traffic jam
-
ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్.. 300 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద అథ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటైన మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) వెళుతున్నారా? అయితే జాగ్రత్త. కుంభమేళా ముగింపు తేదీ గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఫలితంగా కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫ్రిక్ జామ్ (world's biggest traffic jam) ఏర్పడింది. సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శనివారం నుంచి లక్షల వాహనాలు ప్రయాగరాజ్ వైపు మళ్లాయి. దీంతో భక్తులు త్రివేణి సంగమ్ (గంగ, యమునా, సరస్వతి నదుల సంగమం) వద్ద పవిత్ర స్నానమాచరించేందుకు సమయానికి చేరుకోలేకపోతున్నారు. రోజుల సమయం పట్టనున్నడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ప్రయాగరాజ్ సంగమ్ రైల్వే స్టేషన్ను అధికారులు శుక్రవారం వరకు మూసివేశారు.प्रयागराज महाकुंभ में फँसे करोड़ों श्रद्धालुओं के लिए तुरंत आपातकालीन व्यवस्था की जाए। हर तरफ़ से जाम में भूखे, प्यासे, बेहाल और थके तीर्थयात्रियों को मानवीय दृष्टि से देखा जाए। आम श्रद्धालु क्या इंसान नहीं है? प्रयागराज में प्रवेश के लिए लखनऊ की तरफ़ 30 किमी पहले से ही नवाबगंज… pic.twitter.com/1JXmzgDEGI— Akhilesh Yadav (@yadavakhilesh) February 9, 2025 ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ సర్కార్పై సమాజవాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలి,దాహంతో ఇబ్బంది పడుతున్న భక్తులను మనవత్వంతో చూడాలి. సామాన్య భక్తులు మనుషులే కదా? వారికి కనీస సదుపాయాలు కల్పించారా? అని ప్రశ్నలు సంధించారు. అంతకుముందు కుంభమేళా ఏర్పాట్లపై అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ప్రయాగరాజ్లో ట్రాఫిక్ పరిస్థితి గురించి హైలైట్ చేస్తూ.. భక్తుల కోసం అత్యవసర ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయాగరాజ్ ప్రవేశం సమీపంలో నవాబగంజ్లో 30 కిలోమీటర్లు, గౌహానియాలో 16 కిలోమీటర్లు,వారణాసి మార్గంలో 12 నుండి 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్ జామ్ వల్ల జనజీవనం స్తంభించింది.అందుకే ఉత్తర ప్రదేశ్లో వాహనాలకు టోల్ ఛార్జీల నుంచి విముక్తి కల్పించాలి. తద్వారా ప్రయాణ సమస్యలు, ట్రాఫిక్ జామ్ను తగ్గించవచ్చు. సినిమాల్లా వినోదానికి కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ను వసూలు చేయనప్పుడు, వాహనాలకు టోల్ ఫ్రీ ఎందుకు చేయలేరు? అని పునరుద్ఘాటించారు. -
బైక్ యువతి చేష్టలకు బలైపోయిన బస్సులు
-
తప్పిన ముప్పు.. నడిరోడ్డుపై డీజిల్ ట్యాంకర్ బోల్తా
చిలకలగూడ: ట్రాఫిక్ రద్దీ ప్రాంతంలో నడిరోడ్డుపైన ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో అటు పోలీసులు..ఇటు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ట్రాఫిక్, హైడ్రా, ఫైర్ విభాగాలు చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించాయి. వివరాల్లోకి వెళ్తే..చిలకలగూడ ట్రాఫిక్ ఠాణా పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డబావి వద్ద సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో లోడుతో వెళ్తున్న డీజల్ ట్యాంకర్ వెనుక టైర్ పగిలి.. డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో డీజిల్ లీకై రోడ్డుపై ప్రవహించింది. నిప్పు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఈస్ట్జోన్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్కుమార్, చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు స్పందించి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వెంటనే ఫైరింజన్లను రప్పించి మంటలు అంటుకోకుండా భారీగా ఫోమ్ను స్ప్రే చేయించారు. మూడు క్రేన్ల సాయంతో బోల్తా పడిన ట్యాంకర్ను అక్కడి నుంచి తొలగించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది సాయంతో రహదారులపై పడిన డీజిల్పై మట్టిపోయించారు. వాహనదారులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. సుమారు మూడున్నర గంటలు శ్రమపడి పరిస్థితిని చక్కదిద్దారు. ట్యాంకర్ వాహనం డ్రైవింగ్ చేస్తున్న మల్లాపూర్కు చెందిన చంద్రశేఖర్కు స్వల్ప గాయాలయ్యాయి. అనుమానం వచి్చన ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్ చంద్రశేఖర్కు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా, మద్యం తాగి వాహనం నడిపినట్లు నిర్ధారణ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో 105 బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్)పాయింట్లు వచ్చాయి. దీంతో చంద్రశేఖర్పై గోపాలపురం లా అండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులను పలువురు అభినందించారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ఘటన స్థలానికి చేరుకుని తన వంతు సాయం అందించారు. -
సచివాలయానికి సిటీ బస్సులు.. ప్రయాణికులకు తిప్పలు
సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సులు సచివాలయానికి పరుగులు తీశాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి మహిళలను పెద్ద ఎత్తున తరలించింది. ఇందుకోసం సిటీబస్సులను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగరి, చౌటుప్పల్, సంగారెడ్డి తదితర శివారు జిల్లాలతో పాటు నగరంలోని వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. బస్సులన్నీ సచివాలయం కోసమే ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సాయంత్రం విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకొనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇళ్లకు బయలుదేరిన విద్యార్థులు గంటలతరబడి బస్సుల కోసం పడిగాపులు కాశారు. చివరకు ఆటోలు, తదితర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లవలసి వచ్చింది. మరోవైపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. అమీర్పేట్, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు, లిబర్టీ, ఇందిరాపార్కు లోయర్ట్యాంక్బండ్ తదితర చోట్ల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్లోనే ఉండాల్సి వచ్చింది. -
రైతులపైకి టియర్ గ్యాస్
శంభు: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని శంభు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు శంభులోని నిరసన దీక్షా శిబిరం నుంచి కాలినడకన బయలుదేరింది. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ సంఘ్ జెండాలను చేబూనిన రైతులు కొన్ని మీటర్ల దూరం మాత్రమే వెళ్లగలిగారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ముందుకు రావద్దని పోలీసులు వారిని పదేపదే కోరారు. అయినప్పటికీ, రైతులు పలు అంచెల బారికేడ్లను దాటుకుని, వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప మేకులను, ఇనుప ముళ్ల కంచెను తొలగించారు. సిమెంట్ బారికేడ్లనూ దాటేందుకు యత్నించారు. ఇనుప కంచెను కొందరు ఘగ్గర్ నదిలోకి దొర్లించారు. దీంతో, పోలీసులు వారిపైకి పలు రౌండ్ల టియర్ గ్యాస్ను ప్రయోగించారు. రైతులు టియర్ గ్యాస్ నుంచి రక్షణ కోసం తడి గన్నీ బ్యాగులతో కళ్లు, ముఖాన్ని కప్పేసుకున్నారు. బారికేడ్లపై నుంచి వస్తున్న వారిపైకి పోలీసులు లాఠీలు ఝళిపించారు. టియర్ గ్యాస్తో గాయపడిన కనీసం ఆరుగురు రైతులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. రైతులు గాయపడిన నేపథ్యంలో జాతాను శుక్రవారానికి నిలిపి వేస్తున్నట్లు రైతు నేత సర్వాన్ సింగ్ చెప్పారు. తదుపరి కార్యాచరణపై చర్చించుకుని, నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, అంబాలా జిల్లాలో గురువారం నుంచే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఐదు, అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడరాదని ప్రకటించారు. ముందు జాగ్రత్తగా శుక్రవారం జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల పరిధిలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఆ మార్గంలో మోహరించారు. -
బెంగళూరు ట్రాఫిక్.. ఇలా చేస్తే నో టెన్షన్!
‘రష్యాలో ఒక మూల నుంచి ఇంకో మూలకు కారులో ప్రయాణించాలంటే 149 గంటలు పడుతుంది. అంతసేపు ప్రయాణించినా ఇంకా రష్యాలోనే ఉంటాం. బెంగళూరు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది’ బెంగళూరు ట్రాఫిక్ రద్దీపై ఇటీవల ఎక్స్లో ఓ మహిళ పెట్టిన పోస్ట్ ఇది. ఇండియా ఐటీ క్యాపిటల్గా పేరుగాంచిన బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యం. బెంగళూరు వాసులు రోడ్డు మీదకు వచ్చారంటే నరకప్రాయమే. ట్రాఫిక్ రద్దీతో గంటలకొద్దీ రోడ్లపై గడపాల్సి ఉంటుంది. తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతుంటారు. జోకులు, సెటైర్లు కూడా షేర్ చేస్తుంటారు.బెంగళూరు మెట్రో సిటీలో జనాభా అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతంలో బెంగళూరు మహా నగరంలో దాదాపు 1.4 కోట్ల మంది నివసిస్తున్నారు. పెరుగుతున్న జనాభా కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా అధికం కావడంతో ట్రాఫిక్ రద్దీ నానాటికీ ఎక్కువవుతోంది. నగర రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా ఎక్కడా చూసినా ట్రాఫిక్ జామ్లే దర్శనమిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ట్రాఫిక్ను నియంత్రించే వ్యూహాత్మక, సమగ్ర విధానం చాలా అవసరమని బెంగళూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చేయాల్సిన వాటి గురించి బెంగళూరు వాసి ఒకరు ఎక్స్లో పెట్టిన పోస్ట్ తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే ఐదేళ్లలో చేపట్టాల్సిన చర్యల గురించి ప్రస్తావించడం ఆలోచింపజేస్తోంది. బెంగళూరులో ప్రస్తుతం 1.05 కోట్ల ప్రైవేటు వాహనాలు ఉండగా, గత అక్టోబర్ నెలలో కొత్తగా 70 వేల ప్రైవేటు వెహికిల్స్ రోడ్డెక్కినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీకి ఎక్కువగా (87.6 శాతం) ప్రైవేటు వాహనాలు కారణమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బెంగళూరులో ట్రాఫిక్ మరింత నరకప్రాయం అవుతుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 5 ఏళ్లలో చేపట్టాల్సిన చర్యలు..1. బెంగళూరు జనాభాలో ప్రస్తుతం 10 శాతం మంది మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఈ సంఖ్యను 70 శాతానికి పెంచాలి.2. ఆర్టీసీ బస్సు, మెట్రో రైలు, సైకిల్ రైడ్ వంటి బహుముఖ ప్రయాణాలను ప్రోత్సహించాలి.3. ఆక్రమణలు తొలిగించి వీధులను ప్రయాణానికి అనువుగా మార్చాలి. పాదచారులు ఏ ఆటంకాలు లేకుండా నడిచేలా ఉండాలి.చదవండి: ఇండియా సిలికాన్ సిటీలో సిగ్నల్ దాటాలంటే చుక్కలే4. బెంగళూరులో బస్సుల సంఖ్య పెంచాలి. పెద్ద బస్సులతో పాటు మినీ బస్సులు కూడా అవసరం. నివాస ప్రాంతాల నుంచి మెట్రో రైలు, పెద్ద బస్సులకు అనుసంధానంగా మినీ బస్సులు నడపాలి.5. నగరంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ, ఎక్కువ మంది ప్రయాణించేలా మెట్రో రైలు పరిధిని విస్తరించాలి. సబర్బన్ రైలు సేవలను కూడా విస్తృతం చేయాలి.6. ఫుట్పాత్లు, సైకిల్, బస్ లేన్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేలా చూడాలి. BENGALURU city is now home to 1.4 crore people & 1.05 crore private vehiclesThe city added around 70k new private vehicles in the last month, with Private vehicles now dominating 87.6% of trafficSteps needed to be taken during the next 5 years as a major priority for the city… pic.twitter.com/ulagWNybVR— Karnataka Weather (@Bnglrweatherman) November 21, 2024 -
సిటీకి తిరుగు ప్రయాణం.. రోడ్లపై ఫుల్ ట్రాఫిక్ జామ్!
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ ముగిసింది. దీంతో, సిటీ నుంచి గ్రామాలకు వెళ్లినవారు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.దీపావళికి సొంతూరుకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్కు వస్తుండటంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు వరుసకట్టాయి. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ నుంచి ఎల్బీనగర్ వరకు స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ, నల్గొండ, ఖమ్మం, నార్కట్పల్లి, కోదాడ, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి వాహనాలు వస్తున్నాయి. ఇటు, కరీంనగర్, నిజామాబాద్ నుంచి కూడా భారీగా వాహనాలు వస్తుండటంతో నగర శివారులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
Bengaluru: కార్లు వదిలి నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు, ఎందుకంటే!
బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ అంటూ వాహనదారులు భయపడిపోతూ ఉంటారు. కిలోమీటర్ దూరానికే గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని సగం జీవితం రోడ్డుపైనే గడపాల్సి వస్తుందంటూ తరచూ నగరవాసులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. సాధారణ సమయంలోనే ఇలా ఉంటే.. అదే వర్షాలు కురిసి వరద నీటితో రోడ్లు అన్నీ నిండిపోయిన సందర్భంలో ఏర్పడే ట్రాఫిక్ గురించి ఇక చెప్పనవసరం లేదు.తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది. బుధవారం కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలమైంది. పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. మోకాళ్లలోతు నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్పై భారీగా జామ్ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్పైనే చిక్కుకుపోయిన పరిస్థితి తలెత్తింది. దీంతో విసుగుచెందిన కొందరు తమ కాళ్లకు పని చెప్పారు. వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటి బాట పట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.Completely Jammed from past 1.5 hrs in the #electroniccity flyover. I must have reached my home now which is 30kms away. Logged out at 5:20 and we are still stuck! We can see most of the employees of various companies frustrated and starting to walk. @madivalatrfps pic.twitter.com/wqvXuIArN6— KpopStan🤍 (@PratikfamHouse) October 23, 2024 -
దసరా ఎఫెక్ట్: పంతంగి టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్జామ్
సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: దసరా పండుగ సొంతూళ్లలో జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు గ్రామాల బాట పట్టారు. చాలా మంది తమ సొంత కార్లలోనే ఊళ్లకు పయనమయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ రూట్లో భారీగా ట్రాఫిక్జామ్ అయింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోపక్క దసరాకు పల్లెబాట పట్టిన ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వెళ్లే రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు -
మీరు మనుషులేనా
-
హైదరాబాద్లో కుండపోత వర్షం
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ నగరంలో మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం(సెప్టెంబర్21)సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట సికింద్రాబాద్, ఉప్పల్,బోడుప్పల్,నాగోల్,దిల్సుఖ్నగర్, చైతన్యపురి,కోఠి,అబిడ్స్,నాంపల్లి ప్రాంతాల్లో ఏకధాటిగా రెండుగంటల పాటు అతి భారీ వర్షం పడింది. #HYDTPinfoIt's #Raining heavily.Commuters are requested to drive carefully.#HyderabadRains pic.twitter.com/2tKy5y1vg9— Hyderabad Traffic Police (@HYDTP) September 21, 2024 భారీ వర్షంతో రోడ్లపై నీరు వరదలై పారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రధాన రోడ్లపై ట్రాఫిక్జామ్ అయింది. కాగా, శుక్రవారం రాత్రి నగరమంతా రెండు గంటలపాటు భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా నిలిచిన నీళ్లు పూర్తిగా తొలగక ముందే మళ్లీ వర్షం పడడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.ఇదీ చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే -
ట్రాఫిక్ వలయంలో సాగర్ పరిసర ప్రాంతాలు.. వాహనదారులకు అలర్ట్
హైదరాబాద్, సాక్షి: గణేష్ నిమజ్జనం తో హుస్సేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్జామ్ అయ్యింది. నిమజ్జనానికి గణపయ్యలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్యాంక్ బండ్వైపు రావొద్దని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు నగర పోలీసులు సూచిస్తున్నారు.రేపు ‘మహా’ నిమజ్జనం ఉండడం, నిన్న ఆదివారం కావడంతో నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్బంక్కు చేరుకున్నాయి. అయితే విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నిన్న రాత్రి నుంచి నియంత్రించేందుకు సిబ్బంది లేకపోవడం, పైగా వాటిల్లో భారీ వాహనాలు ఉండడంతో.. నిమజ్జనానికి గంటల తరబడి టైం పడుతోంది. ఇక.. సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు లేరన్న మీడియా కథనాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాహనాలను త్వరగతిన పంపించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఈలోపు వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్, నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్యాంక్ బండ్ వైపుగా వెళ్లకపోవడం మంచిదని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్న వాళ్లకు సైతం నరకం కనిపిస్తోంది.రేపు ఖైరతాబాద్ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. శోభాయాత్ర భద్రత కోసం పాతికవేల మంది సిబ్బందిని మోహరించినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇక.. ఖైరతాబాద్ గణేషుడికి ఇవాళ పూజలు నిర్వహించి.. షెడ్డు తొలగింపు పనులు చేపట్టారు. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర మొదలుపెడతారు. మధ్యాహ్నాం లోపు నిమజ్జనం చేస్తారు. ఎల్లుండి సాయంత్రంకల్లా నగరంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: భారీ గణపయ్య దగ్గర కోలాహలం చూశారా? -
HYD: దంచికొట్టిన వర్షం.. రోడ్లపై వరద
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం(ఆగస్టు13) ఉదయం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్సార్నగర్, బాలానగర్, బేగంపేట్, సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లపై అక్కడక్కడా భారీగా నీరు నిలిచింది. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. -
సాగర్కు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్కు పర్యాటకుల తాకిడి పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాజెక్ట్ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్ పరిసర ప్రాంతాదలు కిటకిటలాడాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్ ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంతో రోగి, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. వారం రోజులుగా ప్రాజెక్టు క్రస్ట్గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. మరోవైపు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యామ్ వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల సిఫార్సు ఉన్నవారిని మాత్రమే డ్యామ్ పైకి పంపుతున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. -
ముంబయిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రోడ్లపై పలు చోట్ల నీరు నిలిచి ట్రాపిక్ జామ్ అయింది. పలు రూట్లలో లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. ట్రాక్పై చెట్లు పడిపోవడంతో కసారా-టిట్వాలా సెక్షన్లో రైళ్లను రద్దు చేశారు. నగరంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్సుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నగరంలో రోడ్లపై నీళ్లు నిలిచిన వీడియోలను పలువురు ముంబైకర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. -
హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్!
సాక్షి,హైదరాబాద్ : హైదరబాద్ కురిసిన వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఐకియా సర్కిల్ దగ్గర వర్షం తర్వాత ఆఫీస్ ముగియడంతో వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.బయో డైవర్సిటీ మాదాపూర్ వరకు ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ ఉద్యోగులు దశలవారీగా ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ తమ గమ్య స్థానాలకు వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.సైబరాబాద్ పరిధిలో అటు గచ్చిబౌలి మొదులుకుని గచ్చిబౌలి, మాదాపూర్ బయో డైవర్సిటీ సిగ్నల్,ఐకియా, హైటెక్ సిటీ ఫ్లైఓవర్,జేఎన్టీయూ ఫ్లైఓవర్లో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. గంటపాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురియడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడా నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు.వర్షం తగ్గగానే ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్డెక్కాయి. ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. నానక్ రామ్ గూడా మొదులుకుని గచ్చిబౌలీ, బయోడైవర్సిటీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫలితంగా మాదాపూర్ వెళ్లాలన్నా.. ఇటు జేఎన్టీయూ వెళ్లాలన్నా ఐకియా సిగ్నల్ మీది నుంచి వెళ్లాల్సి ఉంది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ తరుణంలో నగర ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు సైతం ఉద్యోగులు ఓ గంట ఆలస్యంగా ఆఫీస్ల నుంచి ఇంటికి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ATTENTION PLEASE: కూడళ్లూ.. 'కష్టాలు'..
సాక్షి, హైదరాబాద్: బండి తీసి రోడ్డెక్కాం.. ఆ రోడ్డు ఎంత బాగున్నా.. ఫ్లైఓవర్ ఎక్కి ఎంచక్కా దూసుకెళ్లినా.. ఏదైనా జంక్షన్ రాగానే ఉత్సాహం కాస్తా తుస్సుమంటుంది. అడుగులో అడుగేస్తున్నట్టుగా కదులుతున్న వాహనాలతో చిరాకు మొదలవుతుంది. ఎడమ వైపు ‘ఫ్రీలెఫ్ట్’ ఉంటుందేమో అనుకుంటే.. ఇరుకైన జంక్షన్తో అదీ ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఎలాగోలా జంక్షన్ దాటేసి, కాస్త దూరంలోని మరో ఫ్లైఓవర్ ఎక్కుదామనుకుంటే.. దానికి ముందే మళ్లీ వాహనాల నత్తనడక మొదలవుతుంది. చిరాకు మరింత పెరిగిపోతుంది. ఎవరైనా వీఐపీ కోసం ట్రాఫిక్ గానీ ఆపి ఉంటే.. ఈ ‘మంట’ నషాళానికి అంటుతుంది.హైదరాబాద్ మహా నగరంలో కూడళ్ల నిర్వహణ సరిగా లేక జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.సిగ్నల్ ఫ్రీ సిటీ కోసం చర్యలు చేపట్టినా..హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా సాగేందుకు గత పదేళ్లలో పలు చర్యలు చేపట్టారు. కొత్తగా కొన్ని ఫ్లై ఓవర్లు నిర్మించారు. అయినా ప్రజలకు రవాణా కష్టాలు తీరలేదు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, జంక్షన్లను అభివృద్ధి చేయకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. వాహనాలు జంక్షన్ల వద్ద చాలాసేపు ఆగిపోవాల్సి వస్తోంది. దాంతో ప్రయాణ సమయం, ఇంధన వ్యయంతోపాటు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. మరోవైపు జంక్షన్ల వద్ద ఫుట్పాత్లు సరిగా లేక పాదచారులు నడవడానికి, రోడ్డు దాటడానికి తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తోంది.భారీగా విస్తరణకు నిర్ణయించినా.. త్రీవేలు, చౌరస్తాలు, పెద్ద జంక్షన్లున్న చోట ట్రాఫిక్ ఇబ్బందులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనితో జంక్షన్లను విస్తరించి, అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత జోన్కు రెండు చొప్పున నగరవ్యాప్తంగా 12 జంక్షన్లను అభివృద్ధి చేయాలనుకున్నారు. తర్వాత వీటిని 60కి పెంచారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను గుర్తించి.. మొత్తం 127 జంక్షన్లకు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో 13 చోట్ల మాత్రమే పనులు చేపట్టారు. మిగతావీ మొదలై, పనులన్నీ పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటివి ఈ పనులకు ఆటంకంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం చేపట్టిన వాటిల్లో పూర్తికానివే కాక ఇంకా పనులే ప్రారంభం కానివీ ఉన్నాయి. జీహెచ్ఎంసీలో పనులకు కొంతకాలంగా బిల్లుల చెల్లింపులు ఆలస్యమవుతుండటంతో పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేరు. సగానికిపైగా జంక్షన్లకు ఇంకా డీపీఆర్లే పూర్తి కాలేదు.ఫ్లైఓవర్ దాటితే అంతే.. కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల మీదుగా ప్రయాణం వేగంగా సాగుతున్నప్పటికీ.. ఫ్లైఓవర్ దాటగానే ట్రాఫిక్ చిక్కులు రెట్టింపు అవుతున్నాయి. ఉదాహరణకు ఐటీ కారిడార్లోని ప్రాంతాల నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వేగంగా ఆగకుండా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్లో రోడ్ నంబర్ 45 చౌరస్తాలో ఒక్కసారిగా జామ్ అవుతున్నాయి. అక్కడి ఇరుకైన జంక్షన్ దీనికి కారణం. ఫ్లై ఓవర్లపై చూపిన శ్రద్ధ జంక్షన్ల విస్తరణలో చూపకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.⇒ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల నుంచి పంజగుట్ట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట, సికింద్రాబాద్ల వైపు వెళ్లాల్సిన వాహనాలు, ఫ్లైఓవర్ కింద నుంచి ఖైరతాబాద్ దిశగా వెళ్లాల్సిన వాహనాలు అన్నీ ఫ్లైఓవర్కు ముందు, పంజగుట్ట చౌరస్తా వద్ద జామ్ అవుతున్నాయి. నగరంలో చాలా ఫ్లైఓవర్లకుముందు, చివరల్లోఇదే పరిస్థితి ఉంది.జంక్షన్లను అభివృద్ధి చేస్తారిలా.. ముఖ్యమైన జంక్షన్ల వద్ద వాహనాలు సులువుగా మలుపుతిరగడంతోపాటు పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేయనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. అందులో భాగంగా చేపట్టే పనులేంటో వెల్లడించారు.⇒ వాహనాలు సాఫీగా మలుపు తిరిగేలా రోడ్లను విశాలం చేస్తారు. ⇒ జంక్షన్లో అన్నివైపులా పాదచారులు సులభంగా రోడ్డు దాటేలా జీబ్రా క్రాసింగ్స్ ఏర్పాటు చేస్తారు. ⇒ బస్టాపులున్న జంక్షన్ల వద్ద ఎటువైపు వెళ్లే బస్సు ఎక్కాలనుకుంటే పాదచారులు అటువైపు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు. ⇒ ఫ్రీ లెఫ్ట్ కోసం ప్రత్యేక మార్కింగ్స్ వేస్తారు. ⇒ రాత్రివేళ జంక్షన్ అందంగా కనిపించేలా ప్రత్యేక లైటింగ్ ఉంటుంది. కూర్చునేందుకు బెంచీలు, ఇతర ఏర్పాట్లు చేస్తారు. ⇒ జంక్షన్ల వద్ద రోడ్డు డివైడర్లలో అందంగా కనిపించేలా, ఆక్సిజన్ అందేలా మొక్కలు పెంచుతారు. ⇒ పాదచారుల కోసం ఫుట్పాత్లు,వరద నీరు నిలవకుండా కాలువలు నిర్మిస్తారు.విశాలంగా ఉన్నా తప్పని తిప్పలు..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఆరాంఘర్ జంక్షన్ విశాలంగా ఉన్నప్పటికీ పాదచారులకు తిప్పలు తప్పడం లేదు. రోడ్డు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగుతుండటంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ అండర్పాస్ ఉన్నా గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ జంక్షన్ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాక నేటికీ పనులు మొదలు కాలేదు.శాస్త్రీయంగా పరిశీలించి పనులు చేయాలి కేవలం ఫ్లైఓవర్లు, యూటర్న్ల ఏర్పాటు వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరవు. యూటర్న్లు ఏర్పాటు చేసేందుకు శాస్త్రీయంగా సిమ్యులేషన్ స్టడీ చేసి, ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యేలా వాటి ప్రదేశాన్ని ఎంపిక చేయాలి. కానీ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇది సరిగా జరుగుతున్నట్టు లేదు. ఏ పనులైనా సైంటిఫిక్ స్టడీతో చేస్తే ప్రయోజనం ఉంటుంది. -
ట్రాఫిక్పై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నిత్యం బిజీగా ఉండే రోడ్డు.. మధ్యలో ఓ కారు మొరాయించి నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఆ ప్రాంతానికి పైన గాల్లో ఎగురుతున్న ‘డ్రోన్’ద్వారా పోలీసులు ఇది చూశారు. వెంటనే ట్రాఫిక్ రిలీఫ్ వ్యాన్ వచి్చ, మొరాయించిన కారును అక్కడి నుంచి తరలించింది. వాహనాలన్నీ సాఫీగా ముందుకు సాగిపోయాయి. అంటే భారీగా ట్రాఫిక్ జామ్ కాకముందే.. సమస్య పరిష్కారమైపోయింది. ఇదేదో చాలా బాగుంది కదా. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ చిక్కులకు ఇలా సింపుల్గా చెక్ పడిపోనుంది. తొలుత సైబరాబాద్ పరిధిలో.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో దీనికి సంబంధించి ‘థర్డ్ ఐ ట్రాఫిక్ మానిటరింగ్ డ్రోన్’అందుబాటులోకి వచ్చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఐకియా, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, హఫీజ్పేట, హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం తదితర ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఆదివారం ఈ డ్రోన్ను వినియోగించారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్లు, వాహనాల రద్దీ ఎక్కడ ఎక్కువగా ఉంది? జంక్షన్ల వద్ద వాహనాల వేగం ఎలా ఉంది? ఎక్కడైనా నీరు నిలిచి ఉందా? అనే అంశాలతోపాటు రోడ్డు ప్రమాదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఏదైనా సమస్య ఏర్పడితే ట్రాఫిక్ పోలీసు బృందాలు వెంటనే స్పందించి పరిష్కరించవ చ్చు. వాహనాలు సు లభంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఎలా పనిచేస్తాయంటే..? థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియో ఫ్రీక్వెన్సీల సాయంతో ఈ డ్రోన్ సైబరాబాద్ కమిషనరేట్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానమై ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 150–170 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఈ డ్రోన్కు ఉండే మూడు అత్యాధునిక కెమెరాలతో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు, వాహనాల రద్దీ, కదలికలను చిత్రీకరిస్తుంది.రియల్ టైమ్లో కంట్రోల్ సెంటర్కు పంపిస్తుంది. కంట్రోల్ సెంటర్ సిబ్బంది ట్రాఫిక్ పరిస్థితి, రద్దీని విశ్లేíÙంచి, ఏదైనా సమస్య ఉంటే గమనించి క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇస్తారు. తద్వారా ట్రాఫిక్ను క్రమబదీ్ధకరిస్తారు. గాలిలో ఏకధాటిగా 45 నిమిషాల పాటు తిరగగలిగే సామర్థ్యమున్న ఈ డ్రోన్ 15 కిలోమీటర్ల దూరం వరకు హెచ్డీ క్వాలిటీ వీడియోను పంపించగలదు. ఇతర కమిషనరేట్లలో.. సైబరాబాద్ పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ కోసం డ్రోన్లను వినియోగించాలని గతంలోనూ ఆలోచన చేశారు. అప్పుడప్పుడు డ్రోన్లను అద్దెకు తీసుకొచ్చి వినియోగించేవారు. తాజాగా కార్పొరేట్ సామాజిక సేవ (సీఎస్ఆర్) కింద ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)’నిధులతో సొంతంగా ఒక డ్రోన్ను కొనుగోలు చేశారు. దీని ఫలితాలను బట్టి మరిన్ని డ్రోన్లను సమకూర్చుకోనున్నారు.ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు. ఇకపై ట్రాఫిక్ పర్యవేక్షణ కోసమూ వినియోగించనున్నారు. హైదరాబాద్లో డ్రోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా ‘డీ–కెమో’విభాగం ఉంది. దీనికి డీసీపీ/ఏసీపీ ర్యాంకు అధికారి హెడ్గా ఉంటారు.ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ డ్రోన్ ఆపరేషన్ ప్రాథమిక దృష్టి ముఖ్యంగా ఐటీ కారిడార్ మీద ఉంటుంది. ఇక్కడ అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్ సాయం అందిస్తుంది. ఈ మేరకు డ్రోన్ వినియోగంపై ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నాం. – అవినాష్ మహంతి,పోలీస్ కమిషనర్, సైబరాబాద్‘ట్రాఫిక్’కు వాడే డ్రోన్ ప్రత్యేకతలు ఇవీ:డ్రోన్ పేరు: మావిక్ 3 ప్రో ధర: రూ.5.5 లక్షలు బరువు: ఒక కిలో బ్యాటరీ: 5 వేల ఎంఏహెచ్. సుమారు 4 గంటల బ్యాకప్ గరిష్ట ఎత్తు: భూమి ఉపరితలం నుంచి 400 మీటర్లు విజిబులిటీ: 5 కిలోమీటర్ల దూరం వరకు గరిష్ట వేగం: సెకన్కు 8 మీటర్లు. గాలి, వర్షం లేకపోతే వరి్టకల్గా సెకన్కు 21 మీటర్ల వేగంతో ఎగరగలదు. స్టోరేజ్ 8 జీబీ నుంచి 1 సామర్థ్యం: టీబీ వరకు ఉంటుంది. -
చంద్రబాబు ప్రమాణస్వీకారం.. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
-
ట్యాంక్బండ్ కేంద్రంగా భారీ ట్రాఫిక్ జామ్
ట్యాంక్బండ్ కేంద్రంగా సోమవారం సాయంత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటకు పైగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో వాహనచోదకులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఓ దశలో ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవట్లేదంటూ అక్కడ ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పీక్ అవర్ కావడంతోనే ట్రాఫిక్ ఆగిందంటూ పోలీసులు వివరణ ఇచ్చారు. జంట నగరాలకు ఉన్న కనెక్టింగ్ రూట్లలో ప్రధానమైన ట్యాంక్బండ్పై ట్రాఫిక్ జామ్స్ నిత్యకృత్యంగా మారిపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. ఫలితంగా తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుండటంతో కట్టమైసమ్మ దేవాలయం, అంబేడ్కర్ విగ్రహం చౌరస్తాల వద్ద అధికారులు కొన్ని మార్పుచేర్పులు చేశారు. దీంతో ట్యాంక్బండ్ పైన గతంలో ఎన్నడూ లేనంతగా రద్దీ పెరిగింది. ఈ కారణాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం ట్యాంక్బండ్ కేంద్రంగా వాహనాలు పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి. లిబర్టీ, ఖైరతాబాద్, రాణిగంజ్ వైపుల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ జామ్తో దాదాపు గంటకు పైగా వాహనచోదకులు ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ‘భారీగా వాహనాలు రావడం, పీక్ అవర్ కావడంతో పాటు రవీంద్రభారతి, రిజర్వ్ బ్యాంక్, ఇక్బాల్ మీనార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, అంబేడ్కర్ చౌరస్తాల వైపు నుంచి అప్పర్ ట్యాంక్బండ్కు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది’ అని ట్రాఫిక్ విభాగం అధికారులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. -
హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
-
వాహనాలతో కిక్కిరిసిన రహదారి
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజాతో పాటు హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాహనాలతో కిక్కిరిసిపోయింది.యాదాద్రితో పాటు స్వర్ణగిరికి భక్తులు భారీగా తరలిరాగా, శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉండడంతో 40వేల వరకు వాహనాలు గూడూరు టోల్ప్లాజా గుండా రాకపోకలు సాగించాయి. టోల్ప్లాజా వద్ద గూడూరు నుంచి పగిడిపల్లి వరకు వాహనాలు బారులుదీరాయి. -
HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగకు సమయం సమీపించింది. మే 13న జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన వారంతా స్వస్థలాలకు తరలి వెళ్లడంతో శనివారం ఉదయం నుంచే రోడ్లన్నీ రద్దీగా మారాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో(శనివారం, ఆదివారం సోమవారం పోలింగ్) ఊర్లకు వెళ్లేవారితో పలు టోల్గేట్ల వద్ద ట్రాఫిక్జామ్ ఏర్పడుతోంది.హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకోవడంతో హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు హయత్నగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. చౌటుప్పల్, పంతంగి టోల్ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. మరోవైపు నల్లగొండ జిల్లా కొర్లపాడు టోల్ గేట్ వద్ద వాహనాలు బారులుతీరాయి. ఎన్టీఆర్ జిల్లాజగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పెరిగిన వాహనాల రద్దీ.ఏపీలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుండి ఆంధ్రకు భారీగా తరలిస్తున్న ఓటర్లు.వాహనాల రద్దీతో పెంచిన కౌంటర్లు.పంతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.హైదరాబాద్ నుంచి భారీగా తరలి వెళ్తున్న ఆంధ్ర ఓటర్లు.పంతంగి నుంచి చౌటుప్పల్ హయత్ నగర్ వరకు భారీగా వాహనాలు.ఉదయం నుంచి గంటలకు నిలిచిపోయిన వాహనాలు.నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న వాహనాల రద్దీ.హైదరాబాద్లో స్థిర పడ్డ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి..పోలింగ్కు ముందే తమ గ్రామాలకు చేరుకునేలా హైదరాబాద్ నుంిచి పయనం. ప్రయాణీకుల రద్దీతో బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట లాడుతున్నాయి.రైలు టిక్కెట్లు కొన్నప్పటికీ రైలు ఫుల్ కావడంతో బస్సులలో వెళ్లడానికి ఆరంఘర్ చౌరస్తాకు చేరుకుంటున్న ప్రయాణీకులు.సంక్రాంతి, దసరాకు కనిపించినంత రద్దీ కనబడుతుంది.గత నెల రోజుల క్రితమే రైళ్లు, బస్సుల రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓటర్లు. -
Dilli Chalo 2.0: ఢిల్లీ సరిహద్దులో యుద్ధవాతావరణం
అష్ట దిగ్బంధనంలో దేశ రాజధాని ఢిల్లీ సింగు బోర్డర్ వద్దకు భారీగా చేరుకున్న రైతులు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరనసన కారులు శంభు బోర్డర్ వద్ద హైటెన్షన్ పోలీసులపై రాళ్లు రువ్విన రైతులు #WATCH | Protesting farmers vandalise flyover safety barriers at the Haryana-Punjab Shambhu border. pic.twitter.com/vPJZrFE0T0 — ANI (@ANI) February 13, 2024 పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడిక్కడ రహదారులను మూసివేసిన పోలీసులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి రాకుండా సరిహిద్దుల్లో పటిష్ట భద్రత కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రైతుల డిమాండ్ #WATCH | Protesting farmers throw police barricade down from the flyover at Shambhu on the Punjab-Haryana border as they march towards Delhi to press for their demands. pic.twitter.com/oI0ouWwlCj — ANI (@ANI) February 13, 2024 ఢిల్లీ వ్యాప్తంగా నెలరోజులపాటు 144 సెక్షన్ డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న భద్రతా బలగాలు అంబాల హైవేపైకి భారీగా రైతులు ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం రైతుల చలో ఢిల్లీ రహదారులను మూసివేసిన పోలీసులు పలుచోట్ల అతినెమ్మదిగా కదులుతున్న వాహనాలు ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్.. పంజాబ్,హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత సరిహద్దుల వద్ద రైతులను అడ్డుకున్న పోలీసులు రైతుల టియర్ గ్యాస్ ప్రయోగం ఢిల్లీ ముట్టడికి రైతుల యత్నం 2020 ఉద్యమం తరహాలో పోరుగు సిద్ధమైన రైతులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న రైతులు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదన్న రైతులు ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలతో బయల్దేరిన రైతులు ధీర్ఘకాలిక ఉద్యమాన్ని కొనసాగించాలని రైతులు నిర్ణయం మంత్రులతో చర్చలు విఫలం కావడంతో మొదలైన రైతుల మార్చ్ శాంతియూతంగా ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం సాక్షి, ఢిల్లీ: రైతుల ఢిల్లీ ఛలో యాత్రతో నగర సరిహద్దులో యుద్ధవాతావరణం నెలకొంది. ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో సంభూ సరిహద్దులో అడ్డగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరసనకారులు.. అంబాల హైవే పైకి చేరారు. #WATCH | Police use tear gas drones at the Haryana-Punjab Shambhu border to disperse protesting farmers. pic.twitter.com/LcyGpDuFbv — ANI (@ANI) February 13, 2024 మరోవైపు.. పంజాబ్, హర్యానాల నుంచి నిరసనకారులు ఢిల్లీ వైపు వచ్చే యత్నం చేస్తేఉన్నారు. ఇంకోపక్క రైతన్నల ఢిల్లీ ఛలో ప్రభావంతో.. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రహదారుల దగ్గర పోలీసుల మోహరింపు.. తనిఖీలతో.. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అతినిదానంగా వాహనాలు కదులుతుండడంతో.. కిలో మీటర్ దూరం దాటేందుకు గంటల సమయం పడుతోందని వాహదనదారులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. రైతుల మెగా మార్చ్ను భగ్నం చేసేందుకు.. ఢిల్లీకి దారి తీసే ప్రధాన సరిహద్దుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిమెంట్ దిమ్మెలు, కంచెలతో అడ్డుకునే యత్నం చేస్తున్నారు. సింగూ, టిక్రిలతో పాటు ఢిల్లీ(ఘజియాబాద్), యూపీ నొయిడాల సరిహద్దు ప్రాంతాలైన ఘాజిపూర్, చిల్లా వద్ద పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అయితే పోలీసులు మాత్రం దారుల్ని పూర్తిగా మూసేయలేదని.. ఫెన్సింగ్లో పాక్షికంగా మూసేసి తనిఖీల అనంతరం అనుమతిస్తున్నామని చెబుతున్నారు. #Traffic snarls on the highway from #Gurugram towards #DelhiPolice place concrete slabs on the road as a part of measures to stop farmers from marching to Delhi#DelhiNCR #FarmersProtest pic.twitter.com/oqCel5wEUf — cliQ India (@cliQIndiaMedia) February 13, 2024 అలాగే అత్యవసరాల వస్తువులను సైతం అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఎన్హెచ్ 48పై కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆందోళనకు తరలివస్తున్న రైతుల్ని పంజాబ్ పోలీసులు అనుమతిస్తుండడం గమనార్హం. #WATCH | Punjab Police allows protesting farmers to cross Rajpura bypass to head towards Haryana's Ambala onward to Delhi for their protest to press for their demands pic.twitter.com/yCMvdNnD8t — ANI (@ANI) February 13, 2024 ఇదిలా ఉంటే.. పలు డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలోను ప్రారంభించారు. మంగళవారం ఉదయం పంజాబ్, హర్యానా ఇలా సమీప ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభించారు. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు.. సరిహద్దుల్లో కంచెలతో భారీగా మోహరించారు. దీంతో ఏం జరగనుందా? అనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. #WATCH | Delhi Police personnel and barricades deployed at ITO intersection, section 144 CrPC imposed, in view of farmers' protest march to Delhi demanding a law guaranteeing MSP for crops pic.twitter.com/ZSUhHhFFA7 — ANI (@ANI) February 13, 2024 కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో.. ముందుగానే నిర్ణయించినట్లు ‘ఢిల్లీ చలో’ పేరుతో భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు కదిలారు. పంజాబ్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. మరోవైపుభగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. #WATCH | Farmers begin their 'Delhi Chalo' march from Fatehgarh Sahib in Punjab. pic.twitter.com/WE7mXiPu9J — ANI (@ANI) February 13, 2024 #WATCH | Farmers begin their 'Delhi Chalo' march from Shambhu Border. pic.twitter.com/tKEF6iEHkZ — ANI (@ANI) February 13, 2024 సోమవారం నాడు.. యాత్రను విరమించుకోవాలని సూచించిన కేంద్రం.. రైతుసంఘాల నాయకులతో చండీగఢ్ వేదికగా సోమవారం దాదాపు అర్ధరాత్రి వరకూ చర్చలు కొనసాగించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్సింగ్ పంధేర్ తదితరులతో సమాలోచనలు జరిపింది. డిమాండ్లు ఏంటంటే.. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు భరోసా కల్పించేలా చట్టం చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంటరుణాల మాఫీ, రైతులు-రైతుకూలీలకు పింఛన్లు ఇవ్వడం, మూడు వ్యవసాయ చట్టాలకు (తర్వాత రద్దయ్యాయి) వ్యతిరేకంగా 2020-21లో ఉద్యమించినప్పుడు రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ నడిచింది. వీటిలో.. 2020-21 నాటి కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. నాటి ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాల్లో ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకుండా ఉండిఉంటే.. వారికీ పరిహారం అందించేందుకు సమ్మతించింది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఢిల్లీ మార్చ్ యథాతథంగా కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సర్వన్సింగ్ పంధేర్ ప్రకటించారు. మరోవైపు రైతు నాయకులతో కేంద్రం ఈ నెల 8న కూడా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆంక్షల వలయంలో హస్తిన రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నివారించేందుకు నగరంలో సోమవారం నుంచి నెల పాటు సెక్షన్-144 విధిస్తూ దిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోడా ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల నిరసనను సంఘ విద్రోహశక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ముప్పుందని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో పెట్టుకొని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు, అంతిమయాత్రలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. #WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today. (Visuals from Jharoda border) pic.twitter.com/xcFCYaeoMz — ANI (@ANI) February 13, 2024 -
ఢిల్లీలో ఆప్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
న్యూఢిల్లీ: బీజేపీ, ఆప్ చేపట్టిన పోటీపోటీ నిరసనలతో శుక్రవారం సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. రెండు పార్టీల శ్రేణులు నేరుగా తలపడే పరిస్థితిని నివారించేందుకు పోలీసులు పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. దేశ రాజధాని వ్యాప్తంగా పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. పండిట్ దీన్ దయాళ్ మార్గ్(డీడీయూ)వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా నిరసన తెలపాలని నిర్ణయించింది. అదేసమయంలో, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆప్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని కాషాయ పార్టీ తీర్మానించుకుంది. ఆ మేరకు రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు బయలుదేరగా పోలీసులు వారిని 800 మీటర్ల దూరంలో ఆపేశారు. రోడ్డుపై పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించి పరస్పరం తలపడే పరిస్థితిని నివారించారు. రెండు పార్టీల నాయకులు అక్కడే ధర్నా చేపట్టారు. ఈడీ సమన్లకు అయిదోసారీ డుమ్మా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నించేందుకు ఈడీ బుధవారం ఐదోసారి పంపిన సమన్లనూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పట్టించుకోలేదు. శుక్రవారం విచారణకు డుమ్మా కొట్టారు. -
పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది.. అప్పుడు ఏమైందంటే..
‘పెళ్లి జరగాలంటే?’ అనే ప్రశ్నకు ‘రెండు మనసులు కలవాలి’ అనే సిన్మా డైలాగ్ చెబుతాం. బెంగళూరు విషయానికి వస్తే మాత్రం ‘వధూవరులు టైమ్కు ఫంక్షన్ హాల్కు చేరుకోవాలి’ అనే జవాబే వినిపిస్తుంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అనేది తరచుగా వార్తల్లో ఉండే అంశం. బెంగళూరులో ఒక వధువు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయింది. మరో వైపు పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది. దీంతో బ్రైడల్ కారును విడిచి పరుగెత్తుతూ మెట్రో రైలు ఎక్కింది వధువు. ముహుర్తం టైమ్కు ముందుగానే ఫంక్షన్ హాల్కు చేరుకుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధువు మెట్రో ఆటోమేటిక్ ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ‘మెట్రోవాలే దుల్హనియా లేజాయేంగే’ ‘ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ ‘స్మార్ట్ థింకింగ్’... ఇలాంటి రకరకాల కామెంట్స్ నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి. -
పోటెత్తిన భక్తజనం
అయోధ్య: అయోధ్య అక్షరాలా భక్తజన సంద్రంగా మారుతోంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బాలరామున్ని కళ్లారా దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచీ భక్తులు సరయూ తీరానికి పోటెత్తుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట వేడుక ప్రధానంగా వీఐపీలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. సాధారణ భక్తులకు మంగళవారం నుంచి అనుమతిస్తామని ముందుగానే ప్రకటించారు. దాంతో తెల్లవారుజాము మూడింటి నుంచే భారీ క్యూ లైన్లు మొదలయ్యాయి. ఉదయానికల్లా అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆలయానికి దారితీసే ప్రధాన రహదారి రామ్ పథ్ భక్తుల వరదతో నిండిపోయింది. వారి జై శ్రీరాం నినాదాలతో పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. పోలీసు సిబ్బంది కష్టమ్మీద వాటిని నియంత్రించారు. ఉదయం ఆరింటి నుంచి 11.30 దాకా దర్శనాలను అనుమతించారు. ఆ సమయంలో ఏకంగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఏడింటికి రెండో విడతలో మరో 2 లక్షల పై చిలుకు భక్తులకు దర్శనం జరిగినట్టు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యను సందర్శించి భక్తులకు దర్శన ఏర్పాట్లు తదితరాలను స్వయంగా పర్యవేక్షించారు. దేశ నలుమూలల నుంచీ... అయోధ్యకు తరలివస్తున్న భక్తుల్లో మహారాష్ట్ర, తెలంగాణ మొదలుకుని అటు పశ్చిమబెంగాల్, అసోం దాకా పలు రాష్ట్రాల వారున్నారు. వీరిలో చాలామందికి అయోధ్య సందర్శన ఇదే తొలిసారి. వీరిలో చాలామంది కనీసం రెండు మూడు రోజుల పాటు ఉండి నగరాన్ని పూర్తిగా సందర్శించేలా ప్లాన్ చేసుకున్నవారే. పలువురు భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి నేరుగా లగేజీతో సహా ఆలయానికి వచ్చేస్తున్నారు! సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా తెల్లవారుజామునే ఆలయ పరిసరాల్లో రామ్ ధున్ మారుమోగింది. అయోధ్యకు వాహనాల ట్రాఫిక్ కూడా ఊహాతీతంగా పెరిగిపోయింది. దాంతో నగరానికి 30 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతం: మోదీ అయోధ్య భవ్య మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగిన తీరు మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వేడుకకు సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రాణప్రతిష్ట క్రతువులో ముఖ్య యజమానులుగా పాల్గొన్న 14 మంది దంపతుల్లోనూ ఇదే భావన వ్యక్తమైంది. దాన్ని సాటిలేని దివ్యానుభూతిగా అభివర్ణించారు. దాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని వారణాసిలోని మణికరి్ణక ఘాట్ శ్మశానవాటిక కాటికాపరి కుటుంబానికి చెందిన అనిల్ చౌదరి, సప్నాదేవి దంపతులు అన్నారు. వీరందరినీ దేశ నలుమూలల నుంచీ ప్రత్యేకంగా ఎంపిక చేయడం తెలిసిందే. అయోధ్య రామయ్య ఇకపై బాలక్ రామ్ అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లాను ఇకపై బాలక్ రామ్గా పిలవనున్నారు. స్వామి ఐదేళ్ల బాలుని రూపులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్గా పిలవనున్నట్టు ప్రకటించారు. వారణాసికి చెందిన ఆయన సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఇప్పటిదాకా దాదాపు 60 దాకా ఆలయాల ప్రాణప్రతిష్టల్లో పాలుపంచుకున్నా. వాటన్నింట్లోనూ అయోధ్య ప్రాణప్రతిష్ట సర్వోత్తమం. ఆ సందర్భంగా అత్యంత అలౌకికానుభూతికి లోనయ్యా’’ అని దీక్షిత్ చెప్పుకొచ్చారు. ఆరు హారతులు, నైవేద్యాలు బాలక్ రామ్ రోజూ ఆరు హారతులు అందుకోనున్నాడు. స్వామికి ఉదయం మంగళారతితో మొదలు పెట్టి శృంగార, భోగ, ఉపతన, సంధ్యా హారతుల అనంతరం చివరగా శయనారతితో నిద్ర పుచ్చుతారు. బాలక్ రాముడు సోమవారం తెలుపు వ్రస్తాల్లో, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పుసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వ్రస్తాలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. రబ్డీ, ఖీర్, పళ్లు, పాలతో పాటు పలురకాల నైవేద్యాలు అందుకుంటాడు. -
ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కటకట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సాయంత్రానికి పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. బంకుల వద్ద ట్రాఫిక్ స్తంభన ప్రభావం ప్రధాన కూడళ్లు, రహదారులపై పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పనుల మీద బయటకొచ్చిన వారు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ అయిపోయిన వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో.. వాస్తవానికి రెండురోజుల క్రితమే వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఫలితంగా ప్రెటోల్ బంకులకు సరఫరా నిలిచిపోయింది. ఇక బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు పూర్తి స్థాయిలో సమ్మెకు దిగనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం వేలాదిగా వాహనాలు బారులు తీరాయి. సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్న ఆందోళనతో ఎక్కువమంది ట్యాంకులు ఫుల్ చేయించడం కన్పించింది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద క్యాన్లలో ఆయిల్ నింపుకొని తీసుకెళ్లారు. దీంతో మధ్యాహ్నానికల్లా చాలా వరకు బంకుల్లో నిల్వలు ఖాళీ అయ్యాయి. ఆయా బంకుల యాజమానులు బంకులు మూసేసి నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,500 పెట్రోల్ బంకులు ఉండగా 3 వేల వరకు బంకులు మూతపడటంతో సాయంత్రానికి పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమయ్యింది. హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకులన్నింటిలో నిల్వలు ఖాళీ అయ్యాయి. తాత్కాలికంగా సమ్మె విరమణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నిల్వలు ఖాళీ కావడంతో డీలర్ల సొంత ట్యాంకర్లను రంగంలోకి దింపారు. వారు ఆందోళన విరమించి ఇంధన సరఫరాకు సిద్ధమయ్యారు. మరోవైపు సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు రాష్ట్ర పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు నిరసనగా డ్రైవర్లు సోమవారం నుంచి ఆయిల్ టాంకర్స్ నిలిపివేసి ఆకస్మిక సమ్మెలోకి వెళ్ళారని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల అసోసియేషన్లు కూడా సమ్మె విరమించే అవకాశాలు ఉండటం, చమురు సంస్ధల డిపోల వద్దకు డీలర్ల ట్యాంకర్లు లోడింగ్కు చేరుకోవడంతో బుధవారం ఆయిల్ సరఫరాకు అంతరాయం ఉండబోదని డీలర్ల వర్గాలు ప్రకటించాయి. ఇంధన సరఫరాలో కొరత ఉండదు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఇంధన ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంగళవారం పౌరసరఫరాల భవన్లో బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ట్యాంకర్ల డ్రైవర్లతో చర్చించాలని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీలకు, డ్రైవర్లకు తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే విధుల్లో చేరాలని ట్యాంకర్ల డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని, ప్రజలు ఆందోళనకు గురికావద్దని కమిషనర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అప్పా జంక్షన్ వద్ద ఎస్ఐకి గాయాలు! రాజేంద్రనగర్: బండ్లగూడ అప్పా జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి సిబ్బందికి వాహనదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెట్రోల్ కోసం వచ్చిన సందర్భంగా వాగ్వావాదం జరగడంతో పరస్పరం దాడి చేసుకున్నట్టు సమాచారం. ఈ పెట్రోల్ బంకును పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా.. విధుల్లో ఉన్న ఒక ఎస్ఐ ర్యాంకు అధికారితో పాటు సిబ్బందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు చెప్పారు. -
HYD Traffic Jam: ట్రాఫిక్లో చిక్కుకున్న హైదరాబాద్ నగరం
హైదరాబాద్, సాక్షి: ట్రాఫిక్ పద్మవ్యూహంలో హైదరాబాద్ అనే మహా నగరం చిక్కుకుంది. పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూల నేపథ్యంలో నేపథ్యంలో.. ఈ పరిస్థితి నెలకొంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నా.. ఫలితం కనిపించడం లేదు. మంగళవారం సాయంత్రం నగరంలో ఒక్కసారిగా వాహనాల రద్దీ నెలకొంది. పెట్రో స్టాక్లు నిండుకుంటాయనే ప్రచారాల నేపథ్యంలో.. ట్యాంక్ ఫుల్ చేసుకునేందుకు వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు. మరికొందరు క్యాన్లతో బంక్ల వద్ద క్యూలలో నిల్చున్నారు. దీంతో బంక్ల వద్ద మీటర్ల దూరం వాహనాలు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్పై ప్రభావం పడింది. దీంతో దాడులు జరగవచ్చనే ఆందోళనతో బంక్ యజమానులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అంతకు ముందు ఉదయం ఆయిల్ ట్యాంకర్లు రాకపోవడంతో బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. పెట్రోల్,డీజిల్ దొరకదనే ఆందోళనతో వాహనదారులు బంకుల వైపు పరుగులు తీశారు. తీరా సాయంత్రం కల్లా ఆయిల్ ట్యాంకర్ల రాకతో కాస్త ఉపశనమం లభించింది. అయితే మళ్లీ పెట్రోల్ దొరుకుతుందో లేదో అనే ఆందోళన నడుమ వాహనదారులు బంకుల వైపు వెళ్తున్నారు. వాహనాల రద్దీతో కిలోమీటర్ దూరానికే గంటల కొద్దీ సమయం పడుతోంది. లక్డీకాపూల్తో పాటు గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోనూ భారీ ట్రాఫిక్ నెలకొంది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. Ye kya huwa 😂🤣#PetrolDieselPrice #petrolpump #Hyderabad #Petrol #Whatsapp #TruckDriversProtest #ViralVideos #petrolpump pic.twitter.com/sr22sefUjd — Nitin yadav (@Nitinyada7) January 2, 2024 #TruckDriversProtest: Long queues at petrol pumps, with most fuel stations running dry in #Hyderabad. This video from the Assembly metro station petrol pump. pic.twitter.com/sNfoHfRiWI — Iqbal Hussain⭐ اقبال حسین (@iqbalbroadcast) January 2, 2024 Avoid #Ikea #Raidurgam #hitechcity #inorbit #cyberabad Complete chaos, full of traffic wit horn all around.. pls pls don't come out and don't be traffic 🙏🙏@HiHyderabad @3rdEyeDude @Team_Road_Squad @vinay_vangala @KTRBRS @swachhhyd #hyderabad #Telangana #PetrolDieselPrice pic.twitter.com/QVXJjOsATk — TGCitizen (@Citizen_TS) January 2, 2024 -
పెట్రోల్ బంకులకు పోటెత్తిన వాహనదారులు
-
బ్రిడ్జి కింద ఇరుక్కున్న ఎయిరిండియా విమానం.. భారీగా ట్రాఫిక్జామ్
Airplane Viral Video: బీహార్లో నిన్న శుక్రవారం ఒక విచిత్రమైన ఘటన జరిగింది. మోతీహరి ప్రజలు సరికొత్త అనుభూతిని ఎదుర్కొన్నారు . నడిరోడ్డుపై ఎయిరిండియా విమానం సందడి చేసింది. అయితే ఓ బ్రిడ్జి కింద అది ఇరుక్కుపోవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడగా.. కొందరు మాత్రం తమ ఫోన్లకు పని చెప్పారు. అయితే అదేం ప్రస్తుతం సర్వీస్లో ఉన్న విమానం కాదు. కాలపరిమితి ముగిసి.. పాడైపోయిన ఎయిరిండియా ఏ320 విమానం. ఆ భారీ విమానాన్ని ముంబై నుంచి అసోంకు ఓ ట్రక్కులో తరలించే యత్నం చేశారు. అయితే మోతీహరి పిప్రాకోటి ప్రాంతానికి చేరుకున్నాక.. అక్కడి ఓవర్ బ్రిడ్జి కింద ఆ విమానంతో కూడిన ట్రక్కు దాటేందుకు ఇబ్బంది ఎదురైంది. దీంతో.. ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రక్కు డ్రైవర్ పొరపాటు వల్లే ట్రాఫిక్ విఘాతం ఏర్పడిందని అధికారులు తెలిపారు. मुंबई से ले जाते समय एक्स-एयर इंडिया A320 का धड़ मोतिहारी में एक पुल के नीचे फंस गया#AirIndia #Motihari #Mumbai #HindiNews #BreakingNews #Bihar #biharnews #PlaneVideo #Motihari #MotihariAirplaneStuck #viralvideo pic.twitter.com/YYoBFGNKCd — Khushbu_journo (@Khushi75758998) December 30, 2023 పోయిన నెలలో ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి ఓ ఘటనే జరిగింది. ఓ పాత విమానాన్ని కొచ్చిన్ నుంచి ట్రాలీ లారీపై హైదరాబాద్ తరలిస్తుండగా బాపట్ల జిల్లాలోని ఓ అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయింది. పాత విమానాన్ని హోటల్గా మార్చాలన్న ఉద్దేశంతో హైదరాబాద్కు చెందిన ‘పిస్తాహౌస్’ దీనిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దీనిని హైదరాబాద్ తరలిస్తుండగా బాపట్ల మేదరమెట్ల బైపాస్లోని అండర్ పాస్ వద్ద విమానాన్ని తరలిస్తున్న ట్రాలీ ఇరుక్కుపోయింది. దీంతో.. విమానానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా దానిని అండర్ పాస్ నుంచి బయటకు తెచ్చారు. -
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
తిరువనంతపురం: శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచేగాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళుతున్నారు. భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఎరుమేలికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయాయి. నేడు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు అవస్థలు పడుతున్నారు. ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళుతున్నారు. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని వ్యాఖ్యానించారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు. ప్రత్యేక రైళ్లు.. ఇదిలా ఉండగా.. అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 51 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రత్యేక రైళ్లు.. డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీల్లో శబరిమలకు చేరుకుంటాయి. ఇదీ చదవండి: ఉగ్రదాడిలో రిటైర్డ్ పోలీసు అధికారి మృతి -
రద్దీ వేళల్లో ఎక్కడిక్కడ ఆగిన ట్రాఫిక్
హైదరాబాద్: దీపావళి ఎఫెక్ట్ నగర రహదారులపై శుక్రవారమే కనిపించింది. దీనికి తోడు ‘ఎన్నికల ప్రభావం’ కూడా ఉంది. వెరసీ.. నగరంలో ప్రధాన రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వీటి వేగం నత్తలతో పోటీ పటడంతో వాహన చోదకులకు నరకం కనిపించింది. అనేక ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దీపావళి నేపథ్యంలో రహదారులపై తాత్కాలిక బాణాసంచా దుకాణాలు వెలిశాయి. వీటితో పాటు ప్రమిదలు తదితరాలు విక్రయించే వారు కూడా ఫుట్పాత్లపై సరుకులు ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేపట్టారు. ఈ కారణంగా క్యారేజ్వేలు దుకాణాలు, చిరు వ్యాపారులతో నిండిపోయాయి. ఖరీదు చేయడానికి వచ్చినవారు అనివార్యంగా తమ వాహనాలను రోడ్లపైనే నిలపాల్సి వచ్చింది. ఈ ప్రభావం రహదారిపై ఉన్న ట్రాఫిక్పై పడింది. దీపావళి నేపథ్యంలో స్వీట్లు, డ్రైఫ్రూట్స్ పంచిపెట్టే ఆనవాయితీ ఉంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఈ పంపకాలన్నీ దాదాపు శుక్రవారమే పూర్తి చేశారు. వీటిని ఖరీదు చేయడానికి ఆయా దుకాణాల వద్ద వినియోగదారులకు బారులు తీరారు. వీరి వాహనాల కారణంగా ఆ రహదారులు ఇరుకై పోయాయి. దీనికి తోడు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక చోట్ల ట్రాఫిక్ ఆగడం, అతి నెమ్మదిగా సాగడం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు కావడంతో భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. దీనికోసం రిటర్నింగ్ అధికారులుగా నియమితులైన రెవెన్యూ అధికారుల కార్యాలయాల వద్ద పోలీసులు ‘100 మీటర్ల’ బారికేడింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఆయా రహదారులు కుంచించుకుపోయాయి. ఈ పరిణామాలకు తోడు నామినేషన్లు చేయడానికి వెళ్లే అభ్యర్థులు, వారి వెంట వచ్చే అనుచరులు, వాహనాలు తదితరాల నేపథ్యంలోనే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. ఇవి చాలవన్నట్లు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టడంతో భారీగా రద్దీ నెలకొంది. -
హైదరాబాద్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా.. శుక్రవారం పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండోరోజు నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలు కదులుతుండడంతో.. పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఇంకా అమలు చేస్తున్నారు. నిమజ్జనం కోసం ఇంకా వందల సంఖ్యలో విగ్రహాలు రోడ్ల వెంట బారులు తీరాయి. ఈ క్రమంలో పోలీసులు కీలక సూచన చేశారు. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్లో వెళ్లే వాహనాలు.. ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. నగరంలో నిన్న(గురువారం) ఉదయం నుంచి విగ్రహాల నిమజ్జనం మొదలైంది. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం తర్వాత చాలాసేపు విగ్రహాల నిమజ్జనం జరగలేదు. సాయంత్రం నుంచి విగ్రహాలు ట్యాంక్బండ్ వైపు రావడం మొదలైంది. ఈ క్రమంలో ఇవాళ రెండో రోజూ కూడా ట్యాంక్బండ్లో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. లిబర్టీ మీదుగా హిమాయత్ నగర్, నారాయణగూడ, తిలక్నగర్.. కోరంటి ఆస్పత్రి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అబిడ్స్, లక్డీకాపూల్ వైపు భారీగానే ట్రాఫిక్ ఉంది. మరోవైపు ట్యాంక్బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్బండ్పై గణనాథులు బారులు తీశారు. మధ్యాహ్నాంలోగా నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. -
బెంగుళూరు ట్రాఫిక్ జామ్లో టైమ్కి పిజ్జా డెలివరీ..
బెంగళూరు: లాంగ్ వీకెండ్ కావడంతో బెంగళూరు టెకీలు ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు. దీంతో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బెనాలూరు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో ట్రాఫిక్లో ఇరుక్కున్న ఓ వ్యక్తి డామినోస్ పిజ్జా ఆర్డర్ చేయగా అంత ట్రాఫిక్ జామ్లో కూడా సమయానికి డెలివరీ చేశాడు డెలివరీ బాయ్. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సదరు వ్యక్తి. ఆన్టైమ్ డెలివరీ.. ఎలాగూ ట్రాఫిక్ జామ్ అయ్యింది కాబట్టి ఇప్పట్లో గమ్యానికి చేరుకోలేమని భావించి రిషివత్స అనే వ్యక్తి డామినోస్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేసి లైవ్ లొకేషన్ ఇచ్చాడు. కానీ అతడిని ఆశ్చర్యానికి గురిచేస్తూ డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్ అంత ట్రాఫిక్ జామ్లో కూడా ప్రామిస్ చేసినట్టుగా ట్రాఫిక్ ఉండగానే అర్ధగంటలో డెలివరీ చేశాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు విశేష స్పందన రాగా కామెంట్లలో నెటిజన్లు డామినోస్పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. When we decided to order from @dominos during the Bangalore choke. They were kind enough to track our live location (a few metres away from our random location added in the traffic) and deliver to us in the traffic jam. #Bengaluru #bengalurutraffic #bangaloretraffic pic.twitter.com/stnFDh2cHz — Rishivaths (@rishivaths) September 27, 2023 బారులు తీరిన వాహనాలు.. ఈరోజు మిలాద్-ఉన్-నబీ, రేపు కావేరీ జల వివాదం కారణంగా కర్ణాటక బంద్, ఎల్లుండి శనివారం, తర్వా ఆదివారం, సోమవారం గాంధీ జయంతి ఇలా బెంగుళూరు వాసులకు వరుసగా ఐదు రోజులు సెలవులు దొరికాయి. దీంతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగస్తులు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయడానికి సొంతూళ్ళకు బయలుదేరారు. ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడంతో సాయంత్రం 5 నుంచే బెంగళూరు మహానగరంలో రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలన్నీ గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో అయితే వాహనాలు చాలా వరకు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం వలన కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. This is every day before a long weekend in Bangalore, it's same 3-8pm today. Karnataka taking highest tax on liquor (83%) if can utilize even 10% of that can make proper roads and infra. #BangaloreTraffic #bangalore #longweekendhttps://t.co/XlOarOY6hj pic.twitter.com/goU6PIR9ae — nsrivastava.eth (@nitinkr1991) September 27, 2023 #bangaloretraffic Yesterday I saw most my friends in bangalore tweet about massive traffic jam. 2 hours for 8-10 kms and even more..when we are gonna diversify companies to other parts of KA? Bangalore has almost choked bec of political greed,ppl are suffering..feels sorry!! pic.twitter.com/caOvvfTRx7 — North karnataka Rises (@NorthKA_Rises) September 28, 2023 ఇది కూడా చదవండి: లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్ఫారం ఎక్కించేశాడు.. -
ట్యాంక్ బండ్పై భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనంతో ట్యాంక్ బండ్పై కోలాహలం నెలకొంది. అయితే ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఓ విగ్రహ తీసుకెళ్తున్న వాహనం నిలిచిపోగా.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఇది చోటు చేసుకోగా.. దాదాపు ఐదు గంటల పాటు అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. ట్రాక్టర్పై విగ్రహం తీసుకెళ్తుండా.. టైర్ డ్యామేజ్ అయ్యి వాహనం ఆగిపోయింది. దీంతో ట్యాంక్ బండ్ వద్ద భారీ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. చాలా సేపటి దాకా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోలేదని వాహనదారులు మండిపడుతున్నారు. మరోవైపు పీవోపీ(ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) విగ్రహాల నిమజ్జనం తాత్కాలిక కుంటల్లోనే చేయించాలంటూ జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై ట్యాంక్ బండ్పై నిన్న నిరసన చేపట్టారు కొందరు. -
ట్రాఫిక్జామ్తో జూనియర్ లెక్చరర్ పరీక్షకు దూరం
పటాన్చెరు టౌన్: పటాన్చెరు నవపాన్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఓ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుపోయిన పలువురు అభ్యర్థులు పటాన్చెరు మండలం రుద్రారం గీతం వర్సిటీ క్యాంపస్లోని జూనియర్ లెక్చరర్ పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోలేకపోయారు. ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులు మాట్లాడుతూ గంట ముందే పరీక్ష కేంద్రానికి పటాన్చెరు నుంచి బయలుదేరామని, ట్రాఫిక్ జామ్ కారణంగా 12 మంది అభ్యర్థులు 2 నుంచి ఐదు నిమిషాలు, మరో 18 మంది అభ్యర్థులు 10 నిమిషాలు ఆలస్యంగా కేంద్రానికి వచ్చామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా టీఎస్పీఎస్సీ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్ష నోటిఫికేషన్ వచ్చిందని, ట్రాఫిక్ జామ్ కారణంగా పరీక్ష రాయలేకపోయామని రోదిస్తూ చెప్పారు. -
Heavy Rains: హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్
-
HYD: ఉధృతంగా మూసీ.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానతో రాజేంద్రనగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో.. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఒడ్డున ఉన్న కాలనీల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి వేయడంతో చాదర్ ఘాట్ మూసీ పరివాహక ప్రాంతాలలో ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళాలని అధికారులు ఆదేశించారు. అయితే తమకు పునరావాసం కేంద్రాలు ఏర్పాట్లు చేయకుండా.కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికి వెల్లుతామని బాధితులు వాపోతున్నారు. #HyderabadRains కృష్ణానగర్ పూర్ణా టిఫిన్ గల్లీలో వరద భీభత్సం pic.twitter.com/ysY9c8D2nG — keshaboina sridhar (@keshaboinasri) September 5, 2023 ఇక.. ఇప్పటికే కురిసిన కుండపోత వానతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలో ఏవైపు చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బేగంపేట ప్రకాశ్ నగర్ దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రగతి భవన్ ఎదురుగానూ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. Water logging in several areas of #Hyderabad after hours of rains; these visuals from near #MoosapetMetro station; bike that was washed away in waters, got stuck in a manhole in #Borabanda & was retrieved #HyderabadRains @ndtv @ndtvindia pic.twitter.com/bgNdwV2aLe — Uma Sudhir (@umasudhir) September 5, 2023 పంజగుట్ట నుంచి బేగంపేట ఫ్లై ఓవర్ వైపు వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలోనూ భారీ సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో.. దాదాపు 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. శంషాబాద్లోనూ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షంతో రోడ్లు నిండిపోయి.. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. జీడిమెట్ల ఫస్ట్ ఎవెన్యూ కాలనీలో నీరు నిలిచింది. కూకట్పల్లిలో 14 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. కూకట్పల్లి దీన్దయాల్ నగర్లోకి వరద నీరు చేరింది. ఫతేనగర్ రోడ్లపైకి భారీగా నీరు వచ్చి చేరింది. నిజాంపేట ఈశ్వర విల్ల ఐదు అడుగుల మేర నీట మునిగింది. ఆల్వాల్ మచ్చబొల్లారంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నార్సింగిలోని బాలాజీ నగర్ కాలనీ చెరువును తలపిస్తోంది. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నా.. అధికార యంత్రాంగం స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ ఫస్ట్ ప్లేస్లో ఈ రోడ్డు!
హైదరాబాద్: నగరంలో ఇది కీలకమైన రోడ్డు. అనునిత్యం ప్రముఖులు కూడా ప్రయాణిస్తుంటారు. అయితే ఈ మార్గంలో రద్దీ వేళల్లో ట్రాఫిక్ వాహనచోదకులకు నరకం చూపిస్తోంది. డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతోంది. సదరు రూట్లో ఉన్న బాటిల్ నెక్స్తో పాటు కొన్ని వ్యాపార సంస్థల కారణంగానూ ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏళ్లుగా ఇదే దుస్థితి ఉన్నా ట్రాఫిక్ విభాగం అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంజగుట్టలోని నాగార్జున సర్కిల్ నుంచి పెన్షన్ ఆఫీస్ మీదుగా మాసబ్ ట్యాంక్ చౌరస్తా వరకు 2.9 కిలోమీటర్ల పరిధిలో రోడ్ నెం.1 ఉంటుంది. నిరంకారి–పంజగుట్ట మధ్య ఉన్న మార్గానికి ఇది సమాంతరంగా ఉంటుంది. రోడ్ నెం.1 మీదుగా అనునిత్యం ప్రముఖులు, ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు, సామాన్యులు సైతం ప్రయాణిస్తుంటారు. ఈ కారణంగానే రోడ్డు రోజూ రద్దీగానే ఉంటుంది. వెస్ట్జోన్ పరిధిలో ఉన్న అనేక కీలక ఆస్పత్రులకు వెళ్లి వచ్చే అంబులెన్సులతో హడావుడి కూడా ఎక్కువే. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఈ రోడ్డులో ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.1 మీదనే తాజ్ కృష్ణ, 1/10, 1/12 వంటి కీలక జంక్షన్లతో పాటు పోలీసు ఆఫీసర్స్ మెస్ ‘టి’ జంక్షన్ కూడా నిత్యం హడావుడిగానే ఉంటుంది. రద్దీ వేళల్లో 45 నిమిషాల వరకు... వెస్ట్జోన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళే ప్రయాణికులు సైతం రోడ్ నెం.1నే ఆశ్రయిస్తారు. మాసబ్ట్యాంక్ మీదుగా మెహదీపట్నం వరకు వెళ్ళి అక్కడే పీవీ నర్సింహ్మారావు ఎక్స్ప్రెస్ వే ఎక్కుతారు. దీంతో విదేశీయుల కోణంలోనూ ఈ రూట్ కీలకమే. ఈ రహదారిలో ఉన్న జంక్షన్లలో కొన్ని ఇరుకుగా ఉంటాయి. దీనికి తోడు కేర్ ఆస్పత్రికి సమీపంలో, 1/12 జంక్షన్ దాటిన తర్వాత రోడ్డు బాటిల్ నెక్గా మారుతుంది. వీటితో పాటు ఈ రహదారిలో ఉన్న రెండు ప్రముఖ బేకరీ కమ్ రెస్టారెంట్లకు వచ్చిపోయే వాహనాలు, ఓ మద్యం దుకాణం వద్ద ఆగే కొనుగోలుదారుల వెహికిల్స్తో తీవ్ర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ఈ కారణాలతో రద్దీ వేళల్లో ఒక్కోసారి ఈ రూట్ దాటడానికి 45 నిమిషాల వరకు పడుతోంది. అంబులెన్సుల సైరన్ వినిపిస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటోంది. వర్షం కురిస్తే మరీ ఘోరం... సాధారణ రోజుల్లో పీక్ అవర్స్గా పిలిచే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ఇక వర్షం కురిసిన రోజుల్లో సమయాలతో సంబంధం లేకుండా రోడ్డు మొత్తం జామ్ అయిపోతుంది. ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికి అటు జీహెచ్ఎంసీ, ఇటు పోలీసు విభాగాలు సరైన చర్యలు తీసుకోవట్లేదు. గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి అత్యంత ప్రముఖుల కదలికలు ఉంటే మాత్రమే ట్రాఫిక్ పోలీసుల హడావుడి కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో ఈ అధికారులు తీసుకునే చర్యలు నామమాత్రమే. ఆయా వ్యాపార సంస్థల వద్ద రోడ్డుపై వాహనాలు ఆగినా, క్యారేజ్ వేల్లో రాంగ్ పార్కింగ్ చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. దీని ప్రభావం బంజారాహిల్స్ రోడ్.నెం.1 మొత్తమ్మీద ఉంటోంది. ఇకనైనా అధికారులు స్పందించి తమ ఇబ్బందులు తీర్చాలని వాహనచోదకులు కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఈ రూట్లో గస్తీ వాహనాలు మోహరించాలని సూచిస్తున్నారు. -
‘పట్నం’లో భారీగా ట్రాఫిక్జాం
ఇబ్రహీంపట్నం: ట్రాఫిక్ జాంతో ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం స్థానికులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. సుమారు గంటకుపైగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్–నాగార్జునసాగర్ హైవేపై ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. స్థానిక అంబేడ్కర్, డాక్బంగ్లా చౌరస్తాల వద్ద పాత ఇబ్రహీంపట్నం, మంచాల రోడ్డు, బృందావన్ కాలనీ వైపు వెళ్లేందుకు దారులుంటాయి. ఇక్కడే వాహనాదారులు టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్–సాగర్ రోడ్డుపై వెళ్లే వాహనాలతోపాటు ఈ మూడు దిక్కుల నుంచి వాహనాలు టర్న్ చేసుకునేందుకు నిరీక్షించాల్సి వస్తుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా రోడ్లపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో వాటిని కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది, ఓ బాటసారి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు సాయపడ్డారు. వారి సాయంతో పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఇబ్రహీంపట్నానికి మంజూరైన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను వెంటనే ఏర్పాటు చేసి ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించాలని స్థానికులు కోరుతున్నారు. -
పవన్పై అనకాపల్లివాసుల అసహనం
సాక్షి, విశాఖపట్నం: ‘‘జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన పర్యటనతో ఏం సాధిస్తున్నారు?. మిడిమిడి జ్ఞానంతో ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేయడం తప్పించి!’’ అనే విమర్శే వినిపిస్తోంది ప్రత్యర్థుల నుంచి. ఈ క్రమంలో.. స్థానికులు సైతం పవన్, జనసైనికుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడడం తప్పించి.. రూల్స్ ఫాలో అయ్యేది లేదు.. ఓ క్రమశిక్షణా లేదు.. జనసైనికులతో కలిసి తన పర్యటనతో పవన్ విశాఖ వాసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తాజాగా పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి హైవేకు ఇరువైపులా బైక్ ర్యాలీతో పవన్ దూసుకుపోగా.. ఆ ట్రాఫిక్ మధ్యలోనే ఆగిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మొన్న రుషికొండ పర్యటన సందర్భంగా హడావిడి చేసిన పవన్.. ముందస్తు సమాచారం ఇచ్చి భారీగా అభిమానులు గుమిగూడేందుకు కారణం అయ్యాడు. పైగా సాయంత్రం సమయం కావడంతో జనాలు ట్రాఫిక్ రద్దీతో బాగా ఇబ్బంది పడ్డారు. ఇదీ చదవండి: గొడవలు చేయడానికే పవన్ రుషికొండ వెళ్లింది! -
ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్లే పీఎస్ఎల్వీ పరీక్ష ఆలస్యం: ఇస్రో
-
హైదరాబాద్- విజయవాడ రహదారిపై స్తంభించిన రాకపోకలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని కాకుండా దాదాపుగా అన్ని చోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై(హైదరాబాద్-విజయవాడ)అడుగు మేర వరద నీరు చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వన్వేలోనే ట్రాఫిక్ను పోలీసులు మళ్లిస్తున్నారు. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొందరు వాహనదారులు వరద నీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద ఈ మూడు నదులు కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే సమయం గడుస్తున్నా కొద్ది వరద మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఐతవరం దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ముందస్తుగా టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. చదవండి: రెడ్ అలర్ట్.. మరో 24 గంటలు అతి భారీ వర్షాలు -
హైదరాబాద్ వర్షాలు.. ఆ ఏరియా వాళ్లు ఈ టైంకు ఆఫీస్లో లాగౌట్ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను భారీ వర్షాలు వణికిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం గంటపాటు ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. రాత్రి వరకు ఓ మోస్తరు వాన కొనసాగుతూనే ఉంది. అంతేగాక మంగళవారం(నేటి) నుంచి మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంతో.. తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. కాగా వర్షాల కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది. ►ఫేజ్ - 1: ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని తెలిపింది. ►ఫేజ్ - 2: ఐకియా నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని పేర్కొంది. ►ఫేజ్ - 3: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు లాగ్ ఔట్ చేసుకోవాలని చెప్పింది. Massive Traffic jam, near Skyview and IKEA, at Hitec city in Hyderabad, due to heavy rains this evening. The Hyderabad Metro traveller reached early. #HyderabadRains #TrafficJam#Hyderabad #IKEA#HappeningHyderabad pic.twitter.com/4BOrwFVOaA — Surya Reddy (@jsuryareddy) July 24, 2023 -
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేయగా.. హైదరాబాద్కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో కుంభవృష్టి హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంక్బండ్, ఖైరతాబాద్-పంజాగుట్ట, బేగంపేట- సికింద్రాబాద్, గచ్చిబౌలి ఐకియా రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైటెక్ సిటీ నుంచి జూబ్లీ చెక్పోస్టు వరకు వాహనాలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు .. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ► కంట్రోల్ రూం నంబర్లు: 040-2111 1111, 9000113667, సోమవారం ఉదయం వానలు నుంచి కాస్త ఉపశమనం పొందామని నగర వాసులు అనుకున్నారో లేదో.. సాయంత్రం నుంచి భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడలిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని తెలిపారు. #malakpet ⛈️⛈️⛈️⛈️⚡⚡⚡⚡@HiHyderabad @balaji25_t @HYDmeterologist @Hyderabadrains @Hydbeatdotcom @TS_AP_Weather @Z9Habib @MalakpetD @Rajani_Weather @metcentrehyd #hyderabad @Ilovehyderabad #HYDERABADRAINS @kbiqbal777 pic.twitter.com/ynO1cpfbOY — Younus Farhaan (@YounusFarhaan) July 24, 2023 కాగా దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. మేడ్చల్ జిల్లాలోని కాప్రా, ఏ.ఎస్.రావు నగర్, ఈసీఐఎల్ చౌరస్తా, కుషాయిగూడ, హెచ్.బి.కాలనీ, చర్లపల్లి, చక్రీపురం, ఎల్లారెడ్డిగూడ, వంపుగూడ, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి, కీసర, నేరెడ్మెట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం. .#Hyderabadrains pic.twitter.com/l6THASqAoy — Minhaj Hussain Syeed (@MinhajHussains) July 24, 2023 నగరం.. జలమయం ►అంబర్పేట్ నుండి దిల్సుఖ్ నగర్ కు వెళ్లే ప్రధాన రహదారి మూసారాంబాగ్ బ్రిడ్జిపై వర్షం నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. ప్రత్యామ్నాయ రహదారి గోల్నాక నుంచి వెళ్ళాలంటున్న పోలీసు వాహనదారులకు సూచిస్తున్నారు. ►నిజాంపేట....కేపీహెచ్బీ. ....కూకట్ పల్లి....మూసాపేటలలోనూ భారీ వర్షం కురుస్తోంది. వానల కారణంగా పలు చోట్ల రోడ్లపై భారీగా నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. ►రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గండిపేట్ కిస్మత్పూర్ అత్తాపూర్ పలు ప్రాంతాలలో గంట ఒక పైగా భారీ వర్షం కురవడంతో రోడ్లంతా జలమయం అయిపోయాయి. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో పలు కాలనీలో హైవే రోడ్లపై కూడా భారీ ట్రాఫిక్ జామ్ తో పాటు భారీ వర్షం కురుస్తుంది. చదవండి: ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం -
బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తున్న పెన్గంగ.. 20కిమీ మేర ట్రాఫిక్ జామ్
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరదల కారణంగా నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉప నదులు ప్రాణహిత, పెన్గంగ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పెన్గంగ మహోగ్రరూపం దాల్చింది. దీంతో, పలు గ్రామాలు నీట మునిగాయి. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివరాల ప్రకారం.. జిల్లాలోని డోలాలా వద్ద గోదావరి ఉప నది పెన్గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెన్ గంగ వరద నీరు 50 అడుగులు ఎత్తున ఉన్న వంతెనను తాకాయి. దీంతో 44వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపైకి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో దాదాపు 20కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పెన్గంగ ఉధృతికి భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 10 జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఈ సందర్బంగా నేషనల్ హైవే అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్గంగా ప్రవాహం పెరిగింది. ఎగువన ప్రాజెక్ట్ల గేట్లు మూసివేస్తేనే వరద ప్రవాహం తగ్గుతుందన్నారు. నేటి మధ్యాహ్నం వరకు నీటి ప్రవాహం కొంత మేరకు తగ్గే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేశారు. ఆ తర్వాతే బ్రిడ్జిపై నుంచి వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంట్లోనే ఉండండి.. అత్యవసరమైతేనే బయటకు రండి -
రద్దీ రోడ్డు.. ట్రాఫిక్ జామ్ కాకూడదని.. బస్ డ్రైవర్గా మారిన బెంగళూరు ఏసీపీ!
బెంగళూరు: బెంగళూరులో బస్సు డ్రైవర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామచంద్ర స్వయంగా బస్సు నడిపారు. అసలు ఏం జరిగిందంటే.. బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశం జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. వీవీఐపీల (ప్రతిపక్ష నేతల సమావేశం) షెడ్యూల్ కారణంగా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులో ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతను ఏసీపీ రామచంద్ర చూసుకుంటున్నారు. అకస్మాత్తుగా రూట్ 330 డ్రైవర్ అస్వస్థతకు గురికావడంతో ఆ బస్సును రోడ్డుపైనే ప్రయాణికులతో సహా నిలిపివేశారు. తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ రామచంద్ర.. అనారోగ్యంతో ఉన్న ఆ డ్రైవర్ను బోవరింగ్ ఆసుపత్రికి తరలించి, వైద్య సహాయం అందించేలా అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. బస్సు రోడ్డుపై నిలిచిపోయిన కారణంగా ట్రాఫిక్ రద్దీకి కారణమయ్యే అవకాశం ఉందని గ్రహించి.. ఏసీపీ ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను స్వయంగా తానే తీసుకున్నారు. డ్రైవర్ సీటులో కూర్చుని బస్సును ఒక కిలోమీటరుకు పైగా నడుపుతూ కార్పొరేషన్ పార్కింగ్ ప్రదేశంలో బస్సును పార్క్ చేశారు. ఇదంతా బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏసీపీ స్పందించిన తీరుపై అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. Thank you for the care and compassion # LifeSaverCop @DgpKarnataka @CPBlr @alokkumar6994 @masaleemips @BlrCityPolice @blrcitytraffic @mybmtc@BMTC_BENGALURU #BMTC Small act of kindness, duty, compassion & respect for life is thy name of #NammaBengaluruPolice 👏 Contd 01 pic.twitter.com/LI0isc1NoX — Shubha Lakshmi (@Shubha_Lakshmi_) July 17, 2023 చదవండి ఆస్ట్రేలియా బీచ్లో చంద్రయాన్-3 రాకెట్ శకలం.. ఇస్రో చీఫ్ క్లారిటీ -
ఢిల్లీలో భారీ వర్షం.. ఇండియా గేట్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక, భారీ వానల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, రోడ్ల మీద భారీగా వదర నీరు చేరడంతో మింట్ బ్రిడ్జ్ ప్రాంతంలో అండర్ పాస్ను అధికారులు మూసివేశారు. మరోవైపు.. ఇండియా గేట్, నోయిడాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. రానున్న నాలుగు, ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. #DelhiRains Daryaganj in a Darya @AtishiAAP @ArvindKejriwal pic.twitter.com/s4VBDscyAJ — Abantika Ghosh (@abantika77) July 8, 2023 दिल्ली में सुबह से ही लगातार बारिश हो रही है बारिश ने मचाई तबाही, राजधानी की सड़कें हुई जाम। बारिश की वजह से जगह-जगह जलभराव की स्थिति देखने को मिली। शहर तालाब में तब्दील हो गया और बरसाती नदियां उफान पर देखने को मिली। #DelhiRains #capital pic.twitter.com/g0CQice4Oc — kumkum (@kumkumgupta00) July 8, 2023 दिल्ली के श्रीनिवासपुरी में बारिश के बाद नाला टूट गया... और नदी की धार की तरह पानी बहता दिखा... #DelhiRains pic.twitter.com/UjuLorgTg7 — kumkum (@kumkumgupta00) July 8, 2023 #DelhiRains| #PragatiMaidanTunnel, which connects India Gate with Ring Road, witnesses severe waterlogging on Saturday following heavy rainfall.#DelhiRain #DelhiNews #Delhi #Rain pic.twitter.com/fPZLwist6r — Prakash K 🇮🇳 (@PrakashK_Legal) July 8, 2023 -
15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. ప్రయాణికుల నరకం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతోంది. కుండపోతగా కురిసిన వర్షాలతో నదుల్లో వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. అటు భారీగా కురిసిన వర్షాలతో కొండ చరియలు రహదారులపై విరిగిపడ్డాయి. దీంతో మండి, కులును కలిపే జాతీయ రహదారిని బ్లాక్ చేశారు పోలీసులు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడిన కారణంగా మండీలోని చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నత్తనడకన కదులుతున్న వాహనాలతో పర్యటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 200 మంది పర్యటకులు రాత్రంతా రోడ్లపైనే ఉండిపోయారు. ముందుకు వెళ్లలేక వెనకకు మళ్లలేక పిల్లలతో సహా కుటుంబాలతో కలిసి రోడ్లపైనే ఉన్నామని చెప్పారు. ఇదో పీడకలలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఎడతెరిపి లేని వర్షంతో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రెండు జాతీయ రహదారులతోసహా 124 రోడ్లు దెబ్బతిన్నాయని సీనియర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి ఒకరు తెలిపారు. భారీ వర్షాల కారణంగా దాదాపు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. వరదలతో వివిధ జిల్లాల్లో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. #WATCH | Heavy rainfall in Himachal Pradesh's Mandi district leads to landslide on Chandigarh-Manali highway near 7 Mile; causes heavy traffic jam (Drone Visuals from Mandi) pic.twitter.com/tmpPZ8aUbM — ANI (@ANI) June 26, 2023 ఇదీ చదవండి: కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఏటా ఇదే పరిస్థితి.. ఎందుకిలా..? కొండ చరియలు విరిగిపడగా.. ఆదివారం సాయంత్రం 5 గంటలకే రహదారిని మూసివేశారని పర్యటకులు తెలిపారు. రాత్రంతా రోడ్డుపైనే ఉన్నట్లు చెప్పారు. బస చేయడానికి హోటల్ సౌకర్యం కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. దాదాపు 200 వందల కార్లపైనే వరుసగా ఉండిపోయాయని చెప్పారు. కొందరు బస్సుల్లో విహారయాత్రకు వచ్చి రాత్రంతా అందులోనే ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విరిగిపడిన కొండ చరియలను రోడ్డుపై నుంచి ఎప్పుడు తొలగిస్తారో.. ఇంకా ఎంత సమయం వేచి ఉండాలో కూడా అధికారులు తెలపట్లేదని చెప్పారు. "The administration has said that there is a landslide ahead. I don't have much info, we have been here since 5 am," says a tourist from Scotland, who has been stranded in a traffic jam following a landslide on Chandigarh-Manali highway near 7 Mile pic.twitter.com/sWKeJpe5zq — ANI (@ANI) June 26, 2023 ఇదీ చదవండి: Himachal Pradesh Floods: హిమాచల్లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం -
హైదరాబాద్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్: హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం అల్లకల్లోలం సృష్టించింది. వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, బేగంపేట, కోఠి, సికింద్రాబాద్తో పాటు నగర శివారు ప్రాంతాలైన లింగంపల్లి, పటాన్చెరు, ఆర్సీపురంలో భారీ వర్షం కురుస్తోంది. -
గురుగ్రామ్లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు..
చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి కురుస్తున్న కుండపోత వర్షం నగరాన్ని ముంచెత్తింది. రహదారుపై పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వేపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజా రవాణా స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మొకాళ్ల లోతు నీరు చేరడంతో కొన్ని వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్డుపై నిలిచిన నీటిలోనే వాహనాలు నెమ్మదిగా కదులుతున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నర్సింగపూర్ చౌక్ ఏరియాలో రహదారిపై వరద నీరు నిలిచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. #WATCH | Heavy waterlogging in parts of Gurugram after rain lashed the city (Visuals from Narsinghpur Chowk) pic.twitter.com/B8Q7IlC8oh — ANI (@ANI) June 21, 2023 Welcome to Gurgaon, The city of Lakes. #gurugram #gurugramTraffic #gurugramrains @mlkhattar pic.twitter.com/IulhUYFcqH — Ankit Jain (@ajsunnyboy) June 21, 2023 బుధవారం ఉదయం ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (ఆర్డబ్ల్యూఎఫ్సీ) గురుగ్రామ్తో సహా ఢిల్లీలోని పరిసర ప్రాంతాలలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఢిల్లీ (పాలెం, ఐజిఐ విమానాశ్రయం), ఎన్సిఆర్ (గురుగ్రామ్, మనేసర్) ఫరూఖ్నగర్, సోహానా, నుహ్ (హర్యానా) మొరాదాబాద్, సంభాల్, బిల్లారి, చందౌసి, జహంగీరాబాద్, అనుప్షహర్, బహజోయ్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. #Gurugram में बारिश से दरिया बनी सड़कों पर फंसी गाड़ियां, सवारियों से भरी बस बीच सड़क फंसी, चारो तरफ हाहाकार#Emergency #WaterLogging #GurugramRains #Gurgaon @cmohry @OfficialGMDA @MunCorpGurugram @pcmeenaIAS pic.twitter.com/FhRdijHC2t — Sunil K Yadav (@SunilYadavRao) June 21, 2023 -
భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్లోని వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోదాంలో మంటలు చెలరేగాయి. ఫర్నీచర్ గోదాంతో పాటు పక్కనే ఉన్న బట్టల దుకాణంలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థిలికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. -
ఎవరెస్ట్ యమ డేంజర్.. పది వేల అడుగులు దాటితే..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా వెండి కొండలా ధగధగలాడిపోతూ మంచుతో నిండిపోయిన ఈ పర్వత శిఖరం చేరుకోవడమంటే ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడమే. అందుకే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా, ప్రాణాలతో తిరిగి వస్తామన్న భరోసా లేకపోయినా ప్రతీ ఏడాది ఎందరో సాహసికులు ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవాలని తమ దేశ జెండాని పాతాలని ఆరాటపడుతుంటారు. మౌంట్ ఎవరెస్ట్ను తొలిసారి ఎక్కడం ప్రారంభించి 70 ఏళ్లయింది. 1953 సంవత్సరం మే 29న న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ భారత్కు చెందిన టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరుకున్నారు. ఈ 70 ఏళ్లలో కనీవినీ ఎరుగని మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆధునిక సదుపాయాలు చోటు చేసుకోవడంతో ఎవరెస్ట్ అధిరోహించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎవరెస్ట్పై ట్రాఫిక్ జామ్ పర్వతారోహకులకు ఈ ఏడాది నేపాల్ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు జారీ చేయడంతో ఎవరెస్ట్ అధిరోహణ మరింత ప్రమాదకరంగా మారింది. అసాధారణ రీతిలో 900 మంది పర్వతారోహకులకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొండపై భారీగా ట్రాఫిక్ జామ్లు కనిపించాయి. శిఖరాగ్రం చేరుకోవాలంటే 26 వేల అడుగులు పైకి వెళ్లాలి. పది వేల అడుగులు దాటితే ఇంక మృత్యువు ముఖంలోకి అడుగు పెట్టినట్టే. అంత ఎత్తులో ఆక్సిజన్ సరిగా అందదు. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతుంది. రక్తం గడ్డ కట్టేలా వాతావరణం మైనస్ 20 డిగ్రీలకు పడిపోతుంది. శారీరకంగా ఎంత ఫిట్నెస్ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాలు పోతాయి. సముద్ర మట్టానికి అంత ఎత్తుకు చేరుకుంటే ఒక్కోసారి మెదడు, ఊపిరితిత్తులకు వాపు వచ్చి శరీరంపై స్వాధీనం కోల్పోతారు. ఈ సారి ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు మంచులో గల్లంతయ్యారు. ఇటీవల ఈ స్థాయిలో మరణాలు ఎప్పుడూ సంభవించలేదు. ‘‘ఒకేసారి పర్వతారోహకులు కొండ ఎక్కుతూ ఉంటే వారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యం. మా ద్వారా ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకులెవరూ ఇప్పటివరకు ఏ సమస్య ఎదుర్కోలేదు’’అని ఆస్ట్రియాకు చెందిన లుకాస్ ఫర్టెన్బాచ్ అనే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది తమ సంస్థ తరఫున 100 మంది దిగ్విజయంగా ఎవరెస్ట్ ఎక్కి వచ్చారని చెప్పారు. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ముప్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు ఎవరెస్ట్ అధిరోహకులకు అతి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. 1979 నుంచి చూస్తే గత 40 ఏళ్లలో ఎవరెస్ట్పై ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. దీంతో హిమానీ నదాలు కరిగి మంచు చరియలు విరిగి పడటం వంటిæ ప్రమాదాలు ముంచుకొస్తాయి. కొన్నేళ్లుగా ఎవరెస్ట్ అధిరోహించే వారు ఈ మార్పుల ప్రభావం విపరీతంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పదేళ్లలో ఎవరెస్ట్ ఎక్కే మార్గం ఎలా మారుతుందో ఊహకి కూడా అందడం లేదని నేపాల్ మౌంటనీరింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆంగ్ షెరింగ్ పేర్కొన్నారు. ఆదాయానికి ఆశపడి..? నేపాల్కు పర్యాటకమే ప్రధాన ఆధారం. ఎవరెస్ట్ అధిరోహణ నుంచే అధికంగా ఆదాయం సమకూరుతుంది. పశ్చిమ దేశాల నుంచి వచ్చే పర్వతారోహకుల నుంచి11 వేల డాలర్లు (రూ.9 లక్షలు) చొప్పున వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే కాకుండా వెంట తీసుకు వెళ్లే ఆక్సిజన్, ఆహారం, గైడ్ల కోసం మొత్తంగా ఒక్కొక్కరికి 27 వేల డాలర్లు (దాదాపుగా రూ.22 లక్షలు) ఖర్చు అవుతుంది. అయితే నేపాల్ ప్రభుత్వం ఆదాయానికి ఆశపడే అనుమతులు ఎక్కువగా ఇస్తున్నామన్న ఆరోపణల్ని తోసిపుచ్చింది. ప్రతీ పర్వతారోహకుడి ప్రాణ రక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బేస్ క్యాంప్లో వైద్యులు, అధికారుల బృందం ఈ సాహస యాత్రను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ఏదైనా సాధ్యమే ప్రపంచంలో ఎవరెస్ట్ మ్యాన్గా పేరు పొందిన నేపాల్కు చెందిన షెర్పా కామి రిటా 28 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా నిలిచి తన రికార్డు తానే బద్దలు కొట్టాడు. ఈ ఏడాది వారం రోజుల తేడాలో రెండు సార్లు శిఖరాగ్రానికి చేరుకున్నాడు. తన రికార్డుని పసాంగ్ దావా అనే షెర్పా సమం చేయడంతో ఆ మరుసటి రోజే మళ్లీ ఎక్కి అత్యధికసార్లు ఎవరెస్ట్ని ఎక్కిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక బ్రిటన్కు చెందిన మాజీ సైనికుడు హరి బుధా మాగర్ కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. ఒక మలేసియన్ పర్వతారోహకుడు అనారోగ్యం బారిన పడితే నేపాలీ గైడ్ గెల్జీ అతనిని మోసుకుంటూ కొండ దిగడం మరో అరుదైన ఫీట్గా నమోదైంది. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరితే ప్రపంచాన్నే జయించినంత ఆనందం వస్తుంది కాబట్టే ప్రాణాలకు తెగించి మరీ ఎవరెస్ట్ ఎక్కే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చార్జింగ్ చాలట్లే!
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీలోని చార్జింగ్ను ట్రాఫిక్ జామ్లు హరిస్తున్నాయి. దీంతో బస్సు గమ్యం చేరేందుకు అవసరమైన చార్జింగ్ లేకపోవడంతో మధ్యలో మరోసారి బ్యాటరీని చార్జ్ చేయాల్సి వస్తోంది. ఇది ఇటీవలే ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ– గరుడ బస్సులకు తలనొప్పిగా మారింది. ‘ఈ–బస్సు’.. రెండు సార్లు చార్జ్ చేయాల్సిందే.. ♦ ఆర్టీసీ ఇటీవలే పది ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన ప్రారంభించిన విషయం తెలి సిందే. తొలి విడతలో అందుబాటులోకి వచి్చ న ఈ పది బస్సులను విజయవాడ వరకు తిప్పుతున్నారు. వీటిని బీహెచ్ఈఎల్ డిపో ద్వారా నిర్వహిస్తున్నారు. ఎయిర్పోర్టుకు తిరు గుతున్న ఎలక్ట్రిక్ బస్సుల కోసం మియాపూర్ డిపోలో బ్యాటరీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో, ఈ బస్సులకు కూడా అక్కడే చార్జి చేస్తున్నారు. పూర్తి చార్జింగ్ తర్వా త బస్సు ప్రారంభమై ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఎంజీబీఎస్కు వెళ్తుంది. అక్కడి నుంచి విజయవాడ బయలు దేరుతుంది. సిటీ దాటేటప్పటికే చార్జింగ్ డౌన్ ♦ మియాపూర్–ఎంజీబీఎస్ మధ్య 30 కి.మీ. దూరం ఉంది. ఈ రూట్ అంతా విపరీతమైన ట్రాఫిక్ నేపథ్యంలో తరచూ బస్సుకు బ్రేకులు వేయాల్సి వస్తుండటంతో బ్యాటరీ శక్తి ఎక్కువగా ఇక్కడే ఖర్చవుతోంది. ఎంజీబీఎస్లో బయలు దేరిన తర్వాత చౌటుప్పల్ వెళ్లే వరకు ట్రాఫిక్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో కూడా మరింత ఖర్చవుతోంది. మొత్తంగా 150 కి.మీ. దూరం రావాల్సిన శక్తి ఈ రెండు ప్రాంతాల్లోనే ఖర్చవుతుండటంతో విజయవాడ వరకు వెళ్లేందుకు సరిపోవటం లేదు. విజయవాడకు చేరుకున్న తర్వాత తిరిగి చార్జ్ చేసేందుకు, అక్కడి బస్టాండుకు పది కి.మీ. దూరంలో ఉన్న చార్జింగ్ పాయింట్ వద్దకు వెళ్లాలి. వెరసి మియాపూర్ నుంచి ఆ పాయింట్ వరకు 325 కి.మీ.దూరం అవుతోంది. సాధారణంగా బ్యాటరీలో 20 శాతం చార్జింగ్ ఉండగానే మళ్లీ ఫిల్ చేయాలనేది నిబంధన. లేదంటే సాంకేతిక సమస్య తలెత్తి బస్సు ఉన్నదిఉన్నట్టు ఆగిపోతుంది. దీంతో నగరంలో ఫుల్ చార్జ్ చేసినా... ట్రాఫిక్ చిక్కుల్లో పవర్ ఖర్చవుతుండటంతో మధ్యలో మరోసారి విధిగా చార్జ్ చేయించాల్సి వస్తోంది. దీంతో సూర్యాపేటలో ఉన్న ఓ ప్రైవేటు చార్జింగ్ స్టేషన్లో రెండో సారి చార్జ్ చేయిస్తున్నారు. ఇది ప్రయాణికులకు విసుగ్గా మారింది. నాన్స్టాప్గా వెళ్తుందనుకుంటే మధ్యలో ఆగాల్సి రావటం వారికి చిరాకు తెప్పిస్తోంది. బ్రేక్ సమయంగా మార్పు.. విజయవాడ వెళ్లే బస్సులను మధ్యలో కోదాడ వద్దో, ఇతర దాబాల వద్దనో అరగంటపాటు ఆపుతుంటారు. ప్రయాణికుల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ బ్రేక్ సమయాన్ని సూర్యాపేటలో ఇస్తూ, ఆ సమయంలోనే బ్యాటరీని చార్జ్ చేయిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. సూర్యాపేట బస్టాండులో ఆర్టీసీ సొంతంగా చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే మరింత వేగంగా చార్జ్ అవుతుందని పేర్కొంటున్నారు. మళ్లీ తిరుగు ప్రయాణంలో కూడా, విజయవాడ బస్టాండుకు 10 కి.మీ. దూరంలో ఉన్న పాయింట్లో ఫుల్ చార్జ్ చేయించి.. మళ్లీ సూర్యాపేటలో రెండో సారి చార్జ్ చేయిస్తున్నారు. ఫుల్ డిమాండ్.. ఈ–గరుడ బస్సులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఏసీ బస్సులు కావటం, ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో చప్పుడు లేకపోవటంతో ప్రయాణికులు వీటిల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేటప్పటితో పోలిస్తే అక్కడి నుంచి వచ్చేటప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల వరసగా కొన్ని రోజులపాటు 100 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. వెళ్లేప్పుడు అది 70 శాతంగా ఉంటోంది. -
హమ్మయ్యా.. నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయ్!
నగరాల్లో ట్రాఫిక్ ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఆల్డా ఏరోనాటిక్స్’ ఇటీవల ఏకంగా పర్సనల్ ఎయిర్క్రాఫ్ట్ను రూపొందించింది. ఇందులో ఒక్కరు మాత్రమే ప్రయాణించేందుకు వీలవుతుంది. ‘ఎయిర్ స్పీడర్ ఎంకే4’ పేరిట తయారు చేసిన ఈ పర్సనల్ ఎయిర్క్రాఫ్ట్ బ్యాటరీతో పనిచేసే ‘ఈవీటీఓల్’ ఎలక్ట్రిక్ మోటార్స్తో నడుస్తుంది. బ్యాటరీ సహాయంతో పనిచేసే ఈ ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా ఇందులోని వెయ్యి కిలోవాట్ల థండర్స్ట్రైక్ హైడ్రోజన్ టర్బో జనరేటర్కు విద్యుత్ సరఫరా అవుతుంది. టేకాఫ్, ల్యాండింగ్ చాలా సునాయాసంగా జరిగేలా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. టేకాఫ్ తర్వాత ఇది గరిష్ఠంగా గంటకు 362 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులోని బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసినట్లయితే, ఇది నిరాటంకంగా 180 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. వివిధ దేశాల్లో ఇది త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. -
సంక్రాంతి ఎఫెక్ట్.. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
-
Hyderabad: తెలంగాణ భవన్ ముందు ట్రాఫిక్ నరకం
బంజారాహిల్స్ రోడ్ నెం. 14 బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి రోడ్ నెం.12 వైపు వెళ్లే రోడ్డులో తెలంగాణ భవన్ ముందు పల్లంగా ఉండటంతో ఎత్తుపైకి ఎక్కలేక వాహనాలు ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తరచు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. అంతేకాకుండా వంపుగా ఉన్న తెలంగాణ భవన్ వద్ద రోడ్డు నుంచి రోడ్ నెం. 12 వైపు వాహనాలు ఎక్కే క్రమంలో రెడీమిక్స్ వాహనాల నుంచి సిమెంటు, కంకర కిందపడుతూ గుట్టలుగా పేరుకుపోతోంది. ఇదొక సమస్యగా మారిపోయింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద ఆర్టీసీ బస్సులు, లారీలు ఇక్కడి నుంచే ఎక్కే క్రమంలో మొరాయిస్తుండటంతో వెనుక ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ఆగిపోతోంది. సీఎం తెలంగాణ భవన్కు వచ్చినప్పుడు వీవీఐపీలు మెయిన్ రోడ్డు మీదనే కారు ఆపి దిగే క్రమంలో కూడా వెనుక ఉన్న వాహనాలు పెద్ద ఎత్తున నిలిపోతున్నాయి. ► తెలంగాణ భవన్ ముందు ఈ ట్రాఫిక్ సమస్య గత దశాబ్ధ కాలంగా విపరీతంగా పెరిగిపోతున్నది. దీనికి పరిష్కారంగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వైపు మళ్లే ప్రాంతం నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు రోడ్డును సమాంతరం చేయడం ద్వారా సమస్య కొలిక్కి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ► కేబీఆర్ పార్కు నుంచి వరద నీరు తెలంగాణ భవన్ పక్కన నిర్మించిన కాల్వలోకి చేరే క్రమంలోనే ఈ రోడ్డు వంపుగా మారింది. ఇక్కడ వరద నీటి పైప్లైన్ వేసి రోడ్డంతా సమాంతరం చేస్తే ట్రాఫిక్ సజావుగా ముందుకు సాగుతుందని ట్రాఫిక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇరుకుగా అగ్రసేన్ చౌరస్తా.. బంజారాహిల్స్ రోడ్ నెం. 14 నుంచి తెలంగాణ భవన్ మీదుగా వాహనాలు ముందుకు సాగడం గగనంగా మారింది. లేచిన దగ్గరి నుంచి అర్ధరాత్రి దాకా ఈ రోడ్డులో వాహనాలు మెళ్లగా ముందుకు కదులుతున్నాయి. ► ఒక వైపు తెలంగాణ భవన్ వైపు రోడ్డు లోతుగా ఉండటం, జగన్నాథ టెంపుల్ గేటు కూడా రోడ్డు వైపే ఉండటం ట్రాఫిక్ను మరింత జఠిలం చేస్తున్నది. దీనికి తోడు అగ్రసేన్ చౌరస్తాలో తెలంగాణ భవన్ నుంచి రోడ్ నెం. 12 వైపు మలుపు మరింత ప్రమాదకరంగా మారింది. ఇక్కడే ట్రాన్స్ఫార్మర్, కరెంటు స్తంభాలు, హైటెన్షన్ వైర్ల స్తంభాలు టర్నింగ్పై ఉన్నాయి. వీటిని తొలగిస్తే ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ వైపు తేలికగా ముందుకు కదులుతుంది. ► అగ్రసేన్ ఐల్యాండ్ను కూడా పెద్దగా ఉండటం, చౌరస్తా మొత్తం ఇరుకుగా ఉండటం వాహనాలు మళ్లే పరిస్థితులు జఠిలమవుతున్నాయి. ఈ చౌరస్తాను తగ్గించాల్సిన అవసరం ఉందని, సెంట్రల్ మీడియన్లను కూడా కట్ చేయాల్సిన పరిస్థితి ఉందని ట్రాఫిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కూడా అగ్రసేన్ ఐల్యాండ్ను, సెంట్రల్ మీడియన్ను తగ్గించాలని జీహెచ్ఎంసీకి లేఖ కూడా రాశారు. జీహెచ్ఎంసీ మొద్దు నిద్ర.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతున్నది. ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకొని వాహనదారులు విలవిల్లాడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పలుమార్పులు, చేర్పులు చేస్తూ ఉన్నదాంట్లోనే సిబ్బందిని వినియోగించుకుంటూ ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతూ వాహనదారులను ముందుకు వెళ్లే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. ► ట్రాఫిక్ పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులు ఏ మాత్రం సహకరించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. పలుచోట్ల సెంట్రల్ మీడియన్లు తగ్గించాలని ఐల్యాండ్లను కట్ చేయాలని, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని, ఫుట్పాత్లపై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల షిఫ్టింగ్కు తోడ్పాటు నందించాలని, అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలను అనువైన చోటుకు మార్చాలని ట్రాఫిక్ పోలీసులు లేఖలు రాస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. జీహెచ్ఎంసీతో ట్రాఫిక్ పోలీసులు సమన్వయం పూర్తిగా కొరవడింది. (క్లిక్ చేయండి: రసాభాసగా జీహెచ్ఎంసీ మీటింగ్.. చర్చ లేకుండానే బడ్జెట్కు ఆమోదం) -
గోఖలే వంతెన త్వరలో కూల్చివేత
సాక్షి, ముంబై: అంధేరీలోని గోఖలే వంతెన సాధ్యమైనంత త్వరగా కూల్చివేసి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని బీఎంసీ భావిస్తోంది. స్ధానికులు పడుతున్న ఇబ్బందులు, నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కూల్చివేత పనులకు 21 రోజుల్లో టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ పూర్తి చేయాలని బీఎంసీ భావిస్తోంది. 2023 మార్చి లోగా కూల్చివేత పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేగాకుండా కూల్చివేత పనుల్లో చివరి ఘట్టం పూర్తి చేయడానికి 30 గంటలపాటు రైల్వే నుంచి బ్లాక్ తీసుకోనున్నట్లు బీఎంసీ పేర్కొంది. ఆ తరువాత నూతన వంతెన పనులకు శ్రీకారం చుట్టనుంది. 1975లో నిర్మించిన అంధేరీలో తూర్పు–పశ్చిమ ప్రాంతాలను కలిపే గోఖలే వంతెన శిథిలావస్ధకు చేరుకోవడంతో ఈ నెల ఏడో తేదీ నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్ ఉంటోంది. వాహనాలను దారి మళ్లించేందుకు ట్రాఫిక్ శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినప్పటికీ అవికూడా సరిపోవడం లేదు. దీంతో కూల్చివేత పనులు వేగవంతం చేసి కొత్త వంతెన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని బీఎంసీ నిర్ణయించింది. ఎంత వ్యయం? ఎవరి బాధ్యత? గోఖలే వంతెన ఎవరు నేల మట్టం చేస్తారు..? ఎవరు నిర్మిస్తారనే ప్రశ్న స్ధానిక ప్రజల్లో హాట్ టాపిక్గా మారింది. ఎవరు కూల్చివేయాలి...? ఎవరు నిర్మించాలి...? అందుకయ్యే వ్యయంలో ఎవరు, ఎంత శాతం నిధులు వెచ్చించాలి..? ఇలాంటి కారణాలు తెరమీదకు వచ్చాయి. ఇదివరకు నేలమట్టం చేసిన అనేక వంతెనల పనులు జాప్యం జరగడానికి ఇవే ప్రధాన కారణాలయ్యాయి. దీంతో ఈ వంతెన రైల్వే హద్దులో ఉన్న పనులు పశ్చిమ రైల్వే చేపట్టనుంది. బీఎంసీ హద్దులో ఉన్న పనులు బీఎంసీ చేపట్టనుంది. కాని రైల్వే ట్రాక్స్ మీదున్న వంతెన భాగాన్ని కూల్చివేయాలంటే కూలీలకు ప్రాణాలతో చెలగాటమాడటంతో సమానం. ఓవర్ హెడ్ వైర్లోంచి 25 వేల ఓల్టేజీల విద్యుత్ ప్రవహిస్తుంది. వంతెన కిందున్న ఆరు రైల్వే మార్గాల మీదుగా సగటున రెండు నిమిషాలకు ఒక రైలు ప్రయాణిస్తుంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా ప్రాణాలకే ప్రమాదం. దీంతో ఈ వంతెన నేలమట్టం చేయాలంటే ఇటు ఇంజినీర్లకు, అటూ కూలీలకు కత్తిమీద సాములంటిదేనని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో సుమీత్ ఠాకూర్ పేర్కొన్నారు. కూల్చివేత పనులకు టెండర్లు దాఖలు చేయడానికి కంట్రాక్టర్లకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఇవ్వనున్నట్లు ఠాకూర్ తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి సుమారు 84 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. సాధారణంగా గోఖలే వంతెన వినియోగంలో ఉన్నప్పుడే ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య ఉండేది. ఇప్పుడు ఆ వంతెన మూసి వేయడంతో పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది. ఫలితంగా స్ధానికులు విసిగెత్తిపోయారు. రోడ్డు మార్గం కంటే లోకల్ రైలు లేదా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. -
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
-
మూసాపేట నుంచి కేపీహెచ్బీ వరకు భారీగా ట్రాఫిక్ జామ్
-
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, రాంనగర్, విద్యానగర్, కూకట్పల్లి, మూసాపేట్, నిజాంపేట్, బాలానగర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం పడుతోంది. రోడ్డుపై వరదనీరు చేరడంతో పలుచోట్లు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. Just now started in Madhapur too. Crazy thunderstorms pic.twitter.com/vsW1P9wGiq — Krishna K (@youkrishna) October 12, 2022 Lightening strikes in Hyderabad.. Take care Darlings #HyderabadRains pic.twitter.com/9Cxx7oOGTo — Raghu Varma (@RaghuVarma_916) October 12, 2022 Raining heavily at balanagar.@Hyderabadrains pic.twitter.com/4xsVWkyBYs — shaik riyaz (@Riyaaazzz) October 12, 2022 -
Viral Video: నడిరోడ్డుపై దిండు వేసుకుని పడుకుని హల్చల్
యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబర్లను, సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకునేందుకు కొందరు ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఒక్కోసారి వారు చేసే పనులు చూస్తే చిర్రెత్తిపోతుంది. కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా ప్రవరిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే దుబాయ్లో జరిగింది. ఓ కంటెంట్ క్రియేటర్ ఏకంగా నడిరోడ్డుపై దిండు వేసుకుని హాయిగా పడుకున్నాడు. జీబ్రా క్రాసింగ్ వద్ద అతడ్ని చూసి అందరూ షాక్ అయ్యారు. అతను అడ్డంగా ఉండటంతో వాహనదారులు వాహనాలను నిలిపివేశారు. దీంతో కాసేపు అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. يالله خذوا !!! 🙂 pic.twitter.com/4aTcWlPWiF — 🇦🇪العليـــاء (@AlAliaLanjawi) October 4, 2022 మనోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపై పడుకుని ట్రాఫిక్కు ఇబ్బంది కల్గించడమేగాక, తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేసినందుకు అరెస్టు చేశారు. అతను ఆసియాకు చెందినవాడని చెప్పారు. చదవండి: 80 ఏళ్ల వృద్ధులు స్కై డైవింగ్తో... గిన్నిస్ రికార్డు -
HYD: నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చాలా చోట్ల మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. కేబీఆర్ పార్క్ దగ్గర, అపోలో జంక్షన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, క్యాన్సర్ ఆస్పత్రుల చుట్టూరా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చాలా సేపటి నుంచి పరిస్థితి అలాగే ఉండడంతో వాహనదారులు చిరాకు పడుతున్నారు. సోమవారం సాయంత్రం సైతం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం విశేషం. ఇక ఇవాళ(మంగళవారం) ఉదయం సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు పంజాగుట్ట-ఎల్వీప్రసాద్ రూట్లో, పంజాగుట్ట, బేగంపేట దగ్గర్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి యత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. వాహనాలు నెమ్మది నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. -
భారీ వర్షాల ఎఫెక్ట్.. స్కూల్స్ బంద్, ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం!
దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమైంది. రెండు రోజులుగా కురుస్తున్న వానల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు, వాతావరణ శాఖ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక, భారీ వానకు రోడ్లన్నీ జలమయం అవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శుక్రవారం కూడా ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలుకురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మూడు నుంచి నాలుగు గంటలపాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీవర్షాలతో నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా యూపీ, ఢిల్లీలో 13 మంది మృత్యువాతపడ్డారు. Situation after Heavy rain in Faridabad, Haryana.#India #DelhiRains #NCR #waterlogging #Weather pic.twitter.com/Kby0iz5B7t — Chaudhary Parvez (@ChaudharyParvez) September 23, 2022 మరోవైపు.. భారీ వర్షాల వేళ 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. గురుగ్రామ్ ప్రాంతంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని ప్రభుత్వం కోరింది.బ ఇక, గురువారం రాత్రి కుంభవృష్టి కురువడంతో ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వే పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తమ ఇళ్లకు చేరుకునేందుకు గంటల సమయం వేచిచూడాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం కూడా దాదాపు ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. दिल्ली की सड़कों पर लगा जाम। ⏩दिल्ली में हो रही लगातार बारिश से सड़कों पर भरा पानी।#DelhiRains #WeatherUpdate #Delhi pic.twitter.com/tAalG9gQ8Z — Zee Delhi-NCR Haryana (@ZeeDNHNews) September 23, 2022 -
భారీ ట్రాఫిక్ జామ్.. పేషెంట్ కోసం డాక్టర్ పరుగులు
వైరల్: ట్రాఫిక్ నరకం.. అది బెంగళూరు వాసులకు నిత్యానుభవం. మామూలు రోజుల్లోనే ఆ ఐటీ నగరంలో గంటల తరబడి ట్రాఫిక్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి. అందునా తాజాగా కురిసిన వర్షాలతో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అయితే అలాంటి పరిస్థితుల్లో.. తన పేషెంట్ కోసం పరుగులు తీసిన ఓ డాక్టర్ను ఇప్పుడంతా ‘శభాష్’ అని అభినందిస్తున్నారు. మణిపాల్ హాస్పిటల్లో పనిచేసే గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ గోవింద్ నందకుమార్ ఎప్పట్లాగే ఆస్పత్రికి బయలుదేరారు. ఒక మహిళకు గాల్బ్లాడర్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో విపరీతంగా ట్రాఫిక్ ఉండటంతో ఆయన ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో ఏం చేయాలో ఆయనకు తోచలేదు. ఎంతకీ ట్రాఫిక్ తగ్గకపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చేసి కారు దిగి అవతలి రోడ్డుకు చేరుకున్నారు. గూగుల్ మ్యాప్లో చూసేసరికి ఆ దూరం 45 నిమిషాలు చూపించింది. అయితే ఆయన అలస్యం చేయకుండా.. పరుగున మూడు కిలోమీటర్లలో ఆస్పత్రికి చేరుకున్నారు. శస్త్రచికిత్స సక్సెస్ కావడంతో సదరు మహిళను అనుకున్న సమయానికే డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. @BPACofficial @BSBommai @sarjapurblr @WFRising @blrcitytraffic sometimes better to run to work ! pic.twitter.com/6mdbLdUdi5 — Govind Nandakumar MD (@docgovind) September 10, 2022 తన కోసం పేషెంట్ వెయిట్ చేస్తున్నారన్న ఆలోచనతో ఇంకేం ఆలోచించకుండా ఆస్పత్రికి పరుగుతీశానని డాక్టర్ గోవింద్ నందకుమార్ చెప్తున్నారు. ‘‘కన్నింగ్హామ్ రోడ్డు నుంచి సర్జాపూర్లోని మణిపాల్ ఆసుపత్రికి చేరుకోవాల్సి వచ్చింది. భారీ వర్షాలు, నీటి ఎద్దడి కారణంగా ఆస్పత్రికి కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నా పేషెంట్లు సర్జరీ పూర్తయ్యే వరకు భోజనం చేయడానికి అనుమతించనందున, ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు వేచి ఉండే సమయాన్ని వృథా చేయకూడదనుకున్నాను. నాకు డ్రైవర్ ఉన్నాడు, కాబట్టి, నేను కారును వెనుక వదిలి వెళ్ళగలిగాను. నేను క్రమం తప్పకుండా జిమ్ చేయడం వల్ల నాకు పరుగెత్తడం ఈజీ అయ్యింది. నేను ఆసుపత్రికి మూడు కిలోమీటర్లు పరిగెత్తాను. శస్త్రచికిత్సకు సమయానికి చేరుకోగలిగాను. రోగులు, వారి కుటుంబాలు కూడా డాక్టర్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటాయి. అయితే.. అంబులెన్స్లో ఉన్న రోగి ట్రాఫిక్లో ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటి? అంబులెన్స్ వెళ్లేందుకు కూడా స్థలం లేదు అని గోవింద్ తన వీడియోను కర్నాటక ముఖ్యమంత్రికి ట్విటర్లో ట్యాగ్ చేశారు. ప్రస్తుతం డాక్టర్ గోవింద్పై సోషల్ మీడియాలో ఈయన చర్యపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: 61 సార్లు గెలిచిన గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఆ పెద్దాయన -
రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వానలు.. రెండు రోజులు ఇదే పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల ఓ మోస్తరు వర్షం కురియగా.. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రిదాకా వర్షం పడుతూనే ఉంది. పలుచోట్ల నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. దాదాపు వంద కూడళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. మూసీలో వరద పోటెత్తడంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. భారీగా పిడుగుపాటు ఘటనలు కుమురంభీం జిల్లా కౌటాల మండలం పార్డి గ్రామానికి చెందిన నౌగడే మాయబాయి (41), మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రైతు సత్తయ్య ఇద్దరూ చేనులో పనిచేస్తూ పిడుగుపాటుకు గురై మరణించారు. ఇక కౌటాల మండలం కనికి గ్రామంలో మందడే నానుబాయి, ఆమె ఇద్దరు కుమారులు పిడుగుపాటుకు గురై గాయపడ్డారు. వీరిలో నానుబాయి పరిస్థితి విషమంగా ఉంది. కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామంలో పిడుగుపాటు మేకల కాపరి లక్ష్మణ్ గాయపడ్డాడు. చదవండి: హైదరాబాద్లో రాగల 24 గంటల్లో భారీ వర్షం మంజీర నది ఆవతలి ఒడ్డున చిక్కుకున్న గొర్రెలకాపరులు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్పేట్కు చెందిన సయ్యద్ గౌసొద్దీన్ (35) సమీపంలో పిడుగు పడటంతో శబ్ధానికి భయపడి పరుగెత్తి కాల్వలో పడి మృతి చెందాడు. కాగా.. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రానికి చెందిన ఎల్లాపురం ఆశయ్య, పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన చాకలి దుర్గయ్య మేకలు మేపేందుకు హనుమాన్ బండల్ సమీపంలోని కుర్వగడ్డకు వెళ్లి మంజీరా నది మధ్యలో చిక్కుకున్నారు. మరో రెండు రోజులు వానలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వచ్చే రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలొచ్చే అవకాశం ఉందంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం.. మెట్రో కిటకిట
సాక్షి, హైదరాబాద్: గణపతి నవరాత్రోత్సవాల్లో ఐదవ రోజు... ఆదివారం కావడంతో నగరం ‘గణేష్ మహరాజ్ కీ జై’ నినాదాలతో మార్మోగింది. ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల నిమజ్జనాలు.. మరికొన్నిచోట్ల ప్రత్యేక పూజలు, లడ్డూల వేలం పాటలతో కోలాహలం నెలకొంది. ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాది జనం తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే భారీ క్యూలైన్లు కన్పించాయి. ఖైరతాబాద్కు తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ చౌరస్తా, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్ రోడ్లపై ట్రాఫిక్జామ్తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ ప్రాంతానికి వచ్చే సిటీ బస్సులు, మెట్రో రైళ్లు సైతం జనంతో కిటకిటలాడాయి. నగరం నలు మూలల నుంచి భక్తులు పోటెత్తడంతో ఆదివారం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కిటకిటలాడింది. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఈ మార్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్లు అత్యంత రద్దీగా కనిపించాయి. ఖైరతాబాద్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, మెట్రో సిబ్బంది అవస్థలు పడ్డారు. ఆదివారం మూడు మెట్రో మార్గాల్లో రద్దీ నాలుగు లక్షల మార్కు దాటిందని మెట్రో అధికారులు తెలిపారు. (క్లిక్: కౌంటర్ టికెట్లకూ ఆన్లైన్ రద్దు సదుపాయం) -
హైదరాబాద్లో భారీ వర్షం, నగర ప్రజలకు పోలీసుల సూచన
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నగరంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థమవడం లేదు. అప్పటి వరకు భగభగమంటున్న సూర్యుడు మాయమైపోయి.. ఒక్కసారిగా మేఘాలు కమ్మేస్తున్నాయి. వర్షం దంచికొడుతుంది అని అనుకునేలోపు అనూహ్యంగా మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో ఊహించని మార్పులతో నగర ప్రజలకు తికమకపడుతున్నారు. భారీ వర్షం హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మూడు గంటలపాటు వర్షం కొనసాగే అవకాశం ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, హైటెక్సిటీ, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్బీనరగ్, వనస్థలిపురం, హయత్నగర్, ఉప్పల్ చిలుకానగర్, రామంతపూర్, మణికొండ, పుష్పాలగూడ, కాటేదాన్, రాజేంద్రనగర్, నార్సింగి, అత్తాపూర్, గండిపేటలో వాన పడుతోంది. ఆఫీసులకు, విద్యాసంస్థలకు వెళ్లే సమయంలో భారీ వర్షం పడుతుండటంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. Heavy rain lashes city. #HyderabadRains #rain #weather @balaji25_t @HYDmeterologist @TS_AP_Weather @Hyderabadrains @swachhhyd @HiHyderabad @Hyderabad_Bot @Weather_AP pic.twitter.com/7t8VODq1xH — Mohammed Farzan Ahmed (@FarzanHyderabad) August 2, 2022 ట్ట్రాఫిక్ పోలీసులు సూచన హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు వర్ష సూచన చేశారు. నగరంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం ఉందని జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు గంట ఆలస్యంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, వర్షం తగ్గిన తర్వాతనే బయటికి రావాలని తెలిపారు. వర్షం పడుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని పేర్కొన్నారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని, కావున ముందే కొన్ని ముఖ్యమైన రోడ్లలో ఇతర మార్గాలలో వెళ్లాలని చెప్పారు. Wake up call for the day - thunder & lightening accompanied with a down pour! #HyderabadRains #GoodMorning pic.twitter.com/UtX0UMmitG — Atulmaharaj (@Atulmaharaj) August 2, 2022 -
హైదరాబాద్లో మళ్లీ కుంభవృష్టి.. ద్రోణి ప్రభావంతో దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్: ఉత్తర– దక్షిణ ద్రోణి ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ కుంభవృష్టి కురిసింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా కురిసిన కుండపోతతో పలు కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రధానంగా కూకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, నాంపల్లి, లక్డికాపూల్, అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, కోఠి, చాదర్ఘాట్, మలక్పేట్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్లోని వాతావరణ శాఖ తెలిపింది. మూసీలో కొనసాగుతున్న వరద ప్రవాహం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో జలాశయాలకున్న పలు గేట్లను తెరచి మూసీలోకి వరదనీటిని వదిలిపెడుతున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గండిపేట్ జలాశయంలోకి వెయ్యి క్యూసెక్కుల వరదనీరు చేరగా..4 గేట్లను 4 అడుగుల మేర తెరచి 1500 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టారు. హిమాయత్సాగర్లోకి 600 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. రెండు గేట్లను ఒక అడుగు మేర తెరచి 660 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి ప్రకటించింది. మౌలాలి డివిజన్లో.. గౌతంనగర్: భారీ వర్షం కారణంగా మౌలాలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మౌలాలి దర్గా, పాత మౌలాలి, సాదుల్లానగర్, షఫీనగర్, భరత్నగర్, లక్ష్మీనగర్, సుధానగర్ తదితర కాలనీలు నీటి మునిగాయి. మల్కాజిగిరి,ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో నాలాలు నిండి రహదారులపై వర్షం నీరు ఏరులై పారింది. సర్కిల్ పరిధిలోని ఎమర్జెన్సీ బృందాలు, కార్పొరేటర్లు సహాయక చర్యలు చేపట్టారు. పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా.. సాక్షి, సిటీబ్యూరో: ఉత్తర– దక్షిణ ద్రోణి ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ కుంభవృష్టి కురిసింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా కురిసిన కుండపోతతో పలు కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రధానంగా కూకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, నాంపల్లి, లక్డికాపూల్, అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, కోఠి, చాదర్ఘాట్, మలక్పేట్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్లోని వాతావరణ శాఖ తెలిపింది. మూసీలో కొనసాగుతున్న వరద ప్రవాహం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో జలాశయాలకున్న పలు గేట్లను తెరచి మూసీలోకి వరదనీటిని వదిలిపెడుతున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గండిపేట్ జలాశయంలోకి వెయ్యి క్యూసెక్కుల వరదనీరు చేరగా..4 గేట్లను 4 అడుగుల మేర తెరచి 1500 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టారు. హిమాయత్సాగర్లోకి 600 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. రెండు గేట్లను ఒక అడుగు మేర తెరచి 660 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి ప్రకటించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, అమీర్పేట్, మాదాపూర్, జీడిమెట్ల, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్పల్లి, మారేపల్లి, కంటోన్మెంట్ ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. అదే విధంగా హబ్సిగూడ, ఓయూ, నాచారం, అంబర్పేట, సికింద్రాబాద్, తార్నాక, కుత్బుల్లాపూర్, సురారం, చింతల్, గాజుల రామారం, కొంపల్లి బహూదూర్ పల్లి, షాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. చదవండి: క్యాబ్ లేదా ఆటో రైడ్ బుకింగ్ చేస్తున్నారా? చేతిలో నగదు లేదా? Rain is getting more and more intense at Hafeezpet, hi-tech City, Novotel #Hyderabad #HyderabadRains #TelanganaRains @HiHyderabad @WeatherRadar_IN @SkymetWeather @weatherindia @balaji25_t @Hyderabadrains @Rajani_Weather @HydWatch @HYDmeterologist @TS_AP_Weather @Hyderabad_Bot pic.twitter.com/kbfpbW8qPW — Jeethendra Kumar (@iam_jeeth) August 1, 2022 Heavy Downpour Now⛈️ Jeedimetla. pic.twitter.com/Ooi06U60gG — Hyderabad Rains (@Hyderabadrains) August 1, 2022 -
హైదరాబాద్లో కుండపోత వర్షం.. కిలోమీటర్లమేర నిలిచిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో నగరంలో కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక వాకర్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోడ్డుపై నడవాలంటేనే జంకుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతవరణశాఖ వెల్లడించింది. కూకట్పల్లి వై జంక్షన్ చెరువును తలపిస్తోంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. మెట్రో పక్కన పార్క్ చేసిన బైక్లు నీటిలో మునిగాయి. ఫతేనగర్ స్టేషన్ దగ్గర భారీగా వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. 5 అడుగులకు పైగా వరద నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఫతేనగర్ మీదుగా వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ సిబ్బంది సూచించారు. అమీర్పేట్ నుంచి కూకట్పల్లి వెళ్లే వాహనాలు నిలిపివేశారు. చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ మెట్రో ఇబ్బందులు భారీ వర్ష ప్రభావం మెట్రో స్టేషన్లను కూడా తాకింది. మెట్రో స్టేషన్లలో సర్వర్ ప్రాబ్లమ్ తలెత్తింది. టికెట్లు ఇష్యూ కాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో అరగంట నుంచి మెట్రో స్టేషన్లలో భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి ముందస్తు సమాచారం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
హైదరాబాద్లో వర్షం: భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: నగరం మరోసారి వర్షంతో తడిసి ముద్దయ్యింది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల తర్వాత భారీగా వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్పేట్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట,నాంపల్లి, ఖైరతాబాద్లతో పాటు పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమ్యారు. భారీగా వర్షం కురవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతా ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. -
ట్రాఫిక్ జామ్పై నెటిజన్ వింత పోస్ట్.. వైరల్గా మారి నెట్టింట రచ్చ
బెంగళూరు: బెంగళూరు నగరం ఐటీ కంపెనీలకు, చల్లటి వాతావరణంతో పాటు నగరవాసుల బిజీబిజీ బతుకుల్లో ఒకటైన గజిబిజి ట్రాఫిక్ జామ్లకు ప్రసిద్ధి. ఒక్కోసారి అందులో ఇరుక్కంటే ఎప్పుడు బయటపడతామో కూడా క్లారిటీ ఇవ్వలేం. ఇంక వర్షాకాలం వస్తే ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. దీంతో అప్పడుప్పుడు కొందరు నెటిజన్లు ఈ ట్రాఫిక్ సమస్యలపై సోషల్ మీడియాలో తమదైన శైలిలో విమర్శిస్తూ పోస్ట్లు పెడుతుంటారు. తాజాగా బెంగళూరు ట్రాఫిక్ జామ్కి అద్దం పట్టేలా ట్విట్ చేస్తూ ఓ వ్యక్తి వినూత్నంగా విమర్శించాడు. అందులో.. ‘బెంగళూరులో ఉన్న నా స్నేహితుడు తన కారులోని మూడు, నాలుగు, ఐదో గేర్లను అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అతను వాటిని పెద్దగా ఉపయోగించడం లేదు కనుక అవి ఇంకా షోరూమ్ కండీషన్లో ఉన్నాయి’. వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి గలవారు ఎవరైనా ఉన్నారా? అని రాసి ఉన్న ట్విట్ని పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ని చూస్తే కారు నడిపే వాళ్లు అందులోని మూడు, నాలుగు, ఐదో గేర్లను బెంగళూరు రోడ్లపై వినియోగించాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఆ నగరంలోని ట్రాపిక్ పరిస్థితిపై ఎద్దేవా చేసినట్లు ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘లక్షల్లో ట్యాక్్స కుడతున్నప్పటికీ ఈ సమస్యపై ఆందోళనలు చేయలేకపోవడం చాలా బాధాకరమని ఒకరు కామెంట్ చేయగా... ప్రౌడ్ సిటిజన్గా ఉండాలంటే మనం ఇలాంటి వాటిపై నోరు మెదపకూడదని మరొకరు కామెంట్ చేశారు. Any buyer in Bangalore? 🤔 pic.twitter.com/cWZreP06v7 — Shrikant 🇮🇳 (@sdjoshi55) May 25, 2022 చదవండి: పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలు, జెండాలు.. మహారాష్ట్ర ఏకీకరణ సమితి దాడి -
విపరీతమైన ట్రాఫిక్తో కొట్టుమిట్టాడే నగరాల్లో ముంబై, బెంగళూరు..
బండి తీసుకుని రోడ్డెక్కామా అంతే.. గంటలకు గంటలు ట్రాఫిక్లోనే గడిచిపోతుంటుంది. ఒక్కోసారి ఐదారు కిలోమీటర్లు వెళ్లడానికీ అరగంట టైం పడుతుంది. మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ పరిస్థితి ఏమిటన్న దానిపై టామ్టామ్ సంస్థ సర్వే చేసింది. 58 దేశాల్లోని 404 నగరాల్లో అధ్యయనం చేసి ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. ఇరుకుగా, విపరీతమైన ట్రాఫిక్తో కొట్టుమిట్టాడే టాప్–10 నగరాల్లో మన దేశంలోని ముంబై, బెంగళూరు ఉండగా.. ఢిల్లీ 11వ స్థానంలో, పుణే 21వ స్థానంలో ఉన్నాయి. చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు, ధర అక్షరాల రూ. 1,117 కోట్లు -
గూగుల్ మ్యాప్స్లోకి ‘ట్రాఫిక్ అడ్డంకుల’ అప్డేట్
Google Maps Suggest Best Routes In Hyderabad: అత్యవసర పని మీద దిల్సుఖ్నగర్ నుంచి కూకట్పల్లి వెళ్లడానికి బయలుదేరిన ఓ వాహన చోదకుడు ఆ దారిలో రద్దీని గూగుల్ మ్యాప్స్లో పరిశీలించాడు. రద్దీ సాధారణ స్థాయిలో ఉన్నట్లు కనిపించడంతో బయలుదేరాడు. ఆ వాహనం లక్డీకాపూల్ చేరుకునేసరికి.. కొద్దిసేపటి ముందే తలెత్తిన ధర్నా కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ రద్దీలో చిక్కుకుపోయిన అతడు ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తేల్చకోలేకపోయాడు. నగరవాసులకు ఇలాంటి సమస్య తలెత్తకుండా చూసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ట్రాఫిక్ రద్దీ మాత్రమే కనిపించే గూగుల్ మ్యాప్స్లో హఠాత్తుగా తలెత్తే అడ్డంకులూ కనిపించేలా చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ సంస్థతో జరిపిన సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయి. ఉన్నతాధికారుల తుది పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలో కార్యరూపంలోకి రానుంది. దీనిపై ఇప్పటికే పలు దఫాల్లో ట్రాఫిక్ పోలీసులు–గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో.. ► ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో గూగుల్ మ్యాప్స్కు విశేష ప్రజాదరణ వచ్చింది. చిరునామాలు కనుక్కోవడానికి, ట్రాఫిక్ స్థితిగతులు తెలుసుకోవడానికి వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ► స్మార్ట్ఫోన్ వినియోగదారులు గూగుల్ సంబంధిత యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు లొకేషన్కు యాక్సెస్ ఇస్తుంటారు. ఇలా ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్ తెలుసుకునే అవకాశం గూగుల్ సంస్థకు కలుగుతోంది. ► వీటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ఆ సంస్థ ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఏ దిశలో సెల్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయనేది గుర్తిస్తుంది. రహదారులపై ఉన్న సెల్ఫోన్లు సాధారణంగా వాహనచోదకులవే అయి ఉంటాయి. ► ఇలా రోడ్లపై ఉన్న ట్రాఫిక్ వివరాలు ఎప్పటికప్పుడు గూగుల్ సంస్థకు చేరుతున్నాయి. వీటి ఆధారంగానే ఆ సంస్థ తమ మ్యాప్స్లో ట్రాఫిక్ రద్దీ ఉన్న రహదారుల్ని ఎరుపు రంగులో చూపిస్తుంటుంది. ► న్యూయార్క్ పోలీసు విభాగం ‘511ఎన్వై’ పేరుతో ప్రత్యేక వెబ్సైట్ నిర్వహిస్తోంది. ఇందులో రహదారులపై ఉన్న రద్దీతో పాటు హఠా త్తుగా వచ్చిపడే అవాంతరాలను చూపిస్తుంటుంది. దీని మోడల్లోనే తమ మ్యాప్స్ అభివృద్ధి చే యడానికి గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. నగరం నుంచే పైలెట్ ప్రాజెక్టుగా.. ► ట్రాఫిక్ పోలీసుల కోరిన మీదట పైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నుంచే ఈ విధానాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు– గూగుల్ ప్రతినిధుల సమావేశాలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో జరిగాయి. ► క్షేత్రస్థాయిలో సంచరించే హైదరాబాద్ ట్రాఫిక్ సిబ్బంది వద్ద ట్యాబ్స్ ఉన్నాయి. మరోపక్క ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ పేరుతో ప్రత్యేక యాప్ కూడా ఉంది. ఇది వారి ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసి ఉంటోంది. వెంటనే అప్రమత్తం.. ► రహదారిపై హఠాత్తుగా ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా, నిరసనలు తలెత్తినా స్థానికంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు వెళ్తారు. అలా వెళ్లినప్పుడు సదరు ఉదంతం, కార్యక్రమం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటే వెంటనే అప్రమత్తం అవుతారు. ► ఈ విషయాన్ని తమ యాప్లో పొందుపరుస్తారు. ఇది ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే అడ్మినిస్ట్రేటర్కు చేరుతుంది. ఆయన దాన్ని మరోసారి ఖరారు చేసుకుని ఆన్లైన్లో గూగుల్ సంస్థకు పంపిస్తారు. (క్లిక్: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్! ఆ రెండు రోజులు ఆటోలు బంద్) ► ఆ సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని తమ మ్యాప్స్లో పాయింట్తో సహా పొందుపరుస్తారు. ఆ ప్రాంతానికి అటు ఇటు ఉన్న ప్రత్యామ్నాయ రహదారుల వివరాలను ట్రాఫిక్ పోలీసుల నుంచి సేకరించి గూగుల్ మ్యాప్స్లో పాప్అప్ రూపంలో వినియోగదారులకు తెలియజేస్తారు. ► వీటిని తన స్మార్ట్ఫోన్ల ద్వారా తెలుసుకునే వాహనచోదకులు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా, ప్రత్యామ్నాయ మార్గల్లో వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. సాంకేతిక అంశాలకు సంబంధించి తుది పరిశీలనలో ఉన్న ఈ విధానం త్వరలో హైదరాబాద్లో అందుబాటులోకి రానుంది. (చదవండి: కోవిడ్ పోయింది.. హైబ్రిడ్ వచ్చింది!) -
విశాఖ పర్యటనలో ట్రాఫిక్ జామ్పై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి
-
ట్రాఫిక్ జామ్ ఘటనలు మళ్లీ రిపీట్ కావొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం పర్యటనలో ట్రాఫిక్ జామ్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ శారదా పీఠం సందర్శనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం పర్యటన సందర్భంగా.. నగరంలో గంటల తరబడి అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. దీనిపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెంటనే విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపేశారని అధికారులను ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: సరిలేరు నీకెవ్వరు.. వెలుగుల సీలేరు ) -
Lucknow: విమానం టైరును ఎత్తుకెళ్లిన దుండగులు!
లక్నో: కాస్త ఏమరుపాటుగా ఉంటే దొంగలు తమచేతి వాటం చూపిస్తారు. సాధారణంగా నగానట్రో, రోడ్డుపై ఉన్న వాహనాలనో మూడోకంటికి తెలీకుండా పనికానిచ్చేస్తారు. ఐతే ఓ దొంగల ముఠా ఏ కంగా విమానం టైర్ను ఎత్తుకెళ్లింది! లక్నోలోని బక్షి-కా-తలాబ్ ఎయిర్బేస్ నుండి జోధ్పూర్ వైమానిక స్థావరానికి సైనిక వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కులో మిరాజ్ ఫైటర్ జెట్ విమానం టైర్ను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. నవంబర్ 27 అర్ధరాత్రి లక్నోలోని షాహీద్ పాత్లో జోధ్పూర్ ఎయిర్బేస్కు వెళ్తున్న సమయంలో దొంగతనం జరిగింది. వివరాల్లోకెళ్తే.. షాహీద్ పాత్ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో స్కార్పియో వాహనంలో వెళ్తున్న దుండగులు టైరుకు కట్టేందుకు ఉపయోగించే పట్టీని పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. లారీ డ్రైవర్ పోలీసులకు విషయం తెలియజేసే సమయానికి దొంగలు పరారయ్యారు. అతను పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాగా షాహీద్ మార్గంలో జామ్ కావడంతో ట్రక్కు నెమ్మదిగా కదులుతున్న సమయంలో దొంగలు అర్ధరాత్రి 12 గంటల 30 నిముషాల నుంచి 1 గంటల మధ్య చోరీకి పాల్పడ్డారని ట్రక్ డ్రైవర్ హేమ్ సింగ్ రావత్ తెలిపారు. బక్షి-కా-తలాబ్ వైమానిక స్థావరం నుండి సైనిక వస్తువుల సరుకును తీసుకువెళుతున్నట్లు పోలీసులు ధృవీకరించారు. మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానానికి చెందిన ఐదు టైర్లు లక్నో ఎయిర్బేస్ నుండి అజ్మీర్కు ట్రక్కులో రవాణా అవుతున్నాయి. అందులో ఒక టైరును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నవంబర్ 27న చోటుచేసుకోగా.. డిసెంబర్ 1న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ ఈస్ట్ అమిత్ కుమార్ తెలిపారు. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్వీడియో తీసి 10 లక్షలు డిమాండ్! -
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
-
హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్