Telugu Tech News
-
'తెలుగు టెక్ ట్యూట్స్' సయ్యద్ హఫీజ్ నెల సంపాదన ఎంతో తెలుసా!
ప్రముఖ తెలుగు టెక్ కంటెంట్ క్రియేటర్ సయ్యద్ హఫీజ్కు అరుదైన గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ పత్రిక ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటు దక్కింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైంటిక్లైన్ కాలనీకి చెందిన సయ్యద్ హఫీజ్ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. ఉన్నత విద్యను చదవకపోయినా టెక్నాలజీపై తనకున్న మక్కువతో 2011 నుంచి హఫీజ్ 'తెలుగు టెక్ట్యూట్స్' పేరుతో వీడియో కంటెంట్ను అందిస్తున్నాడు. ముఖ్యంగా అటు సోషల్ మీడియాను.. ఇటు టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలి. మితిమీరిన టెక్నాలజీ వినియోగంతో రోజు రోజుకి పెరిగిపోతున్న ప్రమాదాల గురించి యూజర్లకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్ రివ్వ్యూ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆకట్టుకోవడాన్ని ఫోర్బ్స్ ఇండియా గుర్తించింది. 8.89 క్రియేట్ స్కోర్తో టాప్ 100 డిజిటల్ స్టార్ట్స్లో చోటు కల్పిచ్చింది. సయ్యద్ హఫీజ్ ఆదాయం ఎంతంటే టెక్ కంటెంట్తో యూజర్లకు ఆకట్టుకుంటున్న సయ్యద్ హఫీజ్ యూట్యూబ్ ఛానల్కు ప్రస్తుతం 16లక్షల మంది సబ్ స్క్రైబర్లతో నెలకు రూ.2 లక్షల ఆదాయం అర్జిస్తున్నారు. ర్యాంకులు ఎలా ఇచ్చింది ఫోర్బ్స్ ఇండియా, ఐఎన్సీఏ, గ్రూప్ ఎం సంస్థలు సంయుక్తంగా డిజటల్ స్టార్ట్స్ ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, బిజినెస్, ఫిట్నెస్, ఫుడ్,టెక్, ట్రావెల్, సోషల్ వర్క్ ఇలా తొమ్మిది రకాల కంటెంట్తో యూజర్లను ఆకట్టుకుంటున్న 100కి ర్యాంకులు విధించింది. ఆ 100మందిని ఎలా సెలక్ట్ చేసిందంటే టాప్ 100 డిజిటల్ స్టార్స్లో స్థానం సంపాదించిన కంటెంంట్ క్రియేటర్లు నెటిజన్లు ఆకట్టుకోవడంతో పాటు క్రియేట్ చేసే కంటెంట్ ఎంతమందికి రీచ్ అవుతుంది. ఎంత మంది ఆ కంటెంట్తో ఎంగేజ్ అవుతున్నారు. ఆ కంటెంట్ జెన్యూన్గా ఉందా? లేదా? ఇలా అన్నీ రకాలు పరిశీలించిన తర్వాతే ఈ జాబితాను విడుదల చేసినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఈ లిస్ట్లో సయ్యద్ హఫీజ్ 32వ స్థానం దక్కడం గమనార్హం. చదవండి: ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఇండో-అమెరికన్ మహిళలు! -
యాపిల్ సంచలన నిర్ణయం.. వాటిని పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధం..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం యాపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్-14 సిరీస్ స్మార్ట్ఫోన్లను యాపిల్ లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో 2019 సెప్టెంబర్లో విడుదలైన ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్ల పూర్తిగా నిలిపివేయనున్నట్లు యాపిల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. iDropNews నివేదిక ప్రకారం...ఐఫోన్-11 స్మార్ట్ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఐఫోన్ ఎస్ఈ 3తో నేరుగా పోటీపడటంతో...ఈ సంవత్సరం నుంచి దశలవారీగా ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్ సిద్దమైన్నట్లు తెలుస్తోంది. భారత్లో ఐఫోన్-11, ఐఫోన్ ఎస్ఈ 3 స్మార్ట్ఫోన్ల ధరలు కూడా సరిసమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఫోన్-11 సిరీస్ స్మార్ట్ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్ సన్నాహాలను చేస్తోంది. ఇదిలా ఉండగా ఐఫోన్-12 ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఐఫోన్-12 సిరీస్ స్మార్ట్ఫోన్ ధరలు ఐఫోన్-11 ధరలతో సమానంగా ఉండే ఆస్కారం ఉందని ఐడ్రాప్ న్యూస్ తన నివేదికలో పేర్కొంది. చదవండి: యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు.. లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ తక్కువ ధరలోనే... -
సూపర్ ఫీచర్స్తో షావోమీ నుంచి మరో బడ్జెట్ ఫోన్..! లాంచ్ ఎప్పుడంటే..?
భారత మార్కెట్లలోకి మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ సిద్దమైంది. రెడ్మీ 10 సిరీస్లో భాగంగా రెడ్మీ 10 ఏ స్మార్ట్ఫోన్ను షావోమీ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ భారత్లో ఏప్రిల్ 20న లాంచ్ కానుంది. రెడ్మీ10ఏ స్మార్ట్ఫోన్కు సంబంధించిన పలు వివరాలను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో టీజ్ చేసింది. Redmi 10A స్మార్ట్ఫోన్ను ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉండగా..ఇదే మోడల్ భారత్లో కూడా లాంచ్ కానుంది. ఇది Redmi 10 స్మార్ట్ఫోన్ స్ట్రిప్డ్ వెర్షన్ మాత్రమేనని తెలుస్తోంది. రాబోయే Redmi 10A స్మార్ట్ఫోన్ Redmi 10 కంటే చౌకగా ఉండే అవకాశం ఉంది. Redmi 10 ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ.10,999. 6GB RAM + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.12,999 గా ఉన్నాయి. అయితే భారత మార్కెట్లలో Redmi 10A ధరను ఇంకా వెల్లడి చేయనప్పటికీ, ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 10,000 లోపు ఉండవచ్చునని తెలుస్తోంది. Redmi 10A 4GB RAM + 64GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక 3GB RAM + 32GB స్టోరేజ్ Redmi 10A బేస్ మోడల్ ధర సుమారు రూ. 8,999గా అంచనా వేయబడింది. Redmi 10A స్పెసిఫికేషన్లు(అంచనా) 6.53-అంగుళాల HD+ LCD డిస్ప్లే విత్ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ వాటర్డ్రాప్ నాచ్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ మీడియాటెక్ హెలియో జీ25 ప్రాసెసర్ పవర్వీ8320 జీపీయూ గ్రాఫిక్స్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 4GB ర్యామ్+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ 10W ఛార్జింగ్ సపోర్ట్ 5,000mAh బ్యాటరీ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చదవండి: మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్..! -
వాట్సాప్ సంచలన నిర్ణయం..!
వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఎప్పుడూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందబాటులోకి తెస్తూ మరింత పటిష్టంగా యాప్ను రూపొందిస్తోంది వాట్సాప్. కాగా తాజాగా ఫార్వర్డ్ మెసేజ్స్పై వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫార్వర్డ్ మెసెజ్స్కు కళ్లెం..! ఫార్వెర్డెడ్ మెసేజ్స్కు కళ్లెం వేయాలని వాట్సాప్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఫార్వర్డ్ మెసేజ్లకు అడ్డుకట్ట వేసే పనిలో భాగంగా సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ను టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి తెస్తోన్న ఫీచర్తో వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ మెసేజ్లకు చెక్ పెట్టనుంది. ఈ ఫీచర్తో ఒక మెసేజ్ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు ఫార్వార్డ్ చేయకుండా చేస్తోంది. దీంతో స్పామ్ మెసేజ్లకు వాట్సాప్ అడ్డుకట్ట వేయనున్నది. ఒకవేళ సదరు మెసేజ్ను ఒకరికంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయాలంటే ఆయా మెసేజ్ను కాపీ చేసి రెసిపెంట్ కాంటాక్ట్ చాట్కు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన వాట్సాప్ల్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ విజయవంతమైతే అందరికీ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ ట్రాకర్ బెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: పండుగ వేళ ఆకాశంలో అద్భుతం...! అసలు విషయం తెలిస్తే షాకవుతారు..! -
వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక..! ఈ ఎమోజీ పంపితే 20 లక్షల జరిమానా..!
Warning for Whatsapp Users: వాట్సాప్ యూజర్లకు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి వాట్సాప్ చాట్స్లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని అక్కడి ప్రభుత్వం యూజర్లను హెచ్చరించింది. ఒక వేళ రెడ్ హార్ట్ ఏమోజీలను పంపితే రూ.20 లక్షల జరిమానాతో పాటు రెండు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. . వేధింపులతో సమానంగా... గల్ఫ్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం... వాట్సాప్ చాట్స్లో 'రెడ్ హార్ట్' ఎమోజీలు పంపించడం వేధింపులతో సమానమైన నేరంగా పరిగణించబడుతుందని యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ తెలిపారు. వాట్సాప్లో కొన్ని రకాల ఇమేజెస్, ఎక్స్ప్రెషన్స్ను పంపించడం వేధింపుల నేరమవుతుందని ఆయన పేర్కొన్నారు. యూజర్లు ఇతరులకు రెడ్ హార్ట్ ఎమోజి మెసేజ్లను పంపితే వారు తీవ్రంగా భావిస్తే కేసు నమోదు చేస్తే చిక్కుల్లో పడక తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా వాట్సాప్ యూజర్స్.. ఎదుటివాళ్ల అంగీకారం లేనిదే వారితో చాట్ చేయడం నేరం. వారిని ఇబ్బందిపెట్టే రీతిలో చాట్లో సంభాషణలు జరపవద్దన్నారు. ముఖ్యంగా రెడ్ హార్ట్ ఎమోజీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సౌదీ అరేబియాలో వేధింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి చేతల ద్వారా లేదా మాటల ద్వారా భంగం కలిగించేలా వ్యవహరిస్తే దాన్ని వేధింపుల కింద పరిగణిస్తారు. అక్కడి ఆచార సాంప్రదాయాల ప్రకారం వాట్సాప్లో రెడ్ హార్ట్ లేదా రెడ్ రోజెస్ వంటి ఎమోజీలను పంపించడం తమ గౌరవానికి భంగంగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో నేరం రుజువైతే దోషికి 1లక్ష సౌదీ రియల్స్ను జరిమానాగా విధిస్తారు. ఒకవేళ ఇదే నేరంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు దోషిగా తేలితే 3లక్షల సౌదీ రియల్స్ను జరిమానాగా విధించడంతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. -
6జీబీ ర్యామ్, పవర్ఫుల్ బ్యాటరీతో అతి తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్..!
చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ టెక్నో మొబైల్స్ భారత్లో మరింత విస్తరించేందుకు సరికొత్త స్మార్ట్ఫోన్స్ను రిలీజ్ చేయనుంది. టెక్నో స్పార్క్ సిరీస్లో భాగంగా త్వరలోనే మరో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ ఫిబ్రవరి చివరి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్తో అతి తక్కువ ధరలో..! టెక్నో మొబైల్స్ అతి తక్కువ ధరలోనే మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్ఫోన్ 6జీబీ ర్యామ్తో, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. టెక్నో స్పార్క్ సిరీస్లో భాగంగా లాంచ్ అయ్యే స్మార్ట్ఫోన్ రూ. 8000 కంటే తక్కువ ధరలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్లో అందుబాటులో ఉండనుంది. ఈ ఏడాదిలో టెక్నో మొబైల్స్ భారత్లో పదుల సంఖ్యలో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. Tecno Pova 5G ఫిబ్రవరి 8న లాంచ్ చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC ప్రాసెసర్ 8GB RAMతో జత చేయబడింది. Tecno Pova 5G 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉంది. చదవండి: రూ.14వేలకే యాపిల్ ఐఫోన్!! ఇక మీదే ఆలస్యం! -
ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంక్! ఒకేసారి 5 వేల ఫోన్స్ ఇట్టే ఛార్జ్..!
మన నిత్యజీవితంలో స్మార్ట్ఫోన్స్ ఒక భాగమైపోయాయి. స్మార్ట్ఫోన్స్ లేనిదే రోజు గడువదనే ఛంధంగా తయారైంది పరిస్థితి..! ఇక ఎక్కువ సేపు స్మార్ట్ఫోన్తో గడిపే వారు పవర్ బ్యాంకును కూడా తమతో క్యారీ చేస్తుంటారు. పవర్బ్యాంకులకు కూడా భారీ మార్కెట్ ఉంది. ఇప్పటి వరకు మార్కెట్లో 80 వేల నుంచి 1000 mAh పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అయితే చైనాకు చెందిన హ్యాండ్ గెంగ్ అనే యూట్యూబర్ ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంకును కనిపెట్టి అందరితో ఔరా..అనిపిస్తున్నాడు. ఒకే సారి 5 వేల ఫోన్లకు..! హ్యాండ్ గెంగ్ తయారుచేసిన పవర్బ్యాంకు 27,000,000mAh సామర్థ్యాన్ని కల్గి ఉంది. దీంతో ఏకంగా 5 వేల స్మార్ట్ఫోన్స్ను ఛార్జింగ్ చేయవచ్చునని ఈ యూట్యూబర్ తెలిపాడు. ఈ పవర్బ్యాంక్ను గెంగ్కున్న వెల్డింగ్ స్కిల్స్ తో ఎంఐ పవర్బ్యాంకు తరహలో అతి పెద్ద పవర్బ్యాంకును తయారు చేశాడు. దీని లోపల మిడ్ సైజ్ డ్ ఎలక్ట్రిక్ కార్ కు సరిపోయే కెపాసిటీ బ్యాటరీలను ఏర్పాటు చేశాడు. దాంతో పాటుగా 60 పవర్ సాకెట్లను అమర్చారు. స్మార్ట్ఫోన్స్ ఛార్జింగ్ ఒక్కటే కాదు..! గెంగ్ తయారుచేసిన పవర్బ్యాంకుతో నేరుగా మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఇతర పవర్ బ్యాంకులకు కూడా ఛార్జింగ్ ఎక్కించుకునే విధంగా తయారు చేశాడు. స్మార్ట్ఫోన్సే కాకుండా టీవీ, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ కుకర్ను కూడా నడపవచ్చునని తెలిపాడు గెంగ్. చదవండి: వచ్చింది మూడేళ్లే..! 84 ఏళ్ల కంపెనీకి గట్టిషాకిచ్చిన రియల్మీ..! -
ఈ కంప్యూటర్ ధర కేవలం రూ. 1000 మాత్రమే..!
సాధారణంగా ఒక డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ధర ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తాం..? సుమారు రూ. 15 వేల నుంచి 50 వేల వరకు ఉండే అవకాశం ఉంది. సదరు డెస్క్టాప్, ల్యాప్టాప్ కాన్ఫీగరేషన్ బట్టి ధర మారుతూ ఉంటుంది. కాగా బ్రియాన్ బెంచాఫ్ అనే ఒక డెవలపర్ కేవలం 15 డాలర్లకే(సుమారు రూ. 1000) (Minimum Viable Computer) కంప్యూటర్ను తయారు చేసి అందరితో ఔరా..! అన్పిస్తున్నాడు...అసలు ఈ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది..ఇతర విషయాల గురించి తెలుసుకుందాం..! స్మార్ట్ఫోన్ సైజులో..! బ్రియాన్ తయారుచేసిన మినీ పాకెట్ సైజ్ కంప్యూటర్ ఇంచుమించు స్మార్ట్ఫోన్ సైజులో ఉంటుంది. ఇది ఒక Linux ఆపరేటింగ్ సిస్టమ్. దీనిలోని ఆల్విన్నర్ F1C100s సిస్టమ్-ఆన్-ఎ-చిప్తో అనుసంధానించబడిన సాధారణ రెండు-పొరల పవర్ కంట్రోల్ బోర్డ్ను (పీసీబీ)ను ఉపయోగించారు. అంతేకాకుండా సింగిల్ CPU కోర్ కేవలం 533MHz వద్ద క్లాక్ చేయబడింది. విశేషమేమిటంటే Linux కు చెందిన ఆధునిక సంస్కరణలను అమలు చేయడానికి మద్దతును కలిగి ఉంది. ఇది స్క్రిప్ట్లను, పింగ్ రిమోట్ సర్వర్లను అమలు చేయగలదు. వివిధ రకాల USB పరికరాలతో ఆపరేట్ చేయవచ్చును. ఫీచర్స్లో కంప్యూటర్స్తో సమానంగా..! బ్రియాన్ తయారుచేసిన ఈ లైనక్స్ కంప్యూటర్లో సాధారణ కంప్యూటర్లో ఉండే ఫీచర్స్ అన్ని ఉన్నాయి. 2.3-అంగుళాల డిస్ప్లేతో స్ప్లిట్ ఐదు-వరుసల ఆర్తోగోనల్ కీబోర్డ్ను కలిగి ఉంది. ఈ కంప్యూటర్ స్క్రీన్ 240 x 320 రిజల్యూషన్ను కలిగి ఉంది అంతేకాకుండా ఇది టచ్ను కూడా సపోర్ట్ చేయనుంది. దీనిలో AAA NiMH సెల్ను అమర్చాడు. ఇతర పెరిఫెరల్స్ కోసం ప్రామాణిక USB-A పోర్ట్ ఉంది. Wi-Fi అడాప్టర్, కీబోర్డ్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కోసం యుటిలిటీ మద్దతు ఇచ్చే ఏదైనా ప్లగ్ ఇన్ చేయవచ్చు. అయితే, పరికరాన్ని ఛార్జ్ చేయడానికి USB-C పోర్ట్ను ఉపయోగించాలి. ఈ కంప్యూటర్ను తయారుచేయడానికి బ్రియాన్ కేవలం 14.16 డాలర్లను మాత్రమే ఖర్చు చేశాడు. ఈ ప్రాజెక్టును రియాలిటీగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నానని ట్విటర్లో పేర్కొన్నాడు. ఇతరుల సహాయంతో దీనిని మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని బ్రియాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. I designed the 'minimum viable computer', a full Linux computer that fits in your pocket. It costs $15.https://t.co/P7F3Re1mGw If you'd like to see more of this, please like, retweet, and share the above link in whatever forum or aggregator you frequent. pic.twitter.com/XzBSULz3El — VT-69 (@ViolenceWorks) January 26, 2022 చదవండి: మాస్కున్న ఫోన్ అన్లాక్ చేయవచ్చు..కేవలం వారికి మాత్రమే..! -
మాస్క్ ఉన్న చల్తా... వారి ఫోన్ ఇట్టే అన్లాక్..!
కోవిడ్-19 రాకతో మాస్క్ ప్రతి ఒక్కరికి మస్ట్ అనే విధంగా తయారైంది. సరైన మాస్క్ను ధరించడంతోనే కరోనా వైరస్ నుంచి తప్పించుకోవచ్చునని ఇప్పటికే శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతో మంది సూచించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మనలో కొంతమందికి మాస్క్ కొంత చిరాకును కూడా తెచ్చి పెట్టే ఉంటుంది. స్మార్ట్ఫోన్ యూజర్లకు మరీను..! ఫేస్ అన్ లాక్ ఫీచర్ కల్గిన స్మార్ట్ఫోన్లలో కచ్చితంగా మాస్క్ను తీసే ఫోన్ అన్ లాక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫోన్ పాస్వర్డ్ను టైప్ చేసి అన్లాక్ చేయాలి. ఫేస్ ఐడి అన్లాక్ కల్గిన ఫీచర్ మాత్రం నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది. అయితే మాస్క్ ఉన్న కూడా ఫోన్ అన్ లాక్ చేసే ఫీచర్ను త్వరలోనే యాపిల్ తన యూజర్లకు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ వెర్షన్లో..! యాపిల్ తమ iOS Beta (iOS 15.4) బీటా వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. దాంతో పాటుగా iPadOS 15.4, macOS 12.3 వెర్షన్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫేస్ ఐడీ అన్లాక్ ఫీచర్తో మాస్క్ ధరించిన ఫోన్లను లాక్చేయవచ్చును. ఈ సరికొత్త ఫీచర్ వెంటనే పొందాలంటే ప్రస్తుత ఐవోఎస్ వెర్షన్ నుంచి ఐవోఎస్ 15.4 వెర్షన్కు అప్గ్రేడ్ కావాల్సి ఉంటుంది. మాస్క్ ఒక్కటే కాదు..! గతంలో ఐఫోన్లను పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్, యాపిల్ వాచ్ను ఉపయోగించి సదరు స్మార్ట్ఫోన్ను అన్లాక్ చేసేది. లేటెస్ట్ వెర్షన్ సహాయంతో ఇకపై పాస్వర్డ్, యాపిల్ వాచ్ అవసరం లేకుండానే సులభంగా యాపిల్ డివైజ్ అన్ లాక్ చేయవచ్చు. మాస్క్ ధరించి ఉండగానే ఫోన్ అన్ లాక్ అవుతోంది. మాస్కే కాకుండా ఐఫోన్ వినియోగదారులు గ్లాసెస్ ధరించినప్పుడు కూడా ఫేస్ ఐడిని యాక్సెస్ చేయవచ్చు. నాలుగు విభిన్న రకాల గ్లాసెస్తో ఐఫోను లాక్ చేసే అవకాశాన్ని యాపిల్ తన యూజర్లకు కల్పించనుంది. 'యూజ్ ఫేస్ ఐడి విత్ ఎ మాస్క్' సెట్టింగ్ సహాయంతో ఈ ఫీచర్ను పొందవచ్చును. ఐఫోన్ X , తరువాతి మోడల్లలో ఫేస్ ఐడి అందుబాటులో ఉన్నప్పటికీ, ఫేస్ ఐడిని మాస్క్తో ఉపయోగించే ఫీచర్ ఐఫోన్ 12 , ఐఫోన్ కొత్త వెర్షన్ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ పరిమితం కానుంది. చదవండి: ఐఫోన్లో మరో అదిరిపోయే ఫీచర్..! -
బహుశా..! ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ ఇదేనేమో..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం లెనోవో త్వరలోనే భారీ ర్యామ్ స్టోరేజ్తో పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లెనోవో Legion Y90 గేమింగ్ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకు వచ్చినా స్మార్ట్ఫోన్స్లో లెనోవో Legion Y90 ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ గేమింగ్ స్మార్ట్ఫోన్గా నిలిచే అవకాశంలేకపోలేదని స్మార్ట్ఫోన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పవర్ఫుల్ ర్యామ్..ఏకంగా 22జీబీ..! లెనోవో Legion Y90 స్మార్ట్ఫోన్ క్వాలకం స్నాప్డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో రానుంది. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ విబోలో వైరల్గా మారాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో లెనోవో Legion Y90 స్మార్ట్ఫోన్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ 22GB RAMతో రానుంది. ఈ ర్యామ్ 18GB ఫిజికల్ ర్యామ్తో పాటు 4GB వర్చువల్ ర్యామ్ను కలిగి ఉండనుంది. 512GB +128GB రెండు విభిన్న ఇంటర్నల్ స్టోరేజ్తో మొత్తంగా 640 జీబీతో లెనోవో లీజియన్ Y90 రానుంది. Lenovo Legion Y90 స్పెసిఫికేషన్(అంచనా) 6.92-అంగుళాల E4 శాంసంగ్ AMOLED డిస్ప్లే క్వాలకం స్నాప్డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ 22 జీబీ ర్యామ్+ 640 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 64ఎంపీ+16ఎంపీ రియర్ కెమెరా 44-ఎంపీ సెల్ఫీ కెమెరా ఫ్రాస్ట్ బ్లేడ్ 3.0 డ్యూయల్ ఫ్యాన్స్ ఫర్ కూలింగ్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ 5,600mAh బ్యాటరీ చదవండి: షార్ట్ఫిల్మ్ మేకర్లకు నెట్ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్న్యూస్..! -
ఒమిక్రాన్ ఎఫెక్ట్..! మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం..! గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే...
ప్రపంచదేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ దెబ్బకు కేసులు గణనీయంగా పెరగడంతో ఆయా దేశాలు లాక్ డౌన్ను విధించే ఆలోచనలో ఉన్నాయి. కాగా ఒమిక్రాన్ ప్రభావం దిగ్గజ టెక్ కంపెనీలపై కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే..! 2022 జనవరి అమెరికా లాస్వెగాస్లో జరిగే టెక్ కాన్ఫరెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ ఇప్పటికే పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. వారి బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా పయనిస్తోంది. సీఈఎస్-2022 షోలో పాల్గొనట్లేదని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా తాత్కలికంగా టెక్ కాన్ఫరెన్స్ను వాయిదా వేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. లాస్ వెగాస్లో జనవరి 5,6,7,8 తేదీల్లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జరగనుంది. 40కు పైగా కంపెనీలు లెనొవొ, టీ-మొబైల్స్, ఏటీ అండ్ టీ, మెటా, ట్విటర్, అమెజాన్, టిక్టాక్, పింట్రెస్ట్, ఆల్ఫాబెట్కు చెందిన వేమో వంటి 40కి పైగా బడా టెక్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ సదస్సుకు హాజరు కావాల్సి ఉండగా....వీరు కూడా సీఈఎస్-2022 షోలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ షోలో సుమారు 2200 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు పాల్గొనున్నాయి. అంతర్జాతీయ సదస్సులు వాయిదా..! అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇప్పటికే తెలిపింది.కాగా మరోవైపు ఒమిక్రాన్ అలజడితో జెనీవాలో జరగాల్సిన డబ్య్లూటీవో మినిస్టీరియల్ (ఎంసీ12) కూడా వాయిదా పడింది. చదవండి: చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..! -
అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్: స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న టాప్ డీల్స్ ఇవే..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్ను ప్రారంభించింది. స్మార్ట్ఫోన్స్, స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ 9ఏ, రెడ్మీ నోట్ 10ఎస్, షావోమీ 11 లైట్ ఎన్ఈ 5G, శాంసంగ్ గెలాక్సీ ఎమ్ సిరీస్ స్మార్ట్ఫోన్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ, రియల్మీ నార్జో 50ఏ, వన్ప్లస్ నార్డ్ సీఈ వంటి స్మార్ట్ఫోన్స్తో పాటుగా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై కొనుగోలుదారులు 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఆయా స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై బ్యాంకు ఆఫర్లను కూడా అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై అదనంగా రూ. 1,500 వరకు తగ్గింపు రానుంది. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ప్రైమ్ మెంబర్స్కు 6-నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్, అదనంగా 3 నెలల నో కాస్ట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న టాప్ డీల్స్ ఇవే..! ► వన్ప్లస్ నార్డ్ 2 5G 8జీబీ ర్యామ్ వేరియంట్ రూ. 29,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై కొనుగోలుదారులు రూ. 2000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్పై పాత స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా బోనస్గా రూ. 16,950 వరకు అమెజాన్ అందిస్తోంది. ► వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ రూ. 24,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై కొనుగోలుదారులు రూ.1500 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్పై రూ. 16,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అమెజాన్ అందిస్తోంది. ► రెడ్మీ నోట్ 10ఎస్ రూ. 14,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై కస్టమర్లు రూ. 1000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 13,950 వరకు తగ్గింపు కూడా రానుంది. ► షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్ఫోన్ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్లతో కొనుగోలు చేస్తే రూ. 2,500 తక్షణ తగ్గింపు రానుంది. దీంతో రూ. 24,500కు ఈ స్మార్ట్ఫోన్ను పొందవచ్చును. స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ. 19,950 కూడా రానుంది. చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..! -
వన్ప్లస్ 9 సిరీస్ నుంచి మరో స్మార్ట్ఫోన్..లాంచ్ ఎప్పుడంటే...!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ త్వరలో 9 సిరీస్లో భాగంగా మరో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వన్ప్లస్ 9ఆర్టీ స్మార్ట్ఫోన్ను కంపెనీ రిలీజ్చేయనుంది. వన్ప్లస్ 9ఆర్కు అప్గ్రేడ్గా వన్ప్లస్ 9ఆర్టీ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. వన్ప్లస్ 9ఆర్టీ స్మార్ట్ఫోన్ అక్టోబర్ 13 న చైనాలో లాంచ్ చేయనుంది. అదే రోజున భారత మార్కెట్లలోకి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్తో పాటు వన్ప్లస్ బడ్స్ జెడ్2 లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ. 23 వేల నుంచి 34 వేల మధ్యలో ఉండనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లేఖలో సంచలన విషయాలు? వన్ప్లస్ 9ఆర్టీ ఫీచర్స్(అంచనా) 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే విత్ 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ క్వాలకమ్ స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ 50+16+2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 11 బ్యాటరీ 4500ఎమ్ఏహెచ్ ఫ్లాష్ చార్జ్ చదవండి: స్పేస్ఎక్స్ ఓ సంచలనం..! 75 లక్షల కోట్లతో..! -
యూజర్ల కోసం రూ. 95 వేల కోట్లను ఖర్చు చేసిన ఫేస్బుక్...!
ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్బుక్పై గత కొన్ని రోజుల క్రితం వాల్స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..! వాల్ స్ట్రీట్జర్నల్ నివేదికను తప్పుబడుతూ ఫేస్బుక్ ఘాటుగా సమాధానమిస్తోంది. కొంత మంది వ్యక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫేస్బుక్పై వాల్స్ట్రీట్ జర్నల్ చేసిన ఆరోపణలను కంపెనీ తిప్పికొట్టింది. ప్రతి యూజర్ను తమ దృష్టిలో ముఖ్యమైన వ్యక్తిగానే భావిస్తామని ఫేస్బుక్ పేర్కొంది. చదవండి: అదానీ, అవన్ని వదంతులేనా? ఆ టీవీని అమ్మడం లేదట! యూజర్ భద్రతను దృష్టిలో ఉంచుకొని 2016 నుంచి సుమారు 13 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 95, 830 కోట్లు) ఖర్చు చేసిందని ఫేస్బుక్ వెల్లడించింది. యూజర్ల సెక్యూరిటీ కోసం పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్య పదివేల నుంచి..40 వేల వరకు పెరిగిందని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి సుమారు 3 బిలియన్ల నకిలీ ఫేస్బుక్ ఖాతాలను తీసేసినట్లు తెలిపింది. కోవిడ్-19 సమయంలో ఫేక్ సమాచారాన్ని ఎక్కువగా సర్క్యూలేట్ అవ్వకుండా చూశామని ఫేస్బుక్ వెల్లడించింది. సుమారు 20 మిలియన్ల తప్పడు వార్తలను అరికట్టామని ఫేస్బుక్ తెలిపింది. ఇమేజ్-షేరింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ద్వేషపూరిత ప్రసంగాలను, ప్రమాణాలను ఉల్లంఘించిన కంటెంట్ను గతంలో కంటే15 రెట్లు ఎక్కువగా తొలగిస్తున్నామని పేర్కొంది. చదవండి: New York Times Report: వివాదాల నుంచి రిలాక్స్ అవ్వడానికే సర్ఫింగ్ చేస్తున్నారా!: -
వాట్సాప్లో కొత్త ఫీచర్..! యూజర్లకు కాస్త ఊరట..!
ప్రముఖ సోషల్ మెసేజింగ్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తీసురానుంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్ను తిరిగి యూజర్లకు అందుబాటులో రానుంది. చివరిసారిగా వాట్సాప్ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్సీన్ సెట్టింగ్లో అప్డేట్ను తీసుకురానుంది. లాస్ట్సీన్ ఆప్షన్ ద్వారా యూజర్లకు సంబంధించిన ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఆయా యూజర్ ఎప్పుడు వాడరనే విషయాన్ని రెసిపెంట్ కాంటాక్టులకు తెలియజేస్తుంది. చదవండి: WhatsApp: 'మనీ హెయిస్ట్ సీజన్ 5' ఎమోజీలొస్తున్నాయ్ లాస్ట్సీన్ ఆప్షన్ ఎవరు చూడకుండా ఉండడం కోసం ప్రైవసీ సెట్టింగ్లో ‘నోబడీ’, ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్ అప్షన్స్ను ఎంచుకోవడం ద్వారా లాస్ట్సీన్ను ఇతర యూజర్ల నుంచి నియంత్రించుకోవచ్చును. తాజాగా వాట్సాప్ లాస్ట్సీన్ సెట్టింగ్లో మరో ఆప్షన్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. లాస్ట్సీన్ సెట్టింగ్లో భాగంగా ‘మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్’ అనే ఆప్షన్ను వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంచుకున్న ఆయా కాంటాక్ట్లకు యూజర్ లాస్ట్సీన్ కన్పించదు. ప్రస్తుతం ఈ సెట్టింగ్ను వాట్సాప్ కేవలం ఐవోస్ యూజర్లకోసం పరీక్షిస్తుండగా ఈ సెట్టింగ్ను త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి వస్తోందని డబ్ల్యూఏబెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెట్టింగ్తో కొంతమంది లాస్ట్సీన్ ఆప్షన్ను పూర్తిగా ఆఫ్ చేయకుండా నచ్చిన వ్యక్తులకు కన్పించే విధంగా చేసుకోవడంతో యూజర్లకు కాస్త ఊరట కల్గనుంది. చదవండి: Microprocessor Chips: సొంత చిప్ ప్రకటనలు పాతవే.. ఇప్పటికైతే డిజైన్ వరకే? -
మీరు అనుకుంటే వాట్సాప్లో కనిపించకుండా చేయవచ్చు.!
వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్ అసలు రాజీ పడదు. వాట్సాప్ తాజాగా యూజర్ల కోసం ఫోటో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్ చాట్లో మీరు అనుకుంటే మెసేజ్లు కన్పించకుండా చేయవచ్చును. ఔను మీరు విన్నది నిజమే..! వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్లో పంపే మెసేజ్లను నిర్ధిష్ట చాట్లో కన్పించకుండా ఆయా సందేశాల కాలాన్ని మీరు నిర్ణయించవచ్చును. (చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!) వాట్సాప్ తన డిస్ఆపియర్ మెసేజ్స్ ఫీచర్ కోసం కొత్త ఆప్షన్ని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్లో భాగంగా 90 రోజుల తర్వాత ఒక నిర్దిష్ట చాట్లో ఆటోమేటిక్గా మెసేజ్లను డిలీట్ చేయడానికి యూజర్లను అనుమతిస్తుంది. అంతేకాకుండా 24 గంటల్లో మెసేజ్లు ఆటోమేటిక్గా కనుమరుగయ్యే ఆప్షన్ను కూడా వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ వాస్తవానికి గత ఏడాది నవంబర్లో డిస్ఆపియర్ మెసేజ్స్ ఫీచర్ను ప్రవేశపెట్టగా ఈ ఫీచర్లో భాగంగా యూజర్లు పంపిన మెసేజ్లు ఏడు రోజుల వ్యవధి ముగిసిన తరువాత మాత్రమే మెసేజ్లను అదృశ్యమయ్యేలా చేయడానికి వాట్సాప్ యాప్ వీలు కల్సిస్తుంది. వాట్సాప్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం బీటా వెర్షన్ 2.21.17.16 ద్వారా 90 రోజుల తర్వాత చాట్లో మెసేజ్లు కన్పించకుండా ఉండే ఫీచర్ను WABetaInfo స్క్రీన్షాట్ను షేర్ చేసింది. 90 డేస్తో పాటు 24గంటల్లో వాట్సాప్లో మెసేజ్లు కన్పించకుండా చేసే ఫీచర్ను కూడా అందుబాటులోకి తెస్తోన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఈ ఫీచర్ను గత కొన్ని నెలలుగా ఆండ్రాయిడ్, ఐఓఎస్, వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం పరిక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫీచర్లో ఒక చిన్న మెలిక ఉంది. వాట్సాప్ యూజర్ ఇతర రెసిపెంట్లకు పంపిన మెసేజ్లకు డిస్ఆప్పియర్ ఫీచర్తో మెసేజ్లు పంపినా...,రెసిపెంట్ ఆయా మెసేజ్ను వేరే ఇతర వాట్సాప్ యూజర్లకు ఫార్వర్డ్ చేస్తే మాత్రం యూజర్ పంపిన మెసేజ్ ఎప్పటికి రెసిపెంట్తోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో వాట్సాప్ తన యూజర్ల కోసం సరికొత్తగా వ్యూ వన్స్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ యూజర్లను ఎంతగానో ఆకర్షించింది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) -
ఈ వెబ్సైట్ల జోలికి పోయారో అంతే సంగతులు..!
సాక్షి, హైదరాబాద్: గత కొంతకాలంగా సైబర్ మోసాలు భారీగా పెరిగాయి. కరోనా మహామ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా వృద్ధి చెందాయి. నకిలీ యాప్స్, వెబ్సైట్ల పేరుతో ప్రజలకు సైబర్ నేరస్తులు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ఫోన్లలోకి నకిలీ వెబ్సైట్ల రూపంలో ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం కూడా నిర్థారించింది. తక్కువ ధరలకే పలు వస్తువులు వస్తాయనే లింక్లను సామాన్య ప్రజలకు సైబర్ నేరస్థులు ఎరగా వేస్తున్నారు. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు విన్నవించారు. తక్కువగా ధరలకే వస్తువులు వస్తున్నాయని చూపే వెబ్సైట్లను, ఇతర లింక్ల జోలికి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డేబెట్, అమెజాన్93.కామ్, ఈబే19.కామ్, లక్కీబాల్, EZ ప్లాన్, సన్ఫ్యాక్టరీ.ETC వంటి నకిలీ వెబ్సైట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: మొబైల్ రీచార్జ్ టారిఫ్ల పెంపు తప్పనిసరి కానుందా..!) -
వివో నుంచి మరో కొత్త ఫోన్..! ధర ఎంతంటే..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో భారత మార్కెట్లలోకి కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. వివో కంపెనీ వై సిరీస్లో భాగంగా వివో వై 53 ఎస్ స్మార్ట్ఫోన్ను రిలీజ్చేసింది. ఈ స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎం 51 వంటి స్మార్ట్ఫోన్లకు గట్టిపోటీని ఇవ్వనుంది. వివో వై53 స్మార్ట్ఫోన్ను మొదటిసారిగా వియత్నాంలో గతనెలలో లాంచ్ చేసింది. భారత్ మార్కెట్లో వివో వై53ఎస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,490గా నిర్ణయించారు. డీప్ బ్లూ, ఫెంటాస్టిక్ రెయిన్బో కలర్ వేరియంట్లలో లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్లను అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం, టాటాక్లిక్, బజాజ్ స్టోర్, వివో ఇండియా ఈ-స్టోర్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లాంచింగ్ ఆఫర్లలో భాగంగా వివోవై53 ఎస్ స్మార్ట్ఫోన్ను హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్పై కొనుగోలు చేస్తే రూ. 1500 క్యాష్బ్యాక్ రానుంది. వివో వై53ఎస్ ఫీచర్లు ఆండ్రాయిడ్ 11 ఆపరేటిండ్ సిస్టమ 6.58-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు 20: 9 యాస్పెక్ట్ రేషియో మీడియాటెక్హెలియో జీ20 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ యూఎస్బీ టైప్ సీ పోర్ట్ 64ఎమ్పీ రియర్ కెమెరా 16ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ -
Samsung: ఈ స్మార్ట్ఫోన్ ప్రి-బుక్ చేస్తే స్మార్ట్ట్యాగ్ ఉచితం...!
ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ శాంసంగ్ కస్టమర్లకు గుడ్న్యూస్ను అందించింది. కొద్ది రోజుల్లోనే శాంసంగ్ భారత మార్కెట్లోకి నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేయనుంది. కాగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లలోకి ఆగస్టు 11 న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ బుకింగ్ను నేటి (ఆగస్టు 6) నుంచి ప్రారంభం కానుంది. ఫ్రీ బుకింగ్ కోసం కస్టమర్లు రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్లలో లేదా శాంసంగ్ షాప్ యాప్లో బుక్ చేసుకోవచ్చును. ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు శాంసంగ్ ఉచితంగా శాంసంగ్ స్మార్ట్ట్యాగ్ను అందించనుంది. మార్కెట్లో శాంసంగ్ స్మార్ట్ట్యాగ్ ధర రూ. 2,699 గా ఉంది. రెండువేలతో ప్రీ బుక్ చేసుకున్న అమౌంట్ను ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసే సమయంలో అడ్జస్ట్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ధర రూ. 1,49,990గా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర సుమారు రూ. 80 వేల నుంచి రూ. 90 వేల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ధరలు నిజమైతే మునుపటి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకంటే తక్కువ ధరలు ఉండనున్నాయి. -
యూట్యూబ్ బంపర్ ఆఫర్..! వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు..!
యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకు వ్యూస్ ఆధారంగా యూట్యూబ్ డబ్బులను అందజేస్తుంది. తాజాగా కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకు మరో బంపర్ ఆఫర్ను యూట్యూబ్ ప్రకటించింది. టిక్టాక్ యాప్కు పోటీగా యూట్యూబ్ షార్ట్స్ వీడియోలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా షార్ట్ వీడియోలను తీసే వారికి కొత్తగా ప్రోత్సాహకాలను యూట్యూబ్ తన యూజర్లకు అందించనుంది. ప్రోత్సాహకాలను అందించడం కోసం యూట్యూబ్ సుమారు 100 మిలియన్ డాలర్ల ఫండ్ను ఏర్పాటు చేసింది. 2021 నుంచి 2022 మధ్య వైరలైన షార్ట్ వీడియోల కోసం యూజర్లకు రివార్డ్ అందించడంలో ఈ ఫండ్ ఉపయోగపడనుంది. యూట్యూబ్ సుమారు 100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యూజర్లకు రివార్డ్ ఇవ్వనుంది. కాగా ఈ రివార్డులను సొంతం చేసుకోవాలంటే ఒక చిన్న మెలిక పెట్టింది. షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్ను ఆధారం చేసుకొని రివార్డులను అందించనుంది. షార్ట్ వీడియో క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని యూట్యూబ్ సపరేటుగా అడుగుతోంది. ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రకారం ఆయా కంటెంట్ క్రియేటర్లు చేసిన షార్ట్ వీడియోలు వ్యూస్ విషయంలో కచ్చితంగా క్వాలిఫై అవాల్సి ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ను భారత్తోపాటుగా యుఎస్, యుకె, బ్రెజిల్, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, నైజీరియా, రష్యా , దక్షిణాఫ్రికా దేశాల్లోని కంటెంట్ క్రియేటర్లు ఈ ఫండ్ ద్వారా డబ్బు సంపాదించడానికి అర్హులు. త్వరలో ఈ పోటీని మరిన్ని దేశాలకు విస్తరించాలని యూట్యూబ్ యోచిస్తోంది. యూట్యూబ్ షార్ట్స్ ఫండ్ పొందాలంటే అర్హతలు..! యూజర్లు తమ యూట్యూబ్ ఛానెల్ నుంచి అర్హత సాధించిన షార్ట్ వీడియోను గత 180 రోజుల్లో అప్లోడ్ చేసి ఉండాలి. షార్ట్స్ వీడియో కచ్చితంగా ఒరిజినల్ కంటెంటై ఉండాలి. ఇతర వాటర్మార్క్లు లేదా లోగోలతో వీడియోలను అప్లోడ్ చేసేవారు అర్హులు కాదు. ఇతర యూట్యూబ్ ఛానళ్ల వీడియోలను అప్లోడ్ చేయకూడదు. ఈ వీడియోలు యూట్యూబ్ షార్ట్స్ ఫండ్కు అర్హత సాధించవు. యూజర్లు 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారై ఉండాలి. -
జియో కస్టమర్లకు గుడ్న్యూస్..!
జియో తన కస్టమర్లకు తీపికబురును అందించింది. జియో ఫైబర్ వినియోగదారులు ఇప్పుడు ఏలాంటి వెబ్కెమెరా లేకుండా టీవీల్లో వీడియో కాలింగ్ చేసే సదుపాయాన్ని జియో తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. 'కెమెరా ఆన్ మొబైల్' అనే కొత్త ఫీచర్తో యూజర్లు తమ టీవీల్లో వీడియో కాలింగ్ ఆప్షన్ను పొందవచ్చును. అందుకోసం జియోజాయిన్ అనే యాప్ను యూజర్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్ను జియో పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. జియోఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను వినియోగించుకునే కస్టమర్లకు జియోఫైబర్వాయిస్తో వీడియోకాలింగ్ ఆప్షన్ను ఎనెబుల్ చేయవచ్చును. కస్టమర్లు తమ మొబైల్లోని జియోజాయిన్ యాప్ ద్వారా ల్యాండ్లైన్ నంబర్లకు కూడా వాయిస్కాల్స్ చేసుకోవచ్చును. మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా యూజర్లు తమ టీవీలో వీడియో కాల్ చేయడానికి ముందుగా పది అంకెల జియో ఫైబర్ నంబర్ను జియోజాయిన్ యాప్లో నమోదు చేయాలి. జియోఫైబర్ నంబర్ను నమోదు చేసిన తర్వాత, జియో జాయిన్ యాప్ సెట్టింగ్లలో 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్తో వీడియోకాల్స్ చేసుకోవచ్చును. స్పష్టమైన వీడియో కాలింగ్ సేవల కోసం జియోఫైబర్ మోడమ్ను 5GHz Wi-Fi బ్యాండ్కి మార్చాల్సి ఉంటుంది. 2.4GHz బ్యాండ్లో కూడా వీడియో కాలింగ్ ఫీచర్ను పొందవచ్చును, కానీ వీడియో కాలింగ్లో కొంత అస్పష్టత ఉండవచ్చును. -
వాట్సాప్ గ్రూప్స్తో విసుగుచెందారా..! అయితే ఇది మీ కోసమే..!
ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్తో ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాట్సాప్ యాప్లో మనందరికీ గ్రూప్లు ఉండే ఉంటాయి. ఫ్యామిలీ గ్రూప్, స్కూల్ ఫ్రేండ్స్ గ్రూప్స్, ఆఫీస్ కోలిగ్స్ గ్రూప్ ఇలా..ఎన్నో..మనకు తెలిసిన వాళ్లతో గ్రూప్ను క్రియేట్ చేసి మన అభిప్రాయాలను ఆయా సభ్యులతో పంచుకుంటాం. వాట్సాప్ గ్రూప్లో మనకు తెలిసిన వాళ్లు యాడ్ చేస్తే పెద్ద సమస్య లేదు కానీ...మనకు తెలియకుండా వేరే ఇతర వాట్సాప్ గ్రూప్ల్లో యాడ్ చేస్తే కాస్త ఇబ్బంది కల్గుతుంది. మనలో కొంతమంది ఈ సమస్యను ఎదుర్కొన్నవాళ్లమే..! కొన్ని సార్లు వాట్సాప్ గ్రూప్లో వచ్చే మెసేజ్లతో అప్పుడప్పుడు మనలో చాలా మందికి విసుగు వస్తుంది. కాగా వాట్సాప్లోని ఒక చిన్న ట్రిక్తో తెలియని వాట్సాప్ గ్రూప్ల బెడద నుంచి తప్పించుకోవచ్చును. వాట్సాప్ గ్రూప్ల్లో ఎవరు మిమ్మల్ని యాడ్ చేయాలనే విషయాన్ని నిర్ణయించవచ్చును. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయకుండా ఉండటం కోసం ఇలా చేయండి..! మీ స్మార్ట్ఫోన్లోని వాట్సాప్ యాప్ను ఓపెన్ చేయండి. స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి. తరువాత ‘సెట్టింగ్’ పై క్లిక్ చేయండి. తరువాత ‘అకౌంట్’ ఆప్షన్ను ఎంచుకోండి. అకౌంట్పై క్లిక్ చేసిన తరువాత ‘ప్రైవసీ’ అప్షన్పై క్లిక్ చేయండి. కొద్దిగా స్క్రీన్ను పైకి స్క్రోల్ చేసి ‘గ్రూప్స్’ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. 1. ఎవ్రీవన్, 2. మై కాంటాక్ట్స్, 3. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్లు ఉంటాయి. ఎప్పుడు డిఫాల్ట్గా ‘ఎవ్రీవన్’ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లతో ఎవరు మిమ్మల్ని ఇతర వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసే విషయాన్ని నిర్ణయించవచ్చును. ఎవ్రీవన్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్ ద్వారా మిమ్మల్ని ఆయా వాట్సాప్ గ్రూప్లో ఏవరైనా యాడ్ చేయవచ్చును మై కాంటాక్ట్స్ ఆప్షన్తో మీ కాంటాక్ట్ లిస్ట్లో మీరు సేవ్ చేసిన నంబర్లకు మాత్రమే ఇతర వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడానికి యూజర్లను అనుమతిస్తుంది. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఆప్షన్ ద్వారా సదరు వ్యక్తులు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయకుండా చేయవచ్చును. మిమ్మల్ని ఎవరు ఇతర గ్రూప్ల్లో యాడ్ చేసే వారిని మీరు ఎంచుకోవచ్చును. మీకు నచ్చిన విధంగా సెట్టింగ్లను ఎంచుకోని సేవ్ చేస్తే చేయాలి. మిమ్మల్ని ఎవరు వేరే వాట్సాప్ గ్రూప్ల్లో యాడ్ చేయలేరు. -
వన్ప్లస్ నార్డ్ 2కు పోటీగా పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్ఫోన్
వన్ప్లస్ నార్డ్ 2తో పోటీపడేందుకు పోకో ఎఫ్3 జీటీని నేడు(జూలై 23) భారతదేశంలో ప్రారంభించింది. ఈ స్మార్ట్ఫోన్ కొంతమంది ఊహించలేని ధరకే తీసుకొని వచ్చింది. పోకో నుంచి ఎఫ్ సిరీస్ లో వచ్చిన రెండవ స్మార్ట్ఫోన్ "ఎఫ్3 జీటీ" దాదాపు మూడు సంవత్సరాల క్రితం లాంఛ్ చేసిన పోకో ఎఫ్1 తర్వాత వచ్చిన స్మార్ట్ఫోన్ ఇది. ఈ స్మార్ట్ఫోన్ చైనాలో ఈ సంవత్సరం ప్రారంభంలో లాంఛ్ చేసిన రెడ్ మీ కె40 గేమింగ్ ఎడిషన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్. పోకో ఎఫ్3 జీటీ మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో వస్తుంది. పోకో ఎఫ్3 జీటీ ధర భారతదేశంలో పోకో ఎఫ్3 జీటీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.26,999, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.28,999కు తీసుకొనివచ్చారు. ఇక హై ఎండ్ ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.30,999గా ఉంది. పోకో కంపెనీ అమ్మకాల విషయంలో సరికొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఈ సేల్ కి వచ్చిన మొదటి వారంలో (ఆగస్టు 2, 2021 వరకు) కొన్న వినియోగదారులకు రూ.1,000 తక్కువకు లభిస్తుంది. అలాగే, రెండవ వారంలో (ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 మధ్య) కొన్న వినియోగదారులకు ఫోన్ వాస్తవ ధర కంటే రూ.500 తక్కువకు లభిస్తుంది. ఇక తర్వాత ఒరిజినల్ ధరకు లభిస్తుంది. ప్రీ ఆర్డర్లు జూలై 24 నుంచి ప్రారంభమవుతాయి. ఫస్ట్ సేల్ జూలై 26న ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే కస్టమర్లకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ప్రిడేటర్ బ్లాక్, గన్ మెటల్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. పోకో ఎఫ్3 జీటీ ఫీచర్స్: 6.67 అంగుళాల 120హెర్ట్జ్ ఫుల్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ (యుఎఫ్ఎస్ 3.1) మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ 64 ఎంపీ మెయిన్ కెమెరా (ఎఫ్/1.65 అపెర్చర్) 08 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ (119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ) 02 ఎంపీ మాక్రో లెన్స్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5,065 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 67 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
అదిరిపోయే ఫీచర్స్తో వచ్చిన వన్ప్లస్ నార్డ్ 2
ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్ప్లస్ నార్డ్ ప్రియులకు శుభవార్త. నేడు ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్ప్లస్ తన నార్డ్ 2 5జీ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నార్డ్ 2 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు మనకు ముందే తెలిసిందే. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ఫోన్ తో పాటు వన్ప్లస్ బడ్స్ ప్రోను కూడా లాంచ్ చేసింది. మన దేశంలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా ఉంది. ఇది బ్లూ హేజ్, గ్రే సియెర్రా, గ్రీన్ వుడ్ (ఇండియా-ఎక్స్ క్లూజివ్) రంగులలో లభిస్తుంది. వన్ప్లస్ నార్డ్ 2 5జీ జూలై 28న అమెజాన్, OnePlus.in, వన్ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్లు ద్వారా ఓపెన్ సేల్ కి రానుంది. దీనిలోని ప్రధాన ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వన్ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్: 6.43-అంగుళాల 1080పీ 90హెర్ట్జ్ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11.3 ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ 12జీబీ ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ 50 ఎంపీ సోనీ ఐఎమ్ ఎక్స్766 ప్రైమరీ సెన్సార్( f/1.88 లెన్స్, ఓఐఎస్) 8 ఎంపీ సెకండరీ సెన్సార్ (f/2.25 లెన్స్, ఈఐఎస్) 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ (f/2.4 లెన్స్) 32-ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్615 కెమెరా సెన్సార్ (f/2.45 లెన్స్, ఈఐఎస్) 256జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 5జీ, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.2, యుఎస్ బీ టైప్-సీ పోర్ట్ యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 4,500 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ 65 వార్ప్ ఛార్జ్ సపోర్ట్ 189 గ్రాముల బరువు -
క్లబ్హౌజ్లో ఎంట్రీ ఇప్పుడు మరింత ఈజీ..!
గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్మీడియా యాప్ క్లబ్హౌజ్. ఈ యాప్తో ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్ తొలుత ఆపిల్ ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. క్లబ్హౌజ్ యాప్ను మార్చి 2020లో విడుదల చేశారు. క్లబ్హౌజ్కు భారీగా ప్రాచుర్యం రావడంతో దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఫేస్బుక్ కూడా ఆడియో రూపంలో సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇతర సోషల్ మీడియా యాప్స్ మాదిరిగా కాకుండా, క్లబ్హౌజ్లో చేరాలంటే కేవలం అందులో ఉన్న సభ్యులు ఆహ్వానిస్తేనే చేరే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుడు, లేదా ఇతరులు ఆహ్వానిస్తేనే తప్ప అందులో చేరే అవకాశం లేదు. ఆహ్వానం లేకుండా ఫోన్ నంబర్తో నమోదు చేసుకోవాలనుకునే వారిని వెయిటింగ్ లిస్టులో చూపిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ ప్రకారం కొత్త యూజర్లకు క్లబ్హౌజ్ అందుబాటులో వస్తోంది. తాజాగా క్లబ్హౌజ్ అధిక సంఖ్యలో యూజర్లను ఆకర్షించడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ఇన్విటేషన్ కోడ్ లేకుండా యూజర్లు ఇకపై క్లబ్హౌజ్లో జాయిన్ కావచ్చునని ఒక ప్రకటనలో పేర్కొంది. వెయిటింగ్ లీస్ట్ పద్దతిని కూడా ఎత్తి వేసింది. క్లబ్హౌజ్ లాంటి సర్వీసులను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాంలు ఇన్స్టాగ్రామ్, ట్విటర్, రెడ్డిట్, టెలిగ్రాం వంటివి తమ సొంత వర్షన్లతో యాప్ను రిలీజ్ చేయాలని భావిస్తున్నాయి. క్లబ్హౌజ్ ప్రకారం.. ప్రస్తుతం క్లబ్హౌజ్లో డేలీ రూమ్స్ సంఖ్య 50 వేల నుంచి 5 లక్షలకు పెరిగింది. అంతేకాకుండా క్లబ్ హౌజ్ టెడ్ టాక్స్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. -
ఫ్లిప్కార్ట్లో సరికొత్తగా షాపింగ్..ముందుగానే ఇంట్లో చూడొచ్చు..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించనుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీతో ఫ్లిప్కార్ట్లోని ఆయా వస్తువులను కస్టమర్లు ముందుగానే తమ ఇంట్లో చూసుకునే సౌకర్యాన్ని ఏర్పాటుచేసింది. ఈ టెక్నాలజీతో కొనుగోలుదారులకు ఆయా వస్తువులపై మరింత అనుభూతిని పొందవచ్చునని ఫ్లిప్కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్కార్ట్ కెమెరా సహాయంతో ఆయా వస్తువుల 3డీ ఇమెజ్లను ఇంట్లో చూడొచ్చును. ఈ ఫీచర్తో ఫర్నిచర్, లగేజ్, పెద్ద ఉపకరణాల కొనుగోలు విషయంలో ఉపయోగకరంగా ఉండనుంది. వస్తువులను కొనుగోలు చేసే ముందు ఫ్లిప్కార్ట్ కెమెరా సహయంతో వస్తువుల పరిమాణం నిర్ధిష్ట స్థలంలో సరిపోతుందా లేదా అనే విషయాన్నికొనుగోలుదారులు సులువుగా అర్థం చేసుకోవడానికి వీలు పడనుంది. ఫ్లిప్కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ జయంద్రన్ వేణుగోపాల్ మాట్లాడుతూ..ఫ్లిప్కార్ట్లో కస్టమర్లకు మరింత షాపింగ్ అనుభూతిని కల్పించడానికి కంపెనీ పలు చర్యలను తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్తో, కస్టమర్ల తమ ఇంట్లో ఆయా వస్తువులను ఏఆర్ టెక్నాలజీ సాయంతో ముందుగానే చూసే సౌకర్యం కల్గుతుందని తెలిపారు. దీంతో కస్టమర్లు వస్తువులను కొనుగోలు చేయడానికి మరింత సులువుకానుంది. ఫ్లిప్కార్ట్ కెమెరాను ఎలా వాడాలంటే..! మీ స్మార్ట్ఫోన్ నుంచి ఫ్లిప్కార్ట్ యాప్ను ఓపెన్ చేయండి. మీరు కొనుగోలు చేయాలనుకున్న వస్తువుల కోసం సెర్చ్ చేయండి. ఆ వస్తువుపై క్లిక్ చేయండి. ఆయా వస్తువుకు ‘వ్యూ ఇన్ యూవర్ రూమ్’ ఆప్షన్పై క్లిక్ చేయండి. కొన్ని క్షణాల తరువాత వచ్చే ఏఆర్ కెమెరాను అలో చేయండి. తరువాత మీరు ఆ వస్తువును ఉంచదల్చుకున్న ప్రాంతంలో మీకు ఆ వస్తువు 3డీ చిత్రం కెమెరాలో కన్పిస్తోంది. -
5జీ కోసం జతకట్టిన ఎయిర్టెల్, ఇంటెల్
న్యూఢిల్లీ: 5జీ నెట్వర్క్ అభివృద్ధి కోసం ఇంటెల్ తో ఎయిర్టెల్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వల్ల దేశంలో 5జీ వేగం విస్తృతంగా పెరగనుంది. 5జీ నెట్వర్క్ వల్ల ఇండస్ట్రీ 4.0, ఐఓటి(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) అప్లికేషన్లలలో, టెలి మెడిసిన్, క్లౌడ్ గేమింగ్, టెలి ఎడ్యుకేషన్, ఆగ్యుమెంటెడ్/వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయ మానిటరింగ్ వంటి వాటిలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. భారతదేశంలో మొదటి టెలికామ్ ఆపరేటర్ ఎయిర్టెల్ ప్రధాన నగరాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోందని ఐఏఎన్ఎస్ నివేదిక తెలిపింది. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. మొబైల్ ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్వర్క్ స్లైసింగ్ కోసం ఒక బలమైన పునాదిని నిర్మించడానికి ఎయిర్టెల్ నెట్వర్క్ ఇంటెల్ తాజా మూడవ తరం జియోన్ స్కేలబుల్ ప్రాసెసర్లు, ఎఫ్ పీజిఏ, ఈఏఎస్ఐసీలు, ఈథర్నెట్ 800 సిరీస్ వాడనుంది. ఓ-ఆర్ఎఎన్ నెట్వర్క్ లో భాగస్వాములైన ఎయిర్టెల్, ఇంటెల్ మేక్ ఇన్ ఇండియా 5జీ అభివృద్ధి కోసం స్థానిక భాగస్వాముల ద్వారా భారతదేశంలో ప్రపంచ స్థాయి టెలికామ్ మౌలిక సదుపాయాలను కల్పించడానికి పనిచేస్తున్నాయి. -
వాట్సాప్లో మరో సరికొత్త ఫీచర్!
కొద్దిరోజుల క్రితం కొత్తగా మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. జాయిన్ గ్రూప్ కాల్స్ పేరుతో కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ గ్రూప్ కాల్ మధ్యలో ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. సాధారణంగా మన మిత్రులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా మనం ఇతర పని చేస్తున్నపుడు వాట్సాప్ గ్రూప్ కాల్ కట్ చేస్తాం. అయితే, అలాంటి సంధర్భంలో వారు ఇంకా మాట్లాడుతుంటే మధ్యలో గ్రూప్ కాల్ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు. అందుకే, వాట్సాప్ కొత్తగా జాయిన్ గ్రూప్ కాల్స్ పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకొనివచ్చింది. మన మిత్రులు లేదా కుటుంబ సభ్యులు గ్రూప్ కాల్ చేసిన సందర్భంలో మన పాల్గొనకుండా తర్వాత ఎప్పుడైనా జాయిన్ అవ్వొచ్చు. మీరు జాయిన్ కావాలంటే గ్రూప్ కాల్ మీద టాప్ చేస్తే మీకు జాయిన్, ఇగ్నోర్ అనే రెండు బటన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు కనుక మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు మధ్యలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. దశల వారీగా ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది. -
విడుదలకు ముందే లీకైన గెలాక్సీ ఏ 22 5జీ ధర, ఫీచర్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ శామ్సంగ్ కి చెందిన గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చే నెలలో విడుదల కానుంది. కానీ, విడుదలకు కొద్ది రోజుల ముందు ఈ ఫోన్ ధర లీక్ అయింది. ఈ ఫోన్ ను రెండు ర్యామ్ వేరియెంట్లలో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిని జూన్ లో యూరోపియన్ మార్కెట్లో రూ.20,000 ధర ట్యాగ్ తో ప్రారంభించారు. శామ్సంగ్ గెలాక్సీ ఏ22 4జీ, 5జీ మోడల్స్ జూన్ లోనే లాంఛ్ చేశారు. ఎప్పుడు విడుదల అవుతుంది అనే ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడించనప్పటికీ, గెలాక్సీ ఏ22 5జీ ఆగస్టులో రావచ్చు అని సమాచారం. దీనిలో ప్రధానంగా 48 మెగా పిక్సల్ కెమెరా, 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ హైలైట్ చేయబడ్డాయి. శామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లకు భారతదేశంలో బాగా మార్కెట్ ఉంది. ఇవి బడ్జెట్, మిడ్ రేంజ్ లో ఉంటాయి. వీటి ధర 10 నుంచి 20 వేల రూపాయల మధ్య ఉంటుంది. శామ్సంగ్ భారత మార్కెట్లో గెలాక్సీ ఏ22 5జీని భారతదేశంలో రెండు మోడల్స్ లో ప్రవేశపెట్టనుంది. దీని 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.19,999గాను, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ.21,999కు తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ 22 5జీ ఫీచర్స్ 6.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ ఎల్ సీడీ డిస్ ప్లే 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు మీడియాటెక్ డిమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్ 48 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 15డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ -
చెమటతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్...!
Charging With Finger Strip: మానవ పరిణామ క్రమంలో చక్రం నుంచి మొదలైన ఆవిష్కరణలు ఎన్నో ఇతర ఆవిష్కరణలకు దారితీశాయి. తన మేధ సంపత్తితో అనేక విషయాలను జయించాడు. రాబోయే విపత్తులను తెలుసుకోవడంలో, ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని తన మునివేళ్లపై తెచ్చుకున్నాడు. రకరకాల ఆవిష్కరణలతో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాడు. మానవుడి ఆవిష్కరణలో భాగంగా చెప్పుకోదగిన ఇన్నోవేషన్ మొబైల్ ఫోన్. సాధారణంగా మొబైల్ ఫోన్లు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్య ఛార్జింగ్. ఫోన్లలో బ్యాటరీ పూర్తిగా ఐపోతే ఎందుకు పనికిరాదు. కాగా ఛార్జింగ్ సమస్యను కూడా పరిష్కరించడం కోసం సైంటిస్టులు ఇప్పటికే ప్రయత్నాలను మొదలుపెట్టారు.తాజాగా మానవ శరీరం నుంచి వెలువడే చెమటతో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ చేయవచ్చునని పరిశోధకులు నిరూపించారు. చెమటతో ఛార్జింగ్ చేసే ప్రత్యేక ఆవిష్కరణను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ఆవిష్కరించారు. పరిశోధకుల ప్రకారం.. చేతి వేళ్లకు ఒక ప్రత్యేకమైన స్ట్రిప్ను ఉంచుకోవడం ద్వారా మానవ శరీరం నుంచి వెలువడే చెమటనుపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. 10 గంటల పాటు స్ట్రిప్ను ధరించడంతో సుమారు 400 మిల్లీజౌల్స్ వరకు శక్తిని ఉత్పత్తి చేయవచ్చునని పరిశోధనలో తేలింది. ఈ శక్తితో ఒక స్మార్ట్వాచ్ 24 గంటలపాటు నడుస్తుందని తెలిపారు. అంతేకాకుండా చేతి వేళ్లకు, మొబైల్ ఫోన్ స్క్రీన్పై ప్రత్యేక ఏర్పాటుతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేయవచ్చునని సైంటిస్టులు పేర్కొన్నారు. -
ఈ ఇయర్ ఫోన్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?
ప్రముఖ జర్మన్-ఆడియో బ్రాండ్ సెన్హెయిసర్ భారతదేశంలో ఇప్పటి వరకు విడుదల చేయని అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని ప్రత్యేకంగా ప్రొఫెషనల్ డ్యాన్సర్స్, డిజే ఆపరేటర్స్ కోసం ఐఈ 900 ఇయర్ ఫోన్లను తీసుకొచ్చినట్లు పేర్కొంది. కంపెనీ ఐఈ 900లో సెన్ హీసర్ కొత్త సృజనాత్మక ఎక్స్ 3ఆర్ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. ఈ టెక్నాలజీ వల్ల స్వచ్ఛమైన, సహజ ధ్వనిని ఆస్వాదించవచ్చు. మెరుగైన స్థిరత్వం కొరకు గోల్డ్ ప్లేటెడ్ ఎమ్ ఎమ్ సీఎక్స్ కనెక్టర్లతో సహ ఫీచర్స్ తో ఈ ఇయర్ ఫోన్లు వస్తాయి. సెన్ హీసర్ ఐఈ 900 ఇయర్ ఫోన్ల ధర వచ్చేసి రూ.1,29,900. భారతదేశంలో ఇప్పటి వరకు లాంఛ్ చేసిన అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లు ఇవే. అయితే, ఈ ఇయర్ ఫోన్లను సెన్ హీసర్ వెబ్ షాప్ లో వీటిని ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద హెడ్ ఫోన్లలో కనిపించే పొందికైన, కళాఖండం లేని "సెన్హీసర్ సౌండ్"ను అందించే ఐఈ 900లో సెన్ హీసర్ తన కొత్త ఎక్స్ 3ఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ సిలికాన్ ఇయర్ అడాప్టర్లను, మూడు ఎలాస్టిక్ ఫోమ్ ఇయర్ అడాప్టర్ సెట్లను మూడు విభిన్న సైజుల్లో బండిల్ చేసింది. ఈ ఇయర్ ఫోన్ లు 7 మిమీ ట్రూ రెస్పాన్స్ ట్రాన్స్ డ్యూసర్ ని కలిగి ఉంటాయి. ఇయర్ ఫోన్ లు సింగిల్ డ్రైవర్ సిస్టమ్ తో వస్తాయి. అలాగే ఇందులో అల్యూమినియం చాసిస్ను ఉపయోగించారు. సెన్హెయిసర్ ఇప్పటికే డీజే హెడ్ఫోన్స్, హెచ్డీ 25 మానిటరింగ్ను ఇండియాలో విడుదల చేసింది. -
పోకో ఎఫ్ 3 జీటీ జూలై 23న లాంఛ్
పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్ఫోన్ జూలై 23న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కంపెనీ రాబోయే ఈ స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్లను టీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తున్నట్లు ధృవీకరించింది. చైనాలో ఏప్రిల్ లో రెడ్ మీ కె40 గేమింగ్ పేరుతో లాంచ్ చేసిన మొబైల్ కి రీబ్రాండెడ్ ఎడిషన్ గా పోకో ఎఫ్3 జీటీని తీసుకొస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోకో బ్రాండ్ కింద 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో వచ్చిన మొదటి స్మార్ట్ఫోన్ ఇదే. ఈ స్మార్ట్ఫోన్ లో "స్లిప్ స్ట్రీమ్ డిజైన్", యాంటీ ఫింగర్ ప్రింట్ మ్యాట్ ఫినిష్ ఉందని కంపెనీ పేర్కొంది. ఫ్రేమ్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అలాయ్ నుంచి తయారు చేశారు. పోకో ఎఫ్3 జీటీని మొదట మేలో ఆటపట్టించారు. 2021 క్యూ3లో తీసుకొస్తారని అప్పుడు పేర్కొన్నారు. మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పోకో ఎఫ్3 జీటీ 120హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేటు, హెచ్ డీఆర్ 10+, డీసీ డిమ్మింగ్ తో 10-బిట్ అమోల్డ్ డిస్ ప్లేను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. రెడ్ మి కె40 గేమింగ్ ఎడిషన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర చైనాలో సీఎన్ వై 1,999 (సుమారు రూ. 23,000) లాంచ్ చేశారు. -
అతి తక్కువ ధరకే క్రోమ్బుక్ ల్యాప్టాప్స్..!
తైవాన్కు చెందిన ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్ కొత్తగా క్రోమ్బుక్ ల్యాప్టాప్ మోడళ్లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఆసుస్ క్రోమ్బుక్ ఫ్లిప్ సీ214, క్రోమ్బుక్ సీ423, క్రోమ్బుక్ సీ523, క్రోమ్బుక్ సీ223 ల్యాప్టాప్ మోడళ్లను ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యంతో ఆసుస్ కంపెనీ ప్రారంభించింది. ఈ ల్యాప్టాప్ మోడళ్లు గూగుల్కు చెందిన క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్(Chrome OS)తో పనిచేయనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఆసుస్ కొత్తగా క్రోమ్బుక్లను మార్కెట్లోకి లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. యుఎస్, ఇతర ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చిన తరువాత మొదటిసారిగా భారత మార్కెట్లోకి ఆసుస్ రిలీజ్ చేసింది. ఆసుస్ క్రోమ్బుక్ సీ423, క్రోమ్బుక్ సీ523 టచ్, నాన్-టచ్ డిస్ప్లే ఎంపికలతో రానున్నాయి. ఆసుస్ క్రోమ్బుక్ ఫ్లిప్ సీ214 ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ423 నాన్ టచ్ మోడల్ ధర రూ.19,999. టచ్ మోడల్ ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ523 నాన్ టచ్ మోడల్ ధర రూ.20,999, టచ్ మోడల్ ధర రూ. 24,999. ఆసుస్ క్రోమ్బుక్ సీ223 అతి తక్కువ ధర రూ. 17,999గా నిర్ణయించింది. ఈ ల్యాప్టాప్ క్రోమ్ బుక్ మోడళ్లు జూలై 22 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉండనున్నాయి. ఆసుస్ క్రోమ్బుక్ ఫ్లిప్ సీ214 ఫీచర్లు 11.6 అంగుళాల ఆంటీగ్లేర్ టచ్ డిస్ప్లే డ్యూయల్ కోర్ ఇంటెల్ సెలెరాన్ ఎన్ 4020 ప్రాసెసర్ ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ 600 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 50Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్బుక్ సీ423 ఫీచర్లు 14 అంగుళాల టచ్ డిస్ప్లే(ఆప్షనల్) ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ 500 ఇంటెల్ సెలెరాన్ ఎన్ 3350 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్బుక్ సీ523 ఫీచర్లు 15.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఇంటెల్ సెలెరాన్ ఎన్ 3350 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇంటెల్ హెచ్డీ గ్రాఫిక్స్ 500 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్బుక్ సీ223 ఫీచర్లు 11.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఇంటెల్ సెలెరాన్ ఎన్3350 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇంటెట్ హెచ్డీ గ్రాఫిక్స్ 500 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ -
మార్కెట్లోకి నయా ఆడి ఎలక్ట్రిక్ కారు వేరియంట్లు..! ధర ఎంతంటే
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు ఆడి భారత విపణిలోకి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్లను లాంచ్ చేసింది. ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్లు ఎస్యూవీ, స్పోర్ట్బ్యాక్ అనే రెండు రకాల బాడీ స్టైల్స్తో ఆడి కస్టమర్లకు అందించనుంది. తొలిసారిగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మల్టీపుల్ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చిన లగ్జరీ కార్ల సంస్థగా ఆడి నిలిచింది. ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్లలో ఈ-ట్రోన్50, ఈ-ట్రోన్55, ఈ-ట్రోన్55 స్పోర్ట్స్ బ్యాక్ వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 71.4 kWh గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 280 కి,మీ నుంచి 340 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఆడి ఈ-ట్రోన్50 ఎక్స్షోరూమ్ ధర రూ. 99 లక్షలు, ఈ-ట్రోన్55 ఎక్స్షోరూమ్ ధర రూ. 1.1కోట్లు, ఈ-ట్రోన్55 స్పోర్ట్బ్యాక్ ఎక్స్షోరూమ్ ధర రూ. 1.2 కోట్లుగా నిర్ణయించారు. ఈ కార్లు 6.8 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుంది. గరిష్ట వేగం 190 కిలోమీటర్లుగా ఉంది. ఈ ట్రోన్ కారుని న్యూ ఏజ్ లగ్జరీ ఎస్యూవీగా ఆడి పేర్కొంటోంది. ఇందులో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియెంట్ లైటింగ్, పనోరమిక్ సన్రూఫ్ తదితర ఫీచర్ల ఉన్నాయి. మెర్సిడెజ్ బెంజ్ EQC, జాగ్వర్ ఐ పేస్ కార్లకు పోటీగా ఆడి ఈ ట్రోన్ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. -
విద్యార్థులకు బంపర్ ఆఫర్ను ప్రకటించిన అమెజాన్..!
కరోనా రాకతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల కేవలం ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు ఆన్లైన్ విద్యను అమలులోకి తెచ్చాయి. టీచర్లు విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులను బోధిస్తున్నారు. కాగా నూతన విద్యా సంవత్సరం కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు సన్నద్ధమవుతున్నారు. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు, టీచర్ల కోసం అమెజాన్ ఇండియా ‘బ్యాక్ టూ కాలేజ్’ పేరిట సేల్ను ప్రారంభించింది. బ్యాక్ టూ కాలేజ్ సేల్ జూలై 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్లో భాగంగా ల్యాప్ టాప్లు, హెడ్ఫోన్స్, స్పీకర్స్, ఇతర గాడ్జెట్స్పై 50 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఎంపిక చేయబడిన గాడ్జెట్స్పై విద్యార్థులకు ఎడ్టెక్ యాప్స్ నుంచి డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులపై ఆఫర్లను పొందవచ్చును. ల్యాప్టాప్ లేదా టాబ్లెట్ కొనుగోలు చేస్తే వేదాంతు, టాప్పర్, అవిష్కార్, ప్రోగ్రాడ్, డిజిటల్ విద్యా వంటి ఎడ్యుకేషన్ యాప్లోని ఆన్లైన్ కోర్సులపై సుమారు రూ.20,000 వరకు తగ్గింపును అందిస్తోంది. నో కాస్ట్ ఈఎమ్ఐ ద్వారా కూడా గాడ్జెట్స్ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ వీలు కల్పిస్తోంది. హెచ్పీ పెవిలియన్ కోర్ i5 11thGen ల్యాప్టాప్పై రూ. 10,000 తగ్గింపుతో రూ. 66, 940 కు అందించనుంది. ఇతర ల్యాప్టాప్ కొనుగోళ్లపై అడిషనల్ కూపన్లను అందించనుంది. -
మీ ఫోన్ పోయిందా..! వెంటనే ఇలా చేయండి..లేకపోతే..!
స్మార్ట్ ఫోన్ మన నిత్యజీవితంలో ఒక భాగమైపోయింది. పెరుగుతున్న సాంకేతికతో మన చేతుల్లోకి అన్ని రకాల సేవలను స్మార్ట్ఫోన్ అందిస్తోంది. రకరకాల యాప్లు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. స్మార్ట్ఫోన్లలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో భౌతికంగా నగదును క్యారీ చేయడం తక్కువైంది. కూరగాయల నుంచి సూది మందు వరకు ప్రతి చోట యూపీఐ సేవలను వాడుతున్నాం. మనలో చాలా మంది ప్రతి చోట నగదు లావాదేవీలను డిజిటల్ రూపంలోనే చేస్తున్నాం. ఇప్పుడు అంతా బాగానే ఉంది అనుకోండి ! ఒక వేళ మీ స్మార్ట్ ఫోన్ పోయినా, దొంగలు కొట్టేసినా అప్పుడు ఎలా...! సింపుల్గా మరో కొత్త ఫోన్ తీసుకుంటామని అనుకుంటున్నారా..! అయితే మీ బ్యాంకు ఖాతాలోని నగదును మర్చిపోవడం మంచింది. ఔను మీరు చూసింది నిజమే.. తాజాగా స్మార్ట్ఫోన్లను కొట్టేసిన దొంగలు సాంకేతికతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. మీ ఫోన్ను బ్లాక్ మార్కెట్ విక్రయించడంతో పాటు, మీ ఫోన్లో ఉన్న డిజిటల్ పేమెంట్ యాప్లనుంచి నగదును కొట్టేస్తున్నారు. అంతేకాకుండా మీ విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మీ ఫోన్ పోతే వెంటనే ఇలా చేయండి. మొబైల్ బ్యాంకింగ్ సేవలను పూర్తిగా బ్లాక్ చేయండి. మీ సిమ్ కార్డుతో రిజిస్టర్ ఐనా యూపీఐ సేవలను డియాక్టివేట్ చేయండి. మీ ఫోన్లో ఉన్న సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేయించండి. మీ నంబర్పై రిజిస్టర్ ఐనా అన్ని మొబైల్ వ్యాలెట్లను బ్లాక్ చేయండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. -
మీ పీఎఫ్ బ్యాలెన్స్ను మొబైల్ నుంచి ఇలా తెలుసుకోండి
న్యూ ఢిల్లీ: ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులువు. ఈపీఎఫ్ ఖాతాలో రిజస్టర్ ఐనా నంబర్ నుంచి మెసేజ్, మిస్డ్ కాల్ ఇస్తే చాలు క్షణాల్లో మీ ముందు పీఎఫ్ బ్యాలెన్స్ ప్రత్యక్షమవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాతో రిజిస్టర్ ఐనా మొబైల్ నంబర్ నుంచి 7738299899 లేదా 011-22901406 నంబర్లకు మెసేజ్ లేదా మిస్డ్కాల్ చేస్తే చాలు మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు కనిపిస్తోంది. ఎస్ఎంఎస్తో పీఎఫ్ బ్యాలెన్స్ను ఇలా చెక్ చేసుకోండి. ఈపీఎఫ్ సభ్యులు రిజస్టర్ ఐనా మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా వారి బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు యాక్టివ్ మోడ్లో ఉండేలా చూసుకోవాలి. తరువాత రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి ‘EPFOHO UAN LAN’ అని టైప్ చేసి 7738299899 పంపాలి. మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు మెసెజ్ రూపంలో వస్తుంది. మిస్డ్ కాల్తో పీఎఫ్ బ్యాలెన్స్ను ఇలా చెక్ చేసుకోండి. ఈపీఎఫ్ సభ్యులు ఈపీఎఫ్ సభ్యులు రిజస్టర్ ఐనా మొబైల్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో మీ పీఎఫ్ బ్యాలెన్స్ను తెలుసుకోవచ్చును. అంతేకాకుండా ఈపీఎఫ్ సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ను https://passbook.epfindia.gov.in/MemberPassBook/Loginలో లాగిన్ ద్వారా తెలుసుకోవచ్చును. దాంతో పాటుగా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ను ఉద్యోగులు తెలుసుకోవచ్చును. अब घर बैठे ही अपना #ईपीएफ बैलेंस चेक करें। इन आसान स्टेप्स का पालन करें और परेशानी मुक्त सेवा का आनंद लें।#EPFO #PF #पीएफ #ईपीएफओ #Employees #Services@PMOIndia @PIB_India @PIBHindi @MIB_India @MIB_Hindi @DDNewslive @airnewsalerts @mygovindia @_DigitalIndia @PTI_News pic.twitter.com/WU8L2Z2Sxl — EPFO (@socialepfo) July 8, 2021 -
సరికొత్తగా మహీంద్రా బొలెరో...ధర ఎంతంటే..
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా కొత్త లుక్తో మహీంద్రా బొలెరో నియోను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. బొలెరో నియో సబ్కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ మహీంద్రా టీయూవీ 300ను పోలి ఉంది. ఈ కారు ఎన్4, ఎన్8, ఎన్10, ఎన్10(ఓ) నాలుగు రకాల వేరియంట్లలో లభించనుంది. బొలెరో నియో ఎక్స్షోరూమ్ ధర రూ. 8.48 లక్షల నుంచి ప్రారంభంకానుంది. సరికొత్త బొలెరో నియో రివైజ్డ్ డీఆర్ఎల్ హెడ్ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ బంపర్, న్యూ ఫాగ్ ల్యాంప్స్తో రానుంది. కారు ఇంటీరియల్స్ విషయానికి వస్తే..టీయూవీ 300ను పోలీ ఉంటుంది. 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇనోఫో సిస్టమ్ విత్ బ్లూటూత్ను అమర్చారు. స్టీరియో మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, బ్లూ సెన్స్యాప్తో బొలెరో నియో రానుంది. బొలెరో నియో ఇంజన్ విషయానికి వస్తే..1.5-లీటర్ డీజిల్ ఇంజిన్తో, గరిష్టంగా 100పీఎస్ పవర్, 260ఎన్ఎమ్ పీక్ టార్క్ను అందిస్తోంది. టీయూవీ 300తో పోలిస్తే 20ఎన్ఎమ్ టార్క్ను తక్కువగా ఉత్పత్తి చేస్తోంది. బొలెరో నియో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేశారు. బొలెరో నియో బ్లాక్, మెజెస్టిక్ సిల్వర్, హైవే రెడ్, పెర్ల్ వైట్, డైమండ్ వైట్, రాకీ బీజ్ ఆరు రకాల కలర్ వేరియంట్లతో రానుంది. -
జులై 22న వచ్చేస్తున్న వన్ప్లస్ నార్డ్ 2.. ఫీచర్స్ ఇవే!
ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్ప్లస్ నార్డ్ ప్రియులకు శుభవార్త. జూలై 22న వన్ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తో వస్తున్నట్లు కంపెనీ అధికారిక ఇప్పటికే ధృవీకరించింది. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొస్తున్నారు. వన్ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్ పై గత కొన్ని వారాల నుంచి అనేక పుకార్లు వచ్చాయి. ఈ స్మార్ట్ఫోన్ తో పాటు వన్ప్లస్ బడ్స్ ప్రో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ.24,999 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వన్ప్లస్ నార్డ్ 2 ఫీచర్స్(అంచనా): 6.43 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ 12 జీబి ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరా -
రూ.1300కే రియల్ మీ డిజో స్టార్ ఫీచర్ ఫోన్స్
ప్రముఖ చైనా తయారీ దిగ్గజం రియల్ మీ డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 పేరుతో రెండు ఫీచర్ ఫోన్లను భారతదేశంలో లాంఛ్ చేసింది. ఈ రెండు మోడల్స్ మూడు రంగుల్లో ఒక్కొక్కటి ఒక్కో కాన్ఫిగరేషన్ లో లభిస్తున్నాయి. డిజో స్టార్ 300, డిజో స్టార్ 500 ఫీచర్ ఫోన్లు కీప్యాడ్, చిన్న డిస్ ప్లేలతో వస్తున్నాయి. డిజో అనేది రియల్ మీ సబ్ బ్రాండ్. ఇది మొదట టీడబ్ల్యూఎస్ వైర్ లెస్, నెక్ బ్యాండ్ తరహా ఇయర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు రెండు ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. డిజో స్టార్ 300 ధర రూ.1,299, డిజో స్టార్ 500 ధర రూ.1,799కు లభిస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. డిజో స్టార్ 300 ఫీచర్స్: 1.77 అంగుళాల క్యూవిజీఏ(160ఎక్స్120 పిక్సెల్స్) డిస్ ప్లే డ్యూయల్ మైక్రో సిమ్ స్లాట్ ఎస్ సీ 6531ఈ ప్రాసెసర్ 32ఎంబీ ర్యామ్, 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్(64జీబీ మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్) 0.08 ఎంపీ రిజల్యూషన్ సింగిల్ రియర్ కెమెరా 2,550 ఎమ్ఎహెచ్ బ్యాటరీ డిజో స్టార్ 500 ఫీచర్స్ 2.8 అంగుళాల క్యూవిజీఏ(320ఎక్స్240 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే డ్యూయల్ మైక్రో సిమ్ స్లాట్ ఎస్ సీ 6531ఈ ప్రాసెసర్ 32ఎంబీ ర్యామ్, 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్(64జీబీ మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్) 0.3 ఎంపీ రిజల్యూషన్ సింగిల్ రియర్ కెమెరా 1,900 ఎమ్ఎహెచ్ బ్యాటరీ -
అమెజాన్ మెగా హోమ్ మాన్సూన్ సేల్: 70 శాతం వరకు తగ్గింపు!
ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు మెగా హోమ్ మాన్సూన్ సేల్ను ప్రకటించింది. ఈ సేల్ జూలై 8 నుంచి జూలై 11 వరకు కొనసాగనుంది. గృహోపకరణాలు, కిచెన్ ఉపకరణాలతో సహా వివిధ ఉత్పత్తుల కొనుగోలుపై 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు పది శాతం, రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది. క్రెడిట్ కార్డుతో ఈఎంఐలో భాగంగా, కనీసం ఐదు వేల రూపాయల విలువ గల వస్తువుల కొనుగోలుపై సుమారు 10శాతం తక్షణ డిస్కౌంట్ను అందిస్తోంది. అమెజాన్ శాంసంగ్, ఎల్జీ, వర్ల్పూల్ వంటి సంస్థల వాషింగ్ మెషీన్లపై సుమారు 30శాతం డిస్కౌంట్ను ఇవ్వనుంది. ఎల్జీ, శామ్సంగ్, వర్ల్పూల్, హైయర్, గోద్రేజ్ వంటి సంస్థల రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై అమెజాన్ ఇండియా 35శాతం తగ్గింపును అందిస్తోంది. గీజర్ల కొనుగోలుపై 35 శాతం వరకు, వాటర్ ప్యూరిఫైయర్లపై 45 శాతం వరకు ,బేసిక్ ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై 60శాతం వరకు మినహాయింపును ఇస్తోంది. -
ఈ మాస్క్ కరోనా వైరస్ను ఇట్టే పసిగడుతుంది..!
వాషింగ్టన్: ప్రపంచాన్ని కోవిడ్-19 పూర్తిగా అతాలకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో సుమారు 40 లక్షల మంది మరణించగా, 18. 5 కోట్ల మంది కరోనా వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యారు. కాగా పలుదేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ డ్రైవ్లు మొదలైయ్యాయి. భారత్తో సహా కొన్ని దేశాలలో మూడో వేవ్ ముప్పు పొంచిఉందని పరిశోధకులు పేర్కొన్నారు. వైరస్ను గుర్తించడానికి మార్కెట్లో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మాస్క్తో వైరస్ గుర్తింపు...! కరోనా వైరస్ను గుర్తించడానికి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) , హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని వైస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్లీ ఇన్స్పైర్డ్ ఇంజనీరింగ్ పరిశోధకుల బృందం ఒక ప్రత్యేకమైన మాస్క్ను తయారుచేశారు. ఈ మాస్క్ ధరించడంతో కరోనా వైరస్ను కేవలం 90 నిమిషాల్లో పసిగట్టవచ్చునని పరిశోధన బృందం పేర్కొంది. ఈ మాస్క్ను బయోసెన్సర్ టెక్నాలజీనుపయోగించి అభివృద్ధి చేశారు. ఈ బృందం ప్రామాణిక కెఎన్95 మాస్క్కు బయోసెన్సర్లను ఏర్పాటుచేశారు. ఒక వ్యక్తి శ్వాసలో వైరస్ ఉందో లేదో అనే విషయాన్ని ఈ మాస్క్ గుర్తించనుంది. కరోనా వైరస్ను ఆర్టీపీసీఆర్ టెస్ట్ల మాదిరిగానే కచ్చితమైన రిజల్స్ట్ వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. వైస్ ఇన్స్టిట్యూట్ పరిశోధనా శాస్త్రవేత్త పీటర్ న్గుయెన్ మాట్లాడుతూ..ఈ మాస్క్తో కరోనా వైరస్ పరీక్షల వేగవంతమౌతుందని పేర్కొన్నారు. అంతేకాకుంగా కచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. -
ఫేస్బుక్లో మరొ కొత్త ఫీచర్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఫేస్బుక్ భవిష్యత్తులో మరో కొత్త ఫీచరును నెటిజన్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ట్విటర్లో ఉండే ‘థ్రెడ్’ ఫీచరును ఫేస్బుక్లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ట్విటర్లో యూజర్ పోస్ట్ చేయాలనుకున్న సందేశాన్ని కేవలం 280 క్యారక్టర్లను మాత్రమే పోస్ట్ చేయవచ్చును. మిగతా సమాచారాన్ని ముందుపెట్టిన ట్విట్కు థ్రెడ్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ఫీచరును ఫేసుబుక్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావలని చూస్తోంది. థ్రెడ్ ఫీచరును ఫేస్బుక్ టెస్టింగ్ చేస్తోంది. కొంతమంది ఫేస్బుక్ పబ్లిక్ ఫిగర్లకు అందుబాటులో ఉంచింది. దీంతో ఫలానా సమాచారానికి సంబంధించిన విషయాలను సులువుగా థ్రెడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్పై ఫేస్బుక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవారా థ్రెడ్ ఫీచర్కు సంబంధించిన స్క్రీన్ షాట్ను ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా ఫేస్బుక్ తన యూజర్లకు క్లబ్హౌజ్లాంటి సర్వీస్ను త్వరలోనే ప్రారంభించాలని చూస్తోంది. ఈ థ్రెడింగ్ ఫీచర్ భవిష్యత్తులో యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. NEW! Facebook is testing a ‘Threads’ feature h/t @valionk pic.twitter.com/yqv8PIoTcf — Matt Navarra (@MattNavarra) July 1, 2021 -
ఈ కొత్త ఆవిష్కరణతో ఇంధనం మరింత ఆదా...!
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు కొండేక్కుతున్నాయి. పెట్రోలు, డిజీల్ ధరలు పెరగడంతో సామాన్యుడి నెత్తిమీద మరింత భారంపడనుంది. సుమారు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటింది. కాగా వాహనాల్లో ఇంధన వాడకం, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి హైదరాబాద్కు చెందిన డేవిడ్ ఎష్కోల్ సరికొత్త ఆవిష్కరణ రూపొందించారు. అందుకోసం ‘5M మైలేజ్ బూస్టర్’ను ఆవిష్కరించారు. ఈ వ్యవస్థతో ఇంజిన్ నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వెహికిల్ మైలేజీను కూడా పెంచుతుంది. 5M మైలేజ్ బూస్టర్లో ముఖ్యంగా ఐదు రకాల ప్రయోజనాలను కల్పించే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ బూస్టర్ను వాహనాలకు అమర్చడంతో.. అధిక మైలేజీను, అధిక పిక్ అప్ను, స్మూత్ డ్రైవింగ్, అధిక టార్క్ను, పొందవచ్చునని డేవిడ్ తెలిపారు. తక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలను వెలువడేలా చేస్తుంది. 5M మైలేజ్ బూస్టర్ ఇంజిన్కు అమర్చనున్నారు. బైక్ సీసీ పవర్ ఆధారంగా నిర్దిష్ట సమయంలో అల్ట్రా సోనిక్ తరంగాలను, గ్యాస్ రూపంలోని ప్లాస్మాను మైలేజ్ బూస్టర్తో ఇంజిన్కు పంపిస్తారు. కాగా ఇప్పటివరకు సుమారు 8 వేల వాహనాలకు 5M మైలేజ్ బూస్టర్ను అమర్చారు. 100సీసీ నుంచి 10,000 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ లకు మైలేజ్ బూస్టర్ను ఏర్పాటుచేయవచ్చునని డేవిడ్ పేర్కొన్నారు. కాగా ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ తో జతకడితే ఈ టెక్నాలజీను సామాన్యులకు అందుబాటులో వస్తోందని డేవిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
వివో నుంచి గాల్లో ఎగిరే కెమెరా!..ఫోటోలు వైరల్!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వివో గింబల్ను అమర్చి ఉన్న కెమెరా ఫోన్ ఎక్స్ 50, ఎక్స్ 60 మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వివో నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ను త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వివో ఇంటిగ్రేట్డ్ ఫ్లయింగ్ కెమెరాతో పనిచేసే స్మార్ట్ఫోన్పై పనిచేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్ లాంటి సామర్థ్యాలను కలిగి ఉన్న స్మార్ట్ఫోన్ను వివో రూపొందించనుంది. భవిష్యత్తులో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్కు తేలికపాటి డ్రోన్ను అమర్చనున్నారు. ఈ డ్రోన్ సహయంతో ఏరియల్ ఫోటోలను, వీడియోలను తీయవచ్చును. వివో 2020 డిసెంబర్లో వరల్డ్ ఇంటలెక్ట్చువల్ ప్రాపర్టీ కార్యాలయంలో ఈ స్మార్ట్ఫోన్కు పేటెంట్ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.కాగా తాజాగా ఇప్పుడు గాల్లో తేలే కెమెరాతో ఉన్న వివో స్మార్ట్ ఫోన్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. పేటెంట్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోందని భావించడంలేదు. చాలా స్మార్ట్ఫోన్ కంపెనీలు పేటెంట్ కంపెనీ వద్ద సుమారు కొన్ని వేల స్మార్ట్ఫోన్ మోడళ్లకు పేటెంట్లు నమోదైన అందులో కేవలం కొన్ని మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయని పేటెంట్లను నమోదుచేసే సంస్థలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అంతకుముందు వివో గింబల్ సిస్టమ్ కెమెరాతో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. వివో ఎక్స్ 50 ప్రో గింబల్ వ్యవస్థను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్లో 90Hz అధిక రిఫ్రెష్ రేటుతో 6.56 అంగుళాల AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. వివో ఎక్స్ 50 ప్రో ఆండ్రాయిడ్ 10 వెర్షన్ను కలిగి ఉంది . ఈ స్మార్ట్ఫోన్ ధర భారత్లో రూ .49,990. -
ఫోన్ బ్యాటరీ లైఫ్లో సమస్యలా? ఈ 5 చిట్కాలు ఫాలో అవండి
గత కొన్ని ఏళ్లుగా స్మార్ట్ఫోన్ టెక్నాలజీలో కీలక మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రాసెసర్ల నుంచి మొదలు పెడితే హై-రిజల్యూషన్ డిస్ప్లేల వరకు ఎన్నో రకాల ఫీచర్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఇప్పటికి స్మార్ట్ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే పెద్దగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కేవలం బ్యాటరీ చార్జ్ అయ్యే వేగం, సామర్థ్యంలో మాత్రమే మార్పులు వచ్చాయి. అనేక ఏళ్లుగా ఇప్పటికి స్మార్ట్ఫోన్ యూజర్లను వేదిస్తున్న సమస్య బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం. శామ్ సంగ్ వంటి సామర్థ్యం పరంగా పెద్ద పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చిన వాడకం కూడా అదే రీతిలో పెరిగింది. అయితే, ఈ 5 చిట్కాలతో మన స్మార్ట్ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకునే వీలుంది. 1. పవర్ సేవింగ్ మోడ్ మీకు అత్యవసర సమయాల్లో మీ ఫోన్ బ్యాటరీ తొందరగా ఖాళీ కాకుండా ఉండాలంటే పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోవడం మంచిది. దీనివల్ల మీ ఫోన్ లో అనవసరంగా రన్ అయ్యే యాప్స్ ని బ్యాక్ గ్రౌండ్ లో తొలగిస్తుంది. దీంతో మీ బ్యాటరీ తొందరగా ఖాళీ కాదు. అలాగే, ఆండ్రాయిడ్ 10పై రన్ అవుతున్న ఫోన్లలో ఉండే అడాప్టివ్ పవర్ సేవింగ్ మోడ్ యాక్టివేట్ చేసుకోవాలి. దీనివల్ల మీరు ఫోన్ లో చాలా తక్కువగా వాడే యాప్స్ కు బ్యాటరీ అవసరం మేరకు మాత్రమే సరఫరా చేయబడుతుంది. 2. నెట్ వర్క్ డేటా మీ ఇంట్లో వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంటే వై-ఫై ఉపయోగించడం చాలా మంచిది. బయటకి వెళ్లిన సందర్భంలో మాత్రమే మీ మొబైల్ డేటాను ఆన్ చేసుకోవాలి. వై-ఫైతో పోలిస్తే మీ మొబైల్ డేటా ఆన్ చేసిన సమయంలోనే ఎక్కువ బ్యాటరీ డ్రెయిన్ అవుతుంది. రెండింటినీ ఆన్ చేసి ఉంచితే బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. ఫలితంగా బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే, లొకేషన్ సేవలు అవసరం లేని సమయంలో ఆఫ్ చేసుకుంటే. ముఖ్యంగా మీరు ఇంట్లో, ఆఫీస్ లో ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ చేసుకోవడం ఉత్తమం. 3. డార్క్ మోడ్ మీరు ఉపయోగించే ఫోన్లో గాని, యాప్స్ లో డార్క్ మోడ్ ఆప్షన్ ఉంటే అది ఆన్ చేసుకుంటే మంచిది. ఐఫిక్స్ ప్రకారం, డార్క్ మోడ్ ఆన్ చేయడం ద్వారా మీరు ఒక గంట బ్యాటరీ జీవితకాలాన్ని ఆదా చేయవచ్చు. అలాగే, అడాప్టివ్ బ్రైట్ నెస్ ఫీచర్ ఆన్ చేసుకోవడం వల్ల మీరు వెళ్లే ప్రదేశాన్ని బట్టి బ్యాటరీ ఆటోమెటిక్ గా నియంత్రించబడుతుంది. 4. స్క్రీన్ టైమ్ ఔట్ చాలామంది ఫోన్ ఉపయోగించిన ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత స్క్రీన్ ఆఫ్ అయ్యేలా టైమ్ సెట్ చేస్తారు. దీనివల్ల కూడా బ్యాటరీ కాలం త్వరగా అయిపోయే అవకాశం ఉంది. ఇక నుంచి మీ స్క్రీన్ టైమ్ ఔట్ను 30 సెకన్లకు తగ్గించి చూడండి. దానివల్ల బ్యాటరీ వినియోగం తగ్గిపోతుంది. 5.వాల్ పేపర్, విడ్జెట్ చాలా మంది ఎక్కువగా స్క్రీన్ మీద లైవ్ వాల్ పేపర్ పెడుతుంటారు. మీ డిస్ ప్లే వాటిని యానిమేట్ చేయడానికి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి బ్యాటరీ ఖర్చు అవుతుంది. అలాంటి సందర్భాలలో సాదారణ వాల్ పేపర్ పెట్టుకోవడం మంచిది, అలాగే విడ్జెట్ లు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి బ్యాటరీ లైఫ్ తొందరగా తగ్గిపోతుంది. చదవండి: ఫేస్బుక్ యూజర్లకు మరో షాక్.. ఈ యాప్స్ తో జర జాగ్రత్త! -
ప్రపంచంలో తొలి 20 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ మొబైల్
ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక ర్యామ్ గల స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన కంపెనీలు అసుస్, లెనోవో. ఈ రెండు కంపెనీలు మొబైల్ లో అత్యధికంగా 18 జీబీ ర్యామ్ ని తీసుకొచ్చాయి. ఇప్పుడు అంతకు మించి ర్యామ్ తో జడ్టీఈ కంపెనీ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో 20జీబీ ర్యామ్ తీసుకొస్తున్నట్లు సమాచారం. చైనా కంపెనీ జడ్టీఈ దీని గురుంచి ఎటువంటి అధికారిక సమాచారం బయటకి వెల్లడించలేదు. ఆ సంస్థలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లలో ఒకరు ఆన్ లైన్ లో దీని గురుంచి లీక్ చేశారు. 20జీబీ ర్యామ్ ఫోన్ తీసుకురావడం ద్వారా జడ్టీఈ కంపెనీ తన ప్రత్యర్థి కంపెనీలకు దక్షిణాసియా మార్కెట్లో పోటీ ఇవ్వాలని చూస్తుంది. ఈ సంవత్సరం చివరి వరకు అండర్-డిస్ ప్లే సెల్ఫీ కెమెరా ఫోన్లను తీసుకొని రావాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. జడ్టీఈ డైరెక్టర్లలో ఒకరైన లూ క్వియాన్ హావో వీబోలో కంపెనీ 20జీబీ ర్యామ్ ఫోన్ ను టీజ్ చేశారు. వచ్చే ఏడాది 1 టీబీ స్టోరేజీతో ఫోన్లు తీసుకొనిరావచ్చు అని ఎగ్జిక్యూటివ్ సూచించారు. ఖచ్చితమైన లాంఛ్ వివరాలు లేనప్పటికి భవిష్యత్తులో 20జీబీ ర్యామ్ ఫోన్ ను తీసుకురావచ్చని తెలుస్తుంది. అలాగే, అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరా కోసం పనిచేస్తున్న పెద్ద కంపెనీల్లో జడ్టీఈ ఒకటి. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల -
Redmi 10 Series: రెడ్ మీ 10 సీరీస్ వచ్చేస్తుంది!
రెడ్ మీ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. రెడ్ మీ 10 సీరీస్ త్వరలో మనదేశం లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. షియోమీ దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రెడ్ మీ 9, రెడ్ మీ 9 ప్రైమ్, రెడ్ మీ 9 పవర్, రెడ్ మీ 9ఎ, రెడ్ మీ 9ఐ లకు వారసుడిగా రెడ్ మీ 10 సీరీస్ లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. చైనా కంపెనీ నేరుగా రెడ్ మీ 10 సీరీస్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పనప్పటికి వచ్చే నెల ప్రారంభంలో సిరీస్ ను ఆవిష్కరించవచ్చని ట్వీట్ లో సూచించింది. రెడ్ మీ ఇండియా ట్విట్టర్ లో "రెడ్ మీ రివల్యూషన్" అనే చిన్న క్లిప్ ను "#10on10" అనే హ్యాష్ ట్యాగ్ తో పంచుకుంది. రెడ్ మీ 10 సీరీస్ ను జూలై ప్రారంభంలో లాంచ్ చేయవచ్చు అని ఇది సూచిస్తుంది. ఈ సిరీస్ పై ఈ ట్వీట్ తప్ప ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. రెడ్ మీ 9 సీరీస్ లో రెడ్ మీ 9 ప్రైమ్ మొబైల్ ను గత ఏడాది ఆగస్టు మొదటి వారంలో భారతదేశంలో తొలిసారిగా లాంఛ్ చేసింది. ఇలా వరుసగా ఒక్కో మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Brace yourselves for the #RedmiRevolution! 💫 Hitting your screens soon! ☄️ Watch this space for more #10on10 action. 🎥 pic.twitter.com/uFY6ri5SU2 — Redmi India - #RedmiNote10 Series (@RedmiIndia) June 28, 2021 చదవండి: లీకైన వన్ ప్లస్ నార్డ్ 2 కెమెరా, డిస్ప్లే ఫీచర్లు -
బడ్జెట్లో రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్
చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ నార్జో 30 5జీ, రియల్ మీ నార్జో 30 స్మార్ట్ఫోన్లను భారత్ లో విడుదల చేసింది. రియల్ మీ బడ్స్ క్యూ2, రియల్ మీ ఫుల్-హెచ్ డి స్మార్ట్ టీవీతో పాటు వర్చువల్ ఈవెంట్ లో రియల్ మీ ఈ రెండు ఫోన్లను లాంఛ్ చేసింది. రియల్ మీ నార్జో 30 5జీ మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ చేత పనిచేస్తే, రియల్ మీ నార్జో 30 మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్ పనిచేస్తుంది. రెండు ఫోన్ లకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. రియల్ మీ నార్జో 30 5జీ 6 జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ ధర రూ.15,999. మరోవైపు రియల్ మీ నార్జో 30 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.12,499, 6 జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ మోడల్ ధర రూ.14,499గా ఉంది. ఈ రెండు రేసింగ్ బ్లూ, రేసింగ్ సిల్వర్ రంగులలో లభిస్తాయి. నార్జో 30 5జీ మొదటి సేల్ జూన్ 30న జరుగుతుంది. అదే రోజున కొన్నవారికి రూ.500 డిస్కౌంట్(రూ.15,499) లభిస్తుంది. అలాగే, రియల్ మీ నార్జో 30 జూన్ 29న అమ్మకానికి రానుంది. మొదటి రోజు కొంటే 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ మోడల్ పై కూడా రూ.500 తగ్గింపు(రూ. 11,999 సమర్థవంతమైన ధర) లభిస్తుంది. రెండు ఫోన్ లు ఫ్లిప్ కార్ట్, రియల్ మీ.కామ్, ఆఫ్ లైన్ స్టోర్లలో లభ్యం అవుతాయి. రియల్ మీ నార్జో 30 5జీ ఫీచర్స్: 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(రియల్ మీ యుఐ 2.0) ఆక్టా కోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (ఎఫ్/1.8 అపెర్చర్) 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ (ఎఫ్/2.4 అపెర్చర్) 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ (ఎఫ్/2.4 అపెర్చర్) 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (ఎఫ్/2.1 అపెర్చర్) సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 18 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ రియల్ మీ నార్జో 30 ఫీచర్స్: 6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(రియల్ మీ యుఐ 2.0) ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్) సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 30 డబ్ల్యు డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ చదవండి: సెప్టెంబర్ 10న మార్కెట్లోకి రిలయన్స్ జియో చౌకైన స్మార్ట్ ఫోన్ -
బంపర్ ఆఫర్.. రూ.1 కే టీడబ్ల్యుఎస్ ఇయర్బడ్స్
ఈ రోజుల్లో మనకు రూ.1కే ఏమి వస్తుంది. మహా అయితే ఒక చాక్లెట్ మాత్రమే వస్తుంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా కేవలం రూ.1కే టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎక్కువగా హెడ్ ఫోన్ జాక్ తీసుకొని రాకపోవడంతో టీడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్ కు చాలా డిమాండ్ పెరిగింది. అందుకే అనేక పరిశోదనల అనంతరం ప్రోబడ్స్ను రూపొందించినట్లు లావా పేర్కొంది. కస్టమర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా, అనేక ట్రయల్స్ చేసిన తర్వాత ఈ డిజైన్ చేసినట్లు సంస్థ తెలిపింది. నిజంగానే కేవలం రూపాయికే ఇయర్బడ్స్ను లావా సంస్థ ‘ఆఫర్’ చేస్తోంది. రూపాయికే సొంతం చేసుకోవాలంటే రేపు(జూన్ 24వ తేదీ) మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే. లావా ఈ-స్టోర్ కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్లోగానీ గురువారం 12 గంటల నుంచి ఈ స్పెషల్ ఆఫర్ ప్రారంభవుతుంది. అయితే, ఇక్కడొక షరతు ఉంది. స్టాక్ అందుబాటులో ఉన్న వరకే రూపాయికి ఆఫర్ వర్తిస్తుందని లావా కంపెనీ పేర్కొంది. తర్వాత కొనుగోలు చేసే వారు రూ.2,199 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 11.6 mm అడ్వాన్స్డ్ డ్రైవర్స్, మీడియా టెక్ ఏయిరో చిప్సెట్ ఉన్నాయి. ప్రతి బడ్ లో 55 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, అలాగే కేసులో 500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ప్రోబడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ v5.0 టెక్నాలజీ సపోర్ట్ చేయడంతో పాటు 77 గ్రాముల బరువు ఉన్నాయి. చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్ -
ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు గూగుల్ శుభవార్త..!
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్కు క్రేజ్ మామూలుగా ఉండదు. సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్కు పోటి అసలు ఉండదు. ఐఫోన్ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అంతేకాకుండా ఆపిల్ ఐఫోన్ ఒక వేళ పోయినా, దొంగలించిన, తిరిగి ఫోన్ను పొందగలిగే టెక్నాలజీ ఆపిల్ సొంతం. ఐఫోన్లలోని టెక్నాలజీ రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా రానుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ఫైండ్ మై డివైజ్’ పేరిట ఉన్నప్పటికీ ఈ సదుపాయాన్ని మరింత అదనంగా కొత్త ఫీచర్లను యాడ్ చేయాలని గూగుల్ భావిస్తోంది. ‘ఫైండ్ మై నెట్వర్క్’ పేరిట ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ తీసుకురానుంది. గూగుల్ ‘ఫైండ్ మై డివైజ్’తో మొబైల్ ఫోన్ను ట్రాక్ చేయవచ్చును. ఫైండ్ మై డివైజ్లో మెయిల్ ఐడీ, పాస్వర్ఢ్తో లాగిన్ అయితే మొబైల్ ఉన్న లోకేషన్ చూపిస్తోంది. ఇది కేవలం పోయిన మొబైల్కు నెట్వర్క్ కనెక్టివీటీ, ఇంటర్నెట్ ఆన్ , జీపీఎస్ కనెక్షన్ ఆన్లో ఉంటేనే మొబైల్ను ట్రాక్ చేయగలము. కాగా ఆపిల్ తన ఐవోస్ 13లో భాగంగా ఫైండ్ మై డివైజ్కు అదనపు ఫీచర్లను జోడించి ఆపిల్ కొత్త సర్వీస్ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఐఫోన్లు, ఐపాడ్, ఆపిల్ తెచ్చిన ఎయిర్టాగ్స్తో గుర్తించవచ్చును. కాగా ప్రస్తుతం గూగుల్ ఫైండ్ మై నెట్వర్క్ ఫీచర్ను ప్రస్తుతం బీటా వర్షన్లో టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ఏవిధంగా పనిచేస్తోందని గూగూల్ టెస్ట్లను నిర్వహిస్తుంది. ఈ ఫీచర్తో సుమారు 3 బిలియన్ల ఆండ్రాయిడ్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఆపిల్లో ఫైండ్ మై డివైజ్ ఎలా పనిచేస్తుంది..? సాధారణంగా ఆపిల్ ఐఫోన్లలో ఫైండ్ మై డివైజ్ ఉన్న ఫీచర్లో ముందుగానే లాస్ట్ మై డివైజ్ ఆన్లో ఉండేలా చూసుకోవాలి. లాస్ట్ మై డివైజ్లో స్నేహితుల, లేదా ఇతర ఫోన్ నంబర్ను కచ్చితంగా ఎంటర్ చేయాలి. లాస్ట్ డివైజ్ సహకారంతో పోయినా మొబైల్ వేరేవారికి దొరికినా, లేదా దొంగిలించినా ఆ మొబైల్ స్విచ్చ్ ఆన్ చేయగానే మొబైల్ ఫోన్ లోకేషన్, మీరు ఇచ్చిన మొబైల్ నంబర్కు ఫోన్ లోకేషన్ వస్తోంది. అంతేకాకుండా ఈ ఆప్షన్తో మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే మన ఫోన్ నంబర్ కనిపించేలా ఓ మెసేజ్ను చూపిస్తోంది. దీన్ని ముందుగానే లాస్ట్ మై డివైజ్లో ఎంటర్ చేస్తేనే కనిపిస్తోంది. చదవండి: ఆండ్రాయిడ్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆపిల్ సీఈవో..! -
Xiaomi : స్మార్ట్వాచ్పై భారీ తగ్గింపు..!
ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి కీలక ప్రకటన చేసింది. తాజాగా షావోమి జూన్ 22న, ఎంఐ 11లైట్ స్మార్ట్ఫోన్తోపాటుగా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ స్మార్ట్ వాచ్ను భారత్లో లాంచ్ చేయనుంది. అంతకుముందు గత ఏడాది సెప్టెంబర్లో ప్రారంభించిన ఎంఐ రివాల్వ్కు తదనంతర వాచ్గా ఎంఐ రివాల్వ్ యాక్టివ్ ఉండనుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎంఐ రివాల్వ్ స్మార్ట్వాచ్పై భారీ తగ్గింపును ప్రకటించింది. షావోమి ఎంఐ రివాల్వ్ స్మార్ట్వాచ్పై సుమారు రూ.2,000 వరకు స్మార్వాచ్ ధరను తగ్గించింది. తొలుత ఎంఐ రివాల్వ్ స్మార్ట్వాచ్ ధర రూ. 10, 999 ప్రకటించగా, కొన్ని రోజుల్లోనే రూ. 1000 తగ్గించి చివరగా రూ. 9,999 ధరగా ఫిక్స్ చేసింది. కాగా ప్రస్తుతం షావోమి ప్రకటనతో ఎంఐ రివాల్వ్ స్మార్ట్వాచ్ రూ. 7,999 కు లభించనుంది. ఎంఐ రివాల్వ్ స్మార్ట్ వాచ్ను షావోమి వెబ్సైట్, అమెజాన్ ఇండియా నుంచి పొందవచ్చును. ఈ వాచ్ మిడ్నైట్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ వేరియంట్లలో లభిస్తోంది. చదవండి: షియోమీ నుంచి మరో సరికొత్త ఒఎల్ఈడీ టీవి -
బడ్జెట్ లో కిల్లర్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన శామ్సాంగ్
ప్రముఖ ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ సంస్థ శామ్సాంగ్ మార్కెట్లోకి బడ్జెట్ లో మరో కిల్లర్ మొబైల్ తీసుకొనివచ్చింది. గత ఏడాది తీసుకొచ్చిన గెలాక్సీ ఎమ్31 కొనసాగింపుగా ఈ ఏడాది గెలాక్సీ ఎమ్32ను నేడు(జూన్ 21) లాంచ్ చేసింది. ఈ కొత్త శామ్సాంగ్ ఫోన్ 90హెర్ట్జ్ అమోల్డ్ డిస్ ప్లే, 6,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. శామ్సాంగ్ గెలాక్సీ ఎమ్32లో మీడియాటెక్ హీలియో జీ80 ఎస్ వోసి ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ రియర్ కెమెరాలతో వస్తుంది. మూవీలు, గేమ్స్, సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసినట్లు సంస్థ ప్రతినిదులు పేర్కొన్నారు. గెలాక్సీ ఎమ్32 రెడ్ మి నోట్ 10ఎస్, పోకో ఎం3 ప్రో, రియల్ మీ 8 5జీ వంటి వాటితో పోటీపడనుంది. భారతదేశంలో శామ్సాంగ్ గెలాక్సీ ఎమ్32 4జీబీ + 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,999గా ఉంటే, 6జీబీ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.16,999గా ఉంది. ఇది బ్లాక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్ ల్లో లభిస్తుంది. దేశవ్యాప్తంగా అమెజాన్, శామ్ సంగ్ ఇండియా ఆన్ లైన్ స్టోర్, కీలక రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు రానుంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం జూన్ 28 నుంచి అమ్మకం ప్రారంభమవుతుంది. పరిచయ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా గెలాక్సీ ఎమ్32 కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.1,250 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. గెలాక్సీ ఎమ్32 స్పెసిఫికేషన్లు 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఓఎస్(వన్ యుఐ 3.1) 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 800 నిట్స్ బ్రైట్ నెస్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 6,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 25డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (బాక్స్లో 15డబ్ల్యు ఛార్జర్ వస్తుంది) 4జీ ఎల్ టిఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ ఎ-జీపీఎస్, యుఎస్ బి టైప్-సీ, 3.5మిమి హెడ్ ఫోన్ జాక్ 196 గ్రాముల బరువు చదవండి: ఒక్కరాత్రిలో ట్రిలియనీర్ అయిన స్కూల్ విద్యార్థి? -
పవర్ ఫుల్ ప్రాసెసర్ తో విడుదలైన రియల్మీ జీటీ 5జీ
చైనా మొబైల్ తయారీ దిగ్గజం రియల్మీ తన జీటీ 5జీ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను గ్లోబల్ గా ఈ రోజు అట్టహాసంగా లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్తో పాటు రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ను కూడా లాంచ్ చేసింది. అలాగే రియల్మీ బుక్ ల్యాప్టాప్, రియల్మీ ప్యాడ్ టాబ్లెట్ కూడా టీస్ చేసింది. రియల్మీ జీటీ 5జీని చైనాలో మార్చిలో విడుదల చేసింది. దీనిలో పవర్ ఫుల్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. భారతదేశంలో రియల్మీ జీటీ 5జీ లాంచ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. రియల్మీ జీటీ 5జీ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ను చైనా సీఎన్వై 2,799(సుమారు రూ.32,100) ధరకు విడుదల చేసింది. అలాగే 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్వై 3,299 (రూ. 37,800). రియల్మీ జీటీ 5జీ స్పెసిఫికేషన్లు: 6.43-అంగుళాల ఫుల్-హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ర్యామ్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ 64 ఎంపీ సోనీ ఐఎంఎక్స్682 ప్రైమరీ కెమెరా 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా 2 ఎంపీ మాక్రో షూటర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా(ఎఫ్ / 2.5 లెన్స్) 5జీ, 4జీ ఎల్టిఇ, వై-ఫై 6, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్బి టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ 65 వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్ -
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: పబ్జీకి చెందిన త్వరలో లాంచ్ కానున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ యాప్ నిషేధం విషయంలో కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాను భారత్ లో విడుదల కాకముందే తాము నిషేదించలేమని జెఎన్యులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ గౌరవ్ త్యాగి అనే విమర్శకుడు ఇటీవల దాఖలు చేసిన ఆర్టీఐకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ నిబంధనల ప్రకారం విడుదల తర్వాత మాత్రమే ఈ ఆటను నిషేదించే అవకాశం ఉంటుంది అని చెప్పింది. డాక్టర్ గౌరవ్ త్యాగి దాఖలు చేసిన ఆర్టీఐపై స్పందిస్తూ ఐటి మంత్రిత్వ శాఖ.. "భారతదేశంలో పబ్జీ లేదా ఏదైనా కంపెనీ/మొబైల్ యాప్ ప్రవేశానికి అనుమతి ఇవ్వడంలో ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఎటువంటి అధికారులు లేవు" అని పేర్కొంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. "హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ యాప్ విడుదలకు అనుమతి ఇవ్వదు. భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, రక్షణ విషయంలో నిబందనలు పాటించకపోతే మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ, ఐటీ నిబంధనల ప్రకారం ఏదైనా మొబైల్ యాప్ ను నిషేదించే అవకాశం ఉంటుంది" అని తెలిపింది. ఈ గేమ్ ను భారతదేశంలోకి క్రాఫ్టన్ తీసుకొస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మే 18 నుంచి ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ నెల 18న గేమ్ విడుదల అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే, విడుదల విషయంలో అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెల్లడించలేదు. As part of my research on predatory practise of Chinese companies in India and it's impact on National Security, had filed an RTI about the relaunch of PUBG Mobile in India by Krafton (in which the Chinese behemoth has the second largest stake). pic.twitter.com/WL5rkThdOb — Dr Gaurav Tyagi (@drtyagigaurav) June 13, 2021 చదవండి: గుడ్ న్యూస్: టీవీఎస్ అపాచీ బైక్ పై భారీ ఆఫర్ -
అదిరిపోయిన వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ మొబైల్
వన్ప్లస్ తన నార్డ్ సిరీస్ లో మరో మొబైల్ ను "నార్డ్ సీఈ 5జీ" పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న స్మార్ట్ఫోన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. కొంత మేర ధర ఎక్కువ అయిన మంచి ఫీచర్స్ తో మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి ఫోన్లు తీసుకొచ్చిన వన్ప్లస్ కొద్దీ కాలం నుంచి రూ.40వేల పైన గల హై ఎండ్ మొబైల్స్ తీసుకొస్తుంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు వారు ఇతర కంపెనీల వైపు చూస్తుండటంతో మళ్లీ తన అభిమానులను తిరిగి పొందటానికి 'నార్డ్ సీఈ 5జీ' స్మార్ట్ఫోన్ తీసుకొచ్చింది. వన్ప్లస్ గత ఏడాది నార్డ్ సిరీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.25,000లోపు బడ్జెట్లో వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో రూ.22,999 బడ్జెట్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీని విడుదల చేసింది. ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని వన్ప్లస్ ఎదురు చూశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ ప్రీ-ఆర్డర్స్ జూన్ 11 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్: 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4,500ఎంఏహెచ్ బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 6 జీబీ +128 జీబీ ధర రూ.22,999 8 జీబీ +128 జీబీ ధర రూ.24,999 12 జీబీ +256 జీబీ ధర రూ.27,999 చదవండి: విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే? -
ఐఫోన్ ఫేస్ అన్లాక్ సిస్టమ్లో బయటపడ్డ లోపం!
సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్కు పోటి అసలు ఉండదు. ఐఫోన్ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అప్పుడప్పుడు భద్రత విషయంలో విషయంలో కొన్ని చిక్కులు ఎదురైన వాటిని వెంటనే గుర్తించి పరిష్కరిస్తుంది. కాగా ప్రస్తుతం ఐఫోన్ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్కు సంబంధించి ఒక లోపం బయటపడింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్ తన ఐఫోన్ 12 మినీ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్లో కనుగొన్న ప్రధాన లోపాన్నిగుర్తించి వీడియోను పోస్ట్ చేశాడు. వినమ్రే సూద్ అనే నెటిజన్ తన సోదరుడితో కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో ఐఫోన్ను సూద్ తన ఫేస్ ఐడిని ఉపయోగించి అన్లాక్ చేసి తన సోదరుడు ఉపన్షుకు ఇచ్చాడు. ఉపన్షు ఫేస్ ఐడితో వినమ్రే ఫోన్ను అన్లాక్ చేయగలిగాడు. ఇరువురు సోదరులు కవలలు కాకపోయినప్పటికీ ఐఫోన్ వీరి ఇరువురి ఫేస్ ఐడీలను ఒకే విధంగా గుర్తించి మొబైల్ ఫోన్ను అన్లాక్ చేసింది. కాగా ఐఫోన్ ఫేస్ అన్లాక్ సిస్టమ్ వారి విషయంలో పూర్తిగా విఫలమైంది. విన్రమే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ.. ఆపిల్ ఫేస్ఐడి గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది. మొబైల్ పరిశ్రమలో పేరున్న ఒక సంస్థ తమ మార్కెటింగ్ ప్రచారంలో వినియోగదారుల భద్రతకు రాజీ లేకుండా ఉంటుందని చెప్పకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నాడు. మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చే భద్రతను కూడా ఆపిల్ ఐఫోన్ ఇవ్వలేకపోతుందని తెలిపాడు. కాగా 2017లో సీఎన్ఎన్ చేసిన ఒక పరీక్షలో ఐఫోన్ ఫేస్ అన్లాక్ సిస్టమ్ పూర్తిగా విఫలమైంది. వాస్తవానికి ఐఫోన్ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ ఇతర స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ కంటే చాలా మెరగైంది. ఐఫోన్ను అన్లాక్ చేయడంలో పదిలక్షల మందిలో ఒకరిని గుర్తించే సంభావ్యతను కలిగి ఉంటుందని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: నగ్న ఫొటోలు, వీడియో: ఆపిల్ కంపెనీకి కోట్ల జరిమానా -
ఆన్లైన్లో లీకైన వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్, ధర
దేశీయ మొబైల్ మార్కెట్ లో వన్ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లకు మంచి పేరు ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఒకప్పుడు తక్కువ ధరలో మంచి మొబైల్స్ తీసుకొచ్చిన వన్ప్లస్, హత్య కొద్దీ రోజుల హై ఎండ్ మొబైల్స్ మీద మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో మిడ్ రేంజ్ అభిమానులు అందరూ వన్ప్లస్ నుంచి దూరం అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సంస్థ తిరిగి మిడ్ రేంజ్ అభిమానులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను జూన్ 10న విడుదల చేయబోతున్నది. లాంచ్ చేయడానికి కొద్దీ రోజుల ముందు ఇండియాలో ఈ కంపెనీ ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. టిప్స్టర్ ఇషాన్ అగర్వాల్ రాబోయే వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ, వన్ప్లస్ టీవీ యు 1 ఎస్ ధరలను ట్విటర్ ద్వారా బహిర్గతం చేశారు. ఈ ఫోన్ ధర రూ.22,999 ఉండనున్నట్లు తెలుస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారులకు అదనంగా రూ.1,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చే ఉంది. ఈ ఆఫర్ కూడా జూన్ మే 11 నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది అని తెలుస్తుంది. లీక్ల ప్రకారం రాబోయే వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ కొత్త ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ద్వారా పనిచేయనుంది. అలాగే ఇది 4,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వార్ప్ ఛార్జ్ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావచ్చు. అలాగే ఈ ఫోన్ వెనుకవైపు 64MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డీప్ సెన్సార్లను కలిగి ఉంటుంది. అలాగే ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉండవచ్చు. వన్ప్లస్ కొత్త ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్తో వస్తుందని భావిస్తున్నారు. చదవండి: జియోసావన్ లో మరో సరికొత్త ఫీచర్ -
రూ. 25 వేలకే టచ్స్క్రీన్ ల్యాప్టాప్
అసుస్ డిటాచబుల్ సీఎం3 క్రోమ్బుక్ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీడియాటెక్ 8183 ప్రాసెసర్పై ఈ ల్యాప్టాప్ పనిచేస్తుంది. ఇందులో క్రోమ్ఓఎస్ ఉంటుంది. లెనోవో క్రోమ్బుక్ కు పోటీగా ఇది ఆసుస్ క్రోమ్బుక్ను తీసుకొచ్చింది. దీని స్పెసిఫికేషన్లు కూడా అందులో ఉన్న మాదిరగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో తెలియదు. ఇది ల్యాప్టాప్, టచ్ ట్యాబ్లెట్ లాగా మల్టీ టాస్క్ పని చేస్తుంది. అసుస్ క్రోమ్బుక్ ఫీచర్లు ఇందులో 10.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఆక్టాకోర్ 2 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 8183 ప్రాసెసర్పై ఈ ల్యాప్టాప్ పనిచేస్తుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఈఎంఎంసీ స్టోరేజ్ను ఇందులో అందించారు. ఇందులో డిటాచబుల్ కీబోర్డును తీసుకొచ్చారు. అంటే ఈ కీబోర్డును తీసేసి టచ్ ట్యాబ్లెట్లాగా కూడాపనిచేస్తుంది. ఇందులో వెనకవైపు 8 ఎంపీ కెమెరా, ముందువైపు 2 ఎంపీ ఉన్నాయి. ఇందులో 3.5 ఎంఎం ఆడియోజాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టును కూడా అందించారు. ఇందులో 27Whr బ్యాటరీని తీసుకొచ్చారు. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగానూ, బరువు 510 గ్రాములుగానూ ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349.99 డాలర్లుగా(సుమారు రూ.25,500) ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.369.99 డాలర్లుగా(సుమారు రూ.27,000)గా ఉంది. మినరల్ గ్రే కలర్ ఆప్షన్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
రూ.25,000 వేలలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్
మిడ్-రేంజ్ విభాగంలో రూ.25 వేలలోపు స్మార్ట్ ఫోన్లు సరైన ప్రత్యేకతతో రావడమే కాకుండా ఈ విభాగంలో స్మార్ట్ ఫోన్స్ మంచి పనితీరుతో పాటుగా కెమెరా, సాఫ్ట్వేర్, డిజైన్ తో పాటు మొత్తం నిర్మాణంలో కూడా హై-ఎండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లకు పోటీగా ఉండేలా కనిపిస్తాయి. రూ.25,000లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్, యాడ్-ఫ్రీ సాఫ్ట్వేర్, మల్టీ-కెమెరా సేటప్ విషయంలో మంచిగా పని చేయడానికి ఫాస్ట్ మిడ్-రేంజ్ ప్రాసెసర్ తీసుకొస్తాయి. ఇవి పనితీరు విషయంలో ఏ మత్రం ఫ్లాగ్ షిప్ లకు తీసిపోవు అందుకే మార్కెట్లో రూ.25000లోపు అందుబాటులో ఉన్న ఫోన్స్ గురుంచి తెలుసుకుందాం. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 మంచి పనితీరుతో పాటు ఎక్కువ కాలం బ్యాటరీ కావాలనుకునే వారి కోసం ఈ మొబైల్ మంచి ఎంపిక అవుతుంది. దీనిలో గెలాక్సీ నోట్ 10+లో ఉపయోగించిన ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అలాగే, ఇందులో 7,000 ఎమ్ఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఉంది. ఈ ధర వద్ద మంచి సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉండటంతో పాటు అద్భుతమైన కెమెరా, గేమింగ్ పనితీరును కనబరుస్తుంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జర్తో దీనిని చార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో స్టాక్ యాప్స్ లో యాడ్స్ కూడా వస్తాయి. దేశ మొత్తంగా సర్విస్ కేంద్రాలు అందుబాటులో ఉండటం వల్ల అది ఒక అదనపు బలంగా దీనికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ.23,999గా ఉంది. రియల్ మీ ఎక్స్ 7 5జీ రియల్ మీ ఎక్స్ 7 5జీ గురుంచి ప్రధానంగా చెప్పుకోవాలంటే మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని చెప్పుకోవాలి. దీని 8జీబీ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. ఈ ధర వద్ద క్వాల్కామ్ ప్రాసెసర్ కు సమానంగా మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్ పనిచేస్తుంది. గేమింగ్ విషయంలో మంచి పనితీరు కనబరుస్తుంది. దీని బ్యాటరీ జీవితం కూడా ఎక్కువ వస్తుంది. ఇందులో 50 వాట్ ఫాస్ట్ చార్జర్ పొందుతారు. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే అనుకున్నంత రీతిలో పని చేయట్లేదు. ఫోన్లో ఆండ్రాయిడ్ 11 లేదు బ్లోట్వేర్ ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద చిన్న చిన్న సమస్యలు తప్ప అంత పెద్దగా ఇబ్బందులు లేవు. ఎంఐ 10ఐ షియోమీ 2021 లో మొదటగా తీసుకొచ్చిన మొబైల్ ఇదే. ఎంఐ 10ఐ ధర రూ.21,999. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750జీ 5జీ సపోర్ట్ ప్రాసెసర్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇంత తక్కువ ధరకు ఇవి తీసుకొని రావడం ఒక మంచి విషయం. 108 మెగాపిక్సెల్ కెమెరాలలో చిన్న చిన్న సమస్యలు ఉండటం మనం గమనించవచ్చు. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మెరుపరుస్తారో లేదో చూడాలి. మీరు ఫోటో విషయంలో పెద్దగా పట్టించుకోకపోతే రూ.25,000 ఒక మంచి ఫోన్ అవుతుంది. వివో వి20 వివో కూడా ఈ సారి మంచి ఫోన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది అని చెప్పుకోవాలి. ఇది 6.44-అంగుళాల ఆమో ఎల్ఈడీ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఇది చూడటానికి మంచి ప్రీమియం లుక్ ఇస్తుంది. వివో వి 20 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720జీ ప్రాసెసర్ సహాయంతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ ఓఎస్ తాజా వెర్షన్ మీద పనిచేస్తుంది. కెమెరా పరంగా మంచి ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఇది ఒక మంచి ఆప్షన్. దీని ధర రూ.22,990. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయడం ఎలా? -
Mi 11 Ultra: ఎంఐ 11 అల్ట్రా సేల్ మరింత ఆలస్యం
షియోమీ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్ ఏప్రిల్ 23న విడుదల అయిన సంగతి తెలిసిందే. అదే రోజున ఎంఐ 11 సిరీస్లో ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్ని కూడా పరిచయం చేసింది షియోమీ. ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్ఫోన్స్ సేల్ మొదలైన ఎంఐ 11 అల్ట్రా సేల్ ఇంకా మొదలుకాలేదు. ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్ విడుదల అయ్యి చాలా రోజులు గడిచిపోయిన సేల్ జరగకపోవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. షియోమీ ఇండియాలో ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్లను ఎందుకు సేల్ కు తీసుకురావట్లేదనే చర్చ జరుగుతుంది. షియోమీ అభిమానులు కూడా ఎంఐ 11 అల్ట్రా సేల్ ఎప్పుడు ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ అయోమయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమ కంట్రోల్లో లేని అనివార్య పరిస్థితుల కారణంగా ఎంఐ 11 అల్ట్రా షిప్మెంట్ ఆలస్యం జరుగుతుందని, వీలైనంత త్వరగా సేల్ తేదీలను ప్రకటిస్తామని ట్విట్టర్లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ల కారణంగా షియోమీ సరఫరా, ఉత్పత్తి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని తెలుస్తుంది. ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్: 6.81 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్డీ+ ఈ4 అమొలెడ్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా 48 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్ రియర్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ వైర్లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ 10వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,990. చదవండి: కేవలం వారంలో భారీగా పెరిగిన ముకేశ్ అంబానీ సంపద -
లీకైన రియల్ మీ 4కే స్మార్ట్ టీవీ ధరలు
రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే స్పెసిఫికేషన్లు, ధర మే 31 విడుదలకు ముందే లీక్ అయ్యాయి. కంపెనీ మే 31న రెండు మోడళ్లను 43-అంగుళాల, 50-అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్ చేయనున్నట్లు కొద్దీ రోజుల క్రితం ప్రకటించింది. లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం, రియల్ మీ స్మార్ట్ టీవీ 4కే మోడల్స్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ చేత, ఆండ్రాయిడ్ 10 సహాయంతో పనిచేయనున్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి 5, డ్యూయల్-బ్యాండ్ వై-ఫైలను కలిగి ఉంటాయి. రెండు మోడళ్లు 178-డిగ్రీల కోణాల్లో 4కే రిజల్యూషన్ను చూడవచ్చు అని సమాచారం. టిప్స్టర్ డెబాయన్ రాయ్ పంచుకున్న వివరాల ప్రకారం.. 43 అంగుళాల మోడల్ ధర రూ.28,000 - 30,000 ఉంటే, 50 అంగుళాల మోడల్ ధర రూ.33,000 నుంచి రూ.35,000 ఉండే అవకాశం ఉంది. దీనిలో క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ చేత, ఆండ్రాయిడ్ టీవీ 10 సహాయంతో నడవనుంది. ఇందులో డాల్బీ విజన్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మోస్, డీటీఎస్ హెచ్డీ సపోర్ట్ తో 24వాట్ క్వాడ్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ ద్వారా ఆడియోను వినవచ్చు. కనెక్టివిటీ కోసం, ఈ టీవీలో మూడు హెచ్డిఎంఐ పోర్ట్లు, రెండు యుఎస్బి పోర్ట్లు, ఎవి అవుట్ పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్, ట్యూనర్ పోర్ట్తో రావచ్చు. ఇందులో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి 5 కూడా ఉంటాయి. చదవండి: నెలకు రూ.890 కడితే శామ్సంగ్ ఫ్రిజ్ మీ సొంతం! -
వన్ప్లస్ నార్డ్ నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్
వన్ప్లస్ నార్డ్ సిరీస్ లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీని తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిలో స్నాప్డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా తీసుకొని రానున్నట్లు సమాచారం. వన్ప్లస్ జూన్ 10న తన సమ్మర్ లాంచ్ ఈవెంట్లో కొత్త వన్ప్లస్ టీవీ యు-సిరీస్ మోడళ్ తో పాటు వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ గతంలో యూరప్, ఉత్తర అమెరికాలో లాంచ్ అయిన వన్ప్లస్ నార్డ్ ఎన్ 10 5జీని పోలి ఉంటుందని తెలుస్తుంది. రాబోయే బడ్జెట్ ఫోన్ గురించి మరికొన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి. వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750జీ ప్రాసెసర్ చేత పనిచేయనున్నట్లు ఆండ్రాయిడ్ సెంట్రల్ ఒక నివేదికలో పేర్కొంది. అలాగే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.43-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. వన్ప్లస్ నార్డ్ సీఈ పేరులో సీఈ అంటే కోర్ ఎడిషన్ అని అర్ధం. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్తో వస్తుందని సమాచారం. వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ జూన్ 10న సాయంత్రం 7 గంటలకు వన్ప్లస్ టీవీ యు సిరీస్తో పాటు లాంచ్ కానుంది. వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ జూన్ 11 నుంచి ప్రీ-ఆర్డర్ కోసం రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. జూన్ 16 నుంచి వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఓపెన్ సేల్ కి వస్తుంది. చదవండి: పన్ను చెల్లింపుదారుల గుడ్ న్యూస్ -
ఈ సైట్లు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఖాళీలు ఇట్టే చెప్తాయి...!
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని కేంద్రం కూడా భావించగా, ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపిన విషయం తెలిసిందే. చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి కనబరచగా, ఏప్రిల్ 28 నుంచి వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కేంద్రం ప్రకటించడంతో ఆ రోజు ఒక్కసారిగా చాలా మంది సైటుపై పడడంతో కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్ సైట్ క్రాష్ అవ్వగా, ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం చాలా మంది ఎగబడుతున్నారు. సైట్ ఓపెన్ చేసిన వెంటనే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఖాళీ లేదు అనే సందేశం కనిపిస్తోంది. దీంతో చాలా మంది నిరాశకు గురవుతున్నారు. ఈ సమస్యకు కొంతమంది టెక్నికల్ నిపుణులు పరిష్కారాన్ని చూపారు. వీరు చూపిన పరిష్కారంతో సులువుగా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అందుకుగాను కోవిన్ యాప్లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఎక్కడ, ఎప్పుడు ఖాళీగా ఉందో చెప్పేలా వైబ్సైట్లను రూపొందించారు. అంతేకాకుండా ఈ సైట్లలో రిజిస్టర్ అయిన వారికి నోటిఫికేషన్ అలర్ట్లను పంపుతాయి. అందు కోసం ఈ సైట్లలో ముందుగా రిజిస్టర్ కావాల్సి ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తిరిగి కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో ప్రజలు చాలా సమయం పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఖాళీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాడానికి ఈ సైట్లలో రిజిస్టరవ్వండి: 1. కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రాకర్ ఫర్ ఇండియా: దీనిని ఇండియాకు చెందిన అమిత్ అగర్వాల్ రూపొందించారు. ఈ వైబ్సైట్లో రిజిస్టర్ కాగానే, వ్యాక్సిన్ లభ్యత ఎక్కడ ఉందనే విషయం ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. Get email alerts when #COVID19Vaccine becomes available in a vaccination center near you. (Built with Google Sheets) 👉🏻 https://t.co/Gt5D18thvr https://t.co/EWHDC1FEQ5 pic.twitter.com/7BJbCQROgw — Amit Agarwal (@labnol) May 1, 2021 2.అండర్45.ఇన్(Under45.in): 18-44 సంవత్సరాల వయసు వారికి సమీపంలో ఉన్న టీకాల స్లాట్ల కోసం శోధించడానికి అండర్ 45.in అనే వెబ్సైట్తో ప్రోగ్రామర్ బెర్టీ థామస్ ముందుకు వచ్చారు. Alerts of vaccination slots (18-45 group) for South East Delhi (Delhi)https://t.co/LSucUAl4sS For any district, continue to use: https://t.co/VXNLXkLu8C#CovidIndia #CovidVaccineIndia #Under45 6/n — Berty Thomas (@BertyThomas) May 1, 2021 3. గెట్జ్యాబ్.ఇన్(Getjab.in): ఐఎస్బీ పూర్వ విద్యార్థులు శ్యామ్ సుందర్, అతని స్నేహితులు getjab.in అనే వెబ్సైట్ను అభివృద్ధి చేశారు. ప్రజలకు సమీపంలోని టీకా స్లాట్ల ఖాళీలను ఈ-మెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది 4. ఫైండ్ స్లాట్.ఇన్(FindSlot.in): కోవిడ్-19 వ్యాక్సిన్ అపాయింట్మెంట్ కోసం సహాయపడే మరొక సైట్, ఫైండ్స్లాట్.ఇన్ , ఈ సైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రజలు తమ నగరం ద్వారా లేదా వారి పిన్ కోడ్ ద్వారా శోధించవచ్చును. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
వాట్సాప్ లో కొత్త ఫీచర్...వాయిస్ మెసేజ్లను...
వాట్సాప్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్ ద్వారా సందేశాలను ఇతరులకు పంపుతాము. అప్పుడప్పుడు మనం పంపే మెసేజ్ల్లో ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో..చూసి మెసేజ్లను పంపుతాం. ఈ సౌలభ్యం కేవలం వాట్సాప్లో మెసేజ్లకు మాత్రమే ఉంది. వాయిస్ మెసేజ్లకు లేదు. వాయిస్ మెసేజ్లను ఎలాంటి పునః పరిశీలన చేయకుండానే పంపుతుంటాం. మనలో కొంత మంది అరేరే..! తప్పుగా వాయిస్ మెసేజ్ సెండ్ చేశానే..!అని నాలుక కర్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనలో కొందరు వాటివల్ల అనేక పర్యవసానాలను కూడా ఎదుర్కొని ఉంటారు. ఈ సమస్యకు వాట్సాప్ త్వరలోనే చెక్ పెట్టనుంది. అవును మీరు విన్నది నిజమే... రానున్న రోజుల్లో వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్తో వాయిస్ మెసేజ్లను తిరిగి ఒకసారి వినే వీలు కల్గుతుంది. ఈ ఫీచర్ను ప్రస్తుతం వాట్సాప్ పరీక్షిస్తోంది. అంతేకాకుండా వాయిస్ మెసేజ్లను యూజర్లు ఎంపిక చేసుకున్న స్పీడ్ల్లో మెసేజ్లను వినవచ్చును. ఈ ఫీచర్తో యూజర్లు వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ వేగాన్ని నియంత్రించవచ్చును. రానున్న రోజుల్లో వాయిస్ మెసేజ్లను పంపేటప్పడు ‘రివ్యూ’ బటన్ ఉండేలా వాట్సాప్ ఏర్పాటు చేస్తోంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో వాట్సాప్ తీసుకురానుంది. చదవండి: కరోనా: వాట్సాప్ ‘స్టేటస్’ మారిపోతోంది! -
ఎంఐ 11ఎక్స్కి పోటీగా వివో కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్
వివో తన వి-సిరీస్లో వివో వీ21 5జీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో వెనుక వైపు మూడు కెమెరాలు, ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్పై ఈ మొబైల్ పనిచేయనుంది. ఎంఐ 11ఎక్స్కి పోటీగా దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సేల్ మాత్రం మే 6వ తేదీ నుంచి జరగనుంది. ఆర్కిటిక్ వైట్, డస్క్ బ్లూ, సన్ సెట్ డాజిల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వివో వీ21 5జీ ఫీచర్లు: ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టం 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ప్రైమరీ కెమెరా 64 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ కెమెరా 44 ఎంపీ కెమెరా సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.29,990 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.32,990 చదవండి: 2021లో భారీగా పెరిగిన ఫేస్బుక్ ఆదాయం -
గేమింగ్ ప్రియుల కోసం రెడ్మీ సూపర్ ఫోన్!
చైనా: గేమింగ్ కిల్లర్ రెడ్ మీ కే40 సిరీస్లో కొత్త ఫోన్ రెడ్ మీ కే40 గేమింగ్ ఎడిషన్ ను చైనాలో లాంచ్ చేసింది. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో కొన్ని గేమింగ్ ఫీచర్లను షియోమీ తీసుకొచ్చింది. షోల్డర్ బటన్లు, మూడు మైక్లు, డాల్బీ అట్మాస్, జేబీఎల్ ఆడియో సపోర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి. ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం. ఈ మొబైల్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్పై పనిచేయనుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 30వ తేదీన చైనాలో జరగనుంది. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు తీసుకొస్తారో అనే విషయం తెలియదు. రెడ్మీ కే40 గేమింగ్ ఎడిషన్ ఫీచర్స్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లే 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెట్ రేట్ హెచ్డీఆర్10+ సపోర్ట్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ 64 ఎంపీ ప్రైమరీ కెమెరా + 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా + 2 ఎంపీ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరా 5065 ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 5జీ, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్టు 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 1,999 యువాన్లు (సుమారు రూ.23,000) 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,199 యువాన్లు (సుమారు రూ.25,300) 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,600) 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,399 యువాన్లు (సుమారు రూ.27,500) 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 2,699 యువాన్లు (సుమారు రూ.31,100) చదవండి: 65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు! -
జోరుమీదున్న స్మార్ట్ఫోన్స్ విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్మార్ట్ఫోన్ల విక్రయాలు 2021 జనవరి-మార్చిలో జోరుగా సాగాయి. వివిధ బ్రాండ్లకు చెందిన మొత్తం 3.8 కోట్ల యూనిట్లు అమ్ముడ య్యాయి. 2020 తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. నూతన మోడళ్లు, ప్రమోషన్స్, ఈఎంఐ పథకాలు, గతేడాది నుంచి కొనసాగుతున్న డిమాండ్తో మార్చి త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ మార్కెట్ను నడిపించాయి. స్మార్ట్ఫోన్స్, ఫీచర్ ఫోన్లతో కలిపి పరిశ్రమ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 19 శాతం వార్షిక వృద్ధి సాధించింది. ఫీచర్ ఫోన్ల విపణి 14 శాతం అధికమైంది. వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం జనవరి-మార్చిలో కస్టమర్ల సెంటిమెంటును బలపరిచిందని పరిశోధన సంస్థ కౌంటర్పాయింట్ అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో.. మార్చి త్రైమాసికంలో జరిగిన స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో 75 శాతం వాటా చైనా బ్రాండ్లదే. షావొమీ,శామ్సంగ్, వివో, రియల్మీ, ఒప్పో వరుసగా అయిదు స్థానాల్లో ఉన్నాయి. యాపిల్ 207 శాతం, వన్ప్లస్ 300 శాతం వృద్ధి నమోదు చేశాయి. డిమాండ్ను పెంచేందుకు అన్ని బ్రాండ్లు కొత్త మోడళ్లు, ప్రమోషన్స్, ఫైనాన్షియల్ స్కీమ్స్పై దృష్టిసారించాయి. అయితే మహమ్మారి సెకండ్ వేవ్తో సెంటిమెంటు తగ్గే అవకాశం ఉందని కౌంటర్పాయింట్ చెబుతోంది. కోవిడ్-19, లాక్డౌన్స్ ప్రభావం రానున్న త్రైమాసికాలపై ఉంటుందని గుర్తు చేసింది. గతేడాది సరఫరా సమస్యలు తలెత్తిన దృష్ట్యా ముందస్తుగా నిల్వలను పెంచుకున్నామని బిగ్-సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. చదవండి: గూగుల్ లో నకిలీ ఫోటోలను కనిపెట్టడం ఎలా? -
గూగుల్ లో నకిలీ ఫోటోలను కనిపెట్టడం ఎలా?
మనం ఇంటర్నెట్లో అనేక రకాలైన ఫోటోలను చూస్తుంటాం. అయితే అది నిజమా కాదా అనేది మాత్రం ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే అచ్చం అలాంటి ఫోటోలని గ్రాఫిక్స్ సాయంతో మార్చివేసి వేరే విధంగా చూపిస్తారు. ఇలాంటివి ఎక్కువగా రాజకీయ నాయకులు, సెలిబ్రిటీల విషయంలో జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఒక ఫోటో నిజమైనది కదా అనేది తెలుసుకోవాలంటే చిన్న ట్రిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ఇమేజెస్ ఆన్ లైన్ లో ఎక్కువగా ఫోటోలను సెర్చ్ చేయడానికి ప్రధానంగా ఉపయోగించేది గూగుల్. గూగుల్ లో మనకు కనిపించే ఫోటోలు నిజమా? కదా అనేది గూగుల్ ఇమేజెస్ మనకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్ ను అందిస్తుంది. మనం ఏదైనా ఇమేజ్ వెతికినప్పుడు ఆ ఇమేజ్ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే? గూగుల్ ఇమేజెస్ కి వెళ్లి కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయాలి. మీరు చూసిన ఫొటో యూఆర్ఎల్ లేదా ఆ ఫొటోను నేరుగా అప్లోడ్ చేయాలి. అప్పుడు వెంటనే గూగుల్ ఆ ఫొటో ఎక్కడి నుంచి వచ్చిందో మూలం ఎక్కడిదో మనకు చెప్పేస్తుంది. గూగుల్ సెర్చ్ మీ ఆండ్రాయిడ్ పరికరంలో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడానికి మీరు రివర్స్ సెర్చ్ చేయాలనుకుంటున్న ఆసక్తికరమైన ఫోటోను ఎంపిక చేసి దానిమీద రైట్ క్లిక్ ఇవ్వండి అప్పుడు మీకు సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ క్లిక్ చేస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూపిస్తుంది. చదవండి: మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉందో తెలుసుకోవాలా? -
బీఎమ్డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసిన ఈ ఫోన్ అదరహో...!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్ఫోన్స్ బ్రాండ్ వివోకు చెందిన ఐక్యూ మొబైల్స్ తాజాగా మరో రెండు మోడల్లను భారత్లో లాంచ్ చేసింది. చైనాకు చెందిన ఈ స్మార్ట్ఫోన్ బ్రాండ్ తొలుత ఐక్యూ నియో 5ను రిలీజ్ చేయగా, దానినే రిబ్రాండ్ చేస్తూ ఐక్యూ 7గా రిలీజ్ చేసింది. దాంతో పాటుగా ఐక్యూ 7 లెజెండ్ను భారత విపణిలోకి లాంచ్ చేసింది. ఐక్యూ 7 లెజెండ్ మొబైల్ను ప్రముఖ మోటార్స్పోర్ట్ కంపెనీ బీఎమ్డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్ చేసింది. ఐక్యూ 7, ఐక్యూ 7 లెజెండ్ ట్రిపుల్ రియర్ కెమెరాలను కల్గి ఉన్నాయి. దాంతో పాటుగా 66వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. కాగా ఐక్యూ 7, ఎమ్ఐ 11 ఎక్స్తో పోటీ పడుతుండగా, ఐక్యూ 7 లెజెండ్ ఎమ్ఐ 11 ఎక్స్ ప్రో, వన్ప్లస్ 9 ఆర్ ఫోన్లకు సరితూగుతుంది. ఐక్యూ 7 స్టార్మ్ బ్లాక్, సాలిడ్ ఐస్ బ్లూ కలర్లో లభిస్తుంది. ఐక్యూ 7 ధరలు: (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 31,990 (8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 33,990 (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 35,990 ఐక్యూ 7 ఫీచర్లు 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 క్వాల్కం స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 13+2-మెగాపిక్సెల్ రియర్కెమెరా 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఐక్యూ 7 లెజెండ్ ధరలు (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 39,990 (12జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 43,990 ఐక్యూ 7 లెజెండ్ ఫీచర్లు 6.62 అంగుళాల స్క్రీన్ 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 11 క్వాల్కం స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 13+13-మెగాపిక్సెల్ రియర్కెమెరా 8జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం చదవండి: రియల్మీ 5జీ స్మార్ట్ఫోన్ : సరసమైన ధరలో -
వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. ప్రతి వ్యక్తి తమ ఫీలింగ్స్ వ్యక్తపరచడానికి వాట్సాప్ స్టేటస్ లో వీడియోనో, ఫొటోనో పెడుతుంటారు. కొందరు తమకు నచ్చిన వీడియో లేదా ఫోటోలను వాట్సాప్ స్టేటస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ, ప్రస్తుతానికి డౌన్లోడ్ చేసుకోవాలంటే వాట్సాప్లో అలాంటి ఫీచర్ ఇంకా రాలేదు. కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా అత్యంత తేలిగ్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం క్రింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు వాట్సాప్ తెరచి, స్టేటస్లోకి వెళ్లండి. మీరు ఏం డౌన్లోడ్ చెయ్యాలనుకుంటున్నారో దానిని ఓసారి పూర్తిగా చూడండి. ఇప్పుడు మీ మొబైల్లోని ఫైల్ మేనేజర్ ఫోల్డర్ ఓపెన్ చెయ్యండి. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్లి Show Hidden Files ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్లీ వెనక్కి వచ్చి స్టోరేజ్లోకి వెళ్లి వాట్సాప్ ఆప్షన్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఫోల్డర్ కనిపించే మీడియా ఆప్షన్లో స్టేటస్(statuses) ఆప్షన్ను ఎంచుకోండి. అందులో వాట్సాప్ స్టేటస్లో చూసిన వీడియోలు, ఫొటోలూ ఉంటాయి. వాటిని కాపీ చేసి... వేరే ఫోల్డర్లో పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు వాట్సాప్ స్టేటస్లోని ఫొటోలూ, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే, గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి వాట్సాప్ స్టేటస్ డౌన్లోడ్ మేనేజర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీకు నచ్చిన వాటిని పొందవచ్చు. -
వాట్సాప్లో కొత్త సమస్య..! పరిష్కరించండి ఇలా...
వాట్సాప్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. మనలో చాలా మంది తెల్లవారగానే ముందుగా డేటా ఆన్ చేసి వాట్సాప్లో ఏమైనా మెసేజ్లు వచ్చాయే లేదో చూసుకుంటాం. నేటి టెక్నాలజీ యుగంలో అప్పుడప్పుడు వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సర్వర్లు డౌన్ అవుతూంటాయి. దీనితో కాస్త ఇబ్బందికి గురవుతుంటాం. ప్రస్తుతం వాట్సాప్లో కొత్త సమస్య వచ్చి పడింది. అదేంటంటే వాట్సాప్ కొత్త వినియోగాదారులకు మిస్సింగ్ మీడియా ప్రాబ్లమ్ వస్తోంది. వినియోగదారులు వారి వాట్సాప్ యాప్లో మీడియాను చూసుకోలేక పోతున్నారు. ఈ సమస్య కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లల్లో కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వాట్సాప్ ఆప్డేట్ చేసిన వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వాట్సాప్ వర్షన్ 2.21.9.3 వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేసింది. తాజా వెర్షన్లోని కొంతమంది వినియోగదారులు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. వాట్సాప్ ఈ సమస్యను గుర్తించినప్పటీకి, సమస్యకు ఇంకా పరిష్కారం చూపలేదు. మీ మీడియా కంటెంట్ను తిరిగి తీసుకురావడానికి సరళమైన ప్రత్యామ్నాయం ఉంది. కొంత మంది వాట్సాప్ వినియోగదారులు ఈ సమస్యకు గురయ్యారని వాట్సాప్ బేటా ట్రాకర్ డబ్ల్యూఏబేటాఇన్ఫో తెలిపింది. ఈ మీడియాను మొబైల్ ఫోన్లో పొందినప్పటికి కింద సూచించిన విధంగా చేస్తే ఏకంగా మీడియాను మీ వాట్సాప్ యాప్లో చూసుకోవచ్చును. వాట్సాప్ యాప్లో మీడియా కనిపించాలంటే... ►ముందుగా మీ ఫోన్లో వాట్సాప్ను క్లోజ్ చేసి క్యాచీ డేటాను క్లియర్ చేయాలి ఇక్కడ యాప్ బ్యాక్గ్రౌండ్లో నడవకుండా చూసుకోవాలి. ►తరువాత మీ ఫోన్లో ఫైల్ మెనేజర్లో ఉన్న వాట్సాప్లోని మీడియా ఫోల్ఢర్ను సెలక్ట్ చేసుకోవాలి. ►ఇప్పుడు మీడియా ఫోల్డర్లోని కంటెంట్ను ఆండ్రాయిడ్ ఫోల్డర్లోని మీడియా ఫోల్డర్లో కామ్.వాట్సాప్లో ఉన్న వాట్సాప్లోని మీడియా ఫోల్డర్లోకి మూవ్ చేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం వాట్సాప్ ఫోల్డర్లోని మీడియా ఫోల్డర్ మాత్రమే మూవ్ చేయాలి. ►మీడియా కంటెంట్ పూర్తిగా మూవ్ అయ్యే వరకు నిరిక్షించాలి. ఈ స్టెప్స్ పూర్తి చేశాక మీడియా మిస్సింగ్ అనే బాధ ఉండదు. మీ వాట్సాప్ యాప్లో మీడియాను మీ కళ్లముందు ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య ఉన్నవారు పై స్టెప్స్నుపయోగించి మాన్యువల్ గా చేయాలని ఉద్ధేశ్యం లేకపోతే వాట్సాప్ యాప్ను ఆప్డేట్ చేసేదాక వేచి ఉండండి. -
10 లక్షల మంది క్రెడిట్ కార్డు వివరాలు లీక్
ప్రముఖ పిజ్జా బ్రాండ్ డొమినోస్ సర్వర్ల నుంచి భారీగా డేటా లీక్ అయింది. ఇజ్రాయెల్కు చెందిన కో-ఫౌండర్ & సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ హడ్సన్ రాక్, అలోన్ గాల్ చేసిన ట్వీట్ల ప్రకారం.. ఈ డేటా సామర్ధ్యం 13 టెరాబైట్లు(టీబీ). డేటాలో 10 లక్షల యూజర్ల క్రెడిట్ కార్డ్ వివరాలతో సహా 18 కోట్ల మిలియన్ల ఆర్డర్ వివరాలు ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పడు ఈ డేటా మొత్తం డార్క్ వెబ్లో అమ్మకానికి ఉన్నట్లు తెలిపాడు. జూమినెంట్ ఫుడ్వర్క్స్ డొమినోస్ ఇండియా మాతృ సంస్థ. అలాగే, 250 మంది డొమినోస్ ఉద్యోగుల డేటా కూడా లీక్ అయింది. ఈ డేటా మొత్తాన్ని 550,000 డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు అలోన్ గాల్ పేర్కొన్నారు. ఈ డేటా లీక్ ఆరోపణల్ని డొమినో పేరెంట్ కంపెనీ అయిన జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ ఖండించలేదు. కానీ ఫైనాన్షియల్ డేటా లీక్ అయిందన్న వార్తల్ని తిరస్కరించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఇటీవల సమాచార భద్రతా సమస్యను ఎదుర్కొంది. హ్యాకర్లు చేతికి చిక్కిన క్రెడిట్ కార్డ్ డేటా మొత్తం భారతీయ వినియోగదారులదే. Threat actor claiming to have hacked Domino's India (@dominos) and stealing 13TB worth of data. Information includes 180,000,000 order details containing names, phone numbers, emails, addresses, payment details, and a whopping 1,000,000 credit cards. pic.twitter.com/1yefKim24A — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) April 18, 2021 మా నిబందనల ప్రకారం వినియోగదారుల ఆర్థిక వివరాలు లేదా క్రెడిట్ కార్డు డేటాను మేము ఎప్పుడు స్టోర్ చేయలేము. అందువల్ల డేటా లీక్ అయ్యే అవకాశమే లేదని జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. ప్రస్తుతం దీనిపై తమ దర్యాప్తు కొనసాగుతుందని వివరించింది. 10 లక్షలకు పైగా యూజర్ల క్రెడిట్ కార్డుల వివరాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. 18 కోట్ల ఆర్డర్స్ వివరాలు, చిరునామాలు, బిల్లింగ్ డీటెయిల్స్ 10 లక్షల క్రెడిట్ కార్డు వివరాలదే అని యుటిబి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అలోన్ గాల్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో చాలా కంపెనీల డేటా లీక్ అవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. చదవండి: వాట్సప్లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోండి! -
వాట్సప్లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోండి!
వాట్సాప్ యాప్ లేని ఆండ్రాయిడ్ ఫోన్ ఈ రోజుల్లో ఉందంటే మనం అంత ఆశ్చర్యపోవాల్సిందే. అంతలా విస్తరించింది వాట్సాప్. దీని వినియోగం రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది. అయితే, ఈ యాప్ వాడే చాలా మంది తమకు నచ్చని వారిని బ్లాక్ చేస్తారు. అయితే ఇలా ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారో తెలుసుకోవడానికి ఈ క్రింద ఇస్తున్న ట్రిక్స్ ఫాలో అవ్వండి. ట్రిక్ 1: సాదారణంగా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే మీకు వారి స్టేటస్ కనిపించదు. ట్రిక్ 2: అలాగే మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి ప్రొపైల్ మీకు కనిపించదు. ఒకవేళ కనిపించినా ఆ ప్రొఫైల్ పిక్చర్ బ్లాంకులో కనిపిస్తుంది. ట్రిక్ 3: మిమ్మల్ని బ్లాక్ చేశారని తెలియక మీరు అతనికి మెసేజ్ పంపితే కేవలం సింగిల్ ట్రిక్ మాత్రమే కనిపిస్తుంది. బ్లూ ట్రిక్ కాని అలాగే డబుల్ ట్రిక్ కాని కనిపించదు. ట్రిక్ 4: బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు ఎటువంటి కాల్ కాని, వాయిస్ మెసేజ్ కాని పంపలేరు. ట్రిక్ 5: మీరు ఓ గ్రూపు క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని ఇన్వైట్ చేసినప్పుడు మీకు You are not authorized to add this contact అనే మెసేజ్ కనిపిస్తుంది. చదవండి: మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా? -
మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా?
మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో మీకు తెలుసా?. ఇలా మనకు తెలియకుండానే కొందరి పేరు మీద సైబర్ నెరగాళ్లు సిమ్ లు తీసుకుంటు న్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సిమ్ ద్వారా అనైతిక, అసాంఘిక కార్యక్రమాలకు ఈ మొబైల్ నెంబర్ వాడుతున్నట్లు చాలా కేసులలో బయటపడింది. ఇలా మీకు తెలియకుండా ఇతరులు సిమ్ తీసుకోవడంతో మీరు మీకు సంబంధం లేని కేసులలో చిక్కుకునే ప్రమాదం చాలా ఎక్కువ. ఇలా మన పేరు మీద లేదా మన వివరాలతో ఎవరైనా మొబైల్ నెంబర్ తీసుకుంటే వాటిని బ్లాక్ చేసే సదుపాయం ఇప్పడు మీకు కల్పిస్తున్నారు. దీని కోసం మీరు విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించిన వెబ్సైట్(https://tafcop.dgtelecom.gov.in)ను సందర్శించాలి. వెబ్సైట్ ఓపెన్ చేశాక అందులో మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్ చేసి రిపోర్ట్ చేస్తే టెలికం శాఖ తగు చర్యలు తీసుకుంటుంది. ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుంది అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి పేర్కొన్నారు. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని. అందుకే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్ను ప్రారంభించామన్నారు. దీనివల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందన్నారు. ఎవరికైనా అనుమానం వెంటనే ఇలా చెక్ చేసుకోవాలని తెలిపారు. చదవండి: సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్ -
సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్
ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న నెక్స్జూ మొబిలిటీ రోడ్లార్క్ పేరుతో సూపర్ లాంగ్ రేంజ్ ఈ-సైకిల్ను తయారు చేసింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్థాయిలో నడిచే ఈ-సైకిల్ భారత్లో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. ధర రూ.42,000. మూడు నాలుగు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. ఆరు రకాల రైడింగ్ మోడ్స్, డ్యూయల్ డిస్క్ ఎలక్ట్రిక్ బ్రేక్స్, డ్యూయల్ లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్, 26 అంగుళాల కాటన్ ట్యూబ్ టైర్స్ ఏర్పాటు ఉంది. కోల్డ్ రోల్డ్ స్టీల్తో తయారైంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. నెక్స్జూ పోర్టల్ ద్వారాగాన్నీ దేశవ్యాప్తంగా ఉన్న 90 టచ్ పాయింట్లలో రోడ్లార్క్ను కొనుగోలు చేయవచ్చు. చదవండి: టెకీలకు గుడ్ న్యూస్.. భారీగా నియామకాలు! -
గేమింగ్ ఫోన్పై ఏకంగా రూ.14 వేల తగ్గింపు
ఫ్లిప్కార్ట్ మొబైల్ కార్నివాల్లో అసుస్ రోగ్ ఫోన్ 3పై భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్పై ఏకంగా రూ.10,000 తగ్గింపు లభించడం విశేషం. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ను అందించారు. 6.59 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర గతంలో రూ.55,999గా ఉండగా ఈ సేల్లో రూ.41,999కే విక్రయిస్తున్నారు. అలాగే, 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999 నుంచి రూ.12,000 తగ్గింపుతో రూ.45,999కు అందిస్తున్నారు. అసుస్ రోగ్ ఫోన్ 3 ఫీచర్లు: 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ హెచ్డీఆర్ డిస్ ప్లే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ 64 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ మెయిన్ కెమెరా 24 ఎంపీ సెల్పీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ 5జీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ చదవండి: బజాజ్ చేతక్ స్కూటర్స్కి భారీ డిమాండ్! -
వాట్సాప్ వినియోగదారులకి సీఈఆర్టీ హెచ్చరిక
వాట్సాప్ వినియోగదారులకు భారత సైబర్ సెక్యూరిటీ సీఈఆర్టీ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని యూజర్లను హెచ్చరించింది. వాట్సాప్ వెర్షన్ 2.21.4.18, వాట్సాప్ బిజినెస్ యాప్ వెర్షన్ 2.21.32 వెర్షన్లో లోపం గుర్తించినట్లు తెలిపింది. పైవెర్షన్లు ఆన్ ఇంస్టాల్ చేసి అప్డేటెడ్ వెర్షన్లు డౌన్లోడ్ చేసుకోవాలని వినియోగదారులకు సీఈఆర్టీ సూచించింది. అలాగే, వాట్సాప్ కొత్త గోప్యతా విధానం అధిక డేటాను సేకరిస్తున్నట్లు పేర్కొంది. -
లాంచ్ కు సిద్ధంగా 75 అంగుళాల షియోమీ స్మార్ట్ టీవీ
స్మార్ట్ఫోన్ మార్కెట్లో తన హవా కొనసాగిస్తున్న షియోమీ. ఇప్పుడు స్మార్ట్టీవీ మార్కెట్లో కూడా తన హవా కొనసాగిస్తుంది. క్రమ క్రమంగా భారత టెలివిజన్ మార్కెట్ను కూడా సొంతం చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 పేరుతో అతిపెద్ద స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. షియోమీ నుంచి ఇప్పటి వరకు విడుదలైన స్మార్ట్ టీవీల్లో కెల్లా ఇదే అతిపెద్ద స్మార్ట్ టీవీ కావడం విశేషం. అంతేకాక, షియోమీకి చెందిన అత్యంత ఖరీదైన టెలివిజన్ కూడా ఇదేనని తెలిపింది. దీని ఫీచర్స్, స్పెసిఫికేషన్లు 2020 డిసెంబర్లో ఇదే సిరీస్లో విడుదలైన 55 అంగుళాల వేరియంట్తో సమానంగా ఉంటాయని పేర్కొంది. కాగా, ఈ కొత్త స్మార్ట్టీవీ ఏప్రిల్ 23న జరిగే ఆన్లైన్ కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదే కార్యక్రమంలో ఎంఐ 11ఎక్స్ సిరీస్ స్మార్ట్ఫోన్లను కూడా లాంఛ్ చేయనుంది. ఎంఐ క్యూఎల్ఈడీ టీవీ 4కె 75 అంగుళాల అతి పెద్ద స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ టీవీలో సినిమా చూసేటప్పుడు థియేటర్లో చూస్తున్న అనుభూతిని ఇస్తుంది. ఈ టీవీ ధరను మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఇదే ఫీచర్లతో ఇతర కంపెనీల నుంచి విడుదలైన 75 అంగుళాల టీవీలు రూ.1,50,000 ధరల శ్రేణిలో లభిస్తుండగా.. దీని ధర లక్ష రూపాయలలోపే ఉండే అవకాశం ఉంది. చదవండి: ఛార్జింగ్ అవసరంలేని ఎలక్ట్రిక్ కారు! -
ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.2,499కే పోకో ఎక్స్3 ప్రో
పోకో ఇండియా ఇటీవల పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ఫోన్పై అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి ఏకంగా రూ.16,500 డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే మీరు కేవలం రూ.2,499 చెల్లిస్తే సరిపోతుంది. పోకో ఎక్స్3 ప్రో తదుపరి సేల్ ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12 గంటలకు ఉంది. పోకో ఎక్స్3 ప్రో 6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.20,999. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి రూ.16,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్ఫోన్ను రూ.2,499 ధరకే సొంతం చేసుకోవాలంటే మీ పాత స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్లో రూ.16,500 విలువచేయాలి. ఒకవేళ అంతకన్నా తక్కువ విలువ ఉంటే మిగతా మొత్తాన్ని చెల్లించి పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అలాగే, ఒకవేళ పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్ఫోన్ను డైరెక్ట్గా సేల్ లో కొనాలనుకుంటే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్బ్యాక్ లభిస్తుంది. చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్