Ajith Kumar
-
డిజాస్టర్ దిశగా అజిత్ పట్టుదల.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే విడాముయర్చి (తెలుగులో పట్టుదల) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్పై అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అంచనాలను అందుకోవడంపై విఫలమైంది. మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ.22 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. గతేడాది వచ్చిన అజిత్ మూవీ తునివు(తెగింపు) వసూళ్లను మాత్రం విడాముయర్చి అధిగమించలేకపోయింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ రిలీజైన వారం రోజులైనా కేవలం రూ.రూ. 71.3 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. ఏడో రోజు కేవలం రూ. 2.50 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. దీంతో వందకోట్ల నెట్ వసూళ్లు సాధించాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి రెండో వారంలోనైనా విడాముయర్చికి కలిసొస్తుందేమో చూడాలి. అయితే ఈనెల 14న లవర్స్ డే రోజున మరిన్ని కొత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. దీంతో ఈ సినిమాకు తీవ్రమైన పోటీ తప్పేలా లేదుకాగా.. ఈ సినిమాను భారీ ప్రాజెక్ట్ను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కించారు. 1997 అమెరికన్ చిత్రం బ్రేక్డౌన్ ఆధారంగా విడాముయర్చిని రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ అంతా అజర్ బైజాన్లో జరిగింది. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణియన్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
అజిత్ కుమార్ విదాముయార్చి.. ఆ సినిమా కంటే తక్కువగా తొలి రోజు కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి యాక్షన్-థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దేశవ్యాప్తంగా రూ.22 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది.గతేడాది వచ్చిన అజిత్ మూవీ తునివు(తెగింపు) వసూళ్లను మాత్రం విదాముయార్చి అధిగమించలేకపోయింది. తునివు చిత్రం మొదటి రోజే రూ. 24.4 కోట్ల నికర వసూళ్లను సాధించింది. విదాముయార్చి కేవలం రూ.22 కోట్ల నెట్ కలెక్షన్స్కే పరిమితమైంది. అయితే వీకెండ్స్లోనైనా ఈ మూవీ వసూళ్లపరంగా రాణిస్తుందేమోనని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ పరంగా చూస్తే ఉదయం 58.81 శాతం, మధ్యాహ్నం 60.27 శాతం, సాయంత్రం షోలలో 54.79 శాతంగా నమోదైంది. తిరుచ్చి, పాండిచ్చేరిలలో చెన్నై కంటే ఎక్కువగా 92 శాతం, 91.67 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా.. న్నైలో 88.33 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ భారీ బడ్జెట్తో నిర్మించారు. -
అజిత్ మూవీకి షాక్.. కొన్ని గంటల్లోనే ఆన్లైన్లో ప్రత్యక్షం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి అనే సరికొత్త యాక్షన్-థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఒక పక్కా అభిమానులు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. మరోపక్క పైరసీ కేటుగాళ్లు చిత్ర బృందానికి షాకిచ్చారు. విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్టింట్లో అప్లోడ్ చేసేశారు. దీంతో నిర్మాతలతో పాటు అజిత్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొద్ది గంటల్లోనే నెట్టింట ప్రత్యక్షం..అయితే ఈ సినిమాను కూడా పైరసీ భూతం వదల్లేదు. విదాముయార్చి థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల్లోనే నెట్టింట దర్శనమిచ్చింది. కొన్ని పైరసీ వెబ్ సైట్స్లో ఈ సినిమా కనిపించింది. దాదాపు నాలుగైదు వెబ్సైట్స్లో విదాముయార్తి ఫుల్ మూవీని అప్లోడ్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని.. టికెట్ కొని సినిమా చూడమని వేడుకుంటున్నారు. సినిమా రిలీజ్కు ముందే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేసినప్పటికీ పైరసీదారులు అస్సలు పట్టించుకోలేదు.కలెక్షన్లపై తీవ్ర ప్రభావం..విదాముయార్చి పైరసీ బారిన పడడంతో మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రం కావడంతో నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మాణ సంస్థ ముందే విజ్ఞప్తి చేసిన పైరసీకి గురి కావడంతో అజిత్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. భారీ అంచనాలతో రికార్డ్ వసూళ్లు సాధిస్తుందనుకున్న విదాముయార్చికి పైరసీ భూతం అడ్డంకిగా మారింది. కాగా.. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కాసాండ్రా కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ మూవీని పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు.Every effort counts! 💪 Say NO to piracy and watch VIDAAMUYARCHI only in theatres! 🤩FEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @trishtrashers @akarjunofficial… pic.twitter.com/WigarpFJ34— Lyca Productions (@LycaProductions) February 5, 2025 -
హద్దులు మీరిన అభిమానం.. థియేటర్లోనే అరాచకం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి (Vidaamuyarchi Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మగిత్ తిరుమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో తలా అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద బాణాసంచా కాలుస్తూ అభిమాన హీరో సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.రిలీజ్ మొదటి రోజు కొందరు ఫ్యాన్స్ మాత్రం ఓవరాక్షన్ చేశారు. ఏకంగా థియేటర్ లోపల బాణాసంచా పేల్చి అరాచకం సృష్టించారు. మరికొందరు అభిమానులైతే థియేటర్ వెలుపల పోలీసులతో గొడవపడ్డారు. కొందరు ఫ్యాన్స్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అగ్నిప్రమాదం జరిగి ఉంటే..అజిత్ కుమార్ ఫ్యాన్స్ చేసిన పనికి నెటిజన్స్ మండిపడుతున్నారు. థియేటర్ వెలుపల బాణాసంచా కాల్చి సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఉంటే మీ అందరి ప్రాణాలు పోయేవని హెచ్చరిస్తున్నారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా హీరోపై అభిమానం ఉండాలే కానీ.. అది ప్రాణాలు తీసేలా ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.Sambavam pannitanuga😭😭😭#VidaaMuyarchi #VidaaMuyarchiBookings https://t.co/GI1XfPHbM3 pic.twitter.com/yvQucbNe82— 𝓐𝓻𝓪𝓿𝓲𝓷𝓭❤️ (@_Aravind_15) February 5, 2025 -
విడాముయర్చి పై చాలా ఆశలే పెట్టుకున్న కోలీవుడ్
-
ఎముకలు కొరికే చలిలో షూటింగ్.. పట్టువదలని విక్రమార్కుడిలా స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి(Vidaamuyarchi Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించగా.. త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్తో నిర్మించింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్లోనూ రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.అయితే ఈ మూవీని అజర్ బైజాన్ అనే దేశంలో చిత్రీకరించారు. ఇందులో కారుతో అజిత్ కుమార్ కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేశారు. ఆ సమయంలో ఓసారి అజిత్ నడుపుతున్న కారు అదుపుతప్పి కిందపడిపోయింది. అజిత్ కుమార్కు కారు రేసింగ్తో రియల్ స్టంట్స్ చేయడమంటే సరదా. అలా సినిమాల్లోనూ డూప్ లేకుండానే రియల్గా కొన్ని సీన్స్ చేస్తుంటారు.తాజాగా విదాముయార్చి ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. విదాముయార్చి షూటింగ్ సమయంలో ఎదురైన పరిస్థితులను వీడియో రూపంలో ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇందులో అజిత్ కుమార్ స్టంట్స్తో పాటు.. ఎముకలు కొరికే చలిలోనూ షూటింగ్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాతావరణం అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఈ మూవీని షూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో మీరు కూడా చూసేయండి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.The toughest challenges forge the greatest triumphs! 🔥 Step behind the scenes of VIDAAMUYARCHI 💪 Pushing limits in the harshest terrains. ⛰️🔗 https://t.co/WPFLwCykLRFEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar… pic.twitter.com/haDfk8fono— Lyca Productions (@LycaProductions) February 3, 2025 -
సందడిగా ఊరే కలిసేనయ్యా...
అజిత్(Ajith Kumar) హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయర్చి’(Vidaamuyarchi). త్రిష హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రెజీనా, అర్జున్, ఆరవ్, నిఖిల్ నాయర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ సినిమా ‘పట్టుదల’ టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ‘సవదీక...’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘సందడిగా ఊరే కలిసేనయ్యా... విడి విడిగా తిరిగే రెండు ఎదలు ఫ్యామిలీగా ఒక్కటయ్యాయయ్యా..’ అన్న లిరిక్స్తో ఈ పాట తెలుగు వెర్షన్ సాగుతుంది. ఈ పాటకు శ్రీ సాయికిరణ్ సంగీతం అందించారు. ఆంటోనీతో కలిసి ఈ చిత్రం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ పాటను పాడారు. -
'పులి బిడ్డ' అంటూ అజిత్ కుమారుడి విజయంపై ప్రశంసలు
కోలీవుడ్ ప్రముఖ హీరో అజిత్ కుమారుడు ఆద్విక్ రన్నింగ్ రేసులో విజయం సాధించి ప్రథమ బహుమతి అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను అజిత్ ((Ajith Kumar)) సతీమణి షాలిని (Shalini) సోషల్మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కారు రేసింగ్లో తండ్రి సత్తా చాటితే.. కుమారుడు రన్నింగ్ రేస్లో దుమ్మురేపుతున్నాడని, అదే రక్తం అంటూ..ఆద్విక్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.అజిత్లాగే ఆయన కుమారుడు అద్విక్కి కూడా క్రీడలంటే చాలా ఆసక్తి. తాజాగా అద్విక్ తమిళనాడు అంతర్ పాఠశాలల క్రీడా పోటీలలో సత్తా చాటాడు. రన్నింగ్ రేస్, రిలే రేసులలో మొదటి స్థానంలో నిలిచి తండ్రికి తగిన కుమారుడని పేరు గడించాడు. ఏకంగా మూడు మెడల్స్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను షాలిని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో అభిమానులు వైరల్ చేస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు పులికి పులినే పుడుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. తండ్రి అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తుంటే.. కుమారుడు పాఠశాల నుంచి తన విజయాలను మొదలు పెట్టాడని చెప్పుకొస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశం గర్వపడేలా మంచి రన్నింగ్ రేసర్ కావాలని ఫ్యాన్స్ ఆశిస్తూ..శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.'అజిత్ కుమార్ రేసింగ్' పేరుతో ఇటీవల ఒక రేసింగ్ టీమ్ను ప్రకటించిన అజిత్.. దుబాయ్ వేదికగా జరిగిన '24హెచ్ దుబాయ్' కారు రేసింగ్లో పాల్గొని విజయాన్ని అందుకున్నారు. పలు దేశాలకు చెందిన రేసర్లతో పోటీపడి హోరా హోరీగా సాగిన ఈ పోటీల్లో ఆయన టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడినప్పటికీ దానిని లెక్కచేయకుండా బరిలోకి దిగినందుకు గాను.. స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డుతో అజిత్ను గౌరవించారు. సినీ పరిశ్రమకు అజిత్ చేసిన సేవలకు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారంతో కేంద్రం గౌరవించింది. తాజాగా ఆయన్ను పద్మభూషణ్తో సత్కరించింది. తన విజయానికి, సంతోషానికి షాలినీ ప్రధాన కారణం అని అవార్డ్ వచ్చిన సందర్భంగా అజిత్ తెలిపారు. ఆయన నటించిన కొత్త సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న తెలుగు,తమిళ్లో విడుదల కానుంది. ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
మా నాన్న బతికుంటే ఇంకా సంతోషంగా ఉండేది: అజిత్ కుమార్
తనకు పద్మభూషణ్ అవార్డ్(padma Bhushan Award) ప్రకటించడంపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్కుమార్ (Ajith Kumar) స్పందించారు. ఈ అవార్డ్ ప్రకటించినందుకు ముందుగా భారత ప్రభుత్వం, సినిమా రంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు చూడటానికి మా నాన్న పి సుబ్రమణ్యం బతికుంటే ఇంకా సంతోషపడే వాడినని అన్నారు. అలాగే నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన తల్లి మోహిని, భార్య షాలిని, పిల్లలు అనౌష్క, ఆద్విక్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.కాగా.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగానికి చెందిన వారిలో అజిత్కుమార్, నందమూరి బాలకృష్ణ, శోభనతో పాటు మరికొందరికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు."భారత రాష్ట్రపతి నుంచి గౌరవ పద్మ అవార్డును స్వీకరిస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపిక చేసిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత స్థాయిలో గుర్తింపు పొందడం, అలాగే దేశానికి నా కృషిని గుర్తించినందుకు కృతజ్ఞుడను. ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. చాలా మంది సమిష్టి కృషి, మద్దతు వల్లే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేరణ, సహకారం, మద్దతు నా ప్రయాణంలో కీలక పాత్ర పోషించాయి " అని అజిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా.. ప్రస్తుతం అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి (Vidaamuyarchi Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్తో నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ చూస్తుంటే మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
అజిత్ కుమార్ విదాముయార్చి.. రెండో లిరికల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie). ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్తో నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కాగా.. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. పతికిచ్చు అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ సాంగ్ అజిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంక్రాంతికి వాయిదా..ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.రేస్ గెలిచిన అజిత్..ఇటీవల దుబాయ్లో జరిగిన 24హెచ్ కారు రేసులో అజిత్ టీమ్ మూడోస్థానంలో నిలిచింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత అజిత్ తిరిగి రేసింగ్కు వచ్చాడు. దీంతో అజిత్ టీమ్పై సినీ తారలు ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన అనంతరం అజిత్ జాతీయజెండా పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.మైత్రి మూవీ మేకర్స్తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. #PATHIKICHU Out Now 💥➡️ https://t.co/BDeqesYfGc#AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/9fDtLofv7h— Ajith Kumar (@ThalaFansClub) January 19, 2025 -
అజిత్ కుమార్ 'విదాముయార్చి'.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తాజా చిత్రం విదాముయార్చి(Vidaamuyarchi Movie). ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్తో నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా అంతా అజర్ బైజాన్లోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో కార్లతో అజిత్ స్టంట్స్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా అర్జున్ సర్జాతో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూస్తుంటే మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.కారు రేస్ గెలిచిన అజిత్..ఇటీవల దుబాయ్లో జరిగిన 24హెచ్ కారు రేసులో అజిత్ టీమ్ మూడోస్థానంలో నిలిచింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత అజిత్ తిరిగి రేసింగ్కు వచ్చాడు. దీంతో అజిత్ టీమ్పై సినీ తారలు ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన అనంతరం అజిత్ జాతీయజెండా పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.అజిత్ కుమార్కు ప్రమాదం..రేసు ప్రారంభానికి ముందే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్లో జరుగుతున్న రేసింగ్లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అజిత్కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.మైత్రి మూవీ మేకర్స్తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. Persistence is the path, Victory is the destination. 💥 The VIDAAMUYARCHI & PATTUDALA Trailer is OUT NOW. ▶️🔗 Tamil - https://t.co/zKlPqI9XGE🔗 Telugu - https://t.co/mYt21igQIsFEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar… pic.twitter.com/wTL2C1tZHP— Lyca Productions (@LycaProductions) January 16, 2025 -
పక్కవాడితో నీకెందుకు.. ముందు నువ్వు బాగుండాలి కదా?: అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అభిమానులను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని ఫ్యాన్స్కు సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్పై ఆయన మాట్లాడారు.అజిత్ మాట్లాడుతూ.. 'ఇతరుల విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. మీరు చేయాల్సిన పనిపై ముందు దృష్టి పెట్టండి. ఇతరుల గురించి ఆలోచిస్తూ మీరు టైన్షన్ తెచ్చుకోకండి. అలాంటి వాటితో మీకేలాంటి ఉపయోగం ఉండదు. ముందు మీ లైఫ్ గురించి ఆలోచించండి. నేను నా అభిమానులకు కూడా ఇదే చెబుతా. సినిమాలు చూడటం వరకు ఓకే.. కానీ జై అజిత్.. జై విజయ్ అంటుంటే జై కొడుతూ ఉంటే నువ్వెప్పుడు బాగుపడతావ్. మీ చూపిస్తున్న ప్రేమకు నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ మీ జీవితం బాగున్న తర్వాతే కదా ఏదైనా. నా ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారని తెలిసినప్పుడే నాకు సంతోషంగా అనిపిస్తుంది' అని అన్నారు.కాగా.. ఇటీవల దుబాయ్ కారు రేసింగ్లో అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. అజిత్ కారు రేసింగ్ గెలవడంపై సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన తర్వాత జాతీయ జెండా పట్టుకుని అజిత్ సంతోషం వ్యక్తం చేశారు. విదాముయార్చి వాయిదా..కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం అజిత్ కుమార్(ajith Kumar) విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఊహించని కారణాలతో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు.మైత్రి మూవీ మేకర్స్తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. -
దుబాయ్ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్
దుబాయ్ కార్ రేసింగ్లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్ కుమార్కు చెందిన టీమ్ ఈ రేస్లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్లో 24హెచ్ కార్ రేసింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా తమిళ స్టార్ శివ కార్తికేయన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు.రేసుకు ముందు ప్రమాదం.. అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్లో జరుగుతున్న రేసింగ్లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.15 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్లో విజయం సాధించింది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్లో పాల్గొంటానని అజిత్ కుమార్ వీడియోను రిలీజ్ చేశారు. మోటార్స్పోర్ట్స్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయని' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్తో అజిత్ కుమార్ జతకట్టారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఈ సినిమాను సమ్మర్లో అంటే ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Big congratulations to you, AK sir, for your perseverance. Proud moment, sir 👏👏 🏆 👍❤️❤️#AjithKumarRacing pic.twitter.com/YQ8HQ7sRW2— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 12, 2025 -
'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం అజిత్ కుమార్(ajith Kumar) విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. కానీ ఊహించని కారణాలతో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు.అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్లో జరుగుతున్న రేసింగ్లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా అజిత్ ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. మోటార్స్పోర్ట్స్ పట్ల తనకున్న ఇష్టాన్ని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. ప్రస్తుతం దుబాయ్లో జరగనున్న 24హెచ్ కారు రేసింగ్లో అజిత్ పాల్గొంటున్నారు.ఈ వీడియోలో అజిత్ మాట్లాడుతూ.. 'నేను చాలా సంతోషంగా ఉన్నా. మోటార్ స్పోర్ట్స్ నా జీవితాంతం ఇష్టమైంది. చాలా మంది అభిమానులు ఇక్కడకు వచ్చారు. మీరందరూ సంతోషం, ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నా. ముందు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని వృథా చేయకండి. బాగా చదవండి. కష్టపడి పనిచేయండి. జీవితంలో మీకు నచ్చినది చేసినప్పుడు విజయం సాధిస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. అంతే కానీ, విజయం సాధించకలేకపోయామని అక్కడే ఆగిపోవద్దు. ఈ ప్రపంచంలో పోటీ చాలా ముఖ్యం. ఎప్పటికైనా మీ సంకల్పం, అంకితభావాన్ని వదులుకోవద్దు. మీ అందరినీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా' అంటూ రిలీజ్ చేశారు.కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయి' అని అన్నారు.కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్లో పోటీపడుతోంది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్లో పాల్గొంటానని అజిత్ తెలిపారు.మైత్రి మూవీ మేకర్స్తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. Ak. My fans Their commitments. pic.twitter.com/5fW17Gghgu— Suresh Chandra (@SureshChandraa) January 11, 2025 -
అజిత్ కుమార్కు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పింది. దుబాయ్లో జరుగుతున్న రేసింగ్లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అజిత్కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంక్రాంతి బరిలో అజిత్..కాగా.. అజిత్ కుమార్ హీరోగా ప్రస్తుతం ‘విడాముయర్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన విడాముయార్చి సినిమా టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ కీలక పాత్రల్లో నటించారు.మైత్రి మూవీ మేకర్స్తో మరో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వేసవిలో రిలీజ్..ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అజిత్పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ మైలురాయిగా నిలుస్తుందిని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీలు కాకపోవడంతో ఏప్రిల్కు రిలీజ్ కానుంది. Ajith Kumar’s massive crash in practise, but he walks away unscathed.Another day in the office … that’s racing!#ajithkumarracing #ajithkumar pic.twitter.com/dH5rQb18z0— Ajithkumar Racing (@Akracingoffl) January 7, 2025 -
లైకాపై అజిత్ ఫ్యాన్స్ ఆగ్రహం
-
తమిళనాడులో 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్.. భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ
సౌత్ ఇండియాలో ఈ సారి సంక్రాంతికి సినీ సంబరాలు గ్యారెంటీ అనిపిస్తోంది. టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో కూడా బరిలోకి చాలా చిత్రాలు ఉన్నా యి. తెలుగులో డాకు మహరాజ్, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు టాప్లో ఉన్నాయి. కానీ, తమిళ్లో నటుడు అజిత్, త్రిష జంటగా నటించిన 'విడాముయర్చి' ప్రధానంగా రేసులో ఉంది. ఈ చిత్రం పొంగల్కు తెరపైకి రానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర విడుదలను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది నటుడు అజిత్ అభిమానులను నిరాశ పరచే విషయమే అవుతుంది.కాగా విడాముయర్చి చిత్రం వాయిదా పడటంతో కొత్తగా మరిన్ని చిత్రాలు సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వం వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అజిత్ సినిమా వాయిదాతో ఇప్పుడు రామ్ చరణ్ చిత్రానికి మరిన్ని థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంది. పొంగల్ రేసులో తమిళ పెద్ద హీరోలు ఎవరూ లేకపోవడంతో శంకర్, రామ్ చరణ్లు అక్కడ గేమ్ ఛేంజర్స్గా నివలనున్నారు. అయితే, ఈ సంక్రాంతి బరిలో నటుడు జయంరవి, నిత్యామీనన్ జంటగా నటించిన 'కాదలిక్క నేనమిలై' చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. మంత్రి ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించింది. అదే విధంగా సంచలన దర్శకుడు బాలా తెరకె క్కించిన వణంగాన్ చిత్రం ఈ నెల 10న తెరపైకి రానుంది. నటుడు అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సురేశ్కామాక్షీ భారీ ఎత్తున నిర్మించారు.ఇకపోతే వీటంన్నిటిలో భారీ బడ్జెట్ సినిమాగా శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్పైనే కోలీవుడ్ అభిమానులు ఉన్నారు. సంక్రాంతి బరి నుంచి అజిత్ నటించిన విడాముయర్చి తప్పుకోవడంతో రామ్చరణ్ గేమ్ ఛేంజర్కు భారీ ప్లస్ అవుతుందని చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే సంక్రాంతి చిత్రాల్లో ఈ రెండు చిత్రాలపైనే భారీ అంచనాలు ఇప్పటి వరకు ఉన్నాయి. చివరి క్షణంలో అజిత్ తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్కు కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్తో కోలీవుడ్ సినీ అభిమానులకు చరణ్ దగ్గరయ్యాడు. ఇప్పుడు అక్కడ పెద్ద సినిమాలు లేవు కాబట్టి గేమ్ ఛేంజర్కు భారీ ఓపెనింగ్స్ ఉండే ఛాన్స్ ఉంది. -
యాక్షన్ ఎంటర్టైనర్
అజిత్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయర్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించగా, అర్జున్ ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించారు. కాగా ఈ మూవీ నుంచి ‘సవదీక..’ అంటూ సాగే ఫాస్ట్ బీట్ ఎనర్జిటిక్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను అరివు రాయగా, ఆంథోని దాసన్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘విడాముయర్చి’. అజిత్, త్రిషలపై వచ్చే ఈ పాట ఎనర్జిటిక్గా సాగుతుంది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేరా: ఓం ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: సుబ్రమణియన్ నారాయణన్. -
అజిత్ యాక్షన్ మూవీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, త్రిష జంటగా నటిస్తోన్న చిత్రం విడాముయార్చి. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.#Sawadeeka 🕺💃⚡️ https://t.co/Pm5XIZtP2LHappy New Year and love you all 🎉🎉🎉Dearest AK sir #MagizhThirumeni @trishtrashers Sung by @anthonydaasan 🎙️Written by @Arivubeing ✍🏻Choreography by @kayoas13 🕺#Vidaamuyarchi #EffortsNeverFail@LycaProductions #Subaskaran…— Anirudh Ravichander (@anirudhofficial) December 27, 2024ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. సవాదికా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ప్రస్తుతానికి కేవలం తమిళ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, ఆరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
పీవీ సింధు రిసెప్షన్లో సినీ స్టార్స్.. చిరు, అజిత్తో పాటు
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu).. రీసెంట్గా వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా.. హైదరాబాద్లో రిసెప్షన్ వేడుకని అంగరంగ వైభవంగా చేశారు. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది విచ్చేశారు. సినీ సెలబ్రిటీలు మాత్రం తెలుగు, తమిళ స్టార్స్ విచ్చేశారు.(ఇదీ చదవండి: Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు)టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి(Chiranjeevi), నాగార్జునతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకుర్ (Mrunal Thakur).. సింధు రిసెప్షన్లో సందడి చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) ఏకంగా ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లందరితో పాటు ఉపాసన కూడా సింధుని ఆశీర్వదించేందుకు రిసెప్షన్కి వచ్చింది.గత ఆదివారం రాత్రి రాజస్థాన్లోని ఉదయ్పుర్లో పీవీ సింధు వివాహం గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. సింధు పెళ్లాడిన వెంకట్ దత్త సాయి (Venkat Datta Sai) బడా వ్యాపారవేత్త కావడం విశేషం.(ఇదీ చదవండి: ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నెంబర్ అడిగారు: వరుణ్ ధావన్)Boss❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 at #PVSindhuWedding Reception 🥳 @KChiruTweets #MegaStarChiranjeevi Congratulations 💐@Pvsindhu1 pic.twitter.com/Vobmc1K8l1— Team Chiru Vijayawada (@SuryaKonidela) December 24, 2024#akkineninagarjuna at #pvsindhu wedding reception #nagarjuna #PVSindhuWedding pic.twitter.com/tTVQc3h6vs— Cinema Factory (@Cinema__Factory) December 24, 2024#MrunalThakur with #PVSindhu and #VenkatDatta at their wedding reception 💙 pic.twitter.com/vqh005nHlF— y. (@yaaro__oruvan) December 24, 2024AK Family ❤️#Ajith | #Ajithkumar | #AK | #VidaaMuyarchi | #GoodBadUgly | #PVSindhu pic.twitter.com/1i5hvSUWC2— vanakkam world (@VanakkamWorld) December 24, 2024 -
ఈ స్టార్ హీరో ఓ సాహసి.. స్పెయిన్ బార్సిలోనా ఎఫ్ 1 రేసులో అజిత్ కుమార్ (ఫొటోస్)
-
ఏంది స్వామీ ఆ స్పీడు.. అదేం షూటింగ్ కాదు..కాస్తా తగ్గించు!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం విడాముయార్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్దత్ కీ రోల్ పోషిస్తున్నారు.ఇదిలా ఉండగా.. అజిత్కు కారు, బైక్ రేసులు అంటే మహా సరదా. కాస్తా షూటింగ్ విరామం దొరికితే చాలు.. బైక్ రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. సినిమాలకు కాస్తా గ్యాప్ రావడంతో తాజాగా తన లగ్జరీ కారుతో రైడ్కు వెళ్లారు. ఆడి కారులో ఏకంగా 234 కిమీ స్పీడ్తో డ్రైవ్ చేస్తూ కనిపించారు. అయితే సీటు బెల్ట్ కూడా లేకుండా.. ఏమాత్రం భయం లేకుండా అంత స్పీడులో అజిత్ కారును నడపడం విశేషం.అయితే ఇది చూసిన అజిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి స్టంట్స్ చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. రోల్ మోడల్గా ఉన్న మిమ్మల్ని చూసి యువత అదే స్పీడులో వెళ్లితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ కారును నడిపింది ఇండియాలోనా లేదా విదేశాల్లోనా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సీటు బెల్ట్ లేకుండా అంత వేగంతో వెళ్తే మనదేశంలో అయితే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా అన్నదే డౌటానుమానం. ఏదేమైనా కారు అంత స్పీడుతో నడపడం మంచిది కాదని చాలామంది నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. New video of #Ajithkumar during the racing🏎️Speed👀🔥pic.twitter.com/Qsyi6BYtgZ— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2024 -
ప్రొ కబడ్డీ లీగ్లో 118 మంది
ముంబై: రెండు రోజుల పాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంపాట ముగిసింది. మొత్తం 118 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోగా... తొలిరోజు రూ.2 కోట్లయినా వెచ్చించేందుకు వెనుకాడని ఫ్రాంచైజీలు రెండో రోజు మాత్రం పెద్దగా ఎగబడలేదు. శుక్రవారం ‘సి’, ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహించగా ఏ ఒక్కరు రూ. కోటి దాకా వెళ్లలేకపోయారు. రెయిడర్ అజిత్ కుమార్కు అత్యధికంగా రూ. 66 లక్షలు దక్కాయి. రెండో రోజు వేలంలో ఇదే పెద్ద మొత్తం కాగా, పుణేరి పల్టన్ ఆ రెయిడర్ను దక్కించుకుంది. జై భగవాన్ను రూ. 63 లక్షలకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. వీరిద్దరితో పాటు ‘సి’ కేటగిరీలో మరో ఇద్దరు రూ.అరకోటి మార్క్ దాటారు. ఆల్రౌండర్ గుర్దీప్ను రూ. 59 లక్షలకు, డిఫెండర్ దీపక్ రాజేందర్ సింగ్ను రూ. 50 లక్షలకు పట్నా పైరేట్స్ పైరేట్స్ కొనుక్కుంది. ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో రెయిడర్ అర్జున్ రాఠికి అత్యధికంగా రూ.41 లక్షలు లభించాయి. బెంగాల్ వారియర్స్ అతన్ని చేజిక్కించుకోగా, ఆ తర్వాత ఇంకెవరూ ఈ జాబితాలో కనీసం రూ.20 లక్షలైనా పొందలేకపోయారు. డిఫెండర్ మొహ్మద్ అమన్ను రూ.16.20 లక్షలకు పుణేరి పల్టన్, రెయిడర్ స్టువర్ట్ సింగ్ను రూ.14.20 లక్షలకు యు ముంబా జట్లు తీసుకున్నాయి. మొత్తం మీద ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఇద్దరు ప్లేయర్లు సచిన్ (రూ.2.15 కోట్లు; తమిళ్ తలైవాస్), మొహమ్మద్ రెజా (రూ.2.07 కోట్లు; హరియాణా) రెండు కోట్లపైచిలుకు అమ్ముడయ్యారు.ఆరు మందికి రూ.కోటికి పైగా మొత్తం లభించింది. ఇక 12 ఫ్రాంచైజీల్లో ఆటగాళ్ల కోసం అత్యధికంగా హరియాణా స్టీలర్స్ ఫ్రాంచైజీ దాదాపు రూ. ఐదు కోట్లు (రూ.4.99 కోట్లు) ఖర్చు చేసింది. -
స్టైలిష్ యాక్షన్
అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ‘‘స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న మూవీ ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది.ఈ కీలకమైన షెడ్యూల్లో అజిత్తోపాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్కి అనూహ్యమైన స్పందన వచ్చింది. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రోజుకి 21 గంటల పాటు షూటింగ్లోనే.. బిజీ, బిజీగా తమిళ హీరో అజిత్..