Ajay Devgan
-
'26 ఏళ్లుగా ఈ ట్రెండ్ను అధిగమిస్తున్నాం'.. భార్యకు అజయ్ దేవగణ్ స్పెషల్ విషెస్
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. తాజాగా ఈ జంట తమ 26వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు అజయ్ దేవగణ్ మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో దిగిన పాత ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '26 ఏళ్లుగా ఈ ట్రెండ్ను అధిగమిస్తున్నాం.. మనిద్దరికీ హ్యాపీ యానివర్సరీ' అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు స్టార్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మొదట వీరిద్దరు 1995లో వచ్చిన హల్చల్ అనే మూవీ సెట్స్లో కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో జంటగా కనిపించారు. అదేక్రమంలోనే అజయ్, కాజోల్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 1999లో ఓ ప్రైవేట్ వేడుకలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరు ఇష్క్, ప్యార్ తో హోనా హి థా, యు మే ఔర్ హమ్, తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్ లాంచి చిత్రాలలో జంటగా నటించారు. వీరిద్దరి నైసా దేవగణ్, యుగ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే కాజోల్ చివరిసారిగా దో పట్టిలో కనిపించింది. మరోవైపు అజయ్ దేవగణ్ చివరిసారిగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం ఎగైన్లో కనిపించారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న హిస్టారికల్ మూవీ..
-
సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ వద్దు: స్టార్ హీరోలు
బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్లు తమ రెమ్యునరేషన్ల గురించి ఓపెన్గానే మాట్లాడారు. తాజాగా జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2024లో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్లో ఉన్న ఐక్యత గురించి కూడా చర్చించారు. ఒక సినిమా కోసం వారు ఎలా రెమ్యునరేషన్ తీసుకుంటారో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.లాభాలు వస్తేనే రెమ్యునరేషన్: అక్షయ్ కుమార్ఒక సినిమాకు రెమ్యునరేషన్ అనేది స్క్రిప్ట్, కథలో ప్రాధాన్యతను బట్టే రెమ్యునరేషన్ తీసుకోవాలని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం చాలామంది హీరోలు సినిమాకు వచ్చే లాభాల నుంచి షేర్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటారని ఆయన అన్నారు. అందులో తాను కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమా అనుకున్న ఫలితం ఇవ్వకపోతే నిర్మాతకు రికవరీ ఉండదు. దీంతో హీరోలు తమ పారితోషికాన్ని పూర్తిగా వదులుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమపై ఉన్న మక్కువే అంటూ అక్షయ్ తెలిపారు. అయితే, సినిమా భారీ విజయం సాధిస్తే మాత్రం మంచి రెమ్యునరేషన్ వస్తుందని కూడా ఆయన అన్నారు. నిర్మాతకు వచ్చిన లాభంలో మాత్రమే తాము వాటా తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల నిర్మాత సేఫ్గా ఉంటారని అన్నారు. అదే సినిమా ప్లాప్ అయితే మాత్రం నిర్మాతతో పాటు తమకు కూడా నష్టాలు తప్పవని అక్షయ్ పేర్కొన్నారు.సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ తీసుకోను: అజయ్ దేవగణ్చిత్ర పరిశ్రమలో సినిమా బడ్జెట్ పెరుగుతుందని అజయ్ దేవగణ్ అభిప్రాయపడ్డారు. తాను నటించిన సినిమా విజయం సాధించకపోతే రెమ్యునరేషన్ తీసుకోనని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఆధారంగానే తాను పారితోషకం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్లో అంతగా ఐక్యత లేదని ఆయన అన్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీ తమ నటీనటులకు మద్దతుగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అయితే, అక్షయ్ కుమారు, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్లు మాత్రం మంచి స్నేహంగా ఉంటారని అజయ్ దేవగణ్ తెలిపారు. ఈ క్రమంలో ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం తానే డైరెక్షన్ చేయబోతున్నట్లు అజయ్ దేవగణ్ తెలిపారు. ఇందులో అక్షయ్ కుమార్ ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారని రివీల్ చేశారు.#AkshayKumar and #AjayDevgn talks about their fees. They are right if Akki is producer and movies like padman and toilet did 300 cr+ worldwide definitely he will earn 100 cr plus per movie. And if he sign other producers movie like bmcm he might get nothing. Its proper business. pic.twitter.com/OVlpOj2FXe— axay patel🔥🔥 (@akki_dhoni) November 16, 2024 -
భారీ యాక్షన్ సీన్స్తో 'సింగం ఎగైన్' ట్రైలర్
బాలీవుడ్లో అజయ్ దేవగణ్, దీపిక పదుకొణె నటించిన 'సింగం అగైన్' విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో ఉన్న ట్రైలర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్కు చెందిన భారీ తారాగణమే ఉంది. ఇప్పటికే విడుదలైన 'సింగం' ఫ్రాంఛైజీలోని చిత్రాలను ప్రేక్షకులు భారీగానే ఆదరించారు.కాప్ యూనివర్స్ సినిమాగా రోహిత్ శెట్టి తెరకెక్కించారు. ఇందులో రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 4.58 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ మెప్పించేలా ఉంది. దీపావళి సందర్భంగా నవంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది -
కుమారుడి బర్త్ డే.. బాలీవుడ్ స్టార్ కపుల్ స్పెషల్ విషెస్
బాలీవుడ్ మోస్ట్ ఫేమ్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. వీరిద్దరికీ ఓ కూతురు నైసా, కుమారుడు యుగ్ సంతానం ఉన్నారు. ఇవాళ కుమారుడు యుగ్ తన 14వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అజయ్, కాజోల్ కుమారుడికి జన్మిదిన శుభాకాంక్షలు తెలిపారు. కొడుకుతో దిగన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. దీనికి సంబంధింటిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతుంటారు ఈ జంట. తమ పిల్లలతో కలిసి వెకేషన్స్కు వెళ్తుంటారు. ఇక సినిమాల విషయానికొస్తే అజయ్ దేవగణ్ ఈ ఏడాది ప్రారంభంలో మైదాన్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సింగం ఏగైన్, దే దే ప్యార్ దే-2 చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు కాజోల్ ప్రభుదేవా సరసన మహారాగ్ని అనే చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. కాగా..కాజోల్, అజయ్ 1994లోనే డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత వీరిద్దరు 1999లో వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
సినిమాల్లోకి రాకముందే ఆ హీరోతో పరిచయం: హీరోయిన్
బాలీవుడ్ భామ టబు తెలుగువారికి సుపరిచితమే. టాలీవుడ్లో మెగాస్టార్ అందరివాడు చిత్రంలో మెరిసింది. అంతకుముందే విక్టరీ వెంకటేశ్, నాగార్జున సరసన నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ముద్దుగమ్మ ఇటీవల క్రూ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అజయ్ దేవగన్తో కలిసి ఆరోన్ మే కహన్ దమ్ థా చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ అజయ్ దేవగణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడింది.టబు మాట్లాడుతూ..'అజయ్ దేవగన్ని తాను చాలా గౌరవిస్తా. నాకు ఏదైనా చిత్రనిర్మాతతో సమస్యలు వచ్చినప్పుడల్లా నా తరపున మాట్లాడడానికి అజయ్ను పిలుస్తాను. అతను నాతో పూర్తిగా స్వతంత్రంగా ఉంటాడు. అంతే కాదు నాతో పనిచేయడానకి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అజయ్ నా నిర్ణయాలలో ఎలాంటి జోక్యం చేసుకోడు. ఒకరిని ప్రభావితం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించడు. ఎందుకంటే అతను ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడు' అని తెలిపింది.అంతే కాకుండా అజయ్ తన సోదరుడికి చిన్ననాటి స్నేహితుడని.. టీనేజ్ నుంచే తాము ఒకరికొకరు తెలుసని టబు తెలిపింది. మేమిద్దరం కలిసి పెరిగామని.. అతను సినిమాల ద్వారా నాకు పరిచయం కాలేదని పేర్కొంది. ఇతర సహనటుల కంటే.. ఆయనతో ఉన్న రిలేషన్ వేరని ఆమె అన్నారు. ఆయనకు పెళ్లయినప్పటికీ మా మధ్య రిలేషన్లో ఎలాంటి మార్పులేదని తెలిపింది. ఆయనకు సినిమా అంటే మక్కువ అని.. దర్శకుడు కావాలని కోరుకున్నట్లు ఆమె వివరించింది. -
అజయ్ దేవగన్ నివాసంలో అనంత్ అంబానీ - వీడియో
అనంత్ అంబానీ వచ్చే నెలలో రాధికా మర్చంట్ను వివాహం చేసుకోనున్నారు. వివాహ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తమ పెళ్ళికి ఆహ్వానించడానికి అనంత్ అంబానీ స్వయంగా అజయ్ దేవగన్, కాజోల్ నివాసానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనంత్ అంబానీ.. అజయ్ దేవగన్ ఇంటి నుంచి బయటకు వచ్చి తన రోల్స్ రాయిస్ కారులోకి వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఇదిలా ఉండగా అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి కార్డును దేవుని చెంత ఉంచడానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి అక్కడకు వెళ్లినట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జూలై 12న పెళ్లి2024 జులై 12న వీరి పెళ్లి జరుగుతుందని ఇప్పటికే వారిరువురి కుటుంబాలు పేర్కొన్నాయి. అనంత్ & రాధికల పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజులు జరగనుంది. జులై 12న వివాహం, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.ముకేశ్ & నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్ఫారమ్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీతో సహా పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
ఓటీటీకి రూ.200 కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
అజయ్ దేవ్గణ్, తమిళ స్టార్లు జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైతాన్. ఇటీవల థియేటర్లలో రీలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. హారర్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మార్చి 8న విడుదలై ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్కు రానుందని టాక్ నడుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్పాండే, అజయ్ దేవ్గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. -
#Maidaan: రియల్ హీరో రహీం సాబ్.. స్కూల్ టీచర్ నుంచి కోచ్ దాకా!
స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశపరచవని ‘మైదాన్’ ద్వారా మరోసారి నిరూపితమైంది. అజయ్ దేవ్గణ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో అమిత్ రవీంద్రనాథ్ శర్మ రూపొందించిన ఈ చిత్రానికి మూలం సయ్యద్ అబ్దుల్ రహీం కథ. భారత ఫుట్బాల్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు ఆయనది. ఇంతకీ ఎవరాయన? ఆయన స్వస్థలం ఎక్కడ? భారత ఫుట్బాల్కు ఆయన అందించిన సేవలు ఏమిటి?.. సయ్యద్ అబ్దుల్ రహీం హైదరాబాద్ రాష్ట్రంలో 1909లో జన్మించారు. ఫుట్బాల్పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకున్న ఆయన.. ఉపాధ్యాయుడిగా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత ఆటకే పూర్తి సమయం కేటాయించారు. ముప్పై ఏళ్ల వయసులో కమార్ క్లబ్, యూరోపియన్ క్లబ్ తరఫున క్రీడాకారుడిగా రాణించారు. ఇక 1950లో హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్కోచ్గా మారారు. రహీం సాబ్గా ప్రసిద్ధి చెందిన ఆయన మార్గదర్శనంలో హైదరాబాద్ క్లబ్ మూడు డ్యూరాండ్, ఐదు రోవర్స్ కప్లు గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టు కోచ్గా రహీం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుష్కరకాలం పాటు జట్టును అత్యుత్తమ స్థాయిలో నిలిపారు. రహీం సాబ్ శిక్షణలో రాటు దేలిన టీమిండయా ప్రతిష్టాత్మక టోర్నీలో విజయాలు సాధించింది. స్వర్ణ యుగం 1951 ఆసియా క్రీడల ఫైనల్లో ఇరాన్ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుని గోల్డెన్ రన్ మొదలుపెట్టింది. ఇక 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో సెమీ ఫైనల్ చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. అనూహ్య రీతిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇదంతా రహీం సాబ్ చలవే అనడంలో సందేహం లేదు. ఇక 1960 రోమ్ ఒలింపిక్స్లోనూ భారత జట్టుకు ఆయనే కోచ్గా వ్యవహరించారు. రహీం గైడెన్స్లోనే 1962 ఆసియా క్రీడల్లో భారత్ మరోసారి పసిడి పతకం సాధించింది. పీకే బెనర్జీ, చునీ గోస్వామి, పీటర్ తంగరాజ్ వంటి నైపుణ్యాలున్న ఆటగాళ్లను గుర్తించి వారిని మెరికల్లా తీర్చిదిద్దడంతో రహీం సాబ్ది కీలక పాత్ర. తన హయాంలో భారత ఫుట్బాల్ రూపురేఖలనే మార్చివేసిన రహీం.. ఇండియాను ‘బ్రెజిల్ ఆఫ్ ఆసియా’గా నీరాజనాలు అందుకునేలా చేశారు. బ్రిటిష్ మూస పద్ధతిలో కాకుండా.. చిన్న చిన్న పాస్లతో కొత్త టెక్నిక్ను అనుసరించేలా చేసి సత్ఫలితాలు సాధించారు. నిజానికి ఇదే శైలితో బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు 1958, 1962 వరల్డ్కప్ టైటిల్స్ గెలిచింది. తనదైన శైలిలో స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపిన రహీం సాబ్ ఉన్నంతకాలం భారత్ ఫుట్బాల్ జట్టుకు ‘స్వర్ణ యుగం’లా సాగింది. అయితే, అనూహ్య పరిస్థితుల్లో కోచింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రహీం సాబ్.. 1963లో కాన్సర్ బారిన పడ్డారు. ఇండియా ఫుట్బాల్ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు అదే ఏడాది జూన్లో తుదిశ్వాస విడిచారు. 53 ఏళ్ల వయసులోనే అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారత్ ఫుట్బాల్ జట్టు విజయాలు సాధించిందే లేదు. దీనిని బట్టి చూస్తే.. ‘‘రహీమ్ సాబ్ తనతో పాటు ఇండియా ఫుట్బాల్ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు’’ అంటూ సహచర ఆటగాడు ఆయనకు నివాళి అర్పిస్తూ అన్న మాటలు నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. గుర్తింపు దక్కని యోధుడు భారత ఫుట్బాల్ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రహీం సాబ్కు మాత్రం వ్యక్తిగతంగా పెద్దగా మేలు చేకూర్చలేదు. ఆర్థికంగానూ ఆయన పొందిన ప్రయోజనాలు అంతంత మాత్రమే! ఎంతో మందిని మేటి ఫుట్బాలర్లుగా తీర్చిదిద్దిన ఈ గురువును ద్రోణాచార్య అవార్డుతోనైనా సత్కరించకపోయింది ప్రభుత్వం. ఇక రహీం సాబ్ కొడుకు సయ్యద్ షాహిద్ హకీం కూడా తండ్రి బాటలోనే నడిచారు. ఫుట్బాల్పై ఇష్టం పెంచుకున్న హకీం 1960 రోమ్ ఒలింపిక్స్లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇంకెప్పుడూ ఆయన ఒలింపిక్స్కు అర్హత సాధించలేదు. మైదాన్ సినిమాతో నేటి తరానికి తెలిసేలా సయ్యద్ అబ్దుల్ రహీం కథను ప్రపంచానికి పరిచయం చేయడంలో నోవీ కపాడియాది కీలక పాత్ర. అయితే, రహీం సాబ్తో పాటు ఆయన కుమారుడు హకీం, నోవీ కూడా ఇప్పుడు మన మధ్య లేకపోవడం విషాదకరం. అయితే, రియల్ హీరో అయిన రహీం మాత్రం అజరామరంగా అభిమానుల గుండెల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. -
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రేర్ పిక్స్..
-
ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?
సినీ ప్రేక్షకులు ఇప్పుడంతా ఎక్కువగా ఓటీటీలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు ఎప్పటికప్పుడు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీల్లో చూసేందుకే అభిమానులు మొగ్గు చూపుతున్నారు. దీంతో థియేటర్ ఆడియెన్స్తో పాటు నెటిజన్లను దృష్టిలో పెట్టుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు సైతం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే నాగచైతన్య సైతం దూత అనే వెబ్ సిరీస్లో ఎంట్రీ ఇచ్చేశారు. కాగా.. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, తమన్నా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సోనాక్షి సిన్హా, సమంత, రాశీఖన్నా, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ సైతం ఓటీటీ వేదికలపై మెరిశారు. అయితే ఓటీటీల్లో నటించేందుకు అగ్రతారలు పారితోషికం గట్టిగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఏ పాత్రలోనైనా సరే నటించడానికి రెడీ అంటున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్ ఓటీటీలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 2022లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ప్రసారమైన క్రైమ్ థ్రిల్లర్ షో 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్'తో అజయ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటీటీల్లో నటించిన స్టార్స్ పరంగా చూస్తే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు అజయ్ దేవగన్ అని లేటెస్ట్. 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' 7 ఎపిసోడ్ల కోసం దాదాపు రూ.125 కోట్లు పారితోషికం తీసుకున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన ఒక్క ఎపిసోడ్కు రూ. 18 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలా ఓటీటీలో అత్యధిక పారితోషికాన్ని అందుకున్న భారతీయ నటుడిగా అజయ్ నిలిచారు. ఆ తర్వాత మరో నటుడు మనోజ్ భాజ్పేయి నిలిచారు. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన 'ది ఫ్యామిలీ మ్యాన్' క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో ఆయన నటించారు. ఈ సిరీస్ రెండవ సీజన్లో మనోజ్ ఏకంగా రూ. 10 కోట్ల వరకు తీసుకున్నారని టాక్. -
పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో పాల్గొంటున్నందుకు..
లక్నో: పొగాకు కంపెనీల తరఫున ప్రకటనల్లో కన్పిస్తున్న బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అక్షయ్కుమార్, అజయ్ దేవ్గణ్లకు కేంద్రం నోటీసులు పంపింది. ప్రజల ఆరోగ్యానికి చేటు తెస్తున్న పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో సెలబ్రిటీలు, ముఖ్యంగా పద్మ అవార్డు గ్రహీతలు నటిస్తుండటంపై మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. కేంద్రం స్పందించడం లేదని, ఇది ధిక్కరణేనని పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. షారూక్, అక్షయ్, అజయ్లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అక్టోబర్ 20వ తేదీనే నోటీసులిచ్చిందని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున పిటిషన్ను కొట్టేయాలని కోరారు. విచారణ 2024 మే 9కి వాయిదా పడింది. -
కోట్ల బడ్జెట్.. రిలీజ్కు నోచుకొని స్టార్ హీరో సినిమా!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల రిలీజ్కు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అయితే... కావాల్సినన్ని థియేటర్స్ లభించవు. సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రారు..వచ్చినా తక్కువకే అడుగుతుంటారు. ఇలా చిన్న సినిమాల కష్టాలు చాలా ఉంటాయి. కొన్ని సినిమాలు అయితే అసలు రిలీజ్కే నోచుకోవు. కానీ పెద్ద సినిమాలకు అలాంటి కష్టాలు ఉండవని అంటారు. ఎప్పుడు అంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. ముందస్తు వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. రిలీజ్ తర్వాత అట్టర్ ఫ్లాప్ టాక్ వస్తే తప్ప.. బడా సినిమాల మేకర్స్కు పెద్ద కష్టాలేమి ఉండవని అనుకుంటారు. కానీ వందల కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కించిన చిత్రాలు కూడా అప్పుడప్పుడు విడుదలకు నోచుకోవు. దానికి ‘మైదానం’ చిత్రమే అతి పెద్ద ఉదాహారణ అని చెప్పొచ్చు. మూడేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి.. ఆర్ఆర్ఆర్తో పోటీ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా, బోనికపూర్ నిర్మించిన చిత్రమే ఈ ‘మైదానం’. భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్, మేనేజర్ (1950 –1963 సమయంలో) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్. కరోనా కంటే ముందే అంటే 2019లో ఈ చిత్రాన్ని ప్రకటించారు. 2020లో ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. 2021లో రిలీజ్కు ప్లాన్ చేశారు కానీ కుదరలేదు. ఇక 2022లో ఆర్ఆర్ఆర్తో పోటీగా బరిలోకి దిగబోతున్నామని ప్రకటించారు. పోస్టర్లు కూడా విడుదల చేశారు కానీ మళ్లీ అనూహ్యంగా వాయిదా వేసుకున్నారు. రిలీజ్ కష్టమేనా బోనీ కపూర్ భారీ బడ్జెట్తో మైదాన్ చిత్రాన్ని నిర్మించాడు. కరోనా కారణంగా ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా ఈ చిత్రానికి ఖర్చు చేశారట. ఈ చిత్రం కోసం ఒక పెద్ద గ్రౌండ్ ని అద్దెకు తీసుకుని దాంట్లో నిజమైన గడ్డిని పెంచేలా జాగ్రత్తలు తీసుకున్నారట. రోజుకు దాదాపు 500 మందితో షూటింగ్ చేశారట. గ్యాలరీలు, స్టాండ్లు అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేశారు. అయితే లాక్డౌన్తో పాటు 2021లో వచ్చి తుపాను కారణంగా దాదాపు రూ.30 కోట్లతో నిర్మించిన సెట్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయట. ఇన్సురెన్స్ సొమ్ము కూడా రాకపోవడంతో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పటికే సినిమాకు కోట్ల ఖర్చు పెట్టారు. రెండేళ్ల క్రితమే రిలీజ్ అయితే భారీగా నష్టాలు వచ్చే కావు. కానీ ఇప్పుడు రిలీజ్ చేయడానికి నిర్మాత కూడా ఇష్టపడడం లేదు. ఈ చిత్రం గురించి బోనీ కపూర్ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జీవితంలో మొదటిసారి పరిస్థితి చేయి దాటిపోయింది. ఒక సినిమా విషయంలో ఇంతగా ఎదురు దెబ్బ తింటానని ఊహించలేదు’అని అన్నారు. దీన్ని బట్టి ‘మైదానం’ సినిమా థియేటర్స్లోకి రావడం కష్టమే. -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ బీటౌన్తో పాటు దక్షిణాదిలోనూ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే దృశ్యం-2 సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. శ్రియా శరణ్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళంలో సూపర్ హిట్ అయినా చిత్రానికి రీమేక్గా తెరకెక్కించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కార్లపై ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. మార్కెట్లో రిలీజైన కొత్త కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. (ఇది చదవండి: హీరోలు చితకబాదేవారు, నాపై నాకే అసహ్యం వేసేది: నటుడు) తాజాగా ఈ బాలీవుడ్ హీరో ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగణ్ బీఎండబ్ల్యూ ఐ7 ఈవీ కారును జర్మన్ కంపెనీ తయారు చేసింది. ఇండియన్ మార్కెట్లో రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది. అజయ్ కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ కారులో ఆధునాతన సదుపాయాలు ఉన్నాయి. (ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..) -
సింగం సిరీస్ లో..సూర్య,అజయ్ దేవగన్
-
అజయ్ నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు.. కాజోల్ షాకింగ్ కామెంట్స్
కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. కాగా.. 1999లో ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ను ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరికి నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్, కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మూడు బహుమతులను గెలుపొందింది. అయితే గతంలో ఓ ఈవెంట్లో మాట్లాడిన కాజోల్ వారి ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అజయ్ను మొదటిసారి చూసినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదని కాజోల్ తెలిపింది. కాజోల్ మాట్లాడూతూ..'నేను అతన్ని హల్ చల్ మూవీ సెట్స్లో కలిశాను. అది మా షూటింగ్లో మొదటి రోజు. నిర్మాత నా దగ్గరకు వచ్చి అక్కడున్న వ్యక్తి హీరో అని చెప్పాడు. అతను ఒక మూలకు కుర్చీలో కూర్చున్నాడు. నేను అతన్ని చూసి 'నిజమా? అతనేనా హీరో? అని ఆశ్చర్యం వ్యక్తం చేశా. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. అజయ్ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడే వ్యక్తి అని గ్రహించా. ఆ తర్వాత మేం ఫ్రెండ్స్ అయ్యాం' అని అన్నారు. కాగా.. వీరిద్దరు నటించిన హల్చల్ 1995లో థియేటర్లలో విడుదలైంది. కాగా.. అజయ్ దేవగన్ ప్రస్తుతం తన తాజా చిత్రం భోలా బాక్సాఫీస్ విజయంతో దూసుకుపోతున్నాడు. లోకేష్ కనగరాజ్ చిత్రం తమిళ హిట్ మూవీని కైతిని హిందీ రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి అజయ్ దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అజయ్తో పాటు టబు, గజరాజ్ రావు, దీపక్ డోబ్రియాల్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. -
అదిరిపోయే లుక్తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్
బాలీవుడ్ నటి కాజోల్ పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలుగా తనదైన నటనతో అలరించింది. ఆమె అందానికి దాసోహం కానివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కానీ గత కొన్ని రోజులుగా ఆమెపై కొంతమంది నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. కాజోల్ తాజాగా ముంబయిలో తన భర్త నటించిన చిత్రం 'భోలా' ప్రీమియర్ షోకు హాజరైంది. (ఇది చదవండి: కాజోల్ అందంపై ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్) ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన కాజోల్ తెల్లటి కోటుతో పాటు డిఫరెంట్ లుక్లో కనిపించింది. ఆమె వెంట కొడుకు యుగ్, తల్లి తనూజ, భర్త అజయ్ దేవగన్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కాజోల్ డ్రెస్పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరైతే కాజోల్ మరింత అందంగా కనిపిస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. చాలామంది ఆమె లుక్, నడకపై ట్రోల్స్ చేశారు. ఆమె దుస్తులతో పాటు నడక మరింత విచిత్రంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా కాజోల్ ప్రస్తుతం గర్భవతినా? అంటూ కామెంట్స్ చేశారు. అయితే గతంలోనూ కాజోల్ ముఖానికి సర్జరీ చేయించుకున్నారని ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. #Kajol ♥️#jdreturnz pic.twitter.com/2vzI0SzcX8 — JDReturnz (@JdReturnz) March 30, 2023 -
రెండేళ్ల తర్వాత విడుదల కాబోతున్న అజయ్ దేవగన్ మూవీ!
ఎట్టకేలకు అజయ్ దేవగన్, ప్రియమణి చిత్రం ‘మైదాన్’ విడుదలకు సిద్ధమైంది. రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పులుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను చిత్ర బృందం ప్రకటించింది. జూన్ 23న విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్ర యూనిట్ వెల్లడిస్తూ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. కాగా స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ ఫుట్బాల్ కోజ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో అజయ్ దేవగన్ ఫుట్బాల్ కోజ్గా కనిపించనున్నాడు. నటి ప్రియమణి కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి అమిత్ రవీంద్రనాథ్ దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరుణవ జోయ్ గుప్తా నిర్మించిన చిత్రం ఇది. భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్, మేనేజర్ (1950 –1963 సమయంలో) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనలను మైదాన్లో చూపించనున్నాడు దర్శకుడు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
నాటు నాటుకు ఆస్కార్ నా వల్లే వచ్చింది: అజయ్ దేవగన్
ఆర్ఆర్ఆర్ సినిమాకు తన వల్లే ఆస్కార్ వచ్చిందని బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నటించిన భోళా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆయన కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ నాటు నాటు ఆస్కార్ గెలవడంతో అజయ్కి శభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీరు నటించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావడం ఎలా అనిపించిందని కపిల్ శర్మ ప్రశ్నించాడు. చదవండి: అప్పట్లోనే సొంత హెలికాప్టర్, వేల కోట్ల ఆస్తులు.. నటి విజయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? దీనికి అజయ్ దేవగన్ స్పందిస్తూ నిజానికి నాటు నాటుకు ఆస్కార్ నా వల్లే వచ్చిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేలా? అని హోస్ట్ అడగ్గా.. ‘అదే నేను నాటు నాటుకు డాన్స్ చేసి ఉంటే ఎలా ఉండేది. నా డాన్స్ చూసి అకాడెమీ జ్యూరీ మెంబర్స్ ఆస్కార్ ఇచ్చేవారే కాదు’ అంటూ చమత్కిరించాడు. అజయ్ సమాధానం విని అంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. చదవండి: నాని ‘దసరా’కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు, భారీగా కట్స్.. దీంతో అజయ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. షారుఖ్ ఖాన్ తర్వాత అంతటి సెన్స్ ఆఫ్ హ్యుమర్ అజయ్ దేవగన్లోనే ఉంది’, ‘ఒకవేళ అదే పాటకు సన్నీ డియోల్ డాన్స్ చేసి ఉంటే ఎలా ఉండేది.. ఊహించుకోండి’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్లో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తండ్రిగా అజయ్ కనిపించారు. To ye Raaz hai #NaatuNaatuSong ko Oscar milne ka 😯 pic.twitter.com/P9GXv4sy7K — Pooran Marwadi (@Pooran_marwadi) March 24, 2023 -
ఆ హీరో మేనల్లుడితో స్టార్ హీరోయిన్ కుమార్తె ఎంట్రీ..!
రవీనా టాండన్ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరు. 1990ల్లో అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించకున్న నటి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించింది రవీనా టాండన్. తాజాగా ఆమె కూతురు రాషా తడాని సైతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. (ఇది చదవండి: అందరి కళ్లు దీపికా పదుకొణె వైపే.. ఆ శారీ అన్ని లక్షలా?) అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్కు జంటగా బాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సెట్స్పైకి వెళ్లనున్న చిత్రానికి రాషా ఇప్పటికే సంతకం చేశారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్గణ్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తున్నారు. అయితే బాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టి రాషా పైనే ఉంది. రవీనా టాండన్ కూతురిగా సినిమాల్లో ఎలా రాణిస్తుందనే దానిపై చర్చ నడుస్తోంది. నిర్మాత అభిషేక్ కపూర్ గురించి ఓ వ్యక్తి మాట్లాడుతూ.. 'గత 15 ఏళ్లుగా భారతీయ సినిమాకి అభిషేక్ అందించిన సహకారం ప్రశంసనీయం. అతను సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఫర్హాన్ అక్తర్, రాజ్కుమార్ రావు, సారా అలీ ఖాన్ లాంటి కొత్త వ్యక్తులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రతి సినిమాలో వారి పాత్రలను అందించాడు. ఆ సినిమాలు మనతో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ పాత్రలు ఈ నటీనటుల జీవితాల్లో అద్భుతాలుగా నిలిచాయి. భారతీయ సినిమాకు, ఆయన ప్రగతిశీల ఆలోచనకు ఇది సంకేతం.' అని అన్నారు. -
తప్పతాగిన స్టార్ హీరో కూతురు.. నెటిజన్ల దారుణ ట్రోల్స్
బాలీవుడ్ సెలబ్రిటీలు వారాంతం వచ్చిందంటే ఎంజాయ్ చేయడం మామూలే. పబ్లు, నైట్ పార్టీలకు కొదవే లేదు. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్ నటుల పిల్లలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ కల్చర్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సుహానా ఖాన్, ఖుషి కపూర్ ఓ పార్టీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అజయ్ దేవగణ్ కూతురు నైసా దేవగణ్ తన ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణితో ముంబైలో పార్టీకి వెళ్లిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఎందుకంటే వారిద్దరూ వీడియోలో తప్పతాగి కనిపించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహికా రాంపాల్, ఇతర స్టార్కిడ్లు కూడా పార్టీలో కనిపించారు. నైసా దేవగణ్, ఓర్రీ చేతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ వారిద్దరూ తప్ప తాగి ఉన్నారంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఓ నెటిజన్ తల్లిదండ్రులు కష్టపడి పేరు సంపాదిస్తే.. వారి పిల్లలు వాటిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మరో నెటిజన్ నైసా దేవగణ్ ఫుల్గా తాగి ఉందంటూ పేర్కొన్నాడు. దుస్తులు, మేకప్, ఓపెన్ హెయిర్, బోల్డ్ మేకప్తో ఆమె తన రూపాన్ని మార్చేసిందని కామెంట్స్ చేశారు .నైసా దేవగణ్.. అజయ్, కాజోల్లకు మొదటి సంతానం. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు యుగ్ కూడా ఉన్నాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అఫీషియల్: సింగమ్-3లో హీరోయిన్గా దీపికా పదుకొణె..
బాలీవుడ్లో పోలీస్ బ్యాక్డ్రాప్ చిత్రాలకు రోహిత్ శెట్టి పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా ‘సింగమ్’ (2001), ‘సింగమ్ రిటర్న్స్’ (2014)), ‘సింబ’ (2018),‘సూర్యవన్షీ’(2021) వంటి పోలీస్ బ్యాక్డ్రాప్ చిత్రాలు వచ్చాయి. ఇక అజయ్ దేవగన్తోనే రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో లేడీ పోలీసాఫీసర్ పాత్రకు దీపికా పదుకోన్ను తీసుకున్నట్లు గురువారం ప్రకటించారు రోహిత్. ‘‘సింగమ్ ఎగైన్’లో దీపిక లేడీ సింగమ్’’ అని ‘సర్కస్’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో పేర్కొన్నారు రోహిత్ శెట్టి. రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సర్కస్’ ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఇందులో ప్రత్యేక పాటకు భర్త రణ్వీర్తో కలిసి స్టెప్స్ వేశారు దీపిక. ఈ పాట విడుదల వేదికపై సింగమ్ సిరీస్లో అజయ్ దేవగన్ ఎలా నడిచేవారో అనుకరిస్తూ దీపికా నడిచి, అలరించారు. -
అజయ్ దేవ్గణ్ 'దృశ్యం 2'.. టైటిల్ సాంగ్ చూశారా?
అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ను చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. అజయ్ దేవ్గణ్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్) ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్కు విశేష స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఉతుప్, విజయ్ ప్రకాష్ ఈ పాటను ఆలపించగా.. అమితాబ్ భట్టాచార్య ఈ సాంగ్ను రచించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. -
దృశ్యం-2 మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
దృశ్యం 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్
అజయ్ దేవగణ్, శ్రియ, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా హిందీలో రాబోతున్నదృశ్యం 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. అజయ్ దేవ్గణ్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: దృశ్యం 2 క్రేజీ అప్డేట్.. టీజర్ డేట్ ఫిక్స్) ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్కు విశేష స్పందన వస్తోంది. ఇవాళ విడుదలైన ట్రైలర్ను చూస్తే ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తోంది. అజయ్ దేవగణ్ మృతదేహాన్ని పాతిపెట్టే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్లో అజయ్ దేవ్గణ్, శ్రియ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ నవంబర్ 18 థియేటర్లలో సందడి చేయనుంది. అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, ఇషితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో 2015లో వచ్చిన మోహన్ లాల్ చిత్రానికి రిమేక్గా వస్తోంది. -
జక్కన్న బర్త్డే.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ విషెస్
టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే వినిపించేది మొదటి పేరు ఆయనదే. తెలుగు చలనచిత్ర స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయనే. స్టూడెంట్ నం.1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు టాలీవుడ్లో సంచలనాలు సృష్టించిన రాజమౌళి బర్త్డే ఈరోజు. ఈ సందర్భంగా దర్శకధీరుడికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జక్కన్నకు విషెస్ చెబుతున్నారు. (చదవండి: నయనతార కవలల పేర్లు తెలుసా.. వాటి అర్థాలు ఇవే..!) యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే జక్కన్న.. మీరు ఎల్లప్పుడు గొప్పగానే ఉండాలి' అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారు.. మీరే నా ఫెవరేట్' అంటూ రామ్ చరణ్ తన ఇన్స్టాలో ఫోటోను పంచుకున్నారు. భారతీయ సినిమా గతిని మార్చిన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ యంగ్ హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. భారతీయ సినిమాకు టార్చ్ బేరర్గా నిలిచిన రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ జక్కన్నకు విషెస్ తెలిపారు. మీ సినిమాలు, విజన్ మాకు చాలా ఇష్టం. భారతదేశం గర్వపడేలా చేసిన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీ సినిమాలతో మాకు ఎల్లప్పుడు స్పూర్తినిస్తూ ఉండండి' అంటూ స్టార్ హీరో మహేశ్ బాబు విషెస్ తెలిపారు. అలాగే నటుడు సత్యదేవ్, డైరెక్టర్ గోపిచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి విషెస్ చెప్పారు. Happy Birthday Jakkanna @ssrajamouli !! Wishing you the best as always. pic.twitter.com/WSq7Zon3KP — Jr NTR (@tarak9999) October 10, 2022 View this post on Instagram A post shared by Rhyme (@alwaysrhyme) Wishing you a happy birthday @ssrajamouli sir... Keep inspiring us with your cinematic brilliance! Happiness & success always! — Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2022 To the man who changed the course of Indian cinema.. Wishing @ssrajamouli sir a very happy birthday! Health and happiness to you always 🙏 pic.twitter.com/NedBUhxlMh — Sudheer Babu (@isudheerbabu) October 10, 2022 Wishing the Pride and Torch bearer of Indian Cinema, @ssrajamouli garu a very Happy Birthday. May you keep achieving all the glory and love that you deserve.#HBDSSRajaMouli garu pic.twitter.com/d2kZem5s87 — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 10, 2022 Happy birthday dear Rajamouli Sir. Have a fabulous one. I love your vision & all of us love your cinema. Keep making 🇮🇳 proud Sir. Most importantly, today is your day @ssrajamouli pic.twitter.com/q5qCVDJLsV — Ajay Devgn (@ajaydevgn) October 10, 2022 -
ఆ సినిమా టికెట్లపై భారీ తగ్గింపు.. అయితే ఆ ఒక్కరోజు మాత్రమే..!
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం- 2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్గా వస్తోంది. హిందీలో దృశ్యం- 2 విడుదలకు సిద్దమైంది. అయితే తాజాగా ప్రేక్షకుల కోసం సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది చిత్రబృందం. సినిమా రీలీజ్ రోజున అడ్వాన్స్ బుకింగ్ టికెట్లపై 50 శాతం భారీ తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 2 తేదీన బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ అభిమానులకు అందించేందుకు బహుళస్థాయి సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చిత్రబృందం వివరించింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో టబు, ఇషితా దత్తా, అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, శ్రియా శరణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే పేరుతో 2021లో వచ్చిన మోహన్ లాల్ మలయాళ చిత్రానికి రీమేక్గా వస్తోంది ఈ సినిమా. 2015లో విడుదలైన దృశ్యం సూపర్ హిట్గా నిలిచింది. Vijay Salgaonkar and family are back to continue the narrative of 2nd October! Advance bookings open on 2nd October and you can block your tickets on the PVR app for JUST Rs. 50 and get 50% OFF on first day shows of Drishyam 2. #Drishyam2 in cinemas on 18th November, 2022. pic.twitter.com/EIEIV1ijvG — P V R C i n e m a s (@_PVRCinemas) October 1, 2022 -
దృశ్యం 2 క్రేజీ అప్డేట్.. టీజర్ డేట్ ఫిక్స్
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. తాజాగా హిందీలో రాబోతున్నదృశ్యం 2 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అజయ్ దేవ్గన్, శ్రియ కాంబినేషన్లో ఇప్పటికే రిలీజైన దృశ్యం భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్నుగురువారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ నవంబర్ 18 థియేటర్లలో సందడి చేయనుంది. అక్షయ్ ఖన్నా, టబు, రజత్ కపూర్, ఇషితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళంలో 2015లో వచ్చిన మోహన్ లాల్ చిత్రానికి రిమేక్. 2 aur 3 October ko kya hua tha yaad hai na? Vijay Salgaonkar is back with his family. Recall Teaser Out Tomorrow! #Drishyam2 #Tabu #AkshayeKhanna @shriya1109 #RajatKapoor @ishidutta #MrunalJadhav @AbhishekPathakk pic.twitter.com/RgUxGQZPVo — Ajay Devgn (@ajaydevgn) September 28, 2022 -
'థ్యాంక్ గాడ్' సాంగ్ రిలీజ్.. నోరా అందానికి నోరెళ్లబెట్టాల్సిందే..!
సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం'థ్యాంక్ గాడ్'. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఫాంటసీ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్లో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీలంక సింగర్ యోహాని పాడిన 'మనికే మాగే హితే' సాంగ్ను హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ పాటలోనూ యోహానీ తనదైన వాయిస్తో అలరించింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా చిత్రగుప్తగా అజయ్ దేవగణ్ కనిపించనుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారి పాత్రలో నటించనుంది. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ యూపీలోని జాన్పూర్ కోర్టులో కేసు నమోదైంది. (చదవండి: చిక్కులు తెచ్చిన ట్రైలర్.. నటులపై కేసు నమోదు) -
చిక్కుల్లో 'థ్యాంక్ గాడ్'.. కేసు నమోదు.. ట్రైలర్లో ఏముంది?
బాలీవుడ్ నటులు అజయ్ దేవ్గణ్, సిద్ధార్థ మల్హోత్రా నటించిన చిత్రం 'థ్యాంగ్ గాడ్' చిక్కుల్లో పడింది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగా.. అదే ఇప్పుడు సమస్యను తెచ్చిపెట్టింది. దర్శకుడు ఇంద్ర కుమార్ తెరకెక్కిస్తున్న ‘థ్యాంక్ గాడ్’ సినిమాపై న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ యూపీలోని జాన్పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కేసు నమోదైంది. నవంబర్ 18న పిటిషనర్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. (చదవండి: అజయ్తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది: టబు) ఇటీవల విడుదలైన 'థ్యాంక్ గాడ్' ట్రైలర్ ఓ మతం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ హిమాన్షు శ్రీవాస్తవ కోర్టుకు వివరించారు. ఓ సన్నివేశంలో అజయ్ దేవగణ్ సూటు ధరించి చిత్రగుప్తుని పాత్రలో జోకులు పేల్చడం, అభ్యంతరకరమైన పదజాలం కనిపించిందని శ్రీవాస్తవ తన పిటిషన్లో పేర్కొన్నారు. చిత్రగుప్తుడు మంచి, చెడులను లెక్కిస్తాడు. దేవుళ్లను ఇలా వర్ణించడం వల్ల ఓ మతం మనోభావాలను దెబ్బతీస్తుందని న్యాయవాది పిటిషన్లో వివరించారు. దీంతో అజయ్ దేవ్గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర, దర్శకుడు ఇంద్ర కుమార్పై కేసు నమోదైంది. ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదల కానుంది. -
అజయ్తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది: టబు
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా హిందీ చిత్రం భోళ. ఈ చిత్రంలో పోలీసాఫీసర్గా టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. భోళ షూటింగ్ను పూర్తిచేశాం. అజయ్తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది అంటూ లొకేషన్లోని ఫోటోని షేర్ చేశారు టబు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. కాగా తమిళంలో హిట్ సాధించిన 'ఖైది' చిత్రానికి హిందీ రీమేక్గా భోళ తెరకెక్కింది. View this post on Instagram A post shared by Tabu (@tabutiful) -
సీనియర్ హీరోయిన్ టబుకు తీవ్రగాయాలు.. షూటింగ్కి బ్రేక్
సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్లో తీవ్రంగా గాయపడింది.బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బైక్స్తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం జరగడంతో హీరో అజయ్ దేవగన్ షూటింగ్కు చిన్న విరామం ప్రకటించారు. రెప్ప పాటులో ఆమె కంటికి పెను ప్రమాదం తప్పిందని సమాచారం. దీంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా మరో సినిమా షూటింగ్ సెట్లో హీరోయిన్ శిల్పాశెట్టి గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఒకే రోజు ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ గాయపడటం గమనార్హం. -
మధ్యలో తప్పుకున్న దర్శకులు.. మెగా ఫోన్ పట్టిన స్టార్ హీరోలు
ఇండస్ట్రీలో క్రియేటివ్ కథలు ఉన్నట్లే, అప్పుడప్పుడూ ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ కూడా ఉంటాయి. అభిప్రాయ భేదాల వల్ల కొన్నిసార్లు హీరోయే దర్శకుడిగా మారాల్సి వస్తుంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోవడంవల్ల కూడా ఒప్పుకున్న సినిమా నుంచి దర్శకుడు తప్పుకోవచ్చు. అలా ఈ మధ్య కొందరు దర్శకులు తప్పుకుంటే వారి స్థానంలో హీరోయే డైరెక్టర్గా మారారు. అలా డైరెక్షన్ మారింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. విశాల్ కెరీర్లో ఉన్న విజయవంతమైన చిత్రాల్లో ‘తుప్పరివాలన్’ (2017) (తెలుగులో ‘డిటెక్టివ్’) ఒకటి. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ చేసిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎంతలా అంటే ‘తుప్పరివాలన్’ సీక్వెల్ కోసం ఎదురు చూసేంత. ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన విశాల్, మిస్కిన్ ‘తుప్పరివాలన్ 2’ను ప్రకటించారు. వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని వెంటనే షూటింగ్ కూడా ఆరంభించారు. కానీ అనుకోకుండా ఈ సీక్వెల్కు బ్రేక్లు పడ్డాయి. షూటింగ్ లొకేషన్స్, బడ్జెట్, కథ అంశాల్లో విశాల్, మిస్కిన్ల మధ్య అభిప్రాయభేదాల వల్లే ఈ బ్రేక్ అనే వార్తలు వచ్చాయి. ఈ వార్త నిజమే అన్నట్లుగా ‘తుప్పరివాలన్ 2’కు తానే దర్శకత్వం వహిస్తున్నట్లుగా ఓ సందర్భంలో ప్రకటించారు విశాల్. అలా హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ‘తుప్పరివాలన్ 2’కు విశాలే దర్శకుడు. చర్చలు సఫలమై మిస్కిన్ మళ్లీ టేకప్ చేస్తారనే టాక్ కూడా ఉంది. (చదవండి: బాలీవుడ్లో సమంత భారీ సినిమా.. హీరోగా ఎవరంటే?) మరోవైపు యశ్ ‘కేజీఎఫ్’ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ను బాగా థ్రిల్ చేశాయి. ఈ చిత్రం హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్లకు ఎంత పేరు వచ్చిందో ‘కేజీఎఫ్’ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, అరివులకు అంతే పేరు వచ్చింది. ఈ ఇద్దరూ దర్శకులుగా మారాలనుకున్నారు. కొరియోగ్రాఫర్, నటుడు, దర్శక–నిర్మాత రాఘవా లారెన్స్ వీరికి ఆ చాన్స్ ఇచ్చారు. అన్బు, అరివుల దర్శకత్వంలో రాఘవా లారెన్స్ హీరోగా ‘దుర్గ’ అనే సినిమా షూటింగ్ ఆరంభమైంది కూడా. కానీ వివిధ కారణాల వల్ల ‘దుర్గ’ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి అన్బు, అరివులు తప్పుకున్నారు. ఇప్పుడు ‘దుర్గ’ సినిమాకు రాఘవా లారెన్స్నే దర్శకత్వం వహిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. సేమ్ సీన్ బాలీవుడ్లోనూ రిపీట్ అయ్యింది. అజయ్ దేవగన్ హీరోగా‘బోళ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళంలో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాకు ‘బోళ’ హిందీ రీమేక్. ఈ చిత్రానికి ముందు దర్శకుడిగా ధర్మేంద్ర శర్మ బాధ్యతలు తీసుకున్నారు. కారణం బయటకు రాలేదు కానీ ఇప్పుడు ‘బోళ’ సినిమాకు అజయ్ దేవగన్నే దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా దర్శకుడు మారడం తెలుగులోనూ జరిగింది. హీరో విశ్వక్ సేన్, దర్శకుడు నరేశ్ కుప్పిలి కాంబినేషన్లో ‘పాగల్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విశ్వక్, నరేశ్ కలిసి ‘దాస్ కా దమ్కీ’ అనే సినిమాను ఆరంభించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు నరేశ్ దర్శకుడు కాదు. విశ్వక్ సేన్ ఆ బాధ్యతలను స్వీకరించారు. ఇలా హీరోయే దర్శకుడిగా మారిన మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. -
లండన్లో ‘పుష్ప’ సింగర్ వెడ్డింగ్ రిసెప్షన్, స్టార్ హీరో కూతురు సందడి
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా’(పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఊ ఊ అంటావా హిందీ వెర్షన్) అంటూ తన గాత్రంతో బాలీవుడ్ ఆడియన్స్ని ఉర్రూతలూగించిన కనికా లండన్కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని రెండో పెళ్లి చేసుకుంది. లండన్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉసాసన కామినేని హజరైంది. కనికా స్నేహితురాలైన ఉపాసన ఈ పెళ్లిలో సందడి చేసింది. ఇదిలా ఉంటే వీరి వెడ్డింగ్ రిసెప్షన్ విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియంలో గ్రాండ్ నిర్వహించారు. ఈ రిసెప్షన్లో బాలీవుడ్ స్టార్ కిడ్ సందడి చేసింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ కాజోల్ ముద్దుల తనయ నైసా దేవగన్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరైంది. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ తన స్నేహితులతో కలిసి ఈ ఫంక్షన్లో పాల్గొన్న నైసా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. బాడీకాన్ పింగ్ డ్రెస్లో లైట్ జ్యువెల్లరిలో మెరిసిన నైసా ఈ ఫంక్షన్లో సందడి చేసింది. కనికా, తన స్నేహితులతో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ముంబైలో జరిగే సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వేడుకకైన నైసా తన తల్లి కాజోల్, తండ్రి అజయ్ దేవగన్లతో కలిసి హజరవుతుంది. అయితే తొలిసారి ఆమె ఒంటరిగా ఈ కార్యక్రమంలో కనిపించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఇటీవల 19 ఏళ్లు నిండిన నైసా ప్రస్తుతం సింగపూర్లో డిగ్రీ చదువుతోంది. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry1) -
అక్షయ్, అజయ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..
Kangana Ranaut Shocking Comments On Akshay Kumar Ajay Devgn: బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం 'ధాకడ్'. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే బాలీవుడ్పై తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాలీవుడ్ తనకు సపోర్ట్ చేయదని ఎప్పటినుంచో చెప్పుకొస్తుంది కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్. తాజాగా 'అజయ్ దేవగణ్ నా సినిమాను ఎప్పటికీ ప్రమోట్ చేయడు. కానీ ఇతర చిత్రాలను ప్రమోట్ చేస్తాడు. ఇక అక్షయ్ కుమార్ నాకు కాల్ చేసి తలైవి సినిమా బాగుందని చెబుతాడు. కానీ ఆ మూవీ ట్రైలర్ను షేర్ చేయడం, ట్వీట్ చేయడం మాత్రం చేయడు. కాబట్టి వారి గురించి నేను ఏం మాట్లాడలేను. అలాగే అమితాబ్ బచ్చన్ నా సాంగ్ టీజరన్ను ట్వీట్ చేసి వెంటనే దాన్ని తొలగించారు. ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడను. అజయ్ దేవగణ్ ఇతరులు చేసిన మహిళా ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తారు. కానీ చిత్రాల్లో నటించరు. ఎందుకంటే నా సినిమాల్లో నాకే ఎక్కువ పేరు వస్తుందని. ఇప్పుడు నా సినిమాకు సపోర్ట్ చేసిన అర్జున్ రాంపాల్పై ఎలా కృతజ్ఞతతో ఉంటానో, నా సినిమాలో అజయ్ దేవగణ్ నటించిన అలాగే గొప్పగా ఫీల్ అవుతా.' అని తెలిపింది కంగనా రనౌత్. ఇతరుల సినిమాలను ప్రమోట్ చేయడంపై కంగనా రనౌత్ మాట్లాడుతూ 'నేను ఇతరుల సినిమాలను సపోర్ట్ చేసినట్లుగానే నా సినిమాలు ఇతరులు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. ది కశ్మీర్ ఫైల్స్, షేర్షా వంటి చిత్రాలను అభినందించడానికి, ప్రమోట్ చేసేందుకు నేను ఎప్పుడు ముందుంటాను. నేను సిద్ధార్థ మల్హోత్రా గురించి, కరణ్ జోహార్ చిత్రాలను కూడా మెచ్చుకున్నాను. నేను ప్రశంసించాలనుకుంటే బహిరంగానే చేస్తాను. ఎవరికీ తెలియకుండా కాల్ చేసి చెప్పను. ఈ పరిస్థితి మారి నాలాగే వారు కూడా భవిష్యత్తులో నా సినిమాలపై స్పందిస్తారని అనుకుంటున్నా.' అని తెలిపింది. -
దేశంలో హిందీ ఎంతమంది మాట్లాడతారు ?
హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా కలిస్తే ఇంగ్లిష్ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే, తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్తో వివాదం భగ్గుమంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్లో బీజేపీ ‘ఒకే దేశం ఒకే భాష’ తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి. చరిత్రలోకి తొంగి చూస్తే.. హిందీ భాషను ఇతర ప్రాంతాలపై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొత్తేం కాదు. స్వాతంత్య్రానికి ముందే 1937 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీ భాషను బోధించడానికి ప్రయత్నిస్తే దానిని వ్యతిరేకిస్తూ మూడేళ్ల పాటు ఉధృతంగా ఉద్యమం జరిగింది. 1946లో మొదటిసారిగా సమావేశమైన రాజ్యాంగ పరిషత్ పార్లమెంటులో చర్చలు హిందీ, ఇంగ్లిష్లో కొనసాగించాలని నిర్ణయించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ భాషగా ఏది ఉండాలన్న దానిపై ఆనాటి కాంగ్రెస్ నాయకులు కేఎం మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్ హిందీ అనుకూల, వ్యతిరేక వర్గాలను కలుసుకొని అభిప్రాయాలను సేకరించారు. చివరికి హిందీ, ఇంగ్లిషులను కేంద్రం అధికార భాషలుగా గుర్తించింది. పదిహేనేళ్ల పాటు ఆ విధానం కొనసాగాక దానిని సమీక్షించాలని నిర్ణయించింది. పదిహేనేళ్ల గడువు ముగిశాక జాతీయ భాషగా హిందీని చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు భగ్గుమంది. చివరికి కేంద్ర ప్రభుత్వం 1963లో అధికార భాషా చట్టంలో హిందీతోపాటు ఇంగ్లిష్ని చేర్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు తమ అధికార భాషను గుర్తించే అధికారం, అందులోనే ఉత్తరప్రత్యుత్తరాలు చేసుకునే అవకాశం కల్పించింది. హిందీ ఎంతమంది మాట్లాడతారు ? 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 మాతృభాషలున్నాయి. వీటిలో 22 భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చింది. ఆనాటి లెక్కల ప్రకారం 43.6% మందికి మాతృభాష హిందీయే. ఆ తర్వాత స్థానంలో 8 శాతంతో బెంగాలీ నిలిచింది. 6.86% మంది ప్రజలు మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే, 6.70% మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మధ్య కాలంలో తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్లో బంపర్ హిట్ కొడుతూ ఉండడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రభంజనం మొదలైంది. ఇటీవల తెలుగు సినిమాలైన పుష్ప, ఆర్ఆర్ఆర్ వసూళ్లలో సునామీ సృష్టిస్తే, కన్నడ సినిమా కేజీఎఫ్–2 సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈ స్థాయిలో ఎందుకు విజయం సాధించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషేనంటూ ట్వీట్ రాజకీయ రంగు పులుముకుంది. మూడు భాషల ఫార్ములా ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి. ఇంగ్లిష్ భాషలో మాట్లాడడం, రాయడం రాకపోతే అంతర్జాతీయ సమాజంలో నెగ్గుకువచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజీగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో హిందీ కంటే ఇంగ్లిష్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) మూడు భాషల ఫార్ములాను తీసుకువచ్చింది. 8వ తరగతి వరకు హిందీని నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. ‘సరైన విధానంలో బోధించేవరకు మూడు భాషల ఫార్ములా మంచిదే. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ హిందీని జాతీయ భాషగా రుద్దకూడదు. ఆ భాష వస్తే ఒక అదనపు భాష వచ్చినట్టే. కానీ జాతీయ భాష అంటూ కిరీటాలు తగిలించకూడదు’ అని భాషావేత్త మాయా లీలా చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి స్థానిక భాషే సుప్రీం కేజీఎఫ్–2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు, ఈగ ఫేమ్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్దేవగణ్ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది. హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ స్పందిస్తూ అలాంటప్పుడు మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లు స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేచింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలు గురువారం నటుడు సుదీప్కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. దేశంలో హిందీ కూడా ఇతర ప్రాంతీయ భాషల మాదిరిగా ఒక భాషే తప్ప జాతీయ భాష కాదని కుండబద్దలు కొట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో భాషకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడిందని, ఎక్కడికక్కడ స్థానిక భాషే సుప్రీం అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హుబ్లీలో చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషని గౌరవించాలని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని అన్నారు. మన దేశంలో విశిష్టమైన భాషా వైవిధ్యాన్ని ప్రతీ పౌరుడు గౌరవించాలని, మాతృభాష వినిపిస్తే ఎవరైనా గర్వంతో ఉప్పొంగిపోవాల్సిందేనని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన ట్వీట్ నూటికి నూరు శాతం నిజమని, ఎక్కువ మంది మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష అవదని జేడీ(ఎస్) నాయకుడు కుమారస్వామి ట్వీట్లు చేశారు. మరోవైపు బొమ్మై కేబినెట్ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వంత్ నారాయణ్ కమ్యూనికేషన్ కోసం జాతీయ స్థాయిలో హిందీ భాషను మాట్లాడితే తప్పులేదని వ్యాఖ్యానించడం విశేషం. -
కిచ్చా సుదీప్ చెప్పింది కరెక్ట్.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మధ్య తలెత్తిన హిందీ భాషా వివాదం ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి వరకు చేరింది. కన్నడ సూపర్స్టార్ సుదీప్కు మద్దతుగా సీఎం బసవరాజ్ బొమ్మై నిలిచారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కాబట్టి ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. సుదీప్ మాటలు సరైనవేనని, దానిని అందరూ అర్థం చేసుకొని గౌరవించాలని సీఎం బొమ్మై సూచించారు. కాగా ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కిచ్చ సుదీప్కు అండగా నిలిచారు. బాలీవుడ్, కన్నడ సూపర్ స్టార్ల మధ్య హిందీ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న సుదీప్.. దక్షిణాది సినిమాలు బాక్సాఫిస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాయని, హిందీలోకి డబ్ అయి బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నాయని అన్నారు. అలాగే ఇకపై హిందీ జాతీయ భాషగా ఉండబోదని చెప్పారు. దీంతో సుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. .@KicchaSudeep मेरे भाई, आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं? हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी। जन गण मन । — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ వ్యంగ్యంగా స్పందించారు. బ్రదర్ కిచ్చా సుదీప్... మీ అభిప్రాయం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు... మీ మాతృభాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీ ఇంతకమందు, ఇప్పుడు, ఎప్పటికీ మన జాతీయ భాషే. జన గణ మన' అని ట్వీట్ చేశారు. మరోవైపు వీరిద్దరి మాటల యుద్ధంపై పలువురు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చదవండి👉 Kichcha Sudeep Vs Ajay Devgan: చిచ్చు పెట్టిన హిందీ భాష, స్టార్ హీరోల మధ్య ట్వీట్ల వార్ And sir @ajaydevgn ,, I did understand the txt you sent in hindi. Tats only coz we all have respected,loved and learnt hindi. No offense sir,,,but was wondering what'd the situation be if my response was typed in kannada.!! Don't we too belong to India sir. 🥂 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 మరోవైపు తాను మాట్లాడిన మాటలు ట్రాన్స్లేషన్ పొరపాటు వలన తప్పుగా అర్థం చేసుకున్నారనీ సుదీప్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అజయ్ సార్.. మీరు హిందీలో చేసిన ట్వీట్ నాకు అర్థం అయ్యింది. అందరం హిందీని గౌరవిస్తాము. కాబట్టి హిందీని ప్రేమించాము, నేర్చుకున్నాను. గౌరవించాము. మనమందరం నేను హిందీ భాషను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కేవలం ట్రాన్స్లేషన్ వల్ల పొరపాటు జరిగింది. కానీ నేను ఇప్పుడు కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. మనమంతా కూడ భారతదేశానికి చెందిన వాళ్లమే కదా సార్’ అంటూ రీట్వీట్ చేశారు. Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 అలాగే ‘ మన దేశంలోని ప్రతి భాషను నేను ప్రేమిస్తాను సార్. నేను ఆ మాటలను పూర్తిగా భిన్నమైన సందర్భంలో చెప్పాను. అది మీ దగ్గరకు వేరే రకంగా చేరింది. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. అప్పుడు అసలేం జరిగిందో మీకు వివరిస్తాను. ఇది ఎవరినీ బాధపెట్టడానికి, రెచ్చగొట్టడానికి లేదా ఇలాంటి చర్చను ప్రారంభించడానికి కాదు. ఇక ఈ అంశం ఇక్కడితో ముగిసిపోవాలని ఆశిస్తున్నాను. అనువాదం, వివరణలు, దృక్కోణాలు అసలు మేటర్ సర్… పూర్తి విషయం తెలియకుండా స్పందించకపోవడానికి కారణం అదే దీనికి నేను మిమ్మల్ని నిందించను. ఒక సృజనాత్మక కారణంతో నేను మీ నుంచి ట్వీట్ను స్వీకరించి ఉంటే బహుశా అది సంతోషకరమైన క్షణం అయ్యేది” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. -
హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్
హిందీ భాషపై కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో ఆయనకు ఓ వర్గం నెటిజన్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాగా ఆయన తాజా చిత్రం విక్రాంత్ రోణ ప్రమోషన్లో భాగంగా సుదీప్ కేజీయఫ్ 2పై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. ఈ క్రమంలో ఆయన హిందీ భాషపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నటి నమ్రత దీంతో సుదీప్ వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. సుదీప్ను ట్యాగ్ చేస్తూ ‘హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్ను ప్రశ్నించాడు. దీంతో అజయ్ దేవగన్ ట్వీట్కు సుదీప్ స్పందిస్తూ.. ‘హలో అజయ్ సార్. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతం కలిసినప్పుడు దీనికి మీకు వివరణ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు. .@KicchaSudeep मेरे भाई, आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं? हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी। जन गण मन । — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 అలాగే మరో ట్వీట్లో భారతదేశంలోని అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని, ఇక్కడితే ఈ టాపిక్ను వదిలేయాలనుకుంటున్నాను అంటూ సుదీప్ వరస ట్వీట్స్ చేశాడు. ‘ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా దీనికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని నా అభిప్రాయం. మనమంత దేశంలోని అన్ని భాషలను గౌరవించాలి’ అంటూ అంటూ సుదీప్ ట్వీట్కు అజయ్ రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నెలకొంది. I love and respect every language of our country sir. I would want this topic to rest,,, as I said the line in a totally different context. Mch luv and wshs to you always. Hoping to seeing you soon. 🥳🥂🤜🏻🤛🏻 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 కాగా సుదీప్.. 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. -
హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారు: అజయ్ దేవగణ్
Ajay Devgn Reaction Controversy Pan Masala Ad: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పాన్ మాసాల ప్రకటన నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలైన అజయ్ దేవగన్, షారుక్ ఖాన్తో కలిసి అక్షయ్ ఈ ప్రకటనలో నటించాడు. తాజాగా అక్షయ్ ఈ యాడ్ ఎండార్స్మెంట్ వివాదంపై అజయ్ దేవగన్ స్పందించాడు. ఆయన తాజాగా నటించిన ‘రన్వే 34’ మూవీ ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ భాగంగా అజయ్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాన్ మాసాల ఎండార్స్మెంట్ వివాదంపై, అక్షయ్ దీని నుంచి తప్పుకోవడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. చదవండి: కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే.. దీనిపై అజయ్ దేవగన్ స్పందిస్తూ.. ‘నేను దీనిపై పెద్ద మాట్లాడాలనుకోవడం లేదు. దాని గురించి చర్చించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రకటనల ఎంపిక అనేది వారి వ్యక్తిగత విషయం. ప్రతి ఒక్కరికి తమకు తాముగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. అయితే అదే సమయంలో అది హానికరమా? కాదా? అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే అందులో కొన్ని హానికరమైనవి ఉండోచ్చు.. మరికొన్ని ఉండకపోవచ్చు’ అని పేర్కొన్నాడు. అలాగే ‘ఇది మాత్రమే కాకుండా హాని కలిగించే ఉత్పత్తులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు వాటి పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ విధంగా కూడా వాటిని నేను ప్రమోట్ చేయాలనుకోవడం లేదు. అయితే నేను చేసింది ఎలైచి బ్రాండ్ యాడ్ మాత్రమే’ అని సమాధానం ఇచ్చాడు. చదవండి: ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు అనంతరం ఇదంతా పక్కన పెడితే ఈ ప్రకటనలు అనేవి పెద్ద విషయం కాదనేది తన అభిప్రాయమని, మరి అవి అంతటి హానికరమైన ఉత్పత్తులు అయితే.. వాటిని విక్రయించకూడదని అజయ్ అభిప్రాయ పడ్డాడు. అవి హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. కాగా అజయ్ దేవగన్ ఎంతో కాలంగా ఇదే బ్రాండ్కు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్షయ్ కుమార్ ఈ యాడ్లో నటించడంపై ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి ఉత్పత్తులను తమ అభిమాన నటుడు ప్రమోట్ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో అక్షయ్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. అవి చూసిన అక్షయ్ ఫ్యాన్స్కు క్షమాపణలు చెప్పి ఈ ప్రకటన నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. అయితే కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కొంతకాలం వరకు ఆ ప్రకటన ప్రసారమవుతూనే ఉంటుందని అక్షయ్ స్పష్టం చేశాడు -
ఆమె.. అజయ్ దేవగణ్ బలహీనత.. ఎవరంటే ?
Unknown Facts About Ajay Devgn: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇటీవల విడుదలైన దర్శక ధీరుడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్తో కలిసి రన్వే 34 సినిమాలో అలరించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే అజయ్ దేవగణ్ మరో సంవత్సరం పెద్దవాడయ్యాడు. 1969, ఏప్రిల్ 2న జన్మించిన అజయ్ దేవగణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు బాలీవుడ్ సినీ తారలు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే 53వ పడిలోకి అడుగు పెడుతున్న ఈ బాలీవుడ్ హీరో 5 రహస్యాలు ఏంటో తెలుసుకుందామా ! 1. ట్రావెలర్ అజయ్ దేవగణ్ మంచి నటుడే కాకుండా ట్రావెల్ లవర్ కూడా. అతని కుటుంబంతో ప్రయాణించడం కంటే ఆయనకు ఏది గొప్ప ఆనందాన్ని ఇవ్వదట. అజయ్ తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, ఇద్దరు సోదరీమణులు, వారి భర్తలు, పిల్లలతో కలిసి దూర ప్రయాణాలు చేస్తుంటాడని సమాచారం. సెలవుల్లో 25 మంది కుటుంబ సభ్యుల బృందం కలిసి టూర్కు వెళ్తాడట. ఇందుకోసం బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్లో ప్రయాణించి స్టే చేసేందుకు సాధ్యమైతే ఏకంగా ఒక ఐలాండ్నే బుక్ చేస్తాడని సమాచారం. 2. శివ భక్తుడు అజయ్ దేవగణ్ గొప్ప శివ భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే అతని ఛాతిపై శివుడి పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. అంతేకాకుండా ఆయన డైరెక్ట్ చేసిన 'శివాయ్' మూవీని శివుడికి అంకితం ఇచ్చాడు. 3. టాలెంటెడ్ కుక్ అద్భుతంగా వండటంలోనూ అజయ్ దేవగణ్ సిద్ధహస్తుడు. భారతీయ, కాంటినెంటల్ డిషెస్ను సూపర్గా చేయగలడని టాక్. 4. కుటుంబమంటే అమితమైన ప్రేమ యాక్షన్ సీక్వెన్స్లో అదరగొట్టే అజయ్ దేవగణ్ మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. ఆయనకు మొదటగా పుట్టిన కూతురు నైసా.. అజయ్ దేవగణ్ బలహీనత. కనీసం రోజులో కొన్నిసార్లు అయినా ఆమెతో మాట్లాడలేకపోతే అజయ్కు రోజు గడవదట. అలాగే కుమారుడు యుగ్ అన్న అజయ్కి అమితమైన ప్రేమ. 5. పోలో గ్రీన్ కొలోన్ అంటే ఇష్టం అజయ్ దేవగణ్ గత మూడు దశాబ్దాలుగా రాల్ఫ్ లారెన్ తయారు చేసిన పోలో గ్రీన్ అనే కొలోన్నే ధరిస్తున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం. -
ఆ రెండింటి మధ్య నిజం ఉంటుంది.. థ్రిల్లింగ్గా 'రన్వే 34' ట్రైలర్
Runway 34 Movie Trailer: Amitabh Bachchan Ajay Devgn Promising Acting: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్ నటిస్తున్న చిత్రం 'రన్వే 34'. నిజ జీవితపు సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అజయ్ దేవగన్ దర్శకత్వం వహించారు. ఇంతకుముందు 2008లో వచ్చిన 'యూ మే ఔర్ హమ్', 2016లో వచ్చిన 'శివాయ్' చిత్రాల తర్వాత అజయ్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన యాక్టర్స్ ఫస్ట్లుక్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా 'ప్రతీ సెకండ్ కౌంట్స్.. రన్ వే 34 ట్రైలర్ను విడదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. టేకాఫ్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం' అంటూ ట్రైలర్ను షేర్ చేశాడు అజయ్ దేవగన్. ట్రైలర్ ప్రారంభంలో అజయ్ దేవగన్ నో స్మోకింగ్ జోన్లో సిగరెట్ పట్టుకుని కనిపిస్తాడు. ఇందులో అజయ్ దేవగన్ పైలట్గా, రకుల్ కోపైలట్గా కనువిందు చేయనున్నారు. ఒక భయంకరమైన సంఘటన నుంచి ప్రయాణీకులను ఆ విమాన పైలట్లు ఎలా కాపాడరన్నదే కథాంశంగా ట్రైలర్ ఉంది. ఇందులో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫిసర్గా అమితాబ్ బచ్చన్ ఆకట్టుకున్నారు. 'చేసిన తప్పు ఒప్పుకోవడంలోనే మనిషి క్యారెక్టర్ తెలుస్తుంది', 'అసలేం జరిగింది.. ఎలా జరిగింది అనే విషయాల మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. అదే నిజం' వంటి డైలాగ్లు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఒక ప్రమాదపు సంఘటన కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'అజయ్ దేవగన్ ఎఫ్ఫిల్మ్స్' సమర్పణలో అజయ్ దేవగన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆర్ఆర్ఆర్ స్టార్స్ రెమ్యునరేషన్
-
గంగూభాయ్ కతియావాడి: అలియా భట్కు ఓ రేంజ్లో రెమ్యునరేషన్!
ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న ‘గంగూభాయ్ కతియావాడి’ మూవీకి సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాల్లో తన నటనతో అలరించిన స్టార్ హీరోయిన్ అలియా భట్ తాజా సినిమాతో మరో మెట్టు ఎక్కిందని విశ్లేషకులు చెప్తున్నారు. టాప్ హీరో అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో అలియా కళ్లు చెదిరే పారితోషికం తీసుకుందని సమాచారం. ఇండియా టుడే వార్త సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగూభాయ్ సినిమాకు అలియా ఏకంగా రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. దేవ్గన్ రూ.11 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సీనియర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోగ్రాఫికల్ క్రైం డ్రామా సినిమా బడ్జెట్ రూ.100 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా గంగూభాయ్ తెరకెక్కింది. (చదవండి: ఎనర్జిటిక్ హీరోకు సరైనోడు విలన్.. ఆది రోల్ రివీల్) 1960 కాలంలో ముంబైలోని కామాఠీపుర రెడ్లైట్ ఏరియా ప్రధానంగా కథ సాగుతుంది. ఇక స్టార్ కిడ్ అయిన అలియా.. భన్సాలీ దర్శకత్వంలో నటించాలని తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి అనుకున్నట్టు చెప్పుకొచ్చింది. గతంలో భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లాక్’ సినిమా ఆడిషన్స్కు వెళ్లానని, అయితే ఆ సినిమాలో అవకాశం రాలేదని ఆమె గుర్తు చేసుకుంది. ఇక దేశవ్యాప్తంగా గంగూభాయ్ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి: రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్కు డేట్ ఫిక్స్) -
అజయ్ దేవ్గన్కి కోపం వచ్చింది.. నేను ఊరొదిలి పారిపోతా!
సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందించడమే కాదు తమ కంపెనీ ప్రొడక్టులను ప్రమోట్ చేసుకుంటారు ఆనంద్ మహీంద్రా. ఈ క్రమంలో మోర్ అటెన్షన్ సాధించేందుకు ఫన్నీగా ఆయన కామెంట్టు కూడా పెడుతుంటారు. అవి నెట్టింట వైరల్గా మారుతుంటాయి. తాజాగా ఓ యాడ్ షూటింగ్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. మమీంద్రా ట్రక్బస్ కోసం చేపట్టిన షూట్లో.. పదే పదే స్ట్రిప్ట్లో మార్పులు ఎందుకు చేస్తున్నారంటూ అసహనంగా అడుగుతాడు అజయ్ దేవ్గన్.. పదే పదే మార్పులు చేయడం లేదు సార్ ఓ సాలుగైదు సార్లు అంతే అంటూ ఓ గొంతు వినిపిస్తుంది. వెంటనే కెమెరావైపు ఓ సీరియస్ లుక్ ఇస్తాడు అజయ్ దేవ్గన్. I was informed that @ajaydevgn lost his cool on a @MahindraTrukBus film shoot. I better leave town before he comes after me in one our trucks… pic.twitter.com/roXY7hIfRN — anand mahindra (@anandmahindra) February 14, 2022 ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా కామెంట్ రాస్తూ.. మహీంద్రాట్రక్బస్ షూటింగ్లో అజయ్ దేవగన్కి కోపం వచ్చినట్టు నాకు తెలిసింది. మా ట్రక్ బస్ వేసుకుని ఆయన నా కోసం వచ్చేలోగా.. ఊరొదిలి పారిపోతానంటూ చమత్కరించారు ఆనంద్ మహీంద్రా. -
అజయ్ దేవగన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎమోషనల్ అయిన సింగం
Ajay Devagn Completing 30 Years In Bollywood Industry: ముప్పై ఏళ్ల క్రితం ఒక సన్నగా ఉండే వ్యక్తి 'అగర్ తేరే పాస్ జాగీర్ హై, తో మేరే పాస్ జిగర్ హై' అని డైలాగ్ చెప్పి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. ఆ వ్యక్తే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్. ఆయన తొలిచిత్రం 'ఫూల్ ఔర్ కాంటే'లోని ఈ డైలాగ్ అజయ్కు స్టార్డమ్ తీసుకొచ్చిన వాటిలో ఒకటి. నవంబర్ 22న అజయ్ దేవగన్ తన 30 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ప్రయాణంలో 'జఖ్మ్, ఇష్క్, దిల్జాలే, హమ్ దిల్ దే చుకే సనమ్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, యువ, ఓంకార, సింగం, బోల్ బచ్చన్' వంటి చిత్రాల్లో అత్యత్తమైన నటనకౌశాలన్ని ప్రదర్శించారు. సమయం గడిచినా.. స్నేహం అలాగే ఉంటుంది: అక్షయ్ ఈ సందర్భంగా బీ టౌన్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ట్విటర్లో అజయ్ దేవగన్కు శుభాకాంక్షలు తెలపుతూ ప్రత్యేక పోస్ట్లు పెట్టారు. 'అజయ్ దేవగన్ తన మొదటి చిత్రం 'ఫూల్ ఔర్ కాంటే' నవంబర్ 22న విడుదలవడంతో చలన చిత్ర పరిశ్రమలో 30 వసంతాలు పూర్తి చేసుకుంది. అజయ్ మృదుస్వభావి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరు. ఇంకా సినిమా పట్ల మంచి అభిరుచి కలిగి ఉన్నారు. నా అభినందనలు అజయ్. మీరు మరో 70 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నా.' అంటూ బిగ్ బీ అమితాబ్ రాసుకొచ్చారు. మరోవైపు అక్షయ్ కుమార్ ఇలా 'మనం కొత్తవారిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది. నేను నువ్వు జుహు బీచ్లో మార్షల్ ఆర్ట్స్ సాధన చేసేవాళ్లం. మీ నాన్న మనకు శిక్షణ ఇచ్చేవారు. ఎంత మంచి రోజులవి. అలాగే నీ మొదటి చిత్రం 'ఫూల్ ఔర్ కాంటే ' వచ్చి 30 ఏళ్లు అవుతుంది. సమయం గడిచిపోతుంది. కానీ స్నేహం అలాగే ఉంటుంది.' ట్వీట్ చేశారు. Sir, Thank you for your blessings. ❤️ Ajay https://t.co/v9zGOxoVQF — Ajay Devgn (@ajaydevgn) November 22, 2021 Thanks Akki, we’ve shared a long innings. And, I’m happy & grateful for your presence alongside❤️ https://t.co/MPp9udjamE — Ajay Devgn (@ajaydevgn) November 22, 2021 ఎమోషనల్ అవుతున్నా: అజయ్ 'ఈ చిత్రం అజయ్ను చిత్రసీమకు పరిచయం చేయడమే కాకుండా రెండు బైక్లపై అతను ఇచ్చిన ఎంట్రీ సీన్ అప్పట్లో సంచలనంగా మారింది. 'ఫూల్ ఔర్ కాంటే' 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైనది. ఈ చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నా అరంగ్రేటం. ఆస్ట్రైడ్లో రెండు బైక్లపై ఎంట్రీ ఇవ్వడం నా కెరీర్లో చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ కదిలై బైక్లపై స్టంట్ చేసినప్పుడు అనుభవించిన థ్రిల్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పటి నుంచి హిందీ సినిమా దాని పరిధులను విస్తృతం చేసుకుంటూ, అభివృద్ధి చెందుతోంది. ఈ పరిశ్రమలో భాగం కావడం నా అదృష్టం. 30 ఏళ్ల తర్వాత 'ఫూల్ ఔర్ కాంటే'ను మళ్లీ వీక్షించడం భావోద్వేగంగా అనిపిస్తుంది.' అని అజయ్ దేవగన్ తన అనుభవాలను పంచుకున్నారు. అజయ్ దేవగన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తెరంగ్రేటం చేసిన 'ఫూల్ ఔర్ కాంటే' 'జీ బాలీవుడ్' ఛానెల్లో ఇవాళ సాయంత్రం 5.45 గంటలకు ప్రసారం కానుంది. ఈ చిత్రానికి 'వీరూ దేవగన్' దర్శకత్వం వహించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో అజయ్ దేవగన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కళ్లు చెదిరే రేటుకు అజయ్ కొత్త బంగ్లా! -
వీడియోలో అడ్డంగా దొరికిపోయిన అక్షయ్.. అయినా వదలని కత్రీనా
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్ జంట నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యవంశీ’. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అజయ్దేవ్గణ్, రణ్వీర్ సింగ్ కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్స్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పారంభించింది ఈ చిత్రబృందం. ఆ సమయంలో తీసిన ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది క్యాట్. మా బోయ్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండంటూ అక్షయ్, రోహిత్ను చూపించింది ఈ బ్యూటీ. అందులో అక్షయ్ కళ్లు మూసుకొని, రోహిత్ కాళ్లపై తలపెట్టి పడుకొని ఉన్నాడు. కత్రీనా వీడియో తీయడం చూసిన రోహిత్, అక్షయ్ రికార్డు చేయొద్దు అంటూ పరుగు లంకించుకున్నారు. ‘ఇప్పుడు మేము అంతా బాగా కనిపించడం లేదు. మాకు ఫేమ్ ఉంది. రికార్డు చేయొద్దు’ అంటు పరిగెత్తుతున్న అక్షయ్ కిందపడ్డాడు. అది చూసిన పట్టువదలని ఈ భామ గొల్లున నవ్వుతూనే వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో మూవీ ప్రమోషన్స్ గురించి వారు ఎంత ఎక్సయిట్మెంట్తో ఉన్నారో చూడండి అంటూ వెటకారమాడింది ఈ బ్యూటీ. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: OMG 2: శివుడిగా అక్షయ్ కుమార్.. లుక్ అదిరిందిగా! View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: మేమున్నాం!!
డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం..బాంబుల భయంతో వణుకుతున్న ఊరు. బాంబులు కురిసినా సరే దేశం కోసం చనిపోయినా పరవాలేదనే సాహసోపేత నిర్ణయం. ‘మేమున్నాం’ అంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది వీర నారీమణుల తెగువ. 72 గంటల వ్యవధిలో ఎయిర్ఫోర్స్ బేస్ పునరుద్ధరణ. ప్రాణాలకు తెగించి మరీ దేశభక్తిని చాటుకున్న వైనం! అంతేనా.. ప్రభుత్వ అవార్డు సొమ్మును దానం చేసిన దాతృత్వం.. జయహో.. వీరమహిళలు!! చలి పులిలా విజృంభిస్తుంది. కాని ఆ ఊరు చలితో కాదు ‘బాంబుల భయం’తో వణికిపోతుంది. అందరూ ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నారు. పాకిస్థాన్ జెట్స్ భుజ్ (కచ్ జిల్లా, గుజరాత్)లోని ఇండియన్ ఎయిర్ఫోర్స్ బేస్పై బాంబులు వేశాయి. ఈ నేపథ్యంలో ఎయిర్బేస్ను పునరుద్ధరించడానికి భారత వైమానిక దళం బీఎస్ఎఫ్ జవాన్ల సహాయం కోరింది. పునరుద్ధరణ తక్కువ సమయంలో జరగాలంటే ఎక్కువమంది శ్రామికులు కావాలి. వారిని వెదికిపట్టి తీసుకురావడానికి సమయం లేదు. దగ్గరి గ్రామాల్లోని వారి సహాయం కోరాలి.ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్లు ఉన్న ఆ సమయంలో ఎవరు బయటకు వస్తారు? వచ్చినా సహాయపడతారా?రకరకాల సందేహాలను పటాపంచలుచేస్తూ... ఒక్కరు కాదు ఇద్దరు కాదు మాదపూర్ గ్రామానికి చెందిన 300 మంది స్త్రీలు ‘మేమున్నాం’ అంటూ ముందుకువచ్చారు. పునరుద్ధరణ పనుల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం నాటి దృశ్యం ఇది. ఆనాటి భుజ్ ఎయిర్ బేస్ను పునర్నిర్మించిన 300 మంది మహిళలను సగౌరవంగా గుర్తు తెచ్చుకుంటుంది ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రం. (అజయ్ దేవ్గణ్, సంజయ్దత్, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా వోటీటీలో విడుదలైంది) ఈ నేపథ్యంలో ఆనాటి జ్ఞాపకాలు ఆసక్తికరంగా మారాయి. ‘చనిపోయినా సరే, దేశం కోసం చనిపోయాను అనే తృప్తి మిగులుతుంది...అని ఒకరికొకరం ధైర్యం చెప్పుకొని పనిలోకి దిగాము’ అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది సెఘాని అనే మహిళా యోధురాలు. ఆ 300 మంది మహిళలలో ఒకరైన హిరూ బుదియాలో మొదట ఒక సందేహం...‘వెళుతున్నాను సరే, కూలిపని తప్ప నాకు ఏది తెలియదు. నేను చేయగలనా?’ఆ తరువాత భయం... ‘పనిలో ఉండగా పై నుంచి బాంబులు పడితే... ఇంకేమైనా ఉందా!’తనలోని ధైర్యానికి, సందేహాలతో కూడిన భయానికి మధ్య ఆ సమయంలో పెద్ద యుద్ధమే జరిగింది. కాని చివరికి ధైర్యమే గెలిచింది. దేశభక్తి గొప్పతనం అదే కదా! (చదవండి : Mirabai Chanu: ట్రెడిషనల్ ఔట్ఫిట్, ట్వీట్ వైరల్) ‘చిన్నచిన్న విషయాలకే భయపడే నాకు అంతధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. ఏదో శక్తి ఆవహించినట్లు అనిపించింది’ అని ఆరోజును గుర్తు తెచ్చుకుంటుంది వీరు లఖాని. 72 గంటల వ్యవధిలో ఎయిర్ఫోర్స్ బేస్ను పునరుద్ధరించే పని పూర్తయింది.యుద్ధం పూర్తయిన తరువాత గ్రూప్ అవార్డ్గారూ. 50,000 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు వీరమహిళలు. -
నాంది రీమేక్లో బాలీవుడ్ స్టార్ హీరో
తెలుగు హిట్ ‘నాంది’ (2021) హిందీలో రీమేక్ కానుంది. హిందీ నటుడు, దర్శక–నిర్మాత అజయ్ దేవగణ్తో కలిసి ఈ రీమేక్ను ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ‘‘చాలా ముఖ్యమైన ఓ కథను షేర్ చేసుకోవాల్సిన సమయం ఇది. అజయ్ దేవగణ్ ఫిలింస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ కలిసి తెలుగు హిట్ ‘నాంది’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు అజయ్ దేవగణ్. మరి.. ‘నాంది’ హిందీ రీమేక్కు ఎవరు దర్శకత్వం వహిస్తారు? నటీనటులు ఎవరు? అనే విషయాలను స్పష్టం చేయలేదు. ఇక ‘నాంది’ కథ విష యానికి వస్తే.. హాయిగా జీవిస్తున్న ఓ మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఉద్యోగి అనూహ్యంగా హత్యారోపణలతో జైలుపాలవుతాడు. న్యాయం కోసం పోరాడే ఆ వ్యక్తి కథే ‘నాంది’ చిత్రం. కొంత గ్యాప్ తర్వాత అల్లరి నరేశ్ కెరీర్ని హిట్ ట్రాక్ ఎక్కించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకుడు. చదవండి : ఆర్టిస్ట్లు లోకల్ కాదు.. యూనివర్సల్ మరో తెలుగు సినిమాకు సైన్ చేసిన హీరో ధనుష్ -
అజయ్ దేవగణ్ భార్యగా కాజల్..
హిందీ హీరో అజయ్ దేవగణ్తో కాజల్ అగర్వాల్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. హిందీ ‘సింగం’ చిత్రంలో అజయ్తో తొలిసారి నటించారు కాజల్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంతో మంచి జోడీ అనిపించుకున్న అజయ్–కాజల్ దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి కలసి నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ ‘ఖైదీ’ హిందీ రీమేక్లోనే ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారని టాక్. అయితే తమిళ వెర్షన్లో హీరోయిన్ పాత్రకు స్థానం లేదు. కానీ బాలీవుడ్కి తగ్గట్టు కథను మార్చిన నేపథ్యంలో కథానాయిక పాత్రకు అవకాశం ఉందని సమాచారం. హీరో పాత్రకు ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ను జోడించారట. ఆ ఫ్లాష్బ్యాక్లో అజయ్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారని ఓ వార్త హల్చల్ చేస్తోంది. -
రూ. 30 కోట్ల భారీ సెట్ ధ్వంసమైంది.. బోని కపూర్ ఆవేదన
ఒకవైపు కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే.. మూలిగే నక్క మీద తాటిపండు పడడం అన్నట్లుగా తౌటే తుఫాన్ వచ్చి దేశంలో కల్లోలం సృష్టించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ తుఫాన్ ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా భారీగానే పడింది. బాలీవుడ్కు చెందిన చాలా సినిమాల సెట్టింగులు దెబ్బ తిన్నాయి. వందల కోట్ల నష్టం వాటిల్లింది. కేవలం మైదాన్ అనే సినిమాకు సంబంధించి తుపాను కారణంగా రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బోని కపూర్ మీడియాకు వెల్లడించారు. అజయ్ దేవగణ్ హీరోగా బోనికపూర్ నిర్మిస్తున్న మైదాన్ చిత్రం కోసం భారీ సెట్ను ముంబైలో వేశారు. అయితే తౌటే తుఫాన్ దాటికి ఆ సెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో బోనికపూర్ మాట్లాడుతూ..‘గతేడాది లాక్డౌన్ సమయంలో మైదాన్ కోసం వేసిన సెట్ను తొలిసారి కూలగొట్టాం. ఆ తర్వాత మళ్లీ రెండోసారి సెట్ వేసి చిత్రీకరించాం. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మరోసారి సెట్ నిర్మించాం. అయితే ప్రస్తుత తౌటే తుఫాన్ ధాటికి మళ్లీ సెట్ అంతా కూలిపోయింది. దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది ’అని బోనికపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్ఆర్ఆర్ : పవర్ఫుల్ లుక్లో అజయ్ దేవగన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో అజయ్ దేవగన్ జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ల గురువుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఫ్లాష్బాక్ సీన్లలో కనిపించనున్నట్లు సమాచారం. అతనికి జంటగా శ్రియ శరణ్ నటించనుంది శుక్రవారం (ఏప్రిల్2)న ఆయన పుట్టినరోజు కావడంతో ఆర్ఆర్ఆర్లో అజయ్ దేవగన్ ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్,రామ్చరణ్, ఒలివియా, ఆలియాభట్ ఫస్ట్లుక్లను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం' వీడియోలు రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తొలి సినిమా కావడం, స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం. Empowering his people is his defining characteristic. His strength lies in his emotion. Presenting the poweRRRful avatar of @ajaydevgn in #RRRMovie.https://t.co/2cwcGGl7BF#HappyBirthdayAjayDevgn#AjayDevgn #RRR @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @aliaa08 @DVVMovies — RRR Movie (@RRRMovie) April 2, 2021 చదవండి : రాజమౌళి నిర్ణయంతో వకీల్సాబ్ నిర్మాత అప్సెట్! ఆర్ఆర్ఆర్ : రామ్చరణ్ ఫ్యాన్స్కి గిఫ్టిచ్చిన రాజమౌళి -
గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో..
గంగుబాయి కథ ఒక సినిమాకు తక్కువ కాదు. అందుకే అది ఇప్పుడు సినిమా అయ్యింది. గుంగుబాయి కతియావాడి ముంబై కామాటిపురాకు మకుటం లేని మహారాణి. కరీం లాలా అనే మాఫియా డాన్కు రాఖీ కట్టడంతో అతని అండ దొరికి కామాటిపురాను ఏలింది. అయితే ఆమె జీవితాంతం వేశ్యలకు సాయం చేయడానికే చూసింది. అందుకే నేటికీ ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ జూలై 30న రిలీజవుతుందని టాక్. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన గంగుబాయి బయోపిక్ కూడా అదే డేట్కు రిలీజ్ కానుంది. ఆ కలెక్షన్ల క్లాష్ కంటే గుంగుబాయి చరిత్రే ఎక్కువ ఆసక్తికరం. చరిత్ర నిక్షిప్తం చేసుకున్న కథలు ఎన్నో. మనల్ని ఆశ్చర్యపరిచేవి, సంతోషపెట్టేవి, బాధ పెట్టేవి, గర్వపడేలా చేసేవి, సామాజిక పరిణామాలను తెలియ చేసేవి... ఒకప్పుడు సినిమాలంటే కల్పిత కథలు. నేడు చరిత్ర నుంచి ఏరుతున్న పుటలు. దర్శకుడు సంజయ్ లీలాబన్సాలీ అలాంటి మరొక పుటను వెతికి పట్టుకున్నాడు. దాని పేరు ‘గుంగుబాయి కతియావాడీ’. 1960లలో ముంబై రెడ్లైట్ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన మేడమ్ గంగుబాయి కతియావాడీ. ఇప్పుడు ఆమె బయోపిక్ దాదాపుగా పూర్తి కావచ్చింది. గుంగుబాయిగా ఆలియాభట్ నటించింది. ఇంటి నుంచి పారిపోయి గుంగుబాయి కథ ఆసక్తికరమైనది. ఆమెది గుజరాత్లోని కతియావాడీ. వాళ్లది లాయర్ల కుటుంబం అని చెబుతారు. గంగుబాయి చిన్న వయసులో సినిమాల పిచ్చిలో పడింది. అంతే కాదు వాళ్ల నాన్న దగ్గర క్లర్క్గా పని చేసే కుర్రాడి ప్రేమలో కూడా పడింది. ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు. వాళ్లిద్దరూ కొన్నాళ్లు కాపురం చేశారని అంటారు. కాని ముంబైలాంటి మహా నగరిలో ఆ కుర్రాడు బెంబేలెత్తాడు. గుంగుబాయిని కామాటిపురాలోని ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోయాడు. అక్కడి నుంచే గంగుబాయి జీవితం అనూహ్యమవుతూ వచ్చింది. ప్రతిఘటన... లొంగుబాటు వేశ్యావాటికలో గంగుబాయి వారాల తరబడి ఏడ్చింది. కాని తుదకు వృత్తిని అంగీకరించక తప్పలేదు. అయితే ఆమె రూపం, కొద్దో గొప్పో ఉన్న చదువు ఆమెను హైక్లాస్ క్లయింట్ల దగ్గరకు వెళ్లే వేశ్యను చేయగలిగాయి. వారి రాకపోకలు ఆమె కోసం సాగేవి. కాని సహజంగా నేరగాళ్లు కూడా చాలామంది వచ్చి పోతూ ఉండేవారు. అలా ఆమెకు ముంబై అండర్వరల్డ్ తెలిసింది. ఆ సమయంలోనే నాటి పెద్ద డాన్ అయిన కరీం లాలాకు చెందిన ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది ఆమెను చాలారోజుల పాటు అచేతనం చేసిందని అంటారు. తన మీద దాడి ఆమె సహించలేకపోయింది. అయితే మెల్లగా కోలుకుని తనకు న్యాయం జరగాలని ఆశించి శుక్రవారం నమాజు ముగించుకుని వస్తున్న కరీం లాలాను కలిసింది. తనకు జరిగిన అన్యాయం, తాను అనుభవిస్తున్న వేదన చెప్పుకుంది. కరీం లాలా వెంటనే ఆమెకు ఊరడింపు ఇచ్చాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుని రక్ష ఇచ్చాడు. అంతే కాదు ‘కామాటిపురాలో గుంగుబాయికి ఎటువంటి కష్టం ఎవరు కలిగించినా వారి పని చూస్తా’ అని హెచ్చరించాడు. ఇది గంగుబాయికి పెద్ద వరం అయ్యింది. ఆమె కామాటిపురాలో తానే వేశ్యాగృహాల యజమానిగా ఎదగడం మొదలెట్టింది. మహా ప్రాభవం కామాటిపురాలో గంగుబాయికి అనేక వేశ్యాగృహాలు సొంతమయ్యాయి. ఆమె కట్టే ఖరీదైన చీరలు నాడు విశేషమయ్యాయి. నిజం బంగారు అంచు ఉండే చీరలు, నిజం బంగారు గుండీలు ఉండే జాకెట్లు ఆమె కట్టుకునేది. ఆమెకు ఆరోజుల్లోనే బెంట్లి కారు ఉండేది. అండర్ వరల్డ్ కూడా ఆమె గుప్పిట్లో ఉండేది. అయితే ఆమె బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. దీనిని వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని భావించింది. ఎవరైనా ఈ కూపం నుంచి బయటపడాలనుకుంటే వారిని వెళ్లనిచ్చేది. అంతే కాదు వేశ్యల బాగోగులతోబాటు, వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా ఆమె చూసేది. అందువల్లే ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ఆమె ఫొటోలు నేటికి కామాటిపురాలోని వేశ్యాగృహాల్లో కనిపిస్తాయి. సినిమాలో కథ ఈ సినిమా కథను సంజయ్ లీలా బన్సాలీ పకడ్బందీగా తీస్తున్నాడని వినికిడి. ఆలియా భట్ ఈ క్యారెక్టర్ను చాలెంజింగ్గా తీసుకుని చేస్తోంది. అజయ్ దేవ్గణ్ ‘కరీం లాలా’ పాత్రను పోషిస్తున్నాడు. ఎన్నిసార్లు విన్నా వేశ్యల జీవితంలో విషాదమే ఉంటుంది. దీని గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. సినిమాలూ వచ్చాయి. కాని గుంగుబాయి లాంటి వ్యక్తి గురించి వస్తుండటం వల్ల దీని గురించి కుతూహలం ఏర్పడింది. సినిమా విడుదల గురించి వస్తున్న వార్తలను బట్టి జూలై 30న దీనిని విడుదల చేయనున్నారు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా అదే రోజు కావచ్చని అంచనా. కనుక రెండు సినిమాలు కలెక్షన్ల పోటీని ఎదుర్కోవాలి. – సాక్షి ఫ్యామిలీ -
పెళ్ళిలో అజయ్ దేవ్గణ్ డబ్బులు ఆఫర్ చేశాడు!
పెళ్ళి అనేది అందరి జీవితంలో ఒక తియ్యని అనుభూతి. బాలీవుడ్లో కొన్ని జంటలను చూస్తే ఒకరి కోసమే మరొకరు పుట్టారా! అనిపిస్తుంది. బీ టౌన్ జంట కాజోల్, అజయ్దేవ్గణ్ ఈ కోవలోకే వస్తుంది. వీరి పెళ్ళి జరిగి నేటితో 22 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కాజోల్ తమ పెళ్ళి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నారింజ రంగు డ్రెస్సులో ఉన్న కాజోల్, తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతున్న అజయ్ దేవ్గన్ ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో కాజోల్ తమ పెళ్ళినాటి మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. పెళ్లయి ఇన్నేళ్లవుతున్నా ఏరోజు కూడా ఒంటరిగా ఫీలవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి నాడు అజయ్ దేవ్గన్ ఫెరాస్(అగ్ని చుట్టూ తిరగడం) విషయంలో తొందర పెట్టాడని, వీలైనంత త్వరగా పెళ్ళితంతు ముగించడానికి పురొహితుడికి డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్దపడ్డాడని సరదాగా గుర్తుచేసుకున్నారు. కాగా 1995 సంవత్సరంలో 'హల్చల్' సినిమాలో ఈ జంట తొలిసారిగా కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. పెద్దల అంగీకారంతో 1999లో సరిగ్గా ఇదే రోజు పంజాబీ, మహారాష్ట్ర సాంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు న్యాసా, కొడుకు యుగ్ ఉన్నారు. వీరిద్దరు కలిసి గుండరాజ్, ఇష్క్, దిల్క్యాకరే, రాజుచాచా, ప్యార్థోహోనాహిథా సినిమాల్లోనూ కలిసి నటించారు. ఈ మధ్యే వచ్చిన 'తానాజీ: ది అన్సంగ్ వారియర్'లోనూ భార్యాభర్తలుగా కనిపించారు. చదవండి: మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్ -
రాజమౌళి నిర్ణయంతో వకీల్సాబ్ నిర్మాత అప్సెట్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. రెండేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందరి ఆశలను ఎట్టకేలకు నిన్న ఈ మూవీ రిలీజ్ డేట్ను డైరెక్టర్ రాజమౌళి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా సందర్భంగా అక్టోబర్ 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ ఇద్దరూ రాజమౌళి నిర్ణయంతో సంతోషంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మాత్రం నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ విడుదల తేదినే బోనీ కపూర్ ప్రొడక్షన్లో వస్తున్న మైదాన్ సినిమా విడుదల కానున్నట్లు నిర్మాత ఆరు నెలల క్రితమే ప్రకటించాడు. ఈ రెండు సినిమాల్లోనూ అజయ్ దేవగణ్ నటిస్తుండటం విశేషం. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీకి ముందే బోనీ కపూర్తో మాట్లాడాలని అజయ్ రాజమౌళిని కోరాడట. చదవండి: సింగర్ సునీత వెడ్డింగ్.. సుమ డాన్స్ అదరహో అజయ్ నటిస్తున్న మైదాన్ చిత్రం ఫుట్బాల్ లెజండరీ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహిత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అందుకే ప్రత్యేకంగా రాజమౌళితో ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని ప్రకటించే ముందు బోనీ కపూర్ను సంప్రదించాలని అజయ్ దేవగణ్ చెప్పినట్లు సమాచారం. అయితే బోనీ కపూర్ను కలవకుండానే రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ను ప్రకటించాడు. దీంతో ఈ బాలీవుడ్ నిర్మాత అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ‘తప్పకుండా నేను నిరాశ చెందుతున్నాను! ఇది చాలా సరైనది కాదు. మైదాన్ విడుదల తేదీని నేను ఆరు నెలల క్రితం ప్రకటించాను. సినీ పరిశ్రమను కాపాడటానికి మనమందరం కలిసి రావాల్సిన సమయంలో, అతను (రాజమౌళి) ఇలా చేశాడు’ అని బోనీ కోపంగా ఉన్నట్లు టాక్. చదవండి: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది ఇదిలా ఉండగా కోవిడ్ అనంతరం ప్రతి సినిమాకు చెందిన యూనిట్, నిర్మాతలు తమ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఫైట్ను నివారించేందుకు 'ఆర్ఆర్ఆర్' కోసం బోనీ కపూర్ తన చిత్రాన్ని వాయిదా వేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్లో విజయం సాధించిన పింక్ రీమెక్ వకీల్ సాబ్ను బోనీ కపూర్, దిల్ రాజ్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. -
ప్రేమ పెళ్లి అంత వీజీ కాదు
కాజోల్ తాజా సినిమా ‘త్రిభంగ’ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. ఫ్యామిలీ అనుబంధాలలోని సవాళ్లను ఈ సినిమా చర్చిస్తూ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ‘త్రిభంగ’ అనేది ఒడిస్సీ నృత్యంలో ఒక భంగమ. దానిని కచ్చితంగా ఎవరూ పెట్టలేరు.. అయినా ఒక అందం ఉంటుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ఫ్రమోషన్లో కాజోల్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో అనుబంధాలన్నీ అందరి ఇష్టాల కచ్చితత్వంతో ఉండవని అంది. ‘1999లో అజయ్ దేవగన్ను నేను పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు మా నాన్న షోము ముఖర్జీ అందుకు సముఖంగా లేరు. అప్పుడు నా వయసు 23 ఏళ్లు. ఇంకా కొన్నాళ్లు పెళ్లిని వాయిదా వేసి కెరీర్ మీద దృష్టి పెట్టాలని ఆయన ప్రతిపాదన. నాకేమో పెళ్లి చేసుకోవాలని. మరోవైపు అజయ్ తల్లిదండ్రులు మా పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. మా నాన్న మాత్రం నాతో నాలుగురోజులు మాట్లాడలేదు కూడ. అప్పుడు మా అమ్మ (తనూజ) నాకు సపోర్ట్గా నిలిచింది. నీ మనసుకు నచ్చినట్టు చెయ్ అని చెప్పింది. మా అమ్మ నా ప్రతి కష్టకాలంలో నాకు తోడు ఉంది. ఆమె అన్నీ నాకు వివరించి చెప్పేది. మా నాన్నంటే మాకు ఎంత ఇష్టమైనా ఆమె వివరించిన దానిని బట్టి వారి విడాకులను పిల్లలం మేము అర్థం చేసుకున్నాం. కుటుంబంలో సవాళ్లు వస్తూనే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి’ అంది కాజోల్. అజయ్–కాజోల్ల జంట బాలీవుడ్లో సక్సెస్ఫుల్ వివాహిత జంటగా గుర్తింపు పొందింది. వారికి ఇద్దరు పిల్లలు. అజయ్, కాజోల్ నటనను కొనసాగిస్తున్నారు.. సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. -
ఆ వార్త వినగానే.. అభిషేక్ని గట్టిగా తిట్టేశా: అజయ్ దేవ్గణ్
కోవిడ్ మొదలయ్యి భయభ్రాంతం చేస్తున్న రోజుల్లో అమితాబ్ దాని బారిన పడి హాస్పిటల్లో తీవ్రంగా పోరాడాల్సి రావడం అందరికీ తెలిసిందే. అదే సమయంలో అభిషేక్ కూడా కరోనా బారిన పడ్డాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే హాస్పిటల్లో ఉన్నారు. ఆ సంఘటనతో దేశం అంతా అలెర్ట్ అయ్యింది. అమితాబ్కే వచ్చినప్పుడు మనక్కూడా రావచ్చని జాగ్రత్తలు పాటించింది. రెండు రోజుల క్రితం సోనీలో వచ్చిన ‘కామెడీ విత్ కపిల్’షోలో అభిషేక్ బచ్చన్, అజయ్ దేవ్గణ్ పాల్గొని ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘కోవిడ్ వార్త వెలువడగానే నేను అభిషేక్కు ఫోన్ చేశాను. గట్టిగా తిట్టేశాను.. జాగ్రత్తగా ఉండాలి కదా అని. ఎవరి వల్ల వచ్చింది అనంటే అభిషేక్ కంగారుగా నాన్న వల్లే వచ్చి ఉంటుందని అన్నాడు. అమితాబ్ గారు ఇల్లు కదలకుండా ఉంటే ఆయన వల్ల అంటావు మళ్లీ. నువ్వు బయట తిరుగుతున్నావు. నీ వల్లే ఆయన కు వచ్చి ఉంటుంది’ అని బాగా తిట్టాను అని అజయ్ దేవ్గణ్ అన్నాడు. అజయ్ దేవ్గణ్ అమితాబ్ కుటుంబానికి బాగా దగ్గర. అభిషేక్ను పెట్టి హర్షద్ మెహతా బయోపిక్ ‘బిగ్ బుల్’ తాజాగా నిర్మించాడు. దాని ప్రమోషన్లో భాగంగా ఈ షోలో పాల్గొని కోవిడ్ ఉదంతాన్ని పంచుకున్నారు ఇద్దరూ. అభిషేక్ చదువు మానేసి స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చి అజయ్ హీరోగా నటించిన ‘మేజర్ సాబ్’ యూనిట్లో స్పాట్బాయ్గా పని చేశాడు. ‘అప్పటి నుంచి అజయ్ నాకు అన్నగా మారాడు’ అని చెప్పాడు అభిషేక్. -
ఏప్రిల్లో మే డే
బిగ్ బి అమితాబ్ బచ్చన్–అజయ్ దేవగణ్ కాంబినేషన్లో రూపొందనున్న ‘మే డే’ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సినిమాలో అమితాబ్ ప్రధాన పాత్రలో నటించనుండగా కీలక పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ నిర్మిస్తుండడం ఓ విశేషం. రకుల్ ప్రీత్సింగ్, అంగీరా ధార్ కథానాయికలు. తొలి సన్నివేశానికి అజయ్ దేవగణ్ స్నేహితుడు, తెలుగు జోతిష్యులు బాలు మున్నంగి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా అజయ్ దేవగణ్ మాట్లాడుతూ– ‘‘మే డే’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను శుక్రవారమే మొదలుపెట్టాం. సినిమా పూర్తయ్యేవరకూ నాన్ స్టాప్గా షూటింగ్ చేస్తాం. అమితాబ్ గారిని తొలిసారి దర్శకత్వం వహిస్తుండటం ఎగ్జయిటింగ్గా ఉంది. 2022 ఏప్రిల్ 29న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అసీమ్ బజాజ్, సహ నిర్మాతలు: కుమార్ మంగత్, విక్రాంత్ శర్మ, హస్నైన్ హుస్సేనీ, జయ్ కనూజియా, సందీప్ కెవ్లానీ, తార్లోక్ సింగ్. -
మైదానంలోకి వస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’. ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆయన పాత్రలో అజయ్ కనిపిస్తారు. ప్రియమణి కథానాయిక. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమా కోసం వేసిన ఫుట్బాల్ స్టేడియం సెట్ని లాక్ డౌన్ టైమ్లో తొలగించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇంతకు ముందు తీసేసిన సెట్నే మళ్లీ కొత్తగా వేస్తున్నారు. జనవరిలో ఈ చిత్రీకరణలో పాల్గొంటారు అజయ్. ప్రస్తుతం అజయ్, ఈ సినిమాలో నటించేవాళ్లందరూ ఫుట్బాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. -
ఆమె అన్ని పాత్రలకి సూ‘టబు’ల్..
సౌత్ నుంచి బాలీవుడ్కు వెళ్లి స్టార్స్ అయిన వారిలో చాలా మంది ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైలో జెండా పాతినవారిలో శ్రీదేవి, జయప్రద మొదటి వరుసలో వస్తారు. కాని అంతే స్టార్డమ్ను, రెస్పెక్ట్ను సృష్టించుకున్న ఇంకో హీరోయిన్ను మన సౌత్ ఖాతాలో ఎవరూ వేయరు. ఆమె టబూ.. అసలు సిసలు తెలుగు అమ్మాయి. అందులోనూ హైదరాబాదీ అమ్మాయి. టబు బాలీవుడ్లో తన టాలెంట్ను చూపారు. ఇటు సౌత్లో అటు నార్త్లో ఒక వర్సటైల్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ తన బర్త్డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు.. అసలు పేరు తబస్సుమ్... టబు అని అందరూ పిలుస్తారు గాని ఆమె అసలు పేరు తబస్సుమ్. పిలిస్తే తబు అని పిలవాలి. కాని టబు అని అలవాటైంది. ఆమె మదర్, ప్రసిద్ధ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ మదర్ దగ్గరి బంధువులు. షబానా ఆజ్మీకి టబూ మేనకోడలి వరుస. టెన్త్ వరకూ హైదరాబాద్లో చదువుకున్న టబు ఇంటర్ నుంచి చదువు కోసం ముంబై వెళ్లింది. షబానా ఆజ్మీ వల్ల సినిమా వాతావరణం ఉండటంతో ముందు టబు అక్క పర్హా ఖాన్ హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత టబు కూడా సినిమా రంగ ప్రవేశం చేసింది. షబానా ఇంట్లో టబును చూసిన ప్రసిద్ధ నటుడు దేవ్ ఆనంద్ ఆమెకు హమ్ నౌజవాన్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కాని కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉండే మన నిర్మాత రామానాయుడు టబును కూలీ నంబర్ ఒన్ సినిమాతో తెలుగులోకి తీసుకు వచ్చారు. ఆ సినిమా సూపర్హిట్. టబు కూడా సూపర్ హిట్. బాలీవుడ్లో కూడా విజయపథమే.. కూలీ నంబర్ ఒన్ తర్వాత టబు రేంజ్ పెరిగిపోయింది. అందరు హీరోలకు అందుబాటులో లేనంత స్థాయికి వెళ్లింది. ఆ టైమ్లోనే హిందీలో అజయ్ దేవ్గణ్తో చేసిన విజయ్పథ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అజయ్ దేవగణ్ ముంబైకు వచ్చినప్పటి నుంచి టబుకు క్లోజ్ ఫ్రెండ్. వాళ్లు ముంబైలో ఇరుగు పొరుగు ఉండేవారు. ఆ పరిచయం వల్లే విజయపథ్లో కలిసి నటించారు. హిట్ కొట్టారు. (చదవండి: మళ్లీ జంటగా...) టబు-నాగ్ల స్నేహానికి నాంది.. ఈ లోపు తెలుగులో మాస్టర్ అఖిల్ హీరోగా సిసింద్రీ మొదలయ్యింది. నాగార్జున సొంత సినిమా కావడం వల్ల ఇందులో స్పెషల్ సాంగ్లో నటించింది టబు. నాగార్జున టబుల సుదీర్ఘ స్నేహానికి ఈ సినిమా మొదటి మెట్టుగా నిలిచింది. పండు అలియాస్ మహాలక్ష్మి.. కాని అసలు సిసలు మాయాజాలం, టబూజాలం తెలియజేసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. హిందీలో కొత్త ఫ్యామిలీ స్టోరీ ట్రెండ్ను తీసుకొచ్చిన హమ్ ఆప్ కే హై కౌన్ స్ఫూర్తితో రాసుకున్న ఈ కథలో మహాలక్ష్మి అలియాస్ పండుగా టబు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నాగార్జునను గ్రీకువీరుడిగా మోహించే అందాలరాశిగా ఆకర్షించారు. (చదవండి: ముచ్చటగా మూడోసారి) ప్రేమదేశంతో సౌత్లో టాప్ కాని అదే సమయంలో దర్శకుడు కదిర్ తమిళంలో తీసిన కాదల్ దేశం టబును మొత్తం సౌత్కు పరిచయం చేసింది. ఆ సినిమా తెలుగులో ప్రేమదేశం పేరుతో విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. టబులోని గ్రేస్ ఈ సినిమాలో కుర్రకారు వెర్రెత్తి చూశారు. మేచిస్, అస్తిత్వతో మరో మెట్టు పైకి.. కాని టబు అంటే ఇలాంటి కేరెక్టర్లేనా? ఆమెలో నటిగా టాలెంట్ లేదా? ఉంది అని కనిపెట్టినవాడు దర్శకుడు గుల్జార్. అతడు తీసిన హిందీ సినిమా మేచిస్ టబులోని కొత్త నటిని లోకానికి వెల్లడి చేశారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని మంచి కథలు రాయవచ్చని ఆ సినిమా రుజువు చేసింది. ఉగ్రవాదం నేపథ్యంలో నలిగే ఒక అమ్మాయి పాత్రలో టబు అద్భుత నటన ప్రదర్శించి ఎన్నో అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు సంజయ్ మంజ్రేకర్ తీసిన అస్తిత్వ సినిమా టబును నటనను మరో స్థాయికి తీసుకెళ్లారు. భర్త ఉండగా మరో పురుషుడితో సంబంధంలోకి వెళ్లే గృహిణి పాత్రలో టబు ఈ సినిమాలో నటించారు. స్త్రీల మానసిక ప్రపంచం గురించి భావోద్వేగాల గురించి ఈ సినిమాలో టబు చేసిన స్టేట్మెంట్ ఆ సమయంలో గొప్ప ఫెమినిస్టిక్ స్టేట్మెంట్గా విమర్శకులు వ్యాఖ్యానించారు. ఉత్తమ నటిగా నిలబెట్టిన చాందిని బార్ ఆ తర్వాత ఫైనల్ టచ్గా మధుర్ భండార్కర్ తీసిన చాందిని బార్ టబును జాతీయ ఉత్తమ నటిగా నిలబెట్టింది. ముంబైలో పని చేసే బార్ డాన్సర్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు ప్రేక్షకుల ఇటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత టబు గొప్ప కథలకు ఒక ముఖ్యమైన ఎంపికగా నిలిచింది. హిందీలో సీరియస్ సినిమాలు చేస్తూనే తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పక్కన సినిమాలలో నటించింది టబు. చిరంజీవితో అందరివాడులో ఆమె చేసిన పాట ఎవరు మర్చిపోతారు. (చదవండి: హార్ట్ బీట్ని ఆపగలరు!) అంధాదున్కి క్రిటిక్స్ కితాబు.. టబు ఇటీవల బాలీవుడ్లో అంధాధున్ సినిమాలో కీలకమైన పాత్ర చేసి బాలీవుడ్ను మరోసారి సర్ప్రైజ్ చేశారు. ఆమె చేయడం వల్లే ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని క్రిటిక్స్ కితాబు. మొన్నటి అల వైకుంఠపురములో టబు తాజా తెలుగు సినిమా. ఇక టబు పర్సనల్ లైఫ్లోకి వస్తే తను సింగిల్ ఉమన్గా ఉన్నారు. ఇంకా వివాహ బంధంలోకి వెళ్లలేదు. ఖాళీ దొరికితే సోలో ట్రావెలర్గా దేశాలు తిరగడం ఆమెకు ఇష్టం. గొప్ప నటిగా గొప్ప సినిమాలు మరెన్ని చేస్తూ తను హ్యాపీగా ఉంటూ మనల్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే టుయూ వన్స్ అగైన్ టబు. -
మళ్లీ జంటగా...
కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు చిత్రం ‘ఖైదీ’. రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది ఈ చిత్రం. హీరోయిన్ లేకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ‘ఖైదీ’ చిత్రం హిందీలో రీమేక్ కాబోతోంది. కార్తీ చేసిన పాత్రను అజయ్ దేవగన్ చేయనున్నారు. అయితే ఈ రీమేక్లో ఓ పెద్ద మార్పు చేయబోతున్నారని తెలిసింది. హిందీ రీమేక్లో హీరోయిన్ పాత్రను కూడా చేర్చనున్నారట. ఈ పాత్ర కోసం కాజోల్ను సంప్రదించారని సమాచారం. గతంలో ‘హల్చల్, దిల్ క్యా కరే, యు మీ ఔర్ తుమ్’ వంటి సినిమాల్లో జంటగా నటించారు ఈ ఇద్దరూ. ‘ఖైదీ’లో నటిస్తే ఈ రియల్ లైఫ్ కపుల్ని మరోసారి జంటగా తెర మీద చూడొచ్చు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రీమేక్ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. -
శివుడి పాత్రలో..?
ప్రభాస్ హీరోగా నటించనున్న మరో ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్, ఓం రౌత్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్ర చేయనుండగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. మరో కీలకమైన శివుడి పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆది పురుష్’లో తొలుత రావణుడి పాత్ర కోసం అజయ్ని సంప్రదించగా డేట్ల సమస్యతో తిరస్కరించారట. దీంతో ఆ పాత్రకు సైఫ్ని తీసుకున్నారు. అయితే శివుడి పాత్రకు అజయ్ సరిగ్గా సరిపోతారని ఓం రౌత్ భావిస్తున్నారట. ఎలాగైనా డేట్స్ సర్దుబాటు చేయమని అజయ్ను అడగాలనుకుంటున్నారని సమాచారం. -
అజయ్ దేవగన్ సోదరుడు మృతి
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సోదరుడు అనిల్ దేవగన్(51) కన్నుమూశారు. గుండెపోటుతో సోమవారం రాత్రి ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అనిల్ ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. గత రాత్రి నా సోదరుడు అనిల్ దేవగన్ మరణించాడు. అతని అకాల మరణం మా కుటుంబాన్ని తీవ్రంగా కలిచి వేసింది. అతనిని ఎంతో కోల్పోతాను. అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కోవిడ్ కారణంగా ఎలాంటి వ్యక్తిగత ప్రార్థన సమావేశం ఉండదు. అని ట్వీట్ చేశారు. చదవండి : అతనితో జాగ్రత్తగా ఉండమన్నారు: కాజోల్ I lost my brother Anil Devgan last night. His untimely demise has left our family heartbroken. ADFF & I will miss his presence dearly. Pray for his soul. Due to the pandemic, we will not have a personal prayer meet🙏 pic.twitter.com/9tti0GX25S — Ajay Devgn (@ajaydevgn) October 6, 2020 అనిల్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. కాగా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ను ప్రారంభించిన అనిల్ ఆ తరువాత రాజు చాచా, బ్లాక్మెయిల్, హాల్-ఈ-దిల్ వంటి సినిమాలను తెరకెక్కించారు. దర్శకత్వంతో పాటు అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్గా అనిల్ దేవగన్ పనిచేశారు. అదే విధంగా గత ఏడాది (2019 మే 27) అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ కూ డా మరణించారు. -
గంగూభాయ్ బిజీబిజీ
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రం ‘గంగూభాయ్ కతియావాడీ’. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వివిధ వయసుల్లో ఉన్న పాత్రల్లో ఆలియా కనిపిస్తారు. కోవిడ్ బ్రేక్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే ప్రారంభించారు. ముంబైలో నిర్మించిన ప్రత్యేక సెట్స్లో చిత్రీకరణ జరుపుతున్నారు. లాక్డౌన్ ముందు సుమారు 250 మంది యూనిట్తో చిత్రీకరణ జరిపారు. తాజాగా వంద కంటే తక్కువ మందితో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఏకధాటిగా రాత్రి పగలు చిత్రీకరణలో గంగూభాయ్ టీమ్ బిజీబిజీగా ఉంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. -
వెరైటీ లుక్
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో రూపొందిన క్రైమ్ డ్రామా ‘ది బిగ్ బుల్’. అభిషేక్ బచ్చన్, ఇలియానా జంటగా కూకీ గులాటి దర్శకత్వం వహించారు. అజయ్ దేవ్గన్, ఆనంద్ పండిట్ నిర్మించిన ఈ సినిమాకి సంబంధించిన ఇలియానా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. కళ్ల జోడు, టైట్గా ముడివేసిన జుట్టుతో ఇలియానా లుక్ వెరైటీగా ఉంది. ఈ చిత్రం త్వరలో డిస్నీ హాట్ స్టార్లో విడుదల కానుంది. ‘‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఇలియానా. 1980, 1990లలో ముంబైలో జరిగిన వాస్తవ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని, పలు ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ స్టాక్ బ్రోకర్కు సంబంధించి కథ ఇదని సమాచారం -
స్టార్ హీరోయిన్ కాజోల్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
ఆర్ఆర్ఆర్లో అజయ్దేవగన్ పాత్ర అదే!
సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) సినిమాలో అజయ్ దేవగన్ జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ల గురువుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఫ్లాష్ బ్యాక్లో ఫ్లాష్బాక్ సీన్లలో కనిపించనున్నట్లు సమాచారం. అతనికి జంటగా శ్రియ శరణ్ నటించనుంది. ఇక 1920 ల కాలం నాటి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా, హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. (‘ఆర్ఆర్ఆర్’ ట్రయిల్ షూట్ రద్దు.. అందుకేనా!) ఈ సినిమాలో తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్కి జోడీగా ఒలివియా మోరిస్, రామ్ చరణ్కి జోడీగా ఆలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్స్ , అలిసన్ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (అజయ్ దేవగన్కి జోడీగా శ్రియ) -
సుశాంత్ మరణం: షాక్లో సినీ ఇండస్ట్రీ
‘ఎంఎస్ ధోని’ బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది. ఆదివారం ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ హఠాన్మరణ వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ యువహీరో ఇక లేరనే చేదు వార్తను బాలీవుడ్ ఇండస్ట్రీ దింగమింగుకోలేకపోతోంది. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. సుశాంత్ మరణ వార్త నిజం కాకుండా ఉంటే ఎంతో బావుంటుందంటూ వారు ట్వీట్లు చేస్తున్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ‘అద్భుత ప్రతిభ గల యువ నటుడు సుశాంత్ త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. టెలివిజన్, సినిమాల్లో ఆయన నటన అద్భుతం. కెరీర్ పరంగా అయన ఎదిగిన తీరు అందరికీ స్పూర్థిదాయకం. మరిచిపోలేని ఎన్నో అనుభూతులను మనకు మిగిల్చి ఆయన వెళ్లిపోయారు. సుశాంత్ మరణించారన్న వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓంశాంతి’- ప్రధాని నరేంద్రమోదీ ‘సుశాంత్ మృతి చెందాడన్న వార్త విని ఒక్కసారిగా షాక్కు గురయ్యాను. ఇటీవలే సుశాంత్ నటించిన చిచోరే సినిమా చూశాను. ఆ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. తాను కూడా ఆ సినిమాలో భాగస్వామ్యం అయి ఉంటే బాగుండేది అనుకున్నాను. నిజంగా సుశాంత్ చాలా టాలెంటెడ్ హీరో’ - అక్షయ్ కుమార్ ‘సుశాంత్ మరణ వార్తతో షాక్కు గురయ్యాను. నా దగ్గర మాటల్లేవు. నా గుండె పగిలింది. ఈ వార్త నిజం కాకుండా ఉంటే బాగుండు’. - సోనూసూద్ ‘ఈ వార్త వినడం నిజంగా బాధాకరం. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి... సుశాంత్ ఆత్మకు శాంతి కలగాలి’ - అజయ్ దేవగన్ ‘సుశాంత్ సింగ్ రాజ్పుత్ లేరనే వార్త నన్ను ఎంతగానో బాధించింది. ప్రతిభావవంతుడైన యవ నటుడు అతడు. అతడి కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలయజేస్తున్నా. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి’ - సచిన్ టెండూల్కర్ ‘సుశాంత్ సింగ్ విషాదకరమైన మరణవార్తను విని షాక్ అయ్యాను. ప్రతిభ, అవకాశాలతో కూడిన జీవితం అకస్మాత్తుగా ముగిసింది. అతడి కుటుంబానికి, అభిమానులకు నా సానుభూతి’ - టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ‘ఆ మాటలు నన్ను షాక్కు గురిచేశాయి. హృదయం ముక్కలైంది. నిజంగా విషాదకరమైన వార్త. మాటలు రావడం లేదు. చాలా త్వరగా వెళ్లిపోయాడు’ - తరణ్ ఆదర్శ్ ‘జేమ్స్ డీన్, హీత్ లెడ్జర్ మరణించిన తర్వాత నన్ను షాక్కు గురిచేసింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం. కరోనా వైరసే కాకుండా ఆ దేవుడు కూడా బాలీవుడ్పై పగబట్టినట్లు ఉన్నాడు’ - రామ్గోపాల్ వర్మ ‘సుశాంత్ సింగ్ రాజ్పుత్ అకాల మరణం అనే మాటలు విని షాక్ అయ్యాను. ప్రతిభావంతుడైన యువకుడు. అతని ఆత్మ శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తున్నాను. సుశాంత్ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’ - మహేశ్ బాబు. చదవండి: బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ హీరో మాజీ మేనేజర్ ఆత్మహత్య -
మైదానం తొలగిస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్’. ఫుట్బాల్ క్రీడాకారుడు సయ్యద్ అబ్దుల్ రహిమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. 1950లలో ఈ చిత్రకథ జరుగుతుంది. పీరియాడికల్ చిత్రం కాబట్టి ఈ సినిమా చిత్రీకరణ కోసం ముంబైలో 16 ఎకరాల్లో సెట్స్ వేశారు. ఇందులో ఫుట్బాల్ స్టేడియం సెట్ కూడా ఒకటని సమాచారం. అయితే ఈ సెట్స్ను ఇప్పుడు తొలగిస్తున్నారు. కరోనా వల్ల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో ఇంకా స్పష్టత రాలేదు. జూన్ నెలలో వర్షాలు మొదలవుతాయి. దాంతో సెట్స్ పాడవుతాయనే ఉద్దేశంతో తొలగించాలనుకున్నారు. ఆల్రెడీ తొలగించే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘‘ఈ సెట్స్ మళ్లీ నిర్మించాలంటే సుమారు రెండు నెలల సమయం పడుతుంది. షూటింగ్స్ మళ్లీ ప్రారంభం అయితే సెట్స్ మళ్లీ వేసి చిత్రీకరణ ప్రారంభించేసరికి నవంబర్ అవుతుంది’’ అని నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. -
సలామ్ రహీమ్ సాబ్...
1964లో భారత ఫుట్బాల్ కోచ్గా ఉన్న ఆల్బర్టో ఫెర్నాండో ఆ సమయంలో శిక్షణకు సంబంధించి బ్రెజిల్లో నిర్వహించిన ప్రత్యేక వర్క్షాప్కు హాజరయ్యారు. తిరిగొచ్చిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నారు. ‘ఏముంది అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి. 1956లో రహీమ్ సర్ మాకు నేర్పించిందే ఇప్పుడు అక్కడ చెబుతున్నారు. ఆయన నిజంగా ఫుట్బాల్ ప్రవక్త’... ఈ మాటలు చాలు కోచ్గా సయ్యద్ అబ్దుల్ రహీమ్ చూపించిన ప్రభావం ఏమిటో చెప్పడానికి. నాటి తరంలోనే కొత్త తరహా టెక్నిక్లతో భారత ఫుట్బాల్ను పరుగెత్తించిన మన హైదరాబాదీ రహీమ్ సర్కు ఫుట్బాల్ ప్రపంచంలో స్థానం ప్రత్యేకం. భారత్ ఫుట్బాల్ను ఇప్పుడు చూస్తున్న వారికి పాతతరంలో మన జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని, పలు చిరస్మరణీయ విజయాలు సాధించిందని చెబితే ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ 1950, 1960లలో మన ఫుట్బాల్ టీమ్ ఉచ్చ దశలో నిలిచింది. నాడు ఆటగాళ్లతోపాటు వారిలో ఒకడిగా ఈ విజయాలలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి సయ్యద్ అబ్దుల్ (ఎస్ఏ) రహీమ్. హైదరాబాద్కు చెందిన రహీమ్ శిక్షకుడిగా వేసిన ముద్ర ఏమిటో నాటితరం ఆటగాళ్లంతా గొప్పగా చెప్పుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే రహీమ్ సాబ్ కోచ్గా పని చేసిన కాలాన్ని భారత ఫుట్బాల్ స్వర్ణ యుగం అనడం అతిశయోక్తి కాదు. సుదీర్ఘ కాలం పాటు... 1909 ఆగస్టు 17న హైదరాబాద్లో జన్మించిన రహీమ్ కొన్నాళ్లు టీచర్గా పనిచేశారు. ఫుట్బాల్పై ప్రేమతో టీచర్ ఉద్యోగాన్ని వదులుకొని హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టుకు కోచ్గా వచ్చారు. రహీమ్ శిక్షణలో హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టు జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. సిటీ పోలీస్ జట్టును అత్యుత్తమ జట్టుగా నిలిపిన రహీమ్ ఆ తర్వాత 1950 నుంచి ఏకంగా 13 ఏళ్ల పాటు భారత టీమ్ కోచ్గా తన స్థాయిని ప్రదర్శించారు. ఆయన శిక్షకుడిగా ఉన్న సమయంలోనే భారత్ 1951 ఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. 1952 హెల్సింకి, 1956 మెల్బోర్న్, 1960 రోమ్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ భారత జట్టుకు రహీమ్ కోచ్గా వ్యవహరించారు. మెల్బోర్న్ ఒలింపిక్స్లో భారత్ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ముఖ్యంగా 1962 జకార్తా ఆసియా క్రీడల్లో సుమారు లక్ష మంది ప్రేక్షకుల సమక్షం లో జరిగిన ఫైనల్లో కొరియా జట్టుపై భారత జట్టు సాధించిన విజయాన్ని ఏ ఫుట్బాల్ అభిమానీ మరచిపోలేడు. ఇదే కోచ్గా రహీమ్ సాబ్ కెరీర్లో మరపురాని క్షణం. కొత్త తరహా శైలితో... కోచ్గా రహీమ్ గొప్పతనం ఆయన దూరదృష్టిలోనే కనిపిస్తుంది. ఎంతో ముందుచూపుతో ఆలోచించి ఇచ్చే శిక్షణ, వ్యూహాలు జట్టుకు మంచి ఫలితాలు ఇచ్చాయి. అప్పటి వరకు భారత జట్టు ఆడుతూ వచ్చిన బ్రిటిష్ శైలి తరహా ఆట మనకు కుదరదంటూ చిన్న చిన్న పాస్లతో కొత్త టెక్నిక్ను ఆయన మన ఆటలో జోడించారు. మైదానంలో 4–2–4 వ్యూహాన్ని రహీమ్ చాలా ముందుగా అనుసరించారు. అదే శైలితో బ్రెజిల్ 1958, 1962 ప్రపంచకప్లలో ఆడి టైటిల్ గెలవడం విశేషం. ఫార్వర్డ్లు లేకుండా ఆరుగురు మిడ్ఫీల్డర్లతో ఆడించడం కూడా అప్పట్లో ఒక కొత్త వ్యూహం. మోటివేషన్ స్పీకర్ తరహాలో ఆయన ఇచ్చే స్ఫూర్తిదాయక ప్రసంగాలు తమలో విజయకాంక్షను నింపేవని ఆటగాళ్లు చెబుతారు. క్రమశిక్షణకు మారుపేరులా కనిపించే రహీమ్ సాబ్ స్ఫూర్తిగానే తర్వాతి తరంలో ఎంతో మంది కోచ్లు తయారయ్యారు. వీరిలో అమల్ దత్తా, పీకే బెనర్జీ, నయూముద్దీన్ తదితరులు ఉన్నారు. పురస్కారాల మాటే లేదు... 1962లో జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాతి ఏడాదే జూన్ 11న, 1963లో హైదరాబాద్లో రహీమ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. ఆయన సహచర ఆటగాడు ఫ్రాంకో ఫార్చునాటో... ‘రహీమ్ సాబ్ తనతో పాటు భారత ఫుట్బాల్ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు’ అని వ్యాఖ్యానించడం ఆయన చేసిన సేవలను చూపిస్తోంది. నిజంగా అదే జరిగింది. ఆ తర్వాత అంతకంతకూ దిగజారుతూ వచ్చిన భారత ఫుట్బాల్ ప్రమాణాలు ఇక కోలుకోలేని విధంగా మరింత పతనావస్థకు చేరిపోయాయి. గొప్పవాళ్ల ఘనతలను గుర్తించి వారిని తగిన విధంగా గౌరవించుకోవడంలో మన అధికారులు ఎప్పుడూ వెనుక వరుసలోనే ఉంటారు. కోచ్గా అజరామర కీర్తిప్రతిష్టలు దక్కినా రహీమ్ సాబ్కు ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తన జీవితకాలంతో ఆయన ఆర్థికంగా పెద్దగా పొందింది ఏమీ లేదు. చనిపోయిన తర్వాత కూడా ఎలాంటి పురస్కారాలు దక్కలేదు. ఆటగాళ్ల వ్యక్తిగత కష్టాన్ని కూడా తమ ఖాతాలో వేసుకొని ‘ద్రోణాచార్య’ అవార్డులు సొంతం చేసుకునే కోచ్లున్న ఈ కాలంలో అసలైన గురువుకు అలాంటి అవార్డు ఏమీ లభించలేదు. ఏదో అభిమానం ఉన్నవారు అప్పుడప్పుడు తలచుకోవడం మినహా అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కూడా వేర్వేరు రాజకీయ కారణాలతో రహీమ్ను గుర్తు చేసుకునే కార్యక్రమాలు, టోర్నీలు కూడా నిర్వహించలేదు. రహీమ్ కుమారుడు సయ్యద్ షాహిద్ హకీమ్ కూడా అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడే. హకీమ్ 1960 రోమ్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 1960 రోమ్ ఒలింపిక్స్ తర్వాత భారత ఫుట్బాల్ జట్టు మళ్లీ ఒలింపిక్స్కు అర్హత సాధించకపోవడం గమనార్హం. అజయ్ దేవ్గన్ నటనతో... ఇన్నేళ్ల తర్వాత కోచ్ రహీమ్ జీవితం సినిమా కథకు పనికొస్తుందని బాలీవుడ్ గుర్తించింది. రహీమ్ పాత్రలో స్టార్ హీరో అజయ్ దేవ్గన్ నటిస్తూ ‘మైదాన్’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ‘ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్, 1952–1962’ ట్యాగ్లైన్తో ఉన్న సినిమా రహీమ్ కోచ్గా భారత్ సాధించిన విజయాలను ప్రేక్షకుల ముందు ఉంచనుంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మంచి కథను చెప్పేందుకు మన దేశంలో సినిమా మాధ్యమానికి మించినది ఏముంది. ఈ సినిమా తర్వాతైనా రహీమ్ గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుందని ఆశించవచ్చేమో. -
ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి
ఏడాది నుంచి ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ బయటకు రానీయకుండా ఆడియన్స్ని ఊరిస్తున్నారాయన. శుక్రవారం ఓ ఊర మాస్ టీజర్తో ఎన్టీఆర్, రామ్చరణ్ అభిమానులకు ఊరట కలిగించారు. శుక్రవారం రామ్చరణ్ బర్త్డే. ఎన్టీఆర్ వాయిస్తో చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ఆడు కనవడితే నిప్పు కణం నిలవడినట్టుంటది. కలవడితే ఏగుసుక్క ఎగవడినట్టుంటది. ఎదురువడితే చావుకైనా చమట ధార కడతది. బాణమైనా బందూకైనా వానికి బాంచనైతది. ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’’ అంటూ టీజర్లో రామ్చర ణ్ కసరత్తులు చేస్తుంటే ఎన్టీఆర్ పవర్ఫుల్ సంభాషణలు పలికారు. తమిళ, హిందీ, కన్నడ భాషల్లోని టీజర్స్కి ఎన్టీఆరే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘అందరూ ఇంట్లో ఉండటమే తనకి ఇచ్చే బెస్ట్ బర్త్డే గిఫ్ట్’’ అని చరణ్ ట్వీట్ చేశారు. అలాగే ఉపాసన తయారు చేసిన కేక్ని కట్ చేసి ఇంట్లోనే బర్త్డేని జరుపుకున్నారు చరణ్. ఆ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఉపాసన. -
మ్యాచ్ వాయిదా
‘మైదాన్’ సినిమా కోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఫుట్బాల్ కోచ్గా మారారు. ఆయన కోచింగ్లో తయారైన టీమ్ ఆడాల్సిన మ్యాచ్ వాయిదా పడిందని తెలిసింది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటిస్తున్న చిత్రం ‘మైదాన్’. ఈ సినిమాలో ఇండియా ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను పోషిస్తున్నారు అజయ్. తొలుత ఈ సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు డిసెంబర్ 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ఇందులో అజయ్ భార్యగా ప్రియమణి నటిస్తున్నారు. -
బాక్సాఫీస్పై తాన్హాజీ దండయాత్ర
ముంబై : బాలీవుడ్ సూపర్స్టార్ అజయ్ దేవగన్ తాజా బ్లాక్బస్టర్తో జోష్లో ఉన్నారు. ఆయన నటించిన తాన్హాజీ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూ ఇప్పటికే రూ 250 కోట్ల వసూళ్లతో అదరగొడుతోంది. తాన్హాజీ ప్రదర్శిస్తున్న థియేటర్లు ఇంకా హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుండటంతో ఈ మూవీ లైఫ్టైమ్ వసూళ్లు రికార్డు స్ధాయిలో ఉంటాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇతర సినిమాల నుంచి పోటీ ఎదురైన తాన్హాజీ బాక్సాఫీస్ దూకుడు కొనసాగుతోందని, నాలుగో వారంలో రూ 275 కోట్ల మార్క్ దాటుతుందని ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 2020లో రూ 250 కోట్ల క్లబ్లో చేరిన తొలి బాలీవుడ్ మూవీ తాన్హాజీ కావడం గమనార్హం. చదవండి : ఆ రికార్డుకు అడుగుదూరంలో తాన్హాజీ -
నవంబరులో మైదాన్
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైదాన్’. ఇందులో ప్రియమణి కథానాయిక. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని అజయ్ లుక్స్ను గురువారం విడుదల చేశారు. ఇండియన్ ఫుట్బాల్ కోచ్ కమ్ మేనేజర్ (1950–1963) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ‘మైదాన్’ చిత్రం రూపొందుతోంది. ఏప్రిల్కి చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నారు. జీ స్టూడియోస్తో కలిసి బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నవంబరు 27న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘ఆర్ఆర్ఆర్’లో శ్రియ!
ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు దాటిపోయింది. అయినప్పటికీ చెక్కుచెదరని అందంతో కుర్రకారుల మతులు పోగొడుతోంది హీరోయిన్ శ్రియ. దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ టాలీవుడ్లో కాస్త వెనకబడింది. అయితే శ్రియకు ఓ బంపరాఫర్ తగిలినట్లు సమాచారం. తెలుగులో భారీ బడ్జెట్తో, పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిందంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్కు జోడీగా చిత్రబృందం శ్రియను ఎంచుకున్నారు. దీంతో ఆమె షూటింగ్ కోసం గతవారం వికారాబాద్ అడవులకు పయనమైంది. అక్కడ అజయ్, శ్రియ జోడీపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని ఆ వార్తల సారాంశం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రాంచరణ్తో ఆలియా భట్ జోడీ కట్టనున్నారు. బాహుబలి వంటి అంతర్జాతీయ సినిమాలను తెరకెక్కించిన జక్కన్న ఆర్ఆర్ఆర్కు దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై అసాధారణ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన వివరాలను ఎంతో గోప్యంగా ఉంచడానికి చిత్రబృందం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ హీరోల ఫొటోలు, సినిమా వివరాలు లీక్ అవుతూనే వచ్చాయి. దీంతో రాజమౌళి షూటింగ్ సెట్లో మొబైల్ ఫోన్లను నిషేధించినట్టు వినికిడి. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయనున్నారు. చదవండి: ఆర్ఆర్ఆర్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుదీప్ ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు బ్యాడ్ న్యూస్! -
అజయ్ ఆగయా
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామచరణ్కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిరి్మస్తున్నారు. అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి అజయ్ ఆగయా (వచ్చారు). ‘‘రాజమౌళిగారిని వివిధ సందర్భాల్లో కలుసుకున్నప్పుడు ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళిగారితో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు అజయ్ దేవగన్. ఈ షెడ్యూల్ చిత్రీకరణ ఇంకా 25 రోజుల పాటు సాగుతుందని తెలిసింది. 1920 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయింది. ఈ సినిమాను పది భాషల్లో ఈ ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే విడుదల తేదీ మారుతుందనే ప్రచారం జరుగుతోంది. -
తరచూ గర్భస్రావం.. వేదనకు గురయ్యాం: నటి
ముంబై: పదేళ్ల తర్వాత మరోసారి వెండితెరపై భర్యాభర్తలుగా కనిపించబోతున్నారు బాలీవుడ్ జంట కాజోల్- అజయ్ దేవ్గణ్. ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరాఠా అధినేత ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్గా పనిచేసిన మరాఠా యోధుడు తానాజీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న కాజోల్.. సోషల్ మీడియా బ్లాగ్ హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో తన ప్రేమకథ, పెళ్లి గురించి చెప్పుకొచ్చారు. తానూ, అజయ్ నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలామని.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెద్దల అనుమతితో ఒక్కటమయ్యామని తెలిపారు. చాలా రోజులపాటు హనీమూన్ ఎంజాయ్ చేద్దామనుకుంటే.. అజయ్ అనారోగ్యం బారిన పడటంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చిందంటూ చిలిపి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. అలా మొదలైంది.. ‘25 ఏళ్ల క్రితం హల్చల్ సినిమా సెట్లో మేం కలుసుకున్నాం. షాట్ రెడీ అనగానే.. నా హీరో ఎక్కడ ఉన్నాడు అడిగాను. అక్కడున్న వాళ్లు అజయ్ వైపు చూపించారు. ఓ మూలన గంభీరంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్న హీరోను అప్పుడే చూశాను. తర్వాత మాటలు కలిపాం. మంచి స్నేహితులమయ్యాం. నిజానికి నేను అప్పుడు వేరే అబ్బాయితో డేటింగ్లో ఉన్నాను. అతడి గురించి అజయ్కు అప్పుడప్పుడు చాడీలు చెప్పేదాన్ని. కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ అయ్యింది. ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నేను అజయ్ చేతిని పట్టుకున్నాను. చిత్రమేమిటంటే మేం ఎప్పుడూ ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు. కార్లలోనే ఎక్కువ జీవితం గడిపాం! మా ప్రేమ ప్రయాణంలో ఎక్కువ జీవితం కార్లలోనే గడిపాం. తరచుగా డిన్నర్లు, లాంగ్డ్రైవ్లకు వెళ్లేవాళ్లం. నేనేమో దక్షిణ బాంబేలో.. తను జుహులో. తనతో కలిసి వెళ్తున్న ప్రతీసారీ నా స్నేహితులు నన్ను హెచ్చరించేవారు. కానీ తను నాతో ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడు. సరదాగా ఉండేవాడు. అలా నాలుగేళ్లు ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మా పెద్దలకు చెప్పాం. అజయ్ తల్లిదండ్రులు వెంటనే సరే అన్నారు గానీ.. మా నాన్న మాత్రం ముందు కెరీర్ మీద దృష్టి పెట్టమని సూచించారు. అయితే నేను మాత్రం పట్టు వదలకపోవడంతో ఆయన కూడా అంగీకరించారు. పూజారికి లంచం ఇవ్వబోయాడు.. మేము ఎంతగానో ఎదురుచూసిన పెళ్లిరోజు రానే వచ్చింది. పంజాబీ, మరాఠీ సంప్రదాయాల్లో మా వివాహం జరిగింది. అగ్నిహోత్రం చుట్టూ తిరిగేటప్పుడు అజయ్.. పూజారిని వేగిరపెట్టాడు. తంతు తొందరగా పూర్తి చేయాలంటూ లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. అలా పెళ్లి జరిగిపోయింది. తర్వాత హనీమూన్ ట్రిప్లో భాగంగా సిడ్నీ, హవాయి, లాస్ ఏంజెల్స్ చుట్టివచ్చాం. ఇంకో ఐదు వారాల పాటు ట్రిప్ కొనసాగాల్సింది. ఈజిప్టు కూడా వెళ్లాలనుకున్నాం. కానీ అజయ్ ఆరోగ్యం పాడవడంతో..‘ బేబీ.. నాకు తర్వాతి ఫ్లైట్ బుక్ చెయ్యి.. వెళ్లిపోతా’ అని ముఖం పెట్టాడు. అంతే వెంటనే తిరిగి వచ్చేశాం అంటూ కాజోల్ తమ మధురు ఙ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చారు.(తాన్హాజీ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తరచూ గర్భస్రావాలు.. వేదనకు గురయ్యాం పెళ్లైన వెంటనే తాము పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నామని... అయితే వరుసగా గర్భస్రావాలు కావడంతో తీవ్ర వేదనకు గురయ్యామని కాజోల్ పేర్కొన్నారు. కొన్నాళ్ల తర్వాత నైసా జన్మించిందని.. ఆ తర్వాత యుగ్ కూడా రావడంతో తమ కుటుంబం పరిపూర్ణమైందని హర్షం వ్యక్తం చేశారు. తర్వాత అజయ్ సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టాడని.. తను ఇప్పుడు ‘సెంచరీ’ కొట్టబోతున్నాడని(వందో సినిమాలో నటిస్తున్నాడని) చెప్పుకొచ్చారు. తనతో జీవితం తృప్తిగా ఉందని.. హనీమూన్లో అజయ్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు... తనను తొందరగా ఈజిప్టు ట్రిప్నకు వెళ్లమని పోరు పెడుతున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా హల్చల్ సినిమా తర్వాత గూండారాజ్, ఇష్క్, దిల్ క్యా కరే, రాజూ చాచా, ప్యార్ తో హోనా హై థా వంటి సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. 1999లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు కూతురు నైసా, కుమారుడు యుగ్ సంతానం. View this post on Instagram “We met 25 years ago, on the sets of Hulchul–I was ready for the shot & asked, ‘Where’s my hero?’ Someone pointed him out–he was broodily sitting in a corner. So 10 minutes before I met him, I bitched about him! We began talking on set & became friends. I was dating someone at the time & so was he–I’ve even complained about my then boyfriend to him! Soon, we both broke up with our significant others. Neither of us proposed–it was understood that we were to be together. It went from hand-holding to a lot more before we knew it! We used to go for dinners & so many drives–he lived in Juhu & I, in South Bombay, so half our relationship was in the car! My friends warned me about him–he had quite a reputation. But he was different with me–that’s all I knew. We’d been dating for 4 years, when we decided to get married. His parents were on board, but my dad didn’t talk to me for 4 days. He wanted me to focus on my career, but I was firm & he eventually came around. Again, there was no proposal–we just knew we wanted to spend our lives together. We got married at home & gave the media the wrong venue–we wanted it to be our day. We had a Punjabi ceremony & a Marathi one! I remember, during the pheras Ajay was desperately trying to get the pandit to hurry up & even tried to bribe him! I wanted a long honeymoon–so we travelled to Sydney, Hawaii, Los Angeles… But 5 weeks into it, he fell sick & said, ‘Baby, book me on the next flight home!’ We were supposed to do Egypt, but we cut it short. Over time, we began planning to have kids. I was pregnant during K3G, but had a miscarriage. I was in the hospital that day–the film had done so well, but it wasn’t a happy time. I had another miscarriage after that–it was tough. But eventually it worked out–we had Nysa & Yug & our family’s complete. We’ve been through so much–we’ve formed our own company, Ajay’s on his 100th film & every day we’re building something new. Life with him is content–we’re not too romantic or anything–we care for each other. If I’m thinking idiotic things, it’ll come out of my mouth without a filter & vice versa. Like right now I’m thinking that he owes me a trip to Egypt!” A post shared by Humans of Bombay (@officialhumansofbombay) on Jan 8, 2020 at 4:25am PST -
పరిణీతి అవుట్ నోరా ఇన్
హిందీ చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ నుంచి కథానాయిక పరిణీతీ చోప్రా తప్పుకున్నారని బాలీవుడ్ సమాచారం. అభిషేక్ దుధియా దర్శకత్వంలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, రానా, ప్రణీత ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. ఇందులో గూఢచారిగా పరిణీతి చోప్రా నటించాల్సింది. కానీ, ఇప్పుడు ఆమె స్థానంలోకి నోరా ఫతేహీ వచ్చారని టాక్. ఈ నెల 12 తర్వాత జరిగే ఈ సినిమా షూట్లో జాయిన్ అవుతారట నోరా. ఎన్టీఆర్ ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’, ‘బాహుబలి’లో ‘మనోహరీ..’ వంటి స్పెషల్ సాంగ్స్తో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు నోరా. ఇంకా కిక్ 2, లోఫర్ చిత్రాల్లోనూ ప్రత్యేక పాటలకు కాలు కదిపారు. హిందీలోనూ స్పెషల్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నోరా ఇటీవల కొన్ని హిందీ చిత్రాల్లో కీలక పాత్రలకు సై అంటున్నారు. తాజాగా ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో గూఢచారిగా నటించడానికి సిద్ధమయ్యారామె. ఈ చిత్రం ఆగస్టు14న విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి పరిణీతీ ఎందుకు తప్పుకున్నారంటే ‘సైనా’ చిత్రంతో బిజీగా ఉండటం వల్లే అని బాలీవుడ్ టాక్. ‘సైనా’ చిత్రం నుంచి శ్రద్ధా కపూర్ తప్పుకున్నాక ఆమె స్థానంలోకి పరిణీతి వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
డబుల్ ఎంట్రీ
ఈ మధ్యే తొలి బాలీవుడ్ సినిమా చేయడానికి అంగీకరించారు ప్రణీతా సుభాష్. అజయ్ దేవగణ్, సంజయ్ దత్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ ద్వారా హిందీ తెరకు పరిచయం కానున్నారామె. ఈ సినిమా పూర్తికాకముందే మరో హిందీ సినిమా అంగీకరించారు ప్రణీత. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ఏడేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న హిందీ చిత్రం ‘హంగామా 2’లో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ చిత్రం గురించి ప్రణీత మాట్లాడుతూ – ‘‘నేను ఇప్పటివరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రం చేయలేదు. ఎక్కువ శాతం పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో లేదా హీరోని బాగా ప్రేమించే అమ్మాయిలానే కనిపించాను. వాటికి భిన్నంగా ఉంటే ‘హంగామా 2’ నాకో కొత్త అనుభవంలా ఉండబోతోంది’’ అన్నారు. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు ఒకే రోజున (వచ్చే ఏడాది ఆగస్ట్ 14 రిలీజ్ కాబోతున్నాయి. ఆ విధంగా హిందీ స్క్రీన్పై ఒకేసారి డబుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రణీత. -
మళ్లీ రైడ్
గత ఏడాది హీరో అజయ్ దేవగన్ బాలీవుడ్ వెండితెరపై చేసిన ‘రైడ్’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దీంతో మళ్లీ ‘రైడ్’ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అజయ్. తొలి రైడ్లో అజయ్ సరసన హీరోయిన్గా నటించిన ఇలియానాయే మలి రైడ్లోనూ నటించబోతున్నారని బాలీవుడ్ సమాచారం. 1980 నేపథ్యంలో అప్పటి వాస్తవ సంఘటనల ఆధారంగా రాజ్కుమార్ గుప్తా దర్శకత్వంలో ‘రైడ్’ చిత్రం తెరకెక్కింది. తాజాగా మరో భారీ ఐటీ రైడ్ నేపథ్యంలో ‘రైడ్’కు సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నారట అజయ్ దేవగన్. ఇందుకు తగిన కథాచర్చలు కూడా జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి.. రెండో ‘రైడ్’కు కూడా రాజ్కుమార్ గుప్తాయే దర్శకత్వం వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు
చలనచిత్ర పరిశ్రమలో గతకొంతకాలంగా బయోపిక్ల హవా నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల మెప్పును సంపాదించుకుంటున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో వస్తున్న బయోపిక్ చిత్రాలకు లెక్కే లేదు. ఈ క్రమంలో మరాఠా అధినేత చత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్గా పనిచేసిన మరాఠా యోధుడు తానాజీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఈ సినిమాలో అజయ్ దేవ్గన్, కాజోల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజైంది. యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తానాజీ యుద్ధ సన్నివేశాలు భీకరంగా ఉండేట్టు కనిపిస్తోంది. 1670 వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యంలో లిఖించబడిన చరిత్రను చిత్రబృందం వెండితెరపై ఆవిష్కరించింది. తానాజీ మొఘల్ సామ్రాజ్యంపై సర్జికల్ స్ట్రైక్ జరిపాడంటూ ట్రైలర్లో ఆయన ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ ట్రైలర్లో కాజోల్ నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ ఆమె నటన ఆకట్టుకుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. భయం అంటేనే తెలియని తానాజీ ప్రత్యర్థి (సైఫ్ అలీఖాన్)తో యుద్ధానికి సై అంటూ చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఫస్ట్లుక్లతో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మరాఠా యోధుడి భార్యగా కాజోల్
చత్రపతి శివాజీ సైన్యాన్ని ముందుండి నడిపించిన మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్’. ఇందులో మరాఠా యోధుడిగా అజయ్ దేవ్గన్, ఆయన సతీమణి పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. 2008లో ‘యు మీ ఔర్ హమ్’ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. ఓమ్రత్ దర్శకత్వం వహిస్తుండగా టీసీరిస్తో కలిసి అజయ్ దేవ్గన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా వీరుడి పత్ని సావిత్రిబాయి మలుసరేగా కాజోల్ ఫస్ట్లుక్ను సోమవారం విడుదల చేశారు. మరాఠా మహిళ పాత్రలో ఒదిగిపోయిన కాజోల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఉదయ్ సింగ్ రాథోడ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఓంకార్ చిత్రం తర్వాత అజయ్ దేవ్గన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటిస్తున్న చిత్రమిది. మొదట సినిమా పేరును తానాజీగా ప్రకటించిన చిత్రబృందం న్యూమరాలజీ ప్రకారం తాన్హాజీగా మార్చింది. ఈ చిత్ర ట్రైలర్ను రేపు(నవంబర్ 19న) రిలీజ్ చేయనున్నారు. కాగా తాన్హాజీ చిత్రంతో అజయ్ దేవ్గన్ సెంచరీ పూర్తి చేసుకోనున్నారు. ఈ చారిత్రాత్మక చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అజేయంగా...
బాలీవుడ్లో సెంచరీ కొట్టారు అజయ్ దేవగన్. సుమారు 30 ఏళ్ల యాక్టింగ్ కెరీర్లో అజేయంగా 100వ సినిమా మైలురాయిని టచ్ చేశారు. ప్రస్తుతం నటిస్తున్న ‘తన్హాజీ’ అజయ్ దేవగన్ కెరీర్లో 100వ సినిమా. 1991లో ‘పూల్ అవుర్ కాంటే’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు అజయ్. ‘‘30 ఏళ్లు.. వంద సినిమాలు. ఫూల్ అవుర్ కాంటే, గోల్మాల్, శివాయ్, ఇప్పుడు తన్హాజీ. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నిన్ను చూస్తూనే ఉన్నాను. వందో సినిమాకు శుభాకాంక్షలు అజయ్’’ అని ట్వీటర్లో శుభాకాంక్షలు తెలిపారు నటి, అజయ్ దేవగన్ భార్య కాజోల్. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానున్న ‘తన్హాజీ’ సినిమాకు అజయ్ దేవగన్ ఒక నిర్మాత. ఈ సినిమాలో కాజోల్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. -
గంగూభాయ్ ప్రియుడు
‘గంగూభాయ్ కతియావాడి’ అనే గ్యాంగ్స్టర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. గంగూభాయ్ పాత్రలో ఆలియా భట్ నటించనున్నారు. 1960లో ముంబైలో ఓ బ్రోతల్ ఏరియాలో జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో ఆలియా కనిపిస్తారు. ఆలియా జీవితంలో కీలకంగా మారే ప్రియుడి పాత్రలో అజయ్ దేవగన్ నటించనున్నారని బాలీవుడ్ టాక్. గంగూభాయ్ పవర్ఫుల్గా మారడానికి అజయ్ ఎలా సపోర్ట్ చేశారనే అంశం ఆసక్తికరంగా ఉంటుందని టాక్. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది. 20 ఏళ్ల తర్వాత (హమ్ దిల్ దే చుకే సనమ్, 1999) సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటించనుండటం విశేషం. -
జాన్వీ కపూర్ ఎందుకు రాలేదు!?
ముంబై: బోనీ కపూర్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం 'మైదాన్'. ఫుట్బాల్ కథాంశం నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అజయ్ దేవ్గణ్, ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ముంబైలో మంగళవారం ప్రారంభమైంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభ వేడుకకు బోనీ కపూర్ కుటుంబం సహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. కానీ, బోనీ కపూర్-శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ మాత్రం కనిపించలేదు. ఈ సినిమా పూజ కార్యక్రమంలో బోనీ కపూర్ తన పిల్లలు అర్జున్ కపూర్, అన్షులా, ఖుషీతో కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఈ వేడుకకు జాన్వీ కపూర్ ఎందుకు హాజరుకాలేదన్న దానిపై వివరాలు తెలియదు. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల షూటింగ్ కారణంగా ఈ సినిమా పూజ కార్యక్రమానికి ఆమె రాలేకపోయారా? అన్నది తెలియదు. ఇక 1952 - 62 మధ్యకాలంలో భారత ఫుట్బాల్ క్రీడా వైభవాన్ని చాటేలా తెరకెక్కుతున్న ‘మైదాన్’లో అజయ్ దేవ్గణ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను పోషిస్తుండగా, కీర్తి సురేష్ మరో కీలక పాత్రలో నటించబోతున్నారు. -
మైదానంలో దిగారు
ఫుట్బాల్ కోచ్గా మైదానంలో దిగారు అజయ్ దేవగన్. తన నైపుణ్యంతో మైదానంలో మాణిక్యాలను తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా ప్రస్తుతం చేస్తున్న ‘మైదాన్’ కోసమే. ఇండియన్ ఫుట్బాల్ కోచ్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్’. 1950 నుంచి 1963 వరకూ ఇండియన్ ఫుట్బాల్ కోచ్గా వ్యవహరించారు సయ్యద్. ఆయన పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నారు. అజయ్ భార్యగా కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు కీర్తీ. సౌత్లో మహానటి అనిపించుకున్న కీర్తీ బాలీవుడ్ ప్రేక్షకుల దగ్గర కూడా మెప్పు పొందుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి ‘బదాయిహో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకుడు. బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, అరునవ జోయ్ గుప్తా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభం అయింది. -
ఏడేళ్ల తర్వాత?
అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ ఏడేళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 1990–2000 మధ్య కాలంలో దేశ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులకు తోడు కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా హిందీలో కూకై గులాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ఈ సినిమాలో అజయ్, అభిషేక్ హీరోలుగా నటించబోతున్నారని బాలీవుడ్ టాక్. హీరోయిన్గా ఇలియానా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా అజయ్ దేవగన్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందనుందని సమాచారం. చివరి సారిగా అజయ్, అభిషేక్ కలిసి 2012లో వచ్చిన ‘బోల్ బచ్చన్’ సినిమాలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంతకుముందు ‘జమీన్’ (2003), ‘యువ’ (2004) (హిందీ వెర్షన్) సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ బాలీవుడ్ స్టార్ హీరోలు. -
హాయ్ హైదరాబాద్
హిందీ హీరోలు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ హైదరాబాద్కు చాలాసార్లు హాయ్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ చెప్పబోతున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి చిత్రాల షూటింగ్ ఇక్కడ జరగనుంది. అజయ్ దేవగణ్ నటిస్తున్న ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమా కోసం ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియోలో గుజరాత్ ప్రదేశాలను సెట్ వేయిస్తున్నారు. అది కూడా 1970 కాలం నాటివి కావడం విశేషం. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ సెట్లో త్వరలో ప్రారంభం కానుంది. 1971 ఇండియా–పాకిస్థాన్ కార్గిల్ వార్ సమయంలో గుజరాత్లోని భుజ్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను అభిషేక్ దుదియా తెరకెక్కిస్తున్నారు. బ్యాంకాక్ నుంచి డైరెక్ట్గా... పది నిమిషాల యాక్షన్ సన్నివేశాల కోసం దాదాపు వారం రోజులు బ్యాంకాక్కు షిఫ్ట్ అయ్యారు అక్షయ్ కుమార్ అండ్ టీమ్. ఇప్పుడు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు మకాం మార్చనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘సూర్యవన్షీ’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ౖహైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియలో ప్రారంభం కానుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటుగా ఓ రొమాంటిక్ సాంగ్ను కూడా షూట్ చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. -
రొమాంటిక్ కామెడీ రీమేక్లో వెంకీ
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, రీమేక్ సినిమాలు చేయటంలో స్పెషలిస్ట్. గతంలో రీమేక్ సినిమాలతో ఘన విజయాలు సాధించిన ఈ విక్టరీ స్టార్ తాజాగా ఓ బాలీవుడ్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అజయ్ దేవగన్ హీరోగా ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ దే దే ప్యార్ దే. ఈ సినిమాలో.. లేటు వయసులో తన వయసులో సగం వయసున్న అమ్మాయితో ప్రేమలో పడే పాత్రలో అజయ్ ఆకట్టుకున్నాడు. టబు, రకుల్ ప్రీత్ సింగ్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. దీంతో టాలీవుడ్ కన్ను ఈ మూవీపై పడింది. అజయ్ చేసిన పాత్రకు వెంకటేష్ అయితే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారు టాలీవుడ్ మేకర్స్. సురేష్ బాబు నిర్మాతగా ఈ రీమేక్ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్లో బిజీగా ఉన్న వెంకటేష్ తరువాత దే దే ప్యార్దే రీమేక్ను ప్రారంభించే అవకాశం ఉంది. -
అక్కడ తగ్గాల్సిందే!
నటి కీర్తీసురేశ్ ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలో నటిగా ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి అన్నది తెలిసిందే. సాధారణంగా మొదట్లో కమర్శియల్ చిత్రాల్లో చాలా లైట్ పాత్రల్లో నటించాలని చాలా మంది కోరుకుంటారు. అదే విధంగా వర్ధమాన నటీమణులను నమ్మి ఏ దర్శక నిర్మాత బరువైన పాత్రలను ఆఫర్ చేయడానికి సాహసించరు. అయితే లక్కీగా కీర్తీకి అలాంటి పాత్ర మహానటి చిత్రం రూపంలో వరించింది. ఈ సినిమాలో నాటి మేటి నటి సావిత్రిగా నటించడానికి కొందరు పరిహసించారు కూడా. అయినా దర్శకుడి సూచనలతో కీర్తీసురేశ్ తన పనిని సమర్థవంతంగా చేసింది. ఇవాళ సావిత్రి పాత్ర అంటే కీర్తీసురేశ్నే చేయాలి అనేంతగా పేరు తెచ్చుకున్నారు. అయితే అంతకుముందు కూడా రజనీమురుగన్, రెమో వంటి కమర్శియల్ చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యారు. కాగా మహానటి చిత్రం తరువాత కీర్తీసురేశ్ స్థాయి పూర్తిగా మారిపోయారు. దానికి తగ్గట్టుగానే ఈ బ్యూటీ కథలను ఎంచుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక చాలా మంది హీరోయిన్లు మొదట్లో ఆచితూచి అడుగులు వేసి ఆ తర్వాత హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రలు చేస్తారు. అలాంటిది కీర్తీసురేశ్కు మొదట్లోనే అలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ కథ చిత్రాల అవకాశాలు తలుపు తట్టడం ఆమె అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ చిన్నది తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో కథానాయకి సెంట్రిక్ పాత్రలో నటిస్తున్నారు. దీనికి నరేంద్రనాథ్ దర్శకుడు. దీనితో పాటు మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నారు. అంతే కాదు ఇప్పుడు బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. లక్కీగా తొలి హిందీ చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్దేవ్గన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీలో కథానాయికల్ని బొద్దుగా ఉంటే అంగీకరించరు. అందుకే దక్షిణాదిలో పాపులర్ అయిన కథానాయికలు బాలీవుడ్కెళితే స్లిమ్ కావలసిందే. నటి తమన్నా, కాజల్అగర్వాల్, ఇలియానా వంటి వారు బాలీవుడ్లో అవకాశం వస్తే ముందుగా చేసే పని బరువు తగ్గడం. ఎంతగా అంటే జీరోసైజ్ అంటారే అంతగా. నటి తాప్సీ కూడా బరువు బాగా తగ్గడం వల్లే బాలీవుడ్లో పాగా వేయగలిగింది. ఇప్పుడు నటి కీర్తీసురేశ్ అందుకు కసరత్తులు చేయక తప్పలేదు. నిజానికి కీర్తీది ఏమంత భారీ కాయం కాదు. అయినా ఇంకా బరువు తగ్గాల్సిన పరిస్థితి. అక్కడి వారి అభిరుచి అంతే. అందుకనుగణంగా కీర్తీ మారిపోయారు. -
వీరు దేవగణ్ ఇకలేరు
బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్, అజయ్ దేవగణ్ తండ్రి వీరు దేవగణ్ సోమవారం తుది శ్వాస విడిచారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడటంతో వీరు దేవగణ్ను ముంబైలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. సోమవారం ఉదయం హార్ట్ ఎటాక్తో చనిపోయారాయన. సోమవారం సాయంత్రం ముంబైలో అంత్యక్రియలు జరిగాయి. వీరు దేవగణ్ సుమారు 80 సినిమాలకు పైనే స్టంట్మేన్గా పని చేశారు. ‘హిందుస్తాన్కి కసమ్’ (1999) సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, వీరు దేవగణ్ కుమారుడు అజయ్ దేవగణ్, మనీషా కొయిరాల నటించారు. ఓ సందర్భంలో తన తండ్రి గురించి అజయ్ మాట్లాడుతూ – ‘‘నా జీవితంలో నిజమైన సింగం (సింహం) మా నాన్నగారే. జేబులో డబ్బులతో కాకుండా కేవలం ఆశలతో ముంబైలో అడుగుపెట్టారు. తినడానికి తిండి కూడా లేకుండా తన గోల్ కోసం కష్టపడ్డారు. స్ట్రీట్ ఫైటర్ అయ్యారు. ఆ తర్వాత యాక్టర్ రవి ఖన్నా మా నాన్నను చూసి సినిమాల్లో పని చేయమని కోరారు. అక్కడి నుంచి ఇండియాలోనే టాప్ యాక్షన్ డైరెక్టర్గా నాన్న ఎదిగారు. ఆయన ఒంట్లో విరగని ఎముక లేదు. తల మీద సుమారు 50 కుట్లుపైనే ఉన్నాయి. అందుకే ఆయనే నా నిజమైన సింగం’’ అని పేర్కొన్నారు. 1970లలో కెరీర్ ఆరంభించిన వీరు దేవగణ్ దాదాపు 80 చిత్రాలకు స్టంట్ మాస్టర్గా చేశారు. వాటిలో మిస్టర్ ఇండియా, రామ్ తేరీ గంగా మైలీ, ఇంక్విలాబ్, హిమ్మత్వాలా వంటి చిత్రాలు ఉన్నాయి. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘ఫూల్ ఔర్ కాంటే’కి యాక్షన్ డైరెక్టర్గా చేశారు. ఆ తర్వాత కూడా తనయుడి సినిమాలకు స్టంట్ మాస్టర్గా చేశారు. వీరు దేవగణ్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
భాషతో సంబంధం లేదు
సౌత్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ లిస్ట్లో ప్రేక్షకుల చేత పేరు రాయించుకున్నారు రకుల్ప్రీత్ సింగ్. కానీ నార్త్లో మాత్రం కాస్త స్లో అయ్యారు. తాజాగా ఆమె నటించిన ‘దే దే ప్యార్ దే’ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. టబు మరో హీరోయిన్. ‘మీ కెరీర్లో తొలి హిందీ చిత్రం ‘యారియాన్’ (2014)కు మంచి స్పందన వచ్చినప్పటికీ మీరు నెక్ట్స్ హిందీ చిత్రం చేయడానికి నాలుగేళ్లు పట్టింది. ఇందుకు కారణం ఏంటి?’ అని రకుల్ని అడిగితే... ‘‘నిజానికి ‘యారియన్’ సినిమా కంటే ముందే తెలుగులో నాకో అవకాశం వచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’తో మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సౌత్లో నాకు మంచి అవకాశాలు వచ్చాయి. అందుకే హిందీ వైపు వెళ్లలేదు. కథాబలం ఉన్న సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు హిందీ సినిమాలు చేయాలనుకున్నాను. ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడైతే భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడ వస్తే అక్కడ చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు రకుల్. హిందీలో సిద్దార్థ్ మల్హోత్రా సరసన రకుల్ చేసిన ‘మర్జావాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నాగార్జున సరసన ‘మన్మథుడు 2’తో చేస్తున్నారు. తమిళంలో ఆమె నటించిన రెండు సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. -
రకుల్ సీన్కు సెన్సార్ కత్తెర
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సీనియర్ హీరో అజయ్ దేవగన్కు జోడిగా దే దే ప్యార్ దే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ సూచించారు. ఓ పాటలో రకుల్ ప్రీత్ సింగ్ విస్కీ బాటిల్ పట్టుకొని డ్యాన్స్ చేయటంపై సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ సీన్ను కట్ చేయటం లేదా..? బాటిల్ కు బదులుగా పూలు పట్టుకున్నట్టుగా గ్రాఫిక్స్ చేయాలని సూచించారు. మరికొన్ని కట్స్తో సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ను జారీ చేశారు. అకీవ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. -
వాళ్లిద్దరితో బంధానికి పేరు లేదు : టబు
సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు అని సీనియర్ నటి టబు పేర్కొన్నారు. వాళ్లతో తనకు ఉన్న అనుబంధానికి పేరు పెట్టలేమని వ్యాఖ్యానించారు. టబు సినీ రంగప్రవేశం చేసి దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్గానే కాకుండా సహాయక పాత్రల్లో కూడా మెప్పించిన టబుకు ఇండస్ట్రీలో చాలా మందే స్నేహితులే ఉన్నారు. ఈ విషయం గురించి టబు మాట్లాడుతూ..‘ నా వృత్తిలో భాగంగా ఎంతో మందిని కలిశాను. అయితే సల్మాన్, అజయ్లతో నాకున్న అనుబంధం అన్నింటికన్నా అతీతమైంది. నా జీవితంలో ఎక్కువ భాగం వారితోనే కలిసి ఉన్నాను. కఠిన పరిస్థితుల్లో కూడా కుంగిపోకుండా ధైర్యంగా ఉండేలా వారిద్దరు నా వెన్నంటే ఉన్నారు. వాళ్లను కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తా’ అని ఆప్త మిత్రుల గురించి చెప్పుకొచ్చారు. వాళ్లను అమితంగా ప్రేమిస్తా.. ‘అజయ్, సల్మాన్లతో ఒక్కసారి స్నేహం చేస్తే ఎవరైనా సరే వారిని అంత తేలికగా వదులుకోలేరు. మనం చెప్పకుండానే మనసులోని భావాలను వాళ్లు అర్థం చేసుకోగలరు. అందుకే వాళ్లిద్దరిని నేను అమితంగా ప్రేమిస్తా. మా అద్భుత బంధానికి ఫలానా అని పేరు పెట్టలేము’ అని టబు అజయ్, సల్మాన్ ఖాన్పై ప్రశంసలు కురిపించారు. కాగా అజయ్ దేవగణ్ సినిమా విజయ్పథ్ సినిమాతో హీరోయిన్గా సక్సెస్ రుచి చూసిన టబు.. ఆ తర్వాత హకీకత్, తక్షక్, దృశ్యం, గోల్మాల్ తదితర సినిమాల్లో అతడితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం అజయ్తో కలిసి నటించిన దే దే ప్యార్ దే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సల్మాన్ సినిమాలు బీవీ నంబర్1, హమ్ సాథ్ సాథ్ హై, జైహో, భారత్ తదితర సినిమాల్లో టబు నటించారు. -
మందు పోయడం నేర్చుకున్నా
పాత్రను బట్టి ప్రతి సినిమాకు హీరో, హీరోయిన్లు చాలా కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు కొత్త విద్యలు నేర్చుకుంటారు. తన తాజా చిత్రం ‘దేదే ప్యార్ దే’ సినిమా కోసం బార్టెండింగ్ నేర్చుకున్నారట రకుల్ ప్రీత్ సింగ్. బార్టెండింగ్ అంటే బార్లో సర్వ్ చేసే జాబ్. అజయ్ దేవ్గన్, టబు, రకుల్ ప్రీత్సింగ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దేదే ప్యార్దే’. టబుతో పెళ్లయిన అజయ్ దేవ్గన్ మళ్లీ రకుల్ని ప్రేమించడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలేంటి? అన్నది చిత్రకథ. ఈ సినిమా కోసం రకుల్ 8 కిలోల బరువు తగ్గటమే కాకుండా బార్టెండింగ్ కూడా నేర్చుకున్నారు. కొత్త విద్య నేర్చుకోవడం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో అయేషా అనే పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర కోసం కొన్ని వారాలు వర్క్షాప్కి వెళ్లాను. షేకర్స్ని ఎలా ఉపయోగించాలి, డ్రింక్స్ ఎలా కలపాలి, మిక్సర్స్ని కరెక్ట్గా ఎలా హ్యాండిల్ చేయాలనేవాటిపై శిక్షణ తీసుకున్నాను. గ్లాసుని గాల్లో ఎలా తిప్పాలి అనేవి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఆ పాత్రకు పర్ఫెక్ట్గా కనిపించాలి తప్పితే కొత్తగా అనిపించకూడదు. స్టార్టింగ్లో చేతిలో నుంచి గ్లాస్లు జారిపోతుండేవి తర్వాత మెల్లిగా హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాను’’ అన్నారు. ‘దేదే ప్యార్దే’ సినిమా ఈనెల 17న విడుదలæ కాబోతోంది. -
25 రోజులు.. 4 గంటలు.. 10 కేజీలు!
హెడ్డింగ్లో ఉన్న ఫార్ములానే ఫాలో అయ్యారు హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్. ఎందుకు అంటే హిందీ చిత్రం ‘దే దే ప్యార్ దే’ కోసం. అజయ్ దేవగన్, టబు, రకుల్ప్రీత్ సింగ్ ముఖ్య తారలుగా అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దే దే ప్యార్ దే’. ఈ సినిమాలో అయేషా అనే పాత్ర చేశారు రకుల్. ఈ పాత్ర కోసం ఆమె పాతిక రోజుల్లో పది కేజీల బరువు తగ్గాల్సి వచ్చింది. ఇంత తక్కువ టైమ్లోనే రోజుకు నాలుగు గంటలు శ్రమించి, కఠినమైన డైట్ని ఫాలో అయ్యి అనుకున్నది సాధించారు రకుల్. ‘‘ఈ సినిమాలోని నా పాత్ర కోసం పాతిక రోజుల్లో పది కిలోల బరువు తగ్గాల్సి వచ్చింది. నా జీవితంలో ఫిట్నెస్ పరంగా చాలా కష్డపడ్డ సమయం అది. స్క్రిప్ట్ నచ్చితే పాత్ర కోసం ఎందాకైనా, ఎంతైనా కష్టపడటం నాకు ఇష్టం’’ అని పేర్కొన్నారు రకుల్. ఇంతకుముందు ‘యారియాన్’ (2014), ‘అయ్యారే’ (2018) చిత్రాల్లో నటించారు రకుల్. కానీ హిందీలో ఆమెకు ఆశించిన ఫలితం దక్కలేదనే చెప్పాలి. ఇప్పుడు చేసిన ‘దే దే ప్యార్ దే’ చిత్రం వచ్చే నెలలో రిలీజ్కు రెడీగా ఉంది. ఈ సినిమా కాకుండా రకుల్ చేతిలో ‘మర్జావాన్’ చిత్రం ఉంది. మరి.. ‘దే దే ప్యార్ దే, మర్జావాన్’ చిత్రాల రిలీజ్ తర్వాత బాలీవుడ్లో రకుల్ కెరీర్ స్పీడ్ అందుకుంటుందేమో చూడాలి. సౌత్లో మాత్రం మంచి స్పీడ్ మీదే ఉన్నారు. -
కీర్తీ మారిపోయింది
సినిమా: నటి కీర్తీసురేశ్ మారిపోయింది. ఇలా అనగానే ఏదేదో ఊహించుకోకండి. ఈ చిన్నది బాగానే ఉంది. మరేంటంటారా.. కీర్తీ కోలీవుడ్లో అవకాశాలను తగ్గించుకుందనే ప్రచారం జరుగుతోంది. చాలా తక్కువ కాలంలోనే మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్లో ఎడాపెడా చిత్రాలు చేసేసింది. ముఖ్యంగా కోలీవుడ్లో వరస పెట్టి విజయ్, విక్రమ్, విశాల్ వంటి స్టార్ హీరోలతో నటించింది. తెలుగులో మహానటి చిత్రం కోసం శక్తికి మించే శ్రమించిందని చెప్పకతప్పదు. అలా క్షణం తీరిక లేకుండా నటించిన కీర్తీ కాస్త రిలాక్స్ అవుతున్నానని బహిరంగంగానే వెల్లడించింది. అయితే ఈ అమ్మడు పెద్దగా విరామం తీసుకున్నట్లు లేదు. మలయాళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ఎటు తిగిరి కోలీవుడ్లోనే ప్రస్తుతానికి ఏ చిత్రంలో నటించడం లేదు. ఈ చిన్న గ్యాప్లోనే అమ్మడికి బాలీవుడ్ అవకాశ తలుపు తట్టింది. అజయ్దేవ్గన్తో జత కట్టడానికి రెడీ అయిపోతోంది. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. ఈ చిత్ర కోసం కీర్తీసురేశ్ ముందుగానే చాలా వర్కౌట్స్ చేయాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే బాలీవుడ్లో హీరోయిన్లు బొద్దుగా ఉంటే చూడరు. స్లిమ్గా మారాల్సిందే. బొద్దుగా ఉన్న నటి సోనాక్షిసిన్హా, ఇలియానా వంటి కొందరు చాలా కష్టపడి బరువు తగ్గారు. ఎక్కడి వరకో ఎందుకు నటి తాప్సీ కూడా పెద్ద బరువు కాకపోయినా బాలీవుడ్కు మకాం మార్చాక సన్నబడి అవకాశాలను రాబట్టుకుంటోంది. ఇప్పుడు బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వబోతున్న కీర్తీసురేశ్ వర్కౌట్స్ బాట పట్టింది. అంతే కాదు చాలా స్లిమ్గా తయారైంది. సర్కార్ చిత్రంలో నటించిన కీర్తీకి తాజా కీర్తీకీ ఎంతో మార్పు. -
తానాజీ కాదు.. తన్హాజీ!
మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’ పేరుతో ఓ హిందీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. టైటిల్ రోల్లో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ లుక్ ఇటీవల విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘కొత్త సంవత్సరాన్ని నాతో మొదలుపెట్టండి. ఎందుకంటే జనవరి 10న ‘తన్హాజీ’ రిలీజ్ కానుంది’’ అని అజయ్ ట్వీట్ చేశారు. టైటిల్లో మార్పు గమనించారా? ముందు ‘తానాజీ’ అనుకున్నారు. ఇప్పుడు ‘తన్హాజీ’ అంటున్నారు. న్యూమరాలజీ ప్రకారం ఈ మార్పు చేశారట. అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ ముగ్గురూ ఓ ప్రముఖన్యూమరాలజిస్ట్ని కలిశారట. ఆయన సూచించిన మేరకే టైటిల్ని ‘తన్హాజీ’గా మార్చారట. -
ఎంట్రీతోనే ఇద్దరుగా..!
కొన్ని అవకాశాలు అందరికీ అందవు. వాటినే అరుదైన అవకాశాలు అంటాం. లక్కీగా నటి కీర్తీ సురేశ్కు అలాంటి అవకాశాలు ఆదిలోనే వరిస్తున్నాయి. కెరీర్ తొలి దశలోనే ఇళయదళపతి వంటి స్టార్ హీరోతో వరుసగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇక మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అసాధారణ నటనను ప్రదర్శించి విమర్శకులను సైతం మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రంలో మరోసారి కథలో ప్రధాన పాత్రల్లో నటిస్తోంది. అంతేకాదు చాలా తక్కువ టైమ్లోనే బాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్న నటిగా పేరు తెచ్చుకుంది. మరో విశేషం ఏమిటంటే తొలిసారిగా బాలీవుడ్లో నటిస్తున్న హిందీ చిత్రంలో కీర్తీసురేశ్ ద్విపాత్రాభినయం చేయబోతోందన్నది తాజా సమాచారం. ఈమె నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం కూడా ఇదే అవుతుంది. దీనికి ఇంతకు ముందు బదాయ్ హో వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్దేవ్గన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ రెండు విభిన్న పాత్రల్లో నటింబోతోందని తెలిసింది. అయితే మధ్య వయసు పాత్ర కోసం ఎలాంటి ప్రాస్థెటిక్ మేకప్ను వాడకుండా తన నటనతోనే వైవిధ్యాన్ని చూపిస్తానంటోంది. ఇది భారతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు, శిక్షకుడు సెయ్యద్ అబ్దుల్ ఇబ్రహీం జీవిత చరిత్ర ఆధారంగా నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న చిత్రం. దీన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
యంగ్ అండ్ ఓల్డ్
‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రలో వివిధ ఏజ్ గ్రూప్స్లో కనిపించారు కీర్తీ సురేశ్. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ లుక్స్లో కనిపించడానికి సిద్ధమయ్యారట. ఇండియన్ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కనుంది. అజయ్ దేవగన్ కథానాయకుడు. ఈ చిత్రం ద్వారా కీర్తీ సురేశ్ బాలీవుడ్కు పరిచయం కాబోతున్నారు. అజయ్ దేవగన్ భార్య పాత్రలో కీర్తీ కనిపించనున్నారు. ఈ సినిమాలో రెండు లుక్స్లో కీర్తీ పాత్ర ఉంటుందట. ఒకటి యుక్త వయసులో ఉన్న అమ్మాయి కాగా, మరోటి పెద్ద వయసున్న స్త్రీలా కనిపిస్తారట. ఇందులో చేయబోయే ఓల్డ్ లుక్ కోసం ప్రోస్థటిక్ మేకప్ కూడా ఉపయోగించకుండా, న్యాచురల్గా ట్రై చేయాలనుకుంటున్నారట కీర్తీ. గత ఏడాది సూపర్హిట్గా నిలిచిన ‘బదాయి హో’ చిత్రాన్ని రూపొందించిన అమిత్ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ కాకుండా తెలుగులో నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు కీర్తీ. -
‘మహానటి’ రాక కోసం ఎదురుచూస్తున్నా’
హీరోయిన్ కీర్తిసురేశ్కు ప్రశంసలు కొత్త కాదు. రెమో, రజనీమురుగన్, భైరవా, సండైకోళి, సామీ స్క్వేర్, సర్కార్ ఇలా మాస్ మసాలా చిత్రాల్లో నటించిన రాని పేరు ఒక్క మహానటితో తెచ్చుకుంది కీర్తి. అంతగా ఆ మహానటి (సావిత్రి) పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంతో ఎందరి నుంచో ప్రశంసలు అందుకున్నారు. అయితే మహానటిని మెచ్చుకునేవారి జాబితాలోకి తాజాగా మరొకరు చేరారు. దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ తన సోషల్ మీడియాలో కీర్తిపై ప్రశంసలు కురిపించింది. ‘మహానటి సినిమాలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీకు ఫిదా అయిపోయాను. మా నాన్న నిర్మిస్తున్న చిత్రంలో మీరు నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా, ఆత్రుతగా ఉంది. బాలీవుడ్కు స్వాగతం అని క్యాప్షన్తో ఫోటో పోస్టు చేసింది జాన్వీ. తాజాగా కీర్తికి బాలీవుడ్ అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో నటుడు అజయ్దేవ్గన్తో నటించడానికి రెడీ అవుతోంది. ఇది బయోపిక్ చిత్రం కావడం విశేషం. ప్రముఖ భారతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు, శిక్షకుడు సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ జీవిత చరిత్రతో అమిత్శర్మ తెరకెక్కించనున్న చిత్రం ఇది. ఇందులో అజయ్కు జోడిగా నటిస్తుంది కీర్తి. ఈ చిత్రంలో అజయ్దేవ్గన్ సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ పాత్రలో నటించనుండగా ఆయనకు భార్యగా నటి కీర్తిసురేశ్ తెరపై కనిపించనుంది. -
సౌత్ టు నార్త్ ఫుల్ బిజీ
కీర్తీసురేశ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ హీరోగా ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో అజయ్ భార్యగా కీర్తి నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కాకుండా ఆమె మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేశారట. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. తెలుగులో నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు కీర్తి. ఇలా.. సౌత్ టు నార్త్ కీర్తి డైరీ ఫుల్ బిజీ. -
అందుకే వద్దనుకున్నా!
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.ఓ’ (‘రోబో’కు సీక్వెల్) సినిమాలో విలన్గా కనిపించారు అక్షయ్ కుమార్. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు’ సీక్వెల్). ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదన్నారు అజయ్. ‘‘శంకర్ దర్శకత్వంలో నటించడం నాకు ఇష్టమే. ‘ఇండియన్ 2’ సినిమాకోసం చర్చలు జరిగాయి. కానీ ప్రస్తుతం నేను ‘తానాజీ’ సినిమాతో బిజీగా ఉన్నాను. అందుకే కుదర్లేదు’’ అని చెప్పారు అజయ్దేవగణ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం అజయ్ దేవగణ్ చేస్తున్న ‘తానాజీ...’ ఆయనకు నూరవ చిత్రం కావడం విశేషం. విడుదలకు సిద్ధమైన అజయ్ ‘టోటల్ ధమాల్’ను పాకిస్తాన్లో విడుదల చేయకూడదని చిత్రబృందం నిర్ణయించుకుంది. పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
పుల్వామా ఘటన.. పాక్ నటులపై బ్యాన్
పుల్వామా ఘటనలో మన జవాన్లు వీర మరణం పొందడం దేశాన్ని కుదిపేసింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ఘటనను ఖండించారు. వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు దేశ మొత్తం తోడుగా నిలిచింది. అయితే ఈ ఉగ్రదాడికి నిరసనగా ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే పాకిస్తాన్కు చెందిన నటీనటులను బ్యాన్ చేసింది. తమ సినిమాల్లో పాక్ నటీనటులను తీసుకోడానికి వీల్లేదంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది. తాజాగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తన ‘టొటల్ ధమాల్’ను పాకిస్థాన్లో విడుదల చేయడం లేదంటూ ప్రకటించారు. అంతేకాకుండా చిత్రయూనిట్ తరుపున అమరులైన సైనిక కుటుంబాలకు రూ.50లక్షల విరాళాన్ని ప్రకటించారు. -
సెంచరీ హీరో
బాలీవుడ్లో ఉన్న అగ్రహీరోల్లో అజయ్ దేవగణ్ ఒకరు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు పొందారాయన. ఈ నెల 2న అజయ్ జన్మదినం. 50వ వసంతంలోకి అడుగు పెట్టారాయన. ప్రొఫెషనల్గా కెరీర్లో వందో చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న పీరియాడికల్ మూవీ ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’ ఆయనకు వందో చిత్రం. ‘‘రేపు ఏమౌతుంది? అనే ఆలోచన లేకుండా ఇండస్ట్రీలో నా కెరీర్ను స్టార్ట్ చేశాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే 28 ఏళ్లు పూర్తయ్యాయి. వందో చిత్రంలో నటిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది’’ అని అజయ్ దేవగణ్ అన్నారు. ఆయన నటించిన ‘టోటల్ ధమాల్, దే దే ప్యార్ దే’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. -
బోల్డ్ రకుల్
బోలెడు మాటలు చెప్పింది... అన్నీ బోల్డే.ఎవరైనా నాతో తిక్క పని చేస్తే రక్కుతానంది.చికుముకు రవ్వే.. రాంగ్ సైడ్లో రబ్బు చేస్తే ఫైరే.ఎవరో డామ్ డిషుకు ఫెల్లో.. డామ్ డిషుకు కామెంట్ పెడితే.. రక్కేసింది.అది మీడియా అంతా పొక్కేసింది.మరి ‘వాట్ డు యు థింక్’ అని మేమడిగితే.. బోలెడు విషయాలు బోల్డుగా చెప్పింది. తెలుగు సినిమా షూటింగ్స్లో లేరు కానీ ఫుల్ బిజీగా ఉన్నట్లున్నారు? రకుల్: అవును. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మర్జావాన్’ అనే సినిమా చేస్తున్నాను. అజయ్ దేవగన్తో ‘దే దే ప్యార్ దే’ పూర్తి చేశాను. ఈ సినిమాకి 80 రోజులు వర్కింగ్ డేస్ ఇచ్చాను. తమిళంలో కార్తీతో చేసిన ‘దేవ్’ వేలంటైన్స్ డేకు రిలీజ్ అవుతుంది. తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతుంది. అలాగే సూర్యగారితో ‘ఎన్జీకే’ పూర్తి చేశా. సమ్మర్లో ఈ సినిమా వస్తుంది. తెలుగులో కమిట్ అయిన ‘వెంకీమామ’ íసినిమా షూటింగ్ త్వరలో ఆరంభం అవుతుంది. తమిళంలో శివకార్తికేయన్తో కూడా ఓ సినిమా ఉంది. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలున్నాయి. హిందీ, తమిళ సినిమాలు చేయడంవల్ల తెలుగు సినిమాలు ఒప్పుకునే వీల్లేకుండా పోయింది. అయితే ఈ ఇయర్ తెలుగు రిలీజ్లుంటాయి. తెలుగు ప్రేక్షకులకు లాస్ట్ ఇయర్ మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ ఉంది. మీక్కూడా ఉందా? కెరీర్ ఆరంభించిన ఈ ఐదారేళ్లలో వరుసగా నాలుగేళ్లు నావి 16 సినిమాలు రిలీజ్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ రిలీజ్లు లేవు. ప్రతి ఏడాదీ నన్ను ఎక్కువ సినిమాల్లో చూసి ఒక్క ఏడాది లేకపోవడంతో మిస్సయిన ఫీలింగ్ కలగడం సహజం. తెలుగు సినిమాలు చేయకపోయినా నా మనసంతా హైదరాబాద్లోనే ఉంటుంది. ఎంత ప్రేముంటే ఇక్కడ ఇల్లు కొనుక్కున్నానో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్గా నాకో గుర్తింపు, గౌరవం అన్నీ తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చాయి. తెలుగుని మాత్రం వదలను. ప్రేక్షకులు చూసినన్ని రోజులు చేస్తూనే ఉంటా. ‘బాహుబలి’ లాంటి సినిమాలను వదిలేస్తే జనరల్గా ఒక రెగ్యులర్ సినిమాకి హీరోయిన్ ఇచ్చే డేట్స్ 40, 50 రోజుల్లోపే ఉంటాయి. ‘దే దే ప్యార్..’కి 80 రోజులిచ్చారంటే ఆ సినిమా స్పెషాల్టీ ఏంటి? నా కెరీర్లో ఎక్కువ వర్కింగ్ డేస్ ఈ సినిమాకే ఇచ్చాను. ఆల్రెడీ పెళ్లయిన కథానాయకుడు తనకంటే చాలా చిన్న అమ్మాయిని ప్రేమించే లవ్స్టోరీ ఇది. డిఫరెంట్గా ఉంటుంది. పైగా ముంబైలో స్టైల్ వేరే ఉంటుంది. స్క్రిప్ట్ చదవడం, రిహార్సల్స్ చేయడం వంటి వాటికి ఎక్కువ టైమ్ తీసుకుంటారు. అందుకోసం వర్కింగ్ డేస్ పెరుగుతాయి. ప్లస్ ఇదొక డిఫరెంట్ మూవీ కాబట్టి ఎక్కువ రోజులు పట్టింది. బాలీవుడ్లో కొంచెం ఇన్సెక్యూర్గా అనిపిస్తుందని ఇక్కడ సినిమాలు చేసి అక్కడికెళ్లిన ఓ హీరోయిన్ అన్నారు. మీకేమైనా అభద్రతాభావం? కచ్చితంగా ప్రెషర్ అయితే ఉంటుంది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైనా మన మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడి సినిమాలకు ఎంత కష్టపడతానో హిందీ సినిమాలకూ అంతే కష్టపడతాను. బాలీవుడ్ కదా.. ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అనుకోను. ఎక్కడికెళ్లినా కాన్ఫిడెన్స్ ఉండాలి. నాకది ఎక్కువ. నా పని మీద నాకు నమ్మకం ఎక్కువ. అందుకే హిందీకి వెళ్లినప్పుడు ఏమీ అనిపించలేదు. ఆత్మవిశ్వాసం లేకపోతే సౌత్లోనూ అభద్రతాభావం అనిపించొచ్చు. బాలీవుడ్లో ముఖ్యంగా ‘ఫిజిక్’కి ప్రాధాన్యం ఇస్తారు. మీ ఫిజిక్ అటు నార్త్కు కూడా సూట్ అయ్యేలా ఉంటుంది కాబట్టి మీ కాన్ఫిడెన్స్కి అదొక కారణమా? ఫిజిక్తో ఏం సంబంధం లేదు. నేను సన్నగా ఉన్నాను.. అందుకే కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాను అనుకుంటే తప్పు. మన పని మనం సక్రమంగా చేయాలి. వర్క్లో బెస్ట్ అయితే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మన ఫిజిక్ ఎలా ఉండాలనేది మన చాయిస్. ఈ మధ్య వెయిట్ తగ్గాను. ‘దే దే ప్యార్ దే’ కోసం కొంచెం పెరిగాను. స్క్రిప్ట్ బావుండి వెయిట్ పెరగాలంటే పెరుగుతాను. తగ్గాలంటే తగ్గుతా. అదే కదా యాక్టర్ జాబ్. ఓ 20–30 కేజీలు పెరగమంటే పెరుగుతారా? 30 అయితే వద్దు (నవ్వుతూ) అది ఆరోగ్యకరం కూడా కాదు. 20 కూడా సేఫ్ కాదు. అంత పెరిగి మళ్లీ నార్మల్కి రావాలంటే ఈజీగా సంవత్సరం పడుతుంది. 10 కేజీల వరకూ ఓకే. అంతకన్నా బరువు పెరగాలంటే ఎలాగూ ఇప్పుడు వీఎఫ్ఎక్స్ ఉండనే ఉంది. దాంతో లావుగా కనిపించేలా చేయొచ్చు. లేదా బట్టల ద్వారా కూడా మేనేజ్ చేయొచ్చు. అంతేకానీ 20, 30 కేజీలు బరువు పెరిగితే వేరే సినిమాల కోసం వెంటనే బరువు తగ్గాల్సి వస్తుంది. అప్పుడు ఏదేదో చేసేసి అర్జంటుగా తగ్గితే ఆరోగ్యానికి నష్టం. మీరిలా సన్నగా ఉండటంతో ‘ఇది హెల్దీ కాదు.. కడుపు మాడ్చుకోవద్దు’ అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దానికేమంటారు? నేనవి చదవను. సోషల్ మీడియాలో పాజిటివ్, నెగటివ్ రెండూ ఉంటాయి. నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వండి. లేకపోతే ఫాలో అవ్వకండి అనుకుంటాను. నేను మీరేం తింటున్నారు? ఏం చేస్తున్నారు అని ఎవరినీ అడగడంలేదు. ఉచిత సలహాలు ఇవ్వడంలేదు. నా లైఫ్ నా ఇష్టం. నేనేం తినాలి? ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలి? బరువు ఎంత ఉండాలి? అనేది నా ఇష్టం. అయితే నా వర్క్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి. నా సినిమాల ఎంపిక విషయంలో సలహాలు ఇవ్వండి. తీసుకుని ఇంకా బెటర్గా వర్క్ చేస్తాను. మంచి పాత్రలు చేయడం లేదని, చేస్తుందని చెప్పండి. అవి చదువుతాను, పాటిస్తాను. కానీ ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఏం తినాలి? ఎలాంటి వర్కవుట్స్ చేయాలని సలహాలు ఇవ్వొద్దు. అవి చదవను. పొరపాటున చదివినా పాటించను. ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలో నా ఇష్టం అన్నారు. ఈ మధ్య మీరు కారులోంచి దిగుతున్న ఓ ఫొటోను సోషల్మీడియాలో పెట్టి, ‘రకుల్ ప్యాంట్ వేసుకోవడం మరచిపోయింది’ అని కామెంట్ చేశారు. ఏమంటారు? ఇప్పటివరకూ వచ్చిన నెగటివ్ ట్వీట్స్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈసారి పట్టించుకున్నాను. ఈ ప్యాంట్ కామెంట్ వచ్చిన ముందు రోజు నేనో ఈవెంట్కి వెళ్లాను. స్త్రీ సమానత్వం గురించిన కార్యక్రమం అది. ఆడవాళ్లు ఎలా ఉండాలి? ఎలా ఉంటే బాగుంటుంది? అనేదాని గురించి అక్కడ మాట్లాడటం జరిగింది. ఆ మర్నాడు కారులోంచి దిగినప్పుడు ఎవరో ఫొటో తీశారు. యాక్చువల్గా నేను వేసుకున్న జాకెట్ నా షార్ట్స్ని కవర్ చేసింది. అందుకని ఆ జాకెట్ మాత్రమే వేసుకున్నానని అనుకున్నారు. షార్ట్ కనిపించేలా ఉన్న ఫొటోలన్నీ బాగానే ఉన్నాయి. ఆ ఫొటోలను వదిలేసి వేరేవి పెట్టి, చెత్త కామెంట్ రాశారు. ఒళ్లు మండిపోయింది. మీ డ్రెస్ గురించి మాత్రమే కాకుండా ‘కారులో ఎవరితో.... (రాయకూడని పదం), సిగ్గు లేదా? ప్యాంటు కూడా లేకుండా బయటకు వచ్చావు? అని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్ చేస్తే, అతని తల్లిని ప్రస్తావిస్తూ మీరు స్పందించడాన్ని కొందరు విమర్శించడం గురించి? ‘మీ తల్లి కార్లో అలాంటి పనులు ఎక్కువ చేస్తారనుకుంటా. అందుకే నువ్వు ఎక్స్పర్ట్ అయ్యావు. ఆ తల్లి నీకు కొంచెం బుద్ధి ఇచ్చుంటే బావుండేది. నీలాంటి వాళ్లు ఉన్నంత వరకూ మహిళలకు రక్షణ లేదు. ఊరికే సమానత్వం గురించి, రక్షణ గురించి డిబేట్లు పెట్టడం వల్ల ఏ మంచీ జరగదు’ అనే విధంగా సమాధానం ఇచ్చాను. అతగాడి కామెంట్కి నేను ఓ నటిగా సమాధానం ఇవ్వలేదు.. ఓ అమ్మాయిలా స్పందించాను. యాక్టర్ రకుల్గా రిప్లై ఇచ్చి ఉంటే పొలిటికల్గా కరెక్ట్గా మాట్లాడాలి అనుకునేదాన్ని. కానీ అక్కడ ఓ అమ్మాయిలా నా కోపాన్ని వ్యక్తపరిచాను. తమ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ల గురించి ఎవరైనా ఎలా పడితే అలా కామెంట్ చేస్తే వాళ్లకు ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్లు కూల్గా రియాక్ట్ అవుతారా? లేకపోతే వాళ్ల భాషలోనే చెబుతారా? అప్పటికప్పుడు ఏమనిపించిందో అది అనేస్తారు కదా. నేను కూడా అంతే. అయితే కొంచెం బెటర్గా చెప్పి ఉండొచ్చు కానీ అప్పుడు బాగా అప్సెట్ అయ్యాను. ఆ మూమెంట్లో అలా అనిపించింది. వాళ్లింటి ఆడవాళ్లను కామెంట్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో వేరే ఆడవాళ్లకూ అంత బాధ ఉంటుందని తెలియాలి కదా. వాళ్లకూ ఓ ఫ్యామిలీ ఉంటుందని గుర్తు చేయడానికే అలా అన్నాను. నా కామెంట్ని విమర్శించేవాళ్లు నా గురించి ఘోరంగా కామెంట్ చేసినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు? బట్టలను బట్టి ‘ఈ అమ్మాయి ఈ టైప్’ అని జడ్జ్ చేయడం కరెక్టేనంటారా? అస్సలు కాదు. ఎవరికి ఎలా సౌకర్యంగా అనిపిస్తే అలా బట్టలు వేసుకుంటారు. చిన్న బట్టలు వేసుకున్నవాళ్లు అదో టైప్ అనలేం. అయినా మన సమాజంలో చిన్న బట్టలు వేసుకున్న అమ్మాయిలను మాత్రమే కామెంట్ చేస్తున్నారా? చీర కట్టుకున్నవాళ్లనూ వదిలి పెట్టడంలేదు కదా. మారుమూల గ్రామాల్లో ఒంటి నిండా చీర కట్టుకుంటారు. అక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. సమస్య బట్టలది కాదు. ఆలోచనలది. ఆలోచనలో మార్పు రావాలి. నేను స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యేసరికి అతను అకౌంట్ని డిలీట్ చేశాడు. ఇలాంటి ఆకతాయిలను శిక్షించాలి. రేపు వీళ్లే రేపిస్టులు అవుతారు. అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలి అనేది ఇంట్లో నేర్పించాలి. అమ్మాయి, అబ్బాయి ఒకటే అని నేర్పించాలి. అప్పుడే అమ్మాయిలపై వేధింపులు తగ్గుతాయి. హీరోయిన్స్ అంటే కొందరు చిన్న చూపు చూస్తుంటారు. అదేమైనా బాధగా ఉంటుందా? ఎందుకు చూడాలి? మాది కూడా జాబే కదా. మా పర్శనల్ లైఫ్ అనేది పర్శనల్గా ఉండదు. మా జీవితంలో ఏం జరుగుతుందో పబ్లిక్కి కావాలి. జరుగుతున్నవాటి గురించి మాట్లాడుకుంటారు. జరగనివాటి గురించి చెప్పుకుంటారు. మేం ఏమీ చేయలేం. రోజుకి 18, 20 గంటలు వర్క్ చేస్తాం. నిద్ర ఉండదు. అయినా కూడా సినిమాని ఇష్టపడి వచ్చాం కాబట్టి ఏమీ అనిపించదు. ఇప్పుడు నాక్కూడా చాలామంది యాక్టర్స్ నచ్చరు. కొందరు బాగా నచ్చుతారు. అలాగే నేను అందరికీ నచ్చాలని లేదు. ‘నువ్వు నచ్చలేదు’ అనండి. ఓకే. బాగా నటించలేదు అంటే ఓకే. కానీ వల్గర్గా కామెంట్ చేయకూడదు కదా. ఇండస్ట్రీలో మీకెలాంటి అనుభవాలెదురయ్యాయి? అది ఇండస్ట్రీ గురించి కాదు. ప్రపంచం గురించి. ఒక ఇండస్ట్రీని తప్పుబట్టడం కరెక్ట్ కాదు. అన్ని రంగాల్లో ఉంటుంది. 5–10 పర్సెంట్ మగాళ్ల ఆలోచనలు తప్పుగా ఉంటే మన కెరీర్ చాయిస్ తప్పు ఎందుకు అవుతుంది? ఇండస్ట్రీలో చాలామందికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేను ఫేస్ చేయలేదు. అయితే వాళ్లు ధైర్యంగా బయటికి వచ్చి చెప్పినప్పుడు మనం వినాలి. వాళ్లకు ధైర్యం ఇవ్వాలి. అంతేకానీ తప్పు పట్టకూడదు. (కొంచెం ఆవేశంగా). ఓకే కూల్ రకుల్.. లవ్ లైఫ్కి వద్దాం. ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి? ఫ్యాన్స్వి చాలా వస్తుంటాయి. నేను ప్రేమలో పడకూడదని అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే ప్రేమలో పడలేదు. మా అమ్మ కూడా జోక్ చేస్తుంది. ‘సరే ఇప్పుడంటే బిజీగా ఉన్నావు. కానీ నీకోసం కూడా ఆలోచించుకో. మంచి లైఫ్ పార్టనర్ అవుతాడనిపించే అబ్బాయి ఉంటే చెప్పు. ఇంకో మూడు నాలుగేళ్లల్లో పెళ్లి చేయాలంటే నువ్వు ఎవరో ఒకర్ని ప్రేమించాలి’ అంటుంది. చిన్నప్పుడేమో ప్రేమించొద్దు అంటారు, కానీ ఇప్పుడు ప్రేమించమంటున్నారు? అని సరదాగా అంటుంటాను. సరైన మనిషి దొరకాలి. మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నాను. 80 లలో పుట్టి ఉండాలి అనిపిçస్తుంది. అంటే ప్రస్తుతం ప్రేమలో నిజాయితీ ఉండటం లేదంటారా? అలా అని కాదు. నిజాయితీగా ప్రేమించేవాళ్లూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక్క సెకన్లో ‘ఐ లవ్ యు’ ఎలా చెబుతున్నారో ‘ఐ హేట్ యు’ అని అలాగే ఒక్క సెకన్లో చెబుతున్నారు. ప్రేమని కొందరు జోక్ చేసేశారు. బ్రేకప్కి చాలామంది చెప్పే కారణం ఎవరి ‘స్పేస్’ వారికి దక్కడం లేదు అని. కలిసి బతకాలనుకున్న తర్వాత ఎవరి స్పేస్ వారికి అంటే? ఇద్దరూ కరెక్ట్ అయితే ఎవరి ప్రైవసీని వాళ్లు గౌరవించుకుంటారు. ఎవరి స్పేస్ వారు కోరుకోవడంలో తప్పులేదు. ఒకవేళ నేను రిలేషన్షిప్లో ఉంటే వంద ప్రశ్నలు వేయను. ప్రేమించడమంటే వేరే వ్యక్తిని కంట్రోల్ చేయడం కాదు. మనకు నచ్చిన వ్యక్తిని తనకు నచ్చినట్టు ఉండనివ్వటం. దాన్నే ‘స్పేస్’ ఇవ్వడం అంటారు. అంతవరకూ ఓకే. కానీ జీవిత భాగస్వామికి చెప్పుకోలేనన్ని రహస్యాలు ఉంటేనే ప్రాబ్లమ్. ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకోకుండా ఉండి కూడా కంఫర్ట్బుల్గా ఉండటమే లవ్. మంచి అనుబంధం అంటే ఎవరి డ్రీమ్ను వాళ్లు ఫాలో అవుతూ, వాళ్ల జీవితాలని అందంగా తయారు చేసుకోవడమే. ఫైనల్లీ మీకు డ్రీమ్ ఏదైనా? ప్రస్తుతం నా డ్రీమ్లోనే ఉన్నాను. యాక్టర్ అవ్వాలన్నది నా కల. అదే కంటిన్యూ చేస్తున్నాను. ఐదారేళ్ల క్రితం మీరు మామూలు అమ్మాయి. ఇప్పుడు సెలబ్రిటీ. మీలో వచ్చిన మార్పు గురించి? అప్పటి రకుల్ ఇప్పటి రకుల్ ఒకటే. పెద్దగా ఏం మారలేదు. సెలబ్రిటీ అంటే ఇలా ఉండాలని కొత్తగా అలవాటు చేసుకున్నది ఏదీ లేదు. కాకపోతే స్క్రీన్ మీద బాగా కనపడాలి కాబట్టి అందం విషయంలో ఆరోగ్యం విషయంలో చాలా కేరింగ్గా ఉంటాం. ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మారాయి. మైండ్ సెట్ మాత్రం సేమ్. అందరూ 9–5 జాబ్ చేస్తారు. మాకు అలా టైమింగ్స్ ఉండవు. షూటింగ్కి ప్యాకప్ చెప్పాక నేను నార్మలే. నా ఫ్యామిలీ నన్ను నార్మల్గా ఉంచుతుంది. నా ఫ్రెండ్స్ కూడా. ఇంకా చెప్పాలంటే ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు పొగరు పెరగకూడదు. దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. రుణపడి ఉండాలి. దేవుడు మనకు ఇంత ఇస్తుంటే గర్వం చూపించడం దేనికి? అందుకే అందరితో బాగుంటాను. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటాను అనుకోవాలి. అదే మంచిది. డల్ మూమెంట్ని ఎవరితో షేర్ చేసుకుంటారు? నాతోనే. డల్గా అనిపిస్తే నాకు నేనే ఎనర్జీ ఇచ్చుకుంటాను. నా సొంత ప్రాబ్లమ్స్ను వేరే వాళ్ల దగ్గరకు తీసుకెళ్లను. ఫ్యామిలీని టెన్షన్ పెట్టను. నా సమస్యలను నేనే పరిష్కరించుకుంటా. సమస్యలు అందరికీ వస్తాయి. అయితే పరిష్కారం లేని సమస్య ఉండదు. డల్ మూమెంట్స్ లేకపోతే గ్రోత్ ఉండదు. కింద పడితేనే పైకి వెళ్లొచ్చు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఒక్క రోజు మాత్రమే. జరిగింది జరిగిపోయింది. ఒకటి బాధపడటం. రెండోది నెక్ట్స్ ఏం చేయాలి? ఎలా చేయాలి? అనుకుని వెళ్లిపోవడం. అంతే. -
యుద్ధ వీరుడు
బాలీవుడ్లో సెట్స్పై ఉన్న పీరియాడికల్ మూవీస్ లిస్ట్లో ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’ అనే సినిమా ఒకటి. 1670 బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ సైన్యంలో మరాఠా చీఫ్ కమాండర్గా ఉన్న తానాజీ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్గా కనిపిస్తారట. ఈ సినిమా తాజా లుక్ను రిలీజ్ చేశారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘దేదే ప్యార్ దే, టోటల్ ధమాల్’ చిత్రాల విడుదల కూడా ఈ ఏడాదే కావడం విశేషం. ‘తానాజీ’ కాకుండా ఫుట్బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ బయోపిక్లోనూ అజయ్ దేవగన్ నటించనున్నారు. -
హీరో కాదు!
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మరో సినిమాకు సైన్ చేశారు. అయితే హీరోగా కాదు. నిర్మాతగా. ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోందని తెలిసిందే. తాజాగా స్టాక్ మార్కెట్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుందని బాలీవుడ్ టాక్. స్టాక్ మార్కెట్లో హర్షద్కి బిగ్ బుల్ అనే నిక్ నేమ్ కూడా ఉందట. ఈ సినిమాను అజయ్ దేవగన్, బాలీవుడ్ డైరెక్టర్ ఇంద్రకుమార్ కలిసి నిర్మిస్తారట. అయితే ఇందులో అజయ్ హీరోగా నటించరు. ఓ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారట టీమ్. ఈ సినిమాకి కుకీ గులాటి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇంతకుముందు ‘విక్కీ డోనర్, పీకు, అక్టోబర్’ చిత్రాలకు కో–రైటర్గా పనిచేశారాయన. ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ధమాల్ ప్రాంచైజీలో మూడో భాగం ‘టోటల్ ధమాల్’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
సరైన గౌరవం దక్కాలి!
అజయ్ దేవగన్ రీల్ ఫుట్బాల్ మ్యాచ్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. హైదరాబాద్కి చెందిన ఫుట్బాల్ కోచ్ కమ్ ప్లేయర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఇటీవలే ‘బదాయి హో’ చిత్రంతో మంచి సక్సెస్ సాధించిన అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తారు. ‘‘అజయ్ గ్రేట్ లిజనర్. ఎమోషనల్ సీన్లో అజయ్ దేవగన్ అద్భుతంగా నటిస్తారు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెడతాం. మన దేశంలో క్రికెట్కు ఉన్నంత క్రేజ్ ఫుట్బాల్కి లేదు. కానీ మన దేశంలో ఫుట్బాల్ క్రీడకు సయ్యద్గారు చాలా కృషి చేశారు. అయినప్పటికీ ఆయన పేరుపై ఒక్క స్టేడియం కూడా లేదు. ఈ సినిమా తర్వాత అయినా ఆయనకు సరైన గౌరవం దక్కుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు అమిత్. -
ఎ పోయి ఎ వచ్చె!
ఎ.. అంటే అజయ్ దేవగన్.. ఎ.. అంటే అక్షయ్ కుమార్. ‘ఇండియన్ 2’కి ఇప్పుడు ఓ ‘ఎ’ పోయి మరో ‘ఎ’ వచ్చిందట. కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా ఎంత బంపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. కమల్–శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్’కి సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కనుంది. ఇటీవల ఈ సినిమా సెట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విలన్ పాత్రకు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ని తీసుకున్నారంటూ కోలీవుడ్లో వార్తలొచ్చాయి. తాజాగా అజయ్ స్థానంలో అక్షయ్ కుమార్ని ఓకే చేశారంటున్నాయి కోడంబాక్కమ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.0’లో విలన్గా నటించారు అక్షయ్ కుమార్. ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ చిత్రం షూటింగ్లో అక్షయ్–శంకర్ మధ్య మంచి బాండింగ్ కుదిరిందట. అందుకే మళ్లీ కలిసి పనిచేయనున్నారని టాక్. కమల్కి జోడీగా కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారట. అలాగే దుల్కర్ సల్మాన్, శింబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారట. -
కూతురికి ప్రేమతో...
పిల్లలకు గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు తల్లిదండ్రులు. సందర్భం ఉన్నా.. లేకున్నా... పిల్లలకు బహుమానాలు ఇవ్వడంలో పేరెంట్స్ ఆనందం పొందుతుంటారు. తాజాగా బాలీవుడ్ జంట అజయ్ దేవగన్, కాజోల్ కూడా తమ గారాల పట్టి నీసాకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి ఎంతో సర్ప్రైజ్ చేశారు. ఆ గిఫ్ట్ అలాంటి ఇలాంటిది కాదు.. సింగపూర్లో ఖరీదైన లగ్జరీ ఫ్లాట్ కావడం విశేషం. ఉన్నత చదువుల కోసం నిసా సింగపూర్లో ఉంటున్నారు. యునైటెడ్ వరల్డ్ కాలేజ్లో చదువుతున్న ఆమె ప్రస్తుతానికి కళాశాల హాస్టల్లోనే ఉంటున్నారు. అయితే తమ కూతురు హాస్టల్లో కాకుండా ఇండిపెండెంట్గా, సొంత ఫ్లాట్లో ఉండాలన్న ఉద్దేశంతో సింగపూర్లోని కాస్ట్లీ ఏరియా ఆర్చర్డ్ రోడ్లో ఓ లగ్జరీ ఫ్లాట్ను కొనుగోలు చేసి, కూతురికి గిఫ్ట్గా ఇచ్చారట అజయ్–కాజోల్. వచ్చే ఏడాది జనవరిలో నిసా గృహప్రవేశం చేయనున్నారు. ∙ కూతురు నిసా, కొడుకు యుగ్తో అజయ్, కాజోల్ -
కూతురికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ కపుల్
బాలీవుడ్ స్టార్ కపుల్ అజయ్ దేవగన్, కాజోల్లు తమ కూతురు నీసా దేవగన్ను కాస్ట్లీ గిప్ట్తో సర్ప్రైజ్ చేశారు. కొంత కాలంగా ఉన్నత చదువుల కోసం సింగపూర్లో ఉంటున్న నీసాకు ఓ లగ్జరీ ఫ్లాట్ను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం సింగపూర్లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్లో చదువుతోంది నీసా. ఆమె కోసం సింగపూర్లోని కాస్ట్లీ ఏరియా ఆర్చర్డ్ రోడ్లో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ను తీసుకున్నారు అజయ్, కాజోల్. ప్రస్తుతం చదువుతున్న కాలేజ్లో బోర్డింగ్ ఫెసిలిటీ ఉన్నా తమ కూతురు సొంత అపార్ట్మెంట్లోనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ గిఫ్ట్ ఇచ్చారట. వచ్చే ఏడాది జనవరిలో నీసా అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ కానుంది. -
‘నా పిల్లలు నా సినిమాలు చూడరు’
నా పిల్లలు నా సినిమాలు చూడరంటున్నారు బాలీవుడ్ నటి కాజోల్. ఓ టెలివిజన్ షోలో పాల్గొన్న కాజోల్ పలు ఆసరక్తికర ఆంశాల గురించి మాట్లాడారు. ‘నా పిల్లలు నా సినిమాలు అస్సలు చూడరు. అందుకు వాళ్లు చెప్పే కారణం సినిమాల్లో నేను ఎక్కువగా ఏడుస్తూ ఉంటానంట. అందుకే నా సినిమాలు చూడరు. ‘గోల్మాల్’ లాంటి సినిమాలు వాళ్లకి ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చారు కాజోల్. పిల్లల విషయంలో ఎవరూ కఠినంగా ఉంటారని అడగ్గా.. పిల్లల విషయంలో అజయ్ కాస్తా నయం. నేను మాత్రం వారిని ఎల్లప్పుడు కనిపెట్టుకునే ఉంటాను. వారికి కావాల్సిన స్వేచ్ఛను ఇస్తూనే వారిని హద్దుల్లో ఉంచుతాను. అయినా నా పిల్లలిద్దరూ చాలా మంచివారు. అమ్మ చెప్పిన విషయాలను అర్థం చేసుకుంటారు అని తెలిపారు. ‘మీ కూతురు నైసా సినిమాల్లోకి వస్తానంటే మీరు ఒప్పుకుంటారా’ అని ప్రశ్నించగా ‘కెరియర్ విషయంలో నా పిల్లల మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. వారికి నచ్చిన రంగంలోనే వారు ఉన్నతంగా రాణించాలని కోరుకుంటాను’ అని తెలిపారు. -
మరో సైన్స్ ఫిక్షన్
దర్శకుడు శంకర్ సినిమాల్లో గ్రాఫిక్స్ వర్క్స్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. త్వరలో విడుదల కానున్న సైన్స్ ఫిక్షన్ ‘2.0’లో అంతా గ్రాఫిక్సే. ఆ మాటకొస్తే ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ కూడా గ్రాఫిక్స్ బేస్డ్గానే ఉంటుంది. నవంబర్ 29న ఈ చిత్రం విడుదల కానుంది. ‘2.0’ తర్వాత శంకర్ ‘భారతీయుడు 2’ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా దాదాపు 22ఏళ్ల క్రితం రూపొందిన ‘భారతీయుడు’కి ఇది సీక్వెల్. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో మొదలవుతుంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తారు. అజయ్ దేవగణ్ విలన్గా నటిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం తర్వాత శంకర్ మరో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నారు. -
‘మిమ్మల్ని ప్రాంక్ చేశాను బ్రో’
‘ఇదంతా ప్రాంక్ బ్రదర్.. సినిమాల్లో చూసి చూసి బోర్ కొట్టింది. అందుకే మిమ్మల్ని ప్రాంక్ చేద్దామని ఇలా చేశానంటు’న్నారు హీరో అజయ్ దేవగణ్. ఏప్రిల్ 1 ఫూల్స్ డే ఉన్నా కూడా ఈ మధ్య టీవీల్లో వచ్చే తలాతోకాలేని కార్యక్రమాల పుణ్యానా ఈ ప్రాంక్ కాల్స్ పిచ్చి అందరికి బాగానే ఎక్కేసింది. తాను కూడా అలానే చేశానంటున్నారు అజయ్ దేవగణ్. నిన్న మధ్యాహ్నం అజయ్ ‘కాజోల్ ప్రస్తుతం ఇక్కడ(భారత్) లేరు. 98******** తన వాట్సాప్ నంబర్ ఇది. ఈ నెంబర్ ద్వారా ఆమెను సంప్రదించగలరు’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో అభిమానులు కాజల్తో మాట్లాడవచ్చనే ఆనందంలో ఆమెకు మెసేజ్లు పెట్టి రిప్లై కోసం ఎదురు చూశారు. అంతేకాక ‘రిప్లై కోసం ఎదురు చూస్తున్నాం సార్’ అంటూ స్ర్కీన్షాట్లు తీసి అజయ్కు పంపించారు. ఇలా నెటిజన్లతో కాసేపు ఆడుకున్న అజయ్ దేవగణ్ ఆ తర్వాత అసలు విషయం చెప్పారు. ‘సినిమాల్లో ప్రాంక్(ఫూల్స్) చేసి చేసి బోర్ కొట్టింది. అందుకే వెరైటీగా మిమ్మల్ని ప్రాంక్ చెద్దామని భావించి ఇలా చేశానం’టూ ట్వీట్ చేశారు. దాంతో పాటు అభిమానులు నుంచి తనకు వచ్చిన రీట్వీట్స్ని కూడా పోస్ట్ చేశారు. దాంతో అజయ్ షేర్ చేసిన నంబర్ ఫేక్ అని తేలిపోయింది. ఇండస్ట్రీలో ఇలాంటి చిలిపి పనులు చేయడంలో అజయ్ దేవగణ్ ముందుంటారనే పేరుంది. -
భార్య నంబర్ షేర్ చేసిన హీరో!!
పొరపాటున భార్య కాజోల్నంబర్ ట్విటర్లో షేర్ చేశారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. ‘కాజోల్ ప్రస్తుతం ఇక్కడ(భారత్)లో లేరు. 98******** తన వాట్సాప్ నంబర్ ఇది. ఈ నెంబర్ ద్వారా ఆమెను సంప్రదించగలరు’ అంటూ అజయ్ ట్వీట్ చేశారు. అంతే ఇంకేముంది కొద్ది సెకన్ల వ్యవధిలోనే అజయ్ ట్వీట్ వైరల్గా మారింది. రీట్వీట్లు, లైకులతో ట్రెండింగ్లోకి వెళ్లింది. జాగ్రత్త..! కాజోల్ నంబరును సేవ్ చేసుకున్న నెటిజన్లు ఆమెకు మెసేజ్ పెట్టి మరీ.. ‘రిప్లై కోసం ఎదురుచూస్తున్నాం సార్’ అంటూ స్క్రీన్షాట్లతో సహా అజయ్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరికొంత మంది మాత్రం.. ‘సార్.. కాజోల్ మేడమ్ నంబరు సోషల్ మీడియాలో ఎలా పెడతారు. వాట్సాప్ అనుకొని ట్విటర్లో షేర్ చేసినట్టున్నారు. కాస్త జాగ్రత్త’ అంటూ హితవు పలికారు. అయితే అజయ్ ట్విటర్ హ్యాక్ అయిందేమో అంటూ మరికొందరు అతడికి సపోర్టు చేశారు. కాగా కాజోల్ ప్రస్తుతం తన అప్కమింగ్ మూవీ ‘హెలికాప్టర్ ఈల’ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. -
పాత ట్యూన్కి కొత్త స్టెప్స్
తొంభైలలో అజయ్ దేవగన్, టబు పాడుకున్న ‘రుక్ రుక్...’ పాటను లేటెస్ట్గా రీమిక్స్ చేశారు ‘హెలికాఫ్టర్ ఈల’ చిత్రబృందం. కాజోల్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘హెలీకాఫ్టర్ ఈల’. గాయని కావాలనుకునే తల్లి పాత్రలో కాజోల్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అజయ్ దేవగన్, టబు నటించిన ‘విజయ్పథ్ ’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘రుక్ రుక్..’ను రీమిక్స్ చేశారు. ఈ పాత ట్యూన్కు కొత్త స్టెప్స్ జోడించారట కాజోల్. ఈ సాంగ్ హైలైట్గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. అజయ్ దేవగన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఆయన పాటకే ఆయన శ్రీమతి కాజోల్ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ సినిమాను అజయ్ దేవగన్, జయంతీలాల్ నిర్మించారు. అక్టోబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
బాలీవుడ్ సినిమాలో జగపతి బాబు లుక్
లెజెండ్ సినిమాతో విలన్గా టర్న్ అయిన టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న జగ్గూభాయ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 13 సినిమాలు చేస్తున్నారు. తాజాగా జగపతి బాబు నటిస్తున్న హిందీ సినిమాకు సంబంధించిన లుక్ లీకైంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ తానాజీ. ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న తానాజీ చిత్రానికి ఓం రావత్ దర్శకుడు. ఛత్రపతి శివాజీ కోసం పోరాడిన సుబేదార్ తానాజీ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ను ఇటీవల నిర్వహించారు. ఈ లుక్ టెస్ట్కు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఒక్కరా? ఇద్దరా?
కమల్ హాసన్– శంకర్ కాంబినేషన్లో ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) సీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, లొకేషన్స్ వెతికే పనుల్లో శంకర్ ఫుల్ బిజీగా ఉన్నారు. కోలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సీక్వెల్లో కమల్హాసన్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారట. ఏయం రత్నం నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే ఏడాదిలో స్టార్ట్ కానుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో తండ్రీ, కొడుకుల్లా రెండు పాత్రల్లో కనిపించిన కమల్, సినిమా చివరలో లంచగొండి అయిన కొడుకుని చంపేస్తాడు. మరి సీక్వెల్లో డ్యూయల్ రోల్ ఎలా తీసుకువస్తారన్నది చర్చనీయాంశం. ఏది చేసినా లాజిక్లకి లోబడి ఉండే శంకర్ దానికి మించిన స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని ఊహించవచ్చు. -
ఉర్దూ పాఠాలు
అజయ్ దేవగన్ హైదరాబాదీలా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఉర్దూ యాసలో డైలాగ్స్ పలికితే ఎలా ఉంటుంది? సూపర్ కదా. ప్రస్తుతం ఆయన దాని కోసమే శిక్షణ తీసుకుంటున్నారట. తన లేటెస్ట్ సినిమా కోసమే ఇదంతా. ఇండియన్ ఫుట్బాల్ కోచ్ సయద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అమిత్ శర్మ దర్శకత్వంలో జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, జోయ్ సేన్ గుప్తా నిర్మించనున్నారు. సయద్ రహీమ్ హైదరాబాదీ. సో.. ఆయన పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి ఉర్దూ నేర్చుకుంటున్నారట అజయ్. రహీమ్ ఇండియన్ ఫుట్బాల్ కోచ్గా చేసిన పదకొండేళ్ల ప్రాంతంలో ఈ సినిమా కథ నడుస్తుందట. -
బ్యాక్ టు బ్యాక్
ప్రస్తుతం ప్రపంచమంతా సాకర్ ఫుట్బాల్ ఫీవర్లో ఉంది. ఫుట్బాల్ బ్యాక్డ్రాప్లో వచ్చే మూవీని అనౌన్స్ చేయడానికి ఇలాంటి క్రేజీ టైమ్ను ఎవ్వరూ వదులుకోరు. అజయ్ దేవగన్ అండ్ టీమ్ కూడా వదులుకోలేదు. ఇండియన్ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఓ మూవీ తెరకెక్కంచనున్నట్లు ప్రకటించారు. 1950–1963 టైమ్లో ఇండియన్ ఫుట్బాల్ టీమ్కి కోచ్, మేనేజర్గా సయ్యద్ సేవలు అందించారు. 1956 మెల్బోర్న్ ఒలిపింక్స్లో ఇండియన్ ఫుట్బాల్ టీమ్ సెమీ ఫైనల్స్కు, 1962 ఆసియన్ గేమ్స్లో టీమ్ గోల్డ్ మెడల్ సాధించడంలో సయ్యద్ పాత్ర ప్రముఖమైనది. సయ్యద్ బయోపిక్లో అజయ్ నటించనున్నారు. అమిత్ శర్మ దర్శకుడు. మరోవైపు రాజనీతి శాస్త్రజ్ఞుడు, ఆర్థికవేత్త చాణక్య బయోపిక్లోనూ నటించడానికి అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకుడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ బయోపిక్స్లో నటించడానికి అజయ్ దేవగన్ అంగీకరించడం విశేషం. -
చాణక్యుడి పాత్రలో స్టార్ హీరో
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో హిస్టారికల్, ఫోక్లోర్ సినిమాల హవా కనిపిస్తోంది. భారతీయ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో భారీ వసూళ్లు సాధిస్తుండటంతో మన మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవల పద్మావత్ సినిమా ఘనవిజయం సాధించగా ప్రస్తుతం మణికర్ణిక చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా మరో చారిత్రక పాత్రను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ మేకర్స్. చరిత్రలో ఎంతో గొప్ప రాజనీతిజ్ఞుడు, గురువు, ఆర్థిక నిపుణుడు అయిన చాణక్యుడి కథను వెండితెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరున్న నీరజ్ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ టైటిల్ రోల్ లో నటించేందుకు అంగీకరించారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్.. ఫ్రైడే ఫిలిం వర్క్స్, ప్లాస్ సి స్టూడియోస్ బ్యానర్లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
కమల్ చిత్రంలో అజయ్దేవ్గన్?
తమిళసినిమా: రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటుల చిత్రాల్లో బాలీవుడ్ స్టార్స్ను నటింపజేయడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కాంబినేషన్ కొత్తగా ఉంటుంది, వ్యాపారం అంతర్జాతీయ స్థాయిలో పలుకుతుందన్న ఆలోచనలే ఇందుకు కారణంగా భావించవచ్చు. బాలీవుడ్ స్టార్స్ కూడా దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్ కాలా చిత్రంలో తనకు విలన్గా నానాపటేకర్ను ఎంచుకున్నారు. ఇక ఎందిరన్ చిత్రంలో అక్షయ్కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కమలహాసన్ కూడా తన తాజా చిత్రం ఇండియన్–2లో మరో బాలీవుడ్ హీరో అజయ్దేవ్గన్ను నటింపజేసే ప్రయత్నంలో ఉన్నట్లు తాజా సమాచారం. అయితే కమల్ తన హేరామ్ చిత్రంలోనే షారూఖ్ఖాన్ను నటింపజేశారన్నది గమనార్హం. ఆయన త్వరలో శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2లో నటించడానకి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 2.ఓ చిత్ర గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ సెప్టెంబర్లో ఇండియన్–2 చిత్రానికి షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. ఆయన చిత్రాలు బ్రహ్మాండానికి మారుపేరు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ తారాగణం, ప్రఖ్యాత సాంకేతిక వర్గం ఆయన చిత్రాల్లో పనిచేస్తుంటారు. అలా ఇండియన్–2ను భారీ ఎత్తున తెరకెక్కించడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే కమలహాసన్ సరసన అగ్రనటి నయనతార నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అజయ్దేవ్గన్ను ప్రధాన పాత్రల్లో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. దీనికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలు కడుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఎన్ని విశేషాలు ఈ చిత్రంలో చోటు చేసుకోనున్నాయో. -
.నో ఫ్లయిట్స్.. నో ట్రావెల్
రీసెంట్ టైమ్స్లో చెన్నై, ముంబై, హైదరాబాద్ నగరాల మధ్య తెగ చెక్కర్లు కొట్టారు హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్. ఆమె తమిళంలో మూడు (సూర్యతో ‘ఎన్జీకే’, కారీత్తో ‘దేవ్’, శివకార్తీకేయన్తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం), హిందీలో (అజయ్ దేవగణ్) ఒక సినిమా చేస్తుండటమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు దాదాపు నెల రోజుల పాటు ఒకే చోట కుదురుగా ఉండనున్నారట రకుల్. అకివ్ ఆలీ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ హీరోగా ఓ రొమాంటిక్ కామెడీ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో టబు, రకుల్ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ‘‘హిందీలో నేను నటిస్తున్న సినిమా కోసం లండన్ వెళ్లాను. ఈ షెడ్యూల్ కోసం ఇక్కడే నెల రోజులు ఉంటాను. నో ఫ్లయిట్స్.. నో ట్రావెల్’ అని పేర్కొన్నారు రకుల్ప్రీత్ సింగ్. మరోవైపు తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్ ఇంతవరకు తెలుగు సినిమాకు ఓకే చెప్పలేదు. కానీ ఈ నెలలో ఆమె నటించబోయే తెలుగు సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్. -
డబుల్ ధమాకా
ప్రస్తుతం బాలీవుడ్ అంతా బయోపిక్ల హవా నడుస్తోంది. అజయ్ దేవగన్ కూడా బయోపిక్కి రెడీ అయ్యారు. ఒకటి కాదు ఏకంగా రెండు బయోపిక్లను లైన్లో పెట్టారు. మరాఠా సామ్రాజ్యంలోని ముఖ్య జనరల్ తానాజీ, పూలన్దేవిని చంపిన బందిపోటు షేర్ సింగ్ రానా పాత్రలను తెరమీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. బయోపిక్లో యాక్ట్ చేయడం అజయ్కి ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. 2002లో ‘ది లెజెండ్ ఆఫ్ భగత్సింగ్’ చిత్రంలో భగత్సింగ్ పాత్రలో కనిపించారు. ఆల్రెడీ ‘తానాజీ : ది అన్సంగ్ హీరో’ చిత్రంలో తానాజీ పాత్ర కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టేసిన అజయ్ దేవ్గన్.. షేర్ సింగ్ బయోపిక్ను వచ్చే ఏడాది చివర్లో మొదలుపెట్టనున్నారట. -
సండే.. బిజీ డే
నో రెస్ట్. హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్కి ఈ సండే నో రెస్ట్. ఎందుకంటే ఆమె షూటింగ్లో పాల్గొన్నారు. కార్తీతో చేస్తున్న తమిళ సినిమా కోసం, అజయ్ దేవగన్తో చేస్తోన్న హిందీ సినిమా కోసం చెన్నై, ముంబైల మధ్య చక్కర్లు కొడుతున్నారీ బ్యూటీ. అకీవ్ అలీ దర్శకత్వంలో రూపొందుతోన్న హిందీ సినిమా సెకండ్ షెడ్యూల్ని ముంబైలో కంప్లీట్ చేశారామె. ఈ షెడ్యూల్లో పాల్గొనడానికి ముందే చెన్నైలో కార్తీ హీరోగా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా నైట్ షూట్లో పాల్గొన్నారు రకుల్. ఇప్పుడు మళ్లీ ఇదే సినిమా షూటింగ్ కోసం ముంబై నుంచి చెన్నై వెళ్లారట ఈ బ్యూటీ. ఈ సినిమా షూటింగ్ను యూరప్, హిమాలయాస్, యూకేలలో కూడా చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని టాక్. ఈ సండే ఈ సినిమా షూటింగ్లోనే రకుల్ ప్రీత్సింగ్ పాల్గొన్నారు. -
పూలన్ దేవీ హంతకుడా, మజాకా ?!
-
పూలన్ దేవీ హంతకుడా, మజాకా ?!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని సహ్రాన్ పూర్లో మే 9వ తేదీన జరిగిన దళితుడైన సచిన్ వాలియా అనుమానాస్పద మృతిపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడిగా ‘బందిపోటు రాణి’ పూలన్ దేవీ హంతకుడైన షేర్ సింగ్ రాణా పేరును పేర్కొనడమే అందుకు కారణం. మరోపక్క చనిపోయిన దళితుడు కూడా సామాన్యుడు కాదు. ‘భీమ్ ఆర్మీ’ సహ్రాన్పూర్ జిల్లా చీఫ్ కమల్ వాలియా సోదరుడు సచిన్ వాలియా(25). ఇరువర్గాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా కేసు దర్యాప్తులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. రాజ్పుత్ అలియస్ ఠాకూర్లు హీరోగా భావించే షేర్ సింగ్ రాణాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు యూపీ పోలీసులు సాహసించడం లేదు. 2001లో ఢిల్లీలో జరిగిన ఫూలన్దేవి హత్య కేసులో జైలుకెళ్లిన షేర్ సింగ్ రాణా 2004లో జైలు నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో యావజ్జీవ జైలు శిక్ష పడిన ఆయన ప్రస్తుతం బెయిలపై ఉన్నారు. 16వ శతాబ్దానికి చెందిన మహారాణా ప్రతాప్ వార్షికోత్సవం సందర్భంగా మే 9వ తేదీన ఠాకూర్లు జరిపిన కాల్పుల్లో సచిన్ వాలియా మరణించారన్నది స్థానిక దళితుల వాదన. షేర్ సింగ్ రాణా ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లోనే సచిన్ వాలియా మరణించాడన్నది ఆయన తల్లి వాదన. సచిన్ వాలియా మిత్రులు పొరపాటున జరిపిన కాల్పుల్లో మరణించాడన్నది ఠాకూర్ల వాదన. షేర్ సింగ్ రాణా స్థానికంగా ప్రముఖుడు. ఆయన పేరు, ముఖచిత్రంతో ఉన్న టీషర్టులు ఇంటర్నెట్లో తెగ అమ్ముడుపోతున్నాయి. ఆయన్ని హీరోగా కీర్తిస్తున్న అనేక పాటలు ‘యూట్యూబ్’లో అందుబాటులో ఉన్నాయి. ‘షేర్ సింగ్ రాణా క్షత్రియ యువకులకు నిజమైన హీరో’ అని ఉత్తరప్రదేశ్ క్షత్రియ మహాసభ అధ్యక్షుడు ఖాన్ సింగ్ రాణా వ్యాఖ్యానించారు. పూలన్ దేవీ హత్యతో... పూలన్ దేవీ హత్య వరకు సేర్ సింగ్ రాణా గురించి పెద్దగా ఎవరికి తెలియదు. 2001, జూలై నెలలో పార్లమెంట్ నుంచి అధికార నివాసానికి బయల్దేరిన పూలన్ దేవీని నివాసం వద్ద ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. వారిలో ఒక వ్యక్తే షేర్ సంగ్ రాణాగా, ఆయనే హత్యకు ప్రధాన కుట్రదారుగా పోలీసులు గుర్తించారు. పూలన్ దేవీ బందిపోటు రాణిగా 21 మంది ఠాకూర్లను హత్య చేసినందుకు ప్రతీకారంగానే తానీ హత్య చేశానని రాణా నేరం అంగీకరించారు. 2004లో జైలు నుంచి తప్పించుకున్న రాణాను ఢిల్లీ ప్రత్యేక విభాగానికి చెందిన పోలీసులు 2006లో కోల్కతాలో అరెస్ట్ చేశారు. 2014లో రాణాకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 2016లో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ఆయనకు బెయిల్ రావడంలో కూడా రాజకీయ జోక్యం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తీహార్ జైల్లో ఉన్న రాణాకు 2004కు ముందు జైల్లో కొంతమంది టెర్రరిస్టులు తారసపడ్డారట. 1192లో మొహమ్మద్ ఘోరీ చేతుల్లో ఓడి పోయిన 12వ శతాబ్దానికి చెందిన హిందూ మహారాజు పృధ్వీరాజ్ చౌహాన్ సమాధిలోని అవశేషాలను తీసుకొస్తానని వారితో రాణా సవాల్ చేశాడట. ఆ మేరకు 2004లో ఓ పోలీసు అధికారి (నకిలీ) వెంట కోర్టుకు వెళుతున్నట్లుగా నటించి తీహార్ జైలు నుంచి తప్పించుకున్నారు. మొరదాబాద్, రాంచీ మీదుగా కోల్కతా చేరుకున్నారు. అక్కడ సంజయ్ గుప్తా పేరిట నకిలీ పాస్పోర్టు సంపాదించారు. బంగ్లాదేశ్కు మూడు నెలల వీసా సంపాదించి ఆ దేశానికి వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్కి వెళ్లి, అక్కడి నుంచి అఫ్ఘానిస్థాన్ వెళ్లారు. మొహమ్మద్ ఘోరీ తన చేతుల్లో ఓడిపోయిన పృధ్వీరాజ్ చౌహాన్ను భారత్లో చంపేయకుండా అఫ్ఘానిస్థాన్ తీసుకెళ్లి అక్కడ చంపేశారన్నది రాణా నమ్మకం. అందుకనే ఆయన అక్కడికి వెళ్లారు. అఫ్ఘానిస్థాన్లోని దెహ్యాక్ వెళ్లి అక్కడ పృధ్వీరాజ్ చౌహాన్దిగా భావిస్తున్న ఓ మట్టి సమాధిని తవ్వి కొన్ని అవశేషాలను రాణా భారత్కు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాణా పలు సందర్భాల్లో భారతీయ మీడియాకు స్వయంగా తెలిపారు. ఆ అవశేషాలను వివిధ క్షత్రియ సంస్థలకు ఇచ్చారు. అందులో కొన్ని అవశేషాలను యూపీలోని మెయిన్పురిలోని స్మారక భవనంలో భద్రపర్చారు. అజయ్ దేవగన్తో సినిమా! తీహార్ జైలు నుంచి అఫ్ఘానిస్థాన్ వరకు తాను సాగించిన సాహస యాత్ర గురించి రాణా ‘జైల్ డైరీ: తీహార్ సే కాబూల్–కాందహార్’ అనే పుస్తకం రాశారు. ఇది 2012లో విడుదలయింది. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్లో సినిమా తీస్తున్నారని, రాణా పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ లేదా అజయ్ దేవగన్ నటించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ విషయమై అజయ్ దేవగన్ తనతో మాట్లాడినట్లు రాణా పలుసార్లు స్వయంగా చెప్పుకున్నారు. (ఠాకూర్ల చేతుల్లో అంతులేని అత్యాచారాలకు గురైన పూలన్దేవీ బందిపోటు రాణిగా మారడాన్ని ఇతివృత్తంగా తీసుకొని బాలివుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ‘బండిట్ క్వీన్’ పేరిట సినిమా తీయడం, 1994లో విడుదలైన ఆ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడం తెల్సిందే) -
ఓపెనింగ్ వసూళ్లలో చరిత్ర సృష్టించిన రెయిడ్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గణ్ తాజా సినిమా ‘రెయిడ్’ చరిత్ర సృష్టించింది. మంచి టాక్తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తూ.. మొదటి మూడు రోజుల్లోనే రూ.41 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో 2018లో పద్మావత్ సినిమా తర్వాత అతి పెద్ద వీకెండ్ కలెక్షన్ల సినిమాగా చరిత్రకెక్కింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తున్న ‘రెయిడ్’... ఈ ఏడాది వీకెండ్ కలెక్షన్ల పరంగా రెండో అతిపెద్ద హిట్గా నిలిచిందని ఫిలీం ట్రెడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది విడుదలయిన సినిమాల్లో రూ.114 కోట్ల వీకెండ్ కలెక్షన్లతో పద్మావత్ మొదటి స్థానంలో ఉండగా, రూ. 41.01 కోట్లతో రెయిడ్ రెండో స్థానంలో ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. మొదటిరోజు కాస్త తడబడి రూ. 10.04 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిన ఈ సినిమా రెండోరోజు శనివారం రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. ఆదివారం ఒక్క రోజే రూ.17.11 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మూడు రోజుల్లో కలిపి రూ. 41.01కోట్లను రాబట్టింది. రాజ్కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్కు జోడీగా ఇలియానా నటించారు.1980ల్లో ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకున్న అతిపెద్ద ఆదాయ పన్ను దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. -
భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న రెయిడ్
సాక్షి, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ తాజా సినిమా ‘రెయిడ్’.. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. అంచనాలనుమించి వసూళ్లు రాబడుతోంది. మొదటిరోజే రూ. 10.04 కోట్ల భారీ ఓపెనింగ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు శనివారం.. రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. రెండు రోజుల్లో రెయిడ్ సినిమా రూ. 23.90 కోట్లు వసూలుచేసిందని ట్రెడ్ అనాలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ సినిమా 38.04శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తోందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. 1981లో ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకున్న ఐటీ దాడుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ సరసన ఇలియానా నటించింది. డిప్యూటీ కమీషనర్ అమై పట్నాయక్ పాత్రలో అజయ్ దేవగణ్ చూపిన నటన విమర్శకుల ప్రసంశలు అందుకుంటుంది. -
అవును.. నిజమే!
‘‘అవును... నిజమే. ‘రైడ్’ మూవీకి అజయ్ నన్ను రిఫర్ చేశాడు. ‘ముబారక్’ సినిమాలో నా కో–స్టార్ అర్జున్ కపూర్ కూడా ఓ సినిమా స్క్రిప్ట్ను పరిశీలించమన్నాడు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా. అయినా వరుసగా రెండు సినిమాలు ఒక హీరో పక్కన చేస్తే చాలు.. ఏవేవో పుకార్లు పుట్టిస్తుంటారు. అవన్నీ నిజం కావు’’ అంటున్నారు ఇలియానా. ఇంతకీ మేటర్ ఏంటంటే... బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన 2016లో ‘బాద్షాహో’, ఈ ఏడాది ఈ నెలలో రిలీజ్ కానున్న ‘రైడ్’ చిత్రాల్లో కథానాయిక నటించారు ఇలియానా. ప్రస్తుతం ఇంద్రకుమార్ దర్శకత్వంలో ‘ధమాల్’ ఫ్రాంచైజీ ‘టోటల్ ధమాల్ 3’లో నటిస్తున్నారు అజయ్. ఈ సినిమాలో ఇలియానా ఓ ముఖ్య పాత్ర షోషించేలా అజయ్ పావులు కదుపుతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై ఇలియానా స్పందిస్తూ– ‘‘టోటల్ ధమాల్’ చిత్రంలో నటించమని నన్నెవరూ సంప్రదించలేదు. ఈ సినిమాకి అజయ్ నన్ను రికమండ్ చేశాడని వస్తున్న వార్తలు నిజం కావు. ఇలాంటివి విన్నప్పుడు ఫన్నీగా ఉంటుంది. ప్రచారంలో ఉన్నట్లుగా అజయ్తో నాకెలాంటి సంబంధం లేదు. ఒకరి గురించి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారో అర్థం కావడం లేదు’’ అని పేర్కొన్నారు. -
కాజోల్కు అన్ని గట్స్ లేవు
బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవ్గన్, అద్భుతమైన నటన పనితీరును కనబరుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటనకు వంకలు కూడా పెట్టక్కర్లేదు. కానీ అజయ్ నటనను కూడా విమర్శించే వారు ఒకరున్నారట. ఎవరో తెలుసా? ఆమెనే నైసా. తన కూతురు నైసానే తనకు పెద్ద విమర్శకురాలంటూ డీఎన్ఏ ఇంటర్వ్యూలో అజయ్ తెలిపారు. ఇదే సమయంలో భార్య కాజోల్పై ఛలోక్తులు కూడా విసిరారు. తన సినిమాలను విమర్శించేంత గట్స్ కాజోల్కు లేవంటూ చెప్పుకొచ్చారు. ''కాజోల్కు నా సినిమాలను విమర్శించేంత గట్స్ లేవు. కానీ నా కూతురు నైసాకు ఉన్నాయి. నైసానే నాకు పెద్ద విమర్శకురాలు. నైసా నన్ను అసలు విడిచిపెట్టదు'' అంటూ అజయ్ కూతురు నైసా గురించి ముచ్చటించారు. ప్రస్తుతం నైసా సింగపూర్లోని ఆగ్నేయాసియాలో యూనిటెడ్ కాలేజీలో చదువుకుంటోంది. అజయ్ దేవ్గన్ కూడా ప్రస్తుతం రాజ్కుమార్ గుప్తా రైడ్లో నటించారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 16న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో ఇలియానా డి క్రజ్ కూడా ముఖ్య పాత్రలో నటించింది. -
ఇలియానాకు పెళ్లయ్యిందా?
సౌత్ లో స్టార్ ఇమేజ్ ను వదులుకొని బాలీవుడ్ బాట పట్టిన బ్యూటీ ఇలియానా. అడపాదడపా బాలీవుడ్ సినిమాలు చేస్తున్న ఈ భామకు ప్రస్తుతం దక్షిణాదిలో ఒక్క అవకాశం కూడా లేదు. ఇటీవల సౌత్ ఇండస్ట్రీలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ సంచలన ప్రకటన చేసి మరోసారి సౌత్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ పర్సనల్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. గత డిసెంబర్లో తన ఇన్స్ట్రాగామ్లో ఒక ఫొటో, కొన్ని వ్యాఖ్యలను ట్వీట్ చేసింది ఇలియానా. అందులో ‘ఇది చాలా సంతోషకరమైన తరుణం. క్రిస్మస్ ఆనందం, సెలవులు, ఇల్లు, కుటుంబం, ప్రేమ’ అంటూ పోస్ట్ చేసింది. ఆ ఫొటోపై భర్త ఆండ్రూ నీబోర్ అని పేర్కొంది. దీంతో ఇలియానా పెళ్లి చేసుకుందనే ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఇలియానా నటించిన రైడ్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న ఈ బ్యూటీని పెళ్లి విషయం గురించి మీడియా ప్రతినిథి ప్రశ్నించగా ‘ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడడం నాకిష్టం లేదు’ అంటూ సమాధానం దాటవేసింది. ఇంతకీ ఇలియానాకు పెళ్లి అయినట్టా? లేనట్టా?ఈ ప్రశ్నకు ఆమె నుంచి సూటిగా బదులు ఆశించడం ఇంకా సబబు కాదనుకుంటా! -
నేను మిస్ఫిట్!
ఇలియనా.. ఈ బ్యూటీ టాలీవుడ్లో కనిపించి చాలాకాలం అయింది. ఆమె నటించిన లాస్ట్ సినిమా పూరీ జగన్నా«థ్ డైరెక్షన్లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’. ‘బర్ఫీ’తో బాలీవుడ్కి వెళ్లి, అక్కడ కూడా పెద్దగా సినిమాలు చేయడంలేదు. ఏడాదికి ఒక సినిమా చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. ఇటు తెలుగుకి దూరమై అటు హిందీ సినిమాలు చేస్తున్నారు కాబట్టి బాలీవుడ్ బాగా నచ్చిందన్నది కొందరి ఊహ. ‘‘నచ్చింది కానీ నేను బాలీవుడ్కు ‘మిస్ ఫిట్’’ అని ఓ సందర్భంలో ఇలియానా పేర్కొన్నారు. ఎందుకలా అన్నారనే సీక్రెట్ని ఆమె బయట పెట్టలేదు. నంబర్ గేమ్స్ గురించి మాట్లాడుతూ – ‘‘నాకీ నంబర్ గేమ్స్ అంటే చిరాకు. ఈ రేసులో నేనెప్పుడూ పరిగెత్తలేదు. నంబర్ వన్ కావాలంటే ఏం చేయాలో కూడా నాకు తెలియదు. అయినా ‘నంబర్ వన్’ అని ఎలా డిసైడ్ చేస్తారు?. ఒక్కో సినిమాకి నేను గ్యాప్ తీసుకుంటున్నాను. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తున్నాను. అవి సక్సెస్ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది’’ అన్నారు ఇలియానా. ప్రస్తుతం అజయ్ దేవగన్ ‘రెయిడ్’ సినిమాలో నటిసున్నారామె. -
వన్ మోర్ చాన్స్
... కొట్టేశారు హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్. నీరజ్ పాండే దర్శకత్వంలో ఆమె నటించిన ‘అయ్యారీ’ సినిమా రిలీజ్ కాకముందే మరో హిందీ సినిమాకు సైన్ చేశారు. అకివ్ అలీ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా భూషణ్ కుమార్, రంజన్ నిర్మిస్తున్న సినిమాలో రకుల్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు నిర్మాతలు. ‘‘రకుల్ హిందీలో నటించిన తొలి చిత్రం ‘యారియాన్’కి నేనో నిర్మాతను. ఇప్పుడు మళ్లీ మా అసోసియేషన్ కుదరడం ఆనందంగా ఉంది. సౌత్లో మంచి యాక్టర్గా రకుల్కు పేరు తెచ్చుకుంది’’ అన్నారు భూషణ్కుమార్. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేయనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించి అక్టోబర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఒకవైపు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంటూ మరోవైపు హిందీ సినిమాలకూ డేట్స్ ఇస్తూ.. రకుల్ జోరు మీద ఉన్నారు. -
సీనియర్ హీరోతో రొమాన్స్కు సై
సాక్షి, సినిమా : గతేడాది పెద్దగా సక్సెస్లు పలకరించకపోయినా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ప్రస్తుతం నిలకడగానే ఉంది. సెలక్టివ్ కథలను ఎంచుకుంటూ ఈ ఏడాది మంచి చిత్రాలతోనే ప్రేక్షకులను పలకరించబోతోంది. ముందుగా బాలీవుడ్లో ‘అయ్యారీ’ ద్వారా రీ ఎంట్రీతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్లో మరో చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నటుడు అజయ్ దేవగన్ తర్వాతి చిత్రంలో రకుల్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అకివ్ అలీ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కూడా ఓ కీలకపాత్ర పోషించబోతున్నారు. ఈ విషయాలను నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. గతంలో రకుల్ను యారియాన్ ద్వారా బాలీవుడ్కు పరిచయం చేసింది భూషణ్ కుమార్ కావటం విశేషం. రచయిత లవ్ రంజన్(ప్యార్ కా పంచ్నామా ఫేమ్) మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందని నిర్మాతలు వెల్లడించారు. దసరాకు ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు నీరజ్ పాండే డైరెక్షన్లో సిద్ధార్ధ్ మల్హోత్రా-రకుల్ జంటగా నటించిన అయ్యారీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. -
నో లేడీ జోడి!
ఏడేళ్లు అయ్యింది. అజయ్ దేవ్గన్ హీరోయిన్ లేకుండా సినిమా చేసి. ఏడేళ్ల క్రితం హీరోయిన్ లేకుండా అజయ్ చేసిన సినిమా ఏంటబ్బా? అని ఆలోచిస్తున్నారా? 2010లో వచ్చిన ‘రాజ్నీతి’లో ఆయనకు లేడీ జోడీ లేదు. ‘ధమాల్, డబుల్ ధమాల్’లకు సీక్వెల్గా రూపొందనున్న తాజా చిత్రం ‘టోటల్ థమాల్’లోనూ ఆయనకు జోడీ లేదు. మొదటి రెండు భాగాలను తెరకెక్కించిన ఇంద్రకుమార్ మూడో భాగాన్ని కూడా రూపొందించనున్నారు. ఆల్రెడీ థర్డ్ పార్ట్లో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్లు కీలక పాత్రల్లో నటించనున్నారు. తాజాగా అజయ్ దేవ్గన్ను తీసుకున్నారు. మొదట ఇలియానాను అజయ్ సరసన హీరోయిన్గా అనుకున్నారట. కానీ, స్క్రిప్ట్ పరంగా అజయ్ క్యారెక్టర్కు లేడీ జోడి అవసరం లేదని ఫిక్స్ అయ్యారట ఇంద్రకుమార్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మేజర్ సీన్స్ని లక్నోలో షూట్ చేయనున్నారు. ‘టోటల్ ధమాల్’ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
అతను చీటర్.. చీటర్.. చీటర్!
మూడు సార్లు ఇంత బలంగా చీటర్.. చీటర్... చీటర్ అని పరిణీతి చోప్రా చెబుతున్నారంటే.. అతనెవరో పెద్ద మోసమే చేసి ఉంటాడు. ఇంతకీ అతనెవరు? అంటే.. ఇంకెవరో కాదు. ఈ మధ్యే విడుదలైన ‘గోల్మాల్ ఎగైన్’ దర్శకుడు రోహిత్శెట్టి. అజయ్ దేవ్గన్, పరిణీతీ చోప్రా, టబు, అర్షద్ వార్షి ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం బీ టౌన్ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టి, 200 కోట్ల క్లబ్లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ, షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విశేషాలను పరిణీతి గుర్తు చేసుకున్నారు. అందులో రోహిత్ శెట్టితో ఆమె క్రికెట్ ఆడిన ఇన్సిడెంట్ ఒకటి. ఆ సమయంలో వీడియో కూడా తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్ట్రైకర్ ఎండ్లో ఉన్న పరిణీతి లాంగ్ఆన్ షాట్ కొట్టారు. నాన్–స్ట్రైకర్ ఎండ్లో ఉన్న రోహిత్ శెట్టి ముందు రన్కు ట్రై చేసి, సడన్గా వెనక్కి వెళ్లారు. అక్కడితో ఆగకుండా మళ్లీ ట్రై చేయడంతో పరిణీతి చోప్రా రనౌట్ అయ్యారు. ఈ సీన్కు చిత్రబృందం అంతా నవ్వేశారు. దీంతో ‘మోసం.. మోసం.. అంతా మోసం’ అంటూ రోహిత్ శెట్టిపై సరదాగా అలిగారు పరిణీతి. ‘‘ రోహిత్ శెట్టి సార్ నన్ను చీట్ చేశారు. రనౌట్ అయ్యాను. ఆయన చీటర్.. చీటర్.. చీటర్’’ అని పరిణీతి పేర్కొన్నారు. -
తమ్మూ... తమిళ్ రీమేకా?
ఆమా (అవును)... తమిళ్ రీమేకే! తమ్మూ బేబీకి ఇంకో తమిళ్ రీమేక్లో నటించమని బీటౌన్ నుంచి పిలుపు వచ్చిందట! ఇంకొకటి ఏంటి? ఆల్రెడీ హిందీలో తెరకెక్కుతోన్న తమిళ్ రీమేక్లో ఎందులోనైనా తమన్నా నటిస్తున్నారా? అంటే... ఆమా! చక్రి తోలేటి దర్శకత్వంలో ప్రభుదేవా సరసన ‘ఖామోషి’ అనే హిందీ సిన్మా చేస్తున్నారు. తమిళ్లో నయనతార నటిస్తున్న ‘కొలైయుధిర్ కాలమ్’కి హిందీ రీమేక్ అది. ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ ఆఫర్ ఇంకొకటి వచ్చిందట! ‘చిక్కడు దొరకడు’ సినిమా చూశారా? ఎన్టీఆర్, కాంతారావుల సిన్మా కాదు... ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్, బాబీ సింహా హీరోలుగా చేసిన తమిళ్ సిన్మా ‘జిగర్తండా’ తెలుగు డబ్బింగ్ ఇది. మన తెలుగులో సరిగా చూడలేదు. కానీ, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్. ఇప్పుడా ‘జిగర్తండా’ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. సంజయ్ దత్, ఫర్హాన్ అక్తర్ హీరోలు. మరో హీరో అజయ్ దేవగన్ నిర్మాత. ఇందులో తమ్మూ బేబీని నటించమని అడిగారట! ఈమె ఆల్మోస్ట్ ఓకే చేప్పేశారట! ఇప్పటివరకూ హిందీలో చేసిన సినిమాలేవీ తమన్నాకు పెద్దగా కలసిరాలేదు. ఇప్పుడీ రెండు రీమేక్స్ బ్రేక్ తీసుకొస్తాయేమో. వెయిట్ అండ్ సీ!! -
లేడీ ఓరియంటెడ్ సినిమాలో కాజోల్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ చిత్రాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రాణీ ముఖర్జీ, ఐశ్వర్యా రాయ్, శ్రీదేవి లాంటివారు ఈ తరహా చిత్రాల్లో అలరించే ప్రయత్నం చేయగా తాజాగా మరో సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా ఈ లిస్ట్లో చేరేందుకు రెడీ అవుతోంది. పెళ్లి తరువాత కొంత కాలం వెండితెరకు దూరంగా ఉన్న కాజోల్ లాంగ్గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇటీవల తమిళ సినిమా వీఐపీ 2లో కీలక పాత్రలో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలో ఛాలెంజింగ్ రోల్లో నటించనుంది. ఎలాంటి ఆధారం లేని తల్లి పాత్రలో నటించేందుకు కాజోల్ అంగీకరించింది. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కాజోల్ భర్త, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం కాజోల్ కొడుకు పాత్ర కోసం బాలనటుడ్ని వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. -
దుమ్మురేపుతున్న 'గోల్మాల్'.. రికార్డు కలెక్షన్స్!
రోహిత్ షెట్టీ, అజయ్ దేవగణ్ కాంబినేషన్లో వచ్చిన 'గోల్మాల్ అగైన్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం జోరుగా ఉన్నాయి. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లోకి ప్రవేశించింది. ఈ ఏడాది బాలీవుడ్కు పెద్దగా కలిసిరాలేదు. బాలీవుడ్ బడా స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తడబడ్డాయి. ఈ క్రమంలో 'గోల్మాల్ అగైన్' ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, అజయ్-రోహిత్ కాంబో మరోసారి తమపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుంది. 'గోల్మాల్' సిరీస్ మరో బంపర్ విజయాన్ని అందుకుంది. 'గోల్మాల్-3' తర్వాత నాలుగో పార్టు కూడా వరుసగా వందకోట్ల క్లబ్బులో చేరడం గమనార్హం. ఈ సినిమా తొలిరోజు శుక్రవారం రూ. 30.10 కోట్లు, శనివారం రూ. 28 కోట్లు, ఆదివారం రూ. 29.09 కోట్లు, సోమవారం రూ. 16.04 కోట్లు వసూలు చేసిందని, మొత్తంగా రూ. 103.64 కోట్లుసాధించిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో వెల్లడించారు. సోమవారం సైతం ఈ సినిమా రూ. 16 కోట్లకుపైగా వసూలు చేయడం ట్రేడ్ పండితులను విస్మయపరుస్తోంది. థియేటర్కు వచ్చే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ సినిమా మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశముందని భావిస్తున్నారు. ఈ దీపావళి పండుగకు ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్', అజయ్ దేవగణ్ 'గోల్మాల్ అగైన్' పోటీపడ్డాయి. ఆమిర్ సినిమాకు పెద్ద ఎత్తున పాజిటివ్ మౌత్టాక్ వచ్చినప్పటికీ.. భారీ ఎత్తున విడుదలైన 'గోల్మాల్ అగైన్' ఊహించినట్టుగానే పెద్ద మొత్తంలో వసూళ్లు రాబడుతోంది. రోహిత్ షెట్టీ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'గోల్మాల్' సిరీస్ సినిమాలు మంచి ప్రేక్షకాదరణ సాధించాయి. గత సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తాజాగా 'గోల్మాల్ అగైన్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అజయ్ దేవ్గణ్, అర్షద్ వార్సీ, పరిణీత చోప్రా, తుషార్ కపూర్, టబు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. -
గోల్మాల్ అగైన్: తొలిరోజు దుమ్మురేపింది!
రోహిత్ షెట్టీ, అజయ్ దేవగణ్ కాంబినేషన్లో వచ్చిన 'గోల్మాల్ అగైన్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం జోరుగా ఉన్నాయని తెలుస్తోంది. తొలిరోజు ఈ సినిమా రూ. 33 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఈ దీపావళి పండుగకు ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్', అజయ్ దేవగణ్ 'గోల్మాల్ అగైన్' పోటీపడ్డాయి. ఆమిర్ సినిమాకు పెద్ద ఎత్తున పాజిటివ్ మౌత్టాక్ వచ్చినప్పటికీ.. చిన్న సినిమాగా విడుదలైన 'సీక్రెట్ సూపర్స్టార్' తొలిరోజు రూ. 4.75 కోట్లు వసూలు చేసింది. రెండురోజు ఈ సినిమా వసూళ్లు గణనీయంగా పెరిగి రూ. 9 కోట్లు రాబట్టింది. మొత్తంగా తొలి రెండు రోజుల్లో సీక్రెట్ సూపర్స్టార్ రూ. 13 కోట్లు రాబట్టగా.. భారీ ఎత్తున విడుదలైన 'గోల్మాల్ అగైన్' ఊహించినట్టుగానే పెద్ద మొత్తంలో వసూళ్లు రాబడుతోంది. ఆమిర్ సినిమా రాకపోయి ఉంటే ఈ సినిమా తొలిరోజు రికార్డుస్థాయిలో రూ. 45 కోట్లు రాబట్టి ఉండేదని బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాలు చెప్తున్నాయి. రోహిత్ షెట్టీ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'గోల్మాల్' సిరీస్ సినిమాలు మంచి ప్రేక్షకాదరణ సాధించాయి. గత సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తాజాగా 'గోల్మాల్ అగైన్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా వసూళ్లు ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అజయ్ దేవ్గణ్, అర్షద్ వార్సీ, పరిణీత చోప్రా, తుషార్ కపూర్, టబు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. -
ఆ హీరో మూవీకి ఎప్పుడూ నో చెప్పను!
న్యూఢిల్లీ : బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ వల్లే తాను పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయానంటూ గతంలో ఎన్నోసార్లు చెప్పారు ప్రముఖ నటి టబు. అయితే అజయ్ దేవగన్తో నటించే అవకాశం వస్తే మాత్రం ఆ మూవీలో కచ్చితంగా నటిస్తానని, ఎట్టి పరిస్థిత్తుల్లోనూ అవకాశాలు వదుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న గోల్మాల్ అగేయిన్ చిత్రంలో అజయ్, టబు నటించారు. ఈ శుక్రవారం ఆ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్పథ్, తక్షక్, దృశ్యం వంటి అజయ్ దేవగన్ చిత్రాల్లో గతంలో నటించిన టబు గోల్మాల్ అగేయిన్లోనూ కలిసి పనిచేశారు. గోల్మాల్ విడుదల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘అజయ్, నేను చిన్నాప్పటినుంచీ మంచి మిత్రులం. దాంతో అతడి మూవీల్లో నటించేందుకు నాకెలాంటి ఇబ్బంది ఉండదు. అజయ్ హీరోగా నటించినా.. లేక దర్శకుడు, నిర్మాతగా ఇలా ఏ విధంగా పనిచేసినా సరే.. ఆయన మూవీల్లో ఛాన్సిస్తే కచ్చితంగా నటిస్తాను. గోల్మాల్ అగేయిన్ తర్వాత లవ్ రంజన్ నిర్మాతగా తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీలో అజయ్తో మరోసారి జతకట్టనున్నానంటూ’ టబు వివరించారు. పెళ్లి చేసుకునేందుకు నా కోసం ఓ అబ్బాయిని వెతికి పెట్టమంటూ అజయ్ని ఇప్పటికీ అడుగుతుంటానని గతంలో ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు పెను దూమారం రేపిన సంగతి తెలిసిందే. -
తెలుగులో బాలీవుడ్ సీక్వల్
గోల్మాల్ సిరీస్లో ఇప్పటికే మూడు సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి, త్వరలో నాలుగో సినిమాతో రాబోతున్నాడు. గోల్మాల్ ఎగైన్ పేరుతో తెరకెక్కిన ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, అర్షద్ వార్సీ, పరిణితి చోప్రా, తుషార్ కపూర్, ప్రకాశ్ రాజ్, టబులు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే తెలుగు వారికి కూడా సుపరిచితమైన గోల్ మాల్ సిరీస్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఒకేసారి హిందీ పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. -
మేమేం పోర్న్ చిత్రం తీయలేదు: హీరో
న్యూఢిల్లీ: తాను నటించిన చిత్రం 'బాద్షాహో'ను సెల్ఫ్ సెన్సార్ చేసినట్లు వస్తున్న వార్తలను హీరో అజయ్ దేవగన్ ఖండించారు. తానేమి పోర్న్ మూవీలో నటించలేదని అన్నారు. సర్టిఫికేషన్కు సీబీఎఫ్సీకు వెళ్లబోతున్న చిత్రాన్ని డైరెక్టర్ మిలన్, హీరో అజయ్ దేవగన్లు ఎడిట్ చేశారని వార్తలు వచ్చాయి. ఇలియానా డిక్రూజ్, అజయ్ దేవగన్ల మధ్య వచ్చే సన్నివేశాలు అసభ్యంగా ఉంటాయనే పుకార్లు షికార్లు చేశాయి. సోమవారం సినిమా థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేసిన అజయ్ దేవగన్.. బాద్షాహోపై వస్తున్న పుకార్లపై స్పందించారు. 'అవన్నీ అబద్దం. మేమేం పోర్న్ మూవీని తీయలేదు' అని వ్యాఖ్యానించారు. -
నాతో సినిమానా? అయితే... రాజీ పడాలి!
ఎవరైనా సరే నాతో సిన్మా తీయాలని అనుకుంటే... నా దగ్గరకు రావడానికి ముందే నాతో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కాజోల్ అంటున్నారు. బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆదిత్యా చోప్రా, కరణ్ జోహార్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె ఈ విధంగా స్పందించారు. బాలీవుడ్లో బడా దర్శక–నిర్మాతలైన వీళ్లిద్దరూ ఆమెతో గొడవపడ్డారా? అనడిగితే లేదనే చెప్పాలి. మరి, సమస్య ఏంటి? అంటే... కాజోల్ భర్త అజయ్ దేవగన్కు వాళ్లిద్దరితో గొడవలున్నాయి. యశ్ చోప్రా (ఆదిత్య తండ్రి) దర్శకత్వం వహించిన చివరి సిన్మా ‘జబ్ తక్ హై జాన్’, అజయ్ హీరోగా నటించిన ‘సన్నాఫ్ సర్దార్’ సిన్మాలు ఒకే రోజున విడుదలయ్యాయి. అప్పుడు థియేటర్ల విషయంలో గొడవలు వచ్చాయి. అజయ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘శివాయ్’, కరణ్ దర్శకత్వం వహించిన ‘యే దిల్ హై ముష్కిల్’ ఒకే రోజున ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక్కడా సేమ్ ప్రాబ్లమ్. దాంతో ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ వంటి క్లాసిక్లో చోటిచ్చిన ఆదిత్యా చోప్రా, ‘కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్’ వంటి మంచి సిన్మాల్లో ఛాన్స్ ఇచ్చిన కరణ్ జోహార్ల ఫ్రెండ్షిప్కి కాజోల్ కటీఫ్ చెప్పక తప్పలేదు. అప్పట్నుంచి వీళ్ల మధ్య మాటల్లేవ్. ఒకవేళ వాళ్లిద్దరూ మళ్లీ అటువంటి సిన్మాలు, పాత్రలతో మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు? అనడిగితే... ‘‘ఎవరైనా సరే నాతో సిన్మా తీయా లనుకుంటే... ముందు మా ఆయనతో రాజీ పడాలి. సమస్యలను పరిష్కరించుకోవాలి’’ అన్నట్టు కాజోల్ మాట్లాడుతున్నారు. ఏం జరుగు తుందో? వెయిట్ అండ్ సీ. -
రామ్ చరణ్కు టాప్ హీరో డబ్బింగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ధృవ. తమిళ సూపర్ హిట్ తనీఒరువన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగునాట ఘనవిజయం సాధించటమే కాదు, రికార్డ్ వసూళ్లను సాధించింది. అయితే ధృవ సినిమా డబ్బింగ్ వర్షన్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ కు ఓ బాలీవుడ్ టాప్ హీరో డబ్బింగ్ చెపుతున్నాడు. త్వరలో ఓ హిందీ టీవీ ఛానల్ లో ప్రసారం కానున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. జంజీర్ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన చరణ్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి ఆదరణ ఉంది. అందుకే ధృవ సినిమాలో చరణ్ క్యారెక్టర్ అజయ్ దేవగన్ డబ్బింగ్ చెప్పేందుకు అంగీకరించాడు. సినిమాలో కీలకమైన విలన్ పాత్రకు సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ డబ్బింగ్ చెపుతున్నాడు. త్వరలో ధృవ డబ్బింగ్ వర్షన్ టీవీల్లో ప్రసారం కానుంది. -
అంధుడి పాత్రలో అక్షయ్ కాదు.. అజయ్
ఇటీవల కాలంలో సౌత్లో సూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయటం కామన్ అయిపోయింది. మాస్ యాక్షన్ సినిమాలతో పాటు ఇండస్ట్రింగ్ లైన్స్తో తెరకెక్కిన సౌత్ సినిమాలు బాలీవుడ్ సినీ జనాలను కూడా అలరిస్తున్నాయి. అందుకే స్టార్ హీరోలు కూడా సౌత్ రీమేక్లలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అదే బాటలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ఒప్పం సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మలయాళంలో దర్శకత్వంలో వహించిన ప్రియదర్శన్ డైరెక్షన్లో బాలీవుడ్ లోనూ రీమేక్ చేయనున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా అక్షయ్ స్థానంలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఒప్పం బాలీవుడ్ రీమేక్పై అధికారిక ప్రకటన రానుంది. -
అవకాశాల కోసం ఎవరినీ అడగను
అవకాశాల కోసం ఎవరినీ అడగనని, అందుకు ఎవరి వద్దా చేతులు కట్టుకుని నిలబడనని అంటోంది నటి ఇలియానా. ఇటీవల ఈ బ్యూటీ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో కెక్కాలన్నది పరిపాటిగా పెట్టుకున్నట్లుంది. ఇంతకు ముందు టాలీవుడ్లో యమ క్రేజీ హీరోయిన్గా రాణించిన ఇలియానా అనూహ్యంగా బాలీవుడ్పై దృష్టి సారించింది.దీంతో ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్లోనూ అవకాశాలు అడుగంటాయి. ఇక బాలీవుడ్లోనూ పరిస్థితి అంతంత మాత్రమే. ఆ మధ్య అక్షయ్కుమార్కు జంటగా నటించిన రుస్తుం చిత్రం వసూళ్ల వర్షం కురిపించినా ఇలియానాను బాలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం అజయ్ దేవ్గన్తో కలిసి బాద్షా అనే ఒక్క చిత్రంలోనే నటిస్తోంది.కాగా మగాడి సంపాదన, ఆడదాని వయసు చెప్పకూడదనే సామెత ఉంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే చెప్పనే అక్కర్లేదు. అలాంటిది ఇటీవల తన అసలు వయసు 30 అంటూ వెల్లడించి అందర్నీ ఆశ్చర్య పరచింది.ఆ విషయంలోనూ భారీ ప్రచారాన్నే పొందిన ఇలియానా తాజాగా ఒక వేదికపై మాట్లాడుతూ తనకు బాలీవుడ్ చిత్రాల్లో నటించడం ఇష్టం అని, అయితే అక్కడ అవకాశాలు రావడం కష్టం అని పేర్కొంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అవే ఉన్నత స్థాయిలో నిలబెడతాయని, లేకపోతే బాలీవుడ్ మొత్తం మనల్ని దూరంగా పెట్టేస్తుందని అంది. అయఇతే అవకాశాలు లేకపోయినా పర్వాలేదు గానీ తాను మాత్రం వాటి కోసం ఎవరిని అడగనని, ఎవరి వద్ద చేతులు కట్టుకుని నిలబడి బతిమలాడనని అంటూ మరో సారి వార్తల్లోకెక్కింది.ఈ విధంగా ఉచిత ప్రచారం పొందాలన్నది ఈ అమ్మడి ట్రిక్కుల్లో ఒక భాగం అనుకుంటా! అనే భావన పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - శివాయ్
-
సినిమా రివ్యూ: శివాయ్
టైటిల్: శివాయ్ జానర్: యాక్షన్ థ్రిల్లర్ దర్శకుడు, నిర్మాత, కథ: అజయ్ దేవ్ గన్ నటీనటులు: అజయ్ దేవ్ గన్, ఎరికా కార్, సయేషా సైగల్ తదితరులు రచయిత: సందీప్ శ్రీవాస్తవ, రాబిన్ భట్ సంగీతం: మిథూన్ సినిమాటోగ్రఫీ: ఆసిమ్ బజాజ్ విడుదల: 28 అక్టోబర్, 2016 నిడివి: 173 నిమిషాలు బడ్జెట్: 105 కోట్లు భారీ బడ్జెట్ సినిమాలు రెండింటిని ఒకే రోజు విడుదల చేయొద్దన్న నిర్మాతల ఒరవడికి భిన్నంగా బాలీవుడ్లో నేడు(శుక్రవారం) రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి క్రేజీ కాంబినేషన్తో ఉత్సుకత రగిలించడమేకాక, వివాదాలకూ కేంద్రబిందువైన 'ఏ దిల్ హై ముష్కిల్', రెండు అజయ్ దేవ్ గన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'శివాయ్'. అత్యంత సాహసోపేతంగా రూపొందించి, అంతే సాహసంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'శివాయ్'.. అనుకున్నట్లే 'ముష్కిల్'కు చెమటలు పట్టించిందా? కథ: శివాయ్ ఓ పర్వతారోహకుడు. శివుడిలాగే హిమాలయాలే ప్రాణంగా జీవిస్తూ, అంతులేని సాహసాలు చేస్తూఉంటాడు. పర్యాటకులకు శిక్షకుడిగానూ వ్యవహరిస్తాడు. అలా పర్వతారోహణకు వచ్చి ప్రమాదానికి గురైన విదేశీ విద్యార్థిని ఓల్గా (పోలాండ్ నటి ఎరికా కార్)ను శివాయ్ కాపాడతాడు. ఆ క్రమంలో వారిమధ్య ప్రేమ చిగురిస్తుంది. ఓల్గా నెల తప్పుతుంది. కానీ ఇదంతా ఆమెకు ఇష్టం ఉండదు. శివాయ్ ని వదిలేసి స్వదేశానికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే.. ఎనిమిదేళ్లు గడుస్తాయి. ఈ లోగా ఓల్గా కని, వదిలేసిన పాపాయి పెద్దవుతుంది. హిమాలయాలతోపాటు ఇప్పుడా పాపాయి కూడా శివాయ్ కి పంచప్రాణాలు. అయితే కూతురు తల్లిని చూడాలనుకోవడంతో ఓల్గా కోసం తప్పనిసరిగా హిమాలయాలను వదిలి బయటికి వస్తాడు శివాయ్. కూతురితో కలిసి బల్గేరియా(ఓల్గా ఊరికి) వెళతాడు. అక్కడ పిల్లల్ని మాయం చేసే రష్యన్ మాఫియా.. శివాయ్ కూతుర్ని కిడ్నాప్ చేస్తుంది. కూతుర్ని కనిపెట్టే క్రమంలో శివాయ్ కి సయేషా సైగల్(తెలుగు అఖిల్ హీరోయిన్) సహకరిస్తుంది. కిడ్నాపర్ల చెరనుంచి శివాయ్ తన కూతురుని ఎలా కాపాడుకున్నాడు, చివరికి భార్య(ఓల్గా)ను కలుసుకున్నాడా? అతనితో కలిసి జీవించడానికి ఆమె అంగీకరించిందా? అనేవి ముగింపు సన్నివేశాలు అంతా అజయ్ మయం: ఇది యాక్షన్ సినిమా అని నిరూపించడానికి అవసరానికి మించిన సీన్లు, అంతులేని ఫైట్లు జొప్పించినట్లు అనిపిస్తుంది. తండ్రీకూతుళ్ల అనుబంధమే ప్రధానాంశంగా నడిచే ఈ సినిమాలో ఆయా సీన్లు మాత్రం పేవలంగా కనిపిస్తాయి. 'శివాయ్' కి అసలు ప్రాణం.. ఆసిమ్ బజాజ్ సినిమాటోగ్రఫీ. గ్రాఫిక్స్ తోడ్పాటునిచ్చినప్పటికీ హిమాలయాల్లో ఆయన తీసిన సన్నివేశాలు అద్భుతంగా అనిపిస్తాయి. బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిని ఒకమెట్టు పైకి ఎక్కించిన శివాయ్.. కథ, కథనంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే కచ్చితంగా ముష్కిల్ కి చుక్కలు చూపించిఉండేది.