము విజయం సాధించకపోవచ్చు.. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన నా తోటి ఆటగాళ్లు, కోచ్లు, అభిమానులకు ధన్యవాదాలు’’ అంటూ డీకే ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశాడు. ఈ క్రమంలో కార్తీక్ వీడియోపై స్పందించిన అభిమానులు.. ‘‘ప్లీజ్ డీకే.. వద్దు.. ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించకు.. మేము దానికి ఇంకా సిద్ధంగా లేము’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు.. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు డీకే సంకేతాలు ఇచ్చాడని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో అదరగొట్టి.. రీ ఎంట్రీ ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అదరగొట్టిన కార్తీక్.. ఫినిషర్గా భారత జట్టులో పునరాగమనం చేశాడు. అయితే ఫినిషర్గా టీ20 ప్రపంచకప్ భారత జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్.. అంచనాలకు తగ్గట్టు రాణించడంలో విఫలమయ్యాడు. కీలక మ్యాచ్లలో పంత్ను కాదని డికేకు అవకాశం ఇచ్చినప్పటికీ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. దీంతో న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు కార్తీక్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా భారత్ ఎక్కువగా వన్డే సిరీస్లు ఆడనుంది. కాబట్టి కార్తీక్ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్కు కార్తీక్ కూడా గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: Shikhar Dhawan: కెప్టెన్గా కఠిన నిర్ణయాలు తీసుకుంటా! లోకాన్ని వీడేటపుడు ఏం పట్టుకుపోతాం! అంత మాత్రానికి.. View this post on Instagram A post shared by Dinesh Karthik (@dk00019) -
స్టార్ ఆల్రౌండర్కు ఊహించని షాక్.. ఏడాది పాటు నిషేధం
శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ చమికా కరుణరత్నేపై శ్రీలంక క్రికెట్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో బోర్డుకు సంబంధించిన పలు అగ్రిమెంట్లను కరుణరత్నే ఉల్లంఘించాడు. దీనిపై విచారణ జరిపేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది. అయితే కమిటీ విచారణలో నిబంధనలను ఉల్లంఘించినట్లు కరుణరత్నే అంగీకరించాడు. దీంతో ఏడాది పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా అతడిపై లంక క్రికెట్ బోర్డు వేటు వేసింది. అతడిపై నిషేదం విధించడమే కాకుండా 5000 వేల డాలర్ల( భారత కరన్సీ ప్రకారం రూ. 4లక్షలు) జరిమానా కూడా విధించింది. "టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా కరుణరత్నే బోర్డు నిబంధనలను ఉల్లంఘించాడు. అతడి చేసిన తప్పిదాలపై ముగ్గురు సభ్యలతో కూడిన విచారణ కమిటీని వేశాం. కమిటీ విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. అతడు ఇటువంటి తప్పిదాలకు మరోసారి పాల్పడకుండా గట్టిగా హెచ్చరించాలని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. దీంతో అతడిపై ఏడాది పాటు అన్ని రకాల క్రికెట్ ఆడకుండా కమిటీ నిషేదం విధించింది. అదే విధంగా 5000 వేల డాలర్ల ఫైన్ కూడా ఫైన్ కూడా చెల్లించాలంటూ అంటూ" శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసియాకప్-2022ను శ్రీలంక కైవసం చేసుకోవడంలో కరుణరత్నే కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఆఫ్గానిస్తాన్తో తొలి వన్డేకు ముందు లంక క్రికెట్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో తొలి వన్డే.. ఎక్స్ప్రెస్ పేసర్ ఎంట్రీ! సంజూ కూడా -
Team India: ద్వైపాక్షిక సిరీస్ల్లో జోరు.. మెగా టోర్నీల్లో బేజారు
రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక పొట్టి ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్ల్లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం నుంచి భారత జట్టు.. ఆడిన ప్రతి సిరీస్లోనూ జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. అయితే, మెగా టోర్నీల విషయానికి వస్తే మాత్రం టీమిండియా తేలిపోతుంది. ఒత్తిడి వల్లనో లేక కీలక ఆటగాళ్లు సమయానికి (కీలక టోర్నీలకు) అందుబాటులో లేకపోవడం వల్లనో.. కారణం ఏదైనా పెద్ద టోర్నీల్లో మాత్రం టీమిండియా దారుణంగా విఫలమవుతుంది. ఇటీవలి కాలంలో టీమిండియా ఆడిన టీ20 సిరీస్లపై లుక్కేస్తే.. స్వదేశంలో వెస్టిండీస్ (3-0), శ్రీలంక (3-0)లను క్లీన్ స్వీప్ చేసింది. ఆతర్వాత ఐర్లాండ్ పర్యటనలో 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ఆ వెంటనే ఇంగ్లండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆతర్వాత కరీబియన్ గడ్డపై 5 మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో, ఆ వెంటనే స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై 2-1 తేడాతో వరుస సిరీస్ విజయాలు సాధించింది. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇలా.. ఈ ఏడాది టీమిండియా ఆడిన 8 సిరీస్ల్లో వరుస విజయాలు సాధించి, ద్వైపాక్షిక సిరీస్ల్లో తిరుగులేని జట్టుగా నిలిచింది. అయితే, టీమిండియా ఈ జోరును మెగా ఈవెంట్లలో మాత్రం చూపలేకపోతుంది. ఆగస్ట్, సెప్టెంబర్లలో జరిగిన ఆసియా కప్లో సూపర్-4లోనే నిష్క్రమణ, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్లో సెమీస్లో ఓటమి.. ఇలా ఈ ఏడాది ఆడిన రెండు మేజర్ టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆసియా కప్లో అయితే పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో దారుణ పరాభావాలు (సూపర్-4) ఎదుర్కొని ముప్పేట దాడిని ఎదుర్కొంది. 2021 టీ20 వరల్డ్కప్లోనూ ఇదే పరిస్థితి ఏదురైంది. ఆ టోర్నీలో తొలి మ్యాచ్లోనే పాక్ చేతుల్లో ఓడి సూపర్-4కు కూడా అర్హత సాధించలేక పోయింది. ఇక తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్లో గ్రూప్ దశ సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం, సెమీస్కు వచ్చే సరికి ఆగిపోయింది. సెమీస్లో ఇంగ్లండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. -
నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం.. విండీస్ కెప్టెన్సీకి గుడ్బై
వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకు రాజీనామా చేశాడు. టీ20 ప్రపంచకప్లో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ విండీస్ కెప్టెన్సీ పూరన్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెళ్లడించాడు. కాగా ఈ ఏడాది కిరాన్ పోలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో పూరన్ విండీస్ సారధిగా ఎంపికయ్యాడు. కెప్టెన్గా ఎంపికైన పూరన్ జట్టును విజయ పథంలో నడిపించలేకపోయాడు. అంతేకాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా తీవ్ర నిరాశపరిచాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్లో ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి పసికూన చేతిలో ఓడి అవమానకర రీతిలో టోర్నీ నుంచి విండీస్ నిష్క్రమించింది. " టీ20 ప్రపంచకప్లో ఘోర ప్రదర్శన నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అప్పటి నుంచి కెప్టెన్సీ గురించి చాలా ఆలోచించాను. ఆఖరికి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కాగా విండీస్ కెప్టెన్సీ బాధ్యతలను అంకితభావంతో స్వీకరించాను. నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనప్పటినుంచి జట్టుకు నా వంతు కృషిచేశాను. కానీ ప్రపంచకప్లో మాత్రం అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. మాకు మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడేందుకు చాలా సమయం ఉంది. వచ్చే ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్కు మేము పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతాము" అని పూరన్ పేర్కొన్నాడు. అతడు 15 వన్డేలు, 15 టీ20ల్లో విండీస్ కెప్టెన్గా వ్యవహరించాడు. కేవలం నాలుగు వన్డేలు, నాలుగు టీ20ల్లోనే కెప్టెన్గా పూరన్ విజయవంతమయ్యాడు. కాగా విండీస్ వైస్ కెప్టెన్గా ఉన్న పావెల్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. "I remain fully committed to West Indies cricket." - @nicholas_47 pic.twitter.com/n0OvM1v7yw — Windies Cricket (@windiescricket) November 21, 2022 చదవండి: IND vs NZ: గెలిస్తే... సిరీస్ మన చేతికి.. సంజూ సామ్సన్, యువ పేసర్కు అవకాశం? -
వెస్టిండీస్ జట్టుకు కొత్త సారధి.. పాత కెప్టెన్పై వేటు..?
టీ20 వరల్డ్కప్-2022లో ఘోర వైఫల్యం చెంది.. పసికూనలైన ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల చేతుల్లో ఓడి, క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఇంటి బాట పట్టిన టూ టైమ్ టీ20 వరల్డ్కప్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టులో ప్రక్షాళన మొదలైంది. వరల్డ్కప్లోనే కాక కెప్టెన్గా ఎంపికైన నాటి నుంచి వ్యక్తిగతంగానూ ఘోరంగా విఫలమైన నికోలస్ పూరన్పై వేటుకు సర్వం సిద్ధమైంది. పరిమిత ఓవర్లలో విండీస్ కొత్త కెప్టెన్పై అధికారిక ప్రకటనే తరువాయి అని ఆ దేశ క్రికెట్ వర్గాలు ద్వారా తెలుస్తోంది. పూరన్ తదుపరి కెప్టెన్గా వైస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ ఖరారైందని విండీస్ క్రికెట్ బోర్డులోని కీలక వ్యక్తి వెల్లడించారు. తాజాగా రోవ్మన్ పావెల్ సారధ్యంలోని జమైకా స్కార్పియన్స్ జట్టు 11 ఏళ్ల తర్వాత సూపర్-50 కప్ కైవసం చేసుకోవడంతో జాతీయ జట్టు పగ్గాలు కూడా అతనికే అప్పజెప్పాలని విండీస్ క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. శనివారం (నవంబర్ 19)జరిగిన సూపర్-50 కప్ ఫైనల్లో జమైకా స్కార్పియన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు షాకిచ్చి టైటిల్ ఎగురేసుకుపోయింది. జమైకా స్కార్పియన్స్ టైటిల్ సాధించడంలో కెప్టెన్ రోవ్మన్ పావెల్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, వరల్డ్కప్-2022లో విండస్ ఘోర వైఫల్యం తర్వాత.. జట్టు ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
ఆస్పత్రిలో షాహీన్ ఆఫ్రిది.. ఫోటో షేర్ చేసిన స్పీడ్ స్టర్!
ఇంగ్లండ్తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ స్పీడ్స్టార్ షాహీన్ షా అఫ్రిది మెకాలి గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్ను వీడిన సంగతి తెలిసిందే. అయితే అతడు కేవలం మెకాలి గాయంతోనే కాకుండా అపెండిక్స్తో కూడా బాధపడుతున్నాడు. తాజాగా అఫ్రిది తన గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. అపెండెక్టమీ సర్జరీ చేయించుకున్నట్లు ట్విటర్ వేదికగా షాహీన్ వెల్లడించాడు. "ఈరోజు అపెండెక్టమీ చేయించుకున్నాను. అల్లా దయవల్ల బాగానే ఉన్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు దన్యవాదాలు" అంటూ షాహీన్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అతడి అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. కాగా గాయం తీవ్రత దృష్ట్యా అతడు సుమారు ఆర్నెళ్ల పాటు జట్టు నుంచి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వచ్చె నెలలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు ఆఫ్రిది దూరమయ్యే అవకాశం ఉంది. Had an appendectomy today but Alhumdulillah feeling better. Remember me in your prayers. 🤲 pic.twitter.com/M70HWwl9Cn — Shaheen Shah Afridi (@iShaheenAfridi) November 20, 2022 చదవండి: IND vs NZ: సూర్యకుమార్పై కోహ్లి ప్రశంసలు.. వీడియో గేమ్ ఇన్నింగ్స్ అంటూ! -
ఓపెనర్గా పంత్ వద్దు.. అతడిని పంపండి! విధ్వంసం సృష్టిస్తాడు
టీ20 ప్రపంచకప్లో ఘోర పరాభవం తర్వాత టీమిండియా కెప్టెన్సీ, ఓపెనింగ్ స్థానాల పైన తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. భారత టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించి హార్దిక్కు బాధ్యతలు అప్పజెప్పాలని పెద్ద సంఖ్యలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు టీ20ల్లో భారత ఓపెనర్గా రిషబ్ పంత్ను పంపాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ కూడా పంత్ను టీ20ల్లో ఓపెనింగ్ పంపాలని సూచించాడు. ఇక ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఒక వేళ రోహిత్ జట్టుకు దూరమైతే భారత ఓపెనర్గా రిషబ్ పంత్ను ఫస్ట్ చాయిస్గా భావించకూడదని ఆకాష్ చోప్రా అన్నాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. "ప్రస్తుతం భారత జట్టుకు ఒక విధ్వంసకర ఓపెనర్ అవసరం. పృథ్వీ షా రూపంలో టీమిండియాకు అద్భుతమైన అవకాశం ఉంది. అతడు విధ్వంసకర ఆటగాడు. పవర్ ప్లే జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించగలడు. కానీ అతడు ఫిట్గా లేడు, ఓపెనర్గా పనికిరాడని కొంతమంది భావిస్తున్నారు. దేశీవాళీ క్రికెట్లో ఓపెనర్గా అతడి రికార్డులు చూసి మాట్లాడాలి. అయితే ప్రతీ మ్యాచ్లోనూ చేలరేగుతాడని నేను చెప్పడం లేదు. బట్లర్, హేల్స్ వంటి వారు కూడా ప్రతీ మ్యాచ్లోనూ దూకుడుగా ఆడలేరు కదా. పృథ్వీ మీ దృష్టిలో లేకపోతే, ఇషాన్ కిషన్కు అవకాశం ఇవ్వండి. అతడు కూడా విధ్వంసక బ్యాటర్. ఒక్క సారి క్రీజులో నిలదొక్కకుంటే చెలరేగి ఆడుతాడు. అంతే తప్ప పంత్ను మాత్రం ఫస్ట్ ఛాయిస్ ఓపెనర్గా భావించకూడదు" అని పేర్కొన్నాడు. చదవండి: Rishabh Pant: రానున్న పదేళ్లలో టీ20 క్రికెట్లో పంత్దే హవా.. జట్టులో కీలక ప్లేయర్గా.. -
ఐపీఎల్లో కప్ సాధిస్తే.. టీమిండియా కెప్టెన్ చేయాలా? ఇదెక్కడి రూల్!
టీ20 ప్రపంచకప్లో ఘోర పరాభవం తర్వాత టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అదే విధంగా రోహిత్ స్ధానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్పాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రపంచకప్లో ఓటమి పాలైనంత మాత్రాన కెప్టెన్సీలో మార్పు చేయాలనడం సరికాదు అని అతడు అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో కప్ సాధిస్తే.. కెప్టెన్ చేస్తారా? తన యూట్యూబ్ ఛానల్లో భట్ మాట్లాడుతూ.. "హార్దిక్ పాండ్యాను ఎవరు కెప్టెన్ చేయాలని అనుకుంటున్నారో నాకు తెలియదు. అయితే అతడు అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఐపీఎల్లో కూడా కెప్టెన్గా విజయవంతమయ్యాడు. కానీ భారత్ వంటి అగ్రశ్రేణి జట్టును సారథిగా ముందుకు నడిపించడం అంత సులభం కాదు. అలా అయితే రోహిత్ శర్మ ఐపీఎల్లో ఐదు సార్లు కెప్టెన్గా టైటిల్ సాధించాడు. ఇప్పుడు వరల్డ్కప్లో విఫలమయ్యాడు కదా. అదే అతడు ఈ ప్రపంచకప్లో ఒకటి రెండు మంచి ఇన్నింగ్స్లు ఆడి ఉంటే.. కెప్టెన్సీ మార్పు గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఆసియాలో అది ఒక అనవాయితీ. కెప్టెన్గా ఒకట్రెండు సిరీస్లలో విఫలమైతే చాలు, కెప్టెన్సీ నుంచి తీసేయాలి, జట్టు నుంచి తొలిగించాలని డిమాండ్స్ వినిపిస్తాయి. ఆట గురించి పూర్తిగా తెలిసినవారు అలా మాట్లడారని నేను అనుకుంటున్నాను. అలా అయితే ఈ ఏడాది ప్రపంచకప్ను ఒకే ఒక కెప్టెన్ సాధించాడు. మిగిలిన జట్లు ఓడిపోయాయి. ప్రపంచకప్లో ఓటమిపాలైనందుకు మొత్తం 11 జట్ల కెప్టెన్లను మార్చమంటారా? ఇవన్నీ అవసరలేని చర్చలు’’ అని అతడు పేర్కొన్నాడు. చదవండి: భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 ఆలస్యం.. కారణమిదే -
టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా.. ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
భారత టీ20 జట్టులో కీలక మార్పులు చేపట్టేందుకు బీసీసీఐ సిద్దమైంది. ఇందులో భాగంగానే టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించాలి అని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను భారత టీ20 కెప్టెన్గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్కు ముందు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఉన్నత అధికారి ఒకరు ఇన్సైడ్స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దృవీకరించారు. "భారత టీ20 కెప్టెన్సీలో మార్పు చేసే సమయం అన్నమైంది. రోహిత్ కొన్నాళ్ల పాటు భారత కెప్టెన్గా కొనసాగాలని కొంత మంది భావిస్తున్నారు. కానీ అతడి వయస్సు దృష్ట్యా అతడి పని భారాన్ని తగ్గించాలి అనుకుంటున్నాము. అతడు మిగితా రెండు ఫార్మాట్ల్లో కెప్టెన్గా కొనసాగనున్నాడు. టీ20 ప్రపంచకప్- 2024 కోసం ఇప్పటి నుంచే మేము సన్నద్దం కావాలి. ఇందుకోసం భారత జట్టు కీలక మార్పులు చేపట్టేందుకు సిద్దమయ్యాము. ఇక టీ20ల్లో కెప్టెన్సీ రోల్కు హార్దిక్ పాండ్యా సరైనోడు అని భావిస్తున్నాము. మా తదుపరి టీ20 సిరీస్కు ముందు సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంటుంది" అని బీసీసీఐ అధికారి ఇన్సైడ్స్పోర్ట్తో పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్తో టీ20 సిరీస్ అనంతరం వచ్చే ఏదాది జనవరిలో శ్రీలంకతో టీ20లు ఆడనుంది. ఈ మధ్య కాలంలో భారత జట్టు కేవలం వన్డేలు, టెస్టు సిరీస్లు మాత్రమే ఆడనుంది. అంటే శ్రీలంకతో టీ20 సిరీస్కు ముందు కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న భారత టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. చదవండి: India-A vs BAN: బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్.. భారత-"ఏ" జట్టు కెప్టెన్గా పుజారా -
బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచిది: అఫ్రిది
టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్ ఫైనల్ చేరినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం అంతగా రాణించలేకపోయాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన బాబర్ కేవలం 124 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో బాబర్ కెప్టెన్సీపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు చేశారు. మరికొంత మంది బాబర్ కెప్టెన్గా పనికిరాడని, తప్పుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా బాబర్ను ఉద్దేశించి పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బాబర్ టీ20 కెప్టెన్సీని వదులుకుని వన్డేలు, టెస్టుల్లో జట్టును నడిపించడంపై దృష్టి సారించాలని అఫ్రిది సూచించాడు. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్లో కూడా పెషావర్ జల్మీ కెప్టెన్సీ బాధ్యతలు ఆజం చేపట్టకూడదని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ వరకు కరాచీ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన బాబర్.. వచ్చే ఏడాది సీజన్లో పెషావర్ జల్మీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. "బాబర్ ఆజంను నేను చాలా గౌరవిస్తాను. అందుకే అతడు టీ20 క్రికెట్లో కెప్టెన్సీ ఒత్తిడిని తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. అతడు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని వన్డే, టెస్టు ఫార్మాట్లపై దృష్టిపెట్టాలి. షాదాబ్, రిజ్వాన్, షాన్ మసూద్ వంటి వంటి ఆటగాళ్లకి టీ20 ఫార్మాట్లో జట్టును నడిపించే సత్తా ఉంది. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్లో కూడా బాబర్ సారథ్య బాధ్యతలు చేపట్టకూడదు. అతడు ప్రస్తుతం తన బ్యాటింగ్పై దృష్టిసారించాలని" సామా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: అతడు చాలా డేంజరేస్.. టీమిండియా ఓపెనర్గా రావాలి -
పచ్చబొట్టేసినా పిల్లదానా!.. నువ్వు లేకుంటే ఏమైపోయేవాడినో: సూర్యకుమార్
Suryakumar Yadav- Devisha Shetty: ‘‘నా అందమైన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రపంచం.. సమస్యల నుంచి గట్టెక్కించే నా ప్రియనేస్తం. నాలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగేలా.. కెరీర్పై దృష్టి పెట్టేలా ప్రోత్సహించే వ్యక్తి. ఒకవేళ నువ్వు నా జీవితంలో లేకుంటే నేను ఏమైపోయేవాడినో! నా జీవితంలో నాకు దక్కిన విలువైన బహుమతి’’ అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టిపై ప్రేమను కురిపించాడు. దేవిశా బర్త్డే సందర్బంగా ఆమెతో దిగిన ఫొటోను షేర్ చేసిన సూర్య.. తన సతీమణికి శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా సూర్యకుమార్- దేవిశాలది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ముంబై కాలేజీలో చదువుతున్న సమయంలో 2012లో తొలిసారిగా దేవిశాను కలిశాడు సూర్య. డ్యాన్స్ని చూసి ఫిదా ఆమె డ్యాన్స్ని చూసి ఫిదా అయ్యాడు. అప్పటికి దేవిశా వయసు 17 ఏళ్లు. సూర్యకు ఇరవై. ఆమెతో పరిచయం పెంచుకున్న సూర్య.. స్నేహితుడిగా మారి ప్రేమను గెలుచుకున్నాడు. ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి 2016లో వివాహం చేసుకున్నారు. ఇక తన ప్రతి విజయంలోనూ దేవిశా ప్రోత్సాహం ఉందంటూ సూర్య పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నాడు. ఐపీఎల్లో రాణిస్తున్న సమయంలో టీమిండియాలో చోటు కోసం ఎదురుచూసినపుడు ఏమాత్రం నిరాశకు లోనుకాకుండా తనలో స్ఫూర్తి నింపేదని పేర్కొన్నాడు. పచ్చబొట్టేసినా పిల్లదానా! భార్యపై ప్రేమను చాటుకోవడంలో ముందుండే సూర్య ఇలా పుట్టినరోజున ఆమెకు ఇలా విషెస్ చెప్పాడు. కాగా భార్యను తన పంచప్రాణాలుగా భావించే సూర్య కుమార్.. గుండెపై ఆమె పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడట మరి! ఇక ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ సందర్భంగా పొట్టి ఫార్మాట్ ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ 1గా నిలిచి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు సూర్య. ఈ మెగా ఈవెంట్లో టాప్ రన్స్కోరర్ విరాట్ కోహ్లి తర్వాత అత్యధిక పరుగులు సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనతో బిజీగా ఉన్నాడు ఈ మిడిలార్డర్ బ్యాటర్. చదవండి: IND vs NZ: బంతిని చూడకుండానే భారీ సిక్సర్.. శాంసన్తో అట్లుంటుంది మరి! View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
లంక క్రికెటర్ గుణతిలకకు బెయిల్
శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు కాస్త ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుణతిలకకు బెయిల్ మంజూరు అయింది. అయితే సోషల్ మీడియాకు మాత్రం దూరంగా ఉండాలని కోర్టు హెచ్చరించింది. ఇక టి20 ప్రపంచకప్ సమయంలో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు చేయడం సంచలం కలిగించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుణతిలక ఉన్న హోటల్కు వచ్చి అరెస్టు చేశారు. అప్పటినుంచి గుణతిలక కేసులో విచారణ జరుగుతుంది. అయితే స్థానిక కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో గుణతిలక అక్కడి సుప్రీంను ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు విచారణ చేపట్టి గుణతిలకకు కొన్ని కండీషన్స్పై బెయిల్ మంజూరు చేసింది. కేసు పూర్తయ్యేంత వరకు దేశం విడిచి వెళ్లరాదని.. 150,000 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానతో పాటు పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుంది. రెండురోజులకోసారి పోలిస్ రిపోర్టింగ్ ఇవ్వాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు గుణతిలకపై నిఘా ఉంటుందని.. తనపై కేసు పెట్టిన మహిళతో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోకూడదని తెలిపింది. ఇక ఈ కేసు మళ్లీ జనవరి 12న విచారణకు వచ్చే అవకాశముంది. ఇక టి20 ప్రపంచకప్లో సూపర్-12 దశలో లంక పోరాటం ముగియడంతో స్వదేశానికి వెళ్లిపోయింది. అయితే గుణతిలకను మాత్రం ఆస్ట్రేలియాలోనే వదిలేసింది. లైంగిక ఆరోపణలపై గుణతిలక అరెస్టైన వెంటనే అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక గుణతిలక లంక తరపున 47 వన్డేలు, 46 టి20లు, ఎనిమిది టెస్టులు ఆడాడు. చదవండి: ఆసీస్లో లంక క్రికెటర్ గుణతిలక అరెస్ట్ మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్, రక్షణ కూడా లేకుండా అమానుషంగా -
పాక్ దిగ్గజ బౌలర్తో అర్ష్దీప్ సింగ్కు పోలికా?! ఇలా మాట్లాడితే..
T20 World Cup 2022- Arshdeep Singh: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ ప్రభావం చూపగలిగాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న 23 ఏళ్ల అర్ష్ వరల్డ్కప్ ఎనిమిదో ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. ఆడిన ఆరు మ్యాచ్లలో మొత్తంగా 10 వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. కొత్త స్వింగ్ సుల్తాన్ ముఖ్యంగా బంతిని స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించి తనదైన ముద్ర వేయగలిగాడు ఈ లెఫ్టార్మ్ సీమర్. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేకపోవడంతో వచ్చిన వరుస అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా.. కొత్త స్వింగ్ సుల్తాన్ వచ్చేశాడు అంటూ అర్ష్దీప్ను ఆకాశానికెత్తాడు. మరికొందరేమో.. పాకిస్తాన్ దిగ్గజ బౌలర్, మాజీ పేసర్ వసీం అక్రమ్తో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ది గ్రేట్, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్తో అర్ష్దీప్ను పోల్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. వసీం అక్రమ్- జాంటీ రోడ్స్(PC: PTI) పోలిక వద్దు.. ఇలా మాట్లాడితే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువ బౌలర్పై ఇలాంటి పోలికలు ఒత్తిడిని పెంచుతాయని.. అతడి ఆటపై ప్రభావం పడుతుందని పేర్కొన్నాడు. ‘‘జస్ప్రీత్ బుమ్రా లాగే అర్ష్దీప్ సింగ్ కూడా కెరీర్ ఆరంభంలోనే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి అతడిలో మెండుగా కనిపిస్తోంది. డెత్ ఓవర్లలో బంతిని స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టగలుగుతున్నాడు. పవర్ ప్లేలోనూ పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నాడు. వసీం అక్రమ్ మాదిరి బౌలింగ్ చేయగలుగుతున్నాడు. కానీ ఇప్పుడే దిగ్గజాలతో పోలిస్తే అతడిపై ఒత్తిడి పెరుగుతుంది’’ 53 ఏళ్ల జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు. అర్ష్దీప్నకు మేటి బౌలర్గా ఎదగగల సత్తా ఉందని.. అతడి భవిష్యత్తు బాగుంటుందంటూ జోస్యం చెప్పాడు. చదవండి: Aus Vs Eng 1st ODI: స్టార్క్ అద్బుత ఇన్స్వింగర్.. షాట్ ఎలా ఆడాలిరా బాబూ! బిక్క ముఖం వేసిన రాయ్ FIFA World Cup Trophy History: ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీ ఎలా తయారు చేస్తారో తెలుసా? కోహ్లిని చూసి నేర్చుకో! మొండితనం పనికిరాదు.. జిడ్డులా పట్టుకుని వేలాడుతూ: పాక్ మాజీ క్రికెటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లిని చూసి నేర్చుకో! మొండితనం పనికిరాదు.. జిడ్డులా పట్టుకుని వేలాడుతూ
T20 World Cup 2022- Babar Azam: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మండిపడ్డాడు. మొండితనం వీడి ఇప్పటికైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని హితవు పలికాడు. అతడి స్వార్థం వల్ల జట్టు నష్టపోతోందని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని బాబర్కు సూచించాడు. నిస్వార్థంగా ఎలా ఉండాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాలని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో పాకిస్తాన్ రన్నరప్గా నిలిచినప్పటికీ బ్యాటర్గా బాబర్ ఆజం పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. మహ్మద్ రిజ్వాన్తో పాటు ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ లాహోర్ బ్యాటర్ సెమీస్లో న్యూజిలాండ్పై అర్ధ శతకం మినహా మిగతా మ్యాచ్లలో ఆకట్టుకోలేకపోయాడు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్- కోహ్లి జిడ్డులా పట్టుకుని వేలాడుతూ ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా బాబర్ ఆట తీరుపై విమర్శలు చేశాడు. ఓపెనింగ్ స్థానాన్ని జిడ్డులా పట్టుకుని వేలాడుతూ.. జట్టుకు నష్టం చేకూరుస్తున్నాడని ఫైర్ అయ్యాడు. ‘‘బాబర్ ఆజం చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. తన ఓపెనింగ్ స్థానాన్ని వదులుకోవడానికి అతడు ఇష్టపడటం లేదు. కరాచీ కింగ్స్తో ఉన్న సమయంలో అతడి ప్రవర్తన ఇలాగే ఉంది. నిజానికి తను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయలేడు. అందుకే ఇలా చేస్తున్నాడు. అయితే, బాబర్ ఇలా మొండిగా ఉండటం వల్ల పాకిస్తాన్ క్రికెట్కు కీడు చేసినవాడు అవుతాడు. ఓపెనర్ మరీ ఇంత నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభిస్తే ఎలా?’’ అంటూ కనేరియా ప్రశ్నించాడు. ఇక జట్టు ప్రయోజనాల గురించి ఎలా ఆలోచించాలో విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాలన్న డానిష్ కనేరియా.. ‘‘ఈ ప్రపంచంలో విరాట్ కోహ్లి లాంటి నిస్వార్థపరుడైన ఆటగాడు మరొకరు ఉండరు. కోహ్లిని చూసి నేర్చుకో తన సారథ్యంలో వరల్డ్కప్ ట్రోఫీ చేజారింది. దాంతో అతడు బలిపశువు అయ్యాడు. కెప్టెన్సీ వదులుకున్నాడు. ఆ తర్వాత జట్టులో అతడి స్థానం గురించి అనేక ప్రశ్నలు వచ్చాయి. అయితే, తను నిరాశ పడలేదు. కొత్త కెప్టెన్కు పూర్తిగా సహకారం అందిస్తూ.. అతడు ఏ స్థానంలో బ్యాటింగ్కు రమ్మంటే ఆ స్థానంలో వచ్చాడు. జట్టు కోసం చేయాల్సిదంతా చేస్తున్నాడు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు. అదరగొట్టిన కింగ్ టీ20 వరల్డ్కప్-2022లో విరాట్ కోహ్లి 296 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్పై 82 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లికి ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. మరోవైపు బాబర్ ఆజం మొత్తంగా 124 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: T20 WC 2022: బాబర్ చేసిన తప్పు అదే.. అందుకే పాకిస్తాన్ ఓడిపోయింది! లేదంటే Shaheen Afridi: నీకసలు సిగ్గుందా? నా ఎదురుగా నువ్వు ఉంటేనా: వసీం అక్రమ్ -
కెప్టెన్ మార్పు వద్దు.. ఇలా చేస్తే టీమిండియాకు తిరుగే ఉండదు..!
టీ20 వరల్డ్కప్-2022లో టీమిండియా వైఫల్యం చెందడంతో జట్టు ప్రక్షాళణకు సమయం ఆసన్నమైందని, కెప్టెన్ సహా సీనియర్లందరికీ ఉద్వాసన పలికాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో మాజీలు, అభిమానులు, విశ్లేషకులు ఎవరికి తోచిన విధంగా వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు. కెప్టెన్ను, సీనియర్లను తప్పించి ఉన్నపలంగా జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం వల్ల జట్టుకు చాలా నష్టం జరుగుతుందని హెచ్చరించాడు. కెప్టెన్ను మార్చాలనే చెత్త ప్రతిపాదనలను బీసీసీఐ అస్సలు పరిగణలోకి తీసుకోకూడదని, రోహిత్ టీమిండియా పగ్గాలు చేపట్టి ఓ సంవత్సరం కూడా కాలేదని, ఇంతలోనే కెప్టెన్ మార్పు తొందరపాటు నిర్ణయం అవుతుందని బీసీసీఐకి సూచించాడు. ఈ అంశాన్ని బీసీసీఐ పూర్తిగా పక్కకు పెట్టి, జట్టులో మార్పులపై ఫోకస్ పెట్టాలని కోరాడు. జట్టులో మార్పులపై అతనే ఫోర్ పాయింట్ ఎజెండాను రూపొందించాడు. Indian cricket going forward 1) Openers playing freely, At least one of them. 2) Wrist spinner (wicket taker ) is must. 3) Tear away fast bowler. 4) please don’t think changing captaincy will give us changed result. It’s the approach what needs to change. — Irfan Pathan (@IrfanPathan) November 15, 2022 మున్ముందు టీమిండియా సక్సెస్ సాధించాలంటే.. మొదటగా ఓపెనర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలి, ముఖ్యంగా ఓపెనర్లలో ఒకరు ధాటిగా బ్యాటింగ్ చేయాలి. తుది జట్టులో వికెట్ టేకింగ్ రిస్ట్ స్పిన్నర్ తప్పక ఉండేలా చూసుకోవాలి కాస్తో కూస్తో బ్యాటింగ్ చేయగల నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ తుది జట్టులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పటికిప్పుడు కెప్టెన్ను మార్చాలనే ఆలోచనను పూర్తిగా విరమించుకోవాలని పై పేర్కొన్నవన్నీ అమలు చేయగలిగితే టీమిండియాకు తిరుగే ఉండదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు అతను ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. కాగా, టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలని ఇర్ఫాన్ పఠాన్ ఇటీవలే ఓ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్కప్ నేపథ్యంలో బీసీసీఐ.. హార్ధిక్ను కెప్టెన్గా పరిగణిస్తే, అతనితో పాటు మరో స్టాండ్ బై కెప్టెన్ను కూడా తయారు చేసుకోవాలని సూచించాడు. తరుచూ గాయాల బారిన పడే హార్ధిక్ను కెప్టెన్గా చేస్తే.. కీలక టోర్నీలకు ముందు అతను గాయపడితే, అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే ఇప్పటి నుంచే ఇద్దరు కెప్టెన్లను లైన్లో పెట్టుకుంటే మంచిదని అభిప్రాయపడ్డాడు. చదవండి: WC 2024: నేనే చీఫ్ సెలక్టర్ అయితే ఇలా చేస్తా! ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు! -
'అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగేది'.. పాకిస్తాన్ దిగ్గజం సంచలన వాఖ్యలు!
టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో పాకిస్తాన్ ఓటమిని ఆ దేశ మాజీ క్రికెటర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమ జట్టుపై పాక్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ కీలక వాఖ్యలు చేశాడు. విదేశీ కోచ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించడాన్ని మియాందాద్ తప్పు బట్టాడు. విదేశీ కోచ్ల వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రస్తుత ఆటగాళ్ల భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడుతుందని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ఘటనలకు దారితీస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ మోంటార్గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్.. బౌలింగ్ కోచ్గా షాన్ టైట్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ సహాయక సిబ్బందిలో భాగమైన వెరోన్ ఫిలాండర్ గురించి జావేద్ను ప్రశ్నించగా.. అతడు వ్యంగ్యంగా స్పందించాడు. 'వాళ్లను ఈ స్టూడియోకి తీసుకురండి. వాళ్లకి క్రికెట్ గురించి ఎంత తెలుసో మాట్లాడాలి' అంటూ జావేద్ బదులిచ్చాడు. అదే విధంగా గతంలో పాకిస్తాన్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు తరచుగా జరిగిందనే విషయమై మియాంద్ మాట్లాడాడు. "గతంలో పాకిస్తాన్ తరుపున ఆడిన క్రికెట్లరను చూడంది. వాళ్లు రిటైర్మెంట్ అయ్యాక ఖాళీగా ఉండిపోయారు. నేను నా గురించి మాట్లాడటం లేదు. గతంలో నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వెళ్లలేదు. ప్రస్తుత ఆటగాళ్ల సంగతి ఏంటి? వాళ్లు ఎక్కడికి వెళ్లినా రాణించలేరు. ఇది ఆటగాళ్లను ఫిక్సింగ్కు పాల్పడేలా ప్రేరేపిస్తుంది. ప్రతీ ఒక్కరు తమ కెరీర్ కోసం భయపడతారని" అని పాకిస్తానీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మియాంద్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: 'అంతా బాగానే ఉంది'.. మధ్యవర్తిగా పనిచేసిన ధోని! జడ్డూ ట్వీట్ వైరల్ -
WC 2022: ‘టీమిండియా చెత్త ప్రదర్శన.. చరిత్రలోనే’! కౌంటర్ ఇచ్చిన కెప్టెన్
India tour of New Zealand, 2022- Hardik Pandya: టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై భారత ఆల్రౌండర్, తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. భారత జట్టు ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదంటూ కౌంటర్ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో సెమీస్లోనే నిష్క్రమించడం నిరాశ కలిగించిన మాట వాస్తమని.. అయితే ఆటలో ఇవన్నీ సహజమేనని పేర్కొన్నాడు. పొరపాట్లు సరిచేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు. టీమిండియా చెత్త ప్రదర్శన అంటూ కాగా వరల్డ్కప్-2022 రెండో సెమీ ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్.. ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తు చేసి చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరుగనున్న మరో ఐసీసీ టోర్నమెంట్కు క్రికెట్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ది టెలిగ్రాఫ్నకు రాసిన కాలమ్లో మైఖేల్ వాన్.. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 జరుగనున్నప్పటికీ టీమిండియా ఎప్పటికీ ఫేవరెట్ కాలేదని విమర్శించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ప్రదర్శన అస్సలు బాగాలేదని.. చరిత్రలో ఇంత చెత్తగా ఎవరూ ఆడలేదని.. ఇంగ్లండ్ను చూసి నేర్చుకోవాలంటూ అవాకులు చెవాకులు పేలాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. వాన్కు కౌంటర్ ఇచ్చిన హార్దిక్! ఈ నేపథ్యంలో టీ20 సిరీస్కు సారథిగా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా.. మైకేల్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించాడు. ‘‘మా పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతాం. అంతేగానీ ఎవరి ముందో మేము ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. ఈ టూర్లో కీలక ఆటగాళ్లు లేరు. యువకులకు ఈ సిరీస్ చక్కని అవకాశం. మా జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. గత ఏడాది, ఏడాదిన్నర కాలంగా జట్టుకు ఆడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త జట్టు, కొత్త ఉత్సాహం.. నూతనోత్తేజం.. ఈ సిరీస్ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా న్యూజిలాండ్లో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. చదవండి: India tour of New Zealand: టీమిండియా న్యూజిలాండ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు Kane Williamson: నన్ను రిలీజ్ చేస్తారని ముందే తెలుసు.. అయినా హైదరాబాద్తో: కేన్ మామ భావోద్వేగం -
బాబర్ చేసిన తప్పు అదే.. అందుకే పాకిస్తాన్ ఓడిపోయింది! లేదంటే
టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో రెండో సారి ఛాంపియన్స్గా నిలవాలన్న పాక్ కల నేరవేరలేదు. కాగా ఫైనల్లో ఆఫ్రిది స్థానంలో ఇఫ్తికర్ ఆహ్మద్ను బౌలింగ్ చేయంచడాన్ని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తప్పుబట్టాడు. ఏం జరిగిందంటే ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 16 ఓవర్ వేయడానికి వచ్చిన పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిది గాయం కారణంగా కేవలం ఒక్క బంతి మాత్రమే వేసి ఫీల్డ్ను వీడాడు. దీంతో ఆ ఓవర్లో మిగిలిన ఐదు బంతులను ఇఫ్తికర్ ఆహ్మద్తో బాబర్ బౌలింగ్ చేయించాడు. అయితే ఈ ఐదు బంతుల్లో ఇఫ్తికర్ 13 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మలుపు తిరిగింది. అనంతరం పాకిస్తాన్కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఇంగ్లండ్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. అయితే ఐదు బంతులను నవాజ్తో పూర్తి చేసి ఉంటే బాగుండేది అని సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. బాబర్ చేసిన తప్పు అదే "ఈ మ్యాచ్లో షాహీన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆరంభంలోనే ఫామ్లో ఉన్న హేల్స్ వికెట్ పడగొట్టాడు. అయినప్పటికీ పవర్ప్లేలో ఐదో ఓవర్ ఆఫ్రిదికి ఎందుకు ఇవ్వలేదో నాకు ఇప్పటికీ ఆర్ధం కాలేదు. ఆ సమయంలో బంతి అద్భుతంగా స్పింగ్ అవుతోంది. అటువంటి సమయంలో బాబర్.. షహీన్, నసీమ్ షాతో వరుస ఓవర్లు బౌలింగ్ చేయాల్సింది. ఎందుకంటే బంతి స్వింగ్తో పాటు ఇంగ్లండ్ కూడా ఒత్తడిలో ఉంది. అప్పుడు షాదాబ్ ఖాన్తో బాబర్ బౌలింగ్ వేయించాడు. ఈ నిర్ణయం ఇంగ్లండ్ బ్యాటర్లపై ఎటువంటి ప్రభావం చూపలేదు. షాహీన్ తన సెకెండ్ స్పెల్ కోటాను గాయం కారణంగా పూర్తి చేయలేకపోయాడు. బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్నాడు కాబట్టి ఆఫ్రిది ఓవర్ పూర్తి చేయంచడానికి బాబర్ ఇఫ్తికర్ అహ్మద్ని తీసుకువచ్చాడు. అది కచ్చితంగా సరైన నిర్ణయం కాదు. మహ్మద్ నవాజ్ పాకిస్తాన్ ప్రధాన బౌలర్. అతడితో ఓవర్ పూర్తి చేయాల్సింది. కానీ బాబర్ అలా చేయలేదు. ఆ ఒక్క ఓవర్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది" అని యూట్యూబ్ ఛానల్లో సల్మాన్ భట్ పేర్కొన్నాడు. చదవండి: IRE vs PAK: పాకిస్తాన్కు ఘోర పరాభవం.. చిత్తు చేసిన ఐర్లాండ్! సిరీస్ సొంతం -
సూర్య అగ్రస్థానం పదిలం.. 22 స్థానాలు ఎగబాకిన అలెక్స్ హేల్స్
ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ అలెక్స్ హేల్స్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో దుమ్మురేపాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో హేల్స్ ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు. టి20 ప్రపంచకప్లో టీమిండియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అలెక్స్ హేల్స్ 47 బంతుల్లోనే 86 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ ప్రపంచకప్లో అలెక్స్ హేల్స్ 212పరుగులు సాధించి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ మాత్రం నెంబర్వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. టి20 ప్రపంచకప్లో 239 పరుగులు చేసిన సూర్యకుమార్ టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్వన్గా ఉన్న సూర్యకుమార్ ఖాతాలో 859 పాయింట్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 778 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకోగా.. ఒక స్థానం పడిపోయిన న్యూజిలాండ్ బ్యాటర్ డెవన్ కాన్వే 771 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా మార్ర్కమ్, డేవిడ్ మలాన్, రిలీ రొసౌ, గ్లెన్ ఫిలిప్స్, ఆరోన్ ఫించ్, పాతుమ్ నిస్సాంకలు ఉన్నారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఇంగ్లండ్ బౌలర్లు ఆదిల్ రషీద్, సామ్ కరన్లు ముందంజ వేశారు. టి20 ప్రపంచకప్లో టీమిండియాతో సెమీఫైనల్, పాకిస్తాన్తో ఫైనల్లో మంచి ప్రదర్శన కనబరిచిన రషీద్ ఐదు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలవగా.. ఆల్రౌండర్ సామ్ కరన్ రెండు స్థానాలు ఎగబాకి టాప్-5కి చేరుకున్నాడు. ఇక లంక స్పిన్నర్ వనిందు హసరంగా 704 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆఫ్గన్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. Top #T20WorldCup performers biggest gainers in the latest @MRFWorldwide ICC Men’s T20I Player Rankings. Details 👇https://t.co/MKEWVUpZCs — ICC (@ICC) November 16, 2022 చదవండి: అశ్విన్ విషయంలో రాజస్తాన్ రాయల్స్ దిమ్మతిరిగే కౌంటర్ -
ఐపీఎల్ 2023 వేలంలో కోట్లు కొల్లగొట్టబోయే ఆటగాళ్లు వీళ్లే..!
టీ20 వరల్డ్కప్-2022లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెందిన ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్-2023 మినీ వేలంలో ఆ ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు ఎంత సొమ్మునైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే తమ మనీ పర్స్ లెక్కలు కూడా సరి చేసుకున్నాయి. మినీ వేలంలో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరంటే.. తొలుత ప్రస్తావన వచ్చే పేర్లు బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), సామ్ కర్రన్ (ఇంగ్లండ్), కెమరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), జాషువ లిటిల్ (ఐర్లాండ్), రిలీ రొస్సో (సౌతాఫ్రికా), అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్), సికందర్ రజా (జింబాబ్వే). ఈ లిస్ట్ చాంతాడంత ఉన్నప్పటికీ వేలంలో వీరిపై మాత్రం కనక వర్షం కురిసే అవకాశం ఉంది. టీ20 వరల్డ్కప్-2022లో వీరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఫ్రాంచైజీలు వీరిపై ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాక బంగ్లాదేశ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ లిటన్ దాస్, ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్ లాంటి ఆటగాళ్ల కోసం కూడా తీవ్రంగా పోటీ నడిచే అవకాశం ఉంది. అత్యధిక ధర పలికే అవకాశం ఉన్న ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ కోసం కనీసం 12 కోట్లు, సామ్ కర్రన్ కోసం 10 కోట్లు, కెమరూన్ గ్రీన్ కోసం 8 కోట్లు, ఐర్లాండ్ పేసర్ జాషువ లిటిల్ కోసం 6 కోట్లు, రిలీ రొస్సో, అలెక్స్ హేల్స్, సికందర్ రజాల కోసం తలా 4 కోట్లు వెచ్చించేందుకు ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్లు వేసుకున్నట్లు సమాచారం. అలాగే లిటన్ దాస్, హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్, ఆదిల్ రషీద్, కేశవ్ మహారాజ్లపై తలో 2 కోట్లు వెచ్చించే ఛాన్స్ ఉంది. వీరే కాక, ఆయా జట్లు రిలీజ్ చేసిన ఆటగాళ్లలో జేసన్ రాయ్, కేఎస్ భరత్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, జేమ్స్ నీషమ్, డేనియల్ సామ్స్, ఎవిన్ లూయిస్, జేసన్ హోల్డర్, మనీశ్ పాండే కోటి నుంచి 2 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
'రోహిత్ పని అయిపోయింది.. ఆ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయండి'
టీ20 ప్రపంచకప్-2022 సెమీస్లోనే టీమిండియా ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టు మేనేజేమెంట్పై కూడా ఇంకా విమర్శల వర్షం కురుస్తోంది. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు వరుసగా రెండు మేజర్ టోర్నమెంట్లలో ఓటమి చవిచూసింది. ఆసియాకప్లోనూ విఫలమైన రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్లోనూ తమ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయింది. ఈ క్రమంలో భారత జట్టు ప్రక్షాళనకు సమయం అసన్నమైంది క్రికెట్ నిపుణులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది రోహిత్ శర్మను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. కెప్టెన్గా రోహిత్ సమయం ముగిసిందని హార్దిక్ పాండ్యా లేదా రిషబ్ పంత్లకు బాధ్యతలు అప్పజెప్పాలని అతడు సూచించాడు. "టీ20 ఫార్మాట్లో భారత కెప్టెన్గా రోహిత్ సమయం ముగిసిందని భావిస్తున్నాను. అయితే రెండు ప్రపంచకప్లను దృష్టిలో పెట్టుకుని రోహిత్ను కెప్టెన్గా చేశారు. కానీ అతడిని కెప్టెన్గా కొనసాగించడం ద్వారా భారత్ క్రికెట్కు ఎటువంటి లాభం లేదు. మీ ముందు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ రూపంలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పండి. ఇక ఆడిలైడ్లో ఏమి జరిగిందో నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. భారత్ ఓటమిని జీర్ణించుకోలేపోతునున్నాను. ఇంగ్లండ్ షార్జాలో బ్యాటింగ్ చేసినట్లు నాకు అనిపించింది. ఈ మ్యాచ్లో రోహిత్ ఎటువంటి వ్యూహలు రచించలేదు. చాలా నిర్ణయాలు టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్నవే. రోహిత్ కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించాడు. రోహిత్ మునపటి కెప్టెన్లా ఇప్పుడు లేడు" అని అతుల్ వాసన్ పేర్కొన్నాడు. చదవండి: Shaheen Afridi: నీకసలు సిగ్గుందా? నా ఎదురుగా నువ్వు ఉంటేనా: వసీం అక్రమ్ -
T20 WC: నీకసలు బుద్దుందా? నా ఎదురుగా నువ్వు ఉంటేనా: వసీం అక్రమ్
‘‘చూడండి.. ఈ అబ్బాయికి అసలు బుద్ధుందా? ఎలాంటి ప్రశ్న అడుగుతున్నావో తెలుసా? నీకంటే చిన్నవాళ్లు, పెద్ద వాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నీ దేశానికే చెందిన ఆటగాడి గురించి ఇలా మాట్లాడుతావా? సిగ్గు లేదు. కాస్తైనా పశ్చాత్తాపపడు’’ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది గురించి ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు ఫైర్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా.. ఆఫ్రిది గాయపడిన విషయం తెలిసిందే. మ్యాచ్ కీలక దశలో ఉన్న సమయంలో అతడు బౌలింగ్ చేయలేక మైదానాన్ని వీడాడు. అయితే, అప్పటికే మ్యాచ్ ఇంగ్లండ్ చేతుల్లోకి వెళ్లినప్పటికీ.. ఆఫ్రిది బౌలింగ్ కొనసాగించి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా ఉండేదంటూ పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమిని తట్టుకోలేని ఓ నెటిజన్.. ‘‘పిరికిపంద షాహిన్ ఆఫ్రిది.. మిగతా ఐదు బంతులు వేసి నీ ఓవర్ పూర్తి చేయాల్సింది. కానీ పిరికివాడిలా మైదానాన్ని వీడి నువ్వు పరుగులు తీశావు’’ అంటూ ఆఫ్రిదిని ట్రోల్ చేశాడు. ఈ క్రమంలో ఏ- స్పోర్ట్స్ షోలో పాల్గొన్న వసీం అక్రమ్ దృష్టికి ఈ ట్వీట్ రావడంతో సదరు నెటిజన్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘షాహిన్ ఆఫ్రిది గురించి అతడేం అంటున్నాడో చూడండి. కాస్తైనా సిగ్గుండాలి. ఒకవేళ నువ్వే గనుక నా ఎదురుగా ఉండి ఉంటేనా’’ అంటూ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా నవంబరు 13న మెల్బోర్న్లో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో పాక్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 13 ఓవర్లో హ్యారీ బ్రూక్ క్యాచ్ అందుకునే క్రమంలో ఆఫ్రిది మోకాలికి గాయమైంది. చికిత్స అనంతరం 16వ ఓవర్ వేసేందుకు అతడు మైదానంలోకి వచ్చాడు. అయితే ఒక బంతి వేయగానే ఆఫ్రిది బౌలింగ్ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్సీ రేసులో ఎవరూ ఊహించని కొత్త పేరు..? Shubman Gill: హీరోయిన్తో డేటింగ్పై స్పందించిన టీమిండియా యువ బ్యాటర్! ఒక్క మాటతో కన్ఫామ్ చేశాడా? pic.twitter.com/ht0m8wy6GP — Guess Karo (@KuchNahiUkhada) November 15, 2022 -
ప్రపంచకప్లో ఘోర వైఫల్యం! ధోనికి కీలక బాధ్యతలు
ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియాది నెం1 స్థానం. ద్వైపాక్షిక సిరీస్లలో దుమ్మురేపుతున్న భారత జట్టు.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. చివరిసారిగా 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుచుకుంది. అప్పటి నుంచి భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. ఇక ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్-2022లో బరిలోకి దిగిన టీమిండియా.. సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి అవమానకర రీతిలో ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024కు ముందు భారత జట్టును ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా కెప్టెన్తో పాటు కోచ్ను మార్చేయాలని వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంస్ ధోనిని భారత క్రికెట్ డైరక్టర్గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. కాగా మూడు ఫార్మాట్లలో జట్టు బాధ్యతలను చూడటం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కు కష్టం అవుతోంది. ఈ క్రమంలోనే ధోనికి జట్టు బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధోని జట్టుతో కలిస్తే.. ద్రవిడ్కు పని భారం తగ్గుతోంది. ద్రవిడ్ టెస్టు, వన్డే ఫార్మాట్లో ఆటగాళ్లను తీర్చదిద్దడంపై దృష్టి సారిస్తే.. ధోని టీ20 స్పెషలిస్టులను తాయరు చేసే పనిలో ఉంటాడు. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. నవంబర్ అఖరిలో జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం గురుంచి చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్లో ధోని భారత జట్టు మెంటార్గా బీసీసీఐ నియమించింది. కానీ ఈ మెగా టోర్నీలో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. అయినప్పటకీ ధోనికి ఉన్న అనుభవం దృష్ట్యా మరోసారి జట్టు బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నారట. కాగా వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత ధోని అన్ని ఫార్మాట్లు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: IPL 2023: ముంబై విధ్వంసకర ప్లేయర్ సంచలన నిర్ణయం! మిస్ యూ పోలీ.. ట్విస్ట్ ఇచ్చాడు మరి! -
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఎవరూ ఊహించని కొత్త పేరు..?
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి నేపథ్యంలో జట్టులో సమూల మార్పులు చేయాలని భారీ స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మాజీ, విశ్లేషకులు ఇందుకనుగుణంగా తగు సూచనలు కూడా చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే.. 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు, ముగ్గురు వేర్వేరు కోచ్లు ఉండాలని సలహా ఇవ్వగా.. చాలామంది ఫ్యాన్స్ ఈ ప్రతిపాదనకు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు కొత్త కెప్టెన్, కొత్త కోచ్ అనే అంశంపై గత కొద్దిరోజులుగా సోషల్మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్ నడుస్తూ ఉంది. కెప్టెన్, కోచ్ పోజిషన్ల కోసం ఎవరికి తోచిన ప్రతిపాదనలు వారు చేస్తున్నారు. కొందరు రోహిత్నే కంటిన్యూ చేయాలంటుంటే, మరికొందరు హార్ధిక్ పాండ్యాకు టీ20 పగ్గాలు అప్పగిస్తే బెటరని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై క్రికెట్కు సంబంధించిన ఓ వ్యక్తే సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. భారత టీ20 జట్టుకు కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఓ ఆటగాడికి ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతకీ టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ రేసులోకి కొత్తగా వచ్చిన ఆటగాడెవరు.. అతని పేరు ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు..? వివరాల్లోకి వెళితే.. వినాయక్ మానే అనే ముంబై మాజీ క్రికెటర్ టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులోకి ఎవరూ ఊహించని విధంగా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ పేరును తీసుకువచ్చాడు. గతంలో స్థానిక క్లబ్ క్రికెట్ ఆడే సమయంలో సూర్యకుమార్ ఆడిన జట్టుకు కెప్టెన్గా, ఆ సమయంలో స్కైకు పర్సనల్ కోచ్గా వ్యవహరించిన మానే.. సూర్యకుమార్ భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టేందుకు అన్ని విధాల అర్హుడని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన మనసలో మాట బయటపెట్టాడు. సూర్యకుమార్ను చిన్నతనం చూస్తున్నాను.. అతనికి బ్యాటింగ్ లైనప్ను లీడ్ చేయగలిగిన సామర్ధ్యంతో పాటు క్లిష్ట సమయాల్లో జట్టు సారధ్య బాధ్యతలు భుజాన ఎత్తుకునే మనోస్థైర్యం, చాణక్యం కూడా ఉన్నాయని ఆకాశానికెత్తాడు. అతనితో కలిసి ఆడిన అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నా.. టీమిండియా నాయకత్వ మార్పును కోరుకుంటే, సూర్యకుమార్ పేరును తప్పక పరిశీలనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నా అని అన్నాడు. మానే ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులోకి మరో కొత్త పేరు వచ్చి చేరిందని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. వాస్తవానికి సూర్యకుమార్కు గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. 2014-15 రంజీ సీజన్లో అతను ముంబై జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే బ్యాటింగ్పై దృష్టి సారించలేకపోతున్నాన్న కారణంతో అదే సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 2019-20 సీజన్లో ముంబై రంజీ టీమ్ కెప్టెన్గా మళ్లీ ఎంపికయ్యాడు. 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు. చదవండి: Team India: 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్లు..! -
IPL 2023: అతడు పూర్తిగా విఫలం.. 14 కోట్లు ఖర్చుపెట్టడం అంటే!
IPL 2023 Mini Auction - Kane Williamson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలానికి ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. కొచ్చి వేదికగా డిసెంబరు 23న ఆక్షన్ నిర్వహించనున్న నేపథ్యంలో తమతో అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించేందుకు సన్నద్ధమయ్యాయి. ఇందుకు మంగళవారం (నవంబరు 15) ఆఖరి రోజు కావడంతో ఇప్పటికే తుది జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ హెడ్కోచ్ టామ్ మూడీ.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్లో అతడు మాట్లాడుతూ.. ‘‘మెగా వేలానికి ముందు కేన్ విలియమ్సన్ వంటి సమర్థుడైన ఆటగాడిని 14 కోట్ల రూపాయలకు జట్టు రిటైన్ చేసుకుందంటే.. యాజమాన్యం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి పెట్టుకునే ఈ పని చేసిందని అర్థం. అయితే, గత నాలుగు నెలలుగా టీ20 క్రికెట్లో అతడు పూర్తిగా విఫలమవుతున్నాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. తను గొప్ప నాయకుడు అని తెలుసు. ఆటలో తన శక్తిసామర్థ్యాల గురించి కూడా మాకు తెలుసు. కెప్టెన్గా ఐపీఎల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అతడికి మంచి గుర్తింపు ఉంది. 14 కోట్లు అంటే చాలా ఎక్కువ అందుకే కేన్కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఒకవేళ అతడిని ఫ్రాంఛైజీ రిలీజ్ చేసినా చేయకపోయినా.. నా దృష్టిలో ఒక ఆటగాడి మీద 14 కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయడమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టామ్ మూడీకి గుడ్ బై చెప్పిన ఎస్ఆర్ హెచ్.. విండీస్ లెజెండ్ బ్రియన్ లారాను తమ హెడ్కోచ్గా నియమించుకున్న విషయం తెలిసిందే. అక్కడా.. ఇక్కడా.. కెప్టెన్గా కేన్ విఫలం ఇదిలా ఉంటే.. గత సీజన్లో కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్రైజర్స్ 14 మ్యాచ్లకు గానూ ఆరింట మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ఇక గత టీ20 వరల్డ్కప్లో కేన్ బృందం రన్నరప్గా నిలవగా.. ఈసారి సెమీస్లో పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్గానూ కేన్ ఇటీవల కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ అతడిని వదిలేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: IPL 2023: వేలంలో స్టోక్స్, సామ్ కర్రన్.. రికార్డు ధర ఖాయం..! IPL 2023: కేకేఆర్కు వరుస షాక్లు.. మరో ఇద్దరు ఔట్ -
'టెస్టులు, వైట్ బాల్ క్రికెట్కు వేర్వేరు టీమ్స్ ఉండాల్సిందే'
టీ20 ప్రపంచకప్-2022 సెమీఫైనల్లో టీమిండియాకు ఘోర పరభావం ఎదురైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్పై 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక టోర్నీనుంచి అవమానకర రీతిలో ఇంటిముఖం పట్టిన టీమిండియాపై కొంత మంది విమర్శలు వర్షం కురిపించగా.. మరికొంత మంది మద్దతుగా నిలిచారు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2024కు భారత్ ఏ విధంగా సన్నద్ధం కావాలన్న చర్చ ప్రస్తుతం జరగుతోంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ అనిల్ కుండే తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టెస్టు, వైట్బాల్ క్రికెట్కు వేర్వేరు టీమ్స్ ఉండాలి అని కుంబ్లే సూచించాడు. ఈఎస్పీఎన్ క్రికిన్ఫోతో కుంబ్లే మాట్లాడుతూ.. "ఖచ్చితంగా టెస్టు, వైట్బాల్ క్రికెట్ రెండు వేర్వేరు జట్లు ఉండాలి. ప్రతీ జట్టుకు టీ20 స్పెషలిస్టులు కావాలి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఛాంపియన్స్ ఇంగ్లండ్కు, గతేడాది విజేత ఆస్ట్రేలియాకు చాలా మంది టీ20 స్పెషలిస్టులు ఉన్నారు. ఎక్కువ మంది ఆల్రౌండర్లు ఉండేలా జట్టును తయారు చేసుకోవాలి. ఇంగ్లండ్ను చూసుకుంటే లివింగ్స్టోన్ వంటి అద్భుతమైన ఆటగాడు 7 వస్థానంలో బ్యాటింగ్ వస్తాడు. అదే విధంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ స్టోయినిస్ 6 స్థానంలో బ్యాటింగ్ రావడం మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం జట్టును నిర్మించాలి. దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలి" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: రోహిత్ను కెప్టెన్గా తప్పించండి! వాళ్లలో ఒకరిని సారథి చేయండి -
రోహిత్ను కెప్టెన్గా తప్పించండి! వాళ్లలో ఒకరిని సారథి చేయండి
టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే టీమిండియా ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత్.. సెమీఫైన్లలో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశ పరిచాడు. ఈ మెగా ఈవెంట్లో ఆరు మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా కెప్టెన్సీ పరంగా అంతగా వ్యూహాలు రచించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో రాబోయే టీ20 ప్రపంచకప్కు ముందు రోహిత్ను తప్పించి కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ అప్పజెప్పాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఇదే విషయంపై వెస్టిండీస్ దిగ్గజం ఇయాన్ బిషఫప్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ భారాన్ని మోయలేకపోతున్నాడని బిషఫ్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్తో బిషప్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది జూలైలో విండీస్తో సిరీస్ సమయంలో రోహిత్ను ఓ ప్రశ్న ఆడిగాను. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారాన్ని మేనేజ్ చేయగలవా? అతడు దానికి బదులుగా అది చాలా కష్టం అని సమాధానం చెప్పాడు. మూడు ఫార్మాట్ల్లో కెప్టెన్గా బాధ్యతలు నిర్హహించడం అంత సులభం కాదు. అది వ్యక్తిగత ఆటపై ప్రభావం చూపుతోంది. రోహిత్ విషయంలో కూడా ఇదే జరిగింది. మరో రెండేళ్లలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. రోహిత్ వయస్సు దృష్ట్యా అతడి స్థానంలో కొత్త సారథిని భారత్ తయారు చేసుకుంటే బాగుటుంది. నాకు అడిగితే రిషబ్ పంత్ లేదా హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్లకు టీమిండియా కెప్టెన్సీ అప్పగిస్తే బెటర్" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: భారత్తో టీ20 సిరీస్.. న్యూజిలాండ్ కెప్టెన్ దూరం! స్టార్ బౌలర్ కూడా! -
భారత్తో టీ20 సిరీస్.. న్యూజిలాండ్ కెప్టెన్ దూరం! స్టార్ బౌలర్ కూడా!
టీ20 ప్రపంచకప్-2022 సెమీస్లో ఇంటిముఖం పట్టిన న్యూజిలాండ్.. స్వదేశంలో టీమిండియాతో వైట్బాల్ సిరీస్లో తలపడనుంది. ఈ హోమ్ సిరీస్లో భాగంగా టీమిండియాతో న్యూజిలాండ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇప్పటికే ఈ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్కు భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. ఇక న్యూజిలాండ్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. టీ20, వన్డే సిరీస్లకు రెండు వేర్వేరు జట్లను న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే టీ20 సిరీస్కు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. వీరి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా గత కొంత కాలంగా వైట్ బాల్ క్రికెట్కు దూరంగా ఉన్న టామ్ లాథమ్, నికోల్స్ తిరిగి జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత్ టూర్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు.. శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్కీపర్), శుభ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ , శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: Cricket Australia: టీ20 వరల్డ్ కప్ బెస్ట్ టీమ్.. వాళ్లకు మాత్రం స్థానం లేదు! హవా ఎవరిదంటే! -
WC 2024: నేనే చీఫ్ సెలక్టర్ అయితే ఇలా చేస్తా! ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు!
T20 World Cup 2024- Team India Captain: భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2022 బరిలోకి దిగిన టీమిండియా సెమీస్లోనే ఇంటి బాటపట్టి అభిమానులను నిరాశపరిచింది. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించి విమర్శలు మూటగట్టుకుంది. పటిష్టమైన జట్టుగా నంబర్ 1 ర్యాంకులో కొనసాగుతున్న భారత్కు ఇలాంటి పరాభవం ఎదురుకావడాన్ని ఫ్యాన్స్ సహా మాజీ ఆటగాళ్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వచ్చే టీ20 వరల్డ్కప్ నాటికి సంసిద్ధం కావాల్సిన ఆవశ్యకత, జట్టు కూర్పు గురించి పలువురు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్సీ మార్పు అంశం గురించి బీసీసీఐ సీరియస్గా ఆలోచించాలని సూచిస్తున్నారు. రోహిత్ శర్మను పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పించి కొత్త నాయకుడిని సిద్ధం చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షో మ్యాచ్ పాయింట్లో ఈ మేరకు చిక్కా మాట్లాడాడు. శ్రీకాంత్- ఇర్ఫాన్ పఠాన్ నేనే గనుక సెలక్షన్ కమిటీ చైర్మన్ అయితే ‘‘ఒకవేళ నేనే గనుక సెలక్షన్ కమిటీ చైర్మన్ అయితే 2024 వరల్డ్కప్ నాటికి హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయి కెప్టెన్గా ఉండేలా చేస్తాను. ఈరోజు నుంచే జట్టు పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తా. న్యూజిలాండ్ పర్యటన నుంచి సన్నాహకాలు మొదలుపెడతా. నిజానికి ప్రపంచకప్ టోర్నీకి రెండేళ్ల ముందు నుంచే అన్ని రకాలుగా జట్టును సిద్ధం చేసుకోవడం ఉత్తమం కదా! ఇందుకోసం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవాలి. ఏడాది పాటు ప్రయోగాలు చేయండి. దీంతో 2023 నాటికి ఓ అవగాహన వస్తుంది’’ అని మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ప్రపంచకప్లు ఎలా గెలిచామనుకుంటున్నారు ఇక జట్టులో ఆల్రౌండర్ల ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ‘‘1983, 2011, 2007లో ప్రపంచకప్లు ఎలా గెలిచామనుకుంటున్నారు! జట్టులో ఫాస్ట్బాల్ ఆల్రౌండర్లు ఉండాలి. గతంలో ఉన్నారు కూడా! వాళ్లతో పాటు సెమీ ఆల్రౌండర్లు కూడా అవసరం. మనకు ఒక్క హుడా సరిపోడు.. చాలా మంది కావాలి’’అని ఈ మాజీ సారథి అన్నాడు. ఒకరు కాదు ఇద్దరు కావాలి ఇక శ్రీకాంత్ అభిప్రాయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్.. ‘‘హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్.. తనకు గాయాల బెడద కూడా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వరల్డ్కప్ టోర్నీ ఆరంభానికి ముందే మీ ఈ నాయకుడు గాయపడితే పరిస్థితి ఏంటి? కాబట్టి ఒక్కడు కాదు ఇద్దరు సారథులు కావాలి. ఒకరు అందుబాటులో లేకపోయినా వాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు సిద్ధంగా ఉండాలి. అందుకోసం మరో కెప్టెన్ను కూడా సిద్దం చేసుకోవాలి. అలాగే ఓపెనింగ్ జోడీలకు కూడా సరైన ప్రత్యామ్నాయాలు వెదకాలి’’ అని పేర్కొన్నాడు. చదవండి: Pak Vs Eng: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’ India tour of New Zealand: టీమిండియా న్యూజిలాండ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు -
టీ20 వరల్డ్ కప్ బెస్ట్ టీమ్.. వాళ్లకు మాత్రం స్థానం లేదు! హవా ఎవరిదంటే!
టీ20 ప్రపంచకప్-2022 ఆదివారం(నవంబర్ 13)తో ముగిసిపోయింది. ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తు చేసిన ఇంగ్లండ్ రెండోసారి టీ20 ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్లో సత్తా చాటిన ఆటగాళ్లతో క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను సోమవారం ప్రకటించింది. ఇప్పటికే ఐసీసీ కూడా ప్రపంచకప్ అత్యుత్తమ జట్టును ప్రకటిచింది. తాజగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్కు చోటుదక్కింది. అదే విధంగా ఛాంపియన్స్గా నిలిచిన ఇంగ్లండ్ నుంచి గరిష్టంగా ముగ్గురు ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపికచేసింది. వారిలో కెప్టెన్ జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ ఉన్నారు. ఇక రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్ నుంచి షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిదికి స్థానం దక్కింది. న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిఫ్స్, జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికిందర్ రజా, బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తిఫిజర్ రెహ్మన్, ప్రోటీస్ స్పీడ్ స్టార్ అన్రీచ్ నోర్జేకు కూడా ఈ జట్టులో చోటుదక్కింది. కాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టులో డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్కు చెందిన ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టు: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, విరాట్ కోహ్లి, గ్లెన్ ఫిలిఫ్స్ సూర్యకుమార్ యాదవ్, సికిందర్ రజా, షాదాబ్ ఖాన్, సామ్ కర్రాన్, షాహీన్ ఆఫ్రిది, ముస్తాఫిజుర్ రెహ్మన్, అన్రీచ్ నోర్జే చదవండి: టీ20 వరల్డ్కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు -
'ఆఫ్రిదికి అంత సీన్ లేదు.. ఉన్నా ఇంగ్లండ్ విజయం సాధించేది'
టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే పేసర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో వైదొలగడం తమ జట్టు ఓటమికి ప్రధాన కారణమని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. కాగా బాబర్ చేసిన ఈ వాఖ్యలను భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తోసిపుచ్చాడు. ఆఫ్రిది ఫీల్డ్లో ఉన్నా ఇంగ్లండ్ ఖచ్చితంగా విజయం సాధించేది అని గవాస్కర్ తెలిపాడు. ఇండియా టుడేతో గవాస్కర్ మాట్లాడుతూ.. "షాహిన్ ఆఫ్రిది గాయం పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ తొలత బ్యాటింగ్లో అంతగా రాణించలేకపోయింది. వారు 15 నుంచి 20 పరుగులు ఆదనంగా చేసే ఉంటే బాగుండేది. అప్పడు బౌలర్లపై అంత ఒత్తిడి ఉండేది కాదు. అయితే ఈ మ్యాచ్లో షాహీన్ ఫీల్డ్ను వదిలేటప్పటికీ అతడికి కేవలం 11 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 11 బంతులు ఇంగ్లండ్పై ఎటువంటి ప్రభావం చూపకపోయండేవి. బహుశా పాకిస్తాన్కి మరో వికెట్ లభించి ఉండవచ్చు. అంతే తప్ప ఇంగ్లండ్ మాత్రం కచ్చితంగా గెలిచి ఉండేది" అని అతడు పేర్కొన్నాడు. కాగా ఫైనల్లో 2.1 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆఫ్రిది 13 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కాగా ఆఫ్రిది మెకాలి గాయం తిరగబెట్టడంతో మరో ఆరు నెలల పాటు జట్టుకు దూరం ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి: Pak Vs Eng: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’ -
Pak Vs Eng: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’
Pakistan vs England - Pakistan vs New Zealand: టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది కుడి మోకాలికి గాయమైన విషయం విదితమే. ఈ గాయం తీవ్రతరం కావడంతో అతడు స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్తో సిరీస్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గాయం తీవ్రత దృష్ట్యా అతడు సుమారు ఆర్నెళ్ల పాటు జట్టు నుంచి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సొహైల్ సలీమ్ మాట్లాడుతూ.. ‘‘కేవలం మోకాలి గాయం మాత్రమే అయితే అతడు కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు నెలల కాలం సరిపోతుంది. ఇదే కాకుండా గతంలో అయిన గాయాలు మళ్లీ తిరగబెడితే మాత్రం సుమారు ఆరు నుంచి ఏడు నెలల పాటు విశ్రాంతి అవసరం. సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఆఫ్రిది గతంలో గాయపడ్డ సమయంలో చికిత్స అందించే క్రమంలో ఎక్కడ పొరపాటు జరిగిందో అన్న అంశంపై పీసీబీ విచారణ చేయాల్సి ఉంది’’ అని స్థానిక మీడియా డాన్తో పేర్కొన్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆఫ్రిది గనుక దూరమైతే.. వచ్చే నెలలో ఇంగ్లండ్తో సిరీస్ నేపథ్యంలో అతడి స్థానంలో హారీస్ రవూఫ్ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. డిసెంబరు 1 నుంచి 21 వరకు పాకిస్తాన్ వేదికగా ఇంగ్లండ్ ఆతిథ్య జట్టుతో మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత పాక్ స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు, వన్డే సిరీస్లు ఆడనుంది. అంచనాలు తలకిందులు మెల్బోర్న్లో జరిగిన ఆదివారం నాటి వరల్డ్కప్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 13 ఓవర్లో హ్యారీ బ్రూక్ క్యాచ్ అందుకునే క్రమంలో ఆఫ్రిది మోకాలికి గాయమైంది. ఈ క్రమంలో చికిత్స అనంతరం 16వ ఓవర్ వేసేందుకు అతడు మైదానంలోకి వచ్చాడు. ఆ సమయంలో ఇంగ్లండ్ 30 బంతుల్లో 41 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఒక బంతి వేయగానే ఆఫ్రిది బౌలింగ్ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ను, స్వల్ప లక్ష్యాన్ని చూస్తే ఆఫ్రిది మిగతా 11 బంతులు వేసినా పెద్దగా ఫలితం ఉండేదో లేదో చెప్పలేం కానీ... అతని తొలి 2 ఓవర్ల బౌలింగ్ చూస్తే మాత్రం పాక్ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుందనేది వాస్తవం. ఇక వరల్డ్ కప్ తొలి 2 మ్యాచ్లలో సగం ఫిట్నెస్తోనే ఇబ్బందిగా ఆడిన షాహిన్, తర్వాతి 4 మ్యాచ్లలో పూర్తి ఫిట్గా మారి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే అసలు పోరులో మోకాలి గాయం తిరగబెట్టడంతో అంచనాలు తలకిందులయ్యాయి. ఇక ఇప్పుడు ఈ కీలక పేసర్ మరికొంత కాలం జట్టుకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: IND vs NZ: టీ20, వన్డే సిరీస్.. న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా T20I Team Rankings: వరల్డ్కప్ గెలవకపోయినా, టీమిండియానే నంబర్ 1 -
టీ20, వన్డే సిరీస్.. న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా
టీ20 ప్రపంచకప్-2022 సెమీఫైనల్లో ఓటమిపాలై ఇంటిముఖం పట్టిన టీమిండియా.. ఇప్పుడు న్యూజిలాండ్తో వైట్బాల్ సిరీస్కు సిద్దమైంది. ఈ సిరీస్కోసం హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు సోమవారం న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్పిన్నర్ యుజువేంద్ర చాహల్,మహ్మద్ సిరాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక కివీస్ గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు మంగళవారం నుంచి తమ ప్రాక్టీస్ సెషన్ను మొదలపెట్టనుంది. కాగా న్యూజిలాండ్ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యా.. వన్డే సిరీస్కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నారు. మరోవైపు రాహల్ ద్రవిడ్కు కూడా విశ్రాంతి ఇవ్వడంతో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మరో సారి హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత్ టూర్ ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు.. శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్కీపర్), శుభ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ -
టీ ట్వంటీ ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్
-
వరల్డ్కప్ గెలవకపోయినా, టీమిండియానే నంబర్ 1
టీ20 వరల్డ్కప్-2022 ముగిసిన అనంతరం ఐసీసీ విడుదల చేసిన టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. వరల్డ్కప్లో సెమీస్లోనే నిష్క్రమించినా.. రోహిత్ సేన అగ్రస్థానాన్ని కాపాడుకోగలిగింది. పొట్టి ఫార్మాట్లో గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత జట్టు.. ప్రస్తుతం 268 రేటింగ్ పాయింట్స్తో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ జట్టు టీమిండియా తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 265 పాయింట్లు ఉన్నాయి. వరల్డ్కప్కు ముందు వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అంతరం చాలానే ఉన్నప్పటికీ.. వరల్డ్కప్ గెలుపుతో ఇంగ్లండ్.. టీమిండియా టాప్ ప్లేస్ దిశగా దూసుకొస్తుంది. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య 3 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ఇక వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ సైతం పాయింట్లను బాగా మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకింది. పాక్ ఖాతాలో 258 పాయింట్లు ఉన్నాయి. పాక్ తర్వాత సౌతాఫ్రికా (256), న్యూజిలాండ్ (253), ఆస్ట్రేలియా (252), వెస్టిండీస్ (236), శ్రీలంక (235), బంగ్లాదేశ్ (222), ఆఫ్ఘనిస్తాన్ (217) జట్లు వరుసగా 4 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. టీ20 బ్యాటర్ల విషయానికొస్తే.. సూర్యకుమార్, మహ్మద్ రిజ్వాన్, డెవాన్ కాన్వే తొలి మూడు స్థానాల్లో ఉండగా, బౌలింగ్లో హసరంగ, రషీద్ ఖాన్, జోష్ హేజిల్వుడ్ టాప్-3లో, ఆల్రౌండర్ల విభాగంలో షకీబ్ అల్ హసన్, మహ్మద్ నబీ, హార్ధిక్ పాండ్యా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. చదవండి: Wasim Jaffer: సూర్యకుమార్ కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేశాడు.. ! -
ఆ చిన్న కిటుకు మర్చిపోయారు.. అదే పాక్ ఓటమికి దారి
టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ రన్నరప్గానే మిగిలిపోయింది. పాక్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ రెండోసారి పొట్టి ఫార్మాట్లో చాంపియన్గా అవతరించింది. బెన్ స్టోక్స్ ఆల్రౌండ్ ప్రదర్శనకు తోడుగా జట్టు సమిష్టి ప్రదర్శన ఇంగ్లండ్కు విజయాన్ని కట్టబెట్టింది. డెత్ ఓవర్లలో బ్యాటర్లు బోల్తా పడడం.. పాక్ ఓటమికి కారణ మని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ''16 ఓవర్లలో 119/4తో ఉన్న పాక్.. చివరి 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసింది. వాస్తవంగా అయితే అక్కడినుంచి ఓవర్ కు 10 పరుగులు రాబట్టినా స్కోరు దాదాపుగా 160-165 పరుగులకు చేరుకొనేది. ఈ పిచ్పై ఇది నిజంగా సవాల్ విసిరే స్కోరు. కానీ, ఎంసీజీ గ్రౌండ్ బౌండరీలను పాక్ బ్యాటర్లు సరిగా అర్థం చేసుకోలేదు. ఈ కిటుకును పసిగట్టకపోవడం వల్లే డెత్ ఓవర్లలో వారు తడబడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లు కూడా తెలివిగా బౌండ్రీ 85 మీటర్ల దూరం ఉన్న వైపే షాట్లు ఆడే విధంగా బంతులు విసిరి.. పాక్ బ్యాటర్లను ఉచ్చులోకి లాగారు. కొంచెం బుర్ర ఉపయోగించి సింగిల్స్, డబుల్స్తో నెట్టుకొచ్చినా పరిస్థితి మరో రకంగా ఉండేది.ఇదే పాక్ ఓటమికి ప్రధాన కారణం.'' అని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు. చదవండి: బాబర్కు ఊహించని ప్రశ్న.. మధ్యలో తలదూర్చిన మేనేజర్ ముగిసిన ప్రపంచకప్.. కోహ్లి సరికొత్త రికార్డు -
సూర్యకుమార్ యాదవ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన వసీం జాఫర్
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్న అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులు తీవ్రంగా మనసు నొచ్చుకున్నారు. కొందరు బహిరంగంగా తమ బాధను వెల్లగక్కితే.. మరికొందరు పర్వాలేదులే అంటూ టీమిండియాను వెనకేసుకొచ్చారు. ఓటమి బాధను దిగమింగుకోలేక బాహాటంగా బాధను వ్యక్త పరిచిన వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ఉన్నాడు. దాదాపుగా ప్రతి సందర్భంలో టీమిండియాను వెనకేసుకొచ్చే జాఫర్.. వరల్డ్కప్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మాత్రం జట్టులో లోపాలను గట్టిగానే లేవనెత్తాడు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యాలను ఘాటుగా విమర్శించిన జాఫర్.. ఆతర్వాత సెమీస్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేనందుకు భారత బౌలర్లను ఎండగట్టాడు. తాజాగా అతను టీమిండియా విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ను కూడా టార్గెట్ చేశాడు. Wasim Jaffer states Suryakumar Yadav couldn't live up to the expectations in big games via @BatBricks7 presents 'Run Ki Runneeti show.'#CricTracker #BatBricks7 #SuryakumarYadav #2020WorldCup pic.twitter.com/Q2C4GzCgaw — CricTracker (@Cricketracker) November 13, 2022 ప్రపంచకప్లో సూర్యకుమార్ 3 అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించినప్పటికీ, కీలక మ్యాచ్ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాడంటూ స్కైను వేలెత్తి చూపాడు. సెమీస్ మ్యాచ్కు ముందు వరకు టీమిండియాపై పేలిన పాక్ మాజీలకు, ఇంగ్లండ్ మాజీలకు స్ట్రాంగ్ కౌంటర్లిచ్చిన జాఫర్ ఒక్కసారిగా ఇలా భారత ఆటగాళ్లను టార్గెట్ చేయడంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. జాఫర్కు ఏమైనా చిప్ దొబ్బందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ను టార్గెట్ చేసినప్పుడైతే.. అతని ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకొందరైతే.. జాఫర్ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడని అతన్ని వెనకేసుకొస్తున్నారు. జాఫర్ వ్యాఖ్యల్లో తప్పేముంది.. రోహిత్ ఇటీవలికాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు కాబట్టి, వచ్చే టీ20 వరల్డ్కప్లో అతను ఆడతాడనుకోవడం లేదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బహిర్గతం చేశాడంటున్నారు. టీమిండియా బౌలింగ్ కంటే పాక్ బౌలింగ్ బలంగా ఉందని జాఫర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పుడు అర్ధాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగానే భారత్ బౌలింగ్ బలహీనంగా ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని జాఫరే కాదు ఎవరిని అడిగినా చెబుతారు. ఇక, సూర్యకుమార్ విషయానికొస్తే.. మెగా టోర్నీలో 185కు పైగా స్ట్రయిక్ రేట్ కలిగిన స్కై.. పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో, డూ ఆర్ డై సెమీస్ మ్యాచ్లో, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ల్లో అంచనాలకు తగ్గట్టు రాణించలేదన్నది బహిరంగ రహస్యమేనని జాఫర్ కామెంట్స్తో ఏకీభవిస్తున్నారు. చదవండి: 'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు' -
WC: 2012లో వెస్టిండీస్ అలా.. 2022లో పాకిస్తాన్ ఇలా! విండీస్ గెలిస్తే.. పాక్ మాత్రం
T20 World Cup: 2012 Winner West Indies- 2022 Winner England: వరల్డ్కప్ ఫైనల్ ఈసారి ‘టై’ కాలేదు... సూపర్ ఓవర్లు కూడా సమం కాలేదు... క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించడానికి, సగం గెలుపు అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడానికి ఇంగ్లండ్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అలాంటి చర్చే రాకుండా అద్భుత ఆటతో అందరికంటే శిఖరాన నిలిచింది. టోర్నీ ఆరంభంలో వర్షం తమ అవకాశాలను దెబ్బకొట్టినా, ఒక్కసారిగా పుంజుకొని మ్యాచ్లు వానపాలైన వేదికపైనే విశ్వ విజేతగా ఆవిర్భవించింది. వన్డే, టి20 వరల్డ్కప్లు రెండూ ఒకే సమయంలో తమ వద్ద కలిగి ఉన్న తొలి జట్టుగా చరిత్రకెక్కింది. మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్కప్ గెలిచినా వివాదం వెంట తీసుకొచ్చి ఆనందం కాస్త మసకబారగా... అంతకుముందే ఆరేళ్ల క్రితం టి20 వరల్డ్కప్ ఆఖరి మెట్టుపై అనూహ్య రీతిలో ఓడింది. వాటిని మరిచేలా తాజా విజయం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని చూపించింది. వరల్డ్కప్ ఫైనల్ పోరులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు... తొలుత బ్యాటింగ్ చేస్తూ.. పాకిస్తాన్ చూపిన పేలవ బ్యాటింగ్ ఇది... టి20ల్లో చివరి నాలుగు ఓవర్లంటే బౌలర్లకు డెత్ ఓవర్లు! కానీ పాక్ దానిని రివర్స్గా మార్చింది. ఆఖరి 4 ఓవర్లలో కనీసం 40 పరుగులు చేస్తే విజయంపై ఆశలు ఉంచుకోగలిగే చోట 18 పరుగులకే పరిమితమైంది. ముగింపు స్కోరుతోనే పాక్ ఓటమికి పునాది పడింది. టోర్నీ ఆసాంతం చెలరేగిన స్యామ్ కరన్ బౌలింగ్ పదును ముందు పాక్ తేలిపోయింది. 2012 ఫైనల్లో కూడా విండీస్ 137 పరుగులే చేసి విజేతగా నిలిచిన తీరు గుర్తుకొచ్చిందేమో... పాక్లో కాస్త ఆశలు పెరిగాయి! పైగా తొలి ఓవర్లోనే హేల్స్ అవుట్ కావడం, మెల్బోర్న్ మైదానం మొత్తం హోరెత్తిపోవడం ఆ జట్టును మరింత ఉత్సాహపరచింది. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని పాక్ కట్టడి కూడా చేయగలిగింది కూడా. అయితే పాక్ ఆశించినట్లుగా 1992 పునరావృతం కాలేదు. బెన్ స్టోక్స్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. 43 మ్యాచ్ల టి20 కెరీర్లో తన తొలి అర్ధసెంచరీ చేసేందుకు అతను సరైన సమయాన్ని ఎంచుకున్నట్లున్నాడు. చివరి వరకూ నిలబడి మరోసారి తన చేతుల మీదుగా ఇంగ్లండ్ను వరల్డ్కప్ చాంపియన్గా నిలిపాడు. 2012లో వెస్టిండీస్ అలా విజేతగా.. శ్రీలంక వేదికగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీ20 ప్రపంచకప్-2012 ఫైనల్లో వెస్టిండీస్ ఆతిథ్య శ్రీలంకతో తలపడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్లు జాన్సన్ చార్ల్స్(0), క్రిస్ గేల్ (3) వికెట్లు కోల్పోయినా.. వన్డౌన్ బ్యాటర్ మార్లన్ సామ్యూల్స్ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో డ్వేన్ బ్రావో 19, కెప్టెన్ డారెన్ సామీ 26(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సామీ బృందం 137 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్ మహేల జయవర్దనే 33 పరుగులతో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ డకౌట్ అయ్యాడు. వన్డౌన్లో వచ్చిన కుమార్ సంగక్కర 22 పరుగులు చేయగా.. నువాన్ కులశేఖర 26 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్ల స్కోరు కనీసం ఐదు పరుగులు కూడా దాటకుండా విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో18.4 ఓవర్లలో 101 పరుగులకే లంక ఆలౌట్ అయింది. నాడు అదరగొట్టిన విండీస్ బౌలర్లు వెస్టిండీస్ బౌలర్లలో సునిల్ నరైన్ 3.4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు కూల్చగా.. సామీ రెండు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సామ్యూల్ బద్రీకి ఒకటి, రవి రాంపాల్కు ఒకటి, మార్లన్ సామ్యూల్స్కు ఒక వికెట్ దక్కాయి. ఆల్రౌండ్ ప్రతిభతో మార్లన్ సామ్యూల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2022లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఇలా టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆదివారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. షాన్ మసూద్ (28 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ బాబర్ ఆజమ్ (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (3/12) పాక్ను పడగొట్టగా... ఆదిల్ రషీద్, జోర్డాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. బెన్ స్టోక్స్ (49 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. 6 మ్యాచ్లలో 11.38 సగటు, 6.52 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్యామ్ కరన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలిచాడు. అంతా విఫలం... ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ (15) పాక్కు దూకుడైన ఆరంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. తొలి నాలుగు ఓవర్లలో ఆ జట్టు ఒకే ఒక బౌండరీ (సిక్స్) కొట్టగా, తర్వాతి ఓవర్లో రిజ్వాన్ వెనుదిరిగాడు. పవర్ప్లేలో స్కోరు 39 పరుగులకు చేరింది. ధాటిగా ఆడగల హారిస్ (8)ను రషీద్ తన తొలి బంతికే అవుట్ చేయగా, 10 ఓవర్లు ముగిసేసరికి జట్టు 68 పరుగులు చేసింది. ఇందులో మూడు ఫోర్లే ఉన్నాయి! లివింగ్స్టోన్ ఓవర్లో 4, 6తో మసూద్ జోరును పెంచే ప్రయత్నం చేయగా, బాబర్ను చక్కటి రిటర్న్ క్యాచ్తో అవుట్ చేసి రషీద్ మళ్లీ దెబ్బ కొట్టాడు. ఇఫ్తికార్ (0) కూడా చేతులెత్తేయడంతో పాక్ కష్టాలు మరింత పెరిగాయి. ఇంగ్లండ్ పదునైన బౌలింగ్లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాక్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడటంలో పూర్తిగా విఫలమయ్యారు. డెత్ ఓవర్లలో జట్టు పరిస్థితి మరీ ఘోరంగా కనిపించింది. చివరి 4 ఓవర్లలో పాక్ కేవలం 18 పరుగులు మాత్రమే జోడించి ఓవర్కు ఒక వికెట్ చొప్పున 4 వికెట్లు కోల్పోయింది. దాంతో కనీస స్కోరును కూడా సాధించలేక పాక్ ఇన్నింగ్స్ ముగించింది. హేల్స్ విఫలం... ఛేదనలో ఇంగ్లండ్ కూడా గొప్పగా ఆడలేదు. అయితే లక్ష్యం బాగా చిన్నది కావడంతో జాగ్రత్తగా, తగిన ప్రణాళికతో ఆ జట్టు విజయాన్నందుకుంది. తొలి ఓవర్లోనే ప్రమాదకరమైన హేల్స్ (1)ను షాహిన్ అఫ్రిది అవుట్ చేయగా, జోస్ బట్లర్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ను నడిపించాడు. ఆపై నసీమ్ తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ మూడు ఫోర్లతో ఎదురుదాడి చేసింది. రవూఫ్ తన రెండు వరుస ఓవర్లలో సాల్ట్ (10), బట్లర్లను అవుట్ చేయడంతో పవర్ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 49/3 వద్ద నిలిచింది. ఈ దశలో పాక్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు. బౌండరీలు రావడం కష్టంగా మారిపోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు ఇంగ్లండ్ బౌండరీ కొట్టలేకపోయింది! అయితే స్టోక్స్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. హ్యారీ బ్రూక్ (23 బంతుల్లో 20; 1 ఫోర్) అవుటైనా... సింగిల్స్తోనే పరుగులు రాబడుతూ తన వికెట్ మాత్రం అప్పగించకుండా జాగ్రత్త పడ్డాడు. గాయంతో అఫ్రిది అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఆ ఓవర్ పూర్తి చేసేందుకు ఇఫ్తికార్ రాగా వరుసగా 4, 6 బాదాడు. 24 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో వసీమ్ వేసిన 17వ ఓవర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 19; 3 ఫోర్లు) 3 ఫోర్లు కొట్టడంతో పని సులువైంది. వసీమ్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికి ఫోర్తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్... చివరి బంతిని మిడ్ వికెట్ దిశగా సింగిల్ తీసి ఇంగ్లండ్ను వరల్డ్ చాంపియన్గా నిలిపాడు. చదవండి: T20 WC 2022 Final: అఫ్రిది గాయపడకుంటే టైటిల్ గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్ టీ20 వరల్డ్కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు View this post on Instagram A post shared by ICC (@icc) -
ముగిసిన ప్రపంచకప్.. కోహ్లి సరికొత్త రికార్డు
టీమిండియా రన్మెషిన్ విరాట్ కోహ్లి ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా కోహ్లి మరో రికార్డు బద్దలు కొట్టాడు. టి20 ప్రపంచకప్లలో లీడింగ్ రన్స్కోరర్గా నిలవడం కోహ్లికి ఇది రెండోసారి. ఈ ప్రపంచకప్లో ఆరు మ్యాచ్లు కలిపి 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. కోహ్లి ఖాతాలో నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక మెల్బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై కోహ్లి (53 బంతుల్లో 82 పరుగులు నాటౌట్) ఇన్నింగ్స్ ఈ ప్రపంచకప్కే హైలైట్గా నిలిచింది. ఇక ఈ ప్రపంచకప్లో అత్యధిక పరుగుల జాబితా చూస్తే.. కోహ్లి తర్వాత నెదర్లాండ్స్కు చెందిన మాక్స్ ఓడౌడ్ 8 మ్యాచ్ల్లో 242 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో మరో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్(ఆరు మ్యాచ్లు కలిపి 239 పరుగులు) ఉన్నాడు. జాస్ బట్లర్ 225 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. లంకకు చెందిన కుషాల్ మెండిస్ 223 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. అంతకముందు 2014 టి20 ప్రపంచకప్లోనూ కోహ్లినే టాప్ స్కోరర్గా నిలిచాడు. అప్పుడు ఆరు మ్యాచ్లు కలిపి కోహ్లి 106.33 సగటుతో 319 పరుగులు సాధించాడు. అప్పుడు కూడా నాలుగు అర్థసెంచరీలు సాధించిన కోహ్లి అత్యధిక స్కోరు 77గా ఉంది. ఇలా రెండు ప్రపంచకప్లలో లీడింగ్ స్కోరర్గా నిలవడం కోహ్లికి మాత్రమే సాధ్యమైంది. ఇక ఓవరాల్గా అన్ని ప్రపంచకప్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలోనూ కోహ్లినే అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు కోహ్లి టి20 ప్రపంచకప్లలో 27 మ్యాచ్లాడి 81.5 సగటుతో 1141 పరుగులు సాధించాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉండగా.. 89 పరుగులు నాటౌట్ అత్యధిక స్కోరుగా ఉంది. ఇక టీమిండియా 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2014లో ఫైనల్ చేరినప్పటికి కప్ అందుకోవడంలో విఫలమైంది. తాజాగా 2022లో సెమీఫైనల్ చేరినప్పటికి ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకొని ఇంటిబాట పట్టింది. He's a 1⃣0⃣ but he sets unrealistic standards. 🤷♂️ Now the only player to top the run-scoring charts in✌️T20 World Cups. 🙇♂️#PlayBold #TeamIndia #T20WorldCup @imVkohli pic.twitter.com/CiuOD7IS6U — Royal Challengers Bangalore (@RCBTweets) November 13, 2022 చదవండి: బాబర్కు ఊహించని ప్రశ్న.. మధ్యలో తలదూర్చిన మేనేజర్ -
ఆ ఓవర్ అసాధారణం.. అతడికి ఎప్పుడు బంతిని అప్పగించినా: బట్లర్
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs England, Final: ‘‘చాలా గర్వంగా ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని మార్పులు.. వాటి ఫలితాలు ఇప్పుడు అందుకుంటున్నాం. టోర్నీ చాలా అద్భుతంగా సాగింది. ఐర్లాండ్ చేతిలో ఓటమి అసలు ఎప్పుడు ఎదురైందో అనిపిస్తోంది. కోచ్ మాథ్యూ మాట్ కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చి మేం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రోత్సహించారు. స్టోక్స్ పోరాటయోధుడు. తన అనుభవంతో అతను ఏదైనా చేయగలడు. కీలక సమయాల్లో రాణించడమే స్టోక్స్ గొప్పతనం. నాలుగున్నర నెలల కెప్టెన్సీలోనే ప్రపంచకప్ దక్కిందనే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను’’ అంటూ ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ హర్షం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన పాకిస్తాన్ పర్యటన తమ ఆటగాళ్లందరూ బాగా కలిసిపోయేందుకు ఉపకరించిందని పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్కప్-2022 ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ఇంగ్లండ్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. తమ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లను అభినందించాడు. ఈ మ్యాచ్లో ఆదిల్ రషీద్ ఓవర్ అసాధారణమని.. అతనికి ఎప్పుడు బంతిని అప్పగించినా ఏదో ఒకటి చేసి చూపిస్తాడంటూ ప్రశంసలు కురిపించాడు. ఆ ఓవర్ స్పెషల్ కాగా పాక్ ఇన్నింగ్స్లో 12వ ఓవర్ మొదటి బంతికే కెప్టెన్, ప్రమాదకర బ్యాటర్ బాబర్ ఆజం అవుట్ చేసిన ఆదిల్ రషీద్.. ఓవర్ మొత్తంలో ఒక్క పరుగు(మెయిడెన్) కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆదిల్ను ఉద్దేశించి బట్లర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ఆల్రౌండర్ స్టోక్స్ను కొనియాడాడు. కాగా పాక్తో ఫైనల్లో ఆదిల్ రషీద్ తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 22 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక స్టోక్స్ విషయానికొస్తే.. ఒక వికెట్ తీయడంతో పాటుగా అజేయ అర్ధ శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రేక్షకులంతా మాకు మద్దతు పలికేందుకే వచ్చినట్లుంది ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు. మైదానంలో ప్రేక్షకులంతా మాకు మద్దతు పలికేందుకే వచ్చినట్లుంది. అందరికీ కృతజ్ఞతలు. గత నాలుగు మ్యాచ్లలో మా జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఫైనల్లో స్వేచ్ఛగా ఆడాలని మా ఆటగాళ్లకు చెప్పాను. కనీసం 20 పరుగులు తక్కువగా చేసినా చివరి వరకు పోరాడగలిగాం. మా బౌలింగ్ అత్యుత్తమమైంది. అఫ్రిదికి మధ్యలో గాయం కావడం కూడా మాకు ఇబ్బందిగా మారింది. అయితే అదంతా ఆటలో భాగం’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. చదవండి: టీ20 వరల్డ్కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు T20 WC 2022 Final: బాబర్కు ఊహించని ప్రశ్న.. మధ్యలో తలదూర్చిన మేనేజర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
రిటైర్మెంట్ ప్రకటించనున్న డేవిడ్ వార్నర్..?
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే క్రికెట్లో ఓ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని సూచన ప్రాయంగా వెల్లడించాడు. తాజాగా జరిగిన ప్రైవేట్ షోలో వార్నర్ మాట్లాడుతూ.. క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వస్తే.. మొదటగా అది టెస్ట్ క్రికెట్ అవుతుందని, బహుశా సుదీర్ఘ ఫార్మాట్లో మరో ఏడాది పాటు కొనసాగుతానని, టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్పై సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు వైట్బాల్ క్రికెట్లో మాత్రం 2024 టీ20 వరల్డ్కప్ వరకు కొనసాగుతానని, పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగే అంశంపై తన ఉద్దేశాన్ని బయటపెట్టాడు. వార్నర్ టెస్ట్ల్లో మరో ఏడాది కొనసాగితే.. ఈ మధ్యలో భారత్తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (2023 ఫిబ్రవరి, మార్చి), ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ (2023 జూన్, జులై)లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాగా, 36 ఏళ్ల వార్నర్.. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్కప్లో ఘెరంగా విఫలమైన విషయం తెలిసిందే. అతనితో పాటు అతను ప్రాతినిధ్యం వహించే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కూడా పేలవ ప్రదర్శన కనబర్చి, గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగింది. కాగా, గత దశాబ్ద కాలంగా ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న వార్నర్.. 96 టెస్ట్లు, 138 వన్డేలు, 99 టీ20లు ఆడి, దాదాపుగా 17000 పరుగులు సాధించాడు. ఇందులో 43 శతకాలు, 84 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: T20 WC 2022 Final: అఫ్రిది గాయపడకుంటే కథ వేరేలా ఉండేది: పాక్ కెప్టెన్ -
బాబర్కు ఊహించని ప్రశ్న.. మధ్యలో తలదూర్చిన మేనేజర్
టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ రన్నరప్గానే మిగిలిపోయింది. పాక్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ రెండోసారి పొట్టి ఫార్మాట్లో చాంపియన్గా అవతరించింది. బెన్ స్టోక్స్ ఆల్రౌండ్ ప్రదర్శనకు తోడుగా జట్టు సమిష్టి ప్రదర్శన ఇంగ్లండ్కు విజయాన్ని కట్టబెట్టింది. ఇక మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబార్ ఆజంకు ఐపీఎల్ రూపంలో ఊహించని ప్రశ్న ఎదురైంది. దీనిపై బాబర్ ఏం స్పందించలేదు. అయితే మీడియా మేనేజర్ మధ్యలో తలదూర్చి ప్రశ్న అడిగిన జర్నలిస్ట్కు కౌంటర్ ఇచ్చాడు. ప్రెస్మీట్లో భాగంగా ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ.. "ఐపీఎల్ వల్ల జరుగుతున్న మేలు గురించి మాట్లాడుకుందాం. బాబర్ ఒకవేళ మీకు కానీ లేదా జట్టు సభ్యుల్లో ఐపీఎల్ ఆడే అవకాశం వస్తే ఆడుతారా లేకపోతే వదులుకుంటారా" అని ప్రశ్న వేశాడు. దీనికి బాబర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వెంటనే తన మీడియా మేనేజర్వైపు తిరిగాడు. ''ప్రస్తుతం టి20 ప్రపంచకప్ గురించి మాత్రమే ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. వేరే విషయాల ప్రస్తావన ఎందుకంటూ'' చురకలంటించాడు. ఇక ఈసారి టి20 ప్రపంచకప్లో 1992 సీన్ రిపీట్ అవుతుందని చాలా మంది భావించారు. కానీ ఇంగ్లండ్ బౌలర్ల ముందు పాకిస్తాన్ పప్పులు ఉడకలేదు. అదే విషయాన్ని బాబర్ స్పష్టం చేశాడు. గత మూడు మ్యాచ్ల నుంచి చూసుకుంటే మేం సాధించిన విజయాలతో కాస్త ఉత్సాహంగానే ఉన్నా. కానీ ఫైనల్లో పరాజయం చెందడం కాస్త బాధ కలిగించింది. అయితే ఇంగ్లండ్ మంచి ఆటతీరును ప్రదర్శించింది. మ్యాచ్లో చివరకు ఒకరిని మాత్రమే విజయం వరిస్తుంది. అయితే మా పేస్ దళం బలంగా ఉండడంతో స్ట్రాటజీ వర్క్ చేస్తున్నట్లగా అనిపించింది. కానీ స్టోక్స్ ఆఖరివరకు నిలబడి మ్యాచ్ను మా చేతుల్లోంచి లాగేసుకున్నాడు. గెలవాలన్న తాపత్రయం మాలో ఉన్నప్పటికి కొన్ని పరిస్థితులు మాకు అనుకూలంగా లేకపోవడంతో ఓటమి చెందాల్సి వచ్చింది. కానీ ఫైనల్లో మా ప్రదర్శనతో సంతృప్తిగానే ఉన్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. In the #T20WorldCupFinal pre match press conference, Babar Azam was asked about what it’s like to not play the IPL. He completely ignored the question. pic.twitter.com/4RhE6dlJFg — Change of Pace (@ChangeofPace414) November 12, 2022 చదవండి: మొయిన్ అలీ, రషీద్ విషయంలో బట్లర్ పెద్ద మనసు -
T20 WC 2022 Final: అఫ్రిది గాయపడకుంటే కథ వేరేలా ఉండేది: పాక్ కెప్టెన్
టీ20 వరల్డ్కప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం అనంతరం, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాక్ ఓటమికి షాహీన్ అఫ్రిది గాయపడటమే ప్రధాన కారణమని, పరాభవాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. అఫ్రిది గాయపడినప్పటికీ, తమ బౌలర్లు అసాధారణ పోరాటపటిమ కనబర్చారని, ప్రపంచంలోనే తమ బౌలింగ్ విభాగం అత్యుత్తమమైందని గొప్పలు పోయాడు. బ్యాటింగ్లో మరో 20 పరుగులు చేసి ఉంటే, కథ వేరేలా ఉండేదంటూ ఓటమి బాధలో పిచ్చి వాగుడు వాగాడు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ.. ఇంగ్లండ్ ఛాంపియన్ జట్టులా ఆడింది, వారు విజయానికి అర్హులు అంటూ లేని పరిణితిని ప్రదర్శించాడు. ప్రపంచకప్లో ఫైనల్ వరకు సాగిన మా జర్నీ అద్భుతమని, అంతిమ పోరులో శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, విజయం తమకు దక్కలేదని ఫైనల్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. కాగా, ఇంగ్లండ్ జట్టు 30 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో అఫ్రిది మోకాలి గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. అఫ్రిది గాయం తీవ్రమైంది కావడంతో అతను తిరిగి బరిలోకి దిగలేకపోయాడు. అప్పటికి అతను ఇంకా రెండు ఓవర్లు వేయాల్సి ఉండింది. ఒకవేళ అఫ్రిది బరిలో ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే, మెల్బోర్న్ వేదికగా నిన్న (నవంబర్ 13) జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్.. పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు సామ్ కర్రన్ 3 వికెట్లు, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డన్ తలో 2 వికెట్లు, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్నప్పటికీ, బెన్ స్టోక్స్ (52) అజేయమైన అర్ధసెంచరీతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చడంతో పాటు ఇంగ్లండ్ను రెండోసారి జగజ్జేతగా నిలబెట్టాడు. చదవండి: మొయిన్ అలీ, రషీద్ విషయంలో బట్లర్ పెద్ద మనసు -
మొయిన్ అలీ, రషీద్ విషయంలో బట్లర్ పెద్ద మనసు
టి20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి వరల్డ్కప్ను అందుకున్నారు. బెన్ స్టోక్స్ విజయంలో కీలకపాత్రో పోషించగా.. ఆదిల్ రషీద్ బౌలింగ్లో రెండు వికెట్లు తీసి విజయంలో భాగమయ్యాడు. 2010లో టైటిల్ నిలిచిన ఇంగ్లండ్ మళ్లీ పుష్కరకాలం తర్వాత పొట్టి ఫార్మట్లో చాంపియన్గా అవతరించింది. ఈ నేపథ్యంలో వారి సెలబ్రేషన్స్కు అవదులు లేకుండా పోయాయి. ఇక సెలబ్రేషన్స్ సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ పెద్ద మనసు చాటుకున్నాడు. సాధారణంగా ఒక జట్టు ఎలాంటి మేజర్ టోర్నీలు నెగ్గినా షాంపెన్తో సెలబ్రేషన్ చేయడం చూస్తుంటాం. టైటిల్ అందుకున్న తర్వాత బట్లర్ తన జట్టుతో గ్రూప్ ఫోటో దిగాడు. ఆ తర్వాత షాంపెన్ సెలబ్రేషన్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వెంటనే బట్లర్ రషీద్, మొయిన్ అలీని పిలిచి షాంపెన్ సెలబ్రేషన్ చేస్తున్నాం.. పక్కకు వెళ్లండి అని పేర్కొన్నాడు. అర్థం చేసుకున్న ఈ ఇద్దరు బట్లర్కు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు షాంపెన్ పొంగించి సంబరాలు చేసుకున్నారు. కాగా మద్యపానం ఇస్లాంకు విరుద్ధం. మద్యపానం నిషేధం మాత్రమే కాదు.. ఎక్కడ ఈవెంట్ జరిగినా అక్కడ ముస్లింలు మద్యపానం జోలికి కూడా వెళ్లరు. అందుకే బట్లర్ ఇస్లాం మతానికి విలువనిస్తూ ఆదిల్ రషీద్, మొయిన్ అలీలను పక్కకు వెళ్లమన్నాడు. వాళ్లు వెళ్లిన తర్వాతే షాంపెన్ సెలబ్రేషన్ చేయడం పట్ల బట్లర్కు ఇస్లాం మతంపై ఉన్న గౌరవం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు కూడా ..''బట్లర్ది నిజంగా పెద్ద మనసు.. మతాలకు చాలా విలువనిస్తాడు '' అంటూ కామెంట్ చేశారు. England's captain reminded Adil Rashid to leave and checked to see that he and Moeen Ali had left before they celebrated with champagne. Respect. pic.twitter.com/y30bGRFyHG — ilmfeed (@IlmFeed) November 13, 2022 చదవండి: Ben Stokes: అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో -
T20 WC 2022: ఐసీసీ అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు
టీ20 వరల్డ్కప్-2022 ముగిసిన మరుసటి రోజే (నవంబర్ 14) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. అత్యంత విలువైన ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో మొత్తం ఆరు దేశాలకు ప్రాతినిధ్యం లభించగా.. టీమిండియా నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఈ జట్టుకు ఛాంపియన్ టీమ్ కెప్టెన్ జోస్ బట్లర్ను సారధిగా ఎంపిక చేసిన ఐసీసీ.. వికెట్కీపర్గానూ, ఓపెనర్గానూ అతన్నే ఎంచుకుంది. బట్లర్కు జోడీగా సహచరుడు అలెక్స్ హేల్స్ను మరో ఓపెనర్గా ఎంపిక చేసింది. మ్యాన్ ఆఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ సామ్ కర్రన్తో పాటు మార్క్ వుడ్లకు కూడా జట్టులో అవకాశం కల్పించింది. ఇంగ్లండ్ నుంచి మొత్తం నలుగురికి అవకాశం లభించగా.. టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్లకు ఛాన్స్ దక్కింది. వీరితో పాటు హార్ధిక్ పాండ్యాను 12వ ఆటగాడిగా ఎంచుకుంది. ఓపెనర్లుగా బట్లర్, హేల్స్ను ఎంపిక చేసిన ఐసీసీ.. వన్డౌన్లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)లకు అవకాశం ఇచ్చింది. ఆతర్వాత ఆల్రౌండర్ల కోటాలో సికందర్ రజా (జింబాబ్వే), షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)లకు ఛాన్స్ ఇచ్చి.. బౌలర్లుగా సామ్ కర్రన్, అన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా), మార్క్ వుడ్, షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్)లకు అవకాశం కల్పించింది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ జట్టు.. పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, రెండోసారి టీ20 వరల్డ్కప్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: ఇంగ్లండ్ గెలుపులో మూల స్తంభాలు.. -
Ben Stokes: ఆలస్యమైనా కుంభస్థలాన్ని గట్టిగా బద్దలు కొట్టాడు
టి20 ప్రపంచకప్లో ఆదివారం పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లండ్ విజయంలో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ పాత్ర కీలకం. ఇన్నింగ్స్లో చివరి వరకు మూలస్తంభంలా నిలబడిన స్టోక్స్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అయితే ఇక్కడ మనకు తెలియని విషయమేంటంటే.. స్టోక్స్ టి20 కెరీర్లో ఇదే తొలి అర్థసెంచరీ కావడం. 48 టి20 మ్యాచ్ల కెరీర్లో స్టోక్స్ ఇంతవరకు ఒక్క హాఫ్ సెంచరీ కొట్టలేకపోయాడు. దీనికి చాలా కారణాలున్నాయి. స్టోక్స్ ఎక్కువగా ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చేవాడు. ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్ టాపార్డర్ చాలా వరకు మ్యాచ్లను పూర్తి చేస్తూ రావడంతో స్టోక్స్ ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఈసారి మాత్రం టాపార్డర్ విఫలం కావడంతో తనలోని బ్యాటర్ను బయటకు తీశాడు బెన్ స్టోక్స్. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ ఆల్రౌండర్ అనే పదానికి నిర్వచనం చెప్పాడు. ఎట్టకేలకు టి20 ప్రపంచకప్లో అదీ ఫైనల్లో తొలి అర్థసెంచరీ చేయడమే గాక జట్టున విశ్వవిజేతగా నిలిపిన ఘనత స్టోక్స్కే దక్కుతుంది. 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన స్టోక్స్ అనతికాలంలో గొప్ప ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు పొందాడు. 2019 వన్డే వరల్డ్కప్ గెలవడంలో స్టోక్స్దే కీలకపాత్ర. ఆనాటి ఫైనల్లో అతను ఆడిన 84 పరుగుల ఇన్నింగ్స్ ఇంగ్లండ్ను విజేతగా నిలిపింది. తాజాగా మరోసారి ఆఖరి వరకు క్రీజులో నిలిచి పొట్టి ఫార్మాట్లో రెండోసారి ఇంగ్లండ్ను విజేతగా నిలిపాడు. స్టోక్స్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 86 టెస్టులు, 105 వన్డేలు, 48 టి20 మ్యాచ్లు ఆడాడు.ఇక టి20, టెస్టులపై దృష్టి సారించేందుకు స్టోక్స్ ఈ ఏడాది ఆరంభంలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: Ben Stokes: అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో -
Ben Stokes: అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో
అది 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఇంగ్లండ్, వెస్టిండీస్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్ 19 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో విజయానికి 19 పరుగులు కావాలి. అప్పటివరకు ఇంగ్లండ్ బౌలింగ్ చూస్తే కచ్చితంగా ఆ జట్టుదే విజయం అనిపించింది. ఈ నేపథ్యంలో ఆఖరి ఓవర్ బెన్ స్టోక్స్ వేశాడు. క్రీజులో ఉన్న కార్లోస్ బ్రాత్వైట్ నాలుగు వరుస బంతులను నాలుగు సిక్సర్లుగా మలిచి విండీస్కు మరిచిపోలేని విజయాన్ని అందించి రెండోసారి విశ్వవిజేతగా నిలిపాడు.ఈ చర్యతో మైదానంలోనే కూలబడిన స్టోక్స్ కన్నీటిపర్యంతం అయ్యాడు. చేతిదాకా వచ్చిన వరల్డ్కప్ తనవల్లే చేజారిందంటూ మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యాడు. కట్చేస్తే ఇప్పుడదే స్టోక్స్ ఇంగ్లండ్ ను టి20 వరల్డ్ కప్లో విజేతగా నిలపడం విశేషం. పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్ అద్బుతమని చెప్పొచ్చు. మధ్యలో పాక్ బౌలర్లు తమ లయను అందుకొని వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ ఒత్తిడిలో పడినట్లుగా కనిపించింది. కానీ ఈసారి వరల్డ్కప్ చేజార్చుకోవడం ఇష్టంలేని స్టోక్స్ చివరి వరకు వెన్నెముకలా నిలిచాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచి 48 మ్యాచ్ల టి20 కెరీర్లో తొలి అర్థసెంచరీ చేయడంతో పాటు ఇంగ్లండ్ను రెండోసారి విశ్వవిజేతగా నిలిపాడు. 2016లో విలన్గా నిలిచిన స్టోక్స్ తాజాగా జట్టును గెలిపించి హీరో అయ్యాడు. చదవండి: ఇంగ్లండ్ గెలుపులో మూల స్తంభాలు.. -
ఇంగ్లండ్ గెలుపులో మూల స్తంభాలు..
‘లెట్ ఇట్ హర్ట్...’ ఐర్లాండ్ చేతిలో అనూహ్య ఓటమి తర్వాత తన సహచరులకు ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇ ఏకవాక్య సందేశం ఇది. ఏమీ పర్వాలేదు, గెలుపోటములు ఆటలో భాగం అనే రొటీన్ మాటలు చెప్పి అతను తమ పరాజయాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేయలేదు. ‘ఈ ఓటమి మనల్ని బాధించనివ్వండి. ప్రతీ క్షణం గుర్తు చేసుకుంటేనే తర్వాతి మ్యాచ్లు గెలవాలన్న కసి పెరుగుతుంది’ అని బట్లర్ చెప్పాడు. తర్వాతి మ్యాచ్ ఆస్ట్రేలియాతో వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. దాంతో ముందంజ వేయడంపై మరోసారి సందేహాలు! అయితే తర్వాతి రెండు మ్యాచ్లలో సత్తా చాటుతూ కివీస్, శ్రీలంకపై విజయాలతో సెమీస్, ఆపై భారత్పై ఘన విజయంతో ఫైనల్లో చోటు. ఇక తుది పోరులో కూడా సంపూర్ణ ఆధిపత్యంతో టైటిల్ సొంతం. - సాక్షి క్రీడా విభాగం ఇంగ్లండ్ టైటిల్ విజయంలో ప్రధాన ఆటగాళ్లందరి పాత్ర ఉంది. కీలక సమయాల్లో వీరంతా తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. ఓపెనర్లుగా బట్లర్ (225 పరుగులు), హేల్స్ (212 పరుగులు) అదీ దాదాపు 150 స్ట్రయిక్రేట్తో పరుగులు చేయడంతో ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం సాధించేందుకు వీలు కలిగింది. వీరిద్దరు కలిసి టోర్నీలో 6 మ్యాచ్లలోనే 43 ఫోర్లు, 17 సిక్సర్లు బాదడం విశేషం. మిడిలార్డర్లో కొంత తడబాటు కనిపించినా ఓపెనర్లు ఇచ్చిన పునాదులపైనే ఇంగ్లండ్ విజయయాత్ర సాగిందనడం అతిశయోక్తి కాదు. ‘బిగ్ గేమ్–బిగ్ మ్యాన్’ అంటూ గుర్తింపు తెచ్చుకున్న బెన్ స్టోక్స్ నిజంగా ఈ టోర్నీలో జట్టుకు మూలస్థంభంలా నిలిచాడు. టోర్నీకి ముందు టి20 టీమ్లో అతని స్థానంపై విమర్శలు వచ్చాయి. అయితే బ్యాటింగ్ అవసరమైతే బ్యాటింగ్తో, బౌలింగ్ అవసరమైతే బౌలింగ్తో అతను సత్తా చాటాడు. శ్రీలంకతో మ్యాచ్లో, ఫైనల్లో అతను పట్టుదలగా నిలబడి ఉండకపోతే ఫలితాలు భిన్నంగా ఉండేవేమో! కొత్త బంతితో కేవలం 6.79 ఎకానమీతో అతను తీసిన 6 కీలక వికెట్లు ఇంగ్లండ్ను ముందుకు నడిపించాయి. బౌలింగ్లో స్యామ్ కరన్ చూపిన ప్రతిభ అసాధారణం. గత ఏడాది గాయంతో వరల్డ్ కప్కు దూరమై కామెంటేటర్గా మైదానంలో కనిపించిన అతను ఏడాదిలోగా ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు. అతను తీసిన 13 వికెట్లలో ప్రతీది విలువైందే. ముఖ్యంగా ఫైనల్లో ప్రదర్శన చిరకాలం గుర్తుండిపోతుంది. కరన్కు తోడుగా లెగ్స్పిన్నర్ ఆదిల్ రషీద్ ముద్ర కూడా టోరీ్నపై ఎంతో ఉంది. రషీద్ ఆటను చూసినప్పుడల్లా భారత అభిమానులు చహల్తో ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడించలేదు అని బాధపడటం సహజం! 6.12 ఎకానమీతో అతను ప్రత్యర్థులను కట్టి పడేశాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఇన్నింగ్స్ 12వ ఓవర్ మెయిడిన్ వేయడం అంటే సాధారణ విషయం కాదు. అదీ బాబర్ ఆజమ్ వికెట్తో రావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. మార్క్ వుడ్ తన పదునైన పేస్తో 4 మ్యాచుల్లోనే 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. 2015 వన్డే వరల్డ్ కప్లో చిత్తయిన తర్వాత ఆట, రాత మార్చుకున్న ఇంగ్లండ్ మోర్గాన్ నాయకత్వంలో పదును తేలింది. విధ్వంసక జట్టుగా తయారై 2019లో విశ్వ విజేతగా నిలిచింది. మోర్గాన్ జట్టుకు కొత్త దశ, దిశను చూపించినవాడిగా నిలిచాడు. ఇప్పుడు సరైన సమయంలో మోర్గాన్ తప్పుకొని బట్లర్కు పగ్గాలు అప్పగించాడు. కొత్త కెప్టెన్సీలో కొన్ని కొత్త మొహాలు వచ్చాయంతే...జట్టు దృక్పథం మాత్రం మారలేదు. అదే దూకుడు, అవసరమైతే 11వ నంబర్ ఆటగాడు కూడా సిక్స్లు కొట్టేందుకు సిద్ధంగా ఉండటం, జట్టులో సగం మంది ఆల్రౌండర్లు ఒక విభాగంలో విఫలమైతే, రెండో విభాగంలో సత్తా చాటుకోవడం... ఇవన్నీ జట్టులో అంతర్భాగంగా మారిపోయాయి. ఫలితంగానే పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుసగా రెండో ప్రపంచకప్ ఇంగ్లండ్ ఇంటికి చేరింది. -
సామ్ కర్రాన్ అరుదైన ఘనత.. తొలి బౌలర్గా!
టీ20 ప్రపంచకప్-2022 ఛాంపియన్స్గా ఇంగ్లండ్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి విశ్వవిజేతగా ఇంగ్లండ్ అవతరించడంలో ఆ జట్టు ఆల్రౌండర్ సామ్ కర్రాన్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా ఫైనల్లో మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ను దెబ్బకొట్టాడు. తుదిపోరులో తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక ఈ మెగా టోర్నీలో మొత్తం 6 మ్యాచ్లు ఆడిన కర్రాన్ 13 వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా ఈవెంట్లో అద్భుత ప్రదర్శన గాను ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్గా కర్రాన్ ఎంపికయ్యాడు. అదే విధంగా ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా కర్రాన్కే వరిచింది. కాగా ప్లేయర్ ఆఫ్ది టోర్నమెంట్ అవార్డు సాధించిన తొలి స్పెషలిస్టు బౌలర్గా సామ్ కర్రాన్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచినది వీరే షాహిద్ అఫ్రిది(2007) తిలకరత్నే దిల్షాన్(2009) కెవిన్ పీటర్సన్(2010) షేన్ వాట్సన్(2012) విరాట్ కోహ్లీ(2014,2016) డేవిడ్ వార్నర్(2021) సామ్ కర్రాన్(2022) View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 WC 2022: ఇంగ్లండ్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి! -
ఇంగ్లండ్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి!
టీ20 ప్రపంచకప్-2022 ఛాంపియన్స్గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ప్రపంచ చాంపియన్లుగా ఉంటూనే టీ20 చాంపియన్షిప్ను కైవసం చేసుకున్న తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఇప్పటికే 2019లో వన్డే ప్రపంచకప్ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి తొలి ప్రపంచకప్ టైటిల్ను ఇంగ్లండ్ ముద్దాడింది. ఇప్పుడు పాకిస్తాన్కు చిత్తు చేసి మరోమారు పొట్టి ప్రపంచకప్ను ఇంగ్లీష్ జట్టు సొంతం చేసుకుంది. దీంతో ఈ అరుదైన ఘనత ఇంగ్లండ్ తమ ఖాతాలో వేసుకుంది. కాగా 2023లో వన్డే ప్రపంచకప్ ముగిసేంత వరకు.. 2024 నాటి టీ20 వరల్డ్కప్ సమరం పూర్తయ్యేవరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఛాంపియన్ హోదాలో ఇంగ్లండ్ ఉండనుంది. ఇక ఓవరాల్గా ఇంగ్లండ్ ఖాతాలో మొత్తం మూడు ఐసీసీ వరల్డ్కప్ టైటిల్స్ ఉన్నాయి. అదే విధంగా రెండు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్స్గా నిలిచిన రెండో జట్టుగా ఇంగ్లండ్ అవతరించింది. అంతకుముందు వెస్టిండీస్ 2012, 2016లో విశ్వ విజేతగా నిలిచింది. చదవండి: T20 WC 2022: ‘సారీ బ్రదర్... దీన్నే కర్మ అంటారు' అక్తర్కి కౌంటర్ ఇచ్చిన షమీ -
‘సారీ బ్రదర్... దీన్నే కర్మ అంటారు' అక్తర్కి కౌంటర్ ఇచ్చిన షమీ
మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తు చేసిన ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్-2022 విజేతగా నిలిచింది. అయితే ఫైనల్లో పాక్ ఓటమిని ఆ దేశ మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఓటమి అనంతరం పాకిస్తాన్ దిగ్గజ పేసర్ ‘గుండె బద్ధలైంది’ అన్నట్టుగా ఎమోజీని ట్వీట్ చేశాడు. అయితే అక్తర్ ట్వీట్పై భారత పేసర్ మహ్మద్ షమీ వ్యంగ్యంగా స్పందించాడు. ‘సారీ బ్రదర్... దీన్నే కర్మ ’ అంటారు అంటూ షమీ రిప్లే ఇచ్చాడు. కాగా సెమీఫైనల్లో ఇంగ్లండ్పై ఓటమి పాలై ఇంటిముఖం పట్టిన భారత జట్టును పాక్ మాజీలు హేళన చేశారు. "ఈ ఆటతీరుతో ప్రపంచకప్ ఫైనల్కు వస్తుందా.. పాక్తో తలపడే అర్హత టీమిండియాకు లేదంటూ " అక్తర్ కూడా విమర్శలు చేశాడు. దీనికి బదులుగా షమీ ఇప్పుడు గట్టి కౌంటర్ ఇచ్చాడు. అదృష్టం కలిసొచ్చి సెమీస్కు గ్రూప్ స్టేజీలోనే ఇంటి దారి పడుతోంది అనుకున్న పాకిస్తాన్ జట్టు అదృష్టం కలిసొచ్చి సెమీస్లో అడుగుపెట్టింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలవ్వడంతో పాకిస్తాన్ లక్కీగా సెమీస్కు చేరుకుంది. అయితే సెమీఫైనల్లో న్యూజిలాండ్పై అనూహ్య విజయంతో పాక్ ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ పటిష్టమైన ఇంగ్లండ్ ముందు పాక్ తలవంచింది. ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైన పాకిస్తాన్ రన్నరప్గా నిలిచింది. Sorry brother It’s call karma 💔💔💔 https://t.co/DpaIliRYkd — Mohammad Shami (@MdShami11) November 13, 2022 చదవండి: T20 WC 2022: అప్పుడు వన్డే ప్రపంచకప్.. ఇప్పుడు టీ20 వరల్డ్కప్! హీరో ఒక్కడే -
అప్పుడు వన్డే ప్రపంచకప్.. ఇప్పుడు టీ20 వరల్డ్కప్! హీరో ఒక్కడే
టీ20 ప్రపంచకప్-2022 ట్రోఫీని ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్.. రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. స్టోక్స్ ఆల్రౌండ్ షో ఇంగ్లండ్ విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్లో కీలక వికెట్ పడగొట్టిన స్టోక్స్.. అనంతరం బ్యాటింగ్లో 52 పరుగులతో అఖరి వరకు నిలిచి జట్టును జగజ్జేతగా నిలిపాడు. పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను స్టోక్స్ అదుకున్నాడు. హ్యారీ బ్రూక్తో కలిసి కీలక బాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం బ్రూక్ ఔటైనప్పటికీ.. స్టోక్స్ మాత్రం ఎక్కడ పాక్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. అఖరికి విన్నింగ్ రన్స్ కూడా స్టోక్స్ బ్యాట్ నుంచే వచ్చాయి. 2019 వన్డే ప్రపంచకప్లో.. 2019 వన్డే ప్రపంచకప్ను ఇంగ్లండ్ కైవసం చేసుకోవడంలోనూ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 84 పరుగులు చేసిన స్టోక్స్.. జట్టుకు తొలి ప్రపంచకప్ టైటిల్ను అందించాడు. ఈ మ్యాచ్లో కూడా స్టోక్స్ ఆఖరి వరకు ఆజేయంగా నిలిచాడు. అయితే మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ కూడా డ్రా కావడంతో.. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించారు. సూపర్ ఓవర్లో కూడా మూడు బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ 8 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 WC 2022 Winner Prize Money: ఛాంపియన్ ఇంగ్లండ్కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? భారత్కు మరి! -
Pak Vs Eng: సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్నావు కదా బాబర్! ఇప్పుడేమంటావు?
ICC Mens T20 World Cup 2022- Pakistan vs England, Final: ‘‘చరిత్ర పునరావృతం కాబోతోంది.. ట్రోఫీ గెలుస్తాం..’’.. టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం చేసిన వ్యాఖ్యలు. టాస్ సమయంలో అతడు మాట్లాడుతూ.. 1992 నాటి సెంటిమెంట్ రిపీట్ అవుతుందంటూ జోస్యం చెప్పాడు. కానీ.. నాటి ఆ సెంటిమెంట్ ఇప్పుడు పాకిస్తాన్ జట్టుకు కలిసి రాలేదు. పటిష్టమైన జట్టుగా పేరున్న ఇంగ్లండ్ పొట్టి ఫార్మాట్లో తమ సత్తా చాటుతూ విశ్వవిజేతగా నిలిచింది. తద్వారా మూడోసారి ఐసీసీ ట్రోఫీ గెలిచి సగర్వంగా తాజా టోర్నీని ముగించింది. మెల్బోర్న్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు అద్భుతంగా రాణించారు. పాక్ను 137 పరుగులకే కట్టడి చేశారు. లక్ష్య ఛేదనలో పాక్ బౌలర్లు కాసేపు ఇంగ్లండ్ను భయపెట్టినా.. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ వాళ్ల ఆటలు సాగనివ్వలేదు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే అర్ధ శతకం(52 పరుగులు) సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో 2010 తర్వాత ఇంగ్లండ్కు మరోసారి టీ20 వరల్డ్కప్ ట్రోఫీ దక్కింది. ఇక 2009లో చాంపియన్గా నిలిచిన పాకిస్తాన్ మరోసారి కప్ అందుకోవాలని భావించగా వాళ్లకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో బాబర్ మాటలను ఉద్దేశించి నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. ‘‘సెంటిమెంట్లు నమ్ముకుంటే పనికాదని ఇప్పటికైనా అర్థమైందా? టీమిండియా గురించి మీ వాళ్లు మాట్లాడిన మాటలు ఇప్పుడేమయ్యాయి. అయినా ప్రతిసారి లక్ కలిసి రాదు. నెదర్లాండ్స్ సౌతాఫ్రికాను ఓడించి ఉండకపోతే అసలు సెమీస్ దాకా కూడా వచ్చేవాళ్లు కాదు! ఇకనైనా ప్రగల్భాలు మాని ఆటపై దృష్టి పెట్టండి’’ అంటూ హితవు పలుకుతున్నారు. నీ బెస్ట్ కోహ్లి వరస్ట్ కంటే కూడా వేస్ట్ కాగా 1992 వన్డే వరల్డ్కప్ మాదిరే టీ20 ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్లోనూ పాక్కు పరిస్థితులు అనుకూలంగా కనిపించాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ మాదిరి బాబర్ ఆజం కూడా ఐసీసీ ట్రోఫీ గెలుస్తాడంటూ పాక్ ఫ్యాన్స్ ఆశపడగా.. బట్లర్ బృందం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇక ఈ మ్యాచ్లో బ్యాటర్గానూ బాబర్ ఆజం తన స్థాయికి తగ్గట్లు రాణించలేదు. 28 బంతుల్లో 32 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డులు బ్రేక్ చేస్తున్నాడంటూ ప్రశంసలు అందుకున్న బాబర్.. ఈ టోర్నీలో కోహ్లి క్లిక్ అయితే, అతడు మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. నిజానికి కోహ్లి వరస్ట్ ఇన్నింగ్స్ కంటే కూడా బాబర్ ఆజం బెస్ట్ ఇన్నింగ్స్ దారుణంగా ఉంది’’ అంటూ ట్రోలింగ్కు దిగారు మరికొంతమంది. చదవండి: Chris Jordan: ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు The "world class" Babar Azam getting out in the final with 32 off 28. 😭😭😭 Kohli's worst form was his best form. Never compare Zimbabar to King Virat again. #T20WorldCupFinal #T20worldcup22 #PAKvENG #PAKvsEng #EngvsPak #ENGvPAK #PKMKBForever #PKMKB https://t.co/iJBMD4gpKe — Maddy (@EvilRashford) November 13, 2022 Virat Kohli in T20Is since Asia Cup 2022: Innings: 16 Runs: 747 Average: 74.7 Strike Rate: 141.21 50s/100s: 7/1 ICC Player of the Month Babar Azam in T20 WC 2022: Matches: 7 Runs: 124 Average: 17.5 Strike Rate: 97.53 So Called 'GOAT' LOL#BabarAzam𓃵#PAKvsEng #England #Pakistan pic.twitter.com/rQiNBjGp90 — Abhishek Gurav (@GuravAbhishek7) November 13, 2022 For the folks who are still in 1992.#PKMKBForever#PAKvENG #EngvsPak pic.twitter.com/jhwMzKI6jG — बिहारी मानुष (@aditya_0115) November 13, 2022 -
ఛాంపియన్ ఇంగ్లండ్కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? భారత్కు మరి!
టీ20 ప్రపంచకప్-2022 ఛాంపియన్స్గా ఇంగ్లండ్ నిలిచింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తు చేసిన ఇంగ్లండ్ రెండోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్లో కీలక వికెట్ పడగొట్టిన స్టోక్స్.. అనంతరం బ్యాటింగ్లో 52 పరుగులతో అఖరి వరకు నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అదే విధంగా ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 12 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకుగాను కరన్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు, రన్నరప్ పాకిస్తాన్ జట్టుకు ఎంత ప్రైజ్మనీ లభించిందో ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. విజేతకు ఎంతంటే? టీ20 ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్కు ప్రైజ్మనీ రూపంలో 1.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 13 కోట్ల రూపాయలు) లభించింది. అదే విధంగా అదే విధంగా రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్కు 8,00,000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 6.5 కోట్లు) దక్కింది. ఇక సెమీ ఫైనల్లో ఓటమి పాలైన భారత్, న్యూజిలాండ్కు 4,00,000 డాలర్ల ( సుమారు రూ.3.25 కోట్లు) చొప్పున అందింది. అదే విధంగా సూపర్ 12 దశ నుంచి వైదొలిగిన 8 జట్లకు 70,000 డాలర్ల చొప్పున లభించింది. చదవండి: T20 WC 2022 Final: పాకిస్తాన్ను చిత్తుచేసి విశ్వవిజేతగా ఇంగ్లండ్ -
టీ ట్వంటీ ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్
-
T20 WC 2022 Final: పాకిస్తాన్ను చిత్తుచేసి విశ్వవిజేతగా ఇంగ్లండ్
ICC Mens T20 World Cup 2022- Final Pakistan vs England: పొట్టి ఫార్మాట్ క్రికెట్లో ఇంగ్లండ్ మరోసారి జగజ్జేతగా నిలిచింది. 2010లో పాల్ కాలింగ్ వుడ్ బృందం ట్రోఫీ గెలవగా.. బట్లర్ సేన టీ20 ప్రపంచకప్-2022 కప్ను సొంతం చేసుకుంది. దీంతో మరోసారి వరల్డ్కప్ టైటిల్ గెలవాలన్న పాక్ ఆశలు అడియాసలయ్యాయి. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం ఇంగ్లండ్- పాకిస్తాన్ ప్రపంచకప్ ఫైనల్లో తలపడ్డాయి. సామ్ కరన్ అదరగొట్టాడు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఐదో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(14 బంతుల్లో 15 పరుగులు)ను అవుట్ చేసి సామ్ కరన్ పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనానికి బాటలు పరిచాడు. ఇక ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్, క్రిస్ జోర్డాన్ తమ వంతు సాయం చేశారు. సామ్ అత్యధికంగా 3, రషీద్, జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. స్టోక్స్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజం 32, షాన్ మసూత్ 38 పరుగులతో రాణించారు. రిజ్వాన్ 15 పరుగులు చేయగా.. షాదాబ్ ఖాన్ 20 రన్స్ తీశాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఆదిలోనే షాక్.. అయినా ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ను ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు షాహిన్ ఆఫ్రిది. టీమిండియాతో సెమీస్లో హీరోగా నిలిచిన ఓపెనర్ అలెక్స్ హేల్స్(1)ను తొలి ఓవర్లోనే బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత హ్యారీస్ రవూఫ్ ఫిలిప్ సాల్ట్(10)ను పరుగులకే పెవిలియన్కు చేర్చాడు. బట్లర్(26) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పవర్ ప్లేలో 49 పరుగులు చేసిన ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసే సరికి 77 పరుగులతో పటిష్టంగా కనిపించినా.. ఆ తర్వాతి ఓవర్లలో పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భయపెట్టిన పాక్ బౌలర్లు.. ఆదుకున్న స్టోక్స్ దీంతో 11వ ఓవర్లో 2, 12వ ఓవర్లో 3, 13వ ఓవర్లో 5, 14వ ఓవర్లో 2 పరుగులు మాత్రమే చేసింది ఇంగ్లండ్. ఈ క్రమంలో మరో రెండు వికెట్లు పడినా ఆల్రౌండర్ బెన్ స్టోక్స్(52) ఆచితూచి ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మహ్మద్ వసీం జూనియర్ బౌలింగ్లో సింగిల్ తీసి ఇంగ్లండ్ గెలుపును ఖరారు చేశాడు. ఈ క్రమంలో ఐదు వికెట్లతో పాక్ను చిత్తు చేసిన బట్లర్ బృందం టీ20 ప్రపంచకప్-2022 చాంపియన్గా అవతరించింది. సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా మూడేళ్ల కాలంలో ఇంగ్లండ్ ఐసీసీ టైటిల్ గెలవడం ఇది రెండోసారి. 2019లో వన్డే వరల్డ్కప్.. తాజాగా పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది ఇంగ్లిష్ జట్టు. టీ20 ప్రపంచకప్ 2022: ఫైనల్ పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ స్కోర్లు: టాస్: ఇంగ్లండ్... ఫీల్డింగ్ పాకిస్తాన్: 137/8 (20) ఇంగ్లండ్: 138/5 (19) ఐదు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ చదవండి: Chris Jordan: ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు -
షాదాబ్ ఖాన్ అరుదైన ఘనత.. తొలి పాక్ బౌలర్గా
అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్ బౌలర్గా షాదాబ్ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్ను ఔట్ చేసిన షాదాబ్.. ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 84 టీ20లు ఆడిన షాదాబ్ ఖాన్.. 98 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ దిగ్గజం షాహిద్ ఆఫ్రిది(97) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ఆఫ్రిది రికార్డును షాదాబ్ బ్రేక్ చేశాడు. ఇక పైనల్ మ్యాచ్లో షాదాబ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. చదవండి: Chris Jordan: ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు -
'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు'
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి పాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో టీ20 క్రికెట్కు భారత సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అదే విధంగా టీ20ల్లో కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. తాజగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టుకు రోహిత్ ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఇక ఏడాది ప్రపంచకప్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీలో ఆరు మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం116 పరుగులు మాత్రమే చేశాడు. "టీ20 ప్రపంచకప్-2024కు ముందు చాలా మంది భారత సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రాబోయే టీ20 ప్రపంచకప్లో ఖచ్చితంగా ఆడడు. అతడు త్వరలో అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది" అని క్రిక్ ట్రాకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: Pak Vs Eng: పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బౌలర్లు.. టోర్నీ ఆసాంతం -
ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు
టి20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ చర్య నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ జోర్డాన్ వేశాడు. ఆ ఓవర్లో జోర్డాన్ వేసిన నాలుగో బంతిని మహ్మద్ వసీమ్ కట్షాట్ ఆడగా నేరుగా హ్యారీబ్రూక్ చేతుల్లోకి వెళ్లింది. బ్రూక్ క్యాచ్ పట్టుంటే మాత్రం టోర్నీలో మరొక బెస్ట్ క్యాచ్ నమోదయ్యేది. కానీ ఆఖరి నిమిషంలో బ్రూక్ బంతిని కింద పెట్టేశాడు. అప్పటికే మహ్మద్ వసీమ్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే బ్రూక్ బంతి విసరగా అందుకున్న జోర్డాన్ త్రో వేయడంలో విఫలమయ్యాడు. అలా బంతి మరోసారి పరుగులు పెట్టింది. స్టోక్స్ త్రో వేయగా.. ఈసారి కూడా జోర్డాన్ వికెట్లకు బంతిని వేయడంలో విఫలమయ్యాడు. అలా జోర్డాన్ చేసిన పనికి పాక్కు మూడు పరుగులు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్గా మారింది. ఇక టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్లో ఘోరంగా తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పాక్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ ఆజం 32, షాన్ మసూద్ 38 పరుగులు చేశారు. pic.twitter.com/rQ5PRkMLg7 — The sports 360 (@Thesports3601) November 13, 2022 చదవండి: T20 WC Final: ఇంగ్లండ్, పాక్ ఫైనల్.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్ -
WC 2022 Final: పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బౌలర్లు.. టోర్నీ ఆసాంతం
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs England, Final: టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. మెల్బోర్న్ మ్యాచ్లో ఆది నుంచే తమ ప్రణాళికను అమలు చేసిన ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పాక్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. ఐదో ఓవర్ రెండో బంతికి పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(14 బంతుల్లో 15 పరుగులు)ను అవుట్ చేసి సామ్ కరన్ శుభారంభం అందించాడు. తర్వాత ఆదిల్ రషీద్ మహ్మద్ హారీస్(8), బాబర్ ఆజం(32)ను పెవిలియన్కు పంపగా.. స్టోక్స్ ఇఫ్తీకర్ అహ్మద్(0) పని పట్టాడు. ఇక జోరు కనబరిచిన షాన్ మసూద్(28 బంతుల్లో 38 పరుగులు)ను అవుట్ చేసి సామ్ కరన్ రెండో వికెట్ తన ఖాతాలో వేసుకోగా..క్రిస్ జోర్డాన్ షాదాబ్ ఖాన్(20)ను ఆరో వికెట్గా పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత సామ్ మరోసారి తన మ్యాజిక్తో మహ్మద్ నవాజ్(5) వికెట్ తీయగా.. ఆఖరి ఓవరల్లో మహ్మద్ వసీం జూనియర్(4)ను అవుట్ చేసి జోర్డాన్ పాక్ ఇన్నింగ్స్లో చివరి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నారు ఇంగ్లీష్ బౌలర్లు. 16- 20 ఓవర్ల మధ్యలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు కూల్చారు. తమకు ఎదురులేదని మరోసారి నిరూపించుకున్నారు. పాక్తో ఫైనల్లో 16-20 ఓవర్లలో 16.2: సామ్ కరన్- షాన్ మసూద్ వికెట్ 17.2: క్రిస్ జోర్డాన్- షాదాబ్ ఖాన్ వికెట్ 18.3: సామ్ కరన్- మహ్మద్ నవాజ్ వికెట్ 19.3: క్రిస్ జోర్డాన్- మహ్మద్ వసీం జూనియర్ వికెట్ ఈ ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్ డెత్ ఓవర్లలో బౌలింగ్ సాగిందిలా.. 23/6 అఫ్గనిస్తాన్, పెర్త్ 30/7 ఐర్లాండ్, మెల్బోర్న్ 36/3 న్యూజిలాండ్ , బ్రిస్బేన్ 25/5 శ్రీలంక, సిడ్నీ రెండో సెమీ ఫైనల్- 68/3 ఇండియా, అడిలైడ్ ఫైనల్- 31/4 పాకిస్తాన్, మెల్బోర్న్ చదవండి: T20 WC 2022: సామ్ కరన్ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి బౌలర్గా -
ఇంగ్లండ్, పాక్ ఫైనల్.. ఆకట్టుకున్న 13 ఏళ్ల జానకి ఈశ్వర్
టి20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఫైనల్ చేరడంలో విఫలమైనప్పటికి భారత సంతతికి చెందిన 13 ఏళ్ల జానకి ఈశ్వర్ అనే అమ్మాయి ఫైనల్ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియన్ రాక్బాండ్ గ్రూఫ్తో కలిసి పాట పాడుతూ తన మధుర గానంతో స్టేడియాన్ని హోరెత్తించింది. ఆస్ట్రేలియన్ రాక్బాండ్లో ఒకటైన ఐస్ హౌస్ సాంగ్ను ట్రూప్ కంపోజ్ చేయగా.. జానకి ఈశ్వర్ ఎటువంటి బెరుకు లేకుండా పాడడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక జానకి ఈశ్వర్ తల్లిదండ్రులు అనూప్ దివకరణ్, దివ్వా రవీంద్రన్లు కేరళకు చెందినవారు. అయితే 15 ఏళ్ల క్రితమే ఈ దంపతులు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగిన జానకి ఈశ్వర్ ఆస్ట్రేలియన్ రాక్బాండ్లో తన పాటలతో అదరగొడుతుంది. ఇక వాయిస్ ఆస్ట్రేలియా పేరిట నిర్వహించిన ప్రోగ్రామ్ ద్వారా జానకి ఈశ్వర్ తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్లో ఘోరంగా తడబడింది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో పాక్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ ఆజం 32, షాన్ మసూద్ 38 పరుగులు చేశారు. pic.twitter.com/u9pqffBQmp — The sports 360 (@Thesports3601) November 13, 2022 చదవండి: సామ్ కరన్ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి బౌలర్గా -
సామ్ కరన్ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి బౌలర్గా
టి20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ అరుదైన రికార్డు అందుకున్నాడు. టి20 ప్రపంచకప్లలో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. తాజాగా పాకిస్తాన్తో జరుగుతున్న ఫైనల్లో మహ్మద్ రిజ్వాన్ను ఔట్ చేయడం ద్వారా సామ్ కరన్ ఈ ప్రపంచకప్లో 11వ వికెట్ సాధించాడు. సామ్ కరన్ తర్వాత వరుసగా రియాన్ సైడ్బాటమ్(10 వికెట్లు, 2010), గ్రేమ్ స్వాన్(10 వికెట్లు, 2010), డేవిడ్ విల్లే(10 వికెట్లు, 2016) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ తడబడుతుంది. 13 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. బాబర్ ఆజం 32 పరుగులు చేసి ఔట్ కాగా.. షాన్ మసూద్ 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు. చదవండి: Pak Vs Eng: చరిత్ర పునరావృతం కాబోతోంది.. ట్రోఫీ గెలుస్తాం: బాబర్ ఆజం -
Pak Vs Eng: చరిత్ర పునరావృతం కాబోతోంది.. ట్రోఫీ గెలుస్తాం: బాబర్ ఆజం
ICC Mens T20 World Cup 2022- Pakistan vs England, Final: ‘‘మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. కానీ టాస్ మా చేతుల్లో లేదు కదా! కాబట్టి ఇప్పుడు వీలైనన్ని పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాం. వాళ్లను ఒత్తిడిలోకి నెట్టేస్తాం. మా జట్టు ఆట తీరు బాగుంది. ఫైనల్లో కూడా మేము దానిని కొనసాగిస్తాం. ఆరంభంలో కొన్ని మ్యాచ్లలో మేము ఓడిపోయినప్పటికీ.. ఫైనల్ వరకు చేరుకోగలగడం సానుకూల అంశం. జట్టుగా వందకు వంద శాతం గెలుపు కోసం కష్టపడుతూనే ఉన్నాం. చరిత్ర పునరావృతం కాబోతోంది. ఈ మ్యాచ్ గెలిచి కప్ గెలిచేందుకు మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. 1992 వరల్డ్కప్ టోర్నీ మాదిరి పాకిస్తాన్ ఈసారి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీ అందుకోబోతుందంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో పాకిస్తాన్.. ఇంగ్లండ్తో తలపడుతోంది. ఆదివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బాబర్ ఆజం బృందాన్ని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో బాబర్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సెమీస్లో న్యూజిలాండ్తో తలపడిన జట్టుతోనే ఫైనల్ ఆడనున్నట్లు తెలిపాడు. ఇక బట్లర్ మాట్లాడుతూ.. కఠిన సవాలుకు తాము సిద్ధమయ్యామని, వాతావరణం దృష్ట్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నట్లు వెల్లడించాడు. ఇక తాము సైతం టీమిండియాతో రెండో సెమీ ఫైనల్లో తలపడ్డ జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2022: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ పాకిస్తాన్ తుది జట్టు: బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది. ఇంగ్లండ్: జోస్ బట్లర్(వికెట్ కీపర్/ కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్. చదవండి: T20 WC 2022: ఫైనల్కు ముంగిట ఇంగ్లండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్ -
ఇద్దరు దిగ్గజాలు కలిసిన వేళ..
సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా.. ఇద్దరు ఇద్దరే. సమకాలీన క్రికెట్లో పరుగులు సాధించడంలో పోటీ పడ్డారు. సచిన్ రెండు ఫార్మాట్లలో(వన్డే, టెస్టులు) ఎదురులేకుండా సాగితే.. లారా మాత్రం టెస్టుల్లో సచిన్కు ధీటుగా నిలిచాడు. అంతేకాదు ఎవరికి సాధ్యం కాని క్వాడ్రపుల్ సెంచరీ(400 పరుగులు)ని లారా అందుకున్నాడు. సచిన్ వంద సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకున్నప్పటికి ట్రిపుల్ సెంచరీ, క్వాడ్రపుల్ సెంచరీలు తీరని కలగానే మిగిలిపోయాయి. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకేచోట కలిస్తే చూడడానికి ఆ ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంటుంది. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్కు హాజరైన వీరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు తమ గురించి అభిమానులకు కొన్ని వాస్తవాలను తెలియపరిచారు. మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు..తమ ట్రేడ్ మార్క్, నిరాశలో కూరుకున్నప్పుడు ఎలా ఉన్నారు లాంటి విషయాలను వెల్లడించారు. ఎగ్జిబిషన్ మ్యాచ్లో సచిన్, లారా కలిసి బ్యాటింగ్ చేయడం గురించి కునాల్ అడిగారు. ఆ వీడియో కోసం అభిమానులు యూట్యూబ్లో విపరీతంగా సెర్చ్ చేశారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్లతో లాంటి స్టార్లు ఉన్న పాకిస్థాన్ లైనప్ను ఎలా కూల్చివేశారో సచిన్, లారా వివరంగా తెలియజేశారు. సిడ్నీలో సచిన్ ఐకానిక్ డబుల్ సెంచరీ చేసినప్పుడు తన ఆనందాన్ని ఎలా నియంత్రించుకున్నాడో లారా గుర్తు చేసుకున్నాడు. ప్రతి అభిమానివ వలే ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు. అలాగే లారా పరుగుల దాహం, నిలకడం, నైపుణ్యం గురించి సచిన్ ప్రశంసించాడు. కరెబియన్ దిగ్గజం కిట్ బ్యాగ్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. టి20 రాకతో క్రికెట్ చాలా మారిపోయిందని ఇద్దరు మాజీలు తెలియజేశారు.ఇప్పటి బ్యాటర్లు తమ వినూత్న 360 డిగ్రీల షాట్లతో బ్యాటింగ్లో విప్లవాత్మక మార్పులు చేశారని.. కొంతమంది వారిని ఎగతాళీ చేసినప్పటికీ.. వారి వైవిధ్యమైన ఆటతీరు గేమ్ను మంచిగా మార్చివేసిందని లారా స్పష్టం చేశాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం చాలాకష్టమని.. కొంతమంది టెస్టుల్లో కష్టపడుతుంటే.. కొంతమంది మాత్రం టి20 ఫార్మాట్లో సవాలు ఎదుర్కొంటున్నారని తెలిపాడు. పాకిస్థాన్కు మెరుగైన జట్టు ఉందని లారా అభిప్రాయపడ్డాడు. మరోవైపు సచిన్ ఎంసీజీ మైదానం ఇంగ్లాండ్కు కలిసొస్తుందని, అందుకని బట్లర్ జట్టు గెలిచే అవకాశముందని స్పష్టం చేశాడు. మొత్తంమీద సచిన్, లారా ఇద్దరూ మరోసారి తమ అభిమానులతో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. కాలు విరగొట్టుకున్న స్టార్ ఆల్రౌండర్
స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్-2022లో గ్రూప్ దశలోనే నిష్క్రమించి పరువు పోగొట్టుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు.. ఆ బాధ నుంచి తేరుకోకముందే మరో భారీ షాక్ తగిలింది. శనివారం (నవంబర్ 12) జరిగిన స్నేహితుడి బర్త్ డే పార్టీలో ప్రమాదవశాత్తు జారిపడిన ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కాలు విరగొట్టుకున్నాడు. దీంతో వరల్డ్కప్ అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్ మొత్తానికి అతను దూరమయ్యాడు. మాక్స్వెల్ కాలికి ఇవాళ సర్జరీ చేసిన డాక్టర్లు మూడు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సిందిగా సూచించారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. వైట్ బాల్ క్రికెట్లో ఆసీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న మ్యాక్సీ.. మూడు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉండటం ఆ జట్టు విజయావకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం లాంఛనమే అయిన నేపథ్యంలో సీనియర్ సభ్యుడు మ్యాక్సీ కూడా దూరం కావడం ఆ జట్టు కష్టాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే బ్యాటింగ్ విభాగంలో సీనియర్ల రిటైర్మెంట్తో ఇబ్బంది పడుతున్న ఆసీస్కు మ్యాక్సీ గాయం మరింత ఆందోళన కలిగిస్తుంది. కాగా, ఆసీస్ పర్యటనలో వరల్డ్కప్కు ముందు టీ20 సిరీస్ ఆడిన ఇంగ్లండ్.. నవంబర్ 17, 19, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో 3 టీ20ల సిరీస్ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: T20 WC 2022: ఫైనల్కు ముంగిట ఇంగ్లండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్ -
WC 2022 Final Pak Vs Eng: పాకిస్తాన్ను ఓడించి టైటిల్ గెలిచిన ఇంగ్లండ్
ICC Mens T20 World Cup 2022- Final Pakistan vs England Updates In Telugu: ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించి ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఐదో వికెట్ డౌన్ 18.2: మొయిన్ అలీ బౌల్డ్ విజయానికి చేరువలో ఇంగ్లండ్ 16 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 110/4 ►విజయానికి 24 బంతుల్లో 28 పరుగులు కావాలి. కట్టడి చేస్తున్న పాక్ బౌలర్లు ►11వ ఓవర్లో 2, 12వ ఓవర్లో 3, 13వ ఓవర్లో 5, 14వ ఓవర్లో 2 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్ 12.3: షాదాబ్ ఖాన్ బౌలింగ్లో ఆఫ్రిదికి క్యాచ్ ఇచ్చి హ్యారీ బ్రూక్ (20) అవుట్ 12 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు- 82/3 10 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 77/3 ►విజయం కోసం 60 బంతుల్లో 61 పరుగులు కావాలి. ఆచితూచి ఆడుతున్న స్టోక్స్, బ్రూక్ ►స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో.. ఇంగ్లండ్ బ్యాటర్లు స్టోక్స్(11), బ్రూక్(12) ఆచితూచి ఆడుతున్నారు. 9 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 69-3 పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 49-3 హ్యారీ బ్రూక్ 4, బెన్ స్టోక్స్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఇప్పటి వరకు షాహీన్ ఆఫ్రిదికి ఒక వికెట్, హ్యారీస్ రవూఫ్నకు రెండు వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్కు భారీ షాక్ 5.3: హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో బట్లర్ అవుట్. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్గా నిష్క్రమించిన ఇంగ్లండ్ కెప్టెన్. క్రీజులో హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ 5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 43/2 జోస్ బట్లర్ 26, స్టోక్స్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3.3: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ ఫిలిప్ సాల్ట్ అవుట్ ఆదిలోనే ఇంగ్లండ్కు షాక్ అలెక్స్ హేల్స్ను అవుట్ చేసిన షాహీన్ ఆఫ్రిది ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఏడో వికెట్ డౌన్ 18.3: సామ్ కర్రన్ బౌలింగ్లో లివింగ్స్టోన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన నవాజ్(5). షాహీన్ ఆఫ్రిది, వసీం జూనియర్ క్రీజులో ఉన్నారు. షాదాబ్ అవుట్ 17.2: జోర్డాన్ బౌలింగ్లో షాదాబ్ ఖాన్ ఆరో వికెట్గా వెనుదిరిగాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. నవాజ్, మహ్మద్ వసీం జూనియర్ క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ డౌన్ ►16.3: సామ్ కర్రన్ బౌలింగ్లో అవుటైన షాన్ మసూద్. ►క్రీజులో మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ 15 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు:106/4 షాదాబ్ ఖాన్ 10, షాన్ మసూద్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్కు దెబ్బ మీద దెబ్బ ►12.2: స్టోక్స్ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగిన ఇఫ్తీకర్ అహ్మద్. ►క్రీజులో షాదాబ్ ఖాన్, షాన్ మసూద్ ►12 ఓవర్లలో పాక్ స్కోరు: 84-3 బాబర్ ఆజం అవుట్ ►11.1: ఆదిల్ రషీద్ బౌలింగ్లో బౌల్డ్ అయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(32). దీంతో మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. ►క్రీజులో షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ స్కోరు: 68 9 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 59-2 ►బాబర్ ఆజం 27, షాన్ మసూద్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన పాక్ ►7.1: ఆదిల్ రషీద్ బౌలింగ్లో స్టోక్స్కు క్యాచ్ ఇచ్చి మహ్మద్ హారీస్(8) అవుట్. పాక్ స్కోరు. 45/2 పవర్ ప్లేలో పాక్ స్కోరు ►6 ఓవర్లలో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసిన పాక్. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్కు ఒక వికెట్. తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ ►4.2: సామ్ కర్రన్ బౌలింగ్లో బౌల్డ్ అయిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(14 బంతుల్లో 15 పరుగులు). బాబర్ ఆజం, మహ్మద్ హారీస్ క్రీజులో ఉన్నారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ఇంగ్లండ్ ►4 ఓవర్లలో పాక్ స్కోరు: 28-0 ►బాబర్, రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లో పాక్ స్కోరు: 8-0 ►0.4- రనౌట్ నుంచి తప్పించుకున్న మహ్మద్ రిజ్వాన్ ►పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. ► ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ ఆరంభించిన బెన్ స్టోక్స్ ►టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు ►ఇంగ్లండ్ జోస్ బట్లర్(వికెట్ కీపర్/ కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ ►పాకిస్తాన్ బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది నువ్వా- నేనా టీ20 ప్రపంచకప్-2022 తుది పోరుకు ఇంగ్లండ్- పాకిస్తాన్ సన్నద్ధమయ్యాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం ఫైనల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. గ్రూప్-1 నుంచి ఫైనల్కు చేరిన బట్లర్ బృందం.. గ్రూప్- 2 నుంచి తమతో పోటీకి వచ్చిన బాబర్ టీమ్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్.. బిర్యానీ కథ తెలుసుకోవాల్సిందే
అది 1992వ సంవత్సరం. పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్లో అప్పటి పాక్ ఫాస్ట్బౌలర్ వసీం అక్రమ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందు బ్యాటింగ్లో 33 పరుగులు చేసిన అక్రమ్.. ఆ తర్వాత బౌలింగ్లో మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ను శాసించాడు. అలా ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ తొలిసారి వరల్డ్కప్ను ముద్దాడింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన వసీం అక్రమ్ మాట్లాడుతూ.. మ్యాచ్కు ముందు రోజు రాత్రి తిన్న బిర్యానీ వల్లే ఈ ప్రదర్శన అంటూ సరదాగా కామెంట్ చేశాడు. అక్రమ్ మాటలు విన్న ఇప్తికర్ షా అనే వ్యక్తి తెగ సంతోషపడిపోయాడు.ఇఫ్తికర్ షా అంత సంతోషపడడానికి కారణం ఏంటో తెలుసా.. అక్రమ్ తిన్న బిర్యానీ ఈయన తయారు చేసిందే. అప్పటికే ఇప్తికర్ షా ఆస్ట్రేలియాకు వలస వెళ్లి 10 సంవత్సరాలైంది. 1992 వన్డే వరల్డ్కప్కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుందని తెలియగానే.. తన స్వంత దేశమైన పాకిస్తాన్ ఆటగాళ్లకు బిర్యానీ రుచి చూపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అక్రమ్ ఇప్తికర్ను తన వద్దకు పిలుపించుకొని బిర్యానీ చేసి పెట్టాలని ఆర్డర్ వేశాడంట. అక్రమ్ మాటలకు తెగ సంతోషపడిపోయిన ఇప్తికర్ ఎంతో ప్రేమతో బిర్యానీ తయారు చేసి అక్రమ్ సహా పలువురు ఆటగాళ్లకు రుచి చూపించాడు. కట్చేస్తే సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత అదే పాకిస్తాన్ జట్టు మెల్బోర్న్ వేదిగా ఆదివారం(నవంబర్ 13న) ఇంగ్లండ్తో టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. కొన్ని గంటల్లో మొదలుకానున్న ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఫైనల్ మ్యాచ్కు ముందురోజు అంటే శనివారం పాక్ ఆటగాళ్లు మెల్బోర్న్లోని షా మింట్ అండ్ యునివర్సిటీ ఫుడ్ స్ట్రీట్కు వెళ్లారు. అక్కడ తమకు ఇష్టమైన బిర్యానీ తిని ఇప్తికర్ షాను సంతోషపెట్టారు. 1992లో పాకిస్తాన్ వన్డే వరల్డ్కప్ గెలిచిన సమయంలో ఇప్తికర్ షా బిర్యానీ తినే తాను ఈ ప్రదర్శన చేసినట్లు అక్రమ్ అప్పట్లో మీడియాకు తెలపడం బాగా వైరల్ అయింది. అందుకే తాజాగా టి20 ప్రపంచకప్లో ఫైనల్ చేరిన పాక్ సెంటిమెంట్ ప్రకారం ఇప్తికర్ షా వద్దకు వచ్చి బిర్యానీ తిని వెళ్లారు. ఇక మ్యాచ్లో విజయం తమదేనని పాక్ జట్టు బలంగా నమ్ముతుంది. ఇది నిజమవుతుందో లేదో తెలియదు కానీ పాక్ ఆటగాళ్ల వల్ల తన బిర్యానీకి మంచి పేరు వచ్చిందని ఇఫ్తికర్ షా తెగ సంతోషపడుతూ పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: ఫైనల్కు ముంగిట ఇంగ్లండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్ -
T20 WC 2022: ఫైనల్కు ముంగిట ఇంగ్లండ్ జట్టుకు బ్యాడ్ న్యూస్
పాకిస్తాన్తో ఇవాళ (నవంబర్ 13) జరుగనున్న టీ20 వరల్డ్కప్-2022 ఫైనల్ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. ఇంగ్లండ్ క్రికెట్కు గాడ్ ఫాదర్గా చెప్పుకునే డేవిడ్ ఇంగ్లిష్ (76) గుండెపోటు కారణంగా శనివారం తుదిశ్వాస విడిచారు. ఇంగ్లిష్ మరణవార్త తెలిసి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు దిగ్భ్రాంతికి గురైంది. కెప్టెన్ జోస్ బట్లర్ సహా జట్టులోని ఆటగాళ్లంతా సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జోస్ బట్లర్.. ఇంగ్లిష్తో ఉండిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాదా తప్త హృదయంతో ట్వీట్ చేశాడు. So sad to hear the news of David English passing away. One of life’s great characters, so fun to spend time with and producer of some of the best English cricketers through his wonderful Bunbury Festivals. RIP ❤️ pic.twitter.com/RK3SXUOfSr — Jos Buttler (@josbuttler) November 12, 2022 ఇంగ్లిష్ మరణవార్త కలచి వేసిందని, తాను చూసిన గొప్ప వ్యక్తిత్వం గల మనుషుల్లో ఇంగ్లిష్ ఒకరని, ఇంగ్లండ్ క్రికెట్కు ఎంతో మంది ఉత్తమ క్రికెటర్లను అందించిన ఇంగ్లిష్తో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరువలేనని, ఇంగ్లిష్ ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశం పంపాడు. కాగా, డేవిడ్ ఇంగ్లిష్.. బన్బరీ స్కూల్స్ ఫెస్టివల్స్ ద్వారా వేల సంఖ్యలో ఫస్ట్క్లాస్ క్రికెటర్లను, వందల సంఖ్యలో అంతర్జాతీయ క్రికెటర్లను ఇంగ్లండ్ జట్టుకు అందించాడు. చదవండి: Jos Buttler: రేసులో నేను, మావాళ్లు ఉన్నా, నా ఓటు మాత్రం సూర్యకుమార్కే.. -
'వచ్చే వరల్డ్కప్లో వారి మొహాలను చూడొద్దనుకుంటున్నా'
టి20 ప్రపంచకప్లో సెమీస్ ఓటమి తర్వాత టీమిండియాపై విమర్శల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. పోరాడి ఓడిపోయుంటే ఇన్ని విమర్శలు వచ్చేవి కాదేమో.. కానీ పేలవమైన ఆటతీరుతో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూడడమే ఇందుకు కారణం. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. వచ్చే టి20 ప్రపంచకప్లో కొన్ని మొహాలను తాను చూడదలచుకోలేనని.. వారి స్థానాల్లో కుర్రాళ్లకు అవకాశమిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ''కచ్చితంగా భారత జట్టులో మార్పులు ఉండాలని కోరుకుంటున్నా. వచ్చే ప్రపంచకప్లో నాకు కొన్ని మొహాలను చూడాలని లేదు. 2007 టి20 ప్రపంచకప్కు ముందు టీమిండియాది ఇదే పరిస్థితి. అప్పటికి జట్టులో సీనియర్లుగా ఉన్న కొంతమంది ఆ ప్రపంచకప్లో ఆడలేదు. దీంతో వారి స్థానాల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు వచ్చాయి. జట్టు నిండా కుర్రాళ్లు.. ధోని నాయకత్వం.. వెరసి ఎలాంటి అంచనాలు లేకుండా తొలి ప్రపంచకప్ను అందుకున్నాం. ఇప్పుడు కూడా టీమిండియా ఇదే స్థితిలో ఉంది. అందుకే వచ్చే 2024 టి20 ప్రపంచకప్ నాటికి వీలైనంత ఎక్కువగా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. అది ఇప్పటి నుంచి మొదలుపెడితేనే బాగుంటుదనేది నా అభిప్రాయం. ఇక డిసెంబర్లో బాధ్యతలు చేపట్టనున్న కొత్త సెలక్షన్ కమిటీకి జట్టు ఎంపిక ఒక సవాల్గా మారనుంది. భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచిస్తే రెండేళ్లలో మనం అనుకున్న దానికంటే బలమైన జట్టును తయారు చేయొచ్చు. అయితే సెలక్షన్ కమిటీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: వరల్డ్కప్ గెలవడం కంటే, టీమిండియాను ఓడించడమే ముఖ్యం: పాక్ వైస్ కెప్టెన్ -
Jos Buttler: రేసులో నేను, మావాళ్లు ఉన్నా, నా ఓటు మాత్రం సూర్యకుమార్కే..
టీ20 వరల్డ్కప్-2022లో అద్భుత ప్రదర్శనతో విమర్శకులు, ప్రత్యర్ధుల ప్రశంసలు సైతం అందుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ను తాజాగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఆకాశానికెత్తాడు. గత కొంతకాలంగా సూర్య ఆటతీరు అద్భుతంగా ఉందని, అతను గ్రౌండ్ నలుమూలలా ఆడుతున్న షాట్లు, క్రికెట్ పుస్తకాల్లో సైతం ఎక్కడా లేవని కితాబునిచ్చాడు. ప్రస్తుత వరల్డ్కప్లో భీకరమై ఫామ్లో ఉండిన స్కై.. మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అని పిలుపించుకోవడానికి వంద శాతం అర్హుడని పేర్కొన్నాడు. సూర్య ఆడే షాట్లు తనను అమితంగా ఆకట్టుకుంటాయని, అవి తనకు ఏబీడీని గుర్తు చేస్తాయని అన్నాడు. పాకిస్తాన్తో ఫైనల్కు ముందు బట్లర్.. సూర్యకుమార్ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత వరల్డ్కప్లో సూపర్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకునేందుకు అన్ని విధాల అర్హుడని, ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసిన 9 మంది ఆటగాళ్ల జాబితాలో నేను, మావాళ్లు (ఇంగ్లండ్ ఆటగాళ్లు) ఉన్నా, నా ఓటు మాత్రం సూర్యకే అంటూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కాగా, మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 13) వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే టైటిల్ పోరులో ఇరు జట్లు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కోసం ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసిన క్రికెటర్లు వీరే.. 1. విరాట్ కోహ్లి (భారత్)- 296 పరుగులు- 6 మ్యాచ్లలో 2. సూర్యకుమార్ యాదవ్ (భారత్)- 239 పరుగులు- 6 మ్యాచ్లలో 3. షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)- 10 వికెట్లు, ఒక అర్ధ శతకం- 6 మ్యాచ్లలో 4. షాహిన్ ఆఫ్రిది (పాకిస్తాన్)- 10 వికెట్లు- 6 మ్యాచ్లలో 5. సామ్ కర్రన్ (ఇంగ్లండ్)- 10 వికెట్లు- 5 మ్యాచ్లలో 6. జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 199 పరుగులు- 5 మ్యాచ్లలో- కెప్టెన్గానూ విజయవంతం 7. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)- 211 పరుగులు- 5 మ్యాచ్లలో 8. సికిందర్ రజా(జింబాబ్వే)- 219 పరుగులు-8 మ్యాచ్లలో- 10 వికెట్లు 9. వనిందు హసరంగ (శ్రీలంక)- 15 వికెట్లు- 8 మ్యాచ్లలో చదవండి: 152/0 VS 170/0: మీకు మాకు ఇదే తేడా.. పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్ -
152/0 VS 170/0: మీకు మాకు ఇదే తేడా.. పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్
టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా దారుణ పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వివాదాస్పద ట్వీట్పై (152/0 VS 170/0) తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఫైనల్కు చేరామన్న మదంతో కొట్టుకుంటున్న పాక్ ప్రధానికి.. ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాక్ ప్రధాని మరోసారి వంకర బుద్ధి చాటుకున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. So, this Sunday, it’s: 152/0 vs 170/0 🇵🇰 🇬🇧 #T20WorldCup — Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022 మీకు మాకు ఇదే తేడా.. మేము గెలిచినా, ప్రత్యర్ధి గెలిచినా మేము సంతోషిస్తాం, కానీ మీరు ఇతరుల ఓటమితో రాక్షసానందం పొందుతున్నారు.. ఇకనైనా ఇలాంటి పరువు పోగొట్టుకునే పనులు మానుకుని, సొంత దేశంలో సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ ఓ రేంజ్లో చురలకలంటిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. పాక్ ప్రధానికి భారత్ అభిమానులు ఇచ్చిన కౌంటర్లతో పోలిస్తే, ఇర్ఫాన్ ఇచ్చిన ఈ కౌంటర్ మరింత స్ట్రాంగ్గా ఉంది. Aap mein or hum mein fark yehi hai. Hum apni khushi se khush or aap dusre ke taklif se. Is liye khud ke mulk ko behtar karne pe dhyan nahi hai. — Irfan Pathan (@IrfanPathan) November 12, 2022 దీంతో ఇర్ఫాన్ చేసిన కౌంటర్ అటాక్పై భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా బుద్ధి చెప్పావంటూ ఇర్ఫాన్ను మెచ్చుకుంటున్నారు. వంకర బుద్ధి గల వ్యక్తులు నిజంగానే ఇతరుల బాధను ఎగతాలి చేస్తూ రాక్షసానందం పొందుతారంటూ ఇర్ఫాన్ కౌంటర్ ట్వీట్కు మద్దతు పలుకుతున్నారు. పాక్ ప్రధానిని ఇన్ స్వింగింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేసి భలే బుద్ధి చెప్పావంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో, టీ20 వరల్డ్కప్-2021 గ్రూప్ దశలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్ల్లో టీమిండియా ప్రత్యర్ధులు చేసిన స్కోర్లను (152/0 VS 170/0) ప్రస్తావిస్తూ.. ఈ ఆదివారం 152/0 VS 170/0 అంటూ పాక్ ప్రధాని తన స్థాయి దిగజార్చుకునే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై భారత అభిమానులు, మాజీలు తగు రీతిలో ఇప్పటికీ కౌంటర్లిస్తూనే ఉన్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి ఫైనల్ దాకా చేరిన మీకు ఇంత పొగరు పనికిరాదంటూ చురకలంటిస్తున్నారు. చదవండి: టీమిండియా ఓటమిపై పాక్ ప్రధాని ట్వీట్ వైరల్.. కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్ -
వరల్డ్కప్ గెలవడం కంటే, టీమిండియాను ఓడించడమే ముఖ్యం: పాక్ వైస్ కెప్టెన్
టీ20 వరల్డ్కప్-2022 చివరి అంకానికి చేరుకుంది. మెల్బోర్న్లో ఇవాళ (నవంబర్ 13) ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్లు టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ వైస్ కెప్టెన్, ఆ జట్టు కీలక ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకు వరల్డ్కప్ గెలవడం కంటే టీమిండియాను ఓడించామా లేదా అన్నదే ముఖ్యమంటూ బిల్డప్ మాటలు మాట్లాడాడు. వరల్డ్కప్ గెలిచామా లేదా అన్నది పాక్లో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరని, తమ దేశీయులు ఇండియాపై గెలిస్తే చాలనుకుంటారని స్కై స్పోర్ట్స్ ఛానల్లో నాస్సర్ హుసేన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించాడు. పాక్ ప్రజల ఈ ఆకాంక్ష తమపై సహజంగానే ఒత్తిడి పెంచుతుందని, ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో టీమిండియా చేతిలో ఓడామని అన్నాడు. ప్రస్తుత వరల్డ్కప్ సూపర్-12 దశలో టీమిండియా చేతిలో ఓటమిపై షాదాబ్ స్పందిస్తూ.. మాకు తెలుసు టీమిండియా కంటే తమదే ఉత్తమమమైన జట్టు అని, అయితే ఆఖర్లో తడబడటం వల్లే ఓటమిపాలయ్యామని తెలిపాడు. భారత్తో సమరం అంటే, మాపై ఎంత ఒత్తిడి ఉంటుందో, వారిపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని అన్నాడు. ప్రస్తుతానికి ఇంగ్లండ్తో జరుగబోయే ఫైనల్ పైనే తమ దృష్టి అంతా ఉందని, టీమిండియాతో మ్యాచ్కు ముందు ఎలాంటి ప్రెజర్ ఉంటుందో, ఈ మ్యాచ్కు ముందు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుందని పేర్కొన్నాడు. ఏదిఏమైనప్పటికీ ఏమాత్రం ఆశలు లేని స్థాయి నుంచి ఫైనల్ దాకా వచ్చిన మేము తప్పకుండా వరల్డ్కప్తోనే ఇంటికి వెళ్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, పాక్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చదవండి: T20 World Cup 2022: ఆఖరి పోరాటం -
T20 World Cup 2022: ఆఖరి పోరాటం
26 అక్టోబర్, 2022: ఐర్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడిన ఇంగ్లండ్ 27 అక్టోబర్, 2022: జింబాబ్వే చేతిలో స్వయంకృతంతో ఓడిన పాక్ టి20 ప్రపంచకప్లో ఈ మ్యాచ్ల తర్వాత ఈ రెండు జట్లపై సహజంగానే విమర్శలు చుట్టుముట్టాయి... టోర్నీలో ముందుకెళ్లడంపై సందేహాలు కనిపించాయి. కానీ అటు పాక్, ఇటు ఇంగ్లండ్ మళ్లీ ఉవ్వెత్తున ఎగిసాయి. తమలోని అసలు సత్తాను చూపిస్తూ దూసుకొచ్చాయి. ఇప్పుడు నవంబర్ 13, 2022న ప్రపంచకప్ ఫైనల్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అన్ని అంచనాలను దాటి, ఫేవరెట్లను వెనక్కి నెట్టి విశ్వ విజేతగా నిలిచేందుకు పోటీ పడుతున్నాయి. ఈ మెగా టోర్నీని ఇప్పటికే చెరోసారి గెలుచుకున్న టీమ్లలో ఎవరి ఖాతాలో రెండోసారి ట్రోఫీ వెళుతుందో చూడాలి. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికపై ఐసీసీ టోర్నీలో ఫైనల్లో ఈ రెండు జట్లు ముఖాముఖిగా ఎదుర్కోవడం ఇది రెండోసారి. 1992 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై పాక్ గెలవగా... మూడు దశాబ్దాల తర్వాత అదే పునరావృతమవుతుందా లేక భిన్నమైన ఫలితం వస్తుందా అనేది ఆసక్తికరం. మెల్బోర్న్: అనూహ్య ఫలితాలు, హోరాహోరీ మ్యాచ్లు, çసంచలన ప్రదర్శనలతో ఆసక్తికరంగా సాగిన 2022 టి20 ప్రపంచకప్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. 42 గ్రూప్ మ్యాచ్లు, 2 నాకౌట్ మ్యాచ్ల తర్వాత 45వ పోరులో విశ్వ విజేత ఎవరో తేలనుంది. నేడు జరిగే ఫైనల్లో మాజీ చాంపియన్లు పాకిస్తాన్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ప్రస్తుత బలాబలాలు, ఫామ్ను బట్టి చూస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. సెమీఫైనల్ మ్యాచ్లలోనూ రెండు జట్లూ ఏకపక్ష విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి. పాకిస్తాన్ గడ్డపై ఇటీవలే ఇరు జట్ల మధ్య దాదాపు ఇదే ఆటగాళ్లతో 7 టి20 మ్యాచ్ల సిరీస్ జరిగింది కాబట్టి ప్రత్యర్థి గురించి ఆయా జట్టుకు మంచి అవగాహన ఉంది. మార్పుల్లేకుండా... సెమీస్లో అన్ని విధాలా సత్తా చాటిన పాకిస్తాన్ ఫైనల్ కోసం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. కెప్టెన్ బాబర్ ఆజమ్, రిజ్వాన్ విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. మిడిలార్డర్లో మసూద్, ఇఫ్తికార్, నవాజ్లతో జట్టు బ్యాటింగ్ మెరుగ్గానే ఉంది. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’కి పోటీ పడుతున్న లెగ్స్పిన్నర్ షాదాబ్ ఆల్రౌండర్ పాత్రలో జట్టుకు టోర్నీ ఆసాంతం అండగా నిలిచాడు. అన్ని మ్యాచ్లలాగే పాక్ నలుగురు రెగ్యులర్ పేసర్లతో బరిలోకి దిగడం ఖాయం. షాహిన్ అఫ్రిది గాయం నుంచి కోలుకున్న తర్వాత ప్రమాదకరంగా మారడం సానుకూలాంశం. నసీమ్, వసీమ్ కూడా తమ పరిధిలో రాణిస్తుండగా రవూఫ్పై కూడా పాక్ ఆశలు పెట్టుకుంది. బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున ఆడిన అతడిని ఎదుర్కోవడం ఇంగ్లండ్కు అంత సులువు కాదు. ఓపెనర్లే కీలకం... సెమీస్లో హేల్స్, కెప్టెన్ బట్లర్ ఆటను చూస్తే వారిద్దరు ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో తెలుస్తుంది. అయితే వీరిద్దరు మినహా ఇంగ్లండ్ మిడిలార్డర్లో ఎవరు కూడా టోర్నీ మొత్తంలో ఒక సిక్స్కు మించి కొట్టలేదు! స్టోక్స్, బ్రూక్స్, లివింగ్స్టోన్ కూడా తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. ఈ బలహీనతపై తమ స్పిన్తో పాక్ దెబ్బ కొట్టగలిగితే ఇంగ్లండ్కు కష్టం కావచ్చు. అయితే ఓపెనర్లే ఆటను ఏకపక్షంగా మార్చేయగలరు కాబట్టి వారిద్దరే కీలకం కానున్నారు. ఆరంభంలో షాహిన్ని సమర్థంగా ఎదుర్కోగలిగితే హేల్స్, బట్లర్ ఆపై ఆధిపత్యం ప్రదర్శించగలరు. జట్టులో దాదాపు అందరూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నవారే అయినా అదే దూకుడుతో వికెట్లు కూడా చేజార్చుకోగలరు. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్లు మొయిన్ అలీ, వోక్స్, స్యామ్ కరన్లపై అదనపు బాధ్యత ఉంది. అయితే టోర్నీలోనే ఫాస్టెస్ట్ బౌలర్గా ఉన్న మార్క్ వుడ్ టీమ్లో లేకపోవడం జట్టుకు కొంత సమస్యగా మారింది. సెమీస్ లో కూడా అతను ఆడలేదు. ఫైనల్కు అతను వస్తే జట్టు బౌలింగ్ బలం పెరుగుతుంది. టోర్నీలో చక్కటి ప్రభావం చూపించిన కరన్ కూడా రాణిస్తే పాక్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. మొత్తంగా చూస్తే ఇంగ్లండ్ బ్యాటింగ్లో బలంగా ఉండగా, బౌలింగ్లో పాకిస్తాన్ది పైచేయిగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ గెలిస్తే ఒకే సమయంలో వన్డే, టి20 వరల్డ్కప్లను తమ వద్ద ఉంచుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. పిచ్, వాతావరణం ఫైనల్కు పెద్ద సమస్య వర్షం రూపంలోనే పొంచి ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఆదివారం 100 శాతం వర్ష సూచన ఉంది. అయితే మెల్బోర్న్ వాతావరణం అనిశ్చితికి మారుపేరు. భారత్, పాక్ మ్యాచ్కు ముందు కూడా ఇలాగే భావించినా, ఒక్క చుక్క వర్షం పడలేదు! ఫైనల్కు రిజర్వ్ డే ఉంది. అయితే నిబంధనల ప్రకారం రెండో ఇన్నింగ్స్లో కనీసం 10 ఓవర్ల ఆట జరిగితే ఆదివారమే ఫలితం తేలిపోతుంది. అంతకన్నా తక్కువకే ఆట ఆగిపోతే, సోమవారం అదే స్కోరు నుంచి కొనసాగిస్తారు. పిచ్ ఆరంభంలో పేస్, బౌన్స్కు అనుకూలంగా ఉంటుంది. అయితే బ్యాటర్లు దానిని అధిగమిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది. 9: పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 28 టి20 మ్యాచ్లు జరిగాయి. 9 మ్యాచ్ల్లో పాకిస్తాన్ నెగ్గగా... 17 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. మరో మ్యాచ్ రద్దయింది. 29: టి20 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరగ్గా... రెండింటిలోనూ ఇంగ్లండే విజయం సాధించింది. 3: ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లకిది మూడో టి20 ప్రపంచకప్ ఫైనల్. 2007లో పాక్ రన్నరప్గా నిలిచి, 2009లో టైటిల్ సాధించింది. ఇంగ్లండ్ 2010లో చాంపియన్గా నిలిచి, 2016లో రన్నరప్తో సంతృప్తి పడింది. 59: ఇప్పటి వరకు ఏడు టి20 ప్రపంచకప్ ఫైనల్స్ జరగ్గా... ఛేజింగ్ చేసిన జట్లు ఐదుసార్లు... తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు రెండుసార్లు గెలిచాయి. -
స్వదేశానికి చేరుకున్న టీమిండియా.. బాధలో కోహ్లి
టి20 ప్రపంచకప్లో సెమీస్లో ఇంగ్లండ్తో దారుణ పరాజయం అనంతరం టీమిండియా స్వదేశానికి చేరుకుంది. శనివారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన టీమిండియా ఆటగాళ్లు మీడియా కంట పడకుండా స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే కోహ్లికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టి20 ప్రపంచకప్లో సెమీస్ ఓటమి బాధ కోహ్లి మొహంలో స్పష్టంగా కనిపించింది. ఎయిర్పోర్ట్లో కెమెరాకు చిక్కిన కోహ్లి ఏం మాట్లాడకుండానే కారు ఎక్కి వెళ్లిపోయాడు. ఇక టి20 ప్రపంచకప్లో టీమిండియా రన్మెషిన్ కోహ్లి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో నాలుగు అర్థసెంచరీలు సాధించిన కోహ్లి 296 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్లోనే కాదు క్రికెట్ బ్రతికున్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతుంది. 53 బంతుల్లో 82 పరుగుల ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అంతేకాదు నెదర్లాండ్స్, బంగ్లాదేశ్లతో పాటు ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లోనూ కోహ్లి అర్థశతకంతో రాణించాడు. కోహ్లి తర్వాత టీమిండియాలో రాణించింది సూర్యకుమార్ మాత్రమే.వీరిద్దరు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికి జట్టు వైఫల్యం టీమిండియాను సెమీస్లోనే వెనుదిరిగేలా చేసింది. Our golden boy King Kohli is back in the bay 😍❤️ #ViratKohli𓃵 Most runs in the tournament , MCG Masterclass , taking home 2 - ICC POTM , ICC player of the month Award , hopefully POT will follow him . pic.twitter.com/FRQ5L3wqfJ — • MCG 82* (@KohlifiedGal) November 12, 2022 చదవండి: 'ఒక్క మ్యాచ్కే తీసిపారేయొద్దు.. నెంబర్-1 ర్యాంక్ రాత్రికి రాత్రే రాలేదు' -
సెంటిమెంట్ తప్పిస్తే రికార్డులన్నీ ఇంగ్లండ్వైపే.. పాక్కు కష్టమే
టి20 ప్రపంచకప్లో ఆదివారం(నవంబర్ 13న) మెల్బోర్న్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో ఇంగ్లండ్, పాకిస్తాన్లు తలపడనున్నాయి. మరి పొట్టి ప్రపంచకప్లో విజేత ఎవరనేది ఒక్క రోజులో తేలనుంది. సెంటిమెంట్ పరంగా చూస్తే పాక్ గెలుస్తుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ రికార్డులన్నీ ఇంగ్లండ్కే అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఇంగ్లండ్దే విజయమని.. పాక్ టైటిల్ కొట్టడం కష్టమేనని కొంతమంది పేర్కొంటున్నారు. ► ఇక ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు 28 టి20ల్లో ఎదురుపడితే.. వాటిలో ఇంగ్లండ్ 18 విజయాలు నమోదు చేయగా.. పాక్ ఖాతాలో తొమ్మిది విజయాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కదానిలో ఫలితం రాలేదు. ► టి20 ప్రపంచకప్లో ఇరుజట్లు తలపడిన రెండు సందర్భాల్లోనూ ఇంగ్లండ్నే విజయం వరించింది. ► 2019 నుంచి చూసుకుంటే ఇరుజట్ల మధ్య 14 మ్యాచ్లు జరగ్గా.. అందులో 8 మ్యాచ్లు ఇంగ్లండ్ గెలవగా.. ఐదు పాక్ గెలిచింది. ఒక్క దానిలో ఫలితం రాలేదు. ► చివరగా టి20 ప్రపంచకప్కు ముందు ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ జరిగింది. సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. 4-3 తేడాతో ఇంగ్లండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. ► పాకిస్తాన్ ఇది ఫైనల్కు చేరడం మూడోసారి కాగా.. ఇంగ్లండ్కు కూడా మూడో ఫైనల్ కావడం విశేషం. ఇక రెండు జట్లు ఒక ఫైనల్ గెలిచి.. మరొక ఫైనల్ ఓడి సమానంగా ఉన్నాయి. ► పాకిస్తాన్ 2009లో టి20 చాంపియన్స్గా నిలిస్తే.. ఆ మరుసటి ఏడాది అంటే 2010లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించింది. ► ఒకవేళ ఇంగ్లండ్ ఈసారి టి20 ప్రపంచకప్ గెలిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏకకాలంలో వన్డే వరల్డ్కప్, టి20 వరల్డ్కప్ సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించనుంది ► ఇక ఈ ప్రపంచకప్లో ఇంగ్లండ్ అన్ని మ్యాచ్లు కలిపి 669 పరుగులు చేస్తే.. అందులో ఓపెనర్లు బట్లర్, హేల్స్ ద్వయం 410 పరుగులు చేయడం విశేషం. ► ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్కు పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లపై మంచి రికార్డు ఉంది. బాబర్ మూడుసార్లు ఔట్ చేసిన రషీద్.. రిజ్వాన్ను రెండుసార్లు పెవిలియన్ చేర్చాడు. అదే సమయంలో బాబర్ ఆజం, రిజ్వాన్ జంటకు ఇంగ్లండ్పై మంచి స్ట్రైక్ రేట్ను కలిగి ఉంది. పాక్ తుదిజట్టు అంచనా: మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ వసిం జూనియర్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హారీస్ రవూఫ్ ఇంగ్లండ్ తుదిజట్టు అంచనా: జోస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ -
'ఒక్క మ్యాచ్కే తీసిపారేయొద్దు.. నెంబర్-1 ర్యాంక్ రాత్రికి రాత్రే రాలేదు'
టి20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్లో ఓడిపోవడం అభిమానులను చాలా బాధించింది. ఇంగ్లండ్తో సెమీస్లో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూసిన టీమిండియా అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అందుకే మ్యాచ్ జరిగి రెండు రోజులు పూర్తవుతున్నా అభిమానులు మాత్రం దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా సెమీస్ ఓటమిపై ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు. '' ఇంగ్లండ్తో సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరును నమోదు చేయలేకపోయింది. తొలుత భారీ స్కోరు చేయకపోవడం టీమిండియాను దెబ్బకొడితే.. ఆపై బౌలర్లు పూర్తిగా విఫలమవ్వడం జట్టు కొంపముంచింది. ఒక్క మ్యాచ్కే టీమిండియాను విమర్శించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా టి20ల్లో టీమిండియా బాగానే రాణిస్తుందని.. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానంలో ఉందన్న విషయం మరిచిపోవద్దు. నెంబర్వన్ స్థానానికి చేరుకోవడం రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పని కాదు. అలాంటిది టి20 ప్రపంచకప్లో ఒక సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఇచ్చిన ప్రదర్శనను చూసి తప్పుబట్టకూడదు. ఆటలో ఎత్తుపల్లాలు ఉండడం సహజమే. అయితే ఒక మేజర్ టోర్నీలో టీమిండియా ఇలాంటి ప్రదర్శన ఇచ్చిందన్న బాధ అభిమానులకు ఉంటుంది.'' అని పేర్కొన్నాడు. ఇక టి20 ప్రపంచకప్లో ఆదివారం(నవంబర్ 13న) ఇంగ్లండ్, పాకిస్తాన్ల మధ్య ప్రతిష్టాత్మక ఫైనల్ జరగనుంది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్కు వర్షం ముప్పు ఉంది. రిజర్వ్ డే రోజున వర్షం వల్ల ఫలితం రాకపోతే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనున్నారు. #WATCH | I know that the Semi Finals against England was very disappointing. Let's accept that we did not put up a good total on the board. It was a tough game for us, a bad and disappointing defeat. We have been World number 1 T-20 side as well: Cricketer Sachin Tendulkar to ANI pic.twitter.com/zjT3SjwZ8l — ANI (@ANI) November 12, 2022 చదవండి: T20 WC: ప్రతిష్టాత్మక ఫైనల్ కోసం రూల్స్ సవరింపు! T20 WC: టీమిండియాకు వచ్చిన ప్రైజ్మనీ ఎంతంటే? -
T20 WC: ప్రతిష్టాత్మక ఫైనల్ కోసం రూల్స్ సవరింపు!
క్రికెట్ అభిమానులు నెల రోజుల నుంచి ఎంజాయ్ చేస్తున్న టి20 ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇన్నాళ్లు ఫోర్లు, సిక్సర్ల వర్షంతో పాటు వరుణుడి జడివానల్లోనూ తడిసిన అభిమానులకు కిక్కు దిగిపోనుంది. రేపు(నవంబర్ 13న) పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఫైనల్ మ్యాచ్ జరగనున్న రోజున వర్షం పడే సూచనలు 85 శాతం ఉన్నాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అయితే నాకౌట్ దశలో జరిగే మ్యాచ్లకు రిజర్వ్ డేను కేటాయిస్తారు. దీంతో ఫలితం వచ్చే అవకాశాలుంటాయి. అయితే రిజర్వ్ డే కూడా వర్షంలో కొట్టుకుపోతే అప్పుడు ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. అలా చేస్తే ఇప్పటివరకు టి20 ప్రపంచకప్పై ఉన్న జోష్ తగ్గిపోతుంది. ఇలా సంయుక్త విజేతలుగా ప్రకటించడం ద్వారా టోర్నీ ఆఖర్లో కళ తప్పినట్లవుతుందని భావించిన ఐసీసీ శనివారం.. ఫైనల్ మ్యాచ్ కోసం రూల్స్ను సవరించింది. అయితే ఆ రూల్స్ కేవలం మ్యాచ్ వరకు మాత్రమే పరిమితం. మరి ఐసీసీ సవరించిన కొత్త రూల్ ఏంటంటే.. రిజర్వ్ డే రోజున నిర్ణీత సమయంలో వర్షం తగ్గకపోతే.. మరో రెండు గంటలు అదనంగా కేటాయించనున్నారు. ఒకవేళ ఈ రెండు గంటలు ఎలాంటి వర్షం లేకపోతే 10 ఓవర్ల మ్యాచ్ను నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ఇది కూడా సాధ్యపడకపోతే అప్పుడు ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారని ఐసీసీ పేర్కొంది. ఇప్పటికే ఫైనల్ జరగనున్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)కి ఉత్తర్వులు పంపామని.. ఆ దిశగా వారు ప్రణాళికను సిద్ధం చేస్తారని తెలిపింది. ''వర్షం అడ్డుపడినా సాధ్యమైనంత వరకు ఫైనల్ మ్యాచ్ను నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నాం. అందుకే నవంబర్ 13న వర్షంతో మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే అయిన నవంబర్ 14న మ్యాచ్ కొనసాగిస్తాము. అప్పటికి వర్షం అంతరాయం కలిగిస్తే మరో రెండు గంటలు మ్యాచ్ జరిగేందుకు అదనంగా సమయం కేటాయించాం. అప్పటికి ఫలితం రాకుండా వరుణుడు అడ్డుపడితే మాత్రం ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తాం. ఇది చివరి ఆప్షన్ మాత్రమే. కానీ ఇలా జరగడం మాకు ఇష్టం లేదు. కచ్చితంగా ఫైనల్ మ్యాచ్ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం'' అంటూ టోర్నీ నిర్వాహుకులు పేర్కొన్నారు. చదవండి: T20 WC: టీమిండియాకు వచ్చిన ప్రైజ్మనీ ఎంతంటే? -
T20 WC: టీమిండియాకు వచ్చిన ప్రైజ్మనీ ఎంతంటే?
టి20 ప్రపంచకప్లో భాగంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాజయం చవిచూసి ఇంటిబాట పట్టింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్ తుది సమరంలో పాకిస్తాన్తో తలపడనుంది. నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి 1992 సీన్ను బాబర్ ఆజం సేన రిపీట్ చేస్తుందా లేక ఇంగ్లండ్ దాటికి తోకముడిచి రన్నరప్గా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సెమీస్లో ఇంటిబాట పట్టిన టీమిండియాకు వచ్చిన ప్రైజ్మనీ ఎంతో తెలుసా.. 400,000 అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో సుమారు 3,26,20,220 రూపాయలు. ఇక తొలి సెమీస్లో ఓడిన న్యూజిలాండ్కు కూడా ఇదే మొత్త లభించనుంది. ఇక టి20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడనున్న ఇంగ్లండ్, పాకిస్తాన్లలో విజేతగా నిలిచిన జట్టుకు 1,600,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 13,05,35,440 కోట్ల రూపాయలు) ప్రైజ్మనీ ఇవ్వనుంది. రన్నరప్గా నిలిచే జట్టు.. 800,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 6,52,64,280 కోట్ల రూపాయలు) అందుకోనుంది. ►సూపర్-12 దశలో నిష్క్రమించిన జట్లు- 560,000 డాలర్లు (8X 70,000 డాలర్లు ) ►ఫస్ట్రౌండ్లో గెలిచిన జట్లు- 480,000 డాలర్లు (12X 40,000 డాలర్లు) ►ఫస్ట్రౌండ్లో ఇంటిబాట పట్టిన జట్లు- 160,000 డాలర్లు(4X 40,000 డాలర్లు) అయితే టీమిండియాకు వచ్చిన ప్రైజ్మనీపై క్రికెట్ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ''ఐపీఎల్లో కోట్లు తీసుకుంటున్న ఆటగాళ్లకు వరల్డ్కప్ ద్వారా వచ్చే ప్రైజ్మనీ పెద్దగా పట్టించుకోరు.. ఐపీఎల్ ద్వారా కోట్లు వస్తుంటే దేశానికి ఆడాలని ఏ ఆటగాడికి పెద్దగా అనిపించదు.'' అంటూ పేర్కొన్నారు. చదవండి: T20 WC 2022: బాబర్ కుడివైపు, బట్లర్ ఎడమవైపు.. -
T20 WC 2022: బాబర్ కుడివైపు, బట్లర్ ఎడమవైపు..
సెంటిమెంట్స్ను నమ్ముకొని ఆటలు ఆడితే కప్పులు రావు.. ఆరోజు మ్యాచ్లో ఎవరు బాగా రాణిస్తే వారినే విజయం వరిస్తుంది. అంతేకానీ ఆడడం మానేసి సెంటిమెంట్ను ఎక్కువగా నమ్ముకొని బరిలోకి దిగితే మొదటికే మోసం వస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ సెంటిమెంట్లు కూడా నమ్మాల్సి వస్తుంది. ఒక్కోసారి పరిస్థితులు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయి. తాజాగా మనం చెప్పుకునేది కూడా ఆ కోవలోకే వస్తుంది. టి20 ప్రపంచకప్లో భాగంగా నవంబర్ 13న(ఆదివారం) ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో ఇంగ్లండ్ ఫేవరెట్గా కనిపిస్తున్నప్పటికి పాక్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ విషయం పక్కనబెడితే ప్రపంచకప్ ఫైనల్ ఆడనున్న ఇరుజట్ల కెప్టెన్లు ట్రోఫీ పక్కన నిలబడి ఫోటోకు ఫోజివ్వడం ఆనవాయితీగా వస్తుంది. 2019 నుంచి ఐసీసీ ట్రోఫీకి కుడిపక్కన నిలబడిన కెప్టెన్లు టైటిల్స్ గెలుస్తూ వస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. తాజాగా ఫైనల్ మ్యాచ్కి ముందు ట్రోఫీతో ఫైనలిస్టులు ఫోటోలు దిగారు. కుడి వైపు బాబర్ ఆజం నిలబడగా.. ఎడమవైపు ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఎడమవైపు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. సెంటిమెంట్ ప్రకారం ట్రోఫీకి కుడిపక్కన బాబర్ ఆజం నిలబడడంతో ఈసారి పాక్ టి20 వరల్డ్కప్ కొట్టబోతుందని అభిమానులు బలంగా పేర్కొన్నారు. ఇంతకముందు 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కుడి వైపు నిలబడగా.. ఎడమవైపు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలబడ్డాడు. కుడివైపు నిలబడిన ఇంగ్లండ్కు సూపర్ ఓవర్లో 'సూపర్' విజయం దక్కింది. ఇక 2021 టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కుడివైపు నిలబడగా.. కేన్ విలియమ్సన్ మాత్రం మళ్లీ ఎడమవైపే నిలబడ్డాడు. ఈసారి కూడా కుడివైపు నిల్చొన్న ఆరోన్ ఫించ్ సేనకే వరల్డ్ కప్ దక్కింది. ఐసీసీ 2021లో తొలిసారి నిర్వహించిన టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఈసారి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కుడివైపు నిలబడగా.. అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఎడమవైపు ఉన్నాడు. దీంతో దాదాపు 21 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ జట్టు ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ అంశాలన్ని పరిగణలోకి తీసుకొని చేస్తే ట్రోఫీకి కుడివైపు నిలబడిన బాబర్ ఆజం జట్టు కప్ గెలవబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే చాలా మంది అభిమానులు బలంగా నమ్ముతున్న మరో సెంటిమెంట్ను కూడా బలంగా నమ్ముతున్నారు. అదేంటంటే 1992 వన్డే వరల్డ్కప్. అప్పటి ఇమ్రాన్ నాయకత్వంలోని జట్టు.. ఇప్పటి బాబర్ ఆజం సేన దాదాపు ఒకేలాగా సెమీస్కు చేరుకున్నాయి. ఇక సెమీఫైనల్లో అద్భుత ఆటతీరు కనబరిచిన పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 1992 లాగే ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఇంగ్లండ్తో అమితుమీ తేల్చుకోనుంది. మరి పైన చెప్పుకున్నట్లు ట్రోఫీకి కుడిపక్కన నిల్చున్న బాబర్ ఆజం కప్ కొట్టనున్నాడా లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. Pakistan and England have scaled the heights to reach the #T20WorldCup final 💥 Who will come out on top at the MCG? 🏆 pic.twitter.com/J8Azf7belP — ICC (@ICC) November 12, 2022 చదవండి: సూపర్-12లో వెళ్లాల్సినోళ్లు ఫైనల్ దాకా.. హేడెన్ చలవేనా! T20 WC 2022: ఫైనల్లో పాక్ గెలిస్తే, బాబర్ ఆజమ్ ప్రధాని అవుతాడు..! -
హార్ధిక్ను కెప్టెన్ చేసి, టీమిండియా నుంచి ఆ 'ఆరుగురిని' తప్పించండి..!
టీ20 వరల్డ్కప్-2022 సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొని, ఒట్టి చేతులతో ఇంటిదారి పట్టిన టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సూపర్-12 దశలో దక్షిణాఫ్రికా, సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓటములు మినహాయించి.. టీమిండియా టోర్నీ మొత్తంలో ఆశించిన మేరకే రాణించి విజయాలు సాధించినప్పటికీ.. నాకౌట్ మ్యాచ్లో ఒత్తిడికి చిత్తై ఓటమిపాలవ్వడం భారత అభిమానులను తీవ్రంగా కలచి వేస్తుంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్లో పాల్గొన్న భారత జట్టులో సమూల మార్పులు చేయాలని టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. జట్టు ప్రక్షాళణకు సమయం ఆసన్నమైందని సోషల్మీడియాలో తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ప్రస్తుత వరల్డ్కప్ జట్టులో ఆరుగురికి ఉద్వాసన పలకాలని కోరుతున్నారు. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మపై సైతం వేటు వేయాలని సూచిస్తున్నారు. బీసీసీఐ.. ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతే మున్ముందు మరిన్ని అవమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. విశ్రాంతి పేరుతో పదేపదే మార్పులు చేసి, జట్టు లయను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. టీ20 వరల్డ్కప్ ఆడిన టీమిండియాలో ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలపై వేటు వేసి దేవ్దత్ పడిక్కల్/రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్లతో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నిర్ణయం సాహసోపేతమై అయినప్పటికీ.. జట్టు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మంచి నిర్ణయమేనని అంటున్నారు. పై పేర్కొన్న ఆటగాళ్లలో ఏ కాంబినేషన్ తీసుకున్నా, జట్టుకు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ సమస్య కూడా తీరుతుందని అంటున్నారు. అలాగే మిడిలార్డర్లో టెక్నిక్తో పాటు ధాటిగా ఆడగల సమర్ధుడైన శ్రేయస్ అయ్యర్ను తీసుకోవాలని.. శాంసన్, ఇషాన్ కిషన్లు ఉన్నారు కాబట్టి, వరుసగా విఫలమవుతున్న పంత్ అవసరం కూడా లేదని అభిప్రాయపడుతున్నారు. కనీసం బౌలర్గా కూడా న్యాయం చేయలేని అక్షర్ పటేల్... వికెట్లు తీయలేకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న వెటరన్ అశ్విన్, పదును తగ్గిన భువనేశ్వర్ల స్థానాల్లో రవీంద్ర జడేజా/దీపక్ హుడా, యుజ్వేంద్ర చహల్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం కల్పించాలని బీసీసీఐకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ మార్పులు చేయడం వల్ల జట్టు సమతూకంగా ఉండటంతో పాటు సీనియర్లు, జూనియర్లు.. లెఫ్ట్ అండ్ రైట్ల కాంబినేషన్స్తో అద్భుతంగా ఉంటుందని సలహా లు ఇస్తున్నారు. అలాగే రిజర్వ్ ఆటగళ్లుగా భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, దీపక్ చాహర్, రవి భిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్లకు ఛాన్స్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఫ్యాన్స్ కోరుకునే భారత టీ20 జట్టు: దేవ్దత్ పడిక్కల్/రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా/దీపక్ హుడా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్/కుల్దీప్ యాదవ్ రిజర్వ్ ఆటగాళ్లు: భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, దీపక్ చాహర్, రవి భిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: నిందించాల్సింది ఆటగాళ్లను కాదు, వాళ్లను.. ఒక్క లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా లేడా..? -
టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్ రికార్డ్స్
Guinness World Records: టీ20 వరల్డ్కప్-2022 సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ దారుణంగా అవమానించింది. ప్రపంచం నలుమూలల్లో జరిగే ప్రతి అంశంలో అత్యుత్తమ, అతి దారుణమైన విశేషాలను తమ రికార్డుల్లో నమోదు చేసే ఈ సంస్థ.. నవంబర్ 10న ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిని అతి దారుణంగా వర్ణిస్తూ.. క్రికెట్ చరిత్రలో అత్యంత సునాయాసమైన లక్ష్య ఛేదన అంటూ ట్వీట్ చేసి భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది. దీనిపై భారత అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్మీడియా వేదికగా ఆ సంస్థను ఓ ఆటాడుకుంటున్నారు. భారతీయుల మనో భావాలను దెబ్బతీసిన ఈ సంస్థను ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లు శక్తివంచన లేకుండా అత్యుత్తమ ఆటతీరు కనబర్చారని భారత క్రికెటర్లను వెనకేసుకొస్తున్నారు. Easiest run chase in history? 👀#INDvsENG — Guinness World Records (@GWR) November 10, 2022 ఇంత కంటే దారుణ పరాజయాలు క్రికెట్ చరిత్రలో చాలానే ఉన్నాయని రివర్స్ కౌంటరిస్తున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్.. యూకే సంస్థ కాబట్టి, గొప్పలకు పోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఫైనల్లో పాక్పై ఎలా గెలవాలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ట్రైనింగ్ ఇవ్వండి అంటూ సలహాలిస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్కప్లో టీమిండియా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించినప్పటికీ, అదృష్టం కలిసి రాక సెమీస్లోనే ఇంటిదారి పట్టింది. సూపర్-12 దశలో ఒక్క దక్షిణాఫ్రికాతో మినహా అన్ని జట్లపై అద్భుత విజయాలు సాధించి గ్రూప్-2లో అగ్రస్థానంతో సెమీస్కు చేరిన భారత్.. సెమీస్లో అనూహ్యంగా ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా, ఛేదనలో ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఆటగాళ్లు విరాట్ (50), హార్ధిక్ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్ (80), హేల్స్ (86) అజేయమైన అర్ధశతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: హేల్స్ రెచ్చిపోతే.. పాక్ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు..! -
T20 WC 2022 Final: హేల్స్ రెచ్చిపోతే.. పాక్ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు..!
ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య రేపు (నవంబర్ 13) జరిగే టీ20 వరల్డ్కప్-2022 అంతిమ సమరంలో గెలుపు కోసం ఇరు జట్లు సర్వ శక్తులు ఓడ్డనున్నాయి. హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్న ఫైనల్లో దాయాది పాక్ సెంటిమెంట్లను నమ్ముకుంటే.. ఇంగ్లండ్ మాత్రం ప్రతిభపైనే ఆధాపడింది. ప్రస్తుత ప్రపంచకప్లో అదృష్టం కొద్దీ ఫైనల్ దాకా వచ్చిన పాక్.. 1992 వన్డే వరల్డ్కప్ సీన్ రిపీట్ అవుతుందని ధీమా ఉంటే, ఇంగ్లండ్.. పాక్ అంచనాలను తల్లకిందులు చేసేందుకు సమాయత్తమవుతుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో నాసిరకమైన ప్రదర్శనతో నెట్టుకొచ్చిన పాక్.. ఫైనల్లోనూ అదే ప్రదర్శన కొనసాగిస్తే ఒట్టి చేతులు ఊపుకుంటూ ఇంటి దారి పట్టాల్సింది వస్తుందని విశ్లేకులు అంచనా వేస్తున్నారు. మరోపక్క, ఇంగ్లండ్.. ప్రస్తుత టోర్నీలో సూపర్ ఫామ్లో ఉంది. ఒక్క ఐర్లాండ్ చేతిలో పరాభవం తప్పించి, దాదాపు అన్ని మ్యాచ్ల్లో స్థాయికి తగ్గ ఆట ఆడింది. అన్ని విభాగాల్లో ప్రపంచ స్థాయి జట్టుకు ఏమాత్రం తీసిపోకుండా రాణించింది. ఇదే ఫామ్ను బట్లర్ సేన టైటిల్ పోరులోనూ కొనసాగిస్తే.. పాక్ పరాజయాన్ని అడ్డుకోవడం దాదాపుగా ఆసాధ్యమేనని చెప్పాలి. ముఖ్యంగా భీకర ఫామ్లో ఉన్న ఓపెనర్ అలెక్స్ హేల్స్ మరోసారి చెలరేగితే పాక్ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్లతో జరిగిన మ్యాచ్ల్లో హేల్స్.. 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి భీకరమైన ఫామ్లో ఉన్నాడు. మరోవైపు భారత్తో జరిగిన సెమీస్లో గాయం కారణంగా జట్టుకు దూరమైన మార్క్ వుడ్ ఫైనల్ మ్యాచ్లో తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఇంగ్లండ్ బౌలింగ్లో మరింత పటిష్టంగా మారుతుంది. మొత్తంగా ఇరు జట్ల బలాబలాలను పోలిస్తే.. పాక్పై ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని చెప్పాలి. చదవండి: ఫైనల్లో ఇంగ్లండ్పై పాక్ గెలిస్తే, బాబర్ ఆజమ్ ప్రధాని అవుతాడు..! -
T20 WC 2022: ఫైనల్లో పాక్ గెలిస్తే, బాబర్ ఆజమ్ ప్రధాని అవుతాడు..!
టీ20 వరల్డ్కప్-2022లో అదృష్టం కలిసొచ్చి ఫైనల్ దాకా చేరిన పాకిస్తాన్.. రేపు (నవంబర్ 13) జరుగబోయే టైటిల్ పోరులో ఇంగ్లండ్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. పాక్ సారధి బాబర్ ఆజమ్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రేపు జరుగబోయే ఫైనల్లో ఇంగ్లండ్పై పాక్ గెలిస్తే, కెప్టెన్ బాబర్ ఆజమ్.. 2048లో పాక్ ప్రధాని అవడం ఖాయమని జోస్యం చెప్పాడు. Just like 1992, it’s Pakistan vs England in a final at the MCG! 🇵🇰🏴#T20worldcup22 pic.twitter.com/JIgdNkKCJg — Ansar waris (@Ansarwaris112) November 10, 2022 1992 వన్డే వరల్డ్కప్లో పాక్ విజయం, ఆతర్వాత జరిగిన పరిణామాల్లో నాటి పాక్ సారధి ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ (పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్) పెట్టడం (1996), ఆతర్వాత 22 ఏళ్లకు (2018) ఇమ్రాన్ పాక్ ప్రధాని కావడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని లిటిల్ మాస్టర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 1992 వరల్డ్కప్లో కూడా పాక్ ప్రస్తానం అచ్చం ఇలాగే సాగడంతో గవాస్కర్ ఈ తరహా వాఖ్యలు చేశాడు. Just like 1992, it’s #Pakistan vs #England in a final at the MCG! 🇵🇰🏴#T20WorldCup2022#Cricket #cricketchallenge #T20WorldCup pic.twitter.com/jvojJmEL7V — Imran Katoch (@ImranKatoch955) November 10, 2022 సన్నీ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. గవాస్కర్ నోటి మాట పుణ్యమా అని తమ ఆరాధ్య క్రికెటర్ పాక్ ప్రధాని కావాలని బాబర్ అభిమానులు కోరుకుంటున్నారు. pic.twitter.com/42Kf0RF6Sj — Guess Karo (@KuchNahiUkhada) November 10, 2022 ►1992 వన్డే వరల్డ్కప్, 2022 టీ20 వరల్డ్కప్లలో పాక్ ప్రస్తానం.. 1992 వన్డే వరల్డ్కప్: అప్పటి వన్డే వరల్డ్కప్కు ఆస్ట్రేలియానే ఆతిథ్యం 2022 టీ20 వరల్డ్కప్: ఇప్పుడు కూడా ఆస్ట్రేలియానే ఆతిథ్యం 1992: మెల్బోర్న్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్లో ఓటమి 2022: అదే మెల్బోర్న్లో టీమిండియా చేతిలోనే ఓటమి 1992: ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలుపు 2022: నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లపై వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలుపు 1992: లీగ్ దశలో చివరి రోజు ఒక్క పాయింట్ ఎక్కువగా ఉన్న పాకిస్తాన్ సెమీస్కు అర్హత 2022: తాజాగా సూపర్-12 దశలో నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడడం.. బంగ్లాదేశ్పై పాక్ గెలవడం.. దీంతో ఒక్క పాయింట్ ఆధిక్యంతో సెమీస్కు అర్హత 1992: సెమీస్లో న్యూజిలాండ్పై విజయం సాధించి ఫైనల్కు 2022: సెమీస్లో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించిన పాక్ ఫైనల్కు 1992: ఫైనల్లో ఇంగ్లండ్ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన పాకిస్తాన్ 2022: ఫైనల్లో ఇంగ్లండ్తో తలపడనున్న పాక్ చదవండి: PAK Vs ENG: ఇంగ్లండ్- పాక్ ఫైనల్కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే? -
నిందించాల్సింది ఆటగాళ్లను కాదు, వాళ్లను.. ఒక్క లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా లేడా..?
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్కప్-2022లో టీమిండియా సెమీస్లోనే ఇంటిదారి పట్టిన నేపథ్యంలో చాలా వరకు భారత అభిమానులు ఆటగాళ్లను నిందిస్తున్నారు. సోషల్మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతూ, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా ప్రవర్తిస్తూ, మన పరువును మనమే బజారుకీడ్చుకునేలా చేస్తున్నారు. అసలు వరల్డ్కప్లో, ముఖ్యంగా సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమికి కారణలేంటని విశ్లేషిస్తే.. ఈ పరాభవానికి జట్టు సెలెక్టర్లే ప్రధాన కారణమన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. జట్టు ఎంపికలో వారు చేసిన తప్పిదాలే టీమిండియా ఓటమికి పరోక్ష కారణమయ్యాయన్నది అందరూ గమనించాల్సిన అంశం. బౌలింగ్లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడంలో ఘోర వైఫల్యం, టాపార్డర్ బ్యాటింగ్లో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ను కూడా ఎంపిక చేయకపోవడం, ప్రత్యామ్నాయ స్పెషలిస్ట్ ఓపెనర్ను ఎంపిక చేయాలన్న ధ్యాసే లేకపోవడం, మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్లు ఆడగల శ్రేయస్ అయ్యర్ను కాదని దీపక్ హుడాను ఎంపిక చేయడం, హార్ధిక్ లాంటి నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను గుర్తించలేకపోవడం, ఫినిషర్ అంటూ దినేశ్ కార్తీక్ను ఎంపిక చేసి ఘోర తప్పిదం చేయడం, టీ20లకు అస్సలు సూట్ కాని అశ్విన్ను ఎంపిక చేయడం, కనీసం బౌలింగ్కు న్యాయం చేయలేని అక్షర్ పటేల్ను ఆల్రౌండర్ కోటాలో ఎంపిక చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్ కమిటీ వరల్డ్కప్ జట్టు ఎంపికలో చాలా ఘోర తప్పిదాలే చేసింది. వీటన్నిటి కంటే ముఖ్యంగా నిఖార్సైన పేసర్లను గుర్తించి, వారిని సానబెట్టడంలో సెలెక్టర్లతో పాటు బీసీసీఐ, నేషనల్ క్రికెట్ అకాడమీలు దారుణంగా విఫలమయ్యాయి. ఈ విషయంలో వీరినే ప్రధానంగా నిందించాలి. నాణ్యమైన పేసర్లను తయారు చేసుకునేందుకు వరల్డ్కప్కు ముందు చాలా సమయం దొరికినప్పటికీ.. కేవలం ఒకరిద్దరిని పట్టుకుని వేలాడారే తప్పించి, యంగ్ టాలెంట్ను అన్వేశించి, వారిని సానబెట్టాలన్న ఆలోచన చేయలేకపోయారు. ఆస్ట్రేలియా పిచ్లకు సూటయ్యే ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, నటరాజన్ లాంటి యువ పేసర్లను పరిగణలోకి తీసుకోకుండా భారీ మూల్యమే చెల్లించుకున్నారు. సెలెక్టర్లు, బీసీసీఐ, ఎన్సీఏ చేసిన ఇన్ని తప్పిదాలను పక్కకు పెట్టి, కేవలం ఒక్క మ్యాచ్లో ఓడినందుకు క్రికెటర్లను, కోచ్ను నిందించడం ఎంత వరకు సబబో భారత అభిమానులు ఆలోచించాలి. అభిమానులు ఎదో బాధలో ఆటగాళ్లను నిందించారంటే ఓ అర్ధం ఉంది. కొందరు భారత మాజీలయితే తమ స్థాయిని మరిచి కెప్టెన్ను, సీనియర్ ఆటగాళ్లను, కోచ్ను టార్గెట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్, షమీ, దినేశ్ కార్తీక్లు టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని, టీమిండియా ఓటమికి నైతిక బాధ్యత వహించి కోచ్ తప్పుకోవాలని వారు కోరడం విడ్డూరంగా ఉంది. చదవండి: రాహుల్ ద్రవిడ్కు విశ్రాంతి.. టీమిండియా కోచ్ ఎవరంటే..? -
ఓటమి కాదు.. ఓడిన తీరే బాధాకరం
-
కిం కర్తవ్యం?
ఏడాది వ్యవధిలో జరిగిన గత టి20 ప్రపంచకప్కు, ఈ సారి టి20 ప్రపంచకప్ మధ్య భారత జట్టు ప్రదర్శనలో తేడా ఏముంది... నాడు గ్రూప్ దశలో వెనుదిరగ్గా, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సెమీస్ వరకు రాగలిగింది. నాకౌట్కు చేరామనే విషయం, పాక్పై గెలవడం తప్ప ఓవరాల్గా ఆటలో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. ఈ రెండు వరల్డ్కప్ల మధ్య 35 అంతర్జాతీయ టి2ంలు ఆడిన టీమిండియా ఏకంగా 26 గెలిచి జోరుగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. కానీ తుది ఫలితం మాత్రం నిరాశాజనకం. ఈ నేపథ్యంలో వచ్చే వరల్డ్కప్లో జట్టు రూపురేఖల్లో ఏదైనా మార్పు ఉండవచ్చా, రెండేళ్ల కోసం ఏమైనా కొత్త ప్రయోగాలు ఉంటాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. అంతర్జాతీయ క్రికెట్లో ఒక మెగా ఈవెంట్ ముగిసిన తర్వాత అన్ని జట్లలో సహజంగానే కొందరి కెరీర్లు ముగుస్తాయి. మంచి విజయాలతో సంతృప్తిగా ముగించేవారు ఒక వైపు...నిరాశగా ఇక సాధించేందుకు ఏమీ లేదని భావనతో మరి కొందరు ఆటకు దూరమవుతారు. ఈ రకంగా చూస్తే టోర్నీలో ఆడిన భారత ప్రస్తుత జట్టు ఎలా ఉండబోతోంది. మున్ముందు కుర్రాళ్లకు ఎలాంటి అవకాశం దక్కుతుంది. ఆటగాళ్ల టి20 ఫార్మాట్ రిటైర్మెంట్పై ఇప్పుడే మాట్లాడటం సరి కాదంటూ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దాటవేసినా... వాస్తవం చూస్తే ఈ ఫార్మాట్లో పలు మార్పులు మాత్రం ఖాయం. ఇద్దరు స్టార్లూ కష్టమే... కోహ్లి, రోహిత్ స్టార్లు కావచ్చు గాక...కానీ రెండేళ్ల తర్వాత జరిగే టి20 వరల్డ్ కప్ వరకు వారు కొనసాగడం సందేహమే. బీసీసీఐ మరీ కఠినంగా వ్యవహరించకపోవచ్చు గానీ వాస్తవం చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. 2024 సమయానికి రోహిత్కు 37, కోహ్లికి 36 ఏళ్లు ఉంటాయి. రోహిత్ ఇప్పటికే ఫిట్నెస్పరంగా చాలా వెనుకబడి ఉన్నాడు. కెప్టెన్గా ఈ సారి దక్కిన అవకాశం ఉపయోగించుకోలేకపోయాడు. పైగా ఆటగాడిగా కూడా విఫలమయ్యాడు. రోహిత్ కెరీర్కు సంబంధించి వన్డే వరల్డ్ కప్ ఒక లక్ష్యంగా మిగిలింది. ఇప్పటికిప్పుడు కెప్టెన్సీ మార్పు కూడా ఉండదు కాబట్టి వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్కప్లో జట్టును గెలిపిస్తే అతను దిగ్గజాల్లో ఒకడిగా నిలిచిపోతాడు. కాబట్టి పూర్తి ఫోకస్ వన్డేలపైనే ఉండవచ్చు. రెండేళ్ల తర్వాత మళ్లీ టి20 కెప్టెన్సీ చేయాలనే ప్రేరణ అతనికి ఏమీ కనిపించడం లేదు. కోహ్లికి ఫిట్నెస్ సమస్య లేదు కానీ అతను కూడా ఈ ఫార్మాట్లో చాలా సాధించేశాడు. వరల్డ్ కప్ విజేత జట్టులో భాగం కాకపోయినా అదేమీ అతని గొప్పతనాన్ని తగ్గించదు. పైగా వన్డేల్లో ‘ఆల్టైమ్ గ్రేట్’లలో ఒకడైన కోహ్లికి స్వదేశంలో వన్డే వరల్డ్ కప్లో అసాధారణ ప్రభావం చూపించగలడు. బీసీసీఐ అంతర్గత సమాచారం ప్రకారం వీరిద్దరు ఐపీఎల్కు మాత్రం పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన చేయకపోవచ్చు గానీ యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు సిరీస్లకు దూరమవుతూ వస్తారు. రాహుల్పై వేటు పడుతుందా! తర్వాతి రెండు సిరీస్లలో పేర్లను పరిశీలించకపోవడంతో అశ్విన్, దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ టి20 కెరీర్ ముగిసినట్లే అని చెప్పవచ్చు. సుదీర్ఘ విరామం తర్వాత గత వరల్డ్కప్కు ముందు అనూహ్యంగా అశ్విన్ పునరాగమనం చేయగా, ఐపీఎల్ ప్రదర్శనతో ఫినిషర్ కార్తీక్ కెరీర్ చివర్లో మళ్లీ దూసుకొచ్చాడు. అయితే వీరిద్దరితో కొత్తగా ప్రయత్నించేందుకు ఏమీ లేదు కాబట్టి ఫార్మాట్నుంచి తప్పుకోవడం ఖాయం. ఆఖరి నిమిషంలో జట్టుతో చేరిన మొహమ్మద్ షమీ టి20 కెరీర్ కూడా ఇక ముందుకు వెళ్లదు. రాహుల్ పరిస్థితి మాత్రం కాస్త సందేహాస్పదంగా ఉంది. అటు పూర్తిగా తప్పుకోలేడు, ఇటు గొప్పగా ఆడటం లేదు...ఇలాంటి స్థితిలో అతనిపై వేటు పడవచ్చు. అయితే దేశవాళీ, ఐపీఎల్లో మళ్లీ చెలరేగితే పునరాగమనం కూడా సాధ్యమే. కొత్త పేస్ బౌలర్లు పోటీనిస్తూ దూసుకొస్తున్న తరుణంలో భువనేశ్వర్ కుమార్ తన సాధారణ ప్రదర్శనతో ఇంకా ఎంత వరకు జట్టులో కొనసాగగలడో చూడాలి. వచ్చేది ఎవరు? రెండేళ్ల తర్వాత పూర్తిగా భిన్నమైన జట్టును మనం చూడవచ్చు. తొలి బంతినుంచి దూకుడు ప్రదర్శిస్తూ విధ్వంసక శైలి ఆటగాళ్లు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. పృథ్వీ షా, సంజు సామ్సన్ ఎలాంటి ప్రత్యర్థిపైనైనా చెలరేగగలరు. పంత్ దూకుడు గురించి అందరికీ తెలుసు. కివీస్తో సిరీస్కు ఎంపికైన శుబ్మన్ గిల్ ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మెరుపు సెంచరీతో సత్తా చాటారు. స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ సరిగ్గా సరిపోతాడు. పేస్ విభాగంలోనైతే ఉమ్రాన్ మొదలు మొహసిన్ వరకు ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. బుమ్రా ఎలాగూ మళ్లీ జట్టులో చేరతాడు. మరో వైపు 32 ఏళ్ల సూర్యకుమార్ కెరీర్ ఉచ్ఛదశలో ఉన్నాడు కాబట్టి వచ్చే రెండేళ్ల ప్రణాళికలో కూడా అతను భాగం కావడం ఖాయం. భవిష్యత్తును బట్టి చూస్తే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి అన్ని వైపులనుంచి మద్దతు లభించవచ్చు. ఆల్రౌండర్గా తన విలువను ప్రదర్శిస్తున్న అతను రోహిత్ లేని సమయంలో కెప్టెన్గా కూడా రాణిస్తున్నాడు. పైగా ఐపీఎల్లో తొలి సారే గుజరాత్కు విజేతగా నిలిపిన రికార్డూ ఉంది. కొత్త ప్రణాళికలు, వ్యూహాలు కూడా వంద శాతం ఫలితాలిస్తాయని ఎవరూ చెప్పలేరు. అయితే సెమీస్లో ఇంగ్లండ్ ఆట చూస్తే టి20లు ఎలా ఆడాలో తెలుస్తుంది. ఆరంభంలో వికెట్లు కాపాడుకొని చివర్లో పరుగులు రాబట్టగలమనే ఆలోచనకన్నా... ఆసాంతం ధాటిని ప్రదర్శించి కొన్ని ఓటము లు ఎదురైనా నష్టం లేదు. పవర్ప్లేలో పవర్ఫుల్ ఆట చూపించే ఇదే దూకుడు సరైన సమయంలో జట్టుకు సత్ఫలితాలు అందించడం మాత్రం ఖాయం. భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ) ప్రకారం భారత జట్టు వచ్చే ఏడాది కేవలం 12 టి20లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. 2023లో వన్డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి దానికి సన్నాహకంగా అన్నట్లు 25 వన్డేల్లో టీమిండియా బరిలోకి దిగుతుంది. –సాక్షి క్రీడావిభాగం -
ప్రొటీస్నే కాదు టీమిండియాను 'చోకర్స్' అని పిలవొచ్చు
క్రికెట్లో కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే టీమ్లను చోకర్స్ అని పిలుస్తుంటారు. ఇక చోకర్స్ అనే ముద్ర క్రికెట్లో సౌతాఫ్రికాకు ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐసీసీ టోర్నీల్లో ఆరంభంలో వరుస విజయాలు సాధించే ప్రొటీస్ కీలకమైన మ్యాచ్లు లేదంటే నాకౌట్ దశలో చేతులెత్తేయడం చూస్తుంటాం. వాళ్లు క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి చూసుకుంటే ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీలు కొట్టలేకపోయారు. ఈసారి ప్రపంచకప్లో కూడా సౌతాఫ్రికాకు అదే పరిస్థితి ఎదురైంది. గ్రూప్-2లో ఉన్న సౌతాఫ్రికా నెదర్లాండ్స్పై గెలిస్తే సెమీస్ చేరుకునేది. కానీ దురదృష్టం వారి పక్కనే ఉంటుంది కదా.. అందుకే డచ్ చేతిలో ఓడి అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తాజాగా టీమిండియా కూడా సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చూసింది. కనీసం పోరాటం కూడా చేయకపోవడం అభిమానులను మరింత బాధపెట్టింది. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ ఒక ఇంగ్లీష్ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2014 నుంచి ఐసీసీ ఈవెంట్లలో వరుసగా విఫలమవుతూ వస్తున్న టీమిండియాను ఇకపై చోకర్స్ అని పిలవొచ్చని పేర్కొన్నాడు. ''టీమిండియాను చోకర్స్ అని పిలవడంలో తప్పేమీ లేదు. ఇటీవలే ఐసీసీ ఈవెంట్లలో చివరి వరకూ వచ్చి బోల్తా కొడుతున్నారు. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రమే చోకర్స్ అని పిలవొచ్చు. కానీ వ్యక్తిగతంగా జట్టులో కొంత మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ పదం వాడడానికి వీల్లేదు. మరీ అంత కఠినంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇండియా చెత్తగా ఆడిందని నేనూ అంగీకరిస్తాను. కానీ ఒక్క మ్యాచ్తో మరీ అంతగా విమర్శించాల్సిన పని లేదు" అని కపిల్ స్పష్టం చేశాడు. ఇక కపిల్ దేవ్ సారధ్యంలో టీమిండియా తొలిసారి 1983 వన్డే వరల్డ్కప్ గెలిచింది. ఆ తర్వాత ధోని సారధ్యంలో 2007 టి20 ప్రపంచకప్,2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత నుంచి జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్లలో ఆఖర్లో బోల్తా కొడుతూ వస్తుంది. 2014 టి20 వరల్డ్కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకూ ఐసీసీ టోర్నీల్లో చివరి మెట్టుపై ఇండియా బోల్తా పడుతూ వస్తోంది. 2015 వన్డే వరల్డ్కప్ సెమీస్, 2016 టీ20 వరల్డ్కప్ సెమీస్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్కప్ సెమీస్, తాజాగా 2022 టీ20 వరల్డ్కప్లోనూ ఇండియా సెమీస్లో ఓడిపోయింది. చదవండి: ఫైనల్ చేరగానే కొమ్ములొచ్చాయా?.. విషం చిమ్మిన రమీజ్ రాజా -
ఫైనల్ చేరగానే కొమ్ములొచ్చాయా?.. విషం చిమ్మిన రమీజ్ రాజా
టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ ఫైనల్కు వెళ్లిందనగానే పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు కొమ్ములొచ్చాయి. టీమిండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగకక్కాడు. పాకిస్తాన్ జట్టు ఫైనల్ వెళ్లినందుకు ప్రశంసలు కురిపించడం తప్పులేదు.. కానీ అదే సమయంలో పని గట్టుకొని టీమిండియాపై విషం చిమ్మడం ఎందుకంటూ క్రికెట్ అభిమానులు విమర్శలు చేశారు. టి20 ప్రపంచకప్లో భాగంగా గురువారం ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకొని టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే సూపర్-12 దశలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో పాక్ కథ ముగిసిందనుకున్నారు. కానీ అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో అదృష్టం కలిసి వచ్చి పాకిస్తాన్ సెమీస్లో అడుగుపెట్టింది. అయితే సెమీస్లో కివీస్పై మంచి ప్రదర్శన కనబరిచి మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అదే సమయంలో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. దీనిని అవకాశంగా తీసుకున్న పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా టీమిండియా, బీసీసీఐను హేళన చేస్తూ మాట్లాడాడు. తమ టీమ్పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని.. అదే సమయంలో బిలియన్ డాలర్ ఇండస్ట్రీ టీమ్(టీమిండియా) ఇంటికెళ్లిపోయిందంటూ పేర్కొన్నాడు. "మా టీమ్పై మాకు అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి వరల్డ్ క్రికెట్ ఎంత వెనుకబడిపోయిందో పాకిస్థాన్ క్రికెట్ ఎంత ముందుకెళ్లిపోయిందో. ఈ వరల్డ్కప్లో అది తెలిపి వచ్చింది. టీమిండియా లాంటి బిలియన్ డాలర్ టీమ్స్ వెనుకబడిపోతే మా టీమ్ పైకెళ్లిపోయింది. అంటే కొన్ని విషయాలను మేము సరి చేస్తున్నామనే కదా అర్థం. గత నెలలోనే ముగ్గురు ప్లేయర్స్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచారు. ఇది చాలు మేమేంటో చెప్పడానికి" అంటూ గొప్పలు చెప్పుకున్నాడు. అయితే రమీజ్ రాజా వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానుల ధీటుగా బదులిచ్చారు. టీమిండియాపై విషం చిమ్మడం ఆపండి.. సందు దొరికితే చాలు టీమిండియాపై పడిపోతావు.. నీకు వేరే పని లేదనుకుంటా.. ఫైనల్కు వెళ్లగానే కాదు.. ఇంగ్లండ్ చేతిలో పాక్కు మూడింది.. పాక్ను చావుకొట్టడం ఖాయం అంటూ రమీజ్ రాజాకు చురకలంటించారు. ఇక టి20 వరల్డ్కప్ ఫైనల్ ఆదివారం (నవంబర్ 13న) మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు మెల్బోర్న్లో 95 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా సెమీఫైనల్కు,ఫైనల్కు రిజర్వ్డేను ఐసీసీ కేటాయించింది. కాబట్టి ఒక వేళ ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించి, ఆదివారం ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి రిజర్వ్ డే(సోమవారం)లో కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. -
సూపర్-12లో వెళ్లాల్సినోళ్లు ఫైనల్ దాకా.. హేడెన్ చలవేనా!
టి20 ప్రపంచకప్ 2022 నవంబర్ 13న ముగియనుంది. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్తో పాకిస్తాన్ అమితుమీ తేల్చుకోనుంది. సూపర్-12 దశలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి.. దీంతో పాక్ కథ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ వారికి ఎక్కడో సుడి రాసిపెట్టుంది. అందుకే ఆ తర్వాత పాక్ ఆడిన మూడు మ్యాచ్ల్లో వరుసగా గెలవడం.. ఆపై సౌతాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో కథ అడ్డం తిరిగింది. అనూహ్యంగా పాకిస్తాన్ సెమీస్లో అడుగుపెట్టింది. అయితే కీలకమైన సెమీస్లో మాత్రం అద్భుత ఆటతీరును కనబరిచింది. సూపర్-12 వరకు కిందా మీదా పడి ఎలాగోలా గెలిచిన పాకిస్తాన్ జట్టేనా సెమీస్లో కివీస్పై నెగ్గింది అన్న అనుమానాలు వచ్చాయి. మరి రెండు రోజుల వ్యవధిలో పాక్ జట్టులో అంత మార్పు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి కారణం మాత్రం ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ అని క్రీడా పండితులు పేర్కొన్నారు. ప్రస్తుతం మాథ్యూ హెడెన్ పాకిస్తాన్ జట్టుకు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. పాక్ దశను మార్చే పనిలో ఉన్న హేడెన్ దాదాపు సక్సెస్ అయినట్లే. ఇక ఫైనల్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి పాకిస్తాన్ విజేతగా నిలిస్తే హేడెన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లే. ఇదంతా ఎందుకు.. అసలు ఆస్ట్రేలియాలోని పిచ్లపై పూర్తి అవగాహన ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్ను ఎప్పుడైతే మెంటార్గా ఏంచుకుందో అప్పుడే పాక్ సగం సక్సెస్ అయినట్లే. అయితే హేడెన్ ప్రభావం తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది.. అది కీలకమైన సెమీస్ మ్యాచ్లో. నిజానికి గతేడాది టి0 ప్రపంచకప్కు ముందే అంటే సెప్టెంబర్లోనే మాథ్యూ హెడెన్ను బ్యాటింగ్ కోచ్గా నియమించుకుంది. కానీ ఆ ప్రపంచకప్లో సెమీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ప్రధాన కోచ్ అంటే అన్ని విషయాలు పరిశీలిస్తాడు. అదే బౌలింగ్ లేదా బ్యాటింగ్ కోచ్ అయితే కేవలం వారి పరిధి వరకే పనిచేస్తారు. ప్రస్తుతం పాక్ ప్రధాన కోచ్గా సక్లెయిన్ ముస్తాక్ ఉన్నాడు. పీసీబీ ఎంపిక చేసింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. ఇటు చూస్తే ఈసారి ప్రపంచకప్ జరుగుతుంది ఆస్ట్రేలియాలో.బ్యాటింగ్ కోచ్గా ఉన్న హేడెన్కు ఆసీస్ పిచ్లపై అపార అనుభవం ఉంది. అందుకే ఉన్నపళంగా మాథ్యూ హేడెన్ను మెంటార్గా నియమించిన పీసీబీ మహ్మద్ యూసఫ్ను బ్యాటింగ్ కోచ్గా ఎన్నుకుంది. హేడెన్ అనుభవాన్ని పాకిస్తాన్ చక్కగా ఉపయోగించుకుందనడానికి సెమీస్ మ్యాచ్ ఉదాహరణ. ముందు బౌలింగ్తో కివీస్ను కట్టడి చేయగా.. ఆ తర్వాత అసలు ఫామ్లో లేని బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లు అసలు మ్యాచ్లో హాఫ్ సెంచరీలతో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరి వీటన్నింటి వెనుక కారణం హేడెన్ అంటే అతిశయోక్తి కాదు. అందుకే మ్యాచ్ ముగియగానే హేడెన్ వద్దకు పరిగెత్తుకొచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం అతన్ని ప్రేమతో హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సూపర్-12 దశలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తమ జట్టు ముందుకు సాగుతుందా లేదా అని డైలమాలో ఉన్నాడు.. కానీ ఇదే సమయంలో హేడెన్ మాత్రం మా కుర్రాళ్లు తప్పుకుండా రాణిస్తారు.. ఈసారి కప్ పాకిస్తాన్దే అని ప్రతీ మ్యాచ్కు ముందు చెప్పుకుంటూ వస్తున్నాడు. హేడెన్ వ్యాఖ్యలని బట్టి చూస్తే పాక్ విజయంపై అతను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో అర్థమవుతుంది. ఇక పరిస్థితులు కూడా పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్నాయి. 1992 వన్డే వరల్డ్కప్లాగే ఇప్పుడు కూడా పాక్ టైటిల్ కొట్టబోతుంటూ పలువురు జోస్యం చెబుతున్నారు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్గా టైటిల్ గెలిచాడు. ఇప్పుడు బాబర్ ఆజం కెప్టెన్గా తొలి ఐసీసీ ట్రోఫీని అందుకోబోతున్నాడంటూ పేర్కొంటున్నారు. మరి హేడెన్ దిశానిర్ధేశం పాక్ జట్టుకు ఎంత వరకు పనిచేస్తుందనేది ఫైనల్ మ్యాచ్ పూర్తయ్యాకే తెలుస్తుంది. కాగా కివీస్పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాకా.. డ్రెస్సింగ్ రూమ్లో హేడెన్ ఇచ్చిన స్పీచ్ను పీసీబీ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. ఈ జోస్యాల సంగతి పక్కనబెడితే టి20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పాక్ సంగతి పక్కనబెడితే ఇంగ్లండ్ అంతకంటే బలంగా కనిపిస్తుంది. టీమిండియాతో సెమీస్లో ఇంగ్లండ్ ఆడిన ఆటతీరు చూస్తే అర్థమవుతుంది. కానీ పాక్ జట్టులో ప్రస్తుతం బౌలింగ్ విభాగం నెంబర్వన్గా ఉంది. షాహిన్ అఫ్రిది, మహ్మద్ వసీమ్, నసీమ్ షా పేస్ త్రయానికి తోడుగా మమ్మద్ నవాజ్ స్పిన్ కూడా పెద్ద బలం. మరి అరివీర భయంకరంగా కనిపిస్తున్న పాక్ పేసర్లను ఇంగ్లండ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. ఇవన్నీ పక్కనబెడితే క్రికెట్ అభిమానులు మాత్రం ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. కొందరేమో 1992 సీన్ రిపీట్ కాబోతుందని.. పాకిస్తాన్దే కప్ అని పేర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పాక్కు అంత సీన్ లేదని.. మ్యాచ్ కచ్చితంగా వన్సైడ్ అవుతుందని.. ఇంగ్లండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలవనుందని తెలిపారు. చదవండి: కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు ఆటలో లోపం లేదు.. టాలెంట్కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో! -
WC 2022: నా మాటలు రోహిత్ను హర్ట్ చేయొచ్చు.. కానీ: భారత మాజీ క్రికెటర్
ICC Men's T20 World CUp 2022- Rohit Sharma: టీ20 ప్రపంచకప్-2022 నుంచి టీమిండియా నిష్క్రమణ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో బ్యాటర్గా.. కెప్టెన్గా విఫలమయ్యాడంటూ ‘హిట్మ్యాన్’ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్వైపాక్షిక సిరీస్లు, ఐపీఎల్ టైటిళ్లు గెలిస్తే సరిపోదని.. ఐసీసీ ట్రోఫీ గెలిస్తేనే విజయవంతమైన కెప్టెన్ అంటారంటూ ట్రోల్ చేస్తున్నారు. అదే విధంగా పలు సిరీస్లకు రోహిత్ అందుబాటులో ఉండని విషయాన్ని ఉటంకిస్తూ.. విశ్రాంతి తీసుకుని తీసుకుని రోహిత్ అలసిపోయాడని.. ఫామ్లో ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం రోహిత్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా తరచూ కెప్టెన్లను మారుస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరును ఎండగట్టాడు. వరల్డ్కప్ రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర పరాభవం నేపథ్యంలో క్రిక్బజ్తో మాట్లాడిన అజయ్ జడేజా.. ‘‘నేను చెప్పే మాటలు రోహిత్ శర్మకు బాధ కలిగించవచ్చు. నిజానికి కెప్టెన్గా జట్టును తీర్చిదిద్దుకోవాలంటే కనీసం ఏడాది పాటు టీమ్ను అట్టిపెట్టుకునే ఉండాలి. అసలు ఈ ఏడాదిలో రోహిత్ ఎన్ని సిరీస్లు ఆడాడు? జట్టుకు నాయకుడు అనేవాడు ఒక్కడే ఉండాలి. ఏడుగురు కెప్టెన్లు ఉంటే కీలక సమయాల్లో గెలుపొందడం కష్టమే’’ అంటూ బీసీసీఐపై విమర్శలు గుప్పించాడు. ఇక న్యూజిలాండ్ టూర్కు హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్కు రెస్ట్ ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో జట్టులో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని వాపోయాడు. కోహ్లి నిష్క్రమణ తర్వాత కెప్టెన్ల మార్పులు గతేడాది టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. వెస్టిండీస్, శ్రీలంక తదితర జట్లపై క్లీన్స్వీప్లతో సత్తా చాటాడు. ఇక వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తప్పించిన తర్వాత పరిమత ఓవర్ల క్రికెట్ పూర్తిస్థాయి కెప్టెన్గా మారాడు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల రోహిత్ జట్టుకు దూరంకాగా కేఎల్ రాహుల్ (సౌతాఫ్రికాతో వన్డేలు, రిషభ్ పంత్ (సౌతాఫ్రికాతో టీ20 సిరీస్), హార్ధిక్ పాండ్యా (ఐర్లాండ్లో టీ20 సిరీస్), జస్ప్రీత్ బుమ్రా (ఇంగ్లండ్ తో రీషెడ్యూల్ 5వ టెస్ట్), శిఖర్ ధవన్ (వెస్టిండీస్తో వన్డే సిరీస్) తదితరులు సారథులుగా వ్యవహరించారు. ఇలా ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చిన జట్టుగా టీమిండియా ‘రికార్డు’ సృష్టించింది. కాగా ఐపీఎల్లో ఐదు టైటిళ్లు గెలవడం సహా ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలతో కెప్టెన్గా హిట్ అయిన హిట్మ్యాన్.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ, తాజాగా టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మేజర్ టోర్నీల్లో పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ ఆసియా కప్లో 133, వరల్డ్కప్లో 116 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: Alex Hales-Eoin Morgan: కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు WC 2022 Final: రూ. 500కే ఫైనల్ టిక్కెట్లు అమ్మేసిన ఫ్యాన్స్!? ఇది వాళ్ల పనేనంటూ T20 WC 2022: 'అతడిని టీమిండియా కోచ్ చేయండి.. కెప్టెన్గా అతడే సరైనోడు' -
కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు
''ఎక్కడ పారేసుకున్నావో.. అక్కడే వెతుకు కచ్చితంగా దొరుకుతుంది'' అని మన పెద్దలు అనడం వింటూనే ఉంటాం. ఈ సారాంశం ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్కు సరిగ్గా సరిపోతుంది. టి20 ప్రపంచకప్లో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో కెప్టెన్ బట్లర్తో కలిసి విధ్వంసం సృష్టించాడు. 86 పరుగులు నాటౌట్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైన అలెక్స్ హేల్స్ను టీమిండియా అభిమానులు అంత తొందరగా మరిచిపోలేరు. అసలు విషయమేంటంటే ముందు అలెక్స్ హేల్స్ అసలు ఇంగ్లండ్ వరల్డ్కప్ జట్టులోనే లేడు. స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో గాయపడడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు అలెక్స్ హేల్స్. అయితే హేల్స్ జట్టులోకి రావడం వెనుక ఉన్నది మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్. బట్లర్ తనపై పెట్టుకున్న నమ్మకానికి అలెక్స్ హేల్స్ పూర్తిశాతం న్యాయం చేశాడు. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్లతో జరిగిన మ్యాచ్లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్కు చేర్చాడు. ఇక అలెక్స్ హేల్స్ 2019 వన్డే వరల్డ్ కప్కు ముందు సరదాగా ప్రమాదకరం కాని ‘రిక్రియేషనల్ డ్రగ్స్’ తీసుకున్నాడు. దాంతో అతనిపై 3 వారాల నిషేధం విధించారు. అలా మూడు వారాలు కాస్త మూడు సంవత్సరాలైపోయాయి. హేల్స్ మూడేళ్ల పాటు క్రికెట్కు దూరమవ్వడానికి కారణం మరో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. మోర్గాన్ దృష్టిలో మాత్రం డ్రగ్స్ వ్యవహారం చిన్న తప్పుగా అనిపించలేదు. దీనిని ‘నైతికత’కు సంబంధించిన అంశంగా వాదించిన మోర్గాన్ వరల్డ్ కప్ జట్టులోంచి హేల్స్ను తీసేయించాడు. నిజానికి 2015 వరల్డ్కప్లో ఇంగ్లండ్ ఘోర వైఫల్యం తర్వాత జట్టు పునరుజ్జీవంలో హేల్స్ కూడా కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో ఇంగ్లండ్ రికార్డు స్కోర్లలో అతనిదే ప్రధాన పాత్ర. అయినా సరే మోర్గాన్ మాత్రం తగ్గలేదు. హేల్స్ను జట్టుకు దూరంగా ఉంచి తన మాట నెగ్గించుకున్నాడు. సరిగ్గా చెప్పాలంటే ‘నేను కెప్టెన్గా ఉన్నంత వరకు నువ్వు మళ్లీ ఇంగ్లండ్ జట్టులోకి రాలేవు’ అని సందేశం ఇచ్చాడు. చివరకు అదే జరిగింది. అలా మూడేళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు దూరమైన హేల్స్ మోర్గాన్ రిటైర్మెంట్ కాగానే మళ్లీ జట్టులోకి వచ్చాడు. బట్లర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాకా తన మార్క్ను చూపెట్టాలని అలెక్స్ హేల్స్ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చాడు. ఈ సెప్టెంబర్లో పాకిస్తాన్ టూర్లో హేల్స్ మంచి ప్రదర్శన కనబరిచాడు. కానీ అప్పటికే టి20 ప్రపంచకప్కు జట్టును ఎంపిక చేయగా అందులో హేల్స్ లేడు. కానీ బెయిర్ స్టో గాయపడడం హేల్స్కు కలిసి వచ్చింది. అలా ఒక వరల్డ్కప్ ఆడే చాన్స్ మిస్ అయింది. కానీ మరో వరల్డ్కప్ ఆడే అవకాశం వచ్చింది. వచ్చిన రెండో అవకాశాన్ని హేల్స్ వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకేముంది వెనక్కి తిరిగి చూస్తే హేల్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ నుంచి టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక టీమిండియాతో జరిగిన సెమీస్లో హేల్స్ ఇన్నింగ్స్ను మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా చూశాడు. వరల్డ్కప్లో స్కై స్పోర్ట్స్ కామెంటరీ టీమ్లో భాగంగా ఉన్న ఇయాన్ మోర్గాన్ హేల్స్ బ్యాటింగ్కు చప్పట్లు కొడుతూ అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అందుకే అంటారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మొన్న తిట్టినోడే ఇవాళ మెచ్చుకున్నాడు. అంటూ అభిమానులు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: ఆటలో లోపం లేదు.. టాలెంట్కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో! WC 2022: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’.. రేసులో 9 మంది! కోహ్లితో పాటు -
WC 2022: రూ. 500కే ఫైనల్ టిక్కెట్ల అమ్మకం!? ఇది వాళ్ల పనేనంటూ..
T20 World Cup Final: టీ20 ప్రపంచకప్-2022 మొదటి సెమీ ఫైనల్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ను ఓడించగానే.. క్రికెట్ ప్రేమికుల్లో ఎక్కడా లేని ఉత్సాహం.. రెండో సెమీస్ మ్యాచ్లో గ్రూప్-2 టాపర్ టీమిండియా.. ఇంగ్లండ్ను చిత్తు చేయడం ఖాయమని.. తద్వారా ఫైనల్లో దాయాదుల హై వోల్టేజ్ మ్యాచ్ చూసే అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూశారు. కానీ అడిలైడ్ వేదికగా గురువారం నాటి మ్యాచ్లో భారత జట్టు పరాజయం పాలు కావడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. ముఖ్యంగా భారత బౌలర్లు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకపోవడం.. టీమిండియా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి చెందడం తట్టుకోలేకపోయారు. కనీస పోరాటం లేకుండానే ప్రత్యర్థి జట్టు ముందు తలొగ్గారంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. టీమిండియా- పాకిస్తాన్ ఫైనల్ ఆడితే చూడాలని.. 2007 నాటి సెంటిమెంట్ను రిపీట్ చేస్తూ భారత్ గెలవాలంటూ ఆకాంక్షిస్తే సెమీస్లోనే ఇంటికి బాట పట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. కాగా భారత్- పాక్ అంటేనే అంచనాలు ఎక్కువ. అది కూడా ఫైనల్లో తలపడితే ఆ మజానే వేరు. పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్ ఎనిమిదో ఎడిషన్లో ఇందుకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్పటికే ఫైనల్ మ్యాచ్కు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు చాలా మంది! కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వారి ఆశలపై నీళ్లు చల్లడంతో ఉసూరుమన్నారు. దీంతో కొంతమంది ఫ్యాన్స్ ఇండియా- ఇంగ్లండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఫైనల్ వీక్షించేందుకు కొనుక్కున్న టిక్కెట్లు అమ్మేందుకు ప్రయత్నించినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 10 ఆస్ట్రేలియన్ డాలర్ల(మన కరెన్సీలో సుమారు 536 రూపాయలు)కే టిక్కెట్లు ఇచ్చేస్తామంటూ ఆవేదన, ఆగ్రహంతో కూడిన స్వరంతో వాళ్లు మాట్లాడటం అందులో వినిపించింది. అయితే, ఇది పాక్ నెటిజన్ల పనేనని, కావాలనే ఇలాంటి వీడియోలు షేర్ చేస్తున్నారంటూ.. ఇంతకీ ఇది నిజమైందో కాదో అంటూ ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో భారత జట్టు ఓటమిపై మీమ్స్ ఆగటం లేదు. అన్ని రకాలుగా దెబ్బే ఆస్ట్రేలియాలో ఈ ఐసీసీ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ సహా సమీప దేశాల్లో ఉన్న చాలా మంది భారతీయులు మెల్బోర్న్లో నవంబరు 13న ఫైనల్ చూసేందుకు విమాన టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇండియా- పాక్ మ్యాచ్ అంటే వ్యూయర్షిప్ రికార్డులు, రేటింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. కానీ ఈ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు తలపడబోవడం లేదు కాబట్టి ఈ విధంగా కూడా బిజినెస్ దెబ్బ తినే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా రోహిత్ సేన ఫ్యాన్స్తో పాటు సగటు క్రికెట్ అభిమాని ఆశలన్నీ కల్లలు చేసింది. అయినా, ఆటలో గెలుపోటములు సహజమే! క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగటమే ముఖ్యం! చదవండి: T20 WC 2022: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు రేసులో 9 మంది! కోహ్లితో పాటు: ఐసీసీ ప్రకటన SuryaKumar Yadav: ఓటమి బాగా హర్ట్ చేసింది.. ఒక్కడివి ఏం చేయగలవు! Fans who have already bought IND vs Pak final match tickets : pic.twitter.com/gqb0lElvLm — Raghav Masoom (@comedibanda) November 11, 2022 -
'ఒక్కడిని ఏం చేయగలను.. ఓటమి బాగా హర్ట్ చేసింది'
టి20 ప్రపంచకప్లో టీమిండియా కథ సెమీస్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ అవమానానికి జట్టులో అందరూ ఆటగాళ్లు బాధపడొచ్చు.. కానీ అందరికంటే ఎక్కువ బాధ ఇద్దరు బాగా అనుభవిస్తున్నారు. వాళ్లిద్దరే విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్లు. ఈసారి టి20 ప్రపంచకప్లో టీమిండియా ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే ఈ ఇద్దరి గురించే తప్ప చెప్పడానికి కూడా పెద్దగా ఏం ఉండదు. సూపర్-12 దశలో కోహ్లి రెండు మ్యాచ్లు గెలిపిస్తే.. సూర్యకుమార్ మరో రెండు గెలిపించాడు. కోహ్లితో పోటీ పడి మరి పరుగులు సాధించేందుకు సూర్యకుమార్ ప్రయత్నించాడు. అందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కానీ జట్టు సరిగ్గా ఆడకపోతే వీరిద్దరు మాత్రం ఏం చేయగలరు. అందుకే వీరి బాధ వర్ణణాతీతం. ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అని కింగ్ కోహ్లి ట్వీట్ చేసిన కాసేపటికే సూర్యకుమార్ కూడా స్పందించాడు. ఈ పరాజయం మమ్మల్ని బాగా హర్ట్ చేసింది. అయితే సెమీస్లో తడబడడం మా కొంపముంచింది. మేము ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడ జోష్ వాతావరణాన్ని సృష్టించిన అభిమానులకు కృతజ్ఞతలు. ఇంత మద్దతు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అభిమానం చూస్తుంటే అసలు ఈ వరల్డ్కప్ ఆస్ట్రేలియాలో ఆడుతున్నట్లే అనిపించలేదు. ఇక జట్టుతో పాటు సపోర్ట్ స్టాఫ్ చేసిన కృషికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నా దేశం తరపున ఆడటం గర్వంగా ఉంది. మేము తిరిగి ఫుంజుకుంటాం.. బలంగా తిరిగివస్తాం అంటూ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్తో మ్యాచ్లో 14 పరుగులు మాత్రమే చేసి ఔటైన సూర్యకుమార్ యాదవ్ టి20 ప్రపంచకప్లో ఓవరాల్గా ఆరు మ్యాచ్ల్లో 189 స్ట్రైక్రేట్తో 239 పరుగులు చేశాడు. అంతేకాదు ఈ క్యాలెండర్ ఇయర్లో 29 ఇన్నింగ్స్ల్లోనే 1040 పరుగులు సాధించిన సూర్య ఎంత భీకరమైన ఫామ్లో ఉన్నాడో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే టీమిండియా ప్రదర్శనపై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి బౌలింగ్తో ఈ ప్రపంచకప్లో సెమీస్ దాకా రావడమే చాలా ఎక్కువని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా బౌలర్లు పూర్తి స్థాయిలో చేతులెత్తేయడం టీమిండియా బలహీనతను బయటపెట్టిందన్నారు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమేనని తెలిపారు. కళ్ల ముందు జరిగింది కాబట్టి ఏం చెప్పలేక సర్దుకుపోతున్నాం.. ఇంకా నయం ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడి ఉంటే టీమిండియా ఆటగాళ్లకు భారీ అవమానాలు జరిగేవన్నారు. ఇలాంటివి చూడకుండానే సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి టీమిండియా ఇంటి బాట పట్టి మంచి పని చేసిందంటూ కొంతమంది పేర్కొన్నారు. Hurtful loss. Forever grateful to our fans who create electrifying atmosphere, no matter where we play. Thankful for the undying support for each other, proud of the hardwork put in by this team &support staff. Proud to play for my country🇮🇳 We will reflect &come back stronger! pic.twitter.com/EeuLz45kgl — Surya Kumar Yadav (@surya_14kumar) November 11, 2022 -
WC 2022: ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’.. రేసులో 9 మంది! కోహ్లితో పాటు
ICC Men's T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16న ఆరంభమైన టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. మెల్బోర్న్ వేదికగా నవంబరు 13న ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్తో ఈ ఐసీసీ ఈవెంట్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం పోటీలో నిలిచిన తొమ్మిది క్రికెటర్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో ఉన్న తమకు నచ్చిన ఆటగాడికి ఓటు వేసే అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటన చేసింది. కాగా ఈ లిస్టులో భారత్ నుంచి ఇద్దరు, పాకిస్తాన్ నుంచి ఇద్దరు, ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, జింబాబ్వే నుంచి ఒకరు, శ్రీలంక నుంచి ఒకరు చోటు దక్కించుకున్నారు. ఐసీసీ షార్ట్లిస్టులో ఉన్న క్రికెటర్లు వీరే 1. విరాట్ కోహ్లి (భారత్)- 296 పరుగులు- 6 మ్యాచ్లలో 2. సూర్యకుమార్ యాదవ్ (భారత్)- 239 పరుగులు- 6 మ్యాచ్లలో 3. షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)- 10 వికెట్లు, ఒక అర్ధ శతకం- 6 మ్యాచ్లలో 4. షాహిన్ ఆఫ్రిది (పాకిస్తాన్)- 10 వికెట్లు- 6 మ్యాచ్లలో 5. సామ్ కరన్ (ఇంగ్లండ్)- 10 వికెట్లు- 5 మ్యాచ్లలో 6. జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 199 పరుగులు- 5 మ్యాచ్లలో- కెప్టెన్గానూ విజయవంతం 7. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)- 211 పరుగులు- 5 మ్యాచ్లలో 8. సికిందర్ రజా(జింబాబ్వే)- 219 పరుగులు-8 మ్యాచ్లలో- 10 వికెట్లు 9. వనిందు హసరంగ (శ్రీలంక)- 15 వికెట్లు- 8 మ్యాచ్లలో అదరగొట్టిన కోహ్లి, సూర్య.. అయితే ఇక ఈ మెగా టీ20 టోర్నీలో టీమిండియా సెమీస్ దశలోనే ఇంటిబాట పట్టినప్పటికీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మిడిలార్డర్ మేటి బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సూపర్-12 దశ ముగిసే సరికి కోహ్లి 246 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. సూర్యకుమార్ 225 పరుగులతో టాప్-10 జాబితాలో మూడో స్థానం ఆక్రమించాడు. సూపర్-12 ముగిసే నాటికి ఐసీసీ ప్రకటించిన ఈ బ్యాటర్ల జాబితాలో పాకిస్తాన్, ఇంగ్లండ్ క్రికెటర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. బట్లర్, హేల్స్ ఒక్క మ్యాచ్తో ఇదిలా ఉంటే.. బౌలర్ల లిస్ట్లో మాత్రం షాదాబ్ ఖాన్ 10 వికెట్లతో ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక రెండో సెమీ ఫైనల్లో టీమిండియాతో మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ బ్యాటింగ్ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బట్లర్ 80, హేల్స్ 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఇంగ్లండ్ను ఫైనల్కు చేర్చారు. ఇక ఈ మ్యాచ్లో కోహ్లి 50 పరుగులు సాధించగా.. సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చదవండి: WC 2022: ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపైనే భారం! అసలైన మ్యాచ్లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు Sania- Shoaib: సానియా- షోయబ్ విడాకుల రూమర్లు! మోడల్తో మాలిక్ ఫొటోలు వైరల్.. మీ భర్త కూడా ఇలాగే.. T20 WC 2022: 'టీమిండియా కోచ్గా అతడిని చేయండి.. కెప్టెన్గా అతడే సరైనోడు' -
'నెహ్రాను టీమిండియా కోచ్ చేయండి..! కెప్టెన్గా అతడే సరైనోడు'
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో టీమిండియాతో పాటు జట్టు మేనేజేమెంట్పై కూడా విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై మాజీలు, అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ను వెంటనే కెప్టెన్సీ తప్పించాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ప్రపంచకప్లో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడిన రోహిత్.. కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో జట్టుతో పాటు, కోచింగ్ స్టాఫ్లో కూడా మార్పులు చేసే సమయం ఆసన్నమైంది భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇండియా టుడేతో హర్భజన్ మాట్లాడుతూ.. "రాహుల్ ద్రవిడ్ చాలా తెలివైనవాడు. మేమిద్దరం కలిసి చాలా కాలం క్రికెట్ ఆడాము. కానీ పొట్టి ఫార్మాట్లో భారత జట్టుకు ఇటీవలే టీ20 క్రికెట్ నుంచి రిటైరైన వ్యక్తి కోచ్గా కావాలి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ను అర్ధం చేసుకోనే వ్యక్తిని తీసుకురావాలి. ద్రవిడ్ను భారత జట్టు కోచ్గా తొలగించకూడదనుకుంటే.. ఇటీవల రిటైర్ అయిన వారిని అతడికి అసిస్టెంట్గా అయినా ఎంపికచేయండి. ఆశిష్ నెహ్రా లాంటి మాజీ ఆటగాడిని కోచింగ్ స్టాఫ్లో భాగం చేయండి. నెహ్రాది గొప్ప క్రికెట్ మైండ్. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ విషయంలో అతడు ఏం చేశాడో మనం చూశాం. అతడు జట్టుతో కలిస్తే యువ ఆటగాళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు" అని పేర్కొన్నాడు. ఇక టీ20 కెప్టెన్సీ గురించి భజ్జీ మాట్లాడుతూ.. "నా అభిప్రాయం ప్రాకారం అయితే హార్దిక్ పాండ్యాను భారత జట్టు కెప్టెన్ చేస్తే బాగుటుంది. అతడు ప్రస్తుత జట్టులో అత్యుత్తమ ఆటగాడు. అతడి లాంటి ఆటగాళ్లు భారత జట్టుకు మరింత మంది అవసరం" అని తెలిపాడు. చదవండి: Wasim Akram: "ఐపీఎల్ ప్రారంభమైంది.. భారత్ పని అయిపోయింది" -
Wasim Akram: "ఐపీఎల్ ప్రారంభమైంది.. భారత్ పని అయిపోయింది"
టీ20 ప్రపంచకప్-2022లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా.. సెమీస్తో తమ ప్రయాణాన్ని ముగించింది. గురువారం ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలై భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో భారత మాజీ ఆటగాళ్లతో పాటు ఇతర దేశాల మాజీ క్రికెటర్లు కూడా టీమిండియాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర హేల్స్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. బిగ్బాష్ లీగ్లో ఆడిన అనుభవం తనకు బాగా కలిసొచ్చిందిని తెలిపాడు. ఇక ఇదే ప్రశ్న భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు కూడా ఎదురైంది. దీనిపై అతడు స్పందిస్తూ.. "బిగ్ బాష్ లీగ్లో ఆడిన అనుభం ఇంగ్లండ్ ఆటగాళ్లకు కలిసిచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ భారత ఆటగాళ్లు విదేశీ లీగుల్లో ఆడడం చాలా కష్టం. ఎందుకంటే దేశీవాళీ టోర్నీలతో పాటు అంతర్జాతీయ సిరీస్లతో టీమిండియా బీజీబీజీగా ఉంటుంది. దీంతో భారత ఆటగాళ్లకు ఆ అవకాశం లేదు. అయితే విదేశీ లీగ్ల్లో మా ఆటగాళ్ల ఆడడంపై తుది నిర్ణయం బీసీసీఐదే" అని ద్రవిడ్ తెలపాడు. ఇక ద్రవిడ్ చేసిన వాఖ్యలపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ వ్యంగ్యంగా స్పందించాడు. "ఏ స్పోర్ట్స్" ఛానల్ డిబేట్లో అతడు మాట్లాడుతూ.. "ఐపీఎల్ భారత జట్టుకు లాభం చేకూరుతుందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క టీ20 ప్రపంచకప్ను కూడా గెలవలేకపోయారు. ఇప్పుడు ఏం లాభం చేకూరుంది మరి? విదేశీ లీగ్ల్లో ఆడటానికి అనుమతిస్తే అయినా టీమిండియా ఆడే విధానం మారుతుందా అన్న సందేహం నెలకొంది" అని అక్రమ్ పేర్కొన్నాడు. ఇక ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్తో పాకిస్తాన్ తలపడనుంది. చదవండి: T20 WC 2022 Final: ఇంగ్లండ్- పాక్ ఫైనల్కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే? -
PAK Vs ENG: ఇంగ్లండ్- పాక్ ఫైనల్కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే?
టీ20 ప్రపంచకప్-2022 తుది సమరానికి సమయం అసన్నమైంది. ఆదివారం(నవంబర్ 13)న మెల్బోర్న్ వేదికగా ఫైనల్ పోరులో పాకిస్తాన్- ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి పాక్ ఫైనల్లో అడుగు పెట్టగా.. రెండో సెమీఫైనల్లో భారత్పై ఘన విజయం సాధించి ఇంగ్లండ్ ఫైనల్కు చేరుకుంది. అయితే ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 95 శాతం కురిసే అవకాశం ఉందని బ్యూరో ఆఫ్ మెట్రాలజీ వెల్లడించింది. "ఆదివారం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో 95 శాతం భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం సమయంలో గంటకు 25 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి" అని బ్యూరో ఆఫ్ మెట్రాలజీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫైనల్ రద్దు అయితే? కాగా సెమీఫైనల్కు,ఫైనల్కు రిజర్వ్డేను ఐసీసీ కేటాయించింది. కాబట్టి ఒక వేళ ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించి, ఆదివారం ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి రిజర్వ్ డే(సోమవారం)లో కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. చదవండి: Kohli Emotional Post: మా కల నేరవేరలేదు.. చాలా బాధగా ఉంది! కోహ్లి భావోద్వేగం -
మా కల నేరవేరలేదు.. చాలా బాధగా ఉంది! కోహ్లి భావోద్వేగం
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా కథ సెమీస్లో ముగిసింది. 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్ గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు.. మరోసారి నిరాశతో ఇంటిముఖం పట్టింది. గురువారం ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో రోహిత్ సేన ఘోర ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఇక మెగా టోర్నీ నుంచి ఇంటి దారి పట్టిన భారత జట్టుపై అభిమానులు, మాజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ ఓటమిపై స్పందిస్తూ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశాడు. "మా కలను సాకారం చేసుకోకుండానే ఆస్ట్రేలియన్ తీరాలను వీడాల్సి వస్తోంది. ఇందుకు మేము చాలా బాధపడుతున్నాము. అయితే ఎన్నో చిరస్మరణీయ జ్ణాపకాలను మా వెంట తీసుకువస్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలని లక్ష్యంగా పెట్టుకుటున్నాం. మాకు మద్దుతు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులందరికీ ధన్యవాదాలు. భారత జెర్సీ ధరించి, దేశానికి వహిస్తున్నందుకు ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తాను" అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ప్రపంచకప్లో విరాట్ కోహ్లి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ప్రతీ మ్యాచ్లోనూ జట్టు బాధ్యతను తన భుజాలపై విరాట్ వేసుకున్నాడు. ఆడిన ఆరు మ్యాచ్ల్లో నాలుగు అర్ధ సెంచరీలు కోహ్లి సాధించాడు. తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్పై అద్భుత ఇన్నింగ్స్తో భారత జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. అదే విధంగా ఈ టోర్నీలో టాప్ రన్ స్కోరర్గా కూడా విరాట్ కోహ్లి(296)నే కొనసాగుతున్నాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) చదవండి: IND vs NZ: టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్! -
"అతడొక అద్భుతం.. ఒంటి చెత్తో మ్యాచ్ను గెలిపించే సత్తా ఉంది'
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమితో టీమిండియా టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. అయితే తొలి టీ20 ప్రపంచకప్ ఆడిన అర్ష్దీప్ సింగ్ మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడిన అర్ష్దీప్ 10 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి భారత విజయంలో అర్ష్దీప్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైన్లలో మిగితా బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. అర్ష్దీప్ మాత్రం 2 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అర్ష్దీప్ సింగ్పై భారత మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్లో దొరికిన అణిముత్యం అని చోప్రా కొనియాడాడు. క్రిక్ ట్రాకర్తో నిఖిల్ చోప్రా మాట్లాడూతూ.. "ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లలో అర్ష్దీప్ సింగ్ ఒకడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అతడు కొత్త బంతితో బౌలింగ్ చేసే విధానం అద్భుతమైనది. యార్కర్లు, స్లో బంతులు వేయడం అతడి ప్రధాన బలాలు. అదే విధంగా డెత్ ఓవర్లలో ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా బౌలింగ్ చేసే సత్తా అర్ష్దీప్కు ఉంది. అతడు రాబోయే రోజుల్లో భారత జట్టకు కీలక బౌలర్గా మారుతాడు. ఈ మెగా ఈవెంట్లో ఆడిన అనుభవం అతడికి మరింత మెరుగైన బౌలర్గా పరిణితి చెందడానికి ఉపయోగపడుతుంది. అవసరమైన సమయంలో ఆట మొత్తాన్ని మార్చేసే ఓవర్ వేసి జట్టును గెలిపించే సత్తా అర్ష్దీప్ ఉంది" అని చోప్రా పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: 'టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే.. సీనియర్లు గుడ్బై చెప్పనున్నారు' -
'టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే.. సీనియర్లు గుడ్బై చెప్పనున్నారు'
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజాయం పాలైన టీమిండియా ప్రపంచకప్ నుంచి ఇంటి దారి పట్టింది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ప్రపంచకప్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో కొందరు సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని గావస్కర్ తెలిపాడు. అదే విధంగా రోహిత్ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. ‘ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ సారథిగా తొలి ప్రయత్నంలో విజేతగా నిలిపిన పాండ్యా తప్పకుండా తదుపరి టీమిండియా కెప్టెన్ అవుతాడు. జట్టులోని 35 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు రిటైర్మెంట్ యోచనలో ఉన్నారు. త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి’ అని గావస్కర్ పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: మళ్లీ అదే వ్యథ... తీరు మారని టీమిండియా -
రోహిత్ నాయకత్వ ప్రతిభ ఎక్కడ?.. ద్రవిడ్ను ప్రశ్నించే సమయం వచ్చేసిందా?
‘ఫలితాలతో సంబంధం లేకుండా మ్యాచ్ ఆసాంతం దూకుడుగా ఆడటమే మా కొత్త విధానం. గత ఏడాది కాలంగా ఇదే తరహా ఆట ఆడుతున్నాం. మా జట్టులో వచ్చిన కీలక మార్పు ఇది’ ఇటీవల పదే పదే కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. సంవత్సర కాలంగా ద్వైపాక్షిక సిరీస్లలో ఇది పని చేసింది కూడా. కానీ వరల్డ్ కప్కు వచ్చేసరికి మళ్లీ పాత తరహా ఆటనే. ఈ టోర్నీలో పవర్ప్లేలో భారత జట్టు ఓవర్కు 6 పరుగుల రన్రేట్తో పరుగులు చేసింది. మొత్తం జట్లలో నెదర్లాండ్స్, జింబాబ్వే మాత్రమే ఇంతకన్నా తక్కువ రన్రేట్తో ఆడాయి. మన జట్టు శైలి ఎలా ఉందో చెప్పేందుకు ఇది చాలు. సెమీస్లో కూడా చాలా సాంప్రదాయిక పద్ధతిలో, దూకుడు అనేదే లేకుండా టీమ్ ఆడింది. సాధారణంగా ప్రత్యర్థి జట్టులో మంచి బౌలర్లతో పాటు ఒకరిద్దరు బలహీన బౌలర్లు ఉంటారు. వారిని లక్ష్యంగా చేసుకోవాలి. లివింగ్స్టోన్ను కూడా మనోళ్లు కొట్టలేకపోయారు. ఇన్నింగ్స్ ఆరంభంలో వికెట్లు కాపాడుకుంటూ ఆడటం, చివ ర్లో చెలరేగిపోవడం అనే శైలిలో భారత్ ఆట సాగింది. అయితే ఆ వ్యూహం సెమీస్లో పని చేయలేదు. ►పాక్పై అద్భుత విజయంతో భారత అభిమానుల ఆశలను టీమిండియా ఆకాశానికి తీసుకెళ్లింది. ఆ మ్యాచ్లో చిరస్మరణీయ విజయంతో జట్టులోని పలు లోపాలు కూడా బయటకు రాకుండా పోయాయి. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి కాస్త మేలుకునేలా చేసినా, బంగ్లాదేశ్ కూడా చివరి వరకు చెమటలు పట్టించింది! సరిగ్గా చెప్పాలంటే జింబాబ్వేపై మినహా మరే మ్యాచ్లోనూ భారత జట్టు సంపూర్ణ, సమష్టి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ►అంతర్జాతీయ టి20ల్లో 4 సెంచరీలు సహా విధ్వంసక ఆటగాళ్లలో ఒకడైన రోహిత్ పూర్తిగా తేలిపోవ డం జట్టును దెబ్బ తీసింది. 6 ఇన్నింగ్స్లలో కలిపి 116 పరుగులు అదీ 106 స్ట్రయిక్రేట్తో చేయడం నిజంగా ఆశ్చర్యకరం! నెదర్లాండ్స్లాంటి బలహీన జట్టుపై మాత్రమే హాఫ్ సెంచరీ వచ్చింది. ఇక రాహుల్ గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. మొత్తం 128 పరుగులు చేసిన అతను ప్రధాన జట్లయిన పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్లపై పూర్తిగా విఫలమయ్యాడు. కోహ్లి ఒక్కడే నాలుగు అర్ధ సెంచరీలతో (మొత్తం 296 పరుగులు) జట్టు జెండా మోశాడు. సూర్యకుమార్ అసలు పోరులో విఫలమయ్యాడు. ►బౌలింగ్లో ఆడుతున్న తొలి వరల్డ్కప్లోనే అర్ష్దీప్ ఆకట్టుకోగా, భువనేశ్వర్ కూడా లయ అందుకున్నాడు. బుమ్రా లేని లోటును షమీ సరిగానే పూరించాడు. సెమీస్ మ్యాచ్ మినహా అతని బౌలింగ్ బాగా సాగింది. కార్తీక్, పంత్లలో ఒకరిని తేల్చు కునే విషయంలో సందిగ్ధతను ఆసాంతం కొనసాగించాం. లీగ్లో ఒక్క మ్యాచ్ ఆడించి సెమీస్లో ఫినిషర్ పాత్ర ఇస్తే పంత్ ఏం చేయగలడు! ►ఇక అన్నింటికంటే ఎక్కువ ఆశ్చర్యపర్చిన నిర్ణయం లెగ్స్పిన్నర్ యజువేంద్ర చహల్కు ఒక్క మ్యాచ్ కూడా దక్కకపోవడం. గత టి20 ప్రపంచకప్లో చహల్ లేకపోవడంతో అటాకింగ్ బౌలర్ తగ్గాడంటూ విమర్శలు రావడంతో తర్వాతి సిరీస్లోనే అతనికి అవకాశం లభించింది. వరల్డ్ కప్ ముందు వరకు అన్ని మ్యాచ్లలో ఆడించి అసలు సమరంలో అతడికి డ్రింక్స్ ఇచ్చే పనికే సరిపెట్టారు. అశ్విన్పై అపార నమ్మకంతో కనీసం లెగ్స్పిన్నర్తో ఒక మ్యాచ్లో ప్రయత్నించే సాహసం కూడా టీమ్ చేయలేకపోయింది. అలా అని అశ్విన్ కూడా అద్భుతాలేమీ చేయలేదు. బ్యాటింగ్కు పనికొస్తారనే కారణంతో అతడిని, అక్షర్ పటేల్ను ఆడించడం అంటే టాప్–7 బ్యాటింగ్పై జట్టుకు నమ్మకం లేనట్లా! ►2021 వరల్డ్కప్లో లీగ్ దశకే పరిమితమైన తర్వాత కోహ్లి కెప్టెన్సీపై కూడా విమర్శలు వచ్చాయి. అదే స్థానంలో రోహిత్ ఉండి ఉంటే ఎలా చేసే వాడో విశ్లేషణలు వచ్చాయి. అయితే ఐదు ఐపీఎల్ టైటిల్స్ అనుభవం అంతర్జాతీయ మ్యాచ్లకు పనికి రాలేదు. రోహిత్ కూడా వ్యూహాలు, ప్రణాళి కల విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు. అతని నాయకత్వ ప్రతిభను చూపించే ఒక్క ఘటన కూడా టోర్నీలో కనిపించలేదు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అంటూ తీర్చిదిద్దిన హర్షల్ను పెవిలియన్కే పరిమితం చేయడం రోహిత్ ఆత్మరక్షణ ధోరణిని చూపించింది. ►చివరగా... దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ మొదలుకొని ఇంగ్లండ్తో టెస్టులో ఓటమి, రెండు వరల్డ్కప్లలో వైఫల్యం... తాజా ప్రదర్శన వరకు కోచ్గా ద్రవిడ్కు ఫెయిల్ మార్కులే పడ్డాయి. మరి ఆయనను ప్రశ్నించే సమయం ఎప్పుడొస్తుందో? సెమీస్లో ఎందుకు ఓడామంటే... ► సూర్యకుమార్ జోరుకు సరైన వ్యూహంలో ఇంగ్లండ్ అడ్డుకుంది. టోర్నీలో ఇప్పటి వరకు అతను ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన వాటిలో అత్యధిక బంతులు బాగా వేగవంతమైనవే. బంతి ఎంత వేగంగా వస్తే సూర్య అంతే వేగంగా బౌండరీ దాటించాడు. అందుకే అటు రషీద్ స్పిన్తో పాటు ఇటు అన్నీ స్లో బంతులే వేసింది. దాంతో ఆ ఉచ్చులో సూర్య చిక్కాడు. ►రెగ్యులర్ లెగ్ స్పిన్నర్ రషీద్, పార్ట్ టైమ్ లెగ్ స్పిన్నర్ లివింగ్స్టోన్ కలిసి 7 ఓవర్లలో 41 పరుగులే ఇచ్చారు. నిజానికి ఎడంచేతి వాటం ఆటగాళ్లు లెగ్ స్పిన్నర్లపై విరుచుకు పడవచ్చని, అడిలైడ్లో స్క్వేర్లెగ్ బౌండరీలు చిన్నవి కాబట్టి వేగంగా పరుగులు రాబడతాడనే రిషభ్ పంత్ను టీమ్లోకి తీసుకున్నారు. అయితే ఇదంతా వృథా అయింది. పంత్ క్రీజ్లోకి వచ్చేసరికి ఈ 7 ఓవర్లూ ముగిసిపోయాయి. ► తొలి 15 ఓవర్లలో భారత్ 2 సిక్సర్లే కొట్టగలిగింది. ఇంగ్లండ్ సరైన వ్యూహంతో స్క్వేర్లెగ్ బౌండరీల వైపు పరుగులే ఇవ్వలేదు. చదవండి: Shoaib Akhtar: ఈ ఆటతీరుతో ప్రపంచకప్ ఫైనల్కా?.. పాక్తో తలపడే అర్హత టీమిండియాకు లేదు.. -
T20 World Cup 2022: అహో హేల్స్...
‘నేను మళ్లీ ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదు’... సెమీస్ ముగిసిన తర్వాత అలెక్స్ హేల్స్ వ్యాఖ్య ఇది. బహుశా భారత అభిమానులు కూడా అదే జరిగి ఉంటే బాగుండేదని అనుకొని ఉంటారు! మూడేళ్ల పాటు ఆటకు దూరమై పునరాగమనంలో మళ్లీ చెలరేగుతున్న హేల్స్ కథ కూడా ఎంతో ఆసక్తికరం. ► ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలలో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా మూడేళ్ల పాటు అతనికి టీమ్లో చోటు దక్కలేదు. ఆ బాధను అధిగమించి అతను ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్లలో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ ఏడాది జూన్లో మోర్గాన్ రిటైర్ అయ్యాడు... సెప్టెంబర్లో హేల్స్కు టీమ్లో స్థానం లభించింది. పాకిస్తాన్ పర్యటనలో ఆకట్టుకున్న అతను వరల్డ్ కప్లో కీలక ఇన్నింగ్స్లతో తానేంటో నిరూపించాడు. ► పాక్ టూర్ తర్వాత కూడా ఇంగ్లండ్ వరల్డ్ కప్ జట్టులో హేల్స్కు స్థానం దక్కలేదు. అయితే బెయిర్స్టో అనూహ్యంగా గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హేల్స్ను టీమ్లోకి తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత సరైన నిర్ణయమో ఇంగ్లండ్కు ఇప్పుడు తెలిసింది. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్లతో జరిగిన మ్యాచ్లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్కు చేర్చాడు. –సాక్షి క్రీడావిభాగం -
T20 World Cup 2022: ఈసారీ ఫ్లాప్ షో
ఏడాది వ్యవధిలో మరోసారి భారత క్రికెట్ అభిమానులను మన జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది. గత టి20 ప్రపంచకప్లో లీగ్ దశకే పరిమితమైన జట్టు ఆ నిరాశను దూరం చేస్తూ ఈసారి అత్యధిక విజయాలతో సెమీస్ చేరడంతో కొత్తగా ఆశలు చిగురించాయి. అయితే ఇంగ్లండ్ అద్భుత బ్యాటింగ్తో వాటిని తుంచేసింది. ఇప్పటి వరకు మన ఆటగాళ్ల ప్రదర్శన, ప్రత్యర్థిపై ఇటీవలి రికార్డు చూస్తే సెమీస్లోనూ విజయం సులువనిపించింది. కానీ బ్యాటింగ్లో భారీ స్కోరు సాధించలేక సగం ఆట ముగిసే సరికే వెనకడుగు వేసిన టీమిండియా... బౌలింగ్లో పూర్తిగా చేతులెత్తేసింది. ప్రత్యర్థి ఓపెనర్లు చెలరేగుతుంటే ఏం చేయాలో కెప్టెన్ సహా ఆటగాళ్లు బిక్కమొహం వేశారు! టాస్ ఓడిపోవటం మొదలు ఏదీ భారత్కు అనుకూలంగా సాగలేదు. ఓపెనర్ల వైఫల్యం ఇక్కడా కొనసాగగా, మరోసారి ఆదుకోవాల్సిన భారం కోహ్లిపై పడింది. పరిస్థితిని బట్టి అతను కూడా కాస్త తగ్గి ఆడాల్సి రాగా, 360 డిగ్రీ సూర్యకుమార్ను సరైన వ్యూహంతో ఇంగ్లండ్ కట్టిపడేసింది. అంతా చేయిదాటిపోతున్న దశలో హార్దిక్ చెలరేగడంతో కీలక పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఛేదన ఇంత సులువా అనిపించేలా హేల్స్, బట్లర్ ఎవరినీ లెక్క చేయకుండా మన బౌలర్లందరిపై విరుచుకుపడ్డారు. ఫలితమే టి20 ప్రపంచకప్ చరిత్రలో అతి పెద్ద భాగస్వామ్యం... ఆపై టీమిండియా ఓటమి ఖాయం. టోర్నీ తొలి విజేత తర్వాతి ఏడు ప్రయత్నాల్లోనూ రిక్తహస్తాలతో ఇంటికి..! అడిలైడ్: టి20 ప్రపంచకప్లో భారత్ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది. సెమీస్లో సత్తా చాటి ఎంసీజీలో మరోసారి పాకిస్తాన్ను ఢీకొడుతుందని, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ఫైనల్ సాధ్యమవుతుందని భావించిన వారందరికీ ఇంగ్లండ్ బలమైన షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన రెండో సెమీస్లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్లు) దూకుడుగా ఆడగా, విరాట్ కోహ్లి (40 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) మరో అర్ధసెంచరీ సాధించాడు. జోర్డాన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలెక్స్ హేల్స్ (47 బంతుల్లో 86 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్లు), కెప్టెన్ జోస్ బట్లర్ (49 బంతుల్లో 80 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) భారత్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించారు. ఆదివారం మెల్బోర్న్లో జరిగే ఫైనల్లో పాకిస్తాన్తో ఇంగ్లండ్ తలపడుతుంది. 1992 వన్డే వరల్డ్కప్లో మెల్బోర్న్ మైదానంలోనే ఇంగ్లండ్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడగా పాక్ గెలిచింది. సూర్యకుమార్ విఫలం... ఈ నాకౌట్ మ్యాచ్లో తొలి 10 ఓవర్లలో 6 ఫోర్లు, 1 సిక్స్తో భారత్ స్కోరు 62/2 మాత్రమే! ఈ అతి జాగ్రత్తే చివరకు జట్టు కొంప ముంచింది. చివర్లో హార్దిక్ జోరుతో కొన్ని పరుగులు వేగంగా వచ్చినా, బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై తగినంత స్కోరు చేయలేక టీమిండియా భంగపడింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (5) మరో కీలక పోరులోనూ పేలవ ప్రదర్శన కనబర్చగా, రోహిత్ శర్మ (28 బంతుల్లో 27; 4 ఫోర్లు) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యాడు. రోహిత్ వెనుదిరిగిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ (10 బంతుల్లో 14) వరుస బంతుల్లో 6, 4 కొట్టి తన శైలిని ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాతి బంతికే రషీద్ అతని ఆటను ముగించడంతో భారత్కు ఎదురు దెబ్బ తగి లింది. ఫలితంగా కోహ్లి కూడా ఆత్మరక్షణలో పడి ధాటిని ప్రదర్శించలేకపోయాడు. 16 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 110 పరుగులకు చేరింది. 4 ఓవర్లలో 58 పరుగులు... భారత జట్టు చివరకు కాస్త గౌరవప్రదమైన స్కోరు చేయగలిగిందంటే హార్దిక్ బ్యాటింగే కారణం. చివరి 4 ఓవర్లలో భారత్ 58 పరుగులు సాధిస్తే అందులో హార్దిక్ ఒక్కడే 50 కొట్టాడు! 18 బంతుల్లోనే అతను 3 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగాడు. జోర్డాన్ ఓవర్లో రెండు వరుస సిక్స్లు కొట్టిన అతను, స్యామ్ కరన్ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదాడు. మరో ఎండ్లో 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే కోహ్లి వెనుదిరగ్గా, పంత్ (6) రనౌటయ్యాడు. జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కూడా వరుసగా 6, 4 కొట్టాక వెనక్కి జరిగి మరో భారీ షాట్ ఆడే క్రమంలో ఆఖరి బంతికి హార్దిక్ అవుటయ్యాడు. బంతి బౌండరీని దాటినా, షాట్ ఆడే సమయంలో అతని కాలు స్టంప్స్ను తాకింది. ఎదురులేని బ్యాటింగ్... ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించే వ్యూహంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ చివరి వరకు దానిని కొనసాగించింది. భారత బౌలర్లు ఎంత శ్రమించినా ఓపెనింగ్ జోడీనే విడదీయలేకపోయారు. ఈ మ్యాచ్కు ముందు భువనేశ్వర్ బౌలింగ్లో చెత్త రికార్డు (32 బంతుల్లో 5 సార్లు అవుట్) ఉన్న బట్లర్ ఈసారి మాత్రం వెనక్కి తగ్గలేదు. భువీ వేసిన తొలి ఓవర్లోనే 3 ఫోర్లు బాది అతను తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. షమీ ఓవర్లో హేల్స్ 6, 4 కొట్టడంతో పవర్ప్లేలో ఇంగ్లండ్ 63 పరుగులు (9 ఫోర్లు, 1 సిక్స్తో) సాధించింది. ఆ తర్వాత మరింత జోరుగా లక్ష్యం దిశగా జట్టు దూసుకుపోయింది. 28 బంతుల్లోనే హేల్స్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, 61 బంతుల్లోనే సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. అశ్విన్ ఓవర్లో హేల్స్ 6, 4 కొట్టగా, హార్దిక్ ఓవర్లో 6, 4 బాది బట్లర్ 36 బంతుల్లో తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత షమీ ఓవర్లో బట్లర్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. షమీ తర్వాతి ఓవర్ ఆఖరి బంతికి లాంగాన్ మీదుగా భారీ సిక్సర్తో హేల్స్ ఆట ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వోక్స్ 5; రోహిత్ (సి) కరన్ (బి) జోర్డాన్ 27; కోహ్లి (సి) రషీద్ (బి) జోర్డాన్ 50; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) రషీద్ 14; హార్దిక్ (హిట్వికెట్) (బి) జోర్డాన్ 63; పంత్ (రనౌట్) 6; అశ్విన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–9, 2–56, 3–75, 4–136, 5–158, 6–168. బౌలింగ్: స్టోక్స్ 2–0–18–0, వోక్స్ 3–0–24–1, స్యామ్ కరన్ 4–0–42–0, రషీద్ 4–0–20–1, లివింగ్స్టోన్ 3–0–21–0, జోర్డాన్ 4–0–43–3. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బట్లర్ (నాటౌట్) 80; హేల్స్ (నాటౌట్) 86; ఎక్స్ట్రాలు 4; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 170. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–25–0, అర్‡్షదీప్ 2–0–15–0, అక్షర్ 4–0–30–0, షమీ 3–0–39–0, అశ్విన్ 2–0–27–0, హార్దిక్ 3–0–34–0. ఈ రోజు మా ఆటతో చాలా నిరాశ చెందాను. మేం బ్యాటింగ్ బాగానే చేశామని భావిస్తున్నా. బౌలింగ్ వైఫల్యంతోనే ఓడిపోయాం. 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యం ఛేదించేంత సులువైన పిచ్ ఏమీ కాదిది. నాకౌట్ మ్యాచ్లలో ఒత్తిడిని జయించడం ముఖ్యం. ఇది ఎలా చేయాలో ఎవరూ నేర్పించరు. అది వ్యక్తిగతంగా చేయాల్సిన పని. ఐపీఎల్లో ఇలాంటి ఎన్నో మ్యాచ్లలో వారంతా ఒత్తిడిని అధిగమించినవారే. మా బౌలింగ్కు సరైన ఆరంభం లభించలేదు. తొలి ఓవర్లో బంతి కొంత స్వింగ్ అయినా అది సరైన దిశలో వెళ్లలేదు. మైదానం కొలతలపై మాకు అవగాహన ఉంది. వికెట్కు ఇరువైపులా పరుగులు ఆపేందుకు వ్యూహాలు రూపొందించినా ఇంగ్లండ్ ఓపెనర్లు భారీగా పరుగులు రాబట్టగలిగారు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 170: టి20 వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం. 1: టి20 వరల్డ్కప్ నాకౌట్ మ్యాచ్లో ఒక జట్టు 10: వికెట్ల తేడాతో గెలవడం ఇదే మొదటిసారి. 2:టి20 ప్రపంచకప్లో (2021లో పాక్ చేతిలో) రెండుసార్లు 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఏకైక జట్టు భారత్. 4008: అంతర్జాతీయ టి20ల్లో కోహ్లి పరుగులు. 4 వేల పరుగులు దాటిన తొలి ఆటగాడిగా కోహ్లి. -
ఐపీఎల్ బ్యాన్ చేస్తేనే దారిలోకి వస్తారా!
టి20 ప్రపంచకప్లో టీమిండియా పోరాటం సెమీస్తోనే ముగిసింది. కచ్చితంగా ఫైనల్ చేరతారనుకుంటే సెమీఫైనల్లోనే ఇంగ్లండ్ దెబ్బకు తోకముడిచి ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. గురువారం జరిగిన రెండో సెమీస్ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. బౌలర్ల వైఫల్యం టీమిండియా కొంపముంచింది. ఒక్క బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. కనీసం ఒక్క గుడ్లెంగ్త్ బంతి పడితే ఒట్టు.. ఏ బౌలర్ అయినా యార్కర్ వేయాలని చూస్తారు. కానీ అదేంటో టీమిండియా బౌలర్లంతా ఆఫ్స్టంప్కు దూరంగా వేస్తూ ఇంగ్లండ్ ఆటగాళ్ల చేత పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే టీమిండియాకు రాను రాను బౌలర్లు కరువయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే టీమిండియా ఓటమి వెనుక ప్రధాన కారణం మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అని అభిమానులు కుండబద్దలు కొట్టారు. ఐపీఎల్ను బ్యాన్ చేస్తేనే టీమిండియా జట్టు దారిలోకి వస్తుందంటున్నారు. ఐపీఎల్ మోజులో పడి టీమిండియా ఆటగాళ్లలో కొందరు రాణించలేకపోతున్నారన్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు కేవలం ఐపీఎల్లో మాత్రమే మెరుస్తారు తప్ప ఐసీసీ లాంటి మేజర్ టోర్నీలకు పనికిరారని ఎండగట్టారు. ఏదో రెండు మ్యాచ్ల్లో అర్థసెంచరీలు చేసినంత మాత్రానా ఫామ్లోకి వచ్చినట్లు కాదు. ఇంగ్లండ్తో మ్యాచ్లో కేఎల్ రాహుల్ నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ పారేసుకోవడం కనిపించింది. ఇక ఐపీఎల్లో కెప్టెన్గా ఐదు టైటిల్లు సాధించిన రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఇటు బ్యాటర్గానే పూర్తిగా నిరాశపరిచాడు. ఐపీఎల్ లాంటి ప్రైవేటు లీగ్తో అంతర్జాతీయ క్రికెట్ను పోల్చకూడదని రోహిత్కు ఈ పాటికే అర్థమయి ఉండాలన్నారు. ఈ ప్రపంచకప్లో టీమిండియా ప్రదర్శన గురించి మాట్లాడాలంటే అది కోహ్లి, సూర్యకుమార్లు మాత్రమే. కోహ్లి, సూర్యలు తప్పిస్తే టీమిండియాలో ఏ ఆటగాడు పెద్దగా ప్రభావం చూపలేదు. కోహ్లి, సూర్యలు మరికొంతకాలం టీమిండియా బ్యాటింగ్లో వెన్నుముక పాత్ర పోషించడం మాత్రం ఖాయమని అభిమానులు పేర్కొన్నారు. చదవండి: కోహ్లి, రోహిత్ రిటైరవుతారా?.. ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
కోహ్లి, రోహిత్ రిటైరవుతారా?.. ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టి20 వరల్డ్కప్ 2022లో టీమిండియా కథ ముగిసింది. కచ్చితంగా ఫైనల్ చేరతారనుకుంటే సెమీఫైనల్లోనే ఇంగ్లండ్ దెబ్బకు తోకముడిచి ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. గురువారం జరిగిన రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్పై టీమిండియా 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. బ్యాటింగ్లో పెద్దగా మెరుపులు లేకపోగా.. బౌలింగ్లో పేలవ ప్రదర్శనతో ఓటమి దిశగా పయనించింది. ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ తమ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. డగౌట్ కూర్చొని కన్నీటి పర్యంతం కావడం సోషల్ మీడియాలో వైరలగా మారింది. ఇక కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతున్న సమయంలో.. ''సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చేసిందా'' అని ప్రశ్నించారు. ఇప్పుడే ఈ విషయంపై మాట్లాడటం తొందరపాటు అవుతుందని బదులిచ్చాడు. కోహ్లి, రోహిత్లు ఎంతకాలం ఆడాలనేది వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకు ఇంకా చాలా సమయముందని పేర్కొన్నాడు. అనంతరం విదేశీ టి20 లీగుల్లో భారత ఆటగాళ్లు ఆడితే గేమ్ బాగా మెరుగుపడుతుంది కదా? అనే ప్రశ్న వేయగా.. అలా చేస్తే దేశవాళీ టోర్నీలకు ముగింపు పలకడమే అవుతుందని ద్రవిడ్ స్పష్టం చేశారు. "ఇతర ఆటగాళ్ల మాదిరిగా ఇక్కడకు వచ్చి టోర్నమెంట్ ఆడితే బాగానే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ భారత క్రికెట్కు ఇది చాలా కష్టం. ఈ టోర్నమెంట్లు చాలా వరకు మన సీజన్లో ఎక్కువగా జరుగుతాయి. ఫలితంగా ఇది మనకు సవాల్. మా ఆటగాళ్లలో చాలా మంది ఈ లీగుల్లో ఆడే అవకాశాలను కోల్పోతారు. అదీ కాకుండా ఆ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐకే ఉంది. విదేశీ లీగుల్లో ఆటగాళ్లను అనుమతిస్తే మన దేశవాళీ క్రికెట్ ఉందు. రంజీ ట్రోఫీకి చరమగీతం పలికినట్లే అవుతుంది" అని తెలిపాడు. -
చాహల్ ఏమైనా టూర్కు వచ్చాడా? కనీసం ఒక్క మ్యాచ్లోనైనా!
టీ20 ప్రపంచకప్-2022 సెమీఫైనల్లో భారత జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది. భారత్ నిర్ధేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ చేధించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్కు ఎంపికైన మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ను కేవలం బెంచ్కే పరిమితం చేశారు. కాగా ఈ ప్రపంచకప్లో హసరంగా, అదిల్ రషీద్, జంపా, రషీద్ ఖాన్ వంటి మణికట్టు స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. కాగా స్పిన్నర్లగా భారత జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్, అక్షర్ పటేల్ తీవ్ర నిరాశ పరిచారు. ఇంగ్లండ్తో సెమీఫైనల్లో 4 ఓవర్లలో అక్షర్ పటేల్ 30 పరుగులు ఇవ్వగా.. అశ్విన్ రెండు ఓవర్లలోనే 27 పరుగులు సమర్పించుకున్నాడు . ఈ క్రమంలో కేవలం ఒక్క మ్యాచ్లో కూడా చాహల్కు అవకాశం ఇవ్వకపోవడంతో భారత జట్టు మేనేజ్మెంట్పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చాహల్ ఏమైనా టూర్కు వచ్చాడా? కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నలను సంధిస్తున్నారు. కాగా టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా చాహల్ ఉన్న సంగతి తెలిసిందే. A friendly reminder that Yuzvendra Chahal has never bowled a single ball in a T20 World Cup. pic.twitter.com/QBX2vun2rP — Broken Cricket Dreams Cricket Blog (@cricket_broken) November 10, 2022 చదవండి: Virat Kohli: కోహ్లి బాధ వర్ణణాతీతం.. ఒకప్పుడు కెప్టెన్గా; ఇప్పుడు ఆటగాడిగా -
టీమిండియా ఓటమిపై పాక్ ప్రధాని ట్వీట్ వైరల్.. కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్
ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final: ఘోర పరాజయంతో టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ నుంచి నిష్క్రమించింది టీమిండియా. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటర్లు పర్వాలేదనిపించినా.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక భారత బౌలరుల ఆపసోపాలు పడిన తీరు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. పవర్ ప్లేలో మనవాళ్లు తడబడితే(38) ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ మాత్రం ఏకంగా 63 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత వారి దూకుడుకు అడ్డుకట్టవేయడం టీమిండియా బౌలర్ల తరం కాలేదు. తమదైన శైలిలో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ పొట్టి ఫార్మాట్ ఉన్న మజాను ప్రేక్షకులకు అందించారు ఈ ఇద్దరు బ్యాటర్లు. బట్లర్ 80, హేల్స్ 86 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్ను ఫైనల్కు చేర్చారు. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్లో పాకిస్తాన్.. న్యూజిలాండ్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. 7 వికెట్ల తేడాతో కివీస్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. నవంబరు 13న మెల్బోర్న్లో ఇంగ్లండ్తో పోరుకు సిద్ధమైంది. పాక్ ప్రధాని ట్వీట్ వైరల్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమిని ఉద్దేశిస్తూ.. ‘‘టీ20 వరల్డ్కప్లో ఈ ఆదివారం.. 152/0 వర్సెస్ 170/0 అన్నమాట’’ అని పేర్కొన్నారు. గతేడాది ప్రపంచకప్లో పాకిస్తాన్తో చేతిలో భారత జట్టు 10 వికెట్ల తేడాతో పరాజయం(అప్పుడు పాక్ స్కోరు 152/0) పాలైన విషయాన్ని ఉటంకిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు. వరల్డ్కప్ తాజా ఎడిషన్లో.. పాక్, ఇంగ్లండ్ ఫైనల్ చూడబోతున్నామని పేర్కొన్నారు. ఫ్యాన్స్ కౌంటర్ కాగా ఈ ట్వీట్పై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘మా వాళ్లేమీ నక్క తోక తొక్కి.. ఎవరో ఎవరినో ఓడించడం ద్వారా సెమీస్కు చేరలేదు. సెమీ ఫైనల్ చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడలేదు. ఒక్క మ్యాచ్లో ఓటమి చెందినంత మాత్రాన మా వాళ్లేమీ తక్కువ కాదు’’ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమని, ఇండియా ఫైనల్ చేరితే కథ వేరేగా ఉండేందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ టోర్నీలో జింబాబ్వే చేతిలో పాక్ ఓటమిని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Rohit Sharma On India Loss: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్ వాళ్లకే! WC 2022: ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపైనే భారం! అసలైన మ్యాచ్లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు So, this Sunday, it’s: 152/0 vs 170/0 🇵🇰 🇬🇧 #T20WorldCup — Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022 -
కోహ్లి బాధ వర్ణణాతీతం.. ఒకప్పుడు కెప్టెన్గా; ఇప్పుడు ఆటగాడిగా
టీమిండియా మరోసారి ఐసీసీ టైటిల్ కొట్టడంలో విఫలమయింది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన టీమిండియా సెమీస్తోనే ఆటను ముగించింది. ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకొని అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇలా చేసినందుకు టీమిండియాపై కోపం వస్తుంటే.. ఇదే సమయంలో టీమిండియా స్టార్ 'కింగ్' కోహ్లిని చూస్తే మాత్రం బాధ కలగక మానదు. ఐసీసీ మేజర్ టోర్నీల్లో తాను సక్సెస్ అయిన ప్రతీసారి టీమిండియా ఫెయిల్యూర్గా మిగిలిపోతుంది. ధోని కెప్టెన్సీలో టీమిండియా 2011 వన్డే వరల్డ్కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ రెండింటిలో కోహ్లి సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈ రెండు టోర్నీల్లో కోహ్లి పెద్దగా రాణించింది లేదు. అందుకే వాటి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ 2014, 2016.. తాజాగా 2022 టి20 వరల్డ్కప్లతో పాటు 2019 వన్డే వరల్డ్కప్లో కోహ్లి బ్యాటర్గా సూపర్ సక్సెస్ అయ్యాడు. వన్డే వరల్డ్కప్ సంగతి పక్కనబెడితే పైన చెప్పుకున్న ప్రతి టి20 ప్రపంచకప్లో చెలరేగిన కోహ్లీకి ప్రతీసారి నిరాశే మిగిలింది. గతంలో కెప్టెన్గా నిరాశచెందిన కోహ్లి ఇప్పుడు ఆటగాడిగానూ అదే బాధను అనుభవిస్తున్నాడు. 2022 టి20 ప్రపంచకప్లో కోహ్లి.. 296 పరుగులు చేశాడు. ప్రస్తుతం టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ లో తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆపై నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఇలా ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ తాను రాణిస్తూ వచ్చాడు. ఇన్ని చేసి చివరకు చూస్తే మళ్లీ అదే నిరాశ. టీమిండియా జట్టుగా విఫలం కావడంతో కోహ్లికి మరోసారి ఐసీసీ టైటిల్ అందుకునే భాగ్యం లేకుండా పోయింది. వన్డే ప్రపంచకప్ ల సంగతి పక్కనబెడితే టీ20 ప్రపంచకప్ లలో కోహ్లికి మంచి రికార్డు ఉంది. 2014 టీ20 ప్రపంచకప్లో 319 పరుగులు చేసిన కోహ్లి టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 2016లో 273 రన్స్ చేశాడు. తాజాగా 296 పరుగులు చేసిన కోహ్లి ప్రస్తుతానికి టాపర్గా ఉన్నాడు. 2014లో ఫైనల్లో ఓడిని టీమిండియా.. 2016లో సెమీస్లో.. తాజాగా 2022లోనూ సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టింది. ఇక ఐసీసీ టి20 ప్రపంచకప్లలో కోహ్లి ఇప్పటివరకు ఏకంగా 1100 కు పైగా పరుగులు చేశాడు. కోహ్లి దరిదాపుల్లో టాప్-10 లిస్టులో ఉన్న క్రికెటర్లలో రోహిత్ శర్మ మినహా మరెవరూ లేరు. వచ్చే ప్రపంచకప్ (2024) లో రోహిత్ ఆడేది అనుమానమే. దీంతో కోహ్లీ రికార్డుకు వచ్చిన చిక్కేమీ లేదు. ఇంగ్లండ్తో సెమీఫైనల్లో మరో అర్థసెంచరీతో మెరిసిన కోహ్లి టి20 ఫార్మాట్ లో 4 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు టి20లలో నాలుగు వేల మైలురాయిని టచ్ చేసింది కింగ్ కోహ్లి మాత్రమే. మరి ఇన్ని రికార్డులు, ఘనతలు అందుకున్న కోహ్లికి 2013 తర్వాత ఐసీసీ టైటిల్ అందుకోవలనేది అందని ద్రాక్షలానే మిగిలిపోతూ వస్తున్నాది. ప్రస్తుతం కోహ్లి వయస్సు 33 ఏళ్లు. ఇప్పుడున్న ఫామ్ను ఇలానే కంటిన్యూ చేస్తే మరో మూడేళ్లు కొనసాగే అవకాశం ఉంది. ఈ గ్యాప్లో కోహ్లి రెండు వరల్డ్కప్లు ఆడే అవకాశం ఉంది(2023 వన్డే వరల్డ్కప్, 2024 టి20 వరల్డ్కప్). మరి వచ్చే మూడేళ్లలో అన్ని సక్రమంగా జరిగి కోహ్లి జట్టులో ఉంటే కనీసం అప్పుడైనా వరల్డ్కప్ అందుకుంటాడని ఆశిద్దాం. చివరగా కోహ్లి గురించి ఒక మాట.. ''టి20 ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించిందేమో కానీ నువ్వు కాదు కోహ్లి.. నీ ఆట అజరామరం. ప్రతీ మ్యాచ్లో నీ విలువేంటో చూపించావు. విమర్శించిన నోళ్లతోనే పొగిడించుకున్నావు. నీ ఆటకు సలాం చెప్పకుండా ఉండలేం. వరల్డ్కప్ గెలవకపోవచ్చు.. కానీ నీ ఆటతీరుతో మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నావు ''Hatts Off Virat Kohli'..'' చదవండి: వాళ్లు విఫలం.. వీళ్లపై భారం! అసలైన మ్యాచ్లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి కారణాలు -
హార్దిక్ పాండ్యా చెత్త రికార్డు.. తొలి భారత ఆటగాడిగా!
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా కథ ముగిసింది. ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన భారత్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. భారత ఇన్నింగ్స్ అఖరి బంతికి హార్దిక్ హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ చరిత్రలో హిట్ వికెట్గా ఔటైన తొలి భారత క్రికెటర్గా హార్దిక్ నిలిచాడు. ఓవరాల్గా టీ20 ప్రపంచకప్లో ఈ చెత్త రికార్డు నెలకొల్పిన జాబితాలో హార్దిక్ మూడో స్ధానంలో ఉన్నాడు. అంతకుముందు 2007 టీ20 ప్రపంచకప్లో కెన్యా క్రికెటర్ డేవిడ్ ఒబుయా, 2021 పొట్టి ప్రపంచకప్లో నసీం ఆహ్మద్ హిట్వికెట్ రూపంలో పెవిలియన్కు చేరారు. అదరగొట్టిన హార్దిక్ ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 4 ఫోర్లు, 5 సిక్స్లతో 63 పరుగులు సాధించాడు. టీమిండియా 168 పరుగులు సాధించడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. అయితే బౌలింగ్లో మాత్రం పాండ్యా నిరాశపరిచాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా 34 పరుగులు సమర్పించుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: WC 2022: ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపైనే భారం! అసలైన మ్యాచ్లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు -
వాళ్లు విఫలం.. వీళ్లపై భారం! అసలైన మ్యాచ్లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి కారణాలు
ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final: టీ20 ప్రపంచకప్-2022లో తమ ఆరంభ మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ను ఓడించి విజయంతో టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించింది టీమిండియా. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది అభిమానులకు మజాను అందించింది. తర్వాతి మ్యాచ్లో ‘పసికూన’ నెదర్లాండ్స్తో మ్యాచ్లో 56 పరుగులతో జయభేరి మోగించింది. ఇలా వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేనకు సౌతాఫ్రికా చేతిలో మాత్రం భంగపాటు తప్పలేదు. పెర్త్ వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో ప్రొటిస్ జట్టు భారత్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తర్వాత బంగ్లాదేశ్తో హోరాహోరీ పోరు తప్పలేదు. వర్షం ఆటంకం కారణంగా డక్వర్త్ లూయీస్ ప్రకారం టీమిండియా 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక సూపర్-12లో ఆఖరిదైన జింబాబ్వేతో మ్యాచ్కు ముందే భారత జట్టుకు సెమీస్ బెర్తు ఖరారైన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్ సౌతాఫ్రికాను ఓడించడం సహా జింబాబ్వేపై 71 పరుగులతో గెలుపొందడంతో.. గ్రూప్-2 టాపర్గా సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన రోహిత్ సేన.. ఇంగ్లండ్తో అసలైన మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది. బట్లర్ బృందాన్ని ఓడించి ఫైనల్ చేరి అక్కడ దాయాదిని ఓడించాలని కోరుకున్న ఫ్యాన్స్కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఏకంగా పది వికెట్ల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరి టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు??! ఓపెనర్ల వైఫల్యం.. టీ20 ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్లో టీమిండియా ఓపెనింగ్ జోడీ కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ ఆకట్టుకోలేకపోయారు. ఒకటీ రెండు మ్యాచ్లు మినహా పూర్తిగా నిరాశపరిచారు. ఏదో నియమం పెట్టుకున్నట్లుగా ఒక మ్యాచ్లో ఒకరు రాణిస్తే మరొకరు విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టోర్నీలో పాకిస్తాన్పై 4, నెదర్లాండ్స్పై 53, సౌతాఫ్రికాపై 5, బంగ్లాదేశ్పై 2, జింబాబ్వేపై 15 ఇంగ్లండ్పై 27 పరుగులు చేశాడు. ఇక వైస్ కెప్టెన్ రాహుల్ ఇవే మ్యాచ్లలో వరుసగా 4,9,9,50, 51, 5 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్ అంటేనే దూకుడుగా ఆడాలి. పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలి. కానీ ఈ ఓపెనర్లు ఇద్దరూ విఫలం కావడంతో టీమిండియా పవర్ ప్లేలో పెద్దగా స్కోర్ చేయలేకపోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) వాళ్లిద్దరిపైనే భారం టీమిండియా ఓపెనర్లు విఫలమైన నేపథ్యంలో కీలక సమయాల్లో వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తమ నెత్తిపై వేసుకున్నారు. వీరికి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా తోడయ్యాడు. పాక్తో మ్యాచ్లో కోహ్లి 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. పాండ్యా 40 పరుగులతో రాణించాడు. సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి పాలైన సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో రాణించి మరీ తక్కువ స్కోరుకే టీమిండియా పరిమితం కాకుండా పరువు దక్కించాడు. నెదర్లాండ్స్పై సూర్య 51, కోహ్లి 62 పరుగులతో అజేయంగా నిలిచారు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో కోహ్లి 64 పరుగులతో అజేయంగా నిలిస్తే.. సూర్య 16 బంతుల్లో 30 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య విఫలం కావడంతో ఇక జింబాబ్వే మ్యాచ్లో సూర్య 61 పరుగులతో అజేయంగా నిలిచి భారీ విజయం నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సూపర్-12 దశ ముగిసే సరికి కోహ్లి టాప్ స్కోరర్గా ఉండగా.. సూర్య మూడో స్థానంలో నిలిచాడు. అయితే ఇంగ్లండ్తో మ్యాచ్లో కోహ్లి అర్ధ శతకం బాదినా.. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన సూర్య 14 పరుగులకే పెవిలియన్ చేరడం తీవ్ర ప్రభావం చూపింది. హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 63 పరుగులు చేశాడు కాబట్టి టీమిండియా 168 పరుగుల స్కోరు చేయగలిగింది. కీలక సమయంలో నిరాశ పరిచిన బౌలర్లు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా ప్రపంచకప్ బరిలోకి దిగింది. గాయం కారణంగా అతడు దూరం కావడంతో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. మరో సీనియర్, డెత్ ఓవర్ల స్పెషలిస్టు భువనేశ్వర్ కుమార్, యువ ఫాస్ట్బౌలర్ అర్ష్దీప్ సింగ్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలతో బలంగానే కనిపించింది భారత బౌలింగ్ విభాగం. భువీ, అర్ష్ కీలక సమయంలో రాణించినా.. అశూ, అక్షర్ ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ను పూర్తిగా బెంచ్కే పరిమితం చేశారు. ఇక ఫైనల్ చేరాలంటే ఇంగ్లండ్తో గెలవాల్సిన మ్యాచ్లో భారత బౌలర్ల ప్రదర్శన గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిది. టీమిండియా బ్యాటర్లను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేసిన అడిలైడ్ మైదానంలో ఒక్క భారత బౌలర్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఓపెనర్లు బట్లర్, అలెక్స్ హేల్స్ యథేచ్ఛగా ఫోర్లు, సిక్స్లు బాది తమ జట్టును ఫైనల్కు చేర్చిన తీరు భారత బౌలర్ల వైఫల్యానికి అద్దం పట్టింది. ఆటలో ఏమాత్రం దూకుడు లేదు.. టోర్నీ ఆసాంతం పవర్ ప్లేలో దూకుడు చూపలేకపోయింది టీమిండియా. ఫీల్డింగ్ కూడా మరీ ఎంత గొప్పగా ఏమీలేదు. ఒకటీ రెండు మ్యాచ్లలో కొన్ని సూపర్ క్యాచ్లు మినహా అద్భుతాలేమీ జరుగలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్తో సెమీస్లో ఆడుతుంది టీమిండియానా కాదా అన్న సందేహం తలెత్తేలా భారత జట్టు ఆట తీరు సాగింది. పవర్ ప్లేలో అయితే వికెట్ నష్టపోయి 38 పరుగులే చేయగలిగింది. పాండ్యా మెరుపులు ఒక్కటే ఈ మ్యాచ్లో టీమిండియా ఫ్యాన్స్కు కాస్త ఊరట. ఈ పరిణామాల నేపథ్యంలో ఓవైపు దాయాది పాక్ ఫైనల్కు చేరడం.. టీమిండియా సెమీస్లోనే ఇంటిబాట పట్టడంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతేడాది కోహ్లి సేన సెమీస్ చేరకుండానే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈసారైనా ట్రోఫీ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తే ఆశలు అడియాసలే అయ్యాయి. చదవండి: Rohit Sharma On India Loss: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్ వాళ్లకే ENG Vs IND: షమీపై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. గట్టిగా అరుస్తూ! View this post on Instagram A post shared by ICC (@icc) -
1992 సీన్ రిపీట్ కానుందా.. అయితే పాక్దే టైటిల్!
టి20 ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీఫైనల్లోనే వెనుదిరగడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. సూపర్-12 దశలోనే ఇంటికి వెళుతుందనుకున్న పాకిస్తాన్ ఆఖర్లో కీలక విజయాలతో కాస్త అదృష్టం కూడా తోడవ్వడంతో సెమీస్లో కివీస్పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. అటు ఇంగ్లండ్ మాత్రం సూపర్-12 దశలో పడుతూ లేస్తూ తమ ప్రయాణం కొనసాగించినప్పటికి అసలైన మ్యాచ్లో మాత్రం జూలు విదిల్చింది. సెమీస్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టీమిండియాకు చరిత్రలో మరిచిపోలేని పరాజయాన్ని ఇచ్చింది. అలా మొత్తానికి నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఫైనల్ పోరు జరగకముందే రంగంలోకి దిగిన క్రీడా పండితులు అప్పుడే విజేత ఎవరనేది అంచనా వేస్తున్నారు. చాలా మంది క్రీడా పండితులు.. 1992 వన్డే వరల్డ్కప్ సీన్ రిపీట్ కానుందంటూ జోస్యం చెబుతున్నారు. కొందరు మాత్రం అంత సీన్ లేదని.. ఫైనల్ వన్సైడ్ జరగడం ఖాయమని.. ఇంగ్లండ్ పెద్ద విజయంతోనే టైటిల్ గెలవబోతుందని పేర్కొన్నారు. ఈ సంగతి పక్కనబెడితే ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్ ఆటతీరు చూస్తే యాదృశ్చికమో లేక అలా జరిగిందో తెలియదు కానీ అచ్చం 1992 వన్డే వరల్డ్కప్ను తలపిస్తుంది. 1992 వన్డే వరల్డ్కప్లో ఇమ్రాన్ఖాన్ పాకిస్తాన్ను నడిపించాడు. ఆ వరల్డ్కప్లో లీగ్ దశలో టీమిండియాతో ఓడిపోవడం.. ఆ తర్వాత ఇంటిబాట పట్టాల్సిన పాక్ అదృష్టానికి తోడుగా ఆఖరి రెండు లీగ్ మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శనతో సెమీస్కు రావడం.. ఆ తర్వాత న్యూజిలాండ్తోనే సెమీస్ ఆడి ఫైనల్కు ఎంటరవ్వడం.. ఇక ఫైనల్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి ఇమ్రాన్ నాయకత్వంలోని పాక్ జట్టు జగజ్జేతగా నిలవడం జరిగిపోయింది. తాజా వరల్డ్కప్లోనూ బాబర్ సేనకు 1992 పరిస్థితులే కనిపించాయి. సూపర్-12 దశలో టీమిండియా చేతిలో ఓడడం.. ఆపై ఇంటిబాట పట్టాల్సిన పాకిస్తాన్ బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై విజయాలు సాధించడం.. అదే సమయంలో ప్రొటిస్ నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడం పాక్కు అదృష్టంగా మారింది. ఈ దెబ్బతో సెమీస్లో అడుగుపెట్టిన పాకిస్తాన్ అక్కడ న్యూజిలాండ్ను చావుదెబ్బ కొట్టి ముచ్చటగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ► 1992 వన్డే వరల్డ్కప్, 2022 టి20 వరల్డ్కప్లో పాక్ ఆట సాగిన విధానం.. 1992 వన్డే వరల్డ్కప్: అప్పటి వన్డే వరల్డ్కప్కు ఆస్ట్రేలియానే ఆతిథ్యం 2022 టి20 వరల్డ్కప్: ఇప్పుడు కూడా ఆస్ట్రేలియానే ఆతిథ్యం 1992: మెల్బోర్న్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్లో ఓటమి 2022: అదే మెల్బోర్న్లో టీమిండియా చేతిలోనే ఓటమి 1992: ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలుపు 2022: నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లపై వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలుపు 1992: లీగ్ దశలో చివరి రోజు ఒక్క పాయింట్ ఎక్కువగా ఉన్న పాకిస్తాన్ సెమీస్కు అర్హత 2022: తాజాగా సూపర్-12 దశలో నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడడం.. బంగ్లాదేశ్పై పాక్ గెలవడం.. దీంతో ఒక్క పాయింట్ ఆధిక్యంతో సెమీస్కు అర్హత 1992: సెమీస్లో న్యూజిలాండ్పై విజయం సాధించి ఫైనల్కు 2022: సెమీస్లో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించిన పాక్ ఫైనల్కు 1992: ఫైనల్లో ఇంగ్లండ్ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన పాకిస్తాన్ 2022: ఫైనల్లో ఇంగ్లండ్తో తలపడనున్న పాక్ అయితే జరుగుతున్నది టి20 ప్రపంచకప్ కాబట్టి ఈ అంచనాలు నిజమవుతాయని చెప్పలేం. ఎందుకంటే పొట్టి ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కానీ అనాలసిస్ చూస్తే మాత్రం పాక్ టైటిల్ కొట్టనుందా అనే అనుమానం కలగక మానదు. కానీ ఇప్పుడున్న ఫామ్లో ఇంగ్లండ్ను ఓడించడం పాక్కు పెద్ద సవాల్. మరి ఆ సవాల్ను జయించి పాక్ విశ్వవిజేతగా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే నవంబర్ 13 వరకు ఆగాల్సిందే. చదవండి: IND Vs ENG: మాట నిలబెట్టుకున్న జాస్ బట్లర్ రోహిత్ శర్మపై ఫ్యాన్స్ ఫైర్.. ఐపీఎల్ కెప్టెన్ అంటూ.. Just like 1992, it’s Pakistan vs England in a final at the MCG! 🇵🇰🏴#T20worldcup22 pic.twitter.com/JIgdNkKCJg — Ansar waris (@Ansarwaris112) November 10, 2022 Just like 1992, it’s #Pakistan vs #England in a final at the MCG! 🇵🇰🏴#T20WorldCup2022#Cricket #cricketchallenge #T20WorldCup pic.twitter.com/jvojJmEL7V — Imran Katoch (@ImranKatoch955) November 10, 2022 Incredible moments captured at the Adelaide Oval after England's thumping win 📸#T20WorldCup | #INDvENG pic.twitter.com/NXqiNLbmrg — ICC (@ICC) November 10, 2022 -
IND Vs ENG: షమీపై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. గట్టిగా అరుస్తూ!
ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది. దీంతో టీ20 ప్రపంచకప్-2022 నుంచి టీమిండియా నిష్ర్రమించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్(80), హేల్స్ ఆజేయంగా నిలిచి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించారు. ఇక తొలుత బ్యాటింగ్లో రాణించిన భారత్.. బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లో కూడా చిన్న చిన్న తప్పిదాలు కూడా టీమిండియా ఫీల్డర్లు చేశారు. సీరియస్ అయిన రోహిత్ శర్మ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బట్లర్ ఫైన్ లెగ్ దిశగా స్కూప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో ఫైన్ లెగ్ ఫీల్డింగ్లో ఫీల్డింగ్ చేస్తున్న షమీ పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే బంతిని అందుకున్న షమీ నేరుగా త్రో చేయకుండా.. బంతి కోసం వచ్చిన భువనేశ్వర్ కుమార్కు అందించే ప్రయత్నం చేశాడు. కానీ షమీ వేసిన త్రో భువీకి అందలేదు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు నాలుగు పరుగులు పూర్తి చేశారు. ఈ క్రమంలో హార్దిక్తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రోహిత్ మాత్రం తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. షమీని చూస్తూ నేరుగా నీవే త్రో చేయవచ్చు కదా అంటూ గట్టిగా ఆరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Lol, what were they thinking 😂#indiavsengland #ICCT20WorldCup2022 #shami pic.twitter.com/OT14YIr8dj — Mouli (@Mouli_07) November 10, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: Rohit Sharma Crying: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. కన్నీరు పెట్టుకున్న రోహిత్ శర్మ -
Rohit Sharma Cried: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. కన్నీరు పెట్టుకున్న రోహిత్ శర్మ
ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్-2022 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. బౌలర్లు మాత్రం తీవ్ర నిరాశపరిశారు. ఈ మ్యాచ్లో కేవలం ఒక్క వికెట్ కూడా భారత బౌలర్లు సాధించలేపోయారు. ఏ దశలోను భారత బౌలర్లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. దీంతో 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. వికెట్ నష్టపోకుండా 16 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్(80), హేల్స్(86) పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. కన్నీరు పెట్టుకున్న రోహిత్ టోర్నీ నిష్రమించడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం డగౌట్లో కూర్చోని రోహిత్ కన్నీరు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఆదివారం (నవంబర్ 13)న మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో పాకిస్తాన్తో ఇంగ్లండ్ తలపడనుంది. pic.twitter.com/rUVztiHe8R — Aditya Kukalyekar (@adikukalyekar) November 10, 2022 చదవండి: Rohit Sharma: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్ వాళ్లకే! -
IND Vs ENG: మాట నిలబెట్టుకున్న జాస్ బట్లర్
''టి20 ప్రపంచకప్లో టీమిండియా- పాకిస్తాన్ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్ జరగనివ్వం.. అది జరగాలంటే ముందు టీమిండియా మమ్మల్ని ఓడించాలి..'' భారత్తో సెమీస్కు ముందు ఒక్కరోజు ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఏ ముహుర్తానా ఆ మాట అన్నాడో తెలియదు కానీ..ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకోవడమంటే ఏదో మాములుగా కాదు.. టీమిండియాకు తమ జీవితకాలంలో మరిచిపోలేని పరాజయాన్ని అందించి పంతం నెగ్గించుకున్నాడు. మరో ఆసక్తికర విషయమేంటంటే.. టీమిండియా ఓటమిని శాసించింది కూడా జాస్ బట్లరే. అలెక్స్ హేల్స్తో కలిసి టీమిండియా బౌలర్లను చెడుగుడు ఆడుకున్న బట్లర్.. 169 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే కరిగించాడు. కెప్టెన్గా తన మాట నిలబెట్టుకున్నాడు. మరో విషయమేంటంటే బట్లర్ సూపర్-12 దశలో ఒక్క మ్యాచ్లో సరైన ప్రదర్శన కనబరచింది లేదు. కీలకమైన సెమీస్లో తన మార్క్ ఆటను ప్రదర్శిస్తూ కెప్టెన్ ఇన్నింగ్స్తో పాటు ఫామ్లోకి వచ్చేశాడు. ఒక్కసారి బట్లర్ ఫామ్లోకి వచ్చాడంటే ఇంగ్లండ్ కథ పూర్తిగా మారిపోయినట్లే. ఇలాగే ఆడితే ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించడం ఇంగ్లండ్కు పెద్ద పని కాదు. వాస్తవానికి ఇంగ్లండ్ విజయం సాధించడమే కరెక్టని చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. ఐర్లాండ్తో మ్యాచ్ను వర్షం కారణంగా ఓడిపోయింది తప్ప ఇంగ్లండ్ అన్ని మ్యాచ్ల్లోనూ మంచి విజయాలు అందుకుంది. ముఖ్యంగా జట్టులో ఒకటి నుంచి పదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు.. ఆల్రౌండర్లు ఆ జట్టుకు పెద్ద బలం.. ఇక బౌలింగ్లోనూ స్ట్రాంగ్గా ఉండడం ఆ జట్టకు కలిసివచ్చింది. గ్రూప్-1 నుంచి రెండో స్థానంతో సెమీస్ చేరినప్పటికి అసలైన మ్యాచ్లో మాత్రం ఇంగ్లండ్ జూలు విదిల్చింది. టీమిండియాకు అసలు అవకాశమే ఇవ్వకుండా వన్సైడ్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. పేరుకే గ్రూప్-2 టాపర్గా సెమీస్లో అడుగుపెట్టిన టీమిండియా సూపర్-12 దశలో సమిష్టిగా రాణించిన సందర్భాలు చాలా తక్కువ. ఎవరో ఒక బ్యాటర్పైనే పూర్తిగా ఆధారపడడం.. లేదంటే అదృష్టం కలిసివచ్చి బౌలర్లు ఆరోజు మ్యాచ్లో చెలరేగడం వల్ల టీమిండియా విజయాలు సాధించి తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. ఆడితే కోహ్లి లేదంటే సూర్యకుమార్.. ఇంతే టీమిండియా బ్యాటింగ్. రాహుల్ ఫాంలోకి వచ్చాడన్న మాట రెండు మ్యాచ్లకే పరిమితమైంది. ఇంగ్లండ్తో మ్యాచ్లో అయితే రాహుల్ అదే పేలవమైన షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సెమీస్లోనైనా తన ఫామ్ చూపిస్తాడనుకుంటే మళ్లీ అదే రొడ్డకొట్టుడు ఆటతీరు. ఆరంభంలో ఫోర్లు, సిక్సర్లు బాది చివరికి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం అతనికి అలవాటుగా మారిపోయంది. ఈ ప్రపంచకప్లో కోహ్లి, సూర్యల గురించి తప్ప టీమిండియాలో మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇక బౌలర్ల పరిస్థితి అగమ్యగోచరం. బుమ్రా స్థానంలో వచ్చిన షమీ సూపర్-12 వరకు కాస్త బెటర్ అనిపించినప్పటికి కీలక సెమీస్లో చేతులెత్తేశాడు. ఇక భువనేశ్వర్ తన కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడేసినట్లే. అర్ష్దీప్ సింగ్ ఒక్కడే గుడ్డిలో మెల్ల అన్నట్లు 2 ఓవర్లలో 15 పరుగులిచ్చాడు. ఓవరాల్గా కూడా అర్ష్దీప్ ప్రదర్శన బాగానే ఉంది. ఇక అశ్విన్, అక్షర్ పటేల్లు పూర్తిగా విఫలమయ్యారు. చహల్ను ఎందుకు పక్కనబెట్టారంటే దానికి సమాధానం ఉండదు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రపంచకప్లో టీమిండియా సెమీస్ వరకు రావడం ఒక్కటే కాస్త ఉపశమనం అని చెప్పొచ్చు. అంతకుమించి ఏం లేదు టీమిండియా గురించి మాట్లాడుకోవడానికి.. చదవండి: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే IND Vs ENG: పాక్ ఓపెనర్లను మించిపోయిన బట్లర్, హేల్స్ -
IND Vs ENG: రోహిత్ శర్మపై ఫ్యాన్స్ ఫైర్.. ఐపీఎల్ కెప్టెన్ అంటూ..
అడిలైడ్: ప్రపంచకప్ టీ20 సెమీఫైనల్లో ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లండ్ జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వకుండా భారత్ పరాజయం చెందడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Pic 1: Rohit Sharma as India's captain Pic2: Rohit Sharma as MI captain #INDvsENG #INDvENG #Captaincy pic.twitter.com/pu4gA5L0Q9 — The Lost Guy (@TheLostGuy_) November 10, 2022 ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ శర్మ ఐపీఎల్లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు. We missed you today 💔💔#INDvsENG#captaincy#MSDhoni pic.twitter.com/IoLs3SoCKq — Nadeem khan (@Nadeemlam) November 10, 2022 అదే సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తలచుకుంటున్నారు. అందరి కంటే ‘మిస్టర్ కూల్’ బెటరంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో #captaincy హాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. టీమిండియా కెప్టెన్సీని స్వచ్చందంగా రోహిత్ వదులుకోవాలని కొంతమంది సలహా ఇస్తున్నారు. #INDvsENG Today every Indian feel this.. 🥺🥺#dhonikohli#MSDhoni#dhoni #captaincy #T20Iworldcup2022 pic.twitter.com/FqENEwq32a — Dashrath Dhaker Sukhwara (@Dashrath6537) November 10, 2022 ఈ ప్రపంచకప్లో అద్భుతంగా ఆడిన స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లిని కూడా అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఆట పట్ల అతడి అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని గట్టిగా చెబుతున్నారు. బౌలింగ్ బలంగా లేకపోవడం వల్లే టీమిండియా ఓడిందని కొంతమంది పేర్కొంటున్నారు. (క్లిక్: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్ వాళ్లకే!) Every Indian cricket fan RN#T20Iworldcup2022 #captaincy#T20WorldCup 🙂 pic.twitter.com/Qh08CPnHvC — Vamshi Gandla (@Vamshi4uuu) November 10, 2022 If Rohit Sharma have some shame left within him, he will quit his #captaincy today itself. pic.twitter.com/q72LO2VrLS — Akshat (@AkshatOM10) November 10, 2022 -
WC 2022: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: రోహిత్ శర్మ
T20 World Cup 2022- 2nd Semi-Final- England Beat India By 10 Wickets: ‘‘తీవ్ర నిరాశకు లోనయ్యాం. మేము బాగానే బ్యాటింగ్ చేశాం. మెరుగైన స్కోరు నమోదు చేయగలిగాం. కానీ బౌలర్లు రాణించలేకపోయారు. నాకౌట్ మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించడమే అతి ముఖ్యమైనది. అయినా, మా జట్టులోని ఆటగాళ్లకు ఇలాంటి మ్యాచ్లు కొత్తేమీ కాదు. వీళ్లంతా ఐపీఎల్లో ఇలాంటి నాకౌట్ మ్యాచ్లు ఆడినవాళ్లే. కానీ ఈరోజు మాకు శుభారంభం లభించలేదు. ఇంగ్లండ్ విజయంలో క్రెడిట్ మొత్తం ఓపెనర్లకే దక్కుతుంది. వాళ్లు అద్భుతంగా ఆడారు. మొదటి ఓవర్ నుంచే వారు దూకుడు ప్రదర్శించారు. టోర్నీ మొదటి మ్యాచ్లో మేము పట్టుదలగా ఆడిన తీరు గుర్తుండే ఉంటుంది. బంగ్లాదేశ్తో మ్యాచ్లోనూ హోరాహోరీ పోరు జరిగింది. ఏదేమైనా ఈరోజు మేము మా స్థాయికి తగ్గట్లు ఆడలేదు. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేయలేకపోయాం. అందుకే ఇబ్బందుల్లో పడ్డాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మరీ ఇంత దారుణంగా టీ20 ప్రపంచకప్-2022 రెండో సెమీ ఫైనల్లో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అడిలైడ్ మ్యాచ్లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఫైనల్కు చేరుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశను మిగులుస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించింది రోహిత్ సేన. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(50), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(63) అర్ధ శతకాలతో 168 పరుగులు చేయగలిగిన టీమిండియా.. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ను నిలువరించలేకపోయింది. బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ 80, అలెక్స్ హేల్స్ 86 పరుగులతో చెలరేగి 16 ఓవర్లలోనే టార్గెట్ను ఛేదించారు. అద్భుత అజేయ ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ను ఫైనల్కు చేర్చారు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లలో 25, అర్ష్దీప్ సింగ్ రెండు ఓవర్లలో 15, అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 30, మహ్మద్ షమీ 3 ఓవర్లలో 39, రవిచంద్రన్ అశ్విన్ 2 ఓవర్లలో 27 పరుగులు, హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఓటమి అనంతరం ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మ్యాచ్ స్కోర్లు: భారత్: 168/6 (20) ఇంగ్లండ్: 170/0 (16) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అలెక్స్ హేల్స్ చదవండి: T20 WC 2022 Ind Vs Eng: 'మీ బౌలింగ్కు ఓ దండం రా బాబు.. వచ్చి ఐపీఎల్ ఆడుకోండి' T20 WC 2022 IND Vs ENG: ఏంటి రాహుల్ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి అంటూ! View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IND Vs ENG: 'మీ బౌలింగ్కు ఓ దండం రా బాబు.. వచ్చి ఐపీఎల్ ఆడుకోండి'
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా పోరాటం ముగిసింది. ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. తద్వారా టోర్నీ నుంచి రోహిత్ సేన నిష్క్రమించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. వికెట్ నష్టపోకుండా 16 ఓవర్లలోనే చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్(80), అలెక్స్ హేల్స్(86) పరుగులు సాధించి ఇంగ్లండ్ను ఫైనల్కు చేర్చారు. ఇక ఆదివారం (నవంబర్ 13)న మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో పాకిస్తాన్తో ఇంగ్లండ్ తలపడనుంది. చేతులేత్తిసిన భారత బౌలర్లు ఈ మ్యాచ్లో భారత్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. తొలి ఓవర్ నుంచే బౌలర్లకు ఇంగ్లండ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా భారత సీనియర్ పేసర్లు మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. భువనేశ్వర్ రెండు ఓవర్లలో 25 పరుగులు.. షమీ మూడు ఓవర్లో ఏకంగా 39 పరుగులు ఇచ్చారు. మరో వైపు స్పిన్నర్లు కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు వేసిన అశ్విన్ ఏకంగా 27 పరుగులిచ్చాడు. కీలక మైన సెమీ ఫైనల్లో తేలిపోవడంతో భారత బౌలర్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్లో అయితే మన బౌలర్లు బాగా రాణిస్తారని కామెంట్లు చేస్తున్నారు. విఫలమైన రాహుల్, రోహిత్ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కోహ్లి(50), హార్దిక్ పాండ్యా(63) పరుగులతో రాణించారు. అయితే ఓపెనర్లు రాహుల్, రోహిత్ మాత్రం మరో సారి నిరాశ పరిచారు. రాహుల్ ఐదు పరుగులే ఔటవ్వగా.. రోహిత్ 27 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ తలా ఓ వికెట్ పడగొట్టారు. View this post on Instagram A post shared by ICC (@icc) GET IN! 🦁🦁🦁 To the #T20WorldCup final... WE'RE ON OUR WAY! 🙌 pic.twitter.com/z1sQ6EmioP — England Cricket (@englandcricket) November 10, 2022 చదవండి: Ind Vs Eng: టీమిండియా ఓటమి.. ఫైనల్కు చేరుకున్న ఇంగ్లండ్ -
IND Vs ENG: పాక్ ఓపెనర్లను మించిపోయిన బట్లర్, హేల్స్
అంతా ఊహించినట్లే జరిగింది. ఆరంభం నుంచి టీమిండియాకు మైనస్గా కనిపిస్తూ వచ్చిన బౌలింగ్ విభాగం కీలకమైన సెమీస్ పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. పైనల్ చేరతారనుకున్న టీమిండియా సెమీఫైనల్లో ఘోర పరాజయం చవిచూసి అవమానకర రీతిలో నిష్క్రమించింది. టీమిండియా బౌలర్లలో ఒక్క బౌలర్ నుంచి యార్కర్ బాల్ పడలేదంటే ఎంత పేలవమైన ఆటతీరు కనబరిచిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక కళ్ల ముందు 169 పరుగుల లక్ష్యం కనిపిస్తున్నా టీమిండియా బౌలింగ్ను చూసి ఇంగ్లండ్ ఓపెనర్లు ఇంచు కూడా బెదరలేదు. బట్లర్, అలెక్స్ హేల్స్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఈ ఇద్దరే కరిగించారంటే వారి బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందనేది అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరి దాటికి ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా చేధించింది. జాస్ బట్లర్ 80 నాటౌట్, అలెక్స్ హేల్స్ 86 నాటౌట్గా నిలిచి టీమిండియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చూస్తుంటే గతేడాది టి20 ప్రపంచకప్లో సూపర్-12 దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ గుర్తుకుతెచ్చింది. ఆ మ్యాచ్లో టీమిండియా విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాక్ఘ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. మహ్మద్ రిజ్వాన్ 79 నాటౌట్, బాబర్ ఆజం 68 నాటౌట్ అప్పటి టీమిండియా బౌలింగ్ను చీల్చి చెండాడుతూ పాక్కు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తాజాగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ రెండింటిలో కామన్గా ఉన్నది టీమిండియా అయితే.. జట్టు, స్కోర్లు మాత్రమే వేరు. మిగతాదంతా దాదాపు సేమ్ రిపీట్ అయింది. మరో విషయమేంటంటే బట్లర్, హేల్స్లు పాక్ ఓపెనర్లను మించిపోయారు. అప్పుడు పాక్ 17.1 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యాన్ని అందుకుంటే.. తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోకుండా 169 పరుగుల టార్గెట్ను అందుకుంది. చదవండి: పాండ్యా కోసం పంత్ త్యాగం.. -
Ind Vs Eng: టీమిండియా ఓటమి.. ఫైనల్కు చేరుకున్న ఇంగ్లండ్
ICC Mens T20 World Cup 2022- India vs England, 2nd Semi-Final: టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో టీమిండియాను చూడాలనుకున్న అభిమానుల ఆశ నెరవేరలేదు. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్తో తలపడ్డ రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో భారత బ్యాటర్లు ఫర్వాలేదనిపించినా.. బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్లు తమ జట్టుకు విజయం అందించారు. ఆదిలోనే ఎదురుదెబ్బ టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(5) పూర్తిగా నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే అతడు అవుటయ్యాడు. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మరో ఓపెనర్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఆచితూచి ఆడగా.. పవర్ ప్లేలో భారత జట్టు వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆచితూచి.. అతి జాగ్రత్తగా ఇక ఇక 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కోహ్లి 40 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. మిడిలార్డర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు మాత్రమే చేసి అవుట్కాగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దాటిగా ఆడాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అతడు 63 పరుగులు సాధించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(6) రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన టీమిండియా 168 పరుగులు చేసింది. ఇద్దరే గెలిపించారు లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్కు ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అదిరిపోయే ఆరంభం అందించారు. భారత బౌలర్లు ఏ దశలోనూ ఈ జంటను విడగొట్టలేకపోయారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ బౌలర్ను బరిలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. హేల్స్ 86, బట్లర్ 80 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చారు. ఇలా భారత్ను ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడించిన బట్లర్ బృందం ఫైనల్కు చేరుకుంది. కాగా నవంబరు 13 నాటి ఫైనల్లో ఇంగ్లండ్.. పాకిస్తాన్తో తలపడనుంది. మ్యాచ్ స్కోర్లు: భారత్: 168/6 (20) ఇంగ్లండ్: 170/0 (16) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అలెక్స్ హేల్స్ చదవండి: T20 WC 2022 IND Vs ENG: ఏంటి రాహుల్ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి అంటూ! View this post on Instagram A post shared by ICC (@icc) -
ENG Vs IND: పాండ్యా కోసం పంత్ త్యాగం..
టి20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో సెమీఫైనల్ మ్యాచ్లో పంత్ మరోసారి విఫలమయ్యాడు. కోహ్లి ఔట్ అయ్యాకా క్రీజులోకి వచ్చిన పంత్ 4 బంతుల్లో ఆరు పరుగులు చేసి రనౌటయ్యాడు. మ్యాచ్లో పెద్దగా మెరవకపోయినా అభిమానుల మనుసులు మాత్రం గెలుచుకున్నాడు. విషయంలోకి వెళితే.. జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ మూడో బంతిని ఔట్సైడ్ వేయగా పంత్ బ్యాట్కు తాకలేదు. అయితే పాండ్యా సింగిల్ కోసం సగం పిచ్ దాటేశాడు. నాన్స్ట్రైక్ ఎండ్ వెళ్లడం ఇష్టంలేక పాండ్యా ముందుకు కదిలాడు. ఇది గమనించిన పంత్ తాను ఔటైనా పర్లేదనుకొని నాన్స్ట్రైక్ ఎండ్వైపు పరిగెత్తాడు. అయితే బట్లర్ నుంచి బంతి అందుకున్న జోర్డాన్ నేరుగా వికెట్లకు త్రో వేయడంతో పంత్ రనౌట్గా వెనుదిరిగాడు. ఈ దశలో పంత్ హార్దిక్ వైపు చూస్తూ పర్లేదు.. నువ్వు ఆడు అన్నట్లుగా పేర్కొంటూ పెవిలియన్ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి పంత్ బాగా ఆడకపోయినప్పటికి అభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకున్నాడని కామెంట్ చేశారు. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. పాండ్యా 63 పరుగులు, కోహ్లి 50 పరుగులతో రాణించగా.. రోహిత్ శర్మ 27 పరుగులు చేశాడు. pic.twitter.com/Wie8RPGVaU — The sports 360 (@Thesports3601) November 10, 2022 చదవండి: సెమీస్ అంటే కోహ్లికి పూనకాలే.. -
కోహ్లి సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్తో సెమీఫైనల్లో కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 40 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 50 పరుగులు చేశాడు. కాగా ఈ ఏడాది మెగా ఈవెంట్లో కోహ్లికి ఇది నాలుగో అర్ద సెంచరీ. అదే విధంగా ఈ టోర్నీలో టాప్ రన్ స్కోరర్గా కూడా విరాట్ కోహ్లి(296)నే కొనసాగుతున్నాడు. కోహ్లి సరి కొత్త చరిత్ర అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 4000 పరుగుల మార్క్ను అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్తో మ్యాచ్లో 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కింగ్ కోహ్లి.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు 115 మ్యాచ్లు ఆడిన విరాట్ 4008 పరుగులు సాధించాడు. ఇక విరాట్ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ(3853), మార్టిన్ గప్టిల్(3531)పరుగులతో ఉన్నారు. చదవండి: T20 WC 2022 IND Vs ENG: ఏంటి రాహుల్ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి! -
సెమీస్ అంటే కోహ్లికి పూనకాలే..
టీమిండియా రన్మెషిన్ విరాట్ కోహ్లి తన సూపర్ఫామ్ను కొనసాగిస్తున్నాడు. టి20 ప్రపంచకప్లో భాగంగా గురువారం ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో అర్థసెంచరీతో మెరిశాడు. టి20 వరల్డ్కప్లో సెమీఫైనల్ అంటే చాలు కోహ్లిలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. తాజాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో 40 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కోహ్లి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఇక కోహ్లికి సెమీఫైనల్స్ అంటే పూనకాలే అన్నట్లుగా అతని బ్యాటింగ్ ఉంటుంది. తాజా దానితో కలిపి ఇప్పటివరకు కోహ్లి టి20 ప్రపంచకప్ సెమీఫైనల్స్లో మూడు అర్థసెంచరీలు సాధించాడు. తొలిసారి 2014లో సౌతాఫ్రికాపై 72 పరుగులు నాటౌట్, 2016లో వెస్టిండీస్పై 89 పరుగులు నాటౌట్, తాజాగా ఇంగ్లండ్పై 50 పరుగులు సాధించాడు. ఇలా ఒక వరల్డ్కప్లో సెమీస్లో మూడు అర్థసెంచరీలు సాధించిన తొలి బ్యాటర్గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఈ ప్రపంచకప్లో కోహ్లికి ఇది నాలుగో అర్థసెంచరీ కావడం విశేషం. చదవండి: IND Vs ENG: ఏంటి రాహుల్ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి! -
Ind Vs Eng: పాండ్యా మెరుపుల వల్లే ఇలా! లేదంటే..
ICC Mens T20 World Cup 2022- India vs England, 2nd Semi-Final: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా అర్ధ శతకాలు సాధించారు. కోహ్లి 40 బంతుల్లో 50 పరుగులు సాధించగా.. పాండ్యా 33 బంతుల్లో 5 సిక్స్లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టాడు. అడిలైడ్ మ్యాచ్లో కోహ్లి ఆచితూచి ఆడగా.. పాండ్యా దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరి కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కాగా గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, ఇంగ్లండ్ బౌలర్లు ఆది నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో పరుగులు రాబట్టలేక టీమిండియా ఇబ్బంది పడింది. మొదటి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ కేఎల్ రాహుల్ను క్రిస్ వోక్స్ పెవిలియన్కు పంపాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ, వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో 6 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులకే అవుటయ్యాడు. ఈ క్రమంలో కోహ్లితో కలిసి హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దూకుడుగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇక పంత్ 6 పరుగులు చేసి రనౌట్గా వెనుదిరిగాడు. ఆఖర్లో పాండ్యా హిట్ వికెట్గా వెనుదిరగడం గమనార్హం.ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ తలా ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: WC 2022 Final: ఫైనల్లో టీమిండియాతో పోరుకు సిద్ధమేనా? పాక్ కెప్టెన్ ఏమన్నాడంటే Danushka Gunathilaka: మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్, రక్షణ కూడా లేకుండా అమానుషంగా View this post on Instagram A post shared by ICC (@icc) -
IND Vs ENG: ఏంటి రాహుల్ నీ ఆట? వెంటనే జట్టు నుంచి తీసేయండి!
టీ20 ప్రపంచకప్-2022లోభాగంగా ఇంగ్లండ్తో సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఓపెనర్ కెఎల్ రాహుల్ తీవ్ర నిరాశ పరిచాడు. కీలకమైన మ్యాచ్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన క్రిస్ వోక్స్ బౌలింగ్లో.. రాహుల్ వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన రాహుల్.. 128 పరుగులు మాత్రమే చేశాడు. నాకౌట్ దశలో బంగ్లాదేశ్, జింబాబ్వేపై మాత్రమే రాహుల్ పర్వాలేదనిపించాడు. మిగితా మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే రాహుల్ పరిమితమయ్యాడు. ఇక కీలకమైన సెమీఫైనల్లో విఫలమకావడంతో రాహుల్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఏంటి రాహుల్..? బంగ్లాదేశ్, జింబాబ్వే వంటి చిన్న జట్లపై మాత్రం ఆడుతావా అంటూ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. KL Rahul chose the big stage to show his loyalty towards the academy...He gone to pavilion after scoring gorgeous gorgeous 5 runs off just 5 balls... Professor KL on fire🔥😍 #INDvENG pic.twitter.com/mY4utMWa2y — TukTuk Academy (@TukTuk_Academy) November 10, 2022 We fans demand the immediate removal of Kl Rahul from every indian squad. As fans we have suffered enough because of him opening the batting for our lovely Indian team. How many times we have to suffer? *Your every like means you also want kl rahul dropped.#INDvENG pic.twitter.com/QTVuRUMoup — Passionate Fan (@Cricupdatesfast) November 10, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: WC 2022 Final: ఫైనల్లో టీమిండియాతో పోరుకు సిద్ధమేనా? పాక్ కెప్టెన్ ఏమన్నాడంటే -
WC 2022 Final: ఫైనల్లో టీమిండియాతో పోరుకు సిద్ధమేనా? తెలీదు..!
ICC Mens T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్-2022 మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించిన పాకిస్తాన్ ఫైనల్కు సన్నద్ధమవుతోంది. కివీస్తో కీలక మ్యాచ్లో తిరిగి ఫామ్ అందుకున్న బాబర్ ఆజం.. 53 పరుగులతో రాణించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్తో పాటు మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ సైతం 57 పరుగులతో మెరిశాడు. గత మ్యాచ్లలో అంతగా ఆకట్టుకోని ఈ ఓపెనింగ్ జోడీ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో మాత్రం అదరగొట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఫైనల్ చేరడంతో.. రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్ను ఓడించి పాక్తో పాటు తుది మెట్టుకు చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2007 నాటి వరల్డ్కప్ మాదిరి ఫైనల్లో దాయాదుల హోరాహోరీ పోరును చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో కివీస్తో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఓ జర్నలిస్టు నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. జర్నలిస్టు: మీరు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. అయితే, ఫైనల్లో ఇండియా మీ ప్రత్యర్థిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఇండియా- పాక్ మ్యాచ్ అంటే అంతా ఒత్తిడిలో కూరుకుపోతారు. అలాంటి పరిస్థితుల్లో మీరెలాంటి వ్యూహాలు అవలంబిస్తారు? బాబర్ ఆజం: నిజానికి ఫైనల్లో మా ప్రత్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పలేం కదా. అయితే, తుది పోరులో ఎవరితో పోటీ పడాల్సి వచ్చినా వందకు వంద శాతం మా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకే ప్రయత్నిస్తాం. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతాం. ఫైనల్లో ఒత్తిడి సహజమే. అయితే, ఈ టోర్నీ ఆరంభం నుంచి ఫైనల్ చేరే వరకు వివిధ దశల్లో కఠిన పరిస్థితులు దాటుకుని ఇక్కడి దాకా వచ్చాం. ఫైనల్లో కచ్చితంగా భయానికి తావులేకుండా దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. గత మూడు, నాలుగు మ్యాచ్లలో మా ఆట తీరు అలాగే ఉంది. ఫైనల్లో కూడా అదే విధంగా ఆడతాం అంటూ బాబర్ ఆజం సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘లక్తో మీరు సెమీస్ వరకు రాగలిగారు. కివీస్ వైఫల్యం కారణంగా ఫైనల్కు చేరుకున్నారు. టీమిండియా అలా కాదు కదా! కష్టపడి ఇక్కడి దాకా వచ్చారు. ఫైనల్కు చేరుకుంటారు. రెడీగా ఉండండి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Danushka Gunathilaka: మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్, రక్షణ కూడా లేకుండా అమానుషంగా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); a -
IND VS ENG: అనుకున్నదే అయ్యింది.. ఆ ఇద్దరు ఔట్
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ముందు అనుకున్న విధంగానే ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ కీలకమైన మ్యాచ్కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చారు. ఈ రెండు మార్పులు మినహాయించి.. శ్రీలంకపై బరిలోకి దిగిన జట్టునే ఇంగ్లండ్ యధాతథంగా కొనసాగించింది. ఇంగ్లండ్ విజయావకాశాలను ప్రభావితం చేయగల మలాన్, వుడ్ జట్టులో లేకపోవడంతో ఇంగ్లండ్ ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. మరోవైపు ఈ మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా.. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. జింబాబ్వేపై బరిలోకి దిగిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. దీంతో రిషబ్ పంత్కు మరో అవకాశం దక్కినట్లైంది. జట్ల వివరాలు.. టీమిండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ ఇంగ్లండ్: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ -
WC 2022 Ind Vs Eng: టీమిండియా ఘోర ఓటమి.. ఫైనల్లో ఇంగ్లండ్
ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final Updates In Telugu: టీ20 ప్రపంచకప్-2022: రెండో సెమీ ఫైనల్- ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ అప్డేట్స్: టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా పోరాటం ముగిసింది. ఆడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. తద్వారా టోర్నీ నుంచి రోహిత్ సేన నిష్క్రమించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. వికెట్ నష్టపోకుండా చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్(80), అలెక్స్ హేల్స్(86) పరుగులతో ఇంగ్లండ్కు విజయాన్ని అందించారు. ►ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్ 56, హేల్స్ 80 పరుగులతో క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 140/0 ► 11 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(38), హేల్స్(66) పరుగులతో ఉన్నారు. ►9 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్(36), హేల్స్(51) పరుగులతో ఉన్నారు. పవర్ ప్లేలో దూకుడు ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో పవర్ ప్లేలో ఇంగ్లండ్ 63 పరుగులతో దూకుడు కొనసాగిస్తోంది. దాటిగా ఆడుతున్న బట్లర్ ఇంగ్లండ్ కెప్టెన్, ఓపెనర్ జోస్ బట్లర్(14 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 24 పరుగులు) దాటిగా ఆడుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. మరోవైపు అలెక్స్ హేల్స్ సహకారం అందిస్తున్నాడు. ఈ క్రమంలో 4 ఓవర్లలో ఇంగ్లండ్ 41 పరుగులు చేసింది. టీమిండియా స్కోరెంతంటే ఇంగ్లండ్తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కోహ్లి 50, హార్దిక్ పాండ్యా 63 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్కు మూడు, ఆదిల్ రషీద్కు ఒకటి, క్రిస్ వోక్స్కు ఒక వికెట్ దక్కాయి. హిట్ వికెట్గా వెనుదిరిగిన హార్దిక్ పాండ్యా అద్భుత అర్ధ శతకంలో చెలరేగిన హిట్ వికెట్గా వెనుదిరిగాడు. పంత్ రనౌట్ సూపర్ పాండ్యా హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 29 బంతుల్లో 52 పరుగులు రాబట్టాడు. 19 ఓవర్లలో టీమిండియా స్కోరు: 156/4 కోహ్లి అవుట్ అర్ధ శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి జోర్డాన్ బౌలింగ్లో అవుటయ్యాడు. 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. పాండ్యా, పంత్ క్రీజులో ఉన్నారు. 18 ఓవర్లలో టీమిండియా స్కోరు: 136/4 పాండ్యా మెరుపులు జోర్డాన్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన హార్దిక్ పాండ్యా 17 ఓవర్లలో టీమిండియా స్కోరు: 121/3 ►అర్ధ శతకానికి చేరువలో కోహ్లి (48). 16 ఓవర్లలో స్కోరు: 110-3 తప్పిన ఎల్బీడబ్ల్యూ ప్రమాదం.. కోహ్లి నాటౌట్ 16 వ ఓవర్ రెండో బంతికి జోర్డాన్ బౌలింగ్లో కోహ్లికి ఎల్బీడబ్ల్యూ ప్రమాదం తప్పింది. నెమ్మదిగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్ 15 ఓవర్లలో వంద పరుగులు మార్కు అందుకున్న టీమిండియా. స్కోరు: 100/3 ►14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 90-3 కోహ్లి(38), హార్దిక్ పాండ్యా(4) క్రీజులో ఉన్నారు ►75 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రషీద్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ►రోహిత్ శర్మ రూపంలో రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 38/1 ►5 ఓవర్లలో టీమిండియా స్కోరు: 31-1 ►కోహ్లి, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. స్కోరు: 11/1 (2.3 ఓవర్లలో) ► తొలి వికెట్ కోల్పోయిన ఇండియా.. కేఎల్ రాహుల్ అవుట్ ►టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ ఇంగ్లండ్: జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ ఇంగ్లండ్తో టీమిండియా ఢీ టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఫైనల్కు అర్హత సాధించేందుకు టీమిండియా సమాయత్తమైంది. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో రెండో సెమీ ఫైనల్లో గురువారం అమీ తుమీ తేల్చుకోనుంది. ఇక ఇప్పటికే మొదటి సెమీస్ మ్యాచ్లో దాయాది పాకిస్తాన్.. న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా సైతం ఇంగ్లండ్ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించి 2007 నాటి సెంటిమెంట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా మొదటి టీ20 వరల్డ్కప్ ఎడిషన్లో ధోని సేన పాక్ను ఓడించి టైటిల్ గెలిచిన విషయం విదితమే. చదవండి: Rohit Sharma- Jos Buttler: ఇంగ్లండ్ జట్టు ప్రమాదకరమైంది.. మేం గెలవాలంటే! -
రోహిత్ మెరవాలి, కోహ్లి చెలరేగాలి, సూర్య దంచికొట్టాలి..!
టీ20 వరల్డ్కప్-2022 రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు ఇవాళ (నవంబర్ 10) అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 1:30 గటంలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపొంది, ఫైనల్లో పాక్ను కూడా మట్టికరిపించి, టైటిల్ సొంతం చేసుకోవాలని వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. కీలకమైన ఈ మ్యాచ్లో టీమిండియా క్రికెటర్లు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా తమ సహజమైన ఆట ఆడి ఇంగ్లండ్ ఆట కట్టించాలని ఆకాంక్షిస్తున్నారు. ధైర్యంగా ఆడండి మీవెనక 130 కోట్ల మంది భారతీయులున్నారంటూ భరోసానిస్తున్నారు. చాలా మంది అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్లు చెలరేగాలని దేవుళ్లకు పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కాస్తా మెరుగ్గానే ఉందని, బౌలర్లు ఈ మ్యాచ్లో సత్తా చాటేలా వారికి శక్తిని ప్రసాదించాలని దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు. అలాగే, రోహిత్, కోహ్లి, సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలని కోరుకుంటున్నారు. గతకొంతకాలంగా ఫామ్లో లేని హిట్మ్యాన్ ఈ మ్యాచ్లో మెరవాలని, కోహ్లి ఎప్పటిలాగే చెలరేగాలని, సూర్యకుమార్ యాదవ్.. ఇంగ్లండ్ బౌలర్లను దండికొట్టాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో దినేశ్ కార్తీక్, పంత్లలో ఎవరు ఆడినా ఫామ్లోకి రావాలని, ముఖ్యంగా స్పిన్నర్లు తమ పాత్రలను న్యాయం చేయాలని ఆశిస్తున్నారు. భారతీయ అభిమానుల ఆకాంక్షలు, కోరికలు, ప్రార్ధనలతో సోషల్మీడియా హోరెత్తుతుంది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో పాక్.. న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నవంబర్ 13న పాక్తో టైటిల్ పోరులో తలడపనుంది. -
టీమిండియాపై ఇంగ్లండ్దే విజయం.. మరోసారి అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడు. ఇవాళ సెమీస్లో తలపడే రెండు జట్లు బలంగానే ఉన్నా.. టీమిండియాతో పోలిస్తే, ఇంగ్లండ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 60 నుంచి 65 శాతం వరకు ఇంగ్లండ్కే గెలిచే అవకాశాలున్నాయని భారతీయ అభిమానులతో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. భారత్తో పోలిస్తే ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉందని, అందుకే తన ఓటు ఇంగ్లండ్కు వేస్తున్నానని ఓ టీవీ ఇంటర్వ్యూలో జరిగిన విశ్లేషణ సందర్భంగా పేర్కొన్నాడు. ఒత్తిడి ఎదుర్కోవడంలోనూ భారత్తో పోలిస్తే ఇంగ్లండ్ చాలా బెటరని, ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైందని అన్నాడు. గత రికార్డులు భారత్కే అనుకూలంగా ఉన్నా, ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మునుపెన్నడూ లేని భీకర ఫామ్లో ఉందంటూ భారత అభిమానులను భయపెట్టే ప్రయత్నం చేశాడు. అంతిమంగా ముందు అనుకున్న వ్యూహాలను వంద శాతం అమల్లో పెట్టగలిగే జట్టుదే విజయమని, ఫీల్డ్లో 11 మంది ఆటగాళ్లు రాణించే జట్టుకే విజయం సొంతమవుతుంది జోస్యం చెప్పాడు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో దుమారం రేపుతున్నాయి. భారతీయ అభిమానులైతే అఫ్రిదిని పిచ్చి కుక్కతో పోలుస్తూ.. అసభ్యపదజాలం వాడుతూ కామెంట్లు చేస్తున్నారు. పిచ్చి కుక్కలు, క్రికెట్ అజ్ఞానులు విశ్లేషణలను పట్టించుకోవాల్సిన పని లేదంటూ లైట్గా తీసుకుంటున్నారు. అఫ్రిదికి టీమిండియాపై విషం చిమ్మడం అలవాటేనని అంటున్నారు. ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. నీకు భారత్ కంటే మెరుగ్గా కనిపిస్తుందా అని ఏకి పారేస్తున్నారు. -
WC 2022: ఇంగ్లండ్ జట్టు ప్రమాదకరమైంది.. మేం గెలవాలంటే: రోహిత్ శర్మ
ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final: ‘‘నాకౌట్ మ్యాచ్కు ప్రాధాన్యత ఉందనేది వాస్తవమే అయినా అలాంటి ఒక్క మ్యాచ్లో ప్రదర్శన ఏ ఆటగాడినీ తక్కువ చేయదు. అది నేనైనా, మరో ఆటగాడైనా సరే. తమ సుదీర్ఘ కెరీర్లో దేశం తరఫున వారు ఎలా ఆడారనేది ముఖ్యం. ఎవరైనా ఇలాంటి సమయంలో బాగా ఆడేందుకే ఎంతో శ్రమిస్తారు. కానీ ఫలితం ప్రతికూలంగా వచ్చినా గత కొన్నేళ్లుగా వారు చూపిన ఆటను మరిచిపోవద్దు. బాగా ఆడి లీగ్ దశ దాటాం. సెమీస్ కూడా మరో దశ. గెలిచి మూడో దశ (ఫైనల్)లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తాం. ఇంగ్లండ్ జట్టు చాలా ప్రమాదకరమైంది. మేం గెలవాలంటే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టీ20 ప్రపంచకప్-2022 రెండో సెమీ ఫైనల్లో భాగంగా భారత జట్టు గురువారం (నవంబరు 10) ఇంగ్లండ్తో తలపడనుంది. అడిలైడ్ వేదికగా బట్లర్ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా రోహిత్ శర్మ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. బ్యాటింగ్లో అదనపు బలమంటూ స్పిన్ ఆల్రౌండర్లు అశ్విన్, అక్షర్లను ఆడించడం ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘బ్యాటర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అని చెప్పొచ్చు.. ఇక ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ‘‘సూర్యకుమార్ కళ్లు చెదిరే బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. అతణ్ని ‘బ్యాటర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అని చెప్పవచ్చు. అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్న సూర్యను అవుట్ చేసేందుకు ఒక్క మంచి బంతి చాలు. సూర్యను ఎలా అవుట్ చేయాలనే దానిపై ఆలోచిస్తాం. అయితే కేవలం సూర్యకుమార్ గురించి మాత్రమే మేము ఆలోచించడంలేదు. సూర్యతోపాటు ఇతర ఆటగాళ్లు కూడా ప్రమాదకరమే. భువనేశ్వర్తోపాటు ఏ బౌలర్కూ నేను భయపడను. ఏ బౌలర్ను ఎలా ఎదుర్కోవాలో పకడ్బందీగా సిద్ధమయ్యే క్రీజులోకి వస్తా. మా జట్టులో చాలామందికి అడిలైడ్ మైదానంలో ఆడిన అనుభవం ఉంది. మైదానం కొలతలను బట్టి మా వ్యూహంలోనూ మార్పులు చేసుకుంటాం. పిచ్ గురించి పెద్దగా ఆందోళన చెందడంలేదు. భారత జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. టీమిండియాను ఏమాత్రం తక్కువ అంచనా వేయడంలేదు. ముందుగా బ్యాటింగ్ చేస్తే భారత్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తాం. ఛేజింగ్కు దిగితే ఎంతటి లక్ష్యాన్నైనా అధిగమిస్తామన్న నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: T20 WC 2022 IND VS ENG: సెమీస్ మ్యాచ్కు వర్షం ముప్పు..? రద్దయితే ఫైనల్కు టీమిండియా T20 WC 2022: ఓటమి బాధలో ఉన్న కేన్ మామకు మరో భారీ షాక్..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); All Set 💪 Drop a message and wish #TeamIndia for the semi-final against England 📝#T20WorldCup | #INDvENG pic.twitter.com/bgQlSyGMGY — BCCI (@BCCI) November 10, 2022 -
మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్, రక్షణ కూడా లేకుండా అమానుషంగా
టీ20 వరల్డ్కప్-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లి, అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టై బెయిల్ కూడా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుణతిలకకు.. సిడ్నీ పోలీసులు కోర్టుకు అందించిన నివేదిక కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడే క్రమంలో గుణతిలక మృగంలా ప్రవర్తించాడని, పలు మార్లు రక్షణ కూడా లేకుండా బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. బాధితురాలు తిరగబడే సరికి సహనం కోల్పోయిన గుణతిలక.. గొంతు నులిమి, ఊపిరి ఆడనీయకుండా చేశాడని, అలాగే తలను గోడకేసి పలు మార్లు గట్టిగా బాదాడని కోర్టుకు వివరించారు. బాధితురాలు అందించిన సమాచారం మేరకే తాము నివేదికను తయారు చేసి కోర్టులో సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుణతిలక దోషిగా తేలితే 14 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశముందని అన్నారు. ఇదిలా ఉంటే, 31 గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఇదివరకే సస్పెన్షన్ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్ (స్థాయి, ఫార్మాట్, లీగ్) ఆడకుండా నిషేధం విధించింది. కాగా, టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక సూపర్ 12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
IND VS ENG: సెమీస్ మ్యాచ్కు వర్షం ముప్పు..? రద్దయితే ఫైనల్కు టీమిండియా
టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 10) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్కు వర్షం ముంపు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అడిలైడ్, పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం కురిసిందని, ఇవాళ ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో 40 శాతం మేరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అడిలైడ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులకు ఈ వార్త అస్సలు సహించడం లేదు. ఎందుకంటే.. ఒక వేళ వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ రద్దైతే, రిజ్వర్ డేలో మ్యాచ్ను కొనసాగించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ అప్పుడు కూడా సాధ్యపడకపోతే.. గ్రూప్ దశలో టాపర్గా ఉన్న జట్టును (భారత్) విజేతగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఇదే అంశం ఇంగ్లండ్ జట్టును, ఆ దేశ అభిమానులను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్.. న్యూజిలాండ్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఒకవేళ వర్షం పడకుండా ఇవాల్టి మ్యాచ్ సజావుగా సాగితే.. ఈ మ్యాచ్ విజేత నవంబర్ 13న పాకిస్తాన్తో టైటిల్ పోరులో తలపడనుంది.