aditi rao Hydari
-
కూర్చునే నిహారిక డ్యాన్స్.. కొత్త కారుతో తెలుగు యాంకర్
కాస్ట్ లీ బెంజ్ కారు కొన్న తెలుగు యాంకర్ సోనియాబేబీ బంప్ ఫొటోలతో యూట్యూబర్ మహాతల్లిచీరల మెరుపు తీగకంటే సన్నగా జ్యోతిరాయ్చెన్నై మ్యాచ్ చూసేందుకు వచ్చిన యషికా-పార్వతిడార్క్ చాక్లెట్ లా మెరిసిపోతున్న అదితీ రావ్ హైదరీగాయం తాలుకు జ్ఞాపకాల్ని పంచుకున్న అన్షుబాలిలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న నటి నవ్య స్వామి View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by SONIYA SINGH (@soniya_singh31) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
పూజా హెగ్డే భక్తి.. జిగర్తాండతో దివ్య భారతి!
సమ్మర్ హీట్.. జిగర్తాండతో హాట్ హీరోయిన్ దివ్య భారతిపెయింటింగ్ వేస్తూ చిల్ అవుతున్న 'మన్మథుడు' అన్షుపాలరాతి శిల్పంలా తళతళా మెరిసిపోతున్న తమన్నాఇద్దరు పిల్లలకు తల్లయినా అందంలో ప్రణీత తగ్గేదే లేరిషికేష్ లో గంగా హారతి కార్యక్రమంలో పూజా హెగ్డేఫన్నీ పోజులిచ్చిన యాంకర్ రష్మీ గౌతమ్వయసుతో పాటే అందాన్ని పెంచేస్తున్న శ్రియ శరణ్ View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Akshay Amberkar (@akshay_26) -
చిరుకు జోడీగా హైదరాబాద్ బ్యూటీ ?
-
డిజిటల్ యాడ్లో మెరిసిన సిద్ధార్థ్, అదితీ
ప్రపంచపు నంబర్ 1 బ్యూటీ బ్రాండ్ లోరియల్ ప్యారిస్ (L'Oréal Paris) తమ కొత్త డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ జంట అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ నటించారు. తొలి క్యాంపెయిన్ విజయవంతమైన నేపథ్యంలో అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ నటించిన కొత్త డిజిటల్ క్యాంపెయిన్ లోరియల్ ప్యారిస్ ఆవిష్కరించింది.ఇందులో 2003 క్లాసిక్ సినిమా ‘బాయ్స్’ను గుర్తు చేసేలా ఫన్రీల్తో సిద్ధార్థ్ ఇన్స్టాగ్రాంలో కనిపిస్తారు. దుమ్మూ, చెమట లాంటి కారణంగా తలపై నూనె పేరుకుపోవడం, జిడ్డుగా మారడంలాంటి జుట్టు కష్టాల గురించి సిద్ధార్థ్ సరదాగా ముచ్చటిస్తారు. సరిగ్గా ఈ టైంలో సిద్ధార్థ్ స్వీట్హార్ట్ అదితి ఎంట్రీ ఇచ్చి లోరియల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూను అందించి, అందులోని కీలకాంశాలైన శాలిసిలిక్ యాసిడ్, హయాలురోనిక్ యాసిడ్ ప్రయోజనాల గురించి ముచ్చటిస్తుంది. సరదాగా సాగే మాటల మధ్యలో, తాను ఈ ప్రొడక్ట్కి ఫ్యాన్నే అయినప్పటికీ, అదితినే అధికారిక బ్రాండ్ అంబాసిడర్ అని సిద్ధార్థ్ గుర్తు చేస్తాడు ఈ డిజిటల్ ఫిలింకి భారీ స్పందన లభించడం విశేషం. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వీక్షణలను సాధించింది. ఆన్-స్క్రీన్పై సిద్ధార్థ్, అదితి జంట కెమిస్ట్రీకి అభిమానుల ప్రశంసలు దక్కడంతో ఈ క్యాంపెయిన్, సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth)ఈ సందర్భంగా లోరియల్ ప్యారిస్ కుటుంబానికి తోడ్పాటు అందిస్తున్న, సిద్ధార్థ్ అదితి రావు హైదరీకి లోరియల్ ప్యారిస్ ఇండియా జనరల్ మేనేజర్ డేరియో జిజ్జీ (Dario Zizzi) కూడా ధన్యవాదాలు తెలిపారు. సౌందర్యాన్ని మెరుగుపర్చే వినూత్న ఉత్పత్తులను ఆవిష్క రించేందుకు లోరియల్ ప్యారిస్ కట్టుబడి ఉందన్నారు. లోరియాల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూ తల మీద నూనె పేరుకుపోవడాన్ని నివారించి, జుట్టు తేలికగా, పరిశుభ్రంగా, తాజాగా ఉంచుతుందని వివరించారు. -
OTT: మరో వెబ్ సిరీస్కు ఓకే చెప్పిన అదితిరావు
బాలీవుడ్లో ‘జబ్ వియ్ మెట్, రాక్స్టార్, హైవే, లవ్ ఆజ్ కల్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఇంతియాజ్ అలీ. తాజాగా ఈ దర్శకుడు ‘ఓ సాథీ రే’ అనే వెబ్ సిరీస్తో అసోసియేట్ అయ్యారు. కానీ దర్శకుడిగా కాదు. రైటర్, షో రన్నర్గా చేస్తున్నారు. ఈ సిరీస్కు అరిఫ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, హ్యూమన్ ఎమోషన్స్ ప్రధానాంశాలుగా ఉన్న ఈ సిరీస్లో అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), అర్జున్ రాంపాల్, అవినాష్ తివారీ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ‘‘ఈ రోజుల్లో అప్పటి వింటేజ్ లవ్ ఫీల్ని ఈ సిరీస్తో వీక్షకులు అనుభూతి చెందుతారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హీరో సిద్దార్థ్ను పెళ్లి చేసుకున్న తర్వాత అదితిరావు ఒప్పుకున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే! ప్రస్తుతం అదితి.. ఓ సాథిరే సిరీస్తో పాటు హీరామండి 2 వెబ్ సిరీస్, లయనెన్స్ అనే హాలీవుడ్ సినిమా చేస్తోంది. అదితిరావు- సిద్దార్థ్ 2024లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: దేవుడు చూస్తున్నాడు.. అందుకే ఆ హీరోయిన్ పత్తా లేకుండా పోయింది -
అదితిరావు- సిద్ధార్థ్ పెళ్లి.. ప్రపోజల్ ఫోటో వైరల్
హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరిద్దరికి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.(ఇది చదవండి: అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?)తాజాగా అదితిరావు హైదరీ న్యూ ఇయర్ సందర్భంగా పోస్ట్ చేసింది. గతేడాది జరిగిన మధుర జ్ఞాపకాలను షేర్ చేసింది. హీరామండిలో నటన, సిద్ధార్థ్ ప్రపోజల్ ఫోటోతో పాటు అతనితో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. ఓ వీడియో రూపంలో తన ఇన్స్టాలో పంచుకుంది. ఇందులో తన ఎంగేజ్మెంట్, పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి. థ్యాంక్యూ యూ 2024.. వెల్కమ్-2025 అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
'గర్ల్స్ విల్ బి గర్ల్స్' ప్రీమీయర్ షోలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
నువ్వునువ్వుగా,నేనునేనుగా..నా చేయి పట్టుకో ప్రియతమా: అదు-సిద్ధూ ఫోటోషూట్ అదిరిందిగా (ఫొటోలు)
-
రెండోసారి పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ - అదితీ (ఫొటోలు)
-
మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్-అదితీ
హీరో సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అవును మీరు సరిగానే విన్నారు. హీరోయిన్ అదితీతో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఇతడు.. సెప్టెంబరులో ఈమెని పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణలోని వనపర్తిలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయం దీనికి వేదికైంది. ఇప్పుడు మరోసారి వివాహమాడాడు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)సెప్టెంబరులో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరగ్గా.. ఇప్పుడు రాజస్థాన్లోని అలీలా ఫోర్ట్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అదితీ, సిద్ధార్థ్ తమ తమ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో తోటీ నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.'మహాసముద్రం' సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే రంగనాథ్ స్వామి ఆలయండో నిశ్చితార్థం, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ కోరిక ప్రకారం రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్) -
బ్లూ కోట్లో మెరిసిన బొమ్మరిల్లు బ్యూటీ.. గ్రీన్ డ్రెస్లో గ్లామర్ బ్యూటీ ఆదితి!
వైట్ డ్రెస్లో మరింత గ్లామర్గా రాశీ ఖన్నా..క్రిస్మస్ మూడ్లో బాలీవుడ్ భామ అమీ జాక్సన్..బ్లూ కోట్లో మెరిసిన బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా..బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ గ్లామర్ ట్రీట్..గ్రీన్ డ్రెస్లో గ్లామర్ బ్యూటీ ఆదితిరావు హైదరీ.. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
నా జీవితంలోకి ఒక దేవత వచ్చింది: పెళ్లిపై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్
కోలీవుడ్ హీరీ సిద్ధార్థ్ మరోమూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది చిన్నా మూవీతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ మిస్ యూ అంటూ వచ్చేస్తున్నారు. ఈ చిత్రంలో నా సామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఈవెంట్లో హాజరైన సిద్ధార్థ్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆదితి రావు హైదరీతో పెళ్లి తర్వాత వస్తోన్న మీ మొదటి చిత్రం.. మీ లైఫ్ ఎలా ఉందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నా లైఫ్ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇలాంటి వరం దొరికినందుకు నేను చాలా గ్రేట్ఫుల్. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. అంతేకాదు నా లైఫ్లోకి నా దేవత వచ్చింది. 2024లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్ సర్ప్రైజ్. ఏంటి మంచి జరిగిందా? అనేది. సెకండ్ రిలీఫ్. హమ్మయ్య ఆ దేవుడి దయతో అంతా మంచి జరిగిందని.. అలాంటి టైమ్లో మనం బతుకుతున్నాం కాబట్టి.. నాకైతే నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు' అంటూ తన పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు.కాగా.. కోలీవుడ్ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
పురాతన ఆలయంలో పెళ్లి.. ముందుగా ప్లాన్ చేయలేదు: ఆదితిరావు హైదరీ
కోలీవుడ్ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే తాజాగా సాహిత్య ఆజ్తక్ -2024 సదస్సుకు హాజరైన ఆదితిరావు హైదరీ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాము కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే మా పెళ్లి కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్ చేయలేదని పేర్కొంది. 400 ఏళ్లనాటి ఆలయం మా తాత, నానమ్మకు సెంటిమెంట్.. అక్కడే పెళ్లి చేసుకుంటే వారి ఆశీర్వాదాలు ఉంటాయని అన్నారు. మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం.. ఆమె హైదరాబాద్లో పాఠశాలను ప్రారంభించిందని ఆదితిరావు తెలిపింది.ఆదితి రావు హైదరీ మాట్లాడుతూ.. 'మా పెళ్లి పెద్దగా ప్లాన్ చేయలేదు. పెళ్లి జరిగిన ఆలయం మా పూర్వీకులు కట్టారు. దాదాపు 400 ఏళ్లుగా మా కుటుంబంలో భాగంగా ఉంది. అంతేకాదు ఆ ఆలయం నా కుటుంబంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అలాగే నానా, నానమ్మకు చాలా ఇష్టమైన గుడి. అందుకే అక్కడ వివాహం చేసుకోవడం వారికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. వారి ఆశీస్సులు కూడా మాకు అందాయి' అని తెలిపింది.కాగా.. ఆదితి రావు హైదరీ ఈ ఏడాది హీరామండి వెబ్ సిరీస్లో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. -
తాత ప్రధానమంత్రి.. హీరోయిన్గా పాన్ ఇండియా క్రేజ్.. అదితీ గురించి తెలుసా? (ఫొటోలు)
-
మంచు లక్ష్మి కొత్త పాఠాలు.. ఆధ్యాత్మిక బాటలో అషూ
ఫియర్ ప్రమోషన్స్లో హీరోయిన్ వేదిక బఘీర ప్రమోషన్స్లో రుక్మిణి వసంత్మానసిక ప్రశాంతత ముఖ్యమంటున్న మంచు లక్ష్మిహెబ్బా పటేల్ సెల్ఫీ పోజులు8 జ్యోతిర్లింగాలు సందర్శించిన అషూ రెడ్డిథాయ్లాండ్లో స్నేహ ఉల్లాల్లెవల్ క్రాస్ మూవీ బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) ఫోటోలు షేర్ చేసిన అమలాపాల్ View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Sneha Ullal (@snehaullal) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
హనీ సంస్థ ప్రచారకర్తగా అదితిరావు హైదరీ
న్యూఢిల్లీ: హమ్దర్ద్ హనీ తన ప్రచాకర్తగా సినీ నటి అదితిరావు హైదరీని నియమించుకుంది. ఈ సందర్భంగా ‘ద నో కాంప్రమైజ్ హనీ’ పేరుతో ఒక టీవీ ప్రచార వీడియో విడుదల చేసింది. నాణ్యత, స్వచ్ఛతల మేలికలయిక హమ్దర్ద్ బ్రాండ్కు ప్రచారకర్తగా వ్యవహరించనుండటం సంతోషం కలిగిస్తోందని అదితిరావు అన్నారు. ఆరోగ్యకర జీవన శైలి కోరుకునే ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఈ తేనె భాగం కావాలన్నారు. అదితిరావుతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై హమ్దర్ద్ సీఈవో హమీద్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. -
ఎల్లె ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2024..సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
హీరోయిన్ అదితీ జడ చూశారా? మీరు ఇలా ట్రై చేస్తే! (ఫొటోలు)
-
అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?
హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ ఇటీవలే వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాదిలోనే వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వనపర్తి ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవీ కాస్తా వైరల్ కావడంతో అభిమానులు, సినీతారలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.అయితే వీరి పెళ్లి తర్వాత నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. ఇంతకీ వీరి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆదితిరావు హైదరీ రాజవంశానికి చెందిన కుటుంబం కావడంతో అభిమానులు ఆస్తులపై ఆరా తీస్తున్నారు.అయితే ప్రస్తుతం గణాంకాల ప్రకారం అదితి రావు హైదరీ ఆస్తులు రూ.60కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఉంటుందని ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది. జాగరణ్ ఇంగ్లీష్ నివేదిక ప్రకారం నిర్మాత, హీరోగా రాణిస్తున్నసిద్ధార్థ్ ఆస్తులు కూడా దాదాపు రూ.70 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. ఈ లెక్కన ఇద్దరికీ కలిపి సుమారు రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్లకు మధ్య ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముంబయిలోని వర్సోవాలో అదితికి ఓ అపార్ట్ మెంటు కూడా ఉంది. మార్చి 2024న సిద్ధార్థ్- అదితి నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు. ఆ ఆలయంలోనే పెళ్లి ఎందుకంటే?ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ వనపర్తిలోని ఆలయంలోనే పెళ్లి చేసుకోవడంపై కూడా చర్చ మొదలైంది. దాదాపు 400ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడి అదితి కుటుంబానికి ముఖ్యమైదని సమాచారం. ఆ సెంటిమెంట్తోనే వీరి పెళ్లి అక్కడే చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదితి తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన వారసురాలు కావడం విశేషం. అదితిరావు చివరిసారిగా హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్లో కనిపించింది. సిద్ధార్థ్ ఇటీవల విడుదలైన ఇండియన్-2లో కనిపించారు. -
సిద్ధార్థ్,అదితి రావు హైదరీల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు..?
నటుడు సిద్ధార్థ్ తన ప్రియురాలు, నటి అదితి రావు హైదరీని వివాహం చేసుకున్నారు. వారు గతంలో చెప్పినట్లుగానే తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిపాటు బంధువుల సమక్షంలో వారి పెళ్లి వేడుక జరిగింది. వనపర్తి రంగనాథస్వామి ఆలయంతో అదితి రావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే అక్కడే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అక్కడే చేసుకున్నారు. దీని వెనకున్న అసలు స్టోరీ ఇదే.అదితి రావు మన తెలుగమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆమె తండ్రి పేరు ఎహసాన్ హైదరీ. తల్లి విద్యారావు. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్కు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీకి మనవడే అదితి తండ్రి అని తెలిసిందే. తల్లి విద్యా రావు ఏమో వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. అలా వనపర్తి సంస్థానానికి వారసురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్కు కూడా అదితి హైదరి మనవరాలు అవుతుంది. సినీ నిర్మాత, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు, అదితి రావు కజిన్ అవుతుందనే విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్)ఆమె ఆరవ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్ లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ పెళ్లితో అదితి రావు తన పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించింది. తమ కుటుంబంలో ఎలాంటి శుభకార్యక్రమైనా సరే శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో జరగాల్సిందే. అదీ వారికి వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్. సుమారు 400 ఏళ్ల చరిత్ర అక్కడి ఆలయానికి ఉంది. ఈ వేడుకతో ఆమె తన రూట్స్ను గౌరవిస్తోందని చెప్పవచ్చు. అదితి రావు హైదరీ 2002లో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. వనపర్తి రంగనాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా నమ్మకంతో వస్తుంటారు. అక్కడ వివాహం జరిగితే వారి బంధం బలంగా ఉంటుందనేది అందరి నమ్మకం. దీంతో అక్కడ ప్రతి ఏడాది సుమారు 500కు పైగా వివాహాలు జరుగుతాయి. రాయలకాలంలో ఈ గుడిని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. -
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అదితి-సిద్ధార్థ్ (ఫొటోలు)
-
సిద్ధార్థ్-అదితీల 'బొమ్మరిల్లు'
హీరో సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నాడు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న హీరోయిన్ అదితీ రావు హైదరీతో ఏడడుగులు వేశాడు. వనపర్తి జిల్లాలోని దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వివాహం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని అదితీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పట్టు వస్త్రాల్లో కొత్త జంట చూడముచ్చటగా ఎంత చక్కగా ఉన్నారో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)ఈ ఏడాది మార్చిలో వనపర్తి జిల్లాలోని రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం జరిగింది. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే ఈ గుడిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పెళ్లి కూడా ఇక్కడే చేసుకున్నారు. అయితే ఈ శుభకార్యం ఆదివారం జరిగిందా? సోమవారం ఉదయం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. 'మహాసముద్రం' సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. తెలుగులో 'బాయ్స్', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' లాంటి సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదితీ కూడా 'సమ్మోహనం' లాంటి సినిమాతో ఆకట్టుకుంది.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)(ఇదీ చదవండి: తమన్కి ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్న అనుష్క) -
వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?
హీరోయిన్ అదితీ రావు హైదరీ తన పెళ్లి గురించి ఓపెన్ అయిపోయింది. హీరో సిద్ధార్థ్తో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈమె.. ఈ ఏడాది ప్రారంభంలో తెలంగాణలోని వనపర్తిలోని ఆలయంలో నిశ్చితార్థం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్గా ఈ వేడుక జరిగిపోయింది. తాజాగా అదితీ పెళ్లి గురించి మాట్లాడింది. వనపర్తిలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఇంకా ఏమేం మాట్లాడిందంటే?అక్కడే ప్రపోజ్ చేశాడు'మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో నేను అన్ని విషయాలు షేర్ చేసుకునే దాన్ని. హైదరాబాద్లో ఆమెకు ఓ స్కూల్ ఉంది. అది నాకు చాలా స్పెషల్. నేను చిన్నప్పుడు అక్కడే ఉండేదాన్ని. కొన్నాళ్ల క్రితం ఆమె కన్నుమూశారు. ఇది సిద్ధార్థ్కి కూడా తెలుసు. అక్కడికి తీసుకెళ్లమని ఓ రోజు అడిగాడు. మార్చిలో మేం అక్కడికి వెళ్లాం. మోకాళ్లపై కూర్చుని, అతడు నాకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేశానని చెప్పాడు.'(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)పెళ్లి అక్కడే!'వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయం మా కుటుంబానికి చాలా ప్రత్యేకం. సిద్ధార్థ్తో నిశ్చితార్థం అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే. తేదీ ఖరారయ్యాక మేమేం ఎప్పుడనేది ప్రకటిస్తాం' అని అదితీ రావు హైదరీ చెప్పుకొచ్చింది.ఇద్దరు రెండోదే!సిద్ధార్థ్-అతిదీ బహుశా ఈ ఏడాదే పెళ్లి చేసుకునే అవకాశముంది. సరే దీని గురించి పక్కనబెడితే ఈ పెళ్లి ఇద్దరికీ రెండోదే. ఎందుకంటే సిద్ధార్థ్ గతంలో మేఘనా నారాయణ్ని 2003లో వివాహం చేసుకున్నాడు. కానీ నాలుగేళ్లకు ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. అదితీ కూడా సత్యదీప్ మిశ్రా అనే నటుడితో 2009-13 వరకు కాపురం చేసింది. కానీ బంధంలో కలతలు వచ్చి విడిపోయారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ) -
డిజైనర్ గాగ్రాలో అందమైన అదితి గ్రాండ్ లుక్ (ఫొటోలు)
-
Aditi Rao Hydari: హీరామండి బ్యూటీ ఆదితిరావు హైదరీ స్టన్నింగ్ లుక్స్.. (ఫోటోలు)
-
మెరిసిపోతున్న నభా నటేశ్.. వింత పోజులో ప్రగ్యా జైస్వాల్!
అమెరికన్ బీచ్లో బికినీలో మంచు లక్ష్మీడ్యాన్స్ ప్రాక్టీసులో హీరోయిన్ రాశీఖన్నాగ్లామర్ డంప్ అంతా పోస్ట్ చేసిన ఐశ్వర్య మేనన్'డార్లింగ్' పేరున్న డ్రస్తో నభా నటేశ్క్యాట్ వాక్తో కాక పుట్టించిన అదితీ రావ్ హైదరీకాటన్ చొక్కాలో వయ్యారాలు పోతున్న ఈషా రెబ్బాఫన్నీ ఫేస్తో శ్రద్ధా దాస్ పోస్ట్.. చూస్తే నవ్వులే View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Jayanti Reddy (@jayantireddylabel) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) -
Aditi Rao Hydari: పింక్ డ్రస్లో మెరిసిపోతున్న అదితీ రావ్ హైదరీ (ఫొటోలు)
-
కాబోయే భర్తకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. పిక్స్ షేర్ చేసిన హీరోయిన్!
హీరోయిన్ అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ ఈ ఏడాదిలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ ఆలయంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు. అయితే తాజాగా తనకు కాబోయే భర్తకు అవార్డులు రావడం పట్ల ఆదితిరావు సంతోషం వ్యక్తం చేసింది. ఈ గెలుపు మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.తాజాగా సిద్ధార్థ్ తన ఫిల్మ్ఫేర్ అవార్డులు పక్కన పెట్టుకుని నిద్రిస్తున్న ఫోటోను అదితి రావు హైదరి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఇటీవల జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో సిద్ధార్థ్ నటించిన చిత్తా(చిన్నా) సినిమా ఏకంగా ఏడు అవార్డులు సాధించింది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్తా మూవీకి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (క్రిటిక్స్), లీడ్రోల్లో ఉత్తమ నటి (మహిళ), ఉత్తమ సహాయ పాత్ర (ఫీమేల్), ఉత్తమ సంగీత ఆల్బమ్, ఉత్తమ నేపథ్య గాయని (ఫీమేల్) విభాగాల్లో అవార్డులు దక్కాయి. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ప్రేమ వెలుగుల్లో, అంతులేని ఆనందంలో అదితిరావు (ఫొటోలు)
-
Aditi Rao Hydari: అమాయకంగా కనిపిస్తూనే మనసులు కొల్లగొట్టేస్తుందిగా! (ఫోటోలు)
-
షరారా సూట్లో అదితిరావు హైదరి అదిరే లుక్స్ (ఫొటోలు)
-
సిద్ధార్థ్ ప్రేయసికి చేదు అనుభవం.. ఏకంగా ఆరుగంటలకు పైగా!
ఇటీవలే హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్తో అభిమానులను మెప్పించిన బ్యూటీ ఆదితి రావు హైదరీ. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరెకెక్కించిన ఈ సిరీస్కు విశేషమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈనెల 23న ముంబయిలో జరిగిన సోనాక్షి సిన్హా పెళ్లికి హాజరయ్యాడు. తనకు కాబోయే భర్త సిద్దార్థ్తో కలిసి రిసెప్షన్లో పాల్గొన్నారు.అయితే తాజాగా ఆదితి రావు హైదరీకి ఇంగ్లాండ్లో చేదు అనుభవం ఎదురైంది. ఆ దేశంలోని హీత్రో ఎయిర్పోర్ట్లో లగేజీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. తన లగేజీ కోసం ఆరు గంటలకు పైగా విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇదొక 'చెత్త ఎయిర్పోర్ట్ అని కామెంట్ చేసింది. అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది తనకు సాయం చేయకుండా.. లగేజీ కోసం ఎయిర్లైన్ సంస్థను సంప్రదించమని సలహా ఇచ్చారని వివరించింది. దాదాపు ఆరు గంటల తర్వాత కూడా తన లగేజీ అందలేదని అదితి వెల్లడించింది.కాగా.. ఆదితి రావు హైదరీ ఢిల్లీ- 6 మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. సోనమ్ కపూర్, అభిషేక్ బచ్చన్ నటించిన ఈ చిత్రంలో సహాయక పాత్రలో కనిపించింది. ఆ తరువాత లండన్, పారిస్, న్యూయార్క్, మర్డర్ 3, వజీర్, పద్మావత్ లాంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆదితి లయనెస్, గాంధీ టాక్స్ చిత్రాలలో కనిపించనుంది. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ ఏడాది హీరో సిద్ధార్థ్తో ఆదితిరావు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
సోనాక్షి పెళ్లి.. రిసెప్షన్లో మెరిసిన కాబోయే వధూవరులు!
బాలీవుడ్ భామ సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బాలీవుడ్, దక్షిణాది సినీతారలు సందడి చేశారు. బాంద్రాలో జరిగిన ఈ ఫంక్షన్లో కాబోయే వధూవరులు అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ మెరిశారు.కాగా.. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ ఈ ఏడాది మార్చి 27న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట తమ బంధాన్ని అఫీషియల్గా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా సోనాక్షి పెళ్లికి వీరిద్దరు జంటగా హాజరయ్యారు. అయితే ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్లో ఆదితిరావు కీలక పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్లో సోనాక్షి సిన్హాతో కలిసి నటించింది. వీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్లే రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. 2021 తెలుగు సినిమా మహా సముద్రం సెట్స్లో సిద్ధార్థ్, అదితి మొదటిసారి కలుసుకున్నారు. -
అక్కా.. నీ సర్జరీల కథ నాకు తెలుసు.. ఎందుకు మరి బిల్డప్? నటి కౌంటర్
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ అందంగా కనిపించేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఎంచుకుంటారు. సహజసిద్ధంగా మార్చలేని వాటి కోసం సర్జరీలను ఆశ్రయిస్తారు. అలా ఎందరో భామలు ముక్కు, పెదాలు.. ఇలా శరీర అవయవాలను తమకు నచ్చిన రీతిలో మార్చుకున్నారు. అయితే అలా సర్జరీలు చేయించుకున్నవారెవరో బాలీవుడ్ నటి రిచా చద్దాను విమర్శించినట్లున్నారు.అక్కా.. నాకు చెప్పకుఇంకేముంది సోషల్ మీడియా వేదికగా మండిపడింది. 'మరేం లేదు.. కొందరికి ఒంటినిండా విషమే! వయసు పైబడ్డా టీనేజర్లుగా ముస్తాబవుతున్నారు. పది సర్జరీలు చేయించుకుని కూడా మేము సహజంగానే అందంగా ఉంటామని పోజులిస్తున్నారు. అక్కా.. మీరు ఎన్ని సర్జరీలు చేయించుకున్నారో అవన్నీ తెలిసినవారి దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పడం? మాకు కళ్లున్నాయి. అన్నీ చూస్తున్నాం.. కాబట్టి ప్రత్యేకంగా ఏదీ చెప్పాల్సిన పని లేదు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.అదితి గురించేనా?ఇది చూసిన నెటిజన్లు రిచా ఎవరి గురించి మాట్లాడి ఉంటుందా? అని బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నటి గురించి ఆమె మాట్లాడుతోందని అర్థమవుతోంది. కానీ ఆ అక్క ఎవరై ఉంటారు? అని చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం ఇంకెవరు? అదితి రావు హైదరినే తిడుతోంది అని కామెంట్లు చేస్తున్నారు.ఆన్స్క్రీన్.. ఆఫ్స్క్రీన్.. అదే డ్రామా'హీరామండి వెబ్ సిరీస్లో ఎంత డ్రామా జరిగిందో ఆఫ్ స్క్రీన్లో అంతే డ్రామా నడుస్తోంది. రిచా చద్దా.. షర్మిన్ సెగల్ను ట్రోల్ చేసింది. షర్మిన్.. సంజీదా షైఖ్ను అవుట్సైడర్ అని మాట్లాడింది. ఇప్పుడు రిచా.. అదితిరావు మీద సెటైర్లు వేస్తోంది' అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. 'అదితినే అంటోందని క్లియర్గా తెలుస్తోంది.. అయినా రిచా ఏంటి? రోజురోజుకీ కంగనా రనౌత్లా మారుతోంది' అని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం గర్భిణి అయిన రిచా చద్దా జూలైలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.చదవండి: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. బంగారం వడ్డించారు! -
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' సీజన్-2 ప్రకటన
'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్ఫ్లిక్స్లో విడుదలై ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించింది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపింది. తెలుగులో కూడా అందుబాటులో ఉండటంతో ఇక్కడ కూడా మంచి ఆధరణే లభించింది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. త్వరలో రెండో సీజన్ కూడా విడుదల కానుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు.బాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్సిరీస్ను తెరకెక్కించడంతో ప్రేక్షకులు కూడా హీరామండి పట్ల పెట్టుకున్న భారీ అంచనాలను ఆయన నిజం చేశారు. ఇందులో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి,షర్మిన్ సెగల్,సంజీదా షేక్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించి మెప్పించారు. ఈ బిగ్ ప్రాజెక్ట్ను తన సొంత నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్తో భన్సాలీ నిర్మించాడు. అయితే, 'హీరామండి: ది డైమండ్ బజార్' సీజన్-1 సూపర్ హిట్ కావడంతో తాజాగా సీజన్ -2 ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలో విడుదల చేస్తామని సోషల్ మీడియా ద్వారా నెట్ఫ్లిక్స్ తెలిపింది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు
అందాల జాతర చేస్తున్న మాళవిక మోహనన్సన్నజాజి లాంటి నడుముతో కాక రేపుతున్న మౌనీ రాయ్బాలీలో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ మలైకా అరోరాచందమామలా మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఈషా రెబ్బాఆరు నెలల తర్వాత మళ్లీ అడవిలో హీరోయిన్ సదా View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by 𝐒𝐀𝐀𝐍𝐕𝐈𝐄 𝐓𝐀𝐋𝐋𝐖𝐀𝐑 (@saanvitalwar9) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
అమితాబ్ గురించి ఏదో అనుకున్నా.. ఆరోజు సీన్ షూట్ చేసేటప్పుడు..
తెలుగు బ్యూటీ అదితి రావు హైదరి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ "హీరామండి: ద డైమండ్ బజార్". దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో తన నటనకు, డ్యాన్స్కు మంచి మార్కులే పడ్డాయి. తన పర్ఫామెన్స్కు పాజిటివ్ రియాక్షన్ వస్తుండటంతో ఆనందంలో తేలియాడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.బిగ్బీతో నటించే ఛాన్స్అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన వాజీర్ సినిమాలో ఛాన్స్ వచ్చిందనగానే ఎగిరి గంతేశాను. ఆయనతో కలిసి పని చేసే అదృష్టం వస్తుందని ఊహించలేదు. బిగ్బీతో కలిసి పని చేసిన రోజుల్ని ఎన్నటికీ మర్చిపోలేను. ఆ సంతోషం, ఎగ్జయిట్మెంట్ మాటల్లో వర్ణించలేను. ఆ మూవీ అంతా తను వీల్చైర్లోనే కనిపిస్తారు. చిన్నపిల్లాడిలా..సెట్లో కూడా అదే చైర్లో కూర్చుని అంతా తిరుగుతూ ఉండేవారు. ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం చూస్తుంటే భలే ముచ్చటేసేది. వానిటీ వ్యాన్ను వదిలేసి సెట్లోనే ఉండేవారు. వాజీర్లో అమితాబ్ నాతో మాట్లాడే ఓ సీన్ ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ జరిపేటప్పుడు ఆయన నా ఎదురుగా వచ్చి పెద్ద డైలాగ్ చెప్తున్నాడు. ఆయన్ని చూస్తూ ఏడ్చేశాను. గొప్ప నటుడుతనొక పెద్ద స్టార్ కాబట్టి మనలాగా ఉండరేమో, డాబు ప్రదర్శిస్తారేమోనని ఏవేవో పిచ్చిగా ఊహించుకున్నాను. కానీ అక్కడలాంటిదేమీ లేదు. ఆయన నిజమైన యాక్టర్. నా కోసం ఆ సన్నివేశాన్ని మళ్లీ అంతే ఎమోషన్తో పూర్తి చేశారు.. నేను మళ్లీ కన్నీళ్లు ఆపుకోలేకపోయాను అని అదితిరావు హైదరి చెప్పుకొచ్చింది.చదవండి: 'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్తో పెళ్లి'.. నటి ఏమందంటే? -
Aditi Rao Hydari HD Photos: పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
-
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ అదితిరావ్ హైదరీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన భారీబడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండిలో నటించింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో సిద్ధార్థ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై స్పందించింది. సిద్ధార్థ్తో కలిసి ఉండటం ప్రేమపై నమ్మకాన్ని పెంచిందని తెలిపింది.అదితి మాట్లాడుతూ.. 'నేను కొన్ని విషయాల్లో పవిత్రతను నమ్ముతాను. మా ఇద్దరి రిలేషన్పై రూమర్స్ రావడం సహజమే. కానీ మేం మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం. వారు మా కంటే ఎంతో ప్రైవేట్గా ఉంటారు. మాకు చాలా కాల్స్ వస్తున్నందుకే మా రిలేషన్ను బయటకు చెప్పేశాం. ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం'అని తెలిపింది.ఆమె ఇంకా మాట్లాడుతూ..'నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. నా గోప్యత, పవిత్రతను నేను నమ్ముతా. నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. కానీ ప్రజలు మా పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని' తెలిపింది.కాగా.. హీరో సిద్దార్థ్తో డేటింగ్లో ఉన్న భామ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్లో ఉన్నారు. వనపర్తిలోని అతి పురాతన ఆలయంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. మా ఇద్దరి తల్లిదండ్రుల కారణంగానే నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది. సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో బిబో జాన్ పాత్రలో అదితి రావ్ హైదరీ నటించింది. -
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
బాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్లో ఈ భారీ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్తో ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట. ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్ఫిక్స్. అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్ : హీరామండి: ది డైమండ్ బజార్ (వెబ్సిరీస్)నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్, తదితరులునిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీసంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్కథ: మొయిన్ బేగ్జానర్: చారిత్రక నాటకంఎపిసోడ్స్: 8 భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్సిరీస్ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్ట్ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్తో నిర్మించాడు. పీరియాడిక్ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్సిరీస్ 'హీరామండి' సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే... బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..? ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. హీరామండిలో ఉండే షాహీ మహల్ నిర్వహణ మొత్తం మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు. అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్ అనే మరో మహల్ ఉంటుంది. అక్కడ ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్) మల్లికా జాన్కు సోదరి. బిబోజాన్ (అదితిరావ్ హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఇద్దరూ కూడా మల్లికా జాన్కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్ దత్తత తీసుకున్న కూతురు.హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే మల్లికా జాన్ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్ ప్రేమలో పడతారు. కానీ, మల్లికా జాన్ చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్దార్ (తాహా షా బహదూర్ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్తో పాటు తాజ్దార్ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్ (అదితిరావ్ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్గా బిబోజాన్ ఒక గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటీష్వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్న్ అనచివేసేందుకు ఫరీదాన్ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..పీరియాడిక్ డ్రామా చిత్రాలను డిఫరెంట్గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్డ్రాప్లో హీరామండి వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్ చాలు.. ఈ సిరీస్ డెప్త్ ఏంటో చెప్పడానికి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. లాహోర్ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్కు, బ్రిటీష్వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్లలో తన విజువల్ ఫీస్ట్తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో సంజయ్లీలా భన్సాలీ సూపర్ సక్సెస్ అయ్యాడు.తన టేకింగ్, విజువల్ ఫీస్ట్తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్ సిరీస్ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్ మాత్రం దుమ్మురేపుతాయి. మల్లికా జాన్ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది. వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్ను 'హీరామండి'గా సంజయ్లీలా తీసుకొచ్చాడు.ఎవరెలా చేశారంటేరూ. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సిరీస్లో టాప్ హీరోయిన్లను దర్శకుడు సెలక్ట్ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి స్టార్స్ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్గా సోనాక్షి సిన్హా నెగెటివ్ పాత్రలో మెప్పించింది. వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్కు ప్రధాన బలం విజువల్స్, కాస్ట్యూమ్స్,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి. -
రహస్యంగా నిశ్చితార్థం.. ఫోటోలు ఎందుకు షేర్ చేశానంటే: అదితి
కోలీవుడ్లో కాబోయే బ్యూటిఫుల్ కపుల్స్ సిద్దార్థ్ -అదితి రావు హైదరీ. గత నెలలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, ఈ విషయంపై వీరిద్దరూ కూడా మొదట అధికారికంగా ప్రకటన చేయలేదు. కొన్నిరోజుల తర్వాత మీడియాకు చెప్పారు. తాజాగా దీనిపై మొదటిసారి అదితి రావు హైదరీ రియాక్ట్ అయింది. ఇదే క్రమంలో మీడియా వాళ్లకు ఈ విషయాన్ని వెల్లడించడానికి గల కారణాన్ని కూడా ఆమె తెలిపింది. తను నటించిన 'హీరామండీ: ది డైమండ్ బజార్' వెబ్సిరీస్ ప్రమోషన్లో భాగంగా పలు విషయాలను పంచుకుంది.తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో మార్చి 27న వీరి నిశ్చితార్థం జరిగింది. ఉంగరాలతో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. 'ఆమె నాకు ఎస్ చెప్పింది' అని సిద్ధార్థ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.తాజాగా ఇదే విషయంపై హైదరీ ఇలా తెలిపింది. ' అందరూ తమ జీవితంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలను చాలా ప్రత్యేకంగా ఉన్న ప్రదేశంలో చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ క్రమంలో అందరిలా నేను కూడా నా నిశ్చితార్థాన్ని 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఈ విషయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆ దేవాలయంతో మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉండటమే.. నిశ్చితార్థం తర్వాత మా అమ్మ కోరికమేరకే ఆ ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేశాను. మా పెళ్లి విషయం గురించి తెలుసుకోవాలని చాలామంది మా అమ్మకు ఫోన్లు చేశారు. వాళ్లందరికీ ఆమె సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ నిశ్చితార్థం విషయం గురించి మీడియాకు చెప్పాలని ఆమ్మే సలహా ఇచ్చింది. ఆపై తెలిసిందే. వెంటనే నేను, సిద్ధార్థ్ సోషల్మీడియాలో ఫోటోలు షేర్ చేశాం.' అని ఆమె చెప్పింది. -
అదితీ రావ్ చుడీదార్ అందాలు.. సొగసు చూడతరమా! (ఫొటోలు)
-
ఎంగేజ్మెంట్ తర్వాత సిద్దార్థ్ ఫస్ట్ బర్త్డే.. ప్రియురాలి విషెస్ (ఫోటోలు)
-
తన లవర్బోయ్కి అదితి లవ్లీ విషెస్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ఎంగేజ్మెంట్ సీక్రెట్గా జరగలేదు, మా పెళ్లెప్పుడంటే?
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. ఒకప్పుడు సూపర్ హిట్లతో అలరించిన ఇతడికి ఈ మధ్య తెలుగులో విజయాలే కరువయ్యాయి. సినిమాల సంగతి ఎలా ఉన్నా తెలుగు హీరోయిన్ అదితిరావు హైదరితో డేటింగ్ చేస్తూ, షికార్లకు వెళ్తూ అందరి కంట్లో పడ్డాడు. కానీ తన ప్రేమ విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు. పెళ్లి కాస్తా ఎంగేజ్మెంట్ అయింది! ఈ క్రమంలో మార్చి 17న సడన్గా వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలో ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. తమిళనాడు నుంచి పురోహితులను తీసుకొచ్చి మరీ ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. కానీ ఆలయ అధికారులకు, పండితులకు అది సినిమా షూటింగ్ అని చెప్పి బురిడీ కొట్టించారు. తర్వాత ఆ డెకరేషన్, సెలబ్రేషన్స్ చూస్తే అది పెళ్లని అందరూ పొరబడ్డారు. దీంతో సిద్దార్థ్ సోషల్ మీడియా వేదికగా తానింకా పెళ్లి చేసుకోలేదని, జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రమేనని వెల్లడించాడు. సీక్రెట్ కాదు.. తాజాగా ఓ ఈవెంట్కు వెళ్లిన అతడికి ఎందుకు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు? పెళ్లి ముహూర్తాలు పెట్టించారా? అని వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సిద్దార్థ్ స్పందిస్తూ.. చాలామంది మేమేదో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నామంటున్నారు. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. మేము మా కుటుంబసభ్యులతో కలిసి ప్రైవేట్ ఫంక్షన్ చేసుకున్నాం. ఏ ఒక్కరినీ పిలవకుండా, చెప్పాపెట్టకుండా చేసుకుంటే అది సీక్రెట్ అంటారు. మరి మా వాళ్లందరి సమక్షంలో జరిగిన నిశ్చితార్థం సీక్రెట్ ఎలా అవుతుంది? పెళ్లి వారి చేతుల్లోనే.. ఇకపోతే అదితికి ప్రపోజ్ చేసినప్పుడు ఏం సమాధానం వస్తుందా? అని ఎదురుచూశాను. నా టెన్షన్ పోగొడుతూ తను నాతో జీవితాన్ని పంచుకోవడం సమ్మతమే అని అంగీకరించడంతో సంతోషపడిపోయాను. పెళ్లి విషయానికి వస్తే అది మా పెద్దలు నిర్ణయిస్తారు. నేను డిసైడ్ చేయడానికి ఇదేమీ షూటింగ్ డేట్ కాదు కదా.. పెద్దవాళ్లే ముహూర్తాలు చూసి ఓ మంచిరోజు డిసైడ్ చేస్తారు. అప్పుడే పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు. చదవండి: అతడిని ఎంతో ప్రేమించా.. పెళ్లి దగ్గర్లో ఉందనగా నేనంటే ఇష్టం లేదన్నాడు! -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో నెట్ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్సిరీస్ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్లో స్పృషించనున్నారు. ఈ సిరీస్లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్ బజార్తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. -
పెళ్లిపై స్పందించిన సిద్దార్థ్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరో!
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. డేటింగ్ను ఓపెన్గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. తాజాగా మార్చి 27న అదితిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. అయితే తన పెళ్లిపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందిచాడు. తాజాగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 'ఆమె ఓకే చెప్పింది.. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయిందని ఫ్యాన్స్ భావిస్తుంటే సిద్ధార్థ్ సడన్ షాకిచ్చాడు. ఎంగేజ్మెంట్ పోస్ట్తో అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చి పడేశాడు. మరి వీళ్లద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
Siddharth-Aditi Rao Marriage: సిద్దార్థ్ పెళ్లిలో ట్విస్ట్.. వారికి అబద్ధం చెప్పారా?
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్ను ఓపెన్గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. వీళ్ల ప్రేమ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా? అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో నిన్న(మార్చి 27న) అదితిని సీక్రెట్గా పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. షూటింగ్ అని చెప్పి వనపర్తే ఎందుకంటే? అదితిరావు హైదరి పూర్వీకులు వనపర్తి సంస్థానాధీశులు. అందుకనే ఆ సంస్థానానికి చెందిన ఆలయంలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆలయంలో పని చేసే స్థానిక పూజారులకు సినిమా షూటింగ్ అని చెప్పి గుడిని అందంగా ముస్తాబు చేశారట! వారిని లోపలకు రానివ్వకుండా తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పెళ్లి తంతు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి మండపం, గుడిని డెకరేట్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కన్ఫమ్ చేసిన హోస్ట్ అదితి రావు హైదరి హీరామండి: ద డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని ముంబైలో బుధవారం నిర్వహించారు. సిరీస్లో నటించిన అందరూ స్టేజీపై మెరిశారు, ఒక్క అదితి తప్ప! ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సచిన్ కుంబర్ మాట్లాడుతూ.. అదితి ఇక్కడ ఎందుకు లేదో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఆమె పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి అని తెలిపారు. దీంతో సిద్దార్థ్- అదితి పెళ్లి నిజమేనని అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. చదవండి: గతంలో విడాకులకు దరఖాస్తు.. ఇప్పుడేమో ఇంకో ఆప్షన్ లేదంటూ.. -
Siddharth-Aditi Rao Photos: ఆ వార్తల్లో నిజమెంత?.. ట్రెండింగ్ లో సిద్దార్థ్ ,అదితిరావు హైదరీ
-
అదితిని పెళ్లాడిన సిద్ధార్థ్.. ఆ విషయంపైనే అందరి చర్చ!
ఎట్టకేలకు టాలీవుడ్ హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరిని పెళ్లాడారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో వీరిద్దరి పెళ్లికి జరిగింది. రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021)చిత్రంలో నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు ఈ జంటపై వస్తున్న రూమర్స్ను నిజం చేస్తూ.. ఒక్కసారిగా వాటన్నింటికీ తెరదించారు. పెళ్లి జరిగిపోవడంతో వీరిద్దరి గురించి అభిమానులు తెగ వెతికేస్తున్నారు. అయితే ఈ జంట వయస్సు గురించి అభిమానులు చర్చ మొదలెట్టారు. ఈ జంటకు ఏజ్ గ్యాప్ ఎంత ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. మరీ మీరు ఈ విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఆ వివరాలు ఏంటో చూసేయండి. (ఇది చదవండి: హీరో సిద్దార్థ్ మాజీ భార్య గురించి తెలుసా?) అదితి రావు హైదరి అక్టోబర్ 28న 1986న ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 37 సంవత్సరాలు. మరోవైపు హీరో సిద్దార్థ్ 1979 ఏప్రిల్ 17న చెన్నైలో జన్మించారు. వీరిద్దరి మధ్య దాదాపు 7 సంవత్సరాల వయస్సు తేడా కనిపిస్తోంది. కాగా.. గతంలో అదితి సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. అతను ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ సైతం మొదట మేఘనా నారాయణ్ను పెళ్లాడారు. ఆమెతో 2007లోనే సిద్ధార్థ్ విడాకులు తీసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అదితి రావు హైదరీ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన అదితి.. తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం మూవీస్లో హీరోయిన్గా మెరిసింది. మరోవైపు సిద్ధార్థ్.. కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ -2లో నటించనున్నారు. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, ఓయ్, ఓ మై ఫ్రెండ్ చిత్రాలతో మెప్పించారు. -
హీరో సిద్దార్థ్ మాజీ భార్య గురించి తెలుసా?
సిద్దార్థ్ తమిళ హీరో.. కానీ తెలుగులో కూడా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాయ్స్ సినిమాతో వరుస అవకాశాలు అందుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో తన నటనతో కట్టిపడేశాడు. బొమ్మరిల్లు మూవీతో స్టార్ హీరో అయిపోయాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆట, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు.. ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ నెమ్మదిగా తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో టాలీవుడ్కు దూరమయ్యాడు. ఆ మధ్య మహాసముద్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా హిట్ కొట్టలేకపోయాడు. గతంలో పెళ్లి కొంతకాలంగా హీరోయిన్ అదితిరావు హైదరితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాడు సిద్దార్థ్. మీడియా ముందు మాత్రం ఆమెతో కలిసి పోజివ్వడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఈరోజేమో సడన్గా అదితిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు.. అతడికి ఆల్రెడీ పెళ్లయిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ టీనేజ్ కుర్రాడిలాగే కనిపిస్తాడు కాబట్టి ఇది రెండో పెళ్లంటే నమ్మలేకపోతున్నారు. మూడేళ్లకే మనస్పర్థలు సిద్దార్థ్ 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఢిల్లీలో అతడి పక్కింట్లోనే ఉండేది. సిద్దార్థ్- మేఘన మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మూడేళ్లకే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కలిసుండటం కష్టమని భావించి 2007లో విడాకులు తీసుకున్నారు. హీరోయిన్ సోహా అలీ ఖాన్తో ప్రేమ వ్యవహారం నడపడం వల్లే దంపతుల మధ్య గొడవలు తలెత్తాయని అప్పట్లో మీడియా కోడై కూసింది. ఆమె వల్లే బ్రేకప్ వారు తరచూ కలుసుకుంటూ, సినిమాలకు వెళ్తూ కనిపించడంతో ఇది నిజమేనని పలువురు భావించారు. సదరు హీరోయిన్ మాత్రం తాము కేవలం స్నేహితులమేనని ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం సిద్దార్థ్.. సోహాతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. కొంతకాలానికి వీరు కూడా విడిపోయారు. చదవండి: తెలుగు హీరోయిన్ను పెళ్లాడిన సిద్దార్థ్.. ఇద్దరికీ రెండోదే! -
సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్
హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో బుధవారం (మార్చి 27న) ఈ వివాహం జరిగింది. తమిళనాడు పురోహితులు దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించడం విశేషం. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య సిద్దార్థ్- అదితి పెళ్లి జరిగింది. జర్నీ ఎక్కడ మొదలైంది? అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021) మూవీలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఇద్దరూ వెకేషన్కు, ఈవెంట్స్కు కలిసే వెళ్తున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్, పెళ్లికి సైతం జంటగా హాజరవడంతో వీరి ప్రేమ నిజమేనని అభిమానులు భావించారు. ఓ షోలో మీతో జీవితాంతం కలిసి డ్యాన్స్ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అని సిద్దార్థ్కు ప్రశ్న ఎదురవగా.. 'అదితి' దేవో భవ అంటూ తన ప్రేమ గురించి చెప్పకనే చెప్పాడు. కానీ డైరెక్ట్గా తన ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని సిద్దార్థ్.. ఇప్పుడేకంగా సీక్రెట్గా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎవరీ అదితి? అదితిరావు హైదరి.. అచ్చ తెలుగమ్మాయి. తన కెరీర్ మొదలైంది మాత్రం మలయాళ సినిమాతో! హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం మూవీస్లో హీరోయిన్గా మెరిసింది. గతంలో ఈమె సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది. 2012లో అతడికి విడాకులిచ్చింది. సిద్దార్థ్ కూడా గతంలో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లాడాడు. వీరి మధ్య బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. సినిమాల విషయానికి వస్తే బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, ఓయ్, ఓ మై ఫ్రెండ్.. ఇలా ఎన్నో సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు. చదవండి: తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్ -
Aditi Rao Hydari: స్టైల్ అండ్ లుక్స్తో చంపేస్తున్న హైదరాబాదీ బ్యూటీ ఫోటోలు
-
మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. వీడియో వైరల్!
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్ఠ్. గతేడాది చిన్నా సినిమాతో అభిమానులను అలరించారు. అయితే సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్ ఆదితి రాయ్ హైదరతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరు జంటగా కనిపించారు. ఇప్పటికే చాలాసార్లు జంటగా కనిపించిన వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా రూమర్ జంట మరోసారి కెమెరాలకు చిక్కింది. ముంబైలో ఓ ఫంక్షన్కు హాజరైన వీరిద్దరు ఫోటోలకు పోజులిచ్చారు. తాజాగా ముంబయికి చెందిన నటి నటాషా పూనావాలా తన నివాసంలో నిర్వహించిన కచేరీకి పార్టీకి ఈ జంట హాజరయ్యారు. ఈ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న అదితి, సిద్ధార్థ్ కెమెరాల కంటికి చిక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. వీరిని చూసిన ఫోటోగ్రాఫర్ 'ఆదితి జీ ఏక్ కపుల్ ఫోటో ప్లీజ్' అంటూ సరదాగా ఆమెను ప్రశ్నించారు. దీనికి నవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. వీరితో పాటు అక్కడే ఉన్న నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కనిపించారు. అయితే వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పట్ల ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. సినిమాల విషయానికొస్తే అదితి ప్రస్తుతం ఇండో-యుకె కో-ప్రొడక్షన్ 'లయనెస్'లో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అదితి.. సంజయ్ లీలా భన్సాలీ 'హీరమండి' చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!
‘సమ్మోహనం’తో టాలీవుడ్ అభిమానులకు పరిచయమైన హీరోయిన్ అదితి రావు హైదరీ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. తాజాగా తన 37వ పుట్టినరోజును జరుపుకుంది. అక్టోబర్ 28న జన్మించిన ఈ హైదరబాదీ భామ తెలుగులో సైకో, అంతరిక్షం, హే సినామికా లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: పునీత్ రాజ్కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే కోలీవుడ్ హీరోతో మన హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మహా సముద్రం చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీని అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కించగా.. టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చాలా సార్లు వార్తలొచ్చాయి. ఈ జంట లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా ఇద్దరు కలిసి పార్టీల్లో కనిపించడంతో వీరి రిలేషన్పై నిజమేనంటూ కథనాలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా అదితి బర్త్డే సందర్భంగా సిద్ధార్థ్ తన ఇన్స్టాలో విషెస్ చెప్పారు. ఈ ఒక్క పోస్ట్తో వీరిద్దరి రిలేషన్పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కోలీవుడ్ హీరో. అయితే ఈ ఫోటోను మహాసముద్రం డైరెక్టర్ తన ట్విటర్లో షేర్ చేశారు. దీనంతటికీ కారణం నేనేనా? అంటూ కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ..' దీనికి కారణం నేనే అని అందరూ అనుకుంటున్నారు... అసలు ఏం జరుగుతోంది??' అంటూ అదితి, సిద్ధార్త్ ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. కాగా.. సిద్ధార్థ్ ఇటీవలే చిన్నా(చిత్తా) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అదితి ప్రస్తుతం గాంధీ టాక్స్, లయనీస్ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. (ఇది చదవండి: 'గంగమ్మ తల్లిమీద ఒట్టు'.. అలా జరిగిందంటే.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్!) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) Everyone thinks I'm the reason for this... What's actually happening?? 🤔#Siddharth @aditiraohydari pic.twitter.com/vcXQcMrmvu — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2023 -
Birthday Special: అదిరే అందం..అదితి హైదరి సొంతం
-
బీచ్లో పూనమ్ హంగామా.. శ్రీలీల హాట్ లుక్
మత్తెక్కించే పోజుల్లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల డెన్మార్క్ లో సందడి చేస్తున్న నివేదా వయ్యరమైన పోజుల్లో అదితీరావు హైదరీ క్యూట్ పోజుల్లో కవ్విస్తున్న 'కాంతార' పాప దగదగా మెరిసిపోతున్న హాట్ బ్యూటీ నోరా జీన్స్ వేర్లో ప్రియా వారియర్ స్టన్నింగ్ పోజులు రాయల్ ఔట్ఫిట్లో ఫరియా డిఫరెంట్ లుక్ View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) -
అదితీ అందాల జాతర.. హన్సిక స్టన్నింగ్ లుక్
అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న అదితీ చీరలో కొత్తగా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ నడుము చూపిస్తు టెంప్ట్ చేస్తున్న హన్సిక మాల్ ఓపెనింగ్లో పూజాహెగ్డే డ్యాన్స్ సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్న రుహానీ ఓనం లుక్లో 'దృశ్యం' పాప ఎస్తర్ కిక్కేచ్చే పోజుల్లో 'డీజే టిల్లు' బ్యూటీ బీచ్ ఒడ్డున్న బికినీలో మౌనీరాయ్ చీరకట్టులో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రణీత View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) @hegdepooja Dance #ArabicKuthu🥳#ThalapathyVijay🙏🏻 #PoojaHegde 🤩#Beast #LEO #BloodySweet 🥵 pic.twitter.com/BP4uSGFZ8j — 𓄂༺քʀǟӄǟֆɦʋɨʝǟʏ༻𓃭 (@Prakash_ssam) August 25, 2023 View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by ESTHER ANIL (@_estheranil) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Komalee Prasaad (@komaleeprasad) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) -
హీరో అక్కర్లేదు.. యంగ్ హీరోయిన్స్ దానికి సై
నాయికా ప్రాధాన్యంగా సాగే చిత్రాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. కథానుసారం ఫైట్లు చేయాలి.. పవర్ఫుల్ డైలాగులు చెప్పాలి.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకన్నా కాస్త ఎక్కువగానే ఎమోషన్ పండించాలి.. అవసరమైతే క్యారెక్టర్కి తగ్గట్టు సన్నబడాలి లేదా బరువు పెరగాలి లేదా నల్లటి మేకప్ వేసుకోవాలి. అన్నింటికీ మించి సినిమా మొత్తం ఆ నాయిక తన భుజాల మీద మోయాలి. ‘లేడీ ఓరియంటెడ్’ మూవీ అంటే పెద్ద సవాల్. అలాంటి సవాల్ వస్తే కాదనకుండా ఒప్పేసుకుంటారు కథానాయికలు. ప్రస్తుతం ముగ్గురు నాయికలు తొలిసారి ‘హాయ్ హాయ్ నాయికా’ అంటూ లేడీ ఒరియంటెడ్ మూవీకి సై అన్నారు. ఎమోషనల్ రెయిన్ బో రష్మికా మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటివరకూ ఎక్కవగా కమర్షియల్ చిత్రాలే చేశారు. ‘రెయిన్ బో’ చిత్రంతో తొలిసారి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు రష్మికా మందన్నా. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు శాంత రూబన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రధానంగా ఎమోషన్స్తో సాగుతుందట. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ కానుంది. రోడ్ ట్రిప్ మనాలి, లడఖ్ లొకేషన్స్తో ΄ాటు నార్త్లోని మరికొన్నిప్రాంతాల్లో రోడ్ ట్రిప్ చేస్తున్నారట హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. ఇది పర్సనల్ ట్రిప్ కాదు... ్ర΄÷ఫెషనల్ ట్రిప్ అని తెలిసింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ దర్శకత్వంలో రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీలో అనుపమా పరమేశ్వరన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, మలయాళ యంగ్ బ్యూటీ దర్శన, సీనియర్ నటి సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు. ముగ్గురు మహిళల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని టాక్. మరోవైపు ఈ సినిమా కంటే ముందే ‘బటర్ ఫ్లై’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేశారు అనుపమా పరమేశ్వరన్. అయితే ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అనుపమ చేస్తున్న చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. సో.. వెండితెరపై అనుపమ కనిపించనున్న తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇదే అవుతుందనుకోవచ్చు. వచ్చె నెలలో ఆరంభం ‘సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం’ వంటి తెలుగు సినిమాలతో నటిగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు హీరోయిన్ అదితీరావ్ హైదరి. ఈ బ్యూటీ సౌత్లో ఫస్ట్టైమ్ ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. దర్శక– నటుడు రాజేష్ ఎమ్. సెల్వ ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ΄్లాన్ చేస్తున్నారని, ఈ చిత్రంలోని మెయిన్ లీడ్ క్యారెక్టర్కు అదితీరావ్ని ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో చిత్రీకరణప్రారంభించుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. త్రిష, అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా, నయనతార, సమంత వంటి తారలు ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరికొందరు ఈ తరహా చిత్రాలపై మొగ్గు చూ΄ారు. వీరి స్ఫూర్తితో కొందరు యువకథానాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు సైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ∙ -
తొలి అడుగు
ఇటు సౌత్.. అటు నార్త్.. కాస్త ఖాళీ దొరికితే డిజిటల్ వరల్డ్... ఇలా వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటున్నారు హీరోయిన్ అదితీరావ్ హైదరి. అయితే తొలిసారి ఈ బ్యూటీ ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ సమాచారం. తమిళ దర్శక–నటుడు రాజేష్ ఎమ్. సెల్వ ఇటీవల కథానాయిక ప్రాధాన్యంగా సాగే ఓ కథ తయారు చేశారని, ఈ కథ విని, ఇందులోని పాత్ర నచ్చడంతో అదితీరావ్ హైదరి పచ్చ జెండా ఊపారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ఆరంభం కానుందట. లేడీ ఓరియంటెడ్ చిత్రాల పరంగా అదితీకి ఇది తొలి అడుగు. మరి.. ఈ తొలి అడుగుతో ఈ తరహా చిత్రాలు ఇంకెన్ని చేస్తారో చూడాలి. ఇక ‘సమ్మెహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం’ వంటి చిత్రాలతో అదితీరావ్ హైదరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. -
చిన్న గ్యాప్ తర్వాత కోలీవుడ్లో సినిమా చేస్తున్న హీరోయిన్
బహుభాషా నటి అతిథి రావు హైదరి.. బాలీవుడ్లో రంగ ప్రవేశం చేసిన తర్వాత అక్కడ పలు చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించింది. ఈ బ్యూటీని మణిరత్నం కోలీవుడ్కి పరిచయం చేశారు. కార్తీకి జంటగా 'కాట్రు వెలియిడై' అనే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మళ్లీ మణిరత్నమే సెక్క సెంవంద వానం చిత్రంలో అవకాశం కల్పించారు. ఆ మధ్య హే సినామికా చిత్రంలో దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ లతో కలిసి నటించిన ఈమె సముద్రం అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సమయంలోనే ఆ చిత్ర కథానాయకుడు సిద్ధార్థతో పరిచయం ప్రేమగా మారిందని ప్రచారం జోరందుకుంది. అదేవిధంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్ వైరల్ అవుతోంది. ఇకపోతే మరాఠీ, ఆంగ్లం చిత్రాల్లోనూ నటిస్తున్న అతిథి రావ్ చిన్న గ్యాప్ తర్వాత తాజాగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి రాజేష్ సెల్లా దర్శకత్వం వహించినట్లు సమాచారం. నాజర్, వసుంధర కలిసి నటించిన కాలైప్పణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ఈయన ఆ తరువాత విక్రమ్, త్రిష జంటగా నటించిన తూఝగావనం, విక్రమ్ కథానాయకుడిగా నటించిన కడారం కొండాన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఆరై అనే వెబ్సిరీస్కు దర్శకత్వం వహించారు. కాగా నటి అతిథి రావ్ ప్రధాన పాత్రలో నటించే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: విశ్వక్ సేన్ కౌంటర్స్.. బేబీ డైరెక్టర్కేనా? -
స్టైలిష్ లుక్స్తో మతి పోగొడుతున్న అదితి రావు హైదరీ
-
సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. ఇటీవలే తాను హీరోగా నటించిన చిత్రం ‘టక్కర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. (ఇది చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..) చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్లో సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సిద్ధార్థ్.. బాలీవుడ్ భామ ఆదితి రావు హైదరితో డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ జంట చాలాసార్లు ఫంక్షన్లలో తళుక్కున మెరిశారు. గతంలో ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ కలిసి టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్కు కూడా హాజరయ్యారు. ఇటీవలే రాజస్థాన్లో జరిగిన పెళ్లిలోనూ జంటగా పాల్గొన్నారు. దీంతో ఈ జంట పీకల్లోతు డేటింగ్లో ఉన్నట్లు మరోసారి వార్తలు వైరలయ్యాయి. అయితే తాజాగా ఓ టీవీ షోలో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ చూస్తే ఈ రూమర్స్ నిజమనే తెలుస్తోంది. ఇంతకీ సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఓ టీవీ షోలో పాల్గొన్న సిద్ధార్థ్ను యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. జీవితాంతం మీతో కలిసి డ్యాన్స్ చేయాలనుకునే ఆమె ఎవరైనా ఉన్నారా? అని అడిగింది. దీనికి సమాధానమిస్తూ..'మా ఊర్లో అందరూ 'ఆదితి దేవో భవ అంటారు' కదా అంటూ నవ్వుతూ అన్నారు. దీంతో అతిథిని ఆదితి పేరుతో పిలవడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సిద్ధార్థ్ సమాధానంతో ఆదితి రావు హైదరీతో డేటింగ్ ఖాయమని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!) Awwww did he just accept?? CUTE. ❤️❤️🧿#Siddharth pic.twitter.com/x9pVfv8SHT — Shravani (@shravd05) June 9, 2023 -
శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!
యంగ్ హీరో సిద్దార్థ్తో హీరోయిన్ అదితి రావు హైదరీ డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ఎక్కువగా పార్టీల్లో కనిపించడంతో అభిమానులు వీరి గురించే చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరి రిలేషిప్పై ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. గతంలో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ జంట జైపూర్లో జరిగిన శర్వానంద్ పెళ్లికి కూడా హాజరయ్యారు. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) శర్వానంద్ పెళ్లికి జైపూర్ వెళ్తూ అదితి, సిద్ధార్థ్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో జంటగా కనిపించారు. సిద్ధార్థ్, అదితి విమానాశ్రయం లోపలికి వెళ్తూ కనిపించారు. అంతే కాకుండా జైపూర్లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి కూడా వెళ్లారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా శర్వానంద్ పెళ్లికి జంటగా వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by Bina Kak (@kakbina) -
అదితిరావు హైదరితో డేటింగ్ గురించి సిద్ధార్థ్ మాటల్లో వినండి..!
-
ఇండియన్ 2 లో నా క్యారెక్టర్..? ప్రభాస్, నేను పుట్టుమచ్చల గ్యాంగ్!
-
కాదు.. లేదు అంటూనే!
కాదంటే అవుననిలే...అనే సూపర్ హిట్ పాట ఉంది కదా. ఇప్పుడు నటుడు సిద్ధార్థ్, నటి అతిథి రావ్ హైదరి పరిస్థితి ఇలానే ఉంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. సినీ వివాహ వేడుకల్లో తళుక్కున మెరుస్తూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులిస్తారు. లవ్వా అంటే చా..చా... అలాంటిదేమీ లేదు....మంచి స్నేహితులం అంటారు. మీడియాలో మాత్రం సిద్ధార్థ్, అతిథి రావ్ హైదరి సహజీవనం అంటూ వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఈ సంచలన జంట గురించి కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయిన నటుడు సిద్ధార్థ్. మణిరత్నం దర్శకత్వం వహించిన కాట్రు వెలియిడై చిత్రంతో కోలీవుడ్కు అతిథి రావ్ హైదరి పరిచయం అయ్యింది. అయితే వీరిద్దరూ కలిసి తెలుగులో సముద్రం అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం ప్లాప్ అయినా వీరి మధ్య పరిచయం బలపడిందంటారు. మరో విషయం ఏంటంటే సిద్ధార్థ్కి ఇప్పటికే పెళ్లి, విడాకులు కావడం జరిగిపోయింది. నటి అతిథి రావ్ హైదరిదీ ఇదే పరిస్థితి. దీంతో ఈ జంట ముచ్చట చూసి ప్రేమలో ఉన్నారని, పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా తాజాగా వీరిద్దరూ కలిసి ఒక పాటకు చేసిన డాన్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతంది. అయితే దీనిపై వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. -
హీరోయిన్తో సిద్దార్థ్ చెట్టాపట్టాల్.. లవ్లీ జోడీ అనగానే సిగ్గులమొగ్గైన అదితి
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని అటు ఫిల్మీదునియాలో ఇటు సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది. అబ్బే, అదేం లేదంటూనే వీరిద్దరు పార్టీలకు, షికార్లకు వెళ్తూ ఉంటారు. వీళ్లు జంటగా కనిపించిన ప్రతిసారి అభిమానులు మాత్రం భలే ఉన్నారిద్దరూ అని ముచ్చటపడిపోతుంటారు. తాజాగా సిద్దార్థ్, అదితి ముంబైలో జూబ్లీ వెబ్ సిరీస్ ప్రీమియర్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ జంటగా కెమెరాకు పోజులిచ్చారు. అక్కడున్న వాళ్లు ఈ జంటను చూసి లవ్లీ జోడి అని కామెంట్ చేయగా అదితి సిగ్గుపడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సిద్, అదితి ఎంత ముద్దొస్తున్నారో.. అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇప్పటికైనా ఇది ప్రేమంటారా? కాదంటారా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో అదితి రావుకు సిద్దార్థ్తో డేటింగ్పై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ అందరితో పంచుకునే విషయం ఏదైనా ఉంటే నేనే చెప్తానంటూ మాట దాటవేసింది. అయినా నేనేం చెప్పినా చివరకు మీకు నచ్చినట్లుగానే ఊహించుకుంటారుగా అని కౌంటర్ వేసింది. కాగా వీరిద్దరూ మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచే ఈ లవ్ మొదలైందని టాక్! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అదితిరావు హైదరీతో సాక్షి స్పెషల్ చిట్ చాట్
-
హీరో సిద్ధార్థ్తో డేటింగ్పై ప్రశ్న.. అదితి షాకింగ్ కామెంట్స్
హీరో సిద్దార్థ్తో డేటింగ్ వార్తలపై హీరోయిన్ అదితి రావు హైదరి మరోసారి స్పందించింది. గతంలో డేటింగ్ రూమర్స్ను ఖండించిన అదితికి తాజాగా ఇంటర్య్వూలో అదే ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఆమె నటించిన తాజ్ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో ఆమె ఓ చానల్కు ఇంటర్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా రిలేషన్షిప్పై స్పందించాలని యాంకర్ ఆమెను కోరగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. అందరితో పంచుకునే విషయం ఏదైనా ఉంటే నేను చెప్తాను అంది. చదవండి: ఇంత నిర్లక్ష్యమా..‘విరూపాక్ష’ మేకర్స్పై హీరోయిన్ ఆగ్రహం తన రిలేషన్ స్టేటస్పై మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికి ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి వాటిపై ఉండొచ్చు. కానీ, చాలా మందికి మమ్మల్ని స్క్రీన్పై చూడటమంటనే ఇష్టం. అందుకు అనుగుణంగా మేము మరింత కష్టపడి పనిచేయాలి. మా పనిని ప్రేమించాలి. అలా చేసినప్పుడే మీకు మంచి కంటెంట్ను అందించగలం. అదే మాకు ముఖ్యం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అనంతరం సిద్దార్థ్తో రిలేషన్పై మాట్లాడుతూ అసహనం చూపించింది. చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు.. ‘ఈ విషయంలో మీకే ఒక అభిప్రాయం ఉంది. ఇంకా నేనేమి చెప్పాలి. ఒకవేళ నేను ఏం చెప్పినా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు’ అని వాఖ్యానించింది. దీంతో యాంకర్ ఇది ఆడియన్స్ ప్రశ్న అనగానే వారెప్పుడు తనని ఇలాంటి ప్రశ్న అడగలేదని, మీరు అడుగుతున్నారంటూ నవ్వుతూ చెప్పింది. కాగా అదితి-సిద్ధార్థ్లు మాత్రం తమపై వచ్చే రూమర్స్ పట్టించుకోకుండా కలిసి పార్టీలు, విందులకు హాజరవుతున్నారు. అంతేకాదు వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, రీల్స్ను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నారు. -
Aditi Rao Hydari Photos: ట్రెడిషనల్ లుక్లో హీరోయిన్ అదితి.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)
-
సిద్దార్థ్తో లవ్.. స్పందించిన హీరోయిన్
ప్రేమలో పడటం సహజమే.. కానీ ఆ ప్రేమ విషయాన్ని కొందరు మాత్రమే నిర్మొహమాటంగా చెప్తారు. సినీ ఇండస్ట్రీలో అయితే అతికొద్ది మంది మాత్రమే అవునని ఒప్పుకుంటారు, లేదంటే లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. కానీ హీరోహీరోయిన్లు సెట్స్లో కాకుండా బయట కలిసి కనిపించినా, షికార్లు కొడుతూ కెమెరాలకు చిక్కినా వారిని మాత్రం లవ్ బర్డ్స్గానే వర్ణిస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సెలబ్రిటీలు మాత్రం అది ప్రేమ అనో, స్నేహమనో క్లారిటీ ఇవ్వరు. దీంతో ఇది కచ్చితంగా లవ్వేనని అంతా ఫిక్సైపోతారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి రూమర్స్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావుల మధ్య ఎక్కువయ్యాయి. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ పాటకు చిందేసిన డ్యాన్స్ సైతం తెగ వైరల్ అయింది. తాజాగా తన గురించి వస్తున్న ప్రేమ పుకార్లపై స్పందించిందీ హీరోయిన్. 'నేను ఎవరితో ఏ రిలేషన్లో ఉన్నాను అనేదానిపై కాకుండా నా సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతం నేను పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. మంచి డైరెక్టర్లతో కలిసి పని చేస్తున్నాను. కెరీర్పైనే దృష్టి సారించాను. నన్ను నటిగా అంగీకరించినంతవరకు నటిస్తూనే ఉంటా. దయచేసి నా వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి వృత్తిపరమైన విషయాల గురించి మాట్లాడండి' అని పేర్కొంది అదితి. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
రూమర్డ్ గర్ల్ఫ్రెండ్తో హీరో సిద్దార్థ్ డ్యాన్స్.. వీడియో వైరల్
హీరోయిన్ అదితి రావ్ హైదరితో హీరో సిద్దార్థ్ ప్రేమలో ఉన్నాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహాసముద్రం అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు అప్పటినుంచి ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. ఇదిలా ఉంటే మరోసారి ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. సిద్దార్థ్-అదితి కలిసి విశాల్ నటించిన ‘ఎనిమీ’ సినిమాలోని పాపులర్ ‘టమ్ టమ్’అనే పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియోను అదితి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వీరి డ్యాన్స్ రీల్ నెట్టింట వైరల్గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఇంక లేట్ ఎందుకు త్వరలోనే మీ రిలేషన్షిప్ అనౌన్స్ చేయండి.. మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ఒకే ఫ్రేంలో అందాల తారలు.. కనుల పండుగగా హీరామండి ఫస్ట్లుక్
బాలీవుడ్లో దిగ్గజ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. వాస్తవిక కథలను, హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్టా. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, దేవదాస్, ‘బాజీరావ్ మస్తానీ’వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకులకు అందించారు. ఇక ఆయన ఓ వెబ్ సిరీస్తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పలువురు అగ్ర నటిమణులతో హీరామండి అనే వెబ్ సిరీస్ను నెట్ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున ఈ సిరీస్ వేశ్యల కథ నేపథ్యంలో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సిరీస్ను నుంచి అప్డేట్ ఇచ్చింది నెట్ఫ్లిక్స్. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ క్వీన్స్ గెటప్లలో రాయల్ లుక్లో కనిపించారు. అందమైన తారలంతా ఒకే ఫ్రేంలో రాయల్ లుక్లో కనిపించడంతో ఫ్యాన్స్ అంత కనుల పండుగా చేసుకుంటున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. కాగా స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్లో స్పృషించనున్నారు. ఈ సిరీస్లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. Another time, another era, another magical world created by Sanjay Leela Bhansali that we can’t wait to be a part of. Here is a glimpse into the beautiful world of #Heeramandi 💫 Coming soon! pic.twitter.com/tv729JHXOE — Netflix India (@NetflixIndia) February 18, 2023 -
ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ హీరో సిద్ధార్థ్తో డేటింగ్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజులుగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరి నుంచి అధికారిక సమాచారం లేదు. చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్ రీసెంట్గా యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇవాళ వాలంటైన్స్ డే సందర్భంగా అదితి సిద్ధార్థ్కు షాకిచ్చింది. సిద్ధార్థ్కు కాకుండ మరో సీనియర్ హీరోకి ఆమె ప్రపోజ్ చేసింది. వాలంటైన్స్ డే సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్కి బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్రతో పాటు అదితి కూడా ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా అదితి ఆయనకు రెడ్ గులాబి ఇచ్చి సరదగా ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఈ ఫొటోని అదితి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దీనికి ‘ది మోస్టెస్ట్ హ్యాండ్సమ్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పోస్ట్పై హీరో సిద్ధార్థ్ స్పందించడం విశేషం.పోస్ట్ 2 హార్ట్ ఎమోజీలతో అదితి పోస్ట్పై స్పందించాడు. అయితే వాలంటైన్స్ డే రోజున సిద్ధార్థ్కు ప్రపోజ్ చేయకపోవడం ఏంటి? అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్పై స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. కాగా సిద్ధార్థ్, అదితి రావు హైదరీలు మహాసముద్రం చిత్రంలో ప్రేమికులుగా నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం ఆమె అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ ఆమె హీరో సిద్ధార్థ్తో డేటింగ్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు ఇటీవల యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంతో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించారు. దీంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే అప్పటికే అదితికి పెళ్లై విడాకులు అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను గతంలో ఆమె వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. 2009లో వీరి వివాహం జరగ్గా.. 2013లో వీరిద్దరూ విడిపోయారు. అయితే ఇటీవల ఆమె మాజీ భర్త సత్యదీప్ మిశ్రా బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు సత్యదీప్ మిశ్రా. ఈ సందర్భంగా తన మాజీ భార్య అదితిని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: నటుడిగా బ్రహ్మానందం ఎన్ని వందల కోట్లు సంపాదించాడో తెలుసా? ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘అదితితో నా రిలేషన్ కారణంగా ప్రేమపై నాకు విరక్తి కలిగింది. మరోసారి ప్రేమ, పెళ్లి అంటేనే భయం వేసింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు మళ్లీ రిలేషన్, ప్రేమ అంటే భయపడతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం’ అని మిశ్రా చెప్పుకొచ్చాడు. ఇక అనంతరం మసాబాతో ప్రేమ, రెండో పెళ్లిపై స్పందిస్తూ.. ‘మా పెళ్లి చాలా సింపుల్గా జరగాలని అనుకున్నాం. అందుకే కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఇండస్ట్రీ వాళ్ల కోసం చిన్న పార్టీ ఏర్పాటు చేశాం. ఎందుకంటే మా బంధాన్ని మేం రహస్యంగా ఉంచాలనుకోలేదు. ఎందుకంటే సీక్రెట్స్ అనేవి రిలేషన్స్ని ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను. బంధాన్ని సొంతం చేసుకోవాలి.. ఒపెన్గా ఉండాలి’ అని పేర్కొంది. ఇక ఆయన సమాధానం విన్న కొందరు నెటిజన్లు ఇది పరోక్షంగా అదితిగా కౌంటర్ ఇచ్చాడా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రస్తుతం అదితి సిద్ధార్థ్తో సీక్రెట్ డేటింగ్లో ఉంది. ఇప్పటి వరకు తమ రిలేషన్ని అదితి కానీ, సిద్ధార్థ్ కానీ బయట పెట్టలేదు. ఇదిలా ఉంటే మసాబాకు కూడా ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే. చదవండి: యువత పాశ్చాత్య పోకడలపై కళాతపస్వీ విశ్వనాథ్ ఏమన్నారంటే.. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
విడాకులు తీసుకుని పీకల్లోతు ప్రేమలో ఉన్న హీరో, హీరోయిన్
-
డేటింగ్ రూమర్స్..హోటల్లో కెమెరాలకు చిక్కిన హీరో, హీరోయిన్లు
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ముంబైలోని ఓ హోటల్లో సిద్ధార్థ్- అదితిలు జంటగా కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట ఇంతవరకు స్పందించలేదు. కాగా ఇక సిద్దార్థ్, అదితిలు కలిసి ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రంతోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందని.. అదే ప్రేమకు దారితీసిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సిద్ధార్థ్, అదితిరావ్ హైదరిలకు ఇదివరకే పెళ్ళిళ్ళై విడాకులు అయ్యాయి. సిద్దార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని ప్రేమ పెళ్లి చేసుకోగా, 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి కూడా చిన్న వయసులోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికే అతడితో విడిపోయింది. -
సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్గా హీరో పోస్ట్
Siddharth-Aditi Rao Hydari Dating Rumours: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ ముందు వీరిద్దరు జంటగా మీడియాకు చిక్కారు. దీంతో అప్పటి నుంచి సిద్ధార్థ్, అదితిలు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. ఈ నేపథ్యంలో రీసెంట్గా అదితి బర్త్డే సందర్భంగా సిద్ధార్థ్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. చదవండి: కోలుకోవడం సాధ్యం కాలేదు, బతకాలనిపించలేదు : దీపికా పదుకొణె అదితితో కలిసి క్లోజ్గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి ప్రేమాయణం నిజమేనంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదితితో ప్రేమలో ఉన్నట్లు సిద్ధార్థ్ ఈ పోస్ట్తో క్లారిటీ ఇచ్చాడా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిద్ధార్థ్ పోస్ట్పై వారి సన్నిహితులు సైతం వీరిద్దరిని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇక సిద్దార్థ్ పోస్ట్కి అదితి స్పందిస్తూ సిద్దూ… అంటూ స్పెషల్ కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే అదితి బర్త్డే సందర్భంగా వీరిద్దరు జంటగా వేకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె బర్త్డే రోజున(అక్టోబర్ 28న)ముంబై ఎయిరోపోర్ట్లో సిద్దార్థ్, అదితిలు జంటగా దర్శనం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
ఆమె చూస్తే తట్టుకోలేదని బాత్రూమ్కు వెళ్లి ఏడ్చేదాన్ని: అదితి రావు
తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదితి రావు హైదరీ. ఇటీవలే ఈ నటుడు సిద్ధార్థ్తో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జరిగిన మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లలడించారు. తాను సినిమాల్లోకి రావడానికి ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అదితిరావు వెల్లడించారు. (చదవండి: ఆ అమ్మాయి కనిపిస్తే దయచేసి నాకు చెప్పండి.. రాజ్ తరుణ్ వీడియో వైరల్) అదితి రావు మాట్లాడుతూ..' నేను మొదట భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించా. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా ప్రదర్శనలు చేశా. వీటన్నింటిని చూసిన తమిళ దర్శకురాలు శారద నాకు హీరోయిన్గా మొదటి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. ఈ విషయంలో నేను చాలా బాధపడేదాన్ని. మొదటి మూవీ కావడంతో ఫీలయ్యేదాన్ని. మా అమ్మ ముందు నేను ఏడిస్తే తాను తట్టుకోలేదని బాత్ రూమ్కు వెళ్లి ఏడ్చేదాన్ని' అని తెలిపింది. (చదవండి: సూర్య- ఇనయ లవ్ భాష.. ఏంటో అర్థం కావట్లేదన్న నాగ్) -
ఒక్క పోస్ట్తో లవ్ కన్ఫర్మ్ చేసిన సిద్దార్థ్?
అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ నేడు(అక్టోబర్ 28) 36వ పడిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో హీరో సిద్దార్థ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఎందుకంటే వీరిద్దరి మధ్యలో ఏదో ఉందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య వీళ్లు ఓ సెలూన్ నుంచి కలిసి బయటకు వస్తూ కెమెరాలకు చిక్కారు. ఇకపోతే తొలిసారి అదితితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడీ హీరో. 'హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్, నీ కలలన్నీ సాకారం కావాలని మనసారా కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. ఇక్కడ ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్ అంటే అందరి హృదయాల్లో కొలువైన రాణి అంటున్నాడా? లేదా తన మనసు దోచుకున్న మహారాణి అని హింటిస్తున్నాడా? అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు. ఇకపోతే అదితి.. సిద్దార్థ్తో బర్త్డేను సెలబ్రేట్ చేసుకోవడానికి చెన్నైకి చెక్కేసిందట. మరి ఈ బర్త్డే వేడుకల ఫొటోలను వారు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారో లేదో చూడాలి! View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) చదవండి: తొక్కలో పంచాయితీ, ఎంత చెప్పినా గీతూ వినదే! నిజమే, పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీయాల్సిందే! -
డైలాగ్స్ లేకుండా విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’, ఆసక్తిగా ఫస్ట్గ్లింప్స్
ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే హీరోల్లో ముందువరుసలో ఉంటారు విజయ్ సేతుపతి. తాజాగా ఆయన ‘గాంధీ టాక్స్’ అనే సైలెంట్ ఫిల్మ్(డైలాగులు లేని)లో లీడ్ రోల్ చేస్తున్నారు. మరాఠి దర్శకుడు కిశోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, అదితీరావ్ హైదరీ, సిద్ధార్థ్ జాదవ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: మహేశ్-త్రివిక్రమ్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో! కాగా ఆదివారం గాంధీ జయంతి (అక్టోబరు 2) సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘డైలాగ్స్ లేకుండా కేవలం ఎమోషన్స్తోనే కథను చెప్పడం అంత సులువైన విషయం కాదు. ఈ సినిమా నాకు చాలెంజింగ్గా అనిపించింది’’ అని కిశోర్ పాండురంగ్ బేలేకర్ అన్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
అందాల స్వప్నం అదితి రావ్ హైదరీ (ఫొటోలు)
-
గర్ల్ఫ్రెండ్తో సిద్దార్థ్ షికార్లు.. ఫొటోలు తీసినవారికి హీరో వార్నింగ్!
'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. కానీ ఈ మధ్య అతడి సినిమాలేవీ పెద్దగా ఆడటం లేదు. చాలాకాలం తర్వాత మహాసముద్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది సక్సెస్ అవలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ అదితి రావు హైదరీతో సిద్దార్థ్ లవ్లో పడ్డాడంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఇది నిజమేనంటూ మరో వార్త నెట్టింట వైరల్గా మారింది. ముంబైలోని ఓ సెలూన్ నుంచి ఇద్దరూ బయటకు వస్తుండగా కెమెరాల కంట పడింది. ఇంకేముందీ.. ఫొటోగ్రాఫర్లు వెంటనే వారిని ఫొటోలు తీస్తూ కెమెరాలు క్లిక్మనిపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్దార్థ్.. తనను ఫొటోలు తీయొద్దని హెచ్చరించాడట. 'నేను ఇక్కడివాడిని కాదు, వెళ్లి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ల ఫొటోలు తీసుకోండి. నెక్స్ట్ టైం మాత్రం ఇంత మర్యాదగా అస్సలు చెప్పను, అర్థమైందా?' అని ఓరకంగా వార్నింగే ఇచ్చాడట. చదవండి: చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన నారాయణ క్యాస్టింగ్ కౌచ్ వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు వదులుకున్నా.. -
Fashion: కాన్స్.. మన తారల లుక్ అదుర్స్! డ్రెస్ ఎంపికలోనే అంతా!
ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకునే వేదిక అది.. అందం, హుందాతనం కలిసి నడిచే కార్పెట్ అది. అందరి చూపులను తమ వైపు పడేలా చేయాలంటే అందుకు తగిన డ్రెస్ ఎంపిక ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. సమయం, సందర్భం, సీజన్... ఇలా వేడుకకు తగిన నియమాలనూ పాటించాలి. ఇవన్నీ మన కళ్లకు కడుతుంది కాన్స్ ఫిల్మ్ఫెస్టివల్. రెడ్ కార్పెట్పైన మన తారలు వెదజల్లిన జిలుగులు ఇవి.. దీపికా పదుకోన్ సబ్యసాచి డిజైనర్ శారీ ధరించిన దీపిక రెడ్కార్పెట్పై హుందాతనాన్ని ప్రదర్శించింది. ఈ ఫిల్మోత్సవంలో దీపికా పదుకోన్ తన ఫ్యాషన్ పరంపరను కొనసాగించింది. లేత అకుపచ్చ రంగులో ఉన్న గౌన్ నిండా పింక్ గులాబీలు, ఆకులతో ఆమె నవ్వులతో పోటీపడుతున్నట్టుగా ఉన్నాయి. మ్యాచింగ్ బూట్లు మరింత ఆకర్షణీయంగా అమరాయి. ఐశ్వర్యా బచ్చన్ ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ ‘డోల్స్ అండ్ గబ్బానా’ డిజైనర్ బ్లాక్ శాటిన్ గౌన్ను ధరించింది ఐశ్వర్యాబచ్చన్. అంచు భాగం వెడల్పాటి ఫ్లేర్తో, అందమైన పువ్వులతో డిజైన్ చేసిన ఈ గౌన్ విశేషంగా ఆకట్టుకుంది. వెస్ట్రన్ పార్టీలో ఫ్లోరల్స్కున్న ఘనతను ఇలా చాటింది. పూజా హెగ్డే లెబనీస్ ఫ్యాషన్ బ్రాండ్ మైసన్ గేయన్నా బాల్ గౌన్తో కాన్స్లో సందడి చేసింది పూజా హెగ్డే. ఫెదర్ డిజైన్ ఈ గౌన్ ప్రత్యేకతను మరింత పెంచింది. పొనీటెయిల్, లాంగ్ హ్యాంగింగ్స్తో సింపుల్ అనిపించే ఆహార్యంతో ఆకట్టుకుంది పూజా. తమన్నా డిజైనర్స్ గౌరీ అండ్ నైనిక రూపొందించిన గౌనులో తమన్నా రెడ్ కార్పెట్పైన సందడి చేసింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో శాటిన్ నెక్లైన్తో తన రూపాన్ని మరింతగా హైలైట్ చేసింది. నర్గిస్ ఫక్రీ టర్కీ డిజైనర్ నెడ్రెట్ టాసిరోగ్లు రూపొందించిన బేబీ పింక్ కలర్ షిమ్మర్ డ్రెస్లో రెడ్ కార్పెట్పైన నడిచింది నర్గీస్ ఫక్రీ. హాల్టర్ నెక్ ఈ డ్రెస్ ప్రత్యేకత. నడుము వరకు సరైన ఫిటింగ్తో ఉన్న గౌన్ కింది భాగమంతా వెడల్పాటి ఫ్లెయర్తో ఆకట్టుకుంది. అదితీరావు హైదరీ ఇండియన్ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన స్లీవ్డ్ బ్లాక్ గౌన్ను ధరించి ఫిల్మోత్సవంలో పాల్గొంది అదితీరావు హైదరీ. ఫ్లోరల్ లేస్, క్రూ నెక్, ఎంబ్రాయిడరీ ఈ డ్రెస్ ప్రత్యేకతలు. అంతేకాదు గౌన్ హైలైట్ అయ్యేలా డిజైనర్ బ్రాండ్ బెల్ట్, రాయల్ బెంగాల్ టైగర్ గోల్డ్ యాక్ససరీస్.. కార్పెట్పైన స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఊర్వశి రౌతేలా టోనీ వార్డ్ కోచర్ నుండి తీసుకున్న తెల్లటి రఫుల్డ్ గౌన్లో రెడ్ కార్పెట్ మీద మెరిసింది ఊర్వశి రౌతేలా. రఫుల్స్తో విప్పారినట్టుగా ఉన్న గౌన్ను నడుము, భుజం వద్ద జత కలిపిన డిజైన్ డ్రెస్కి మరింత అందాన్నిచ్చింది. చదవండి👉🏾 Catherine Tresa: ఈ హీరోయిన్ ధరించిన అంగ్రఖా కుర్తా ధర 32వేలు! డ్రెస్ ప్రత్యేకత ఇదే! -
ఆ హీరోయిన్స్ను జిరాఫీలు అన్న అదితి రావ్.. ఎందుకంటే ?
Aditi Rao Hydari About Cannes Film Festival 2022 Debut Experience: తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవల మహా సముద్రం, హే సినామిక చిత్రాలతో అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో తళుక్కుమంది. బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్ మాధవన్, పూజా హెగ్డేతోపాటు అదితి పాల్గొంది. వేడుకలో భాగంగా ఐదో రోజు రెడ్ కార్పెట్పై రెడ్ అండ్ పింక్ గౌన్లో అందంగా నడిచి ఆకట్టుకుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అదితి రావ్ హైదరీ. 'నేను చాలా పొట్టిగా ఉంటాను. అందుకే కేన్స్ ఫెస్టివల్లో ఉన్న జిరాఫీలతో (మిగతా హీరోయిన్స్ తనకన్నా హైట్గా ఉంటారన్న ఉద్దేశ్యంతో) పోటీపడలేనని మాటల సందర్భంలో సబ్యసాచితో (డిజైనర్) చెప్పాను. నేను నటిని. పొట్టిగా ఉన్నప్పటికీ నాకు బాధ లేదు. ఎందుకంటే నాలాగా ఉండటానికి నేను ఎంతో సౌకర్యవంతంగా ఫీల్ అవుతాను. అందుకే ధైర్యం చేసి ఫెస్టివల్లో పాల్గొంటాను. నేను చాలా తెలివితక్కువ పని చేయబోతున్నాను. రెడ్ కార్పెట్పై నడిచేప్పుడు కచ్చితంగా ఏదో ఒక పొరపాటు చేస్తాను. అప్పుడు నన్ను అందరు విమర్శిస్తారు. అయినా పర్లేదు. అంతా మన మంచికే. దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు.' అని అదితి చెప్పుకొచ్చింది. అయితే రెడ్ కార్పెట్పై ఎలాంటి పొరపాటు లేకుండా హొయలు పోయింది అదితి రావ్ హైదరీ. చదవండి: లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ? View this post on Instagram A post shared by Vivo India (@vivo_india) View this post on Instagram A post shared by Vivo India (@vivo_india) -
లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ?
Aditi Rao Hydari Buys New Audi Q7 Car Worth 90 Lakhs: తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ దూసుకుపోతోంది బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవల తెలుగులో 'మహాసముద్రం' సినిమాతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ విలాసవంతమైన కారు కొనుగోలు చేసింది. ముంబైలో అత్యంత ఖరీదు చేసే 'ఆడి క్యూ 7' లగ్జరీ కారుకు యజమానురాలైంది అదితి. సుమారు ఈ కారు విలువ రూ. 90 లక్షలు ఉంటుంది. అదితి రావు ఈ కారు కొనుగోలు చేసినట్లుగా ఆడి కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పలు ఫొటోలతో పోస్ట్ చేసింది. కారుతో అదితి రావు దిగిన అందమైన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అదితి రావు హైదరీ 2007లో 'శృంగారం' అనే తమిళ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. సమ్మోహనం, వి, మహా సముద్రం, హై సినామిక, రాక్స్టార్, మర్డర్ 3, వజీర్, ది గర్ల్ ఆన్ ది ట్రైన్, పద్మావత్ వంటి తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. చదవండి: సమయం వృథా చేయాను.. అందుకే అప్పుడు ఏడ్చేశా: అదితీరావు View this post on Instagram A post shared by Audi Mumbai West (@audi_mumbaiwest) -
చీర కట్టుల్లో సమ్మోహనపరుస్తున్న అందాల అదితీ
అందం, అభినయంతో ప్రేక్షకులను సమ్మోహనపరుస్తున్న నటి అదితీరావు హైదరీ. స్క్రీన్ మీద ఎంచుకునే పాత్రల్లోనే కాదు.. అప్పియరెన్స్ కోసం అనుసరించే ఫ్యాషన్లోనూ వినూత్నమైన అభిరుచి ఆమెది! ఆ టేస్ట్కు అద్దం పట్టే బ్రాండ్సే ఇవీ.. ది హౌస్ ఆఫ్ ఎమ్బీజే .. ‘ది సింబల్ ఆఫ్ టైమ్లెస్’.. అనేది ఈ సంస్థ క్యాప్షన్. తగ్గట్టుగానే రాజుల కాలం నుంచి నేటి వరకూ ఉన్న ప్రతి డిజైన్లో ఆభరణాలు లభిస్తాయిక్కడ. 1897లో ప్రారంభమై, వంద సంవత్సరాలకు పైగా ఎన్నో అద్భుతమైన బంగారు, వెండి, వజ్రాభరణాలను వీరు అందిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు పెట్టింది పేరు. చాలా మంది సెలబ్రిటీస్ తమ పెళ్లిళ్లలో వీరి ఆభరణాల్లోనే మెరిశారు. ఇక్కడ ఏది కొనాలన్నా లక్షల నుంచి కోట్లు ఖర్చు చేయాల్సిందే. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: ది హౌస్ ఆఫ్ ఎమ్బీజే పునీత్ బలానా, సెలబ్రిటీస్ స్టైలిస్ట్, ధర: ఆభరణాల నాణ్యత, డిజైన్పై ఆధారపడి ఉంటుంది. పునీత్ బలానా .. ఇతని కలెక్షన్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. కారణం.. పునీత్ బలానా అంటే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్ పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. రాజస్థాన్లో పుట్టి, సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేసి, ఎన్నో అందమైన ఫ్యాషన్ డిజైన్స్ను అందించాడు. ఈ దుస్తులన్నీ ఎంత సంప్రదాయబద్ధంగా ఉంటాయో, అంతే మోడర్న్గానూ ఉంటాయి. అదే ఇతని బ్రాండ్ వాల్యూనూ పెంచింది. పునీత్ బలానా లేబుల్ సృష్టిని బాలీవుడ్ తారలు విద్యా బాలన్, కృతి సనన్, రవీనా టాండన్, అదితిరావ్ హైదరి వంటి ఎంతో మంది సెలబ్రిటీస్ కోరుకుంటారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది. చీర డిజైనర్: పునీత్ బలానా ధర: రూ. 45,000 - దీపిక కొండి చదవండి: World's loneliest whale: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..! -
సమయం వృథా చేయాను.. అందుకే అప్పుడు ఏడ్చేశా: అదితీరావు
‘‘నాకు చాలెంజింగ్ పాత్రలంటే చాలా ఇష్టం. ఆ విషయంలో మణిరత్నంగారు నా గురువు. నేను స్టార్లా సెట్కు రాను.. ఓ నటిగా వస్తాను. దర్శకులు చెప్పింది చేస్తాను. ‘మహాసముద్రం’లో మహా పాత్రకు ప్రాణం పోసేందుకు ప్రయత్నించాను’’ అని అదితీరావు హైదరీ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్, అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ ముఖ్య పాత్రల్లో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదితీరావు హైదరీ మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల క్రితం అజయ్ భూపతి నాకు ‘మహాసముద్రం’ స్క్రిప్ట్ను వినిపించారు. కథ బాగా నచ్చింది. నేను చేసిన మహా పాత్ర స్వీట్, హార్డ్ వర్కింగ్.. నిజాన్ని చెప్పే గుణం ఉంటుంది. నాకు ప్రేమకథలంటే చాలా ఇష్టం. సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఎదురుచూస్తుంటాను. అజయ్గారు ప్రేమకథ అని చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఈ సినిమా రెండు ట్రైలర్లు చూసినా స్టోరీని ఎవ్వరూ ఊహించలేకపోయారు. నేను హైదరాబాద్లో పుట్టాను. కానీ, పెరిగింది నార్త్లోనే. నాకు తెలుగు అంతగా రాదు. అయితే నాకు డైలాగ్స్ ఇచ్చి, అర్ధరాత్రి లేపి సీన్ నంబర్ చెబితే ఇట్టే చెబుతాను.. అంతలా బట్టీపట్టేస్తాను. ఎందుకంటే సెట్కు వచ్చినప్పడు మిగతా వాళ్ల సమయం వృథా చేయాలనుకోను. ఓసారి డైలాగ్ ప్రాక్టీస్ చేసేలోపు పిలవడంతో వెంటనే చెప్పలేకపోయాను.. అప్పుడు ఏడ్చేశాను. బయోపిక్స్లో నటించడం నాకు ఇష్టం. ఎంఎస్ సుబ్బలక్ష్మీ, రేఖగార్ల బయోపిక్ అయితే బాగుంటుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్–బృందా మాస్టర్తో ఓ చిత్రం చేస్తున్నాను. హిందీలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమాతో పాటు మరికొన్ని ఉన్నాయి’’ అన్నారు. -
'మహా సముద్రం' నుంచి రొమాంటిక్ మెలోడి సాంగ్
ప్రేమలో పడ్డప్పుడు కుదురుగా ఉండనివ్వని ఆలోచనలతో తికమకపడిపోతుంటారు ప్రేమికులు. అది ఆనందం తాలూకు తికమక. ‘మహాసముద్రం’ సినిమాలో రెండు జంటలు అలాంటి ఫీలింగ్తోనే ఓ పాట పాడుకున్నాయి. ఓ జంట శర్వానంద్, అనూ ఇమ్మాన్యుయేల్, మరో జంట సిద్ధార్థ్, అదితీ రావు హైదరీ. ఈ రెండు జంటలూ ‘తికమక..’ అంటూ పాడుకునే లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటకు కిట్టు వరప్రసాద్ సాహిత్యం అందించగా హరిచరణ్, నూతన్ మోహన్ పాడారు. అజయ్ భూపతి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. -
‘మహా సముద్రం’ మూవీ స్టిల్స్
-
Sardar Ka Grandson: ‘సర్దార్ కా గ్రాండ్సన్’ మూవీ రివ్యూ
పిల్లలు ఉన్న చోట పెద్దలు ఉండక తప్పదు. కాని ఆ పెద్దలకు ఒక బాల్యం ఉంటుంది. బతికిన ఒక ఊరు ఉంటుంది. ఏదో ఒక స్థలంతో, ఆవాసంతో బంధం ఉంటుంది. తమ చివరి రోజుల్లో వాటిని ఒకసారి చూసుకోవాలని వారికి ఉంటుంది. పిల్లలకు అది పట్టదు. కాని వారిని అర్థం చేసుకుంటే ఆ కోరిక నెరవేరుస్తే వారు పొందే ఆనందం చాలా విలువైనది. ‘సర్దార్ కా గ్రాండ్సన్’లో ఒక నానమ్మ చివరి సందర్శనను మనవడు నెరవేరుస్తాడు. ఆదివారం సినిమా పరిచయం. వృద్ధాప్యంలో జ్ఞాపకం పెద్ద ఊతంగా ఉంటుంది. గతం ఒక ఓదార్పుగా ఉంటుంది. ఎన్నో చేదు అనుభవాలు కూడా వాటిలో ఉంటాయి. కాని వాటి గాఢత, ఆ సందర్భాలను దాటి రావడం వల్ల పూర్తిగా తగ్గి, ఆ అనుభవాల పునఃసందర్శనకు కూడా శక్తి ఉంటుంది. ఇక మంచి జ్ఞాపకాలనైతే వెతుక్కుంటూ వెళ్లాలని ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్నవారి మనసుల్లో ఏం కోరిక ఉందో పిల్లలకు పెద్దగా పట్టదు. వారిని బాగా చూసుకుంటున్నాం కదా అనుకుంటారు. మహా అయితే పుణ్యక్షేత్రాలకు తీసుకువెళతారు. కాని ఇవాళ్టి వృద్ధులు ఒకప్పటి యవ్వనవంతులు, యువతీ యువకులు, భార్యాభర్తలు, ఉద్యోగులు, సంసారులు. వారి జీవనంతో పెనవేసుకున్న విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిలో కొన్నింటిని వారు ఆఖరిశ్వాస వరకూ పూర్తిగా అంటి పెట్టుకుని ఉంటారు. తాము పోయేలోపు ఆ ఫలానా స్థలాన్నో, వ్యక్తినో, ఊరినో తిరిగి చూడాలనుకుంటారు. ఆ కోరిక తీరిస్తే వారికి కలిగే ఆనందం అనంతం. ‘సర్దార్ కా గ్రాండ్’ ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన సినిమా. అమృత్సర్లో స్థిరపడిన శ్రీమంతురాలైన 90 ఏళ్ల వృద్ధురాలి కథ అది. ఆమె పిల్లలు బాగా స్థిరపడ్డారు. ఆమె కూడా ఇక హాయిగా చివరి శ్వాస తీసుకోవచ్చు. కాని ఆమె మనసులో ఒక కోరిక. తాను మరణించేలోపు తను ఇష్టపడి కట్టుకున్న ఇంటిని చూడాలనేది. అదేం పెద్ద కోరిక అనుకోవచ్చు. కాని ఆ ఇల్లు లాహోర్లో ఉంది. దేశ విభజన సమయంలో దానిని ఆమె విడిచి వచ్చేసింది. అక్కడ ఉండగా భర్తతో ఎంతో ఇష్టపడి ఆ ఇంటిని కట్టుకుంది. అందులోనే తొలి బిడ్డకు జన్మనిచ్చింది. అందులోనే నాటి అల్లర్లలో భర్త ప్రాణం విడిచాడు. ఆ ఇంటిని చూసుకోవాలని ఉంటుంది. కాని ఆమె ఆరోగ్యరీత్యా వేరే కారణాల రీత్యా ఎవరూ ఆ కోరికను మన్నించరు. కాని ఆమె మనవడు ఆమె కోరికను అర్థం చేసుకుంటాడు. దానిని నెరవేర్చాలనుకుంటాడు. అక్కడే సమస్య వస్తుంది. ఇంటినే కదిలించి అమృత్సర్లో ఉన్నవారు పాకిస్తాన్కు వెళ్లిరావడం పెద్ద సమస్య కాదు. కాని మనవడికి వీసా వస్తుంది కాని నానమ్మకు రాదు. దానికి కారణం గతంలో ఒక క్రికెట్ మేచ్లో ఆమె చేసిన అల్లరే కారణం. అందుకని మనవడు లాహోర్ వెళతాడు. ఏ ఇంటికైతే తన నానమ్మ రాలేదో ఆ ఇంటినే అమృత్సర్కు తీసుకువస్తాడు. అంటే దానిని పునాదులతో సహా పెకలించి ట్రక్కు మీద పెట్టి అమృత్సర్ తీసుకువస్తాడు. అయితే అదంత సులువు కాదు. దాని కోసం అతడు ఏమేమి తిప్పలు పడ్డాడనేది కథ. కొంచెం హాస్యం, కొంచెం సెంటిమెంట్తో సినిమా మొదటి పదిహేను నిమిషాలు స్లోగా ఉన్నా తర్వాత అందుకుంటుంది. నీనా గుప్తా సర్వమై ఈ సినిమా గత నెల విడుదలైంది. ఆశించినంత స్పందన రాలేదు. దానికి కారణం ఈ స్క్రిప్ట్ ఇంకా బాగుండొచ్చు. అయితే ఈ సినిమా ఒకసారి చూసేంతగా ఆకట్టుకోవడానికి కారణం వృద్ధురాలిగా నటించిన నీనా గుప్తా నటన. ఆమె మన మనసులోని భావాలను, నాటి అనుభవాల గాఢతను తెర మీద వ్యక్తం చేయడంలో గొప్ప నటన చూపించింది. ఈ సినిమా చూసినంత సేపు మన ఇంట్లో నానమ్మో, తాతయ్యో, ఇరువురో ఉంటే ‘మీకేం కావాలి... మీరేం చూడాలనుకుంటున్నారు... మీరెవరిని కలవాలనుకుంటున్నారు’ అని అడిగేలా ఉంటుంది. మిగిలిన పాత్రల్లో అర్జున్ కపూర్, రకుల్ప్రీత్ సింగ్ నటించారు. లాహోర్ ఫ్లాష్బ్యాక్లో జాన్ అబ్రహామ్, అదితి రావ్ హైదరీ మెప్పిస్తారు. జాన్ అబ్రహామ్ దీని నిర్మాత. -
‘మహా సముద్రం’ నుంచి ‘మహా’ లుక్ వచ్చేసింది
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’.యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 'లైట్ హౌస్ ఆఫ్ మహాసముద్రం' అంటూ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ లుక్ బయటపెట్టింది చిత్ర యూనిట్. తాజాగా మరో హీరోయిన్ అదితిరావు హైదరి పోస్టర్ని విడుదల చేసింది. ఇందులో ఆమె ‘మహా’అనే క్యారెక్టర్లో కనిపించనుంది. ఈ సినిమా కథ అంతా 'మహా' అనే అమ్మాయి చుట్టూ నడుస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే అదే నిజమే అని తెలిసిపోతుంది. అజయ్ భూపతి డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అనిల్ సుంకర దీన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. Meet #Maha....on her journey of #ImmeasurableLove 🤍#Mahasamudram @ImSharwanand @Actor_Siddharth @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @kishore_Atv @chaitanmusic @Cinemainmygenes @AKentsOfficial pic.twitter.com/tzxPCLemNs — Aditi Rao Hydari (@aditiraohydari) April 12, 2021 -
అందం.. అదితిరావు హైదరి సొంతం
టాలీవుడ్ టు బాలీవుడ్ .. అందంతోనూ, నటనతోనూ మెప్పిస్తున్న నటి అదితిరావు హైదరి. ఇటీవల టాప్ టు బాటమ్ బ్లాక్ ఔట్ఫిట్లో అభిమానుల మైండ్ బ్లాంక్ చేసేసింది. చెట్ల కలప నుంచి తీసిన గుజ్జుతో తయారైన టెన్సిల్ ఫ్యాబ్రిక్తో చూపులను చుట్టేసింది. ఈ డ్రెస్లో అద్భుతం అనిపించిన హైదరి ఆభరణాల జోలికి వెళ్లలేదు. వేళ్లకు రెండు బంగారు ఉంగరాలు, నలుపు రంగు హీల్స్ మాత్రమే ధరించింది. సహజసిద్దమైన స్కిన్ టోన్ మేకప్, దట్టమైన కనుబొమ్మల తీరు, వదిలేసిన హెయిర్ స్టైల్తో మెరిపించింది. ఈ ఫోటోపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ స్పందించాడు. స్టన్నింగ్ అంటూ కామెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
శర్వానంద్ సినిమాలో పాయల్ ‘స్పెషల్’..?
‘సీత’ సినిమాలో ‘బుల్లెట్టు మీదొచ్చె బుల్రెడ్డి.. రాజ్దూత్ మీదొచ్చె....’ అంటూ ఓ స్పెషల్ సాంగ్లో స్టెప్స్ వేశారు పాయల్ రాజ్పుత్. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘మహా సముద్రం’ అనే సినిమా తెరకెక్కుతోంది. అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్లో పాయల్ స్టెప్స్ వేస్తారని సమాచారం. పాయల్కి పెద్ద బ్రేక్ వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’కి అజయ్ భూపతే దర్శకుడు అనే సంగతి గుర్తుండే ఉంటుంది. త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్ను షూట్ చేయనున్నారట. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. -
ఆ లక్ష్యం నెరవేరింది
‘‘ఎవరైనా నన్ను ‘మీరు ప్యాన్ ఇండియన్ యాక్టర్’ అని అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నటిగా ప్రారంభం అయినప్పుడు ప్యాన్ ఇండియా యాక్టర్ అనిపించుకోవాలనే లక్ష్యంతో వచ్చాను’’ అన్నారు అదితీ రావ్ హైదరీ. ఈ విషయం గురించి అదితీ రావ్ మాట్లాడుతూ – ‘‘నటి కావాలని కలలు కన్నాను. అది నిజం చేసుకున్నాను. కొన్నేళ్లుగా నా అభిమాన దర్శకులందరితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ దర్శకులు తాము రాసుకున్న కథల్లో నేను సరిపోతాను అని నమ్మి నాకు ఆ పాత్రల్ని ఇవ్వడం చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. అలానే అన్ని భాషల్లోని ప్రేక్షకులు నన్ను ఆదరించారు. వాళ్ల హీరోయిన్ అనుకున్నారు. అందుకే అన్ని భాషల ప్రేక్షకుల్ని పలకరించడానికి సినిమాల ఎంపిక విషయంలో బ్యాలెన్సింగ్గా ఉంటాను’’ అన్నారు. ప్రస్తుతం అదితీ రావ్ తెలుగులో శర్వానంద్తో ‘మహాసముద్రం’, హిందీలో జాన్ అబ్రహాంతో ఓ సినిమా చేస్తున్నారు. -
'హే సినామిక' షూటింగ్ కంప్లీట్
'కౌన్ హో గయా' సినిమాలో చిన్న పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ తర్వాత 'లక్క్క్ష్మీ కళ్యాణం'తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ్లో స్టార్ హీరోలందరి సరసన నటించింది. అగ్ర నటులతో పాటు యంగ్ హీరోలతోనూ నటించింది. తాజాగా ఆమె 'హే సినామిక' చిత్రంలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో నటిస్తున్న విషయం తెలిసిందే. డ్యాన్స్ మాస్టర్ బృంద దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ చిత్రం షూటింగ్ డిసెంబర్ 26న ముగిసింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన చిత్రయూనిట్ సెట్స్లో తీసిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక జియో స్టూడియోస్ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిది. ప్రస్తుతం కాజల్ చేతిలో చిరంజీవి 'ఆచార్య', కమల్ హాసన్ 'భారతీయుడు 2' ఉండగా రెండు హారర్ చిత్రాలు సైతం ఒప్పుకున్నారు. ఏదేమైనా పెళ్లయ్యాక కాజల్ మరింత దూకుడుగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. (చదవండి: అందరికీ ఒక్కడే దేవుడు!) మరోవైపు ఈ మధ్యే ఫ్యాన్స్ 'కాజలిజం డే'ను క్రియేట్ చేసి నెట్టింట రచ్చరచ్చ చేశారు. దక్షిణాదిన ఓ హీరోయిన్ పేరిట ఇలా ఒక రోజు ఉండటం కాజల్కే చెల్లింది. అభిమానులు కురిపిస్తున్న ప్రేమకు చందమామ ఉబ్బితబ్బిబైంది. మరోవైపు ఇటీవలే కాజల్ మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్లో నెలకొల్పగా.. ఆ గౌరవం పొందిన తొలి సౌత్ హీరోయిన్గా కాజల్ రికార్డు నెలకొల్పింది. ఇక ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మిలిటరీ మ్యాన్గా కనిపించనున్నారు. ఇందులో దుల్కర్కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నారని సమాచారం. ఈ సినిమాను తెలుగు, మలయాళంలో తెరకెక్కించనున్నారు. ఒకవేళ పూజా హెగ్డే ఈ సినిమా కమిట్ అయితే ఆమె మాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. (చదవండి: నా రూట్ హారర్ రూట్: కాజల్) -
అవును... తప్పుకున్నాను
‘విజయ్ సేతుపతి నటిస్తున్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమాలో నేను నటించడం లేదు’ అని హీరోయిన్ అదితీ రావ్ హైదరీ తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కరోనా వల్ల భారతీయ చలన చిత్రపరిశ్రమతో సహా ప్రపంచ సినీ లోకమే గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్స్ను మొదలుపెట్టారు. షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్ట్లను పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇంకా ప్రారంభించని ప్రాజెక్ట్లు కూడా నా వల్ల ఆలస్యం కాకూడదనుకుంటున్నాను. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల నిర్మాత, సెవెన్ స్క్రీన్ స్టూడియోకు చెందిన లలిత్ కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి హీరోగా డిల్లీ ప్రసాద్ దర్శకత్వంలో రానున్న ‘తుగ్లక్ దర్బార్’ నుండి తప్పకుంటున్నాను. ఈ చిత్రబృందానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను చేయాల్సిన పాత్రను చేయబోతున్న రాశీ ఖన్నాకు ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు అదితీ రావ్ హైదరీ. -
విజయ్ సినిమా: ఫీమేల్ లీడ్ రోల్లో రాశీ
చెన్నై : గతేడాది వెంకీ మామ, ప్రతి రోజూ పండగే సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు నటి రాశీ ఖన్నా. ఆ తర్వాత ఏ ఏడాది(2020) నటించిన వరల్డ్ ఫేమస్ లవర్లో బాక్సాఫీస్ వద్ద బొల్తా పడటంలో రేస్లో కొంచెం వెనకప్పడారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ ప్రాజెక్టుపై సైన్ చేయలేదు. ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. అందేంటంటే.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘తుగ్లక్ స్టార్’. ఢిల్లీ ప్రసాద్ దీనాదయలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈ సినిమాలో అదితి రావ్ హైదరిని హీరోయిన్గా తీసుకున్నారు. తొలి షూటింగ్ అయ్యాక కరోనా లాక్డౌన్ రావడంతో సినిమాకు బ్రేక్ పడింది. దాంతో ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఇక తాజాగా అదితి స్థానంలో రాశీ ఖన్నా నటించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చదవండి:విజయ్ సేతుపతి కూమర్తెకు అత్యాచార బెదిరింపు ఈ మేరకు ట్విటర్లో చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్యూ 7 స్రీన్ స్టూడియో. తుగక్లక్ సర్కార్లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది.’ అని ట్వీట్ చేశారు. ఈ సినిమాలో రాశీ మార్వారీ అమ్మాయిగా నటించనున్నారు. ఇటీవల రాశీఖన్నాతో తొలి షూట్ చేయించారు. రాజకీయ నేపథ్యంలో సాగనుంది. డిసెంబర్ నాటికి పూర్తి చిత్రీకరణ జరిపేందుకు ఆలోచిస్తున్నారు. ఇక రాశీతోపాటు నటుడు పార్థిrబాన్, మంజిమా మోహన్, కరుణ కరన్, బాగవతి పెరుమాల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా ‘తుగ్లక్ సర్కార్’ వీరిద్దరి కలయికలో రూపొందుతున్న రెండో సినిమా. ఇంతకుముందు విజయ్తో కలిసి రాశీ ‘సంగ తమిజాన్’ అనే సినిమా చేశారు. చదవండి: రాశీ ఖన్నా నోట.. ‘ఉండిపోరాదే’ పాట.. Happy to announce that #RaashiKhanna is playing as female lead in @VijaySethuOffl 's #TughlaqDurbar 😊😊 Team #TughlaqDurbar welcomes you aboard @RaashiKhanna 💐💐@DDeenadayaln @Lalit_SevenScr @proyuvraaj pic.twitter.com/AR0aAcHZ0B — Seven Screen Studio (@7screenstudio) October 20, 2020 -
మహా సముద్రంలో..
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అదితీ రావ్ హైదరీ ఒక హీరోయిన్గా నటించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్ను ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించింది చిత్రబృందం. యాక్షన్ లవ్ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సుంకర రామబ్రహ్మం నిర్మాత. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మహాసముద్రంలో...
‘సమ్మోహనం, అంతరిక్షం, వి’ చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషించారు అదితీ రావ్ హైదరి. చేసే ప్రతి పాత్ర వినూత్నంగా ఉండాలనుకుంటారామె. ‘మహాసముద్రం’లో అలాంటి పాత్రకు అడగడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అదితి. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితీ రావ్ని కథానాయికగా తీసుకున్న విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ సినిమాలో నాది మంచి పాత్ర. మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు అదితీ రావ్ హైదరి. -
రంగు కాదు.. ప్రతిభ ముఖ్యం
‘‘సమాజంలో మనల్ని మన అందం చూసి కాదు.. మన ప్రతిభను చూసి గుర్తించాలి, గౌరవించాలి. అదే నేను నమ్ముతాను. అందుకే చర్మ సౌందర్య ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఇష్టపడను’’ అన్నారు అదితీ రావ్ హైదరీ. ఇలా అనడమే కాదు గతంలో కొన్నిసార్లు అలాంటి ఆఫర్స్ను తిరస్కరించారట కూడా. ఓ సంఘటన గురించి అదితీ రావ్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్ ప్రారంభంలో ఓ సౌందర్య ఉత్పత్తిని ప్రమోట్ చేసే అవకాశమొచ్చింది. నేను తిరస్కరించాను. నిజానికి ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు ఆ యాడ్ కెరీర్కి ఉపయోగపడుతుంది. అయినా అందం ప్రాధాన్యం అని చెబుతూ నటించడం నాకిష్టం లేదు. కానీ ఆ ఉత్పత్తిదారులు నన్ను ఒప్పించాలని చాలా ప్రయత్నించారు. ఏం చేయాలో తెలీక ఇలాంటివి చేస్తే మా అమ్మమ్మకు నచ్చదని చెప్పాను. రంగు, కులం, మతం వంటివాటికి ప్రాధాన్యం ఇచ్చి, మనుషులను అంచనా వేయడం అలవాటు లేని కుటుంబం నుంచి వచ్చినదాన్ని నేను. ఇక తెల్లగా మారాలనుకుంటున్నారా? అనే యాడ్లో ఎందుకు నటిస్తాను? కేవలం తెల్లగా ఉన్నవాళ్లనే ఈ సమాజం గౌరవిస్తుంది, బాగా చూస్తుందనే ఆలోచనతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. తెల్లగా మారడానికి ఏం చేయాలా? అని ఆలోచిస్తారు. అలాంటివాళ్లకు నేను చెప్పేదేంటంటే.. రంగు ముఖ్యం కాదు.. టాలెంట్ ముఖ్యం. అందం కొలమానం కాకూడదు. అది కేవలం జీన్స్ మాత్రమే’’ అన్నారు. -
‘వి’ తర్వాత అభిమానులు పెరుగుతారనుకుంటున్నా!
నాని, సుధీర్బాబు, అదితీ రావు హైదరీ, నివేధా థామస్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శనివారం అమెజాన్ ప్రైమ్లో విడుదల కానున్న సందర్భంగా నాని చెప్పిన విశేషాలు. ► కొత్త కంటñ ంట్తో వచ్చే సినిమా చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ టైమ్లో ‘వి’ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం రావటం అదృçష్టంగానే భావించాలి. ఇంత మంచి సినిమాని థియేటర్లో చూస్తే బావుండేదే అనిపిస్తుంది. కానీ, తప్పదు. ఓటీటీ ఓ కొత్త ఎక్స్పీరియన్స్. నా ప్రతి సినిమాని ప్రసాద్ ఐమ్యాక్స్లో ఉదయం 8.45 షోను కర్టెన్ పక్కన నిలబడి చూసేవాణ్ణి. అది మిస్ కాకూడదని థియేటర్ ఫీలింగ్ కోసం మా ఫ్యామిలీకి ఓ షో వేస్తున్నాను. ► ఇంద్రగంటిగారితో నా ఫస్ట్ సినిమా ‘అష్టా చమ్మా’ చేశాను. ఈ పన్నెండేళ్లలో నేను, ఆయన వ్యక్తిగతంగా కొంచెం కూడా మారలేదు. కానీ వృత్తిపర ంగా దర్శకునిగా ఇంద్రగంటిగారు, నటునిగా నేను, కెమెరామేన్గా విందా చాలా గొప్పగా ఎదిగాం అనిపించింది. ఈ ‘వి’ సినిమాకి హీరో ఇంద్రగంటిగారే. మా ‘అష్టా చమ్మా’ రిలీజ్ రోజునే ఈ సినిమా కూడా విడుదలవ్వటం అనుకోకుండా జరుగుతోంది. ► ‘వి’ సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత వస్తాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందనుకుంటున్నా (న వ్వుతూ). ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు బ్యాడ్బాయ్స్నే ఇష్టపడుతున్నారు. కావాలంటే చూడండి రానా, సోనూ సూద్లకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ‘వి’ కథ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. చాలామంది చివరికి వచ్చేసరికి నాని హీరో అవుతాడు, సుధీర్ విలనవుతాడని రాస్తున్నారు. అసలు అలాంటిదేం లేదు. లైఫ్ అంతా సాఫీగా నడుస్తోన్న ఒక సెలబ్రిటీ పోలీస్ లైఫ్లోకి ఒకడొచ్చాడు. ఇంతే సినిమా. సినిమా చూసిన ప్రేక్షకులు ఆ పాత్రలకు కనెక్ట్ అయి చిన్న ఎమోషన్ ఫీలవుతారు. ► ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను ఇలా (ఓటీటీలో) విడుదల చేస్తున్నందుకు ‘దిల్’ రాజుగారు చాలామందికి సమాధానం చెప్పాలి. ఆయన కూడా ఓ డిస్ట్రిబ్యూటర్. రాజుగారూ.. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీతో పాటు మేమున్నాం అని నావైపు నుండి పూర్తిగా సపోర్ట్ చేశాను. నిర్మాతకు నష్టం రాకుండా చూసుకోవటం మన బాధ్యత. ► లాక్డౌన్ ముందు రాజమండ్రిలో 20 రోజులు, పళనిలో 15 రోజులు షూటింగ్ చేశాను. షూటింగ్ చేసొచ్చిన ప్రతిసారీ మా అబ్బాయి జున్ను కొత్తగా కనిపిస్తుంటాడు. త్వరగా పెరిగిపోతున్నాడే, ఇలాంటి క్యూట్ ఏజ్ను మిస్ అవుతున్నానే అనుకునేవాణ్ణి. ఈ లాక్డౌన్లో 24 గంటలూ వాడితో టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ► నటులందరూ బాధ్యతగా ఉండి నిర్మాతకు డబ్బు రాకపోతే అసలు రూపాయి కూడా తీసుకోకుండా పని చేయొచ్చు. అంతేకానీ ఒక్కో నటునికి 20 శాతం, 30 శాతం కట్ చేయాలని చాంబర్ రూల్ పెట్టిందని కాకుండా ఎవరికి వారు తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. అంతేకానీ ఈ సమస్యను జనరలైజ్ చెయ్యకూడదు. ► ‘టక్ జగదీష్’ సినిమా 50 శాతం పూర్తయింది. అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ‘శ్యామ్సింగరాయ్’ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘టక్ జగదీష్’ పూర్తవ్వగానే అది మొదలవుతుంది. మరో రెండు కథలు ఓకే చేశాను. ఒకటి కొత్త దర్శకుడు, మరోటి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్తో చేస్తాను. ► జనరల్గా నేను ఫిట్నెస్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టను కాబట్టి ఇప్పుడొచ్చిన గ్యాప్లో ఫుల్గా ఫిట్నెస్ పెంచుకుని సిక్స్ప్యాక్ చేద్దామనుకున్నాను. అలాగే పియానో నేర్చుకుందామనుకున్నాను. మా అమ్మ దగ్గర వంట నేర్చుకుందామనుకున్నాను. కానీ ఏమీ చేయలేదు. తినడం.. పడుకోవటం.. మా జున్నుతో ఆడుకోవటంతోనే ఆరు నెలలు గడిచిపోయాయి. -
సస్పెన్స్కు తెరదించిన హీరో నాని
సాక్షి, హైదరాబాద్: ‘‘అదిరింది.. అయ్యో అయిపోయింది. అయితేనేం మళ్లీ మళ్లీ చూస్తా. థియేటరే మీ ఇంటికి వచ్చేస్తుంది’’ అంటూ ఫ్యాన్స్ను టీజ్ చేసిన నేచురల్ స్టార్ నానీ ఎట్టకేలకు ‘వి’మూవీ విడుదలకు సంబంధించిన సస్పెన్స్కు తెరదించాడు. ‘‘వి’ ఇంటికి వచ్చేస్తుంది’’ అని ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సెప్టెంబరు 5 నుంచి అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం స్ట్రీమ్ కానున్నట్లు తాజాగా ట్వీట్ చేశాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 25వ చిత్రం ఇలా విడుదల కావడం కూడా గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయేలా సెలబ్రేట్ చేసుకుందామంటూ అభిమానులను ఉద్దేశించి ఓ లేఖను షేర్ చేశాడు. (మళ్లీ జంటగా కనిపిస్తారా? ) ‘‘గత 12 ఏళ్లుగా నా కోసం మీరు థియేటర్కు వచ్చారు. ఇప్పుడు నేను మీ కోసం, మీ ధన్యవాదాలు చెప్పేందుకు ఇంటికే వస్తున్నాను! మీ స్పందన తెలుసుకోవాలనే ఉత్సుకతతో పాటు.. సినిమా రిలీజ్ విషయంలో కొంచెం నెర్వస్గానూ అనిపిస్తోంది. థియేటర్లు తెరచుకోగానే టక్ జగదీశ్తో సిద్ధంగా ఉంటా. ఒట్టు’’అంటూ ‘వి’ సినిమాను ఆదరించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. ఇక హీరోయిన్ నివేదా థామస్ సైతం.. ‘సెప్టెంబరు 5 నుంచి వేట మొదలు’ అని మూవీ అప్డేట్ను షేర్ చేశారు. కాగా విలక్షణ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని‘దిల్’ రాజు నిర్మించారు. అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ కథానియకలుగా నటించిన ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా దాదాపు 35 కోట్ల వ్యయంతో ఈ సినిమా రూపొందినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక కరోనా లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో పలు చిన్న సినిమాలు ఇప్పటికే ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో కొన్ని భారీ చిత్రాలు కూడా ఓటీటీలో సందడి చేశాయి. అయితే దక్షిణాదిలో ఇంత బడ్జెట్తో రూపొంది, ఓటీటీలో విడుదలవుతున్నతొలి భారీ ‘వి’నే కావడం విశేషం. V is coming home ❤️ September 5th.. The Hunt is On!@PrimeVideoIN #VOnPrime pic.twitter.com/28Lpb21RuE — Nani (@NameisNani) August 20, 2020 -
మళ్లీ జంటగా కనిపిస్తారా?
నాని, అదితీ రావ్ హైదరీ ‘వి’ సినిమాలో కలసి నటించారు. తాజాగా మరోసారి జోడీ కట్టనున్నట్టు సమాచారం. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృతియాన్ దర్శకత్వంలో నాని ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసందే. ‘శ్యామ్ సింగ రాయ్’ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మించనుంది. ఇందులో నానీకి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. అలానే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉన్నారని తెలిసింది. ఆ పాత్రకు అదితీ రావ్ హైదరీని తీసుకున్నట్టు సమాచారం. దీంతో రెండోసారి నాని, అదితీని జంటగా చూడొచ్చన్నమాట. ‘ఎంసీఏ’ తర్వాత ఈ సినిమా కోసం సాయి పల్లవి, నాని కూడా మళ్లీ కలసి నటించనున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టులో ప్రారంభించి, డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కరోనా వల్ల ప్లాన్ మొత్తం మారింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా ప్రకటించలేదు. -
మహాసముద్రంలో ఆ ముగ్గురు
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సంచలన విజయం సాధించారు దర్శకుడు అజయ్ భూపతి. ఆ చిత్రం తర్వాత ‘మహాసముద్రం’ అనే కథను తయారు చేసుకున్నారాయన. కథరీత్యా ఇందులో ఇద్దరు హీరోలు నటించాల్సి ఉంటుంది. కథ విని ఇద్దరు ప్రముఖ హీరోలు ఈ కథకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా షికారు చేశాయి. కారణమేదైనా ఆ హీరోలిద్దరూ ఈ సినిమా చేయడంలేదట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లోకి హీరోలుగా శర్వానంద్, సిద్ధార్థ్ వచ్చారని సమాచారం. హీరోయిన్గా అదితీ రావ్ హైదరీని ఎంపిక చేశారని తెలిసింది. -
టాలీవుడ్లో కొత్త జోడి.. సాయి కాదు అదితి
‘అర్ఎక్స్100’తో సూపర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. తాజాగా ఆయన ఇద్దరు కథా నాయకులతో ‘మహా సముద్రం’ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించబోతున్నారు. ‘బొమ్మరిల్లు’తో తన కంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్న సిద్ధార్థ్ పలు చిత్రాల్లో నటించిన అనంతరం తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. అయితే చాలా కాలం తర్వాత అజయ్ భూపతి చిత్రంతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన హీరోయిన్ అదితిరావు హైదరీని చిత్రబృందం ఎంపిక చేసింది. దీంతో తెలుగు తెరపై మరొ కొత్త జోడి సందడి చేయనుందని సినీ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇందులో ఒకే హీరోయిన్కు అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలుత సాయిపల్లవిని తీసుకోవాలని భావించినప్పటికీ చివరికి అదితి వైపే చిత్రబృందం మొగ్గు చూపింది. ఇక అదితి సుధీర్బాబు హీరోగా వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో నటన పరంగా అదితికి మంచి మార్కులే పడినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగారాలేదు. ఇక ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. చదవండి: ‘అసలు మీరెవరు.. మమ్మల్ని అడగడానికి?’ ఆ అకౌంట్ నాది కాదు.. స్వాతి క్లారిటీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గొప్పగా నటించమని వేడుకుంటా: మణిరత్నం
ప్రముఖ దర్శకుడు మణిరత్నం మొదటిసారిగా సోషల్ మీడియా లైవ్చాట్లోకి వచ్చారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో ఆసక్తి కనబరచని ఆయన తన భార్య, నటి సుహాసిని నిర్వహించిన లైవ్చాట్లో మొదటిసారిగా పాల్గొన్నారు. అంతేగాక సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండే ఆయన ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకోవడమే కాకుండా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ లైవ్లో హీరో మాధవన్, నటి ఖుష్భు, అదితిరావ్ హైదరిలతో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలో ‘మాధవన్ నువ్వు మణిరత్నం(ఆయన)కు గోల్ఫ్ ఆటను పరిచయం చేయడం ద్వారా ఆయన జీవితం మారిపోయింది’ అని సుహాసిని అన్నారు. అయితే ‘ఆటలో నన్ను ఓడించమని రత్నం సార్కు సవాలు విసిరాను.. కానీ ఆయన నాపై చెత్తను విసిరారు’ అంటూ చమత్కరించాడు. (నిర్మాతను టెన్షన్ పెడుతున్న హీరోయిన్) అంతేగాక మణిరత్నం నిర్మించిన మాధవన్ ‘అలైపాయుతే’ సినిమాలోని ఓ రైలు సన్నివేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ.. ‘సన్నివేశం చిత్రీకరించడానికి ఆ సమయంలో రెండు రైళ్లు ఉన్నప్పటికీ.. నాకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో చిత్రీకరణపై ఆందోళన చెందాను’ అని చెప్పుకొచ్చారు. ఇక మధ్యలో నటి అను హాసన్ కలుగజేసుకుని మణిరత్నంపై రాపిడ్ఫైర్ ప్రశ్నలను సందించారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్లో ఉన్న మీరు భార్య నుంచి ఎలా తప్పించుకుంటున్నారని అడగ్గా.. ‘లాక్డౌన్లో నేను నిశ్శబ్ధాన్ని పాటించడం నేర్చుకున్న’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. ఇక ప్రముఖ నటి పూనం ధిల్లాన్... ‘పాత్రల ఎంపికలో ఏలా ఉంటారు. అసాధారణమైన నటులను ఎన్నుకుంటారా లేక సాధారణ నటులను అసాధారణమైన వారిగా మార్చుకుంటారా’ అని అడిగారు. ‘నా నటీనటులను బాగా నటించమని వేడుకుంటాను’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. (‘కరోనా’ సందేశం.. పవన్, బన్నీ మిస్) View this post on Instagram Good evening. Hope u enjoyed the live sessions last 21 days. It was time to say good bye. But we had an amazing evening. Hope you all liked what was planned and what was spontaneous. Give us your feed. Especially those whose videos were played A post shared by Suhasini Hasan (@suhasinihasan) on Apr 14, 2020 at 9:08am PDT ఇక అదితి రావు హైదరి.. పాత్రలకు సరైన నటులను ఎలా అడగ్గా.. తనని కాస్తా ఇబ్బందికి గురి చేసే నటుల కోసమే నేను ఎప్పుడూ వెతుకుతానని చెప్పాడు. “ఇది కూడా ఓ మంచి అనుభూతి. ఎవరైనా మొదటి ఎంపికతోనే ఎల్లప్పుడూ ముగించ కూడదు. నిజానికి సరైనా ఎంపిక.. మనం చేసే సగం పనిని పూర్తి చేస్తుంది. అయితే నేను ఏది చెబితే అది మాత్రమే చేసే వారిని వెతకను. దానితో పాటు అదనంగా ఎదైన కొత్తగా చేయాలి’’ అని చెప్పారు. ఇక ఓటీటీ(ఓవర్ దీ టాప్) వంటి ప్లాట్ఫాంల కోసం సినిమా చేయడానికి లేదా చూపించడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదని అభిమానులు అడిగిన ప్రశ్నకు.. “నేను 20 సంవత్సరాలుగా టెన్నిస్ ఆడుతున్నాను. ఇప్పు నన్ను మీరు ఫుట్బాల్ ఆడమని అడిగితే ఆడలేను. అంతేగాక ఆ ఆటకు న్యాయం కూడా చేయలేను ” అంటు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కాగా ప్రముఖ తమిళ ఇతిహాస నవల ఆధారంగా ఆయన తెరకెక్కించబోయే ‘పొన్నీన్ సెల్వన్’ను సీరిస్లుగా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక సినిమాల్లో మీరు ఎప్పుడైనా నటించాలనుకుంటున్నారా అని ఓ అభిమాని అడిగ్గా... ఇదే ప్రశ్నను ఇది వరకే రజనీకాంత్ కుమార్తె ఆయనను అడిగినట్లు సుహాసిని చెప్పారు. దానికి ఆయన చేయనని వెంటనే సమాధానం ఇచ్చారని కూడా ఆమె తెలిపారు. (బగ్గా వైన్ షాప్ పేరుతో ఆన్లైన్లో మోసం) -
మనసు మాట వినండి
ప్రతి ఒక్కరిలోనూ బలాలు, బలహీనతలు ఉంటాయి. తనలో ఉన్న ఓ బలహీనత తాను సెన్సిటివ్గా ఉండటమే అని అంటున్నారు హీరోయిన్ అదితీ రావ్ హైదరీ. ఈ విషయం గురించి ఆమె చెబుతూ – ‘‘నేను చాలా సున్నితమనస్కురాలిని. కొన్ని విధాలుగా ఇది నాకు ఉపయోగం. కానీ కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి మనస్తత్వం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. త్వరగా హర్ట్ అవుతాను. ఫీల్ అయిన విషయం నా ముఖం మీద కనిపించేస్తుంది. అలా నా ఫీలింగ్స్ని బయటపెట్టకూడదని ఫిక్స్ అయ్యాను. అలా ఉండగలనో లేదో చూడాలి’’ అన్నారు. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే మీరు ఎవరి మీద ఆధారపడతారు? అనే ప్రశ్నకు – ‘‘జనరల్గా మనం మన మనసు చెప్పే మాటను వినాలి. మనసు చెప్పినది ఎంత కష్టమైనా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నమ్మకంతో ముందుకెళ్లాలి ’’ అని పేర్కొన్నారు అదితీ రావ్. -
విడుదల వాయిదా
తన 25వ చిత్రాన్ని ఈ నెల 25న ఆడియన్స్కు చూపించాలనుకున్నారు నాని. అయితే ప్లాన్ మారింది. కరోనా వైరస్ కారణంగా ‘వి’ చిత్రం విడుదల వాయిదా పడింది. నాని, సుధీర్బాబు, అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించారు. ఇది నాని కెరీర్లో 25వ సినిమా. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు నాని. ఉగాది రోజున ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను ఏప్రిల్కు వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మార్చిలో కరోనాను చంపేద్దాం. ఏప్రిల్ నెలలో ఉగాదిని జరుపుకుందాం’’ అని ట్వీట్ చేశారు నాని. -
హే సినామికా
సీనియర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ బృందా దర్శకురాలిగా మారారు. ఆమె దర్శకత్వం వహించనున్న సినిమా ముహూర్తం గురువారం జరిగింది. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో బృందా దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ చిత్రం ‘హే సినామికా’. రొమాంటిక్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా జియో స్టూడియోస్ సంస్థ కోలీవుడ్లో అడుగుపెడుతోంది. ‘హే సినామికా’ టైటిల్ను మణిరత్నం – దుల్కర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం)లో ‘హే సినామికా...’ పాట నుంచి తీసుకున్నారట. -
డైరెక్టర్గా మారిన ప్రముఖ కొరియోగాఫ్రర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకురాలిగా మారారు. పలు హిట్ సాంగ్స్కు కొరియోగ్రాఫర్గా వ్యవహరించిన బృందా దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీ రావ్ హైదరీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘హే సినామిక’ చిత్రానికి ఆమె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ గురువారం చెన్నైలో ప్రారంభమైంది. తొలి షాట్కు మణిరత్నం, కె భాగ్యరాజ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి సుహాసిని, కుష్బూలతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు.. బృందాకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా బృందాకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం టైటిల్ను మణిరత్నం ఒకే కన్మణి(ఒకే బంగారం) సినిమాలోని హే సినామిక పాట పల్లవి నుంచి తీసుకున్నారు. ఈ చిత్రం ప్రారంభానికి సంబంధించిన ఫొటోలను దుల్కర్, అదితీలు ట్విటర్లో షేర్ చేశారు. -
ఒక్క ఫ్లాప్తో విలువ తగ్గిపోదు
‘‘ఒక్క అపజయంతో ఏ యాక్టర్ విలువ తగ్గిపోదు’’ అంటున్నారు అదితీ రావ్ హైదరీ. మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘చెలియా’తో దక్షిణాదిన పాపులర్ అయిన అదితీ తెలుగులో ‘సమ్మోహనం’ చిత్రం చేశారు. మూడు నాలుగు రోజులుగా సమంతతో అదితీని ముడిపెట్టి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఓ సినిమా (‘మహాసముద్రం’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది) ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సమంతను కథానాయికగా తీసుకోవాలనుకున్నారని ప్రచారమైంది. అయితే ఇటీవల విడుదలైన తమిళ ‘96’ తెలుగు రీమేక్ ‘జాను’ ఆశించిన ఫలితం సాధించకపోవడంతో అజయ్ భూపతి తన మనసు మార్చుకుని, కథానాయికగా అదితీ రావ్ హైదరీని తీసుకోవాలనుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ఈ వార్త గురించి అదితీ తన ట్వీటర్ ద్వారా స్పందించారు. ‘‘ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది. అందుకే చెబుతున్నా. ఒక్క ఫ్లాప్ వల్ల ఏ యాక్టర్ విలువ తగ్గిపోదు. దయచేసి ఇలాంటి ఆలోచనలను మనం ప్రోత్సహించవద్దు. అలాగే సినిమాకి సంబంధించిన ప్రకటనను చేసే అవకాశం డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్కి ఇవ్వాలి. వాళ్లను గౌరవించాలి’’ అని పేర్కొన్న అదితీ.. ఈ సినిమా గురించి తనను సంప్రదించారా? లేదా? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. -
లాక్మే ఫ్యాషన్ వీక్లో మెరిసిన బాలీవుడ్ భామలు
-
ఆయన దర్శకత్వంలో నటిస్తా!
సినిమా: నటుడు ధనుష్ దర్శకత్వంలో నటించడం ఖాయం అంటోంది నటి అదితిరావ్. మణిరత్నం చిత్రాలతో పాపులర్ అయిన నటి ఈ భామ. కార్తీ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన కాట్రు వెలియిడై చిత్రంలో నటించిన అదితిరావ్ తాజాగా ఆయన దర్శకత్వంలోనే పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా తుగ్లక్ దర్బార్ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఇక హిందీ, తెలుగు, మలయాళం భాషల్లోనూ ఒక్కో చిత్రం చేస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడు ఉదయనిది స్టాలిన్కు జంటగా నటించిన సైకో చి త్రం ఇటీవల తెరపైకి వచ్చింది. కాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించే చిత్రంలో అదితిరావ్ హీరోయిన్గా నటించనుందనే ప్రచారం 2018లోనే జరిగింది. అయి తే ఆ చిత్రం ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. ఈ మధ్యలో ధనుష్ అసురన్, పటాస్ చిత్రాల్లో నటించేశారు. ప్రస్తుతం సురళి, కర్ణన్ చిత్రాలతో పాటు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో అంతకు ముందు స్వీయ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రకటించిన చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అదితిరావ్ పేర్కొంటూ తాను ధనుష్ దర్శకత్వంలో కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అది జరిగి తీరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. అంత నమ్మకం ఏమిటమ్మా అన్న ప్రశ్నకు తన మనసు చెబుతోందని, అది ఎప్పు డూ సరిగానే చెబుతుందని అంది. ధనుష్ నటుడు మాత్రమే కాకుండా దర్శకుడు కూడా కా వడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. నటుడు ధనుష్ ప్రతిభావంతుడైన దర్శకుడని, తన నటించడంతో పాటు ఇతరుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో దిట్ట అని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేసింది. ఈ అమ్మడు ఎందుకిలా ధనుష్ను పొగుడుతుందో అర్థంకాక నెటిజన్లు అందుకు కారణాలను వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అదితిరావ్ ప్రస్తుతం విజ య్సేతుపతికి జంటగా నటిస్తున్న తుగ్లక్ దర్బార్ చిత్రంపై చాలా నమ్మకాలు పెట్టుకుందట. ఎందుకంటే మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న పొన్నియన్ సెల్వన్ విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. అది భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చారిత్రక కథా చిత్రం కాబట్టి. ఈ రెండూ మినహా కోలీవుడ్లో ఈ జాణకు అవకాశాలు లేవు. విజయ్సేతుపతితో నటిస్తున్న తుగ్లక్ దర్బార్ విడుదలైతే మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది. -
పవర్ఫుల్ ఆఫీసర్
నువ్వా? నేనా? అని పోటీపడ్డారు నాని, సుధీర్బాబు. నాని నేచురల్ స్టార్ అని ఎప్పుడో అనిపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సుధీర్బాబు కూడా ఒక్కో సినిమాకి నిరూపించుకుంటూ మంచి నటుడు అనిపించుకున్నారు. ఈ ఇద్దరూ నువ్వా? నేనా? అంటూ ‘వి’ సినిమాలో పోటీపడి నటించారు. నానీతో ‘అష్టా చమ్మా, జెంటిల్మేన్’ వంటి హిట్ చిత్రాలను, సుధీర్బాబుతో ‘సమ్మోహనం’ వంటి హిట్ చిత్రాన్ని తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. నాని ఓ డిఫరెంట్ రోల్లో.. ఆ పాత్రకు దీటుగా ఉండే పవర్ఫుల్ ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్బాబు నటించారు. సోమవారం సుధీర్ లుక్ని విడుదల చేశారు. ‘‘భారీ బడ్జెట్తో ఈ యాక్షన్ థ్రిల్లర్ని రూపొందించాం. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ఉగాది సందర్భంగా మార్చి 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: అమిత్ త్రివేది, కెమెరా: పి.జి.విందా. -
విగాదికి కలుద్దాం
హీరో నాని ఉగాది వేడుకలు ‘వి’సెట్లో జరిగాయి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్బాబు నటించిన చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీరావు హైదరి కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో సుధీర్ బాబు నటించగా, నాని విలన్ పాత్ర చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కెరీర్లో తొలిసారి నాని విలన్ పాత్ర పోషిస్తున్న చిత్రం ఇది. ‘‘సంక్రాంతి రోజున ముగిస్తున్నాము. ఉగాది రోజు మొదలెడదాము’’ అని పేర్కొన్నారు నాని. ‘‘వి’ చిత్రీకరణ ముగిసింది. ఓ మంచి భావోద్వేగంతో కూడిన ప్రయాణం ముగిసింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరు బాగా కష్టపడ్డారు. ఉగాదికి కౌంట్డౌన్ మొదలైంది. అతి త్వరలో ఫస్ట్లుక్ను విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘వి’ చిత్రం ఉగాది సందర్భంగా ఈ ఏడాది మే 25న విడుదల కానుంది. -
వాళ్లంటే జాలి
‘‘విమర్శలకు దూరంగా పారిపోలేం. ఎలాంటి విమర్శని అయినా పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తులను విమర్శించేవాళ్లు ఏదో సమస్యతో బాధ పడుతున్నారని నా అభిప్రాయం’’ అన్నారు అదితీ రావ్ హైదరీ. సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి అదితీ మాట్లాడుతూ – ‘‘విమర్శించేవాళ్లకు ఏదో విషయంలో కోపం అయినా ఉండి ఉండాలి. లేకపోతే వాళ్ల జీవితం పట్ల వాళ్లకు ఏదైనా బాధ అయినా ఉండి ఉండాలి. ఆ కోపాన్ని సోషల్ మీడియాలో చేసే విమర్శల ద్వారా తీర్చుకుంటున్నారనుకుంటున్నాను. వాళ్ల విషయంలో మనం ఒక్కటే చేయగలం అని నా ఫీలింగ్.. అదేంటంటే జాలి చూపించడం. అలాగే వాళ్లు బాగుండాలని కోరుకోవాలి. ఒక్కోసారి నేను వాళ్లకు ‘మీకు ఈరోజు బాగుండాలని కోరుకుంటున్నాను’ అని రాసి పంపిస్తుంటాను. వాళ్ల మంచి కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ల కోపం వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది’’ అన్నారు. ఆమె నటించిన హిందీ థ్రిల్లర్ ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’ వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కానుంది. ‘పద్మావత్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అదితీ తెలుగులో ‘చెలియా’, ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో కనిపించారు. -
ఈ ఉగాదికి హింసే!
‘‘ఈ క్షణం నుంచి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అన్నాడు షేక్స్పియర్. అదే నేనూ అంటున్నాను. శత్రువులందరూ జాగ్రత్తగా ఉండండి’’ అంటున్నారు నాని. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్బాబు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘వి’. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘వయొలెన్స్ (హింస) కావాలన్నారుగా. ఇస్తాను. ఉగాదికి సాలిడ్గా ఇస్తాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు నాని. ఈ సినిమాలో సుధీర్బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో, నాని విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇది నాని 25వ చిత్రం కూడా కావడం విశేషం. ఈ సినిమాకు సంగీతం: అమిత్ త్రివేది. -
మనాలీ పోదాం
ఫైట్ కోసం మనాలీలో మకాం వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ‘వి’ టీమ్. సుధీర్బాబు, నాని ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అదితీరావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో పోలీసాఫీర్ పాత్రలో సుధీర్బాబు, విలన్ పాత్రలో నాని నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్, థాయ్ల్యాండ్ లొకేషన్స్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ముఖ్యంగా యాక్షన్ బ్యాక్డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాతి షెడ్యూల్ మనాలీలో జరగనుంది. అక్కడ కూడా ఓ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. -
అలా పెళ్లి చేసుకోవాలని ఉంది
పెళ్లి విషయాల్లో అమ్మాయిలకు ఎన్నో కలలుంటాయి. ‘రెక్కల గుర్రం మీద రాకుమారుడు రావాలి, ఊరంతా చెప్పుకునేలా పెళ్లి జరగాలి’ అని ఎవరి కలలు వాళ్లవి. మరి మీ డ్రీమ్ వెడ్డింగ్ ఏంటి? అనే ప్రశ్నను అదితీరావ్ హైదరీని అడిగితే ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘‘నా పెళ్లిలో నేను అచ్చు రాజారవివర్మ బొమ్మను తలపించేలా ఉండాలి. మా అమ్మగారి వివాహం జరిగినప్పుడు ఆమె మేకప్ లేకుండా సింపుల్గా ఉన్నారు. నేనూ అలానే ఉంటాను. నా పెళ్లి బీచ్ ఒడ్డున ఉండే రాజుల నాటి భారీ కోటలో జరగాలి. పెళ్లికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాక చెప్పులు తీసేసి బీచ్లో పరిగెడతాను. రాత్రంతా డ్యాన్స్ చేస్తూనే ఉంటాను. నేను చెప్పేవన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేకపోవచ్చు. కానీ నేనంతే. నా ఆలోచనలన్నీ ఒకేలా ఉండవు’’ అన్నారు. ఇదిలా ఉంటే అదితీరావ్కి ఆల్రెడీ పెళ్లయింది. కానీ భర్త నుంచి విడిపోయారామె. -
సూఫీ సుజాత
అదితీరావ్ హైదరీ తన యాక్టింగ్ కెరీర్ను మలయాళం సినిమాతోనే మొదలుపెట్టారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటిస్తూ పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా ‘పద్మావత్’ ఆమెకు బ్రేక్ తెచ్చిందని చెప్పాలి. అలాగే మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘చెలియా’, ‘నవాబ్’ చిత్రాలూ మంచి పేరు తెచ్చాయి. ఒకవైపు హిందీ సినిమాల్లో నటిస్తూనే తెలుగు, తమిళ సినిమాలూ చేస్తున్నారు. పదమూడేళ్ల తర్వాత ఓ మలయాళ సినిమాలో నటించబోతున్నారు అదితీ. 2006లో మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘ప్రజాపతి’ సినిమా ద్వారా మలయాళ తెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు అదితీ. మళ్లీ 13 ఏళ్లకు నరానిపుళ షానవాస్ తెరకెక్కించబోయే ‘సూఫియుమ్ సుజాతయుమ్’ సినిమాలో అదితీరావ్ హీరోయిన్గా నటించబోతున్నారు. సంగీత ప్రధానంగా సాగే సినిమా ఇది. సుజాత పేరు అదితీ రావ్ పాత్రది అని ఊహించవచ్చు. -
ప్రయాణం మొదలైంది
కథానాయిక పరిణీతి చోప్రా రైలు ప్రయాణం చేస్తున్నారు. అదితీరావ్ హైదరీ, కృతీకల్హారీ ఈ ప్రయాణంలో పరిణీతి చోప్రాకు తోటి ప్రయాణికులు. ఈ ముగ్గురు హీరోయిన్లు కలిసి ఏ ట్రైన్ ట్రిప్ ప్లాన్ చేయలేదు. ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ అనే హాలీవుడ్ సినిమా హిందీ రీమేక్ మూవీ కోసం తోటి ప్రయాణికులుగా తోడయ్యారు. రిబు దాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మేజర్ షూటింగ్ లండన్లో ప్లాన్ చేశారు. ఓ మిస్సింగ్ పర్సన్ కేసులో చిక్కుకున్న ఓ వివాహిత ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుంది. పౌలా హాకిన్స్ ఫేమస్ నవల ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ ఆధారంగా అదే టైటిల్తో 2015లో ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
తుగ్లక్ దర్బార్లోకి ఎంట్రీ
రాజకీయ నాయకుడిగా మారనున్నారు విజయ్ సేతుపతి. ఆయనకు తోడుగా అదితీ రావ్ హైదరీ కూడా జాయిన్ అయ్యారని తెలిసింది. మరి రాజకీయాల్లో వీళ్ల లక్ష్యం ఏంటో స్క్రీన్పైనే చూడాలి. విజయ్ సేతుపతి హీరోగా నూతన దర్శకుడు ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ తెరకెక్కించనున్న తమిళ చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. పొలిటికల్ ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అదితీ రావ్ హీరోయిన్గా నటించనున్నారని చిత్రబృందం ప్రకటించింది. పార్తిబన్ విలన్గా నటించనున్నారు. ఇదివరకు మణిరత్నం తీసిన ‘నవాబ్’లో విజయ్ సేతుపతి, అదితీ రావ్ నటించారు. జోడీగా నటించడం మాత్రం ఇదే తొలిసారి. త్వరలోనే ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుంది. -
స్మగ్లింగ్ పార్ట్నర్స్?
విశాఖపట్నంలో స్మగ్లింగ్ చేయడానికి స్కెచ్ వేస్తున్నారట రవితేజ. ఆ ప్లాన్కు హెల్ప్ చేస్తున్నారట సిద్ధార్థ్. మరి.. వీరిద్దరి పార్టనర్షిప్ వివరాలు తెలుసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. ‘ఆర్ఎక్స్ 100’ వంటి సూపర్హిట్ను అందించిన అజయ్భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి ‘మహాసముద్రం’ అనే టైటిల్ని అనుకుంటున్నారు. ఈ చిత్రంలో రవితేజ, సిద్ధార్ధ్ హీరోలుగా నటించనున్నారు. రవితేజకు జోడీగా అదితీరావ్ హైదరీ కనిపించనున్నారు. సిద్ధార్థ్ సరసన హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్లో ప్రారంభం కానుందని సమాచారం. విశాఖపట్నం నేపథ్యంతో లవ్, ఎమోషన్ అంశాలకు స్మగ్లింగ్ ఎలిమెంట్ను స్క్రిప్ట్కు జత చేశారట అజయ్ భూపతి. -
మహా సముద్రంలో...
‘ఆర్ఎక్స్ 100’ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. దర్శకుడు అజయ్ భూపతి తర్వాతి సినిమాని ఇంకా సెట్స్పైకి తీసుకెళ్లడం లేదు. రవితేజ హీరోగా ‘మహా సముద్రం’ అనే పవర్ఫుల్ సబ్జెక్ట్ను రెడీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. ఇందులో రవితేజ సరసన హీరోయిన్గా అదితీరావ్ హైదరీని తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. గత ఏడాది ‘సమ్మోహనం, అంతరిక్షం’ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు అదితీ. ప్రస్తుతం సుధీర్బాబు, నాని చేస్తున్న ‘వి’ సినిమాలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. రవితేజ సినిమా సెప్టెంబర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. -
రాజ్తో అదితి?
‘సమ్మోహనం, అంతరిక్షం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు అదితీరావ్ హైదరీ. ప్రస్తుతం ఆమె ‘వి’ సినిమాలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్బాబు, నాని హీరోలు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం అదితీని వరించిందని టాలీవుడ్ టాక్. హీరో రాజ్తరుణ్కి జోడీగా ఆమె నటించనున్నారని ఫిల్మ్నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ ప్రస్తుతం జి.ఆర్. కృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు బ్యానర్లో ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట. తాను రాసుకున్న కథకు అదితి అయితేనే న్యాయం చేస్తుందని భావించిన దర్శకుడు, ఆమెతో సంప్రదింపులు జరిపారట. మరి.. అదితీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారా? వెయిట్ అండ్ సీ. -
ఎంట్రీ అప్పుడే
నాని, సుధీర్బాబు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అదితీరావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సుధీర్బాబు వర్కౌట్స్ చేసి బరువు కూడా తగ్గారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఇందులో సుధీర్బాబు పోలీసాఫీసర్గా కనిపిస్తారని, నానిది విలన్ పాత్ర అని టాక్. జూలై రెండోవారంలో నాని ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో జాయిన్ అవ్వనున్నట్లు తెలిసింది. శ్రీవెంకటేశ్వర కియేషన్స్ పతాకంపై అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి.. నాని ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే ‘గ్యాంగ్లీడర్’ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 30న విడుదల కానుంది. -
ఎలా డేటింగ్ చేయాలో తెలియదు
చెన్నై: నాకు వచ్చిన మొదటి ప్రేమలేఖను అమ్మకు ఇచ్చాను అని చెప్తోంది హీరోయిన్ అదితిరావ్ హైదరి. మణిరత్నం తెరకెక్కించిన కాట్రువెలియిడై చిత్రంలో కార్తీకు జంటగా కోలీవుడ్కు పరిచయమైన ఈ అమ్మడు హైదరాబాద్ బ్యూటీ. ఈ మధ్య తెలుగులో సమ్మోహనం చిత్రంలో నటించి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అంటూ చుట్టేస్తున్న అదితిరావ్ ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్కు జంటగా సైకో చిత్రంలో నటిస్తోంది. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇటీవల ఈ బ్యూటీ తన ప్రేమ వ్యవహారం గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను 5వ తరగతి చదువుతున్నప్పుడే తన సీనియర్ ప్రేమలేఖను రాశాడని చెప్పింది. అప్పుడు తన వయసు 9 ఏళ్లు అని పేర్కొంది. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసులో అతను రాసిన రెండు పేజీల ప్రేమలేఖను తీసుకెళ్లి గర్వంగా తన తల్లికి ఇచ్చానని చెప్పింది. అంతే వేగంతో తనను బోర్డింగ్ స్కూల్లో చేర్పించారని తెలిపింది. ఇంతకీ ఆ లేఖలో అతను రాసిందేమిటంటే నువ్వు చాలా అందంగా ఉన్నాను.. లాంటి ఏవేవో రాతలు రాశాడని చెప్పింది. తనకు 21 ఏళ్ల వయసులో పెళ్లి జరిగిందని, ఎలా డేటింగ్ చేయాలో కూడా తెలియలేదని చెప్పుకొచ్చింది. ఆ తరువాత చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయాను అని నటి అదితిరావ్ పేర్కొంది. గ్లామర్ విషయంలో పరిమితులు లేవనే విధంగా నటించడానికి రెడీ అనే అదితిరావ్ కారణాలేమైనా ఎక్కువ చిత్రాల్లో చిత్రాల్లో కనిపించడం లేదు. -
ఇక ‘టాటా’ చీరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్నకు చెందిన ఆభరణాలు, వాచీల ఉత్పత్తుల విక్రయ సంస్థ టైటాన్ బ్రాండెడ్ చీరల విభాగంలోకి అడుగుపెట్టింది. చీరలు, మహిళల సాంప్రదాయ దుస్తులకు సంబంధించి తనైరా పేరిట హైదరాబాద్లో షోరూం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో టైటా న్ ఎండీ భాస్కర్ భట్, సినీ నటి అదితి రావు హైదరీ పాల్గొన్నారు. తనైరా బ్రాండ్ కింద ఇది అయిదో స్టోర్ అని, హైదరాబాద్లో మొట్టమొదటిదని భాస్కర్ భట్ తెలిపారు. ‘ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీల్లో కలిపి నాలుగు షోరూమ్లు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా మొత్తం 14 స్టోర్స్ ఏర్పాటు చేయనున్నాం. దీంతో 2020 మార్చి నాటికి తనైరా స్టోర్స్ సంఖ్య 18కి చేరుతుంది’ అని ఆయన వెల్లడించారు. బెనారస్, కంచి మొదలుకుని పోచంపల్లి, ఉప్పాడ వరకు దాదాపు 3,000 రకాల చీరలు ఈ స్టోర్స్లో అందుబాటులో ఉంటాయని భట్ చెప్పారు. వీటి కోసం ప్రత్యేకంగా 300 మంది దాకా చేనేతకారులతో ఒప్పందాలు చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఒక్కో స్టోర్పై సుమారు రూ. 4–5 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందన్నారు. ధరల శ్రేణి రూ. 1,000 నుంచి ప్రారంభమవుతుందని భట్ చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేక సందర్భాల కోసం ఉద్దేశించిన దుస్తుల మార్కెట్ పరిమాణం సుమారు రూ. 20,000 కోట్లు ఉంటుందని భట్ చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కూడా స్టోర్స్ ఏర్పాటు పరిశీలించనున్నట్లు టైటాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ చావ్లా తెలిపారు. మరోవైపు, ఆభరణాల బ్రాండ్ తనిష్క్ స్టోర్స్ను ఈ ఏడాది మధ్యప్రాచ్య దేశాల్లో ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. టైటాన్ 20 శాతం వృద్ధి అంచనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టైటాన్ ఆదాయ వృద్ధి సుమారు 20 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు భట్ చెప్పారు. క్రిత ఆర్థిక సంవత్సరం వృద్ధి 22 శాతంగా ఉండగా, 2018 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లోను సుమారు అదే స్థాయిలో నమోదైందని ఆయన పేర్కొన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నేడు (మంగళవారం) వెల్లడి కానున్నాయి. 2017–18లో సంస్థ ఆదాయం రూ. 15,472 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఇది రూ. 14,769 కోట్లుగా నమోదైంది. ఆదాయ వృద్ధికి ఆభరణాల వ్యాపార విభాగం గణనీయంగా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. టైటాన్ ఆదాయాల్లో దాదాపు 83 శాతం వాటా ఈ విభాగానిదేనని భట్ వివరించారు. -
వ్యూహమా? విక్టరీయా?
నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘అష్టా చమ్మా, జెంటిల్ మన్’ చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే సుధీర్బాబు, ఇంద్రగంటి కలయికలో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్లో ‘వి’ పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ‘వి’ అంటే విక్టరీ అని ఊహించవచ్చు. నాని, సుధీర్బాబు హీరోలుగా, అదితీరావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో 36వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అనిత సమర్పణలో శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రినాథరావు నక్కిన కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శ్రీరామ్ వేణు క్లాప్ ఇచ్చారు. ‘ఎఫ్2’ డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, వి.కె. నరేష్, రోహిణి, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కెమెరా: పి.జి.విందా, సంగీతం: అమిత్ త్రివేది. -
వ్యూహం పన్నారా?
‘సమ్మోహనం’ సక్సెస్ తర్వాత దర్శకుడు మోహన్కృష్ణ ఇంద్రగంటి థ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. సుధీర్బాబు, నానిలతో ఈ మల్టీస్టారర్ రూపొందనుంది. ఇందులో నాని పాత్ర నెగటివ్ షేడ్స్లో ఉంటుందని సమాచారం. నాని సరసన అదితీరావ్ హైదరీ, సుధీర్కి జోడీగా నివేదా థామస్ నటించనున్నారట. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ నలుగురిలో ఎవరు వ్యూహం పన్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే. ‘సమ్మోహనం’ తర్వాత సుధీర్, అదితీలను, ‘జెంటిల్మేన్’ తర్వాత నాని, నివేదా థామస్లను ఇంద్రగంటి రిపీట్ చేస్తున్నారు. జులైలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. -
హిట్ హిట్ హుర్రే
సాధారణంగా బిజినెస్ ఇయర్ మార్చి టు మార్చి జరుగుతుంది. ఆ ఏడాది జరిగిన లావాదేవీలన్నీ లెక్కలేస్తుంటారు. బిజినెస్ ఇయర్ను మేం కొంచెం మార్చాం. ఉగాది టు ఉగాది చేశాం. గత ఏడాది ఉగాది నుంచి ఈ ఉగాది వరకూ ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన కొత్త టాలెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఉగాది పచ్చడిలానే సినీపరిశ్రమలో ఫలితాలు కూడా షడ్రుచుల్లా ఉంటాయి. చేదు, పులుపు, తీపి, కారంలా హిట్టు, ఫ్లాప్, యావరేజ్, డిజాస్టర్లు ఉంటాయి. తొలి ప్రయత్నంలోనే తీపి రుచి చూసిన హీరో, హీరోయిన్లు, దర్శకులు గురించి చర్చించుకుందాం. వాళ్లపై స్పెషల్ స్టోరీ. లక్కీయారా తొలి పరిచయంలోనే స్టేట్ సీయంను ప్రేమలో పడేసిన హీరోయిన్ కియారా అద్వానీ. అదేనండీ.. ‘భరత్ అనే నేను’లో సీయం భరత్ని ప్రేమలో పడేశారు కదా. మహేశ్బాబు నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘భరత్ అనే నేను’తో ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు బాలీవుడ్ బ్యూటీ కియారా. ‘భరత్ అనే నేను’ రిలీజ్ కాకముందే ‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్చరణ్తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేశారు. కెరీర్ స్టార్టింగ్లోనే ఇద్దరు టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసి లక్కీయారా అనిపించుకున్నారు. ‘భరత్..’ బ్లాక్బస్టర్గా నిలిచినా, ‘వినయ..’ సినిమా అంచనాలను అందుకోలేదు. అయినా నో ప్రాబ్లమ్. కియారాకి అవకాశాలు కొదవ లేదు. అఖిల్ కొత్త చిత్రంలో కియారా నటించే అవకాశముందని తెలిసింది. మజిలీ ఎటువైపు హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘చి.ల.సౌ’తో పరిచయమయ్యారు రుహానీ శర్మ. సినిమా ఆకట్టుకుంది. రుహానీ నటన కూడా బాగుందనే అన్నారు. కానీ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. రుహానీలా హిట్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా కూడా నెక్ట్స్ సినిమాను ఇంకా సైన్ చేయని హీరోయిన్లలో శోభితా ధూళిపాళ, ప్రియాంకా జవాల్కర్ ఉన్నారు. ‘గుఢచారి’ ద్వారా శోభిత, ‘టాక్సీవాలా’ ద్వారా ప్రియాంకా ఆడియన్స్ను ఇంప్రెస్ చేశారు. నెక్ట్స్ ఏ సినిమా చేస్తున్నారు? అంటే.. ఇంకా ప్రకటించలేదు ఈ తెలుగమ్మాయిలు. ఇక నాగచైతన్య, సమంత చేసిన ‘మజిలీ’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యారు దివ్యాన్షాకౌశిక్. ఆమె నటనను మెచ్చుకున్నారు ప్రేక్షకులు. మరి.. ఈ సినిమా తర్వాత దివ్యాన్ష మజిలీ ఎటువైపో చూడాలి. సమ్మోహిని అదితీరావ్ హైదరీకి బాలీవుడ్లో తొమ్మిదేళ్ల కెరీర్ ఉంది. మణిరత్నం ‘చెలియా’ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఫస్ట్ టైమ్ పలకరించారు అదితీ. మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ ద్వారా తెలుగుకి స్ట్రయిట్ ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్తో సమ్మోహనపరచడమే కాకుండా తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకొని మెప్పించారు. ఆ వెంటనే వరుణ్ తేజ్తో కలసి ‘అంతరిక్షం’లో ప్రయాణం చేశారు. ‘అంతరిక్ష’ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. తాజాగా మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారని తెలిసింది. సుధీర్బాబు, నానిలతో మోహనకృష్ణ ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అందులో నాని సరసన హీరోయిన్గా కనిపిస్తారట అదితీ. ఒక్క హిట్ నిధీ అగర్వాల్ది స్పెషల్ కేస్. వరుస సినిమాలను సంతకం చేస్తున్నారు కానీ ఫస్ట్ హిట్ను ఇంకా టేస్ట్ చేయలేదీ ఈ బెంగళూర్ భామ. నాగచైతన్య ‘సవ్యసాచి’తో పరిచయమైన నిధీ, ఆ తర్వాత అఖిల్తో ‘మిస్టర్ మజ్ను’లో నటించారు. లేటెస్ట్గా రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ హీరోయిన్గా కనిపిస్తున్నారు. మరి.. అవకాశాలు అందుకుంటున్నట్లుగానే హిట్ ఎప్పుడు అందుకుంటారో చూడాలి. అది ‘ఇస్మార్ట్ శంకర్’తోనే దక్కుతుందనే ఊహలున్నాయి. భల్లే భల్లే పాయల్ గత ఏడాది ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన వారిలో పాయల్ రాజ్పుత్ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఈ పంజాబీ భామ చేసిన బోల్డ్ రోలే అందుకు కారణం. ప్రస్తుతం వరుస సినిమాలు సైన్ చేసే పనిలో పడ్డారు పాయల్. ‘వెంకీ మామా’లో వెంకటేశ్ సరసన, ‘డిస్కో రాజా’లో రవితేజ సరసన, ‘మన్మథుడు 2’లో యాక్ట్ చేస్తున్నారు పాయల్. తమిళంలో ఆమె చేసిన ‘ఏంజెల్’ చిత్రం రిలీజ్కి రెడీ అవుతోంది. ఇటీవల తెలుగులో ‘ఆర్డీఎక్స్’ అనే ఓ కొత్త చిత్రం కూడా స్టార్ట్ చేశారు. హాట్ ఎంట్రీతో ప్రస్తుతం హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయారు పాయల్. కొత్త ఐడియాలు క్లిక్ 2018 తెలుగు సినిమా విభిన్న కథలను చూసింది. సరికొత్త ఐడియాలతో కొత్త దర్శకులు ముందుకొచ్చారు. ‘ఆర్ఎక్స్100’ లాంటి బోల్డ్ అటెంప్ట్తో అజయ్ భూపతి ఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం ‘మహాసముద్రం’ అనే మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేస్తున్నారు అజయ్. తక్కువ బడ్జెట్లోనూ బాండ్ తరహా చిత్రాలు తెరకెక్కించవచ్చని ‘గూఢచారి’ సినిమా ద్వారా శశికిరణ్ తిక్క నిరూపించారు. మహేశ్బాబు నిర్మాణంలో ‘మేజర్’ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్లో ఉన్నారు శశికిరణ్. ‘చి. ల. సౌ’ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు హీరో రాహుల్ రవీంద్రన్. మంచి పేరు వచ్చింది. సెకండ్ సినిమాకే నాగార్జునను డైరెక్ట్ చేసే చాన్స్ లభించింది. నాగ్ సూపర్ హిట్ ‘మన్మథుడు’ సీక్వెల్ ‘మన్మథుడు 2’ షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు రాహుల్. ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ మిడిల్ క్లాస్ కథను చూపించిన వేణు ఉడుగుల ఈసారి పీరియడ్ ఫిల్మ్ చేసే ప్లాన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. రానా, సాయి పల్లవి జంటగా నక్సలైట్ బ్యాక్డ్రాప్లో ఓ కథను తయారు చేశారట. ‘కేరాఫ్ కంచెరపాలెం’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకటేశ్ మహా, ‘నన్ను దోచుకుందువటే’ ఆర్ఎస్ నాయుడు, ‘టాక్సీవాలా’ రాహుల్ సంక్రిత్యాన్ తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ వివరాలింకా చెప్పలేదు. విజయ కార్తికేయం గత ఏడాది ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో కార్తికేయ బాగా మెరిశారు. ‘ఆర్ఎక్స్ 100’ బండిలానే దూసుకెళ్లారు. సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ వెంటనే తమిళ బడా చిత్రాల నిర్మాత కలైఫులి యస్ థాను నిర్మాణంలో ‘హిప్పీ’ సినిమా చేస్తున్నారు. నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చి, సంవత్సరం తిరక్కముందే విలన్ వేషాలకు కూడా రెడీ అయ్యారు. నాని– విక్రమ్ కె కుమార్ ‘గ్యాంగ్లీడర్’ సినిమాలో కార్తికేయ విలన్గా నటిస్తున్నారు. శభాష్ నటేశ్ నిర్మాతగా హీరో సుధీర్బాబు తొలి ప్రయత్నం ‘నన్ను దోచుకుందువటే’. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు కన్నడ నటి నభా నటేశ్. సినిమా సక్సెస్లో తన పాత్ర ఎంతో ఉందనే ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు నటనకు కూడా శభాష్ అనిపించుకున్నారు. ఆ హిట్తో వరుస సినిమాలతో బిజీ అయ్యారు నభా. రవితేజ ‘డిస్కో రాజా’లో ఓ హీరోయిన్గా, పూరి జగన్నాథ్–రామ్ కాంబినేషన్లో వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ హీరోయిన్గా చేస్తూ బిజీగా ఉన్నారు. – గౌతమ్ మల్లాది -
నానికి జోడిగా అదితి!
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఈ రెండు సినిమాల రిలీజ్కు ముందే మరో సినిమాను కూడా ఫైనల్ చేశారు నాని. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మెహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు నాని. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా అదితి రావ్ హైదరిని హీరోయిన్గా తీసుకున్నారట. గత చిత్రం సమ్మెహనంలో హీరోయిన్గా నటించిన అదితిని ఈ సినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు ఇంద్రగంటి. మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరో సుధీర్ బాబు కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. -
అలా తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది
‘‘పిల్లలతో పాటు పెద్దలను ‘అంతరిక్షం’ సినిమా మెప్పిస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన తొలి తెలుగు స్పేస్ థ్రిల్లర్ సినిమా ఇది. దర్శకుడు సంకల్ప్ అద్భుతంగా రూపొందించారు’’ అని క్రిష్ అన్నారు. క్రిష్ సమర్పణలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, అదితీరావ్ హైదరీ, లావణ్య ముఖ్య పాత్రలలో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేయంపీహెచ్’. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రిష్ మాట్లాడుతూ –‘‘అంతరిక్షం’ సరికొత్త తెలుగు సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ‘గమ్యం, కంచె’ తర్వాత మా బ్యానర్లో మరో గొప్ప చిత్రంగా నిలిచింది’’ అన్నారు. ‘‘ఓ వినూత్న ప్రయతాన్ని అందరూ ఆదరించడం ఆనందంగా ఉంది. సినిమాపై కొన్ని విమర్శలు వచ్చాయి. వాటినీ స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో అవి పునరావృత్తం కాకుండా చూసుకుంటాం’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘మరికొన్ని వైవిధ్యమైన ప్రయోగాలు చేయడానికి ఈ విజయం స్ఫూర్తినిచ్చింది. మన బడ్జెట్లోనే కొత్త ఆలోచనలతో సినిమా తీయవచ్చని నిరూపించింది. కొన్ని లాజిక్కులు మిస్ అయ్యాయి అంటున్నారు. పూర్తి లాజిక్స్తో తీస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది’’ అన్నారు సంకల్ప్ రెడ్డి. ‘‘కొత్త ప్రయత్నంలో భాగం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాన’’న్నారు అదితీరావ్ హైదరీ. -
అడ్జస్ట్ అయితేనే చాన్స్ ఇస్తామన్నారు!
‘‘ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ (క్యాస్టింగ్ కౌచ్) అనే దానికి ఒప్పుకోనందువల్లే దాదాపు ఎనిమిది నెలలు పనిని కోల్పోయాను’’ అంటూ ‘మీటూ’ ఉద్యమం గురించి మాట్లాడుతూ అదితీరావ్ హైదరీ తనకెదరైన అనుభవాన్ని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ సదస్సులో ‘మీటూ’ గురించి అదితీరావ్ హైదరీ మాట్లాడుతూ – ‘‘నేను కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో అమాయకంగా ఉండేదాన్ని. నా ఫ్యామిలీ నన్ను చాలా జాగ్రత్తగా పెంచారు. ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు జరుగుతాయని నమ్మేదాన్ని కాదు. నిజాయితీగా చెప్పాలంటే నాకన్ని చేదు అనుభవాలు కూడా ఇక్కడ ఎదురవ్వలేదు. ఒక్క సంఘటన జరిగింది. అది నాకు అంతగా హాని చేయలేదు కానీ కొంచెం డిస్ట్రబ్ చేసింది. ఒక ప్రాజెక్ట్కు సంబంధించి.. అడ్జస్ట్ అయితేనే చాన్స్ ఇస్తాం అని చాయిస్ ఇచ్చారు. దాని గురించి నేను పెద్దగా ఆలోచించకుండానే చాలా సింపుల్గా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాను. అలా ఓ ఎనిమిది నెలలు పని కోల్పోయాను. దాంతో అప్సెట్ అయ్యాను. ఇక కొత్త సినిమాలేవి చేయలేనా? అనే ఆలోచనల్లో పడిపోయాను. నా టీమ్, నా మేనేజర్ అంతా కలసి నెగటీవ్ ఆలోచనల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చారు. అలాగే లైంగిక వేధింపులకు గురైనవారిని కచ్చితంగా ఏదోటి మాట్లాడాలని ఒత్తిడికి గురి చేయకూడదు. వాళ్లు మాట్లడటానికి సిద్ధంగా ఉన్నారనుకున్నప్పుడే మాట్లాడమనాలి. ఎవరైనా తమ అనుభవాన్ని బయటకు చెప్పకపోతే నోరు నొక్కేసారు, అమ్ముడుపోయారు అని కొందరు ప్రచారం చేస్తారు. మాట్లాడకపోతే ‘మీటూ’ ఉద్యమాన్ని మీరు వదిలేసినట్టే.. మాట్లాడండి అని కొందరు కండీషన్స్లు పెడుతుంటారు. అది తప్పు. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, అది కరెక్ట్ అని అనిపించినప్పుడు చేయడమే నిజమైన సాధికారత అని నేను భావిస్తాను’’ అని పేర్కొన్నారు. -
లైఫ్ ఈజీ అవ్వడానికి కారణం అదే
‘తొలిప్రేమ’ షూటింగ్ టైమ్లో సంకల్ప్ కలిశాడు. ‘అంతరిక్షం’ సినిమా లైన్ చెప్పక ముందే కొన్ని ఫొటోలు చూపించాడు. ఆ తర్వాత ‘అంతరిక్షం’ నేపథ్యంలో సినిమా అనుకుంటున్నా అని స్టోరీ చెప్పాడు. కొత్తగా ట్రై చేద్దామనుకుంటున్న నేను కథ వినగానే చాలా ఎగై్జట్ అయ్యాను’’ అని వరుణ్ తేజ్ అన్నారు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ పంచుకున్న విశేషాలు. ► ‘అంతరిక్షం’ పూర్తి కథ రెడీ చేయడానికి, స్క్రీన్ప్లేకి సంకల్ప్ టైమ్ తీసుకున్నాడు. బెంగళూరులోని ఇస్రో మాజీ శాస్త్రవేత్తలను కలిసి వివరాలు సేకరించాడు. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు లోపల చిన్న భయం ఉండేది. తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. తప్పకుండా వారికి నచ్చు తుందనే నమ్మకంతో చేశా. ► ఇదొక వ్యోమగామి కథ. సినిమాలో కథ, ఎమోషన్స్ చాలా బాగున్నా దానికి అంతరిక్షం నేపథ్యం జోడించడం ఇందులో హైలైట్. సెకండ్ హాఫ్ మొత్తం స్పేస్ నేపథ్యంలోనే ఉంటుంది. వాస్తవ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని సంకల్ప్ హీరో పాత్ర సృష్టించాడు. ఇందులో దేవ్ అనే సైంటిస్ట్గా కనిపిస్తా. దేశానికి గొప్ప పేరు తీసుకురావాలనే అతని కల ఎలా నెరవేరిందన్నదే కథ. ఈ పాత్ర చేయడానికి నాకెలాంటి రిఫరెన్స్లు లేవు. స్పేస్ నేపథ్యంలోని కొన్ని హాలీవుడ్ సినిమాలు చూశా. తమిళ ‘టిక్ టిక్ టిక్’ సినిమా కూడా బాగుంది. ఆ సినిమా దర్శక, నిర్మాతల సూచనలు కూడా తీసుకున్నాం. ► వ్యోమగామి సూట్ వేసుకోవడానికే చాలా టైమ్ పట్టేది. సూట్, హెల్మెట్తో పాటు బ్యాక్ ప్యాక్ అన్నీ కలిపి దాదాపు 15 కిలోల బరువు ఉండేవి. ఆ సూట్ వేసుకున్నప్పుడు రెండు మూడు రోజులు ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైపోయింది. ఇప్పటి వరకూ నేను చేయని సరికొత్త పాత్ర ఇది. నటుడిగా నాకు సవాల్గా అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది. ► జీరో గ్రావిటీ ఎఫెక్ట్ కోసం వ్యాక్యూమ్ రూమ్స్ రెంట్కి తీసుకుని షూటింగ్ చేసుకోవచ్చు. హాలీవుడ్ సినిమాల్లాగా ఒక సర్టెన్ హైట్కి వెళ్లి చిత్రీకరించుకోవచ్చు. అలా చేయాలంటే బడ్జెట్ 400 నుండి 500 కోట్లు అవుతుంది. మా సినిమా బడ్జెట్ దాదాపు 25 కోట్లు. మాకున్న బడ్జెట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్తో మంచి ఔట్పుట్ తెచ్చాం. షూటింగ్లో ఎక్కువ రోజులు తాడుతో గాల్లో వేలాడటం కోసం ముందుగానే ప్రాక్టీస్ చేశాం. ► తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ థ్రిల్లర్ సినిమా ‘అంతరిక్షం’ కావడంతో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. పోస్టర్లు, ట్రైలర్ చూసి సినిమాకు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. మా సినిమా వారికి మంచి విజువల్ వండర్లా అనిపిస్తుంది. అంతరిక్షం అంటే ఏంటి? ఎలా ఉంటుంది? అని బి,సి తరగతుల ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా మా సినిమా ఉంటుంది. ► ఈ సినిమాలో పరిస్థితులే విలన్. టీమ్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ వాటిని ఎలా ఎదుర్కొన్నారన్నదే కథాంశం. మన లైఫ్ ఇంత ఈజీ అయిందంటే అది స్పేస్ రీసెర్చ్ వల్లే. నేను ప్రయోగాలు చేస్తున్నానని అనుకోవడం లేదు. రొటీన్ సినిమాల్లా కాకుండా సరికొత్త పాయింట్తో నా సినిమాలు ఉండాలనుకుంటా. ► సింపుల్గా సినిమా చేసేసి డబ్బులు సంపాదిద్దాం అనే ఆలోచన రాజీవ్రెడ్డిగారికి లేదు. వైవిధ్యమైన సినిమాలు చేయాలని ఆలోచిస్తారు. క్రిష్గారు కూడా అంతే. ఇందులో లావణ్య త్రిపాఠి టీచర్గా కనిపిస్తుంది. సినిమాలో నా పాత్రకి, అదితి పాత్రకి మధ్య లవ్ యాంగిల్ ఏం ఉండదు. ‘ఎఫ్ 2’ సినిమాలో వెంకటేశ్గారు, రాజేంద్రప్రసాద్గారితో పనిచేయడం వెరీ హ్యాపీ. వాళ్లు సింగిల్ టేక్లో సీన్ చేసేసేవారు. నేను ఒక్కోసారి రెండు మూడు టేక్లు తీసుకునేవాడిని. నా తర్వాతి సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఉంటుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్గారి తనయుడు అల్లు వెంకటేశ్ నిర్మిస్తారు. ఆ చిత్రం తర్వాత సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తా. హరీష్ శంకర్గారు ఓ సినిమా రీమేక్ గురించి చర్చించారు. ఇంకా ఫైనల్ కాలేదు. నా సినిమా కథలన్నీ నాన్నగారు (నాగబాబు) వినరు. చెల్లి నిహారిక నటించిన ‘సూర్యకాంతం’ సినిమా కథ నాకు తెలుసు. ప్రణీత్ యంగ్ డైరెక్టర్. వారిని ప్రోత్సహిద్దామనే ఆ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నా. -
లిప్స్టిక్ వేసుకుంటేనే హీరోయిన్ కాదు!
‘‘సినిమాలో పాత్ర చిన్నదా, పెద్దదా అనే తేడా చూడను. ‘కెరీర్ స్టార్టింగ్లో మీరు చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు లీడ్ రోల్స్ చేస్తున్నారు’ అని కొందరు అంటున్నారు. హాలీవుడ్ సినిమాలో అది చాలా కామన్. చిన్నా, పెద్దా అనే ట్యాగ్ కాదు.. ట్యాలెంట్ ముఖ్యం. ఏ పాత్ర చేసినా ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా, తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లేలా ఉండాలి. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో భాగమవ్వాలని భావిస్తుంటాను’’ అని అదితీ రావ్ హైదరీ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా అదితీ రావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన స్పేస్ మూవీ ‘అంతరిక్షం 9000కేయంపీహెచ్’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై క్రిష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించారు. ఈ నెల 21న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా అదితీ రావ్ హైదరీ పంచుకున్న విశేషాలు. ► ‘అంతరిక్షం’ సినిమాలో రియా అనే వ్యోమగామి (ఆస్ట్రోనాట్) పాత్ర పోషించాను. ఈ పాత్రకు సంబంధించి శిక్షణ కోసం చాలా కష్టపడ్డాం. శిక్షణలో భాగంగా పిల్లిమొగ్గలేయడం (ముందుకు,వెనక్కి) గాల్లో స్విమ్ చేయడం నేర్చుకున్నాను. శిక్షణ తీసుకునేప్పుడు ‘నవాబ్’ సినిమా షూటింగ్ కూడా జరిగేది. పొద్దునే ప్రాక్టీస్, సాయంత్రం చెన్నె వెళ్ళి షూటింగ్ చేసేదాన్ని. చిన్నప్పుడు మా స్కూల్కి ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ వచ్చి, తన అనుభవాలు షేర్ చేసుకునేవారు. ఈ సినిమా చేస్తుంటే అవన్నీ గుర్తొచ్చాయి. ► సినిమాలో వ్యోమగామి (ఆస్టోనాట్) అవుదాం అని స్పేస్ సెంటర్లో ఇన్టర్న్గా జాయిన్ అవుతాను. ఆ తర్వాత ఆస్ట్రోనాట్గా ట్రెయిన్ అవుతాను. సినిమాలో పాత్రల గురించి పూర్తిగా చెప్పేయడానికి ఇష్టపడను. ఎందుకంటే.. ఇదివరకు ప్రేక్షకులకు సినిమా గురించి ఎక్కువగా తెలిసేది కాదు. సినిమాలో అన్నీ ఆశ్చర్యంగా తోచేవి. ఇప్పుడు అన్నీ ముందే తెలుస్తుంటే ‘సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్’ తగ్గుతుందని నా ఫీలింగ్. ► జీరో గ్రావిటీ సన్నివేశాలన్నీ కూడా తాళ్లతో కట్టేసుకుని షూట్ చేశాం. నేను, వరుణ్, సత్యదేవ్, రాజా నలుగురం స్పేస్ సీన్స్లో ఎక్కువగా పాల్గొన్నది. వాళ్లందరిలో నేనే చాలా తక్కువ వెయిట్. నాలా తక్కువ బరువుంటే ఏ ఇబ్బందీ ఉండదు అని వాళ్లతో అనేదాన్ని (నవ్వుతూ). నాకైతే నా హెల్మెట్ చాలా బరువుగా ఉండేది. అది ధరించేప్పుడు చాలా నొప్పిగా ఉండేది. ఒకసారి హెల్మెట్ పెట్టుకుంటే మెడ దగ్గర ‘టక్’మని సౌండ్ వినిపించింది. గాయమైంది. డాక్టర్ సుమారు 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. నా కోసం టీమ్ అన్ని రోజులు ఎదురుచూడటం కరెక్ట్ కాదనుకున్నాను. సీరియస్గా ఫిజియోథెరపీ చేయించుకుని రోజుకు 4 పెయిన్ కిల్లర్స్ తీసుకొని జస్ట్ 2 రోజుల్లో షూటింగ్లో జాయినయ్యా. ► సంకల్ప్ రెడ్డి స్క్రిప్ట్ చెపినప్పుడు బాగా నచ్చింది. ఈ సినిమా చేయాలంటే ముంబై, హైదరాబాద్ వస్తూ పోతుండాలి. అది ప్రొడక్షన్కు ఇబ్బంది అన్నాను. ఆ తర్వాత ‘సమ్మోహనం’ చేస్తున్న సమయంలో పూర్తి కథ రెడీ అన్నారు. ఇప్పటి వరకూ అంతరిక్షానికి వెళ్లిన మహిళా ఆస్ట్రోనాట్స్ మన దేశానికి చెందిన వారే. అప్పుడే ఈ పాత్ర చేయాలనుకున్నాను. ► ఇందులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుదాం అనుకున్నాను. కానీ మా టీమ్ వేరే వాళ్లతో డబ్ చేయించేశారు. వరుణ్ తేజ్ ప్రాజెక్ట్స్ ఎంపిక బావుంది. లావణ్యతో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. వరుణ్ తేజ్కి సంబంధించిన లవ్స్టోరీలో ఆమె ఉంటారు. ► నా దృష్టిలో యాక్టర్స్ అనేవాళ్లు చిన్నపిల్లలు. కెమెరా ఆన్ అయితే చాలా ఆనందం వచ్చేస్తుంది. వేరే ప్రపంచంలోకి వెళ్లిపోతాం. చిన్నపిల్లల్ని ప్లే గ్రౌండ్లో వదిలిపెట్టినట్లే. ఎంతసేపు అక్కడున్నా అలసిపోరు. మేం కూడా అంతే. కెమెరా ముందు నుంచి బయటకు రాగానే అలసిపోతాం. ► నాకు నటించడం రాదు. ఆ టైమ్లో ఆ సందర్భానుసారం ఫీల్ అవ్వడమే వచ్చు. డ్యాన్స్ మాత్రమే నేర్చుకున్నాను. యాక్టింగ్కు సంబంధించిన రూల్స్ కూడా నాకు తెలియవు. నటనకు సంబంధించిన ప్రాసెస్ వివరించడం కష్టం అనుకుంటున్నాను. ► మన సేఫ్టీని మనమే క్రియేట్ చేసుకోవాలి. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే. నా అదృష్టమేంటంటే 99 శాతం చాలా మంచి మనుషులతో వర్క్ చేశాను. ‘సమ్మోనం’ తర్వాత మళ్లీ గ్లామర్ పాత్ర ఎందుకు చేయలేదని కొందరు అడిగారు. నా దృష్టిలో ఆస్ట్రోనాట్ని మించిన హీరోయిన్ లేదు. దేశం కోసం అంత దూరం ప్రయాణించడం గ్రేట్. వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. లిప్స్టిక్ వేసుకుంటేనే హీరోయిన్ కాదు. కేవలం అందమైన ముఖం ఉంటే కొన్ని రోజుల్లో బోర్ కొట్టేయొచ్చు. టాలెంట్కి ప్రాధాన్యం ఇచ్చి కొత్త కొత్త పాత్రలు చేస్తూ ఉంటే చాలా ఏళ్లు కొనసాగొచ్చు. మన యాటిట్యూడ్, వర్క్ మనల్ని హీరోయిన్ని చేస్తుంది. ► నెక్ట్స్ ధనుశ్తో ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. ధనుశ్ నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్నారు. నాగార్జునగారు కూడా ఉన్నారు ఆ సినిమాలో. తమిళంలో దర్శకుడు మిస్కిన్తో ‘సైకో’ అనే సినిమా చేస్తున్నాను. -
చినుకుల వేళ.. తళుకుల తార
-
అంతరిక్షం 2 చేయాలనుంది
‘‘ఘాజీ రిలీజైన మూడు నెలల తర్వాత స్పేస్కు సంబంధించిన ఆర్టికల్ చదువుతుంటే ‘అంతరిక్షం’ చిత్రం తీయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆర్టికలేంటో చెబితే సినిమా కథ తెలిసిపోతుంది, ప్రస్తుతానికైతే చెప్పను (నవ్వుతూ). ‘గ్రావిటీ, ఇంటర్స్టెల్లార్’, తమిళంలో వచ్చిన ‘టిక్ టిక్ టిక్’ లాంటి ఏ సినిమాకు మా చిత్రం సంబంధం లేదు. కొత్తగా ఉంటుంది’’ అని దర్శకుడు సంకల్ప్ రెడ్డి అన్నారు. వరుణ్తేజ్ హీరోగా సంకల్ప్రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అంతరిక్షం’. అదితీరావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై క్రిష్, జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్రెడ్డి నిర్మించారు. యు సర్టిఫికెట్తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి పంచుకున్న విశేషాలు... ► వైజాగ్లో మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఎలా ‘ఘాజీ’ సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందో.. ఏదో స్పేస్ ఆర్టికల్ చదువుతుంటే ఈ సినిమా చేయాలనిపించింది. ఇప్పటి వరకూ వచ్చిన స్పేస్ సినిమాలతోపోలుస్తారని తెలుసు. కానీ వాటి నుంచి ఇన్స్పెర్ అవ్వలేదు. ► నా ఫస్ట్, సెకండ్ రెండు సినిమాలు ఏదో ఓ ఈవెంట్ రిలేటెడ్ ఐడియాలే ఉన్నాయి. ఫ్యూచర్లో ఎప్పుడైనా కొత్త ఐడియాలు రాకపోతే ఫార్ములా సినిమాలే తీస్తానేమో. ఇప్పుడే కాదు ఫ్యూచర్లో. ► ‘ఘాజీ’ చిత్రానికి నేషనల్ అవార్డ్ ఈ ఏడాది మే 1న వచ్చింది. తర్వాతి రోజే సినిమాను స్టార్ట్ చేశాం. 1500 సీజీ షార్ట్స్ ఉన్నాయి. అయినా కూడా 70 రోజులు షూటింగ్ పూర్తి చేశాం. అందులో30 రోజులు జీరో గ్రావిటీ సీన్స్ చిత్రీకరించాం. సినిమా షూట్ చేయడానికి సమయం ఎక్కువ తీసుకోలేదు. ► సినిమాకు సంబంధించి బాగానే రీసెర్చ్ చేశాను. నెట్లోనే మనకు కావల్సిన కంటెంట్ ఉంది. యుట్యూబ్లోనూ చాలా మ్యాటర్ ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడాను. ► స్పేస్లో ఉన్నది ఉన్నటుగా తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది. వీలైనంత ల్యాజిక్ ఉండేలా చూసుకున్నాం. ఒక్కసారి ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అయితే లాజిక్ పట్టించుకోడు. బోర్ కొట్టిస్తున్నాం అంటే లాజిక్స్ వెతికే పనిలో పడతారు. ► దేవ్ అనే పాత్రకు వరుణ్ తేజ్ అయితేనే బావుంటుంది అనిపించింది. కథేంటో అని క్లుప్తంగా చెప్పాను. తర్వాత నాలుగు నెలల్లో కథ పూర్తి చేశా. ► ఘాజీలో లవ్స్టోరీ ఉండదు. కానీ ఇందులో ప్రేమతో పాటు దేశభక్తి లవ్స్టోరీ అన్నీ ఉంటాయి. ► స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలో, ప్రీ–ప్రొడక్షన్ చేస్తున్న సమయంలో క్రిష్గారు సహాయం చేశారు. నిర్మాతల సహకారం కూడా బావుంది. షూటింగ్లో నాకు పెద్ద చాలెంజ్లు ఎదురవ్వలేదు కానీ, యాక్టర్స్ మాత్రం చాలెంజెస్ ఫేస్ చేశారు. ‘రంగస్థలం’లో ఆర్ట్వర్క్ చూసి రామకృష్ణ, మోనికాలను ఎంపిక చేసుకున్నాను. ► బాలీవుడ్లో రెండు ఆఫర్స్ ఉన్నాయి. టిని పూర్తి చేయాలి. టాలీవుడ్కు టెంపరరీగా బ్రేక్ తీసుకుంటున్నాను. నిర్మాతలకు కథ కూడా చెప్పాను. అక్కడికి వెళ్తే 2 ఏళ్ల సమయం కేటాయించాలి. మరీ ఆలస్యం అయితే ఇక్కడే సినిమాలు చేస్తాను. ‘అంతరిక్షం 2’ కూడా చేయాలనుంది. -
అద్భుతం అనే పదం ఈ సినిమాకు కరెక్ట్
‘‘క్రిష్, రాజీవ్ అద్భుతాలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ‘ప్రయత్నించి విఫలం అయినా ఫర్వాలేదు. ప్రయత్నించకుండా ఉండకూడదు’ అని ట్రైలర్లో ఉన్న డైలాగ్ చాలా బాగా నచ్చింది. కొత్త ఆలోచనలు, సాంకేతికంగా కొత్త సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. వరుణ్తేజ్, అదితీరావ్, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై దర్శకుడు క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘మా కుటుంబంలో వరుణ్ తేజ్ డైమండ్. వరుసగా సినిమాలు చేసేయాలి, డబ్బు సంపాదించాలి అనుకోకుండా ఆగి.. ఆలోచించి మంచి సినిమాలు చేస్తున్నాడు. ‘సమ్మోహనం’లో అదితీ నటనను చాలా ఎంజాయ్ చేశాను’’ అన్నారు. ‘‘అద్భుతం అనే పదం చాలా తక్కువసార్లు నప్పుతుంది. ఈ సినిమాకు ఆ పదం సరిగ్గా సరిపోతుంది. సంకల్ప్ ఫస్ట్ సినిమాతో నీళ్లలోకి వెళ్లిపోయాడు. నెక్ట్ ఏంటా? అనుకున్నాను. అంతరిక్షానికి వెళ్లిపోయాడు. వరుణ్ ట్రై చేస్తే అంతరిక్షం అందుతుంది (వరుణ్ ఎత్తుని ఉద్దేశిస్తూ). సంకల్ప్ క్రమశిక్షణ చూస్తే ఆశ్చర్యం వేసింది. క్రిష్, నేను, సంకల్ప్ దగ్గర అసిస్టెంట్గా చేస్తాం (నవ్వుతూ). సంకల్ప్.. ‘బాహుబలి’ లాంటి సినిమాలు కూడా చేయాలి. చేయగలడు. ‘వరుణ్ స్క్రిప్ట్ని ఎంచుకునే తీరు బావుంటుంది’ అని రామ్చరణ్ నాతో అన్నాడు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు సుకుమార్. ‘‘దర్శకులు ఎన్ని కథలైనా రాసుకోవచ్చు. కానీ హీరో ఓకే అన్నాకే సినిమా మొదలవుతుంది. కథను నమ్మిన వరుణ్కు థ్యాంక్స్. ఈ విజయంలో అగ్రతాంబూలం అతనికే ఇస్తాను. ఇలాంటి సినిమాతో నేనూ అసోసియేట్ అవ్వడం గర్వంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని ఈ సినిమా కూడా ఒక అడుగు ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు క్రిష్. ‘‘సినిమా చాలా కష్టపడి చేశాం. చాలా నమ్మకంగా కూడా ఉన్నాం. ఈ సినిమా మీ అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలో భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన టీమ్కు కృతజ్ఞతలు’’ అన్నారు లావణ్య. ‘‘రెండో సినిమాతో మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్’’ అన్నారు అదితీరావ్. ‘‘ఇలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది. ‘ఘాజీ’ కంటే రెండింతల నమ్మకంగా ఉన్నాను. ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతికి లోనవుతారని నమ్ముతున్నాను. ’’ అన్నారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సత్యదేవ్, రాజా, కిట్టు విస్సాప్రగడ, ఆర్ట్ డైరెక్టర్ మోనికా, రామకృష్ణ, సహ నిర్మాత బిబో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘అంతరిక్షం 9000 KMPH’ ట్రైలర్ లాంచ్
-
‘గెలవాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి’
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో వ్యోమగామిగా నటిస్తున్నాడు. ‘అంతరిక్షం 9000 KMPH’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది డిసెంబర్ 21న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టైలర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మిరా అనే శాటిలైట్ దారి తప్పటంతో ప్రపంచంలోని కంమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతరిక్షంలో ఆఫీసర్ దేవ్ చేసిన సాహసమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆస్ట్రోనాట్గా కనిపించేందుకు వరుణ్ తేజ్ ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ షటిల్తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేశారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మించారు. -
నే తమిళ పాట పాడితే...
కథానాయిక అదితీరావ్ హైదరి యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘చెలియ, పద్మావత్, సమ్మోహనం’ వంటి చిత్రాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు సింగింగ్లోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. సంగీతదర్శకుడు జీవీ ప్రకాష్ హీరోగా నటించిన ‘జైలు’ సినిమాలో ఓ పాట పాడారామె. ఈ చిత్రానికి వసంతబాలన్ దర్శకుడు. ‘‘తమిళంలో నా తొలి సాంగ్ను రికార్డ్ చేసినందుకు ఆనందంగా ఉంది. చాలా ఎగై్జటింగ్గా ఉంది. నన్ను గైడ్ చేసిన జీవీ ప్రకాశ్కి ధన్యవాదాలు. ‘జైలు’ టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు అదితీ. అలాగే స్టూడియోలో జీవీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారామె. సుధీర్బాబు ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇంతకు ముందు బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సౌత్లో మంచి ఊపు మీద ఉన్నారు. తెలుగు ‘అంతరిక్షం 9000 కేఎమ్పిహెచ్’ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేసిన అదితీ తమిళంలో ‘సైకో’ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
ఎంతో దూరంలో లేదు
అంతరిక్షాన్ని చేరుకోవడానికి తాను చేసిన ప్రయత్నాన్ని విజువల్గా చూపించడానికి రెడీ అయ్యారు హీరో వరుణ్ తేజ్. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, అదితీరావు హైదరీ, లావణ్యాత్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేఎమ్పిహెచ్’. ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 9న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో వరుణ్తేజ్, అదితీ ఆస్ట్రోనాట్స్గా కనిపించనున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ వేడుక ఏఎమ్బి మల్టీఫ్లెక్స్లో జరిపేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు ట్రైలర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. రాధాకృష్ణ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదల ఎంతో దూరంలో లేదు... ఈ నెల 21న విడుదల కానుంది. -
డబ్బింగ్ షురూ
జనరల్గా ఆస్ట్రోనాట్ అంటే రాకెట్ లాంచింగ్ స్టేషన్లో బిజీ బిజీగా ఉంటారు. కానీ టాలీవుడ్ ఆస్ట్రోనాట్ వరుణ్ తేజ్ చెన్నై, హైదరాబాద్లోని స్కూల్స్కి వెళ్లొచ్చారు మరి.. స్టూడెంట్స్కు రాకెట్ గురించి ఏమైనా పాఠాలు చెప్పారా? లేక చిన్ననాటి జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళ్లారా? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్పిహెచ్’. లావాణ్యా త్రిపాఠి, అదితీరావ్ హైదరీ కథానాయికలుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు వరుణ్ తేజ్. ‘‘ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు ప్రశాంత్ విహారి స్వరకర్త. క్రిష్ సమర్పణలో సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. -
అంతరిక్షం కొత్త లుక్
వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేఎమ్పిహెచ్’. అదితీరావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఇందులో వరుణ్తేజ్, అదితీరావ్ వ్యోమగాములుగా కనిపిస్తారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా కొత్త లుక్ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ‘‘ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్లుక్, టీజర్లకు మంచి స్పందన లభిస్తోంది. సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయాలను కుంటున్నాం’’ అని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ విహారి స్వరకర్త. దర్శకుడు క్రిష్ సమర్పణలో సాయిబాబు, రాజీవ్రెడ్డి నిర్మించారు. -
అంతరిక్షంలో ఏం జరిగింది?
‘ఫిదా, తొలిప్రేమ’ వంటి హిట్ చిత్రాల తర్వాత వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ కథానాయికలు. తొలి చిత్రం ‘ఘాజీ’తో జాతీయ అవార్డు అందుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్ని దసరా సందర్భంగా విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నారు. ఈ టీజర్లోని సన్నివేశాలు సినిమాపై ఉత్కంఠ పెంచేస్తున్నాయి. అంతరిక్షంలో ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలనుకుంటున్నారు.