Walking
-
వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు
గుండె పోటు అంటే బీపీ, సుగర్ లాంటి వ్యాధులున్నవారిలో, అధిక బరువు ఉన్నవారిలోమాత్రమే వస్తుంది అని భ్రమపడేవారు. కానీ ప్రస్తుతం గుండెపోటు తీరు మారింది. నిరంతరం వ్యాయామం చేస్తూఆరోగ్యంగా ఉన్నవారినికూడా గుండె పోటు బలి తీసుకుంటోంది. తాజాగా ఉదయం వాకింగ్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన వైనం పలువుర్ని విస్మయ పర్చింది. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఆదివారం ఉదయం నడకకు వెళుతుండగా 28 ఏళ్ల అనుమానాస్పదంగా కుప్పకూలి మరణించాడు. బాధితుడిని రాష్ట్రీయ లోక్దళ్ కార్యకర్త అమిత్ చౌదరిగా గుర్తించారు. నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి చౌదరిని పలకరించి, అతని భుజం తట్టి వెళ్ళిపోయిన దృశ్యాలు CCTV ఫుటేజ్లో రికార్డైనాయి. ఆ తరువాత అతను అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనాడు.. తీవ్ర ఇబ్బందికి గురైన అతను ఇంటి ఎదురుగా ఉన్న గోడను ఆసరా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. జిల్లాలోని మదన్పూర్ గ్రామంలోని ఇంటి వెలుపల గుండెపోటుతో మరణించాడు. చౌదరి కుప్పకూలిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడు. చౌదరి మరణానికి డెపోటే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అని భావిస్తున్నారు.⚠️ Trigger Warning : Sensitive Visual⚠️जिंदगी–मौत का कुछ नहीं पता। इस Video को देखिए। 20 सेकेंड पहले तक जो इंसान एकदम फिट दिखाई दे रहा है, वो अचानक से मर जाता है।📍बुलंदशहर, यूपी pic.twitter.com/9jiDgbC2ay— Sachin Gupta (@SachinGuptaUP) March 22, 2025 చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?గుండెపోటుఎందుకు వస్తుంది?గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్న మాట. గుండె నొప్పి లక్షణాలు:గుండె నొప్పి (ఛాతీ నొప్పి) తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఛాతీ నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బరువుగా, టైట్గా అనిపించిడం, నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, చల్లని చెమటలు, ఎడమ చేయి లేదా దవడలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి.ఇంకా తలనొప్పి, ఎడమ చేయి, మెడ, దవడ లేదా రెండు చేతుల్లో నొప్పి, బలహీనంగా, అనీజిగా అనిపించడం, చర్మం పాలిపోవడంలాంటి లక్షణాలు కనిపించినా వైద్య సహాయం తీసుకోవాలి. ఇంతకు ముందే గుండె సమస్యలున్నా, కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలున్నా మరింత అప్రమత్తంగా ఉండాలి. -
'వాకింగ్ యోగా': జస్ట్ ఒకే వ్యాయామంతో..!
నడక, యోగా రెండూ దేనికవే ప్రత్యేకం. ఆరోగ్యకరమైన వ్యాయామ మార్గాలు. ప్రస్తుతం ఈ రెంటినీ మిళితం చేసిన సరి కొత్త వ్యాయామంగా అందుబాటులోకి వచ్చింది వాకింగ్ యోగా. అటు నడక ద్వారా లభించే ప్రయోజనాలతో పాటు.. ఇటు యోగా ఫలితాలను ఒకే వ్యాయామం ద్వారా అందుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అనేక మందిని ఆకట్టుకుంటున్న ఈ వాకింగ్ యోగా విశేషాలివి..నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నడక– యోగా ఆ ప్రయోజనాలను మరింత ముందడుగు వేయిస్తుంది. ఆధునిక సౌకర్యాలు, పని విధానాల వల్ల చలన రహితంగా మారుతున్న శరీరాన్ని చురుకుగా కదపడానికి విభిన్న రకాలుగా సాగదీయడానికి, సరైన రీతిలో శ్వాస పీల్చుకోడానికి వీలుగా ఈ వాకింగ్ యోగా రూపుదిద్దుకుంది. ఇది నడిచేటప్పుడు మన శరీర భంగిమను మెరుగుపరచడానికి, నడకను మరింత ప్రయోజనకరంగా మార్చడానికి సహకరిస్తుంది. ఏదో నడిచాం అన్నట్టుగా కాకుండా అవగాహనతో నడవడం నేర్పిస్తుంది. ఇందులో ప్రతి అడుగు లోతైన శ్వాస, సున్నితమైన స్ట్రెచ్లతో కలిపి ఉంటుంది. భంగిమకు మేలు.. మనలో చాలా మంది మన శరీర భంగిమ ఎలా ఉంటుందో పట్టించుకోకుండా నడుస్తూ ఉంటారు. తద్వారా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతుంటారు. వాకింగ్ యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్లు, మెడ.. వీటిని సరైన రీతిలో ఉంచేలా సహాయపడుతుంది. నిటారుగా నిలిచేలా, నడుము భాగం, వీపుతో నడకను అనుసంధానిస్తుంది. కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొందరికి అననుకూలం.. ఒక వ్యక్తి తమ నడకను మరింత విశ్రాంతిగా అదే సమయంలో మరింత ఉపయుక్తంగా మార్చే నడక యోగా టీనేజర్స్తో సహా అన్ని వయసుల వారికీ ఉపయుక్తమే. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది అందరికీ అనుకూలం కాకపోవచ్చు. వేగవంతమైన నడక లేదా తీవ్రమైన వ్యాయామాలను ఇష్టపడే వ్యక్తులకు నప్పకపోవచ్చు. అలాగే, దీనికి ఏకాగ్రత, ఎక్కువ సహనం అవసరం. అది లేనివారు దీన్ని సాధన చేయడం కష్టం. నప్పుతుందో లేదో తెలుసుకోడానికి ఒక వారం పాటు దీనిని ప్రయత్నించి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానసికంగానూ ఎంతో మేలు.. నడక యోగా ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతిని అందించడానికి ఒక గొప్ప మార్గం. ఇది నడుస్తున్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం అలవాటు చేస్తుంది. తద్వారా ఆందోళనను, ప్రతికూల ఆలోచనలను తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది చురుకుగా ఉంటూనే మెదడుకు రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయడం లాంటిదని చెప్పొచ్చు. మనసు శరీరానికి క్రమబద్ధమైన అభ్యాసం ఇది. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని, ఏకాగ్రతను పెంచడానికి శరీరంపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజుకు 5 నిమిషాలతో.. బాగా పరిచయం ఉన్న కాస్త ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో రోజుకు ఐదు నిమిషాలతో ఈ వాకింగ్ యోగాని ప్రారంభించాలి. రోజుకు క్రమంగా ఐదు నిమిషాల చప్పున పెంచుకోవచ్చు. తద్వారా రొటీన్ వ్యవహారాలకు, వ్యాయామాలతో సర్దుబాటు కావడానికి కండరాలకు సమయాన్ని ఇవ్వాలి. ‘రోజుకు 20 నిమిషాలు వచ్చే వరకూ ఈ విధంగా పెంచుతూపోవాలి. ప్రతిరోజూ 20 నిమిషాలు కేటాయించలేకపోతే.. కనీసం వారానికి మూడు రోజులు 30 నిమిషాలు చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. 50 ఏళ్ల క్రితమే.. మైండ్ఫుల్ వాకింగ్ అనే ప్రక్రియను యోగా శిక్షకురాలు, యోగా ఫర్ పెయిన్ యాప్ సృష్టికర్త, లండన్కు చెందిన సోఫియా డ్రోజ్డ్ వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఇదేమీ కొత్తది కాదని, దాదాపు 50 ఏళ్ల క్రితం.. అంటే 1970 ప్రాంతంలోనే రోజువారీ కార్యకలాపాలతో యోగా, బ్రీత్వర్క్లను కలిపే సాధనంగా ఇది ప్రప్రథమంగా వినియోగంలోకి వచ్చిందని డ్రోజ్డ్ అంటున్నారు. ప్రకృతితో మమేకం.. మైండ్ ఫుల్ వాక్.. దృష్టిని పూర్తిగా శ్వాస మీదే కేంద్రీకరిస్తూ.. ఆలోచనలు మరే విషయం మీదకూ మళ్లించకుండా శరీరాన్ని కదిలించడమే మైండ్ ఫుల్ నెస్. నడిచే సమయంలో ఈ ప్రక్రియను సాధన చేస్తే.. అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అది కూడా ప్రకృతిలో మమేకమవుతూ చేయడం మరింత ప్రయోజనకరం. నడకను, యోగాను మేళవించడమే వాకింగ్ యోగా. మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నేచర్ వాక్, పచ్చని గడ్డి మీద నడిచే బేర్ ఫుట్ వాక్, క్లౌడ్ గేజింగ్.. వంటివన్నీ ఇందులో భాగంగానే చెప్పవచ్చు. నగరంలో పలువురు వాకింగ్ యోగాను సాధన చేస్తున్నారు. – రీనా హిందోచా, యోగా శిక్షకురాలు (చదవండి: క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..) -
బరువు తగ్గాలన్నా, ఫిట్గా ఉండాలన్నా ది బెస్ట్ ఫార్ములా!
బరువు తగ్గాలంటే జీవన శైలి మార్పులు చేసుకోవాలి. వాకింగ్, యోగా ఇలాంటి ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి. అంతేకాదు ఆరోగ్యంగా, ఫిట్గా ఉండాలన్నా కూడా వాకింగ్కు మించింది లేదు. ఈ వాకింగ్లో చాలా పద్దతులు న్నాయి. రోజులో కనీసం 5 వేల అడుగులు వేయాలని, 10 వేల అడుగులు నడిచే వారికి ఊబకాయం అనే సమస్య ఉండదని నిపుణులు చెబుతారు. అయితే ఒక పద్ధతిని పాటిస్తే వాకింగ్ బోర్ కొట్టకుండా ఉత్సాహంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకుందామా మరి.ఫిట్గా ఉండటానికి నడక కంటే మెరుగైన వ్యాయామం లేదు. రెగ్యులర్ వాకింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నడక వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. గుండెకు బలం చేకూరుతుంది. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు, దృఢంగా మారతాయి. కండరాల శక్తి పెరుగుతుంది. బీపీ, షుగర్ లాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. వీటన్నింటికి మించి ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే, ఈ రోజువారీ నడకలో చిన్న మార్పులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయని నిపుణులు అంటున్నారు. అదే 2:2:1 వాకింగ్ ఫార్ములాచదవండి: ఇంటి గుట్టు :దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!ఏంటీ 2:2:1 వాకింగ్ ఫార్ములా రెండు(2) నిమిషాలు వేగంగా నడవడం (Brisk walking) తరువాతి రెండు(2) నిమిషాలు జాగింగ్ (jogging) చేయడంఆ తరువాత ఒక నిమిషం (1) పాటు సాధారణ నడక(normal walking) అన్నమాట. ఈ సైకిల్ను రిపీట్ చేస్తే అటు బరువు తగ్గడంతోపాటు, ఇటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. రోజులో కనీసం అరగంట ఈ పద్ధతినే పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారికి గేమ్-ఛేంజర్గా భావిస్తారు. ప్రయోజనాలుకేలరీలు తొందరగా,ఎక్కువగా బర్న్ అవుతాయి. 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల 200 కేలరీలు బర్న్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయిజీవక్రియ వేగవంతమవుతుంది.వేగంగా నడవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఆ తరువాత చేసే జాగింగ్ కొవ్వును వేగంగా కరిగించడానికి సాయపడుతుంది. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్తాయి పెరుగుతుంది. నెమ్మదిగా నడుస్తున్నప్పుడు జాగింగ్తో అలసిన కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విధానంలో అలసట రాదు , ఆసక్తికరంగా ఉంటుంది కూడా. నెమ్మదిగా, స్థిరంగా చేసే ఒకే రకమైన వ్యాయామాల కంటే ఇంటర్వెల్-స్టైల్ వ్యాయామాలు కొవ్వును కరిగించ డానికి, సమర్థవంతంగా ఉంటాయని అధ్యయనాల ద్వారా వెల్డైంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే 2:2:1 ఫార్ములా ఉత్తమమంటున్నారు నిపుణులు. -
హెల్మెట్ లేకుండా నడిచినందుకు ఫైన్!
సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఆపి, ‘హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టు’అంటాడు ఓ సినిమాలో ట్రాఫిక్ పోలీస్. మధ్యప్రదేశ్లో పోలీసులు మరో అడుగు ముందుకేశారు! రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తకి హెల్మెట్ పెట్టుకోలేదంటూ రూ.300 జరిమానా విధించారు! పన్నా జిల్లాలో అజయ్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన జరిగింది. సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తి తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు అతిథులను ఆహ్వానించేందుకు వెళ్తుండగా ఓ పోలీసు వాహనం అడ్డగించింది. బలవంతంగా వాహనంలోకి ఎక్కించి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. కుమార్తె పుట్టినరోజు వేడుకలకు ఇంటికి వెళ్లాల్సి ఉందని చెప్పినా పోలీసులు విన్పించుకోలేదు. పక్కనే ఉన్న ఓ బైకు రిజి్రస్టేషన్ నంబర్ రాసి మరీ, హెల్మెట్ లేకుండా వాహనం నడిపావంటూ శుక్లాకు జరిమానా విధించారు. దాంతో ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఆధారంగా తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పిల్లల్లో దొడ్డికాళ్లు, కారణాలు తెలుసుకోండి!
పిల్లల్లో మోకాళ్ల వద్ద దూరం ఎక్కువగా ఉండి, చిన్నారుల అరికాళ్లు దగ్గరగా ఉంచినప్పుడు ఈ రెండు కాళ్లూ బయటివైపునకు విల్లులా ఒంగి ఉండే కండిషన్ను ఇంగ్లిష్లో బౌడ్ లెగ్స్, వైద్యపరిభాషలో జీనూవేరమ్ అంటారు. తెలుగు వాడుక భాషలో ఈ కండిషన్ను ‘దొడ్డికాళ్లు’ అంటుంటారు. నిజానికి పుట్టిన పిల్లలందరూ చిన్నతనంలో కొన్నిరోజుల పాటు ఎంతోకొంత దొడ్డికాళ్ల (బౌడ్ లెగ్స్) కండిషన్ను కలిగి ఉంటారు. శిశువు తన పిండ దశలో దగ్గరగా ముడుచుకుని (ఫోల్డెడ్ పొజిషన్లో) ఉండటమే దీనికి కారణం. అందువల్ల అప్పుడే పుట్టిన పిల్లల్లో కాళ్లు ఇలా ఉండటం చాలా సాధారణం. పిల్లలు నడక మొదలు పెట్టాక, వాళ్లు తమ కాళ్లపై కొంత బరువు మోపుతుండటం మొదలుకావడంతో... అంటే... ఒకటిన్నర–రెండు సంవత్సరాలప్పటి నుంచి వాళ్ల కాళ్లు మామూలుగా కావడం మొదలవుతుంది. దాదాపు మూడేళ్ల వయస్సు వచ్చేసరికి కాళ్లు రెండూ నార్మల్ షేప్కు వస్తాయి. ఒకవేళ చిన్నారుల్లో వారు మూడేళ్లు పైబడ్డాక కూడా బౌడ్ లెగ్స్ (సివియర్ బౌడ్ లెగ్స్) కండిషన్ ఎక్కువగా కనిపిస్తుంటే అందుకు కారణాలు ఏమై ఉంటాయా అని ముందుగా ఆలోచించాలి. అంటే ఆ పరిస్థితికి... రికెట్స్ వంటి వ్యాధులు గానీ; లేదా లెడ్ (సీసం), ఫ్లోరైడ్స్ వంటి విష పదార్థాల ప్రభావం ఎక్కువ కావడం గానీ; లేదా ఎముకల షేప్ మారడం (బోన్ డిస్ప్లేసియాస్) వంటివి గానీ కారణం కావచ్చా అని ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలతోనే ఒకవేళ బౌడ్ లెగ్స్ వచ్చి ఉంటే, దాన్ని కాస్తంత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ జీనూవేరమ్ కండిషన్ ఉన్న పిల్లలకు ఎక్స్రే, రక్తపరీక్షల వంటివి చేసి కారణాలను నిర్ధారణ చేయాలి. కారణం తెలిశాక తగిన చికిత్స అందించాలి. అయితే మొదట్లో ఈ బౌడ్ లెగ్స్ కండిషన్ కనిపిస్తున్నప్పటికీ చిన్నారుల్లో మూడేళ్ల వయసు వచ్చే వరకు ఈ సమస్య గురించి ఆలోచించాల్సిన లేదా ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. మూడేళ్ల తర్వాత కూడా అలాగే ఉంటే మాత్రం అప్పుడు పిల్లల నిపుణులను లేదా ఆర్థోపెడిక్ నిపుణులను తప్పక సంప్రదించాలి. -
బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!
ఇంతవరకు ఎన్నో వెయిట్లాస్ స్టోరీలు చదివాం. వాళ్లంతా బరువు తగ్గి.. ఎలా స్లిమ్గా మారి శెభాష్ అనిపించుకున్నారో చూశాం. కానీ ఇలాంటి అందమైన వెయిట్లాస్ స్టోరీని మాత్రం చదివి ఉండరు. ఈ మహిళ అధిక బరువుకి చెక్పెట్టి అందాల రాణిగా గెలుపు సాధించింది అందర్నీ ఆశ్చర్యపరిచింది పైగా "గెలుపు" అంటే ఇది అని చాటిచెప్పింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అమెరికాలోని సీటెల్లో నివశిస్తున్న 39 ఏళ్ల భారత సంతతి మహిళ చాందినీ సింగ్ యూఎస్ఏ ఆధారిత పిల్లల పాదరక్ష కంపెనీ సహ వ్యవస్థాపకురాలు. ఆమె పీసీఓఎస్ సమస్యలతో గర్భం దాల్చడంలో పలు కాంప్లీకేషన్స్ని ఎదుర్కొంది. ఏదోలా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక ఒక్కసారిగా ఆరోగ్య సమస్యలు చుట్టిముట్టాయి. మూడోనెల నుంచి బెడ్రెస్ట్ పేరుతో మంచానికే పరిమితమైపోయింది. దీంతో ఒక్కసారిగా బరువు పెరిగిపోయింది. ఆ తర్వాత అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ తోసహ ప్రీ డయాబెటిక్ వంటి సమస్యలను ఫేస్ చేసింది. చివరికి డెలివరి అయ్యి.. కోలుకునేందుకు చాలా సమయమే పట్టింది. కానీ దీని కారణంగా అధిక బరువుతో పాటు ఆయా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇలానే ఉంటే భవిష్యత్తులో తన ఆరోగ్యం మరింత దారణంగా దిగజారిపోతుందేమోనన్న భయం మొదలైంది చాందినీలో. ఇక అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది ఎలాగైన బరువు తగ్గాలని. తన ఫిట్నెస్ లక్ష్యాలు చేరుకునేలా క్రమ తప్పకుండా వ్యాయామాలు, ఆరోగ్యకరమైన డైట్ని ఫాలో అయ్యింది చాందినీ. అయితే మొదటి రెండు నెలల్లో తన బరువులో పెద్ద మార్పులు కనిపించకపోయినా..బరువు తగ్గాలనే ఆలోచనకు మాత్రం బ్రేక్ వేయలేదు. డైట్ని, వర్కౌట్లని కొనసాగిస్తూ ఉండేది. మరికొన్ని వర్కౌట్ల సెషన్లను పెంచుకునేది. ఒకవేళ రెండు నుంచి ఐదు రోజులు వ్యాయామాలు స్కిప్ అయినా కేలరీలు ఏదో రకంగా ఖర్చు అయ్యేలా చూసుకుంది. అలా సుమారు 48 కిలోల మేర తెలియకుండా బరువు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె 70 కిలోల బరువుతో ఉంది. అలాగే ఆమె ఇంతకు ముందు ఫేస్ చేసిన అనారోగ్య సమస్యలన్ని తగ్గుముఖం పట్టాయి. పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉంది. అయితే చాందీని వేగంగా బరువు తగ్గడం కంటే నిదానంగా బరవు తగ్గితేనే ఆరోగ్యకరం అంటోంది. తాను ఇంట్లో వండే భారతీయ భోజనానికే ప్రాధాన్యత ఇచ్చానని, జంక్ ఫుడ్ని పూర్తిగా దూరం పెట్టానని చెప్పారు. ముఖ్యంగా రెస్టారెంట్లలో తినడం తగ్గించినట్లు చెప్పుకొచ్చింది. ఇక్కడితో ఆమె వెయిట్ లాస్జర్నీ పూర్తి కాలేదు. ఆమె స్లిమ్గా మారి.. యూఎస్ఏ 2024 అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. బరువు తగ్గి ఆరోగ్యాన్ని కాపడుకోవడమే గాక అందలా రాణిగా మెరవచ్చు అని చాటి చెప్పింది. ఇక్కడ బరువు తగ్గడం అనేది అందం, ఆరోగ్యం అని చెప్పకనే చెప్పింది చాందినీ. (చదవండి: హాట్టాపిక్గా టెక్ మిలియనీర్ డైట్ ! కేవలం భారతీయ వంటకాలే..) -
6-6-6 వాకింగ్ రూల్ పాటిద్దాం..ఆరోగ్యంగా ఉందాం..!
ప్రస్తుతం బిజీ లైఫ్లో శారీరక శ్రమ అనేది కాస్త కష్టమైపోయింది. ఏదో ఒక టెన్షన్తో రోజు గడిచిపోతుంది. ఇక వ్యాయామాలు చేసే టైమ్ ఏది. కనీసం నాలుగు అడుగులు వేసి వాకింగ్ చేద్దామన్నా.. కుదరని పరిస్థితి. అలాంటి వారు ఈ సింపుల్ 6-6-6 వాకింగ్ రూల్ ఫాలో అయితే చాలు.. సులభంగా వాకింగ్, వ్యాయామాలు చేసేయొచ్చు. మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అత్యంత బిజీగా ఉండే వ్యక్తులకు ఈ రూల్ చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంతకీ అదెలాగంటే..రోజువారీ శారీరక శ్రమను పెంచేలా చిన్న చిన్న.. సెషన్లుగా విభజించే వాకింగ్ రూల్ ఇది. ఏం లేదు..జస్ట్ రోజు ఆరు నిమషాలు ఆరు సార్లు చొప్పున వారానికి ఆరు రోజులు చేయాలి. ఆరు నిమిషాలు చొప్పున నడక కేటాయించండి ఎక్కడ ఉన్నా.. ఇలా రోజంతా ఆరు నిమిషాల నడక..ఆరుసార్లు నడిచేలా ప్లాన్ చేసుకుండి. ఇలా వారానికి ఆరురోజులు చేయండి. ఈ విధంగా నడకను తమ దినచర్యలో భాగమయ్యేలా చేసేందుకు వీలుగా ఈ నియమాన్ని రూపొందించారు. ఆయా వ్యక్తులు తమ సౌలభ్యానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేసుకుంటే చాలు.. సులభంగా వాకింగ్ చేసి..మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రయోజనాలు..హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిరక్తపోటుని తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెరుగైన మాసిక ఆరోగ్యం సొంతంఈ చిన్న చిన్న వాకింగ్ సెషన్లు ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కీళ్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది. చాలా చిన్నసెషన్ల నడక అయినప్పటికీ..క్రమం తప్పకుండా వారమంతా చేయడం వల్ల చక్కగా కేలరీలు బర్న్ అయ్యి జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఈ నియమం హృదయ సంబంధ ఫిట్నెస్, మానిసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అలాగే అత్యంత ప్రభావవంతంగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంపందించడం మంచిది. (చదవండి: ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!) -
జిమ్కి వెళ్లకుండానే 16 కిలోలు తగ్గింది, ఎలా?
బరువు తగ్గే ప్రక్రియ అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి బరువు తగ్గడం అంటే అదొక యజ్ఞం. కొందరు జిమ్కు వెళ్లి వర్కౌట్స్ చేస్తారు. మరికొంతమంది యోగాసనాలతో ఈజీగా బరువు తగ్గుతారు. మరికొంతమంది వాకింగ్, జాగింగ్ ద్వారా తమ అధిక బరువును తగ్గించు కుంటారు. మరికొందరు ఇవన్నీ చేస్తారు. జిమ్కు వెళ్లకుండానే సాహిబా ఏకంగా 16 కిలోల బరువు తగ్గింది. తన వెయిట్ లాస్ జర్నీని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సాహిబా మొదట్లో 104 కిలోల బరువు ఉండేది. దీంతో ఎలాగైన బరువు తగ్గించుకోవాలని నిశ్చయించుకుంది. దీనికి రోజూ 10-20 వేల అడుగులు నడిచేది. అంతేకాదు ఎన్ని కేలరీల ఫుడ్ తింటున్నదీ నిత్యం పరిశీలించుకుంటూ ఉండేది. ఆహార నియమాలను పాటించి భారీగా బరువు తగ్గింది. ప్రస్తుతం 87.85 కిలోల బరువుకు చేరింది. ఇంట్లోనే కొంత కార్డియో చేసానని ,స్కిప్పింగ్ వ్యాయామం కూడా చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కొన్ని చిట్కాలను కూడా తన ఫాలోవర్స్కు అందించింది. అధిక బరువు ఉన్నవారు అరగంట నడకతో ప్రారంభించి, వారి వారి కంఫర్ట్ జోన్కు అనుగుణంగా ఈ సమయాన్నిపెంచుకోవాలని సూచించింది.16 కిలోల బరువు తగ్గడానికి స్టెప్స్ సాహిబా మాటల్లోపూర్తిగా ఉపవాసం కాకుండా మితంగా తిన్నాను. కోరుకున్నది తిన్నారు. తగ్గించి తింటూ కేలరీలను ట్రాక్ చేసుకున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 12:12 (12గం ఉపవాసం 12గం తినడం)శరీరం దీనికి సహకరిస్తే ఈ ఉపవాసాన్ని పెంచుకోవచ్చు.డయాబెటిక్ లేదా కొన్ని మందులు తీసుకుంటే ఉపవాసం వద్దు. 16:8 ఉపవాస పద్ధతిలో రోజుకు 16 గంటల పాటు ఉపవాసం. ప్రోటీన్ , ఫైబర్ ఎక్కువ, పిండి పదార్థాలు , కొవ్వు తక్కువ ఉన్న ఆహారందేన్ని ఎలా తినాలి అనేది లెక్క వేసుకోవాలి.నీటిని తాగుతూ హైడ్రేట్ గా ఉంచుకున్నారు. జిమ్కు వెళ్లకూడదని కాదు!అయితే జిమ్కి వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పింది. అయితే, అందరికీ ఆర్థిక స్థోమత ఉండదు కాబట్టి, తానూ కూడా ఆర్థిక భారం లేకుండా ఈ పద్ధతిని ఎంచుకున్నట్టు వెల్లడించింది. View this post on Instagram A post shared by Sahiba a.k.a Savleen | Vocals & Self-Care 🩷 (@sahibavox) నోట్: మనం ముందే అనుకున్నట్టుగా వెయిట్ లాస్ జర్నీ అనేది అందరికీ ఒకేలా ఉండదు. వారి వారి వ్యక్తిగత ఆరోగ్యం , పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి శరీర తత్వానికి తగ్గట్టు, మన బాడీ అందించే సంకేతాలను గుర్తించాలనే గమనించాలి. ఇటీవల విద్యాబాలన్ చెప్పినట్టు మన బరువు గుట్టు ఏంటి అనేది తెలుసుకుని రంగంలోకి దిగాలి.ఇదీ చదవండి : డైట్ చేస్తున్నారా? బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రాగుల ఉప్మా -
అమోదయోగ్యమైన నడక ఎంత?
అన్ని వయసుల వారికీ వాకింగ్ నిర్ద్వంద్వంగా అందరికీ మేలు చేసే వ్యాయామం. పైగా అది ఎవరైనా చేయగలిగే చాలా తేలికైన ఎక్సర్సైజ్. పైగా దీనికి ఎలాంటి వ్యాయామం ఉపకరణాలూ, పరికరాలూ అక్కర్లేదు. వ్యాయామం చేయగలిగే ఏ వయసు వారైనా అలాగే మహిళలైనా, పురుషులైనా వాకింగ్ చేయాల్సిన సగటు దూరమెంతో, ఎంత నడిస్తే దేహం మీద దాని ప్రభావం పడి, మంచి ఆరోగ్యం సమకూరుతుందో లెక్కలు వేశారు యూఎస్కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వారి సిఫార్సుల ప్రకారం రోజుకు ఎనిమిది కిలోమీటర్లు మంచిదని చెబుతున్నారు. (వాళ్ల లెక్కల ప్రకారం 5 మైళ్లు). ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు నడక గానీ లేదా ఏరోబిక్స్గానీ చేయడం మంచిది. నడర అయితే రోజుకు 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తూ వారంలో కనీసం ఐదు రోజుల పాటైనా ఈ వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే రోజులో కనీసం 4 నుంచి 5 కిలోమీటర్లు నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నది డబ్ల్యూహెచ్వో లెక్క. ఏ లెక్కలు ఎలా ఉన్నా... ఎత్తుకు తగినట్లుగా బరువు తగ్గి, మంచి ఫిట్నెస్ సాధించడం కోసం అందరూ రోజూ ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడవాలని పలు ఆరోగ్య సంస్థల అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల గరిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్నది ఆ అధ్యయనాల మాట. ఇది అందరి లెక్క అయినప్పుడు అందరూ ఇన్ని దూరాలు నడవగలరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా... దీనికి సమాధానమిస్తూ టీనేజ్లో ఉన్న పిల్లలు, యువత చాలా వేగంగా ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు దూరాలు నడవాలనీ, అయితే మధ్యవయస్కులు మొదలు కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు నెమ్మదిగా నడవాలని సూచిస్తున్నారు. మరీ ఎక్కువ వయసుతో వృద్ధాప్యంలో ఉన్నవారు మాత్రం రోజూ 2 నుంచి 4 కిలోమీటర్లు నడిస్తే చాలన్నది ఆ అధ్యయన సంస్థల సూచన. ఇక ఆరు నుంచి పదిహేడేళ్ల వరకు ఉన్న చిన్నారులు రోజుకు కనీసం 60 నిమిషాల పాటైనా వేగంతో కూడిన నడక లేదా కాస్త శ్రమ కలిగించే వ్యాయామాలు చేయాలంటున్నారు.అసలు ఎందుకు నడవాలి?ఈ ప్రశ్న వచ్చినప్పుడు నడక వల్ల కలిగే వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలే సమాధానాలుగా నిలుస్తాయంటున్నాయి ఆరోగ్య పరిశోధక సంస్థలు. నడక వల్ల ఒత్తిడి తగ్గడం, మూడ్స్ మెరుగుపడటం, శక్తిసామర్థ్యాలు పెరగడం, బరువు తగ్గడం, కండరాలు బలంగా మారడం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వాటికి అవసరమైన పోషకాలు అందడం, వాటి ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. -
ధర్మ సందేహాలు: వాకింగ్ చేస్తూ భగవంతుని ధ్యానం మంచిదేనా?
భగవంతుని ధ్యానం చేసేటప్పుడు శుచిగా ఉండాలంటారు. నేను చాలాకాలం నుండి వాకింగ్ చేసేటప్పుడు భగవద్ధ్యానం చేస్తున్నాను. అది దోషమా? ‘ధ్యానం‘ శుచిగా చేయడం శ్రేష్ఠం. దానికి ఆసనం, ప్రాణాయామం సమకూరాలి. అటు తరువాతనే ధ్యానం. అయితే, నడకలో చేసే దానిని ’స్మరణ’ అంటారు. అది శ్రేష్ఠమైన విషయం. భగవత్ స్మరణ సర్వపాపహరం సర్వాభీష్ట ఫలప్రదం. అది నిరభ్యంతరంగా నడకలో చేయవచ్చు. మీరు చాలా కాలం నుండి చేస్తున్న భగవత్ స్మరణ మంచిదే. ధ్యానానికి గానీ, స్మరణకిగానీ ఆచమనం, సంకల్పం అవసరం లేదు. అవి లేకుండానే ధ్యాన–స్మరణలు చేయవచ్చు. అందులో దోషం ఏమీ లేదు. వాటికి తప్పక ఫలితం ఉంటుంది. పూజ’ అనేది బాహ్యం, మానసికం అని రెండు విధాలు. మానసిక పూజకి దేవుడు ఎదురుగా ఉండనక్కర్లేదు. ఈ మానసిక పూజని కొంతమేరకు ’ధ్యానం’ అని నిర్వచించవచ్చు. బాహ్య పూజకు ఎదురుగా దేవుని బింబం (పటంగానీ, విగ్రహంగానీ) ఎలాగూ అవసరమే కదా! ఆ పూజకు ఆచమనం, సంకల్పం వగైరాలు అవసరమే. బాహ్యపూజ వలన శరీర, మనశ్శుద్ధులు ఏర్పడి మానసికమైన భావన, స్మరణ, ధ్యానం వంటివి శీఘ్రంగా సిద్ధించే అవకాశం కలుగుతుంది. ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని అంటారు. నిజంగానే అంతమంది దేవతలున్నారా?ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న మాట నిజమే. ఇక్కడ కోటి అంటే మనం అనుకునే నూరు లక్షలు కాదు. సంస్కృతం లో కోటి అంటే విభాగం అని అర్ధం. మొత్తం ముప్పై మూడు రకాలయిన దేవతలు అని అర్థం వస్తుంది. వారు వరుసగా అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రుడు, బ్రహ్మ (ప్రజాపతి) కలిపి మొత్తం ముప్పైమూడు మంది దేవతలు. -
వాకింగ్ : జంటగానా? ఒంటరిగానా? ఎపుడైనా ఆలోచించారా?
రోజూ కనీసం అర్థగంట సేపు నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాకింగ్ శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది ఖర్చులేనిది. అనువైంది కూడా క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలనుంచి బయటపడొచ్చు. సాధారణంగా, గుంపులుగా, జంటలుగా, స్నేహితులతో వాకింగ్ చేస్తూ ఉండటం, పార్కింగ్ల్లోనూ, ఇతర ప్రదేశాల్లోనూ చూస్తూ ఉంటాం. అయితే వాకింగ్ ఎలా చేయాలి. ఎపుడు చేయాలి? ఒంటరిగాచేయాలా? లేక తోడు ఉంటే మంచిదా? ఇలాంటి విషయాల గురించి ఎపుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం రండి!ఏ సమయంలో చేయాలి? వ్యాయామం ఎపుడు చేసినా దాని ప్రయోజనాలు దానికుంటాయి. సాధారణంగా మార్నింగ్ వాకింగ్ మంచిదని చెబుతారు. ఉదయం ట్రాఫిక్ బెడద ఉండదు, కాలుష్యం తక్కువ. వీటిన్నింటికంటే ఉదయం వాతావరణం ప్రశాంగంగా ఉంటుంది. సూర్యుని లేలేత కిరణాలు, శరీరానికి, మనసుకు ఉత్తేజానిస్తాయి.రోజుకు కనీసం గంట అయినా వాకింగ్ చేస్తే ఫలితాలు బావుంటాయి. ఉదయం, సాయంత్రం 30 నిమిషాల చొప్పున రోజులో గంట చేసినట్టువుతుంది. వాకింగ్ను ప్రారంభించేటప్పుడు నెమ్మదిగా నడవాలి. అటవాటైన కొద్దీ క్రమంగా వేగం పెంచాలి. షుగర్ పేషెంట్లే, గుండె జబ్బులున్నవారు ఏదైనా కాస్త తిన్నాక చేయడం మంచిది. వాకింగ్ కోసం సౌకర్యవంతంగా ఉండే షూస్ ధరించడం, పార్క్ల్లో కాకుండా ఆరుబయట నడిచే వారు కుక్కల నుంచి తప్పించుకునేందుకు చేతి కర్ర ఉంటే మంచిది.ఒంటరిగా చేయాలా? తోడు ఉండాలా?ఒంటరిగా నడవడం వల్ల ఏకాగ్రత ఉంటుంది, నడకచురుగ్గా ఉంటుందిమాట్లాడుకుంటూ నడిస్తే తొందరంగా ఆయాసం వస్తుంది. ఏకాగ్రత ఉండదు. ఏదైనా వ్యాయామంద్వారా ప్రయోజనం పొందాలంటే కాన్సెంట్రేషన్ ముఖ్యం. ఇద్దరు లేదా ముగ్గురుఉంటే ఇది సాధ్యపడకపోవచ్చు. సరైన వేగంతో నడిస్తేనే ఫలితం బావుంటుంది. కనుక ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే ఒంటరిగా నడవడం ఉత్తమ మార్గం.అయితే భర్త లేదా భార్యతోనో, స్నేహితులతోనో కలిసి నడిస్తే ప్రయోజనం ఉండదా? ఉంటుంది. ఎలా అంటే..పార్టనర్ ఉంటే నడక బోర్ కొట్టదు. ఉత్సాహంగా ఉంటుంది. జంటగా అయితే మీ వేగాన్ని అందుకోగల వారైతే ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. పోటీ తత్వం ఉంటుంది.వృద్ధులు తమతో పాటు ఎవరైనా ఉన్నప్పుడు మరింత సురక్షితంగా భావిస్తారు. పెద్దవాళ్లు గుంపులుగా నడవడం ఖచ్చితంగా సురక్షితం.వాకింగ్ ఎపుడు, ఎలా అనేది మనకున్న వెసులుబాటు, మనం అనుకున్న లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా, నిబద్ధతతో చేసినపుడు మాత్రమే చక్కటి ఫలితం లభిస్తుంది.ఇదీ చదవండి: గణపతి బప్పా మోరియా : స్టార్ కిడ్ రాహా ఎంత ముద్దుగా ఉందో! -
వాకింగ్ వల్ల మోకాళ్లు దెబ్బతింటాయా.? అలా కాకూడదంటే..?
కొందరూ వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ల సమస్య వస్తుందని ఫిర్యాదులు చేస్తుంటారు. అందుకని వాకింగ్ మానేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే సమస్య ఉన్నా కూడా మార్నింగ్ సమయంలో వాకింగ్కి వెళ్లడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. సమస్య తీవ్రతరం కాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. శారీరక, మానసిక ధృఢత్వం కోసం పూర్తి కార్డియో వ్యాయామాలు, నడక ఎల్లప్పుడూ మంచివి. ఉదయం నడకతో రోజుని ప్రారంభిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. వాకింగ్ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా బరువు నిర్వహణలో కూడా ఉపయోగపడుతుంది. అయితే నడిచే విధానంలో తప్పుడు విధానం లేదా భంగిమలో నడవడం కారణంగా దిగువ శరీరంగపై ఒత్తిడి ఎక్కువై మోకాళ నొప్పికి దారితీస్తోంది. అదికాస్తా దీర్ఘకాలిక ఆస్టియో ఆర్థరైటిస్ కారణమవుతుంది. ఇలాంటి సమస్యలు రాకూడదంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని వాకింగ్ వెళ్లితే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.మార్నింగ్ వాకింగ్ ప్రారంభించే ముందే కొన్ని వార్మింగ్ అప్ వ్యాయామాలు చేయండి. ఇది మిమ్మల్ని శక్తిమంతంగా, ఫ్లెక్సిబుల్గా ఉంచడంలో సహాయపడుతుంది. నెమ్మదిగా శరీరాన్ని సాగదీయడం, కొద్దిపాటి ఎక్సర్సైజ్లతో శరీరంలో ఉష్ణోగ్రత వస్తుంది. అందువల్ల సులభంగా నడవడగలుగుతాం.అలాగే గోరు వెచ్చని నీటితో ఫ్రెష అయ్యాక వాకింగ్ వెళ్లండి. దీనివల్ల సులభంగా కదిలేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకింగచి కీళ్ల ద్రవం కదిలేందుకు సహాయపడుతుంది. ఎల్లప్పుడూ నడకని నెమ్మదిగా ప్రారంభించండి. ఈ నడక షెడ్యూల్ను దాదాపు పది నిమిషాల్లో చేసేలా సెట్ చేయండి. అలా రోజుకి 30 నిమిసాలు చేసేలా వేగం పెంచుకోండి. కాలక్రమేణ వేగంగా నడవగులుగుతారు, సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. రోజుకి కనీసం ఆరువేల అడుగులు వేయండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు రోజుకు కనీసం ఆరువేల అడుగులు నడిస్తే చాలప్రయోజనం ఉంటుంది. నడకను ట్రాప్ చేసేల ఫోన్ యాప్ని ఉపయోగించండి. ముఖ్యంగా సౌకర్యవంతమైన బూట్లు ధరించండి. మడమపై ఒత్తిడి పడకుండా నడవగలిగేలా ఫ్లాట్, ఫ్లెక్సిబుల్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ 0.75 లేదా అంతకంటే తక్కువ ఎత్తులో ఉండే బూట్లను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నొప్పి లేకుంటే కంటిన్యూగా నడవండి. అలా కాకుండా నొప్పి మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతుంటే ఒకటి లేదా రెండు నిమిషాలు బ్రేక్ తీసుకుంటూ ప్రయత్నించండి. అలాగే చదునుగా ఉండే మైదానం లేదా ఉపరితలంపైనే నడవండి. మోకాళ్లకు నడక ఎందుకు మంచిదంటే..?మోకాళ్లలోని మృదులాస్థి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషణను అందిస్తుంది. కీళ్లను కదిలించడం వల్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇది ఎక్కువసేపు పనిచేసేందుకు ఉపకరిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం కండారాలను మెరుగ్గా ఉంచేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ వాకింగ్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.(చదవండి: ఎరుపు ఆర్గాంజా చీరలో జాన్వీ స్టన్నింగ్ లుక్..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
వాకింగ్ చేస్తే మోకాళ్లు అరిగిపోతాయా?
ఆర్థరైటిస్ కారణంగా మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు తాము వాకింగ్ చేస్తే తమ మోకాళ్లు మరింతగా అరిగిపోతాయని అపోహపడుతుంటారు. ఇది వాస్తవం కాదు. నిజానికి మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ అంత బాగా రక్తప్రసరణ అవుతుంటుంది. దాంతో కీళ్లకు పోషకాలు బాగా అందడమే కాకుండా కండరాలూ, ఎముకలు బాగా బలపడతాయి. ఆర్థరైటిస్తో బాధపడేవారే కాకుండా, మధ్యవయసుకు వచ్చిన ఆరోగ్యవంతులందరూ వెంటనే వాకింగ్ మొదలుపెట్టడం మంచిది. సైక్లింగ్ వల్ల మోకాళ్లు మరింత అరుగుతాయనుకుంటారు కానీ ఒంటి బరువు పడకపోవడంతో సైక్లింగ్ కూడా మంచిదే. శరీరం బరువు మోకాళ్ల మీదా, తమ కాళ్ల మీద పడదు కాబట్టి స్విమ్మింగ్ కూడా మంచి ఎక్సర్సైజ్. పైగా స్విమ్మింగ్లో కేవలం మోకాళ్లకే కాకుండా ఒంటికంతటికీ మంచి వ్యాయామం సమకూరుతుంది. -
ఎక్కువ క్యాలరీలు ఖర్చవ్వాలంటే..రివర్స్ వాకింగ్ ట్రై చేశారా?
ఆరోగ్యకరమైన అలవాట్లు ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో మనిషికి చాలా ఆరోగ్య ప్రయోజనాలను లభిస్తాయి. చక్కని ఆరోగ్యంతోపాటు, చక్కని శరీరాకృతితో బరువు పెరగకుండా ఉండేందుకు చాలా వ్యాయమాలను చేస్తాం. అయితే వెనుకకు నడవడం లేదా రివర్స్ వాకింగ్ ఉత్తమమైన వ్యాయామమని మీకు తెలుసా? చిన్నతనంలో ఏదో సరదాగా ఆటల్లో భాగంగా అలా చేసే ఉంటారు కదా. కానీ పెద్దయ్యాక కూడా రివర్స్ వాకింగ్ వల్ల చాలా లాభాలున్నాయి. ఇది వింతగా అనిపించినప్పటికీ ఇది ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.రివర్స్ వాకింగ్ మన సమతుల్యతను, స్థిరత్వాన్ని కాపాడుతుంది. తూలి పడిపోయే ప్రమాదం నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా పెద్ద వయసువారిలో పడిపోవడం వల్ల ఎముకలు విరగడం లాంటి ప్రమాదాలను నివారించవచ్చు.ఈ టెక్నిక్తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రతతో మరింత స్థిరంగా ఉండటానికి దోహదపడుతుంది. ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి కూడా వేగవంతమైన నడక కంటే రివర్స్ వాకింగ్తో 40 శాతం ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.రివర్స్ వాకింగ్ కీళ్ల పనితీరు మెరుగుపడుతుంది. కాళ్లలోని కండరాలు బలపడతాయి. కండరాలు ఎక్కువగా సాగుతాయి. మోకాళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది.వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రివర్స్ వాకింగ్ కింది వీపుపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా బాగా పనిచేస్తుంది. వెనుకకు నడిచేటప్పుడు ఏకాగ్రత అవసరం. కనుక శరీరంలోని మెదడు, ఇతర అవయవాల మధ్య సమన్వయం పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. గుండె, ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచి, ప్రసరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది అథ్లెట్లకు, ముఖ్యంగా రన్నర్లకు, ఇది బాగా ఉపయోగకరం. ఎలా చేయాలి?ఆరుబయట, విశాలమైన పార్క్ లేదా ప్రశాతంగా ఉండే నిశ్శబ్ద పరిసరాలు, సురక్షితమైన ఖాళీ స్థలాన్ని ఎంచుకోవాలి. ఎటువంటి అడ్డంకులు, ట్రాఫిక్ లేని ప్రాంతాలను ఎంచుకోండి. వెనుకకు నెమ్మదిగా అడుగులు వేస్తూ నడవాలి. ట్రెడ్మిల్పై కూడా చేయవచ్చు.ఈ రివర్స్వాకింగ్ను నెమ్మదిగా ప్రారంభించాలి. ఆరంభంలో ఎవరైనా తోడు ఉంటే ఇంకా మంచిది. అలవాటయ్యే కొద్దీ, ఈ వాకింగ్ సమయాన్ని, దూరాన్ని పెంచుకోవచ్చు. సపోర్ట్ ఇచ్చే ఫిట్టింగ్ పాదరక్షలను ధరించండినోట్ : మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడేవారు వైద్య సలహా మేరకు రివర్స్వాకింగ్ చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. తూలిపడే తత్వం, ఉదాహరణకు వర్టిగోతో బాధపడుతున్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. -
ట్రెడ్మిల్ వర్సెస్ వాకింగ్: ఏది బెటర్?
వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ట్రెడ్మిల్ కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సమతుల్య వ్యాయామ నియమావళిలో భాగంలో ఏ వ్యాయామం బెటర్గా ఉంటుందనే ప్రశ్న అందరికి వచ్చే కామన్ సందేహం. ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే.నడక అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాయామానికి సంబంధించిన అత్యంత సులభమైన వర్కౌట్. ఇది అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా గుండెజబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, టైప్2 డయాబెటిస్ వంటి వివిధ సమస్యలను ఎదుర్కొనడంలో సహాయపడుతుంది. శారీరక ప్రయోజనాలే కాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేగాదు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. మరి ఇలాంటి ప్రయోజనాలు ట్రెడ్మిల్పై నడిచినా లభిస్తున్నాయి కదా మరీ రెండింటిలో ఏది బెటర్ అనే సందేహం అందిరిలో మెదిలే ప్రశ్న. రెండు కూడా శరీరానికి మంచి ప్రయోజనాలే అందిస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే బెస్ట్ అంటే..ట్రెడ్మిల్పై నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు..ట్రెడ్మిల్పై నడవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైద్యులు ఏమంటున్నారంటే..నియంత్రిత వాతావరణంలో ట్రెడ్మిల్పై నడవడం జరుగుతుంది. వర్షం, మంచు లేదా వేడి వాతావరణాల్లో బయటకు రానివాళ్లకు, లేదా పడనివాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. అదీగాక ఆధునిక ట్రెడ్మిల్లు వివిధ సెట్టింగులతో వస్తున్నాయి. ఇవన్నీ మంచి వర్కౌట్లకు అనుగుణంగా ఉన్నాయి. శరీరానికి తగిన వ్యాయామం లభించినట్లు అవుతోంది కూడా. ట్రెడ్మిల్లు కుషన్డ్ ఉపరితలాలు కలిగి ఉంటాయి. అందువల్ల బహిరంగ ఉపరితలాలపై నడవడం కంటే దీనిపై నడవడం వల్ల కీళ్లకు మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లకు లేదా ఆర్థోపెడిక్ సర్జరీల నుంచి కోలుకుంటున్న వారికి ఈ ఫీచర్ కీలకం.ముఖ్యంగా భద్రత ఉంటుంది. ఇంటిలోపలే ట్రెడ్మిల్పై నడవడం వల్ల ట్రాఫిక్ వంటి సమస్యలు ఎదురవ్వవు. ఎలాంటి ప్రమాదాలు ఎదురుకావు. ఆరుబయట నడవడం వల్ల కలిగే లాభాలు..ఆరుబటయ నడవడం వల్ల సహజమైన వాతావరణ వైవిధ్యం లభిస్తుంది. శరీరానికి ఆహ్లాదం తోపాటు చక్కటి వ్యాయామం లభిస్తుంది. తాజాగాలి, సూర్యకాంతి, ప్రకృతికి బహిర్గతం అవుతాం. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పచ్చటి ప్రదేశాల్లో నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మానసిక స్థితి మెరుగుపడుతుంది. మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బహిరంగంగా నడవడం వల్ల మన చుట్టు ఉన్నవాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. చక్కటి సామాజిక సంబంధాలు మానసిక ఉత్సాహాన్ని అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే బయట నడవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఏది మంచిదంటే..ట్రెడ్మిల్ లేదా ఆరుబయట నడవడం అనేది వ్యక్తిగత పరిస్థితులు, ప్రాధాన్యత ఆధారంగా ఇది నిర్ణయించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భద్రతా సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ట్రెడ్మిల్ మంచిదని, ప్రకృతితో సాన్నిత్యం కోరుకునేవారికి, మానసిక ఆరోగ్యం కోసం అయితే బహిరంగంగా వాకింగ్ చేయడం సరియైనదని నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: రక్తదానం చేయడం మంచిదేనా? ఏడాదికి ఎన్నిసార్లు చెయ్యొచ్చు..) -
తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్.. ఏంటో తెలుసా?
శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం కోసం ఎవరి పద్ధతులు వారికి ఉంటాయి. కొందరు రకరకాల ఎక్సర్సైజులు చేస్తే, పొట్టను మాడ్చుకుంటారు కొందరు. వాకింగ్, జాగింగ్ వంటి వాటితో ప్రారంభించి, చిన్న చిన్న బరువులు మోయడం... ఆ తర్వాత వాటన్నింటినీ అనుసరించలేక నీరస పడిపోతుంటారు ఇంకొందరు. అయితే అలా కాకుండా తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్ ఒకటుంది. అదేమంటే మెట్లెక్కడం... నిజమే! మెట్లెక్కడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మెట్లెకెక్కినట్లే! అయితే దానికీ ఓ పద్ధతుంటుంది మరి.నడవటం, పరుగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈదటం లాంటి మిగతా వ్యాయామాలే కాదు, రోజూ మెట్లెక్కటం, దిగటం వల్ల కూడా శరీరం ఆరోగ్యవంతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సాధారణంగా నేలమీద నడుస్తున్నప్పటి కంటే మెట్లెక్కుతూ పైకి వెళ్ళటం, కిందకు దిగటం మూలంగా కండరాలు బలపడతాయి. తొడలు, కాలి పిక్కలు పటిష్టంగా తయారవుతాయి. కండరాలు బలంగా ఉంటే నిటారుగా, మంచి ఫిటెనెస్ తో ఉన్నట్లుగా కనిపిస్తారు.శరీరాకృతి పట్ల శ్రద్ధ ఉండి రోజూ ఎక్సర్ సైజులు చేసేవాళ్ళు, వాటితో΄ాటు మెట్లెక్కటాన్ని కూడా అలవాటు చేసుకుంటే రోజు రోజుకూ శరీరాకృతిలో వచ్చే మార్పులను చూసి మనకే ఆశ్చర్యం వేస్తుంది.ఇలా అలవాటు చేసుకోవాలి!కింద నుంచి 8 మెట్ల దాకాఎన్నుకుని ఆ 8 మెట్లనూ పైకి ఎక్కటం, కిందికి దిగటం, మళ్ళీ ఎక్కటం, దిగటం అలా అలిసిపోయేదాకా చేయాలి. లేదా ఒక అంతస్తు పైదాకా ఎక్కుతూ దిగుతూ ఉండాలి. మెట్లను పైకి ఎక్కుతున్నప్పుడు చేతుల్ని రిలాక్స్గా పక్కలకు వదిలేయాలి. మోచేతుల్ని మాత్రం కొద్దిగా వంచాలి. బాగాప్రాక్టీస్ అయాక మోచేతుల్ని ఇంకా వంచవచ్చు. ఇలా చేయటం వల్ల మోకాళ్ళను ఎత్తి ఎత్తి వేయటానికి అనువుగా ఉంటుంది. అయితే ఎన్ని మెట్లెక్కినా, మరునాటికి కాళ్ళపిక్కల్లో పోట్లు, నొప్పులు వంటివి ఉండకూడదు. అలా ఉన్నాయంటే మీరు శక్తికి మించి మెట్లెక్కుతూ దిగుతున్నారన్న మాట.మెట్లు ఎక్కుతూ దిగుతూ వున్నప్పుడు ΄ాదాలు జారకుండా ఉండటానికి సౌకర్యంగా ఉండే షూస్ వాడాలి.మిగతా ఎక్సర్ సైజులతో ΄ాటు రెండు మూడు అంతస్తుల మెట్లను ఇలా ఎక్కుతూ దిగితే మీ శరీరం వెచ్చదనానికి చేరుకుంటుంది.తర్వాత శరీరం మామూలు స్థితికి వచ్చి కూల్ డౌన్ కావటానికి అనువుగా రిలాక్స్ అవుతూ కొద్దిసేపు నడవాలి. ఇందుకు సుమారు మూడు నుంచి 10 నిముషాల సమయం పడుతుంది.మిగతా ఏ ఎక్సర్ సైజులూ చేయనివారు ఈ మెట్లెక్కే ఎక్సర్ సైజును వారానికి కనీసం రెండుసార్లన్నా చేయాలి. తడవకు 20 నిముషాలకు తగ్గకుండా. ఆ తర్వాత పైన చెప్పిన నడక ఎక్సరసైజును తిరిగి చేయాలి.దీనిని ఒక సాధనగా చేసుకోవాలంటే మొదటి రెండువారాలలో 2 అంతస్తుల దాకా మెల్లగా ఎక్కుతూ దిగాలి. మూడోవారం వచ్చేసరికి 3 అంతస్తులు... ఇలా అయిదు అంతస్తుల దాకా అలుపు లేకుండా ఎక్కి, దిగగలిగేలా సాధన చేయాలి.ఇవి చదవండి: వారి చేతుల్లో.. వ్యర్థాలు కూడా బొమ్మలవుతాయి.. -
ప్రతిరోజూ ఓ అరగంట నడిచారో.. ఈ సమస్యలిక దూరమే!
మనకు తెలిసిన విషయమే కదా అని తేలిగ్గా తీసిపారేయద్దు. అలాగే బద్ధకించవద్దు. క్రమం తప్పకుండా రోజూ ఓ అరగంట పాటు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. స్లిమ్గా ఉండవచ్చు. డయాబెటిస్, బీపీ వంటి వాటికి దూరంగా ఉండచ్చు.అన్నింటికీ మించి రోజంతా ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉండచ్చు. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు నడవడం కాదు... మన నడక ఎలా ఉండాలి... ఎంత దూరం నడవాలి? ఏ సమయంలో నడవాలి... వంటి ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం..!క్రమం తప్పకుండా నడవడం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణంగా, శారీరక వ్యాయామాలు, కార్యకలాపాలు ఆందోళన, నిరాశ, ఒత్తిడి, ఇతర సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయని చెబుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 30 నిమిషాల పాటు చేసే మార్నింగ్ వాక్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.వ్యాయామాలన్నింటిలోనూ అతి తేలికపాటి వ్యాయామం ఏదంటే నడకే అని చెప్పచ్చు. బరువును నియంత్రించడంలో, కేలరీలను కరిగించడంలో వాకింగ్ను మించిన మందే లేదు. క్రమబద్ధమైన నడక వార్థక్య ఛాయలను నివారిస్తుంది. అయితే ఆ నడక ఎలా ఉండాలి... ఎప్పడు చేయాలో చూద్దాం...శక్తిని పెంచుతుంది..మార్నింగ్ వాక్ ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతోనే చేయాలి. అలా ఖాళీ కడుపుతో చేసే మార్నింగ్ వాక్ శక్తి స్థాయిని పెంచుతుంది. శరీరం, మనస్సు సాంత్వన పొంది, కణజాలాలు శక్తిని పొందేలా చేస్తుంది. వాకింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ శక్తి స్థాయులను పెంచడానికి గొప్ప మార్గం. ఇది అలసట తగ్గించి,, ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.గుండెకు బలాన్నిస్తుంది..రోజూ ఉదయాన్నే అరగంటపాడు చురుగ్గా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ సాధారణ వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని, రక్త΄ోటును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బుల ముప్పును ముందుగానే తగ్గించుకోవచ్చు.జీర్ణవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది..జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు ఖాళీ కడుపుతో ఉదయాన్నే నడవడం మంచిది. ఈ అభ్యాసం మీ ఉదర కండరాల సహజ సంకోచాన్ని ్ర΄ోత్సహిస్తుంది.మానసిక బలంరోజూ నడవడం వల్ల మెరుగైన ఆత్మగౌరవం, మెరుగైన మానసిక స్థితి, ఆందోళన సమస్యలతో సహా మీ మానసిక ఆరోగ్యానికి వాకింగ్ గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది. శారీరక శ్రమ మీ శరీరం మానసిక స్థితి ఆత్మగౌరవాన్ని మెరుగుపరిచే ఎండార్ఫిన్ లను విడుదల చేయడంలో సహాయపడుతుంది.చక్కటి నిద్ర: తెల్లవారుజామున వెలువడే సూర్యరశ్మి సహజంగా మీ సిర్కాడియన్ రిథమ్ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మీ దినచర్యకు 30 నిమిషాల మార్నింగ్ వాక్ అలవాటుతో మీ మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. శారీరక శ్రమ మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది.పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాకింగ్ వంటి మితమైన వ్యాయామం, కాలక్రమేణా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే వాయిదా వేయకుండా నడుద్దాం. నడకను పడక ఎక్కనివ్వకుండా చూద్దాం.ఖాళీ కడుపుతో 30 నిమిషాల మార్నింగ్ వాక్ అనే నియమాన్ని అలవాటుగా చేసుకోవటం వల్ల రోజంతా శక్తిని పొందుతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. వార్థక్య లక్షణాలు తొందరగా దరిచేరకుండా ఉంటాయి. దీనిని తేలిగ్గా తీసేయకుండా దిన చర్యలో చేర్చడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. -
ఈ నడక ఎంతో ఆరోగ్యం అంటున్నారు.. నిపుణులు!
ఆస్ట్రేలియాలో ‘బేర్ఫుట్ వాకింగ్’ ఇప్పుడు చాలామంది అలవాటు చేసుకుంటున్నారు. ఉత్తకాళ్లతో నడవడం భారతీయులకు వేల ఏళ్లుగా తెలిసినా ఆ తర్వాత వ్యాయామ నడక కోసం తగిన షూస్, చెప్పులు తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. కాని ‘భూమితోపాదాలను తాకించడం’ వల్ల ఆరోగ్యమని ఇంకా ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఉత్తకాళ్ల నడక ప్రయోజనాలేమిటి?ఆస్ట్రేలియాలో ఉత్త కాళ్లతో నడవడం ఇప్పుడు ఒక వ్రతంలా పాటిస్తున్నారు. కొందరు మార్నింగ్ వాక్ కోసం ఉత్త కాళ్లను ఉపయోగిస్తుంటే మరికొందరు ఎల్లవేళలా చెప్పులు, షూస్కు దూరంగా ఉంటున్నారు. ఇదొక పెద్ద ధోరణిగా మారిందక్కడ. మన దేశంలో చెప్పుల్లేనిపాదాలతోనే జనం నడిచారు. ఇప్పటికీ నడిచేవారున్నారు. కాని ఆరోగ్య చర్యల్లో భాగంగా చెప్పుల్లేకుండా భూస్పర్శను ΄÷ందడం అనేది మెల్లమెల్లగా మన దేశంలోనూ కనిపిస్తోంది. గతంలో చూస్తే చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ తన జీవితంలో ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు. ఆయన ఎన్ని దేశాలు తిరిగినా ఖాళీపాదాలతోనే తిరిగాడు. ఇక ఇటీవల యువ దర్శకుడు అనుదీప్ ఖాళీపాదాలతో నడకను ప్రచారం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా వారైనా గానీ, ఇలా నడవడాన్ని ఇష్టపడుతున్నవారుగానీ చెబుతున్నదేమిటి? ఇలా నడవడం వల్ల ఉపయోగాలేమిటి?ఎక్కడ నడవాలి: ఉత్తపాదాలతో నడిచే వారు కూసు రాళ్లు లేదా ముళ్లు లేని మట్టి బాటల్లోగాని, గడ్డి మైదానంలోగాని, ఇసుక దారుల్లోగాని నడవడం మంచిదని నిపుణులు అంటున్నారు. సూపర్ మార్కెట్లో లేదా నున్నటి రాళ్లు పరిచిన స్థలాల్లో నడిస్తే జారి పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.1. ప్రకృతితో అనుసంధానంప్రకృతిలో పుట్టిన మనిషి ప్రకృతితో అనుసంధానం కావడం లేదు. ప్రకృతి స్పర్శను అనుభవించడం లేదు. ఏíసీ గదుల్లో ఉంటూ కాలికి నేలంటకుండా జీవిస్తున్నాడు. నేల తగిలితే– కాలి కింద భూమికి ఉన్న రకరకాల స్వభావాలు అంటుతూ ఉంటే ప్రకృతితో ఒక అనుసంధానం ఏర్పడుతుంది. వినమ్ర భావన కలుగుతుంది. ఇంకా మామూలు భాషలో చె΄్పాలంటే కళ్లు నెత్తికెక్కి ఉంటే అవి కిందకు దిగుతాయి.2. విద్యుదయస్కాంత సమతుల్యతఖాళీపాదాలతో నడవడం వల్ల భూమిలోని నెగెటివ్ అయాన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనం నిత్యం వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల శరీరంలో పేరుకున్న అయాన్లను ఇవి బేలెన్స్ చేస్తాయి. దాని వల్ల శరీరంలోని విద్యుదయస్కాంత స్థితి సమతుల్యం అవుతుంది. దీంతో వాపులు తగ్గడం, నిద్ర బాగా పట్టడం వీలవుతుంది.3. ఒత్తిడి దూరంఖాళీపాదాలతో నడవడం వల్లపాదాలలో ఉండే నరాలు క్రమబద్ధంగా తాకిడికి లోనవుతాయి. దాని వల్ల ఒత్తిడి దూరమయ్యి సేదదీరిన భావన కలుగుతుంది.4. సరైన పోశ్చర్ఖాళీపాదాలతో నడిచినప్పుడుపాదాలు, కాళ్లు, మడమలు అనుసంధానంలోకి వస్తాయి. చెప్పులు లేదా షూస్ వేసుకుని నడిచేటప్పుడు తెలియకనే నడకపోశ్చర్ మారుతుంది. కాని ఖాళీపాదాలతో నడిచేటప్పుడు నడకకు వీలుగా శరీరం సరైనపోశ్చర్కు వస్తుంది. అంతేకాదు కాలి కండరాలు బలపడతాయి. శరీరాన్ని సరిగ్గా బేలెన్స్ చేస్తూ నడవడం తెలుస్తుంది. కాళ్లను పూర్తిగా ఆన్చి నడవడం వల్ల నడకలో కుదురు వస్తుంది.5. రక్తప్రసరణ ఖాళీపాదాలతో నడవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.పాదంపై ఒత్తిడి పడటం వల్ల రక్తప్రసరణలో చురుకు వచ్చి గుండెకు మేలు జరుగుతుంది. అంతేకాదుపాదాలపై ఉండే మృతకణాలు వదిలి΄ోయి చర్మం మెరుగవుతుంది. -
గతంలో బద్రీనాథ్ నడక మార్గం ఎలా ఉండేది?
దేశంలో చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. చార్ధామ్లలో ఒకటైన బద్రీనాథ్కు నడకమార్గం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తరాఖండ్లోని యోగా సిటీ రిషికేశ్ పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందింది. దీనిని తీర్థయాత్రల ప్రధాన ద్వారం అని కూడా అంటారు. రిషికేశ్ ఆలయంతో పాటు ఇక్కడి ఘాట్ భక్తులను అమితంగా ఆకర్షిస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం రిషేకేశ్ను సందర్శించిన తర్వాతే చార్ధామ్కు వెళ్లేవారు. రిషికేశ్కు ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తుంటారు. అనేక పురాతన, గుర్తింపు పొందిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం రిషికేశ్లోని త్రివేణి ఘాట్ బద్రీనాథ్ ధామ్కు నడక మార్గంగా ఉండేది.రిషికేశ్లోని సోమేశ్వర్ మహాదేవ్ ఆలయ పూజారి మహంత్ రామేశ్వర్ గిరి మీడియాకు ఈ ప్రాంతపు ప్రత్యేకతలను తెలియజేశారు. ఇక్కడ మూడు పవిత్ర నదుల త్రివేణీ సంగమం ఉందన్నారు. ఇక్కడున్న మార్కెట్ రిషికేశ్లోని ప్రధాన మార్కెట్ అని, ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఏదో ఒక వస్తువును కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళతారన్నారు. ఈ మార్కెట్ కొన్నాళ్ల క్రితం బద్రీనాథ్కు నడక మార్గంగా ఉండేదని తెలిపారు. దీంతో ఈ రహదారి మార్గంలో అనేక దుకాణాలు, రెస్టారెంట్లు, భవనాలు నిర్మితమయ్యాయన్నారు.కొన్నాళ్ల క్రితం రిషికేశ్ అడవిలా ఉండేదని రామేశ్వర్ గిరి తెలిపారు. నాడు ఇక్కడ ఋషులు కఠోర తపస్సు చేసేవారన్నారు. ఇక్కడికి వచ్చే యాత్రికులంతా త్రివేణిలో స్నానమాచరించిన తర్వాతనే చార్ధామ్ యాత్రకు బయలుదేరేవారని పేర్కొన్నారు. -
మధుమేహాన్ని ఇలా నియంత్రించొచ్చా? ప్రూవ్ చేసిన ఫైనాన్షియల్ ఆఫీసర్
కొందరు ఏదైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే బెంబేలెత్తిపోరు. చాలా ధైర్యంగా ఉండటమే గాకుండా మందులతో పనిలేకుండా చక్కటి జీవనశైలితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని చూపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే భారత సంతతికి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఏం జరిగిందంటే?..సౌత్ చైనాలోని హంకాంగ్కి చెందిన రవి చంద్ర(51) అనే వ్యక్తి మదుమేహాన్ని మందులు వాడకుండానే నియంత్రించొచ్చని ప్రూవ్ చేసి చూపించాడు. అతను హాంకాంగ్లోని అమోలి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా పనిచేస్తున్నాడు. అతనికి 2015లో చంద్రకి షుగర్ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. దీంతో వైద్యుల మందులు వాడమని సూచించడం జరిగింది. అయితే అతను ఆ మందులు వాడుతున్నా..రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతున్నట్లు కనిపించలేదు. అందువల్ల అతను వాటికి బదులుగా ఫిట్నెస్పై దృష్టి సారిస్తే బెటర్గా ఉంటుందేమో అని భావించాడు. అందుకోసం అతను రోజు జాగింగ్, వాకింగ్ వంటి చేయడం ప్రారంభించాడు. దీంతో జస్ట్ మూడు నెలల్లోనే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేశాయి. అలా అతను క్రమం తప్పకుండా పరిగెత్తడం ప్రారంభించి మారథాన్ వంటి రేసుల్లో కూడా పాల్లొన్నాడు. అంతేగాదు చైనా, తైవాన్, భారత్ వంటి దేశాల్లో జరిగే పలు మారథాన్లలో పాల్గొన్నాడు . అలా అతను ఇప్పటి వరకు దాదాపు 29 రేసుల్లో పాల్గొన్నట్లు తెలిపాడు. మొదట్లో ఒక్క కిలోమీటరు నుంచి ప్రారంభించి క్రమంగా పది కిలోమీటర్లు పరుగు, నడకలలో మెరుగపడ్డానని వివరించారు. అంతేగాదు సుమారు 100కు పైగా మారథాన్లో పాల్గొన్న తన స్నేహితుడే తనకు ఈ విషయంలో స్పూర్తి అని చంద్ర చెబుతున్నాడు. తాను ఈ పరుగును చిన్న ఏరోబిక్ ఫంక్షన్ టెక్నిక్ని ఉపయోగించి పరిగెడతానని అన్నారు. అది హృదయ స్పందన రేటు సక్రమంగా ఉండేలా చేస్తుందని అన్నారు. ఇక చంద్ర తన డైట్లో శాకాహారమే తీసుకుంటానని, అప్పుడప్పుడూ చేపలు, చికెన్ తింటానని చెప్పారు. అలాగే లంచ్, డిన్నర్లలో ఎక్కువుగా కూరగాయలే ఉండేలా చూసుకుంటానని అన్నారు. చిరుతిండిగా కేవలం పండ్లే తింటానని చెప్పారు. ప్రస్తుతం అతని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 8 నుంచి 6.80కి పడిపోయాయి. అంతే షుగర్ లేదనే చెప్పొచ్చు. భలే చక్కగా ఫిట్నెస్పై దృష్టిసారించి మందులు వాడకుండానే మధుమేహాన్ని కట్టడి చేసి అందరికి ప్రేరణ కలిగించేలా చేశాడు. నిజంగా గ్రేట్ కదూ. అతను ఓ పక్క అత్యున్నాధికారి హోదాలో ఆఫీస్ పనులు చేసుకుంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. వర్క్లో చాలా బిజీ అని సాకులు చెప్పేవాళ్లు కూడా అవాక్కయ్యేలా షుగర్ని కట్టడి చేశారు రవిచంద్ర. (చదవండి: చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..) -
అల్లు అర్జున్ పుష్ప మూవీ.. ఆ స్టైల్ కాపీ కొట్టేశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప బాక్సాఫీస్ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. శ్రీవల్లిగా టాలీవుడ్ను అభిమానులను అలరించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ను ఓ రేంజ్ స్థాయికి తీసుకెళ్లింది. అంతే కాకుండా ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ మేనరిజానికి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా భుజం కాస్తా పైకి ఎత్తి బన్నీ నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆ స్టైల్కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏది ఏమైనా ఈ చిత్రంలో అల్లు అర్జున్ డైలాగ్స్, వాకింగ్ స్టైల్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. పుష్ప సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ నడక ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అచ్చం అల్లు అర్జున్ లాగే ఆ వాకింగ్ స్టైల్ను టాలీవుడ్ హీరో చేసి చూపించారు. కాకపోతే ఇప్పుడు కాదండోయ్. దాదాపు 22 ఏళ్ల క్రితమే శ్రీహరి అలాంటి మేనరిజంతో మెప్పించారు. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. 2002లో వచ్చిన పృథ్వీ నారాయణ అనే చిత్రంలో సేమ్ బన్నీ వాకింగ్ స్టైల్తో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ శ్రీహరి అద్భుతంగా చేశారంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో పుష్ప మేనరిజం కాపీ కొట్టారా? అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. pushpa walking style appatlone srihari gaaru 👌❤️ pic.twitter.com/4PJj9Y1Z1Z — celluloidpanda (@celluloidpanda) March 25, 2024 -
రోజుకు ఒక్క అరగంట చాలు, ఫలితాలు మాత్రం!
నడక అన్ని వయసుల వారికి సరిపడే చక్కటి వ్యాయామం. క్రమ తప్పకుండా వాకింగ్ చేస్తే ఫిట్గా ఉండటమేకాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉన్నాయి. రోగ నిరోధకశక్తి బలపడి, మంచి ఆయుర్దాయానికి సాయపడుతుంది. నడక వల్ల ప్రయోజనాలు ♦ నడకతో శరీరంలోని కొవ్వు నిల్వలు కలుగుతాయి. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే ఊబకాయం కూడా నెమ్మదిగా కరుగుతుంది. ♦ రోజంతా మనసు హాయిగా, తేలిగ్గా ఉంటుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి జలుబు లేదా ఫ్లూ ప్రమాదం తగ్గుతుంది. ♦ రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు నడవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని దాదాపు 19 శాతం తగ్గించవచ్చు. రోజూ వాకింగ్ దూరాన్ని పెంచుకుంటే ఫలితాలు ఇంకా బావుంటాయి. ♦ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది ♦ తిన్న తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ♦ అల్పాహారం, భోజనం , రాత్రి భోజనం తర్వాత ఇలా రోజుకు మూడుసార్లు వాకింగ్ చేస్తే మంచిది. ♦ కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నడక కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది ♦ ఆర్థరైటిస్తో బాధపడేవారికి కూడా చిన్నపాటి నడక ప్రయోజనాలను అందిస్తుంది. ♦ ముఖ్యంగా ఆరుబయట నడిచినపుడు సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. నోట్: వాకింగ్కోసం ఉపయోగించే స్థలాలు, లేదా పార్క్లు ఎంచుకోవాలి. వాకింగ్కు అనువుగా దృఢమైన బూట్లు ధరించాలి. వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే మంచిది. నడకకు ముందు పుష్కలంగా నీరు తాగితే బెటర్. ఇది మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మరీ ఎండలో కాకుండా, ఎండ తక్కువగా ఉన్నపుడు, నీడ ప్రదేశంలో వాకింగ్ చేయాలి. -
20 కిలోమీటర్ల నడకలో అక్ష్ దీప్ జాతీయ రికార్డు
చండీగఢ్: జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్షిప్ పురుషుల 20 కిలోమీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నమోదైంది. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన పంజాబ్ అథ్లెట్ అక్ష్ దీప్ సింగ్ మంగళవారం జరిగిన పోటీల్లో 20 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట 19 నిమిషాల 38 సెకన్లలో నడిచి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఒక గంట 19 నిమిషాల 55 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అక్ష్ దీప్ బద్దలు కొట్టాడు. సూరజ్ పన్వర్ (1గం:19ని.44 సెకన్లు; ఉత్తరాఖండ్) రెండో స్థానంలో, సెరి్వన్ సెబాస్టియన్ (1గం:20.03 సెకన్లు; తమిళనాడు) మూడో స్థానంలో, అర్‡్షప్రీత్ సింగ్ (1గం:20ని.04 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు కూడా పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ (1గం:20.10 సెకన్లు) సమయాన్ని అధిగమించారు. దాంతో పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత వాకర్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. నిబంధనల ప్రకారం ఒలింపిక్స్లో రేస్ వాకింగ్లో ఒక దేశం నుంచి గరిష్టంగా ముగ్గురికి మాత్రమే పోటీపడే వీలుంది. దాంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య జూన్లో ట్రయల్స్ నిర్వహించి ఆరుగురి నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తుంది. -
చేతి కర్ర సాయంతో నడుస్తున్న మాజీ సీఎం కేసీఆర్
-
కర్ర సాయంతో కేసీఆర్ నడక
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ మాజీ సీఎం కే. చంద్రశేఖరరావు చేతి కర్ర సాయంతో నడక సాధన చేస్తున్నారు. ఫిజయోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. గత నాలుగు రోజులుగా సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌజ్లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమారు తన ‘ఎక్స్’ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కాలు తొంటి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. ఇటీవలే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ చేరుకున్నారు. చదవండి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై తమిళిసై కీలక ప్రకటన -
నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా?
నడిచే చెట్ల గురించి విన్నారా?. ఔను! మీరు వింటుంది నిజమే!. ఈ చెట్లు నిజంగా నడుస్తాయి అది కూడా సూర్యకాంతిని వెతుక్కుంటూ నడుస్తాయట. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?. నిజం నడిచేలా వాటి చెట్ల ఆకృతి కూడా అందుకు తగ్గట్టుగా ఉంటుంది. పైగా అలా నడిస్తే భూమిలో ఉన్న వేరు తెగిపోతుంది లేదా దాంతోపాటు ఎలా కదులుతుంది అని కదా డౌటు. అయితే ఆ చెట్టు ఎలా నడుస్తుంది? ఎలా కదులుతుందో సవివిరంగా చూద్దాం!. ఈ రకం చెట్టు దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్లను సక్రాటియా ఎక్సరిజా అంటారు. వాటి మూలాలు సూర్యకాంతి దిశగా పెరుగుతాయి. అందువల్ల ఇవి నడుస్తాయట. ఇవి అచ్చం తాటి చెట్టు మాదిరిగా ఉండే ప్రత్యేకమైన చెట్లు. ఏడాదికి సుమారుగా 15 నుంచి 20 మీటర్లు పొడవు పెరుగుతాయని లెక్కించారు శాస్త్రవేత్తలు. దీని వ్యాసం 16 సెం.మీ ఉంటుందని చెప్పారు. వాస్తవానికి తాటి చెట్టు వేళ్లు ఎక్కువగా నేలలోపలికి చొచ్చుకుని ఉంటాయి. ఈ చెట్లకి మాత్రం వాటి వేర్లు భూమికి వెలుపల చీపురి ఆకృతిలో ఉంటాయి. ఈ ప్రత్యేక రకం తాటి చెట్లు నడుస్తున్నప్పుడు వాటికి ఉన్న పాత వేర్లు ఊడిపోవడం(నశించిపోవడం) జరుగుతుందట. ఇలా అవి రోజుకి రెండు నుంచి 3 సెం.మీ వరకు నడుస్తాయని చెబుతున్నారు నిపుణులు. అలా ఏడాదికి ఈ చెట్టు సుమారు 20 మీటర్ల దూరం వరకు నడుస్తాయని అంచనా వేశారు. ఇలాంటి చెట్లు దట్టమైన అడవుల్లోనే ఉంటాయని చెబుతున్నారు. ఇది నిజంగా అత్యంత విచిత్రంగా ఉంది కదూ!. సూర్యరశ్మిని అనుసరిస్తూ కదలడం అలా ఏకంగా కొంత దూరం వరకు నడవడం అనేది శాస్త్రవేత్తలకు ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉంది. View this post on Instagram A post shared by Advancible (@advancible) (చదవండి: ఆ ఊరిలో నాలుగొందలకు పైగా ఇళ్లు ఉన్నాయ్! కానీ సడెన్గా..) -
హార్ట్ఎటాక్ సమస్య వెంటాడుతుందా..? అయితే ఇలా చేయండి!
'ఈ మధ్య కాలంలో దాదాపుగా 30 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారు తరచుగా మృతి చెందుతూ ఉండడం ఆందోళనలకు గురిచేస్తోంది. ప్రణాళిక లేని ఆహారపు అలవాట్లు, మద్యపానం, సరైన వ్యాయామం లేకపోవడం, క్రిమిసంహారక మందులతో పండించిన కూరగాయలు, దినుసులు వంటివాడకం మితిమీరిపోవడంతోనే ఇలాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.' పెరుగుతున్న హృద్రోగ, కాలేయ సమస్యలు తరచుగా ఆకస్మిక మరణాలు నాలుగుపదుల వయసువారే అధికం అసమతుల్య ఆహారపు అలవాట్లు, జీవనశైలే కారణం క్రమబద్ధమైన నియమాలు పాటించాలంటున్న ఆరోగ్యనిపుణులు ఎన్నో కారణాలు.. ప్రధానంగా గుండె లయతప్పడానికి ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు పెద్దగా కారణాలేవి లేకుండానే ఇటువంటి ప్రమాదం సంభవిస్తుంది. కొందరిలో మాత్రం గుండె కండరం మందం కావడం, పుట్టుకతో గుండెలో ఉండే లోపాలు, కర్ణికలు పెద్దగా ఉండడం, జన్యుపరంగా తలెత్తే ఇతర ఇతర సమస్యలు రక్తంలో ఖనిజలవణాల సమతుల్యత లోపించడం, మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటివి కారణమవున్నాయి. బాగున్న కండరం మధ్యభాగంలోని కణాలు అతి చురుకుగా స్పందించడంతో కూడా గుండె కొట్టుకునే వేగం పెరుగుతోంది. దీంతో శరీరానికి రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, ఫలితంగా తలతిరగడం, స్పహ తప్పి కోల్పోవడం, నిమిషాల వ్యవధిలోని మరణం సంభవించడం వంటి వాటికి ఆస్కారం ఉంటుంది. జీవనశైలిలో మార్పుతోనే నివారణ.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అనేక ఒత్తిడిలతో కూడిన జీవన విధానంలో ప్రశాంతత లోపించడం సమయభావంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం నడక, వ్యాయామక కసరత్తులు, యోగా, మెడిటేషన్ వంటివి నిపుణుల పర్యవేక్షణలో చేయడంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము. కాలేయ సంబంధ వ్యాధుల్లో ప్రధానంగా ఆహారపు అలవాట్లు ప్రభావం చూపుతాయి. సరైన ఆహారపు అలవాట్లు లేని వ్యక్తుల్లో సమస్యలు తలెత్తడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకోవాలి.. ఈ రోజుల్లో ఎటువంటి ఆరోగ్య సమస్య ఎటువైపు నుంచి మంచికొస్తుందో తెలియనిస్థితిలో ఉన్నాం. ఆరో గ్యపరంగా శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకునే విధంగా నియమాలు పాటించాలి. ఆహారం పరంగా, శారీరకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – ఎండపెల్లి అశోక్కుమార్, మైథిలీ వెల్నెస్ సెంటర్, నిర్మల్ నిరంతర పరీక్షలతోనే నివారణ గుండె సంబంధిత జబ్బులు ప్రస్తుత కాలంలో అధికమవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు గుండె, కాలేయ సంబంధ సమస్యలకు గురవుతున్నారు. గుండె జబ్బులు ఇతర అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరీక్షలను చేయించుకోవాలి. – డాక్టర్ ఎం.ఎస్. ఆదిత్య, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
ఫస్టు నుంచి చూద్దాం!
అందరి షూ ర్యాక్లో దుమ్ము పట్టిన వాకింగ్ షూస్ ఉంటాయి. అవి గత సంవత్సరం జనవరి నెలలో కొన్నవి. కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా, వాకింగ్ చేయాలనుకుని కొన్నవి అవి. ఆ వాకింగ్ ఎన్ని రోజులు సాగిందో. ప్రస్తుతం అవి దుమ్ముకొట్టుకుని, పట్టించుకునే యజమాని కోసం ఎదురు చూస్తూ అలా పడి ఉంటాయి. ఆ దారిన వెళుతున్నప్పుడల్లా ఆ జిమ్ కనిపిస్తూనే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు వెళ్లి మూడో నెల నుంచి మానేసిన జిమ్. ట్రైనర్ ఇప్పటికీ ఫోన్ చేస్తుంటాడు. జిమ్ నుంచి అలెర్ట్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. గత సంవత్సరం కంటిన్యూ చేయలేదు కాని ఈ సంవత్సరం మళ్లీ చేరి కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటారు కొందరు. ఉదయం వాకింగ్ ఫ్రెండ్స్ వాకింగ్ చేస్తూనే ఉంటారు. మనం వారు కనిపిస్తే ముఖం తిప్పుకుని వెళ్లిపోతూ ఉంటాం. నాలుగు రోజుల సింగారంగా మన వాకింగ్ ముగిసిపోయి ఉంటుంది. ‘న్యూ ఇయర్ రానివ్వండి. జాయిన్ అవుతాను’ అని వాళ్లు కనిపించినప్పుడల్లా అంటూనే ఉంటారు. తక్షణం అవశ్యం ఆరోగ్యం ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. ‘తక్షణం అవశ్యం ఆరోగ్యం’ అనుకోవాలి విజ్ఞులు. ఇవాళ రేపట్లో మనం ఏం తింటున్నామో అందరికీ తెలుసు. విషం. మందులు విషం. కల్తీ గాలి. అయితే పరిగెత్తి చేసే ఉద్యోగాలు లేదా తిష్ట వేసినట్టుగా కదలక కూచుని చేసే కొలువులు... ఆరోగ్యం ఎలా? వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు నెరవేరాలంటే ఆరోగ్యం ముఖ్యం. అందుకు ప్రయత్నం ముఖ్యం. అక్కడే వస్తుంది చిక్కు. ‘ఆరంభించరు నీచ మానవులు’ అని భర్తృహరి అన్నాడుకాని ‘ఆరంభించడానికి వేచి చూస్తారు సోమరి పోతులు’ అనాలి నిజానికైతే. ‘జనవరి 1 వస్తేనే ఆరంభిస్తా’ అనుకుంటే జనవరి 1 వస్తేనే భోం చేస్తా అనుకోరు ఎందుకో. ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ జనవరి 1 అంటే కొత్త సంవత్సరం వస్తుంది. క్యాలెండర్ మారుతుంది. అన్నిచోట్ల ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. కనుక కొత్తగా నిర్ణయాలను అమలు చేద్దాం అని చాలామంది అనుకుంటారు. దీనిని ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ అంటారు. అయితే డాక్టర్ జాన్ నార్క్రాస్ అనే సైకాలజీ ప్రొఫెసర్ ఇలా న్యూ ఇయర్ నిర్ణయాలు తీసుకుంటున్నవారిని గత 40 ఏళ్లుగా పరిశీలిస్తూ ఏమని తేల్చాడంటే– సాధారణంగా న్యూ ఇయర్ నిర్ణయాలలో ముఖ్యమైనవి 2. మొదటిది ఫిట్నెస్ సాధించడం, రెండోది బరువు తగ్గడం. ఫిట్నెస్ సాధించాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఒక నెల రోజుల్లో సగానికి సగం మంది వ్యాయామం ఆపేస్తున్నారు. ఆరు నెలల్లో తొంభై శాతం మంది. పది శాతం మందే న్యూ ఇయర్ నిర్ణయాలను కొనసాగిస్తున్నారు. నిర్ణయం తీసుకోవడం ఎందుకు నీరుగారి పోవడం ఎందుకు? మంచి సీజన్ అమెరికా, బ్రిటన్లలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జిమ్లు కిటకిటలాడతాయి. నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి ఖాళీ అయిపోతాయి. కొత్త సంవత్సరం ఉత్సాహం, నిర్ణయం నిలబడకపోవడమే కారణం. నిపుణులు ఏమంటున్నారంటే మీరు, మీ చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడు ఉత్సాహం గా ఉంటే అప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అని. ఉదాహరణకు మనకు వేసవి కాలం ఉత్సాహంగా అనిపిస్తే అప్పుడు మొదలెట్టి కొనసాగించాలి. లేదా నవంబర్ మంచి సీజన్ అనుకుంటే మొదలెట్టాలి. అమెరికాలో జనవరి నెల చలిలో మొదలెట్టే వ్యాయామాలు కొనసాగించడం సాధ్యం కావడం లేదని తేల్చారు. మన దగ్గర కూడా జనవరి చలి. ఆ చలిలో ఉదయాన్నే లేవలేక న్యూ ఇయర్ రెజల్యూషన్ పాటించడం లేదని బాధపడి... ఇదంతా ఎందుకు? ఈ రోజు నుంచే మొదలెట్టొచ్చు కదా. ముఖ్యం... చాలా ముఖ్యం ఆరోగ్యం కోసం కష్టపడటం ముఖ్యం. చాలా ముఖ్యం. ఏదో ఒక మంచి సందర్భంలో వజ్ర సంకల్పం తీసుకోవాలి. ఆల్కహాల్ తగ్గిస్తాను, స్మోకింగ్ మానేస్తాను, ఫేస్బుక్ కట్టేస్తాను, పిల్లలతో గడుపుతాను, యోగా చేస్తాను, నాన్వెజ్ వారంలో ఒక్కరోజే... ఇలా ఏ మంచి నిర్ణయమైనా మీకు మేలు చేస్తుంది. నేటి మీ నిర్ణయం రేపు మీ యోగం. -
Deepika Padukone : కాలినడకన తిరుమల చేరుకున్న బాలీవుడ్ బ్యూటీ 'దీపికా పదుకొనే' (ఫొటోలు)
-
భారత్లో అంతకంతకు పెరుగుతున్న 'వాకింగ్ న్యూమోనియా కేసులు'!
భారత్లో కూడా చైనా మాదిరి కేసులు పెరగుతున్నాయంటూ కలకలం రేగింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అందుకు సంబంధించిన ఏడు కేసులు గురించి వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ ఆందోళన రేకెత్తింది. ఐతే ఎయిమ్స్ ఆస్పత్రి ఈ కేసులకి చైనా న్యూమోనియాతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అవి సాధారణ 'వాకింగ్ న్యూమోనియో' కేసులేనని తేల్చి చెప్పింది. అసత్య ప్రచారాలను నమ్మి భయాందోళనలు చెందొద్దని పేర్కొంది. అసలేంటీ వాకింగ్ న్యూమోనియా? దానికీ ఆపేరు ఎలా వచ్చింది? అంత ప్రమాదం కాదా? తదితరాల గురించే ఈ కథనం. వాకింగ్ న్యూమోనియో అంటే..? ఈ న్యూమోనియా బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ల వచ్చే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యంగా వృద్ధులు చిన్న పిల్లల్లో ఎక్కువుగా కనిపిస్తుంది. వారే సులభంగా ఈ వ్యాధి బారినపడుతారు. రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉన్నవారిలో కూడా ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుందని వైద్యులు చెబతున్నారు. ఇది చాలా వరకు సాధారణమైన తేలిక పాటి లక్షణాలు గల వ్యాధేనని తెలిపారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులను తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసం ఉండదని చెబుతున్నారు. అయితే ఈ రోగ నిర్థారణ అనేది సరైన పద్ధుతుల్లో చేయాలి. అందుకు తగట్టుగా చికిత్స తీసుకుంటే చాలని పేర్కొన్నారు డాక్టర్లు. ఆ పేరు ఎలా వచ్చిందంటే.. 'వాకింగ్ న్యూమోనియా' అనేది ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్తో బాధపడే రోగులను ఉద్దేశించి పెట్టిన పేరు. దీని కారణంగా ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతుంటారు. పైగా జ్వరం, దగ్గు, ముక్కు కారటం వంటి సాధారణ లక్షణాలే కనిపస్తాయి. ఇవి కూడా రెండు నుంచి మూడు వారాలు మాత్రమే కనిపిస్తాయి. పరిస్థితి సాధారణ న్యుమోనియా కంటే తక్కువగానే ఉంటుంది. తేలికపాటి లక్షణాలే ఉండటంతో ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందుతారు. కాబట్టి దీన్ని 'వాకింగ్ న్యుమోనియాగా' పిలిచారు వైద్యులు. ఐతే చైనాలో వచ్చే న్యూమోనియాకు దీనికి సంబంధం లేదు. అది అడెనోవైరస్, రెస్పిరేటరి సిన్సిటియల్ వైరస్(ఆర్ఎస్వీ) వల్ల వన్తున్నట్లు నివేదికలో తెలిపింది. అవి విలక్షణమైన న్యూమోనియాకి సంబంధించిన కేసులు. అయితే ఇది కరోనా మాదిరిగా ప్రబలంగా లేదని తీవ్రత తక్కువగానే ఉందని చైనా స్పష్టం చేసింది కూడా. వైద్యులు సైతం ఈ న్యూమోనియా తీవ్రత రేట్లు ఒక్కోసారి మారుతూ ఉంటాయిని చెబుతున్నారు. అయితే ఇది అంటువ్యాధి అని, ఇది దగ్గినా లేదా తుమ్మినప్పుడు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని అందువల్ల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది యాంటీబయోటిక్లకు లొంగినప్పటికీ మళ్లీ ఈ వ్యాధి తిరగబెడుతుంటుందని తెలిపారు. ముఖ్యంగా కౌమరదశలో ఉన్న పిల్లలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఆందోళన చెందాలా? వైద్యులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యక్తి గ్రత శుభ్రత తోపాటు జాగ్రత్తుల పాటిస్తే చాలని చెప్పారు. ముక్కుకి మాస్క్ల ధరించడం, చేతి పరిశుభ్రత పాటించడం వంటివి చేస్తే ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదని అన్నారు. చికిత్స.. నోటి ద్వారా తీసుకునే యాంటీబయోటిక్స్ని ఐదు నుంచి 10 రోజుల వాడితే చాలు. పొరపాటును కూడా దగ్గును తగ్గించే మందులను వాడకూడదు. ఎందుకంటే వచ్చింది వాకింగ్ న్యూమోనియా అని తేలితే వైద్యుల సూచించిన మందులే వాడాలి. దగ్గుని కంట్రోల్ చేసే మందులు వాడితే శ్లేష్మం ఊపిరితిత్తులోనే ఉండి సమస్య మరింత జటిలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కుటుంబంలో ఎవ్వరైన ఈ వ్యాధి బారినపడి అందరూ జాగ్రత్తలు పాటించాలి. అంటువ్యాధి కావున ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. అందువల్ల చేతి పరిశుభ్రతలు, వ్యక్తిగత శుభ్రత పాటించటం అనేది అత్యంత ముఖ్యం. (చదవండి: పప్పులు తినడం మంచిదేనా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
Delhi Air pollution: ఉదయం నడక మానండి.. టపాసులు కాల్చకండి..
న్యూఢిల్లీ: ఉదయం నడక మానండి..టపాసులు కాల్చకండి..ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోండి.. వాయు కాలుష్యం కొనసాగుతున్న వేళ దేశ రాజధాని వాసులకు ఢిల్లీ ఆరోగ్య శాఖ జారీ చేసిన సూచనలివి. శనివారం అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ఈ మేరకు సూచనలు ప్రచురించింది. ఇక కాలుష్యంతో రెండు వారాలుగా ఇబ్బంది పడుతున్న జనానికి వర్షం ఊరట ఇచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో గురువారం వాయు నాణ్యత ఇండెక్స్(ఏక్యూఐ) 437 కాగా, శనివారం ఉదయం ఏక్యూఐ 219కి పడిపోయింది. -
జపాన్లో కూడా కణకణలాడే నిప్పుల మీద నడిచే ఆచారం..!
రకరకాల జాతరలలో కణకణలాడే నిప్పుల మీద నడిచే ఆచారం మన దేశంలో ఉంది. ఇలా నిప్పుల మీద నడిచే ఆచారం జపాన్లోనూ ఉంది. జపాన్ ప్రజలు జరుపుకొనే ‘హక్కాయిసాన్’ పండుగ రోజున ఆరుబయట ఏర్పాటు చేసే అగ్నిగుండాల్లోని నిప్పుల మీద ఉత్తకాళ్లతో నడిచే ఆచారం ఉంది. ఈ పండుగను ఏటా వసంత రుతువులో ఒకసారి, శరదృతువులో మరోసారి జరుపుకొంటారు. మినామియువోనుమా నగరం శివార్లలో హక్కాయి కొండ దిగువన ఒసాకీ డ్యామ్ వద్దనున్న ‘హక్కాయిసాన్ సన్’ ఆలయం ఎదుట అగ్నిగుండాలను ఏర్పాటు చేసి, ఈ వేడుకను జరుపుకొంటారు. ఈసారి శరదృతువులో నిప్పుల మీద నడిచే పండుగను అక్టోబర్ 20న జరుపుకొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రార్థనలతో మొదలయ్యే ఈ కార్యక్రమంలో మొదటగా ఆలయ పూజారి అగ్నిగుండం మీదుగా 88 అడుగులు నడిచి, ఆలయంలోకి చేరుకుంటారు. ఆయన తర్వాత మిగిలిన జనాలు కూడా ఆయననే అనుసరిస్తూ నిప్పుల మీదుగా 88 అడుగులు నడిచి ఆలయంలోకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆహార సంబరాలు కూడా జరుపుకొంటారు. నూడుల్స్తో తయారు చేసే ‘సోబా’, గోధుమపిండి ఆక్టోపస్లతో తయారు చేసే ‘టకోయాకీ’ వంటి సంప్రదాయ వంటకాలను ఆరగిస్తారు. నిప్పుల మీద నడవడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయని, కోరికలు ఈడేరుతాయని ఇక్కడి జనాలు నమ్ముతారు. (చదవండి: పురాతన ఆలయం కోతులకు ఆవాసం!) -
ఎస్క్లేటర్పై నిషేధమున్న నగరం ఏది? గణాంకాలు ఎందుకు బెంబేలెత్తిస్తున్నాయి?
సాంకేతికత పరంగా ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో జపాన్ ఒకటి. అయితే ఈ దేశంలోని ఒక నగరంలోని జనం ఎస్క్లేటర్లపై నడవడంపై నిషేధం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎస్క్లేటర్లపై ఎవరైనా నడిస్తే చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. ఈ విషయం తెలిశాక ప్రజారోగ్యం దృష్ట్యా ఇలా చేసి ఉంటారని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే జనం మెట్లను ఎక్కువగా ఉపయోగించాలి. వారంతా ఫిట్గా ఉండాలనే ఆలోచనతో ఇలా చేసివుంటారని అనుకుంటారు. అయితే ఇలా అనుకోవడంలో అస్సలు నిజం లేదు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. జపాన్ టుడే తెలిపిన వివరాల ప్రకారం నగోయా నగరం ఈ చట్టాన్ని చేసింది. 2023, అక్టోబర్ 1 నుంచి ఇక్కడ ఎస్క్లేటర్లపై నడవడంపై నిషేధం విధించారు. ఎస్కలేటర్ల నుండి పడిపోకుండా జనాన్ని రక్షించడం, ఈ తరహా ప్రమాదాలను నివారించడమే దీని ఉద్దేశ్యం. జపాన్లో ఎస్క్లేటర్ వినియోగంలో ఒక నియమం ఉంది. ప్రజలు ఎస్క్లేటర్ల ఎడమ వైపున నిలబడాలి. తద్వారా జనం త్వరగా ఎక్కడానికి లేదా దిగడానికి కుడి వైపున ఉన్న మార్గం తెరిచి ఉంటుంది. ఎస్క్లేటర్లు వినియోగించేవారు భయాందోళనలకు గురైనపుడు ఇతరులను నెట్టడంలాంటివి జరుగుతుంటాయి. ఫలితంగా పలువురు గాయపడటం లాంటివి జరుగుతుంటాయి. వృద్ధులు, వికలాంగులను ఇలాంటి ప్రమాదాల నుండి రక్షించడానికి ఈ నియమం అమలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా నగోయా నగరంలో ఎస్క్లేటర్ల ప్రమాదాలు ఎక్కువయ్యాయి. జపాన్ ఎలివేటర్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2018-2019 సంవత్సరంలో 805 ఎస్క్లేటర్ల ప్రమాదాలు సంభవించాయి. ఎస్క్లేటర్ల దుర్వినియోగం కారణంగానే ఇలా జరిగినట్లు తేలింది. అప్పటి నుంచి అధికారులు ఎస్క్లేటర్ల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు 2021 అక్టోబర్లో సైతామా నగరంలో కూడా ఇలాంటి నిబంధనలను అమలు చేశారు. అయితే దానికి చట్టరూపమివ్వలేదు. తాజాగా ఎస్క్లేటర్ల వినియోగంపై నగోయా నగరం ఒక చట్టాన్ని రూపొందించింది. ఎస్కలేటర్ల వాడకం మానేయాలని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రధాన రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ప్రకటనల బోర్డులు ఏర్పాటుచేశారు. ఇది కూడా చదవండి: హర్దీప్ నిజ్జర్ హత్య వెనుక చైనా హస్తం? -
అత్యంత అరుదైన చేప! ఐతే ఇది ఈత కొట్టదట..ఏకంగా..
నీటిలో చేపలు ఈతకొడతాయి. అయితే, ఇదొక వింత చేప. నీటి అడుగున ఇది నడుస్తుంది. దీనికి ముందు వైపు చేతుల్లా ఉపయోగపడే కాళ్లు పెద్దగా ఉంటాయి. వెనుకవైపు కాళ్లు చాలా చిన్నగా ఉంటాయి. అందువల్ల దీనిని హ్యాండ్ఫిష్ అంటారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ రకమైన చేప కెమెరా కంటికి చిక్కింది. ఇదివరకు విక్టోరియా తీరానికి చేరువలోని సముద్రంలో 1986లో ఒకసారి, 1996లో ఒకసారి ఇలాంటి హ్యాండ్ఫిష్ చేప కనిపించింది. ఇటీవల టాస్మానియా ఈశాన్యాన ఉన్న ఫ్లిండర్స్ దీవికి చేరువలో సముద్రం అడుగున నడుస్తున్న ఈ హ్యాండ్ఫిష్ అండర్వాటర్ కెమెరాకు చిక్కింది. ఇది నీటికి 292 అడుగుల లోతున ఉండగా కెమెరాకు చిక్కినట్లు కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ) శాస్త్రవేత్త కార్లీ డివైన్ తెలిపారు. సీఎస్ఐఆర్ఓ శాస్త్రవేత్తలు టాస్మానియా సముద్ర జలాల్లో పరిశోధనల కోసం ‘ఆర్వీ ఇన్వెస్టిగేటర్’ ఓడలో అన్వేషణ సాగిస్తుండగా, ఈ అరుదైన చేప వారి కెమెరాకు చిక్కడం విశేషం. (చదవండి: అక్కడ హోటళ్లలోని గదులను చూస్తే..కంగుతినడం ఖాయం!) -
78 ఏళ్ల తాతకు నైన్త్లో అడ్మిషన్.. స్కూలుకు ఎలా వెళుతున్నాడంటే..
మిజోరంనకు చెందిన 78 ఏళ్ల తాత భుజానికి స్కూలు బ్యాగు ధరించి, యూనిఫారం వేసుకుని క్రమం తప్పకుండా రోజూ స్కూలుకు వెళుతున్నాడు. ఇదేమీ జోక్ కాదు.. ముమ్మాటికీ నిజం. నార్త్ ఈస్ట్ లైవ్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం మిజోరంలోని చమ్ఫాయి జిల్లాలోని హువాయికాన్ గ్రామానికి చెందిన లాల్రింగథర కథ ప్రతీ ఒక్కరికీ స్ఫూరిగా నిలుస్తుంది. ప్రస్తుతం లాల్రింగథర హువాయికోన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాడు. 1945లో భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో జన్మించిన లాల్రింగథర తన తండ్రి మరణించిన కారణంగా 2వ తరగతిలోనే చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది. వారి ఇంటిలో అతనొక్కడే సంతానం అయిన కారణంగా తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, కూలీనాలీ చేస్తూ జీవనం కొనసాగించాడు. ఉపాధి రీత్యా ఒకచోట నుంచి మరో చోటుకు మారి, చివరకు 1995లో న్యూ హువాయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. ఉదరపోషణ కోసం ఈ వయసులోనూ స్థానిక ప్రోస్బిటేరియన్ చర్చిలో గార్డుగా పనిచేస్తున్నాడు. తన ఆర్థిక పరిస్థితుల కారణంగా పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాననే బాధ అతనిని నిత్యం వెంటాడేది. అలాగే ఆంగ్లంలో నైపుణ్యం సంపాదించాలని, ఆంగ్ల భాషలోని వివిధ దరఖాస్తులను నింపాలనేది అతని లక్ష్యం. అందుకోసమే ఈ వయసులోనూ అతను పాఠశాలకు వెళుతున్నాడు. లాల్రింగథర మీడియాతో మాట్లాడుతూ ‘నాకు మిజో భాష చదవడంలోనూ, రాయడంలోనూ ఎటువంటి సమస్య లేదు. అయితే చదువుకోవాలనేది నా అభిలాష. ఆంగ్ల భాష నేర్చుకోవాలనేది నా తీరని కోరిక. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా ఆంగ్ల పదాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు నేను ఇబ్బంది పడుతుంటారు. అందుకే నేను ఆంగ్ల భాషను నేర్చుకోవాలనే తపనతో రోజూ స్కూలుకు వెళుతున్నాను’ అని తెలిపాడు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వన్లాల్కిమా మాట్లాడుతూ ‘లాల్రింగథర అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచాడు’ అని అన్నారు. కాగా లాల్రింగథర ప్రతిరోజూ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం నడిచి, స్కూలుకు చేరుకుంటాడు. ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఆన్లైన్ గేమ్తో ప్రేమజంటకు రెక్కలు.. -
డాన్స్ అనేది వైరల్ అని ఎందుకంటారంటే..
-
వ్యాయామమే మంచి మందు
సాక్షి, అమరావతి: ప్రతి రోజూ అర గంటపాటు నడక, పరుగు, సైక్లింగ్, ఈత.. ఇలా ఏదో ఒకదాన్ని నిత్యకృత్యంగా చేసుకున్నవారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా వరకు వ్యాధులను దరి చేరకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి సైతం వ్యాయామాన్ని మించిన మందు లేదని వివరిస్తున్నారు. ఈ మేరకు అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. మందుల కంటే కూడా వ్యాయామంతోనే 1.5 రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శారీరకంగా చురుకుగా ఉంటే విచారం, ఆందోళన, బాధ తదితరాలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ మేరకు సౌత్ ఆ్రస్టేలియా యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా 1.28 లక్షల మందిని పరిశీలించారు. ఆయా మానసిక సమస్యలను అధిగమించడానికి మందులు, కౌన్సెలింగ్ కంటే కూడా శారీరక శ్రమ చేస్తే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటోందని వెల్లడించారు. ఈ అధ్యయనం ఆధారంగా గుర్తించిన అంశాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో తాజాగా ప్రచురించారు. మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, నిరాశ, ఆందోళన, ఆత్మన్యూనతతో బాధపడేవారిని పరిశీలించారు. ఈ క్రమంలో శారీరక శ్రమ/వ్యాయామం చేసేవారిలో నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుముఖం పట్టాయని గుర్తించారు. తీవ్ర డిప్రెషన్తో బాధపడుతున్న గర్భిణులు, హెచ్ఐవీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వ్యాయామంతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నట్టు స్పష్టమైంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్ల వ్యయం చేస్తున్నారు. ఈ వ్యయం 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. మంచి హార్మోన్లు పెరుగుతాయి నడక, వ్యాయామం, పరుగు, ఏరోబిక్స్ వంటివాటితో శరీరానికి మంచి చేసే హార్మోన్లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాయామం వల్ల శరీరంలోని అడ్రినాలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించే ఎండారి్ఫన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని అంటున్నారు. రోజూ అరగంట చేసినా మంచి ఫలితాలు.. ప్రస్తుతం అన్ని వయసులవారు తీవ్ర ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో రోజూ కనీసం అరగంట పాటు నడక, స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, ఏరోబిక్స్ వంటి వాటికి సమయం కేటాయించాలి. ఈ వ్యాయామం బీపీ, షుగర్, ఊబకాయం వంటివి రాకుండా శారీరక, మానసిక ఆరోగ్యాలకు మేలు చేకూరుస్తుంది. రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి దూరం కావచ్చు. – డాక్టర్ రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, విజయవాడ -
నడక మంచిదే... ఫిట్నెస్ ఊరికే రాదు!
ప్రస్తుతపు ఉరుకులు పరుగుల లైఫ్లో మిషన్ల సాయం లేకపో తే పని నడవదు. అలాగని కదలకుండా కూర్చుంటే చేజేతులా ముప్పు తెచ్చుకున్నట్లే. మరయితే ఏం చేయాలి? మనసుంటే మార్గం ఉన్నట్లు ఈ బిజీ లైఫ్లో కూడా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండొచ్చు. అవేమిటో చూద్దామా? రకరకాల కారణాల వల్ల వ్యాయామం చేయడానికి సమయం లేనివారు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండవచ్చు. అందులో నడక ఒకటి. అసలు ఎలా నడవాలి.. ఎప్పుడెప్పుడు నడిస్తే ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం.. మాట్లాడుతూనే నడవండి కొంతమందికి పొద్దస్తమానం ఫోన్ మాట్లాడటం అవసరం. మరికొందరికి వృత్తిరీత్యా తప్పదు. చాలామందికి అలవాటు. అది వర్క్ కాల్ అయినా.. మీకు ఇష్టమైన వారితో చెప్పుకునే కాలక్షేపం కబుర్లే కావచ్చు... మాట్లాడండి. కానీ అలా మాట్లాడుతూనే నడవండి. ఎందుకంటే అరగంట వాకింగ్ చేస్తే వొంటికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా? ఇది మీ బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మెట్లు ఫిట్గా ఉండటానికి మెట్లను ఖచ్చితంగా ఎక్కాలని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర కదలికలు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. మెట్లను ఎక్కుతున్నప్పుడు మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అందుకే లిఫ్ట్లో వెళ్లకుండా మెట్లను ఎక్కడం అలవాటు చేసుకోండి. అయితే కొన్ని రకాల శారీరక ఇబ్బందుల రీత్యా, కొన్ని శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారినీ వైద్యులు మెట్లు ఎక్కవద్దని చెబుతారు. అలాంటి వారు మాత్రం మెట్లెక్కడాన్ని మినహాయించాలి. ఎక్కువ కదలడానికి ప్రయత్నించండి మీ ఆఫీస్ దగ్గరలో ఉంటే నడిచి వెళ్లడానికి ప్రయత్నించండి. లేదా ఆఫీసుకు కనీసం 10 నుంచి 20 నిమిషాల నడక దూరంలో దిగి.. నడిచి వెళ్లండి. బస్సులో వెళ్లినా, కారులో వెళ్లినా ఇలాగే నడవండి. ఫిట్గా ఉండటానికి ఈ చిన్న చిన్న మార్పులు అత్యవసరం. నిలబడి పనిచేయండి మీరు పనిచేసే ప్లేస్లో మీకు సౌకర్యంగా ఉంటే నిలబడి పని చేయడానికి ప్రయత్నించండి. ఇలా కొద్దిసేపు నిలబడి పనిచేయడం వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందుతారు. అలా అని మరీ ఎక్కువసేపు నిలబడటం ఆరోగ్యానికి మంచిది కాదు. టీవీ చూస్తున్నప్పుడు... టీవీ లేదా సెల్ ఫోన్లో సినిమాలను చూస్తున్నప్పుడు ఒకే దగ్గర కూర్చోకుండా.. ట్రెడ్మిల్పై నడవడం లేదా సైక్లింగ్ లేదా శరీరాన్ని సాగదీయడం వంటి కొన్ని వ్యాయామాలను చేయడం వల్ల మీ శరీరం బాగా కదిలి ఆరోగ్యంగా ఉంటుంది. డ్యాన్స్ బెస్ట్ సమయం దొరికినప్పుడల్లా మీ శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించండి. అన్నింటిలో డ్యాన్స్ బెస్ట్. ఎందుకుంటే ఇది వ్యాయామంగా అనిపించదు. కొన్ని నిమిషాలపాటు డ్యాన్స్ చేస్తే మనసుకు సంతోషం, శరీరానికి ఆరోగ్యం చేకూరతాయి. వీటితోబాటు సాధ్యమైనంత వరకు ఇంట్లో మీ పనులు మీరే చేయండి. క్లీనింగ్, వాషింగ్, వంటపనుల్లో ఓ చే యి వేయండి. ఈ పనులు కూడా వ్యాయామం కిందికే వస్తాయి. మిమ్మల్ని ఫిట్గా ఉంచుతాయి. -
పారిస్ ఒలింపిక్స్కు ఆకాశ్దీప్, ప్రియాంక అర్హత
రాంచీ: జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్షిప్లో పురుషుల 20 కిలోమీటర్ల విభాగంలో పంజాబ్కు చెందిన ఆకాశ్దీప్ సింగ్... మహిళల 20 కిలోమీటర్ల విభాగంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రియాంక గోస్వామి విజేతలుగా నిలిచారు. ఈ ఏడాది ఆగస్టులో బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలకు... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించారు. ఆకాశ్దీప్ 20 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 19 నిమిషాల 55 సెకన్లలో పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (1గం:20ని:10 సెకన్లు) అధిగమించాడు. ప్రియాంక 1 గంట 28 నిమిషాల 50 సెకన్లలో లక్ష్యానికి చేరి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (1గం:29ని:20 సెకన్లు) అధిగమించింది. చదవండి: టీ20 బ్లాస్ట్లో దుమ్మురేపనున్న మ్యాక్స్వెల్.. ఏ జట్టుకు అంటే..? -
60 ఏళ్లకు చేరువయ్యారా?.. అయితే రోజు ఎన్ని అడుగులు వేస్తే గుండెకు..
సాక్షి, అమరావతి: నడక నాలుగు విధాలుగా మేలు... అని తరచూ వైద్యులు చెబుతుంటారు. మంచి ఆరోగ్యం కోసం 18 ఏళ్లు పైబడిన వారు వారానికి కనీసం 150 నిమిషాల మితమైన శారీరక శ్రమ లేదా వారానికి కనీసం 75 నిమిషాల తీవ్రమైన శారీరక శ్రమ చేయాలని డబ్ల్యూహెచ్వో కూడా సూచిస్తోంది. ముఖ్యంగా 60ఏళ్లు పైబడినవారు వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల ప్రమాదకర రోగాల నుంచి రక్షణ పొందవచ్చని పలు అధ్యయనాలు స్పష్టంచేశాయి. తాజాగా ఇదే విషయం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ పరిశోధకుల అధ్యయనంలోనూ వెల్లడైంది. 60 ఏళ్లు పైబడిన వారు రోజు 6వేల నుంచి 9వేల అడుగులు నడిస్తే గుండెకు మంచిదని నిర్ధారించింది. ఈ అధ్యయనంలో భాగంగా అమెరికా సహా 42 దేశాల్లో 18 ఏళ్లు పైబడిన 20,152 మంది డేటాను ఎనిమిది కోణాల్లో పరిశోధకులు విశ్లేషించారు. ఆరేళ్ల పాటు వీరు నడుస్తున్న దూరం, ఆయా వ్యక్తుల్లో కార్డియోవాసు్కలర్ డిసీజ్ (సీవీడీ), నాన్ ఫాటల్ కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి అంశాలను బేరీజు వేశారు. ఈ నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వారు రోజుకు 6వేల నుంచి 9వేల అడుగులు నడిస్తే గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడవచ్చని గుర్తించారు. రోజుకు రెండు వేల అడుగులు మాత్రమే నడిచే వారితో పోలిస్తే వీరిలో గుండెపోటుతోపాటు పక్షవాతం ముప్పు 40 నుంచి 50 శాతం వరకు తగ్గుతుందని తేల్చారు. వృద్ధులకే కాదు అన్ని వయసులవారు నడక, వ్యాయామం, జాగింగ్, ఇతర శారీరకశ్రమ కార్యకలాపాలను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని స్పష్టంచేశారు. అయితే డబ్ల్యూహెచ్వో సూచించిన ప్రమాణాల మేరకు 41.3 శాతం మంది దేశంలో శారీరకశ్రమ చేయడం లేదని 2021లో ఒక సర్వేలో ఐసీఎంఆర్ తెలిపింది. అన్ని వయసుల వారికి ఉత్తమం నడక చక్కటి, సహజమైన వ్యాయామం వంటిది. రోజు వారి దినచర్యలో అన్ని వయసులవారు నడకను అలవాటుగా మార్చుకోవాలి. ప్రస్తుతం అన్ని వయసుల వారిలో శారీరక శ్రమ చేయడం చాలా వరకూ తగ్గిపోయింది. దీనికితోడు ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం, ఇతర జీవనశైలి జబ్బుల బారినపడుతున్నారు. వీటిని జయించి ఆరోగ్యంగా ఉండాలంటే నడక ఒక్కటే ఉత్తమ మార్గం. రోజు 30నిమిషాలు నడవడంవల్ల రక్తపోటు, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు అదుపులోకి వస్తాయి. 45ఏళ్లు పైబడినవారు, మధుమేహం, ఇతర సమస్యలు ఉన్నవారు కొత్తగా నడక, వ్యాయామం ప్రారంభిస్తున్నట్లయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడి సలహా మేరకు వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. మధుమేహం సమస్య ఉన్నవారు ఇన్సులిన్ తీసుకుంటుంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నడక, వ్యాయామం కొనసాగించాలి. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూల్ జీజీహెచ్ రోజు నడకతో ప్రయోజనాలు... ►రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తంలోని మలినాలు బయటకు పోతాయి. ►శరీర బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతాయి. ►మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులను అదుపులో ఉంటాయి. ►మానసిక కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ►మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) పెరిగి, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. ►ఆత్మ విశ్వాసం, శారీరక సామర్థ్యం పుంజుకుంటాయి. -
నడకతో గుండె పదిలం..!
వాషింగ్టన్ : ప్రతిరోజూ ఉదయం లేవగానే కాస్త అటూ ఇటూ నడిస్తే మీ గుండెకు వచ్చే ముప్పు తగ్గుతుందని మరోసారి తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజుకి 6 వేల నుంచి 9 వేల అడుగులు వేసే వారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం సగానికి సగం తగ్గిపోతోందని ఆ అధ్యయనం తెలిపింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్కు చెందిన జర్నల్ సర్క్యులేషన్ తాజా అధ్యయనం వివరాలను ప్రచురించింది..ఆ అధ్యయనం ప్రకారం రోజుకి 9 వేల అడుగులు నడిచే వారిలో గుండె వ్యాధులు వచ్చే ముప్పు 40–50 శాతం తగ్గిపోతుంది. మధ్య వయస్కులు రోజుకి 6 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే గుండె సంబంధిత వ్యాధులు సోకే అవకాశం 50% తగ్గిపోతుంది. ఇక 60 ఏళ్ల వయసు పైబడిన వారు ఎంత ఎక్కువ నడిస్తే వారి గుండెకు అంత మంచిది. యుక్త వయసులో ఉన్న వారి గుండె ఆరోగ్యానికి, వారి నడకకు ఎలాంటి సంబంధమూ లేదు. నడకకి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న లింకుపై ఇప్పటివరకు జరిగిన ఎనిమిది అధ్యయనాల ఫలితాల్ని క్రోడీకరించి తాజా అధ్యయనాన్ని రూపొందించారు. 18 ఏళ్లకు పైబడిన వయసున్న వారు 20,152 మంది ఇందులో పాల్గొన్నారు. ఆరేళ్లపాటు వారి స్మార్ట్ వాచ్లు, ఫోన్ల్లో రికార్డయిన వివరాల ద్వారా తాజా అధ్యయనాన్ని రూపొందించారు. -
తొలి అడుగులు చెట్ల మీదే!
భూమిపై మానవ వికాసం జరిగిన తీరు మనకిప్పటికీ పెద్ద మిస్టరీయే. అందులో అత్యంత కీలకమైన ‘ముందడుగు’ నడక. వెన్నును నిటారు చేసి రెండు కాళ్లపై సాగడం మానవ పరిణామ క్రమంలో నిజానికి చాలా పెద్ద మలుపు. ఇతర చతుష్పాద జంతువులన్నింటి నుంచీ ఇదే మనిషిని పూర్తిగా వేరు చేసి అత్యంత ప్రత్యేకంగా నిలిపింది. ఇంత కీలకమైన నడకను మన పూర్వ మానవుడు ఎప్పుడు నేర్చాడన్నది మనకే గాక పరిశోధకులకు కూడా అత్యంత ఆసక్తికరమైన టాపికే. దీనిపై దశాబ్దాలుగా ఎన్నెన్నో పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. అడవులు, తత్ఫలితంగా చెట్లు బాగా తగ్గి మైదాన ప్రాంతం పెరుగుతూ పోవడం వల్లే మనిషి రెండు కాళ్లపై నడక నేర్చుకోవాల్సి వచ్చిందని అవన్నీ దాదాపుగా ముక్త కంఠంతో చెప్పే మాట. కానీ అది పూర్తిగా తప్పంటోంది తాజా పరిశోధన ఒకటి. మన పూర్వీకులు చెట్లపై నివసించే రోజుల్లోనే రెండు కాళ్లపై నడవడం నేర్చారట. అదీ నిటారుగా! ఆ తర్వాతే పూర్తిస్థాయిలో నేలపైకి దిగారని వాదిస్తోంది! తెలివితేటల్లోనూ ఇతరత్రా కూడా జంతుజాలమంతటిలో మనిషికి అత్యంత సమీప జీవి అయిన చింపాంజీలపై 15 నెలల పాటు లోతుగా పలు కోణాల్లో పరిశోధనలు చేసి మరీ ఈ మేరకు తేల్చామంటోంది!! ఏం చేశారు? తూర్పు ఆఫ్రికాలో టాంజానియాలోని ఇసా లోయలో కొద్దిపాటి చెట్లు, కాస్తంత దట్టమైన అడవి, విస్తారమైన మైదాన ప్రాంతం మధ్య జీవిస్తున్న 13 అడవి చింపాంజీలను పరిశోధనకు ఎన్నుకున్నారు. మన పూర్వీకులు నడిచేందుకు దారి తీసిందని భావిస్తున్న చెట్ల లేమి, అపారమైన బయలు ప్రదేశం కారణంగా అవి కూడా అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తాయేమో గమనించడం అధ్యయనం ఉద్దేశం. ‘‘ఇందుకోసం చింపాంజీల ప్రవర్తనను అతి దగ్గరగా పరీక్షించి ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ వచ్చాం. వాటి తాలూకు ఏకంగా 13 వేల రకాలుగా హావభావాలను లోతుగా గమనించాం’’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న డాక్ట ర్ అలెక్స్ పీల్ వివరించారు. కానీ అవి అచ్చం అ త్యంత దట్టమైన అడవుల్లోని చింపాంజీల మాదిరిగానే అత్యధిక సమయం తమకందుబాటులో ఉన్న కొద్దిపాటి చెట్లపైనే గడుపుతూ వచ్చాయి నడిచే ప్రయత్నమే చేయలేదని చెప్పుకొచ్చారు. ‘‘కనుక దాదాపు 50 లక్షల ఏళ్ల క్రితం అటవీ సంపద తరిగిపోయి మైదాన ప్రాంతం ఎక్కువైన క్రమంలోనే ఆదిమ మానవుడు చెట్ల నుంచి నేలపైకి దిగి నిటారు నడక నేర్చాడన్న భావన తప్పు. దాన్నతను కచ్చితంగా చెట్లపైనే నేర్చుంటాడు. తర్వాత కూడా ఆహార వృక్షాల అన్వేషణలో చాలాకాలం పాటు చెట్లపై నిటారుగానే నడిచుండాలి. ఆ రకంగా మానవ వికాసానికి చెట్లే ఊతమిచ్చాయని భావించవచ్చు’’ అని ఆయన వివరించారు. ఈ అధ్యయనం జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్లో పబ్లిషైంది. కొసమెరుపు ఇంతా చేస్తే, తోకలేని కోతుల (ఏప్)న్నింట్లోనూ మన పూర్వీకులు మాత్రమే రెండు కాళ్ల నడకను ఎలా, ఎందుకు నేర్చారన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీయేనని అధ్యయనకర్తలు అంగీకరించారు! విస్తారమైన మైదాన ప్రాంతం అందుబాటులో ఉన్నా చింపాంజీలు చెట్లపైనే ఎందుకు అత్యధిక సమయం గడిపిందీ తేలితే బహుశా ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏమైనా క్లూ దొరకవచ్చంటున్నారు. అందుకే తమ తర్వాతి అధ్యయనం దీని మీదేనని ప్రకటించారు!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
FIFA: మ్యాచ్ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా?
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన కెరీర్లో చివరి ఫిఫా వరల్డ్కప్ ఆడుతున్నాడని చాలామంది భావిస్తున్నారు. 35 ఏళ్ల వయసులో ఉన్న మెస్సీ మరో వరల్డ్కప్ ఆడడం అనుమానమే. అందుకే కెరీర్లో ఎన్నో మైలురాళ్లను, రికార్డులను అందుకున్నప్పటికి ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీ అందుకోలేదన్న కోరిక మెస్సీకి బలంగా ఉంది. ఈసారి ఎలాగైనా అర్జెంటీనాను విజేతగా నిలిపి తన కోరికను నెరవేర్చుకోవడంతో పాటు హ్యాపీ మూమెంట్తో ఆటకు వీడ్కోలు పలకాలని మెస్సీ భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే మెస్సీ ప్రయాణం కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి మినహా.. క్వార్టర్ ఫైనల్స్ వరకు అంతా సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇప్పటివరకు మెస్సీ మూడు గోల్స్ కొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం నాకౌట్ దశ జరుగుతుండడంతో ప్రతీ మ్యాచ్ కీలకమే.. అర్జెంటీనా ఓడితే మాత్రం ఇంటిబాట పట్టడమే కాదు మెస్సీ కెరీర్ కూడా ముగిసినట్లే. డిసెంబర్ 10న బలమైన నెదర్లాండ్స్తో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్ పోరులో తలపడనుంది. ఆ మ్యాచ్లో మెస్సీ సేన విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లాలని బలంగా కోరుకుందాం. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో భాగంగా లియోనల్ మెస్సీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఫుట్బాల్ అంటే బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ఆటగాళ్లు పరిగెత్తుతూనే ఉండాలి.. అయితే మెస్సీ మాత్రం బంతి తన ఆధీనంలో లేనప్పుడు పరిగెత్తడం కంటే ఎక్కువగా నడవడం చేస్తుంటాడని ఒక వెబ్సైట్ తన సర్వేలో పేర్కొంది. ఫిఫా వరల్డ్కప్లో భాగంగా గ్రూప్ దశలో మ్యాచ్ సమయంలో గ్రౌండ్లో ఎక్కువగా నడిచిన టాప్-10 ఆటగాళ్ల లిస్ట్ రూపొందించారు. ఈ లిస్ట్లో మెస్సీ మూడుసార్లు చోటు దక్కించుకోవడం విశేషం. మెక్సికోతో మ్యాచ్లో మెస్సీ అత్యధికంగా 4998 మీటర్లు దూరం నడిచాడు. ఆ తర్వాత పోలాండ్తో మ్యాచ్లో 4736 మీటర్ల దూరం, సౌదీ అరేబియాతో మ్యాచ్లో 4627 మీటర్ల దూరం నడిచాడు. ఓవరాల్ జాబితాలో రెండు, ఐదు, తొమ్మిదో స్థానాలు కలిపి మొత్తంగా మూడుసార్లు మెస్సీ చోటు దక్కించుకున్నాడు. ఇక తొలి స్థానంలో పోలాండ్ కెప్టెన్ రాబర్ట్ లెవాన్డోస్కీ ఉన్నాడు. సౌదీ అరేబియాతో మ్యాచ్లో రాబర్ట్ 5202 మీటర్ల దూరం నడిచాడు. ఆ తర్వాత అర్జెంటీనాతో మ్యాచ్లో 4829 మీటర్ల దూరం నడిచిన లెవాన్డోస్కీ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచి రెండోసారి చోటు సంపాదించాడు. మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా? మరి మ్యాచ్లో మెస్సీ పరిగెత్తడం కంటే ఎక్కువగా నడుస్తాడనే దానిపై సందేహం వచ్చింది. ఈ ప్రశ్నకు మెస్సీ మాజీ మేనేజర్ పెప్ గార్డియోలా సమాధానం ఇచ్చాడు. ''మెస్సీ నడవడంలోనే పరిగెత్తడం చేస్తుంటాడు. అతను గేమ్లో ఎంతలా ఇన్వాల్వ్ అయితాడనేదానికి అతని నడకే ఒక ఉదాహరణ. మెస్సీ కావాలని అలా నడవడు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కనీసం ఒక పది నిమిషాల పాటు గ్రౌండ్ మొత్తం నడుస్తూనే తన జట్టు ఆటగాళ్ల కదలికలను.. ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారనే దానిపై ఒక కన్ను వేస్తాడు. గ్రౌండ్ పరిసరాలను మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికే ఈ ప్రయత్నం. ఆ తర్వాత తలను ఎడమ, కుడి.. ఇలా 360 డిగ్రీస్లో తిప్పుతూ ఆటగాడి కదలికలను.. వారు కొట్టే షాట్స్ను అంచనా వేయడం అతనికి అలవాటు. ఇక అంతా బాగుంది అనుకొని అప్పుడు తనలోని ఆటను బయటికి తీయడం చేస్తుంటాడు. మెస్సీ సక్సెస్కు ఇదీ ఒక కారణం అని చెప్పొచ్చు. అంతేకాని ఏదైనా సమస్య కారణంగా మెస్సీ పరిగెత్తడం లేదని.. నడకకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని అనుకుంటే మాత్రం పొరబడ్డట్లే. మెస్సీలో ఉన్న ప్రత్యేకత ఇదే.'' అంటూ చెప్పుకొచ్చాడు. Here is a video of Pep Guardiola explaining why Messi seems to “just walk around the pitch” when he doesn’t have the ball: pic.twitter.com/sEBQ4Juufh — ⚡️ (@Radmanx23) July 8, 2021 Tell us something we don't know 😂 pic.twitter.com/YbZLH1g8LE — M•A•J (@Ultra_Suristic) December 3, 2022 చదవండి: ఎంత కష్టం.. ఒకే ఒక్క వికెట్ కోసం చకోర పక్షుల్లా FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు! -
70 ఏళ్లు.. 9 కి.మీటర్లు.. 83 నిమిషాలు
కాచిగూడ (హైదరాబాద్): కాచిగూడలోని జీవీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్.గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఎద్దుల కృష్ణారెడ్డి (70) 9 కిలోమీటర్లను 83 నిమిషాల్లో నడిచి వరల్డ్ రికార్డును సాధించారు. ఇప్పటికే గతంలో రెండు వరల్డ్ రికార్డ్స్ను డాక్టర్ కృష్ణారెడ్డి తన ఖాతాలో వేసుకున్నారు. సైదాబాద్లోని వివేక్ ఆస్పత్రి వద్ద డాక్టర్ కృష్ణారెడ్డి ప్రారంభించిన నడకను జైళ్ళ శిక్షణ కళాశాల (చంచల్గూడ) ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, జైలర్ రత్నంలు ప్రారంభించారు. ట్యాంక్బండ్లోని వివేకానంద విగ్రహం వరకు 9 కిలోమీటర్ల దూరాన్ని 83 నిమిషాల్లో నడిచి ఆయన ఈ రికార్డును నెలకొల్పారు. కృష్ణారెడ్డి చేసిన ఈవెంట్ను గుర్తించి (9 వరల్డ్ రికార్డ్ సంస్థలు) వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ట్రెజర్ వరల్డ్ రికార్డ్స్, గ్రాండ్ వరల్డ్ రికార్డ్స్, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫోకస్ వరల్డ్ రికార్డ్స్, గ్లోరీ వరల్డ్ రికార్డ్స్, కోహినూర్ వరల్డ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ రికార్డ్స్ సంస్థలు రికార్డ్ను నమోదు చేశాయి. ఈ సందర్భంగా జీవీఆర్ కరాటే అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధుల సమక్షంలో రికార్డును కృష్ణారెడ్డికి అందజేశారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ...ఈ రికార్డ్ను సీనియర్ సిటిజన్స్కు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాయామం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఆర్ కరాటే అకాడమి కరాటే బ్లాక్బెల్ట్ ప్రతినిధులు కరీం, సుభాష్, సర్వర్, అమృత తదితరులు పాల్గొన్నారు. -
వడివడిగా రాహుల్ నడక.. ఇబ్బందులు పడుతున్న సీనియర్ నేతలు
వడివడిగా రాహుల్ నడక.. ఇబ్బందులు పడుతున్న సీనియర్ నేతలు -
ఆరోగ్యంగా తగ్గండి.. లేదంటే బరువు తగ్గినా ఈ సమస్యలు తప్పవు!
Weight Loss Tips: బరువు తగ్గాలి అంటే వ్యాయామం, డైటింగ్ ఒక్కటే సరిపోదు. సరైన వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన తిండి, నిలకడగా వ్యాయామాలు చేయడం కొంచెం ఓపిక అవసరం. బరువు తగ్గడానికి అయినా పెరగడానికి అయినా వ్యాయామాల పాత్ర 20 శాతం ఉంటే, ఆహారం పాత్ర 80 శాతం ఉంటుంది. సాధారణ మనిషికి రోజుకు 2,200 క్యాలరీలు అవసరం. బరువు తగ్గాలనుకునే వారు తక్కువ తమకు అవసరమైన దానికన్నా తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే మన శరీరానికి 2,200 క్యాలరీలు అవసరమనుకుంటే, అంతకన్నా కొద్దిగా తక్కువ క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు: రోజుకు 2000 క్యాలరీలు ఇచ్చే ఆహారం తీసుకోవాలి. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం... అంటే కూరగాయలు, పళ్ళు, మాంసకృత్తులు, ఓట్స్ లాంటివి తీసుకోవాలి. ముందుగా ఇంతకుముందు తింటున్న ఆహార పరిమాణాన్ని కొంచెం తగ్గించాలి. తీపి పదార్థాలు, శీతల పానీయాలు, బయట తిండి పూర్తిగా తగ్గించాలి. తోపుడు బండి వాళ్ల దగ్గరి నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ల వరకూ అందరూ తమ ఆహారం రుచిగా ఉండాలి అనే కోరుకుంటారు గాని ఆరోగ్యంగా ఉండాలి అని కాదు. ఆరోగ్యం అంటే శుభ్రత ఒకటే కాదు, తక్కువ క్యాలరీలు అని కూడా. ఎంతసేపు చేస్తున్నాము అన్నదానికన్నా ఎంత తీవ్రతతో చేస్తున్నాము, ఎన్ని క్యాలరీలు కరిగిస్తున్నాం అన్నది ముఖ్యం. ఉదా – ఒక గంటన్నర నడవడం వల్ల 500 క్యాలరీలు కరిగితే, 45 నిముషాలపాటు చేసే వర్కవుట్స్ వల్ల కూడా 500 క్యాలరీలు కరుగుతాయి. కాబట్టి చేసే వ్యాయామాల వల్ల రోజుకు ఎన్ని క్యాలరీలు కరుగుతాయో అంచనా వేసుకుని అందుకు తగ్గట్టు తినడం వల్ల మాత్రమే ఆరోగ్యంగా బరువు తగ్గగలం. లేదంటే బరువు తగ్గినా, నీరసం, అనారోగ్యం పాలవక తప్పదు. చదవండి: Stammering: మాట్లాడేటపుడు నత్తి వస్తోందా? ఈ చిట్కాలు పాటించారంటే! -
అబ్బా! ఏం చేశాడ్రా... మూన్ వాకింగ్ స్టైల్కి ఫిదా అవుతున్న నెటిజన్లు
అందరికి వివిధ రకాల టాలెంట్లు ఉంటాయి. ఐతే ఆ టాలెంట్కి పదును పెట్టి విభిన్నంగా చేసి ఔరా! అనిపించుకునేవారు కొంతమందే. ఆ కోవకు చెందిన వ్యక్తే జయదీప్ గోహిల్. మూన్వాక్ గురించి అందరికీ తెలిసిందే. కానీ, జయదీప్ చేసిన మూన్వాక్ మరింత స్పెషల్. ఎందుకంటే అతను చేసింది నీటిలో తలకిందులుగా! వివరాల్లోకెళ్తే.. మూన్ వాక్తో జనాలను ఆకర్శిస్తున్న జయదీప్ గోహిల్.. ఈసారి విభిన్నంగా ట్రై చేశాడు. నీటి అడుగు భాగంలో మూక్వాక్తో ఆకట్టుకున్న ఈ యువకుడు.. తలకిందులుగా ఆ స్టెప్ వేసి అందర్నీ ఆశ్చర్య చకితులను చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. అతను ఆ వీడియోలో తొలుత స్విమ్మింగ్ పూల్లోని అడుగున ఉన్న టేబుల్ పై మేఖేల్ జాక్సన్కి సంబంధించిన ప్రసిద్ధ పాట స్మూత్ క్రిమినల్లో ఆయన ఎలా వాకింగ్ స్టైల్ డ్యాన్స్ తరహాలో నడిచాడో అలా నడుస్తాడు. ఆ తర్వాత సడన్గా తలకిందులుగా నడుస్తాడు. చూస్తే ఏం చేశాడ్రా అని అనకుండా ఉండలేరు. ఈ వీడియోకి తొమ్మిది మిలియన్లకు పైగా వ్యూస్, లైక్లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు కూడా అతని టాలెంట్ చూసి తెగ ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Hydroman (@hydroman_333) (చదవండి: కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు: వీడియో వైరల్) -
కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే! అన్నం ఎక్కువ తిన్నారో!
"ఇది తిను.. అది తినొద్దు.. అంటూ ఒకటే సోది. మన తాతముత్తాతలు హాయిగా అన్నీ తిన్నారు. ఇప్పుడే పనిలేని వాళ్లు అది తొనొద్దు... ఇది తినొద్దు... అంటూ ప్రచారం చేస్తున్నారు. హాయిగా అన్నీ తినండి ".... ఇదీ.... వాట్సాప్ లో ఆహార ప్రియులు ఫార్వర్డ్ చేసుకొని తుత్తి పొందే మెసేజ్ ! ఎంతమంది తాతలేంటి ? మనిషి పుట్టింది నలభై లక్షల సంవత్సరాల క్రితం. అంటే మనకందరికీ ఒక కోటి ఇరవై లక్షల మంది తాతలున్నారు. వారి జీవన విధానం మనల్ని ప్రభావితం చేస్తుంది. మనకు ఇష్టమున్నా , లేకున్నా తప్పదు.. తప్పించుకోలేము. అదే సూక్ష్మ పరిణామక్రమం ! అదే సైన్స్ ! 1. కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే! మనిషి నాగరికుడయ్యింది అయిదు వేల సంవత్సరాల క్రితం మాత్రమే. నలబై లక్షల్లో అయిదువేల సంవత్సరాలంటే ఎంత ? ఒక శాతం కూడా కాదు. ఒక శాతంలో పదోవంతు. అంటే సముద్రంలో నీటి బొట్టు. అంటే మనిషి తన మనుగడలో తొంబై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం సమయం వేట - ఆహార సేకరణ లో గడిపేశాడు . అంటే పొద్దునే లేస్తే మగాళ్లు వేట. మహిళలు ఇంటిపని, పిల్లల సంరక్షణ, ఆహార సేకరణ. పగటి పూట కూర్చోవడం అరుదుగానే .ఏదో బాగా అలిసినప్పుడు కాసేపు రాత్రి పూట పడుకోవడం మానవ శరీరం అందుకు తగ్గట్టుగానే తయారయ్యింది. నడుస్తూ, పరుగెత్తుతూ, ఎక్కుతూ, దిగుతూ మన తాతలు పగలు గడిపేశారు .... ఇప్పుడేమో తీరిక. ఆఫీస్ పని ఉన్నా కూర్చొని చేయడమే . ఇక ఇప్పుడు కొత్తగా వర్క్ ఫ్రొం హోమ్. ఇంటినుంచి బయటకు వెళ్ళేపని లేదు. సోఫాలో, కుర్చీలో, మంచం లో అరుగు పైన గంటలు గంటలు కూర్చోవడమే. అదిగో అక్కడే సమస్య వచ్చింది . మన పూర్వీకులు మనకు సాధించి పెట్టింది.. తిరగడానికి అనువైన శరీరం. మనం .. లేదా మన తండ్రులు.. అంటే లింగులిటుకు అంటూ రెండు తరాలు మాత్రం .. కూర్చోవడం.. అదీ కాసేపు కాదు.. గంటలు గంటలు! మన బాడీ అందుకు తగ్గట్టు లేదు.. అందుకే.. బిపి.. షుగర్.. వెన్ను నొప్పి.. మోకాలు నొప్పి.. ఊబ కాయం.. హృద్రోగం .. అబ్బో ఒకటా రెండా ? సమస్యలే సమస్యలు .. సరే గుప్పెడు మాత్రలు ఉన్నాయి. ..... వేసుకొంటే పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది . వేసుకోకపోతే ఇంకో సమస్య . మరి పరిష్కారం ? కనీసం రోజుకు గంట నడక .. శరీరం అలసి పోయేలా శారీరిక శ్రమ. నడక ఎంత అవసరమో ఇరవై నాలుగు గంటలు ఎకానమీ క్లాసులో తన సీట్ లో కూర్చొని ఇండియా నుంచి అమెరికా విమానాశ్రయం లో అప్పుడే దిగిన ప్రయాణికుడిని అడుగు చెబుతాడు . 2. ఒంటరి తనమంటే మానసిక అనారోగ్యానికి దగ్గరి దారి : మనిషి సంఘ జీవి . మన పూర్వీకులు వేట ఆహార సేకరణ దశలో జట్లుగా సమిష్టి జీవనం గడిపారు . జట్టు అంటే ఆంగ్లం లో బ్యాండ్ . ఒక్కో జట్టు లో సుమారుగా ముప్పై నలబై మంది ఉండేవారు . ఒక విధంగా చెప్పాలంటే జట్టు ఉమ్మడి కుటుబంకన్నా పెద్దది. జట్టులోని సభ్యుల మధ్య సహకారం.. సమన్వయం.. శ్రమ విభజన.. పరస్పరత ఉండేది . మనిషి నాగరీకుడు అయ్యి వ్యవసాయం వచ్చాక ఉమ్మడి కుటుంబాలొచ్చాయి. భార్య భర్త పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని కేంద్రక కుటుంబం అంటారు . ఇది కేవలం చివరి రెండు తరాలు మాత్రమే . కేంద్రక కుటుంబాలే మానవ మనుగడకు ముఖ్యంగా పిల్లల పెంపుదలకు అనుకూలం కాదు అనుకొంటుంటే ఇప్పుడు సరి కొత్త కుటుంబాలు . తల్లి లాప్ టాప్ లో లేదా టీవీ ముందు .. తండ్రి సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ ముందు . పిల్లలల తో మాటాడే సమయం ఉండదు . వారి చేతిలో సెల్ ఫోన్ . అక్కడే అన్ని అరిష్టాలు మొదలు . అంతేనా ? మనిషి ఒంటరిగా గడిపింది ఎప్పుడు ? ఇప్పుడేమో ఎదిగిన పిల్లలు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో .. కనీసం ఆఫీస్ లాంటి వాటికి పోయినా అదో రకం .. వర్క్ ఫ్రొం హోమ్ .. రిటైర్మెంట్ తరువాత జీవనం .. . మనిషి ఒంటరి వాడయ్యాడు . పక్కన ఎవరైనా ఉన్నా మాట్లాడరు. చేతిలో సెల్ ఫోన్ ." ఖాళీ బుర్ర .. దెయ్యాల కొంప "అనే ఆంగ్ల సామెత ఉండనే వుంది . ప్రతి ఇంట్లో ఒక సైకో తయారవుతున్నాడంటే తప్పు .. మన తాతలదే . కానీ అదే మన ancestry. తప్పదు.. అదే నీ పరిణామ క్రమం.. అదే నీ బతుకు.. మారాలంటే కనీసం లక్ష సంవత్సరాలు కావాలి . 3. అన్నం ఎక్కువ తింటే సున్నం దక్కదు సుమీ.. మనిషి తన మనుగడ లో తొంబై తొమ్మిది శాతం సమయం మాంసం , దుంపలు , కాయలు పళ్ళు తిని బతికేసాడు . ఈ నాటి బాష లో చెప్పాలంటే మీట్.. సలాడ్స్ . నవీన శిలా యుగం లో అక్కడక్కడా బార్లీ లాంటి పంటలు . గోధుమ, వరి లాంటి ధాన్యాలు పండించింది కేవలం అయిదు వేల సంవత్సరాల క్రితం . దానికే మన బాడీ గా రెడీ గా లేదు . అది చాలదన్నట్టు ఇదిగో గత నలబై యాభై సంవత్సరాల్లో కొత్త వంగడాలు.. రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు .. పీచు సున్నా .. పిండి పదార్థాలు తప్పించి మిగతా పోషకాలు సున్నా .. అదే తెల్లనం .. ఉత్తరాది వారు మరీ దారుణం .. రసాయనాలు కలిసిన మైదా కలుపుకొని గోధుమ పిండి రొట్టెలు .. పుల్కాలు . సకల సమస్త రోగాలకు ఇవే కారణం . ఇది చాలదన్నట్టు ఆధునిక ప్రపంచంలో ప్రొసెస్డ్ ఫుడ్స్.. ట్రాన్స్ ఫ్యాట్స్ .. జంక్ ఫుడ్ .. అబ్బో .. రోగాలు మూడు రోగాలు ... ముప్పై ఆసుపత్రులు . ఈ మెసేజ్ ఇక్కడి దాక చదివిన వారికి రెండు మార్గాలున్నాయి . 1."అంటే ఏంటట ? మన తాతముత్తాతలు ఆకులూ అలుములు కట్టుకొని, గుహల్లో అడవుల్లో బతికారు కాబట్టి మనం కూడా బట్టలిప్పేసి అకులు కట్టుకొని అడవిలోకి వెళ్లిపోవాలా?" అని జోక్ చేసి .. మీ జోక్ కు మీరే కిచ కిచ అని నవ్వేసుకొని హ్యాపీ గా బతికెయ్యడం .. అల్ ది బెస్ట్ . లేదా .. ►రోజుకు ఒక గంట నడక ►పిల్లాపాపలతో సమయం గడపడం ►స్నేహితులు బంధువులు తో తరచూ కలుస్తూ సమయం గడపడం ►ఆఫీస్ లాంటి చోట్ల అందరితో కలివిడిగా మాట్లాడడం ►తెల్లన్నం బాగా తగ్గించి మైదా పుల్కాలు పూర్తిగా మానేసి ఆకుకూరలు కాయగూరలు , పళ్ళు లాంటివి ఎక్కువ తినడం . మనం ఎంచుకొన్న దారే మన భవిత రాదారా ? గోదారా? ఏది మీ దారి ?? - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
దేశమంతా పాదయాత్ర
కోచి: కేరళలోని కొట్టాయానికి చెందిన బెన్నీ కొట్టార్తిల్ (53), ఆయన భార్య మోలీ బెన్నీ (46) దేశమంతటినీ కాలినడకన చుట్టొచ్చారు. ఈ ఘనత సాధించిన తొలి జంటగా నిలిచారు. 2021 డిసెంబర్ 1న కన్యాకుమారిలో మొదలు పెట్టి జూలై 3న ముగించారు. మొత్తం 17 రాష్ట్రాలను కవర్ చేశారు. ప్రజల్లో నడకపై అవగాహనను మరింత పెంచేందుకే పాదయాత్ర చేసినట్టు చెబుతున్నారు. ‘‘యాత్ర పొడవునా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. బిహార్లో ఓ రాత్రి ఎక్కడా ఆశ్రయం దొరక్క శ్మశానంలో తలదాచుకున్నాం! పంజాబ్లోని స్వర్ణ దేవాలయం అన్నింటికంటే ఎక్కువగా నచ్చింది. ఆంధ్రా స్టైల్ భోజనానికి ఏదీ సాటి రాదు’’ అన్నారు. యాత్రానుభవాలను సొంత యూట్యూబ్ చానళ్లో పంచుకున్నారు. స్పాన్సర్లు దొరికితే మళ్లీ పాదయాత్రకు సిద్ధమంటున్నారు! -
వాకింగ్ వెహికిల్.. నాలుగు కాళ్ల కారు
అదేం చోద్యం! కారుకు చక్రాలు ఉంటాయి గాని, కాళ్లేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ‘హ్యుండాయ్’ కంపెనీ తయారు చేయనున్న కారుకు నాలుగు కాళ్లు ఉంటాయి. అయితే, ఆ నాలుగు కాళ్లకూ నాలుగు చక్రాలు కూడా ఉంటాయనుకోండి. హ్యుండాయ్ కంపెనీ ఈ నాలుగు కాళ్ల కారు నమూనాను 2019 నాటి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించి, సందర్శకులను ఆకట్టుకుంది. నాలుగు కాళ్లతో అడుగులు వేసుకుంటూ ఈ కారు ఎన్ని మెట్లయినా ఇట్టే ఎక్కేస్తుంది. అంతేకాదు, ఎంత ఎత్తైన గుట్టలనైనా అవలీలగా ఎగబాకగలదు. లోపల ప్రయాణించే వారికి పెద్దగా కుదుపుల్లేకుండా, గుట్టల్లోని ఎగుడు దిగుడు ప్రయాణం సుఖప్రదంగా సునాయాసంగా సాగేందుకు వీలుగా ఈ విచిత్ర వాహనాన్ని త్వరలోనే రూపొందించడానికి హ్యుండాయ్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీని తయారీ కోసం అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. -
బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 శాతం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు వెళ్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే(ఎన్ఏఎస్)–2021లో తేలింది. 18 శాతం మంది సైకిళ్లపై పాఠశాలలకు చేరుకుంటున్నట్లు వెల్లడయ్యింది. స్కూల్ ట్రాన్స్పోర్టు, పబ్లిక్ ట్రాన్స్పోర్టును ఉపయోగించకుంటున్నవారు కేవలం 9 శాతం మంది ఉన్నారు. 8 శాతం మంది సొంత వాహనం(టూ వీలర్)పై, 3 శాతం మంది సొంత కార్లలో స్కూలుకు వెళ్తున్నారు. పిల్లల విద్యాభ్యాసం విషయంలో కనీసం 25 శాతం స్కూళ్లకు విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతు లేదని సర్వేలో గుర్తించారు. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 720 జిల్లాల్లో 1.18 లక్షల స్కూళ్లకు చెందిన 34 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వే పాల్గొన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్ 12న 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులను ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో సర్వే చేపట్టారు. చివరిసారిగా 2017లో ఎన్ఏఎస్ సర్వే జరిగింది. -
స్టేడియంలో అధికారి కుక్క వాకింగ్ కోసం.. విమర్శలు
ఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్పై.. సోషల్మీడియాలో తాజాగా కొందరు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ అధికారి తన కుక్కతో వాకింగ్ చేసేందుకు వీలుగా స్టేడియం వేళల్ని సవరించినందుకు మండిపడుతున్నారు. ఢిల్లీలో స్టేడియాల వేళల్ని పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. రాత్రి పది గంటలకు వరకు అథ్లెట్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాల జారీ వెనుక ఉన్న వ్యవహారమే విమర్శలకు దారి తీస్తోంది. ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో ఓ ఐఏఎస్ అధికారి పెంపుడు కుక్కతో నిత్యం వాకింగ్కు వస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన కోసం స్టేడియం నిర్వాహకులు.. అథ్లెట్లకు ప్రాక్టీస్ చేసుకునే సమయం తగ్గించారు. త్వరగా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీంతో విమర్శలు వెల్లువెత్తగా.. రాత్రి పది గంటల వరకు స్టేడియాలను తెరిచి ఉంచాలని తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Delhi CM Arvind Kejriwal has directed that all Delhi Govt sports facilities will stay open for sportspersons till 10pm (File pic) pic.twitter.com/a7d0IyodXH — ANI (@ANI) May 26, 2022 ఢిల్లీ రెవెన్యూ సెక్రెటరీ సంజీవ్ ఖీర్వార్ తన పెంపుడు కుక్కతో ఈ స్టేడియంలోనే వాకింగ్ చేస్తున్నారు. ఈయన కోసమే అథ్లెట్లను బయటకు పంపించి వేస్తున్నారంటూ.. ఫొటో ఆధారాలతో సహా విమర్శిస్తున్నారు కొందరు. అయితే స్టేడియం నిర్వాహకుడు అనిల్ చౌదరి మాత్రం విమర్శలను ఖండిస్తున్నారు. స్టేడియం అధికారిక టైమింగ్ రాత్రి ఏడువరకే. ఆ తర్వాత ఎవరినీ ఎవరూ బయటకు వెళ్లిపోమనట్లేదు. స్వచ్చందంగా అథ్లెట్లు వెళ్లిపోతున్నారంటూ చెప్పారు. మరి సంజీవ్ ఈ స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వలేదు. Delhi Staduim Dog Walk Row ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో .. ఇప్పుడు స్టేడియం వేళల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కేజ్రీవాల్. -
బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే.. ఏం చేయాలి?
మనిషికి శారీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. శారీరక శ్రమ ముఖ్యంగా మెట్లు ఎక్కడం ద్వారా అధిక కొవ్వును కరిగించుకోవచ్చు. అలాగే మెట్లు ఎక్కితే మెదడువికాసానికి, మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పరిశోధకులు వెల్లడించారు. జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే వ్యాయామాల తోపాటు మెట్లు ఎక్కడం లాంటివి ఎక్సర్సైజ్ చేయడం బ్రెయిన్ ఫిట్నెస్కు చాలా మంచిదట. ముఖ్యంగా వయసు పెరుగుతున్నవారు క్రమం తప్పకుండా చిన్నగా మెట్లు ఎక్కుతూ మెదడుని చురుగ్గా ఉంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వృద్ధాప్యంలో వేధించే అల్జీమర్స్ లాంటి బారిన పడకుండా ఈ వ్యాయామం అద్భుతమైన మేలు చేస్తుందని చెబుతున్నారు. మెట్లు ఎక్కితే శరీరానికి మంచిదని, చక్కని వ్యాయామం అందుతుందని మనకు తెలుసు. మెట్లు ఎక్కడం వలన మెదడుకి కూడా చాలా మేలు కలుగుతుందట. తక్కువ వ్యవధిలో, తేలికగా మెట్లు ఎక్కడంవల్ల బాడీ, మైండ్ ఫిట్నెస్కు చాలా మంచిదని ఒక స్టడీలో తేలింది. జర్మనీలోని కార్ల్ శ్రహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ప్రతిరోజూ మెట్లు ఎక్కడం వలన చురుగ్గా ఉండటం తోపాటు, క్తితో నిండిన అనుభూతిని కలిగిస్తుందని, ఇది మన ఆరోగ్యాన్ని మరింత ఉత్తేజితం చేస్తుందని సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో అధ్యయన వేత్తలు వెల్లడించారు. అలాగే చిన్నచిన్న తేలిక పాటి ఇతర వ్యాయామాల ద్వారా వృద్ధులు తమ మెదడును యవ్వనంగా ఉంచుకోవచ్చని తెలిపారు. అనేక రకాల ఇతర శారీరక శ్రమలతో పోల్చితే, రోజుకు కనీసం ఒక్కసారైనా మెట్లు ఎక్కడం చాలా మంచిదని కెనడా పరిశోధకులు న్యూరోబయాలజీ ఆఫ్ ఏజింగ్ జర్నల్లో వెల్లడించారు. 19 నుండి 79 సంవత్సరాల వయస్సు గల 331 మంది ఆరోగ్యవంతమైన పెద్దల భౌతిక మెదడుపై వారం రోజులపాటు పరిశోధన నిర్వహించారు. ఈ స్టడీలో వారి బ్రెయిన్ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఎంఆర్ఐ స్కాన్లను పరిశీలించారు. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కినవారి మెదడు చురుకుగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. బాగా చదువుకున్న వారిలో భౌతిక మెదడు వయస్సు దాదాపు ఒక సంవత్సరం తక్కువగానూ, రోజు మెట్లు ఎక్కే వారి భౌతిక మెదడు వయస్సు అర సంవత్సరం తగ్గినట్టు పరిశోధకులు తెలిపారు. మెట్లు ఎక్కడం వలన చదువుకుంటున్న వారిలో మెదడులోని నాడీ కణజాలం సంకోచించకుండా కాపాడి, మెదడు చురుగ్గా, మరింత యవ్వనంగా తయారువుతుందట. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి భోజనం చేయడం, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం, పుస్తకాలు, చదవడం, సామాజికంగా చురుగ్గా ఉండటం రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే షుగర్, బీపీ లాంటి వ్యాధులను బారిన పడకుండా ముందునుంచీ జాగ్రత్త పడాలి. థైరాయిడ్, షుగర్, బీపీ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవడం చాలా కీలకం. మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేయాలంటే.. రోజువారీ జీవితంలో లిఫ్ట్లకు, ఎలివేటర్స్కు సాధ్యమైనంత వరకు బైబై చెప్పేసి మెట్టు ఎక్కితే మెదడు పదిలంగా ఉంటుంది. మన మెదడు నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. మెదడును ఎంత ఉల్లాసంగా ఉంచితే అంత మంచిదన్నమాట. -
ఆర్కిటెక్చర్ వాక్.. అడుగు అడుగులో నిర్మాణం
నడవాలి.. నడతలు మార్చడానికి నడవాలి.. నడతలు నేర్పడానికి ఆర్కిటెక్ట్ గీతా బాలకృష్ణన్ ‘నడక’ గురించి తెలుసుకుంటే ఈ మాటలు ముమ్మాటికి నిజం అనిపిస్తుంటుంది. 1700 కిలోమీటర్లు... కోల్కతా నుంచి ఢిల్లీ వరకు దాదాపు రెండు నెలల ప్రయాణం 54 ఏళ్ల వయసులో వందల కిలోమీటర్ల నడక దేనికోసం..? ‘నవభారత నిర్మాణం’ కోసం అంటూ ఆర్కిటెక్చర్ వాక్ గురించి ఆనందంగా వివరిస్తారు ఆమె. గీతా బాలకృష్ణన్ పుట్టింది చెన్నైలో. చదివిందంతా హైదరాబాద్లో. 1982లో కలకత్తాకు వెళ్లిపోయి, అక్కడే ఆర్కిటెక్చర్ వృత్తిలో కొనసాగుతున్నారు. దేశంలో భవన నిర్మాణ రంగం గురించి రాబోయే తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ఒంటరిగా 1,700 కిలోమీటర్లు నడిచిన ఈ ఆర్కిటెక్ట్ దారి గురించి మరింత వివరంగా.. ► ప్రయాణంలో గ్రహించిన విషయాలు.. అనుకున్న ప్లాన్ ప్రకారం గత శనివారం ఉదయం 5:30కి ఢిల్లీకి చేరుకోవడంతో నా ‘వాక్’ పూర్తయింది. దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో తప్ప ఆర్కిటెక్చర్ గురించి చాలా మందికి తెలియదని ఈ ‘వాక్’ ద్వారా మరింతగా అర్థమయ్యింది. తల్లితండ్రులు కూడా తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనుకుంటారు తప్ప ఆర్కిటెక్ట్ కావాలని, అదొక రంగం ఉంటుందని తెలియదు. చిన్న చిన్న టౌన్లు మొదలు పల్లెల్లో జనానికి భవన నిర్మాణాల డిజైన్స్ గురించి, ఈ రంగంలో ఉన్న అవకాశాల గురించి తెలియజేయాలనుకుని ఫిబ్రవరి 13న ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా ఈ ప్రయాణం మొదలైన మొదటి రోజు భవన నిర్మాణాలు జరుగుతున్న చోటుకు వెళ్లాను. ‘ఎందుకు కడుతున్నారు, ఏం పనిచేస్తున్నారు.. ప్లానింగ్ ఏంటి?’ అని అడిగితే ‘అవేమీ మాకు తెలియదు. కాంట్రాక్టర్ వస్తారు. ఇంత ఎత్తులో కట్టండి, అలా పని చేయండి.. అని చెబితే అలాగే చేస్తాం’ అని చెప్పారు. ఆర్కిటెక్ట్ వచ్చి వారితో మాట్లాడి, తగిన డిజైన్ ఇస్తే కదా.. ఆ పనివాళ్లలో నిర్మాణం పట్ల ప్రేమ కలిగేది. ఇల్లు, భవనం అంటే.. నాలుగు గోడలు రూఫ్ మాత్రమే కాదు కదా! ఇది కూడా బాధ్యతగా చేయాల్సిన పని అని ఎవరికీ తెలియడం లేదు. ► ఈ ‘వాక్’ వల్ల జనాల్లో అవగాహన వస్తుందంటారా? నా ఒక్కదాని వల్ల అందరిలోనూ అవగాహన వస్తుందని చెప్పలేను. కానీ, జనాల్లోకి కొంతవరకు సందేశం వెళుతుంది. ప్రభుత్వం, ఆర్కిటెక్ట్ అసోషియేషన్స్.. అందరూ కలిసి అవగాహన కల్పించడానికి ఇదో మార్గం అనుకున్నాను. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇండియన్ ఇన్సిట్యూట్ ఆర్కిటెక్చర్ ఈ రెండు కౌన్సిల్స్ నేను చేసే వాక్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ జర్నీలో చాలా సమస్యలు ఉన్న ప్రాంతాలను సందర్శించాను. వాటిని గుర్తించి, ఒక డాక్యుమెంట్ చేసే పనిలో ఉన్నాను. నాకు ఇది ఒక పరిశోధనగా ఉపయోగపడింది. ఈ వాక్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ► మీ రోజువారీ ప్రయాణం ఎలా ఉండేది? మొదట ఉదయం 6 గంటలకు ప్రారంభించినా, ఎండకారణంగా ఉదయం 4 గంటలకే నడక మొదలుపెట్టేదాన్ని. ఈ జర్నీలో చాలామంది నుంచి చాలా ప్రేమ దక్కింది. కొందరు వచ్చి యోగక్షేమాలు అడిగేవారు. కొందరు మంచి నీళ్లు, టీ ఇచ్చేవారు. మరికొందరు టిఫిన్కు ఆహ్వానించేవారు. కొన్ని చోట్ల వాళ్ల ఇంట్లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసి, మరీ పిలిచారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రజల్లో ఉన్న ఇంత మంచిని నేరుగా చూడగలిగాను. నేను నడుస్తూ వెళుతుంటే స్థానిక మీడియా వాళ్లు చూసి, విషయమేంటో కనుక్కొని, నన్ను అనుసరిస్తూ నా గురించి పేపర్లలో రాశారు. నేను ముందుకు వెళ్లినప్పుడల్లా స్థానికులు ‘మీ గురించి చదివాం, చూశాం..’ అని చెబుతుండేవారు. ► ప్రయాణంలో అద్భుతం అనిపించినవి? మార్గంలో నా చూపంతా భవననిర్మాణాలవైపుగా ఉండేది. వెస్ట్ బెంగాల్ ఆర్కిటెక్చర్, జార్ఞాండ్లోని ఆర్కిటెక్చర్ చాలా భిన్నంగా ఉంది. మధ్యప్రదేశ్లో భర్రా అని గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు కట్టిన ఒక ఇంటికి వెళ్లాను. మట్టితో కట్టిన ఇల్లు అది. వాళ్ల కుటుంబసభ్యులే కలిసి స్వయంగా కట్టుకున్నారు. రూఫ్కి కూడా వాళ్లే తయారు చేసుకున్న మట్టి పెంకులు వాడారు. ఇంట్లో బెడ్ నుంచి ప్రతీది వారి రూపకల్పనే. అలాంటి ఇళ్లు అక్కడ మరికొన్ని చూశాను. ఇంటి నిర్మాణాల్లో వారి ప్రతిభ చాలా వండర్ అనిపించింది. ► వందల కిలోమీటర్ల వాక్ ఒంటరిగా చేయడానికి మీ కుటుంబం ఒప్పుకుందా? ఇప్పుడు నా వయసు 54 ఏళ్లు. ఇన్నేళ్లకు ఓ ఉదయం లేచి సడెన్గా ఇంట్లోవారికి నా కల గురించి చెబితే వెంటనే సపోర్ట్ చేయరు. మొదటి నుంచి నా కుటుంబ సభ్యులకు నా ఇష్టాయిష్టాలేంటో తెలుసు. నేను చేస్తున్నపని తెలుసు. అలాగే, సొంతంగా తీసుకున్న నిర్ణయాల గురించి తెలుసు. వారితో నా రంగానికి సంబంధించిన విషయాలనూ చర్చిస్తూనే ఉంటాను. నా భర్త, నా కొడుకు కూడా నాతో కలిసి 200 కిలోమీటర్ల వరకు వచ్చారు. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోయారు. మా అమ్మ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్రమాదాల గురించి మనం భయపడినా, ఇంట్లో వాళ్లు ఆపేసినా ముందడుగు వేయలేం. గ్యాలియర్లో ఒక సైక్లింగ్ యాక్సిడెంట్లో కింద పడిపోయాను. కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉంటుందన్నారు. చేరాల్సిన గమ్యం ఇంకా 200 కిలోమీటర్లు ఉంది. బ్రేక్ వస్తుందేమో అనుకున్నాను. కానీ, పర్వాలేదు. 4–5 రోజుల్లో కోలుకుని, నా నడకను కొనసాగించాను. ► మీరు మారుమూల గ్రామాల్లోకి కూడా వెళ్లారు కదా... అక్కడి వారికి ఏం చెప్పారు? గ్రామాల్లో ఎవరైనా పిల్లవాడిని ‘భవిష్యత్తులో ఏమవుతావు’ అంటే ‘టీచర్’ అనే సమాధానం ఎక్కువ విన్నాను. అంటే, వాళ్ల కళ్ల ముందు రోజూ టీచర్ ఒకరే కనిపిస్తారు. మరో వృత్తి గురించి వారికి అంతగా తెలియదు. అందుకే, టీచర్లను కలిసి ఆర్కిటెక్చర్ వృత్తి గురించి, బిల్డింగ్ డిజైన్ గురించి పిల్లలకు చెప్పమని, వారిని ట్రెయిన్ చేయమని వివరించాను. ► మీరు రన్నర్ అని కూడా విన్నాం. ఈ వాక్కి మీరు ముందు చేసిన కార్యక్రమాలు..? 2014లో రన్నింగ్ స్టార్ట్ చేశాను. అంతకుముందు చిన్న చిన్న వ్యాయామాలు చేసేదాన్ని. అప్పటినుంచి 10 కిలోమీటర్ల వాక్, 20 కిలోమీటర్లు రన్, 30 కిలోమీటర్ల మారథాన్ చేశాను. ఇలా లాంగ్ వాక్ చేయడం మాత్రం మొదటిసారి. ఈ వాక్లో ఒక రోజు వాక్ అండ్ రన్, మరో రోజు వాక్. మిక్స్డ్గా చేశాను. రోజూ 20–30 కిలోమీటర్లు నడిచాను. ఈ వాక్ రాబోయే రోజుల్లో చేసే పనులకు ముందడుగు అనుకుంటున్నాను. ► ఆర్కిటెక్ట్గా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నవి..? ఈ వాక్ ఎక్స్పీరియన్స్ అంతా ఒక డాక్యుమెంటరీ చేయడానికి మరో 3–4 నెలల సమయం పడుతుంది. వాక్ గురించి కాకపోయినా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక... లలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నాను. దేశంలోని అన్ని జిల్లాలకు వెళ్లాలని, ఆర్కిటెక్చర్ రంగం గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఈ రంగంలోకి రావాలని, ప్రతిభ కనబరుస్తున్న స్టూడెంట్స్కి ఫెలోషిప్స్ ఇస్తూ ప్రోత్సహించాలి. ఎక్కడ ఆర్కిటెక్చర్ రంగంలో సమస్యలు ఉన్నాయో గుర్తించి, పరిష్కరిస్తూ వెళ్లాలనుకుంటున్నాను. – నిర్మలారెడ్డి -
Arthritis: నడక, సైక్లింగ్, నీళ్లలో ఏరోబిక్స్ చేస్తున్నారా..?
ఎస్ అంటే ‘స్టార్ట్ స్లో అండ్ గో స్లో : ఆర్థరైటిస్తో బాధపడేవారు డాక్టర్లు సూచించిన విధంగా తమకు అనువైన తేలికపాటి వ్యాయామాల్ని ప్రారంభించాలి. అతి మెల్లిగా మొదలు పెట్టి.. క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఎమ్ అంటే మాడిఫై యువర్ యాక్టివిటీ వెన్ ఆర్థరైటిస్ సింప్టమ్స్ ఇంక్రీజ్ : ఆర్థరైటిస్ లక్షణాల్లో ప్రధానమైనది కీళ్లనొప్పి. ఇది తరచూ వస్తూ పోతూ ఉంటుంది. నొప్పి వచ్చి, అది తీవ్రమైనప్పుడు బాధితులు చేసే ఆ వ్యాయామరీతులను వారి లక్షణాలకు తగ్గట్లుగా మార్చుకోవాలి. ఉదాహరణకు తీవ్రత పెరిగినప్పుడు వ్యాయామం చేసే వ్యవధినీ, వ్యాయామ తీవ్రతనూ తగ్గించుకోవాలి. దీనివల్ల నొప్పి మరింతగా పెరగకుండా చూసుకోవచ్చు. ఏ అంటే ఏక్టివిటీస్ షుడ్ బి జాయింట్ ఫ్రెండ్లీ: బాధితుల వ్యాయామాలు వారి కీళ్లకూ, కండరాలకు మరింత మేలు చేసేలా ఉండాలి. ఉదాహరణకు వ్యాయామాల్లోని తేలికపాటివి... అంటే నడక, సైక్లింగ్, నీళ్లలో చేసేవి బాధితులకు శ్రమ ఎక్కువగా కలిగించవు. పైగా అవన్నీ చాలావరకు స్వాభావికమైనవే. నీళ్లలో వ్యాయామాలు చేయడం వల్ల కీళ్లపై పడే శరీర బరువు బాగా తగ్గుతుంది. అందువల్ల నీళ్లలో ఏరోబిక్స్ కీళ్లకు మేలు చేసేవిగా (జాయింట్ ఫ్రెండ్లీ)గా ఉంటాయన్నమాట. ఆర్ అంటే రికగ్నైజ్ సేఫ్ ప్లేసెస్ అండ్ వేస్ టు బి యాక్టివ్: ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఎముకలు పెళుసుబారి ఉంటాయి. అందుకే అవి చిన్నపాటి శ్రమకు కూడా విరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే వ్యాయామం చేయడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా అవసరమే. ఉదాహరణకు పార్క్లో నడుస్తున్నప్పుడు... అక్కడి వాకింగ్ ట్రాక్ పగుళ్లు లేకుండా, స్లిప్ అవ్వడానికి అవకాశం లేకుండా సురక్షితంగా ఉండటం అవసరం. అలాగే చుట్టుపక్కల పెద్ద బండరాళ్లు ఉన్న ప్రదేశమైతే.. పొరబాటున పడిపోతే తలకు బలమైన గాయాలయ్యే అవకాశం ఎక్కువ. అలాంటివేవీ లేని సమతల ప్రదేశంలోనే వ్యాయామం చేయాలి. ఒకవేళ కాస్తంత సాయం సమయంలో చీకటిపడ్డప్పుడు వాకింగ్ చేస్తుంటే, అక్కడ తగినంత లైట్ల వెలుతురు ఉండేలా చూసుకోవాలి. టీ అంటే టాక్ టు హెల్త్ ప్రొఫెషనల్ : చిన్నవయసు ఆరోగ్యవంతులు కాకుండా... మరెవరు(అంటే కీళ్లనొప్పులు, గుండెజబ్బులు... వంటివి ఉన్నవారు) వ్యాయామాలు ప్రారంభించినా... ముందుగా ఓసారి వ్యాయామ నిపుణుడితోపాటు డాక్టర్ (లైఫ్స్టైల్ నిపుణులు లేదా ఆర్థో / గుండె / ఫిజీషియన్)ను సంప్రదించి, తమకు తగిన వ్యాయామాలేమిటో తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక (క్రానిక్) వ్యాధులతో బాధపడేవారు ఎలాంటి వ్యాయామాలు చేయాలో నిపుణులు మాత్రమే సూచిస్తారు. చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
10 కే స్టెప్స్.. ఇలా నడిస్తే ఎన్నో లాభాలు
కోవిడ్ వచ్చింది. మొదటి వేవ్, రెండో వేవ్, మూడో వేవ్... డెల్టాలు ఒమిక్రాన్లు... అన్నీ కలిసి మనిషి ఆరోగ్యంతోపాటు జీవనశైలిని కూడా తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఆన్లైన్ పాఠాలు, వర్క్ ఫ్రమ్ హోమ్లు షురూ అయిపోయాయి. డెస్క్ వర్క్ చేసేవారికి మామూలు రోజుల్లో కూడా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్లో తగినంత నడక లేక దేహానికి ఎప్పుడూ ఏదో ఒక సవాల్ ఉండేది. ఇప్పుడైతే ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే వ్యాయామం కూడా ఉండడం లేదు. దాంతో అనారోగ్యం అవకాశం కోసం పొంచి ఉన్న శత్రువులాగ ఉందనే చెప్పాలి. ఇందుకు టెన్ ఓ స్టెప్స్ సొల్యూషన్ను సూచిస్తున్నారు వైద్య నిపుణులు. 10 కే అంటే పది కిలోమీటర్ల దూరం కాదు, పది వేల అడుగులు. ►పదివేల అడుగుల లెక్క కోసం ప్రతి అడుగునూ లెక్కపెట్టుకోవాల్సిన పని లేదు. సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం నడిస్తే పదివేల అడుగులు పూర్తవుతాయని ఆరోగ్య జాగ్రత్తలతోపాటు అడుగుల లెక్క కూడా చెబుతోంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. పదివేల అడుగుల్లో ఏడు వేల అడుగులు మామూలు నడక, మూడు వేల అడుగులు మాత్రం బ్రిస్క్ వాక్ లేదా జాగింగ్ చేయాలి. బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు దేహం పక్కన ఫొటోలో ఉన్నట్లు నిటారుగా ఉంచి కింది పొట్ట, హిప్ కండరాలను బిగపట్టి, భుజాలను జారవేయకుండా వెనక్కు తీసుకుని ఛాతీని విశాలంగా ఉంచి నడవాలి. ►నడక ద్వారా మెదడు ఉత్తేజితమవుతుంది. కొత్త ఆలోచనల ప్రవాహం మొదలవుతుంది. మెదడులో అల్లిబిల్లిగా తిరుగుతూ చికాకు పెడుతున్న అనవసరపు విషయాలు పక్కకు వెళ్లిపోతాయి. సృజనాత్మకత మెరుగవుతుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్లు నడకను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ►మంచి నడక మంచి నిద్రకు దారి తీస్తుంది. మంచి నిద్ర దేహానికి పునఃశక్తినిస్తుంది. ►వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే మానసిక ఆందోళన, నిరాశపూరిత ఆలోచనలు దూరమవుతాయి. అయితే ఈ ఫలితం కోసం నడిచే నడక మామూలుగా ఉండకూడదు. క్విక్ వాక్ చేయాలి. ఇది దాదాపుగా పరుగును తలపిస్తుంది. ఈ నడకలో ఒకపాదం నేల మీద ఉంటే మరోపాదం దాదాపుగా గాల్లోనే ఉంటుంది. అలాగే నడక మీదనే ధ్యాస ఉంచాలి. పది నిమిషాల సేపు ఇలా నడిస్తే దేహం సాంత్వన ఫీలవుతుంది. యాస్పిరిన్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కలిగేటువంటి భావన అన్నమాట. ఇది ఎక్కువ గంటలు కొనసాగదు. కానీ రోజూ ఈ స్థితికి చేరడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ►నడకతో బ్లడ్ ప్రెజర్ క్రమబద్ధమవుతుంది. రక్తం రక్తనాళాల ద్వారా దేహంలోని అన్ని భాగాలకూ సక్రమంగా ప్రవహిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటే రక్తాన్ని పంప్ చేయడం అనే పనిని సులువుగా నిర్వర్తిస్తుంది. గుండె పని తీరు మందగిస్తే రక్తప్రసరణ వేగం కూడా తగ్గిపోతుంది. నడక గుండె కొట్టుకునే వేగాన్ని, లయను కూడా నిర్ధారిస్తుంది. ►నడిచేటప్పుడు దేహం ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. అంటే ఎక్కువ గ్లూకోజ్ను ఉపయోగించుకుంటుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయి. దేహంలో అనవసరమైన గ్లూకోజ్ నిల్వలు చేరవు. కాబట్టి అధికబరువు, ఒబేసిటీ సమస్యలకు కూడా నడకే ఔషధం. ►కరోనా కాలం ప్రతిఒక్కరినీ మానసికంగా ఆందోళనకు గురిచేసింది. ఇంట్లోనే ఉండి పని చేస్తున్నారనే కానీ, ఒంట్లో ప్రతి భాగమూ పరీక్షకు లోనవుతోంది. పరోక్షంగా గుండెను ప్రమాదంలో పడేస్తాయి. నడక ద్వారా కార్డియోవాస్కులర్ వ్యాధులు దరి చేరవనే విషయాన్ని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి కూడా. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్లు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వాళ్లు అందరూ నిరభ్యంతరంగా చేయగలిగిన వ్యాయామం నడక. ‘వాచ్’ చేస్తుంది శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అనే రెండు రకాల ప్రయోజనాలనిచ్చే నడక కోసం ఇక మీనమేషాలు లెక్కపెట్టవద్దు. నడవడానికి పాదానికి అనువైన షూస్ ధరించండి. పదివేల అడుగులకు దూరాన్ని ఎక్కడ నుంచి ఎక్కడికి మార్కు చేసుకోవడం అని ఆలోచించాల్సిన పని లేదు. సెండెంటరీ లైఫ్ స్టయిల్ను సవాల్ చేస్తూ వచ్చింది యాపిల్ వాచ్. మన కదలికలను లెక్క వేస్తుంటుంది. అడుగుల లెక్క చూపిస్తుంది. ఎన్ని కేలరీలు కరిగాయో కచ్చితంగా చెప్తుంది. మనకు కరభూషణంగా మారిన స్మార్ట్ ఫోన్లు కూడా ఈ పని చేస్తున్నాయి. -
అతనికి ఆ హాబీ ఉందని... ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన భార్య!!
wife bid for her husband to sell him online: ఆలు మగలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. ఇటీవల కాలంలో చాలా సిల్లీ విషయాలకే విడిపోవడం కూడా చూశాం. మరికొంతమంది అయితే చాలా తీవ్రంగా కొట్టుకుని ఒకరినోకరు గాయపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మహిళ కేవలం వాకింగ్కి వెళ్తున్నాడన్న కోపంతో భర్తని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. ఈ ఘటన న్యూజిలాండ్లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే..న్యూజిలాండ్కి చెందిన ఒక మహిళ తన భర్తను ఆన్లైన్లో విక్రయానికి పెట్టింది. తన భర్తకి వాకింగ్కి వెళ్లే హాబీ ఉందని, అందుకోసం తనని, పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడని చెబుతోంది. పైగా అతను పిల్లలను చూసుకోవలసినప్పుడల్లా వాకింగ్కి వెళ్లిపోతుంటాడని తెలిపింది. అయితే ఆమెకు తన భర్తతో గడపటం చాలా ఇష్టం అని, కానీ అతనెమో తనకు చెప్పకుండా వెళ్లిపోతాడని వాపోయింది. అందుకే ఆమె విసిగిపోయి ఈ పని చేసానని చెబుతోంది. ఈ మేరకు ఆమె తన భర్త అమ్మకానికి సంబంధించిన ప్రోఫైల్ని క్రియేట్ చేసి ఆన్లైన్ ట్రేడింగ్ సైట్లో ఉంచింది. పైగా యూజ్డ్ కండిషన్ అనే ట్యాగ్ని ఒకటి పెట్టి ప్రకటనలో..పొడవు 6 అడుగుల 1 అంగుళం...వయసు 37 ఏళ్లు. వృత్తి రీత్యా రైతు. బాగా చూసుకోడమే కాక నిజాయితీ పరుడు అని పేర్కొంది. అంతేకాదు అతన్ని ఎవరైన కొనుగోలు చేస్తే షిప్పింగ్ ఉచితం అని ఆఫర్ కూడా ఇచ్చేసింది. (చదవండి: ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!. అతని ఆహారం ఏమిటో తెలుసా?) -
బరువు పెరుగుతున్నా.. మానసిక చికాకులను ఆపడానికైనా అదే సరైన ఔషదం
బరువు పెరుగుతున్నట్టు అనిపించినా, మానసిక చికాకులను ఆపడానికైనా వ్యాయామం సరైన ఔషధంగా పనిచేస్తుంది. అందులోనూ కరోనా మహమ్మారి కాలంలో శరీరానికి తగినంత శక్తిని అందించడానికి కూడా వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుందని తెలిసిందే. ఇక నేడు, రోజూ 8–9 గంటల పాటు ఉద్యోగం చేసేవారు తమ జీవన శైలిలో విపరీతమైన మార్పులను చవిచూస్తున్నారు. వీటన్నింటికీ సరైన సమాధానం శారీరక శ్రమను కలిగించే వ్యాయామం. వర్క్ఫ్రమ్ హోమ్ అయ్యాక బెడ్రూమ్, లివింగ్ రూమ్లలో పనిచేసే కొత్త సంస్కృతి వచ్చి చేరింది. ఈ గదులు సౌకర్యంగా అనిపించినా, వారి ఆరోగ్యంపై కనిపించని ప్రభావం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చురుకుదనానికి.. నిద్రలో ఉన్నప్పుడు కూడా బరువు తగ్గడంలో సహాయపడే రోజువారీ అలవాటుగా వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. శరీరం తన శారీరక కదలికలను తగ్గించుకున్నప్పుడు రకరకాల సమస్యలు, వ్యాధులు ఎలాంటి హెచ్చరిక లేకుండా వచ్చి చేరిపోతాయి. అప్పుడు శరీరానికి పని లేకుండా గంటలతరబడి కూర్చోవడం వల్ల ఆరోగ్యం ఎలా పాడైందో గ్రహిస్తారు. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత మహిళలు శారీరక శ్రమ తగ్గితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం వల్ల గుండె సమస్యలు, మధుమేహం, కీళ్లనొప్పులు.. మొదలైన ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. నడకతో బలం కండరాలను బలపరచడంలోనూ, నిద్రను మెరుగుపరచడంలోనూ ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది నడక. అంతేకాదు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అలై్జమర్స్ ప్రమాదాన్ని నివారిస్తుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలపై జరిగిన ఒక అధ్యయనంలో ప్రతిరోజూ 30 నిమిషాల నడక వారి తుంటి పగుళ్ల ప్రమాదాన్ని 40 శాతం తగ్గించిందని గుర్తించారు. హార్వర్డ్ హెల్త్ రీసెర్చ్ ప్రకారం 70 కిలోలు ఉన్న వ్యక్తి 30 నిమిషాల పాటు (గంటకు ఆరున్నర కిలోమీటర్ల వేగంతో) నడిస్తే 167 కేలరీలు ఖర్చు చేస్తారని అంచనా వేశారు. హానికారకాలకు దూరం 30 నిమిషాల పాటు నడవడం సౌకర్యంగా ఉంటే నడకను సాధారణ జాగింగ్కు అప్గ్రేడ్ చేయవచ్చు. నడక కంటే జాగింగ్ ఇంకాస్త ప్రభావవంతంగా ఉంటుంది. ఇది హానికరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. వాకింగ్లాగానే జాగింగ్ చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ప్రారంభించడానికి ఒక జత బూట్లు ఉంటే చాలు. బరువును తగ్గించే సైక్లింగ్ సైక్లింగ్ చేయడం వచ్చినా మూడు పదుల వయసు దాటిన తర్వాత దానిని దాదాపుగా మూలన పడేస్తారు మహిళలు. కానీ, 30 ఏళ్ల తర్వాతనే సైక్లింగ్ వలన శరీరానికి మరిన్ని ప్రయోజనాలు అందుతాయి. హార్వర్డ్ హెల్త్ ఉదహరించిన ఒక పరిశోధనా ప్రకారం శారీరక శ్రమ, బరువులో మార్పులను అధ్యయనం చేయడానికి పరిశోధకులు 16 సంవత్సరాల పాటు 18,000 మందికి పైగా మహిళలను గమనించారు. వీరి అధ్యయనంలో వ్యాయామం చేయని మహిళలు సగటున 20 పౌండ్ల బరువు పెరిగారు. అదే రోజూ 30 నిమిషాలు సైక్లింగ్ చేసిన వారు 20 పౌండ్ల బరువు తగ్గారు. దీనివల్ల సైక్లింగ్ మిగతా వాటికన్నా అదనపు ప్రయోజనాలు ఇస్తుందని నిరూపించారు. మెరుగైన ఆనందానికి.. ఈత అనేది వినోదంతో పాటు ఆరోగ్యకరమైన చర్య. ఈత హృదయ స్పందన రేటును పెంచుతుంది. కండరాలను టోన్ చేస్తుంది. శరీరానికి మొత్తం వ్యాయామం అందిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి, ఇతర రకాల శారీరక శ్రమలు నొప్పిని తీవ్రతరం చేస్తాయి కానీ, ఈత మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది. ఆర్థ్రరైటిస్ ఉన్న వ్యక్తులకు కూడా ఈత ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. నీటి ఆధారిత వ్యాయామాల వల్ల కీళ్ల పనితనం మెరుగుపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం.. ఇది శారీరక శ్రమకు రూపం మాత్రమే కాదు. మానసిక ఒత్తిడిని నివారిస్తుంది. బరువును తగ్గించడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. యోగాలోని ధ్యానం అలై్జమర్స్ రాకుండా నిరోధించడమే కాదు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇతరులతో పోల్చితే యోగా చేసే వ్యక్తులు 43 శాతం తక్కువ వైద్య సేవలను ఉపయోగించుకుంటారని అధ్యయనాలు చూపుతున్నాయి. -
గాల్లో తాడుపై నడిచాడు.. ఇది మామూలు రికార్డు కాదు!
ఇది మామూలు రికార్డా.. ఇప్పటివరకూ ఎవరూ సాహసించనిది.. చూస్తున్నారుగా.. మైలు కన్నా ఎక్కువ ఎత్తులో.. రెండు హాట్ఎయిర్ బెలూన్ల మధ్య ఎలాంటి ఆధారం లేకుండా.. తాడుపై నడవడమంటే మాటలా మరి.. బ్రెజిల్కు చెందిన 34 ఏళ్ల రాఫెల్ జుగ్నోబ్రిడి ఈ అరుదైన ఫీట్ను సాధించాడు. (చదవండి: చరిత్ర సృష్టించిన పాలకొల్లు అమ్మాయి) బ్రెజిల్లో 6,131 అడుగుల ఎత్తులో అంగుళం వెడల్పున్న తాడుపై నడిచి.. సరికొత్త ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫా కంటే రెట్టింపు ఎత్తులో చెప్పులు లేకుండా నడిచి టైట్రోప్ వాక్లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. చాలెంజ్లంటే తనకెంతో ఇష్టమని.. చిన్న తప్పు జరిగినా.. ఇక అంతే అని తెలిసినప్పటికీ.. ఏకాగ్రతతో దీన్ని సాధించానని రాఫెల్ చెప్పాడు. (చదవండి: 15 సెకన్లలో ఏమైతది.. బస్సు రైలైతది.. అదెలా?) -
ట్రెడ్మిల్ మీద వాకింగ్! 12 గంటల్లో ఏకంగా..
లక్నో: సాధారణంగా చాలా మంది యువత.. సరైన శరీరాకృతి, ఆరోగ్యం కోసం జిమ్లలో వ్యాయామాలు చేస్తుంటారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రేడ్ మిల్, డంబెల్స్, సైక్లింగ్స్ మొదలైన ఎక్విప్మెంట్ ఉంటాయి. ఈ క్రమంలో వాటితో గంటల కొలది వ్యాయమం చేసి శరీరంలోకి కొవ్వును తగ్గించుకుంటారు. వీటిని జిమ్లో ట్రైనర్ సమక్షంలో చేస్తుంటారు. అయితే, యూపీకి చెందిన జైనూల్ అబేదిన్ అనే వ్యక్తికి జిమ్ చేయడం అంటే ఇష్టం. ఇతడిని గ్రామస్థులు ‘మొరాదాబాద్ ఎక్స్ప్రెస్’ అని పిలుస్తారు. ఇతనికి ట్రెడ్మిల్పై నడవటం అంటే ఎంతో ఇష్టం. తాజాగా, ఇతను ట్రెడ్మిల్పై 12 గంటలపాటు ఏకధాటిగా 66 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించాడు. దీంతో ప్రస్తుతం ఇతను వార్తల్లో నిలిచాడు. ఇతడి ట్రెడ్మిల్ విన్యాసాన్ని చూడటానికి జిల్లాల నుంచి అధికారులు పెద్దఎత్తున యూపీకి తరలివచ్చారు. ఈ క్రమంలో జైనూల్ను ఉత్సాహపరిచారు. గెలవగానే అతనిపై సభ్యులు పూలవర్శం కురిపించారు. ఇప్పటికే జైనూల్.. న్యూఢిల్లీలోని ఇండియాగేట్ నుంచి ఆగ్రా, జైపూర్కు ప్రయాణించి మరల ఢిల్లీ చేరుకున్నాడు. ఈ పోటీని ఇతను 7 రోజులు 22 గంటలలో పూర్తిచేశాడు. ఈ అరుదైన ఘనతతో.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. అదే విధంగా కరోనా లాక్డౌన్ కాలంలో పోలీసుల గౌరవార్థం 50 కిలోమీటర్లు నడక సాగించిన విషయం తెలిసిందే. -
KBR Park: కేబీఆర్ పార్కు టికెట్టు ధర పెంపు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): బంజారాహిల్స్లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్ ధరలను అటవీశాఖాధికారులు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1 నుంచి అమలు కానున్న ఈ ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్లను ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోవాలని నోటీసును అతికించారు. వార్షిక ఎంట్రీపాస్(జనరల్) 2021లో రూ. 2250 ఉండగా 2022 నుంచి రూ. 2500 చేశారు. అలాగే సీనియర్ సిటిజన్ వార్షిక ఎంట్రీ ఫీజు పాస్ కోసం గతంలో రూ. 1500 ఉండగా వచ్చే ఏడాది నుంచి రూ. 1700 వసూలు చేయనున్నారు.ఇప్పటి వరకు నెలవారి ఎంట్రీఫీజు రూ. 600 మాత్రమే ఉండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ. 700 ఉండనుంది. అలాగే రోజువారి ప్రవేశ రుసుము పెద్దలకు గతంలో రూ. 35 ఉండగా ఇప్పుడది రూ. 40కి చేరింది. పిల్లలకు మొన్నటి వరకు ఎంట్రీఫీజు రూ. 20 ఉండగా ఇప్పుడది రూ. 25కు చేరింది. అలాగే పార్కు వేళలను కూడా కుదించారు. ఉదయం 5 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే వాకింగ్, సందర్శకులకు అనుమతిస్తారు. చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్ -
OU: ఓయూ తీరుపై విమర్శలు.. ‘నడకకు రేటు కడితే ఎలా..?’
సాక్షి, హైదరాబాద్: దట్టమైన అడవిని తలపించే పచ్చిక బయళ్ల మధ్య ఉస్మానియా అందాలను ఆస్వాదిస్తూ నిత్యం వేలాది మంది చేసే వాకింగ్కు ఓయూ అధికారులు వెలకట్టారు. ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో భాగంగా సెక్యూరిటీ పేరుతో యూజర్ చార్జీల వసూలుకు పూనుకున్నారు. సినిమా షూటింగ్, వాకింగ్, జిమ్, గేమ్స్ ఇలా ప్రతిదానికి ఓ రేటు నిర్ణయించారు. దీనిపై యూనివర్సిటీలో నిత్యం వాకింగ్ చేసే ముషీరాబాద్, అంబర్పేట నియోజకవర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాస్తవానికి డిసెంబర్ ఒకటి నుంచే యూజర్ చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నప్పటికి మొదటి వారం తరువాత ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఓయూలో వాకింగ్.. మైమరిపించే అనుభూతి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల వారికి ఉస్మానియా ప్రకృతి ప్రసాదించిన వరం. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది తెల్లవారు జామున 5గంటల నుంచి ఉదయం 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇక్కడ వాకింగ్ చేసి సేద తీరుతుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, బీపీ, షుగర్ వ్యాధులున్న వారితో పాటు అధిక బరువుతో బాధపడేవారు డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేందుకు ఇక్కడకు వస్తుంటారు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల, మినీ టెక్, ఐపీఈల వెనుక దట్టమైన అడవిని తలపించే మార్గంలో వాకింగ్ చేయడం ఈ ప్రాంత వాసులకు మరిచిపోలేని అనుభూతి. పొద్దున్నే పురివిప్పి నాట్యం చేసే నెమళ్ల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే మైమరచిపోయే అనుభూతి కలుగుతుంది. సామాన్యులతో పాటు హర్యాణా గరవ్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, విద్యావేత్త చుక్కా రామయ్య ఇలా ఎంతో మంది ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు, ఉన్నతాధికారులు యూనివర్సిటీలో వాకింగ్ అనుభూతిని పొందినవారే. దీంతోపాటు ఓయూలోని ప్లేగ్రౌండ్స్లో వందలాది యువత క్రికెట్, వాలీబాల్, రన్నింగ్తో పాటు ఇతర ఆటలు ఆడుతూ క్రీడా స్ఫూర్తిని పొందుతున్నారు. భద్రత పేరుతో బాదుడు ఉస్మానియా యూనివర్సిటీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, భద్రత కరువైందని, నిర్మానుష్య ప్రాంతంలో పగలు, రాత్రి అనే తేడాలేకుండా ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారని.. దీనిని నియంత్రించాలనే ఉద్దేశంతోనే యూజర్ చార్జీల నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం పసలేదని వాకర్స్ కొట్టిపడేస్తున్నారు. యూనిర్సిటీలో గత కొన్నేళ్లుగా సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న పాతవారిని ఇటీవల తొలగించి రిటైర్డ్ ఆర్మీకి చెందిన వారికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. వారి జీతభత్యాలను సమకూర్చుకోవడం కోసమే యూజర్ చార్జీల ఆలోచనను తీసుకువచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మందికి ప్రతిరోజూ ఆరోగ్య ప్రధాయినిగా ఉన్న యూనివర్సిటీలో ఎంతో మంది ప్రాణవాయువు ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే వారినుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశి్నస్తున్నారు. ఒకరిద్దరు అసాంఘిక శక్తులు ఉంటే వారిని కట్టడి చేయాలని, గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు. కుటుంబంపై భారం నేను, నా భార్య ఎన్నో ఏళ్లుగా ఉస్మానియాలో వాకింగ్ చేస్తున్నాం. ఎప్పుడూ ఎటువంటి అభద్రతా భావం మాలో కలగలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా వాకర్స్కి మెరుగైన వసతులు కల్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు చేయడం అన్యాయం. కొంత మంది కుటుంబ సమేతంగా వాకింగ్ చేస్తారు. వారంతా నెలకు 1000 రూపాయలు వాకింగ్ కోసం చెల్లించాలంటే చాలా భారం అవుతుంది. అధికారులు ఈ నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలి. –కౌండిన్యా ప్రసాద్, వాకర్ స్వేచ్ఛగా గాలి పీల్చేందుకు ఆంక్షలా..? యూనివర్సిటీ దగ్గరగా ఉందనే ఈ ప్రాంతంలో ఇళ్లు తీసుకుని ఉంటున్నాం. ప్రతి రోజు క్రమం తప్పకుండా స్నేహితులతో కలిసి వాకింగ్ చేస్తుంటా. ఇప్పుడు అకస్మాత్తుగా యూజర్ చార్జీలు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదు. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలు అరికట్టాలంటే భద్రత పెంచి గస్తీని ముమ్మరం చేయాలి. అవసరం అనుకుంటే ఉచితంగా ఐడీ కార్డులను పంపిణీ చేయాలి. –ఎం.నర్సయ్య, వాకర్ -
ఓయూ క్యాంపస్లో యూజర్ చార్జీలు.. ఇకపై నో ఫ్రీ వాకింగ్
సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్లో వాకింగ్ కోసం వచ్చే బయటి వారినుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని వర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. క్యాంపస్ విద్యార్థులతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల నుంచి అనేక వందల మంది ప్రజలకు, క్యాంపస్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ మరియు యోగా వంటి ఫిట్నెస్ కార్యకలాపాలకు వస్తుంటారు. అయితే వాకర్స్కు యూనివర్సిటీ షాక్ ఇచ్చింది. డిసెంబర్ నెల నుంచి యూనివర్సిటి గ్రౌండ్లో వాకింగ్ చేసే వారి నుంచి 200 రూపాయల యూజర్ చార్జీలను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం క్యాంపస్లో స్విమింగ్పూల్, క్రికెట్ గ్రౌండ్ వాడుకునే వారి నుంచి యూజర్ చార్జీలు వసులు చేస్తున్నారు. అయితే బయటి వ్యక్తులు క్యాంపస్లోని వసతులను ఉచితంగా వాడుకోవడం వల్ల వాటి విలువ తెలియడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. పరిస్థితితులకు అనుకూలంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుపట్టలేమన్నారు. కొంతమంది క్యాంపస్కు పెంపుడు కుక్కలను తీసుకొచ్చి ఇక్కడే మలమూత్ర విసర్జన చేయించడాన్ని విద్యార్థులు తప్పు పడుతున్నారు. అంతేకాక చుట్టుపక్కల నివాసముండేవారు తమ కార్లను ఈ స్థలాన్ని పార్కింగ్స్థలంగా ఉపయోగించుకుంటున్నారు. రాత్రి వేళ అయితే క్రీడా మైదానాల్లో మద్యం తాగి..ఖాళీ సీసాలను పగులగొట్టి అలాగే వదలివేస్తారు. చదవండి: ‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’ వాకింగ్కు ప్రముఖులు హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, రాంచందర్రావు, పలువురు విద్యావేత్తలు, విద్యా సంస్థల యజమానులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ తదితరులు వాకింగ్కు వస్తారు. వీరి భద్రత కూడ యూనివర్సిటీ చూసుకోవలసి ఉంటుంది. వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది వ్యక్తులు కూడా క్యాంపస్లో తిరుగుతుంటారు. ఎవరు ఎందుకు వస్తున్నారో తెలుసుకునే అవకాశం లేదు. అందుకోసం యూనివర్సిటీ అధికారులు క్యాంపస్లోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. చదవండి: హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. సందిగ్ధంలో ప్రయాణికులు -
గుండెపోటుతో మాజీ ఉపాధ్యక్షుడి మృతి
సాక్షి, రాయచూరు(కర్ణాటక): రాయచూరు నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నేత దొడ్డమల్లేశ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం వాకింగ్ వెళ్లే సమయంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. రెండుసార్లు నగరసభ సభ్యుడిగా, బీజేపీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల నగరసభ అధ్యక్షుడు వినయ్కుమార్, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
మీకు తెలుసా.. వృద్ధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుంది!
Health Benefits Of Walking- Interesting Facts: వృద్ధాప్యంలో భాగంగా మన జుట్టు బూడిదరంగులోకి మారడం, ముఖంపై ముడతలు పడటం, చర్మం పొడిగా మారడం వంటి సంకేతాలు సర్వసాధారణం. అయితే వాటి గురించి మనం భయపడకూడదు. కానీ మనం కేవలం రెండు వారాల పాటు కాళ్ళను కదపకపోతే, కాళ్ళ బలం 10 సంవత్సరాలు తగ్గుతుంది. అది అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అందుకే నడవడం అనే తేలికపాటి వ్యాయామాన్ని అలవాటు చేసుకుంటే వృద్ధాప్యాన్ని వాయిదా వేయవచ్చు. వృద్ధులయితే, వారి వృద్ధాప్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. రోజూ 30 నిమిషాలు లేదంటే.. నడక అనేది.. తీవ్రత మధ్యస్థంగా ఉండే వ్యాయామం కిందకు వస్తుంది. వారానికి కనీసం 150 నిమిషాలు చురుకైన నడక వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం పెద్దగా ప్రయాస పడవలసిన అవసరం లేదు. మొదట సాధారణ నడకతో ప్రారంభించి, క్రమంగా నడిచే సమయాన్ని, తీవ్రతను పెంచుకోవచ్చు. ►ఒక వ్యక్తి వారానికి ఐదు రోజుల పాటు.. రోజూ 30 నిమిషాలు లేదా ఖాళీ సమయాల్లో 10 నిమిషాల చొప్పున నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చునని క్లినిక్ నిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణ వ్యక్తులు ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల నడక ద్వారా మంచి వ్యాయామ ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ►నిమిషానికి 80 అడుగుల నడకను సాధారణ వేగంగా.. నిమిషానికి వంద అడుగులను మధ్యస్థం నుంచి చురుకైన వేగంగా పరిగణించాలి. నిమిషానికి 120 అడుగులను ఎక్కువ వేగంగా గుర్తించవచ్చు. అయితే అసలు ఇలాంటి లెక్కలతో సంబంధం లేకుండా, చురుగ్గా నడవడంపై దృష్టి పెట్టడం మంచిది. ►నడక .. పగటిపూట ఎక్కువగా కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. స్నేహితులతో కలిసి వాకింగ్కు వెళ్లడం, లేదా పెంపుడు కుక్కలను పక్కన తీసుకెళ్లడం వల్ల ఎక్కువ దూరం నడవగలుగుతారు. ►డెన్మార్క్లోని కోపెన్హాగన్ విశ్వవిద్యాలయం వారు జరిపిన ఒక అధ్యయనంలో వృద్ధులు – యువకులు, రెండు వారాల పాటు నడవకుండా ఉండటం వల్ల వారి కాళ్ల కండరాలు బలహీనపడ్డట్లు తెలిసింది. ►మన వయస్సు పెరుగుతున్నప్పుడు, వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన పాదాలు ఎల్లప్పుడూ చురుకుగా – బలంగా ఉండాలి. మీకు తెలుసా? ►వృద్ధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుంది! ►పాదాలు ఒక రకమైన స్తంభాలు. అవి మానవ శరీరం మొత్తం బరువును భరిస్తూ ఉంటాయి. ►ఒక వ్యక్తి చిన్న వయస్సులో ఉన్నప్పుడు, అతని/ఆమె తొడలు 800 కిలోల చిన్న కారును ఎత్తడానికి తగినంత బలాన్ని కలిగి ఉంటాయి! ►పాదాలు శరీరాన్ని కలిపే అతి పెద్ద ప్రసరణ నెట్వర్క్. నడక వల్ల నెట్వర్క్ బాగా పని చేస్తుంది. కాబట్టి నడవండి. ►ఒకవేళ మీ పాదాలు ఆరోగ్యంగానే ఉన్నాయనుకోండి... నడవడం వల్ల పాదాల నుంచి శరీరానికి రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది, ►కాళ్లను బలోపేతం చేయడం ద్వారా, వృద్ధాప్యాన్ని కొంత కాలం వాయిదా వేయవచ్చు. కాలి కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి రోజూ కనీసం 30–40 నిమిషాలు నడిస్తే చాలు. చదవండి: Flax Seeds: కాయగూరలు, చేపలతోపాటు అవిసె గింజలు కలిపి తింటే.. -
తలపాగే ప్రాణాలను కాపాడింది
కెనడా: మనం వెళ్లున్నప్పుడో లేక ఎక్కడకైన వెళ్లినపుడు అనుకోకుండా అప్పటి వరకు మనతో ఉన్న వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే మనకు ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్లను ఏ విధంగా రక్షించాలన్న ఆలోచనతో గందరగోళంలోకి వెళ్లిపోతాం. మహా అయితే ఎవరినైన సాయం చేయమని అడుగుతాం తప్ప మన వరకు మనం ఏదైనా చేయగలమా అన్న ఆలోచనే స్ఫూరించదు. కానీ కెనడాలోన ఒక పార్కులోని ఇద్దరూ వ్యక్తులు పార్క్ దగర ఉండే నీటిలో పడిపోతే వారిని ఐదుగురు సిక్కులు తమ వద్ద రక్షించేందకు కావల్సినవి ఏమి లేకపోయినప్పటికీ వాళ్లు తలపాగనే తాడుగా చేసి మరీ వాళ్లను కాపాడతారు. (చదవండి: బీరు’బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు) వివరాల్లోకెళ్లితే....కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని గోల్డెన్ ఇయర్స్ ప్రావిన్షియల్ పార్క్లో కుల్జీందర్ కిండా అనే అతను తన స్నేహితుడితో కలిసి వాకింగ్ చేస్తూ అనుకోకుండా ఇద్దరూ అక్కడ ఉన్న జారుడు బడ్డ మీద నుంచి సమీపంలోని జలపాతంలోకి పడిపోతారు. దీంతో ఆ పార్క్లో ఉన ప్రజలు ఇద్దరూ వ్యక్తులు ఎవరో పడిపోయారు కాపాడంటూ అని అరుస్తారు. అటుగా వాకింగ్ చేస్తూ వస్తున్న ఐదుగురు సిక్కు స్నేహితులు ఏం జరిగిందని అక్కడి వాళ్లని అడిగి తెలుసుకుంటారు. ఈ మేరకు వాళ్లను ఏ విధంగా రక్షించాలో మొదట వాళ్లకు అర్థం కాలేదు . ఇంతలో తమ తలపాగనే తాడుగా చేసి రక్షింద్దాం అనే నిర్ణయానికి వస్తారు వాళ్లు. ఈ క్రమంలో ఆ ఐదుగురు స్నేహితులు తమ తలపాగలను, ఆఖరికి తమ దుస్తులను కూడా జత చేసి తాడుగా మార్చి వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. కొతసేపటి వాళ్లు సురక్షితంగా బయటపడతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఏమి ఆలోచన మీది, మీరు చాలా గ్రేట్ అంటూ రకరకాలుగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు (చదవండి: ఏంటీ....స్నేక్ కేక్ ఆ!) A video of the incident on Monday, in which five Sikh hikers tied their dastaars (turbans) together to save a man who had slipped and fallen at the Lower Falls at Golden Ears Park. Video courtesy @globalnews Kudos to these young men on their quick thinking and selflessness. pic.twitter.com/XQuX27OH5i — Sikh Community of BC (@BCSikhs) October 16, 2021 -
వరల్డ్ కార్ ఫ్రీ డే: ఈ విశేషాలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: రోజుకు రోజుకు కాలుష్యం పెను భూతంలా విస్తరిస్తోంది. విచ్చలవిడిగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు భూతాపాన్ని మరింత పెంచేస్తున్నాయి. ఫలితంగా ఈ భూ ప్రపంచంపై మానువళి మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ పెను ముప్పుపై అవగాహన కల్పించేందుకు వచ్చిందే వరల్డ్ కార్ ఫ్రీ డే. ప్రతీ ఏడాది సెప్టెంబర్ 22 న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ విశేషాలేంటో మీకోసం వరల్డ్ కార్ ఫ్రీ డే. అంటే వాహనదారులు ఈ ఒక్కరోజు కార్లను పక్కనపెట్టేసి మన కాళ్లకు పని చెప్పడన్నమాట. నడుచుకుంటూ వెళ్లడమో లేదంటే ఎంచక్కా సైకిళ్లనో, లేదా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం. తద్వారా పర్యావరణ వాయు కాలుష్యంపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం. దీని వల్ల కలిగే ప్రయోజనాలను హైలైట్ చేసేలా ప్రతీ ఏడాది ఈ డేను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) అధికారిక వెబ్సైట్ ప్రకారం ఆ ఈవెంట్ పౌరులకు కారులేకుండా వెళ్లడాన్ని పోత్సహిస్తుంది. సురక్షితమైన వాతావరణంలో నడక సైక్లింగ్ను ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. ఫ్రాన్స్లోని పారిస్లో సెప్టెంబర్ 2015న ఈ డేను పాటించగా ఉద్గార ప్రభావం 40 శాతం తగ్గిందట.ముఖ్యంగా మనం రోజూ వాడే కార్లు, బైక్స్ నుంచి విడుదలయ్యే ఉద్గారాలు మొత్త కాలుష్యంలో 8శాతాన్ని ఆక్రమించాయంటేనే కాలుష్యతీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 1990ల నుండి ఐస్ల్యాండ్, యూకే మొదలైన దేశాలలో ఈ డేనునిర్వహిస్తుండగా, 2000లో కార్బస్టర్స్ (వరల్డ్ కార్ఫ్రీ నెట్వర్క్) ప్రారంభించిన వరల్డ్ కార్-ఫ్రీ డేతో ఈ ప్రచారం ప్రపంచవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా ఆయా సిటీ ప్లాన్లరు, రాజకీయ నాయకులు దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2007లో, ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా, తన మొదటి కార్-ఫ్రీ డేని నిర్వహించింది. అంతేకాదు మే 2012 నుండి జకార్తాలో ప్రతి ఆదివారం కార్ రహిత దినోత్సవం నిర్వహించడం విశేషం. -
కోవిడ్ తర్వాత వాకింగ్ బెటరా? జాగింగ్ బెటరా?.. క్యాలరీల ఖర్చు ఎలా?
కరోనా తర్వాత వ్యాయామం ఆవశ్యకతను అందరూ చెబుతున్నారు. కానీ అధిక శ్రమతో కూడిన వ్యాయామం కంటే వాకింగ్ బెటర్ అంటున్నారు నిపుణులు. ‘కోవిడ్ ప్రధానంగా ఊపిరితిత్తులనూ, గుండెనూ దెబ్బతీస్తుంది. కాబట్టి... కరోనా అనంతర వ్యాయామం అంత కఠినంగా ఉండకూడదు’ అన్నదే వారి అభ్యంతరం. ఈ నేపథ్యంలో వ్యాయామ నిపుణులు, జీవనశైలి డాక్టర్లు ‘నడక’ను ఉత్తమమైన వ్యాయామంగా సూచిస్తున్నారు. కొందరికి ‘నడక’ ఓ వ్యాయామంగా రుచించదు. ఎందుకంటే దానితో త్వరగా కండరాలు ఫిట్గా అయినట్లు అనిపించకపోవడం, బరువు తగ్గడమనే ఫలితం అంత వేగంగా కనిపించకపోవడం లాంటివి వారిని ‘నడక’వైపునకు నడిపించవు. అయితే కోవిడ్ తర్వాత ‘నడకే’ అత్యంత ఉత్తమమైన వ్యాయామమనీ, అది మిగతా వ్యాయామాలకు ముందుమెట్టు అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం. ప్రశ్న: వ్యాయామం ఫలితాలు కండలు తిరగడం, కండరాలు బలంగా మారడం రూపంలో కనిపిస్తాయి. ఫిట్నెస్ తెలుస్తుంది. అయితే ఎంతగా నడిచినా ఆ ఫలితాలు ‘నడక’లో కనిపించవు కదా? జవాబు: నడకతో చక్కటి ఫిట్నెస్ ఫలితాలు కనిపిస్తాయి. వాకింగ్ తర్వాత సాధించిన ఫిట్నెస్ను పరీక్షించేందుకు పరీక్ష పెట్టుకోవచ్చు. అదేమిటంటే.. నడక మొదలు పెట్టడానికి ముందు 1 కిలోమీటర్ నడవడానికి ఎంత టైమ్ పట్టిందో, అదెంత సులువుగా జరిగిందో చూసుకోవాలి. కనీసం మూడు వారాల పాటు ‘నడక’ వ్యాయామం చేశాక... అదే కిలోమీటర్ నడవడానికి ఎంత సమయం పడుతోంది చూసుకోవచ్చు. సాధించిన ఫిట్నెస్ తెలుసుకోడానికి ఈ కింది ఛార్ట్ ఉపయోగపడుతుంది. ► వయసు 30 లోపు అయితే 1 కిలోమీటర్ నడకకు 10 నిమిషాలు చాలు. ► 30 నుంచి 39 లోపు... 1 కిలోమీటర్ నడకకు 12 – 13 నిమిషాలు. ► 40 నుంచి 49 లోపు... 1 కిలోమీటర్ నడకకు 15 నిమిషాలు. ► 50 నుంచి 69 లోపు... 1 కిలోమీటర్ను 18 నిమిషాల్లో నడిస్తే మంచి ఫిట్నెస్ ఉన్నట్లే. ► 70 – అంతకు పైబడ్డవారు 20 – 25 నిమిషాల్లో 1 కి.మీ. నడిస్తే మంచి ఫిట్నెస్తో ఉన్నట్టు లెక్క. ► కండరాలు పైకి కనిపించకపోయినా... స్టామినా, సామర్థ్యం ఇలా చక్కగా కనిపిస్తాయి. ప్రశ్న: రన్నింగ్తో పోలిస్తే వాకింగ్లో క్యాలరీలు అంతగా బర్న్ కావు కదా. జవాబు : అవును... నడక కంటే రన్నింగ్లో బర్న్ అయ్యే క్యాలరీలు ఎక్కువే. కానీ ఒకరు ఎంత దూరం పరుగెత్తగలరు? ఆ పరుగును ఎంత సేపు కొనసాగించగలరు. అదే నడక అయితే... ఒక నిర్ణీత వేగంతో ఎంతదూరమైనా ఆగకుండా నడవవచ్చు. అసలు వాస్తవాన్ని పరిశీలిద్దాం. ఒక గంట పాటు జాగింగ్ చేస్తే 700 క్యాలరీలు బర్న్ అవుతాయి. అదే బ్రిస్క్ వాకింగ్లో (వేగంగా నడిస్తే) గంటలో 600 క్యాలరీలు బర్న్ అవుతాయి. కానీ... ఓ స్థాయి ప్రాక్టిస్, ఫిట్నెస్ తర్వాత... ఆ నడకను ఎంతసేపైనా అలాగే కొనసాగించవచ్చు. ఫలితంగా సమయం పెరుగుతున్నకొద్దీ ఇలా వాకింగ్తో బర్న్ అయ్యే క్యాలరీలే ఎక్కువ. ప్రశ్న : బాగా పెద్ద వయసు వారు నడక అనే ఈ వ్యాయామాన్ని చేయడం మంచిదేనా? పైగా కరోనా వచ్చి తగ్గాక వారిలోని ఫిట్నెస్, వ్యాయామ సామర్థ్యాలు మరింత తగ్గుతాయి కాబట్టి ఆ వయసువారికి నడక మంచిదేనా? జవాబు : ఎంత పెద్ద వయసు వారైనా... వారు నడవగలిగే శక్తిసామర్థ్యాలతో ఉన్నప్పుడు నడక వ్యాయామాన్ని కొనసాగించడమే మంచిదే. అది వారి గుండె పనితీరు సామర్థ్యాన్ని పెంచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒంట్లోని చక్కెర పాళ్లను అదుపులో ఉంచుతుంది. ఒళ్లునొప్పులను తగ్గిస్తుంది. నడకలో తమ వయసువారిని కలిసి కాసేపు సంభాషించడం, పిచ్చాపాటీ మాట్లాడటం వంటి ప్రక్రియల వల్ల సామాజిక బంధాలు పటిష్టంగా మారవడంతో పాటు, వారి మానసిక ఆరోగ్యమూ బాగుంటుంది. ప్రశ్న: వాకింగ్ అంటే ఉదయం పూటేనా? జవాబు: నడక ఏ సమయంలోనైనా మంచిదే. సాధారణంగా అందరూ ఉదయం పూట నడక తర్వాత రోజువారీ పనుల్లో మునిగిపోతారు. ఈ సౌలభ్యం కోసమే ఉదయం వేళలను ఎంచుకుంటారు. నడవాలనిపించినప్పుడు ఏ వేళల్లో నడిచినా ఫలితాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే పగటివేళ సూర్యకాంతిలో నడిస్తే... అదనంగా విటమిన్–డి కూడా దొరుకుతుంది. ప్రశ్న: నడుస్తున్నప్పుడు ఎంతగా చెమట పడితే అంతగా కొవ్వు కరుగుతుందా? జవాబు : చెమట పట్టడం విషయంలో ప్రతివ్యక్తికీ తేడాలుంటాయి. కొందరికి కొద్దిపాటి శ్రమకే చాలా త్వరగా, చాలా ఎక్కువగా చెమటలు పట్టవచ్చు. మరికొందరిలో దీనికి భిన్నంగా ఉండవచ్చు. ఎంత వేగంగా /ఎంత దూరం నడిస్తే అన్ని క్యాలరీలు దగ్ధమై కొవ్వు తగ్గుతాయి. అంతేతప్ప... చెమటకూ, కొవ్వుకూ సంబంధం ఉండదు. ప్రశ్న: ఎంత వాకింగ్ చేసినా ఓ పట్టాన బరువు తగ్గదు. వేగంగా బరువు తగ్గాలంటే బరువైన వ్యాయామాలు మంచివి కదా. జవాబు : బరువులెత్తడం, బరువైన వ్యాయామాలు చేయడం వల్ల వేగంగా బరువు తగ్గినట్లుగా అనిపించవచ్చు. కానీ వ్యాయామంలో కొద్దిగా గ్యాప్ వచ్చినా మళ్లీ వేగంగా బరువు పెరగవచ్చు. కానీ వాకింగ్తో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతుంది. ప్రతి రోజూ 40 నిమిషాలకు తగ్గకుండా వారంలో కనీసం 5 రోజులైనా నడుస్తూ ఉంటే... అనారోగ్యకరమైన కొవ్వు కరుగుతుంది. తప్పక బరువు తగ్గుతారు. నడక సహాయంతో బరువు తగ్గాలనుకునేవారు మంచి సమతుల ఆహారమూ తీసుకోవడం అవసరం. ఇలాంటివారు కార్బోహైడ్రేట్స్, కొవ్వులున్న ఆహారాన్ని తగ్గించి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. అలాగే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా బరువు తగ్గడం అన్నది హైబీపీ నివారణకూ, గుండెజబ్బుల అదుపునకూ, మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రశ్న : ఇప్పుడు కరోనా వచ్చి తగ్గినవారు ఆరుబయట నడవటం కంటే ట్రెడ్మిల్ మీద నడవడమే మంచిదా? జవాబు: ఒకే వేగంతో ఒకే రకమైన సర్ఫేస్ మీద నడవడానికి ‘ట్రెడ్మిల్’ ఉపయోగపడుతుంది. ఎగుళ్లూ దిగుళ్లూ లేకుండా చూస్తుందంతే. నడక ఎక్కడైనా మంచిది. అయితే ఆరుబయటి ఉపరితలం అన్నిచోట్లా, అన్నివేళలా అంతే సమంగా ఉండకపోవచ్చు. వాతావరణం ఆహ్లాదంగా, ఆరోగ్యకరంగా బాగా ఉండి సర్ఫేస్ సమతలంగా ఉంటే అది ట్రెడ్మిల్ కంటే మంచిదే. కానీ ఇప్పుడున్న కరోనా నేపథ్యంలో ఆరుబయటి వాతావరణం అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఇంకా కొంతకాలం పాటు ట్రెడ్మిల్ అయితేనే మంచిది. ఎక్కడ నడవాలన్నది కేవలం పర్సనల్ ఛాయిస్. డా. సుధీంద్ర ఊటూరిలైఫ్స్టైల్ మెడిసిన్ స్పెషలిస్ట్ -
త్రిపుర సీఎంపై హత్యాయత్నం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వాకింగ్కు వెళ్లినప్పడు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఆయనని ఢీకొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాస్త ఆలస్యంగా ఆ ఘటన వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు. హత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బిప్లవ్ కుమార్ తన అధికారిక నివాసమైన శ్యామ్ప్రసాద్ ముఖర్జీ లేన్కి సమీపంలో గురువారం ఈవెనింగ్ వాక్కి వెళ్లారు. ఆయన చుట్టూ భద్రతా వలయం ఉన్నప్పటికీ వారి మీదుగా హఠాత్తుగా ఒక కారు దూసుకువచ్చింది. కారు రావడాన్ని గమనించిన బిప్లవ్ పక్కకి జరగడంతో పెను ముప్పు తప్పింది. అయితే ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. ఆ కారుని పట్టుకోవడానికి సీఎం భద్రతా సిబ్బంది విఫలయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు గురువారం అర్ధరాత్రి కారుని, అందులో ఉన్న ముగ్గుర్ని అదుపులోనికి తీసుకున్నారు. వారి వయసు సుమారుగా 20 ఏళ్లు ఉంటుంది. వారు ఎందుకు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారో కారణాలు ఇంకా తెలియలేదు. కోర్టు ఎదుట వారిని హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
యువ ఇంజనీర్ నిర్వాకం.. బర్త్డేను గ్రాండ్గా జరుపుకోవాలని..
న్యూఢిల్లీ: సాధారణంగా చాలా మంది తమ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకోవడానికి ఇష్టపడుతుంటారు. దీని కోసం అనేక ప్లాన్లు వేస్తుంటారనే విషయం తెలిసిందే. ఒక మంచి హోటల్లో బంధువులు, స్నేహితులను పిలిచి వారి మధ్య బర్త్డే వేడుకలను గ్రాండ్గా జరుపుకొని తమ రిచ్నేస్ను చూయించుకోవాలనుకుంటారు. అయితే, ఇక్కడో యువ ఇంజనీర్ కూడా.. తన జన్మదినాన్ని గ్రాండ్గా సెలబ్రెట్ చేసుకోవాలనుకున్నాడు. అయితే, దీని కోసం ఆ ప్రబుధ్దుడు మాత్రం చోరీల బాటపట్టాడు. ఈ సంఘటన ఢిల్లీలోని మన్సరోవర్ పార్క్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఢిల్లీకి చెందిన ఒక మహిళ ప్రతిరోజు మన్సరోవర్ పార్క్కు వాకింగ్కు వెళ్తుండేది. ఈ క్రమంలో.. గడిచిన శుక్రవారం రోజు మహిళ వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని యువకుడు ఆమెను అనుసరించాడు. ఒక్కసారిగా ఆమెపై దాడిచేసి, బలవంతంగా చెవిరింగులను లాక్కొని అక్కడి నుంచి బైక్పై పరారయ్యాడు. దీంతో, ఆమె షాక్కు గురయ్యింది. ఆ తర్వాత తేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆగంతకుడు ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పార్క్ పరిధిలోని 30 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆగంతకుడు ముఖానికి మాస్క్ ధరించి ఉండటం.. బైక్కు నంబర్ ప్లేట్ లేకపోవడం వలన నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. నిందితుడి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గస్తీని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో.. గత ఆదివారం రోజున పార్క్ పరిసరాల్లో ఒక యువకుడు నంబర్ప్లేట్లేని బైక్తో ఉండటాన్ని గస్తీ పోలీసులు గమనించారు. అతని కదలికలు అనుమానస్పదంగా ఉన్నాయి. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో అతగాడు.. తన పేరు గౌతమ్ అని.. షాహదారాలోని జ్యోతి నగర్లో ఉంటానని తెలిపాడు. కాగా, బీఎస్ఈఎస్లో జూనియర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా, తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్గా జరుపుకోవడం కోసమే చోరికి పాల్పడినట్లు అంగీకరించాడు. చోరి చేసిన బంగారాన్ని ఒక దుకాణంలో అమ్మేసినట్లు తెలిపాడు. దీంతో గౌతమ్పై పలు సెక్షన్ల కింది కేసుల నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. -
ఫిట్నెస్ డ్రోన్స్ వచ్చేస్తున్నాయ్.. సమస్యలూ లేకపోలేదు!
ఇప్పటివరకు డ్రోన్స్ అంటే మిలటరీలో వాడతారని, అమెరికా లాంటి దేశాల్లో సరుకుల డెలివరీకి వాడతారని, మనదగ్గరైతే ఫొటోషూట్స్ కోసం వాడతారని తెలుసు. కానీ త్వరలో పర్సనల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ రంగంలో డ్రోన్స్ కాలుమోపనున్నాయి. ఫిట్నెస్ డ్రోన్లతో రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జాగోబోట్ పేరిట కొన్ని నమూనాలు ఫిట్నెస్ రంగంలో హల్చల్ చేస్తున్నాయి. మెల్బోర్న్కు చెందిన ఎక్సర్షన్ గేమ్స్ ల్యాబ్ 2012లోనే దీన్ని సృష్టించింది. ఈ డ్రోన్ జాగింగ్ చేసేవారు ధరించే టీషర్ట్పై ఉండే ప్రత్యేక మార్కర్ను గుర్తించి దానికి పదడుగుల దూరంలో ఎగురుతూ ఉంటుంది. జాగింగ్లో దీన్ని తోడుగా కొందరు భావిస్తే, కొందరు పేసర్గా వాడుకుంటున్నారు. అయితే ఎక్కువమంది దీన్ని జాగింగ్లో స్నేహితుడిగా భావించడమే ఆశ్చర్యాన్నిస్తోందని దీని సృష్టికర్త ముల్లర్ చెప్పారు. మనిషి సంఘజీవి అని, ఒంటరిగా ఎక్కువసేపు ఉండడం ఎక్కువమందికి చేతకాదని వివరించారు. అందుకే చాలామంది ఫ్రెండ్స్తో, కుటుంబసభ్యులతో లేదా పెంపుడు కుక్కతో జాగింగ్కు వెళ్తుంటారన్నారు. ఇప్పుడు అంతా మెకానికల్ లైఫ్ అవుతున్న దశలో సరైన జాగింగ్ పార్టనర్ దొరకడం కష్టమవుతోంది. అలాంటివారికి జాగ్బాట్ స్నేహితుడిలా ఉపయోగపడుతోంది. పరిమితులున్నాయి హాలీవుడ్ సినిమాల్లోలాగా జాగ్బాట్ అన్నీ చేసేయదు. దీనికి కొన్ని పరిమితులున్నాయి. దీంతో జాగింగ్ చేయాలంటే సరళమార్గాల్లోనే పరుగెత్తాలి. అలాగే దీని బ్యాటరీ లైఫ్ 30 నిమిషాలే ఉంటుంది. ఈ లోటుపాట్లను అర్ధం చేసుకొని మరికొన్ని కంపెనీలు మరింత ఉన్నత సాంకేతికతతో కూడిన ఫిట్నెస్ డ్రోన్ల తయారీకి ముందు కొస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన హాంగిక్ యూనివర్సిటీ విద్యార్థ్ధులు తాజాగా ట్రావెర్స్ డ్రోన్ పేరిట కొత్త నమూనా రూపొందించారు. కొత్తగా వ్యాయామాలు మొదలెట్టేవారికి పర్సనల్ ట్రైనర్గా వ్యవహరించడం దీని ప్రత్యేకత. ఇందుకోసం దీనిలో అనేక కెమేరాలు, సెన్సర్లు అమర్చారు. డ్రోన్ వాడే కస్టమర్లు చిన్న పాడ్ లాంటిదాన్ని మెడలో వేసుకుంటే సరిపోతుంది. దీనిద్వారా డ్రోన్ కంట్రోల్స్ను మార్చుకోవడంతో పాటు, వాయిస్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. త్వరలో దీన్ని ఉత్పత్తి దశకు తెచ్చే యత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఎలక్ట్రానిక్ ట్రైనింగ్ యంత్రాల సాయం దివ్యాంగులకు మరింత ఎక్కువ ఉపయుక్తమని రిసెర్చర్లు భావిస్తున్నారు. ఈ దిశగా రోబోటిక్స్ రిసెర్చ్ ల్యాబ్ బ్లైండ్ రన్నర్లకు సహాయకారిగా ఉండే డ్రోన్లను రూపొందించింది. – డి. శాయి ప్రమోద్ సమస్యలు కూడా ఉన్నాయి ఇలాంటి యంత్రాల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ప్రతిధ్వని సమస్య. ఒక గదిలో వ్యాయామాలు చేస్తున్నప్పుడు డ్రోన్ కు ఇచ్చే వాయిస్కమాండ్ గదిలో ప్రతిధ్వనిస్తే డ్రోన్ కరెక్ట్గా గ్రహించలేదు. అలాగే బయట వాతావరణంలో పలు శబ్దాల మధ్య మన గొంతును కచ్ఛితంగా గుర్తుపట్టడం కూడా డ్రోన్ కు సమస్యే!. ఇక మరో అతిపెద్ద సమస్య డ్రోన్ తో ఢీ కొనడం! బ్లైండ్రన్నర్లు పరిగెత్తే సమయంలో డ్రోన్ మూవ్మెంట్ మొరాయిస్తే ఈ సమస్య ఎదురవుతుంది. అలాగే దీర్ఘకాలిక బ్యాటరీ శక్తిని సమకూర్చడం కూడా అవసరం. ఈ సమస్యలకు పరిష్కారాల కోసం పరిశోధకులు యత్నిస్తున్నారు. ఇక ఫిట్నెస్ డ్రోన్లంటే కేవలం జాగింగ్, రన్నింగ్కు మాత్రమే సాయం చేస్తాయనుకుంటే పొరపాటే! పలు యూరోపియన్ సాకర్ టీమ్లు ప్రత్యర్ధి టీమ్ వ్యూహాలు, బాల్ కదలికలను అధ్యయనం చేసుకునేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. అలాగే కొన్ని క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తమ పోశ్చర్ను అన్ని కోణాల్లో చూసుకొని తప్పులు దిద్దుకునేందుకు డ్రోన్లను వాడుతున్నారు. పైన చెప్పుకున్న ఎక్సర్షన్ ల్యాబ్ తాజాగా ధ్యాన డ్రోన్స్ను తయారు చేయాలని భావిస్తోంది. డ్రోన్ ఛిగా పిలిచే ఈ డ్రోన్ చైనా మార్షల్ ఆర్ట్ తాయ్ఛికి ప్రతిరూపమని తెలిపింది. ఇప్పటికీ ఈ డ్రోన్ ప్రొటోటైప్స్ను సంస్థ రూపొందించింది. భవిష్యత్లో ఈ డ్రోన్లు ఫిట్నెస్ విషయంలో మెకానికల్ భాగస్వాములుగా మారనున్నాయంటే అతిశయోక్తి కాదేమో! -
ఓ తల్లి దయనీయగాథ.. భుజాలపై పిల్లాడితో
సాక్షి, యశవంతపుర: భర్తతో గొడవ పడిన ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకును తీసుకుని 90 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన కర్ణాటకలో దావణగెరెలో వెలుగులోకి వచ్చింది. శివమొగ్గ జిల్లా గాడికొప్పకు చెందిన నాగరత్న ఏదో విషయమై భర్తతో తగాదా పడింది. దిక్కుతోచని స్థితిలో కొడుకును, బట్టల సంచిని తీసుకుని బిజాపుర (విజయపుర) జిల్లా హరప్పనహళ్లి తాలూకా తుంబికెరెలోని అక్క ఇంటికి బయలుదేరింది. బస్సులు లేవు, చేతిలో డబ్బులు కూడా కరువు. దీంతో ఆమె నడకనే నమ్ముకుంది. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు దావణగెరె నగరంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా నాగరత్న ఎస్ఎస్ ఆస్పత్రి వద్ద కంటపడ్డారు. పోలీసులు ప్రశ్నించగా భర్తతో కొట్లాడి కొడుకును భుజాలపై మోసు కుంటూ అక్క ఇంటికి కాలినడకన వెళ్తున్నట్లు వారికి వివరించింది. ఇలా ఆమె 90 కిలోమీటర్లు నడిచినట్లు తెలిసి పోలీసులే విస్తుపోయారు. తల్లి, కొడుకుకు పోలీసులు భోజనం పెట్టించి తమ వాహనంలో తుంబికెరెలోని ఆమె సోదరి ఇంటికి పంపించారు. -
సన్నగా ఉన్నవాళ్లు వ్యాయామం చేయొద్దా?
సన్నగా ఉంటే వ్యాయామం అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ సన్నగా, పీలగా ఉన్నవాళ్లు కాస్త ఒళ్లు చేయాలంటే డైట్తో పాటు వ్యాయామం తప్పదు. సన్నగా ఉన్నవాళ్లు కోచ్ ఆధ్వర్యంలో ఎక్సర్సైజ్లు చేయాలి. ముఖ్యంగా కార్డియో వర్కవుట్స్ కన్నా స్ట్రెంత్ ట్రైనింగ్కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా సరే బెల్లీ బలంగా మారాలంటే క్రంచెస్ చేయాలి. మీ సామర్థ్యాన్ని బట్టి 20 సార్లు 3 సెట్లు లేదా 15 సార్లు 4 సెట్లు రోజూ చేస్తే మంచి ఫలితం తొందరగా కనిపిస్తుంది. స్కిప్పింగ్ ఇలా చేద్దాం! పది నిమిషాలు స్కిప్పింగ్ చేయడం ఎనిమిది నిమిషాల నడకకు సమానం. స్కిప్పింగ్కు మీరు ఎంచుకునే తాడు మీ ఎత్తుకు రెండింతలుండాలి. దానిని మీ పాదాలతో అదిమి పట్టి రెండు అంచులను మీ ఎత్తుకు సమానంగా ఇరువైపులా చూసుకుని మీ చేతులతో ముందుకు, వెనక్కు తిప్పి చూసుకోవాలి. అప్పుడే కాళ్లకు అడ్డం పడకుండా క్రమపద్ధతిలో స్కిప్పింగ్ చేయగలరు. ఒకేవిధమైన ఎక్సర్సైజ్లు కాకుండా కాంపౌడ్ ఎక్సర్ సైజ్ లు అంటే క్వాట్స్, డెడ్ లిప్ట్, బెచ్ ప్రెస్, మిలటరీ ప్రెస్, డంబెల్ రో ప్రయత్నించడం వల్ల కండరాలు పటిష్ఠంగా తయారై, తీరైన ఆకృతిలోకి మారతాయి. మొదటి రోజునుంచే వ్యాయామాలతో శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టొద్దు, మోతాదును పెంచుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఫిట్నెస్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వావ్.. వాకింగ్! క్రమం తప్పక వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే హార్మోనులు విడుదలవుతాయి, ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రెగ్యులర్ వాకింగ్తో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ అరగంట వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ముప్పు చాలావరకు తగ్గుతుంది, నిత్యం 10 వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బరువు ఈజీగా తగ్గుతారు. బూట్లు లేకుండా ఒట్టి పాదాలతో చేసే వాకింగ్తో మెంటల్ టెన్షన్ తగ్గుతుందని, ఇమ్యూనిటీ పెరుగుతుందని, హృద్రోగాల రిస్కు తగ్గుతుందని, మెన్సస్ టైంలో వచ్చే పొత్తికడుపు నొప్పులు నివారించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక్కడ చదవండి: కూరగాయలతోనే పొట్ట తగ్గించుకోండి నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే..! -
జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు
సాక్షి, నంద్యాల : అసలే ఎండాకాలం.. గతంలో ఎప్పుడూ లేనంతగా భానుడు భగభగా మండిపోతున్నాడు.. బయటికి వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్న తరుణంలో ఓ వ్యక్తి చెప్పుల్లేకుండానే నడుచుకుంటూ కూలి పనులకెళుతున్నాడు.. పైగా తారు రోడ్డు మీద. గమనించిన ‘సాక్షి’ అతడిని పలుకరించింది. సాక్షిని చూడగానే సంతోషంతో అతను ఇలా చెప్పాడు.. ‘నా పేరు దూదేకుల ఖాశీం. మాది కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామం. ఓదార్పు యాత్రలో భాగంగా 2010లో కర్నూలు జిల్లాకు వచ్చిన జగనన్నను కలిశాను. వైఎస్సార్ బిడ్డ ముఖ్యమంత్రి అవ్వాలని.. ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ అన్నను కలిసేంత వరకూ కాళ్లకు చెప్పులు ధరించనని స్నేహితులు, గ్రామస్తులందరి సమక్షంలో శపథం చేశాను. 11 ఏళ్లుగా పాదరక్షలు లేకుండానే నడుస్తున్నాను. వైఎస్ జగన్మోహన్రెడ్డి దగ్గరకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్రెడ్డిని కలిశాను.. సీఎం దగ్గరకు తీసుకెళతానన్నారు’ అని చెప్పాడు. అంతలో గ్రామస్తులు వచ్చి ముఖ్యమంత్రిని కలిసిందాకా ఖాశీం చెప్పులు వేసుకునేలా లేడు.. ఆయనను త్వరగా సీఎం దగ్గరకు తీసుకెళ్లండయ్యా.. అంటూ విజ్ఞప్తి చేశారు. చదవండి: సచివాలయాలు యూనిట్గా వ్యాక్సినేషన్: సీఎం జగన్ -
శభాష్ భరత్.. 99 రోజుల్లో 11 రాష్ట్రాలు దాటి
అసలైతే పాదాభివందనం చేయాలనుకున్నాడు భరత్. కానీ ఒకరా ఇద్దరా! డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, సామాజిక కార్యకర్తలు.. వేలు, లక్షలు! ఎంతమందికని పాదాభివందనం చేయగలడు? పోనీ.. ‘ఎందరో కరోనా యోధులు. అందరికీ వందనాలు’ అనుకుని మనసులోనే చేతులు జోడించవచ్చు. అలాక్కూడా కాదు, అంతకన్నా ఎక్కువగా కృతజ్ఞతలను చెల్లించాలనుకున్నాడు. కాలి నడకన కన్యాకుమారి నుంచి బయల్దేరి శ్రీనగర్లోని దాల్ సరస్సుకు చేరుకున్నాడు. తన ప్రయాణాన్ని ఒక స్తుతిగా, నమస్కృతిగా చెల్లించుకున్నాడు. భరత్ది మైసూర్. కరోనా కాలంలో కష్టాలు పడుతున్నవాళ్లను చూశాడు. ఆ కష్టాలను తమవిగా భావించి చేయి అందించిన వాళ్లూనూ చూశాడు. ఆసుపత్రులలో కరోనా బాధితుల్ని చూశాడు. ప్రాణానికి ప్రాణమిచ్చి వారిని కాపాడిన వైద్యులను, సిస్టర్స్ని చూశాడు. ప్రతి చోటా ఏదో ఒక సహాయం చేయడానికి వచ్చినవారే! ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా.. మనిషిలోని మంచితనాన్ని కూడా బయట పెట్టింది. ఏడాదిగా చూస్తున్నాడు భరత్. కరోనా యోధులకు అవార్డులు ఇస్తున్నారు. వారిని అభినందిస్తూ పెయింటింగ్ లు వేస్తున్నారు. సత్కరిస్తున్నారు. సర్టిఫికెట్ లు ఇస్తున్నారు. మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నారు. తనూ ఏదైనా చేయాలని అనుకున్నాడు. అనుకోవడం కాదు, చేయకుండా ఉండలేకపోయాడు. ఇప్పటికే అతడు పర్యావరణాన్ని పరిరక్షించే పనిలో ఉన్నాడు. మొక్కలు నాటుతున్నాడు. ఫిట్నెస్పై అవగాహన కల్పిస్తున్నాడు. ఆ పనులను కొనసాగిస్తూనే దేశవ్యాప్తంగా కరోనా యోధులకు అభివాదాలు తెలియజేసేందుకు ‘వాక్ ఫర్ హ్యుమానిటీ’ (మానవత్వం కోసం పాదయాత్ర) ను తలపెట్టాడు. 4000 వేల కి.మీ. పొడవైన ఆ మహా సంకల్పాన్ని పూర్తి చేశాడు! ∙∙ ముప్పై మూడేళ్ల భరత్ 2020 డిసెంబర్ 11న తన పాద యాత్రను ప్రారంభించాడు. మైసూర్ నుంచి కన్యాకుమారి వెళ్లి అక్కడ తొలి అడుగు వేశాడు. చివరి అడుగు జమ్ము కశ్మీర్. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డుకు చేరీచేరగానే.. పసుపు, ఎరుపు రంగుల్లో తను రూపకల్పన చేసుకున్న యాత్ర పతాకాన్ని రెండు చేతులతో రెపరెపలాడించాడు. మొత్తం 99 రోజుల ప్రయాణం. హైవేల మీదుగా రోజుకు 45 నుంచి 50 కిలో మీటర్ల నడక. మొత్తం 11 రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్లాడు భరత్. కరోనా రాక ముందు వరకు అతడు రకరకాల వ్యాపారాలు చేసేవాడు. కరోనాతో అవన్నీ దెబ్బతిన్నాయి. లాక్డౌన్లో పూర్తిగా ఇంటికే పరిమితం కావడం, ఆ మాత్రం అవకాశం కూడా లేని కరోనా యోధులు నిరంతరం ఇంటికి దూరంగా గడపడం చూశాక భరత్కు తను కూడా ఏదైనా చేయాలన్న ఆలోచన కలిగింది. నిస్వార్థంగా సేవలు అందిస్తున్న లక్షల మందికి ధన్యవాద సమర్పణ చేయదలచుకున్నాడు. పాదయాత్ర తో వారి రుణం తీర్చుకోవాలనుకున్నాడు. దారి మధ్యలో కొన్ని చోట్ల చెట్ల కింద సేద తీరాడు. సామాజిక కార్యకర్తలను పరిచయం చేసుకున్నాడు. 150 చోట్ల మొక్కలు నాటాడు. అతడి ఒంటరి ప్రయాణానికి ఏదో ఒక రూపంలో శక్తిని అందించినవారు ఎందరో ఉన్నారు. ‘‘ఈ కృతజ్ఞతా ప్రయాణం నా ఒక్కడిదే కాదు. వాళ్లందరిది కూడా’’ అంటున్నాడు భరత్. -
స్టైలిష్ వాక్, లవ్లీ జంపింగ్స్... స్విమ్మింగ్తో డాగ్స్ సందడి
-
బట్టలు లేకుండా బజార్లో వాకింగ్
లండన్: 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అన్నట్లుగా ఓ వ్యక్తి ఒంటి మీద నూలుగు పోగు లేకుండా బజార్ల వెంట నడిచాడు. అతడి వాలకం చూసి నిర్ఘాంతులయ్యారు లండన్ ప్రజలు. 'మై లండన్' పేర్కొన్న వివరాల ప్రకారం జనవరి 24న లండన్లో ఓ వ్యక్తి నగ్నంగా బ్రిటీష్ మ్యూజియమ్ చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఆ ప్రదేశంలోనే పరుగులు తీస్తూ జనాలను ఠారెత్తించాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగగా సదరు వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యాడు. (చదవండి: వైరల్: వెనకాల కాదురా.. దమ్ముంటే పులికి ఎదురుపడు!) ఈ ఘటన గురించి ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. 'సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో నేను రోడ్ల మీద వాకింగ్ చేస్తున్నాను. అప్పుడు ఓ వ్యక్తి నగ్నంగా నడుస్తూ తారసపడ్డాడు. అతడు పరుగులు పెడుతున్నట్లుగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అక్కడున్న చాలామంది అతడిని చూసి షాకయ్యారు. ఓ గార్డెన్ వరకు వెళ్లిన అతడు తిరిగి మళ్లీ మ్యూజియం వైపు నడక సాగించాడు' అని చెప్పుకొచ్చాడు. మరో ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. 'ఎందుకీ అవతారంలో బయటకు వచ్చావని అతడిని అడిగాను. దానికాయన బదులిస్తూ.. నా బట్టలు నేను ఉతుక్కోవడం కోసం ఒంటి మీదున్నవి తీసేశాను. ఆ తర్వాత కాసేపు అలా నడుద్దామని వచ్చానని చెప్పాడు' అని తెలిపాడు. రోడ్లపై బట్టలు లేకుండా ఇష్టారాజ్యంగా తిరిగిన సదరు వ్యక్తి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. (చదవండి: ఓ మై గాడ్.. వీరిద్దరూ ఎంత ముద్దుగా ఉన్నారు!) -
24 గంటలు.. 79.6 కిలో మీటర్లు
అరగంట.. గంట.. మహాఅయితే రెండు గంటలు నడిస్తే హమ్మయ్య అంటాం. చాలామంది వయసును దృష్టిలో ఉంచుకొని వాకింగ్ చేస్తుంటారు. కాస్త వయసు పైబడినవారు ‘స్టాప్ ఎన్ స్టార్ట్’ పద్ధతిలో మధ్య మధ్యలో కాస్త సేదతీరుతూ నడక కొనసాగిస్తుంటారు. తార్నాకకు చెందిన సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ సీఐ రవికుమార్ మాత్రం నిత్యం 20 నుంచి 30 వేల అడుగులు అలవోకగా నడుస్తారు. పలుమార్లు ఏకంగా లక్ష అడుగులు నడిచి రికార్డు సృష్టించాడు. కొన్ని రోజుల క్రితం ఏకంగా 24 గంటల పాటు నడిచి 1,14,633 అడుగులతో 79.6 కిలోమీటర్లు నడిచిన ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం అభినందించారు. ⇔ తార్నాకలో ఉంటున్న రవికుమార్ రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్. పంజాబ్లో పనిచేసిన కాలంలో ఒళ్లు చేసింది. సీఆర్పీఎఫ్లో పనిచేస్తూ ఇదేం శరీరం అంటూ ఒక మిలటరీ అధికారి ప్రశ్నించడంతో వాకింగ్కు శ్రీకారం చుట్టారు. ⇔ 26 ఏళ్లుగా వాకింగ్ చేస్తున్న ఆయనకు ఉస్మానియా యూనివర్సిటీ మైదానాలు, ప్రకృతి మరింత స్ఫూర్తినిచ్చాయి. ⇔ ఉత్తరప్రదేశ్కు చెందిన సుశాంత్ జైస్వాల్, మహారాష్ట్రకు చెందిన సూర్యవంశీ లక్ష అడుగులు నడిచిన తొలి రెండు రికార్డులు సొంతం చేసుకున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మూడో వ్యక్తిగా రవికుమార్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. కాగా మొదటి ఇద్దరి వయసు 28 ఏళ్లు కాగా రవికుమార్ వయసు 58. ⇔ తార్నాక నుంచి పెద్దమ్మగుడి, కీసరగుట్ట, యాదగిరిగుట్ట.. ఇలా సికింద్రాబాద్ నుంచి దాదాపు అన్ని మార్గాల్లో ఆయన ఉదయపు నడక సాగిస్తుండటం విశేషం. ⇔ నగర యువతలో ఊబకాయం పెరిగిపోతున్న నేపథ్యంలో వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఉదయం పూట నడక జీవిత కాలం కొనసాగిస్తానని తెలిపారు. -
మోకాళ్ల నొప్పులా.. ఈ పనులు చేయకండి
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో చాలామంది తాము ఎక్కువగా నడుస్తూ ఉంటే మోకాళ్ళు మరింతగా అరిగిపోతాయేమోనని, దాంతో నొప్పులు మరింతగా పెరుగుతాయేమోనని అపోహపడుతుంటారు. వాస్తవానికి ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి మన మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే, ఆ భాగంలో అంతగా రక్తప్రసరణ జరుగుతుంది. అలా రక్తప్రసరణ పెరగడం వల్ల కీళ్లకు మంచి పోషణ అందుతుంది. రాబోయే కాలం అనువైన సమయం... కొద్దిరోజుల్లోనే చలికాలం ముగియబోతోంది. చలి క్రమంగా తగ్గిపోయి ఉదయం వేళ, సాయంత్రం పూట నడకకు ఆస్కారం ఇచ్చే వాతావరణం... అంటే... అంతగా చలీ, అంతగా వేడీ లేని మంచి వాతావరణం మరో రెండు నెలలూ ఉండబోతోంది. అందుకే వీలైతే వెంటనే రోజుకు కొంతసేపు నడకకు కేటాయించండి. పది నిమిషాలు వ్యవధితో మొదలు పెట్టి క్రమంగా 40 – 60నిమిషాల వరకూ వాకింగ్ సమయాన్ని పెంచుతూ పొండి. నడక వల్ల మీ మోకాళ్లపై మీ దేహభారం పడుతుందని అనిపిస్తే...ఒకే చోట కూర్చుని చేసే సైక్లింగ్ కూడా చేయవచ్చు. నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడే ఉపకరణాలివి... మోకాలిలో నొప్పులు లేకుండా ఉండటానికి / నొప్పులు తగ్గడానికి నీ గార్డులు, క్రేప్ బ్యాండేజీలు, మోకాళ్ల వద్ద బిగుతుగా ఉంచే సపోర్టింగ్ సాక్స్, చిన్న బ్రేసెస్ ఇలాంటి కొన్ని ఉపకరణాలను అవసరమైన వారికి ఆర్థోపెడిక్ నిపుణులు సూచిస్తారు. అయితే పనుల్లో భాగంగా మోకాలిపైన భారం పడుతున్న సమయంలో మాత్రమే వీటిని ధరించాలి. లేదా డాక్టర్ సూచనలకు అనుగుణంగా మాత్రమే వీటిని ఉపయోగించాలి. ఈ పనులు చేయకండి... మోకాళ్ల నొప్పులున్నవారు ఇక్కడ పేర్కొన్న పనులేవీ చేయకూడదు. అవేమిటంటే... ఒక అంతస్తు కంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగడం వద్దు. ఎగుడు–దిగుడుగా ఉండే నేలపై నడవద్దు. నడక వ్యాయామం సమయంలోనూ సమతలంగా ఉండే నేలపైనే నడవండి. నేలపై కాళ్లు రెండూ మడత వేసుకుని కూర్చోవడం / లేవడం (స్కాటింగ్) చేయకండి. గొంతుక్కూర్చొని బరువైన వస్తువలేవీ ఎత్తకండి. నొప్పులు తగ్గకపోతే... పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటున్నా... నడక మొదలుపెట్టిన వారం లేదా రెండు వారాల్లో తగ్గకపోయినా ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించండి. వారు మీ మోకాళ్ళను ఎక్స్–రే తీసి, అవి ఏ మేరకు అరిగాయి అన్న విషయం తెలుసుకుంటారు. దాన్ని బట్టి మీకు ఎలాంటి వైద్య చికిత్స అవసరమో నిర్ణయిస్తారు. అవసరాన్ని బట్టి మందులతోపాటు ఫిజియోథెరపీని కూడా సూచించవచ్చు. ఫిజియోథెరపీలో కండరాలు, ఎముకలు గట్టిపడి వాటి కదలికలు మెరుగుపడతాయి. ఫిజియో అంటే మళ్లీ వ్యాయామాలే. కాబట్టి ఈ సారి క్రమంగా మీ నొప్పులు తగ్గుతూ మళ్లీ వ్యాయామం వైపునకు మళ్లే అవకాశం ఉంటుంది. -
నడుస్తూ ధ్యానం చేయవచ్చని తెలుసా?!
ధ్యానం.. మనలోని అనవసర ఆందోళనలు, భయాలు మాయం చేసిమనసుకు ప్రశాంతత చేకూర్చే చక్కని మార్గం. అందుకే భారతీయసంప్రదాయంలో ధ్యానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రుషులు, మునులుసదా అనుసరించేదిదే. అలాగే బుద్ధిజంలోనూ దీని పాత్ర అధికం. చక్కని వాతావరణంలో పద్మాసనం వేసుకొని కూర్చొని కాసేపు కళ్లు మూసుకొని అన్నింటినీ మరచిపోయి శ్వాస మీద ధ్యాస కేంద్రీకరించడమే ధ్యానంగా ఎక్కువ మంది భావిస్తారు. అయితే, నడుస్తూ కూడా ధ్యానం చేసే ప్రక్రియ(మెడిటేషన్ వాక్) ఉందనే విషయం అందరికీ తెలీదు. వాకింగ్ మెడిటేషన్ను బౌద్ధంలో ‘‘కిన్హిన్ ’’అంటారు. దీనికే ‘సూత్ర వాక్’ అని మరోపేరుంది. జెన్ మెడిటేషన్, ఛన్ బుద్ధిజం, వియత్నమీస్ థైన్ తదితర విభాగాల్లో మెడిటేషన్ వాక్ ఒక భాగంగా భావిస్తారు. ఒక చోట కూర్చుని ధ్యానం చేసే బదులుగా మధ్య మధ్యలో ఇలా వాకింగ్ మెడిటేషన్నూ చేస్తారు. కిన్హిన్ అనేది జాజెన్కు(కూర్చొని ధ్యానం చేయడం) వ్యతిరేక ప్రక్రియ. ఎలా చేస్తారు? మెడిటేషన్ వాక్లో ఒక చేతిపిడికిలి బిగించి మరో చేతితో ఆ పిడికిలిని మూస్తారు. అనంతరం క్లాక్వైజ్ డైరక్షన్లో నెమ్మదైన అడుగులు వేస్తూ వృత్తాకారంలో తిరుగుతారు. ఒక్కో అడుగుకు ముందు ఒక బ్రీత్(ఒక ఉచ్ఛాశ్వ, నిశ్వాస) పూర్తి చేస్తారు. కిన్హిన్ అంటే చైనా భాషలో ఒక దాని గుండా ప్రయాణించడమని అర్ధం. అంటే మనం ప్రశాంతత గుండా ప్రయాణించడమని అర్ధం చేసుకోవచ్చు. ఉపయోగాలు: 1. రక్తప్రసరణ మెరుగుపర్చడం తరచూ వాకింగ్ మెడిటేషన్ చేసేవారిలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వారి పాదాల్లో రక్తం సక్రమంగా సరఫరా అవడంలో తోడ్పడుతుంది. కాళ్ల అలసట, మందస్థితిని పోగొడుతుంది. అంతేకాదు శరీరంలో శక్తిస్థాయిల్ని పెంచుతుంది. 2. జీర్ణశక్తిని పెంచుతుంది ఆహారం తీసుకున్న తర్వాత కాసేపు ప్రశాంతంగా అటూ ఇటూ నడిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. ప్రత్యేకించి కడుపు నిండా తిన్నప్పుడు ఇలా నడవడం ద్వారా ఆహారం జీర్ణకోశ ప్రాంతంలో సమంగా పంపిణీ అవుతుంది. అంతేకాదు మలబద్ధకం నివారిస్తుంది. 3. ఒత్తిడి తగ్గిస్తుంది ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కూర్చొని చేసే ధ్యానం కన్నా నడుస్తూ చేసే ధ్యానంతో ఎక్కువ ఫలితం ఉంటుంది. 2017లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మధ్య వయస్కుల్లో ఒత్తిడి, ఆందోళన లక్షణాలు వాకింగ్ మెడిటేషన్ ద్వారా సమర్థంగా తగ్గినట్లు తేలింది. అయితే, కనీసం 10 నిమిషాల సమయం మెడిటేషన్ వాక్ చేయాల్సి ఉంటుంది. 4. చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిల్ని బౌద్ధంలోని ఓ మెడిటేషన్ వాక్ ప్రక్రియ సమర్థంగా నియంత్రించినట్లు 2016లో వెలువడిన ఓ నివేదిక వెల్లడించింది. వారానికి మూడుసార్లు రోజూ కనీసం అరగంట చొప్పున సాధారణ వాకింగ్ చేసేవాళ్లతో పోలిస్తే బౌద్ధ మెడిటేషన్ వాక్ చేసిన వాళ్లలో మధుమేహం నియంత్రణ, చక్కటి రక్తప్రసరణ జరుగుతున్నట్లు గుర్తించారు. 5. డిప్రెషన్ తొలగిస్తుంది 2014లో వెలువడిన ఓ సర్వే ప్రకారం బౌద్ధంలోని ఓ మెడిటేషన్ వాక్ ప్రక్రియను అనుసరించిన వృద్ధుల్లో డిప్రెషన్కు సంబంధించిన లక్షణాలు చాలా వరకు తగ్గినట్లు గుర్తించారు. అలాగే వారిలో రక్తప్రసరణ, ఫిట్నెస్ మెరుగవడం గుర్తించారు. ఇది దాదాపు యుక్తవయసువారు చేసే రోజువారీ వ్యాయామం ఫలితంతో సమానంగా ఉన్నట్లు తేలింది. ఈ బౌద్ధ మెడిటేషన్ వాక్ ప్రక్రియను వారానికి కనీసం మూడుసార్లు చొప్పున 12 వారాల పాటు వారు అనుసరించారు. 6. ఆరోగ్యాన్ని పెంచుతుంది ప్రకృతి(ఏదైనా పార్క్/తోట/ వనం)లో కాసేపు నడుస్తూ ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే సమతుల స్థితి చేకూరుతుంది. 2018లో వెలువడిన ఓ సర్వే ప్రకారం కనీసం 15 నిమిషాల పాటు వెదురు వనంలో మెడిటేషన్ వాక్ చేసిన వారిలో ఆందోళన, ఒత్తిడి, రక్తపోటు తగ్గినట్లు గుర్తించారు. వీటితోపాటు నిద్ర, సృజనాత్మకత, ప్రశాంతత తదితర వాటినీ మెడిటేషన్ వాక్ మెరుగుపరుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
ఇంట్లో వాకింగ్కు గిన్నిస్ రికార్డు!
లండన్: బరువు తగ్గడం కోసం ఇంట్లో వాకింగ్ చేస్తూవచ్చిన 70 ఏళ్ల పెద్దాయనకు తాను ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు డౌటు వచ్చింది. అనుమానం వచ్చిందే తడవు వెంటనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు లేఖ రాశాడు. ఆయన రికార్డును ప్రస్తుతం గిన్నిస్ బుక్ పరిశీలిస్తోంది. వింటుంటే వింతగా ఉందా! కానీ ఇదే నిజం. ఐర్లాండ్కు చెందిన భారతీయ సంతతి ఇంజనీర్ వినోద్ బజాజ్ తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు లేఖ రాశారు. తాను 1500 రోజుల్లో భూమి చుట్టుకొలతకు సమానమైన 40,075 కిలోమీటర్ల దూరం నడిచానని చెప్పుకొచ్చారు. తన నడకను లెక్కగట్టేందుకు ఎలక్ట్రానిక్ డివైజ్ను వాడానని సాక్ష్యం చూపుతున్నారు. 2016లో బరువు తగ్గే ఉద్దేశ్యంతో వాకింగ్ ఆరంభించినట్లు ఆయన చెప్పారు. క్రమంగా ఇది ఒక అలవాటుగా మారిందన్నారు. తొలి ఏడాది పూర్తయ్యేసరికి 7600 కిలోమీటర్ల దూరం పూర్తి చేసినట్లు పేసర్ ట్రాకర్ యాప్ చూపిందని చెప్పారు. రెండో ఏడాదికి తన నడక 15200 కిలోమీటర్లను దాటిందన్నారు. ఇది చంద్రుడి చుట్టుకొలత కన్నా ఎక్కువ. ఈ ఏడాది సెప్టెంబర్ 21కి భూ చుట్టుకొలతకు సమానమైన దూరం తాను నడిచినట్లు నమోదయిందని తెలిపారు. ఇందుకు మొత్తం 1496 రోజులు పట్టిందన్నారు. చెన్నై నుంచి వినోద్ 1975లో స్కాట్లాండ్ వచ్చారు. తర్వాత ఐర్లాండ్లో స్థిరపడ్డారు. -
వాకింగ్కు ఏదీ అవకాశం!
సాక్షి, హైదరాబాద్: రోజూ ఉదయంపూట నడక.. రోగాలను దూరంగా ఉంచుతుందంటారు. అయితే కరోనా వైరస్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో నగరజీవి ఉదయంపూట నడకకు దూరం కావాల్సి వచ్చింది. కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలని సూచిస్తున్న వైద్యులు, తగిన వ్యాయామం కూడా అత్యవసరమని చెబుతున్నారు. ఇంతకాలం పార్కుల్లో నిత్యం ఉదయం, సాయంత్రం నడకతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్న వారు ఇప్పుడు నాలుగు నెలలుగా నడకకు దూరం కావాల్సి వచ్చింది. దానికి లాక్డౌన్ నిబంధనలే అడ్డుగా మారటం గమనార్హం. నాలుగు నెలలుగా దూరం.. మార్చిలో జనతా కర్ఫ్యూ తర్వాత విధించిన లాక్డౌన్తో మున్సిపల్ పార్కులన్నింటిని మూసేశారు. అప్పుడు మూసుకున్న గేట్లు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. హైదరాబాద్లోని చాలా కాలనీలు, బస్తీల్లో మున్సిపల్ పార్కులు తప్ప నడకకు సరైన ప్రదేశాలంటూ లేవు. దీంతో శారీరక ఫిట్నెస్పై శ్రద్ధ ఉన్నవారు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా పార్కుల్లోనే వాకింగ్ చేసేవారు. కానీ, లాక్డౌన్తో పార్కులు మూసేసిన తర్వాత వారికి వాకింగ్ చేసే వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో కొందరు గత్యంతరం లేక రోడ్లపైనే నడుస్తున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవటంతో వారు రోడ్లపై నడిచేందుకు భయపడుతున్నారు. ఇతర పనులకు నడుచుకుంటూ వెళ్లేవారికి దగ్గరగా నడవాల్సి రావటంతో వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మరింతగా భయపడుతున్నారు. వైరస్ సోకుతుందన్న భయంతో అసలు వాకింగ్కే వెళ్లటం మానేశారు. పార్కులు తెరిచి ఉంటే ధైర్యంగా నడిచే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అన్లాక్ ప్రక్రియ మొదలైనా.. పార్కులను మాత్రం తెరవకపోవటంతో వాకర్లు ఇబ్బందులు పడుతున్నారు. పార్కులు మూసి ఉండటంతో ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు ఉన్న వారు సరైన నడక లేక ఇబ్బంది పడుతున్నారు. దుకాణాలు, హోటళ్ల వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడేవారిని నియంత్రించటంలో విఫలమవుతున్న అధికార యంత్రాంగం, అతి తక్కువ మంది వచ్చే పార్కులను పూర్తిగా మూసి ఉంచటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్కులు తెరవండి క్రమబద్ధమైన నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. నా దగ్గరికి వచ్చే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కచ్చితంగా వాకింగ్ సిఫారసు చేస్తాను. కానీ ఇప్పుడు వాకింగ్ చేసేందుకు అనువైన పార్కులు లేకపోవటంతో చాలామంది ఆ ప్రక్రియకు దూరమై మధుమేహాన్ని నియంత్రించుకోలేకపోతున్నారు. కరోనా భయంతో ఎక్కువ సమయం ఇళ్లకే పరిమితమవుతున్నవారు.. ఓ రకమైన మానసిక సమస్యలోకి జారుకుంటున్నారు. వీరికి నడక చాలా అవసరం. అలాగే కరోనా సోకకుండా ఉండాలంటే శరీరం కూడా ఫిట్గా ఉండాలి. దానికి వాకింగ్ ఎంతో అవసరం. పార్కులకు నిర్ధారిత వేళలు విధించటం, వాకర్స్ మాత్రమే పార్కులను వినియోగించుకునేలా చూడ్డం ద్వారా కరోనా భయం లేకుండా చేయొచ్చు. – డాక్టర్ సీతారాం, డయాబెటాలజిస్టు -
22 రోజులు.. 110 కిలో మీటర్లు..
సాక్షి, హైదరాబాద్: కూటి కోసం.. కూలి కోసం.. కాంట్రాక్టర్ మాటలు నమ్మి.. వెంట వెళ్లిన కుటుంబానికి ఎంత కష్టం.. ఎంత కష్టం.. చేతిలో చిల్లిగవ్వలేక.. కరోనా వేళ కరుణించేవారు లేక.. కళ్లలో ఆశలుడిగి కాలినడకన బయలుదేరిన ఆ కూలీ కుటుంబానికి ఎంత కష్టం.. ఎంత కష్టం.. 22 రోజులుగా నడిచి నడిచి, ఎడతెరిపిలేని వాననీటిధారలోనే ఎడతెగని కన్నీటిధార కలిసిపోయిన ఆ పేద జంటకు ఎంత కష్టం.. ఎంత కష్టం.. చివరికి కూలీని మరో కూ లీ చెంతకు తీసుకొని చింత తీర్చి మానవత్వం ఇంకా కూలిపోలేదని నిరూపించిన ఘటన ఇది. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్నగర్కు చెందిన భాషబోయిన రమేశ్ దినసరి కూలీ. రెండు నెలల కిందట గుంటూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ మాటలు నమ్మి భార్య లక్ష్మి, కుమారుడు చక్రిని తీసుకుని ఉపాధి కోసం విశాఖపట్నం వెళ్లాడు. తీరా పనిచేయించుకున్న కాంట్రాక్టర్ వారికి చెప్పాపెట్టకుండా ఎటో ఉడాయించాడు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తోంది. ఎన్నిరోజులు ఎదురుచూసినా తిరిగిరాలేదు. తనతోపాటు పలువురు స్థానిక, మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలకు కూడా ఆ కాంట్రాక్టర్ కూలి డబ్బులు ఎగ్గొట్టాడు. దీంతో మోసపోయామని గ్రహించిన రమేశ్ భార్యాబిడ్డలతో కలసి స్వగ్రామానికి తిరిగి వెళ్లాలనుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో చాలామందిని చార్జీ డబ్బుల కోసం బతిమిలాడాడు. కరోనా విజృంభిస్తున్నవేళ ఎవరూ వారిని కరుణించలేదు. కాంట్రాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తుండటంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. రూ.100 చేతిలో పెట్టి వెళ్లిపొమ్మన్నారు. లారీ డ్రైవర్లు కూడా వారిని వాహనంలోకి ఎక్కించుకునేందుకు నిరాకరించారు. 22 రోజులపాటు పట్టాల వెంబడే నడక..! చేసేదేమీ లేక కాలినడకన రైలు పట్టాల వెంట విశాఖపట్నం నుంచి వరంగల్కు బయల్దేరింది ఆ కూలీ కుటుంబం. మార్గమధ్యంలోనూ చాలామందిని అర్థించినా ఫలితం లేకుండా పోయింది. సరిగా తిండి లేకపోవడంతో రోజుకు 4–5 కి.మీ. మాత్రమే నడిచేవారు. స్టేషన్లలో ప్రయాణికులను బతిమిలాడుతూ.. పొట్టనింపుకున్నారు. పట్టాల వెంబడే నిద్రపోవడంతో రమేశ్ కుమారుడు చక్రీకి, భార్య లక్ష్మికి పలుమార్లు తేళ్లు కుట్టాయి. అయినా గుండెధైర్యంతో 22 రోజులపాటు పట్టాల వెంట నడక సాగించారు. మధ్యలో ఐదురోజులపాటు ఏకధాటి వాన కురుస్తున్నా నడుస్తూనే ఉన్నారు. దాదాపు 110 కిలోమీటర్ల అనంతరం రాజమండ్రి సమీపంలోని లక్ష్మీనారాయణపురం రైల్వేస్టేషన్ వద్దకు బుధవారం రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ పనులు చేసుకుంటున్న రైల్వే కూలీ డేవిడ్ వారిని గుర్తించి వివరాలు వాకబు చేశాడు. డేవిడ్ ఇటీవల తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్గా సెలక్టయ్యాడు. ట్రైనింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో కూలి పనులు చేసుకుంటున్నాడు. రమేశ్ తన పరిస్థితి చెప్పగానే డేవిడ్, అతని మిత్రులంతా కలిసి ఆ కుటుంబాన్ని చేరదీశారు. ఆకలి తీర్చి, ఆ రాత్రికి తమ వద్దే ఆశ్రయమిచ్చారు. మర్నాడు డేవిడ్ తాను పనిచేసే ఎంఎంఆర్ సంస్థ అధికారులకు, తోటి కూలీలకు, తెలంగాణలోని టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు విషయం వివరించాడు. దీంతో వారంతా కలసి రమేశ్ కుటుంబానికి ఆన్లైన్లో రైల్వే టికెట్లు బుక్చేశారు. కూలీలంతా కలసి రాజమండ్రి వరకు ఆటో మాట్లాడి వారిని అందులో ఎక్కించారు. దారి ఖర్చులకు డబ్బులిచ్చారు. రాజమండ్రిలో వరంగల్ రైలెక్కించి మానవత్వం చాటుకున్నారు. -
ప్రేయసి కోసం నడిచి పాకిస్తాన్కు..
భుజ్/ముంబై: ప్రేమించిన అమ్మాయి కోసం నడుచుకుంటూ పాకిస్తాన్ వెళ్లాలని ప్రయత్నించిన మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడిని సరిహద్దు భద్రతా బలగాలు అడ్డుకున్న ఘటన గుజరాత్లో జరిగింది. అదుపులోకి తీసుకున్నాక అతడిని తల్లిదండ్రులకు బీఎస్ఎఫ్ అధికారులు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్కు చెందిన జషాన్ మొహమ్మద్ సిద్ధిఖీ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సిద్ధిఖీ సోషల్ మీడియాలో పరిచయమైన పాకిస్తాన్ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం ఈ నెల 11న తన ఇంటి నుంచి బైక్ మీద బయల్దేరి గుజరాత్ చేరుకున్నాడు. రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం గుండా పాకిస్తాన్లోకి అడుగుపెట్టాలని ప్రణాళిక వేసుకున్నాడు. అయితే మధ్యలో ధోలవీర గ్రామం సమీపంలో బైక్ ఇసుకలో కూరుకుపోవడంతో దాన్ని అక్కడే వదిలేసి నడక మొ దలుపెట్టాడు. గ్రామంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న అనుమానాస్పద బైక్ వదిలేసి ఉండటంతో బీఎస్ఎఫ్ అప్రమత్తమైంది. ఆ క్రమంలోనే భారత్–పాక్ సరిహద్దు వెంట సిద్ధిఖీని జవాన్లు అడ్డుకున్నారు. అప్పటికే మహారాష్ట్రలో అతని తల్లిదండ్రులు మిస్సింగ్ కేసును పెట్టారు. అతని బైక్ వివరాలను కేసుతో పోల్చుకున్న పోలీసులు బీఎస్ఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చి అతన్ని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అతని సోషల్ మీడియా ఖాతాలు, ఫోన్ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. -
వైరల్ వీడియో: గున్న ఏనుగు వాకింగ్!
సాక్షి, బెంగుళూరు: సాధారణంగా పెంపుడు జంతువులు తమతో పాటు వాకింగ్ చేస్తే యజమానులు చాలా సంతోష పడతారు. అవి తమతో పాటు నడవటం, పరుగెత్తటం చూసి మురిసిపోతారు. తాజాగా మైసూర్లోని జూ సంరక్షణలో ఉన్న ఓ గున్న ఏనుగు తన కేర్ టేకర్ వెంట నడుస్తూ, పరుగెత్తే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కర్ణాటక జూ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘మైసూర్ జంతు ప్రదర్శనశాలలో వేదవతి అనే చిన్నఏనుగు సోము సంరక్షణలో పెరుగుతోంది. వేదవతి కాకుండా మరో ఐదు గున్న ఏనుగులు అతని సంరక్షణలో ఉన్నాయి’ అని పేర్కొంది. మరో వీడియోను పోస్ట్ చేసి.. ‘వేదవతి ఎలా పరుగెత్తుతుందో చూడండి. ఈ చిన్న ఏనుగు రోజూ నడవటానికి ఇష్టపడుతుంది. మైసూర్ జంతు ప్రదర్శనశాలలో వేదవతి చేరినప్పుడు కేవలం 89 కిలోల బరువు మాత్రమే ఉండేది. రెండు నెలల వ్యవధిలో సోము సంరక్షణలో సుమారు 20 కేజీల బరువు పెరిగింది. కేర్ టేకర్ సోము ప్రతి రోజు వేదవతిని జూ చూట్టు వాకింగ్కి తీసుకెళ్తాడు. ఈ గున్న ఏనుగు రోజుకు మూడు సార్లు జూ చుట్టు పరుగులు తీస్తూ వ్యాయామం పూర్తి చేసుకుంటుంది’ అని కామెంట్ కర్ణాటక జూ తెలిపింది. ‘కరోనా కాలంలో మేము బంధీలమయ్యాంది. గున్న ఏనుగుకు ఎప్పుడూ స్వేచ్ఛే’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #Vedavathi lives walking and running, #Somu takes around three times in a day. Look how she runs!! She was 89 kgs , when arrived now 110kgs, gained any 20kgs in two months.@aranya_kfd @CZA_Delhi @AnandSinghBS @KarnatakaWorld @PIBBengaluru pic.twitter.com/PFPlpFshWi — Zoos of Karnataka (@ZKarnataka) July 13, 2020 -
గున్న ఏనుగు పరుగు..
-
25 రోజులపాటు కాలినడకన..
సాక్షి, న్యూఢిల్లీ: ‘సాధారణంగా మానవ శరీర నిర్మాణం రోజుకు కొన్ని గంటలు నడిచేందుకే అనువుగా ఉంటుంది. ఓ కిలోమీటరు నడిస్తే 60–70 కాలరీలు కరిగి పోతాయి. కడుపు నిండా తిన్న ఆహారం దాదాపు 600 కాలరీలు ఉంటుంది. అంటే ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు నడిస్తే ఆ 600 కాలరీలు కరిగిపోతాయి. ఇది ఉష్ణోగ్రత 25 డిగ్రీల లోపు ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ. లాక్డౌన్ కారణంగా సొంతూళ్లకు బయల్దేరిన కార్మికులు రోజుకు 8 నుంచి 12 కిలోమీటర్లు నడిచారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు లేకపోవడంతో, చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇంకా కొందరు నడుస్తున్నారు. మొన్నటిదాకా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో, ఒంటిపూట భోజనం లేదా అర్ధాకలితో నడిచారు. అలాంటప్పుడు వారిలో జీవన క్రియ భయంకరంగా దెబ్బతింటుంది. మానవ కండరాల్లోని అణువులు తగినంత శక్తిని విడుదల చేయలేవు. వాటి నుంచి ‘లాక్టిక్’ యాసిడ్ వెలువడుతుంది. అది శరీరాన్ని తీవ్ర అలసటకు గురి చేస్తుంది. శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంలో ఎక్కువగా ఉపయోగపడే గ్లూకోజ్ పడి పోతుంది. అప్పుడు కళ్లు తిరుగుతాయి. దప్పిక, ఆకలి ఎక్కువవుతుంది. సకాలంలో ఆహారం, విశ్రాంతి లేకపోతే స్పృహతప్పి పోతారు. సకాలంలో వైద్యం అందకపోతే మరణిస్తారు. ఎండలో ఎక్కువగా నడుస్తుంటే శరీరంలోని నీటి స్థాయి పడిపోతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్లో సమతౌల్యం దెబ్బతింటుంది. సోడియం లెవల్స్ పడిపోయి, వాంతుల అవుతాయి. దీన్ని ‘సన్స్ట్రోక్’ లేదా ‘డీహైడ్రేషన్’గా వ్యవహరిస్తారు. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోతాయి. సుదీర్ఘ నడక కారణంగా అరిపాదాలు బొబ్బలెక్కుతాయి. అవి ఇన్ఫెక్షన్లకు దారితీస్తే ప్రాణాంతకం అవుతాయి. ఈ వైద్యపరమైన విషయాలను బిలాస్పూర్లో గిరిజనులకు, గ్రామీణ ప్రజలకు అతి చౌకగా వైద్య సేవలు అందించేందుకు ‘జన్ స్వస్థ సయోగ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న డాక్టర్ యోగేశ్ జైన్ తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన అమిత్ కుమార్ గత మే నెలలో మొహమ్మద్ సాయిద్ చేతుల్లో మరణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. ఆయన ‘సన్స్ట్రోక్’తోనే మరణించారు. ఇలాంటి కారణాల వల్లనే గత మే 31వ తేదీ వరకు కాలి నడకన బయల్దేరిన వలస కార్మికుల్లో 46 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 17 ఏళ్ల బలిరామ్ కుమార్ బెంగళూరు నుంచి 25 రోజులపాటు నడిచి అక్కడికి చేరుకున్నారు. కాళ్లకు బూట్లు ఉన్నప్పటికీ పాదాలు బొబ్బలెక్కాయని, పాదాలతోపాటు మొత్తం వొళ్లంతా నొప్పులు సలిపేస్తున్నాయని ఆయన మీడియాకు తెలిపారు. (తిండి, నీళ్లు లేవు.. చుట్టూ శవాలే!) బిహార్లోని కతియార్ జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్న 20 ఏళ్ల వినోద్ యాదవ్ తాను 27 రోజులపాటు నడిచి బెంగళూరు నుంచి అక్కడికి చేరుకున్నట్లు చెప్పారు. ఇలా ఎంతో మంది ప్రాణాలకు తెగించి తమ స్వస్థలాలకు చేరుకున్న విషయం తెల్సిందే. దేశంలో కరవు కాటకాలు, కలరా లాంటి మమమ్మారీలు దాపురించినప్పుడే కాకుండా దేశ విభజన సందర్భంగా మత ఘర్షణలు చెలరేగినప్పుడు ఇలాగే మానవ వలసలు కొనసాగాయి. అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా 1942లో బర్మాలోని రంగూన్ నగరంపై జపాన్ బాంబులు వేసినప్పుడు కూడా వేలాది మంది భారతీయులు భారత్కు కాలి నడకన బయల్దేరారు. బర్మాను మయన్మార్ అని, రంగూన్ను యాంగన్ అని నేడు వ్యవహరిస్తారని తెల్సిందే. (ఇలాంటి కథలు...ఇంకెన్నో!) -
మాస్క్తో వ్యాయామం మంచిదేనా?
కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్క్లు తొడగడం నిత్యకృత్యమైపోయింది. అయితే కొందరు మాస్క్లు తొడిగే వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు చేస్తున్నారు. అయితే మాస్క్ పెట్టుకుని వ్యాయామం చేయడం మంచిదేనా? ఎక్సర్సైజ్ చేసే సమయంలో మాస్క్ తొడగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వ్యాయామం చేయడం సరైన పద్ధతి అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే మాస్క్ తొడిగి వ్యాయామం చేయాల్సి వస్తే... కొన్ని అంశాలను గమనించడమూ ఎంతో అవసరం. మాస్క్తో వ్యాయామం ఎంతవరకు మంచిదో చూద్దాం. మామూలుగానైతే మాస్క్లు మంచివే. వైరస్లనూ, వ్యాధి కారక క్రిములనూ చాలావరకు నిరోధిస్తాయి. తద్వారా వ్యాధులను నివారిస్తాయి. అయితే మీరు వాకింగ్గానీ, జాగింగ్ గానీ లేదా ఇతర వ్యాయామాలు చేసే సమయంలో మాస్క్ తొడిగితే ... ఆ తేడాను మీరే పసిగట్టగలరు. మామూలుగా వ్యాయామం చేసే సమయంలో అధిక శ్రమ కారణంగా మనకు కాస్తంత ఆయాసం రావడం మామూలే. అయితే ముక్కుకు అడ్డుగా ఏదీ లేనప్పుడు మామూలు కంటే మరింత ఎక్కువగా, ధారాళంగా గాలి పీలుస్తూ ఉంటాం. కానీ మాస్క్ అడ్డుగా ఉన్న సమయంలో మనం కాస్తంత తల బాగా తేలికైన ఫీలింగ్ (లైట్హెడెడ్నెస్) గానీ, కళ్లు తిరగడం గానీ, మగత గా అనిపించడం లేదా తగినంత చురుగ్గా లేకపోవడం, ఊపిరి అందకుండా ఉన్న ఫీలింగ్గానీ ఉంటే మాస్క్ వల్ల మీకు అందాల్సినంత ఆక్సిజన్ అందకుండా ఉందని అర్థం. అలాంటి సమయాల్లో మాస్క్ తొలగించి... జనసామాన్యానికి దూరంగా ఉంటూ వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం ముగించాక మళ్లీ మాస్క్ తొడుక్కోవచ్చు. తేలికపాటి నడక సాగించే వారు విడిగా ఇంట్లోనే మాస్క్ లేకుండా నడిచి... నడక ప్రక్రియ పూర్తి కాగానే మళ్లీ మాస్క్ ధరించడం మేలు. వ్యాయామం అప్పుడు అస్సలు మాస్క్ తొడగకుండానే ఉండాల్సిన వారు... మీరు గుండెజబ్బులతో బాధపడుతున్నవారా? లేదంటే... మీకు ఏవైనా శ్వాససంబంధమైన వ్యాధులున్నాయా? అలాగైతే వ్యాయామం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాధుల కారణంగా మీకు శ్వాసలో తగినంత ఆక్సిజన్ అందకపోతే ఇబ్బందులు ఖాయం. అందుకే వాకింగ్, బ్రిస్క్వాకింగ్ వంటివి చేస్తున్నప్పుడు మాస్క్ తొడగకుండా చేయడం అవసరం. అయితే బయట ఇప్పుడున్న వాతావరణంలో మాస్క్ తొడగకపోవడం అంత మంచిది కాదు కాబట్టి... మీరు ఇంటి ఆవరణలోనో, మేడపై ఖాళీస్థలంలోనో మాస్క్ లేకుండానే నడక కొనసాగించడం మంచిది. ఒకవేళ ఫేస్మాస్క్ ధరించక తప్పదని మీ డాక్టర్ చెబితే... మీరు వ్యాయామం మొదలుపెట్టే ముందర ఒకసారి మీ డాక్టర్ సలహా తప్పక తీసుకునే ఎక్సర్సైజ్ ప్రారంభించాలి. డాక్టర్ను నేరుగా కలవడం కుదరకపోతే ఫోన్లో సంప్రదించాలి. పేషెంట్ స్వయానా కనిపిస్తుండే టెలిమెడిసిన్ పద్ధతైతే ఇంకా మంచిది. చాలా కాలంగా వ్యాయామం చేయకుండా ఇప్పుడే మొదలుపెడుతున్నారా? చాలాకాలం నుంచి వ్యాయామం చేయకుండా ఉన్నవారు... వ్యాధినిరోధకతను పెంచుకునేందుకు ఇప్పుడు మొదలుపెట్టాలనుకుంటున్నవారూ చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లు మాస్క్ తొడిగే నేరుగా వ్యాయామం మొదలుపెట్టడం అస్సలు మంచిది కాదు. తొలుత తేలికపాటి వ్యాయామాలు/వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు చేస్తూ... క్రమంగా వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవడం అవసరం. చాలాకాలం వ్యాయామం చేయకుండా ఇప్పుడు వ్యాయామం మొదలుపెట్టగానే... మగతగా, కళ్లుతిరుగుతున్నట్లుగా, స్పృహతప్పుతున్నట్లుగానూ అనిపిస్తే వ్యాయామాలు ఆపేసి, డాక్టర్ను సంప్రదించండి. మాస్క్తో వ్యాయామం చేస్తే ఏమవుతుంది? మామూలుగా మనం శ్వాసించేటప్పుడు గాలి చాలా ఫ్రీగా ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అయితే ఫేస్కు మాస్క్ ఉన్నప్పుడు అది గాలిని నిరోధిస్తూ, దాని కదలికలకు అడ్డుపడుతుంది. దాంతో అందాల్సిన మోతాదులో ఆక్సిజన్ అందదు. మాస్క్ ఉన్నప్పుడు మన ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్లో ఎంతో కొంత కొరత ఉంటుంది. అలాగే మనం వదిలే గాలిలో ఉండే కార్బన్ డై యాక్సైడ్ మునపటిలా మొత్తం బయటి గాలిలోకే వెళ్లకుండా... ముక్కుకు ఆని ఉన్న మాస్క్ ప్రాంతంలోనే ఎక్కువ మోతాదు ఉండిపోతుంది. దాంతో మళ్లీ మరోసారి గాలి పీల్చినప్పుడు మొదటికంటే ఆక్సిజన్ తక్కువ అందడంతో పాటు, ముక్కుకు దగ్గరగానే ఉన్న కార్బన్ డైయాక్సైడ్ మళ్లీ లోపలికి ప్రవేశించడంతో అందాల్సిన ఆక్సిజన్ పాళ్లు మరింత తగ్గుతాయి. ఇలా ఆక్సిజన్ అందాల్సినంత మోతాదులో అందకపోవడంతో ఇటు గుండెకూ, అటు మెదడుకూ తగినంత ఆక్సిజన్ అందకనే ఇలా తల దిమ్ముగా ఉండటం, తల తేలికైపోయినట్లుగా ఉండటం, ఊపిరి అందకపోవడం వంటి పరిణామాలు ఎదురవుతాయి. మాస్క్ విషయంలో జాగ్రత్తలివి... ► ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులే ఉంటారు కాబట్టి... కుటుంబసభ్యుల్లో ఎవ్వరికీ ఫ్లూ, జలుబు వంటి లక్షణాలేవీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ తొడగకండి. అయితే కుటుంబసభ్యులైనా అందరూ తగినంత భౌతిక దూరం పాటిస్తూ ఉండాలి. ► ఇంటి ఆవరణలో లేదా మేడపైన విడిగా వ్యాయామం చేయాలి. ఇంట్లోని కుటుంబసభ్యులు వ్యాయామం చేస్తూన్నా కలివిడిగా కాకుండా విడివిడిగానే చేయాలి. ► బయటకు వెళ్లినప్పుడు తప్పక మాస్క్ ధరించే వెళ్లాలి. గుంపులు గుంపులుగా జనాలు ఉన్నచోటికి మీకు మాస్క్ ఉన్నా వెళ్లకండి. అక్కడ రద్దీ తగ్గాకే వెళ్లండి. తీవ్రమైన (హెవీ) వ్యాయామాలు చేసేవారు... ఇప్పుడు జిమ్లు, స్విమ్మింగ్పూల్స్ ఎలాగూ పనిచేయడం లేదు. అయితే పర్సనల్ జిమ్లలో లేదా తమకు అందుబాటులో ఉండే వస్తువులతో చాలా తీవ్రంగా వ్యాయామాలు (ఇంటెన్స్ ఎక్సర్సైజ్) చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెవీ వెయిట్లిఫ్టింగ్స్, స్ప్రింట్స్, ప్లయోమెట్రిక్స్, క్రాస్ఫిట్ సై్టల్ వర్కవుట్స్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్స్ (హిట్స్–హెచ్ఐఐటీ) వంటి వ్యాయామాలు చేసేవారు మాస్క్ తొడుక్కోకుండా చేయడం అవసరం. కార్డియో వ్యాయామాలు చేసేవారు కూడా ఇవే పద్ధతులు అవలంబించాలి. మీకు తగినంత ఆక్సిజన్ అందుతుందో లేదో గుర్తించడం ఎలా? ఆక్సిజన్ తగినంతగా అందుతుందా లేదా అన్నది తెలుసుకోడానికి ఉత్తమమైన మార్గం పల్స్ ఆక్సీమీటర్ను ఉపయోగించడం. దానిద్వారా మన రక్తంలోని ఆక్సిజన్ మోతాదు ఎంత ఉందో తక్షణం తెలిసిపోతుంది. అయితే ఇలాంటి ఉపకరణాలు ఆసుపత్రుల్లో మాత్రమే ఉంటాయి కాబట్టి... మన దేహస్పందనలను జాగ్రత్తగా గమనించడం ద్వారా మనకు మనంగా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. వ్యాయామం చేస్తున్న సమయంలో భరించలేనంత శ్రమ...ఊపిరందకపోవడం, (వ్యాయామంలో ఎంతో కొంత ఆయాసం ఉంటుందిగానీ... అది పూర్తిగా గాలి ఆడనంత తీవ్రంగా ఉంటే)... తల బాగా తేలికయిపోయినట్లు ఉండటం, అవయవాలు మొద్దుబారినట్లు అనిపించడం, తిమ్మిర్లుగా అనిపించడం, నిస్సత్తువగానూ, నీరసంగానూ, నిద్రవస్తున్నట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం వ్యాయామం ఆపేయాలి. పైన పేర్కొన్నవన్నీ మన ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ లభ్యం కావడం లేదనడానికి సూచనలు. అలాంటప్పుడు అన్ని రకాల వ్యాయామాలు ఆపేసి, డాక్టర్ సంప్రదించి, మళ్లీ మీ డాక్టర్ వ్యాయామాలు చేయడానికి అనుమతించాకే మొదలుపెట్టాలి. -
వందల కిలోమీటర్లు నడిచి..
-
ఇలా చేస్తే ఏడు రకాల క్యాన్సర్లకు చెక్..
న్యూయార్క్ : వారానికి రెండున్నర గంటలు లేదా రోజుకు దాదాపు 20 నిమిషాలు పైగా వేగంగా నడిస్తే ఏడు రకాల క్యాన్సర్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. ఈ తరహా వ్యాయామంతో స్త్రీ, పురుషులు లివర్ క్యాన్సర్ ముప్పును 18 శాతం, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 6 శాతం మేర తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. వారానికి ఏడు గంటల పాటు వేగంగా నడిస్తే ఈ ముప్పు 10 శాతం తగ్గుతుందని తేల్చారు. వారానికి రెండున్నర గంటల పాటు వేగంగా నడిస్తే కిడ్నీ క్యాన్సర్ ముప్పును 11 శాతం, ఐదుగంటల వ్యాయామంతో 17 శాతం మేర ఈ ముప్పును తగ్గించవచ్చని వెల్లడించారు. బ్రిస్క్ వాకింగ్ చేసే పురుషుల్లో జీర్ణవాహిక క్యాన్సర్ ముప్పు 14 శాతం మేర తగ్గినట్టు గుర్తించారు. ఇక స్త్రీ, పురుషులిద్దరిలో బ్లడ్ క్యాన్సర్ ముప్పు 19 శాతం తగ్గినట్టు వెల్లడైంది. వ్యాయామంతో బరువు తగ్గడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని, చురుకైన వ్యక్తులు వ్యాయామం చేయడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లను నియంత్రించుకోగలుగుతారని ఈ ఫలితాలు వెల్లడించాయని పరిశోధకులు తెలిపారు. 7.5 లక్షల మందిపై పదేళ్ల పాటు పరిశోధనలు చేపట్టిన అనంతరం ఈ అవగాహనకు వచ్చినట్టు అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన సహ రచయిత డాక్టర్ అల్ఫా పటేల్ వెల్లడించారు. వేగంగా నడవటం వంటి సరళమైన వ్యాయామంతో పలు రకాల క్యాన్సర్ల ముప్పును నిరోధించవచ్చని పరిశోధనలో వెల్లడవడం నిజంగా అద్భుత ఫలితమేనని పరిశోధకులు విశ్లేషించారు. -
వేకువజామున విషాదం
దొడ్డబళ్లాపురం: వాకింగ్ వెళ్లిన యువకుడిని ఏనుగు తొక్కి చంపివేసింది. ఈ ఘటన కనకపుర తాలూకా నారాయణపుర గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. టీ బేకుప్పె గ్రామానికి చెందిన చేతన్కుమార్(25) బుధవారం తెల్ల వారుజామున స్నేహితులతో కలిసి కోడిహళ్లి మెయిన్రోడ్డులో వాకింగ్కు వెళ్లాడు. ఇద్దరు స్నేహితులు వాకింగ్ చేస్తూ వేగంగా వెళ్లగా చేతన్ వెనుకబడిపోయాడు. ఆ సమయంలో హఠాత్తుగా చెట్ల మధ్య నుండి వచ్చిన ఏనుగు చేతన్పై దాడిచేసి తొక్కి చంపింది. ఎంతసేపయినా చేతన్ రాకపోవడంతో మొబైల్కు కాల్ చేశారు. సమాధానం రాకపోవడంతో వెనక్కు వెళ్లి చూడగా చేతన్ మృతదేహం కనిపించింది. ఘటనాస్థలాన్ని అటవీశాఖ అధికారులు, పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కనకపుర గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఒకే పని... రెండు లాభాలు
ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న కాలుష్యానికి మున్ముందు మన తెలుగు రాష్ట్రాల నగరాలూ, పట్టణాలూ మినహాయింపు కాదు. కాకపోతే ఇప్పుడు అంతే తీవ్రత ఇక్కడ లేకపోవచ్చు. అటు పర్యావరణం, ఇటు మన వ్యక్తిగత ఆరోగ్యం... ఈ రెండూ బాగుపరచుకుంటూ ఢిల్లీ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా చూసుకోడానికి మనం చేయాల్సిందొకటే. ఆ ఒక్క పనితోనే ఒనగూరే ప్రయోజనాలు రెండు!! మొదటిది మన ఆరోగ్యం.రెండోది మన పర్యావరణ రక్షణ. ఒకే పనితో రెండు ప్రయోజనాలంటే మనకెంత లాభం! డబుల్ బెనిఫిట్ కదా. ఒకే దెబ్బకు రెండు పిట్టలు దొరుకుతుంటే మరెందుకు ఆలస్యం. అనుసరిద్దాం. అటు మన దేహ ఆరోగ్యానికీ... ఇటు మన ధరిత్రి ఆరోగ్యానికీ ప్రయోజనాలు చేకూరేలా చేసుకుందాం. వాకింగ్ ఇలా... వాకింగ్ చాలా మంచి వ్యాయామం అన్నది అందరికీ తెలిసిన విషయమే. వాకింగ్ను కేవలం వ్యాయామంలా మాత్రమే గాక... వీలైనంత వరకు చిన్న దూరాలకూ ప్రతి రోజూ చేస్తూనే ఉండాలి. దీంతో మనకు రెండు లాభాలు. మొదటిది మోటార్సైకిల్గానీ, కార్లుగానీ ఉపయోగించనందున కర్బన కాలుష్యం తగ్గుతుంది. ఇక మనలో చాలామంది వాకర్స్ క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తూనే ఉంటారు. ఉదయాన్నే ఆరుబయటకు వెళ్లి వాకింగ్ చేయలేని చాలామంది ట్రెడ్ మిల్ని ఉపయోగిస్తుంటారు. మనం స్విచ్ ఆన్ చేసే ప్రతి విద్యుత్ ఉపకరణం వాతావరణ కాలుష్యానికి దోహదం చేస్తుంటుందన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి నడక వ్యాయామం చేయాలనుకున్నవారు వీలైనంత వరకు ఆరుబయటే వాకింగ్ చేయడం మంచిది. దీని వల్ల రెండు ప్రయోజనాలు. మొదటిది విద్యుత్ వినియోగం తగ్గి వాతావరణం బాగుపడుతుంది. రెండోది ఆరుబయట నడకతో తాజా ఉదయపు తాజాగాలి పీల్చడం వల్ల దేహ ఆరోగ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం... రెండూ మెరుగవుతాయి. అయితే ఏదైనా కారణాల వల్ల ఆరుబయట వాకింగ్కు వెళ్లలేని పరిస్థితి ఉంటే ఎలక్ట్రిసిటీ సహాయం లేకుండా కాళ్లతోనే వెనక్కు నెడుతూ నడిచే ట్రెడ్మిల్ మిషన్తోనే వాకింగ్ చేయడం చాలా మంచిది. చిన్న దూరాలకు సైకిల్ ఈమధ్య మనం కొద్దిపాటి దూరాలకు కూడా మోటార్సైకిల్ లేదా మోటార్ వాహనాన్ని ఉపయోగించడం బాగా పెరిగిపోయింది. మనం సైకిల్ను ఉపయోగిస్తే రెండు లాభాలు చేకూరతాయి. మొదటిది మన దేహానికి మంచి వ్యాయామం. దీనివల్ల మోకాళ్లు, కాలి కండరాలు బలంగా మారతాయి. సైక్లింగ్ వల్ల మోకాళ్ల నొప్పులు పెరుగుతాయని కొందరు అపోహ పడుతుంటారు.సైక్లింగ్లో మన బరువు మోకాళ్ల మీద పడదు. కాబట్టి అది వాస్తవం కాదు. అప్పటికే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు మినహా మిగతావారంతా నిరభ్యంతరంగా సైక్లింగ్ చేయవచ్చు. ఇక మోటారుసైకిల్ /మోటారు వాహనాన్ని ఉపయోగించకపోవడం వల్ల ఇంధన ఆదా అవుతుంది. దాంతో వాతావరణంలోకి వెలువడే కర్బన కాలుష్యాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఒక మొబైలే వాడండి... చాలామంది కొత్త కొత్త ఫీచర్లతో కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినప్పుడల్లా తమ పాత మొబైల్ మార్చేస్తుంటారు. ఎంతో అవసరమైతేనో తప్ప మీ పాత మొబైల్ మార్చకండి. ఎందుకంటే మీరు వాడి పారేసే ఒక సెల్ఫోన్ భూమిలోకి చేరాక దాని నుంచి వచ్చే వ్యర్థాలు కనీసం 1,32,000 లీటర్ల నీటిని కలుషితం చేస్తాయి. అది పూర్తిగా చెడిపోయి వృథా పదార్థంగా మారాక దాంట్లోంచి లెడ్, క్యాడ్మియం, బ్రోమినేటెడ్ వ్యర్థాలు, ఆర్సినిక్ వంటి విషపదార్థాలు పర్యావరణంలోకి కలుస్తాయి. ఒకవేళ మీరు మీ క్రేజ్ కొద్దీ తప్పనిసరిగా సెల్ మార్చాలనుకుంటే ముందుగా దాన్ని ఎవరైనా అవసరం ఉన్నవారికి ఇవ్వండి. త్వరగా నిద్ర పోవాలి మూడు నాలుగు దశాబ్దాల కిందట మనమంతా ఏ ఎనిమిదికో లేదా తొమ్మిదికో పడుకునేవాళ్లం. అయితే ఈ సమయం కాస్తా క్రమంగా వెనక్కుపోతూ ఇప్పుడు రాత్రి ఒంటిగంటకు నిద్రపోవడం అన్నది చాలా సాధారణంగా మారిపోయింది. దీనివల్ల ఆరోగ్యంపై కలిగే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. మనం నిద్రపోయే ఒంటిగంట లేదా రెండు వరకూ కేవలం విద్యుద్దీపాలే కాకుండా కంప్యూటర్లు, టీవీ, మైక్రోఓవెన్, మ్యూజిక్సిస్టమ్ వంటివి కూడా పనిచేస్తుంటాయి. ఫలితంగా విద్యుత్తు వినియోగం పెరగడం, ఆ విద్యుత్తుకు ప్రధాన వనరులైన బొగ్గు, గ్యాస్ వినియోగం పెరిగి పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే నిద్రవేళలు వెనక్కి వెళ్లడం అటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని, ఇటు పర్యావరణ ఆరోగ్యాన్ని భగ్నం చేస్తోంది. నిద్రపోయే వ్యవధి తగ్గడం స్థూలకాయానికి దారితీస్తుంది. స్థూలకాయం కారణంగా కీళ్లనొప్పులు, రక్తపోటు, డయాబెటిస్ వంటి అనేక అనారోగ్యాలు వస్తాయి. పైగా నిద్ర తగ్గడం వల్ల జీవక్రియల్లో సమతౌల్యం దెబ్బతింటుంది. ఇక ఘ్రెలిన్ అనే మరో హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఇది ఆకలిని పుట్టించే హార్మోన్. మనం నిద్రపోయే గంటలు తగ్గినప్పుడు ఆకలి పెరిగి అనవసరమైనవన్నీ తింటూ ఉంటాం. దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే త్వరగా నిద్రపోవడం మన ఆరోగ్యానికీ, పర్యావరణినికీ మంచిది. నో కూల్ డ్రింక్స్ మీరు పానీయాలు తీసుకోవాలనుకుంటే కూల్డ్రింక్స్ బదులు తాజా పళ్ల రసాలే తీసుకోండి. కూల్డ్రింక్స్ తయారు చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో నీళ్లను ఉపయోగించాలి. అంతేకాదు... ఇందులో షుగర్స్/ తీపినిచ్చే పదార్థాలు సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, సిట్రిక్ యాసిడ్, కలర్స్, ఫాస్ఫారిక్ యాసిడ్, నీళ్లు, కొంత కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి. వీటిల్లో పురుగుమందుల అవశేషాలుంటాయని రుజువైంది. కూల్డ్రింక్స్లోని చక్కెర కారణంగా పిల్లలు/పెద్దల్లో ఊబకాయం వస్తుంది. ఇది డయాబెటిస్ వచ్చే రిస్క్ను పెంచుతుంది. ఇక కూల్డ్రింక్స్లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ దంతాలపై ఉండే అనామెల్ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫారిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల క్యాల్షియం మెటబాలిజమ్ దెబ్బతింటుంది. ఫలితంగా ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో ఉండే కృత్రిమ రంగులు శరీరానికి హానికరం. వీటిని బయటకు పంపే ప్రక్రియలో మూత్రపిండాలు చాలా ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు పాడవుతా యి. కూల్డ్రింక్స్ను నిల్వ ఉంచే రసాయనాల వల్ల పిల్లల్లో అతి ధోరణులు పెరుగుతాయి.. మన డీఎన్ఏలోని కీలకమైన అంశాలను కూడా ఈ రసాయనం దెబ్బతీస్తుందని కొన్ని బ్రిటిష్ పరిశోధనలు చెబుతున్నాయి. డాక్టర్ జి. నవోదయ కన్సల్టెంట్, జనరల్ మెడిసన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నడకతో నగరంపై అవగాహన
శోభన.. ఉద్యోగరీత్యా చెన్నై నుంచి హైదరాబాద్కి బదిలీపై వచ్చింది. నగరానికి వచ్చి కొన్ని వారాలు గడిచినా.. పనులు, వసతి ఏర్పాట్లలో తలమునకలైంది. ఆమెకు స్నేహితులు ఎక్కువ మంది లేకపోవటంతో పనులు తెమలక మరింత ఇబ్బంది పడేది. సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తుండగా సిటీలోని ప్రముఖ ప్రాంతంలో వాక్ నిర్వహిస్తున్నారనే సమాచారం కంటపడింది. వెళితే కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుందనే తలంపుతో అందులో పాల్గొంది. వాక్లో నగర పరిచయంతో పాటు తనలాంటి మైండ్సెట్ ఉన్న మిత్రులు ఆమెకు పరిచయమయ్యారు. ఇంకేముంది. ఇప్పడు శోభనకి సిటీ అంతా పరిచయమైంది. కొత్త ప్రాంతంగా అనిపించట్లేదు. నగరంలోని చారిత్రక ప్రాంతాలు, పార్కులు, మార్కెట్లు,ఆలయాలు ఇలా పలు వాక్లలో పాలుపంచుకుంది. హైదరాబాద్ని తెలుసుకుంటూ, తన సిటీగా ఫీల్ అవుతోంది. కొత్తగా వచ్చిన వారికే కాదు.. నగరవాసులకు సైతం ఈ వాక్లు సిటీ ప్రాముఖ్యతనుపరిచయం చేస్తున్నాయి. ఒక రకంగా ఇది ఒక కొత్త ట్రెండ్గా మారింది. నగర చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, ప్రత్యేకతలు తెలుసుకోవడానికి ఇంతకంటే చక్కటి మార్గం లేదంటున్నారు వాకర్స్. నగరం గురించి కొత్తవారికి తెలియజెప్పడంలో ఆనందం ఉందంటున్నారు వాక్ లీడర్స్.ఆ వివరాలేమిటో తెలుసుకుందాం. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రెండ్గా మారిన వాక్లను ఆయా సంస్థలు, కొంతమంది వ్యక్తిగతంగా కూడా నిర్వహిస్తున్నారు. సంస్థలైనా వ్యక్తులైనా సోషల్ మీడియా వేదికగా తమ ఈవెంట్లను ప్రమోట్ చేసుకుంటున్నారు. వీకెండ్, సెలవు దినాల్లో ఈ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. హైదరాబాద్కు సంబంధించిన ఫేస్బుక్, మీటప్ పేజీల్లో ఈ సమాచారం లభిస్తోంది. కేవలం ‘వాక్’నే కాదు.. ఇక వాక్ అంటే అలా కాసేపు సరదాగా నడిచి వచ్చేయటం కాదు. హెరిటేజ్ వాక్ అయితే ఆ కట్టడం నిర్మాణ శైలి నుంచి మొదలు నిర్మించిన వ్యక్తి, ఆ కట్టడానికి సంబంధించిన పూర్తి చరిత్ర తెలియచేస్తారు. ఇక బజార్లు, పండగ రోజుల్లో నిర్వహించే వాక్లలో ఆ ప్రాంతంలో ఏ వస్తువులు దొరుకుతాయి, ఆ ప్రాంతం ప్రాముఖ్యతలు, ప్రముఖ ఘట్టాలు ఇలా అన్ని వివరిస్తారు. పార్క్లు, టూంబ్స్, ప్యాలెస్లు, కోటలు, పురాతన భవనాలు, గ్రంథాలయాలు, చర్చిలు, నాటి బజార్లు, నగరానికి దగ్గరలో ఉన్న కొండలు, గుట్టలు, అడవులు, జలాశయాలు ఇలా మన ఆసక్తిని బట్టి ఆయా వాక్లను ఎంచుకోవచ్చు. ఎన్నో రకాలు.. చార్మినార్, ట్యాంక్బండ్, గోల్గొండ, కుతుబ్షాహీ టూంబ్స్, పురానాపూల్, మొజంజాహీ మార్కెట్, చౌమహల్లా ప్యాలెస్, అమీన్పురా చెరువు, వికారాబాద్ ఫారెస్ట్, మౌలాలి గుట్ట, ఇలా నగరంలోని ఎన్నో ప్రాంతాల్లో అనేక వాక్లు నిత్యం నిర్వహిస్తూనే ఉంటారు. దసరా, రంజాన్, క్రిస్మస్ లాంటి పండగ సమయాల్లోనూ వాటికి సంబంధించిన వాక్లు నిర్వహిస్తుంటారు. వీటిలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, స్కెచ్చింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాక్లు కూడా ఉంటాయి. ఈ వాక్లలో పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వీటిలో ఆయా వ్యక్తులు, సంస్థలను బట్టి ఫీజులున్నాయి. వాక్ నిర్వాహకులు ఈ వివరాలను ముందే తెలియజేస్తారు. ఎంతో ఆనందం..నేను హైదరాబాదీని. అధ్యాపక వృత్తిలో ఉన్నాను. నగరానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివాను. దాదాపు నగరంలో ఉన్న అన్ని చారిత్రక కట్టడాలు, ప్రాంతాల గురించి తెలుసు. నగరానికి కొత్తగా వచ్చే అనేక మంది మిత్రులుకు విద్యార్థులకు సిటీ గురించి చాలా విషయాలు తెలియజేస్తుంటాను. ఆసక్తి ఉన్న వారికి వాటి గురించి తెలియజేయటంలో మరింత ఆనందం కలుగుతుంది. ఇప్పటి వరకు ఇండియా హెరిటేజ్ వాక్స్ వారి తరఫున సాలార్జంగ్ మ్యూజియం, మొజాంజాహీ మార్కెట్ ఇలా పలు వాక్స్ నిర్వహించాను. – మహమ్మద్ అబ్దుల్ నయీం, వాక్ లీడర్ చాలా విషయాలు తెలుస్తాయి.. నాకు సిటీలో ఉండే డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చెయ్యాలంటే ఇష్టం. నాస్తా ఏ సుబాహ్ అనే ఈవెంట్ గురించి ఫేస్బుక్లో చూశాను. అబిడ్స్లో టేస్టీ టిఫిన్ సెంటర్స్లో ఫుడ్ టేస్ట్ చేశాను. సెంటర్ ఆఫ్ సిటీలో తక్కువ ధరకు ఇంత మంచి ఫుడ్ దొరుకుతుందని ఈ వాక్ వల్లే తెలిసింది. ఫస్ట్ టైం వెళ్లాను. ఫుడ్ అంటే ఇష్టమున్న వాళ్లని కలుసుకున్నా. – చందనశ్రేయ, వాకర్ -
అంత చెమటలు కక్కాల్సిన అవసరం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : కండలు పెంచుకోవడానికి కొందరు, ఆరోగ్యంగా ఉండేందుకు మరికొందరు పోటీలు పడి జిమ్లకు వెళుతుంటారు. చెమటలు కక్కుతూ ప్రయాస పడి కసరత్తులు చేస్తుంటారు. ‘అమ్మో! ఆ బరువులు ఎత్తడం మనవల్ల కాదు బాబోయో! ’ ఇంకొందరు జిమ్కు వెళ్లాలంటేనే భయపడతారు. అలాంటి వారు ఆరోగ్యం కోసం సహజంగానే జాగింగ్ లేదా వాకింగ్ను ఎంచుకుంటారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు అంత చెమటలు కక్కాల్సిన అవసరం లేదని, అంతగా కసరత్తు చేయాల్సిన అవసరం లేదని ఓ అధ్యయనం తెలిపింది. కనీసం రోజుకు 13 నిమిషాల చొప్పున వారానికి 90 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలట. వారి ఆయుర్దాయం మూడేళ్లు పెరుగుతుందట. అందుకోసం జిమ్లకు, జాగింగ్లకు వెళ్లాల్సిన అవసరం లేదట. రోజుకు 13 నిమిషాలకు తగ్గకుండా వారానికి 90 నిమిషాల పాటు ఇంటి పట్టునో, రోడ్డు మీదనో వాకింగ్ చేస్తే, మైదానానికి వెళ్లి చిన్న చిన్న కసరత్తులు చేస్తే ఏమీ చేయని వారికన్నా మూడేళ్ల ఆయుర్దాయం పెరుగుతుందని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆరోగ్య బీమా సంస్థ ‘వైటాలిటీ’ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కనీస వ్యాయామం చేయని వారి నుంచి కనీస వ్యాయామం, ఎక్కువ వ్యాయామం చేసే వారి వరకు 1,40,000 మందిని ఎంపిక చేసుకొని వారి ఆరోగ్యం, ఆయుర్దాయంపై వైటాలిటీ సంస్థ కొన్నేళ్లపాటు అధ్యయనం జరిపింది. ఎలాంటి వ్యాయామం చేయని వారికంటే వారానికి 90 నిమిషాలు వ్యాయామం చేసిన వాళ్లు మూడేళ్లు అధికంగా, అలాగే రోజుకు 25 నిమిషాల చొప్పున వారానికి మూడు గంటలపాటు వ్యాయామం చేస్తే నాలుగేళ్లు అధికంగా జీవిస్తారట. వ్యాయామంలో మంచి ఫలితాల గురించి తెల్సి కూడా దీనికున్న ప్రాధాన్యతను కొందరు ప్రజలు ఇప్పటికీ గుర్తించరని ఈ తాజా అధ్యయనాన్ని పరిశీలించిన ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్’ అధ్యక్షుడు లార్డ్ సబాస్టియన్ కో వ్యాఖ్యానించారు. కేవలం ఆయుర్దాయం పెరగడం కోసమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు, వత్తిలో అధిక ఉత్పత్తిని సాధించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. వైటాలిటీ ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులపైనే ఈ అధ్యయనం జరిపి, వారిలో ఆరోగ్యం కాపాడుకోవడానికి వ్యాయామం చేస్తున్న వారికి అదనపు రాయతీలను కల్పించింది. పాలసీదారులు ఎంత ఎక్కువ కాలం జీవిస్తే బీమా సంస్థకు అంత లాభాలు గదా! -
గర్భవతులకు నడక మంచి వ్యాయామం!
స్వాభావిక ప్రసవం (నాచురల్ డెలివరీ) కోసం అందరూ తాపత్రయపడతారు. మంచి శారీరక వ్యాయామం ఉన్నవారికి నాచురల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు తేల్చాయి. వాకింగ్ వల తుంటి కండరాల్లో సాగే గుణం పెరుగుతుంది. ఈ అంశమే వారిలో సుఖంగా ప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది. అయితే గర్భవతులకు నడక చాలా మంచి వ్యాయామం అంటున్నారు నిపుణులు. గర్భం ధరించి ఉన్న మహిళలు వాకింగ్ చేయడం అంత మంచిది కాదనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. గర్భవతులకు వాకింగ్ కంటే మంచి వ్యాయామం మరొకటి లేనేలేదు. ఒక మహిళ తాను గర్భం దాల్చడానికి ముందు ఉన్న ఫిట్నెస్ను బట్టి తానెంతదూరం హాయిగా, శ్రమలేకుండా నడవగలన్న అంశాన్ని నిర్ణయించుకొని ఆ మేరకు నడవవచ్చు. ఇలా గర్భం దాల్చి ఉన్నప్పుడు నడక కొనసాగించడం అటు తల్లికీ, ఇటు కడుపులోని బిడ్డకూ ఇరువురికీమంచిది. అయితే గర్భవతులు నడక వ్యాయామాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు ఒకసారి తమ డాక్టర్ను సంప్రదించి, తన ఫిట్నెస్ ఎంత, ఎంతసేపు నడవాలి అనే అంశాలను తెలుసుకున్న తర్వాతే నడక కొనసాగించడం మంచిది. కాబోయే తల్లికీ, బిడ్డకూ నడక ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి. ♦ కాబోయే తల్లి నడక వ్యాయామాన్ని కొనసాగించడం వల్ల కడుపులోని బిడ్డ బరువు ఆరోగ్యకరమైన విధంగా పెరుగుతుంది. ప్రసవం సమయానికి ఎంత బరువు ఉండాలో అంతకు చేరుతుంది. అంతేకాదు... స్వాభావికమైన ప్రసవం (నేచురల్ డెలివరీ) అయ్యేందుకు నడక దోహదం చేస్తుంది. ♦ నడక వల్ల కాబోయే తల్లి బరువు అదుపులో ఉండటమే కాకుండా... ఆ సమయంలో సాధారణంగా మహిళల్లో కనిపించే జెస్టేషనల్ డయాబెటిస్ను నడక నివారిస్తుంది. ♦ గర్భవతుల్లో ఒత్తిడి అనేది చాలా సాధారణంగా కనిపించే అంశం. అన్ని వ్యాయామాల్లో లాగే నడక వల్ల కూడా ఒంట్లో ఆరోగ్యకరమైన ఎండార్ఫిన్లు, సంతోషాన్ని కలిగించే రసాయనాలు వెలువడి గర్భవతుల్లో ఒత్తిడిని తొలగించడంతో పాటు వారిని మరింత హాయిగా సంతోషంగా ఉండేలా చూస్తాయి. ♦ వాకింగ్ వల్ల వేవిళ్ల సయంలో కనిపించే వికారం తగ్గుతుంది. అలసట, కండరాలు పట్టేయడం (క్రాంప్స్) తగ్గుతాయి. మలబద్దకం రాదు. వేరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు నివారితమవుతాయి. గర్భవతుల్లో సహజంగా కనిపించే రాత్రివేళ నిద్రపట్టకపోవడం అనే లక్షణం నివారితమై, కంటినిండా నిద్రపడుతుంది. -
‘కేబీఆర్’లో రన్నింగ్, జాగింగ్ నిషేధం
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని కేబీఆర్ పార్కును కేవలం వాకింగ్కు మాత్రమే వినియోగించుకోవాలని... ఇక్కడ రన్నింగ్, జాగింగ్ చేయరాదంటూ జిల్లా అటవీ శాఖాధికారి సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. ఈ మేరకు పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నోటీసు బోర్డులో రన్నింగ్, జాగింగ్ను నిషేధించినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 3వేల మందికి పైగా, సాయంత్రం 1500 మందికి పైగా వాకర్లు పార్కులో వాకింగ్ చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులను ట్రైనర్లుగా నియమించుకొని పార్కులో రన్నింగ్, జాగింగ్ చేస్తున్నారు. దీంతో అసలే ఇరుగ్గా ఉండే వాకింగ్ ట్రాక్పై వాకర్లకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ పార్కులో వెయ్యి మందికి పైగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తుంటారు. వేగంగా పరుగెత్తుకొస్తున్న వారితో వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొన్నిసార్లు పరుగెత్తుకొస్తున్న వారు పొరపాటున వీరికి తగులుతుండడంతో కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్ సిటిజన్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాగింగ్, రన్నింగ్ను అధికారులు నిషేధించారు. -
నడకతో ఆ ముప్పుకు చెక్..
లండన్ : రోజూ అరగంట పాటు నడిస్తే అనారోగ్యం దరిచేరదని ఇప్పటికే పలు అథ్యయనాలు స్పష్టం చేయగా, నిత్యం వాకింగ్తో స్ర్టోక్, గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. గతంలో స్ర్టోక్ బారిన పడినవారు రోజూ 35 నిమిషాలు నడిస్తే తదుపరి భారీ స్ర్టోక్ ముప్పును తప్పించుకోవచ్చని ఈ అథ్యయనంలో గుర్తించామని స్వీడన్కు చెందిన గొతెన్బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కథారినా సనర్హెగెన్ చెప్పారు. శారీరక చురుకుదనం మెదడు పనితీరును కాపాడుతుందని తమ పరిశోధనలో తేలిందని చెప్పుకొచ్చారు. సగటున 73 సంవత్సరాల వయసు కలిగి గతంలో స్ర్టోక్కు గురైన 925 మంది వృద్ధులపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయన్నారు. తేలికపాటి, ఒక మాదిరి సంక్లిష్ట వ్యాయామాలు చేసే వారితో పోలిస్తే చురుకుదనం లోపించిన వారిలో స్ర్టోక్ ముప్పు రెట్టింపుగా ఉందని అథ్యయనంలో వెల్లడైంది. వారంలో చేసే చిన్నపాటి శారీరక కదలికలు సైతం తర్వాతి కాలంలో స్ర్టోక్ తీవ్రతను తగ్గించేలా పెనుప్రభావం చూపుతాయని తమ పరిశోధనలో తేలిందని ప్రొఫెసర్ సనర్హెగెన్ వెల్లడించారు. తాజా అథ్యయన వివరాలు జర్నల్ న్యూరాలజీలో ప్రచురితమయ్యాయి. -
ఆదర్శంగా నిలిచినరెండేళ్ల బుడతడు
-
లక్షల మందికి ఆదర్శంగా నిలిచిన బుడతడు
చిన్న చిన్న సమస్యలకే భయపడుతూ.. క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని ముగించుకునే వారేందరో. అలాంటి వారందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రెండేళ్ల బుడతడు. నడవడమే అసాధ్యమన్న డాక్టర్లు ఇప్పుడు ఆ చిన్నారి అడుగులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ బుడిబుడి అడుగులే ఇప్పుడతన్ని ఇంటర్నెట్ స్టార్గా మార్చాయి. పెంపుడు కుక్కతో పాటు అడుగులేస్తున్న రోమన్ డింకిల్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. ఈ చిట్టి అడుగులే ఇప్పుడు జీవితం మీద ఆశలు కోల్పోయిన ఎందరికో నమ్మకాన్ని కల్గిస్తున్నాయి . రోమన్ తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. ‘గర్భంలో ఉన్నప్పుడే రోమన్కి వెన్నెముకకు సంబంధించిన అనారోగ్యం తలెత్తింది. అయినా పిండం ఎదుగుదలకు మాత్రం ఎటువంటి ఆటంకం కలగలేదు. రోమన్ జన్మించిన తరువాత అతను నడవడం అసాధ్యమన్నారు డాక్టర్లు. కానీ మేము మాత్రం మా బిడ్డ చేత నడిపించాలనుకున్నాము. అందుకు ఎన్నో ఆస్పత్రులకు తిరిగాము. ఒక 4 నెలల క్రితమే రోమన్కి అల్ట్రా సౌండ్ చికిత్స చేయించాము. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత రోమన్ చేత నడక ప్రయత్నాలు చేయించేవాళ్లం. కానీ కొద్ది దూరం నడవగానే పడిపోయేవాడు. దాంతో నేను లేదా నా భర్త పక్కనే ఉండి తనను పట్టుకొని నడిపించే ప్రయత్నం చేసేవాళ్లం. అలాంటిది ఉన్నట్టుండి ఒక రోజు చాలా ఆశ్యర్యకరమైన సంఘటన జరిగింది. మా ఇంట్లో మాగీ అనే పెంపుడు కుక్క ఉండేది. అదంటే రోమన్కి చాలా ఇష్టం. ఆ రోజు మాగీ రోమన్ ముందుకు రాగానే వాడు సంతోషం పట్టలేకపోయాడు. దాన్ని చూస్తూ ఆ సంతోషంలో దానితో పాటు నడవడం ప్రారంభించాడు. రోమన్ నడవడం చూసి నాకు కన్నీరు ఆగలేదు. నా సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలని అనుకున్నాను. అందుకే ఈ వీడియోను ఇంటర్నెట్లో పోస్ట్ చేశాను. కానీ ఇంత భారీ స్పందన వస్తుందనుకోలేదు. ఇప్పటికే ఈ వీడియోను కొన్ని లక్షల మంది చూశారు. వారందరు మా రోమన్ను పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. -
‘ఇడియట్’ సినిమా గుర్తుందా..?
బుధవారం రాత్రి 10 గంటలు బషీర్బాగ్లోని కమిషనరేట్... అప్పుడే పని ముగించుకున్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్... ఇంటికి బయలుదేరడానికి సిద్ధం కావడంతో రెడీ అయిన వాహన శ్రేణి... తన వెహికిల్ను వదిలి కాలినడకన అంబర్పేట్లోని ఇంటికి వెళ్లిన సీపీ... దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ ‘పాదయాత్ర’లో అనేక కీలకాంశాలు తన దృష్టికి వచ్చాయని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: రవితేజ హీరోగా నటించిన ‘ఇడియట్’ సినిమా గుర్తుందా..? అందులో పోలీసు కమిషనర్ పాత్ర పోషించిన ప్రకాష్రాజ్ బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన రోజు రాత్రి నగరంలో మారువేషంలో తిరుగుతూ కొన్ని లోపాలను గుర్తిస్తారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సైతం బుధవారం రాత్రి దాదాపు ఇదే పని చేశారు. కమిషనర్ కార్యాలయం నుంచి ఆయన తన ఇంటి వరకు గంటన్నరపాటు కాలినడకనే వెళ్లారు. సాధారణ దుస్తుల్లో బయటకు... బుధవారం రాత్రి 10 గంటలకు తన కార్యాలయం నుంచి బయలుదేరిన సమయంలో కొత్వాల్ అంజనీకుమార్ సాధారణ దుస్తుల్లో ఉన్నారు. నీలిరంగు ట్రాక్, ఎర్రరంగు టీషర్ట్తో పాటు స్పోర్ట్ షూస్ ధరించి, ఓ చేతిలో తన సెల్ఫోన్తో బయలుదేరారు. ఈయనకు దాదాపు 100 మీటర్ల దూరంలో సఫారీ దుస్తుల్లో ఉన్న గన్మెన్ అనుసరించగా...అర్ధగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆయన కాన్వాయ్ వెంట వెళ్ళింది. బషీర్బాగ్ నుంచి హిమాయత్నగర్, నారాయణగూడ, తిలక్నగర్, ఛే నంబర్, శ్రీ రమణ థియేటర్, అంబర్పేట్ మీదుగా దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచిన కొత్వాల్ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ పోలీసు లైన్స్లో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు. మార్గమధ్యంలో కొందరు చిరు వ్యాపారులతోనూ ఆయన ముచ్చటించారు. అత్యధికులు సాధారణ దుస్తుల్లో, నడుచుకుంటూ వస్తున్న పోలీసు కమిషనర్ను గుర్తించలేదు. మందుబాబులు... ట్రాఫిక్ ఇబ్బందులు... ఈ మార్గంలోని పరిస్థితులను గమనించాలనే ఉద్దేశంతో ‘పాదయాత్ర’ చేసిన కొత్వాల్ ముఖ్యంగా రెండు ఇబ్బందుల్ని గుర్తించారు. నారాయణగూడ, కాచిగూడ ఠాణాల పరిధుల్లో ఉన్న రెండు వైన్షాపుల వద్ద ఆ సమయంలోనూ భారీగా జనం ఉన్నారు. వీరిలో కొందరు మద్యం ఖరీదు చేసుకుని రోడ్లపై వాహనాలు ఆపి తాగుతూ కొత్వాల్కు కనిపించారు. మరికొందరు మద్యం సీసాలు తీసుకుని రాంగ్రూట్స్లో దూసుకుపోతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన పరిశీలించారు. వీటికి తోడు ఆ సమయంలోనూ రహదారులపై పాదచారులు ఎక్కువగా ఉంటున్నారని సీపీ దృష్టికి వచ్చింది. అయితే రాత్రివేళ కావడంతో వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. దీంతో కొన్ని జంక్షన్లతో పాటు కీలక ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు పాదచారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కొత్వాల్ గ్రహించారు. ఆ ఇద్దరిపై తీవ్ర ఆగ్రహం... ఈ ‘పాదయాత్ర’ మార్గంలోని రెండు ఠాణాలకు చెందిన అధికారులపై నగర పోలీసు కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మద్యం దుకాణాలు ఉన్న చోట్ల గస్తీ సక్రమంగా లేదని, ఆ కారణంగానే మందుబాబులు రెచ్చిపోతున్నారని అభిప్రాయపడినట్లు సమాచారం. గురువారం ఉదయం జరిగిన టెలీకాన్ఫరెన్స్లో అంజనీ కుమార్ తన ‘వాక్ ఆన్ స్ట్రీట్స్’ అనుభవాన్ని జోనల్ డీసీపీలతో పాటు ఇతర ఉన్నతాధికారులకు పంచుకున్నారు. తన దృష్టికి వచ్చిన లోపాలను ఆయా విభాగాలు, జోన్లకు చెందిన అధికారులతో స్పష్టం చేశారు. తక్షణం వాటిని సరిదిద్దాలంటూ ఆదేశించారు. ‘దాదాపు గంటన్నర పాటు నడుస్తూ ఇంటికి చేరుకున్నా. దీని వల్ల నాకు అనేక విషయాలు తెలిశాయి. వాటిపై అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నగర ప్రజల భద్రత, ప్రశాంత జీవనమే మా ప్రధాన లక్ష్యం’ అని అంజనీ కుమార్ ‘సాక్షి’తో అన్నారు. లిఫ్ట్ కావాలా.. కారు పంపాలా... కొత్వాల్ సాబ్ వాకింగ్లో ఉండగా గుర్తించిన వారు అతి తక్కువే ఉన్నారు. అలా ఆయన్ను గుర్తుపట్టిన వారు వెనుక వస్తున్న సిబ్బంది వద్దకు వెళ్ళి ఏం జరుగుతోందని ఆరా తీశారు. కొందరు ద్విచక్ర వాహనచోదకులు అయితే లిఫ్ట్ కావాలేమో అడగాలంటూ సిబ్బందిని కోరారు. ఇంకొందరు ఆయన వాహనం చెడిపోయినందుకు నడుస్తున్నారని భావించారు. దీంతో తమ వాహనాలు ఇస్తామని, లేదా మరో కారు ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు కూడా ఇచ్చారు. అయితే వీటిపై స్పందించలేదు. -
నడక వేగంతోపాటే ఆయుష్షూ పెరుగుతుంది!
వాకింగ్ చేసేవారిని మీరెప్పుడైనా గమనించారా? కొంతమంది నింపాదిగా నడుస్తూంటే.. ఇంకొంతమంది రేపన్నది లేదేమో అన్నంత వేగంగా అడుగులేస్తూంటారు. ఎవరి స్టైల్ వారిదని అనుకుంటాంగానీ.. దీంట్లో మన ఆయుష్షును పెంచే ఓ కిటుకు ఉందంటే మాత్రం ఆశ్చర్యపోతాం. సిడ్నీ యూనివర్శిటీ శాస్త్రవత్తేలు ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ఏం చెబుతోందంటే.. నడక వేగం పెరిగినకొద్దీ.. మరణం దూరమయ్యేందుకు అవకాశాలూ ఎక్కువ అవుతాయి. సాధారణ వేగంతో నడిచే వారు అన్ని రకాల కారణాల వల్ల మరణించే అవకాశం 20 శాతం వరకూ తక్కువగా ఉంటే.. వేగంగా నడిస్తే ఈ సంఖ్య 24 కు చేరుతుంది. అయితే గుండెజబ్బులున్న వారి విషయంలో మాత్రం నింపాది నడకే మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వయసుమీదపడ్డ వారిలోనూ దాదాపుగా ఇలాంటి ఫలితాలే కనిపించాయని ప్రొఫెసర్ ఎమ్మాన్యుల్ స్టామటాకిస్ అంటున్నారు. గంటకు అయిదు నుంచి ఏడు కిలోమీటర్ల వేగాన్ని తాము వేగంగా నడవడంగా పరిగణించామని.. అయితే ఈ వేగం వారి వారి ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి.. కొంచెం చెమటపట్టేంత స్థాయిలో చేసే నడకను కూడా వేగంగా నడవడటం అనుకోవచ్చునని ఆయన వివరించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా తామీ అధ్యయనం చేసినట్లు తెలిపారు. నడకను వ్యాయామంగా మార్చుకున్న వారికి వేగానికి సంబంధించిన సమాచారం కూడా అందితే మెరుగైన ఫలితాలు ఉంటాయని తాము అంచనా వేస్తున్నటుల చెప్పారు. -
వేగంగా నడిస్తే..
సిడ్నీ : వేగంగా నడవడం గుండెకు మేలు చేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 30 సంవత్సరాల వయసు పైబడిన వారు గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే గుండెపోటు, స్ర్టోక్ ముప్పు మెల్లిగా నడిచేవారితో పోలిస్తే సగం తక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అన్ని వయసుల వారూ వేగంగా నడిస్తే ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు 20 శాతం తక్కువగా ఉంటుందని, జీవనకాలం 15 సంవత్సరాలు పెరుగుతుందని పేర్కొన్నారు. వేగంగా నడవడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అథ్యయనం పేర్కొంది. గంటకు అయిదు నుంచి ఏడు కిలోమీటర్లు నడవడం వేగవంతమైన నడకగా గుర్తిస్తామని, అయితే ఇది నడిచేవారి ఫిట్నెస్ స్ధాయిలపై ఆధారపడిఉంటుందని అథ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన ప్రొఫెసర్ ఇమ్మానుయేల్ స్టమటకిస్ తెలిపారు. వేగవంతమైన నడకకు మరో సంకేతంగా చిరు చెమట పట్టడాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు. 1994 నుంచి 2008 వరకూ 11 జనాభా లెక్కల ప్రామాణికంగా 50,000 మంది ఆరోగ్య రికార్డులను అథ్యయనంలో భాగంగా పరిశోధకులు పరిశీలించారు. నడక వేగాన్ని పెంచడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం, అకాల మరణం ముప్పును నివారించవచ్చని తమ ఫలితాలు సూకచిస్తున్నాయని ప్రొఫెసర్ స్టమటకిస్ చెప్పారు. -
నములుతూ నడిస్తే.. ప్రయోజనమెక్కువ!
వాకింగ్ చేస్తూ బబుల్ గమ్ నములుతూండటం ఆరోగ్యానికి కొంతవరకూ మేలు చేస్తుందని అంటున్నారు టోక్యోలోని వాసెడా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. నడుస్తూ బబుల్గమ్ తినడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరగడంతోపాటు శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చవుతుందని వీరు అంటున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు తాము 21 – 69 మధ్య వయస్కులతో ప్రయోగం నిర్వహించామని చెప్పారు. వీరికి రెండు బబుల్గమ్స్ ఇచ్చి ముందుగా గంటసేపు విశ్రాంతి కల్పించామని ఆ తరువాత పదిహేను నిమిషాలపాటు బబుల్గమ్స్ నములుతూ నడవమని సూచించామని.. ఇదే సమయంలో ఇంకొంతమందికి బబుల్గమ్ కాకుండా అదే పదార్థాలతో చేసిన ఇంకో తినుబండారం ఇచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు వివరించారు. రెండు గ్రూపుల్లోని వారిని పరిశీలించినప్పుడు బబుల్గమ్ తినేవారు నడిచే వేగం, దూరం పెరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఒక్కో అంగలో కొంచెం ఎక్కువ దూరం వేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. అలాగే గుండెకొట్టుకునే సగటు వేగం కూడా బబుల్గమ్ తినేవారిలో కొంచెం ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందన్నారు. వయసు, స్త్రీయా, పురుషుడా? వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నా ఫలితాల్లో మార్పులేమీ లేకపోవడంతో బబుల్గమ్లు నములుతూ నడవడం వల్లనే ఈ మార్పులు చోటు చేసుకున్నట్టు నిర్ధారించుకున్నామని వివరించారు. మధ్యవయసు వారిపై ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని.. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కోసం వ్యాయామం చేసే వారు మరింత ఎక్కువ ఫలితాన్ని సాధించేందుకు తగిన బబుల్గమ్ను ఉపయోగించడం ఒక మార్గమవుతుందనేది తమ అంచనా అని చెప్పారు. ఆవలింతలు.. అంటుకుంటాయా? చిన్నప్పటి నుంచి చాలాసార్లు విని ఉంటాం.. చూసి ఉంటాం కూడా. ఒకరికి ఆవలింతలు వస్తే చాలు.. చుట్టూ ఉన్న వారు ఒకొక్కరికీ వెంటవెంటనే ఆవలింతలు వచ్చేస్తూంటాయి. ఇది అక్షరాలా నిజమే అయినప్పటికీ ఎందుకిలా జరుగుతుందో మాత్రం ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయని అంటున్నారు టెక్సస్ ఏ అండ్ ఎమ్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్కు చెందిన మెరిడిత్ విలియమ్సన్. బహుశా ఇది మాటల్లేని సమాచార ప్రసారం కావచ్చునని... అందుకే ఇది కేవలం మనుషుల్లోనే కాకుండా కొన్ని రకాల జంతువుల్లోనూ కనిపిస్తూంటుందని వివరించారు. ఇతరులపట్ల సహానుభూతి ఎక్కువగా ఉన్నవారు ఇతరుల ఆవలింతలకు ఎక్కువగా స్పందిస్తూంటారని.. మిగిలినవారు.. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం తక్కువగా స్పందిస్తారని ఆమె వివరించారు. అలాగే నాలుగేళ్లలోపు పిల్లలు, వయసుమళ్లిన వారు కూడా ఇతరుల ఆవలింతలకు స్పందించరని చెప్పారు. మద్యానికి.. గుండెపోటుకు ఇంకో కొత్త లింకు! అతిగా మద్యం తాగితే జబ్బులు గ్యారెంటీ. మిగిలిన వాటి సంగతేమోగానీ.. గుండెజబ్బుల విషయంలో మాత్రం మద్యంతోపాటు మన శరీరంలో ఉండే ఓ జన్యువు కీలకపాత్ర పోసిస్తున్నట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. టిటిన్ అని పిలిచే ఈ జన్యువు గుండె కండరం సంకోచ వ్యాకోచాలు సక్రమంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని.. మద్యం తాగినప్పుడు మాత్రం ఈ జన్యువు సక్రమంగా పనిచేయకుండా గుండెజబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆల్కహాలిక్ కార్డియో మయోపతీ వ్యాధికి గురైన కొంతమందిపై తాము పరిశీలన జరిపినప్పుడు టిటిన్ పాత్ర గురించి తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జేమ్స్ వేర్ తెలిపారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం వారానికి 70 కంటే ఎక్కువ యూనిట్ల వైన్ తాగే వారికి ఆల్కహాలిక్ కార్డియో మయోపతి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతూ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగానూ మారుతుందని జేమ్స్ చెప్పారు. తాము పరిశీలించిన వారిలో దాదాపు 13.5 శాతం మందిలో టిటిన్ జన్యువు మార్పులకు గురైనట్లు తెలిసిందని వివరించారు. దీన్నిబట్టి మద్యం జన్యువులపై ప్రభావం చూపుతుందని మరింత స్పష్టంగా అర్థమవుతోందని.. ఒకవేళ ముందుగానే కొన్ని జన్యుమార్పులున్న వారు మద్యానికి బానిసలైతే.. గుండెజబ్బులు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువవుతాయన్నది తమ పరిశోధనల సారాంశమని తెలిపారు. ఆల్కహాలిక్ కార్డియో మయోపతి వ్యాధికి గురైన వారి కుటుంబ సభ్యులు తమ పరిస్థితిని మరోసారి బేరీజు వేసుకోవాలని... జన్మతహా టిటిన్ జన్యువులో మార్పులు ఉంటే వీరు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముంటుందని వివరించారు. -
‘నడక’యాతన
కోవెలకుంట్ల: చదువు కోసం ఇతర ఊళ్లకు రోజూ నడిచి వెళ్తున్న విద్యార్థుల బాధలు అన్నీ ఇన్నీ కావు. కాళ్లకు చెప్పులు లేకుండా.. ఒట్టికాళ్లతో ముళ్లబాటల గుండా రోజూ కొన్ని కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారు. ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 12 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు ఉంటున్నాయి. పాఠశాల ముగిశాక విద్యార్థులు మండుటెండలోనే ఒట్టికాళ్లతో నడుచుకుంటూ ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి. దీంతో కాళ్లు బొబ్బలెక్కుతున్నాయి. మట్టిరోడ్లపై ముళ్లు గుచ్చుకుంటున్నాయి. వీరి అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లాలో 2,283 ప్రాథమిక, 932 ప్రాథమికోన్నత, 898 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 6,41,530 మంది చదువుతున్నారు. పలు గ్రామాల్లో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు లేవు. పక్కనున్న గ్రామాలకు వెళ్లాలి. జిల్లాలో మొత్తం 1,435 గ్రామాలున్నాయి. వీటిలో 646 గ్రామాలకు ఆర్టీసీ బస్సుల్లేవు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న పత్తికొండ నియోజకవర్గంలోనే దాదాపు 110 గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. జిల్లాలో 70 గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నా..బస్సులు తిప్పకపోవడం గమనార్హం. చాలా గ్రామాల విద్యార్థులకు పాఠశాల సమయానికి కనీసం ఆటోలు కూడా ఉండడం లేదు. దీంతో కాలినడకన, సైకిళ్లపై వెళ్తున్నారు. కంకర తేలిన రోడ్లు, ముళ్లతో నిండిన దారుల గుండా భుజానికి బరువైన పుస్తకాల సంచి, చేతిలో నీళ్ల బాటిల్తో వెళ్లి రావాలంటే నరకం కన్పిస్తోంది. కాలికి ముళ్లు గుచ్చుకున్నా, రాయికొట్టుకున్నా బాధను భరిస్తూనే సమయానికి పాఠశాలకు చేరుకోవాలి. లేదంటే ఉపాధ్యాయులతో దెబ్బలు తినాల్సి వస్తుందని విద్యార్థులు భయపడుతూ వెళ్తున్నారు. కొద్దోగొప్పో ఆర్థిక స్తోమత ఉన్న వారి∙పిల్లలు కాళ్లకు చెప్పులు, సైకిళ్లపై స్కూళ్లకు వెళుతుండగా.. నిరుపేద పిల్లల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత తొమ్మిదో తరగతి బాలికలకు మాత్రమే సైకిళ్లు అందజేసింది. మిగిలిన తరగతుల విద్యార్థినులతో పాటు బాలురకు ఇవ్వకపోవడంతో వారు కాలినడకన వెళ్లక తప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన సైకిళ్లు కూడా నాసిరకంగా ఉండటంతో చాలా వరకు మూలన పడేశారు. ♦ కోవెలకుంట్ల మండలం భీమునిపాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు రెండున్నర కి.మీ దూరంలోని కంపమల్ల గ్రామానికి చెందిన విద్యార్థులు రోజూ పొలాల రస్తాలో కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. ఇదే మండలం గుళ్లదూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పొట్టిపాడు గ్రామ విద్యార్థులు ఆయకట్టు దారి గుండా వెళ్తున్నారు. ♦ కోవెలకుంట్ల పట్టణంలో మూడు ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటికి పలు గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. పాఠశాల సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో వెలగటూరు, బిజనవేముల, అమడాల గ్రామాల విద్యార్థులు నడుచుకుంటూ వస్తున్నారు. ♦ రేవనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లింగాలకు చెందిన విద్యార్థులు గుండుపాపల నుంచి నడుచుకుంటూ రాక తప్పడం లేదు. ♦ కొలిమిగుండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మీర్జాపురం, నాయినిపల్లె నుంచి విద్యార్థులు నడిచి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంకిరెడ్డిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలకు రావాలంటే బందార్లపల్లె, తుమ్మలపెంట గ్రామాల విద్యార్థులదీ ఇదే పరిస్థితి. ♦ అబ్దులాపురం హైస్కూల్కు ఉమ్మాయిపల్లె, కోరుమానుపల్లె నుంచి విద్యార్థులు నడిచి వెళ్తున్నారు. ♦ అవుకు మండలంలోని సుంకేసుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చనుగొండ్ల, కాశీపురం గ్రామాల నుంచి కాలినడకన వస్తున్నారు. ♦ చెన్నంపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు శివవరం గ్రామానికి చెందిన విద్యార్థులు , సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ముచ్చలపురి, ఎగ్గోని, కొత్తపేట గ్రామాల విద్యార్థులు కాలినడకన వచ్చి చదువుకోవాల్సి వస్తోంది. మట్టిరోడ్డుపై అవస్థలు ఊళ్లో ఉన్నత పాఠశాల లేదు. పక్క గ్రామమైన గుళ్లదూర్తికి వెళ్తున్నాం. నాతో పాటు 20 మందిమి అక్కడికి వెళ్లి చదువుకుంటున్నాం. గ్రామం నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో పొలాల దారి గుండా రెండున్నర కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. ఐదుగురు విద్యార్థులకు సైకిళ్లు ఉన్నప్పటికీ మట్టిరోడ్డు కావడంతో కొన్నిచోట్ల వాటిని తోసుకుంటూ వెళ్లాలి.-విజయ్, 8వ తరగతి, పొట్టిపాడు -
అలుపెరుగని నడక జనమంతా వెనుక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అడుగడుగునా ఘన స్వాగతాలు..సమస్యల వినతులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర సాగుతోంది. 15వ రోజు ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలోని దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో సాగింది. ఆదివారం 8 గంటల సమయంలో దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు శివారులో నుంచి కొనసాగిన యాత్ర కొద్దిసేపటికి కుంకుపాడు వద్ద అద్దంకి నియోజకవర్గంలోని ప్రవేశించింది. నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెంచు గరటయ్య, ఆయన కుమారుడు కృష్ణ చైతన్యలతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పార్టీ జెండాలతో యువకులు ఆకర్షణగా నిలిచారు. జగన్ను కలిసేందుకు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువతతో పాటు మహిళలు ఆసక్తి చూపించారు. పలువురు ప్రజలు సమస్యలపై జగన్కు వినతి పత్రాలు సమర్పించారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక మోసం చేసిందని వాపోయారు. అర్హులకు రేషన్కార్డు, పింఛన్లు ఇవ్వటం లేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వటం లేదని, డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధులు కూడా ఇవ్వలేదని జగన్కు ఫిర్యాదులు చేశారు. రైతులకు రుణమాఫీ అందలేదని, పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించలేదని పలువురు రైతులు జగన్ దృష్టికి తెచ్చారు. మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వస్తూనే అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని వైఎస్.జగన్మోహన్రెడ్డి జనానికి భరోసానిచ్చారు. అద్దంకి నియోజకవర్గంలో తొలిరోజు యాత్ర కుంకుపాడు, శ్రీరామ్నగర్ కాలనీ, పార్వతీపురం మీదుగా మధ్యాహ్నానికి తిమ్మాయిపాలెం చేరుకుంది. భోజన విరామం అనంతరం అక్కడి నుంచి అద్దంకి వరకు కొనసాగింది. అనంతరం జగన్ అద్దంకి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదిస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే నవరత్నాలతో పాటు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తామని జగన్ జనానికి భరోసానిచ్చారు. 15వ రోజు వైఎస్ జగన్ 15.3 కి.మీ. మేర పాదయాత్ర సాగించారు. జగన్తో కలిసి నడిచిన నేతలు: 15వ రోజు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్తో పాటు పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్, అద్దంకి సమన్వయకర్త చెంచు గరటయ్య, వైఎస్సార్సీపీ నేతలు వై.వి.భద్రారెడ్డి జగన్తో కలిసి నడిచారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విభాగం వాణిజ్య విభాగం కుప్పం ప్రసాద్, జిల్లా నేతలు రామానాయుడు, ప్రసాద్, ఒంగోలు పట్టణ అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
హంపీలో సాంస్కృతిక నడక
హొసపేటె: విదేశీ పర్యాటకులు హంపీలో ఆదివారం హెరిటేజ్ వాక్ కార్యక్రమం చేపట్టారు. గో హెరిటేజ్ వాక్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, న్యూజీలాండ్ తదితర దేశాల నుంచి వచ్చిన సుమారు 15 మంది పర్యాటకులు, బెంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాలకు చెందిన స్వదేశీ సందర్శకులతో కలిసి హెరిటేజ్ వాక్లో పాల్గొన్నారు. హంపీలోని ఎదురు బసవణ్ణ మంటపంవద్ద ప్రారంభమైన నడక ప్రారంభించి విజయ విఠల దేవస్థానం, మహానవమి దిబ్బ, జలమంటపం, గజ్జల మంటపం, ఉగ్ర నరసింహ, లోటస్ మహల్, గజశాల తదితర పురాతన స్మారకాల మీదుగా 21 కి.మీ.ల మేర వరకు కొనసాగించారు. ఈసందర్భంగా ఇంగ్లండ్కు చెందిన జోనస్ ఎలిజబెత్ మాట్లాడుతూ పర్యాటక కేంద్రమైన హంపీలో హెరిటేజ్ వాక్ చేపట్టడం ద్వారా పురాతన స్మారకాల సంరక్షణపై అవగాహన కల్పించామన్నారు. -
అడుగడుగునా ఆరోగ్యం...
నడక నిత్యజీవిత అవసరం. నడుస్తూ నడుస్తూ పోవాలనే నానుడి ఉంది. అంటే నడక సాగినంత కాలం ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని దాని అర్థం. నడక ఆరోగ్యాన్నిచ్చే వ్యాయమం కూడా. ఎంతటి వ్యాయామాలు చేసినా నడకకు మించిన ఎక్సర్సైజ్ లేదనేది తేటతెల్లమే. అందరూ నడుస్తారు. కానీ నడక గురించి మనకు తెలియని వివరాలెన్నో. ప్రధానంగా చలికాలం మొదలుకాబోతున్న ఈ సమయంలో వ్యాయామంగా నడకను మొదలుపెట్టాలనుకునే వారు చాలామందే ఉంటారు. వారితో పాటు... ఇప్పుడు నడకను కొనసాగిస్తున్న వారూ... భవిష్యత్తులో నడక మొదలెపెట్టాలనుకునే వారందరూ నడకను గురించి తెలుసుకోవాల్సిన వివరాలెన్నో! ఇంతటి అద్భుతమైన నిత్యజీవన అవసరం అయిన నడక వ్యాయామం పట్ల ఎన్నో అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు – వాస్తవాలను చదవండి. నడక అనే వ్యాయామం సహాయంతో జీవితాంతం ఆరోగ్యంగా ఉండటం ఎలాగో తెలుసుకోండి. అపోహ : వాకింగ్ చాలా చేశాం. కానీ బరువు తగ్గలేదు. అబ్బే... వాకింగ్తో బరువు తగ్గుతుందా? బరువు తగ్గాలంటే బరువులెత్తుతూ, బరువైన వ్యాయామాలు చేయాల్సిందే. వాస్తవం : వాకింగ్తో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతుంది. ప్రతి రోజూ 40 నిమిషాలకు తగ్గకుండా వారంలో కనీసం 5 రోజులైనా నడుస్తూ ఉండండి. రోజు రోజుకూ నడిచే వడిని కాస్త కాస్త పెంచుకుంటూ పొండి. అవాంఛితమైన కొవ్వు తగ్గి, తప్పక బరువు తగ్గుతారు. ఆరోగ్యకరమైన బరువు పరిమితికి చేరుకుంటారు. అలా నడక సహాయంతో బరువు తగ్గాలనుకునేవారు సమతుల ఆహారం కూడా తీసుకోవడం మంచిది. కార్బోహైడ్రేట్, కొవ్వులున్న ఆహారాన్ని బాగా తగ్గించి ప్రోటీన్తో కూడిన ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. అపోహ : నడకకు ముందు ఏమీ తినకూడదు. పరగడుపున నడిస్తేనే మంచిది. వాస్తవం : నిజానికి నడకకు ముందుగా కాస్తంత తినడమే మంచిది. అది కడుపు మీద భారం పడినంతగా కాకుండా కాస్త లైట్గా ఉండాలి. అంటే... కాస్తంత పండు ముక్కో లేదంటే లైట్గా కాస్తంత పెరుగన్నమో (నాన్–ఫ్యాట్ యోగర్ట్) అయితే మంచిది. చాలామంది వ్యాయామం పరగడుపునే చేయాలి అనడానికి ఒక కారణం ఉంది. మానవ శరీరం వ్యాయామం చేస్తున్నప్పుడు... ఆహారాన్ని జీర్ణం చేయడం అనే పనిని చేయదు. ఈ రెండు పనులను ఒకేసారి చేయలేదు. అందుకే చాలామంది ఈ సలహా ఇస్తారు. అయితే కాస్తంత లైట్ శ్నాక్స్ తిని నడక మొదలుపెట్టడం వల్ల వ్యాయామం పూర్తయ్యే సమయానికి ఆకలితో నకనకలాడిపోకుండా ఉండటంతో పాటు నడకకు అవసరమైన శక్తి కూడా లభిస్తుంది. ఉదయం నడక మొదలుపెడితే దానికంటే ముందు ఒక గ్లాసు నీళ్లు తప్పక తాగాలి. ఇక డయాబెటిస్ వాళ్లు నడక మొదలుపెట్టాలనుకుంటే... ఏదైనా కాస్తంత తిన్న తర్వాతే నడక ముందుకు సాగాలని గుర్తుపెట్టుకోండి. అపోహ :వాకింగ్ ఉదయం పూట చేస్తేనే మంచిది. అందుకే ‘మార్నింగ్ వాక్’ అనే పదబంధం (ఫ్రేజ్) పుట్టింది. వాస్తవం : నడక ఏ సమయంలోనైనా మంచిదే. సాధారణంగా చాలా మంది ఉదయం వేళల్లో నడిచి, ఆ తర్వాత రోజువారీ వ్యవహారాల్లో పడిపోతారు. అందుకు వీలుగా ఉదయం వేళలను ఎంచుకుంటారు. అంతే తప్ప... ఫలానా సమయంలో నడిస్తేనే ఎక్కువ మేలు జరుగుతుందన్నది వాస్తవం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ వేళ మీకు హాయిగా నడవాలనిపిస్తుందో... ఆ వేళే నడకకు ఉత్తమమైన సమయం. కాకపోతే పగలు సూర్యుడు ఉన్నప్పుడు నడిస్తే... నడక ఇచ్చే ఆరోగ్యానికి అదనంగా విటమిన్–డి కూడా లభ్యమవుతుందంతే. అపోహ : రన్నింగ్తో పోలిస్తే వాకింగ్లో అంతగా క్యాలరీలు బర్న్ కావు. వాస్తవం : నడక కంటే రన్నింగ్లో బర్న్ అయ్యే క్యాలరీలు ఎక్కువే. కానీ ఒకరు ఎంత దూరం పరుగెత్తగలరు? అదే నడక అయితే... ఒక నిర్ణీత వేగంతో నడిస్తే చాలా దూరాలు ఆగకుండా నడవడం సాధ్యమవుతుంది కదా. ఇక మరీ లెక్కల్లో చెప్పుకోవాలంటే ఒక గంట పాటు నెమ్మదిగా జాగింగ్ చేస్తే 700 క్యాలరీలు బర్న్ అవుతాయి. అదే బ్రిస్క్ వాకింగ్ (వేగంగా నడిస్తే) ఒక గంటలో 600 క్యాలరీలు బర్న్ అవుతాయి. కానీ ఆ నడకను చాలాసేపు అదేపనిగా కొనసాగించవచ్చు కదా. అదే నడకలోని సౌలభ్యం, సౌకర్యం. అపోహ : నడక కొనసాగించడానికి ఎలాంటి పాదరక్షలైనా ఒకటే. వాస్తవం : కొన్ని కొన్ని పనులకు కొన్ని కొన్ని పాదరక్షలు అనుకూలంగా ఉంటాయి. ఉదాహరణకు స్పోర్ట్స్ షూస్తో పాదాలకు సపోర్ట్, మంచి కుషనింగ్ ఉంటాయి. అది లెదర్ షూలో ఉండకపోవచ్చు. అంతమాత్రాన నడక కొనసాగించేందుకు తప్పనిసరిగా స్పోర్ట్స్ షూ యే ఉండితీరాలని పట్టుపట్టాల్సిన అవసరం లేదు. నడక సజావుగా సాగడానికి మన పాదరక్ష సౌకర్యవంతంగా ఉండాలి. అదీ నియమం. అంతేతప్ప... ఫలానా మంచి పనిని కొనసాగించడానికి ఫలానా షూస్ లేకపోవడం అన్న ఒకే ఒక అంశం ప్రతిబంధకం కాకూడదు. అయితే ఒకవేళ మీకు మంచి స్పోర్ట్స్ షూస్ అందుబాటులో ఉన్నాయనుకోండి. అది మరింత సౌకర్యం. అపోహ : మంచి షూ వేసుకున్నప్పుడు మంచి సాక్స్ అవసరం లేదు. వాస్తవం : మంచి షూ ఉన్నప్పుడు మంచి సాక్స్ వేసుకోవడం తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే షూతో నడుస్తున్నప్పుడు చెమట పట్టడం ఎక్కువ. అలాంటప్పుడు మంచి సాక్స్ లేకపోతే కాలికి పొక్కులు, బొబ్బలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చెమట పీల్చుకునే విధంగా మంచి సాక్స్ అవసరమే. కాలిని పొడిగా ఉంచుతూ, బాగా గాలిసోకే విధంగా ఉండి, పాదాన్ని చల్లగా ఉంచే సాక్స్ అయితే మంచిది. నైలాన్ సాక్స్ వద్దు. అవి పాదాన్ని వేడిగా ఉండేలా చేస్తాయి. పాదానికి చల్లదనాన్నివ్వవు. అపోహ : నడక వల్ల కీళ్ల మీద బరువు పడుతుంది. కీళ్లనొప్పులు ఉన్నవారికి నడక అంత మంచి వ్యాయామం కాదు. వాస్తవం : చాలా మందికి ఈ అపోహ ఉంటుంది. అయితే ఇందులో దోషం నడకది కాదు. నడక సాగించే క్రమంలో వాడే షూస్ సరిగా లేకపోవడం లేదా సరిౖయెన రీతిలో నడవకపోవడం. వాకింగ్ షూస్ బాగాలేనప్పుడు రెండు కాళ్లు సమానమైన రీతిలో నేలను తాకకపోవడంతో కాలి ఎముకలపైనా, కీళ్లపైనా పడే బరువులో తేడాలతో మరిన్ని నొప్పులు వస్తుంటాయి. ఇక నడక అన్నది చాలా సౌకర్యవంతంగా, సజావుగా సాగుతున్నట్లుగా జరగాల్సిన ప్రక్రియ. అలసటతో, బరువుగా సాగకూడదు. నడక అప్పుడు అలా జరుగుతోందంటే ఏదో తేడా జరుగుతున్నట్లు అర్థం. నిజానికి ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు ఉన్నవారు నడక సాగించడం వల్ల వారి ఎముకలు, కీళ్లు మరింత బలం పుంజుకుంటాయి. ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ల దుష్ప్రభావం చాలా తగ్గుతుంది. అయితే సరైన నడక ఎలా సాగాలన్నది ఒకసారి స్పోర్ట్స్ మెడిసిన్ లేదా లైఫ్స్టైల్ మెడిసిన్ నిపుణులను అడిగి తెలుసుకొని ఈ రీతిలో సాగించాలి. సౌకర్యవంతమైన పాదరక్షలతో చురుగ్గా, సులువుగా, సంతోషంగా నడుస్తున్నట్లుగా మన నడక సాగాలి. అపోహ : నడక సమయంలో ఎంత చెమట పడితే అంత కొవ్వు కరుగుతుందని అర్థం. వాస్తవం : చెమట పట్టడంలో వ్యక్తికీ వ్యక్తికీ చాలా తేడా. కొందరికి త్వరగా చెమటలు పట్టవచ్చు. మరికొందరికి ఆలస్యంగా. అందుకే వడివడిగా నడుస్తూ ఉంటే క్యాలరీలు దగ్ధమై కొవ్వు తగ్గుతుంది. అంతేగానీ పట్టే చెమటలకూ, కరిగే కొవ్వుకూ సంబంధం ఉండదు. అపోహ : ఇతర వ్యాయామాలు చేసేవారిలో కండల రూపంలోనైనా ఫిట్నెస్ పొందిన దాఖలాలు కనపడతాయి. కానీ నడక అనే వ్యాయామంలో ఫిట్నెస్ పొందామని చెప్పేందుకు ఎలాంటి దాఖలాలూ కనిపించవు. వాస్తవం : మీరు నడక ద్వారా ఎంత ఫిట్నెస్ సాధించారో తెలుసుకునేందుకు ఈ పని చేయండి. నడక మొదలు పెట్టడానికి ముందు కిలోమీటర్ నడవడానికి ఎంత టైమ్ పట్టింది, ఎంత సులువుగా నడిచారన్నది నమోదు చేయండి. కొంతకాలం నడిచాక... అదే దూరానికి ఎంత సమయం పడుతోంది, ఎంత సులువుగా నడుస్తున్నారో గమనించండి. ఎంత ఫిట్నెస్ సాధించారో తెలుస్తుంది. ఇక మీలో ఎంత ఫిట్నెస్ ఉందో తెలుసుకోడానికి ఈ కింది ఛార్ట్ చూడండి. ∙మీ వయసు 30 లోపు అయితే 1 కిలోమీటర్ నడకకు 10 నిమిషాలు చాలు. ∙30 నుంచి 39 లోపు అయితే 1 కిలోమీటర్ నడకకు 12 – 13 నిమిషాలు పడుతుంది ∙40 నుంచి 49 లోపు అయితే కిలోమీటర్ నడకకు 15 నిమిషాలు పడుతుంది. ∙50 నుంచి 69 లోపు అయితే 1 కిలోమీటర్ను 18 నిమిషాలలో నడిస్తే మీరు మంచి ఫిట్నెస్తో ఉన్నట్లే. ∙70 నుంచి అంతకంటే పైబడ్డవారైతే 20 – 25 నిమిషాల్లో 1 కి.మీ. నడిస్తే మంచి ఫిట్నెస్తో ఉన్నట్లే. అపోహ : నడిచే సమయంలో నీళ్లు తాగకూడదు. వాస్తవం : వ్యాయామ మార్గదర్శకాలు (ఎక్సర్సైజింగ్ గైడ్లైన్స్) చేప్పే మాట ఒక్కటే. దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగాలి. ఎప్పుడూ ఒంట్లోని ద్రవాలను కోల్పోకూడదు. ఇందుకోసం రెండు సూచనలు పాటించవచ్చు. ∙నడక మొదలుపెట్టడానికి చాలాసేపటి ముందుగా ఒక పెద్ద గ్లాసు నీళ్లు తాగండి. ∙నడక మొదలుపెట్టాక ప్రతి అరగంటకోసారి చిన్న కప్పులో కాసిన్ని నీళ్లతో గొంతుతడుపుకుంటూ ఉండండి. అలా నడక మొత్తం దూరంలో ఎప్పుడూ దాహం ఫీల్ కానివిధంగా గొంతు తడుపుకుంటూ ఉండాలి. అంతేకానీ విపరీతంగా దాహం అవుతున్నా... నడుస్తున్నాం కదా అని నీళ్లు తాగకుండా ఉండిపోకండి. ఎందుకంటే నడక సమయంలో గుక్కెడు నీళ్లతో గొంతు తడుపుకోవడం అపాయకరం అని మీరనుకుంటే... డీహైడ్రేషన్ అనే పరిస్థితి అంతకంటే అపాయకరం. అపోహ : వయోవృద్ధులకు నడక వ్యాయామం అంతమంచిది కాదు. వాస్తవం : ఎంత పెద్ద వయసు వారైనా... వారు నడవగలిగే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడు నడక వ్యాయామాన్ని కొనసాగించడం మంచిదే. అది వారి గుండె పనితీరు సామర్థ్యాన్ని పెంచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒంట్లోని చక్కెర పాళ్లను అదుపులో ఉంచుతుంది. ఒంటి నొప్పులను తగ్గిస్తుంది. సామాజిక బంధాలను పరిరక్షించడం ద్వారా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అపోహ : గట్టి రోడ్డు మీద నడవడం కంటే మెత్తటి గడ్డిలో నడవడం మంచిది. వాస్తవం : ఇందులో కొంతమేరకు మాత్రమే వాస్తవం ఉంది. గట్టి రోడ్డుపై నడక కంటే గడ్డిలో నడక కీళ్లకు మంచిదనీ, గట్టి రోడ్డు మీద నడుస్తుండటం వల్ల కీళ్లపై ఒత్తిడి బాగా పడుతుందనే అభిప్రాయం ఉంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. మనం గడ్డి మీద నడిచినా లేదా గట్టి నేల మీద నడవడం మొదలుపెట్టినా... సర్ఫేస్కు అనుగుణంగా మన కండరాలు, కీళ్లు దానికి అడ్జెస్ట్ అయి ఎముకల మీద ఎంత ఒత్తిడి పడాలో అంతే పడనిస్తాయి. అలా మన షాక్ అబ్జార్బింగ్ వ్యవస్థ ఆటోమేటిగ్గా సెట్ అవుతుంది. పూర్తి ఆరోగ్యవంతులు ఎక్కడ నడిచినా ఒకటే. అయితే కొంతమందిలో కీళ్లనొప్పులు ఎక్కువ. ఇలా అప్పటికే కీళ్లనొప్పులు ఉన్నవారు మాత్రం ఎగుడుదిగుడుగా ఉన్న మెత్తటి గడ్డి ఉపరితలం మీద నడవడం కంటే గడ్డి లేని సమతలమైన గట్టి ఉపరితలం మీద నడవడం మంచి ప్రయోజనకరం. ఒకవేళ సమతలంగా ఉండి గడ్డి కూడా ఉంటే అది కీళ్లనొప్పులున్న వారికి మేలు. అపోహ : ఆరుబయట నడవటం కంటే ట్రెడ్మిల్ మీద నడక సాగించడం మంచిది. వాస్తవం : ట్రెడ్మిల్ అనేది ఒకే వేగంతో ఒకే రకమైన సర్ఫేస్ (ఫ్లాట్ ఉపరితలం) మీద నడవడానికి దోహదం చేసే ఉపకరణం. ఎగుళ్లూ దిగుళ్లూ లేకుండా చూస్తుంది. అయితే వెనక్కి వెళ్లే ట్రెడ్మిల్ మీద పెద్దగా శక్తి వెచ్చించనక్కర్లేదు. అందుకే నడకలో మరింత శక్తివెచ్చించడం ద్వారా గరిష్ఠ ప్రయోజనాన్ని పొందడం కోసం ట్రెడ్మిల్ ఉపరితలాన్ని కాస్త ఎత్తుగా డిజైన్ చేస్తారు. నేల మీద ఎక్కువ శక్తిని వినియోగించాలి. ఎందుకంటే ట్రెడ్మిల్ లాగ నేల వెనక్కి వెళ్లదు. కాబట్టి నేల మీద నడకలో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆరోగ్య తారక మంత్రం.. నడకే
ఆరోగ్యం కోసం కొందరు జాగింగ్ చేస్తే.. ఇంకొందరు పరుగెత్తుతారు.. మరికొందరు సైక్లింగ్, వెయిట్లిఫ్టింగ్, యోగా.. ఇలా రకరకాల పనులు చేస్తుంటారు. మరి వీటన్నింటిలో ఏది బెటర్? బాడీబిల్డింగ్ లాంటి ప్రత్యేకమైన లక్ష్యాలేవీ లేకపోతే నిండైన ఆరోగ్యానికి నడకకు మించిన తారకమంత్రం లేదు అంటోంది అమెరికాలో తాజాగా ముగిసిన ఓ అధ్యయనం. డాక్టర్లు సూచించినంత కాకపోయినా అందులో కొంతైనా నడిచినా.. ఏ వ్యాయామమూ చేయనివారి కంటే ఎక్కువ కాలం జీవించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక అంచనా ప్రకారం వారానికి 150 నిమిషాలు అంటే రోజుకు 20–25 నిమిషాల పాటు నడిచినా లేదా రోజుకు 10–12 నిమిషాలు వేగంగా నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అమెరికాలో కేన్సర్ ప్రివెన్షన్ స్టడీస్–2 న్యూట్రిషన్ కోహర్ట్ అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 1.4 లక్షల మంది వివరాలను అల్పా పటేల్ అనే శాస్త్రవేత్త విశ్లేషించారు. ఏ రకమైన వ్యాయామం చేయని వారు ఇందులో దాదాపు ఐదు శాతం ఉంటే మిగిలిన వారు కొద్దోగొప్పో వ్యాయామం చేసేవారున్నారు. ధూమపానం, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలను పక్కనబెట్టి పరిశీలించినప్పుడు వారానికి రెండు గంటల కంటే తక్కువ నడక సాగించే వారు కూడా ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. -
కొత్త దారులు
‘‘ఏవండీ! కాస్త నా మాట వినండి. ఎవరైనా చూస్తే బావుండదు. ఇంత వయసూ వచ్చి ఇదేం మాయ రోగం అని నవ్వి పోతారు’’ అంది సరస్వతి.‘‘నవ్వితే నవ్వనీ. వాళ్ళ పళ్లే బయట పడతాయి’’ అన్నాడు ప్రసాదరావు.‘‘అది కాదండీ. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడేవిటండీ మీకీ వెధవ బుద్ధులు?’’‘‘అదే నేనూ బాధ పడుతున్నాను. ఈ తెలివితేటలు ఓ పదేళ్ల క్రిందట లేకపోయాయే అనుకుంటున్నాను.’’ ‘‘నామాట వినండి ఇక్కడొద్దు ఇంటికిపోదాం. కాదంటే ఏదైనా హోటల్కి పోదాం’’ బతిమాలింది ఆవిడ. ‘‘వీల్లేదు.. వీల్లేదన్నానా? ఓ రెండు రోజులు మొహమాటంగా వున్నా ఆ తరవాత అలవాటు అయిపోతుంది.’’‘‘నలుగురిలోనూ పరువు తక్కువగా వుంటుందండీ. పోనీ ఇంకో చోటికి వెళదామండీ’’ ‘‘ఇంటెదురుగుండా వున్నది వదిలేసి ఇంకెక్కడికో ఎందుకూ... మళ్ళీ ఆటో డబ్బులు దండగ. ఈ సణుగుడు ఆపి పద. అక్కడికి వెళ్లి లైన్లో నిలబడదాం’’ఆవిడ ఇంకా సణుగుతూ ఉండగానే చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు.ఓ అరగంట ఆవిడకు ముళ్ళమీద వున్నట్లుగా వుంది పాపం.. ఎవరు చూస్తారో అని కంగారు. ఆయన మాత్రం బాగానే వున్నాడు.‘‘ఎలావుందీ?’’ చేతులు కడుక్కున్నాక అడిగాడు. ‘‘నా బొందలా వుంది.’’ అంది సరస్వతి చిరాగ్గా. ‘‘ఇవ్వాళే మొదలు కదా.. నాల్రోజులు అలవాటైతే బాగుంటుంది’’ అని నచ్చ చెప్పాడు.ఇద్దరూ ఇంటికెళ్లి పోయారు .మర్నాడు పొద్దున్నే ఫోను. గోపీ చేశాడు.‘‘ఏవిటి రావుగారూ నేను విన్నది నిజమేనా ?’’‘‘ఏం విన్నారో చెప్తే నిజమో కాదో చెప్తాను’’‘‘నిన్న మీరు భార్యా సమేతంగా వెళ్లి ఐదు రూపాయల భోజనం చేశారట.’’‘‘అవునూ చేశాం.’’‘‘మీకేం ఖర్మ ?’’‘‘భోజనం చెయ్యటం ఖర్మా?’’‘‘కాదా .? మీ లెవెల్ ఏమిటీ? మీరు వెళ్లి క్యూలో నిలబడి ఐదు రూపాయల భోజనం చెయ్యటం ఏమిటీ? ఎవరో పొద్దున్నే మీ ఫ్రెండ్ ప్రసాదరావు గారు ఐదు రూపాయల భోజనం చేస్తున్నారు. మేము కళ్లారా చూసాం అంటే నమ్మలేకపోయాను.’’‘‘అలాగా? అయ్యోపాపం. మీకు ఇబ్బంది కలిగింది నా వల్ల. విషయం నూటికి నూరుపాళ్లు నిజం. మీరు నిశ్చింతగా నమ్మొచ్చు..’’ అన్నాడు ప్రసాదరావు. ఆవేళ హీనపక్షం పదిమంది ఫోన్ చేశారు. అందరూ అదే గొడవ. అందరికీ ఓపిగ్గా సమాధానం చెప్పాడు ఆయన.సరస్వతి ముక్కు చీదుకోనూ కళ్ళు తుడుచుకోనూ, ‘‘ఏవిటది? కొంపలు అంటుకు పోయినట్లూ ఆ ఏడుపేమిటి?’’ అని కోప్పడ్డాడు ప్రసాదరావు. వాళ్లింటి ఎదురుగా ఓ పార్కు వుంది. అందులో పదవీ విరమణ చేసిన వాళ్ళు ఓ పది మంది సాయంత్రం కలుసుకుని వాకింగ్ చేస్తారు. వాకింగ్ అరగంట. బాతాఖానీ రెండు గంటలు.ఆవేళ ప్రసాదరావు ఐదు రూపాయల భోజనమే హాట్ టాపిక్. అందరూ ఆవేశంగా తీవ్రంగా చర్చించారు. రాగానే ఆయన్నే అడిగెయ్యాలని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మామూలుకంటే ఓ అరగంట ఆలస్యంగా వచ్చాడు ప్రసాదరావు. వచ్చీ రాగానే అందరూ ప్రశ్నలతో దాడిచేశారు. ఆయన చిద్విలాసంగా వింటూ కూర్చున్నాడు.‘‘ఏవయింది మీకు?’’ అని నిలదీసి అడిగారు. ‘‘జ్ఞానోదయం అయింది.’’ చెప్పాడు. ‘‘మాకు అర్థం కావటం లేదు వివరంగా చెప్పండి’’ అన్నారు.‘‘మీరు అడగక పోయినా చెప్తాను. చెప్పింది విని మీలో మరి కొంతమందికి జ్ఞానోదయం అవుతుందనే నా నమ్మకం.’’ ప్రసాదరావు చెప్పటం మొదలు పెట్టాడు.‘‘పెద్దవాడు నాన్నకు ముద్దు. ఆఖరివాడు అమ్మకు ముద్దు. మధ్యన వున్నవాడు మట్టికొట్టుకు పోయాడు అని సామెత వుంది తెలుసుకదా మీకు. అదుగో నేను ఆ మధ్య కొడుకు లాటివాడిని.. మధ్య తరగతికి చెందిన వాడిని. నాకు వున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నా సంపాదనలో ముప్ఫై శాతం పన్నులకి పోతుంది. అదీగాక, ఓ వస్తువు కొన్నా, కాస్త టిఫెన్ తిన్నా, అదనంగా పన్ను కట్టాలి. ఓ వూరు వెళ్తే, రవాణాకి పన్ను, వసతికి పన్ను, ఈ పై పన్నులన్నీ కూడా కలుపుకుంటే నా రాబడిలో సగం పన్నులకే పోతోంది..పోనీ సగం ఏలిన వారికి పన్ను రూపంలో ఇచ్చుకున్నాం. దానికి బదులుగా నిశ్చింతగా వుంటున్నామా అంటే అదీలేదు. కనీసావసరమైన వైద్యంగానీ, ట్రాన్స్పోర్ట్గానీ, ఎక్కడ పడి తలకాయ బద్దలు కొట్టుకుంటామో అని భయం లేకుండా రోడ్డు పక్కన నడిచే అవకాశం గానీ, కనీస భద్రత గానీ లేవు. అన్నింటికీ ప్రైవేటు సంస్థల మీద ఆధార పడాల్సిందే. గవర్నమెంటు వారు పేదలకోసం బోలెడన్ని పథకాలు, రాయితీలు కల్పించారు. మరి మాబోటివాళ్లం వాళ్ళకంటికి ఆనం.నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. ఇద్దరివీ ఆరంకెల జీతాలే. టాక్స్ పోను చేతికి వచ్చినదాంట్లో బతకాలంటే.. వాళ్ళ జీవితంలో అన్నీ సమస్యలే. ఇంటికీ ఆఫీసుకి పాతిక కిలో మీటర్ల దూరం. లోకల్ రైలు సదుపాయం లేదు. బస్సు సదుపాయం లేదు. కార్లో వెళ్తే హీనపక్షం గంటన్నర. రోజుకి మూడు గంటలు రానూ పోనూ. ఆఫీసుకి దగ్గర ఇల్లు తీసుకుని వుందామంటే అక్కడ అద్దెలు ఎక్కువ. జీతంలో ఐదో వంతు అద్దెకి కట్టాలి. పైగా నీటి ఎద్దడి. అద్దెకి ఎంతో నీళ్ళకి అంత పెట్టాలి. పోనీ కాస్త చిన్న ఇంట్లోనే సర్దుకుందాం అనుకున్నా, అక్కడి స్కూల్లో మామూలు వాళ్ల పిల్లలకి సీట్లు దొరకవు. దొరికినా లక్షల్లో డొనేషన్లు. ఫీజులు. అక్కడ మా పిల్లలు తమపిల్లలని అతికష్టం మీద అయిదోతరగతి దాకా చదివిస్తే గొప్ప. ఆ చదువుతో ఆ పిల్ల సన్నాసులు ఏం చెయ్యగలరు? అందుకే మరో దారిలేక, మధ్య తరగతి వాళ్ళు వుండే ప్రాంతంలోనే ఇల్లు. అక్కడికి దగ్గర్లోనే ఏడాదికి ఓ లక్ష కట్టి ఓ మోస్తరు స్కూల్లో పిల్లల విద్య. లక్ష కట్టినా సదుపాయాలేం వుండవు.. చంటిపిల్లలు చచ్చినట్లూ మంచినీళ్ల సీసా మోసుకెళ్లాల్సిందే.ఇక నా విషయం మీకు తెలుసుగా. రెండేళ్ల కిందట రిటైర్ అయినప్పుడు వచ్చిన సొమ్మంతా బ్యాంకులో వేసుకున్నాను. దానిమీద వచ్చే వడ్డీతో జీవించాలి. అటు వడ్డీ తరుగుతోంది. ఇటు ఖర్చులు పెరుగుతున్నాయి. ఎలా బతకటం? పేదవారి కోసం చేసినంత కాకపోయినా అందులో పాతిక వంతు మాలాటి మధ్య తరగతి వాళ్ళ కోసం కూడా సాయం చెయ్యచ్చుగా ప్రభుత్వం? నిజం చెప్పాలంటే చిన్న చిన్న వ్యాపారస్తులు మాకంటే ఎక్కువే సంపాదిస్తారు. కాకపోతే వాళ్ళ రాబడికి లెక్క ఉండదు. కాబట్టి పన్నుల వడ్డింపు వుండదు. మాకూ ఓ నల్ల కార్డు ఏర్పాటు చేసి దానిమీద ఇంత నూనె. ఇన్ని బియ్యం ఇవ్వచ్చుగా?వాళ్లకి బంగారుతల్లి, ఆరోగ్య లక్ష్మి, కల్యాణమస్తు లాగా అంత కాకపోయినా మాకు కూడా వెండితల్లి, ఆరోగ్య గౌరీ, మంగళ కళ్యాణం అని ప«థకాలు పెట్టి సాయం చేస్తే మేమూ సంతోషిస్తాం కదా. ఆహా. అలాంటప్పుడు మనం గుర్తుకు రాము. మానవ హారాలు చేసి ఎండలో నిలబడటానికి, పచ్చని నగరం కోసం పది కిలో మీటర్లు పరిగెత్తండి, అన్నప్పుడు మాత్రం మనం అందరం కావాలి. ఇవ్వకపోతే పోయే, ఎదురు మనల్ని డబ్బులడగటం. మీరు గ్యాస్ మీద సబ్సిడీ వదిలేస్తే ఇంకో ఇంట్లో పొయ్యి వెలుగుతుంది, మీరు ఫలానా వస్తువులు కొంటే ఓ పిల్లాడు చదువుకుంటాడు. నెలకో అయిదువందల దానం చేస్తే ఓ పిల్లాడు బతుకుతాడు అని తెల్లారిలేస్తే ప్రకటనల ద్వారా ఊదర పెట్టడం. మాదగ్గర తీసుకున్న పన్నులతో వాళ్ళు చెయ్యచ్చుగా ఆ పనులన్నీ. మనమే ఈసురో మంటూ బండి లాగుతుంటే దానాలు కూడానూ!ఇవన్నీ చూసి నా మనసు అల్లా కల్లోలం అయిపోతోంది. ఏంచెయ్యాలి సంపాదన పెంచుకునే మార్గం లేదు కాబట్టి వున్నదానిలోనే గడుపుకోవాలి. అందుకే ఆలోచించి ఒక మార్గం కనిపెట్టాను. ఎక్కడ వీలైతే అక్కడ ఖర్చు తగ్గించుకోవాలి. పెద్దమొత్తమే అక్కర్లేదు. ఓ రూపాయి మిగిలినా చాలు. అందుకు మంచి రోజున అంటే పండుగనాడే మొదలుపెట్టాను. అయిదు రూపాయలకి నాబోటివాడికి పచ్చిమిరప కాయలు కూడారావు. మరి భోజనం పెడుతుంటే తినడానికి మొహమాటం ఎందుకు? ఆ సదుపాయం నిరుపేదలకేం కాదు. జనాలు టీ షర్ట్ వేసుకుని, వాచీ పెట్టుకుని, సెల్ ఫోన్ పట్టుకుని, అన్నం తింటూ ‘ఫుడ్ క్వాలిటీ ఈజ్ నాట్ దట్ గుడ్’ అని టి.విలో మాట్లాడ్డం నేను కళ్లారా చూశాను. కాబట్టి నేనూ మొదలు పెట్టాను. ఇక్కడేకాక చాలా దేవాలయాలలోనూ అన్న ప్రసాదాలు పెడుతున్నారట. అలా తలోచోట కొన్నాళ్ళు తింటే బోలెడంత డబ్బు ఆదా. విసుగేస్తే ఇంట్లో వండుకోవచ్చు. ఇక కాలక్షేపం. మనం పేపరు కొనుక్కోకుండా కాస్త ఎండెక్కేదాకా ఏ రామకోటో రాసుకుని అప్పుడు పక్కింటివాళ్ల పేపరు అరువడిగి చదువుకోవచ్చు. మాఇంటి పక్కనే రైల్వే స్టేషనుంది. అక్కడ టి.వి వుంది. పగలంతా అక్కడ కూచుంటే సరి. అక్కడ ఇలా ప్రోగ్రాములురావు. ప్రకటనలే అనుకున్నా, ఇంట్లో మాత్రం ఏం గొప్పగా ఏడ్చాయిటా? పదినిముషాలు ప్రోగ్రాము పావుగంట ప్రకటనలేగా. అక్కడైతే వచ్చే రైలూ పోయే రైలూ. మంచి కాలక్షేపం. ఎండాకాలం ఇంట్లో ఏసీ వాడకుండా ఇంటి దగ్గర మాల్కి వెళ్లి అక్కడ ఎండ తగ్గేదాకా ఏ మూలో కూచుని రావచ్చు. ప్రాణాల మీదికి వస్తే తప్ప స్వంత వాహనం బయటికి తియ్యకూడదు. రోడ్డు మీద నుంచుంటే ఎవరో ఒకరు కనిపించకపోరు. చేయెత్తి ఆపి బావున్నారా? పిల్లలు బావున్నారా? అని కుశలం అడిగి కాస్త అందాకా దిగబెట్టండి అనొచ్చు. ఎవరైనా పెళ్ళికో పేరంటానికో పిలిస్తే డబ్బు కవర్లో పెట్టి ఇచ్చే సంప్రదాయానికి స్వస్తి చెప్పాలి. యూట్యూబ్లో చూస్తే పనికి రాని వస్తువులతో అవీ ఇవీ తయారుచేయటం అని వందలకొద్దీ ఉపాయాలు చూపిస్తారు కదా. ఏదో ఒకటి తయారుచేసి బహుమతిగా ఇస్తే చాలు.ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎంత వీలయితే అంత ఆదా చేస్తూ పోవాలి. ఇప్పటికి ఎలాగో గడిచిపోతున్నాయి రోజులు అనుకుని ఊరుకుంటే రేపు ఎలా వుంటుందో ఎవరు చూడొచ్చారు? పన్నులు ఇంకొంచెం పెంచి, వడ్డీరేటు ఇంకాస్త తగ్గిస్తే అప్పుడేవిటి మన గతి? దాహం వేశాక బావి తవ్వుకోటం కంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం మంచిది.’’ అంటూ తన మనసులోని మాట చెప్పేశాడు ప్రసాదరావు. అతను ప్రారంభించినప్పుడు నలుగురే వున్నారు. ముగించేసరికి చుట్టూ జనం. చచ్చేంత మొహమాటం వేసింది.అంతలోనే చప్పట్లు. నీరసంగా కాదు హోరెత్తిపోయేలా. ఆశ్చర్యం వేసింది అతనికి. ఎందుకంటేæ ఇటీవల చప్పట్లకు కరువొచ్చి పడింది. పెద్ద పెద్ద సభలలోనే ‘చప్పట్లు కొట్టండో, వేదిక మీదనున్నవారికి ఉత్సాహం కలిగించండో’ అని మైకులో మొత్తుకున్నా టప్పూ టప్పూ అని ఒకరో ఇద్దరో కొడతారు చప్పట్లు. అలాంటిది అడక్కుండానే చప్పట్లు కొట్టేస్తున్నారు అంటే తాను మాట్లాడిన విషయం నలుగురికీ నచ్చిందని అర్థం. మర్నాడు కూడా కొన్ని ఫోన్లొచ్చాయి. ఎలా ఉందండీ అయిదు రూపాయల భోజనం? ఇవ్వాళ కూడా వెళ్తున్నారా? నన్నూ కేకేయ్యండి చూద్దాం అదేవిటో అన్నారు. ఆవేళ మరో నలుగురు వచ్చారు. క్రమంగా పెరిగింది ఆ సంఖ్య. అయిదు రూపాయల భోజనం దగ్గర పెద్ద లైన్లు. ఆ మనకేం పనా పాటా / ఇక్కడే నిలబడి కబుర్లు చెప్పుకుందాం అనుకున్నారు.విసుగేస్తే ఏ గుడికో వెళ్లి భోజనం చేసి రావటం. ఖర్చు గణనీయంగా తగ్గింది. ఆడవాళ్ళూ వంట పని తప్పిందని సంతోషించారు. మిగిలిన పద్ధతులన్నీ కూడా పాటిస్తూ ఎక్కడికక్కడ ఖర్చు తగ్గిస్తున్నారు. ఏ చిన్న శుభకార్యం అయినా మొక్కుబడిగా హోటలుకి వెళ్ళటం మానేసి ఇంట్లోనే ఇంత పులిహోర, రవ్వకేసరి చేసుకుని వేడుక చేసుకుంటున్నారు. ఇదంతా మీ పుణ్యమే మొత్తానికి భలే ఉపాయం చెప్పారు అని ప్రసాదరావుని మెచ్చుకుంటున్నారు.‘‘ఏం చేస్తాం? శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు’’ అన్నాడు ప్రసాదరావు. వాళ్లకి బంగారుతల్లి, ఆరోగ్య లక్ష్మి, కల్యాణమస్తు లాగా అంత కాకపోయినా మాకు కూడా వెండితల్లి, ఆరోగ్య గౌరీ, మంగళ కళ్యాణం అని ప«థకాలు పెట్టి సాయం చేస్తే మేమూసంతోషిస్తాం కదా.ఆహా. అలాంటప్పుడు మనం గుర్తుకు రాము. మానవ హారాలు చేసి ఎండలో నిలబడటానికి, పచ్చని నగరం కోసం పది కిలో మీటర్లు పరిగెత్తండి, అన్నప్పుడు మాత్రం మనం అందరం కావాలి. ఇవ్వకపోతే పోయే, ఎదురు మనల్ని డబ్బులడగటం. -
మధుమేహం రాకుండా ఉండాలంటే..
రక్తంలో చక్కెర మోతాదు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉందా? నేడో రేపు.. మధుమేహం బారిన పడతామేమో అన్న అనుమానం వెంటాడుతోందా? ఏం ఫర్వాలేదు.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. ఆ మహమ్మారికి చిక్కకుండా తప్పించుకోవచ్చు. చైనా, ఫిన్లాండ్, అమెరికాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో మధుమేహంపై జరిగిన పరిశోధనలు అన్నింటినీ మదించి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని చెబుతున్నారు. అన్నింటికంటే ముందు మన శరీరం బరువును 5 నుంచి 10 శాతం తగ్గించుకోవాలి. వారంలో ఐదు రోజులు.. రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే కనీసం రెండేళ్ల పాటు వ్యాధికి దూరంగా ఉండొచ్చని ఈ అధ్యయనం తెలిపింది. దీంతోపాటు ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దాదాపు రెండు లక్షల మందిపై జరిగిన అధ్యయనాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. పాలకూర, క్యాబేజీ వంటివి ఎక్కువగా తినాలి. కూల్డ్రింక్స్కు పూర్తిగా దూరంగా ఉండటం ద్వారా కూడా మధుమేహాన్ని దూరం పెట్టొచ్చని యూకే, యూఎస్లోని 17 ప్రాంతాల్లో జనాభాపై జరిగిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. జంతు ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడాన్ని తగ్గిస్తే మధుమేహం వచ్చే అవకాశం 20 శాతం వరకు తగ్గుతుంది. వీటితోపాటు గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మేలని ఇంకో అధ్యయనం సూచిస్తోంది. రోజూ కాఫీ తాగడం ద్వారా మధుమేహానికి దూరంగా ఉండొచ్చని దాదాపు 85 వేల మందిపై జరిగిన అధ్యయనం ద్వారా తెలుస్తోంది. -
రాజమహేంద్రవరం 2 బరంపురం
గోదావరి జలాలతో శివభక్తుల పాదయాత్ర గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఒడిశా నుంచి వచ్చిన శివభక్తులు గోదావరి జలాలతో పాదయాత్రగా తిరుగుపయనమయ్యారు. ఒడిశా రాష్ట్రంలోని బరంపురానికి చెందిన 15 మంది శివ భక్తులు డి. కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో శివమాల దీక్షను బూని గోదావరిలో పవిత్ర స్నానాలు చేసేందుకు రైలు మార్గాన మంగళవారం రాజమహేంద్రవరం చేరకున్నారు. అక్కడ స్నానాలు ఆచరించిన వారు వెంట కలశాలలో గోదావరి జలాలను తీసుకుని పాదయాత్రగా స్వస్థలానికి బయల్దేరారు. జాతీయ రహదారిన నడుస్తూ బుధవారం దివాన్చెరువు వచ్చిన వారిని ‘సాక్షి’ పలుకరించింది. గోదావరి పవిత్ర జలాలతో అక్కడ శివలింగాన్ని అభిషేకిస్తే మంచి జరుగుతుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. – దివాన్చెరువు (రాజానగరం) -
చదవాలంటే నడవాల్సిందే!
కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి పట్టని అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థుల కాలినడక కష్టాలకు ఫుల్స్టాఫ్ పడేనా? మానవపాడు: మండల పరిధిలోని విద్యార్థులు చదువుకోలాంటే కాలినడకన వెళ్లాల్సిందే. పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ఈ పరిస్థితి దాపురించింది. దీంతో కొంత మంది విద్యార్థులు చదువులకు స్వస్తిచెబుతున్నారు. అయినప్పటికీ పాలకులు, అధికికారులు పట్టించుకోవడం లేదు. పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి.. మానవపాడు మండల పరిధిలోని గోకులపాడు, ఇటిక్యాలపాడు, చండూరు, ఏ బూడిదపాడు, పోతులపాడు, కొర్విపాడు తదితర గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం నేటి వరకు లేదు. దీంతో ఆయా గ్రామాల నుంచి ఇతర గ్రామాలకు ఉన్నత చదువులు చదువుటకు కాలినడకన వెళ్తున్నారు. మండల పరిధిలోని ఈ గ్రామాల్లో ప్రాథమిక స్థాయి పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. పైచదువులు చదవాలంటే మానవపాడు, పుల్లూర్, జల్లాపురం, ఉండవెల్లి పాఠశాలలకు వెళ్లాలి. ఉన్నత చదువులు చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలంటే కాలినడక తప్పటం లేదు. ప్రతి రోజూ ఆరుకిలోమీటర్లు నడవాలి ప్రతి రోజు ఉదయం మూడు కిలోమీటర్లు, సాయంత్రం మూడు కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థులు మాత్రం కష్టమైనా ఇష్టపడి చదువుకుంటున్నారు. కాలినడక, ఇంటి అవసరాల నేపథ్యంలో జంకుతున్న కొంత మంది విద్యార్థులు ఆరవతరగతి వరకే చదువుతున్నారు. ఆ తరువాత ఇంటికే పరిమితమవుతున్నారు. గత కొన్నెళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. పట్టని అధికారులు అయినా అధికారులు మాత్రం బస్సు సౌకర్యం కల్పించడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరండి మీకు అన్ని సౌకర్యలు కల్పిస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో బస్సు సౌకర్యం కల్పించడం లేదు. ప్రతి రోజూ విద్యార్థులు పడుతున్న కషాం్టలు వారికి పట్టడం లేదు. ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలి సీమాంధ్రకు సరిహద్దుగా ఉన్న గ్రామాలకు మొదటి నుంచి కర్నూల్డిపో బస్సులే ఆధారమయ్యాయి. కాని వారు మాత్రం బస్సులను ఇష్టం వచ్చినప్పుడు తిప్పుతారు. అడిగినా స్పదించడం లేదు. తెలంగాణ జిల్లాలో ఉన్నSఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న గ్రామాలవైపు దష్టిసారించడం లేదు. జిల్లాలో ఉన్న డిపోల నుంచి బస్సు సౌకర్యం కల్పించాల్సి ఉంది. బస్సు సౌకర్యం లేని గ్రామాలకు బస్సు సర్వీసులను నడిపితే తప్ప విద్యార్థుల సమస్యలకు పరిష్కారం దొరకదు. ఇప్పటికైనా పాలకులు స్పదించి విద్యార్థుల కాలినడక కష్టాలకు ఫుల్స్టాఫ్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
వాకింగ్తో ప్రచారం
సాక్షి, చెన్నై: తండ్రిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు తనయుడు పడుతున్న కష్టం ఇది. మనకు.. మనమే అంటూ రాష్ట్రాన్ని చుట్టొచ్చిన ఈ తనయుడు అధికార పగ్గాలు లక్ష్యంగా రేయింబవళ్లు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ తనయుడే డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్. వినూత్న బాణీతో ప్రచారంలో దూసుకెళ్తోన్న స్టాలిన్ మందీమార్బలం, కమాండోల భద్రతా వలయం కూడా లేకుండా సాధారణ వ్యక్తిగా వాకింగ్తో ప్రజల్ని ఆకర్షించే పనిలో పడ్డారు. ఆయన్ను గుర్తు పట్టిన వాళ్లు మనలో ఒక్కడూ అంటూ నినాదించడం మొదలెట్టారు. ఇందుకు తిరుచెందూరు వేదికగా నిలిచింది. అధికార పగ్గాల్ని చేపట్టి తీరాలన్న కాంక్షతో డీఎంకే వర్గాలు ఉరకలు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రథముడిగా డీఎంకే దళపతి స్టాలిన్ ఉన్నారు. అధినేత కరుణానిధి ఓ వైపు, చెల్లెమ్మ కనిమొళి మరో వైపు ప్రచారంలో ఉరకలు తీస్తున్నా, దళపతి శైలి మాత్రం వినూత్నంగా సాగుతున్నది. మనకు..మనమే అంటూ స్టైలీష్ స్టాలిన్గా మారిన ఈ దళపతి ఎన్నికల ప్రచారంలో సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు. రోడ్ షో సాగుతున్నా, చటుక్కున వాహనం దిగేయడంతో కాసేపు నడకతో జనాన్ని పలకరించడం, చిన్న దుకాణాల్లో బజ్జిలు, బిస్కెట్లు ఆరగించడం, టీ కాఫీలతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం వేకువ జామున వాకింగ్ రూపంలో ఓటర్లను పలకరించే యత్నం చేసి స్టాలిన్ సఫలీకృతులు అయ్యారు. తిరుచెందూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్టాలిన్ ఉదయాన్నే హంగు ఆర్భాటాలు, మంది మార్భలం, కమాండో బలగాల భద్రత కూడా లేకుండా సాధారణ వ్యక్తిగా బయటకు వచ్చేయడం విశేషం. అక్కడి వీధుల్లో వాకింగ్ చేస్తూ, తిరుచెందూరు బీచ్ వైపుగా కదిలారు. కాసేపు బీచ్లో సముద్రపు గాలిని ఆస్వాదించిన స్టాలిన్ తిరిగి హోటల్కు వెళ్లడానికి గంట సమయం పట్టిందటా..!. ఇందుకు కారణం స్టాలిన్ను గుర్తు పట్టిన జనం మనలో ఒక్కడూ అని నినాదిస్తూ పలకరింపుల్లో దిగడం గమనార్హం. ఆలయ వీధుల్లో వాకింగ్తో మహిళల్ని , కార్మికుల్ని పలకరిస్తూ, రోడ్డుపై ఉన్న దుకాణంలో కొంబరి బోండాను తాగి, అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ హోటల్కు చేరడం విశేషం. అయితే, తండ్రిని సీఎం కుర్చీలో కూర్చేబెట్టేందుకు వారసుడు పడుతున్న పాట్లు, చేస్తున్న ఫీట్లకు ఏ మేరకు ఓట్లు రాలుతాయో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
రోడ్డుపై నడుస్తూ మెసేజ్ లు చూసినా..
న్యూయార్క్: రోడ్లపై నడుస్తూ, డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు మాట్లాడకూడదని ఆలా చేయడం నేరమని, ట్రాఫిక్ నిబంధనలకు సైతం విరుద్ధమని అమెరికాలో ఇప్పటికే చట్టాలు చేశారు. ఇకమీదట రోడ్లపై ఫోన్లో మెసేజ్ లు చూడటం, సందేశాలు టైప్ చేయడం వంటివి కూడ నేరంగానే పరిగణించబోతున్నారట. చట్ట వ్యతిరేక చర్యగా భావించి తగిన శిక్షను కూడ అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నారు. 'డిస్ట్రాక్టెడ్ వాకింగ్' విశ్వవ్యాప్త సమస్యగా మారుతున్న నేటి తరుణంలో, సమస్యలపై నిపుణులు దృష్టిసారించారు. కదిలే సమయంలో ఫోన్ లోని చిన్నపాటి బ్లూ స్క్రీన్ చూడటంవల్ల కళ్ళకు తీవ్ర హాని కలగడంతోపాటు, ప్రమాదాలకు దారి తీయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. గ్లోబల్ మీడియా కంపెనీ మాషబుల్ లెక్కల ప్రకారం అమెరికాలో పాదచారుల మరణాలు రోజు రోజుకూ పెరుగుతున్నట్లు గమనించారు. పెడస్ట్రియన్ డెత్స్ 2005 లో 11శాతం ఉండగా.. ఆ సంఖ్య 2014 నాటికి 15 శాతానికి చేరుకున్నట్లు సర్వేలద్వారా తెలుసుకున్నారు. రోడ్ దాటుతున్నపుడు ఫోన్ వాడితే 250 డాలర్ల జరిమానా కట్టాలంటూ హవాయిలో రూపొందించిన బిల్లు పెండింగ్ లో ఉండగా... ఇప్పుడు రోడ్డుపై నడుస్తూ మేసేజ్ లు చేయడం కూడ చట్ట విరుద్ధంగా పరిగణించాలంటూ న్యూ జెర్సీలోని చట్టసభ సభ్యురాలు ఒకరు డిమాండ్ చేశారు. పాదచారులు ఫోన్లు వంటి కమ్యూనికేషన్ పరికరాల్లో మెసేజ్ లు చేయడం, సందేశాలను చూడటం వంటి చర్యలను పూర్తిగా నిషేధించాలని పమేలా లాంపిట్ డిమాండ్ చేశారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారికి 50 డాలర్ల జరిమానాతోపాటు, 15 రోజుల జైలు శిక్షను కూడ అమలు చేయాలని ఆమె కోరారు. రోడ్లపై పరధ్యానంగా ఉండటం అటు డ్రైవర్లకు ఇటు ప్రయాణీకులకు ప్రమాదాలను తెచ్చిపెడుతుందన్నారు. వాహనాలు నడుపుతూ ఫోన్లు మాట్లాడటం వల్ల కలిగే నష్టమే, పరధ్యానంగా రోడ్లపై నడిచేవారివల్ల కలుగుతుందని, వారికి విధించినట్లే వీరికి కూడ జరిమానా విధించాలని లాంపిట్ డిమాండ్ చేశారు. -
శిలువతో వా‘కింగ్’
ఈ ఫొటోలో కనిపిస్తున్న అమెరికన్ పెద్దమనిషి పేరు అర్థర్ బ్లెసిట్. ఇతగాడు వాకింగ్లో కింగ్. కాలినడకతోనే ప్రపంచమంతా చుట్టేశాడు. చేతులు ఊపుకుంటూ సాదాసీదాగా సాగిన నడక కాదు, 3.7 మీటర్ల పొడవు ఉన్న శిలువను భుజాన వేసుకుని మరీ నడక సాగించాడు. ఫ్లోరిడా నుంచి 1969లో మొదలుపెట్టిన నడకను 2000 సంవత్సరం వరకు కొనసాగించాడు. మొత్తం 31 ఏళ్ల వ్యవధిలో ఏడు ఖండాలనూ చుట్టేస్తూ, 34,501 మైళ్లు (55,524 కి.మీ) నడక సాగించి, గిన్నెస్ బుక్లోకి ఎక్కాడు. ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. తిక్కలెక్క -
రోడ్డుపై హల్చల్ చేసిన హన్సిక
-
వరదల్లో చిక్కుకుని అష్టకష్టాలు పడ్డ హీరోయిన్
చెన్నై: తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మాంచి జోరుమీదున్న ముద్దుగుమ్మ హన్సిక.. తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చిక్కుకుందట. ఊహించని ఈ పరిణామానికి తెగ టెన్షన్ పడింది. చివరికి చెన్నై విమానాశ్రయం నుంచి హోటల్ కు చేరడానికి చాలా పెద్ద సాహసమే చేసింది. చెన్నై రోడ్లపై హోరువానలో గంటపాటు నడిచి తెల్లవారుఝామున మూడు గంటలప్రాంతంలో హోటెల్ కు చేరింది. అటు జోరువాన.. ట్రాఫిక్ జామ్, ఇటు చూస్తే మోకాళ్ల లోతు నీళ్లు. మరోవైపు సిగ్నల్స్ లేక కనెక్ట్ కాని మొబైల్స్. ఇలా దాదాపు గంటల నరకయాతన అనుభవించి.. చివరికి ఎలాగోలా బయటపడ్డానుంటూ ఈ విషయాలను స్వయంగా హన్సికానే మీడియాకు వివరించింది. 'చలికి వణికిపోయా... వానకెదురు నడుస్తోంటే....కాళ్లు నొప్పులు.. అభిమానులు గుర్తు పట్టేశారు.. పేరు పెట్టి పిలవడం మొదలు పెట్టారు. అయినా ఎలాగోలా చేరాను .దాదాపు ముంబై దాడులప్పుడు కూడా ఇలాంటి సిట్యుయేషన్నే ఎదుర్కొన్నాఅపుడు నా స్నేహితులు చాలామంది సాయం చేశారంటూ' ఆనాటి జ్ఞాపకాలను మీడియాతో షేర్ చేసుకుంది. స్టాలిన్ సరసన జాలీ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటిస్తున్న హన్సిక ఈ మూవీ షూటింగ్ నిమిత్తం ముంబై నుంచి చెన్నైకి బయలుదేరింది. ఈ సందర్భంగానేఈ పాలబుగ్గల సుందరి చిక్కుల్లో పడిందట. విపరీతమైన ట్రాఫిక్ జామ్ తో అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కి వెళ్లలేక మద్యలోనే చిక్కుకు పోయింది. ఎడతెరిపిలేని వానలు నగరాన్ని ముంచెత్తడంతో దాదాపు మోకాళ్ల లోతు నీటిలో కనీసం గంటపాటు ఇరుక్కుపోయిందట. ఇక ఎటూ పాలుపోని పరిస్థితుల్లో సుదీర్ఘంగా అంటే గంటపాటు నడక సాగించాల్సొచ్చిందంట. తనకు కేటాయించిన హోటెల్ కు చేరుకోవాలంటే కనీసం గంటా రెండు గంటల టైమ్ పడుతుందట.. అభిమానులు చుట్టుముట్టి గందరగోళం సృష్టించినా చివరకి నడుచుకుంటూనే హోటల్ కు చేరిందట. -
రెండు రోజులుగా జ్వరం... స్వైన్ఫ్లూ కావచ్చా?
హోమియో కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 68. ఆయన ఆరోగ్యంగానే ఉంటారు కానీ, ఈ మధ్య వాకింగ్కని వెళ్లి, ఇల్లు కనుక్కోలేక పోతున్నారు. అలాగే కళ్లద్దాలు, హ్యాండ్స్టిక్, సెల్ఫోన్ వంటి వాటిని ఒకచోట పెట్టి మరోచోట వెతుక్కుంటున్నారు. ఒక్కోసారి మా పిల్లల పేర్లు కూడా మర్చిపోతున్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. ఆయన మతిమరపును తగ్గించవచ్చా? - పార్థసార థి, గుంటూరు ప్రతిమనిషి తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి మరచిపోవటం సహజం. ఈ మతిమరపు ఎక్కువగా వృద్ధాప్యంలో చూడటం సాధారణం. వృద్ధులు తమ వస్తువులను ఒకచోట పెట్టి, ఆ విషయం మరచిపోయి మరోచోట వెతుక్కోవడం చూస్తూనే ఉంటాం. కొంతమందిలో కొన్ని కారణాల వల్ల ఈ మతిమరపు ఎక్కువ అవుతుంటుంది. వాకింగ్ చేస్తూండగానో, మరో పనిచేస్తుండగానో తామెందుకు ఆ ప్రదేశానికి వచ్చామో మరచిపోయి చూసి మతిభ్రమించినట్లు వెర్రిగా ప్రవర్తించటం చూస్తుంటాం. అదిచూసి ఇంటిలోని వారు విసుక్కోవటం, కోప్పడటం, బాధపడటం సాధారణం. అయితే వారు తమ సమీప బంధుమిత్రులను, ముఖ్యంగా కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేక సతమతమవుతుండటం వంటి లక్షణాలను గమనించినట్లయితే వారు అల్జైమర్ డిసీజ్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించవచ్చు. అల్జైమర్స్ డిసీజ్ అంటే ఏమిటి? డెమైన్షియా అనేది మెదడుకు సంబంధించిన సమస్య. దీని వలన మనిషి అలవాటు పడ్డ పనులలో తేడా రావటం గమనిస్తాము. వృద్ధాప్యంలో చూసే మతిభ్రమణ అంటే డెమైన్షియాను అల్జైమర్స్ డిసీజ్ అంటారు. ఇది మొదట మెదడు భాగాలలో ప్రభావం చూపి క్రమేపీ మనిషి ఆలోచనా విధానంలో, జ్ఞాపకశక్తిలో, భాషావిధానంలో మార్పు తీసుకు వస్తుంది. ఇది సామాన్యంగా 60 ఏళ్ల తర్వాత వస్తుంది. ఆ తర్వాత వయస్సు పెరిగేకొద్దీ వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. స్త్రీ పురుషులిరువురిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుంది. మెదడుకు బలమైన దెబ్బతగలటం వల్ల మెదడులో సరిగా రక్తప్రసరణ సరిగా జరగక భవిష్యత్తులో ఈవ్యాధి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు రోగి ఇంటిలోనుంచి వెళ్లిపోవటం, యాంగ్జైటీకి గురవటం, తమ ఇంటినే గుర్తించలేకపోవటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. నిర్ధారణ: రోగి శారీరక, మానసిక లక్షణాలలో మార్పులను బట్టి, రక్తపరీక్ష, బ్రెయిన్ సీటీస్కాన్, ఎమ్మారై హోమియో కేర్ ఇంటర్నేషనల్ చికిత్స: రోగి శారీరక, మానసిక లక్షణాలను విశ్లేషించి వ్యాధి కారణాలను కనుగొన్న తర్వాత కోనియం, బెరైటాకార్బ్, కోబాల్ట్, అల్యూమినా, నేట్రం సల్ఫ్ వంటి మందులను వైద్యుని పర్యవేక్షణలో వాడటం ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చు. నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. గత ఏడాది నాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఏశారు. ఇంకా మందులు వాడుతున్నాను. ఇవి ఇంకా ఎన్నాళ్లు వాడాల్సి ఉంటుంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి. - డి. మదన్మోహన్, మెదక్ కిడ్నీ మార్పిడి అయిన తర్వాత శరీరం ఆ మూత్రపిండాన్ని నిరాకరించకుండా ఉండేందుకు వాడే మందులు జీవితాంతం తప్పనిసరిగా వాడాలి. చాలామంది కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తారు. ఇలా చేయడం వల్ల శరీరం కిడ్నీని అంగీకరించకుండా ఉండే అవకాశం ఉంది. తద్వారా మీకు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. ఇవిగాక జలుబు, జ్వరం, ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే డాక్టర్ను సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఏ మందులూ వాడకూడదు. నిల్వ పదార్థాలను తినకూడదు. ఇన్ఫెక్షన్స్ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నా వయసు 34 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. నెలలోపు మళ్లీ జ్వరం వస్తోంది. ఇలా పదే పదే జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? - జ్ఞానేశ్వర్, నల్గొండ మీరు తరచూ జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే, అది మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలు ఏమిటో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ ఉంటే కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కావచ్చు. ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఇలా తిరగబెడతాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ పూర్తికోర్సు వాడకపోతే డాక్టర్ చెప్పిన మోతాదులో మూడు నెలల పాటు అవి వాడాలి. ఇన్ఫెక్షన్స్ తరచూ తిరగబెట్టకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు (రోజూ రెండు నుంచి మూడు లీటర్లు) తాగుతుండాలి. మూత్రవిసర్జనను ఆపుకోకూడదు. ఒకసారి మీరు డాక్టర్కు చూపించుకోండి. పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ఇటీవలే వారం రోజుల పాటు దూరప్రాంతాలకు ప్రయాణం చేశాను. రెండు రోజులుగా జ్వరం. దాంతో పాటు ఒళ్లునొప్పులు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. అలసటగా అనిపిస్తోంది. స్వైన్ఫ్లూ గురించి పత్రికల్లో వస్తున్న న్యూస్ చూసి, నాకు స్వైన్ఫ్లూ సోకిందేమోనని అనుమానంగా ఉంది. దయచేసిన నా సమస్యకు పరిష్కారం చూపండి. - దయాసాగర్, నల్గొండ ఒంటినొప్పులతో కూడిన జ్వరం ఉన్నంత మాత్రాన అది స్వైన్ఫ్లూ అనే చెప్పలేం. ఎక్కువగా ప్రయాణం వల్ల కూడా ఒళ్లునొప్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం, సురక్షితం కాని నీరు తాగడం వల్ల కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే, అది స్వైన్ఫ్లూ అని నిర్ధారణ అయినట్లు కాదు. వైరల్ ఫీవర్లలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మీకు ఛాతీ బరువెక్కినట్లు అనిపించడం, బీపీ పడిపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో పాటు మరో నాలుగు రోజుల పాటు జ్వరం తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అప్పటివరకూ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మీ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, మీ పరిసరాలూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. బయటకు ఎక్కడికీ వెళ్లకుండా విశ్రాంతి తీసుకోండి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కు ధరించి వెళ్లడం మంచిది. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులా అని చూసుకోండి. ఎందుకంటే వారితో పాటు చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో స్వైన్ఫ్లూ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ స్వైన్ఫ్లూ అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు జ్వరం తగ్గకుండా మాటిమాటికీ వస్తూ ఉంటే, వెంటనే డాక్టరును సంప్రదించండి. వారు దానికి కారణం ఏమిటో నిర్ధారణ చేస్తారు. -
వానా... వానా... ఇలియానా!
♦ ఇలియానాకి వానంటే ఇష్టమా? ♦ వాన పడితే తనకి గుర్తొచ్చేది? ♦ వర్షాలప్పుడేం వేస్కుంటుంది? ♦ చిన్ననాటి వాన జ్ఞాపకాలేంటి? ♦ ఎండలకు సెలవు చెప్పి, వానలకు ఆహ్వానం పలకడానికి ఎంతో హుషారుగా ఎదురు చూస్తుంటా. తొలకరి జల్లు పడగానే పులకరించిపోతా. అప్పటివరకూ ఎండల కారణంగా అనుభవించిన కష్టమంతా ఆ జల్లులతో ఒక్కసారిగా పోయినట్లు ఉంటుంది. ♦ రుతు పవనాలు వచ్చేస్తున్నాయి అని టీవీల్లో, రేడియోల్లో చెప్పగానే నేను షాపింగ్కి రెడీ అయిపోతాను. రంగు రంగుల గొడుగులు, గమ్ బూట్స్, రెయిన్ కోట్, కలర్ఫుల్ స్వెటర్లు కొని తెచ్చుకుంటాను. ♦ వర్షాకాలంలో పసుపు రంగు దుస్తులు వాడితే బాగుంటుంది. అందుకని, ఎక్కువగా ఆ రంగు దుస్తులు వాడతాను. యెల్లో కాకపోతే వేరే ముదురు రంగు డ్రెస్సులు వేసుకుంటాను. ఈ సీజన్లో లేత రంగులు అంత బాగుండవు. రెయినీ సీజన్లో నేను జీన్స్ ప్యాంట్స్ వాడను. కురచ దుస్తులే వాడతాను. ట్రౌజర్స్, కలర్ఫుల్ టీ షర్ట్స్ వేసుకుంటాను. ♦ నేను మామూలుగా ఎప్పుడూ ఎత్తు మడమల పాదరక్షలే వాడతాను. కానీ, వర్షాకాలంలో వాటిని పొరపాటున కూడా షూ ర్యాక్ నుంచి బయటికి తీయను. ఫ్లాట్ స్లిప్పర్స్ వాడతాను. షూటింగ్స్ ఉంటే మాత్రం క్యారెక్టర్కి అనుగుణంగా బూట్లు, చెప్పులు సెలక్ట్ చేసుకుంటాను. ♦ వర్షాకాలం అంటే నాకు మా గోవా గుర్తొస్తుంది. ఇలా వాన పడిందో లేదో అలా పవర్ కట్ అవుతుంది. అందుకని కొవ్వొత్తులు రెడీగా ఉంచుకుంటాం. రాత్రిపూట క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేవాళ్లం. భలే గమ్మత్తుగా ఉండేది. అదేంటో ఎంత వాన వచ్చినా గోవా బాగానే ఉంటుంది. కానీ, ముంబయ్ చాలా అధ్వాన్నంగా తయారవుతుంది. విడి రోజుల్లోనే ట్రాఫిక్ ఎక్కువ అనుకుంటే ఇక వర్షాకాలంలో చెప్పక్కర్లేదు. రోడ్లన్నీ బురద బురదగా తయారవుతాయ్. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోతాయ్. నడిచి వెళ్లేవాళ్లకీ ఇబ్బందే, వాహనాల్లో వెళ్లేవాళ్లకీ ఇబ్బందే. ♦ చిన్నప్పుడు వానలో బాగా తడిచేదాన్ని. పాటలు కూడా పాడేదాన్ని. ఇప్పుడు దూరంగా నిలబడి ఎంజాయ్ చేయడంతో సరిపెట్టుకుంటున్నా. వానలో తడుస్తూ, పాటలు పాడితే చుట్టుపక్కలవాళ్లు విచిత్రంగా చూస్తారని భయం. ఆ భయాలు, బెరుకులూ తెలియని బాల్యం చాలా తీపిగా ఉంటుంది కదా! ♦ రెయినీ సీజన్లో ఆ చల్లదనానికి కాస్త బద్ధకంగా ఉంటుంది. బయటికెళ్లి వాకింగ్, స్విమ్మింగ్ చేసే వీలు కూడా ఉండదు. అందుకే ఈ సీజన్లో ఇన్డోర్ వ్యాయామాలే చేస్తాను. మా ఇంటి లోపల మెట్లు ఉంటాయి. వీలైనన్ని సార్లు అవి ఎక్కి దిగుతాను. అలాగే కార్డియో ఎక్సర్సైజ్ కూడా చేస్తాను. ♦ వడగళ్ల వాన గురించి వినడం తప్ప ఎప్పుడూ చూడలేదు. పిడుగు శబ్దం వినపడితే మాత్రం ‘ఏ సముద్రంలోనో పడి ఉంటే బాగుంటుంది’ అనుకుంటాను. ఈ సీజన్లో షూటింగ్ ఉంటే ఎప్పుడెప్పుడు ప్యాకప్ చెబుతారా, ఎప్పుడు ఇంటికెళ్లిపోదామా అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే వర్షాకాలంలో నాకు ఇంట్లో ఉండటం బాగా ఇష్టం. బాల్కనీలో నిలబడి వర్షాన్ని చూస్తుంటాను. ఆ సమయంలో వేడి వేడి కాఫీ తాగుతుంటే దీన్నే స్వర్గం అంటారేమో అనిపిస్తుంటుంది. అలాగే మా అమ్మగారు వేడి వేడి స్నాక్స్ తయారు చేసి ఇస్తారు. అవి తింటూ హ్యాపీగా టీవీ ముందు సెటిలైపోతా. మామూలుగా డైట్ విషయంలో జాగ్రత్త తీసుకున్నా ఆ టైమ్లో మాత్రం లెక్కలేకుండా తింటా. ఒంట్లోకి ఎన్ని కేలరీలు పంపించానా అని తర్వాత టెన్షన్ పడుతుంటా. -
నడకతో డిప్రెషన్కు స్వస్తి!
వాషింగ్టన్: ప్రస్తుతం జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురవటం, డిప్రెషన్కు లోనవటం జరుగుతోంది. అయితే ప్రతి రోజూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొద్ది సేపు నడిస్తే డిప్రెషన్ వచ్చే ప్రమాదం చాలా తక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పార్కులు, పచ్చికమైదానాలు వంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నడిస్తే మానసిక ప్రశాంత చేకూరి, మెదడులోఎలాంటి ప్రతికూల భావాలు జనించవని అమెరికాలోని స్టాన్ఫోన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు గ్రెచెన్ తెలిపారు. ట్రాఫిక్, ఇతర రణగొణ ధ్వనుల మధ్య వాక్ చేస్తే మెదడులో నెగెటివ్ ఎమోషన్స్ పుట్టి, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు. ట్రాఫిక్లో, పార్కులు వంటి ఆహ్లాదకరమైన వాతారణంలో ప్రతి రోజూ 90 నిమిషాలు నడిచే వారిపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలు కనుగొన్నారు. -
అస్సాంలో వింతవైద్యం
-
ఏడు నెలల గర్బిణి వ్యాయామం
-
లూనా... ఓ చక్కని సేవకుడు!
శునకాన్ని వాకింగ్కు తీసుకెళ్లడమే కాదు.. లూనా అనే ఈ పర్సనల్ రోబో ఇంకా అనేక పనులూ చేయగలదు. కూల్డ్రింకులు అందించడంతో పాటు ఆస్పత్రిలో వైద్యులకు, నర్సులకు సహాయం కూడా చేస్తుంది. కాలిఫోర్నియాలోని రోబోడైనమిక్స్ కంపెనీ వారు దీనిని తయారు చేస్తున్నారు. మనిషిలా ఒకటిన్నర మీటర్ల ఎత్తుండే లూనా ముఖంపై టచ్స్క్రీన్ ఉంటుంది. మైక్రోఫోన్, వైర్లెస్, సెల్యులార్ కమ్యూనికేషన్ ద్వారా నియంత్రించొచ్చు. హెచ్డీ కెమెరాతో పరిసరాలను గమనిస్తూ చక్రాలతో చకచకా తిరుగుతుంది. దీనిని పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసేందుకు కంపెనీవారు నిధుల వేట మొదలుపెట్టారు. డిసెంబర్లోగా మార్కెట్లోకి రానున్న లూనా ధర రూ. 93 వేలు. ముందుగా బుక్ చేసుకుంటే రూ. 63 వేలు. ఇప్పుడు పీసీలు, స్మార్ట్ఫోన్లు ఇంటింటా సందడి చేస్తున్నట్లే.. 2021 నాటికి పర్సనల్ రోబోలూ హల్చల్ చేస్తాయని, వాటిలో లూనా మొదటిస్థానంలో నిలుస్తుందని కంపెనీవారు చెబుతున్నారు. -
గిరిగీతలు నగరికి
హత్తుకున్న ధన్యులు! వేష, భాష, నడక, నడతల్లోనే కాదు కళల్లోనూ కృత్రిమత్వానికి బహుదూరం! చిత్రరచనలోనూ వాళ్ల కుంచె ప్రకృతినే ప్రస్తుతిస్తుంది. అధునాతన హంగులు అద్దుకోని ఆ రంగులు గిరి దాటి నగరికి చేరుతున్నాయి. ఆ సహజ కళను నాగరిక ప్రపంచానికి పరిచయం చేయాలనే కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఏటా ‘ఆదిచిత్ర’ పేరుతో గిరిజన చిత్రకళాప్రదర్శనను ఏర్పాటు చేస్తోంది. ఈసారి దీనికి తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమిస్తోంది. మాసబ్ట్యాంక్లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలోని నెహ్రూ మ్యూజియం వేదికగా ఈ నెల 15న ప్రారంభం కానున్న ఈ ప్రదర్శన 21 వరకూ కొనసాగనుంది. ప్రత్యేకమైన కళ గిరిజన చిత్రాలు ప్రత్యేకమైనవి. నిజానికి వీళ్ల చిత్రకళకు వాళ్ల గుడిసెల గోడలే క్యాన్వాసులు. వాళ్లు కొలిచే దేవుళ్లు, దైనందిన జీవితం, అది సాఫీగా సాగడానికి ప్రకృతిని వాళ్లు కోరే దీవెనలే.. ఆ కళకు వస్తువులు! జీవం ఉట్టిపడే ప్రతిగీతకు ప్రకృతి ప్రసాదించిన రంగులే అదనపు హంగులు సమకూరుస్తాయి. ఈ అందాలన్నీ ఈ చిత్రప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. ఈ ప్రదర్శనలో తెలంగాణకు చెందిన గోండులు, పర్ధానులు, పిథోరా, కోయ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సవర్లు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రత్వా, భిలాల, నాయక్, భిల్ తెగల గిరిజన కళాకారులు పాల్గొననున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ‘నాయకపోడ’ గిరిజనులు తమ నృత్యంతో అలరించనున్నారు. టైఫెడ్.. ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (కేంద్ర గిరిజనశాఖ అనుబంధ సంస్థ) గిరిజన ఉత్పత్తులు, హస్తకళలను ప్రమోట్ చేయడానికి.. వాటికి మార్కెటింగ్ కల్పించడానికి ఏర్పడిన సంస్థ. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ గిరిజన సంక్షేమానికే వినియోగిస్తారు. ఇక్కడ ‘ఆదిచిత్ర’ను నిర్వహిస్తున్నది ఈ టైఫెడే. ఈ చిత్ర కళాప్రదర్శనలో పాల్గొంటున్న వారంతా ఆదివాసీలే. -
అరగంటలో నాలుగు దొంగతనాలు
అది మచిలీపట్నంలోని కలెక్టర్ బంగళా వెనుక రోడ్డు.. మంగళవారం తెల్లవారుజాము సమయం.. సీఎస్ఆర్ నగర్కు చెందిన లక్ష్మీరత్నకుమారి వాకింగ్ చేస్తున్నారు.. ఇంతలో మోటార్ సైకిల్పై వేగంగా వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకునే ప్రయత్నం చేశారు.. ప్రతిఘటించిన ఆమెను రోడ్డుపై పడేసి గొలుసు లాక్కుపోయారు.. ఇంగ్లిషుపాలెంలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మరో మహిళ వద్ద.. ఈడేపల్లిలో, బైపాస్ రోడ్డులోని మాచవరంలో మరో ఇద్దరి వద్ద.. ఇదే తరహాలో గొలుసు చోరీలు చేశారు. ఒకేరోజు అరగంట వ్యవధిలో వరుసగా చోరీలు జరగడం పట్టణంలో సంచలనం రేపింది. ఈ ఘటనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు చోట్ల వరుస గొలుసు దొంగతనాల ఘటనలు జరిగాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వాకింగ్ చేస్తుండగా వాహనంపై వచ్చి ... పట్టణంలోని సీఎస్ఆర్ నగర్కు చెందిన క్రోవి లక్ష్మీరత్నకుమారి కలెక్టర్ బంగ్లా వెనుకరోడ్డులో మంగళవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా మోటార్సైకిల్పై వేగంగా వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 26 గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. ఆమె ప్రతిఘటించటంతో రోడ్డుపై పడేసి మెడలోని గొలుసును లాక్కుపోయారు. అడ్రస్లు అడిగి.. ఆదమరిపించి.. ఇంగ్లిషుపాలెంకు చెందిన మాదిరెడ్డి ఉమాసుందరి తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న నాలుగు కాసుల (32 గ్రాములు) గొలుసును తెంచుకుని పోయారు. అనంతరం ఈడేపల్లికి చెందిన వేముల భారతరాజేశ్వరి ఇంటిముందు ముగ్గు వేస్తుండగా బైక్పై ఇద్దరు దుండగులు వచ్చారు. వారిలో ఒకడు తనవద్ద ఉన్న చిన్న కాగితం చూపి ఫలానా పేరున్న వ్యక్తి ఇల్లు ఇదేనా? అని అడిగాడు. ఆ పేరుగలవారు ఇక్కడ ఎవరూ లేరనే సమాధానం ఇచ్చే లోపుగానే రాజేశ్వరి మెడలో ఉన్న మూడు సవర్ల (24గ్రాములు) బంగారు గొలుసును లాక్కుపోయారు. బైపాస్ రోడ్డులోని మాచవరంలో ఉంటు న్న కాగిత సూరమ్మ అనే వృద్ధురాలు ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఇద్దరు దుండగులు వచ్చారు. వారిలో ఒకడు ఆమె వద్దకు వచ్చి ఒకరి అడ్రస్ను హిందీలో అడిగాడు. తనకు హిందీ రాదని.. భర్తను పిలుస్తానంటూ ఇంట్లోకి వెళ్లబోతున్న సూరమ్మపై దాడి చేశాడు. ఆమె మెడలోని ఆరు సవర్ల (48గ్రాములు) రెండు పేటల నానుతాడును మంగళసూత్రాలతో సహా తెంచుకున్నాడు. వెంటనే ఇద్దరూ బైక్పై పరారయ్యారు. ఈ నాలుగు ఘటనల్లో ఇద్దరు యువకులు పాల్గొన్నారు. వారిలో ఒకడు గొలుసులు తెంచుకుని సమీపంలో ఉన్న బైక్పైకి ఎక్కాడు. దానిపై అప్పటికే సిద్ధంగా ఉన్న మరో యువకుడితో కలిసి రెప్పపాటులో మాయమయ్యారని బాధితులు చెబుతున్నారు. పోలీసు బృందాల గాలింపు పట్టణంలో గత జూన్ 16వ తేదీ తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో ఇదే తరహాలో వరుస చోరీలు జరిగాయి. అప్పట్లో పలువురు మహిళల నుంచి సుమారు 109 గ్రాముల విలువ చేసే బంగారు ఆభరణాలను ఇద్దరు యువకులు సినీ ఫక్కీలో అపహరించుకుపోయారు. అదే ముఠా మళ్లీ ఈ చోరీలకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. ఈ బృందాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బాధితుల నుంచి వివరాలు సేకరించిన డీఎస్పీ చైన్స్నాచింగ్ల వరుస ఘటనలు పట్టణ ప్రజల్లో కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న పలువురు వాకింగ్ను మానివేసి హుటాహుటిన ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనలపై సమాచారం అందుకున్న డీఎస్పీ కె.వి.శ్రీనివాసరావు హుటాహుటిన బాధితుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. నేరస్తులకు సంబంధించి బాధితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే దుండగులు ఒక్కసారిగా గొలుసులు తెంచుకుపోతుండటంతో ఆందోళనకు గురై వారిని సరిగా పసిగట్టలేకపోయామని బాధితులు తెలిపారు. దీంతో ఆయన పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో పుటేజీలను పరిశీలించి, నిందితుల ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నించారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో రెండు పోలీసు ప్రత్యేక బృందాలనుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాగా ఈ చోరీలన్నీ చిలకలపూడి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగాయి. బాధితులంతా అదే స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
నేనే పెద్ద పెప్పర్ స్ప్రేని..
సమయం ఉదయం 8.30 గంటలు... ప్రాంతం.. బంజారాహిల్స్...కేబీఆర్ పార్కులో వాకింగ్ ముగించుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్తున్న సమయం. అప్పుడే వాకింగ్ ముగించుకొని బయటికి వస్తున్న టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు ఓ పెప్పర్ స్ప్రే సేల్స్మెన్ ఎదురుపడి ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే తీసుకోండి సార్ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేశాడు. అందుకు స్పందించిన మోత్కుపల్లి ‘అరె నాకెందుకురా భయ్ గది... గదేదో ఆ లగడపాటికి ఇచ్చుకో పో... నేనే పెద్ద పెప్పర్ స్ప్రే.. నా జోలికి ఎవరొస్తర్రభయ్’ అంటూ బదులిచ్చాడు. దీంతో అక్కడున్న వాకర్లంతా గొల్లుమన్నారు. -
వాకింగ్@హార్ట్
వాకింగ్తోనే గుండె బలం పెరుగుతుందంటున్నారు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. శారీరక శ్రమ తగ్గడం, మారిన జీవన శైలి మనిషి గుండెను బలహీనంగా చేస్తున్నాయన్నారు. హెల్దీ ఫుడ్ హాబిట్స్, వాకింగ్ వల్ల వ్యాధులను అరికట్టవచ్చని చెప్పారు. ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ‘కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద ‘హార్ట్ హెల్త్ అవేర్నెస్’ సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. గుండె వ్యాధులపై ప్రజల్లో అవేర్నెస్ పెంచాలన్నారు. -
వాకింగ్ వెళ్తే ఇల్లు లూటీ
మైసూరు : ఇక్కడి విజయనగర మొదటి స్టేజ్ రెండో క్రాస్లో నివాసముంటున్న ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఇంటిలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసుల వివరాల మేరకు... కువెంపు ట్రస్ట్ సమీపంలోని ఇంటి నెంబర్ 74లో రవీంద్రనాథ్, ఆయన భార్య ఉషా నివాసముంటున్నారు. రవీంద్ర నాథ్ చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో రవీంద్ర భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి సమీపంలోని పార్కుకు వాకింగ్ వెళ్లారు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి మొదటి అంతస్తులోని బాల్కని ద్వారా లోనికి ప్రవేశించి మొదటి, రెండో అంతస్తుల్లోని మూడు బీరువాల్లో రూ. 10 లక్షల విలువైన బంగారు నగలతో పాటు విలువైన డైమండ్ నెక్లెస్తో పాటు పలు విలువైన నగలతో ఉడాయించారు. గంట తరువాత ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని సీఐ రవి, క్రైం బ్రాంచ్ ఎస్ఐ రఘ ప్రసాద్, సీసీబీ సీఐ సూరజ్ తదితరులు పరిశీలించారు. పోలీసు జాగిలంతో ఆధారాలు సేకరించారు. దుండగులు తెలివిగా ఒక కర్ర సాయంతో మొదటి అంతస్తుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
తాత చెప్పినట్టే దేశ దిమ్మరినయ్యూ
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు విజయవాడ స్పోర్ట్స్, న్యూస్లైన్ : ‘ఓరే బాబూ నీ అరి కాలిపై చక్రం ఉందిరా. దేశ దిమ్మరివవుతావు. అని చాలా చిన్న వయస్సులోనే మా తాత చెప్పారు. అలాగే ఆ నాడు ఆయన చెప్పిన ప్రకారమే దేశదిమ్మరినయ్యూ. దేశమంతా తిరిగి ప్రజలకు సేవ చేయడానికే దేశ దిమ్మరినయ్యా’ అని అన్నారు కేంద్ర పట్టణాభివృద్థి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు. చంద్రబాబు ప్రమాణాస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు నగరంలోని గేట్వే హోటల్లో దిగిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో కొద్దిసేపు వాకింగ్ చే శారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నడక శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. చేసే పని మంచిదైతే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. తాను రోజూ ఇంటిలో అందుబాటులో ఉన్న డ్రైవర్తో, కుక్తో ఎవరితోనైనా కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుంటానన్నారు. తనకిష్టమైన షటిల్ బ్యాడ్మింటన్ ఆడిన తరువాత హుషారుగా, ప్రశాంతంగా ఉంటుందన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ వాకింగ్, సైక్లింగ్ చేసే సంస్కృతి పెరగాలన్నారు. ఇందుకోసమే పట్టణాభివృద్ధిలో భాగంగా దేశంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న స్మార్ట్ సిటీలు, మెట్రో సిటీల్లో రోడ్లపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్ర నగరాల్లో వేసే రోడ్లపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఐజీఎంసీ స్టేడియంలో అనుకోని అతిథిగా కాషాయ రంగు టీ షర్ట్, లోయర్తో సాదాసీదాగా వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు స్టేడియంలో వార్మ్ప్ చేస్తున్న టెన్నిస్ ఆడే చిన్నారులు ‘గుడ్ మార్నింగ్ సార్’ అంటూ స్వాగతం పలికారు. ఇందుకు వెంకయ్యనాయడు తనైదైనశైలిలో ‘మనం భారతీయులం. గుడ్ మార్నింగ్ కాదు నమస్తే అనాలి. మమ్మీ, డాడీ కాదు అమ్మా, నాన్న అని పిలవాలి’ అని సూచించారు. టెన్నిస్ చిన్నారులతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న మహిళా క్రికెటర్లకు కుశల ప్రశ్నలువేశారు. స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా వెంకయ్యనాయుడుతో కరచలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందు ఒక సారి స్టేడియంలో వాకింగ్ చేసేం దుకు వచ్చానని, మళ్లీ ఇప్పుడు వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి స్టేడియంలో సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు విషయాన్ని ‘న్యూస్లైన్’ వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయని వివరించగా వెంకయ్యనాయుడు వెంటనే తన పీఏను పిలిచి ఢిల్లీ వెళ్లగానే సంబంధిత మంత్రితో మాట్లాడేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాకింగ్ అనంతరం స్టేడియం నుంచి బందరు రోడ్డుపై నడుచుకుంటూనే తాను బస చేసిన హోటల్ గేట్వేకు చేరుకున్నారు. -
మగనోరు తీరు వేరు!
ఉత్త(మ) పురుష నేను చెప్పే మాటలు మా శ్రీవారికి అర్థం కావో లేక నేను మంచి చెబితే అది ఆయనకు చెడుగా వినిపిస్తుందో నాకు తెలియదుగానీ... ఎందుకో ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరులే అన్న పాపులర్ పాటకు సంసారలోకం సరిగ్గా వ్యతిరేకంగా ఉందని నా అభిప్రాయం. అసలు విషయం మొదలుపెట్టేముందు కాస్త ఉపోద్ఘాతం మాట్లాడుకుందామా? ‘అల్పపీడనం’ అన్న మాటకు అర్థం ఏమిటో చూద్దాం. అంటే... పీడించడం తక్కువగా ఉండటం లేదా పీడన స్వల్పంగా ఉండటం. అలాంటప్పుడు అల్పపీడనం మంచిదా కాదా మీరే చెప్పండి. నాకూ, మా శ్రీవారికీ కాస్త ఎడమొహం పెడమొహం మొదలుకాగానే ఆయన వ్యాఖ్యలూ మొదలు... ‘అబ్బ... ఇంట్లో అల్పపీడనం ఏర్పడింది’ అంటూ. ఇదేదో సరదాగా జోక్గా అన్నాలెండి. కానీ నా మాటల్లోని పాజిటివిటీ కాస్తా మా వారికి ఎందుకు నెగెటివ్గా అనిపిస్తుందో నాకింకా తెలియదు. ఆయన పొద్దున్నే నిద్ర లేవగానే ‘ఈరోజు నుంచి వాకింగ్కు వెళ్లరాదా’ అన్నాను. అంతే... ‘నేను సుఖపడితే నువ్వు చూడలేవు. కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వవు’ అంటూ నస. ఆయన ప్రశాంతంగా పడుకుంటే నాకేమిటి బాధ. ఆఫీసుకు బయల్దేరుతూ బెల్టు పెట్టుకునే ముందు మళ్లీ నస. పొట్ట పెరిగిపోయి బెల్టు పట్టక అదికాస్తా దిగాలుగా నేలముఖం చూస్తోంది. ఎవరో గొప్పనాయకుడు మరణించాక జెండాను అవనతం చేసినట్టుగా ముఖం వేలాడేసుకున్నట్లుగా ఉంది దాని బకిల్. దాంతో తన వయసు కాస్త పెరిగినట్టూ, ఆరోగ్యం తగ్గినట్టూ అనిపిస్తోందని బోల్డంత సేపు బాధపడ్డారు. అందుకే ఆయన మంచి కోసమే ‘ఈరోజు నుంచైనా వాకింగ్ చేయరాదా’ అన్నాను. అంతే... ‘చేయరాదు... నన్ను సుఖంగా ఉండనివ్వకూడదనే నీ అభీష్టాన్ని నెరవేరనీయరాదు’ అంటూ కొట్టిపారేశారు. ఇలాంటిదే మరో సంఘటన. గోదావరి ఒడ్డునే ఉన్న ఊరి నివాసులమైనందువల్ల... అన్ని పనులకూ పడవ మీదే అవతలి ఒడ్డుకు వెళ్లాలి. ‘ఇవ్వాళ్ల నది మంచి పోటు మీద ఉందట. ఇప్పుడు ప్రయాణం పెట్టుకోకపోతేనేం?’ అన్నాను. అంతే... గోదావరి కాస్తా మావారి ఒంట్లో రక్తమై ప్రవహించింది. గంగమ్మ పోటు కాస్తా ఆయన నరాల్లోని రక్తానికి బదిలీ అయ్యింది. ‘వెళ్లితీరాల్సిందే’ అంటూ కటువుగా అనేసి బయటకెళ్లారు. ఆ మాటనైతే కటువు ధ్వనించడం కోసం ‘పొడిపొడిగా’ అన్నారా... కాసేపట్లోనే తడితడిగా మారిపోయి ఇంట్లోకి వచ్చారు. అదేమిటంటే... మూడు లేదన్నారు. మూడు లేకపోవడం కాదూ... మూడంకేసుకొని పడుకోవాలనీ కాదు. వాస్తవం ఏమిటంటే... మూడోనెంబరు ప్రమాదహెచ్చరిక జెండాను అక్కడ ఎగరేశారట. ఏమిటో ఈ మగాళ్లు... ఎగిరే జెండాలా గర్వంగా నిలపాల్సిన బెల్టును తల వేలాడేసేలా చేసుకుంటారు. తెరచాపలు గాలికి కొట్టుకుపోతూ తుపాన్లో జెండాలా విరగబడే సమయాల్లో పొగరుగా తలెగరేసి వెళ్లి తలవంపులు తెచ్చుకుంటారు. మగాళ్లెవరూ ఏమీ అనుకోకపోతే ఒక్క మాట చెప్పాలనుంది. ఆడది నోరేసుకు బతుకుతుంది అంటూ మా మీద అక్కసు వెళ్లగక్కుతుంటారు ఈ మగాళ్లు. అప్పుడెప్పుడో విజయావారు తమ సినిమాలో ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ అని పాట పెట్టినందుకు ఆ మాటనే మకుటాయమానం చేసుకుని నిత్యం వల్లిస్తుంటారు. దాన్నే మళ్లీ మళ్లీ పాడుతుంటారు. ఎందుకలా...? ఎందుకనీ...? ఎందుకంటే వాళ్లకు నోరుంది. వాళ్లకే నోరుంది. లోకం నోరున్నవాళ్లది. ఇంతకంటే విపులీకరించాల్సిన అవసరం వేరే ఏదీ లేదనుకుంటాను. అర్థమయ్యేవాళ్లకు అర్థమై తీరుతుంది లెండి. ఎందుకంటే... వాళ్లు మగాళ్లు. ఆడవాళ్లకంటే ఓ పట్టాన అర్థం కాదుగానీ... మగాళ్లకు అర్థంకానిదంటూ ఏదీ ఉండదు. -
చేపను వాకింగ్కు తీసుకెళ్దామా?
కుక్కలను వాకింగ్కు తీసుకెళ్లేవాళ్లున్నారు.. మరి చేపలను? అవును మరి.. ఇంట్లో ఉండీ ఉండీ దానికీ బోర్ కొడుతుంది కదా.. ఇలాంటి తిక్క ఆలోచనలు వచ్చేవాళ్ల కోసమే ఈ పరికరం.. పేరు అక్వాటిక్ ప్రామ్. బ్రిటన్లోని వెస్ట్యార్క్షైర్కు చెందిన మైక్ వారెన్ అనే వ్యక్తి దీన్ని రూపొందించాడు. తన పెంపుడు చేప మాల్కం కోసం దీన్ని తయారుచేశాడు. మాల్కం చనిపోయింది. పరికరం మిగిలిపోయింది. తనలాగే తమ పెంపుడు చేపలను వాకింగ్కు తీసుకెళ్లాలనుకునేవాళ్లు చాలా మంది ఉంటారని మైక్ చెబుతున్నాడు. అందుకే.. భారీ స్థాయిలో దీని ఉత్పత్తి చేపట్టాలని యోచిస్తున్నాడు. -
సరికొత్త అడుగులు
నయాసాల్ సే షురూ... ‘నవ’ నియమాలు పాటించాలి ఇక అంతా ఆనందమయజీవితమే కొత్త సంవత్సరంలో రెగ్యులర్గా వాకింగ్, ఎక్స్ర్సైజ్కు వెళతామని, మద్యం, సిగరేట్ లాంటి అలవాట్లుంటే మానేస్తామని శపథాలు చేయడం, తెల్లారేసరికి.. మరోసారి చూద్దాంలే అని వాయిదాల పర్వానికి ప్రాధాన్యమిచ్చే వారే ఎక్కువ. పాత అలవాట్లను కొనసాగించడం మామూలే అవుతున్నది. ఇక నుంచైనా కొత్త సంవత్సరంలోనైనా చెడు అలవాట్లకు చెల్లుచీటి ఇచ్చి, మంచి వాటిని వంట పట్టించుకునేందుకు మరో 24గంటల సమయం ఉంది. ఏదైనా ఓపని క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు చేస్తే తెలియకుండానే అది అలవాటుగా మారుతుందని వ్యక్తిత్వ వికాస నిపుణుల అభిప్రాయం. ఈ జనవరి నుంచి ఓ తొమ్మిది అలవాట్లను మనసులో అనుకొని తప్పకుండా పాటిస్తే అంతులేని ఆత్మసంతృప్తి మీ సొంతం. ఆ ‘నవ’ అలవాట్లు ఏమిటంటే.. సమయ పాలన.. మీరు ఎంతో నైపుణ్యం కలిగిన ఉద్యోగైనా కావచ్చు, చేయి తిరిగిన వ్యాపారైనా కావచ్చు. సమయ పాలన లేకపోతే రాణించడం కష్టం. మీ సమయమేకాదు. ఇతరుల సమయం కూడా ఎంతో ముఖ్యమని గుర్తించాలి. వృథాకబుర్లను కట్టిపెట్టాలి. పనులను వాయిదా వేసే విధానానికి నేటి నుంచే చెక్పెట్టాలి. అప్డేట్ కావాలి.. కంప్యూటర్ యుగంలో టైప్రైటర్తో పనిచేస్తానంటే కుదరదు. ఈ రోజున్న పోకడ రేపటికి మారడం సహజం. పోటీ ప్రపంచంలో కొత్త విషయాలు నేర్చుకునేందుకు ముందుండాలి. అప్పుడే సక్సెస్ వెన్నంటి ఉంటుంది. అప్డేట్కావాలి. సమయం లేదని సాకులు చెప్పకుండా ప్రయత్నిస్తూ పోతే విజేతలుగా ఉంటారు. సానుకూల ఆలోచనలు.. చిన్నపాటి సమస్యలకే కుంగిపోరాదు. తొందరపాటు నిర్ణయాల నుంచి బయటకు రావాలి. సానుకూల ఆలోచనాదృక్పథం అవసరం. ఇంటా, బయటా ఇబ్బందులెదురైతే సహకారాత్మక ధోరణితో పరిష్కరించుకునే అలవాటు చేసుకోవాలి. నిరంతరం ప్రయత్నం చేయడం వారానే ఇది సాధ్యం. ప్రతి ఒక్కరూ భావావేశానికి లోనుకాకుండా సహకారాత్మక వైఖరితో విమర్శలు తిప్పికొట్టడం విజేత లక్షణం. ఒత్తిడిని జయించండి ఇలా.. ఈ రోజుల్లో ఒత్తిడి లేని జీవితాలు లేనేలేవని చెప్పవచ్చు. ఒత్తిడికి చిత్తవ్వకుండా విజేతలుగా నిలవాలి. చెప్పినంత సులువుకాక పోవచ్చు. కానీ ప్రయత్నిస్తే కష్టమేమీకాదు. సంకల్పబలముండాలి. మంచి వారితో స్నేహం, నలుగురితో కలివిడిగా మెలగడం, మంచి పుస్తకాల పఠనం, యోగా చేయడం, వారాంతంలో రిలాక్స్ అయ్యేపనులు, సానుకూల దృక్పథం.. ఇలాంటివన్నీ ఒత్తిడి నుంచి దూరం చేయవచ్చు ఆరోగ్యమే అంతులేని ఆస్తి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన ఆస్తిలేదు. సమస్యలు చుట్టు ముట్టే వరకు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించి, వచ్చిన తరువాత ఆందోళన చెందడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. రోజుకు అరగంటైనా వ్యాయామం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం. కొత్త సంవత్సరంలో అలవాటుగా మార్చుకుందాం. దురలవాట్లకు స్వస్తి మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి రుచించదు. మద్యం, సిగరేట్, జూదం ఇలాంటి చెడు అలవాట్లు నిండా ముంచుతాయి. దురలవాట్లకు ఈ కొత్త సంవత్సరం నుంచైనా స్వస్తి పలకాలి అనుకుంటాం. కానీ వదులుకోలేక పోతున్నాం అని సమర్థించుకోకండి అలా అంటే కారణం మీమనస్సును నిగ్రహంలో ఉంచుకోలేకపోవడమేనని గుర్తించాలి. పొదుపు మంత్రం పొదుపా...ఆ...అప్పుడే ఏం తొందర. తర్వాత చేద్దాం లే అని భావించే వారు ఎక్కువ. జీతం వచ్చిందా, ఖర్చు చేశామా, అనే ధోరణి సరికాదు. అవసరం ఎప్పుడూ చెప్పిరాదు. అలాంటపుడు ఆదుకునేది పొదుపే. ఎంత చిన్న వయస్సు నుంచి పొదుపు ఆరంభిస్తే అంతమంచిది. వంద రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలైనా పొదుపు చేయాలనే ప్రణాళిక ఉండాలి. ఎవరికి వారే ఉంటే.. ప్రపంచీకరణ వల్ల పెరిగిన జీవన వేగంలో ఎవరికి వారే అనే ధోరణి పెరిగింది. అపార్టుమెంట్ల సంస్కృతి వచ్చాక పక్కింటి వారు కూడా తెలియని పరిస్థితి. అక్కడ ఏం జరిగినా మనకేం సంబంధం అనే విధంగా లైఫ్స్టైల్ మారింది. వాస్తవానికి బాధను పంచుకుంటే సగం ఊరటలభిస్తుంది. ఆపదలోని వారిని ఆదుకోవడం, బాధలో ఉన్న వారికి బాసటగా నిలవడం, చేతనైనంత సహాయం చేయడం ద్వారా ఎంతో తృప్తికలుగుతుంది. కుటుంబంతో సరదాగా.. ప్రతి వ్యక్తి విజయంలో కుటుంబ పాత్ర ఎంతో ఉంటుంది. విధుల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం ఇవ్వాలి. రోజుకోసారై నా కుటుంబ సభ్యుల తో కలిసి తినాలి. వారానికోసారైనా అలా బయటకు వెళ్లిరావాలి. బయటికెళ్దామని మీ శ్రీమతి అంటే సమయం లేదనడం. పార్కు కో, సినిమాకో పోదామా డాడీ అని పిల్లలంటే తర్వాత వెళ్దాంలే అని దాటేయకండి. వాటిని నెరవేర్చడం ద్వారా మీపై నమ్మకాన్ని పెంచుతాయి. -
సిటీ గజగజ
చలి నగరవాసులను భయపెడుతోంది. వృద్ధులు వాకింగ్కి వెళ్లాలంటే జంకుతున్నారు. భానుడి కిరణాలు సైతం శీతల గాలుల గిలిగింతలను అడ్డుకోలేకపోతున్నాయి. స్కూలుకి వెళ్లే విద్యార్థులు.. కొలువుకి వెళ్లే ఉద్యోగులు.. పనులకు వెళ్లే కూలీలు తప్పదంటూ ఇంటి నుంచి బయటకు అడుగులు వేస్తున్నారు. సోమవారం మంచుకురిసే వేళలో నగరంలో కనిపించిన దృశ్యాలు.మంచుదుప్పటి కప్పుకున్న బీహెచ్ఈఎల్ ప్రాంతంకండువాలు కప్పుకుని పనికెళ్తూ...కొలిమి పక్కన వెచ్చగా కాసేపు నిద్రపోని...పాఠాలు చదివేముందు కాసేపు పరుగుఇంటి ముందు కల్లాపు చల్లుతూ..ఎండ పడే ప్రాంతంలో నిలబడి ఉన్న అయ్యప్ప స్వాములుభానుడి కిరణాల తోడుగా బడికిస్వేదం చిందిస్తే చలి ఇంకెక్కడ?నగరంలో చలి తీవ్రతను తెలుపుతున్న సూచిక బోర్డు ఫొటోలు : మోర్లా అనిల్కుమార్ -
వివేకం: రేపు అనేది లేదు
శరీర ఆరోగ్యం కోసం కొందరు యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నారు. కొందరు పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారు. కొందరు వ్యాయామం గురించి తెలుసుకుంటున్నారు. కానీ నేర్చుకున్నవి వారు ఆచరిస్తున్నారా? ఆ విషయం వారిని అడిగితే, ‘ఈ రోజు మరీ అలసటగా ఉంది. రేపటి నుండి తప్పకుండా చేస్తాను’ అంటూ సమాధానం వస్తుంది. నిజంగా రేపు మీరు మార్నింగ్ వాక్కి వెళ్తారా? శరీర వ్యాయామం చేస్తారా? ఛాన్స్ లేదు. మీకు ఇష్టమైనది చేయకుండా, నీరసంగా కూర్చుంటే, ‘అదేమిటి? బద్దకంగా కూర్చున్నావ్? లే!’ అంటూ మీ మనసే మిమ్మల్ని నిలదీస్తుంది. ‘బాధ్యతా రహితంగా ఉన్నాను!’ అనడానికి మీ అహంకారం ఒప్పుకోదు. ‘నేను సోమరిపోతును కాదు. రేపు మొదలెడతా’నని అహంకారం మనసుకు నచ్చజెప్పి వంచన చేస్తుంది.కర్నాటక రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో ఒక మూఢవిశ్వాసం ఉంది.చీకటిపడ్డాక అక్కడ దెయ్యాలు, పిశాచాలు ఇళ్లలోకి చొరబడటానికి ప్రయత్నిస్తాయట! ఆ భూత పిశాచాలను పారదోలాలని ప్రయత్నిస్తే, వాటికి కోపం వస్తుందట! ఘోరమైన ఫలితాలను చూడాల్సి వస్తుందని అక్కడి ప్రజలకు భయం.అందుకే ఊరి వారంతా ఒక పన్నాగం పన్నారు. దెయ్యాలకు, పిశాచాలకు రక్తపు రంగు ఇష్టం కాబట్టి, ఎర్ర రంగుతో ప్రతి ఇంటి వీధి తలుపు మీద ‘రేపు రా’ అని రాసి పెడతారు.దెయ్యాలు, పిశాచాలు వచ్చి, గుమ్మానికున్న ఆ ప్రకటన చూసి వెళ్లిపోతాయని వారి నమ్మకం.ఈ రోజు అన్నా, ఇప్పుడన్నా, ఫరవాలేదు కాని, ‘రేపు’ అనేది ఎప్పటికీ రాని రోజు కూడా.ఆరోగ్యమూ, జయమూ, ఆనందమే కదా మీకు కావలసినవి. ‘రేపు రా’ అంటే అవి పక్కకు పోతాయి. జాగ్రత్త! ‘రేపటి నుంచి’ అనేది మనసుకు మత్తెక్కించే తంత్రం. మీ జీవితంలో, అనేకసార్లు ఈ మాయాతంత్రానికి మీరే స్థానం కల్పించారు.చెయ్యలేనివారికి, రేపు అనేది ఎప్పుడూ మంచిరోజే. రేపు అనే సరికి వారి బాధ్యత ముగిసినట్లే.ప్రారంభించిన పనులను ఏదోలా వాయిదా వేయడం, పార్లమెంట్కు కూడా అలవాటు కావడమే, బాధాకరం!గుర్తుంచుకోండి. రేపు అనేది రాదు. ఈ రోజే మనకుంది. మరి ఇంతకూ ఈ పరిస్థితినెలా మార్చాలి? ఇంటి పనైనా, ఆఫీస్ పనైనా, మన ఆరోగ్యానికి కావలసిన వ్యాయామమైనా, ముందు దానికి అనువైన సందర్భాన్ని సృష్టించుకోవాలి.రాత్రి పది దాటిన తర్వాత, కడుపు నిండా దోసెలు తిని, పొద్దున్న ఆరు ఏడు గంటలలోపు లేచి యోగా చేయాలంటే, వాకింగ్కి వెళ్లాలంటే, శరీరం ఎలా సహకరిస్తుంది? తెల్లవారుఝామున నాలుగ్గంటలకే మెలకువ వచ్చేలా, కాస్త తక్కువ తిని చూడండి. మెలకువ వస్తుంది. యోగా చేయగలరు. ‘వాకింగ్ వెళ్దాం రా’ అంటూ శరీరమే పిలుస్తుంది. కొన్ని రోజులిలా చేసి చూస్తే ఫలితం కనబడుతుంది. తర్వాత ఎవరూ చెప్పనక్కరలేదు.మనసులో దృఢమైన సంకల్పం, బయట అనుకూలమైన పరిస్థితి, ఈ రెంటినీ కలిపితే, అనుకున్నవి వాయిదా వేయకుండా చేసుకునే మనోబలం దానికదే వస్తుంది. సమస్య - పరిష్కారం ఎంత ప్రయత్నించినా సిగరెట్ తాగే అలవాటును వదలలేకపోతున్నాను. దీన్ని వదిలించుకోవడం ఎలా? - పి.వెంకటేశ్వర్లు, నల్గొండ సద్గురు: ఏదైనా విషయాన్ని బలవంతంగా మరచిపోవాలని దృఢంగా నిశ్చయించుకుంటే అదే విషయం మనసంతా ఆక్రమిస్తుంది. ఐదు నిమిషాల పాటు కోతుల గురించి ఆలోచించకూడదని అనుకుంటే, లక్షల కోతులు మీ ఆలోచనలను ఆక్రమిస్తాయి. దురలవాట్లను వదలాలని దృఢంగా అనుకునేవారు కొత్తగా వేరే అలవాట్లకు బానిసలైపోతారు. పొగ తాగడం, మద్యం సేవించడం మరచిపోవాలని ప్రయత్నించడం కాదు. పొగ తాగినా, మద్యం సేవించినా మీ శరీరంలో ఎన్నెన్ని మార్పులొస్తాయో తీవ్రంగా తలచుకోండి. దానితో దురలవాట్లు వాటంతట అవే మిమ్మల్ని వదిలిపోవడం ఖాయం. -
‘వాకింగ్’కు సూచనలివ్వండి...
నేను చాలా కాలంగా వాకింగ్ మొదలుపెట్టాలని అనుకుంటూ వాయిదా వేస్తూ పోతున్నాను. ఇప్పుడు తప్పక వాకింగ్ ప్రారంభించాలనుకుంటున్నాను. మంచి సూచనలు చెప్పండి. - సూర్యప్రకాశ్, అనంతపురం మీలాగే చాలా మంది నడక మొదలుపెట్టాలనుకుంటూనే అలా వాయిదా వేసుకుంటూ పోతారు. వాకింగ్ తేలికపాటి వ్యాయామమే కాబట్టి చలికాలం వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదు. నడక మొదలు పెట్టాలనుకున్న తర్వాత వాయిదా వేయకూడదు. నడకను ఆస్వాదిస్తూ వాకింగ్ చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కొత్తగా వాకింగ్ మొదలు పెట్టాలనుకున్నవారికి కొన్ని సూచనలు... వాకింగ్ కోసం మీ ఆర్థిక స్థోమతను బట్టి ట్రెడ్మిల్ సమకూర్చుకోవచ్చు. ట్రెడ్మిల్ మీద నడవటం వల్ల మనం ఎంత వేగంగా నడుస్తున్నామో తెలుసుకోవచ్చు. పైగా దీని వల్ల వాకింగ్ కార్యక్రమం ఇంట్లోనే జరుగుతుంది. అయితే ఉదయం వేళల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆరుబయట నడిస్తే ఉండే హాయి వేరు. వాకింగ్ మొదలు పెట్టినప్పుడు ముందుగా రెండు రోజుల పాటు 10-20 నిముషాలపాటు మాత్రమే నడవండి. మొదలుపెట్టినరోజే అరగంట, గంట అని లక్ష్యాలు పెట్టుకోవద్దు. మీ నడక వ్యవధిని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. మొదట పది, ఇరవై నిమిషాల నుంచి మొదలై దాన్ని క్రమంగా 60 నిముషాలకు పెంచండి. అయితే మీరు అరవై నిమిషాల వ్యవధికి చేరడానికి రోజుకు ఐదు నిమిషాల వ్యవధి చొప్పున పెంచుకుంటూ పోవడం మంచిది. ముందుగా నడిచే దూరాన్ని పెంచుకోవాలి. తరువాతే నడకలో వేగాన్ని పెంచాలి. అయితే దూరాలకు నడవడం, నడకలో వేగాన్ని పెంచడం అన్నది ఒకేసారి వద్దు. దీన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. మొదట మూడు వారాల పాటు మామూలు వాకింగ్ చేశాక అప్పుడు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్) చేయాలి. వాకింగ్లో మ్యారథాన్, వాకథాన్ చేసేవాళ్లు కనీసం మొదటిసారైనా ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాలి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్