ATA
-
ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-28 ఎన్నికల ఫలితాలు : సరికొత్త చరిత్ర
అమెరికన్ తెలుగు అసోసియేషన్ -బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-2028 పదవీ కాలానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు రికార్డ్ సృష్టించాయి. ఆటా చరిత్రలోనే ఫస్ట్ టైం నాన్ స్లేట్ మెంబర్స్ ఆధిక్యం కనబరిచారు. లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో 9 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు గాను, ఆటా ఎలక్షన్ కమిటీ రికమెండ్ చేసిన నలుగురు స్లేట్ అభ్యర్థులు గెలుపొందారు. ఐదుగురు నాన్ స్లేట్ అభ్యర్థులు విజయ ఢంకా మోగించి.. ప్రత్యేకతను చాటారు. స్లేట్ నుంచి గెలిచిన వారిలో న్యూజెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం , అట్లాంటా వాసి శ్రీధర్ తిరుపతి , హ్యూస్టన్ వాసి శ్రీధర్ కంచరకుంట్ల , వర్జీనియా వాసి సుధీర్ బండారు ఉన్నారు.నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజిల్స్ వాసి విజయ్ రెడ్డి తూపల్లి , చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర RV రెడ్డి విజయం సాధించించారు. నాన్ స్లేట్ నుంచి గెలిచిన వారిలో విజయ్ కుందూర్ - న్యూజెర్సీ, విష్ణు మాధవరం- వర్జీనియా, శ్రీనివాస్ శ్రీరామ - అట్లాంటా ఉన్నారు.న్యూ జెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. సంతోష్ కోరం ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ నుంచి రెండు వైపులా ఓటర్లను ఆకర్షించి.. తన ప్రత్యేకతను చాటుకున్నారు.నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజిల్స్ వాసి విజయ్ రెడ్డి తూపల్లి, చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర RV రెడ్డి విజయ ఢంకా మోగించారు. వీరి గెలుపుతోనే ఆటా చరిత్రలోనే మొట్టమొదటిసారి నాన్ స్లేట్ అభ్యర్థుల హవా కనబడింది. గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో ముగ్గురు కాశీ విశ్వనాథ రెడ్డి కొత్త, రామ్ మట్టపల్లి, శ్రీధర్ బాణాల.. స్లేట్ నుంచి గెలిచారు. ప్యాట్రన్ కేటగిరీలో ఒకరు స్లేట్ నుంచి, ఇద్దరు నాన్ స్లేట్ నుంచి గెలిచారు. శారద సింగిరెడ్డి, రవీందర్ కె. రెడ్డి, వెన్ రెడ్డి ప్యాట్రన్ కేటగిరీలో విజయం సాధించారు. న్యూ జెర్సీ , అట్లాంటా, వర్జీనియా నుండి ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ అభ్యర్థులు గెలపొందడం విశేషం. ఈ ఎన్నికల్లో గెలిచిన వారందిరికీ ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందనలు తెలిపారు. -
ఆటా ఉత్సవాల్లో విజయ్ దేవరకొండ
-
అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18 వ ఆటా కన్వెన్షన్
నవత, యువత, భవిత నినాదంతో తెలుగు వారి అతి పెద్ద పండుగ ఆటా 2024 వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో జూన్ 7 నుండి 9 వరకు అట్లాంటా లో జరిగిన 18వ ఆటా కన్వెన్షన్ కు 18 వేల మంది పైగా హాజరయ్యారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో తొలి రోజు బ్యాంకెట్ సమావేశం జరిగింది. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్, ధ్యాన గురు దాజి, సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, హీరో శ్రీకాంత్, హీరోయిన్ మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ళ భరణి హాజరయ్యారు.జార్జియా రాష్ట్ర అభివృద్ధికి తెలుగు వారి సేవలు అభినందనీయం- జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ జార్జియా రాష్ట్ర అభివృద్ధికి తెలుగు వారు తోడ్పడుతున్నందుకు కొనియాడారు జార్జియా గవర్నర్ బ్రయాన్ కెంప్ . ఇండియా తమకు కీలక భాగస్వామి అన్నారు. ముఖ్యంగా తెలుగు వారి సేవలను ఎప్పటికీ గుర్తుంచు కుంటామని అన్నారు. ఆటా వేడుకల లో జార్జియా గవర్నర్ పాల్గొన్నారు.యువత భవిష్యత్తుకు పెద్దపీటనవత, యువత, భవిత అనే లక్ష్యాలతో ఈ సారి కన్వెన్షన్ నిర్వహించామని ఆటా అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, అధ్యక్షురాలు మధు బొమ్మినేని వెల్లడించారు. చరిత్రను తిరగరాసిన ఈ కన్వెన్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆటా నవల పోటీ లు..త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్ చాలా విన్నూత్నంగా, యువతను ఆకర్షించే విధంగా సాగింది. ఈలల గోలల తో మారు మోగిపోయింది. భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కమిషనర్ హనమంతరావు హాజరయ్యారు. యూత్ కమిటీ సమావేశాలు ఈసారి హై లైట్ గా నిలిచాయి. ఏ ఐ సెమినార్, సెలబ్రిటీలతో క్యూ & ఏ, వివిధ విషయాలపై డిబేట్స్ వినోదాత్మకంగా సాగాయి. ఉమెన్స్ ఫోరమ్ లో మహిళా సాధికారత, గృహ హింస, వంటి అంశాలు చర్చించారు. మెహ్రీన్, దేవరకొండ బ్రదర్స్ తో ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించారు. బిజినెస్ ఫోరంలో రాష్ట్ర మంత్రులు, కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు, తెలంగాణ ఐటీ అడ్వైజర్ రవి తంగిరాల తదితరులు పాల్గొనగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా మోడరేటర్ గా వ్యవహరించారు. ఎప్పుడూ లేని విధంగా బిజినెస్ పిచ్చింగ్ జరిగింది. టెక్నాలజీ, ట్రేడ్ ఫోరంలో ఏ ఐ వంటి అత్యాధునిక విషయాల ప చర్చ జరిగింది. యెన్ ఆర్ ఐ కమిటీ ఇమ్మిగ్రేషన్, టాక్స్, యెన్ ఆర్ ఐ ఇష్యూస్ సెమినార్లు, ఆంధ్రా, తెలంగాణా, అమెరికా పొలిటికల్ ఫోరంలలో వివిధ విషయాలపై చర్చ ఆసక్తిగా సాగింది. సాహిత్య ఫోరమ్ లో కథా సాహిత్యం, సమకాలీన నవల, పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. అష్టావధానం రకరకాల చిక్కుముడులతో రసవత్తరంగా సాగింది. తనికెళ్ళ భరణి, గంగాధర శాస్త్రి ప్రవచనాలు అద్భుతంగా సాగాయి. బ్యూటీ పెజెంట్ వేరే లెవెల్లో ఘనంగా జరిగింది, గెలిచిన వారికి దేవరకొండ బ్రదర్స్ కిరీటాలను అందించారు.జీవిత భాగస్వాములను కోరుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆటా మ్యాట్రిమోనీకి అధిక సంఖ్యలో హాజరయ్యారు. మరోవైపు ప్రధాన కార్యక్రమంలో దాజీ శ్రీ కమలేష్ పటేల్ పాల్గొని ప్రేక్షకులకు సందేశo ఇచ్చారు. థమన్ మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన 17 మందికి ఆటా అవార్డులు ప్రదానం చేశారు. మాజీ అధ్యక్షులు భువనేష్ బూజాల, హరి ప్రసాద్ రెడ్డి లింగాల, రామకృష్ణారెడ్డి ఆల, సాయినాథ్ బోయపల్లి, విజయ్ కుందూరు, రఘువీరారెడ్డిలకు అవార్డులు, ఆటా లైఫ్టైమ్ సర్వీస్ అవార్డును డాక్టర్ రాజేశ్వర్ రావు టేక్మాల్కు అందజేశారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సన్మానం చేశారు. ఆటా మహా సభలు అట్లాంటాలో జరగడం ఇది మూడోసారి. 2000, 2012లో అట్లాంటాలో ఆటా సమావేశాలు జరగగా ఇప్పుడు మళ్లీ పదేళ్ల తరవాత జరిగాయి. కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. -
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్: అదిరిపోయిన ఆరంభం!
ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ జూన్ 7న బ్యాంకెట్తో మొదలయ్యి..మూడు రోజులు వివిధ కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. జార్జియా వరల్డ్ కాంగ్రె సెంటర్ ప్రాంగణం ఈ వేడుకుల కోసం అంత్యంత సుందరంగా ముస్తాబయ్యింది. అట్లాంటాలో ఈ వేడుకలు 2000, 2012లో జరగగా మళ్లీ ఇన్నేళ్లకు జరగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించిన అనంతరం కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఇంతలా దిగ్విజయంగా చేసుకునేందుకు సహకరించిన స్పాన్సర్లను కోర్ కమిటీ తోపాటు ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీలు ఘనంగా సత్కరించారు. ఇక ఆటా అవార్డ్స్ కమిటీ వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలు చూపించిన వారికి అవార్డులు ప్రదానం చేసింది. ఈ వేడుకలో జరిగిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు దుద్దిళ్ల, సినీ నటులు శ్రీకాంత్, మెహ్రీన్, నేహా షెట్టి, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ రెడ్డి వంగా వంటి పలువురు విశిష్ట అతిథులు ఆటా వారి ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలియ జేసి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనూప్ రూబెన్స్ బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఉర్రూతలూగించింది. రుచికరమైన భోజనాలు అందరి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయి. ఇక ఈ వేడుకలో యూత్ కాన్ఫరెన్స్ హైటెట్గా నిలిచింది. ఎక్కడెక్కడ నుంచే పెద్ద ఎత్తున యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ ఆటా నవత, యువత, భవితకు ఆటా పెద్ద పీట వేస్తుందంటూ దీని ప్రాముఖ్యత గురించి వివరించారు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఇంకా ఎన్నో ఆకట్టుకునే అలాగే అట్లాంటా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుండి పలు నాన్ ప్రాఫిట్ సంస్థల నుంచి ఎంతో మంది వచ్చారు. వారందరికీ కన్వీనర్ కిరణ్ పాశం అభినందనలు తెలిపి, ఈ కన్వెన్షన్ ఎలా మొదలయ్యిందీ, ఎంత మంది పాటుపడ్డారు, వాలంటీర్ల కృషి మున్నగు వివరాలు గురించి వివరించారు. ఆటా టీం గౌరవ అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసి, సముచితంగా సత్కరించారు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేసుకుని అందరం కలిసి పాల్గొని ఆనందిద్దాం అని అన్నారు కన్వీనర్ కిరణ్ పాశం.(చదవండి: 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!) -
మహేష్ బాబు గురించి చెప్పిన శ్రీమంతుడు నటి
-
18వ ఆటా మహాసభల్లో మెహ్రీన్ సందడి
-
అట్లాంటాలో తెలుగువారిని చూసి శ్రీకాంత్ సంతోషం
-
బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్న జబర్దస్త్ ఐశ్వర్య
-
అట్లాంటాలో ఘనంగా ఆటా బాంక్వెట్ వేడుకలు
-
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!
ఇక్కడ రెండు మూడు రోజులుగా వార్ రూమ్ అంటుంటే అర్థం కాలేదు. వెళ్లి చూస్తే, ఆటా నాయకులు కూర్చుని, రకరకాల కమిటీలతో, వెండర్లతో, వేరే టీంలతో మాట్లాడుతున్నారు, చర్చించుకుంటున్నారు, ఫోనుల్లో మాట్లాడుతున్నారు, వీడియో కాన్ఫరెన్సులు నడుస్తున్నాయి... అప్పుడు అర్థం అయ్యిందేమంటే.. జనతా గ్యారేజ్ సినిమాలాగా, 'ఇచ్చట అన్ని రకముల సమస్యలకు పరిష్కారం చూపబడును' అని. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఆటా వారు ఏ లెవెల్లో రెడీ అవుతున్నారో. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ బాబు దుద్దిళ్ల, భద్రాద్రి పండితులు, సినిమా వారు మెహ్రీన్, థమన్, అనూప్ రూబెన్స్, అంకిత, రోహిత్, సత్య మాస్టర్ వంటి ఎందరో విచ్చేశారు. మరి కొందరు బయలుదేరి, విహంగ వీక్షణ చేస్తున్నారు. వేరే ఊర్ల నుంచి ఆటా నాయకులు ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, అజయ్, నర్సిరెడ్డి గడ్డికొప్పుల ఏతెంచారు. మిగతా వాళ్లు ఆన్ ది వే. అలానే, దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి, హోటళ్ళలోనో, బంధువుల ఇళ్లలోనో ఉంటున్నారు. కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా, అట్లాంటా మేయర్, కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, ఇక్కడి దేశీయ నాయకులు ఇలా చాలా మంది వేంచేయబోతున్నారు. వేరే వేరే నాన్ ప్రాఫిట్, సంస్థలు, మీడియా సంస్థల నుంచి చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ అట్లాంటాలో ఈ శుక్రవారం, జూన్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ శుక్రవారం సాయంత్రం బ్యాంకెట్లో వివిధ రంగాలలో నిష్ణాతులకు ఆటా సాఫల్య అవార్డులు ప్రధానం చేస్తారు. ఇక శని, ఆదివారాలలో ఝుమ్మంది నాదం అంటూ పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు, ఆత్మ విశ్వాసం కోసం పెజంట్, ధ్యానం గురు దాజి ఉపన్యాసం, భద్రాద్రి కళ్యాణం, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ పోటీలు, దడదడలాడించే అనూప్ రూబెన్స్, థమన్, త్రీఓరీ మ్యూజికల్ కాన్సర్ట్లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, ఉమెన్స్ ఫోరమ్, అమెరికా, భారత దేశాల పొలిటికల్ ఫోరంలు, అల్యూమిని మీటింగులు, బిజినెస్ ఫోరంలు, సాహిత్య విభావరి, అష్టావధానం, లైఫ్ టైం అవార్డులు, ఆత్మీయ సత్కారాలు, వెండర్ స్టాల్ల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యువత గురించి సరే సరి.. వారికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే..మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆటా వారు. మరి ఇన్ని వినోదాలు, విశేషాలు ఒకే చోట ఉంటే, ఆలస్యం ఎందుకూ..? టిక్కెట్ల గడువు కూడా ముగియనుంది. వివిధ కాన్ఫరెన్స్ వివరాల కోసం www.ataconference.orgని, టిక్కెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registrationని సందర్శించండి. ఆటా కమ్యూనిటీ రీచ్ సందర్భంగా అట్లాంటాతో పాటు వేర్వేరు నగరాలలో సమావేశాలు నిర్వహించారు, ఎంతోమంది రావడానికి ఉత్సాహం చూపించారు. అలానే, టాలీవుడ్ తారలతో కమ్యూనిటీ వార్కు 300 మందికి పైగా విచ్చేయడం హర్షణీయం. విశిష్ట అతిథులతో ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే మొదలయ్యాయి. కన్వెన్షన్ కోర్ టీం కన్వీనర్ కిరణ్ పాశం, అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలలో 500 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంత కృషికి తగ్గ అజరామర ఫలితాలు త్వరలో చూడనున్నాం. కన్వీనర్ కిరణ్ పాశం మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా పనులు పూర్తి అయ్యాయి., ప్రపంచమంతా ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ముఖ్యంగా యువత ఆటాకి ఎంతో ముఖ్యమనీ, వారికి చాలా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. కావున అందరూ ఈ కార్యక్రమానికిచ్చేసి జయప్రదం చేయాలని అన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని జార్జియా గవర్నర్ సందేశం అందరికీ వినిపించి.. జరగబోయే స్పిరిట్యుయల్, కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత వివరించారు. ఎంతో మంది ఈ కార్యన్ని జయప్రదం చేసేందుకు ఆహర్నిశలూ కష్టపడుతున్నారనిన్నారు. అలాగే చాలా వెండర్ స్టాల్ల్స్, ఎన్నో ఫోరమ్స్ వంటి ఉపయుక్త కార్యక్రమాలు ఉన్నాయనీ చెప్పారు. అందువల్ల ఈ మహా పండుగకు అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. (చదవండి: నాట్స్ నాయకుడి సేవలకు నీతి ఆయోగ్ గుర్తింపు!) -
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
ఈ మధ్య అమెరికాలో అయినా, ఇండియాలో అయినా ఎన్నికల తర్వాత అత్యధికంగా తెలుగు వారు మాట్లాడుకునేది అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ గురించే. దీన్ని ఈ ఏడాది జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో అంగ రంగ వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా నిర్వాహకులు పలు నగరాల్లో నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు. సిరిసిరిమువ్వ సినిమాలోని ‘ఝుమ్మంది నాదం సయ్యంది పాదం’ పాట స్ఫూర్తితో ఈ పోటీలకు ‘సయ్యంది పాదం’ అని ఆటా వారు నామకరణం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా అప్రతిహతంగా సాగుతున్న ఈ పోటీలలో గెలిచిన వారికి బహుమతులతో పాటు, తెలుగు గడ్డపై వివిధ వేదికలలో అవకాశాలు కల్పించడం ఆటా వారికే చెల్లింది. ఇలాంటి పోటీలతో పాటు గత 34 సంవత్సరాలుగా తెలుగు వారికి అన్ని విషయాలలో వెన్ను దున్నుగా ఉంటున్న ఆటా వారు శ్లాఘనీయులు. దాదాపు 15 నగరాలలో ఇప్పటికే 4500 మంది హాజరయ్యారు అంటే.. ఇంక కన్వెన్షన్కి ఎంత మంది వస్తారో ఊహించుకోవచ్చు. ప్రతి సిటీలో భోజనం, టీ, కాఫీ, మంచి నీళ్లు, స్నాక్స్, పండ్లు ఇవ్వడం జరిగింది. అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో అమెరికా నలుమూలలా వేలాదిమంది చరిత్రలో చూడని విధంగా ఈ కన్వెన్ని అట్టహాసంగా నిర్వహించాలని ప్రయాసపడుతున్నారు. అన్ని కార్యక్రమాల వివరములకు www.ataconference.org ని సందర్శించండి.ఇక, సయ్యంది పాదం విషయానికి వస్తే.. ‘కాలు కదుపుదాం, ప్రైజ్ గెలుద్దాం’ అన్న చందాన ఇప్పటికే ఈ నృత్య పోటీలు లాస్ ఏంజెల్స్, నాష్ విల్, రాలీ, అట్లాంటా, డల్లాస్, న్యూ జెర్సీ, ఆస్టిన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డిసి, షార్లెట్, చికాగోలలో జరగగా, ఇంకా పలు నగరాలలో జరగాల్సి వుంది. ప్రతి ఊరిలో దాదాపు 80 నుంచి 120 మంది కళాకారులు పాల్గొనడం గమనార్హం. ఎలా చూసినా, వెయ్యి మందికి పైగా పాల్గొన్న సయ్యంది పాదంలో 7 నుంచి 13 సంవత్సరాల వారు జూనియర్ల విభాగంలో, 14 ఆపై వారు సీనియర్ల విభాగంలో క్లాసికల్, నాన్ క్లాసికల్, సోలో, గ్రూప్ వంటి విభిన్న పోటీలలో ఎందరో పాల్గొని, తమ సత్తా చాటారు. యాంకర్లు ఉత్సాహంగా నడిపించగా, జడ్జీలకు డాన్సర్లు తమ నృత్య కౌశల్యంతో సవాలు విసిరారు. అన్ని విభాగాలలో మొదటి, రెండో స్థానంలో నిలిచిన వారికి ఆటా కన్వెన్షన్ ఫైనల్స్లో పాల్గొనే అవకాశం ఇవ్వడమే కాకుండా, టిక్కెట్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు ఇచ్చారు.సయ్యంటే సై అన్నట్టుగా సాగిన ఈ కార్యక్రమానికి ఛైర్ శృతి చిట్టూరి అంకిత భావంతో పని చేస్తూ, అందరికీ దిశానిర్దేశం చేశారు. అలానే, అడ్వైజర్ రాజు కాకర్ల, కో ఛైర్ వాణి గడ్డం, మెంబర్లు గౌరీ కారుమంచి, రజనీకాంత్ దాడి, చిట్టి అడబాల అఖండ కృషి అభినందనీయం. సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనం, కమ్మని భోజనం ప్రతి ఊరిలో ఏర్పాటు చేశారు. అట్లాంటా నుంచి సందీప్ రెడ్డి, నీలిమ గడ్డమణుగు, కిషన్ దేవునూరి, ఉదయ ఈటూరి, శ్రావణి రాచకుళ్ల, మాధవి దాస్యం, జయచంద్రా రెడ్డి, నిరంజన్ పొద్దుటూరి, గణేష్ కాసం, రాలీ నుంచి శృతి ఛామల, రాధా కంచర్ల, కీర్తి ఎర్రబెల్లి, అజిత చీకటి, పవిత్ర రత్నావత్, షాలిని కల్వకుంట్ల, శ్రీదేవి కటిక, రజని త్రిపురారి, నాష్ విల్ నుంచి రామకృష్ణా రెడ్డి అల, కిశోర్ గూడూరు, నరేంద్ర నూకల, సుశీల్ చండ, క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండ, లావణ్య నూకల, బిందు మాధవి చండ, షార్లెట్ నుంచి వెంకట రంగారెడ్డి సబ్బసాని, క్రాంతి ఏళ్ళ, సునీత నూకల ఇలా ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి ఎంతో కృషి చేశారు.ఈ కార్యక్రమాలు పలు నగరాలలో విజయ దుందుభి మ్రోగించడానికి సహకరించిన స్పాన్సర్లకు, జడ్జీలకు, ఆటా టీం, వాలంటీర్లు, ఆహుతులు, ఫోటో మరియు వీడియో గ్రాఫర్లకు, డీ జె, వెన్యూ. రెస్టారెంట్లకు, డెకొరేషన్ వారికి ఇలా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగనున్నాయి. అంతేగాక చాలామంది సెలెబ్రిటీస్ ఇండియా నుంచి రానున్నారు. తామెల్లరూ ఈ కన్వెన్షన్కి విచ్చేసి విజ్ఞాన, వివేక, వినోదాలలో భాగం కండి. ప్రతి వారం మరిన్ని వివరములతో మీ ముందుకు వస్తుంటాము. అని ఆటా కన్వెన్షన్ నిర్వాహకులు చెబుతున్నారు. (చదవండి: అమెరికన్ల పేర్లు, ఇంటిపేర్ల కథ.. కమామీషు !) -
Ugadi 2024: ఆన్లైన్లో ఆటా సాహిత్య వేదిక ఉగాది వేడుకలు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న అంతర్జాలం వేదికగా శారద సింగిరెడ్డి సారథ్యంలో నిర్వహించిన శ్రీ క్రోధి నామ సంవత్సర "తెలుగు వసంతం" సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆకట్టుకుంది. త్రిభాషా మహాసహస్రావధాని , ప్రణవ పీఠాధిపతులు వద్దిపర్తి పద్మాకర్, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సాహిత్య పరిషత్తు ప్రాంత అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, శృంగేరి శారదా పీఠ ఆస్తాన పౌరాణికులు డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ, అవుసుల భానుప్రకాష్ అవధాని , అధ్యక్షులు సాహితీ గౌతమి కరీంనగర్ శ్రీ నంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గణనాథుని కీర్తనతో రాలీ,నార్త్ కరోలీనా నుండి వైభవ్ గరిమెళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా , విశిష్ఠ అతిథుల వినోదభరిత విజ్ఞాన విశ్లేషణ, చతురత ఇమిడిన బోధన , సంస్కార సాంప్రదాయ సమ్మిళిత సుభాషిత సందేశాలతో రాశి ఫలాలు , పంచాంగ శ్రవణం, పద్య గద్య గాన ప్రసంగాదులతో ఆద్యంతం హృద్యంగా సాగిన ఈ సాహితీ కార్యక్రమం ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలందుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మధు బొమ్మినేని పేరు పేరునా ప్రత్యేక అభినందనలను తెలిపారు. అలాగే 2024 సంవత్సరం అట్లాంటా లో జూన్ 7,8,9 తేదీలలో జరుగ నున్న18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్కు అందరికీ పేరుపేరున సాదర ఆహ్వానాన్ని పలికారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమానికి నంది శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా అతిథులందరూ ఉత్సాహంగా గడిపారు. చివరిగా ఆటా లిటరరీ సభ్యులు మాధవి దాస్యం విశిష్ఠ అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఆటా ప్రతినిధుల ఆహ్వానం!
ఆటా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆటా కన్వెన్షన్ ఆహ్వానం అందించారు. ఈ ఏడాది జూన్ 7, 8, 9 తేదీలలో అమెరికాలోని అట్లాంటాలో ఆటా తెలుగు కన్వెన్షన్ భారీ ఎత్తున జరగనుంది. ఈ వేడుకలను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆటా ప్రతినిధులు ఆటా తెలుగు కన్వెన్షన్ అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. అందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అమెరికాలో వున్న తెలుగు వాళ్ళను కలవడానికి తప్పకుండా వస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన వారిలో కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, కో ఆర్డినేటర్ వశిష్ఠ్ రెడ్డి తదితరులు వున్నారు. కాగా, ఆటా సంస్థ సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంది. ఆటా నేతృత్వంలో చాలా మందికి సాయం అందించారు. ఇలాగే గతేడాది ఆటా కన్వెన్షన్ డిసెంబర్ నెలలో 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవ కార్యక్రమాలు చేసిన విషయం విదితమే. (చదవండి: సింగపూర్లో తమిళ వైభవం..ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!) -
న్యూ జెర్సీలో ఆటా బిజినెస్ సెమినార్, కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్
న్యూ జెర్సీ లో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా బిజినెస్ సెమినార్ మరియు కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూ జెర్సీ న్యూయార్క్ టీం సాయంతో.. అట్లాంటాలో జరుగనున్న 18th ఆటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించారు. ఆట అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ఎలెక్ట్ జయంత్ చర్ల , పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, ఫిలడెల్ఫియా ట్రస్టీ రాజ్ కక్కెర్ల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ATA న్యూజెర్సీ , న్యూయార్క్ టీం - కార్ప్రేట్ చైర్ హరీష్ బథిని, కో చైర్ ప్రదీప్ కట్టా మరియు ఫైనాన్స్ కమిటీ చైర్ శ్రీకాంత్ గుడిపాటి , కో చైర్ శ్రీకాంత్ తుమ్మలతో పాటు రీజనల్ కోరినేటర్లు సంతోష్ కోరం , ధనరాజ్, రీజినల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల, మహిళల రీజినల్ కో-ఆర్డినేటర్ గీతా గంగుల, తదితరుల సహాయంతో బిజినెస్ సెమినార్ మరియు నిధుల సేకరణను విజయవంతంగా నిర్వహించారు. అట్లాంటాలో జరిగిన ఆటా (ATA) కాన్ఫరెన్స్ కోసం 636k పైగా 175 కార్పొరేట్ స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించినట్లు సభ్యులు తెలిపారు. అలాగే న్యూజెర్సీ & న్యూయార్క్ బృందం అట్లాంటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా దాతల ప్రతిజ్ఞలను సేకరించిందని పేర్కొన్నారు. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు జరిగే ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు పిలుపునిచ్చారు. -
రవీంద్రభారతిలో ఘనంగా ఆటా గ్రాండ్ ఫినాలే వేడుకలు (ఫొటోలు)
-
ఆటా ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్
-
ఆటా ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ఘనంగా సేవ కార్యక్రమాలు!
ఆటా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామచేని, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ...1991లో ఏర్పాటైన ఆటా సంస్థ గత 31 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ 1మిలియన్కి పైగా తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని అన్నారు. అలాగే ప్రతి రెండేళ్లకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో 15 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 2024 జూన్ 7,8,9 తేదీలలో అమెరికాలో అట్లాంటా నగరంలో జరగనున్న ఆటా సదస్సును నిర్వహిస్తున్నామని, ఆ సదస్సుకి తెలుగు రాష్ట్రాల అన్ని రంగాల ప్రముఖులు హాజరు అవుతారని, ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రఘువీర్ మరిపెద్ది, రాజ్ కక్కెర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, సినీ నటుడు, కల్చరల్ అడ్వైజరీ లోహిత్, కో ఆర్డినేటర్ శశికాంత్, మీడియా కో ఆర్డినేటర్ వెంకటేశ్వర రావు సిహెచ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తెలంగాణ చైర్, C. శేఖర్ రెడ్డి, ఆటా బిజినెస్ చైర్ లక్ష్ చేపూరి తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్తో సమావేశమయ్యారు ఈ ఆటా వేడుకలకు ఆమెను ఆహ్వానించారు. అలాగే గవర్నర్ కూడా ఆటా ఆహ్వానాన్ని ఆమోదించారు. (చదవండి: అరబ్ దేశాల పర్యటనలో గురుదేవ్..కాప్ 28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీ శ్రీ రవిశంకర్) -
అట్లాంటాలో 18వ ఆటా మహాసభల సన్నాహాలకు శ్రీకారం!
అమెరికా తెలుగు సంఘం ఆటా ద్వైవార్షికంగా నిర్వహించు 18వ మహాసభలను 2024న జూన్ 7,8, 9 తేదీలలో అట్లాంటాలో అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. అందుకోసం ఈ నెల సెప్టెంబరు 8,9,10తేదీలలో అట్లాంటాలోని మారియట్ హోటల్లో ఆటా బోర్డు సమావేశం, ఫేస్ ఈవెంట్స్ నందు ఆటా18వ మహాసభల కిక్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. సెప్టెంబరు 8న, శుక్రవారం సాయంత్రం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న ఆటా అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, ట్రస్ట్ బోర్ద్ సభ్యులు,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ఆటా అట్లాంటా సభ్యులు మర్యాదపూర్వక స్వాగత సమారోహంతో ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం, అద్వితీయ విందు వినోదాలతో అలరించింది. ఇక సెప్టెంబర్ 9 శనివారం ఉదయం 9 గంటలకు బోర్డు సమావేశం గణనాథుని ప్రార్థనతో ఆరంభమయి, ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని సారథ్యంలో, ఉపాధ్యక్షులు జయంత్ చల్లా ,పూర్వ అధ్యక్షులు భువనేష్ బుజాల,హనుమంత్ రెడ్డి,కరుణాకర్ మాధవరం,సుధాకర్ పెరికారి మరియు పరమేష్ భీమ్రెడ్డి, కార్యదర్శి రామకృష్ణ రెడ్డి ఆల, కోశాధికారి సతీష్ రెడ్డి, సంయుక్త కోశాధికారి రవీందర్ గూడూర్, ట్రస్ట్ బోర్ద్ సభ్యుల,రీజనల్ అడ్వైజర్స్, రీజనల్ కోఆర్దినేటర్స్, వుమెన్ కోఆర్దినేటర్స్, స్టాండింగ్ కమిటీస్, ఆటా అడ్వైజర్స్ మరియు అట్లాంటా ఆటా బృందం ఆధ్వర్యంలో నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు. ఆటా సభ్యుల ప్రోత్సాహభరిత సందేశాలు , మౌలిక సదుపాయాల చర్చ, ఆవశ్యక సేవా కార్యక్రమాలు, భారత దేశంలో డిసెంబర్ నెలలో జరుగు ఆటా వేడుకల చర్చలు, ఆమెరికన్ తెలంగాణ సొసైటి (ఏటీఎస్) సంస్థ విలీనం , సమావేశ సభ్యుల పరిచయం, మహాసభల తాత్కాలిక అడ్హాక్ బృందం ప్రకటన, ఆర్థిక సేవా అభివృద్ధి సంబంధిత అజెండా, రానున్న బోర్డు సమావేశపు కీలక నిర్ణయాలు, వంటి పలు కీలక అంశాల అధ్యయనంతో ప్రభావాన్వితంగా సాగడం హర్షణీయం. ఆటా 18వ సభల కొరకు నియామికమైన కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం,కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోదిరెడ్డి నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదినిలు ప్రసంగిస్తూ అట్లాంటా తరుపున అందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఆటా సభలకుగాను అందరి సహాయసహకారాలను సవినయంగా కోరుతూ, సభలను గూర్చి పలు అంశాల వివరణ అందించారు. ఆటా మ్యాట్రిమోని కమిటీ కో-చైర్ రమేష్ నల్లవోలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అట్లాంటాలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసారు. వధూవరులు, తల్లితండ్రులు, మిత్రులు సుమారు 50 కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం కమ్మని విందుతో బోర్డు సమావేశం సంపూర్ణం అయ్యింది. మధ్యాహ్నం ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, ఆటా 18వ కాన్ఫరెన్స్ బృందం , ట్రస్ట్ బోర్ద్ సభ్యులు, అట్లాంటా ఆటా బృందం 18వ మహాసభలను నిర్వహించు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్(జీడబ్ల్యూసీసీ)ని సందర్శించి అట్లాంటా నగర వీధుల్లో ప్రత్యేక సందడి చేసారు. సాయంత్రం 7 గంటలకు అట్లాంటాలోని ఫేస్ ఈవెంట్స్లో కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ సమావేశం అధ్యక్షురాలు మధు బొమ్మినేని అట్లాంటా కోర్ సభ్యుల చేత సాంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకోగా గణనాథుని ఆరాధనతో శుభారంభమయ్యింది. ఆ శుభవేళ కళారాధనతో మొదలైన నీలిమ గడ్డమనుగు నేపథ్యంలో వివిధ శాస్త్రీయ జానపద , చలన చిత్ర గీతికల నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమాలతో ఆద్యంతం సభాసదుల అలరించింది. ఆటా 18వ కాన్ఫరెన్స్ లోగో ను ఇటీవల ఎన్నికైన అమెరికా క్రికెట్ బోర్డ్ చైర్మన్ మరియు పూర్వ ట్రస్ట్ బోర్ద్ సభ్యులు వేణు పీసీకే ఆవిష్కరించగా, మధు బొమ్మినేని, జయంత్ చల్లా కిరణ్, పాశం వేణు పీసీకేను సన్మానించారు. మధు బొమ్మినేని కాన్ఫరెన్స్ సాంగ్ ఆవిష్కరించగా ప్రసిద్ధ గాయకులు, అద్భుత సంగీత సహకారాన్ని అందించిన దర్శకులు మల్లికార్జున సాహిత్య సహకారం అందించిన మాధవి దాస్యంలను అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందించగా సభాసదులు ప్రతిధ్వనించు హర్షధ్వానాలతో ఆటా సభ అడ్హాక్ సభ్యులను, సలహాదారులను, పూర్వ అధ్యక్షులను, స్పాన్సర్సను హర్షధ్వానాలతో సత్కరించారు. ఈ సాయంకాలం సుమారు 600 గౌరవ అతిథులతో కార్యక్రమం ఆద్యంతం మధురానుభూతులతో ఉల్లాసభరితంగా కొనసాగింది. శ్రావణి రాచకుల్ల సారథ్యంలో సుందర నారీమణుల వస్త్రాలంకరణ ప్రదర్శన (ఫ్యాషన్ షో) వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగా నూతన మోహన, జనార్ధన్ పన్నేల గార్ల అద్భుత గానాలాపన మరియు స్థానిక గాయకుల గానాలాపానతో జనరంజకంగా సాగింది ఆ శుభ సాయంకాలం. కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం 18 వ కాన్ఫరెన్స్ కార్యక్రమాలు గురించి తెలుపుతు అందరికీ అభినందనలు తెలియచేశారు. అట్లాంటాలోని స్థానిక తెలుగు సంస్థల TANA, GATA,GATeS, GTA, NATA,NATS,TTA, TDF, TAMA ప్రతినిధులను 18వ ఆటా మహాసభలకు ఆహ్వానించారు. తెలుగు సంస్థల ప్రతినిధులు కూడా 18వ ఆటా మహాసభల విజయవంతంగా సాగడానికి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. అధ్యక్షురాలు మధు బొమ్మినేని తమ స్పందన తెలియచేస్తూ కార్యక్రమం అద్భుతంగా, అద్వితీయంగా కొనసాగడానికి కారకులైన విశిష్ఠ అతిథులకు, గౌరవ అతిథులకు, వదాన్యులకు , యూత్ వాలంటీర్స్కు, అట్లాంటా కోర్ సభ్యులకు, అట్లాంటా కోర్ కాన్ఫరెన్స్ దాతలకు తదితర మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. (చదవండి: ఐటీ అమెరికా నిర్వహించిన ఆత్మీయ సదస్సులో బండి సంజయ్!) -
ఏపీ ఫైబర్ నెట్ ద్వారా మరో సినిమా రిలీజ్.. ఈసారి రూ.39కే
కొత్త సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే కూర్చొని చూసే ఛాన్స్ 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్' రీసెంట్ గానే ప్రారంభించింది. ఈ విషయాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి ఇదివరకే చెప్పారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ 3వ అంతస్తులోని ఫైబర్ నెట్ కార్యాలయంలో 'లవ్ యూ టూ' చిత్ర బృందంతో కలిసి గురువారం పత్రికా సమావేశం నిర్వహించారు. మరో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా నిర్మాతకు, ప్రేక్షకుడికి లాభం కలిగేలా అతి తక్కువ ధరకే తొలిరోజే సినిమాను రాష్ట్ర ప్రజలు ఇంట్లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమాగా ఇప్పటికే 'నిరీక్షణ' అనే చిత్రాన్ని రూ.99కి విడుదల చేశాం. రెండో సినిమాగా 'లవ్ యూ టూ' చిత్రాన్ని కేవలం రూ.39కే జూన్ 16 నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో థియేటర్లలోకి వచ్చే ప్రతి సినిమాను ఏపీ ఫైబర్నెట్ ద్వారా చూసే ఛాన్స్ కల్పిస్తాం. త్వరలో మూరుమూల ప్రాంతాలకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు విస్తరిస్తాం. ఏపీఎస్ఎఫ్ఎల్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్, థియేటర్లకు పోటీ కాదు' అని గౌతంరెడ్డి చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 31 సినిమాలు.. లిస్ట్ ఇదే!) -
డల్లాస్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA బోర్డు సమావేశం
-
అమెరికాలో తెలుగు అమ్మాయిల ఆట.. విజేత నాష్విల్లే రైజర్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం- 2023 వేడుకల్లో భాగంగా టేనస్సీ రాష్ట్రంలోని నాష్విల్లే నగరంలో జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) తొలిసారి మహిళల షార్ట్ క్రికెట్ టోర్నీని ఏప్రిల్ 8, 9 తేదీల్లో విజయవంతంగా నిర్వహించింది. 9 జట్ల మధ్య పోరు ఈ కార్యక్రమంలో 9 మహిళా జట్లు పాల్గొనగా.. సుమారు 300 మంది ప్రేక్షకులు వారి ఆటను తిలకించారు. ఈ పోటీలను ఆటా రీజినల్ కో-ఆర్డినేటర్లు క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండతో సహా ఆటా నాష్విల్ టీమ్ సభ్యులు భరద్వాజ్ సామల, సాయి వర్ధన్ రెడ్డి బోడా, అనూష వంగాల, ఆనంద్ రామ్కుమార్, దిగ్విజయ్ వంగల, ప్రశాంతి రాచకొండ, వంశీ కొరిపెల్లి, రాకేష్ బెక్కం, వాలంటీర్లు నిర్వహించారు. రామకృష్ణారెడ్డి ఆల (ఆటా కార్యదర్శి) , కిషోర్రెడ్డి గూడూరు (బీఓటీ సభ్యుడు), సుశీల్ చందా (విద్యాకమిటీ చైర్) , నరేందర్రెడ్డి నూకల ( ప్రాంతీయ సలహాదారుడు) నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. విజేత ఎవరంటే ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నాష్విల్లే రైజర్స్ నిలిచింది. పవర్ గర్ల్స్ రన్నరప్, TNMM రెండో రన్నరప్గాన నిలిచాయి. విజేతలకు ఆటా ట్రోఫీలను అందించింది. అదనంగా, మహిళల అభిరుచి, క్రీడ పట్ల నిబద్ధతను ప్రోత్సహించడానికి ప్రతి జట్టు సభ్యురాలికి పార్టిసిపెంట్ మెడల్స్ అందజేశారు. ఆటా నాష్విల్ బృందం ఆటా ఎగ్జిక్యూటివ్ టీమ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సమాజానికి సేవ చేయడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన ఇండియా బజార్, చాయ్ సమోసా రెస్టారెంట్కు ఆటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. వాళ్ల వల్లే ఇదంతా: డుప్లెసిస్ -
నూతనంగా ఎర్పాటైన ఆటా బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్లోని ది మిరాగ్ లో శనివారిం జరిగిన ఆటా బోర్డు మీటింగ్ లో ప్రస్తుత అధ్యక్షులు భువనేశ్ భూజల చేతుల మీదుగా మధు బొమ్మినేని నూతన అధ్య క్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి యూఎస్ లోని అన్ని ప్రాంతాల నిండి ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. నార్తు కరోలినా ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నిండి ’ఆటా’ లో చురుగ్గా ఉిండడంతో పాటు, ఆటా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి అనేక పదవుల్లో సేవలందించారు. 2023 జనవరిలో ఆటాలోని 16 బోర్తుఆఫ్ ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయ. ఎన్నికైన సభ్యులు నాలుగేండ్లు పాటు పదవిలో కొనసాగుతున్నారు. అనిల్ బొదిరెడ్డి, సన్నిరెడ్డి, కిరణ్ పాశం, కిషోర్ గూడూరు, మహీదర్ ముస్కుల, నర్సిరెడ్డి గడి కొప్పుల, రామకృష్ణారెడ్డి అల, రాజు కక్కెర్ల, సాయి సుధిని, శ్రీకాంత్ గుడిపాటి, నర్సింహారెడ్డి ధ్యాసాని, రఘవీర్ మరిపెద్ది, సాయినాథ్ బోయపల్లి, సతీష్రెడ్డి, శ్రీనివాస్ దర్గుల, వినోద్ కోడూరు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆటా బోర్డు ఏకగ్రీవంగా జయింత్ చల్లాను కాబోయే ప్రెసిడెంట్గా ఎన్నుకుంది. ఆటా బోర్డు 2023, 2024 టర్మ్కి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి అల (కార్యదర్శి), సతీష్ రెడ్డి (కోశాధికారి), తిరుపతి రెడ్డి యర్రంరెడ్డి ( జాయింట్ సెక్రటరీ), రవీందర్ గూడూరు (జాయింట్ ట్రెజరర్), హరి ప్రసాద్ రెడ్డి లింగాల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)గా ఎన్నికయ్యారు. -
ఆకాశవాణి... యూఎస్ కేంద్రం!
ఆకాశవాణి శ్రోతలకు ఆమె గొంతు సుపరిచితం. తొలితరం తెలుగు టీవీ ప్రేక్షకులకు ఆమె నటన చిరపరిచితం. ఇరవయ్యేళ్ల కిందట తెలుగు చిత్ర కథానాయికల గళం ఆమె. పేరు... ఉదయగిరి రాజేశ్వరి. ఇప్పుడు... యూఎస్లో తెలుగు వాణి ఆమె. యూఎస్ తెలుగు రంగస్థల నిర్మాత. ప్రాక్– పశ్చిమ తెలుగుకు సాంస్కృతిక వారధి. ‘‘నాకు స్టేజి ముందున్న జ్ఞాపకం లేదు. ఎప్పుడూ స్టేజి మీదనే ఉండేదాన్ని. అమ్మ రచయిత. ఆమె రాసిన నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యేవి. అలా నాకు చిన్నప్పుడే రేడియోతో పరిచయం ఏర్పడింది. స్కూల్ ప్రోగ్రామ్స్లో కూడా తప్పకుండా పాల్గొనేలా చూసేది అమ్మ’’ అంటూ తన ఎదుగుదలలో తల్లి అత్తలూరి విజయలక్ష్మి పాత్రను గుర్తు చేసుకున్నారు ఉదయగిరి రాజేశ్వరి. ‘‘రేడియోలో నా ఎంట్రీ కూడా అమ్మ నాటకంతోనే. ఆ నాటకం కోసం ఆడిషన్స్ జరిగినప్పుడు నేను ‘బి’ గ్రేడ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యాను. ఆ తర్వాత ‘ఏ’ గ్రేడ్కి ప్రమోట్ అయ్యాను. అమ్మ ఎప్పుడూ ‘నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్. అందుకే నిన్ను స్టేజ్ మీదనే పెంచాను’ అంటుండేది. బాల్యంలో సరైన ఎక్స్పోజర్ లేకపోతే ఆ భయం ఎప్పటికీ వదలదేమోనని ఆందోళన ఆమెకి. అందుకే నన్ను ఊహ తెలిసేటప్పటికే స్టేజి మీద నిలబెట్టింది. రేడియో తర్వాత టీవీకి కూడా పరిచయం చేసింది. జెమినీ టీవీలో ‘బిజినెస్ ట్రాక్స్, యువర్స్ లవింగ్లీ వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేశాను. స్వచ్ఛమైన తెలుగు, మంచి డిక్షన్ ఉండడంతో ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా రాణించగలిగాను. మొదట్లో నాకు ఆన్ స్క్రీన్ మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ అమ్మ సరదా కొద్దీ యాంకరింగ్ చేశాను. ప్రముఖుల పరిచయాల్లో భాగంగా యండమూరి వీరేంద్రనాథ్గారిని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడాయన సీరియల్స్లో చేయమని అడగడంతో కొద్దిపాటి సందిగ్ధతతోనే ‘ప్రియురాలు పిలిచె’లో నటించాను. శాంతి నివాసం, ఎడారి కోయిలలో కూడా మంచి పాత్రలే వచ్చాయి. స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తే అది ఎలా ఉందనేది ప్రేక్షకులు చెప్తారు. కెమెరా ముందు ప్రోగ్రామ్ చేసిన తర్వాత అది ప్రసారం అయ్యేటప్పుడు ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూడడం చాలా థ్రిల్లింగ్గా ఉండేది. మా ఇంట్లో అందరిదీ ఒక్కటే ఫార్ములా. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్నింటిలో చురుగ్గా ఉన్నా సరే... చదువును నిర్లక్ష్యం చేయకూడదు. అందుకేనేమో నాకు చదువు మీద ఫోకస్ తగ్గకుండా అమ్మ చాలా జాగ్రత్త పడింది. అయితే నాకు ఆన్ స్క్రీన్ ఆసక్తి పెరిగే సమయంలో అమ్మ మాట మీద కొంతకాలం నటనకు దూరంగా ఉండి చదువుకే పరిమితమయ్యాను. ఎంసీఏ తర్వాత వెబ్స్మార్ట్లో ఉద్యోగంతో కొత్త జీవితం మొదలైంది. చదువుకుంటూ కూడా సినిమాల్లో డబ్బింగ్ చెప్పడం మాత్రం వదల్లేదు. ఇడియట్, శివమణి, ఏ ఫిల్మ్ బై అరవింద్ వంటి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పాను. పెళ్లి, పాపకు తల్లి కావడం, సింగపూర్లో ఉద్యోగం, అక్కడి నుంచి 2005లో యూఎస్కి... అక్కడ బాబు పుట్టడం, ఉద్యోగం– కుటుంబాన్ని బాలెన్స్ చేసుకోవడం అనే ఒక రొటీన్ చక్రంలో కొంతకాలం గడిచిపోయింది. అయితే అంత బిజీలో కూడా నాకు కొంత వెలితిగా అనిపించేది. రేడియో నాటకాలు, టీవీ షోలు, సినిమా డబ్బింగ్ల మధ్య జీవించిన ప్రాణం కదా మరి’’ అన్నారామె నవ్వుతూ. అమ్మ చెప్పింది అమెరికాలో రాజేశ్వరి నివసిస్తున్న డాలస్లో కూడా తెలుగు రేడియో ఉందని, వీలయితే ప్రోగ్రామ్స్ చేయమని తల్లి సూచించడంతో ఆమెలోని కళాకారిణి ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఆమె సాహిత్యకాంక్ష ఆకాశంలో రెక్కలు విచ్చుకుంది. అలా 2006లో అమెరికా ఆకాశవాణితో గళాన్ని సవరించుకున్నారు రాజేశ్వరి. వారాంతాల్లో ప్రోగ్రామ్లు చేయడంతో అమెరికాకు చక్కటి తెలుగు భాషను వినిపించారు. ఆటా, తానా వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా అక్కడ మన భాష, సంస్కృతులకు జీవం పోస్తున్నారు. ప్రస్తుతం ఆమె సొంతంగా ‘రేడియో సురభి’ అనే ఎఫ్ఎమ్ రేడియోను రోజుకు ఇరవై నాలుగ్గంటల కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. ‘సరసిజ’ పేరుతో నాటకసంస్థను కూడా ప్రారంభించారామె. ‘‘విజయా వారి మిస్సమ్మ సినిమాను నాటకంగా ప్రదర్శించిన నా ప్రయోగం విజయవంతమైంది. సినిమాను స్టేజ్ మీద నాటకంగా ప్రదర్శించడం ప్రపంచంలో అదే మొదలు. అలాగే అమ్మ రాసిన ద్రౌపది అంతః సంఘర్షణ నాటకంలో ద్రౌపది పాత్ర పోషించాను. ‘అనగనగా ఒక రాజకుమారి, పురూరవ నాటకాలు కూడా అంతే ప్రజాదరణ పొందాయి. యూఎస్లో భారతీయ నాటకరంగం అనగానే మన వాళ్లందరికీ హిందీ నాటకాలే గుర్తుకు వసాయి. తెలుగుకు పెద్ద ఆదరణ ఉండదనే అపోహ ఉండేది. మనం చక్కగా ప్రదర్శిస్తే ఆదరణ ఎందుకు ఉండదు... అని చాలెంజ్గా తీసుకుని చేశాను. ప్రతి సన్నివేశానికి ముందు ఆడియోలో ఇంగ్లిష్లో నెరేషన్ చెప్పి ప్రదర్శించడం ద్వారా ఇతర భాషల వాళ్లు కూడా మన నాటకాన్ని ఆదరించారు. అలా నేను న్యూయార్క్లో ‘ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్’లో తెలుగు నాటకాన్ని ప్రదర్శించాను’’ అని తన కళాప్రస్థానాన్ని వివరించారామె. హైదరాబాద్లోని సారస్వత పరిషత్లో బుధవారం (20–7–2022) నాడు ‘లేఖిని– వంశీ’ సంయుక్తాధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి రాజేశ్వరికి ‘సురభి జమునారాయలు– వంశీ రంగస్థల పురస్కారం, లేఖిని ఆత్మీయ పురస్కార ప్రదానం జరిగింది. ఆ సందర్భంగా సాక్షితో ముచ్చటించారామె. ‘‘మాడపాటి హనుమంతరావు గరల్స్ హైస్కూల్ నాకు మంచి తెలుగు భాషను నేర్పింది. చక్కటి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసింది’’ అంటూ తన ఎదుగుదలలో తాను చదువుకున్న స్కూల్ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు రాజేశ్వరి. రెండు గంటలు ఎవరూ కదల్లేదు యూఎస్... అన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కలిసి నివసిస్తున్న ప్రదేశం. అక్కడ అందరూ వాళ్ల వాళ్ల సంస్కృతిని పరిరక్షించుకుంటూ యూఎస్వాసులుగా కొనసాగుతుంటారు. మనవాళ్లు మాత్రమే త్వరగా మన సంస్కృతిని వదిలేస్తున్నారనిపించింది. నాకు చేతవచ్చినది ఏదో ఒకటి చేయాలని కూడా అనిపించింది. నాటకం మీద నాకున్న అభిలాషకు అది చక్కటి వేదిక అయింది. మొదట్లో స్టేజ్ షోకి ఎవరూ రారేమోననే భయంతో మిస్సమ్మ నాటకాన్ని ఫ్రీ షో వేశాం. ఏడువందల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం నిండిపోయింది. రెండు గంటల సేపు కదలకుండా చూశారు. పురూరవ నాటకాన్ని పిక్టోరియల్గా చిత్రీకరించి అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయడం కూడా ఓ ప్రయోగమే. మన నాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. – ఉదయగిరి రాజేశ్వరి, రంగస్థల కళాకారిణి – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి. -
ఆటాలో కూచిపూడికి పట్టం
తెలుగు వారి సాంప్రదాయ భారతీయ నాట్యం కూచిపూడికి ఆటా వేదికపై పట్టం కట్టించారు న్యూజెర్సీలోని సెంటర్ ఫర్ కూచిపూడి. ఇటీవల వాషింగ్టన్ డీసీ వేదికగా జరిగిన అమెరికన్ తెలుగు అసొసియేషన్ ప్రపంచ మహాసభల్లో సెంటర్ ఫర్ కూచిపూడి కళాకారిణులు అద్భుత ప్రదర్శనతో అలరించారు. హైదరాబాద్లో పుట్టి పెరిగి కూచిపూడి నృత్యం అభ్యసించి.. అమెరికాలో సెంటర్ ఫర్ కూచిపూడి ఏర్పాటు చేశారు ఇందిరా శ్రీరాం రెడ్డి దీక్షిత్. న్యూజెర్సీ కేంద్రంగా గత 20 ఏళ్లుగా ఎంతో మందికి కూచిపూడిని నేర్పిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు పలు చోట్ల కూచిపూడి ప్రదర్శనలు ఏర్పాటు చేసి దాని గొప్పదనాన్ని చాటి చెప్పుతున్నారు ఇందిరా శ్రీరాం దీక్షిత్. అమెరికన్ తెలుగు అసొసియేషన్ సభల్లో ఇందిరా టీంలోని సభ్యులు సాంప్రదాయ కూచిపూడితో పాటు కోలాట నృత్యాలు చేసి అలరించారు. -
చరిత్ర సృష్టించాలన్నా.. దాన్ని తిరగరాయాలన్నా మనమే: ఆటా
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా 17వ తెలుగు మహాసభల సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్ డీసీ నగరం తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారి కావటం విశేషం. సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో 15వేల మందికి పైగా హాజరైనారు. జులై 1 వ తారీఖున నిర్వహించిన బాంక్వేట్ డిన్నర్ లో 3000 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ ఆటా అవార్డ్స్ ప్రదానం చేసారు. క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ తదితరులు ఈ బాంక్వేట్ డిన్నర్ లో పాల్గొన్నారు, వీరిని ఆటా ఘనంగా సత్కరించింది. 125 మందితో స్వాగతోత్సవ జానపద సంబరాలు "మన ఆటా జానపదాల కోట" నిర్వహించారు. 140 మందికి పైగా పాల్గొన్న “తెలుగు మన వెలుగు” కార్యక్రమంలో కూచిపూడి, గోండి, లంబాడి తదితర సంప్రదాయ నృత్య రూపకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మన బడి బాలలు చేసిన శ్రీ కృష్ణ రాయభారం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. బతుకమ్మ పైన ఆటా ముద్రించిన పుస్తకాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. వద్దిపర్తి పద్మాకర్ అవధానం విశేషంగా ఆకట్టుకున్నది. శివమణి, థమన్ మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రుతలు గించింది. ఉపాసన కామినేని సద్గురుకి వినూత్నమైన ప్రశ్నలు శ్రోతల తరపున అడిగారు. సద్గురు మాట్లాడుతూ పర్యావరణ ముప్పుని నివారించటానికి సారవంతమైన భూమిని ఎలా కాపాడుకోవాలో, ఆహార భద్రతకు దీని ఆవశ్యకత, ఎంత ప్రాముఖ్యం సంతరించుకుందో సోదాహరణంగా “సేవ్ ది సాయిల్” ప్రోగ్రాం గురించి వివరించారు. ఈ సభలకు మగ్దూం సయ్యద్, రవి రాక్లే, సింగర్ సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మహిళలు, పిన్నలు పెద్దలు సాంప్రదాయ దుస్తులతో సందడి చేసారు. ఆటా మొదటి రోజు సాహిత్య కార్యక్రమాల ప్రారంభ సమావేశంలో కే. శ్రీనివాస్, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభావతి, స్వామి వెంకటయోగి సమకాలీన సాహిత్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత, జొన్నవిత్తుల తన పారడీ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మానకాలపు నవల, కథ’ పేరుతో నిర్వహించిన చర్చలో అమెరికాలో ఉన్న కథా, నవలా రచయితలు పాల్గొని సమకాలీన కథా సాహిత్యం గురించి లోతైన చర్చ చేశారు. రెండవ రోజు సాహిత్య కార్యక్రమాలలో సినిమాకి, సాహిత్యంలో ఉన్న సంబంధం గురించి వివరించడానికి ‘సినిమా కథ... సాహిత్య నేపధ్యం’ పేరుతో నిర్వహించిన చర్చలో దర్శకులు సందీప్ రెడ్డి వంగ, తనికెళ్ళ భరణి, ధర్మ దోనేపూడి, సుకుమార్, శివ సోమయాజుల పాల్గొన్నారు. చర్చలో భాగంగా ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకులు సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత, ‘ఆటా, పాటా, మనం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమమంలో చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి వారి పాటల నేపధ్యాన్నీ వివరించారు. ఈ కార్యక్రమానికి ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన లభించింది. జులై 3న ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు, తీర్ధ ప్రసాదాలందుకున్నారు. ఆటా బ్యూటీ పేజంట్ విజేతలకు హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్, నటుడు అడివి శేష్ బహుమతులందచేశారు. అమెరికాలో 12 నగరాల నుంచి ఔత్సాహికులు పాల్గొనటం విశేషం. ఝుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం నాట్య పోటీల విజేతలకు బహుమతులు అందచేశారు. బిజినెస్ కమిటీ నిర్వహించిన ఎంట్రప్రెనేయూర్షిప్ అండ్ లైఫ్ సైకిల్ కార్యక్రమంలో GMR సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సదస్సులో ఉపాసన కామినేని పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి పై నిర్వహించిన సదస్సులో తనికెళ్ళ భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మహాసభలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్ల రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ళ వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొళ్ళం మల్లయ్య యాదవ్ , గాదారి కిశోర్, వైజాగ్ పార్లమెంట్ సభ్యులు MVV సత్యనారాయణ, రాజమండ్రి శషన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌధరి ఇతర నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, భవానీ మారికంటి, మన్నవ సుబ్బ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ ధ్యాన గురువు కమలేష్ పటేల్( దాజి) ప్రత్యేక సందేశం అందించారు . ఈ మహాసభల నిర్వహణకు విరాలలాను అందచేసిన ధాతలను ఆటా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అధినేత డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ఆటా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు వారందరు అమెరికాలో ఎదగటానికి ఆకాశమే కొలమానమని మన జాడ్యాలను విడనాడి అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో అబివృద్దిలోకి రావాలి అని ఆయన ఆకాంక్షించారు. ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల తెలుగు శాస్త్రీయ పద్దతిలో ఘనంగా సత్కరించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అంధరిని మైమరిపించింది. గురువందనతో సంగీత విభావరి ప్రారంభమై ఎన్నో అద్భుతమైన పాటలను మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయనీగాయకులసంగీత ఝురిలో ప్రేక్షకులను ఉర్రూతలూగారు. =అమెరికాలో తెలుగు వారి చరిత్రలో నభూతో నభవిష్యతిగా ఈ మహాసభలు నిర్వహించడానికి తోడ్పాటునందించిన కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం తదితరులకు ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా కోర్ కమిటీ, ఆడ్ హాక్ కమిటీ, కాట్స్ టీం & వాలంటీర్స్ ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేశారు. ఆటా ఫౌండింగ్ మెంబర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రెసిడెంట్ అండ్ టీం కార్యాదక్షత మూలంగానే ఇంత ఘనంగా ఈ మహాసభలు నిర్వహించగలిగామని కొనియాడారు. వెండర్ బూత్స్ ఒక మినీ షాపింగ్ మాల్ని పించాయి. ఆటా సంప్రదాయ దుస్తులలో రిజిస్ట్రేషన్ వాలంటీర్స్ ఎరుపు రంగు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మీడియా మిత్రులకు, ప్రకటనకర్తలు వాలంటీర్స్, సహకరించిన ప్రతి ఒక్కరికి అట కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల, కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ కోశాధికారి విజయ్ కుందూరు కాన్ఫరెన్స్ విజయానికి ఎంతో తోడ్పాటుని అందించిన కోహోస్టు కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ సబ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్ పనులను కో-కన్వీనర్ సాయి సూదిని, కో-కోఆర్డినేటర్ రవి చల్ల. లోకల్ కోఆర్డినేటర్ శ్రావణ్ పాదురు పర్యవేక్షించారు. -
ఘనంగా ఆటా వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆటా వేడుకలు ముగిశాయి. సమావేశాలకు తెలుగు వాళ్లు పోటెత్తారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఏకంగా 15,000 మందికిపైగా హాజరవడం విశేషం. వేడుకల సందర్భంగా కపిల్, సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్, సద్గురు గోల్ఫ్ టోర్నమెంట్లో కూడా పాల్గొన్నారు. బతుకమ్మపై ఆటా ముద్రించిన పుస్తకాన్ని టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. శివమణి, థమన్ మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రూతలూగించింది. తెలంగాణ నుంచి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, గ్యాదరి కిశోర్, ఏపీ నుంచి ప్రజాప్రతినిధులు ఎంవీవీ సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌధరి తదితరులు పాల్గొన్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అందరినీ మైమరిపించింది. మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయని గాయకులు అంధింస్తు సంగీతాల ఝురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కో ఆర్డినేటర్ కిరణ్ పాశం, ఆటా ఫౌండింగ్ మెంబర్ హనుమంత్ రెడ్డి, తదితరులు మాట్లాడారు. హీరో అడివి శేష్, సినీ నటుడు తనికెళ్ల భరణి తదితరులు సందడి చేశారు. -
ఆటా మహాసభలు: ఏపీ పెవిలియన్ ప్రారంభం
వాషింగ్టన్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా)17వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. మూడురోజుల పాటు వాష్టింగ్టన్ డీసీలో జరుగు తున్న ఈ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు రత్నాకర్ పండుగాయల, హరి ప్రసాద్ లింగాల, మేడపాటి వెంకట్ ఏపీ పెవిలియన్ ను ప్రారంభించారు. 17వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్లో డా.వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో వైఎస్సార్ అభిమానులు, నేతలు హాజరైన ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని ఏపీ ఆధికారిక భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్మి ప్రసాద్ రావు గుర్తు చేశారు. పలువురు రాజకీయ నాయకులు, కళాకారులు ఆటా వేడుకల్లో సందడి చేస్తున్నారు. - వాష్టింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఆటా సభల్లో మహానేత డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 1 నుండి 3 తేదీ వరకు వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న 17వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్లో భాగంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరైన అభిమానులు, నేతలు వైఎస్సార్కు ఘనంగా నివాళులర్పించారు. ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని ఏపీ ఆధికారిక భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రావు గుర్తు చేశారు. ఇంగ్లీష్ మీడియం మీద కొన్ని విపక్షాలు కుట్ర చేస్తున్నాయని యార్లగడ్డ మండిపడ్డారు. ప్రతి పేద వాడి పిల్లలకు ఇంగ్లీష్ చదువులు కావాలని ఎందరో పాదయాత్రలో తమ కోరికను వెల్లడించారని చెప్పారు. అలాగే 98శాతం ఇంగ్లీష్ మీడియం కావాలాని సర్వేలో చెప్పారని తెలిపారు. కేవలం సీఎం జగన్కు క్రెడిట్ వస్తుందన్న దుగ్ధతోనే ఇంగ్లీషు మీడియంను తప్పు బట్టారని విమర్శించారు. మీ పిల్లలకు ఇంగ్లీషులు చదువులు కావాలి గానీ, మరి పేదల పిల్లలు ఇంగ్లీషులు చదువుకోవద్దా ? అని విమర్శిస్తున్నవారినుద్దేశించి ప్రశ్నించారు. వైఎస్సార్ చిరకాలం అందరి గుండెల్లో నిలిచిపోయారని వైజాగ్ ఎంపీ సత్య నారాయణ మహానేతకు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. అమెరికాలో ఏ ముఖ్యమైన తెలుగు కార్యక్రమం జరిగినా వైఎస్సార్ను గుర్తు చేసుకుంటారన్నారు. జులై 8 కంటే ముందే అమెరికాలో జయంతి వేడుకలు జరపడం ఎంతో సంతోషకరమని ఆటా సెక్రెటరీ హరి లింగాల వెల్లడించారు. డా. వైఎస్సార్ తన పాలనతో చెరగని ముద్ర వేశారనీ, తన ప్రసంగాలతో అసెంబ్లీకి వన్నె తెచ్చారంటూ నాటా అధ్యక్షుడు రాఘవ రెడ్డి గోసాల వైఎస్సార్ సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ను మరిపించేలా జగన్ పాలన దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ ప్రశంసించారు. అంతేకాదు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి 175కు 175 సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ మాట్లాడుతూ సామాన్యులకు చేరువైన వ్యక్తి వైఎస్సార్ అనీ, ఆయన మనకు దూరమై 12 ఏళ్లు గడిచినా అందరి మనసుల్లో సజీవంగా నిలిచే ఉన్నారని పేర్కొన్నారు. డా. వైఎస్సార్ చేసిన సంక్షేమంతో ఎంతోమంది ఉన్నత విద్యనభ్యసించి అమెరికా వరకు చేరుకున్నారని అన్నారు. మహానేత వైఎస్సార్ పాలనను ఆయన తనయుడు జగన్ కొనసాగిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ సేవా కార్యక్రమాలు జరిగినా వైఎస్సార్ ఫౌండేషన్ స్పందించి తనవంతు సాయాన్ని అందిస్తుందనీ వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి వెల్లడించారు. వైఎస్సార్ ఫౌండేషన్కు సంబంధించి అమెరికాలో ఎంతోమంది తమవంతుగా ముందుకు వచ్చారన్నారు. మానవత్వం, దార్శనికత కలగలిసిన వ్యక్తి మహా మనిషి వైఎస్సార్, మన మధ్య లేరు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామంటూ అమెరికా వైస్సార్సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి ఆ మహానేతను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిమిక్రి రమేష్ తన అద్భుతమైన గళంతో వైఎస్సార్ను అనుకరించి సభికులను అలరించారు. - వాష్టింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆటా వేడుకలకు వేదిక ముస్తాబు (ఫొటోలు)
-
ఆటా 17వ మహాసభలకు ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. మహాసభల్లో భాగంగా జరిగే యువజన సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆటా ప్రతినిధులు ఆమెను ఆహ్వానించారు. జూలై 2న జరిగే ఆటా మహాసభల్లో కవిత చేతుల మీదుగా తెలంగాణ పెవిలియన్ ప్రారంభమవుతుంది. అదేరోజు సాయంత్రం జరిగే ప్రధాన సమావేశంలో కవిత అతిథిగా పాల్గొంటారు. ఇదే సమావేశం వేదికగా బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు. వేడుకల నిర్వహణకు 80 కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఆటా ప్రతినిధులు వెల్లడించారు. -
ఆటా వేడుకలకు సర్వ సిద్ధం: అతిథులతో కళకళ లాడుతున్న వేదిక
వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం (ఆటా)17వ ఆటా మహసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభంగా జరిగే ఈ వేడుకలకోసం తెలుగువారంతా అమెరికాకు చేరుకుంటున్నారు. పదివేలమందికిపైగా హాజరవుతారని భావిస్తున్న ఆటా మహాసభలకు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ఒక్కొక్కరుగా వాషింగ్టన్ డీసీకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు తమన్, చంద్రబోస్, శివారెడ్డి , సింగర్ మంగ్లీ తదితరులు ఏటీఏ కాన్ఫరెన్స్కు చేరుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఆటా అధ్యక్షుడు భువనేష్ భుజాల సారథ్యంలో వేర్వేరు కమిటీలు వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్న వేడుకల కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా కోవిడ్ కారణంగా రెండేళ్ళలో వేడుకలు ఇంత పెద్ద ఎత్తున జరగకపోవడం, కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరింత ఉత్సాహం నెలకొంది. ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా, ఉత్సాహంగా సభలను నిర్వహించేందుకు ఎద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని ఆటా అధ్యక్షుడు తెలిపారు. -వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఆటా వార్ రూం : ఢీ అంటే ఢీ
మూడు రోజుల గ్రాండ్ కన్వెన్షన్కు సిద్ధమవుతున్నారు ఆటా యోధులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది ప్రిపరేషన్స్లో బిజీబిజీగా ఉన్నారు. తమ సన్నాహకాలకు వార్ రూం ఏర్పాటు చేసుకున్నారు. జులై 1,2,3 తేదీల్లో జరగనున్న అమెరికన్ తెలుగు అసొసియేషన్ ప్రపంచ తెలుగు మహాసభలకోసమే ఈ కసరత్తు. వార్ రూంకు ఇప్పటికే చేరుకున్న కళా బృందాలు తమ ప్రతిభా పాటవాలకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. గతానికి భిన్నంగా, మరింత సృజనాత్మకంగా, కొత్త కళా రీతులతో కొంగొత్తగా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆటా కల్చరల్ కమిటీ, హాస్పిటాలిటీ కమిటీలు వీరికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఇక్కడ కనిపిస్తున్న చాలా మంది పిల్లలు అమెరికాలో పుట్టిపెరిగిన వాళ్లే. అయితే తెలుగు సంప్రదాయాన్ని, సంస్కృతిని మాత్రం తల్లితండ్రుల నుంచి గుర్తు పెట్టుకున్నారు. పేరేంట్స్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు అమ్మమ్మ, నానమ్మ ఇళ్లకు వెళ్లి ఇక్కడి విషయాలు గమనిస్తున్నారు. అందుకే అగ్రరాజ్యంలో ఉన్నా తెలుగును మరిచిపోలేదు, ఇక్కడి మట్టివాసనను మరిచిపోలేదు. తమ కళలు, ప్రదర్శనలలో తెలుగు తత్వాన్ని చూపించే పనిలో ఉన్నారు. అమెరికన్ తెలుగు అసొసియేషన్ అధ్యక్షుడు భువనేష్ భుజాల, ఇతర కమిటీ సభ్యులు, వాలంటీర్లు అలుపెరగకుండా కష్టపడుతున్నారు. వేలాది మంది అతిథులకు సంతోషం పంచేలా, ఉత్సాహం నింపేలా తమ వేడుకలు ఉంటాయని హామీ ఇస్తున్నారు. కన్వెన్షన్ సందర్భంగా ప్రతీ కమిటీ ఏ ఏ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలన్నదానిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే వార్ రూంలో మరో పక్క వాడివేడి చర్చలు జరుపుతున్నారు. ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా బాధ్యతలు పంచుకుంటున్నారు. సుధీర్ బండారు, కాన్ఫరెన్స్ కన్వీనర్ ఎన్నో రోజుల కష్టం ఇది. ఆటా వేడుకలు ఇప్పుడు కాదు.. చాలా రోజుల ముందుగానే మొదలయ్యాయి. సయ్యంది పాదం పేరుతో ఎన్నో రోజులుగా డాన్స్ కాంపిటీషన్లు నిర్వహించి అత్యుత్తమ కళాకారులను ఎంపిక చేశాం. అలాగే జుమ్మంది నాదం పేరుతో గాయకులను ఎంపిక చేశాం. అమెరికాలోనే పుట్టి పెరిగిన కొందరు అద్భుతంగా పాడినప్పుడు ఆశ్చర్యపోయాం. ఈ వేడుకలు కచ్చితంగా ఆహూతులను అలరిస్తాయని నమ్మకంగా చెబుతున్నాం. కిరణ్ పాశం, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఒకరు కాదు, ఇద్దరు కాదు 80 కమిటీలు, 300 మంది వాలంటీర్లు, వీరే కాకుండా పరోక్షంగా మరెంతో మంది సహకారంతో ఈ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమ తమ వృత్తి బాధ్యతలను పక్కనబెట్టి.. ఈ వేసవి కాలాన్ని అత్యంత ఆహ్లదంగా మార్చేందుకు, ఆటా వేడుకలను అత్యంత మధురంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వచ్చే మూడు రోజులు మరింత ఉధృతంగా ప్రాక్టీసు సెషన్లుంటాయి. బ్రహ్మండమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటామన్న విశ్వాసం ఉంది. - (వాషింగ్టన్ డిసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
ఆటా వేడుకలకు వేళాయే
అమెరికన్ తెలుగు అసొసియేషన్ కన్వెన్షన్ వేడుకలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబవుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఏ రోజుకారోజు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. అమెరికన్ తెలుగు అసొసియేషన్ అధ్యక్షుడు భువనేష్ భుజాల సారథ్యంలో వేర్వేరు కమిటీలు వేడుకలకు సంబంధించి వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు ఇలా.. చెప్పుకుంటూ పోతే దాదాపు 80 కమిటీలు, 300 మంది వాలంటీర్లు అలుపెరుగకుండా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా మూడు రోజుల్లో వేటికవే వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా రాజకీయ, సినీ, వ్యాపార, అధికార ప్రముఖులు హాజరు అవుతున్నారు. గత మూడేళ్లుగా కరోనా పరిస్థితుల వల్ల అమెరికాలో పెద్ద తెలుగు ఈవెంట్ ఏదీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ప్రవాసాంధ్రులు ఇప్పటికే భారీగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. చారిత్రక వేదిక డిసి కన్వెన్షన్ సెంటర్ వేడుకలు నిర్వహించనున్న వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అమెరికా అరు వేర్వేరు అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రెసిడెంట్ అభ్యర్థి సమావేశాలకు ఇదే కన్వెన్షన్ సెంటర్ను ఎంచుకున్నారు... * 23 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియా * అల్ట్రా మోడర్న్ స్ట్రక్చర్ * 40 వేల మందితో సమావేశాలు నిర్వహించుకునే సదుపాయం * పూర్తి పర్యావరణ అనుకూలంగా ఉండే గ్లాస్ వాల్స్ * మూడు ఎయిర్పోర్ట్లకు సులువుగా చేరుకునే సదుపాయం * అత్యంత సులువుగా అన్ని రకాల రవాణా సౌకర్యాలు కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం కోలుకున్న తర్వాత నిర్వహిస్తున్న అతిపెద్ద తెలుగు పండుగ ఇది. ప్రవాసాంధ్రులందరిని ఒక్కతాటిపైకి తెచ్చి ఒక కుటుంబం అన్న భావన తీసుకురావడానికే మా ఈ ప్రయత్నం. ఘనమైన తెలుగు వారసత్వాన్ని అందించడం, పుట్టిన నేలకు తమ వంతు సాయం అందించడం, కొత్త తరానికి స్పూర్తిదాయక సందేశం ఇవ్వడమే ఆటా ముందున్న లక్ష్యాలు. వాషింగ్టన్ డీసీలో జులై 1,2,3 తేదీల్లో జరగనున్న వేడుకలకు తరలిరండి!మా ఆతిథ్యాన్ని స్వీకరించండి!! ఆటా కుటుంబంలో భాగం కండి!!! - భువనేష్ భుజాల, ఆటా అధ్యక్షుడు ఎంతో ఘనకీర్తి, ఎన్నో విజయాలు సాధించిన తెలుగు వారికి ఆటా ఒక కేంద్ర బిందువు అవుతుందని భావిస్తున్నాం. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్.. ప్రవాసాంధ్రులందరినీ ఒక్క తాటిపైకి చేర్చబోతుంది. ఎందరో ప్రముఖులు వస్తున్న ఈ కన్వెన్షన్ మునుపెన్నడూ లేనంత ఘనంగా నిర్వహించబోతున్నాం. కార్యక్రమాల్లో అత్యున్నత సాంకేతికత, వచ్చిన అతిథులకు అత్యుత్తమ హోటళ్లు, రాకపోకలకు ఆధునాతన రవాణా వసతులు, రుచికరమైన భోజనం, మరిచిపోలేని విధంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. హరిప్రసాద్ లింగాల, ఆటా సెక్రటరీ -వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఆటా వేడుకలు: ముచ్చటగా మూడు రోజులు సందడే సందడి
వాషింగ్టన్ డీసీ వేదికగా జరగబోతున్న 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు తన వేడుకలకు రంగం చేసింది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఏ రోజు ప్రత్యేకత దానికే ఉంది. ఆ వివరాలు.. జులై 1 మొదటి రోజు కన్వెన్షన్ సెంటర్లోని గ్రాండ్ లాబీలో వెల్కం రిసెప్షన్తో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ స్వరపరిచిన ప్రారంభోత్సవ గీతాన్ని గాయకులు కొమాండూరి రామాచారి ఆలపిస్తారు. అదే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన తెలుగు ప్రముఖులకు అమెరికన్ తెలుగు అసొసియేషన్ అవార్డులందించనుంది. బాంకెట్ వేడుకల్లో సింగర్ రామ్ మిరియాల స్పెషల్ మ్యూజిక్ నైట్తో అలరించబోతున్నారు. జులై 2 రెండో రోజు ఉదయం నుంచే ఆటా పరేడ్ ప్రారంభం అవుతుంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ఇదే రోజు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురు పద్మ విభూషణ్ సద్గురు జగ్గీ వాసుదేవన్ అతిథులతో మాట్లాడనున్నారు. అలాగే ఆటా కన్వెన్షన్లో భాగంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్రమిషన్ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న రామచంద్రమిషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రెషన్స్ నిర్వహిస్తారు. రెండో రోజు సాయంత్రం సంగీత దర్శకులు ఎస్.థమన్ నేతృత్వంలో విభావరి ఏర్పాటు చేశారు. జులై 3 మూడో రోజు ఉదయం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి కళ్యాణం నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అమెరికా చేరుకున్నారు. శ్రీనివాసుడి కళ్యాణంలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు పద్మశ్రీ శోభారాజు, నిహాల్ కొండూరి ఆధ్యాత్మిక సంగీతంతో ఆహూతులను భక్తి పరవశ్యంలోకి తీసుకెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం గ్రాండ్ ఫినాలేలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇళయరాజా తన 32 మంది ట్రూప్తో అతిథులను అలరించనున్నారు. దీంతో పాటు ఆహుతుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆటా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన అతిథులు.. ఎప్పటికీ మరిచిపోలేని విధంగా వేడుకలను డిజైన్ చేశారు. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, వివాహా వేదికలు, మాటా ముచ్చట్లు.. చెప్పుకుంటూ పోతే.. మూడు రోజులు వాషింగ్టన్ డిసిలో పండగ వాతావరణం ఏర్పాటు కానుంది. ఆటా వేదికగా ఆట-పాట భారతీయులకు క్రికెట్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. అందుకే ఆటా నిర్వాహకులు ఇద్దరు లెజెండ్ క్రికెట్ క్రీడాకారులను ఈ కన్వెన్షన్కు తీసుకొస్తున్నారు. టాప్ క్లాస్తో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన సునీల్ గవాస్కర్, సిక్సర్ల మెరుపులతో అలరించే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్.. యూత్ క్రికెట్ సరదాగా ఆడబోతున్నారు. అలాగే మరో లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ కూడా కనువిందు చేయబోతున్నాడు. ఆటా సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో భాగంగా కపిల్ దేవ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫర్ సాహిత్ రెడ్డి తీగల ఆటా వేడుకల్లో సందడి చేయనున్నారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేస్తున్నారు. హీరోలు అడవి శేషు, డైరెక్టర్లు శేఖర్ కమ్ముల, అర్జున్రెడ్డి ఫేం సందీప్ వంగా, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, నివేదా థామస్, డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్, వీజే సన్నీ, సింగర్ రాం మిరియాల, సింగర్ మంగ్లీ.. ఇంకా పలువురు ప్రముఖులు వేడుకలకు వస్తున్నారు. సాహితీ వేత్తలు జొన్నవిత్తుల రాంజోగయ్య శాస్త్రి, సీనియర్ నటులు తనికెళ్ల భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అష్టవధానంతో అలరించబోతున్నారు. - వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
17వ ఆటా మహాసభలు: వారధిగా ‘ఆటా’
వాషింగ్టన్ డీసీ: వాషింగ్టన్ డీసీ వేదికగా అమెరికన్ తెలుగు అసొసియేషన్ నిర్వహించబోతున్న వేడుకలు రెండు రాష్ట్రాలకు, ప్రవాసాంధ్రులకు మధ్య వారధిగా నిలవబోతు న్నాయి. ఈ వేడుకలకు రెండు రాష్ట్రాల నుంచి 60 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి ఆటా వేదికగా పొలిటికల్ డిబేట్లు జరగనున్నాయి. వీటితో పాటు వివిధ రంగాలకు సంబంధించి నిష్ణాతులైన వారితో డీసీ కన్వెన్షన్లోని వేర్వేరు వేదికలపై చర్చా కార్యక్రమాలు విడివిడిగా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక చిరునామా పుట్టి పెరిగిన మాతృభూమిపై మమకారం చూపించేలా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీకి అయిదు స్టాళ్లు, తెలంగాణకు అయిదు స్టాళ్లు ఇందులో ఉంటాయి. రెండు ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ కీలక అంశాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రవాసాంధ్రులకు వివరించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం స్టూడెంట్ అవేర్నెస్ డెస్క్, అలాగే మెడికల్, టూరిజం, రియల్ ఎస్టేట్తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలందిస్తారు. ఈ స్టాళ్లలో ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రదర్శిస్తారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపడుతున్న కొన్ని కార్యక్రమాల్లో ప్రవాసులు తమ వంతుగా భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ‘నాడు-నేడు’, ‘మన బడి’ లాంటి కార్యక్రమాలకు విరాళాలను అందించడంలో ముందుంటున్నారు. ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం మరింత పెంచేలా అధికారులు ఈ స్టాళ్లలో వివరాలందించ నున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు హరి లింగాల, రత్నాకర్ పండుగాయల తదితరులు వీటికి తోడ్పాటు అందిస్తున్నారు. ముఖ్య విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు ఈ స్టాళ్లలో అందుబాటులో ఉండి ప్రవాసాంధ్రుల విజ్ఞప్తులను పరిశీలిస్తారు. మొత్తమ్మీద ప్రభుత్వానికి, అలాగే ప్రవాసాంధ్రులకు ఆటా కన్వెన్షన్ వారధిగా నిలవనుంది. జోహార్ వైఎస్సార్ ఆటా వేడుకల్లో భాగంగా డీసీ కన్వెన్షన్లో శనివారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం అమెరికాలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. మరి కొంత మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చే రెండు రోజుల్లో అమెరికా రానున్నారు. - వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
వీరే ‘ఆటా’ నవలల పోటీ విజేతలు
తెలుగు భాషా, సాహిత్యంపైన మక్కువతో అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన నవలల పోటీకి ప్రపంచం నలుమూలల నుండి దాదాపుగా 70 వరకూ నవలలు వచ్చాయి. అనేక పరిశీలనలూ, వడ పోతల తర్వాత ఈ దిగువ నవలలకు బహుమతి మొత్తాన్ని సమానంగా పంచాలని న్యాయనిర్ణేతలు నిర్ణయించారు. బహుమతి పొందిన నవలలు పగులు (తాడికొండ శివకుమార శర్మ, వర్జీనియా), కొంతమంది... కొన్నిచోట్ల... (వివిన మూర్తి, బెంగళూరు)గా ఉన్నాయి. విజేతలకు చెరి లక్ష రూపాయలు బహుమతిగా అందివ్వనున్నారు. ఈ రెండు నవలలను ‘ఆటా’ త్వరలో ప్రచురిస్తుంది. ఈ పోటీలో పాల్గొన్న ప్రతీ రచయితకీ, రచయిత్రికీ మా ఆటా కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ పోటీ నిర్వహణలో మాకు ఎంతో సహకరించి, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన రమణమూర్తి, స్వాతికుమారి, అనిల్ రాయల్, పద్మవల్లి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలని ఆటా పేర్కొంది. -
అట్లాంటలో ఆటా సయ్యంది పాదం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా (ఆటా) ఆధ్వర్యంలో సయ్యంది పాదం డాన్స్ కాంపిటీషన్తో పాటు అందాల పోటీలను అట్లాంటా నగరంలో నిర్వహించారు. ఈ పోటీల్లో 25కి పైగా డాన్స్ గ్రూప్స్ పాల్గొన్నాయి. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సెగ్మెంట్స్ క్లాసికల్ మరియు నాన్-క్లాసికల్ విభాగాలలో టీన్స్, మిస్, మిస్సెస్ పోటీలలో చాలా మంది మహిళలు పాల్గొని సందడి చేశారు. ఈ పోటీలను బాలు వళ్లు, శ్వేతా పర్యవేక్షించారు. అందాల పోటీల నిర్వహణలో శ్రావణి రాచకుల్లా, మల్లికా దుంపల, శృతి చితూరీ మరియు ఉదయ ఏటూరి చురుకైన పాత్ర పోషించారు. ఈ పోటీలకు ముందు జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీరామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటా అట్లాంటా టీంని సభకు పరిచయం చేసారు. ట్రస్టీ అనిల్ బొద్దిరెడ్డి ఆటా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, ఆట మెంబెర్ బెనిఫిట్స్ సభకు వివరించారు. ఆటా పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి, కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, ఆటా కాన్ఫరెన్స్ అడ్వైసర్ గౌతమ్ గోలి, ట్రస్టీస్ అనిల్ బొద్దిరెడ్డి, వేణు పిసికే మరియు ప్రశీల్ రెడ్డి. ఆటా నేషనల్ కమిటీ చైర్ వెంకట్ వీరనేని, నిరంజన్ పొద్దుటూరి , జయ చందా, తిరుమల పిట్టా, శ్రీనివాస్ ఉడతా మరియు ఉమేష్ ముత్యాల పాల్గొన్నారు. ఆటా 17 వ మహా సభలలో విరివిగా పాల్గోవాలిసిందిగా కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, అట పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి మరియు గౌతమ్ గోలి పిలుపునిచ్చారు. అత్య అద్భుతమైన ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన వారికి లీడర్షిప్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసింది. కార్యక్రమంలో పాల్గొన్న వారికి మొమెంటోస్ అందచేశారు. విజేతలు వాషింగ్టన్ డీసీ కార్యకరంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పాటుని అందించిన ప్రతి ఒక్కరికి ఆటాకాన్ఫరెన్స్ కో-కోర్డినేటర్ కిరణ్ పాశం ధన్యవాదాలు తెలియచేశారు. నిర్వాహకులు సయ్యంది పాదం చైర్ సుధా కొండెపు, అడ్వైసర్ రామకృష్ణ అలె, కో చైర్స్ భాను, రాంరాజ్, అందాల పోటీలు చైర్ నీహారిక నవల్గా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చదవండి: మన చాయ్ పానీ ముందు..పిజ్జా, బర్గర్లు జుజుబీ అనాల్సిందే! -
న్యూజెర్సీ లో ఘనంగా ‘‘ఆటా’’ సయ్యంది పాదం నృత్య పోటీలు
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో నిర్వహించారు. కూచిపూడి, భరత నాట్యం, జానపదం ఫిల్మ్ విభాగాలలో చాలా నాణ్యమైన ప్రదర్శనలతో ఈ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని న్యూజెర్సీ సయ్యంది పాదం ఇంచార్జీలు ఇందిరా దీక్షిత్, మాధవి అరువ గారి ఆధ్వర్యంలో గొప్పగా జరిగాయి. మ్యూజిక్ ఆడియో సిస్టంను ఏర్పాటు చేసిన రాజ్ చిలుముల, కాన్ఫరెన్స్ డైరెక్టర్ రఘువీర్ రెడ్డిలు విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యూజెర్సీ సయ్యంది పాదం బృందానికి అభినందనలు తెలిపారు. సక్సెస్ చేయడంలో.. వర్జీనియా నుండి న్యూ జెర్సీకు వచ్చిన సయ్యంది పాదం ఛైర్ సుధారాణి కొండపు, కో-ఛైర్ భాను మాగులూరి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. వాలంటీర్లకు, న్యూజెర్సీ ఆటా టీమ్ రాజ్ చిలుముల, రీజినల్ కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆటా బృందం ప్రతి విభాగంలో విజేతలకు సర్టిఫికెట్లు, మెమోంటోలను అందించారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవడానికి ఇందిరా దీక్షిత్, మాధవి అరువ, నందిని దార్గుల, వాణి అనుగుల, రాజ్ చిలుముల, రఘువీర్ రెడ్డి , సంతోష్ రెడ్డి, శరత్ వేముల , విజయ్ కుందూరు, మహీందర్ రెడ్డి ముసుకు, రవీందర్ గూడూరు , శ్రీకాంత్ గుడిపాటి , శ్రీనివాస్ దార్గుల, శైల మండల ,బిందు, వినోద్ కోడూరు, రామ్ రెడ్డి వేముల, శివాని, విజయ ,ప్రవీణ్, నిహారిక , అపర్ణ, ప్రదీప్ కట్ట , విలాస్ రెడ్డి జంబులతో పాటు మిగితా వలంటీర్లు కృషి చేసారు. వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం పట్ల సయ్యంది పాదం పోటీల ఛైర్ సుధా కొండపు, సలహాదారు రామకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు స్థానిక కోఆర్డినేటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. విజేతల వివరాలు సోలో నాన్ క్లాసికల్ సీనియర్ – నేహా రెడ్డి వంగపాటి, సోలో నాన్ క్లాసికల్ జూనియర్ – సంజన నూకెళ్ల, సోలో సీనియర్ క్లాసికల్ – మెగానా మధురకవి, సోలో జూనియర్ క్లాసికల్ – జాన్వీ ఇరివిచెట్టి, నాన్ క్లాసికల్ గ్రూప్ జూనియర్ – నిషా స్కూల్ ఆఫ్ డ్యాన్స్, నాన్ క్లాసికల్ గ్రూప్ సీనియర్ – శైలా మండల స్కూల్ ఆఫ్ డాన్స్, గ్రూప్ జూనియర్ – చార్వి పొట్లూరి, శ్రీనికా కృష్ణన్లు ఉన్నారు. ఆటా 17వ కన్వెన్షన్ ఆటా 17వ కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ను వాల్టర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో జూలె 1 నుంచి 3 వరకు వాషింగ్టన్ డీసీలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, బోర్డు ఆఫ్ ట్రస్టీలు వివిధ కమిటీల ఆధ్వర్యములో అమెరికా తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభలు జరగబోతున్నాయి. కావున తెలుగువారందరూ ఈ మహాసభలకు హాజరై, భారీ స్థాయిలో విజయవంతం చేయాలని ఆటా ప్రతినిధులు కోరారు. ఇళయరాజ సంగీత విభావరి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తన మొత్తం ట్రూప్ తో జూలై 3న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరుకానున్నారు. విజయ్ దేవరకొండ, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, రకుల్ ప్రీత్ సింగ్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ వేడుకకు విచ్చేయనున్నారు. సంగీత దర్శకుడు తమన్ జూలై 2న సంగీత కచేరీలో ప్రేక్షకులను అలరించనున్నారు. చదవండి: న్యూజెర్సీలో ‘తెలంగాణ’ ఉట్టిపడేలా ఉత్సవాలు -
అరిజోన రాష్ట్రంలో ఆటా ఫీనిక్స్ టీం ప్రారంభం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నూతనంగా ఫీనిక్స్, అరిజోన, టీం ఆరంభించారు. జూన్ 5న అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో దాదాపు 400 పైగా తెలుగు వారు పాల్గొన్నారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల ముఖ్య అతిధులుగా వచ్చారు. ఈ కార్యక్రంలో చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్, పాటల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందచేశారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లడుతూ.. ఫీనిక్స్ లోకల్ టీం సేవలు కొనియాడారు. వందమందికి పైగా కొత్త సభ్యులు చేరటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రఘు గాడి, రీజినల్ కోఆర్డినేటర్, శేషిరెడ్డి గాదె కో-చైర్ అట స్పోర్ట్స్ ,వంశీ ఏరువారం, ఆర్సీ చెన్నయ్య మద్దూరి ఆర్.సి., బిందా కిరణ్ ఈవెంట్ కోఆర్డినేటర్ కొత్తగా మెంబెర్స్ చేర్పించటంలో ఎంతో తోడ్పాటుని అందించారని తెలిపారు. ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాలమాట్లాడుతూ భవిష్యత్తులో ఈ టీం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు, ఆర్గనైజింగ్ టీం సభ్యులు శిల్ప పెనెత్స, రేఖ రెడ్డి ,మదన్ గోపాల్ బొల్లారెడ్డి , ఋక్కు మిల, అనుదీప్ యాపల,సుదర్శన్ మాచుపల్లి, ప్రసాద్ తాటికొండ, ప్రశాంత్ గంగవల్లి , విజయ్ కందుకూరి తదితరులుని అభినందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా నివేదిత గాడి, భార్గవి మహీధర్, కిరణ్మయి జ్యోతుల, నీరజ వ్యవరించారు. చదవండి: డాలస్లో శ్రీనివాసుడి కల్యాణం -
జోరుగా సాగుతున్న ఆటా డీసీ కాన్ఫరెన్స్ సన్నాహాక ఏర్పాట్లు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ మొట్ట మొదటిసారి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 17వ కాన్ఫరెన్స్ , యూత్ కన్వెన్షన్ని జులై 1 నుంచి 3 తారీకు వరకు ఘనంగా నిర్వహించనున్నారు. వాషింగ్టన్ డీసీ వాల్తేర్ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి ముఖ్య అతిథులుగా సద్గురు జగ్గీవాసుదేవ్, విజయ్ దేవరకొండ, రకుల్ ప్రీత్ సింగ్, కపిల్ దేవ్, బాలకృష్ణ తదితరులు విచ్చేయచున్నారు. ఆబాలగోపాలాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించే మాస్ట్రో ఇళయరాజా ట్రూప్ చేత మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంది బిజినెస్, రాజకీయ, సామాజిక, సాహిత్య, కవులు కళాకారులు, ప్రముఖులు, మేధావులు హాజరవబోతున్న ఈ కార్యకమంలో దాదాపు 1౦,౦౦౦ మందికి పైగా భాగస్వాములు అవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్, కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కవిత, జి.ఎం.ర్. ఉపాసన కామినేని తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల అధ్యక్షతన సుధీర్ బండారు కన్వీనర్గా, క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ కో-హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కాన్ఫరెన్స్ కి ఉత్తర అమెరికాలో తెలుగు వారు పెద్ద ఎత్తున హాజరయ్యి తెలుగు వారి ప్రత్యేకతను చాటవలసిందిగా ఆటా కార్యవర్గం ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 2.3 మిలియన చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కన్వెన్షన్ సెంటర్ లో మినీ షాపింగ్ మాల్ తలపించనుంది. 200 పైగా ప్రత్యేక స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా రియల్ ఎస్టేట్, జ్యుయల్లరీ, చీరలు, ఇన్సూరెన్స్, ఇన్నోవేటివ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. మిగిలి ఉన్న అతి కొద్ది వెండర్ బూత్ కొరకు త్వరగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధఙంచి మరిన్ని వివరాల్లో కోసం https://www.ataconference.org/exhibits సంప్రదించగలరు. చదవండి: సీఎం జగన్ను కలిసిన ఆటా ప్రతినిధుల బృందం -
సీఎం జగన్ను కలిసిన ఆటా ప్రతినిధుల బృందం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి ఆటా తెలుగు మహాసభలకు ఆహ్వానించారు. వాషింగ్టన్ డీసీ జూలై 1 నుంచి 3 వరకు 17వ ఆటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ని కలిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాదరెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ సన్నీరెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ జయంత్ చల్లా ఉన్నారు. చదవండి: (గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన సీఎం జగన్ దంపతులు) -
వాణిజ్యవేత్తలకు దన్నుగా నిలుస్తున్న ఆటా
హైదరాబాద్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) హైదరాబాద్ నగరంలో బిజినెస్ సెమినార్ 2021ను నిర్వహించింది. వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలను ప్రోత్సహించడం, యువ వాణిజ్యవేత్తలకు మెంటారింగ్, వెంచర్ క్యాపిటలిస్టులకు ఒక వేదిక కల్పించడం, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందివ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో అమెరికా, భారతదేశాలకు చెందిన దాదాపు 100 పాల్గొన్నారు. లక్ష్యాలు ఇవే ఈ సెమినార్లో ఆటా వేడుకల బిజినెస్ కమిటీ ఛైర్ శ్రీ కాశీ కొత్త మాట్లాడుతూ.. బిజినెస్ సెమినార్ ఎజెండా బహుముఖం. అమెరికాలో స్థిరపడిన తెలుగు వాణిజ్యవేత్తలు, తెలంగాణలోని వ్యాపారవేత్తల మధ్య అనుసంధానం, అనుబంధం పెంచాల్సి ఉందన్నారు. తెలంగాణలోని స్టార్టప్ కంపెనీలకు మెంటారింగ్ చేసి, వాటిలో పెట్టుబడులు వచ్చేలా సూచనలు చేస్తామన్నారు. అదే విధంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ లాంటి టైర్-2 నగరాలకు మరిన్ని కంపెనీలను ఆకర్షించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలని తెలిపారు. ప్రతీ రెండేళ్లకు ఓసారి ఆటా కాన్ఫరెన్స్ సలహా కమిటీ చైర్మన్ జయంత్ చల్లా మాట్లాడుతూ.. 2014 నుంచి హైదరాబాద్లో ప్రతీ రెండేళ్లకు ఓసారి ఆటా ఇలాంటి సెమినార్లు నిర్వహిస్తోందని తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు భారతీయ స్టార్టప్లలో దాదాపు 20 మిలియన్ డాలర్లు (రూ. 150 కోట్లకు పైగా) పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ బిజినెస్ సెమినార్ల వల్ల పలు సంంస్థలు టైర్-2 నగరాలకు తరలి వచ్చాయన్నారు. ఖమ్మంలో టి-హబ్ ప్రారంభించడమనేది ఆటా బిజినెస్ కో-ఛైర్ చేపూరి సాధించిన ఓ అతిపెద్ద విజయంగా భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. పాల్గొన్న వారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్, తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, ఐటీ పెట్టుబడుల విభాగం సీఈవో విజయ్ రంగినేని, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈవో శ్రీకాంత్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఆటా తరఫున భువనేష్ బూజల (ఆటా ప్రెసిడెంట్), మధు బొమ్మినేని (ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్), ఆటా వేడుకల ఛైర్ జయంత్ చల్లా, సదస్సు సలహా కమిటీ ఛైర్ కిరణ్ పాశంలతో పాటు సమన్వయకర్తలు కాశీ కొత్త, ఆటా వేడుకల బిజినెస్ ఛైర్ లక్ష్ చేపూరి, ఆటా వేడుకలు బిజినెస్ కో-ఛైర్ తదితరులు పాల్గొన్నారు. 1990 నుంచి అమెరికా వ్యాప్తంగా ఉన్న ఐదువేల మందికి పైగా తెలుగువారికి ప్రాతినిధ్యం వహించేందుకు 1990లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఇందులో పెద్ద సంఖ్యలో సభ్యత్వం కలిగి ఉన్నారు. అమెరికాకు వచ్చిన తొలితరం వారు ఎక్కువ మంది ఆటాలో సభ్యత్వం కలిగి ఉన్నారు. సమాజ సేవ, వ్యాపారం, సంస్కృతి, సామాజిక కార్యకలాపాలు, విద్యార్థులకు సాయం, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ, ప్రోత్సాహం తదితరాల బాధ్యతలను అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ నిర్వహిస్తుంది. -
ఆటా నాదం పాటల పోటీల విజేతలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన “ఆటా నాదం” పాటల పోటీల్లో ఫైనల్ రౌండ్లో 13 మంది గాయనీగాయకులు పాల్గొనగా.. విజేతలుగా ప్రథమ స్థానంలో కే ప్రణతి, ద్వితీయ స్థానంలో దాసరి మేఘన నాయుడు, తృతీయ స్థానంలో వెంకట సాయి లక్ష్మి, పాసాల హర్షిత, అవసరాల అభినవ్లు నిలిచారు. సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ నిహాల్ కొందూరి, ప్లేబాక్ సింగర్, సినీ మ్యుజిషియన్ యూనియన్ ప్రెసిడెంట్ విజయ లక్ష్మి, సంగీత దర్శకులు,ప్లేబ్యాక్ సింగర్ సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహారించారు. ఆటా మహాసభల సన్నహాక కార్యక్రమములో భాగంగా ప్రతిభా వంతులైన యువ గాయనీగాయకులకు ప్రోత్సహాం అందించేందుకు ఆటా నాదం పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన 200ల మంది గాయనీ గాయకులు పాల్గొన్నారు. రవీంద్రభారతి హైదరాబాద్ డిసెంబర్ 26, 2021 లో సాయంత్రం 7 గంటలకు జరిగే ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలే” సాంస్కృతిక కార్యక్రములో విజేతలకు పాడే అవకాశం ఆటా కల్పిస్తోంది. -
దిగ్విజయంగా కొనసాగుతున్న ఆటా నాదం పాటల పోటీలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహిస్తోన్న ఆటా నాదం పాటల పోటీలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఆటా జూమ్ ద్వారా ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాదాపుగా 200 మంది గాయని గాయకులు ఈ పోటీలో పాల్గొన్నారు. అక్టోబర్ 23న ప్రిలిమినరీ రౌండ్ తో ప్రారంభించి సెమి ఫైనల్స్ నవంబర్ 6 న ముగిశాయి. సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్ నిహాల్ కొందూరి , ప్లేబాక్ సింగర్ విజయ లక్ష్మి, సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు నవంబరు 13న ఇరు తెలుగు రాష్ట్రాలనుండి పదకొండు మంది గాయని గాయకులు అభినవ్ అవసరాల, గీత మహతి పిసుపాటి, జ్యోస్న నిమ్మలపాడి, లక్ష్మి శ్రీవల్లి కాందూరి, లేఖ సదా ఫణిశ్రీ వీర,మేఘన నాయుడు దాసరి, నిగమ నెల్లుట్ల, ప్రణతి కే , సాయి శృతి పొలిశెట్టి, సాకేత్ కొమ్మజోస్యుల,వెంకట సాయి లక్ష్మి హర్షిత పాసాల ఫైనల్ రౌండ్ కు ఎంపిక అయ్యారు. గెలుపొందిన ఈ గాయని గాయకులు మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన న్యాయనిర్ణేతగా 2021 నవంబర్ 13న జరిగే ఫైనల్స్ లో పోటీపడబోతున్నారు. ఈ పోటీలో విజేతలకు 2021 డిసెంబరు 26 సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలేలో పాడే అవకాశం కల్పిస్తున్నారు. మొదటిసారి ఉత్తరాధ్యక్షులు మరియు ఆటా సేవ డేస్ మరియు ఆటా వేడుకల చైర్మన్ మధు బొమ్మినేని, పాలకమండలి సభ్యులు , సంయుక్త కార్యదర్శి, ఆటానాదం కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి ఆల , పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ అనిల్ బొద్దిరెడ్డి , పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్ శరత్ వేముల, పాలకమండలి సభ్యులు ఆటా నాదం కోఆర్డినేటర్ శారద సింగిరెడ్డి మాతృదేశంలో ఇరు తెలుగురాష్ట్రాలలో ప్రతిభఉన్న గాయనిగాయకుల కోసం మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఎస్పీబీకి ‘ఆటా’ స్వర నీరాజనం
డల్లాస్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) డల్లాస్, టెక్సాస్ కార్యవర్గ బృందం 2021 సెప్టెంబర్ 25న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మొదటి వర్థంతి వేడుకలు నిర్వహించారు. డల్లాస్కి చెందిన గాయనీగాయకుల చేత బాలు గాన సుధా స్మృతి అనే సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజశేఖర్ సూరిభొట్ల, సంతోష్ ఖమ్మామ్కర్, జానకి శంకర్, సాయి రాజేష్ మహాభాష్యం, సృజన ఆడూరి , ప్రభాకర్ కోట, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, నాగి వడ్లమన్నాటి, బాలాజి నరసింహన్, వీణ యెలమంచలి, జ్యోతి సాదు, మల్లిక సూర్యదేవర, రోషిని బుద్ధ లు ఎస్పీబీ పాడిన యాభైకి పైగా గీతాలను ఆలపించారు. బాలుతో విడదీయలేని బంధం ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, ఉత్తరాధ్యక్షులు మధు బొమ్మినేని బాలు గారితో ఆటా సంస్థ కి ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. అలానే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఆయన లేని లోటు ఎప్పటికి తీరదన్నారు. బాలు మన మధ్య లేక పోయినా ఆయన పాట చిరస్థాయిగా సంగీత ప్రియుల హృదయాలలో నిలిచి ఉంటుందన్నారు. చదవండి: విజయవంతమైన తానా సాహిత్య సదస్సు -
డెట్రాయిట్లో జరిగిన ఆటా బోర్డు సమావేశం
డెట్రాయిట్: వచ్చే ఏడాది జులైలో డెట్రాయిట్ వేదికగా జరగనున్న ఆటా 17వ సమావేశాలు, యూత్ కన్వెన్షన్కి 1.25 మిలియన్ డాలర్లు నిధులను ఇప్పటి వరకు సమీకరించినట్టు ఆటా ప్రతినిధులు తెలిపారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) బోర్డు సమావేశం శనివారం డెట్రాయిట్ నగరంలో జరిగింది. ఈ సందర్భంగా హర్ట్పుల్నెస్ ప్రోగ్రామ్ గైడ్ కమలేశ్ డీ పటేల్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా బోర్టు సమావేశం ప్రారంభించడానికి ముందు సెప్టెంబర్ 11 బాధితులకు నివాళి అర్పించారు. ఆటా ఆర్థిక స్వయం సమృద్ధికి సంబంధించిన విశేషాలను ఆటా అధ్యక్షుడు భువనేశ్ బూజాల, కార్యదర్శి హరిప్రసాద్రెడ్డలు వివరించారు. ఈ సమావేశంలో ఫైనాన్షియల్ రిపోర్టును ట్రెజరర్ బోయపల్లి సాయినాథ్రెడ్డి ప్రవేశపెట్టారు. గడిచిన కొద్ది కాలంలోనే వెయ్యి మందికి పైగా కొత్తగా ఆటాలో సభ్యత్వం తీసుకున్నట్టు మెంబర్ కమిటీ సభ్యుడు నర్సిరెడ్డి తెలిపారు. చదవండి : తొలి గోల్ఫ్ టోర్నమెంట్ను గ్రాండ్గా నిర్వహించిన ఆటా -
వాషింగ్టన్ డీసీ వేదికగా ఆటా వేడుకలు
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ని 2022 జులై 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆటా కార్యవర్గం ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న హెర్న్డాన్ వరల్డ్ గేట్ సెంటర్ ఏరియాలో క్రౌన్ ప్లాజా హోటల్లో జరిగిన ఆటా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు ఎనిమిది వందల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటిసారి ఇప్పటి వరకు 16 సార్లు ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్లు జరిగాయి. అయితే ఇవన్నీ అమెరికాలోని వేర్వేరు నగరాల్లో జరిగాయి. అయితే 17వ కాన్ఫరెన్స్కి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మొదటిసారి వేదికగా నిలవనుంది. ఈ వేడుకలు నిర్వహించేందుకు వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్ని ఎంపిక చేశారు. ఈ కాన్ఫరెన్స్కి క్యాపిటల్ ఏరియా తెలుగు సంఘం, కాట్స్ కో హోస్ట్గా వ్యవహరిస్తోంది. ఏర్పాట్ల పరిశీలన ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కాట్స్ ఆధ్వర్యంలో 70 మందికి పైగా ఆటా కార్యవర్గ, అడ్హాక్, అడ్విసోరీ, లోకల్ కన్వెన్షన్ కమిటీలు కాన్ఫరెన్స్ ఏర్పాట్లను పరిశీలించారు. వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న సౌకర్యాలను పర్యవేక్షించారు. 12 వేల మంది ఆటా కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్ను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం లో 12,000 మందికి పైగా తెలుగు వారు పాల్గొనే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
'ఆటా' ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆదివారం(మార్చి 7) రోజున నిర్వహించింది. ‘చూస్ టు ఛాలెంజ్’ అనే థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆటా పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత డీకే అరుణ, ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తి, సినీ దర్శకురాలు నందిని, సినీయర్ నటి లయలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తితిదే ఆస్థాన విద్వాంసురాలు పద్మశ్రీ శోభారాజు అమ్మ మీద ఓ పాటతో ప్రారంభమైంది. అనంతరం ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తి మాట్లాడుతూ.. మహిళలకు ఎన్నో సూచనలు ఇచ్చారు. మహిళలు తమ ఆలోచనా విధానం మార్చుకుంటే చక్కటి అవకాశాలు పొందవచ్చన్నారు. పూర్తి సామర్ధ్యలు వినియోగించుకుంటే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, స్త్రీ శక్తి ముందు ఏదైనా దిగ దిడుపే అని ఆమె వ్యాఖ్యానించారు. ఇక ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లాడుతూ.. మహిళలను గౌరవించటం మన సంప్రదాయమని, కుటుంబలో ప్రేమ బాంధవ్యాలు పెంపొందిచటంలో, మెరుగైన సమాజం సృష్టించటంలో మహిళల సేవ ఎనలేనిదని కొనియాడారు. అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని మాట్లాడుతూ.. స్త్రీలు మగ వారి కంటే అన్ని విషయాలలో ఒక అడుగు ముందే వుంటారన్నారు. అన్ని రంగాలలో మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని, అయినా ఇంకా ఎంతో చేయవలసింది ఉందన్నారు. బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ ఆటా సబ్యులని, మహిళామణులని అభినందించారు. మహిళలు పాలనా పరమైన సెగ్మెంట్లో ఆటా మొదటి మహిళ ప్రెసిడెంట్ సంధ్య గవ్వ గారు మహిళ సాధికారత మీద ప్రసంగించారు. సినీ నటి లయ మాట్లాడుతూ.. మహిళలు స్వీయ విశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు. నంది అవార్డు గ్రహీత డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ... మహిళలు ఏదైనా సాధించగల దృఢ చిత్తం కలవారు అని కొనియాడారు. ఆటా ఉమెన్స్ కోఆర్డినేటర్ అనిత యజ్ఞిక్ ఎంతో సమర్ధవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆటా మహిళామణులు అభినందించారు. ఆటా కార్యవర్గం, ట్రస్టిస్ మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
'ఆటా' కొత్త అధ్యక్షునిగా భువనేశ్ బుజాల
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా భువనేశ్ బుజాల పదవీ బాధ్యతలు స్వీకరించారు. వాషింగ్టన్ డీసీ నివాసి అయిన భువనేశ్ 2004వ సంవత్సరం నుంచి ఆటాలో ఉత్సాహంగా పాలుపంచుకొంటున్నారు. 2014లో జరిగిన ఫిలడెల్ఫియా కన్వెన్షన్లో కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహించిన ఆయన నాశ్విల్లే నగరంలో జనవరి 16న జరిగిన 'ఆటా' కార్యవర్గ సమావేశంలో ప్రెసిడెంట్ పదవిని స్వీకరించారు. డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్గా జయంత్ చల్లా, కాశీ విశ్వనాధ్ కొత్త, పరశురాం పిన్నపురెడ్డి, శారద సింగిరెడ్డి, సోమశేఖర్ నల్ల, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, హనుతిరుమల్ రెడ్డి, ప్రశీల్ గూకంటి, రఘువీర్ రెడ్డి, రామ్ అన్నాడీ , రవీందర్ గూడూర్, రింద సామ, శరత్ వేముల, సుధీర్ బండారు & విజయభాస్కర్ తూపల్లి ఎన్నికయ్యారు. ఇక ఆటా ప్రెసిడెంట్గా భువనేశ్ భూజాల, సెక్రటరీగా హరిప్రసాద్ రెడ్డి లింగాల, ట్రెజరర్గా సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ ట్రెజరర్గా విజయ్ కుందూరు ఎన్నిక అయ్యారు. నష్విల్లె నగరంలో జరిగిన ఆటా బోర్డు మీటింగ్లో నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించింది. తదుపరి ప్రెసిడెంట్గా మధు బొమ్మినేని ఎన్నికయ్యారు. ఇక ప్రెసిడెంట్ భువనేశ్ మాట్లాడుతూ.. ఆటా ఎమర్జెన్సీ సర్వీసెస్ను అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తున్నామని చెప్పారు. ఆపదలో ఉన్న తెలుగు వారు ఆటా సేవ 1-844-ATA-SEVA టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆటా ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆటా ఎల్లప్పుడూ పెద్ద పీఠ వేస్తుందని పేర్కొన్నారు. మన మాతృభూమిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకునే ప్రవాసులు ఆటాను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ నిర్వహణ కార్యక్రమంలో అమెరికాలో పుట్టిపెరిగిన మన పిల్లలను భాగస్వాములను చేయడానికి తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఆయన బోర్డును కోరారు. యూత్ కమిటీ ఏర్పాటు చేశారు. మొట్ట మొదటసారిగా ఆటా కన్వెన్షన్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో 2022 సంవత్సరంలో జులై 1 నుంచి 3 తేదీలలో నిర్వహిస్తున్నామని అందరూ తప్పక పాలుపంచుకోవాలన్నారు. కోవిడ్-19 సమయంలో సహాయక చర్యలు, సంస్థ బాధ్యతలు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి పదవీ విరమణ చేసిన పరమేష్ భీంరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన రవి పట్లోళ్ల, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డిని బోర్డు అభినందించింది. నాశ్విల్లే నగరంలో ఆతిధ్యం ఇచ్చిన ఆటా సభ్యులకు బోర్డు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఆటాకి తోడ్పాటునందిస్తున్న లోకల్ ఆర్గనైజషన్స్ను బోర్డు కొనియాడింది. -
విజయవంతంగా ఆటా పాటల పోటీలు
అమెరికాలోని తెలుగుసంఘం(ఆటా) ఆధ్వర్యంలో ‘ఝుమ్మందినాదం’ సీనియర్ క్లాసికల్ పాటల పోటీలు జూలై 12 నుంచి 19 తేదీల్లో ఆన్లైన్ జూమ్ ద్వారా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 65మంది గాయని గాయకులు అమెరికాలోని పలు రాష్ట్రాలకు చెందినవారు ఆసక్తితో పాల్గొన్నారు. ‘ఝుమ్మంది నాదం’ కార్యక్రమాన్ని ఆల రామ కృష్ణారెడ్డి బోర్డు ఆఫ్ ట్రస్టీ, శారదా సింగిరెడ్డి నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి అమెరికా, భారత్ నుంచి సంగీత దర్శకులు రాజశేఖర్ సూరిభొట్ల, ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకులు శ్రీనిహాల్ కొండూరి, ప్లేబ్యాక్ సింగర్ కుమారి, నూతన మోహన్, ప్లేబ్యాక్ సింగర్ వేణు శ్రీరంగం, సింగర్, ఇండియన్ ఐడల్ రన్నర్ అప్ పీవీఎస్ఎన్ రోహిత్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆటా సంస్థ సీనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీ గాయకులుగా అపరాజిత పమిడిముక్కల, చైత్ర ఆర్ని, జ్యోత్స్నా ఆకుంది, కార్తిక్ స్వామి, మైన ఏదుల, ప్రణవ్ అర్కటాల, ప్రణవ్ బార్ల, ప్రియాంక కొలనుపాక, శృతి శేఖర్, శ్రీప్రజ్ఞ వెల్లంకి, సుదార్చిత్ సొంటి, తేజశ్రీ మేక, వాదిరాజ్ గర్లపాడ్ ఫైనలిస్ట్స్గా ఎంపిక చేశారు. వీరు వాషింగ్టన్, న్యూజెర్సీ, టెక్సాస్, నార్త్ క్యారలిన్, జార్జీయా, ఆరిజోనా,క్యాలిఫోర్నియా, న్యూయార్క్, వర్జీనియా, మిన్నిసోటా రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్రెడ్డి భుజాల.. బోర్డు ఆఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్మన్లు, రీజనల్ డైరెక్టర్లు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఆటా 2020 కన్వన్షన్ బృందం, ‘ఝుమ్మంది నాదం’ బృందం, సోషల్ మీడియా టీం, ఫైనలిస్ట్స్కు అభినందనలు తెలియజేశారు. పోటీలో పాల్గొన్న గాయని, గాయకులు, వారి తల్లిదండ్రులు.. ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందడం సంస్థకు గర్వకారణమని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీరెడ్డి అన్నారు. ఆటా ‘ఝమ్మంది నాదం’ సెమీ ఫైనల్స్ పాటల పోటీలు ఆగస్ట్2, 2020న, ఫైనల్స్ను ఆగస్ట్ 8, 2020 నుంచి 9 వరకు కొనసాగనున్నాయి. ఆటా సంస్థ లైవ్ ప్రచారం చేస్తున్న మన టీవీ, మన టీవీ ఇంటర్నేషనల్, టీవీ5, జీఎన్ఎన్, ఏబీఆర్ ప్రొడక్షన్స్, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, టోరీ రేడియో ఇతర మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఝుమ్మంది నాదం పాటల పోటీ విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ప్రెసిడెంట్ పరమేష్ భీం రెడ్డి అభినందనలు తెలిపారు. -
ఆటా 'ఝుమ్మంది నాదం' పాటల పోటీలు
వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) “ఝుమ్మంది నాదం” పాటల పోటీలను జూన్ 28 నుంచి ఆగష్టు 2 వరకు నిర్వహిస్తోంది. అందులో భాగంగా జూన్ 28న సబ్జూనియర్స్ నాన్ క్లాసికల్, జూలై 4, 5 తేదీలలో జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలను ఆన్లైన్లో జూమ్ ద్వారా నిర్వహించారు. దాదాపుగా 82 మంది గాయనీ గాయకులు అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి ఆసక్తితో పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణా రెడ్డి ఆల బోర్డు ఆఫ్ ట్రస్టీ, శారదా సింగిరెడ్డి ఝుమ్మంది నాదం చైర్ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. అమెరికా, ఇండియా నుంచి కర్నాటిక్ మ్యూజీషియన్ వాసగోపినాధ్ రావు, సంగీత దర్శకులు శ్రీని ప్రభల, సంగీత దర్శకులు రాజశేఖర్ సూరిభొట్ల, ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకులు నిహాల్ కొండూరి, ప్లే బ్యాక్ సింగర్ నూతన మోహన్, ప్లే బ్యాక్ సింగర్ మానస ఆచార్య, ప్లే బ్యాక్ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. (ఆటా ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు) ఆటా సంస్థ అయిదు రీజియన్స్.. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, మిడ్ వెస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ల నుంచి సబ్ జూనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీమణులు.. అమ్రిత వుడుముల, అనన్య జొన్నాదుల, అనన్య యెర గుడిపాటి, కృతి రాచకొండ, మహి ఓత్ర, మిత్ర చెబియ, పర్జిక వుల్లగంటి, శరణ్య ఎస్, తన్వి గొంగల, వైష్ణవి రెండుచింతలను ఫైనలిస్ట్స్గా ఎంపిక చేశారు. ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్ రెడ్డి భుజాల, బోర్డు ఆఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజినల్ కోఆర్డినేటర్స్, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్, కాన్ఫరెన్స్ టీం, ఝుమ్మంది నాదం టీం, సోషల్ మీడియా టీం అమెరికాలో ఉన్న గాయనీగాయకుల నైపుణ్యతను ప్రదర్శించడానికి ఆటా సంస్థ ఏర్పరిచిన ఈ గొప్ప సదవకాశాన్ని ఉపయోగించుకుని సంగీత విద్వాంసుల ముందు వారి సంగీత ప్రతిభను చూపిస్తున్న గాయని గాయకులందరికీ అభినందనలు తెలియజేశారు. ఆటా సంస్థ లైవ్ ప్రచారం చేస్తున్న టీవీ చానళ్లకు, అలాగే తెలుగు ఎన్నారై రేడియో, టోరీ రేడియో, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఝుమ్మంది నాదం పాటల పోటీ విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి ప్రశంసలు తెలిపారు. (ఆటా అధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు) -
దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు...
జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ డేన్ పీట్ అనూహ్య నిర్ణయంతో ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సభ్యదేశమైన దక్షిణాఫ్రికా జట్టును వదిలి అసోసియేట్ టీమ్ అమెరికాతో జతకట్టేందుకు సిద్ధమయ్యాడు. శనివారం ఉదయమే ఈ ఒప్పందానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని అతను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్పై సంతకం చేశా. చాలా కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ... ఇది నాకో మంచి అవకాశం. ఆర్థికంగానూ, జీవనశైలి పరంగానూ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని వదులుకోలేకపోయాను. పైగా గతేడాది అమెరికాకు వన్డే జట్టు హోదా దక్కింది. ఇంకా ఆలోచించడానికి ఏముంది? దక్షిణాఫ్రికా వన్డే తుది జట్టులో తనకు చోటు దక్కే అవకాశాలు అతి స్వల్పంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను ’ అని పీట్ వ్యాఖ్యానించాడు. ఈ వేసవిలో ప్రారంభం కానున్న ‘ మైనర్ లీగ్ టి20 టోర్నమెంట్’ నుంచి అతను అమెరికా తరఫున తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. 2014లో సఫారీ జట్టు తరఫున అరంగేట్రం చేసిన పీట్ తొమ్మిది టెస్టుల్లో 26 వికెట్లు దక్కించుకున్నాడు. -
ఆటా అధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు
వాషింగ్టన్: అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) డీసీ రిజీయన్ నిర్వహకులు అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలను వాషింగ్టన్ సమీపంలోని చిన్మయ సోమనాథ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్సాస్ రాష్ట్రంలోని మన్షాట్టన్ నగర మేయర్ ఉషారెడ్డి, ఫెయిర్ఫాక్స్ కౌంటీ పబ్లిక్ స్కూల్ సభ్యులు రచన సిజెమోర్లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ ఉషారెడ్డి మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా మహిళలు రాణిస్తున్నారన్నారు. ఇక స్త్రీ, పురుష భేదం లేకుండా మహిళలు, బాలికలు అన్ని రంగాల్లో తమ కలలను సాకారం చేసే దిశగా వారిని ప్రోత్సహించాలనన్నారు. అనంతరం ఆటా సంఘం అధ్యక్షులకు, సంఘ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇక రచన సిజెమోర్ మాట్లాడుతూ.. దక్షిణాసియా మహిళలందరూ సమాజా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా అటా సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అటా సంఘ స్థానిక తెలుగు అసోసియేషన్ నాయకురాలు సుధ కొండపు, క్యాపిటల్ ఏరియా అధ్యక్షులు సాయి సుధ పలడుగు, గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సోసైట్ అధ్యక్షురాలు పుష్యమి దువూరి, తెలంగాణ అభివృద్ధి ఫోరం అధ్యక్షురాలు డాక్టర్ ప్రభావతి రెడ్డి స్కాలర్, కుచిపుడి డాన్స్ అకాడమీకి చెందిన లక్ష్మి బాబు, సాయికాంత రాపర్ల, డ్యాన్స్ టీచర్ శ్రీలేఖా పల్లె, ఆయా రంగాలలో, సమాజ సేవలో రాణిస్తున్న సంఘం నాయకురాలు మిస్ ఇండియా డీసీ స్నేహ మిశ్రా, భారతీ సంధ్య బైరెడ్డిలతో పాటు వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళ నాయకులను ఆహ్వనించారు. అంతేగాక ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి రాఫెల్ టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కుట్టు మిషిన్లు అందించడానికి ఏబీవీ ఫౌండేషన్(abvfoundarion.org)కు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారంత మహిళ సాధికారతను ప్రోత్సహించడానికి బ్యూటీషియన్ కుర్చీలను కూడా అందజేశారు. ఆటా సంఘం నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు.. శీరిష కొంపల్లి, శ్రీలేఖ పల్లె, దీపికా బూజల, నందిని యెదులా, ప్రసన్న కొమటిరెడ్డి గీతా బోజ్జలకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా డీసీ అధికారులు భువనేశ్వర్ బూజల, అధ్యక్షుడు జయ చల్లాలకు ధన్యవాధాలు తెలిపారు. అంతేగాక ఈ కార్యక్రమానికి హజరై విజయవంత చేసిన వాలంటీర్లకు ఇతర సంఘ నాయకులకు, నిర్వహకులకు ఆటా సంఘం నిర్వహకులు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. -
భూపతిరాజు లక్ష్మికి లేడీ లెజెండ్ అవార్డు
హైదరాబాద్ : కూచిపూడి నాట్య గురువు శ్రీమతి భూపతిరాజు లక్ష్మీకి అంతర్జాతీయ లేడీ లెజెండ్-2020 అవార్డు వరించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఏటా బెక్కంటి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్, ఆటా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా భద్రాచలంలో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ మేరకు ట్రస్ట్ చైర్మన్, ఆట జాతీయ అధ్యక్షులు బెక్కంటి శ్రీనివాస్రావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భూపతిరాజు లక్ష్మి వద్ద పలువురు నాట్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. -
ఆటా ఆధ్వర్యంలో 'యూఎస్ హయ్యర్ ఎడ్యుకేషన్' సెమినార్
హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసొసియేషన్(ఆటా), తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీఎస్సీహెచ్ఈ) ఆధ్వర్యంలో ' యూఎస్ హయ్యర్ ఎడ్యుకేషన్' పై గురువారం సెమినార్ నిర్వహించారు. అమెరికాలో ఉన్నత విద్యను చదవాలనుకుంటున్న విద్యార్థులకు సరైన ప్రణాళిక, అనుసరించాల్సిన వ్యూహం, మార్గదర్శనం చేయడమే ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశం.తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ టి. పాపిరెడ్డి మాట్లాడుతూ.. ఆటా ఆధ్వర్యంలో ఈ సెమినార్ను నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు సరైన కాలేజీని ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సెమినార్ నిర్వహించిన ఆటాకు, యూస్ కాన్సులేట్ జనరల్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి. వినోద్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి వచ్చేవారు 80శాతం మంది గ్రామీణ విద్యార్థులే ఉంటారని, అందులోనూ మద్య,దిగువ తరగతికి చెందినవారే ఉంటారని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రాజెక్టు వర్క్కోసం వచ్చే విద్యార్థులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను వివరించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ కన్సులర్ సెక్షన్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్, స్టేట్ యునివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ రిజిష్ట్రార్ రాజశేఖర్ వంగపతి, ఆటా ప్రెసిడెంట్ పరమేశ్ భీమ్రెడ్డి, భువనేశ్ కుమార్, జయదేవ్ చల్లా, కవిత(తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం), జాఫర్ జావేద్, ఫ్రొపెసర్ లింబాద్రి, ఫ్రొపెసర్ వి. వెంకటరమణ(టీఎస్సీహెచ్ఈ వైస్ చైర్మన్), సుల్తాన్ ఉల్ ఉలూం యునివర్సిటికీ చెందిన 50 మంది విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆటా ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం శనివారం ఘనంగా జరిగింది. ముందు తరాలతో సంభాషణ, నవ కవి సమ్మేళనం, పన్నెండు మంది కొత్తతరం కవుల కవిగానం, ఇప్పటి కథకుల ఆలోచనలు, అనుభవాలు, పద్యం పాటా, జానపదం కార్యక్రమాలను నిర్వహించారు. పన్నెండు మంది కొత్త తరం కవులతో నిర్వహించిన కవి సమ్మేళనం వైభవంగా జరిగింది. నేపద్య గేయ రచయితలు దేశపతి శ్రీనివాస్, అనంత శ్రీరామ్, ప్రొద్దుటూరి యెల్లారెడ్డిలు పద్యం, పాట, జానపదం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై అలనాటి కవులు, నేటి తరం కవులు కలిసి మొత్తం 39మంది కవులు అంతర్జాతీయ సాహితీ సదస్సులో పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు అమెరికాలో ఉన్న ఆటా తెలుగు ప్రజలకు వారధిగా ఉంటుందని అమెరికా తెలుగు సంఘం తదుపరి అధ్యక్షులు బువనేశ్ బుజాలా అన్నారు. కేవలం సాహిత్యమే కాకుండా ఇతర రంగాల్లో కూడా అభివృద్ధికి ఆటా అండగా ఉంటుందని ఆయన అన్నారు. సుప్రసిద్ద రచనా కవి కె.శివారెడ్డి మాట్లాడుతూ.. కొత్త తరాల మీద మనకు కొన్ని అపోహలు అపనమ్మకాలు ఉన్నాయి. ఇతరులతో మనం నమ్మకం ఉంచినప్పుడు అదే నమ్మకంతో కొనసాగాలని తెలిపారు. 'నలుగురితో చర్చలు జరుగితే ఆలోచనలు వికసిస్తాయి. ఈ ఆలోచనలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిదద్దుతాయని' వ్యాసకర్త, జానపద వాజ్మయ పరిశోధకుడు కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ద వచన కవులు కె.శివారెడ్డి, నందిని సిధారెడ్డి, రాచపాళెం, కె.శ్రీనివాస్, ఓల్గా, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డి, కె.ఎన్.మల్లీశ్వరి, వెల్దండి శ్రీధర్, పూడూరు రాజిరెడ్డి, వెంకట సిద్ధారెడ్డి, మల్లికార్జున్, పూర్ణిమ తమ్మిరెడ్డి, స్వాతి కుమారి బండ్లమూడి, ఆటా ప్రెసిడెంట్ పరమేశ్ భీంరెడ్డి, తదపరి ప్రెసిడెంట్ భువనేశ్ బుజాలా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోదిరెడ్డి, రామకృష్ణా రెడ్డి అలా, ఆటా 2020 కన్వీనర్ నర్సింహారెడ్డి ద్యాసానితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. -
అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
-
అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం
వాషింగ్టన్: నగరంలో కనుల పండుగగా శ్రీనివాస కళ్యాణ వేడుకలు ‘తారా’ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ రీడింగ్ అండ్ అరౌండ్) జనరల్ సెక్రటరీ 'సంతోష్ కుమార్ బచ్చు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ... శ్రీ వేంకటేశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి, అమ్మవార్ల విగ్రహాలకు తిరుపతిలో కళ్యాణం జరిగేంత ఘనంగా వేద పండితులు, అర్చకుల చేత కళ్యాణ వేడుకలు జరిపించినట్లు పేర్కొన్నారు. నాదస్వర వాయిద్యాల మధ్య కోలాటం ఆడుతూ... స్వామి వారిని పల్లకిలో స్వాగతిస్తూ.. సుప్రభాత సేవతో స్వామివారిని, అమ్మవార్లను ఊరేగించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తి విన్యాసాలతో, గోవింద నామాలతో , విష్ణు సహస్ర , అన్నమాచార్య కీర్తనలతో భక్త బృందం పాల్గొని తన్మయత్వంలో మునిగితేలారు. అలాగే ఉదయం ఏర్పాటు చేసిన ఫలహారాన్ని, కళ్యాణం తర్వాత పంచిన మహాప్రసాదాన్ని భక్తులు ఆస్వాదించారని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా తిరుపతి నుంచి తెప్పించిన లడ్డు, వడ ప్రసాదం విరివిరిగా పంచామని, చివరగా పల్లకి సేవతో స్వామివారికి, అమ్మవార్లకి భక్తులంతా వీడ్కోలు పలికినట్లు ఆయన వివరించారు. స్వామివారి కళ్యాణం తర్వాత తిరుపతి నుంచి తెప్పించిన లడ్డూ ఉచితంగా పంచడంతో భక్తులంతా హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. అనంతరం స్వామివారి కళ్యాణానికి హజరై విజయవంతం చేసిన భక్తులందరికి తారా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏటీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
అడిలైడ్ : అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్(ఏటిఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. సౌత్ ఆస్ట్రేలియా అడిలైడ్ పట్టణంలోని ఎల్డర్స్ పార్క్లో అక్టోబర్ 5న(శనివారం) ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా, మహిళలు పెద్ద ఎత్తున హాజరై రంగు రంగుల బతుకమ్మలను పేర్చి తమ ఆట పాటలతో అలరించారు. -
ఆటా ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్
వాషింగ్టన్ : ప్రవాస తెలుగు వారికే కాకుండా ప్రవాస భారతీయులందరికీ అండగా నిలిచే ఆటా, ఆగస్టు 17న అత్యున్నత స్థాయిలో హెల్త్ క్యాంపు నిర్వహించింది. అమెరికాలో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేపట్టే ఆటా నేడు చేసిన హెల్త్ క్యాంపు వల్ల పలు వర్గాల వారికి బహు విధాలా ప్రయోజనకరంగా వారి సేవలు అందించారు. ఆట వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు ఆరు వందలకు పైగా అమెరికా వాసులు, వారి బంధు మిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అతి విజయవంతంగా చేసారు. హేర్నడోన్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ ప్రోగ్రాం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 వరకు నడిచింది. కార్యక్రమంలో ౩౦ మంది పైగా డాక్టర్లు పాల్గొన్నారు. వైద్యో నారాయణో హరి: అన్నట్లుగానే వచ్చిన వైద్యులు చాలా ఓపికతో వచిన వారికీ సలహాలు ఇచ్చి వారి సమస్యలకు స్పందించారు. వచ్చిన వారందరు పలు స్పెషాలిటీస్ లో ఆరితేరిన నిపుణులు మరియు 10ఏళ్లకు పైగా అనభవాం కలిగిన వైద్యులు కావడం విశేషం. అరుదైన విధంగా హృదయేతర కార్డియాలజిస్ట్ , కిడ్నీ స్పెషలిస్ట్స్, ఇంటర్నల్ మెడిసిన్, దంత మరియు ఆర్థోపెడిక్ డాక్టర్స్, పిల్లల డాక్టర్స్, న్యూరాలజీ, అల్లెర్జీస్ సంబంధించిన నిపుణులను మరియు అనేక ఫార్మాసిస్ట్స్లను ఒకే చోటుకు తీసుకు వచ్చిన ఖ్యాతి ఆటా ఒక్కదానికే దక్కింది. వారికి వారే సాటి! అన్ని రకాల వైద్యులు ఒకే చోట ఉన్నందున వచ్చిన ప్రతి వ్యక్తి హర్షం వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ ఉన్నా ఎన్నోసార్లు తిరగాల్సిన అవసరం లేకుండా ఆటా ఈ విధంగా తమకి ఎంతో సాయం చేసిందని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రక్త పరీక్ష మరియు బీపీ చెకప్ చేయించుకొని డాక్టర్ల చేత సలహాలు పాందారు. డాక్టర్ రామకృష్ణన్ గారి హృదయ సమస్యల పరమైన అవగాహన మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం, డాక్టర్ వీరపల్లి గారి వ్యాధుల లక్షణాలు తెలుసుకోవడం, డాక్టర్ పాలువోయ్ గారిచే అల్లెర్జిఎస్ ఎలా అరికట్టాలో వినడం తమకు ఎంతో ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. వచ్చిన వారందరూ ఆటా ఈ క్యాంపు ద్వారా తమ రుగ్మతలను సకాలంలో వైద్య సదుపాయాలందించిందని అభినందించారు. వచ్చిన వైద్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువనేశ్ మాట్లాడుతూ.. సామాజిక ప్రయోజనమే లక్షంగా పెట్లుకొని ఈ ప్రొగ్రాం నిర్వహించామని , వైద్య సదుపాయాలు తెచ్చామని , ఆరోగ్యకరమైన అవగాహన కల్సించాలని , సామాజిక అభ్యున్నతికి సర్వ విధాలా ఆటా తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలియచేస్తూ , డాక్టర్ వెంకట్ గారి ప్రేరణనను అభినంధిస్తూ , వైద్యులందరికి కృతజ్ఞత భావంగా మెమెంటోలని సమర్పించారు .ఇంత పెద్ద ఎత్తున క్యాంపు ఎవరు చేయలేదని , ఇదే చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. ఆట బోర్డు అఫ్ ట్రస్టీస్ సౌమ్య కొండపల్లి మరియు జయంత్ చల్ల గార్లు మాట్లాడుతూ.. ఆట సంవత్సరం పొడువునా అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ప్రవాస తెలుగు వారికీ ఉన్నత విద్యలో స్కాలర్షిప్స్ ఇస్తుందని, భారతదేశంలో మానవీయ సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తుందని పేర్కొని , ఇంత భారీ ఎత్తున క్యాంపు చేసినందుకు ఆట డీసీ చాప్టర్ కు అభినందలు తెలిపారు . -
విజయ నిర్మల మృతికి ‘ఆటా’ సంతాపం
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల (73) గురువారం ఉదయం కన్నుమూసారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతికి అమెరికా తెలుగు సంఘం తరపున అద్యక్షులు పరమేశ్ భీంరెడ్డి సంతాపం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను డైరెక్ట్ చేసిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డుతో పాటు అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారని అన్నారు. అంతేకాదు నటిగా, దర్శకురాలిగా తెలుగు సినీ కళామతల్లికి విశిష్ట సేవలందించారని ఈ సందర్భంగా కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని, అద్భుతమైన ప్రతిభ చూపగలరని ఆరోజుల్లోనే నిరూపించారని అన్నారు. గత సంవత్సరం అమెరికా తెలుగు సంఘం తరఫున హైదరాబాద్ లో నిర్వహించిన ఆటా వేడుకల్లో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును బహుకరించామని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
ఆటా నేతృత్వంలో మహిళలకు తైక్వాండో శిక్షణ
నాష్విల్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా-ATA), ఇండియన్ కమ్యూనిటీ నాష్విల్ (ICON) ఆధ్వర్యంలో ప్రతీ ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఈ వేడుకలో భాగంగా మహిళకు తైక్వాండోలో శిక్షణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణలో 25మంది పాల్గొన్నారని, వారందరికి రచన అగర్వాల్ నేతృత్వంలో శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. 2008 నుంచి తైక్వాండోలో నిపుణులైన రచన.. మహిళలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఉండేలా వారికి తర్ఫీదునిస్తున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 9న జరుపనున్నట్లు కమిటీ హెడ్ రాధికా రెడ్డి తెలిపారు. -
ఆటా బాధ్యతలు స్వీకరించిన భీమ్రెడ్డి
లాస్వెగాస్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) కొత్త అధ్యక్షుడిగా పరమేష్ భీమ్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లాస్ వెగాస్లో జరిగిన ఈ సమావేశంలో కరుణాకర్ అసిరెడ్డి నుంచి కొత్త అధ్యక్షుడిగా పరమేష్ బాధ్యతలను స్వీకరించారు. తదుపరి అధ్యక్షుడిగా భువనేష్ భోజాలను ఎన్నుకున్నారు. జనవరి 19న ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో దాదాపు 150మంది ప్రముఖ సభ్యులు పాల్గొన్నారు. ఆటా అధ్యక్షుడిగా ఎన్నుకున్న పరమేష్ భీమ్రెడ్డి 2014 నుంచి ఆటాకు కన్వీనర్గా సేవలు అందించారు. ఈ సమావేశంలో మరికొందరి సభ్యుల్ని కూడా ఎన్నుకున్నారు. సెక్రటరీగా వేణుగోపాల్రావు సంకినేని, కోశాధికారిగా రవి పట్లోలా, జాయింట్ సెక్రటరీగా శరత్ వేముల, జాయింట్ ట్రెజరర్గా అరవింద్రెడ్డి ముప్పిడిని ఎన్నుకున్నారు. ఇంకా మిగతా 18మంది సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అరవింద్ ముప్పిడి, సతీష్ రెడ్డి, వేణు పిస్కే, రవి పట్లోలా, మధు బొమ్మినేని, సాయినాథ్ బోయపల్లి, రమేష్ నల్లవోలు, శ్రీనివాస్ దర్గుల, విజయ్ కొండూరు, వేణు సంకినేని, శ్రీకాంత్ గుడిపాటి, హరి లింగాల, సన్నీ రెడ్డి, సాయి సుదిని, రామకృష్ణ రెడ్డి, అనిల్ బొడ్డిరెడ్డి, రాజేశ్వర్ టెక్మల్, మెహర్ మేడవరం తదితరులను ఆటా సభ్యులుగా ఎన్నుకున్నారు. 2021-22 ప్రెసిడెంట్గా భువనేశ్ రెడ్డి భోజాలను ఎన్నుకున్నారు. -
ఇన్కమ్ ట్యాక్స్పై అట్లాంటాలో ఆటా అవగాహన కార్యక్రమం
అట్లాంటా : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో జార్జియాలోని అట్లాంటాలో ఇన్కమ్ ట్యాక్స్పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే 2019లో టాక్స్ చట్టాల్లో మార్పులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆటా పేర్కొంది. అట్లాంటాలో 2009 నుంచి ట్యాక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ను అందిస్తున్న సీపీఏ ప్రభాకర్ రెడ్డి టాక్స్ చట్టాలపై సెషన్ తీసుకున్నారు. ట్యాక్స్ చట్టాలు 2018, ఎన్ఆర్ఐ ట్యాక్సేషన్, ట్యాక్స్ ఫిల్లింగ్ వంటి అంశాలపై ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా పాల్గొన్నారు. మంచి కార్యక్రమంతో టాక్స్ చట్టాలపై అవగాహన కల్పించిన ఆటాకు తరగతులకు హాజరైనవారు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఏ ప్రభాకర్ రెడ్డికి ఆటా అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి, కిరణ్ పాశం, అనిల్ బొడ్డిరెడ్డి, వేణు పిసికెలు కృతజ్ఞతలు తెలిపారు. ఆటా రీజినల్ కోఆర్డినేటర్లు ప్రశాంత్ పీ, శ్రీరామ్ ఎస్, గణేష్ కాసం, ఆటా రీజినల్ డైరెక్టర్ తిరుమల్ రెడ్డి, ఆటా స్టాండింగ్ కమిటీ ఛైర్స్, కో ఛైర్స్ రమణారెడ్డి, శివకుమార్ రామడుగు, శ్రీధర్ టీ, ఉమేష్ ముత్యాల, ఉదయ్ ఎటూరు, సుబ్బారావు మద్దలి, సురేష్ వోలమ్లతోపాటూ ఆటా వాలంటీర్లు అతిథులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. -
బోస్టన్లో దసరా వేడుకలు
బోస్టన్ : విజయదశమి పండుగను బోస్టన్లోని ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు దాదాపు 250 మంది ప్రవాసాంధ్రులు హాజరైనట్టు పేర్కొన్నారు. బోస్టన్ లో నివసిస్తున్న తెలుగు వారు ఈ వేడుకను జమ్మిపూజతో మొదలుపెట్టారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఆహ్లాదభరితంగా జరిగాయి. పసందైన విందు భోజనాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఆటా సభ్యులైన రమేష్ నలవోలు, మల్లా రెడ్డి యనల, క్రిష్ణా ద్యాపా, సోమ శేఖర్ నల్లా, చంద్ర మంచికంటి, శశికాంత్, దామోదర్, రవి, మధు, అనిత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. -
ఆటా ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు
చికాగో : తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. చికాగోలోని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దాదాపు 300 మంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ రంగురంగుపూలతో బతుకమ్మలను తయారు చేసి తమ వెంట తీసుకొచ్చారు. ఆటపాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి, మెహర్ మాదవరం, లక్ష్మీ బోయపల్లి, భాను స్వర్గం, వెంకట్ తుడి, మహిపాల్ వంచ, హరి రైనీ, సునీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితురాలైన జానపద గాయనీ రాగం శాలినీ ఆలపించిన పాటలు హుషారెత్తించాయి. -
డెట్రాయిట్లో ఆటా బోర్డు మీటింగ్
డెట్రాయిట్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) బోర్డు మీటింగ్ డెట్రాయిట్లోని సౌత్ఫీల్డ్ మారియట్ హోటల్లో జరిగింది. అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆటా ట్రస్టీలు, అడ్వైజర్లు, రీజినల్ కో ఆర్డినేటర్లు, వివిధ స్టాండింగ్ కమిటీ అధ్యక్షులతోపాటూ స్థానిక ఆటా సభ్యలు పాల్గొన్నారు. డెట్రాయిట్ ఆటా టీమ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రస్టీలు హరి లింగాల, మురళి బొమ్మనవేణి, అంతర్జాతీయ కో ఆర్డినేటర్ కోత కాశి, రీజినల్ అడ్వైజర్ సన్నీ రెడ్డి, సీఎమ్ఈ అధ్యక్షులు డా. అశోక్ కొండూరు, డా. హర్ష క్రిష్ణ, ఆర్సీలు చెంచురెడ్డి, సునీల్ మందుటి, ఎస్సీ అధ్యక్షులు వేణు సురపరాజులు ఆటా బోర్డు మీటింగ్ పనులను పర్యవేక్షించారు. త్వరలో రాబోయే ట్రస్టీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కమిటీ, ఎలక్షన్ కమిటీల నియామకాలను ఆటా నాయకులు చేపట్టారు. అమెరికాలోని తెలుగువారికి మరిన్ని సేవలు అందించడానికి చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ఆటా వ్యవస్థాపక సభ్యులు, మాజీ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఆటా అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి, ఆటా ఎలక్ట్ ప్రెసిడెంట్ పరమేష్ భీమ్రెడ్డిలు ఆటా వివాహ పరిచయవేదిక వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాట్రిమోనియల్ కమిటీ సభ్యులు శంకర్ బండి, రామ క్రిష్ణా రెడ్డి ఆళ్ల, అజయ్ రెడ్డి, అనిల్ బోడిరెడ్డి, అరుంధతి కోడూరులు చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు డెట్రాయిల్ ఆటా టీమ్కు ఆటా బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. లాస్ వేగాస్లో 2019 జనవరిలో ఆటా మరుసటి బోర్టు మీటింగ్ జరగనుంది. -
ప్రొఫెసర్ సాంబరెడ్డికి తెలంగాణ సైన్స్ ఎక్సలెన్స్ పురస్కారం
హ్యూస్టన్ : అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలంగాణ మహాసభల్లో ప్రొఫెసర్ దూదిపాల సాంబ రెడ్డికి ప్రతిష్టాత్మక 'తెలంగాణ సైన్స్ ఎక్సలెన్స్ పురష్కారం' ప్రదానం చేశారు. అమెరికాలో హ్యూస్టన్ మహానగరంలో జూన్ 29 నుండి జులై 2 వరకు జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్లో జరగిన ద్వితీయ తెలంగాణ ప్రపంచ మహాసభలల్లో టెక్సాస్ ఏ అండ్ ఎమ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. సాంబ రెడ్డిని 'తెలంగాణ మహాసభల' బృందం తెలుగు సంప్రదాయాలతో ఘనంగా సత్కరించింది. శాస్త్ర సాంకేతిక రంగంలో నిస్వార్ధంగా గత 20 సంవత్సరాలుగా ప్రొఫెసర్ సాంబ రెడ్డి చేసిన పరిశోధనలకు, సేవ నిరతకు గుర్తింపుగా ఈ విశిష్ట పురష్కారాన్ని ఇస్తున్నట్లు మహాసభల నాయకత్వ బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని పాల పిట్ట సావెనీర్లో కూడా విడుదల చేశారు. వేల మందితో కిక్కిరిసిన ఈ మహాసభలకు అమెరికా అన్ని రాష్ట్రాలనుండి తెలుగు ప్రవాసులు, ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్తో పాటు ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రముఖులు వచ్చారు. తెలంగాణ మహాసభల ఎగ్జిక్యూటివ్, కన్వెన్షన్ బృంద నేతృత్వంలో అత్యంత వైభవంగా జరిగిన ప్రారంభ డిన్నర్ వేడుక సభలో మఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ జితేందర్ రెడ్డి, సత్కారాన్ని డా. సాంబ రెడ్డికి అందజేశారు. 'తెలంగాణ సైన్స్ పురస్కారం' ఇంతచిన్న వయసులోనే అందుకోవడం అదృష్టంగా భావిన్నాను. ఒక తెలంగాణ బిడ్డగా ఇంతటి గౌరవవం నాకు ఇవ్వడానికి సహకరించిన వారందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ముందుముందు మరెన్నో శాస్త్ర విజయాలు సాధించి తెలంగాణ గడ్డకి, మనభారతీయులందరి కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా నావంతు కృషి చేస్తా. ఈ అవార్డును నా మాతృ మూర్తుల జ్ఞాపకంగా వారికీ అంకితం చేస్తున్నా' అని డా. సాంబ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలంగాణ మహాసభల ఆర్గనైజర్లు కరుణాకర్ మాధవారపు (చైర్మన్), సత్యనారాయణ రెడ్డి కందిమల్ల (ప్రెసిడెంట్), శ్రీధర్ కాంచనకుంట్ల (డైరెక్టర్), వినోద్ కుకునూర్ (ప్రెసిడెంట్-ఎలెక్ట్), బంగారెడ్డి ఆలూరి (కన్వీనర్), జగపతి రెడ్డి వీరటి (కోఆర్డినేటర్), డా. రాజేందర్ అపారసు (అవార్డు చైర్), బోర్డు మెంబర్లు, కన్వెన్షన్ సభ్యులు, కన్వెన్షన్ కమిటి చైర్మన్లు, తెలంగాణ అసోసియేషన్ అఫ్ గ్రేటర్ హ్యూస్టన్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ హ్యూస్టన్ సభ్యులలతోపాటూ పలువురు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పరకాల మండల పరిధిలోని చెర్లపల్లి గ్రామంలో రైతు కుటుంబంలో డా. సాంబ రెడ్డి జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో ఆరు బంగారు పతకాలతో పట్ట భద్రులయ్యారు. ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో పీహెడీ చేసి, అత్యధిక శాస్త్ర అధ్యయనాలు ప్రచురించి లింకా రికార్డు సృష్టించారు. అయన కనిపెట్టిన ఎన్నో ఫార్మసిటికల్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిపొందాయి. డా. సాంబ రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎమ్ విశ్వవిద్యాలయం వైద్య శాస్త్ర ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. అమెరికాలోని అత్యంత ప్రసిద్ధిచెందిన శాస్త్ర సంస్థలైన ఏఏఏఎస్ (అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ సైన్స్), ఏఏపీఎస్ (అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఫార్మాస్యూటికల్ సొసైటీ), ఏఈఎస్ (అమెరికన్ ఎపిలెప్సీ సొసైటీ ) నుంచి "ఫెల్లో" (శాశ్వత సభ్యత్వము) అనే అతి కొద్దీ శాస్త్రవేత్తలకిచ్చే ముఖ్యమైన పురస్కారాలు అందుకున్న మొట్ట మొదటి తెలుగు భారతీయుడు. ఫార్మసీ మెడికల్ రంగాల్లో 180 పేపర్స్, డజన్ కు పైగా మెడికల్ పుస్తకాలు రచించిన ఆయన ఇంటెర్నేషనల్ సైన్స్ పండిత డాక్టర్లలో ఒక అసామాన్యుడుగా ప్రసిద్ధి పొందారు. ఆయన గత 24 సంవత్సరాల నుండి మెదడు జబ్బులపై అధ్యాయనం చేస్తున్నారు. ఫీట్స్ వ్యాధికి ఓ మెడిసిన్ కూడా కనిపెట్టారు. మెదడులోని ఉత్ప్రేరకాలు, సరఫరా వ్యవస్థ విధానంలో ఎన్నో పరిశోధనలు చేసి, ఎపిలెప్సీ రోగ నిర్మూలనం కోసం 'న్యూరో కోడ్' కనిపెట్టి చరిత్ర సృష్టించారు. మెదడు దెబ్బల నుంచి న్యూరోలాజికల్ జబ్బులు రాకుండా ఒక కొత్త 'ఏపిజెనెటిక్' చికిత్స విధానాన్నిఇటీవలే ప్రకటించారు. ఈ మెడికల్ విధానాలు విశ్వవ్యాప్తంగా ఎన్నో వేల మంది న్యూరోలాజికల్ రోగులకు ఉపయోగపడుతున్నాయి. ఫిట్స్, తల దెబ్బలు, న్యూరోటాక్సిసిటీ, ఇతర మెదడు జబ్బులకు కొత్త మందులు కనిపెట్టి న్యూరోలాజికల్ రోగులకు అధునాతన చికిత్స అందిస్తూ, వారి జబ్బుల నియంత్రణకు సహాయం చేయడమే తన జీవిత ధ్యేయంగా మలచుకున్నారు. 2012, 2013, 2014 లో వరుసగా అమెరికాలోని ప్రముఖ తెలుగు అసోసియేషన్స్ 'నాటా', 'తానా', 'ఆటా' సంస్థల నుంచి రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు సాధించి, హ్యాట్రిక్ సృష్టించిన ఏకైక తెలుగు ప్రవాస భారతీయుడిగా నిలిచారు. శాస్త్రవేత్తగా బిజీగా ఉంటూనే సామజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. -
హ్యూస్టన్లో భద్రాద్రి రాముడి కల్యాణం
హ్యూస్టన్ : అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ (ఆటా) నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ ద్వితీయ మహాసభల చివరి రోజు వేడుకల్లో భద్రాద్రి రాముడి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. హ్యూస్టన్ లోని జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన సభలకు భద్రాచలం నుంచి ఉత్సవ మూర్తులను తీసుకొచ్చిన పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకలో భాగంగా నిర్వహించిన సాహిత్య, సంగీత కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షులు సత్యనారాయణ కందిమళ్ల, నిర్వహాణ కార్యదర్శి బంగారు రెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ మాధవరం, ప్రెసిడెంట్ ఎలెక్ట్ వినోద్ కుకునూర్, సహాయ సమన్వయ కర్త జగపతి వీరేటి, వివిధ కమిటీల ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ప్రత్యేక విశిష్ట అతిథులుగా ఎంపీ జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్, బీజేపీ రాష్ట్ర నాయకులు కృష్ణప్రసాద్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. (చదవండి: హ్యూస్టన్లో ఘనంగా ఆటా మహాసభలు) -
హ్యూస్టన్లో ఘనంగా ఆటా మహాసభలు
హ్యూస్టన్ : అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ (ఆటా) నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ ద్వితీయ మహాసభలు హ్యూస్టన్ లోని జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రారంభమయ్యాయి. వేడుకలను తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. దీపారాధన, గణపతి ప్రార్థన, తెలంగాణ పాటలు, కూచిపూడి భరత నాట్యం లాంటి భారతీయ నృత్యాలతో వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. సామాజిక పలకరింపులు, అలాయి బలాయిలు జరిగాయి. సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ కందిమళ్ల, నిర్వహణ కార్యదర్శి బంగారు రెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ మాధవరం, ప్రెసిడెంట్ ఎలెక్ట్ వినోద్ కుకునూర్, సహాయ సమన్వయ కర్త జగపతి వీరేటి, వివిధ కమిటీల ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ప్రత్యేక విశిష్ట అతిథులుగా ఎంపీ జితేందర్ రెడ్డి, సాంస్కృతిక రాయబారి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర నాయకులు కృష్ణప్రసాద్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా18 దేశాల నుంచి అనుబంధ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వాణిజ్య వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, గాయకులూ, కళాకారులూ, మీడియా ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేశారు. పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖులను వేడుకల్లో అవార్డులతో సత్కరించారు. కమ్యూనిటీ సర్వీస్లో శ్రీధర్ కాంచనచర్ల, రామచంద్రారెడ్డి, జీవిత సాఫల్య అవార్డు డాక్టర్ పద్మజారెడ్డి, డాక్టర్ రత్నకుమారి, చేనేత రంగంలో గజం అంజయ్య అందుకున్నారు. తెలంగాణ ఆర్టిస్టులతో రూపొందించిన చార్మినార్, దాని చుట్టూ పాతబస్తీని తలపించేలా వాణిజ్య అంగళ్లు, హైదరాబాదీ వంటకాలతో తొలి రోజు సంబరంగా జరిగింది. తెలంగాణ, తెలుగు కళలు ఉట్టిపడేలా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. -
ఆటా ఆహ్వానం
సాక్షి, సిటీబ్యూరో: అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ (ఆటా) ఆహ్వానం మేరకు ప్రముఖ నృత్య గురువు పద్మజారెడ్డి అమెరికాలోని హూస్టన్ నగరంలో ఈ నెల 29, 30, జులై –1 తేదీల్లో మూడు రోజుల పాటు నాట్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం పద్మజారెడ్డి లక్డీకాపూల్లోని సెంట్రల్ కోర్టు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. జీవిత సాఫల్య పురస్కారంతో తనను సత్కరించనున్నారని తెలిపారు. తాను ప్రణవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యూచిపూడి డ్యాన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభవాన్ని కాకతీయం నృత్య రూపకం ద్వారా ప్రాచుర్యం కల్పించినందుకు ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారన్నారు. హూస్టన్ నగరంలో తమ మూడు రోజుల పర్యటనలో నవదుర్గలు నృత్య రూపకంతో పాటు.. కాకతీయం నృత్యంలోని కొన్ని భాగాలను ప్రదర్శిస్తామన్నారు. భద్రాచలం అర్చకులు సీతారామకల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. తాను శిష్య బృందంలోని ఆరుగురితో కలిసి సీతారామ కల్యాణానికి సంబంధించి అంశాలను నృత్యరూపంలో ప్రదర్శిస్తామని పద్మజారెడ్డి వివరించారు. అంతేకాకుండా కెనడా, సింగపూర్, మలేషియా, సిడ్నీల్లో ఇదే రకంగా ప్రదర్శనలకు ఆహ్వానం వచ్చిందన్నారు. భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు మదన్ మోహనాచార్య మాట్లాడుతూ.. భద్రాది రామయ్య కల్యాణాన్ని అమెరికాలోని హూస్టన్లోని నగరంలో నిర్వహించేందుకు అనుమతించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, దేవాదాయ కమిషనర్ శివశంకర్లకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో నాట్య బృందంలోని నర్తకిలు అమరనేని షాలిని, ఆవుల భూమిక, కనక హర్షిణి, త్రిష, చందన, మ్రేనిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హుస్టన్ వేదికగా ఆటా తెలంగాణ మహాసభలు
టెక్సాస్ : అమెరికా తెలంగాణ అసొసియేషన్ (ఆటా) రెండో తెలంగాణ మహా సభలను ఈ నెల 29నుంచి టెక్సాస్ రాష్ట్రంలోని హుస్టన్లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది. జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. నిర్వహణ బాధ్యతల కోసం పలు కమిటీలను ఏర్పాటు చేశారు. 2016లో డెట్రాయిట్వేదికగా తొలి మహాసభలు జరగాయి. ఈ సంస్థ ఉత్తర అమెరికాలో నివసించే ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడి, అమెరికా అంతటా విస్తరించిన దాదాపు 40 తెలంగాణ సంఘాల్ని ఒక్కతాటి మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికీ, ప్రవాసీ తెలంగాణ వాసులకి ఒక వారధి ఆటా. ఈ సారి వేడుకలను ప్రముఖ సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణరెడ్డికి అంకితం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది జూన్ 12న కన్నుమూసిన సినారెను, సాహిత్యానికి ఆయన చేసిన సేవలను ఈ సభల్లో ప్రత్యేకంగా గుర్తు చేసుకోనున్నారు. "రైతే రాజు" నినాదంతో రైతు ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా "రచ్చబండ" కార్యక్రమాన్ని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో నిర్వహించనున్నారు. భాషా సాహిత్యాల పరంగా కార్యక్రమాలు జరుగనున్నాయి. అష్టావధానంతో పాటు, సాహిత్య సదస్సులు, యువశక్తి అంశంపై చర్చలు నిర్వహించనున్నారు. మహాసభల్లో చివరిరోజు భద్రాచలం నుండి పూజారులు వచ్చి అక్కడి ఉత్సవ విగ్రహాలు, మరియు ప్రసాదముతో శ్రీ సీతారామ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపి భక్తులకు స్వామివారి ఆశీస్సులందించనున్నారు. ఆటా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి ‘తెలుగు భాష మరియు తెలంగాణ అభిమానులందరికి హృదయపూర్వక ఆహ్వానం. కొత్తగా ఏర్పడ్డ మన తెలంగాణ.. కోటి రతనాల వీణగా మారాలి. తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, సర్వాంగీణ వికాసం జరగాలి. ప్రవాస తెలంగాణ వాసుల ఆకాంక్ష ఫలితమే ఆటా-తెలంగాణా. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి, సంస్కృతి -సంప్రదాయాలు, భాష-యాస, ఆచారం, కట్టుబాట్లు , నడవడికల పరిరక్షణ ధ్యేయంగా, ప్రపంచంలోని తెలంగాణ సంఘాల సమ్మేళనంగా ఆటా ఏర్పడింది. ఇదే ధ్యేయంతో మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నా. ప్రపంచం నలుమూలలలో విస్తరించిన ప్రవాస తెలంగాణ సోదర సోదరీమణులు ఈ వేదికగా కలుసుకోనుండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మహాసభలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. అనితర సాధ్యమైన బృహత్ లక్ష్యాన్ని ఆటా ధర్మకర్తలు, కార్యవర్గం మరియు కార్యకర్తల సమష్టి కృషితో, తెలంగాణ ప్రవాస మిత్రుల అండదండలతో, ఎన్నారై పారిశ్రామికవేత్తల ఆర్ధిక, హార్దిక వెన్నుదన్నుతో, ఘనంగా, వైభవంగా నిర్వహించబోతున్నామ’ని ఆటా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి కందిమల్ల తెలిపారు. ఆటా ఛైర్మన్ కరుణాకర్ మాధవరం ఆటా ఛైర్మన్ కరుణాకర్ మాధవరం మాట్లాడుతూ.. ‘అమెరికా రాష్ట్రాల్లోని స్థానిక తెలంగాణ సంస్థల ఐక్యసమాఖ్య సంఘటిత శక్తి ఆటా. ప్రతి తెలంగాణ వాసి, తెలంగాణ బాగు కోరే ప్రతి ఒక్కరు మా సంస్థ లోకి ఆహ్వానితులే. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి, అమెరికాలోని తెలంగాణ ప్రవాసులకు వారధిగా ఉంటుంది. మేము చేసే ప్రతి మంచి పనికి మా వెంటే వుండే కార్య కర్తలకు, దాతలకు మా శుభాబి వందనాల’ను తెలిపారు. -
ఆటా, టాటా వేడుకల్లో మహానేత వైఎస్సార్కు ఘననివాళి
డల్లాస్ : ఏటీసీ తెలుగు మహాసభ ఉత్సవాలు మూడు రోజులు పాటు(మే31-జూన్2) డల్లాస్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల చివరి రోజైన శనివారం నాడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఏటీసీ ప్రతినిధులు ఘననివాళి ఆర్పించారు. ఆయన జ్ఞాపకార్థం ‘సెలబ్రేటింగ్ డాక్టర్ వైఎస్సార్ లైఫ్ అండ్ లెగసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు వైఎస్సార్తో వారి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ చిరకాల మిత్రుడు ప్రేమసాగర రెడ్డి మాట్లాడుతూ.. కాలేజీ రోజుల్లో వైఎస్సార్తో తనకున్న అనుబంధాన్ని ఆహుతులతో పంచుకున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయే పనులు చేశారని కొనియాడారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. ప్రతి సందర్భంలో ఆయన లేకపోవటం కనిపిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్(టాటా) అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ జీవితాంతం గుర్తుపెట్టుకునే మహామనిషి అన్నారు. సాయం కోసం వైఎస్సార్ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని.. ఆయన మనస్సున్న మహారాజని గుర్తుచేశారు. పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్సార్ తనను హిందీ అకాడమీకి చైర్మన్గా నియమించటమే కాకుండా, అఖరి వరకు తనకు చేదోడువాదోడుగా నిలిచారని వైఎస్సార్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. అమెరికన్ తెలుగు అసోషియేషన్(ఆటా) అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన నిజమైన నాయకుడు వైఎస్సార్ అని అన్నారు. ఆయన స్నేహనికి ప్రాణమిచ్చే అరుదైన వ్యక్తి అని కొనియాడారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కుటుంబంతో తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్ కుటుంబానికి మైలవరంతో ఉన్న అనుబంధాన్ని ఆయన ఆహుతులకు తెలియజేశారు. ఇతర వక్తలు మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణం ఇప్పటికి ఓ పీడకలలా వెంటాడుతుందన్నారు. ఆయన మరణం తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం ప్రజల కోసం పోరాడుతూ తన తండ్రిని గుర్తుకు తెస్తున్నారని.. వైఎస్ జగన్ తండ్రిని మించిన తనయుడు అవ్వాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన మంచి మంచి పథకాలను పూర్తి చేయగల సత్తా కేవలం వైఎస్ జగన్కే ఉందన్నారు. ప్రజలు వైఎస్ జగన్కి అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎంఎస్ రెడ్డి, రవి సన్నారెడ్డి, వైఎస్సార్ చిరకాల మిత్రులు రాఘవ రెడ్డి, డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి, నిజామాబాద్ మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, పరమేష్ భీంరెడ్డి, డా. మోహన్ మల్లం, డా.హరినాథ్ పొలిచర్ల, రాజేశ్వరరెడ్డి గంగసాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమెరికా కన్వీనర్లు డా.శ్రీధర్ కొర్సపాటి, డా. వాసుదేవతో పాటు అమెరికా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించటానికి సహకరించిన హరిప్రసాద్ లింగాలకి కార్యక్రమ నిర్వహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. -
యార్లగడ్డకు ఆటా, టాటా జీవిత సాఫల్య పురస్కారం
న్యూఢిల్లీ: కేంద్రీయ హిందీ సమితీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్కు అమెరికన్ తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా)లు కలిసి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించాయి. మే 31, జూన్1, జూన్ 2లలో డల్లాస్లో రెండు సంస్థలు ఏర్పాటు చేసిన సదస్సులో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్కి ఈ పురస్కారం అందజేయనున్నట్టు ఆటా అధ్యక్షుడు డా. కరుణాకర్ రెడ్డి, టాటా అధ్యక్షుడు డా. హరినాథ్ పొలిచెర్ల ప్రకటించారు. 1990లో ఏర్పడిన ఆటా, 2015లో ఏర్పడిన టాటాలు మొట్టమొదటిసారిగా సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించడం ఇదే మొదటిసారి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 4500 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖ రచయితలు, కవులు, మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, కళాకారులు, యువకులు ఈ సదస్సులో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. కాగా, ఉభయ భాషల్లో పీహెచ్డీ చేసి, పద్మభూషణ్, పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు అనేక పురస్కారాలు పొంది, 60కి పైగా పుస్తకాలు రచించిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్కు ఈ సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు రెండు సంఘాలు తెలిపాయి. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి సాంస్కృతిక వారధిగా, ఆదర్శంగా భావిస్తున్నట్లు ప్రకటించాయి. డల్లాస్లో ఉభయ సంఘాలు కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు చారిత్రక ప్రాధాన్యత ఉన్నదని నిర్వాహకులు పేర్కొన్నారు. -
డల్లాస్లో అటా వేడుకలకు రంగం సిద్ధం
-
ఆటా-టాటా ఆధ్వర్యంలో పెయింటింగ్ పోటీలు
డల్లాస్ : అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలను మే 31, జూన్ 1, 2 తేదీల్లో డల్లాస్ లో నిర్వహించడానికి అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా)లు సంయుక్తంగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. మన కళలు, సంస్కృతిని పరిరక్షిస్తూ యువతలో నైపుణ్యాన్ని, సమాజ సేవని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆటా, టాటాలు కృషి చేస్తున్నాయి. ఆటా, టాటా ఆధ్వర్యంలో డల్లాస్లో కొపెల్లోని ఫోర్ పాయింట్స్ షేరాటన్లో చిన్నారులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించాయి. ఈ పోటీల్లో100 మంది చిన్నారులు పాల్గొన్నారు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కమిటీ ఛైర్ మధుమతి వ్యాసరాజు, కో ఛైర్ జ్యోత్స్నవుండవల్లి, సభ్యులు చైతన్యల పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. స్థానిక పెయింటింగ్ స్కూల్ టీచర్స్ బ్రిందా నవీన్, సవిత నల్లాలు పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. మూడు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో రోషిని బుద్దా, అదితి ఆవుల, క్యాతి గొవకనపల్లిలు తొలిస్థానంలో నిలవగా, శ్రీశ్మ పసుపులేటి, చందన పగడాల, అవనీష్ బుద్దాలు రెండో స్థానంలో నిలిచారు. జాయింట్ ఎగ్జిగ్యూటివ్ కమిటీ సభ్యులు అజయ్ రెడ్డి, రఘువీరా బండారు, విక్రమ్ జనగాం, సతీష్ రెడ్డి, మహేష్ ఆదిభట్లలు విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. మధుమతి వ్యాసరాజు, జ్యోత్స్న వుండవల్లిలు పోటీల్లో పాల్గొన్నచిన్నారులు, వారి తల్లిదండ్రులకు, టీచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏటీసీ వాలంటీర్లు దీప్తి సూర్యదేవర, మాధవి లోకిరెడ్డి, సునిత త్రిపురలు ఈ పోటీల నిర్వహనలో తమవంతు కృషి చేశారు. -
ఘనంగా విమెన్స్ డే, ఆటా వార్షికోత్సవం
కెంటకీ : అమెరికాలోని ఆటా(అమెరికన్ తెలుగు అసోసియేషన్) ఆధ్యర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళ దినోత్సవం, ఆటా వార్షికోత్సవాన్ని కెంటకీ స్టేట్లోని లూసివిల్లెలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెంటకీ సెనెటర్ జూలీ ఆడమ్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆటా కెంటకీ రిజనల్ కో-ఆర్డినేటర్ డా.మహేష్ కుమార్ గుండ్లూరు మాట్లాడుతూ.. కార్యక్రమానికి హాజరై, మహిళ దినోత్సవాన్ని, ఆటా వార్షికోత్సవాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 650 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అలాగే తెలుగు సినిమా గాయని సునీతా తన పాటలతో అందరినీ అలరించారు. గుండ్లూరు కవితా, సరస్వతీ తూటుపల్లి, హేమప్రసాద్, కవితా, వెంకటేశ్వర రెడ్డి, రాజ గోపాల్ రెడ్డి, రమ్య, అనిల్, కృష్ణ, భారతి, శివ రామకోటి రెడ్డి, సుజిత్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పాటు అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో కెంటకీ నేషనల్ టీం లీడర్స్ చైర్మన్ డా. తిరుపతి రెడ్డి, కో చైర్మన్ శ్రీకాంత్ కోటగిరి, ఆటా అధ్యక్షులు కరుణాకర్ అసిరెడ్డి, ఆటా ట్రస్టీ అనిల్ బోడిరెడ్డి, వెబ్ కమిటీ చైర్మన్ ఉమేష్ ముత్యాల, రామకిృష్ణ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ కో చైర్మన్ కిశోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాష్విల్లేలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
టేనస్సీ: నాష్విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో గత నెల 28న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ కమిటీ సభ్యులు ఆల రామకృష్ణా రెడ్డి, నూకల నరేందర్ రెడ్డి, సుషీల్ చందా, గుడూరు కిశోర్ రెడ్డి, దయప ప్రకాశ్ రెడ్డి, పునీత్ దీక్షిత్, రవి కిరణ్, రాధిక రెడ్డి, నూకల లావణ్య, మంజూ లిక్కి, బూస సునీత, అరమండ్ల రాధిక, రాచకొండ సాయిరాం, కేస సిరిషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాష్విల్లేలోని గణేష్ ఆలయం విస్తరణ పనులను గత కొన్ని ఏళ్లక్రితమే ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి దాదాపు 4 మిలియన్ల డాలర్లను ఖర్చుచేశారు. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్) సభ్యులు పెద్ద మొత్తంలో ఆలయానికి విరాళాలు ఇచ్చారు. గత ఏడాది కూడా శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ఘనంగా ఆటా డే వేడుకలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మరో వేడుకకు సిద్ధమైంది. అమెరికాలోని తెలుగు వారందరిని ఏకం చేయుటకు, తెలుగు సంస్కృతిని చాటిచెప్పెందుకు అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలను మే 31, జూన్ 1, 2 తేదీల్లో డల్లాస్ లో నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహాకులు తెలిపారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ ఆటా డే నష్వీల్లే’ ను ఏప్రీల్ 21న నిర్వహించారు. ఈ వేడుకలకు 100 మంది అతిధులు హాజరైయారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ భానుశ్రీ ఆటలు, పాటలు, ఉత్తేజభరితమైన సంగీతాన్ని, నృత్యాన్ని ప్రదర్శించి అందరిని అలరించారు. ఆటా టీం హాస్యభరిత చర్చలతో, ఉత్సహాభరితంగా సాగింది. వేడుకల అనంతరం అతిథులకు నష్వేల్లీ నుంచి పారడైస్ బీర్యానీతో రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు ఆటా ప్రాంతీయ కో ఆర్డీనేటర్ నరేంద్ర రెడ్డి నూకల, రామకృష్ణా రెడ్డి ( కమ్యూనిటి చైర్), సుశీల్ చంద్రా ( స్టాండింగ్ కమిటి, కో-చైర్), కిషోర్ రెడ్డి గుడూర్, ఆధ్వర్యంలో జరిగాయి. వేడుకల నిర్వాహాణకు 25 వేల డాలర్లు విరాళాలు సేకరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు, కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బోడిరెడ్డి, వెబ్ కమ్యూనిటీ చైర్మన్ ఉమేష్ ముత్యాల, తిరుపతిరెడ్డి యర్రంరెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రముఖులు, ప్రతినిధులు హజరయ్యారు. -
టెక్సాస్లో 'ఆటా-టాటా' సంయుక్త సమావేశం
డల్లాస్ : మే 31, జూన్ 1, 2వ తేదీల్లో డల్లాస్ లో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) సంయుక్తంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. టెక్సాస్లో కొప్పెల్లోని ఫోర్ పాయింట్స్ షెరాటన్ బాంక్వెట్లో విరాళాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 300 మంది హాజరయ్యారు. స్థానిక కమ్యునిటీ నాయకులు, వ్యాపారస్తులు, మద్దతుదారులు 5లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చారు. మన సంస్కృతిని ప్రచారం చేయడంతో పాటూ స్నేహితులు, కుటుంబసభ్యులు ఆహ్లాద వాతావరణంలో ఒక్కచోట కలిసి గడిపేలా అమెరికన్ తెలుగు కన్వెన్షన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ కళలు, క్లాసికల్ డ్యాన్సులు, కవిత్వం వంటివాటిని ప్రోత్సహించడానికి అమెరికన్ తెలుగు కన్వెన్షన్ తోడ్పాటును అందిస్తుందన్నారు. మెగా కన్వెన్షన్ని విజయవంతంగా నిర్వహించడానికి 36 కమిటీలు అహర్నిశలు కృషి చేస్తున్నాయన్నారు. ఆటా అధ్యక్షులు డా. కరుణాకర్ ఆసిరెడ్డి, టాటా అధ్యక్షులు డా. హరినాథ్ పొలిచెర్ల, అజయ్ రెడ్డి, అరవింద్ ముప్పిడి, భరత్ మాదాడి, ధీరజ్ ఆకుల, జ్యోతి రెడ్డి, కిరణ్ రెడ్డి పాశం, మోహన్ పటోళ్ల, రఘువీర్ బండారు, మహేష్ ఆదిభట్ల, సతీష్రెడ్డి, శ్రీనివాస్ ఆనుగు, విక్రం జనగాంలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు హన్మంత రెడ్డి, పైళ్ల మల్లారెడ్డి, డా. విజయపాల్ రెడ్డి, డా. హరనాథ్ పొలిచెర్ల, డా. సంధ్యా గవ్వ, శ్రీనివాస్ పిన్నపురెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు.