aditi rao Hydari
-
అదితిరావు- సిద్ధార్థ్ పెళ్లి.. ప్రపోజల్ ఫోటో వైరల్
హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరిద్దరికి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.(ఇది చదవండి: అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?)తాజాగా అదితిరావు హైదరీ న్యూ ఇయర్ సందర్భంగా పోస్ట్ చేసింది. గతేడాది జరిగిన మధుర జ్ఞాపకాలను షేర్ చేసింది. హీరామండిలో నటన, సిద్ధార్థ్ ప్రపోజల్ ఫోటోతో పాటు అతనితో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. ఓ వీడియో రూపంలో తన ఇన్స్టాలో పంచుకుంది. ఇందులో తన ఎంగేజ్మెంట్, పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి. థ్యాంక్యూ యూ 2024.. వెల్కమ్-2025 అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
'గర్ల్స్ విల్ బి గర్ల్స్' ప్రీమీయర్ షోలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
నువ్వునువ్వుగా,నేనునేనుగా..నా చేయి పట్టుకో ప్రియతమా: అదు-సిద్ధూ ఫోటోషూట్ అదిరిందిగా (ఫొటోలు)
-
రెండోసారి పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ - అదితీ (ఫొటోలు)
-
మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్-అదితీ
హీరో సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అవును మీరు సరిగానే విన్నారు. హీరోయిన్ అదితీతో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఇతడు.. సెప్టెంబరులో ఈమెని పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణలోని వనపర్తిలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయం దీనికి వేదికైంది. ఇప్పుడు మరోసారి వివాహమాడాడు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)సెప్టెంబరులో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరగ్గా.. ఇప్పుడు రాజస్థాన్లోని అలీలా ఫోర్ట్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అదితీ, సిద్ధార్థ్ తమ తమ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో తోటీ నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.'మహాసముద్రం' సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే రంగనాథ్ స్వామి ఆలయండో నిశ్చితార్థం, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ కోరిక ప్రకారం రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్) -
బ్లూ కోట్లో మెరిసిన బొమ్మరిల్లు బ్యూటీ.. గ్రీన్ డ్రెస్లో గ్లామర్ బ్యూటీ ఆదితి!
వైట్ డ్రెస్లో మరింత గ్లామర్గా రాశీ ఖన్నా..క్రిస్మస్ మూడ్లో బాలీవుడ్ భామ అమీ జాక్సన్..బ్లూ కోట్లో మెరిసిన బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా..బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ గ్లామర్ ట్రీట్..గ్రీన్ డ్రెస్లో గ్లామర్ బ్యూటీ ఆదితిరావు హైదరీ.. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
నా జీవితంలోకి ఒక దేవత వచ్చింది: పెళ్లిపై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్
కోలీవుడ్ హీరీ సిద్ధార్థ్ మరోమూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది చిన్నా మూవీతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ మిస్ యూ అంటూ వచ్చేస్తున్నారు. ఈ చిత్రంలో నా సామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఈవెంట్లో హాజరైన సిద్ధార్థ్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆదితి రావు హైదరీతో పెళ్లి తర్వాత వస్తోన్న మీ మొదటి చిత్రం.. మీ లైఫ్ ఎలా ఉందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నా లైఫ్ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇలాంటి వరం దొరికినందుకు నేను చాలా గ్రేట్ఫుల్. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. అంతేకాదు నా లైఫ్లోకి నా దేవత వచ్చింది. 2024లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్ సర్ప్రైజ్. ఏంటి మంచి జరిగిందా? అనేది. సెకండ్ రిలీఫ్. హమ్మయ్య ఆ దేవుడి దయతో అంతా మంచి జరిగిందని.. అలాంటి టైమ్లో మనం బతుకుతున్నాం కాబట్టి.. నాకైతే నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు' అంటూ తన పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు.కాగా.. కోలీవుడ్ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
పురాతన ఆలయంలో పెళ్లి.. ముందుగా ప్లాన్ చేయలేదు: ఆదితిరావు హైదరీ
కోలీవుడ్ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే తాజాగా సాహిత్య ఆజ్తక్ -2024 సదస్సుకు హాజరైన ఆదితిరావు హైదరీ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాము కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే మా పెళ్లి కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్ చేయలేదని పేర్కొంది. 400 ఏళ్లనాటి ఆలయం మా తాత, నానమ్మకు సెంటిమెంట్.. అక్కడే పెళ్లి చేసుకుంటే వారి ఆశీర్వాదాలు ఉంటాయని అన్నారు. మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం.. ఆమె హైదరాబాద్లో పాఠశాలను ప్రారంభించిందని ఆదితిరావు తెలిపింది.ఆదితి రావు హైదరీ మాట్లాడుతూ.. 'మా పెళ్లి పెద్దగా ప్లాన్ చేయలేదు. పెళ్లి జరిగిన ఆలయం మా పూర్వీకులు కట్టారు. దాదాపు 400 ఏళ్లుగా మా కుటుంబంలో భాగంగా ఉంది. అంతేకాదు ఆ ఆలయం నా కుటుంబంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అలాగే నానా, నానమ్మకు చాలా ఇష్టమైన గుడి. అందుకే అక్కడ వివాహం చేసుకోవడం వారికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. వారి ఆశీస్సులు కూడా మాకు అందాయి' అని తెలిపింది.కాగా.. ఆదితి రావు హైదరీ ఈ ఏడాది హీరామండి వెబ్ సిరీస్లో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. -
తాత ప్రధానమంత్రి.. హీరోయిన్గా పాన్ ఇండియా క్రేజ్.. అదితీ గురించి తెలుసా? (ఫొటోలు)
-
మంచు లక్ష్మి కొత్త పాఠాలు.. ఆధ్యాత్మిక బాటలో అషూ
ఫియర్ ప్రమోషన్స్లో హీరోయిన్ వేదిక బఘీర ప్రమోషన్స్లో రుక్మిణి వసంత్మానసిక ప్రశాంతత ముఖ్యమంటున్న మంచు లక్ష్మిహెబ్బా పటేల్ సెల్ఫీ పోజులు8 జ్యోతిర్లింగాలు సందర్శించిన అషూ రెడ్డిథాయ్లాండ్లో స్నేహ ఉల్లాల్లెవల్ క్రాస్ మూవీ బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) ఫోటోలు షేర్ చేసిన అమలాపాల్ View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Sneha Ullal (@snehaullal) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
హనీ సంస్థ ప్రచారకర్తగా అదితిరావు హైదరీ
న్యూఢిల్లీ: హమ్దర్ద్ హనీ తన ప్రచాకర్తగా సినీ నటి అదితిరావు హైదరీని నియమించుకుంది. ఈ సందర్భంగా ‘ద నో కాంప్రమైజ్ హనీ’ పేరుతో ఒక టీవీ ప్రచార వీడియో విడుదల చేసింది. నాణ్యత, స్వచ్ఛతల మేలికలయిక హమ్దర్ద్ బ్రాండ్కు ప్రచారకర్తగా వ్యవహరించనుండటం సంతోషం కలిగిస్తోందని అదితిరావు అన్నారు. ఆరోగ్యకర జీవన శైలి కోరుకునే ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఈ తేనె భాగం కావాలన్నారు. అదితిరావుతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై హమ్దర్ద్ సీఈవో హమీద్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. -
ఎల్లె ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2024..సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
హీరోయిన్ అదితీ జడ చూశారా? మీరు ఇలా ట్రై చేస్తే! (ఫొటోలు)
-
అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?
హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ ఇటీవలే వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాదిలోనే వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వనపర్తి ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవీ కాస్తా వైరల్ కావడంతో అభిమానులు, సినీతారలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.అయితే వీరి పెళ్లి తర్వాత నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. ఇంతకీ వీరి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆదితిరావు హైదరీ రాజవంశానికి చెందిన కుటుంబం కావడంతో అభిమానులు ఆస్తులపై ఆరా తీస్తున్నారు.అయితే ప్రస్తుతం గణాంకాల ప్రకారం అదితి రావు హైదరీ ఆస్తులు రూ.60కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఉంటుందని ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది. జాగరణ్ ఇంగ్లీష్ నివేదిక ప్రకారం నిర్మాత, హీరోగా రాణిస్తున్నసిద్ధార్థ్ ఆస్తులు కూడా దాదాపు రూ.70 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. ఈ లెక్కన ఇద్దరికీ కలిపి సుమారు రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్లకు మధ్య ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముంబయిలోని వర్సోవాలో అదితికి ఓ అపార్ట్ మెంటు కూడా ఉంది. మార్చి 2024న సిద్ధార్థ్- అదితి నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు. ఆ ఆలయంలోనే పెళ్లి ఎందుకంటే?ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ వనపర్తిలోని ఆలయంలోనే పెళ్లి చేసుకోవడంపై కూడా చర్చ మొదలైంది. దాదాపు 400ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడి అదితి కుటుంబానికి ముఖ్యమైదని సమాచారం. ఆ సెంటిమెంట్తోనే వీరి పెళ్లి అక్కడే చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదితి తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన వారసురాలు కావడం విశేషం. అదితిరావు చివరిసారిగా హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్లో కనిపించింది. సిద్ధార్థ్ ఇటీవల విడుదలైన ఇండియన్-2లో కనిపించారు. -
సిద్ధార్థ్,అదితి రావు హైదరీల పెళ్లి ఆ గుడిలోనే ఎందుకు..?
నటుడు సిద్ధార్థ్ తన ప్రియురాలు, నటి అదితి రావు హైదరీని వివాహం చేసుకున్నారు. వారు గతంలో చెప్పినట్లుగానే తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిపాటు బంధువుల సమక్షంలో వారి పెళ్లి వేడుక జరిగింది. వనపర్తి రంగనాథస్వామి ఆలయంతో అదితి రావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే అక్కడే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అక్కడే చేసుకున్నారు. దీని వెనకున్న అసలు స్టోరీ ఇదే.అదితి రావు మన తెలుగమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆమె తండ్రి పేరు ఎహసాన్ హైదరీ. తల్లి విద్యారావు. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్కు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీకి మనవడే అదితి తండ్రి అని తెలిసిందే. తల్లి విద్యా రావు ఏమో వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. అలా వనపర్తి సంస్థానానికి వారసురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్కు కూడా అదితి హైదరి మనవరాలు అవుతుంది. సినీ నిర్మాత, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు, అదితి రావు కజిన్ అవుతుందనే విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్)ఆమె ఆరవ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్ లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ పెళ్లితో అదితి రావు తన పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించింది. తమ కుటుంబంలో ఎలాంటి శుభకార్యక్రమైనా సరే శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో జరగాల్సిందే. అదీ వారికి వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్. సుమారు 400 ఏళ్ల చరిత్ర అక్కడి ఆలయానికి ఉంది. ఈ వేడుకతో ఆమె తన రూట్స్ను గౌరవిస్తోందని చెప్పవచ్చు. అదితి రావు హైదరీ 2002లో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. వనపర్తి రంగనాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా నమ్మకంతో వస్తుంటారు. అక్కడ వివాహం జరిగితే వారి బంధం బలంగా ఉంటుందనేది అందరి నమ్మకం. దీంతో అక్కడ ప్రతి ఏడాది సుమారు 500కు పైగా వివాహాలు జరుగుతాయి. రాయలకాలంలో ఈ గుడిని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. -
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అదితి-సిద్ధార్థ్ (ఫొటోలు)
-
సిద్ధార్థ్-అదితీల 'బొమ్మరిల్లు'
హీరో సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నాడు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న హీరోయిన్ అదితీ రావు హైదరీతో ఏడడుగులు వేశాడు. వనపర్తి జిల్లాలోని దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వివాహం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని అదితీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పట్టు వస్త్రాల్లో కొత్త జంట చూడముచ్చటగా ఎంత చక్కగా ఉన్నారో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)ఈ ఏడాది మార్చిలో వనపర్తి జిల్లాలోని రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం జరిగింది. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే ఈ గుడిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పెళ్లి కూడా ఇక్కడే చేసుకున్నారు. అయితే ఈ శుభకార్యం ఆదివారం జరిగిందా? సోమవారం ఉదయం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. 'మహాసముద్రం' సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. తెలుగులో 'బాయ్స్', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' లాంటి సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదితీ కూడా 'సమ్మోహనం' లాంటి సినిమాతో ఆకట్టుకుంది.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)(ఇదీ చదవండి: తమన్కి ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్న అనుష్క) -
వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?
హీరోయిన్ అదితీ రావు హైదరీ తన పెళ్లి గురించి ఓపెన్ అయిపోయింది. హీరో సిద్ధార్థ్తో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈమె.. ఈ ఏడాది ప్రారంభంలో తెలంగాణలోని వనపర్తిలోని ఆలయంలో నిశ్చితార్థం చేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్గా ఈ వేడుక జరిగిపోయింది. తాజాగా అదితీ పెళ్లి గురించి మాట్లాడింది. వనపర్తిలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఇంకా ఏమేం మాట్లాడిందంటే?అక్కడే ప్రపోజ్ చేశాడు'మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో నేను అన్ని విషయాలు షేర్ చేసుకునే దాన్ని. హైదరాబాద్లో ఆమెకు ఓ స్కూల్ ఉంది. అది నాకు చాలా స్పెషల్. నేను చిన్నప్పుడు అక్కడే ఉండేదాన్ని. కొన్నాళ్ల క్రితం ఆమె కన్నుమూశారు. ఇది సిద్ధార్థ్కి కూడా తెలుసు. అక్కడికి తీసుకెళ్లమని ఓ రోజు అడిగాడు. మార్చిలో మేం అక్కడికి వెళ్లాం. మోకాళ్లపై కూర్చుని, అతడు నాకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేశానని చెప్పాడు.'(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)పెళ్లి అక్కడే!'వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయం మా కుటుంబానికి చాలా ప్రత్యేకం. సిద్ధార్థ్తో నిశ్చితార్థం అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే. తేదీ ఖరారయ్యాక మేమేం ఎప్పుడనేది ప్రకటిస్తాం' అని అదితీ రావు హైదరీ చెప్పుకొచ్చింది.ఇద్దరు రెండోదే!సిద్ధార్థ్-అతిదీ బహుశా ఈ ఏడాదే పెళ్లి చేసుకునే అవకాశముంది. సరే దీని గురించి పక్కనబెడితే ఈ పెళ్లి ఇద్దరికీ రెండోదే. ఎందుకంటే సిద్ధార్థ్ గతంలో మేఘనా నారాయణ్ని 2003లో వివాహం చేసుకున్నాడు. కానీ నాలుగేళ్లకు ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. అదితీ కూడా సత్యదీప్ మిశ్రా అనే నటుడితో 2009-13 వరకు కాపురం చేసింది. కానీ బంధంలో కలతలు వచ్చి విడిపోయారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ) -
డిజైనర్ గాగ్రాలో అందమైన అదితి గ్రాండ్ లుక్ (ఫొటోలు)
-
Aditi Rao Hydari: హీరామండి బ్యూటీ ఆదితిరావు హైదరీ స్టన్నింగ్ లుక్స్.. (ఫోటోలు)
-
మెరిసిపోతున్న నభా నటేశ్.. వింత పోజులో ప్రగ్యా జైస్వాల్!
అమెరికన్ బీచ్లో బికినీలో మంచు లక్ష్మీడ్యాన్స్ ప్రాక్టీసులో హీరోయిన్ రాశీఖన్నాగ్లామర్ డంప్ అంతా పోస్ట్ చేసిన ఐశ్వర్య మేనన్'డార్లింగ్' పేరున్న డ్రస్తో నభా నటేశ్క్యాట్ వాక్తో కాక పుట్టించిన అదితీ రావ్ హైదరీకాటన్ చొక్కాలో వయ్యారాలు పోతున్న ఈషా రెబ్బాఫన్నీ ఫేస్తో శ్రద్ధా దాస్ పోస్ట్.. చూస్తే నవ్వులే View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Jayanti Reddy (@jayantireddylabel) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) -
Aditi Rao Hydari: పింక్ డ్రస్లో మెరిసిపోతున్న అదితీ రావ్ హైదరీ (ఫొటోలు)
-
కాబోయే భర్తకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. పిక్స్ షేర్ చేసిన హీరోయిన్!
హీరోయిన్ అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ ఈ ఏడాదిలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ ఆలయంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు. అయితే తాజాగా తనకు కాబోయే భర్తకు అవార్డులు రావడం పట్ల ఆదితిరావు సంతోషం వ్యక్తం చేసింది. ఈ గెలుపు మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.తాజాగా సిద్ధార్థ్ తన ఫిల్మ్ఫేర్ అవార్డులు పక్కన పెట్టుకుని నిద్రిస్తున్న ఫోటోను అదితి రావు హైదరి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఇటీవల జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో సిద్ధార్థ్ నటించిన చిత్తా(చిన్నా) సినిమా ఏకంగా ఏడు అవార్డులు సాధించింది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్తా మూవీకి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (క్రిటిక్స్), లీడ్రోల్లో ఉత్తమ నటి (మహిళ), ఉత్తమ సహాయ పాత్ర (ఫీమేల్), ఉత్తమ సంగీత ఆల్బమ్, ఉత్తమ నేపథ్య గాయని (ఫీమేల్) విభాగాల్లో అవార్డులు దక్కాయి. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ప్రేమ వెలుగుల్లో, అంతులేని ఆనందంలో అదితిరావు (ఫొటోలు)
-
Aditi Rao Hydari: అమాయకంగా కనిపిస్తూనే మనసులు కొల్లగొట్టేస్తుందిగా! (ఫోటోలు)
-
షరారా సూట్లో అదితిరావు హైదరి అదిరే లుక్స్ (ఫొటోలు)
-
సిద్ధార్థ్ ప్రేయసికి చేదు అనుభవం.. ఏకంగా ఆరుగంటలకు పైగా!
ఇటీవలే హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్తో అభిమానులను మెప్పించిన బ్యూటీ ఆదితి రావు హైదరీ. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరెకెక్కించిన ఈ సిరీస్కు విశేషమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈనెల 23న ముంబయిలో జరిగిన సోనాక్షి సిన్హా పెళ్లికి హాజరయ్యాడు. తనకు కాబోయే భర్త సిద్దార్థ్తో కలిసి రిసెప్షన్లో పాల్గొన్నారు.అయితే తాజాగా ఆదితి రావు హైదరీకి ఇంగ్లాండ్లో చేదు అనుభవం ఎదురైంది. ఆ దేశంలోని హీత్రో ఎయిర్పోర్ట్లో లగేజీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. తన లగేజీ కోసం ఆరు గంటలకు పైగా విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇదొక 'చెత్త ఎయిర్పోర్ట్ అని కామెంట్ చేసింది. అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది తనకు సాయం చేయకుండా.. లగేజీ కోసం ఎయిర్లైన్ సంస్థను సంప్రదించమని సలహా ఇచ్చారని వివరించింది. దాదాపు ఆరు గంటల తర్వాత కూడా తన లగేజీ అందలేదని అదితి వెల్లడించింది.కాగా.. ఆదితి రావు హైదరీ ఢిల్లీ- 6 మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. సోనమ్ కపూర్, అభిషేక్ బచ్చన్ నటించిన ఈ చిత్రంలో సహాయక పాత్రలో కనిపించింది. ఆ తరువాత లండన్, పారిస్, న్యూయార్క్, మర్డర్ 3, వజీర్, పద్మావత్ లాంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆదితి లయనెస్, గాంధీ టాక్స్ చిత్రాలలో కనిపించనుంది. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ ఏడాది హీరో సిద్ధార్థ్తో ఆదితిరావు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
సోనాక్షి పెళ్లి.. రిసెప్షన్లో మెరిసిన కాబోయే వధూవరులు!
బాలీవుడ్ భామ సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బాలీవుడ్, దక్షిణాది సినీతారలు సందడి చేశారు. బాంద్రాలో జరిగిన ఈ ఫంక్షన్లో కాబోయే వధూవరులు అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ మెరిశారు.కాగా.. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ ఈ ఏడాది మార్చి 27న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట తమ బంధాన్ని అఫీషియల్గా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా సోనాక్షి పెళ్లికి వీరిద్దరు జంటగా హాజరయ్యారు. అయితే ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్లో ఆదితిరావు కీలక పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్లో సోనాక్షి సిన్హాతో కలిసి నటించింది. వీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్లే రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. 2021 తెలుగు సినిమా మహా సముద్రం సెట్స్లో సిద్ధార్థ్, అదితి మొదటిసారి కలుసుకున్నారు. -
అక్కా.. నీ సర్జరీల కథ నాకు తెలుసు.. ఎందుకు మరి బిల్డప్? నటి కౌంటర్
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ అందంగా కనిపించేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఎంచుకుంటారు. సహజసిద్ధంగా మార్చలేని వాటి కోసం సర్జరీలను ఆశ్రయిస్తారు. అలా ఎందరో భామలు ముక్కు, పెదాలు.. ఇలా శరీర అవయవాలను తమకు నచ్చిన రీతిలో మార్చుకున్నారు. అయితే అలా సర్జరీలు చేయించుకున్నవారెవరో బాలీవుడ్ నటి రిచా చద్దాను విమర్శించినట్లున్నారు.అక్కా.. నాకు చెప్పకుఇంకేముంది సోషల్ మీడియా వేదికగా మండిపడింది. 'మరేం లేదు.. కొందరికి ఒంటినిండా విషమే! వయసు పైబడ్డా టీనేజర్లుగా ముస్తాబవుతున్నారు. పది సర్జరీలు చేయించుకుని కూడా మేము సహజంగానే అందంగా ఉంటామని పోజులిస్తున్నారు. అక్కా.. మీరు ఎన్ని సర్జరీలు చేయించుకున్నారో అవన్నీ తెలిసినవారి దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పడం? మాకు కళ్లున్నాయి. అన్నీ చూస్తున్నాం.. కాబట్టి ప్రత్యేకంగా ఏదీ చెప్పాల్సిన పని లేదు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.అదితి గురించేనా?ఇది చూసిన నెటిజన్లు రిచా ఎవరి గురించి మాట్లాడి ఉంటుందా? అని బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నటి గురించి ఆమె మాట్లాడుతోందని అర్థమవుతోంది. కానీ ఆ అక్క ఎవరై ఉంటారు? అని చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం ఇంకెవరు? అదితి రావు హైదరినే తిడుతోంది అని కామెంట్లు చేస్తున్నారు.ఆన్స్క్రీన్.. ఆఫ్స్క్రీన్.. అదే డ్రామా'హీరామండి వెబ్ సిరీస్లో ఎంత డ్రామా జరిగిందో ఆఫ్ స్క్రీన్లో అంతే డ్రామా నడుస్తోంది. రిచా చద్దా.. షర్మిన్ సెగల్ను ట్రోల్ చేసింది. షర్మిన్.. సంజీదా షైఖ్ను అవుట్సైడర్ అని మాట్లాడింది. ఇప్పుడు రిచా.. అదితిరావు మీద సెటైర్లు వేస్తోంది' అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. 'అదితినే అంటోందని క్లియర్గా తెలుస్తోంది.. అయినా రిచా ఏంటి? రోజురోజుకీ కంగనా రనౌత్లా మారుతోంది' అని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం గర్భిణి అయిన రిచా చద్దా జూలైలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.చదవండి: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. బంగారం వడ్డించారు! -
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' సీజన్-2 ప్రకటన
'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్ఫ్లిక్స్లో విడుదలై ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించింది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపింది. తెలుగులో కూడా అందుబాటులో ఉండటంతో ఇక్కడ కూడా మంచి ఆధరణే లభించింది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. త్వరలో రెండో సీజన్ కూడా విడుదల కానుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు.బాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్సిరీస్ను తెరకెక్కించడంతో ప్రేక్షకులు కూడా హీరామండి పట్ల పెట్టుకున్న భారీ అంచనాలను ఆయన నిజం చేశారు. ఇందులో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి,షర్మిన్ సెగల్,సంజీదా షేక్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించి మెప్పించారు. ఈ బిగ్ ప్రాజెక్ట్ను తన సొంత నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్తో భన్సాలీ నిర్మించాడు. అయితే, 'హీరామండి: ది డైమండ్ బజార్' సీజన్-1 సూపర్ హిట్ కావడంతో తాజాగా సీజన్ -2 ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలో విడుదల చేస్తామని సోషల్ మీడియా ద్వారా నెట్ఫ్లిక్స్ తెలిపింది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు
అందాల జాతర చేస్తున్న మాళవిక మోహనన్సన్నజాజి లాంటి నడుముతో కాక రేపుతున్న మౌనీ రాయ్బాలీలో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ మలైకా అరోరాచందమామలా మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న ఈషా రెబ్బాఆరు నెలల తర్వాత మళ్లీ అడవిలో హీరోయిన్ సదా View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by 𝐒𝐀𝐀𝐍𝐕𝐈𝐄 𝐓𝐀𝐋𝐋𝐖𝐀𝐑 (@saanvitalwar9) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
అమితాబ్ గురించి ఏదో అనుకున్నా.. ఆరోజు సీన్ షూట్ చేసేటప్పుడు..
తెలుగు బ్యూటీ అదితి రావు హైదరి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ "హీరామండి: ద డైమండ్ బజార్". దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో తన నటనకు, డ్యాన్స్కు మంచి మార్కులే పడ్డాయి. తన పర్ఫామెన్స్కు పాజిటివ్ రియాక్షన్ వస్తుండటంతో ఆనందంలో తేలియాడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.బిగ్బీతో నటించే ఛాన్స్అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన వాజీర్ సినిమాలో ఛాన్స్ వచ్చిందనగానే ఎగిరి గంతేశాను. ఆయనతో కలిసి పని చేసే అదృష్టం వస్తుందని ఊహించలేదు. బిగ్బీతో కలిసి పని చేసిన రోజుల్ని ఎన్నటికీ మర్చిపోలేను. ఆ సంతోషం, ఎగ్జయిట్మెంట్ మాటల్లో వర్ణించలేను. ఆ మూవీ అంతా తను వీల్చైర్లోనే కనిపిస్తారు. చిన్నపిల్లాడిలా..సెట్లో కూడా అదే చైర్లో కూర్చుని అంతా తిరుగుతూ ఉండేవారు. ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం చూస్తుంటే భలే ముచ్చటేసేది. వానిటీ వ్యాన్ను వదిలేసి సెట్లోనే ఉండేవారు. వాజీర్లో అమితాబ్ నాతో మాట్లాడే ఓ సీన్ ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ జరిపేటప్పుడు ఆయన నా ఎదురుగా వచ్చి పెద్ద డైలాగ్ చెప్తున్నాడు. ఆయన్ని చూస్తూ ఏడ్చేశాను. గొప్ప నటుడుతనొక పెద్ద స్టార్ కాబట్టి మనలాగా ఉండరేమో, డాబు ప్రదర్శిస్తారేమోనని ఏవేవో పిచ్చిగా ఊహించుకున్నాను. కానీ అక్కడలాంటిదేమీ లేదు. ఆయన నిజమైన యాక్టర్. నా కోసం ఆ సన్నివేశాన్ని మళ్లీ అంతే ఎమోషన్తో పూర్తి చేశారు.. నేను మళ్లీ కన్నీళ్లు ఆపుకోలేకపోయాను అని అదితిరావు హైదరి చెప్పుకొచ్చింది.చదవండి: 'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్తో పెళ్లి'.. నటి ఏమందంటే? -
Aditi Rao Hydari HD Photos: పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
-
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ అదితిరావ్ హైదరీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన భారీబడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండిలో నటించింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో సిద్ధార్థ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై స్పందించింది. సిద్ధార్థ్తో కలిసి ఉండటం ప్రేమపై నమ్మకాన్ని పెంచిందని తెలిపింది.అదితి మాట్లాడుతూ.. 'నేను కొన్ని విషయాల్లో పవిత్రతను నమ్ముతాను. మా ఇద్దరి రిలేషన్పై రూమర్స్ రావడం సహజమే. కానీ మేం మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం. వారు మా కంటే ఎంతో ప్రైవేట్గా ఉంటారు. మాకు చాలా కాల్స్ వస్తున్నందుకే మా రిలేషన్ను బయటకు చెప్పేశాం. ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం'అని తెలిపింది.ఆమె ఇంకా మాట్లాడుతూ..'నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. నా గోప్యత, పవిత్రతను నేను నమ్ముతా. నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. కానీ ప్రజలు మా పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని' తెలిపింది.కాగా.. హీరో సిద్దార్థ్తో డేటింగ్లో ఉన్న భామ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్లో ఉన్నారు. వనపర్తిలోని అతి పురాతన ఆలయంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. మా ఇద్దరి తల్లిదండ్రుల కారణంగానే నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది. సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో బిబో జాన్ పాత్రలో అదితి రావ్ హైదరీ నటించింది. -
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
బాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్లో ఈ భారీ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్తో ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట. ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్ఫిక్స్. అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్ : హీరామండి: ది డైమండ్ బజార్ (వెబ్సిరీస్)నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్, తదితరులునిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీసంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్కథ: మొయిన్ బేగ్జానర్: చారిత్రక నాటకంఎపిసోడ్స్: 8 భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్సిరీస్ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్ట్ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్తో నిర్మించాడు. పీరియాడిక్ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్సిరీస్ 'హీరామండి' సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే... బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..? ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. హీరామండిలో ఉండే షాహీ మహల్ నిర్వహణ మొత్తం మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు. అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్ అనే మరో మహల్ ఉంటుంది. అక్కడ ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్) మల్లికా జాన్కు సోదరి. బిబోజాన్ (అదితిరావ్ హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఇద్దరూ కూడా మల్లికా జాన్కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్ దత్తత తీసుకున్న కూతురు.హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే మల్లికా జాన్ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్ ప్రేమలో పడతారు. కానీ, మల్లికా జాన్ చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్దార్ (తాహా షా బహదూర్ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్తో పాటు తాజ్దార్ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్ (అదితిరావ్ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్గా బిబోజాన్ ఒక గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటీష్వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్న్ అనచివేసేందుకు ఫరీదాన్ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..పీరియాడిక్ డ్రామా చిత్రాలను డిఫరెంట్గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్డ్రాప్లో హీరామండి వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్ చాలు.. ఈ సిరీస్ డెప్త్ ఏంటో చెప్పడానికి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. లాహోర్ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్కు, బ్రిటీష్వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్లలో తన విజువల్ ఫీస్ట్తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో సంజయ్లీలా భన్సాలీ సూపర్ సక్సెస్ అయ్యాడు.తన టేకింగ్, విజువల్ ఫీస్ట్తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్ సిరీస్ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్ మాత్రం దుమ్మురేపుతాయి. మల్లికా జాన్ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది. వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్ను 'హీరామండి'గా సంజయ్లీలా తీసుకొచ్చాడు.ఎవరెలా చేశారంటేరూ. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సిరీస్లో టాప్ హీరోయిన్లను దర్శకుడు సెలక్ట్ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి స్టార్స్ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్గా సోనాక్షి సిన్హా నెగెటివ్ పాత్రలో మెప్పించింది. వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్కు ప్రధాన బలం విజువల్స్, కాస్ట్యూమ్స్,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి. -
రహస్యంగా నిశ్చితార్థం.. ఫోటోలు ఎందుకు షేర్ చేశానంటే: అదితి
కోలీవుడ్లో కాబోయే బ్యూటిఫుల్ కపుల్స్ సిద్దార్థ్ -అదితి రావు హైదరీ. గత నెలలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, ఈ విషయంపై వీరిద్దరూ కూడా మొదట అధికారికంగా ప్రకటన చేయలేదు. కొన్నిరోజుల తర్వాత మీడియాకు చెప్పారు. తాజాగా దీనిపై మొదటిసారి అదితి రావు హైదరీ రియాక్ట్ అయింది. ఇదే క్రమంలో మీడియా వాళ్లకు ఈ విషయాన్ని వెల్లడించడానికి గల కారణాన్ని కూడా ఆమె తెలిపింది. తను నటించిన 'హీరామండీ: ది డైమండ్ బజార్' వెబ్సిరీస్ ప్రమోషన్లో భాగంగా పలు విషయాలను పంచుకుంది.తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో మార్చి 27న వీరి నిశ్చితార్థం జరిగింది. ఉంగరాలతో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. 'ఆమె నాకు ఎస్ చెప్పింది' అని సిద్ధార్థ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.తాజాగా ఇదే విషయంపై హైదరీ ఇలా తెలిపింది. ' అందరూ తమ జీవితంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలను చాలా ప్రత్యేకంగా ఉన్న ప్రదేశంలో చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ క్రమంలో అందరిలా నేను కూడా నా నిశ్చితార్థాన్ని 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఈ విషయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆ దేవాలయంతో మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉండటమే.. నిశ్చితార్థం తర్వాత మా అమ్మ కోరికమేరకే ఆ ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేశాను. మా పెళ్లి విషయం గురించి తెలుసుకోవాలని చాలామంది మా అమ్మకు ఫోన్లు చేశారు. వాళ్లందరికీ ఆమె సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ నిశ్చితార్థం విషయం గురించి మీడియాకు చెప్పాలని ఆమ్మే సలహా ఇచ్చింది. ఆపై తెలిసిందే. వెంటనే నేను, సిద్ధార్థ్ సోషల్మీడియాలో ఫోటోలు షేర్ చేశాం.' అని ఆమె చెప్పింది. -
అదితీ రావ్ చుడీదార్ అందాలు.. సొగసు చూడతరమా! (ఫొటోలు)
-
ఎంగేజ్మెంట్ తర్వాత సిద్దార్థ్ ఫస్ట్ బర్త్డే.. ప్రియురాలి విషెస్ (ఫోటోలు)
-
తన లవర్బోయ్కి అదితి లవ్లీ విషెస్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ఎంగేజ్మెంట్ సీక్రెట్గా జరగలేదు, మా పెళ్లెప్పుడంటే?
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. ఒకప్పుడు సూపర్ హిట్లతో అలరించిన ఇతడికి ఈ మధ్య తెలుగులో విజయాలే కరువయ్యాయి. సినిమాల సంగతి ఎలా ఉన్నా తెలుగు హీరోయిన్ అదితిరావు హైదరితో డేటింగ్ చేస్తూ, షికార్లకు వెళ్తూ అందరి కంట్లో పడ్డాడు. కానీ తన ప్రేమ విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు. పెళ్లి కాస్తా ఎంగేజ్మెంట్ అయింది! ఈ క్రమంలో మార్చి 17న సడన్గా వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలో ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. తమిళనాడు నుంచి పురోహితులను తీసుకొచ్చి మరీ ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. కానీ ఆలయ అధికారులకు, పండితులకు అది సినిమా షూటింగ్ అని చెప్పి బురిడీ కొట్టించారు. తర్వాత ఆ డెకరేషన్, సెలబ్రేషన్స్ చూస్తే అది పెళ్లని అందరూ పొరబడ్డారు. దీంతో సిద్దార్థ్ సోషల్ మీడియా వేదికగా తానింకా పెళ్లి చేసుకోలేదని, జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రమేనని వెల్లడించాడు. సీక్రెట్ కాదు.. తాజాగా ఓ ఈవెంట్కు వెళ్లిన అతడికి ఎందుకు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు? పెళ్లి ముహూర్తాలు పెట్టించారా? అని వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సిద్దార్థ్ స్పందిస్తూ.. చాలామంది మేమేదో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నామంటున్నారు. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. మేము మా కుటుంబసభ్యులతో కలిసి ప్రైవేట్ ఫంక్షన్ చేసుకున్నాం. ఏ ఒక్కరినీ పిలవకుండా, చెప్పాపెట్టకుండా చేసుకుంటే అది సీక్రెట్ అంటారు. మరి మా వాళ్లందరి సమక్షంలో జరిగిన నిశ్చితార్థం సీక్రెట్ ఎలా అవుతుంది? పెళ్లి వారి చేతుల్లోనే.. ఇకపోతే అదితికి ప్రపోజ్ చేసినప్పుడు ఏం సమాధానం వస్తుందా? అని ఎదురుచూశాను. నా టెన్షన్ పోగొడుతూ తను నాతో జీవితాన్ని పంచుకోవడం సమ్మతమే అని అంగీకరించడంతో సంతోషపడిపోయాను. పెళ్లి విషయానికి వస్తే అది మా పెద్దలు నిర్ణయిస్తారు. నేను డిసైడ్ చేయడానికి ఇదేమీ షూటింగ్ డేట్ కాదు కదా.. పెద్దవాళ్లే ముహూర్తాలు చూసి ఓ మంచిరోజు డిసైడ్ చేస్తారు. అప్పుడే పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు. చదవండి: అతడిని ఎంతో ప్రేమించా.. పెళ్లి దగ్గర్లో ఉందనగా నేనంటే ఇష్టం లేదన్నాడు! -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో నెట్ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్సిరీస్ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్లో స్పృషించనున్నారు. ఈ సిరీస్లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్ బజార్తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. -
పెళ్లిపై స్పందించిన సిద్దార్థ్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరో!
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. డేటింగ్ను ఓపెన్గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. తాజాగా మార్చి 27న అదితిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. అయితే తన పెళ్లిపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందిచాడు. తాజాగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 'ఆమె ఓకే చెప్పింది.. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయిందని ఫ్యాన్స్ భావిస్తుంటే సిద్ధార్థ్ సడన్ షాకిచ్చాడు. ఎంగేజ్మెంట్ పోస్ట్తో అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చి పడేశాడు. మరి వీళ్లద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
Siddharth-Aditi Rao Marriage: సిద్దార్థ్ పెళ్లిలో ట్విస్ట్.. వారికి అబద్ధం చెప్పారా?
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్ను ఓపెన్గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. వీళ్ల ప్రేమ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా? అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో నిన్న(మార్చి 27న) అదితిని సీక్రెట్గా పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. షూటింగ్ అని చెప్పి వనపర్తే ఎందుకంటే? అదితిరావు హైదరి పూర్వీకులు వనపర్తి సంస్థానాధీశులు. అందుకనే ఆ సంస్థానానికి చెందిన ఆలయంలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆలయంలో పని చేసే స్థానిక పూజారులకు సినిమా షూటింగ్ అని చెప్పి గుడిని అందంగా ముస్తాబు చేశారట! వారిని లోపలకు రానివ్వకుండా తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పెళ్లి తంతు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి మండపం, గుడిని డెకరేట్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కన్ఫమ్ చేసిన హోస్ట్ అదితి రావు హైదరి హీరామండి: ద డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని ముంబైలో బుధవారం నిర్వహించారు. సిరీస్లో నటించిన అందరూ స్టేజీపై మెరిశారు, ఒక్క అదితి తప్ప! ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సచిన్ కుంబర్ మాట్లాడుతూ.. అదితి ఇక్కడ ఎందుకు లేదో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఆమె పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి అని తెలిపారు. దీంతో సిద్దార్థ్- అదితి పెళ్లి నిజమేనని అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. చదవండి: గతంలో విడాకులకు దరఖాస్తు.. ఇప్పుడేమో ఇంకో ఆప్షన్ లేదంటూ.. -
Siddharth-Aditi Rao Photos: ఆ వార్తల్లో నిజమెంత?.. ట్రెండింగ్ లో సిద్దార్థ్ ,అదితిరావు హైదరీ
-
అదితిని పెళ్లాడిన సిద్ధార్థ్.. ఆ విషయంపైనే అందరి చర్చ!
ఎట్టకేలకు టాలీవుడ్ హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరిని పెళ్లాడారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో వీరిద్దరి పెళ్లికి జరిగింది. రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021)చిత్రంలో నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు ఈ జంటపై వస్తున్న రూమర్స్ను నిజం చేస్తూ.. ఒక్కసారిగా వాటన్నింటికీ తెరదించారు. పెళ్లి జరిగిపోవడంతో వీరిద్దరి గురించి అభిమానులు తెగ వెతికేస్తున్నారు. అయితే ఈ జంట వయస్సు గురించి అభిమానులు చర్చ మొదలెట్టారు. ఈ జంటకు ఏజ్ గ్యాప్ ఎంత ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. మరీ మీరు ఈ విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఆ వివరాలు ఏంటో చూసేయండి. (ఇది చదవండి: హీరో సిద్దార్థ్ మాజీ భార్య గురించి తెలుసా?) అదితి రావు హైదరి అక్టోబర్ 28న 1986న ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 37 సంవత్సరాలు. మరోవైపు హీరో సిద్దార్థ్ 1979 ఏప్రిల్ 17న చెన్నైలో జన్మించారు. వీరిద్దరి మధ్య దాదాపు 7 సంవత్సరాల వయస్సు తేడా కనిపిస్తోంది. కాగా.. గతంలో అదితి సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. అతను ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ సైతం మొదట మేఘనా నారాయణ్ను పెళ్లాడారు. ఆమెతో 2007లోనే సిద్ధార్థ్ విడాకులు తీసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అదితి రావు హైదరీ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన అదితి.. తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం మూవీస్లో హీరోయిన్గా మెరిసింది. మరోవైపు సిద్ధార్థ్.. కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ -2లో నటించనున్నారు. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, ఓయ్, ఓ మై ఫ్రెండ్ చిత్రాలతో మెప్పించారు. -
హీరో సిద్దార్థ్ మాజీ భార్య గురించి తెలుసా?
సిద్దార్థ్ తమిళ హీరో.. కానీ తెలుగులో కూడా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాయ్స్ సినిమాతో వరుస అవకాశాలు అందుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో తన నటనతో కట్టిపడేశాడు. బొమ్మరిల్లు మూవీతో స్టార్ హీరో అయిపోయాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆట, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు.. ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ నెమ్మదిగా తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో టాలీవుడ్కు దూరమయ్యాడు. ఆ మధ్య మహాసముద్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా హిట్ కొట్టలేకపోయాడు. గతంలో పెళ్లి కొంతకాలంగా హీరోయిన్ అదితిరావు హైదరితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాడు సిద్దార్థ్. మీడియా ముందు మాత్రం ఆమెతో కలిసి పోజివ్వడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఈరోజేమో సడన్గా అదితిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు.. అతడికి ఆల్రెడీ పెళ్లయిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ టీనేజ్ కుర్రాడిలాగే కనిపిస్తాడు కాబట్టి ఇది రెండో పెళ్లంటే నమ్మలేకపోతున్నారు. మూడేళ్లకే మనస్పర్థలు సిద్దార్థ్ 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఢిల్లీలో అతడి పక్కింట్లోనే ఉండేది. సిద్దార్థ్- మేఘన మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మూడేళ్లకే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కలిసుండటం కష్టమని భావించి 2007లో విడాకులు తీసుకున్నారు. హీరోయిన్ సోహా అలీ ఖాన్తో ప్రేమ వ్యవహారం నడపడం వల్లే దంపతుల మధ్య గొడవలు తలెత్తాయని అప్పట్లో మీడియా కోడై కూసింది. ఆమె వల్లే బ్రేకప్ వారు తరచూ కలుసుకుంటూ, సినిమాలకు వెళ్తూ కనిపించడంతో ఇది నిజమేనని పలువురు భావించారు. సదరు హీరోయిన్ మాత్రం తాము కేవలం స్నేహితులమేనని ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం సిద్దార్థ్.. సోహాతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. కొంతకాలానికి వీరు కూడా విడిపోయారు. చదవండి: తెలుగు హీరోయిన్ను పెళ్లాడిన సిద్దార్థ్.. ఇద్దరికీ రెండోదే! -
సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్
హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో బుధవారం (మార్చి 27న) ఈ వివాహం జరిగింది. తమిళనాడు పురోహితులు దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించడం విశేషం. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య సిద్దార్థ్- అదితి పెళ్లి జరిగింది. జర్నీ ఎక్కడ మొదలైంది? అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021) మూవీలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఇద్దరూ వెకేషన్కు, ఈవెంట్స్కు కలిసే వెళ్తున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్, పెళ్లికి సైతం జంటగా హాజరవడంతో వీరి ప్రేమ నిజమేనని అభిమానులు భావించారు. ఓ షోలో మీతో జీవితాంతం కలిసి డ్యాన్స్ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అని సిద్దార్థ్కు ప్రశ్న ఎదురవగా.. 'అదితి' దేవో భవ అంటూ తన ప్రేమ గురించి చెప్పకనే చెప్పాడు. కానీ డైరెక్ట్గా తన ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని సిద్దార్థ్.. ఇప్పుడేకంగా సీక్రెట్గా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎవరీ అదితి? అదితిరావు హైదరి.. అచ్చ తెలుగమ్మాయి. తన కెరీర్ మొదలైంది మాత్రం మలయాళ సినిమాతో! హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం మూవీస్లో హీరోయిన్గా మెరిసింది. గతంలో ఈమె సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది. 2012లో అతడికి విడాకులిచ్చింది. సిద్దార్థ్ కూడా గతంలో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లాడాడు. వీరి మధ్య బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. సినిమాల విషయానికి వస్తే బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, ఓయ్, ఓ మై ఫ్రెండ్.. ఇలా ఎన్నో సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు. చదవండి: తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్ -
Aditi Rao Hydari: స్టైల్ అండ్ లుక్స్తో చంపేస్తున్న హైదరాబాదీ బ్యూటీ ఫోటోలు
-
మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. వీడియో వైరల్!
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్ఠ్. గతేడాది చిన్నా సినిమాతో అభిమానులను అలరించారు. అయితే సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్ ఆదితి రాయ్ హైదరతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరు జంటగా కనిపించారు. ఇప్పటికే చాలాసార్లు జంటగా కనిపించిన వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా రూమర్ జంట మరోసారి కెమెరాలకు చిక్కింది. ముంబైలో ఓ ఫంక్షన్కు హాజరైన వీరిద్దరు ఫోటోలకు పోజులిచ్చారు. తాజాగా ముంబయికి చెందిన నటి నటాషా పూనావాలా తన నివాసంలో నిర్వహించిన కచేరీకి పార్టీకి ఈ జంట హాజరయ్యారు. ఈ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న అదితి, సిద్ధార్థ్ కెమెరాల కంటికి చిక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. వీరిని చూసిన ఫోటోగ్రాఫర్ 'ఆదితి జీ ఏక్ కపుల్ ఫోటో ప్లీజ్' అంటూ సరదాగా ఆమెను ప్రశ్నించారు. దీనికి నవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. వీరితో పాటు అక్కడే ఉన్న నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కనిపించారు. అయితే వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పట్ల ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. సినిమాల విషయానికొస్తే అదితి ప్రస్తుతం ఇండో-యుకె కో-ప్రొడక్షన్ 'లయనెస్'లో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అదితి.. సంజయ్ లీలా భన్సాలీ 'హీరమండి' చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!
‘సమ్మోహనం’తో టాలీవుడ్ అభిమానులకు పరిచయమైన హీరోయిన్ అదితి రావు హైదరీ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. తాజాగా తన 37వ పుట్టినరోజును జరుపుకుంది. అక్టోబర్ 28న జన్మించిన ఈ హైదరబాదీ భామ తెలుగులో సైకో, అంతరిక్షం, హే సినామికా లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: పునీత్ రాజ్కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే కోలీవుడ్ హీరోతో మన హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మహా సముద్రం చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీని అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కించగా.. టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చాలా సార్లు వార్తలొచ్చాయి. ఈ జంట లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా ఇద్దరు కలిసి పార్టీల్లో కనిపించడంతో వీరి రిలేషన్పై నిజమేనంటూ కథనాలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా అదితి బర్త్డే సందర్భంగా సిద్ధార్థ్ తన ఇన్స్టాలో విషెస్ చెప్పారు. ఈ ఒక్క పోస్ట్తో వీరిద్దరి రిలేషన్పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కోలీవుడ్ హీరో. అయితే ఈ ఫోటోను మహాసముద్రం డైరెక్టర్ తన ట్విటర్లో షేర్ చేశారు. దీనంతటికీ కారణం నేనేనా? అంటూ కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ..' దీనికి కారణం నేనే అని అందరూ అనుకుంటున్నారు... అసలు ఏం జరుగుతోంది??' అంటూ అదితి, సిద్ధార్త్ ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. కాగా.. సిద్ధార్థ్ ఇటీవలే చిన్నా(చిత్తా) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అదితి ప్రస్తుతం గాంధీ టాక్స్, లయనీస్ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. (ఇది చదవండి: 'గంగమ్మ తల్లిమీద ఒట్టు'.. అలా జరిగిందంటే.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్!) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) Everyone thinks I'm the reason for this... What's actually happening?? 🤔#Siddharth @aditiraohydari pic.twitter.com/vcXQcMrmvu — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2023 -
Birthday Special: అదిరే అందం..అదితి హైదరి సొంతం
-
బీచ్లో పూనమ్ హంగామా.. శ్రీలీల హాట్ లుక్
మత్తెక్కించే పోజుల్లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల డెన్మార్క్ లో సందడి చేస్తున్న నివేదా వయ్యరమైన పోజుల్లో అదితీరావు హైదరీ క్యూట్ పోజుల్లో కవ్విస్తున్న 'కాంతార' పాప దగదగా మెరిసిపోతున్న హాట్ బ్యూటీ నోరా జీన్స్ వేర్లో ప్రియా వారియర్ స్టన్నింగ్ పోజులు రాయల్ ఔట్ఫిట్లో ఫరియా డిఫరెంట్ లుక్ View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) -
అదితీ అందాల జాతర.. హన్సిక స్టన్నింగ్ లుక్
అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న అదితీ చీరలో కొత్తగా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ నడుము చూపిస్తు టెంప్ట్ చేస్తున్న హన్సిక మాల్ ఓపెనింగ్లో పూజాహెగ్డే డ్యాన్స్ సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్న రుహానీ ఓనం లుక్లో 'దృశ్యం' పాప ఎస్తర్ కిక్కేచ్చే పోజుల్లో 'డీజే టిల్లు' బ్యూటీ బీచ్ ఒడ్డున్న బికినీలో మౌనీరాయ్ చీరకట్టులో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రణీత View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) @hegdepooja Dance #ArabicKuthu🥳#ThalapathyVijay🙏🏻 #PoojaHegde 🤩#Beast #LEO #BloodySweet 🥵 pic.twitter.com/BP4uSGFZ8j — 𓄂༺քʀǟӄǟֆɦʋɨʝǟʏ༻𓃭 (@Prakash_ssam) August 25, 2023 View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by ESTHER ANIL (@_estheranil) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Komalee Prasaad (@komaleeprasad) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) -
హీరో అక్కర్లేదు.. యంగ్ హీరోయిన్స్ దానికి సై
నాయికా ప్రాధాన్యంగా సాగే చిత్రాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. కథానుసారం ఫైట్లు చేయాలి.. పవర్ఫుల్ డైలాగులు చెప్పాలి.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకన్నా కాస్త ఎక్కువగానే ఎమోషన్ పండించాలి.. అవసరమైతే క్యారెక్టర్కి తగ్గట్టు సన్నబడాలి లేదా బరువు పెరగాలి లేదా నల్లటి మేకప్ వేసుకోవాలి. అన్నింటికీ మించి సినిమా మొత్తం ఆ నాయిక తన భుజాల మీద మోయాలి. ‘లేడీ ఓరియంటెడ్’ మూవీ అంటే పెద్ద సవాల్. అలాంటి సవాల్ వస్తే కాదనకుండా ఒప్పేసుకుంటారు కథానాయికలు. ప్రస్తుతం ముగ్గురు నాయికలు తొలిసారి ‘హాయ్ హాయ్ నాయికా’ అంటూ లేడీ ఒరియంటెడ్ మూవీకి సై అన్నారు. ఎమోషనల్ రెయిన్ బో రష్మికా మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటివరకూ ఎక్కవగా కమర్షియల్ చిత్రాలే చేశారు. ‘రెయిన్ బో’ చిత్రంతో తొలిసారి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు రష్మికా మందన్నా. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు శాంత రూబన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రధానంగా ఎమోషన్స్తో సాగుతుందట. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ కానుంది. రోడ్ ట్రిప్ మనాలి, లడఖ్ లొకేషన్స్తో ΄ాటు నార్త్లోని మరికొన్నిప్రాంతాల్లో రోడ్ ట్రిప్ చేస్తున్నారట హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. ఇది పర్సనల్ ట్రిప్ కాదు... ్ర΄÷ఫెషనల్ ట్రిప్ అని తెలిసింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ దర్శకత్వంలో రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీలో అనుపమా పరమేశ్వరన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, మలయాళ యంగ్ బ్యూటీ దర్శన, సీనియర్ నటి సంగీత లీడ్ రోల్స్ చేస్తున్నారు. ముగ్గురు మహిళల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని టాక్. మరోవైపు ఈ సినిమా కంటే ముందే ‘బటర్ ఫ్లై’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేశారు అనుపమా పరమేశ్వరన్. అయితే ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అనుపమ చేస్తున్న చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. సో.. వెండితెరపై అనుపమ కనిపించనున్న తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇదే అవుతుందనుకోవచ్చు. వచ్చె నెలలో ఆరంభం ‘సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం’ వంటి తెలుగు సినిమాలతో నటిగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు హీరోయిన్ అదితీరావ్ హైదరి. ఈ బ్యూటీ సౌత్లో ఫస్ట్టైమ్ ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. దర్శక– నటుడు రాజేష్ ఎమ్. సెల్వ ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ΄్లాన్ చేస్తున్నారని, ఈ చిత్రంలోని మెయిన్ లీడ్ క్యారెక్టర్కు అదితీరావ్ని ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో చిత్రీకరణప్రారంభించుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. త్రిష, అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా, నయనతార, సమంత వంటి తారలు ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరికొందరు ఈ తరహా చిత్రాలపై మొగ్గు చూ΄ారు. వీరి స్ఫూర్తితో కొందరు యువకథానాయికలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు సైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ∙ -
తొలి అడుగు
ఇటు సౌత్.. అటు నార్త్.. కాస్త ఖాళీ దొరికితే డిజిటల్ వరల్డ్... ఇలా వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటున్నారు హీరోయిన్ అదితీరావ్ హైదరి. అయితే తొలిసారి ఈ బ్యూటీ ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ సమాచారం. తమిళ దర్శక–నటుడు రాజేష్ ఎమ్. సెల్వ ఇటీవల కథానాయిక ప్రాధాన్యంగా సాగే ఓ కథ తయారు చేశారని, ఈ కథ విని, ఇందులోని పాత్ర నచ్చడంతో అదితీరావ్ హైదరి పచ్చ జెండా ఊపారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ఆరంభం కానుందట. లేడీ ఓరియంటెడ్ చిత్రాల పరంగా అదితీకి ఇది తొలి అడుగు. మరి.. ఈ తొలి అడుగుతో ఈ తరహా చిత్రాలు ఇంకెన్ని చేస్తారో చూడాలి. ఇక ‘సమ్మెహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం’ వంటి చిత్రాలతో అదితీరావ్ హైదరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. -
చిన్న గ్యాప్ తర్వాత కోలీవుడ్లో సినిమా చేస్తున్న హీరోయిన్
బహుభాషా నటి అతిథి రావు హైదరి.. బాలీవుడ్లో రంగ ప్రవేశం చేసిన తర్వాత అక్కడ పలు చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించింది. ఈ బ్యూటీని మణిరత్నం కోలీవుడ్కి పరిచయం చేశారు. కార్తీకి జంటగా 'కాట్రు వెలియిడై' అనే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మళ్లీ మణిరత్నమే సెక్క సెంవంద వానం చిత్రంలో అవకాశం కల్పించారు. ఆ మధ్య హే సినామికా చిత్రంలో దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ లతో కలిసి నటించిన ఈమె సముద్రం అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సమయంలోనే ఆ చిత్ర కథానాయకుడు సిద్ధార్థతో పరిచయం ప్రేమగా మారిందని ప్రచారం జోరందుకుంది. అదేవిధంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్ వైరల్ అవుతోంది. ఇకపోతే మరాఠీ, ఆంగ్లం చిత్రాల్లోనూ నటిస్తున్న అతిథి రావ్ చిన్న గ్యాప్ తర్వాత తాజాగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి రాజేష్ సెల్లా దర్శకత్వం వహించినట్లు సమాచారం. నాజర్, వసుంధర కలిసి నటించిన కాలైప్పణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ఈయన ఆ తరువాత విక్రమ్, త్రిష జంటగా నటించిన తూఝగావనం, విక్రమ్ కథానాయకుడిగా నటించిన కడారం కొండాన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఆరై అనే వెబ్సిరీస్కు దర్శకత్వం వహించారు. కాగా నటి అతిథి రావ్ ప్రధాన పాత్రలో నటించే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: విశ్వక్ సేన్ కౌంటర్స్.. బేబీ డైరెక్టర్కేనా? -
స్టైలిష్ లుక్స్తో మతి పోగొడుతున్న అదితి రావు హైదరీ
-
సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. ఇటీవలే తాను హీరోగా నటించిన చిత్రం ‘టక్కర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. (ఇది చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..) చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్లో సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సిద్ధార్థ్.. బాలీవుడ్ భామ ఆదితి రావు హైదరితో డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ జంట చాలాసార్లు ఫంక్షన్లలో తళుక్కున మెరిశారు. గతంలో ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ కలిసి టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్కు కూడా హాజరయ్యారు. ఇటీవలే రాజస్థాన్లో జరిగిన పెళ్లిలోనూ జంటగా పాల్గొన్నారు. దీంతో ఈ జంట పీకల్లోతు డేటింగ్లో ఉన్నట్లు మరోసారి వార్తలు వైరలయ్యాయి. అయితే తాజాగా ఓ టీవీ షోలో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ చూస్తే ఈ రూమర్స్ నిజమనే తెలుస్తోంది. ఇంతకీ సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఓ టీవీ షోలో పాల్గొన్న సిద్ధార్థ్ను యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. జీవితాంతం మీతో కలిసి డ్యాన్స్ చేయాలనుకునే ఆమె ఎవరైనా ఉన్నారా? అని అడిగింది. దీనికి సమాధానమిస్తూ..'మా ఊర్లో అందరూ 'ఆదితి దేవో భవ అంటారు' కదా అంటూ నవ్వుతూ అన్నారు. దీంతో అతిథిని ఆదితి పేరుతో పిలవడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సిద్ధార్థ్ సమాధానంతో ఆదితి రావు హైదరీతో డేటింగ్ ఖాయమని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!) Awwww did he just accept?? CUTE. ❤️❤️🧿#Siddharth pic.twitter.com/x9pVfv8SHT — Shravani (@shravd05) June 9, 2023 -
శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!
యంగ్ హీరో సిద్దార్థ్తో హీరోయిన్ అదితి రావు హైదరీ డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ఎక్కువగా పార్టీల్లో కనిపించడంతో అభిమానులు వీరి గురించే చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరి రిలేషిప్పై ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. గతంలో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ జంట జైపూర్లో జరిగిన శర్వానంద్ పెళ్లికి కూడా హాజరయ్యారు. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) శర్వానంద్ పెళ్లికి జైపూర్ వెళ్తూ అదితి, సిద్ధార్థ్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో జంటగా కనిపించారు. సిద్ధార్థ్, అదితి విమానాశ్రయం లోపలికి వెళ్తూ కనిపించారు. అంతే కాకుండా జైపూర్లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి కూడా వెళ్లారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా శర్వానంద్ పెళ్లికి జంటగా వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by Bina Kak (@kakbina) -
అదితిరావు హైదరితో డేటింగ్ గురించి సిద్ధార్థ్ మాటల్లో వినండి..!
-
ఇండియన్ 2 లో నా క్యారెక్టర్..? ప్రభాస్, నేను పుట్టుమచ్చల గ్యాంగ్!
-
కాదు.. లేదు అంటూనే!
కాదంటే అవుననిలే...అనే సూపర్ హిట్ పాట ఉంది కదా. ఇప్పుడు నటుడు సిద్ధార్థ్, నటి అతిథి రావ్ హైదరి పరిస్థితి ఇలానే ఉంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. సినీ వివాహ వేడుకల్లో తళుక్కున మెరుస్తూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులిస్తారు. లవ్వా అంటే చా..చా... అలాంటిదేమీ లేదు....మంచి స్నేహితులం అంటారు. మీడియాలో మాత్రం సిద్ధార్థ్, అతిథి రావ్ హైదరి సహజీవనం అంటూ వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఈ సంచలన జంట గురించి కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయిన నటుడు సిద్ధార్థ్. మణిరత్నం దర్శకత్వం వహించిన కాట్రు వెలియిడై చిత్రంతో కోలీవుడ్కు అతిథి రావ్ హైదరి పరిచయం అయ్యింది. అయితే వీరిద్దరూ కలిసి తెలుగులో సముద్రం అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం ప్లాప్ అయినా వీరి మధ్య పరిచయం బలపడిందంటారు. మరో విషయం ఏంటంటే సిద్ధార్థ్కి ఇప్పటికే పెళ్లి, విడాకులు కావడం జరిగిపోయింది. నటి అతిథి రావ్ హైదరిదీ ఇదే పరిస్థితి. దీంతో ఈ జంట ముచ్చట చూసి ప్రేమలో ఉన్నారని, పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా తాజాగా వీరిద్దరూ కలిసి ఒక పాటకు చేసిన డాన్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతంది. అయితే దీనిపై వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. -
హీరోయిన్తో సిద్దార్థ్ చెట్టాపట్టాల్.. లవ్లీ జోడీ అనగానే సిగ్గులమొగ్గైన అదితి
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని అటు ఫిల్మీదునియాలో ఇటు సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది. అబ్బే, అదేం లేదంటూనే వీరిద్దరు పార్టీలకు, షికార్లకు వెళ్తూ ఉంటారు. వీళ్లు జంటగా కనిపించిన ప్రతిసారి అభిమానులు మాత్రం భలే ఉన్నారిద్దరూ అని ముచ్చటపడిపోతుంటారు. తాజాగా సిద్దార్థ్, అదితి ముంబైలో జూబ్లీ వెబ్ సిరీస్ ప్రీమియర్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ జంటగా కెమెరాకు పోజులిచ్చారు. అక్కడున్న వాళ్లు ఈ జంటను చూసి లవ్లీ జోడి అని కామెంట్ చేయగా అదితి సిగ్గుపడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సిద్, అదితి ఎంత ముద్దొస్తున్నారో.. అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇప్పటికైనా ఇది ప్రేమంటారా? కాదంటారా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో అదితి రావుకు సిద్దార్థ్తో డేటింగ్పై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ అందరితో పంచుకునే విషయం ఏదైనా ఉంటే నేనే చెప్తానంటూ మాట దాటవేసింది. అయినా నేనేం చెప్పినా చివరకు మీకు నచ్చినట్లుగానే ఊహించుకుంటారుగా అని కౌంటర్ వేసింది. కాగా వీరిద్దరూ మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచే ఈ లవ్ మొదలైందని టాక్! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అదితిరావు హైదరీతో సాక్షి స్పెషల్ చిట్ చాట్
-
హీరో సిద్ధార్థ్తో డేటింగ్పై ప్రశ్న.. అదితి షాకింగ్ కామెంట్స్
హీరో సిద్దార్థ్తో డేటింగ్ వార్తలపై హీరోయిన్ అదితి రావు హైదరి మరోసారి స్పందించింది. గతంలో డేటింగ్ రూమర్స్ను ఖండించిన అదితికి తాజాగా ఇంటర్య్వూలో అదే ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఆమె నటించిన తాజ్ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో ఆమె ఓ చానల్కు ఇంటర్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా రిలేషన్షిప్పై స్పందించాలని యాంకర్ ఆమెను కోరగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. అందరితో పంచుకునే విషయం ఏదైనా ఉంటే నేను చెప్తాను అంది. చదవండి: ఇంత నిర్లక్ష్యమా..‘విరూపాక్ష’ మేకర్స్పై హీరోయిన్ ఆగ్రహం తన రిలేషన్ స్టేటస్పై మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికి ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి వాటిపై ఉండొచ్చు. కానీ, చాలా మందికి మమ్మల్ని స్క్రీన్పై చూడటమంటనే ఇష్టం. అందుకు అనుగుణంగా మేము మరింత కష్టపడి పనిచేయాలి. మా పనిని ప్రేమించాలి. అలా చేసినప్పుడే మీకు మంచి కంటెంట్ను అందించగలం. అదే మాకు ముఖ్యం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అనంతరం సిద్దార్థ్తో రిలేషన్పై మాట్లాడుతూ అసహనం చూపించింది. చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు.. ‘ఈ విషయంలో మీకే ఒక అభిప్రాయం ఉంది. ఇంకా నేనేమి చెప్పాలి. ఒకవేళ నేను ఏం చెప్పినా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు’ అని వాఖ్యానించింది. దీంతో యాంకర్ ఇది ఆడియన్స్ ప్రశ్న అనగానే వారెప్పుడు తనని ఇలాంటి ప్రశ్న అడగలేదని, మీరు అడుగుతున్నారంటూ నవ్వుతూ చెప్పింది. కాగా అదితి-సిద్ధార్థ్లు మాత్రం తమపై వచ్చే రూమర్స్ పట్టించుకోకుండా కలిసి పార్టీలు, విందులకు హాజరవుతున్నారు. అంతేకాదు వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, రీల్స్ను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నారు. -
Aditi Rao Hydari Photos: ట్రెడిషనల్ లుక్లో హీరోయిన్ అదితి.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)
-
సిద్దార్థ్తో లవ్.. స్పందించిన హీరోయిన్
ప్రేమలో పడటం సహజమే.. కానీ ఆ ప్రేమ విషయాన్ని కొందరు మాత్రమే నిర్మొహమాటంగా చెప్తారు. సినీ ఇండస్ట్రీలో అయితే అతికొద్ది మంది మాత్రమే అవునని ఒప్పుకుంటారు, లేదంటే లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. కానీ హీరోహీరోయిన్లు సెట్స్లో కాకుండా బయట కలిసి కనిపించినా, షికార్లు కొడుతూ కెమెరాలకు చిక్కినా వారిని మాత్రం లవ్ బర్డ్స్గానే వర్ణిస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సెలబ్రిటీలు మాత్రం అది ప్రేమ అనో, స్నేహమనో క్లారిటీ ఇవ్వరు. దీంతో ఇది కచ్చితంగా లవ్వేనని అంతా ఫిక్సైపోతారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి రూమర్స్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావుల మధ్య ఎక్కువయ్యాయి. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ పాటకు చిందేసిన డ్యాన్స్ సైతం తెగ వైరల్ అయింది. తాజాగా తన గురించి వస్తున్న ప్రేమ పుకార్లపై స్పందించిందీ హీరోయిన్. 'నేను ఎవరితో ఏ రిలేషన్లో ఉన్నాను అనేదానిపై కాకుండా నా సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతం నేను పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. మంచి డైరెక్టర్లతో కలిసి పని చేస్తున్నాను. కెరీర్పైనే దృష్టి సారించాను. నన్ను నటిగా అంగీకరించినంతవరకు నటిస్తూనే ఉంటా. దయచేసి నా వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి వృత్తిపరమైన విషయాల గురించి మాట్లాడండి' అని పేర్కొంది అదితి. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
రూమర్డ్ గర్ల్ఫ్రెండ్తో హీరో సిద్దార్థ్ డ్యాన్స్.. వీడియో వైరల్
హీరోయిన్ అదితి రావ్ హైదరితో హీరో సిద్దార్థ్ ప్రేమలో ఉన్నాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహాసముద్రం అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు అప్పటినుంచి ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. ఇదిలా ఉంటే మరోసారి ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. సిద్దార్థ్-అదితి కలిసి విశాల్ నటించిన ‘ఎనిమీ’ సినిమాలోని పాపులర్ ‘టమ్ టమ్’అనే పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియోను అదితి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వీరి డ్యాన్స్ రీల్ నెట్టింట వైరల్గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఇంక లేట్ ఎందుకు త్వరలోనే మీ రిలేషన్షిప్ అనౌన్స్ చేయండి.. మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ఒకే ఫ్రేంలో అందాల తారలు.. కనుల పండుగగా హీరామండి ఫస్ట్లుక్
బాలీవుడ్లో దిగ్గజ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. వాస్తవిక కథలను, హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్టా. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, దేవదాస్, ‘బాజీరావ్ మస్తానీ’వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకులకు అందించారు. ఇక ఆయన ఓ వెబ్ సిరీస్తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పలువురు అగ్ర నటిమణులతో హీరామండి అనే వెబ్ సిరీస్ను నెట్ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున ఈ సిరీస్ వేశ్యల కథ నేపథ్యంలో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సిరీస్ను నుంచి అప్డేట్ ఇచ్చింది నెట్ఫ్లిక్స్. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ క్వీన్స్ గెటప్లలో రాయల్ లుక్లో కనిపించారు. అందమైన తారలంతా ఒకే ఫ్రేంలో రాయల్ లుక్లో కనిపించడంతో ఫ్యాన్స్ అంత కనుల పండుగా చేసుకుంటున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. కాగా స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్లో స్పృషించనున్నారు. ఈ సిరీస్లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. Another time, another era, another magical world created by Sanjay Leela Bhansali that we can’t wait to be a part of. Here is a glimpse into the beautiful world of #Heeramandi 💫 Coming soon! pic.twitter.com/tv729JHXOE — Netflix India (@NetflixIndia) February 18, 2023 -
ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ హీరో సిద్ధార్థ్తో డేటింగ్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజులుగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరి నుంచి అధికారిక సమాచారం లేదు. చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్ రీసెంట్గా యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇవాళ వాలంటైన్స్ డే సందర్భంగా అదితి సిద్ధార్థ్కు షాకిచ్చింది. సిద్ధార్థ్కు కాకుండ మరో సీనియర్ హీరోకి ఆమె ప్రపోజ్ చేసింది. వాలంటైన్స్ డే సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్కి బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్రతో పాటు అదితి కూడా ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా అదితి ఆయనకు రెడ్ గులాబి ఇచ్చి సరదగా ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఈ ఫొటోని అదితి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దీనికి ‘ది మోస్టెస్ట్ హ్యాండ్సమ్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పోస్ట్పై హీరో సిద్ధార్థ్ స్పందించడం విశేషం.పోస్ట్ 2 హార్ట్ ఎమోజీలతో అదితి పోస్ట్పై స్పందించాడు. అయితే వాలంటైన్స్ డే రోజున సిద్ధార్థ్కు ప్రపోజ్ చేయకపోవడం ఏంటి? అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్పై స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. కాగా సిద్ధార్థ్, అదితి రావు హైదరీలు మహాసముద్రం చిత్రంలో ప్రేమికులుగా నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం ఆమె అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ ఆమె హీరో సిద్ధార్థ్తో డేటింగ్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు ఇటీవల యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంతో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించారు. దీంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే అప్పటికే అదితికి పెళ్లై విడాకులు అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను గతంలో ఆమె వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. 2009లో వీరి వివాహం జరగ్గా.. 2013లో వీరిద్దరూ విడిపోయారు. అయితే ఇటీవల ఆమె మాజీ భర్త సత్యదీప్ మిశ్రా బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు సత్యదీప్ మిశ్రా. ఈ సందర్భంగా తన మాజీ భార్య అదితిని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: నటుడిగా బ్రహ్మానందం ఎన్ని వందల కోట్లు సంపాదించాడో తెలుసా? ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘అదితితో నా రిలేషన్ కారణంగా ప్రేమపై నాకు విరక్తి కలిగింది. మరోసారి ప్రేమ, పెళ్లి అంటేనే భయం వేసింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు మళ్లీ రిలేషన్, ప్రేమ అంటే భయపడతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం’ అని మిశ్రా చెప్పుకొచ్చాడు. ఇక అనంతరం మసాబాతో ప్రేమ, రెండో పెళ్లిపై స్పందిస్తూ.. ‘మా పెళ్లి చాలా సింపుల్గా జరగాలని అనుకున్నాం. అందుకే కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఇండస్ట్రీ వాళ్ల కోసం చిన్న పార్టీ ఏర్పాటు చేశాం. ఎందుకంటే మా బంధాన్ని మేం రహస్యంగా ఉంచాలనుకోలేదు. ఎందుకంటే సీక్రెట్స్ అనేవి రిలేషన్స్ని ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను. బంధాన్ని సొంతం చేసుకోవాలి.. ఒపెన్గా ఉండాలి’ అని పేర్కొంది. ఇక ఆయన సమాధానం విన్న కొందరు నెటిజన్లు ఇది పరోక్షంగా అదితిగా కౌంటర్ ఇచ్చాడా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రస్తుతం అదితి సిద్ధార్థ్తో సీక్రెట్ డేటింగ్లో ఉంది. ఇప్పటి వరకు తమ రిలేషన్ని అదితి కానీ, సిద్ధార్థ్ కానీ బయట పెట్టలేదు. ఇదిలా ఉంటే మసాబాకు కూడా ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే. చదవండి: యువత పాశ్చాత్య పోకడలపై కళాతపస్వీ విశ్వనాథ్ ఏమన్నారంటే.. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
విడాకులు తీసుకుని పీకల్లోతు ప్రేమలో ఉన్న హీరో, హీరోయిన్
-
డేటింగ్ రూమర్స్..హోటల్లో కెమెరాలకు చిక్కిన హీరో, హీరోయిన్లు
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ముంబైలోని ఓ హోటల్లో సిద్ధార్థ్- అదితిలు జంటగా కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట ఇంతవరకు స్పందించలేదు. కాగా ఇక సిద్దార్థ్, అదితిలు కలిసి ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రంతోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందని.. అదే ప్రేమకు దారితీసిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సిద్ధార్థ్, అదితిరావ్ హైదరిలకు ఇదివరకే పెళ్ళిళ్ళై విడాకులు అయ్యాయి. సిద్దార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని ప్రేమ పెళ్లి చేసుకోగా, 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి కూడా చిన్న వయసులోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికే అతడితో విడిపోయింది. -
సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్గా హీరో పోస్ట్
Siddharth-Aditi Rao Hydari Dating Rumours: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ ముందు వీరిద్దరు జంటగా మీడియాకు చిక్కారు. దీంతో అప్పటి నుంచి సిద్ధార్థ్, అదితిలు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. ఈ నేపథ్యంలో రీసెంట్గా అదితి బర్త్డే సందర్భంగా సిద్ధార్థ్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. చదవండి: కోలుకోవడం సాధ్యం కాలేదు, బతకాలనిపించలేదు : దీపికా పదుకొణె అదితితో కలిసి క్లోజ్గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి ప్రేమాయణం నిజమేనంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదితితో ప్రేమలో ఉన్నట్లు సిద్ధార్థ్ ఈ పోస్ట్తో క్లారిటీ ఇచ్చాడా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిద్ధార్థ్ పోస్ట్పై వారి సన్నిహితులు సైతం వీరిద్దరిని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇక సిద్దార్థ్ పోస్ట్కి అదితి స్పందిస్తూ సిద్దూ… అంటూ స్పెషల్ కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే అదితి బర్త్డే సందర్భంగా వీరిద్దరు జంటగా వేకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె బర్త్డే రోజున(అక్టోబర్ 28న)ముంబై ఎయిరోపోర్ట్లో సిద్దార్థ్, అదితిలు జంటగా దర్శనం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
ఆమె చూస్తే తట్టుకోలేదని బాత్రూమ్కు వెళ్లి ఏడ్చేదాన్ని: అదితి రావు
తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదితి రావు హైదరీ. ఇటీవలే ఈ నటుడు సిద్ధార్థ్తో డేటింగ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జరిగిన మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లలడించారు. తాను సినిమాల్లోకి రావడానికి ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అదితిరావు వెల్లడించారు. (చదవండి: ఆ అమ్మాయి కనిపిస్తే దయచేసి నాకు చెప్పండి.. రాజ్ తరుణ్ వీడియో వైరల్) అదితి రావు మాట్లాడుతూ..' నేను మొదట భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించా. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా ప్రదర్శనలు చేశా. వీటన్నింటిని చూసిన తమిళ దర్శకురాలు శారద నాకు హీరోయిన్గా మొదటి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. ఈ విషయంలో నేను చాలా బాధపడేదాన్ని. మొదటి మూవీ కావడంతో ఫీలయ్యేదాన్ని. మా అమ్మ ముందు నేను ఏడిస్తే తాను తట్టుకోలేదని బాత్ రూమ్కు వెళ్లి ఏడ్చేదాన్ని' అని తెలిపింది. (చదవండి: సూర్య- ఇనయ లవ్ భాష.. ఏంటో అర్థం కావట్లేదన్న నాగ్) -
ఒక్క పోస్ట్తో లవ్ కన్ఫర్మ్ చేసిన సిద్దార్థ్?
అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ నేడు(అక్టోబర్ 28) 36వ పడిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో హీరో సిద్దార్థ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఎందుకంటే వీరిద్దరి మధ్యలో ఏదో ఉందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య వీళ్లు ఓ సెలూన్ నుంచి కలిసి బయటకు వస్తూ కెమెరాలకు చిక్కారు. ఇకపోతే తొలిసారి అదితితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడీ హీరో. 'హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్, నీ కలలన్నీ సాకారం కావాలని మనసారా కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. ఇక్కడ ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్ అంటే అందరి హృదయాల్లో కొలువైన రాణి అంటున్నాడా? లేదా తన మనసు దోచుకున్న మహారాణి అని హింటిస్తున్నాడా? అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు. ఇకపోతే అదితి.. సిద్దార్థ్తో బర్త్డేను సెలబ్రేట్ చేసుకోవడానికి చెన్నైకి చెక్కేసిందట. మరి ఈ బర్త్డే వేడుకల ఫొటోలను వారు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారో లేదో చూడాలి! View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) చదవండి: తొక్కలో పంచాయితీ, ఎంత చెప్పినా గీతూ వినదే! నిజమే, పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీయాల్సిందే! -
డైలాగ్స్ లేకుండా విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’, ఆసక్తిగా ఫస్ట్గ్లింప్స్
ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే హీరోల్లో ముందువరుసలో ఉంటారు విజయ్ సేతుపతి. తాజాగా ఆయన ‘గాంధీ టాక్స్’ అనే సైలెంట్ ఫిల్మ్(డైలాగులు లేని)లో లీడ్ రోల్ చేస్తున్నారు. మరాఠి దర్శకుడు కిశోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, అదితీరావ్ హైదరీ, సిద్ధార్థ్ జాదవ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: మహేశ్-త్రివిక్రమ్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో! కాగా ఆదివారం గాంధీ జయంతి (అక్టోబరు 2) సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘డైలాగ్స్ లేకుండా కేవలం ఎమోషన్స్తోనే కథను చెప్పడం అంత సులువైన విషయం కాదు. ఈ సినిమా నాకు చాలెంజింగ్గా అనిపించింది’’ అని కిశోర్ పాండురంగ్ బేలేకర్ అన్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
అందాల స్వప్నం అదితి రావ్ హైదరీ (ఫొటోలు)