bipin rawat
-
మానవ తప్పిదమే.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణానికి కారణం
ఢిల్లీ : మానవ తప్పిదం వల్లే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 8, 2021న ఎంఐ-17 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ మంగళవారం లోక్సభ ముందుంచింది. 2017 - 2022 వరకు 'పదమూడవ డిఫెన్స్ పీరియడ్ ప్లాన్' పేరిట రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో 2017-2022 వరకు మొత్తం భారత వైమానిక దళానికి సంబంధించి మొత్తం 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది.The Indian Air Force has officially attributed the tragic crash of the Mi-17 V5 helicopter, which resulted in the untimely demise of CDS General Bipin Rawat and other esteemed personnel, to human error by the flying crew. This conclusion raises critical questions about the… pic.twitter.com/lFNZs29uls— Aviator Amarnath Kumar (@aviatoramarnath) December 19, 2024 వాటిల్లో అప్పటి సీడీఎస్ బిపిన్ రావత్ తమిళనాడులోని కున్నూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం కూడా ఉందని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు భార్య మధులిక, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ సందర్భంగా బిపిన్ రావత్ ప్రమాదానికి కారణం మానవ తప్పిదేమేనని స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. డిసెంబరు 8, 2021న తమిళనాడులోని సూలూర్ ఎయిర్బేస్ నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఆ రోజు ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయలుదేరారు.అయితే మార్గం మధ్యలో హెలికాప్టర్ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అయోమయంలో పడిన పైలట్ హెలికాప్టర్ను మేఘాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అది కూలిపోయింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణంపై ఓ అంచనాకు వచ్చాము’ అని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. -
బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్గా అనీల్ చౌహాన్
సాక్షి, న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం సుమారు 9 నెలల తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్గా లెఫ్టినెట్ జనరల్ అనిల్ చౌహాన్(రిటైర్ట్) పేరును ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ 2021, మే నెలలో తూర్పు కమాండ్ చీఫ్గా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ చేశారు. సైన్యంలో పలు ఉన్నత పదవులను నిర్వర్తించారు చౌహాన్. జమ్ముకశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రకార్యకలాపాలను నిలువరించటంలో విస్తృత అనుభవం ఉంది. త్రివిద దళాలను ఏకతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను ఏర్పాటు చేసింది కేంద్రం. దేశ తొలి సీడీఎస్గా జనరల్ బిపిన్ రావత్ 2020, జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2021 డిసెంబర్లో తమిళనాడులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మిలిటరీ హెలికాప్టర్లో వెళుతుండగా ప్రమాదం జరిగి రావత్, ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు మరో 11 మంది మరణించారు. అప్పటి నుంచి సీడీఎస్ పోస్ట్ ఖాళీగానే ఉంది. దాదాపు 9 నెలల తర్వాత కొత్త సీడీఎస్ను నియమించింది కేంద్రం. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్? -
‘పద్మ’ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: 2022 సంవత్సరానికి 64 మందికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సోమవారం పద్మ పురస్కారాలను అందించారు. ఇందులో రెండు పద్మ విభూషణ్, 8 పద్మభూషణ్, 54 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తరఫున ఆయన కుమార్తెలు కృతిక రావత్, తరిణి రావత్, గీతాప్రెస్ అధినేత దివంగత రాధేశ్యామ్ ఖేమ్కా తరఫున ఆయన కుమారుడు కృష్ణ కుమార్ ఖేమ్కాలు పద్మ విభూషణ్ పురస్కారాలను స్వీకరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, సీరం ఇన్స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా, పంజాబీ జానపద గాయకుడు గుర్మీత్ బావా (మరణానంతరం), టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి, దేవేంద్ర ఝఝరియా, రషీద్ ఖాన్, సచ్చిదానంద స్వామి తదితర ప్రముఖులు పద్మభూషణ్ పురస్కారాలను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్ హసన్ సాహెబ్ (మరణానంతరం)లు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. 2022 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం ఈ నెల 28న జరుగనుంది. ఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 128 పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు విడతల్లో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐలు ఉండగా, 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు. -
Padma Awards 2022: బిపిన్కు విభూషణ్..
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డులు వరించిన వాళ్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణకు ఒక పద్మ భూషణ్తో పాటు 3 పద్మశ్రీ, ఏపీకి 3 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. పూనావాలా, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్లకు పద్మ భూషణ్ దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్కు ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్తో పాటు రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్ సింగ్ (మరణానంతరం), ప్రభా ఆత్రే ఎంపికయ్యారు. పద్మ భూషణ్కు మాజీ కాంగ్రెస్ లీడర్ గులాం నబీ ఆజాద్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఐ (ఎం) నేత బుద్ధదేవ్ భట్టాచార్య, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా, కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ను దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, పంజాబీ ఫోక్ సింగర్ గుర్మీత్ బవ, నటుడు విక్టర్ బెనర్జీ, కేంద్ర మాజీ హోం సెక్రటరీ రాజీవ్ మెహ్రిశ్రీలను కేంద్రం ఎంపిక చేసింది. తమిళనాడు రాష్ట్రం నుంచి నటి షావుకారు జానకి, అలాగే ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన నీరజ్ చోప్రా, సింగర్ సోనూ నిగమ్లు పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఈసారి 34 మంది మహిళలు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వాళ్లకు ఏటా ఈ అవార్డులను ఇస్తుంటారు. ఈసారి మొత్తం 128 అవార్డులను ప్రకటించారు. అవార్డులు పొందిన వాళ్లలో 34 మంది మహిళలున్నారు. 10 మందిని విదేశీ, ఎన్నారై, పీఐఓ, ఓసీఐ విభాగంలో ఎంపిక చేసింది. 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించింది. ఇద్దరికి కలిపి ఒకే అవార్డును ఈసారి రెండు సందర్భాల్లో ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లకే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు. పద్మ భూషణ్కు తెలంగాణ నుంచి భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ నుంచి దర్శనం మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు).. ఏపీ నుంచి గోసవీడు షేక్ హాసన్ (కళలు) (మరణానంతరం), డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం), గరికపాటి నరసింహారావు (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించింది. -
బీజేపీలో చేరిన బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు, రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరారు. బుధవారం ఉదయం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ను ఢిల్లీలో కలిశారు. సాయంత్రం విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విజయ్ రావత్ మాట్లాడుతూ.. బీజేపీలో చేరే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీలో చేరి ప్రజాసేవ చేయాలని ఉన్నట్లు తెలిపారు. పార్టీ ఆమోదిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం తన తండ్రి బీజేపీలో చేరడంతో ఇప్పుడు తనకు కూడా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. అయితే దోయివాలా అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రావత్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. -
బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం: ప్రతికూల వాతావరణమే కారణం
న్యూఢిల్లీ: మేఘావృతమైన ప్రతికూల వాతావరణంలోకి హఠాత్తుగా హెలికాప్టర్ ప్రవేశించడంతో.. అది పైలట్ అధీనంలో ఉన్నప్పటికీ దాని పథం మారి కిందకు దూసుకొచ్చి కూలిందని సీడీఎస్ రావత్ ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో వెల్లడైన ప్రాథమిక వివరాలు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి చేరాయని భారత వాయుసేన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ముందుస్తు కుట్ర, ఉగ్రవాద దుశ్చర్చ, హెలికాప్టర్లో లోపాలు, పైలట్ తప్పిదం.. ఇలాంటి వాదనలు అన్నీ అవాస్తవం’ అని స్పష్టంచేసింది. చదవండి: కోడలి నగలు భద్రపరచడం క్రూరత్వం కాదు ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైన సమాచారంతోపాటు ఘటనాస్థలిలో సేకరించిన సమాచారాన్ని పరిశీలించి ప్రాథమిక అంచనాకు వచ్చారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికసహా 14 మంది ప్రయాణిస్తున్న భారత వాయుసేన హెలికాప్టర్ గత ఏడాది డిసెంబర్ ఎనిమిదిన కూనూర్లో నీలగిరి కొండల్లో నేలకూలిన విషయం తెల్సిందే. -
Bipin Rawat: సైనిక్ స్కూల్కు జనరల్ బిపిన్ రావత్ పేరు
లక్నో: దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరును మెయిన్పురి జిల్లాలోని ఒక సైనిక్ స్కూల్కు పెట్టాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెలికాప్టర్ ప్రమాదంలో నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్కు నివాళిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం గురువారం ఒక ట్వీట్చేసింది. 2019 ఏప్రిల్ ఒకటిన ఈ స్కూల్ను ప్రారంభించారు. కూనూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతులుసహా 13 మంది అమరులైన విషయం విదితమే. -
రక్షణమంత్రికి సీడీఎస్ చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదిక
-
బిపిన్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటన.. ప్రమాదమే!
సాక్షి, న్యూఢిల్లీ: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు అందజేసింది. హెలికాప్టర్ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. డిసెంబర్ 8న తమిళనాడులో బిపిన్ రావత్ ప్రయాణించిన భారత వాయుసేనకు చెందిన MI-17V5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 14మంది దుర్మరణం పాలయ్యారు. ‘కోయంబత్తూరు నుంచి వెల్లింగ్టన్కు బయల్దేరిన MI-17V5 హెలికాప్టర్ కనూర్ సమీపంలో దట్టమైన మేఘాలల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా దారి స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్ ఇబ్బందులు పడ్డాడు. మేఘాల్లో చిక్కుకోవడంతో ముందున్న దృశ్యాలు అస్పష్టంగా కనిపించాయి. దారి కోసం రైల్వే లైన్ను హెలికాప్టర్ పైలట్ అనుసరించాడు. ఎత్తయిన శిఖరం అంచును హెలికాప్టర్ అనూహ్యంగా ఢీకొట్టింది. అదేవేగంతో హెలికాప్టర్ కిందికి పడిపోయింది’ అని ఇండియన్ ఎయిర్ఫోర్స్ నివేదికలో వెల్లడించింది. -
కొత్త సీడీఎస్ ‘ఎంపిక’ షురూ
న్యూఢిల్లీ: దివంగత జనరల్ బిపిన్ రావత్ స్థానంలో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) నియామక ప్రక్రియ మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన జనరల్ బిపిన్ రావత్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సీనియర్ కమాండర్లతో ఒక ప్యానెల్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్యానెల్ ప్రతిపాదించిన పేర్లతో కూడిన జాబితా త్వరలో రక్షణ మంత్రి రాజ్నాథ్కు అందుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తదుపరి ఈ జాబితా కేబినెట్ నియామకాల కమిటీకి పరిశీలనకు అందుతుంది. ఆ కమిటీ అంతిమంగా సీడీఎస్ పేరును ఖరారు చేస్తుంది. అత్యున్నత స్థాయి ఈ పోస్టుకు అత్యంత సీనియర్ అయిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జనరల్ నరవణె వచ్చే ఏడాది ఏప్రిల్లో రిటైర్ కానున్నారు. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇద్దరూ కూడా ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ఒక వేళ సీడీఎస్గా జనరల్ నరవణెను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే, తదుపరి సీడీఎస్గా ఎవరిని నియమించాల్సింది కూడా ఇప్పుడే నిర్ణయించాల్సి ఉంటుంది. తదుపరి ఆర్మీ చీఫ్గా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతి, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకే బ్యాచ్కు చెందిన సీనియర్ మోస్ట్ కమాండర్లు. ఇద్దరూ కూడా జనవరి 31వ తేదీన రిటైర్ కావాల్సి ఉంది. దేశ మొట్టమొదటి సీడీఎస్గా గత ఏడాది జనవరి ఒకటో తేదీన జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత
Captain Varun Singh Passed Away: ఆర్మీహెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ బుధవారం తుదిశ్వాస విడిచారు. కాగా, డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మందిలో 13 మంది అదే రోజు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ ఈరోజు కన్నుమూశారు. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిపట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదని అన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. చదవండి: ఈ ప్రమాదాలు యక్షప్రశ్నలేనా! Group Captain Varun Singh served the nation with pride, valour and utmost professionalism. I am extremely anguished by his passing away. His rich service to the nation will never be forgotten. Condolences to his family and friends. Om Shanti. — Narendra Modi (@narendramodi) December 15, 2021 IAF is deeply saddened to inform the passing away of braveheart Group Captain Varun Singh, who succumbed this morning to the injuries sustained in the helicopter accident on 08 Dec 21. IAF offers sincere condolences and stands firmly with the bereaved family. — Indian Air Force (@IAF_MCC) December 15, 2021 -
ఈ ప్రమాదాలు యక్షప్రశ్నలేనా!
భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు, వారి సిబ్బందితో సహా ప్రయాణిస్తున్న ప్రత్యేక సైనిక రవాణా రష్యన్ హెలికాప్టర్ తమిళ నాడులోని నీలగిరి కొండల్లో ఆకస్మిక ప్రమాదానికి గురై కూలిపోయింది. విమానం కెప్టెన్ మినహా అందరినీ బలిగొన్న ఆ ప్రమాదం రష్యన్ సైనిక వాహనాల వినియోగం, వాటి సాంకేతిక నాణ్యతపై పలు సందేహాలను రేకెత్తిస్తోంది. పౌరవిమానయాన దుర్ఘటనలకు, సైనిక రవాణా సంబంధిత హెలికాప్టర్ల పతనానికి కారణాలను శోధించే విచారణ సంస్థలు వెలువరించే ఏ నివేదికలూ ఒక పట్టాన వాస్తవాలను బహిర్గతం కానివ్వవు. ఆ నివేదికల్లో దాగి ఉన్న పలు వాస్తవాలను ప్రజలు ఎప్పటికి తెలుసుకోగల్గుతారన్నది మరొక యక్షప్రశ్నగానే మిగిలిపోతోంది. ఈ నెల 8వ తేదీన కూలిపోయిన ప్రత్యేక సైనిక రవాణా రష్యన్ హెలికాప్టర్ ‘ఎంఐ– 17వీ5’ తమిళనాడులోని నీలగిరి కొండల్లో అకస్మాత్తుగా అంత ర్థానమైన విషయం తెలిసిందే, ఈ దుర్ఘటనలో 13 మంది సైనిక సిబ్బందిని (భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా) దేశం కోల్పోయింది. ఈ సందర్భంగా భారత రక్షణశాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. ఈ ప్రమాద నేపథ్యంలో, రష్యన్ హెలికాప్టర్ల కోసం భారత ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందం గురించి గానీ, వాటి సామర్థ్యం గురించి కానీ ఎవరూ ఎలాంటి ఊహాగానాలు చేయరాదని ఆయన కట్టడి చేశారు. కాని గత పదేళ్ళుగా ఈ రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ల వల్ల సంభవించిన వరసవారీ ఘటనలు వాటి సామర్థ్యాన్ని అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఈ సందర్భంగా 1966–2021 మధ్యకాలంలో రష్యాకి చెందిన పౌర, సైనిక రవాణా హెలికాప్టర్ల వల్ల ఎన్ని దుర్ఘటనలు సంభవించాయో వివరిస్తూ సుప్రసిద్ధ ఐటీ, మీడియా సంస్థలు గూగుల్, వికీపీడియాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కొన్ని సివిలియన్ హెలికాప్టర్లు, కొన్ని సైనిక రవాణా హెలి కాప్టర్ల పతనానికి సంబంధించి కొందరు రాజకీయ పాలకులు, సైనికా ధికారులు చెప్పే కథనాలు తీవ్రమైన గందరగోళం కలిగిస్తున్నాయని వైమానిక నిపుణులు పేర్కొంటున్నారు. పరస్పర విరుద్ధమైన ఈ కథనాలవల్ల ఎవరి తొందరపాటు నిర్ణయాలు ఈ దుర్ఘటనలకు కార ణమో చెప్పలేని దుస్థితిని ఎదుర్కొనవలసి వస్తుందని ప్రముఖ రిటైర్డ్ ఎయిర్లైన్ ఇన్స్ట్రక్టర్ పైలట్, వైమానిక భద్రతా సలహాదారు కెప్టెన్ ఎ. మోహన్ రంగనాథన్ వివరించారు. ప్రమాదాల బారిన అధునాతన హెలికాప్టర్లు ఎందుకంటే రష్యన్ ప్రత్యేక హెలికాప్టర్లు ‘మనకెంత ముద్దయినా’, గత పదేళ్ళకు పైగా ఆ ప్రత్యేక హెలికాప్టర్లు అనేక ప్రమాదాలకు కారణమయ్యాయని చెప్పక తప్పదు. రష్యాతో 2008లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 2011లో భారత వైమానిక దళానికి ఈ ప్రత్యేక హెలికాప్టర్లను అందజేయడం మొదలైంది. 2012 నుంచి వాటి సేవల్ని మనం పొందుతున్నాం. అది మొదలు అధునాతనమైన ‘ఎంఐ–17 వి5’ రష్యన్ హెలికాప్టర్లు అనేక దుర్ఘటనలకు కారణమయ్యాయన్నది నిపుణుల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఈ రష్యన్ సైనిక, రవాణా హెలికాప్టర్లను ఎన్నిదేశాలు వినియోగిస్తున్నాయన్నది ఇక్కడ ప్రధానం కాదు, అవి ఆయా దేశాల్లో ఎన్ని ప్రమాదాలకు కారణమయ్యాయ న్నదే ఇక్కడ కీలకం. ముఖ్యంగా కెప్టెన్ మోహన్ రంగనాథన్ అంచనా ప్రకారం, సైనిక రక్షణ హెలికాప్టర్ ప్రమాద కారణాల విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఎన్నటికీ లేదు! అలాగే అధికారంలో ఉన్న రాజకీయ పాల కులు తమ ప్రత్యేక విమాన ప్రయాణాలకు సంబంధించిన ప్రమాద కారణాలను తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఎందు కంటే తమ కార్యక్రమాల్ని ముగించుకుని రావడంలో ఎవరి తొందర వారిది! పైలట్ల మానసిక స్థితిపై తీవ్ర ఒత్తిడి తమ ప్రయాణాలు, కార్యక్రమాలపై రాజకీయ నాయకుల తొందర, దాంతో తీసుకుంటున్న ఆకస్మిక నిర్ణయాలు హెలికాప్టర్లను నడిపే పైలట్ల మానసిక స్థితిపైన తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే హెలికాప్టర్ని నడిపి తీరాల్సిందే అని ఒత్తిడి చేసే రాజకీయ పాలకుడిని ఆ సమయంలో ఏ పైలట్ కూడా శాసిం చలేడు. ఇందుకు గతంలోనూ ఎన్నో ఉదాహరణలున్నాయి. 2001లో మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి మాధవరావు సింథియా తన అవసరం కొద్దీ కాన్పూరు వెళ్లవలసి వచ్చింది. కానీ, వాతావరణం ఏమాత్రం సహకరించని ఘడియల్లో పైలట్ను ఆయన బలవంతాన ఒత్తిడిచేసి బయలుదేరడంతో విమానం కూలి అందు లోని వారంతా ప్రాణాలు విడిచారు. అలాగే 2002లో లోక్సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి భారీవర్షంలో పైలట్ను ఒత్తిడికి గురిచేసి బయలుదేరి నప్పుడు ఆ హెలికాప్టర్ కాస్తా కుప్పకూలింది. గగనతల ప్రమాదాలకు అసలు కారణాల గురించి ఇన్ని అనుభవాలు చెప్తున్న గుణపాఠం ఏమిటో కూడా కెప్టెన్ మోహన్ రంగనాథన్ ఈ సందర్భంగా వివ రించారు. ‘పైలట్ను ఎన్నడూ మేం ఒత్తిడి చేయలేదు అని పాలకులు పైకి చెప్పడం అయితే చెబుతారు. కానీ విచారణ నివేదికలు మాత్రం ఆ ప్రమాద కారణాల్ని బహిరంగంగా వెల్లడించకుండా చడీ చప్పుడూ లేకుండా వాటిని తొక్కి పడతాయి’. అలాగే ఈ నెల 8వ తేదీన భారత సర్వసేనాధిపతి బిపిన్ రావత్ వినియోగించిన రష్యన్ సైనిక రవాణా వాహనం అననుకూల వాతా వరణ పరిస్థితుల్లో ప్రయాణించవలసి రావడానికి కారణం కూడా అలాంటిదే అయిఉండాలి! ఏది ఏమైనప్పటికీ, ఇటీవల తూర్పు అరు ణాచల్ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లోని కేదారనాథ్లో, గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్బేస్ దగ్గర్లో ఇవే రష్యన్ సైనికరవాణా హెలి కాప్టర్లు పరస్పరం ఢీకొని వైమానికదళ సభ్యులు ప్రాణాలు విడవ వలసి వచ్చింది! ఇందువల్ల రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ల విని యోగ సాంకేతికతలోనే తీవ్రమైన లోపం ఉండి ఉండాలన్న నిపుణుల అంచనాను విశ్వసించవలసి వస్తోంది! అంతేకాదు... చివరికి పాకిస్తాన్ సైన్యం వాడుతున్న ‘మిగ్–17’ రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ కూడా గిల్గిత్–బల్తిస్తాన్లోని ‘నల్తార్’ ప్రాంతంలో ఆకస్మికంగా కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నార్వే, ఫిలిప్పైన్, మలేషియన్, ఇండోనేషియా రాయ బారులు, వారి భార్యలతోపాటు, పాకిస్తాన్ సైన్యం పైలట్లు ఇద్దరు కూడా చనిపోయారు! బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన రష్యన్ ‘మిగ్– 17’ హెలికాప్టర్ కూడా ఇలాగే కూలిపోయిందని సాధికార వార్తా సంస్థలు ప్రకటించాయి. బ్లాక్బాక్స్ వివరాలు వెల్లడించరెందుకు? ఇలా 1955 నుంచి 2021వ సంవత్సరం దాకా ప్రపంచ దేశాలలో సైనిక వైమానిక రవాణా హెలికాప్టర్ల ద్వారా జరిగిన దుర్ఘటనలపై ప్రపంచ మీడియా వ్యవస్థలు సాధికార నివేదికలను ప్రచురించాయి! చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలు సమీపం లోని కొండల్లో వాతావరణ పరిస్థితులు వికటించిన ఫలితంగా చెట్లను ఢీకొని కూలిపోయింది. వై.ఎస్. అర్ధంతరంగా దివంగతులయ్యారు. అయితే, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్లోని ‘బ్లాక్బాక్స్’లో నిక్షిప్తమై ఉన్న వివరాల్ని మాత్రం వెల్లడించకుండా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ శాఖ జాయింట్ డైరెక్టర్గా వ్యవహరించిన అధికారి ‘చాలా జాగ్రత్త’ పడ్డారు! ఆమాట కొస్తే ఆ బాక్స్లోని వివరాల్ని ‘తూ.తూ’ మంత్రంగా తేల్చారు! అందువల్ల ఆ బ్లాక్బాక్స్ వివరాల్ని మభ్యపర్చడం ద్వారా ఆరోజుకీ, ఈ రోజుకీ వాస్తవాలను బయటపడనీయకుండా కనుమరుగుచేశారు. ఆ పరిస్థితుల్లో ఆ ప్రమాదానికి సంబంధించిన అనేక వాస్తవాలు కనుమరుగయ్యాయన్నది ‘బ్లాక్ బాక్స్’ వివరాల్ని తొక్కిపెట్టిన ఆఫీ సర్కి మాత్రమే తెలియాలి. అందుకే కెప్టెన్ మోహన్ రంగనాథన్ అన్నట్టు అటు పౌరవిమానయాన దుర్ఘటనలకు, సైనిక రవాణా సంబంధిత హెలికాప్టర్ల పతనానికీ కారణాలను విచారించే విచారణ సంస్థలు వెలువరించే ఏ నివేదికలు కూడా ఒకపట్టాన వాస్తవాలను బహిర్గతం కానివ్వవు. ఆ నివేదికల్లో దాగిఉన్న పలు వాస్తవాలను ప్రేక్ష కులైన ప్రజలు ఎప్పటికి తెలుసుకోగల్గుతారన్నది మరొక యక్షప్రశ్న గానే మిగిలిపోతోంది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆ వీడియో వాస్తవమేనా..?
Bipin Rawats Chopper Crash Video: ఆర్మీ హెలికాప్ట్టర్ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు తీసిన వీడియో వాస్తవమేనా అన్న పరిశోధన సాగుతోంది. ఈ వీడియో చిత్రీకరించిన నాజర్ అనే వ్యక్తి వద్ద క్యూబ్రాంచ్ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. ఈమేరకు ఘటనా స్థలంలోని కార్మికుల వద్ద ఆదివారం విచారణ సాగింది. వివరాలు.. నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని ఆర్మీ హెలికాçప్టర్ కుప్పుకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) ఈ ఘటనపై ఓ వైపు ఆర్మీ వర్గాలు, మరోవైపు రాష్ట్ర పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో హెలికాప్ట్టర్ కుప్పకూలేందుకు ముందుగా చిట్ట చివరి దృశ్యం అంటూ ఓ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం అన్నది పసిగట్టేందుకు క్యూబ్రాంచ్ రంగంలోకి దిగింది. విచారణను ముమ్మరం చేయగా, ఆ వీడియోను కోయంబత్తూరుకు చెందిన నాజర్ చిత్రీకరించినట్టు ఆదివారం వెలుగు చూసింది. దీంతో ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు. తాము పరాట్యక ప్రాంత సందర్శనకు వెళ్లిన సమయంలో ఆ వీడియో చిత్రీకరించినట్టు ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, రైల్వే ట్రాక్ వైపుగా నడుచుకురావాల్సిన అవసరం ఏమిటో అన్న ప్రశ్నలతో నాజర్ వద్ద విచారణ చేపట్టారు. అలాగే, ఆయన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని, ఆ వీడియో వాస్తవమేననా అన్నది నిగ్గుతేల్చేందుకు కోయంబత్తూరులోని పరిశోధన కేంద్రంలో çపరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్మీ వర్గాల నేతృత్వంలో సంఘటన జరిగిన ప్రదేశం పరిసరాల్లో మరోమారు పరిశీలన సాగింది. అయితే, ఆ పరిసరాల్లో 60 కుటుంబాలు ఉండగా, ఇందులో 12 మంది ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినట్టు సమాచారం. దీంతో హెలికాప్టర్ గాల్లో నుంచి కింద పడ్డ అనంతరం పేలిందా..? లేదా, గాల్లోనే ఏదేని మంటలు చెలరేగినట్టుగా కింద పడిందా...? అన్న కోణంలో వారిని ప్రశ్నించినట్లు సమాచారం. పాకిస్తానీ ట్విట్టర్లపై చెన్నై సైబర్ క్రైం కేసు పాకిస్తానీ ట్విట్టర్ ఖాతాదారులు పలువురిపై సీబీసీఐడీ సైబర్ క్రైం ఆదివారం కేసులు నమోదు చేసింది. బిపిన్రావత్ మరణం, హెలికాప్ట్టర్ ప్రమాద ఘటనపై పాకిస్తాన్కు చెందిన కొన్ని ట్విట్టర్ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారం, ఆధార రహిత ఆరోపణలు, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే రీతిలో సంభాషణలు సాగినట్టు తమిళనాడు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఖాతాలపై చర్యలకు తగ్గట్టు ట్విట్టర్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా కేసులు నమోదు చేశారు. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్కి గురైన వెయిటర్!) -
ఆ కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం
భోపాల్: డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నాయక్ జితేంద్ర కుమార్ వర్మ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆదివారం ఉదయం ధామండ గ్రామంలో జితేంద్ర కుమార్ వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం చౌహాన్ నివాళులర్పించారు. అనంతరం చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అమర్ షహీద్ జితేంద్ర కుమార్ జీ ధమందాకే కాదు.. యావత్ దేశానికే గర్వకారణం. ఈ పుణ్యాత్ముడికి, ఆయన తల్లిదండ్రులకు, భార్యకు నేను వందనం చేస్తున్నాను' అని అన్నారు. చదవండి: (అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం) అనంతరం తన ట్విటర్ ఖాతాలో.. 'హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు జితేంద్ర కుమార్ జీకి నేను నివాళులర్పిస్తున్నాను. అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వబడుతుంది. అమరవీరుని భార్య, కుమార్తె సునీతను ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటాం. అతని పేరు మీద ఒక పాఠశాలకు 'అమర్ షహీద్ జితేంద్ర కుమార్ విద్యాలయ' అని పేరు పెట్టడం జరుగుతుంది. ధమండ గ్రామంలో సైనికుని జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించబడుతుంది అంటూ సీఎం చౌహాన్ ట్వీట్ చేశారు. చదవండి: (గంట వ్యవధిలో మూడు ఒమిక్రాన్ కేసులు.. థర్డ్వేవ్ తప్పించుకోలేమా?) కాగా, సెహోర్ జిల్లాకు చెందిన వర్మ అంత్యక్రియలు పూర్వీకుల గ్రామమైన ధమండాలో నిర్వహించారు. కార్యక్రమం మొత్తం అతని సోదరుడు దగ్గరుండి నిర్వహించాడు. ఆ సమయంలో వర్మ తండ్రి, 13 నెలల కొడుకు కూడా అక్కడే ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
సెలవిక.. సైనికా!
బి.కొత్తకోట: ‘సాయితేజ అమర్ రహే.. జై జవాన్.. భారత్ మాతాకీ జై’ అంటూ వేలాదిగా తరలివచ్చిన ప్రజల నినాదాలతో ఎగువరేగడి గ్రామం ప్రతిధ్వనించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన లాన్స్నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు అతడి కుటుంబీకులు, సన్నిహితులు, బంధువుల అశ్రునయనాల నడుమ సైనిక, పోలీసు లాంఛనాలతో పూర్తయ్యాయి. బెంగళూరులోని ఆర్మీ బేస్ ఆస్పత్రి నుంచి సాయిజేజ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కురబలకోట మండలం ఎగువరేగడి గ్రామానికి చేరుకుంది. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు సాయితేజ భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. పార్థివదేహాన్ని తొలుత సాయితేజ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే మైదానానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం గంటకుపైగా ఉంచారు. అనంతరం ఇంటి సమీపంలో సిద్ధం చేసిన సమాధి వద్దకు శవ పేటికను ప్రజలు మోసుకొచ్చారు. అక్కడ సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ చేత తమ్ముడు మహేష్బాబు అంతిమ సంస్కారాలు చేయించారు. తర్వాత శవపేటికతో సహా సమాధి చేశారు. మధ్యాహ్నం 3:20 గంటలకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. నినాదాలు, ఆర్తనాదాల నడుమ.. సాయితేజ మృతదేహం ఉన్న శవపేటికను మైదానంలోకి తీసుకురావడంతో జనం ఒక్కసారిగా జై జవాన్ నినాదాలతో హోరెత్తించారు. దర్శనార్థం జనం దూసుకొచ్చారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లకు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అరగంట వరకు ఇదేపరిస్థితి నెలకొనగా పోలీసులు జనాన్ని అదుపు చేశాక శవపేటిక వద్దకు భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహన్, తమ్ముడు జవాన్ మహేష్బాబు, బంధువులు చేరుకోగా ఒక్కసారిగా ఆర్తనాదాలతో వాతావరణం ఆవేదనాభరితంగా మారింది. కొంతసేపు భార్య శ్యామల భర్త శవపేటిక వద్ద మౌనంగా ఉండిపోయింది. అర్తనాదాలు, జనం నినాదాలు, తోపులాటలు ఇవేమీ అర్థంకాని సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ జాతీయ పతాకం చేతపట్టి తండ్రి శవపేటిక వద్ద కూర్చున్న దృశ్యం కలచివేసింది. ఇక తండ్రి లేడన్న విషయం తెలియని మోక్షజ్ఞ తల్లి ఒడిలో కూర్చోని అటుఇటూ చూస్తూ జెండా ఊపుతూ కనిపించాడు. జనం జై జవాన్ నినాదాలు చేస్తుంటే సాయితేజ తమ్ముడు జవాన్ మహేష్బాబు వారితో గొంతు కలిపి జై జవాన్ అంటూ చేతులెత్తి నినాదాలు చేశాడు. అంత్యక్రియల సందర్భంగా రెండుచోట్ల అధికారిక లాంఛనాలు జరిపారు. తొలుత మైదానంలో శవపేటిక ఎదుట బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనికులు గౌరవ వందనం చేశారు. అనంతరం గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. ఆర్మ్డ్ పోలీసులు కూడా గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు సైనిక విభాగం నుంచి నలుగురు అధికారులు, ఐదుగురు జాయింట్ కమెండో ఆఫీసర్లు, 30 మంది సైనికులు హాజరయ్యారు. సమాధి చేసేముందు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకా లతో జనం నినాదాలు చేశారు. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు సెంథిల్కుమార్, వెంకట అప్పలనాయుడు సాయితేజ శవపేటికపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వెంకటేశ్వర, బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనిక విభాగం అధికారులు, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, స్థానిక అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. మదనపల్లె జెడ్పీ, హోప్, సీటీఎం, తంబళ్లపల్లె, చెంబకూరు హైస్కూళ్లు, మిట్స్, బీటీ కళాశాలకు చెందిన 200 మంది ఎన్సీసీ క్యాడెట్లు హాజరై నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్దకు ప్రజలు శవపేటికను మోసుకొచ్చారు. శ్యామలకు జాతీయ పతాకం అందజేత సాయితేజ మృతదేహం ఉంచిన శవపేటికకు చుట్టిన జాతీయ పతాకాన్ని సైనిక అధికారులు అతడి భార్య శ్యామలకు అందజేశారు. దేశం కోసం సాయితేజ అమరుడైనాడని, మీకు దేశం అండగా ఉంటుందని దైర్యం చెప్పారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మాటిచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..!
ఇండోర్: 'క్షమించండి.. మేము కత్రినా పెళ్లి ఫోటోను ప్రింట్ చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ప్రచురిస్తున్నాం!’ ఈ లైన్లను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. పై ఇమేజ్లో న్యూస్ పేపర్ కంటింగ్ దానికి సంబంధించిందే. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు అనేక మంది ఈ వార్తా పత్రిక చర్యను ప్రశంసిస్తున్నారు కూడా! ఎందుకో మీరే తెలుసుకోండి.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన జంటకు సంబంధించిన పవిత్రమైన స్మరణ కోసం గ్లామర్ను విస్మరించవచ్చు. జీవన మార్గంలో కలిసి నడవాలనే వాగ్దానం ఇంత విషాదకరమైన రీతిలో వెలుగులోకి రావడం దురదృష్టకరం అనే క్యాప్షన్తో పాటు జనరల్ బిపిన్ రావత్ పెళ్లి పత్రికను కూడా ప్రచురించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఈ వార్తాపత్రిక కటింగ్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ట్విట్టర్తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇది పెళ్లి సంబరాలను జరుపుకునే తరుణం కాదని, భారతమాత ముద్దుబిడ్డకి తలవంచి నమస్కరించాలని కొందరు, ఈ సమయంలో మన దేశానికి అండగా నిలవాలని మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ వివాహానికి ఒక రోజు ముందు సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన గత బుధవారం తమిళనాడులోని కూనూర్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సీడీఎస్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది జవాన్లు మృతి చెందారు. చదవండి: స్కూల్కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు! -
బిపిన్ రావత్కు నివాళులు అర్పించిన ఎన్నారైలు
న్యూ జెర్సీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. న్యూజెర్సీ ఎడిసన్లో శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించింది. బిపిన్ రావత్తో పాటు సైన్యం లో సేవలందించిన రిటైర్డ్ కల్నల్ వీరేంద్ర ఎస్ తవాతియాఈ కార్యక్రమానికి వచ్చారు. బిపిన్ రావత్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన స్మరించుకున్నారు. వీర సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసారు. ఈ సందర్భంగా సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, మాతా రాజ్యలక్ష్మి (స్పిరిట్యుయల్ గురు, కమ్యూనిటీ లీడర్), సాయి దత్త పీఠం బోర్డు సభ్యులు, ఆలయ భక్తులు, మాతృభూమి కోసం బిపిన్ రావత్ చేసిన సేవలను గుర్తు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్తో పాటు మరణించిన ఇతర సైనికులందరికీ నివాళులు అర్పించారు. బిపిన్ రావత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు రఘు శర్మ శంకరమంచి తెలిపారు. -
బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశసైన్యం స్వయం సమృద్ధి సాధించేదిశగా సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఎంతో కృషి చేశారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్లోని బలరాంపూర్లో రూ.9,800 కోట్లతో చేపట్టిన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు. భారతదేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం ప్రతి దేశభక్తునికి తీరని లోటు. అతను ధైర్యవంతుడు. దేశంలోని సాయుధ బలగాలను స్వావలంబనగా మార్చడానికి చాలా కష్టపడ్డాడు, దీనికి దేశం సాక్షి' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కాగా, 'భారతదేశం ప్రస్తుతం శోకసంద్రంలో ఉంది. అయితే దేశం సవాళ్లను అధిగమించి అభివృద్ధి దిశగా పనిచేస్తూనే ఉంటుంది. భారతీయులమైన మనం కష్టపడి పనిచేస్తాము. దేశం లోపల, దేశం బయట కూడా సవాళ్లను, ప్రతి సవాళ్లను ఎదుర్కొంటాము. భారతదేశాన్ని మరింత శక్తివంతంగా, సంపన్న దేశంగా తీర్చిదిద్దుతాం' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చదవండి: ('పగ, ద్వేషం ఉంటే నాపై తీర్చుకోండి.. వారు మీకేం అన్యాయం చేశారు') -
బిపిన్ రావత్కి వినూత్న నివాళి!... ఆకు పై ప్రతి రూపం చెక్కి!!
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో యావత్ భారత దేశం తుది వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలో చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, పౌరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. (చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!) అందరికంటే భిన్నంగా ఇక్కడొక వ్యకి తన కళా నైపుణ్యంతో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్కి నివాళులర్పించాడు. ఈ మేరకు కళాకారుడు శశి అడ్కర్ అనే వ్యక్తి రావి ఆకుపై పై బిపిన్ రావత్ ముఖచిత్రాన్ని రూపొందించి నివాళులర్పించాడు. అంతేకాదు ఆ కళాకారుడు ఆకు కళను చేతితో భూమి నుంచి ఆకాశంలోకి చూపిస్తున్నట్లుగా పైకి లేపి వెనుక నుంచి 'తేరి మిట్టి' పాట బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యేలా ఒక వీడియోను తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఐపిఎస్ అధికారి హెచ్జిఎస్ ధాలివాల్, నటుడు అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో కేంద్ర మంత్రి 'నీ కళాకృతికి సెల్యూట్" అని ఆ కళాకారుడిని ప్రశసిస్తూ ట్వీట్ చేశారు.ఈ క్రమంలో నెటిజన్లు కూడా స్పందిస్తూ... 'సీడీఎస్ జనరల్ శ్రీ బిపిన్ సింగ్ రావత్కు సెల్యూట్ ' అని ఒకరు, 'అల్విదా జనరల్ మీరు మా హృదయాలలో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు' అని మరొకరు ఇలా రకరకాలుగా ట్వీట్ చేశారు. ఈ మేరకు సీడిఎస్ జనరల్ బిపిన్ రావత్కు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ భారత సైన్యం ఇక వెబ్ లింక్ని కూడా జారీ చేసింది. (చదవండి: "సాయం" అనే పదానికి అంతరాలు ఉండవంటే ఇదేనేమో...!!) Salute! pic.twitter.com/BVb8grqpgX — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 9, 2021 -
వీరుడా.. వీడ్కోలు
న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. రావత్ దంపతుల పార్థివ దేహాలకు ఢిల్లీలోని కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో శుక్రవారం సాయంత్రం వారి కుమార్తెలు కృతికా, తరిణి దహన సంస్కారాలు నిర్వహించారు. రావత్ దంపతుల పార్థివదేహాలను పక్కపక్కనే ఉంచి చితి పేర్చారు. మత గురువు సంస్కృత శ్లోకాలు పఠిస్తుండగా, కుమార్తెలిద్దరూ తల్లిదండ్రుల చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా ఉద్విగ్నభరితమైన వాతావరణం నెలకొంది. ప్రజలు భావోద్వేగానికి గురై కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అంతకుముందు రావత్, మధులికకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేంద్ర మంత్రులు, ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్, బ్రిటష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్తోపాటు పలు దేశాల రక్షణశాఖ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. రావత్కు సైనికులు 17 శతఘ్నులతో గన్ సెల్యూట్ సమర్పించారు. రావత్ అమర్ రహే.. తొలుత శుక్రవారం ఉదయం రావత్, మధులిక భౌతికకాయాలకు వారి అధికారిక నివాసంలో అధికారులు, ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. నివాసం ఎదుట భారీగా జనం గుమికూడారు. భారత్ మాతా కీ జై, జనరల్ రావత్ అమర్ రహే, ఉత్తరాఖండ్ కా హీరా అమర్ రహే అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ, హరియాణా సీఎం ఖట్టర్, రాజ్యసభ సభ్యుడుఖర్గే, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు, మత గురువులు రావత్ దంపతుల పార్థివ దేహాల వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు అంతిమ యాత్ర మొదలైంది. వందలాది మంది యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో త్రివిధ దళాల నుంచి 800 మంది సీనియర్ సైనికులు పాల్గొన్నారు. జవాన్ల కవాతు మధ్య అంతిమ యాత్ర 10 కిలోమీటర్ల మేర కొనసాగి, శ్మశాన వాటికకు చేరుకుంది. ఈ యాత్ర పొడవునా జనం రావత్ దంపతుల భౌతిక కాయాలపై పూలు చల్లి నివాళులర్పించారు. అంత్యక్రియలను దేశవ్యాప్తంగా లక్షలాది మంది టీవీల్లో వీక్షించారు. నేడు హరిద్వార్కు చితాభస్మం రావత్ దంపతుల చితాభస్మాన్ని శనివారం ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్కు తీసుకెళ్లనున్నట్లు వారి కుమార్తె తరిణి చెప్పారు. చితాభస్మాన్ని హరిద్వార్లో గంగానదిలో నిమజ్జనం చేస్తామని అన్నారు. నా భర్తను నవ్వుతూ సాగనంపాలి బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్ భార్య గీతికా లిడ్డర్ న్యూఢిల్లీ: ‘‘నా భర్తకు ఘనమైన వీడ్కోలు పలకాలి. నవ్వుతూ సాగనంపాలి’’ అని బ్రిగేడియర్ లఖ్వీందర్సింగ్ లిడ్డర్ భార్య గీతికా లిడ్డర్ వ్యాఖ్యానించారు. హెలికాప్టర్ నేలకూలిన ఘటనలో జనరల్ రావత్ దంపతులతోపాటు మృతిచెందిన బ్రిగేడియర్ లిడ్డర్ అంత్యక్రియలను శుక్రవారం ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హరియాణా సీఎం ఖట్టర్తోపాటు సీనియర్ సైనికాధికారులు అంతకుముందు లిడ్డర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గీతికా లిడ్డర్ మాట్లాడుతూ.. విధులకు వెళ్లిన తన భర్త ఇలా నిర్జీవంగా తిరిగి వస్తారని ఊహించలేదని చెప్పారు. ఆయన మరణం తమ కుటుంబానికి పూడ్చలేని నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుడి భార్యనని, చెదరని నవ్వుతో తన భర్తకు వీడ్కోలు పలుకుతానన్నారు. తన తండ్రి ఒక హీరో, గొప్ప స్ఫూర్తి ప్రదాత అని లిడ్డర్ కుమార్తె ఆష్నా(17) చెప్పారు. తండ్రి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. 17 గన్ సెల్యూట్ ఎవరికి? రాష్ట్రపతి, అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల అంతిమ వీడ్కోలు సందర్భంగా 21 గన్ సెల్యూట్ సమర్పిస్తుంటారు. నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్, ఎయిర్ఫోర్స్ చీఫ్ మరణిస్తే 17 గన్ సెల్యూట్ సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. భారత తొలి డీసీఎస్ జనరల్ రావత్ ర్యాంక్.. ఆర్మీ చీఫ్, వాయుసేనాధిపతి, నావికా దళాధిపతిల ర్యాంక్లతో సమానం. అందుకే ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ చీఫ్లతో సమానంగా అంత్యక్రియల్లో 17 గన్ సెల్యూట్ సమర్పించారు. ‘2233 ఫీల్డ్ రెజిమెంట్’కు చెందిన 17 శతఘ్నులతో రావత్కు గన్ సెల్యూట్ చేయించారు. ఇతర దేశాల అధినేతలు, అతిథులు భారత్కు వచ్చినప్పుడు 19 గన్ సెల్యూట్తో గౌరవ వందనం సమర్పించడం ఆనవాయితీ. హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలు వద్దు న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: 13 మందిని బలిగొన్న హెలికాప్టర్ దుర్ఘటనపై ఎలాంటి ఊహాగానాలు వద్దని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజ్ఞప్తి చేసింది. కచ్చితమైన సమాచారం లేకుండా అవాస్తవాలను ప్రచారంలోకి తీసుకురావొద్దని శుక్రవారం ట్వీట్ చేసింది. ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రమాదంవెనుక కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమంటూ కొందరు నేతలు చెబుతున్న నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాఉండగా,హెలికాప్టర్ ప్రమాదంపై ఎలాంటి అనుమానాలకు తావులేదని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు శుక్రవారం చెప్పారు. నీలగిరి ప్రాంతంలో ఎల్లప్పుడూ కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందని తెలిపారు. -
వీరుడికి వీడ్కోలు....
-
కన్నీరు పెట్టిస్తోన్న సైనిక వీరుడి వీడ్కోలు దృశ్యాలు..
-
బిపిన్ రావత్ మృతి.. ‘దయచేసి ఆ ఊహాగానాలకు చెక్ పెట్టండి’
న్యూఢిల్లీ: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13మంది ప్రాణాలు కోల్పోయిన హెలికాఫ్టర్ ప్రమాదంపై వదంతులు ప్రచారం చేయొద్దని భారతీయ వాయుసేన విజ్ఞప్తిచేసింది. ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరింది. ఘటనపై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తునకు ఆదేశించామని.. దర్యాప్తు బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని పేర్కొంది. విచారణను త్వరితగతిన పూర్తిచేసి.. ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తుందని ట్విట్టర్లో వెల్లడించింది ఇండియన్ ఎయిర్ఫోర్స్. అప్పటివరకూ ఎలాంటి వదంతులు వ్యాప్తిచేయవద్దని విజ్ఞప్తిచేసింది. మరణించినవారి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. బుధవారం తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో సీడీఎస్ రావత్ దంపతులు సహా 13మంది మరణించారు. (చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
బిపిన్ రావత్ అంత్యక్రియలు: 17 తుపాకీ వందనాలే ఎందుకు..
సాక్షి, వెబ్డెస్క్: తమిళనాడు కూనూర్ సమీపంలో డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో రావత్తో పాటు ఆయన భార్య కూడా మరణించారు. రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వారికి తుపాకీ వందనం (గన్ సెల్యూట్) సమర్పిస్తారు. అంత్యక్రియల సందర్భంగా బిపిన్ రావత్కు 17 గన్ సెల్యూట్ సమర్పిస్తారు. ఈ క్రమంలో మన మదిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఈ గన్ సెల్యూట్ ఎందుకు, ఎవరికి సమర్పిస్తారు. వేర్వేరు సందర్భాలలో ఈ తుపాకీ గౌరవ వందనం వేర్వేరుగా ఉండటానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తాయి. వాటన్నింటికి సమాధానాలు.. ఇక్కడ లభిస్తాయి. అంత్యక్రియలో సమయంలో తుపాకీ వందనం సమర్పించడం అంటే.. ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అర్థం. అయితే ఎవరికి ఈ గౌరవం లభిస్తుంది అంటే.. రాజకీయం, సాహిత్యం, న్యాయ, విజ్ఞాన, కళా రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి తుపాకీ వందనం సమర్పిస్తారు. అలానే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున కూడా గన్ సెల్యూట్ ఉంటుంది. దీంతో పాటు భారత సైన్యం.. యుద్ధ, శాంతి సమయాల్లో విశేష కృషి చేసిన వారికి సైనిక వందనం సమర్పిస్తోంది. ఫిరంగి వందనం కూడా సమర్పిస్తారు. ఎవరికి, ఎన్ని తుపాకీ వందనాలు సమర్పిస్తారంటే.. భారత రాష్ట్రపతి, మిలిటరీ, సీనియర్ అధికారులు చనిపోయినప్పుడు.. 21 తుపాకీ వందనాలు (గాల్లోకి 21 సార్లు కాల్పులు జరుపుతారు) సమర్పిస్తారు. త్రివిధ దళాలలో పని చేసిన ఉన్నతాధికారులు మరణిస్తే.. 17 తుపాకీ వందనాలు సమర్పిస్తారు. గతంలో మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆయన గౌరవార్ధం.. ఢాకాలో 19 తుపాకీ వందనాలు సమర్పించారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంలు మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి.. తుపాకీ వందనం సమర్పిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తే.. దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించడం, జాతీయ జెండాను అవనతం చేయడం, దేశం అంతటా సెలవు ప్రకటించడం వంటివి చేస్తారు. తొలిసారి మహత్మ గాంధీకి ఇటీవలి కాలంలో మరణించిన వ్యక్తికి సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలో.. లేదో నిర్ణయించే విధంగా నిబంధనలు మార్చబడ్డాయి. భారతదేశంలో తొలిసారిగా మహాత్మా గాంధీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు దీనికి సంబందించి ఎలాంటి నియమ నింబధనలు రూపొందించలేదు. తుపాకీ వందనం వెనక ఉన్న చరిత్ర... బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి భారతదేశం 21 తుపాకీ వందన సంప్రదాయాన్ని వారసత్వంగా పొందింది. స్వాతంత్య్రానికి ముందు అత్యధికంగా 101 తుపాకీ వందనం ఉండేది. దీనిని రాయల్ సెల్యూట్ అని పిలుస్తారు. దీనిని భారత చక్రవర్తికి (బ్రిటీష్ క్రౌన్) మాత్రమే అందించారు. దీని తర్వాత 31-గన్ సెల్యూట్, రాయల్ సెల్యూట్ ఉంటుంది. ఇది రాణి, రాజ కుటుంబ సభ్యులకు సమర్పిస్తారు. ఇదే పద్దతిని వైస్రాయ్, భారత గవర్నర్ జనరల్కు కూడా పాటిస్తారు. దేశాధినేత, విదేశీ సార్వభౌమాధికారులు, వారి కుటుంబ సభ్యులకు 21 గన్ సెల్యూట్ సమర్పించారు. ఇక భారత రాష్ట్రపతికి పలు సందర్భాల్లో.. 21 తుపాకీ వందనం సమర్పిస్తారు. నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజున తుపాకీ వందనం స్వీకరిస్తారు. ఇక స్వాంతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు.. 21 తుపాకీ వందనం స్వీకరిస్తారు. చదవండి: మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ సాయితేజ మృతి: కన్నీటి సుడులు.. సంద్రమైన ఓదార్పులు -
పప్పా నా హీరో, బిగ్గెస్ట్ మోటివేటర్: బ్రిగేడియర్ లిడ్డర్ కుమార్తె కన్నీరు
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులోని ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బాసిన బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్ క్రిమటోరియంలో శనివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా లిడ్డర్ సతీమణి గీతిక, కుమార్తె అస్నా భావోద్వేగానికి లోనుకావడం అక్కడున్న వాందరి కళ్ళల్లో కన్నీరు నింపింది. (రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి) ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అమరుడయ్యారన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంటూ కుమార్తె అస్నా తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తండ్రి పార్థివ దేహాన్ని ముద్దు పెట్టుకుని కడసారి వీడ్కోలు పలికిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. ఈ సందర్భంగా ఆస్రా మాట్లాడుతూ ఆయన అకాల మరణం జాతికి తీరని నష్టం. నన్ను చాలా గారాబం చేసేవారు.. ఇపుడు భయంగా ఉంది. నాకిపుడు 17 ఏళ్లు. ఈ 17 ఏళ్లు నాన్న నాతో ఉన్నారు. ఆ సంతోషకరమైన జ్ఞాపకాలతో ముందుకు వెళ్తా. మా పప్పా నా హీరో, నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనే నా బిగ్గెస్ట్ మోటివేటర్ అంటూ కంటతడి పెట్టారు. #WATCH | Daughter of Brig LS Lidder, Aashna Lidder speaks on her father's demise. She says, "...My father was a hero, my best friend. Maybe it was destined & better things will come our way. He was my biggest motivator..." He lost his life in #TamilNaduChopperCrash on Dec 8th. pic.twitter.com/j2auYohtmU — ANI (@ANI) December 10, 2021 బ్రిగేడియర్ లిడ్డర్ పార్థివదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. ఆ పతాకాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు గీతిక. అనంతరం సతీమణి గీతిక మాట్లాడుతూ ‘‘ఆయన చాలా మంచి మనిషి, స్నేహ శీలి..అందుకే నవ్వుతూ సాగనంపుతామని వచ్చా ఆయన మంచి తండ్రి. నా బిడ్డ ఆయనను చాలా మిస్ అవుతుంది. ఆయన లేకుండా జీవించాల్సిన జీవితం ఇంకా చాలా ఉంది. చాలా నష్టం. కానీ విధి అలా ఉంది..గర్వంగా కంటే చాలా బాధగా ఉంది’’ అని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లిడ్డర్తోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే. లిడ్డర్ జనరల్ రావత్కు రక్షణ సలహాదారుగా ఉన్నారు. లిడ్డర్ మేజర్ జనరల్ ర్యాంక్కి పదోన్నతి పొందాల్సి ఉంది. లిడ్డర్కు 2020లో సేన మెడల్, విశిష్ట సేన పతకం లభించింది. గతంలో కశ్మీర్లో ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్స్కు నేతృత్వం వహించారు. #WATCH | "...We must give him a good farewell, a smiling send-off, I am a soldier's wife. It's a big loss...," says wife of Brig LS Lidder, Geetika pic.twitter.com/unLv6sA7e7 — ANI (@ANI) December 10, 2021 -
మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ
న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ వద్ద డిసెంబర్ 8న చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వరుణ్ సింగ్ ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ సింగ్ రెండు నెలల క్రితం అనగా సెప్టెంబర్ 21, 2021న తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపల్కు రాసిన ఓ లేఖ తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. చండి టెంపుల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వరుణ్ సింగ్ చదువుకున్నారు. చదవులో సామాన్య ప్రతిభ కనబరిచే విద్యార్థులనుద్దేశించి ఈ లేఖ రాశారు వరుణ్ సింగ్. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) ‘‘మీరు చదువులో యావరేజ్ స్టూడెంట్స్ అని ఎప్పుడు బాధపడకండి. చదువులో సామాన్యమైన విద్యార్థిగా ఉండటం తప్పేం కాదు. ప్రతి ఒక్కరు 90 శాతం మార్కులు తెచ్చుకోలేరు. ఒకవేళ మీరు మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులు అయితే మీకు నా అభినందనలు. ఒకవేళ మీరు ర్యాంకర్ కాకపోయినా బాధపడకండి. చదువులో సామాన్య విద్యార్థి అయినందున మీ జీవితం కూడా అలానే ఉంటుంది అని భావించకండి’’ అని వరుణ్ సింగ్ సూచించారు. ‘‘మీకు దేని మీద ఆసక్తో దాన్ని గుర్తించండి. సంగీతం, నటన, రచన ఏది అయినా కావచ్చు. దానిలో రాణించేందుకు శ్రమించండి. చదువులో నేనూ యావరేజ్ స్టూడెంట్నే. ఎప్పుడు టాప్ మార్కులు రాలేదు. ఇక తొలిసారి నన్ను స్క్వాడ్రన్లో యువ ఫ్లైట్ లెఫ్టినెంట్గా నియమించిన్పుడు చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత నాకు ఓ విషయం అర్థం అయ్యింది. నేను కనుక నా మనసు, బుద్ధిని దీని మీదే కేంద్రీకరిస్తే.. చాలా అద్భుతంగా పని చేయగలనని తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి నేను అత్యుత్తమంగా పని చేయడం ప్రారంభించాను’’ అని వరుణ్ సింగ్ రాసుకొచ్చారు. (చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు) ‘‘నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నప్పుడు నేను చదువలో, క్రీడల్లో రాణించలేదు. కానీ ఫ్లైట్ లెఫ్టినెంట్గా నియమించినప్పుడు నేను దాని మీద మనసు పెట్టాను. ఆ తర్వాత నాకు విమానాల పట్ల మక్కువ పెరిగింది. అలా నేను మెరుగ్గా పని చేస్తూ.. జీవితంలో ఎదిగాను. తొలుత నేను నా వాస్తవ సామర్థ్యాలను విశ్వసించలేదు. ఈ విషయం నాకు అర్థం అయిన తర్వాత నేను వెనుతిరిగి చూడలేదు. మీరు కూడా మీ మీద నమ్మకం పెట్టుకొండి. మీకు నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేయండి. మార్కులు మన జీవితానికి కొలమానం కాదు’’ అన్నారు వరుణ్ సింగ్. అంతేకాక తాను శౌర్య చక్ర అవార్డు అందుకోవడానికి ఆర్మీ స్కూలే కారణమని వరుణ్ సింగ్ తన లేఖలో తెలిపారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ఉన్న ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 'It's ok to be mediocre' Inspiring letter of Group Captain Varun Singh, lone survivor in helicopter crash, to principal of his school with request to share it with teenaged students to motivate them. Sharing the wonderful journey & beautiful thoughts of the braveheart with u. pic.twitter.com/vSpymhMg0p — Arun Bothra 🇮🇳 (@arunbothra) December 9, 2021 చదవండి: ఊరే అతడింటికి కదిలొచ్చింది -
పూర్తయిన బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు
05:18PM బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంతిమ సంస్కారాలు సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. సీడీఎస్ రావత్కు 17 గన్ సెల్యూట్తో ఘనంగా నివాళులు అర్పించింది భారత సైన్యం. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99మంది సైనికాధికారులు.. 33 మందితో కూడిన ట్రై సర్వీస్ బ్యాండ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. త్రివిధ దళాలకు చెందిన మొత్తం 800మంది సేవా సిబ్బంది అంత్యక్రియాల్లో పాలుపంచుకున్నారు. శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్కు చెందిన సీనియర్ మిలటరీ కమాండర్లు జనరల్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. 03:30PM ►దారిపొడవునా జనరల్ రావత్కు జననీరాజనం 03:15PM కన్నీటి వీడ్కోలు ►సైనిక వీరుడికి తుది వీడ్కోలు పలుకుతున్న ఢిల్లీ ప్రజలు ►కొనసాగుతున్న జనరల్ బిపిన్ రావత్ అంతిమయాత్ర ►భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తుతున్న ఢిల్లీ 02:10PM ►మధ్యాహ్నం 2 గంటలకు రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో రావత్ దంపతులు అంత్యక్రియలు జరుగుతాయి. సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల మృత దేహాలను శుక్రవారం ఢిల్లీలోని వారి నివాసానికి తరలించారు. ప్రజల సందర్శన కోసం రావత్ దంపతుల పార్థివదేహాలను ఢిల్లీలోని కామరాజ్ మార్గ్ నివాసంలో ఉంచారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బజాల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తదితరలు శుక్రవారం రావత్ ఇంటికి చేరుకుని.. దంపతులకు నివాళులర్పించారు. (చదవండి: హెలికాప్టర్ ప్రమాదం: ఢిల్లీకి పార్థివ దేహాలు) చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు -
ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు
న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్కు సహాయక సిబ్బందిగా ఏడాదికాలంగా విధుల్లో ఉన్న సెకండ్ జనరేషన్ ఆర్మీ అధికారి, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ పదోన్నతి అర్ధంతరంగా ఆగింది. బుధవారం హెలికాప్టర్లో రావత్తో పాటు ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిలో లఖ్వీందర్ ఉన్నారు. హరియాణాలోని పంచకులకు చెందిన లఖ్వీందర్ గతంలో కశ్మీర్లో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలో, చైనాతో సరిహద్దు వెంట ఆర్మీ బ్రిగేడ్కు నేతృత్వం వహించారు. కజక్స్తాన్లో భారత సైనిక బృందంలో పనిచేశారు. సేనా మెడల్, విశిష్ట్ సేవా మెడల్ ఆయనను వరించాయి. త్రివిధ దళాల విధుల్లో విశేష అనుభవముంది. దాంతో రావత్కు సహాయక సిబ్బందిలో డిఫెన్స్ అసిస్టెంట్గా నియమితులయ్యారు. సెకండ్ జనరేషన్ ఆర్మీ ఆఫీసర్గా ఉన్న ఆయనకు త్వరలోనే మేజర్ జనరల్ పదవిని కట్టబెట్టనున్నారు. ప్రమోషన్ జాబితాలో ఉన్న ఆయన ఆ పదోన్నతి పొందకుండానే వీరమరణం పొందారు. లఖ్వీందర్కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) విహార యాత్రకు తీసుకెళ్తామన్నారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన హవాల్దార్ సత్పాల్ రాయ్ సొంతూరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా తక్దాలో విషాదం అలుముకుంది. రాయ్కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సైన్యంలో పనిచేస్తున్నారు. ‘చివరిసారిగా దీపావళికి వచ్చారు. ఏప్రిల్లో వస్తానని మాట ఇచ్చారు. అందర్నీ విహారయాత్రకు తీసుకెళ్తానన్నారు. ఇంతలో ఘోరం జరిగింది’ అని రాయ్ భార్య కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు, ప్రమాదంలో మరణించిన కో–పైలట్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లు రాజస్తాన్లోని సొంతూరు ఘర్దానా ఖుర్ద్లో మొదలయ్యాయి. కాగా, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనున్నాయి. (చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్కు వెళ్లాడా’’) 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టారు ఒక సోదరి ముంబైలో ఉండటంతో ఇన్నాళ్లూ కుదరక, ఎట్టకేలకు ముగ్గురు అక్కలతో కలసి 31 ఏళ్ల తర్వాత ఇటీవల రాఖీ పండుగ జరుపుకున్న తన కుమారుడు ఇప్పుడు లేడని, హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ తండ్రి వాపోయారు. ఐదుగురు సంతానంలో ఇతనే చిన్నవాడని పృథ్వీ జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన పృథ్వీ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. పృథ్వీ 2000లో హైదరాబాద్లో భారత వాయుసేనలో చేరారు. -
బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం
కోయంబత్తూర్: హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ను మరింత మెరుగైన చికిత్స కోసం గురువారం బెంగళూరుకు తరలించారు. ఊటీ వెల్లింగ్టన్ మిలిటరీ ఆస్పత్రి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా సాయంత్రం బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కమాండ్ ఆస్పత్రికి తరలించారు. కాగా, వరుణ్ ఆరోగ్య పరిస్థితిపై కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్, సీఎం బసవరాజ్ బొమ్మైలు వివరాలు అడిగి తెల్సుకున్నారు. అంతకుముందు వరుణ్ తండ్రి రిటైర్డ్ కల్నల్ కేపీ సింగ్ మాట్లాడారు. తానిప్పుడే వెల్లింగ్టన్కు వచ్చానని చెప్పారు. వరుణ్ను బెంగళూరుకు తీసుకువెళ్తున్నారని ధృవీకరించారు. వరుణ్ పరిస్థితిపై ఇప్పుడేమీ చెప్పలేనన్నారు. వరుణ్ ప్రమాద వార్త తెలిసినప్పుడు ఆయన తల్లిదండ్రులు ముంబైలోని తమ చిన్న కుమారుడు లెఫ్టినెంట్ కమాండర్ తనూజ్ వద్ద ఉన్నారు. గతంలో వరుణ్ తృటిలో మృత్యువాత నుంచి బయటపడిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఎలా ఉన్నారు? వరుణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వెల్లింగ్టన్లో ఆయనకు వైద్యం చేస్తున్న వైద్యుల బృందం తెలిపింది. కొందరు అధికారులు ఆయనకు 45 శాతం కాలిన గాయాలయ్యాయని చెబుతుండగా, తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు మాత్రం ఆయనకు 80–85 శాతం కాలిన గాయాలు అయ్యాయని చెప్పారు. ఆయన పరిస్థితి ఇప్పటికీ సీరియస్గానే ఉందన్నది నిర్విదాంశం. ఆయన్ను లైఫ్ సపోర్టు వ్యవస్థపై ఉంచి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు తెలిసింది. మరోవైపు వరుణ్ కోలుకోవాలని రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ప్రార్ధించారు. చదవండి: చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్ -
బిపిన్ రావత్ ఓ బ్రాండ్ .. మాజీ కల్నల్ ఎమోషనల్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మాజీ కల్నల్ పీవీ దుర్గా ప్రసాద్ కొన్నేళ్ల పాటు బిపిన్ రావత్తో కలిసి పని చేశారు. ఇద్దరూ కలిసి అనేక కీలక ఆపరేషన్లు కూడా చేశారు. 1978 నుంచి ఇద్దరూ కలిసి ఒకే బెటాలియన్లో దాదాపు 18 ఏళ్లు విధులు నిర్వర్తించారు. లెఫ్ట్నెంట్ నుంచి కల్నల్ వరకు కలిసే ఎదిగారు. ఆపై దుర్గా ప్రసాద్ పదవీ విమరణ పొందారు. రావత్ సీడీఎస్ వరకు ఎదిగారు. ఈ ద్వయం అమృత్సర్, యూరిల్లో అత్యంత సన్నిహితంగా పని చేసి, అనేక ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. బిపిన్ హఠాన్మరణం నేపథ్యంలో దుర్గా ప్రసాద్ గురువారం మీడియాతో మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే.. నిబద్ధతకు నిదర్శనం.. ► బిపిన్ రావత్తో కలిసి 11 గూర్ఖా రైఫిల్స్కు చెందిన ఆల్ఫా కంపెనీలో పని చేశా. ఓ రోజు ఇద్దరం కలిసి యూరి క్యాంప్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద గార్డ్ చేస్తూ మధ్యాహ్న భోజనానికి వచ్చాం. అది పూర్తయిన తర్వాత ఎవరో మేజర్ జనరల్ వస్తే ఆయన బ్రీఫింగ్ చేస్తూ నేను ఆగిపోగా... బిపిన్ ఆర్మీ వాహనంలో తన విధులకు వెనక్కు వెళ్తున్నారు. నేను చూస్తుండగానే బాంబు పేలింది. ఆ ప్రమాదంలో ఆయన గాయాలతో బయటపడ్డారు. నాటి దసరా సందర్భంలో గాయాలతో ఉన్నారు. అలాంటి వారికి క్యాంప్ నుంచి వెనక్కు వచ్చే అవకాశం ఉన్నా... ఆయన ఒప్పుకోలేదు. అంతటి నిబద్ధతతో విధులు నిర్వర్తించే వారాయన. ► దసరా రోజు సాయంత్రం 5.30 గంటలకు పాకిస్థాన్కు చెందిన ఛగోతీ పోస్టు వద్ద ఉన్నాం. ‘నేను నా ట్రూప్స్తో వెళ్లి దసరా బోర్డర్ లైన్ వద్ద సెలబ్రేట్ చేస్తా’ అని వెళ్లారు. దాదాపు రెండుమూడు గంటలు అక్కడ గడిపి వెనక్కు వచ్చారు. ఆయన నడిచే పరిస్థితి లేకపోవడంతో గూర్ఖా ట్రూప్స్ మోసుకు వెళ్లాయి. ఆ రోజు ఉన్నతాధికారులకూ సమాచారం ఇవ్వకుండా ఇలా చేశాం. అలాంటివి మళ్లీ జరిగి ఉంటాయని అనుకోను. పాకిస్థాన్కు చెందిన ఆయుధాలు రికవరీ చేయడం, ఆ బలగాల కదలికల్ని కనిపెట్టడంలో బిపిన్ రావత్కు మంచి నెట్వర్క్ ఉండేది. సెకండ్ లెఫ్ట్నెంట్ నుంచే ముందుండి ట్రూప్ను నడిపే వారు. అందుకే అనేక మెడల్స్ ఆయన సొంతమయ్యాయి. 18 గంటల పాటు పనిచేసేవారు ► రావత్కు మానసిక స్థైర్యం, ధైర్యం చాలా ఎక్కువ. నాగాలాండ్ ఇన్సెర్జెన్సీ ఏరియాలో ఉండగా ఓ రోజు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయింది. ఆ వెంటనే కిందికి పడిపోయింది. అలా జరిగితే ఎవరైనా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. బిపిన్ రావత్ మాత్రం అలా చేయలేదు. మరో హెలికాప్టర్ తీసుకుని వెళ్లి పని పూర్తి చేసుకువచ్చారు. పని పట్ల ఆయనకు ఉండే నిబద్ధత అలాంటిది. ఒక్కోసారి నిర్విరామంగా 18 గంటలూ ఆయన పని చేసే వారు. ఆయన భార్యను మేం మధు అని పిలిచేవాళ్లం. ఆమెది మధ్యప్రదేశ్కు చెందిన రాజకుటుంబం. అయినా ఆ దర్పం గాని, సీనియర్ అధికారి భార్య అనే భావన గాని ఏనాడూ ఆమెలో కనిపించలేదు. లక్నోలో మేమంతా కలిసి ఒకేచోట ఉండేవాళ్లం. నా భార్య అరుణకు ఆమె స్కూటర్ నడపడం నేర్పారు. ► రావత్ ఆర్మీ వైస్ చీఫ్, చీఫ్ అయిన తర్వాత కూడా ఆయన నాకు ఫోన్లు చేసి మాట్లాడేవారు. ఆయన హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ వెళ్లి కలిసేవాడిని. రావత్ సీడీఎస్ అయిన తర్వాత ఒకేసారి కలిశాను. ఏడాది క్రితం ఆయన సీడీఎంలో లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు. అప్పుడు దాదాపు గంటకు పైగా ఆయనతో గడిపా. బిపిన్ ఆర్మీ ఆపరేషన్స్లో దిట్ట. ఆయనకు అవంటే చాలా ఇష్టం. ఆయన కాంగోలో ఐక్యరాజ్య సమితి మిషన్లో పని చేశారు. అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, చర్యలను అందరూ అభినందించారు. ► బలగాల నైతిక ధైర్యం దెబ్బతీయడానికి యూఎన్ కాన్వాయ్పై దాడికి ప్రయత్నించిన కాంగో మిలిటెంట్స్ను సమర్థంగా తిప్పికొట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచంలోని ప్రసిద్ధ దేశాల ఆర్మీలని ఆయన అధ్యయనం చేశారు బిపిన్. ఈ నేపథ్యంలోనే ఆయన సీడీఎస్ అయిన తర్వాత థియేటర్ కమాండ్ అనే కొత్త కాన్సెప్ట్ పరిచయం చేశారు. దీంతో ఏ ప్రాంతంలో ఉన్న సైన్యానికైనా ఆయుధ, మౌలిక వసతుల కల్పన తేలికైంది. యుద్ధంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అది పూర్తిగా అమలులోకి వచ్చే సందర్భంలోనే విషాదం చోటుచేసుకోవడం దారుణం. చదవండి: ఎంఐ–17వీ5 ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు -
ఎంఐ–17వీ5 ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు
న్యూఢిల్లీ: ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రారంభమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు సాగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడి, సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లైఫ్ సపోర్టు సిస్టమ్పై ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్(ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్నాథ్ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో మాట్లాడారు. హెలికాప్టర్ దుర్ఘటన గురించి తెలియజేశారు. ఐఏఎఫ్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందం బుధవారమే తమిళనాడులోని వెల్లింగ్టన్కు చేరుకుందని, వెంటనే రంగంలోకి దిగి, దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తోపాటు ఇతర సైనికుల అంత్యక్రియలను పూర్తి సైనిక లాంఛనాలతో నిర్వహిస్తామన్నారు. ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి ‘జనరల్ రావత్ షెడ్యూల్ ప్రకారం వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో విద్యార్థులు, అధికారులతో భేటీ కావాల్సి ఉంది. ఇందుకోసం సూలూరు ఎయిర్బేస్ నుంచి బుధవారం ఉదయం 11.48 గంటలకు వాయుసేనకు చెందిన ఎంఐ–17వీ5 హెలికాప్టర్లో బయలుదేరారు. 12.15 గంటలకు వెల్లింగ్టన్లో దిగాల్సి ఉండగా, సూలూరులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో హెలికాప్టర్కు మధ్యాహ్నం 12.08 గంటలకు సంబంధాలు తెగిపోయాయి. కూనూరు వద్ద అడవిలో మంటలు చెలరేగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న హెలికాప్టర్ శిథిలాలు వారికి కనిపించాయి. స్థానిక అధికారులు, సహాయక సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను బయటకు తీసి, వెల్లింగ్టన్లోని మిలిటరీ హాస్పిటల్కు తరలించారు. మాకు అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో 13 మంది మరణించారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరిని సంఘటనా స్థలానికి పంపించాం’’ అని రాజ్నాథ్ సింగ్ వివరించారు. ఉభయ సభల్లో నివాళులు తమిళనాడు నీలగిరి కొండల్లో చోటుచేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారికి లోక్సభ, రాజ్యసభలో ఎంపీలు నివాళులర్పించారు. మృతుల ఆత్మశాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించారు. జనరల్ బిపిన్ రావత్ మృతిపట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంతాపం తెలిపారు. దేశం ఒక గొప్ప యోధుడు, వ్యూహకర్త, అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిపిన్ రావత్ అసాధారణమైన, ఎనలేని పేరు ప్రఖ్యాతలు కలిగిన సైనికాధిపతి అని రాజ్యసభలో డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ కొనియాడారు. రావత్ సంతాప సందేశాన్ని సభలో చదివి వినిపించారు. ఆయన అందించిన సేవలను దేశ ప్రజలు, సైనికులు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతిచెందడం బాధాకరం, దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్యసభలో ఎంపీలు మౌనం పాటించారు. బ్లాక్ బాక్స్ లభ్యం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ దంపతులతోపాటు మరో 11 మందిని బలిగొన్న ఎంఐ–17వీ5 హెలికాప్టర్ ప్రమాదంపై ఆర్మీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలకమైన ఫ్లైట్ డేటా రికార్డర్(బ్లాక్ బాక్స్)ను గురువారం వెలికితీశారు. ఘటనా స్థలంలో గాలింపు చేపడుతుండగా 300 మీటర్ల దూరంలో ఇది లభ్యమైందని చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్లోని సమాచారం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ బాక్స్ను ఢిల్లీ లేదా బెంగళూరుకు తరలించి, సమాచారాన్ని విశ్లేషించాలని యోచిస్తున్నారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి గురువారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. సీనియర్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. హెలికాప్టర్ ప్రమాదంపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో హెలికాప్టర్ వీడియో తమిళనాడులోని నీలగిరి కొండల్లో నేలకూలిన ఎంఐ–17వీ5 హెలికాప్టర్ పేరిట ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీన్ని నెటిజన్లు విస్తృతంగా షేర్ చేశారు. కొండపై దట్టమైన పొగమంచులో వెళ్తున్న హెలికాప్టర్ కొన్ని క్షణాల తర్వాత అదృశ్యమైనట్లు ఈ వీడియోలో రికార్డరయ్యింది. ఈ దృశ్యాన్ని ఓ పర్యాటకుడు చిత్రీకరించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ వీడియోపై వైమానిక దళం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. -
ఊరే అతడింటికి కదిలొచ్చింది
మదనపల్లె: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్కు వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేస్తూ.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన లాన్స్నాయక్ బి.సాయితేజ మృతదేహం కోసం అతని కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు ఆ గ్రామమంతా కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తోంది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువ రేగడవారిపల్లెకు చెందిన సాయితేజ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడని తెలియగానే ఊరికి ఊరే అతడి ఇంటి వద్దకు చేరింది. అప్పటికే విషయం తెలిసి కుప్పకూలిన లాన్స్నాయక్ తల్లిదండ్రులు మోహన్, భువనేశ్వరిని ఆ ఊరంతా ఓదారుస్తోంది. తమ ఊరి ముద్దుబిడ్డ ఇక లేడంటే ఇప్పటికీ గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల, తాత మోహన్, నాయనమ్మ భువనేశ్వరి గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియని చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని వారందరి ముఖాల్లోకి దీనంగా చూస్తుండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో.. సాయితేజ మృతదేహాన్ని గుర్తించేందుకు వీలుగా ఆర్మీ ప్రత్యేక బృందం అతడి తల్లిదండ్రుల నుంచి రక్త నమూనాలు సేకరించి తీసుకెళ్లింది. వీరి డీఎన్ఏల ఆధారంగా లాన్స్ నాయక్ మృతదేహాన్ని గుర్తించి.. శుక్రవారం సాయంత్రానికి స్వగ్రామానికి తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు సాయితేజ మరణవార్త అధికారికంగా ధ్రువీకరించాక ఆయన భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మదనపల్లె నుంచి ఎగువరేగడ వారిపల్లె గ్రామానికి చేరుకున్నారు. డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్కుమార్, ఇన్చార్జ్ తహసీల్దార్ సయ్యద్ ఎగువరేగడకు వెళ్లి అంతిమ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సాయితేజ పార్థివదేహాన్ని ఇంటికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. వీరజవాన్ అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సైనికాధికారులు, ప్రజలు హాజరవుతారన్న సమాచారంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న మరణవార్త తెలిసిన వెంటనే సాయితేజ సోదరుడు మహేష్ (బీఎస్ఎఫ్ జవాన్) సిక్కిం నుంచి గురువారం సాయంత్రం స్వగ్రామం చేరుకున్నాడు. తల్లి, తండ్రి, వదినను ఎలా ఓదార్చాలో తెలియక దుఃఖాన్ని దిగమింగుకుంటూ అందరిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. తన సోదరుడి స్ఫూర్తితోనే దేశ సేవలో చేరానన్నాడు. ‘నన్ను రమ్మని చెప్పి నువ్వెళ్లిపోయావా’ తన బిడ్డ సాయితేజకు ఎప్పుడు ఫోన్ చేసినా ‘మదనపల్లెకు వచ్చేయమ్మా. నా భార్యాబిడ్డలకు తోడుగా ఉండు. నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’ అనే వాడని తల్లి భువనేశ్వరి వాపోయింది. ‘వ్యవసాయ పనులు పూర్తయ్యాక వస్తాలే బిడ్డా్డ అంటే.. కూలీలు చూసుకుంటార్లేమ్మా. నీవు వచ్చేయని ప్రాధేయపడేవాడు. ఇప్పుడు నా బిడ్డ లేడు. నన్నెవరు చూసుకుంటారు తండ్రీ’ అని రోదిస్తోంది. ‘అందరూ వద్దంటే నేనే పంపిస్తిని’ ‘ఆర్మీలోకి పంపొద్దని ఊళ్లో అందరూ చెబుతున్నా నేనే పంపిస్తినే. ఆడు వెళతానని పట్టుపడితే బిడ్డ కోరిక కాదనక పోతినే. ఇప్పుడు ఇట్టా జరిగితే నాకు దిక్కెవరు రామా. నీకు నేనున్నా నాన్నా అనే వాడివే బిడ్డా. మోసం చేసి వెళ్లిపోతివే సామీ. నాకు దిక్కెవరు రామా..’ అంటూ తండ్రి మోహన్ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
హెలికాప్టర్ సడన్గా పడిపోయి ఉండొచ్చు..బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై
సాక్షి, హైదరాబాద్/కంటోన్మెంట్: ప్రతికూల వాతావరణానికి సాంకేతికలోపం తోడై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణించిన ఎంఐ–17 హెలికాఫ్టర్ సడన్గా డ్రాప్ అయి కిందికి వచ్చి ఉంటుందని, దీని వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని రిటైర్డ్ వింగ్ కమాండర్ టీజే రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ కమోడోర్ ఎన్ఎన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎంఐ–17 హెలికాప్టర్ గంట ప్రయాణానికి 800 లీటర్ల ఇంధనం అవసరం అవుతుందని, ప్రమాద సమయంలో హెలికాప్టర్లో కనీసం 1,200 లీటర్ల ఇంధనం ఉండే అవకాశముందని, ఎత్తు నుంచి కిందకు పడిపోయిన వెంటనే ఇంధనం వల్ల మంటలు చెలరేగి ఉంటాయన్నారు. హెలికాప్టర్లోని ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్ బాక్స్), కాక్ పిట్ వాయిస్ రికార్డర్ విశ్లేషణ తర్వతే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. ఈ విశ్లేషణకు 10 నుంచి 15 రోజుల సమయం పట్టొచ్చన్నారు. టీజే రెడ్డి, ఎన్ఎన్ రెడ్డి గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలపై వీరేమన్నారంటే.. చలికాలం.. పొగ మంచు.. వీఐపీలు ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లను అత్యంత అనువభమున్న పైలెట్లే నడుపుతారు. టేకాఫ్ అవడానికి ముందే వాటిని అనేక రకాలుగా పరీక్షిస్తారు. సీడీఎస్ రావత్ ప్రయాణించిన ఎంఐ–17 హెలికాఫ్టర్లోని వెదర్ రాడార్లో ప్రయాణ మార్గంలో వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. అయితే మేఘాలు స్పష్టంగా కనిపించినా పొగమంచు ఆ స్థాయిలో కనిపించదు. రావత్ ప్రయాణించిన మార్గంలో కొండలు, అడవులు ఉన్నాయి. చలికాలంలో కొండలపై భాగంలో పొగమంచు ఎక్కువుంటుంది. ఒక్కోసారి ఊహించిన దానికంటే ఎక్కువగానూ ఉండొచ్చు. అనుకోకుండా పెరిగిపోవచ్చు. గమ్యానికి మరో 10–15 కి.మీ. దూరంలోనే ఉండటంతో పైలెట్ హెలికాఫ్టర్ను కిందికి తీసుకువచ్చి ఉంటాడు. ఆ సమయంలో మంచు వల్ల కింద ఏముందో కనిపించకపోవచ్చు. అయినా అనుభవజ్ఞుడైన పైలెట్ కావడంతో ధైర్యంగా కిందికి వచ్చి ఉంటాడు. ఆ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చి హెలికాప్టర్ సడన్గా డ్రాప్ అయి ఉంటుంది. ఒకేసారి 100 నుంచి 150 అడుగులు కిందికి పడిపోయి ఉంటుంది. దీని వల్ల హెలికాప్టర్లోని ఇంధనం నుంచి మంటలు అంటుకొని ఉండొచ్చు. వాతావరణం బాగోలేనప్పుడు.. వాతావరణం బాలేనప్పుడు పైలట్లు సురక్షితమైన ఎత్తును పాటిస్తూ ఉంటారు. గమ్యానికి చేరాక దిగాల్సిన చోట నాలుగైదు రౌండ్లు వేసి హైట్ తగ్గించుకుని ల్యాండ్ చేస్తారు. రావత్ హెలికాప్టర్ విషయంలో ఇలా ఎందుకు జరగలేదో తేలాల్సి ఉంది. హెలికాప్టర్ బయలుదేరినప్పటి నుంచి కూలే వరకు ఎంత ఎత్తులో ప్రయాణించింది, సాంకేతిక సమస్యలు వచ్చాయా లాంటివి ఫ్లైట్ డేటా రికార్డర్లో ఉంటాయి. పైలట్, కోపైలట్ ఏటీసీతో జరిపిన సంభాషణ అందులో ఉంటుంది. వాటిని విశ్లేషిస్తే ప్రమాద కారణాలు తెలుస్తాయి. -
బిపిన్రావత్ తదితరులకు గవర్నర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన జనరల్ బిపిన్రావత్, ఆయన భార్య, మరో 11 మంది సైనికుల పార్థివదేహాలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం సూలూరు ఎయిర్బేస్లో ఘన నివాళి అర్పించారు. వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిని సందర్శించిన ఆమె అక్కడ చికిత్స పొందుతున్న కెప్టన్ వరుణ్సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. -
హెలికాప్టర్ ప్రమాదం: అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
-
దేశవ్యాప్తంగా బిపిన్ రావత్కు నివాళులు
-
హెలికాప్టర్ ప్రమాదం: ఢిల్లీకి పార్థివ దేహాలు
న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ రావత్ దంపతులతోపాటు ఇతరుల పార్థివ దేహాలను సైనిక విమానంలో గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్కు తీసుకొచ్చారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఆర్మీ చీఫ్ నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏవీఆర్ చౌదరి నివాళులర్పించారు. మృతుల కుటుంబీకులు హాజరయ్యారు. ఇక్కడ భావోద్వేగ వాతావరణం కనిపించింది. రావత్ ఇద్దరు కుమార్తెలను ప్రధాని మోదీ ఓదార్చారు. అంతకు ముందు తమిళనాడులోని వెల్లింగ్టన్లోని మద్రాస్ రెజిమెంట్ సెంటర్లో పార్థివ దేహాలకు తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై, తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళులర్పించారు. మృతదేహాలను కోయంబత్తూరుకు, తర్వాత ఢిల్లీకి తరలించారు. 3 మృతదేహాల గుర్తింపు హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించగా, ఇప్పటివరకు 3 మృతదేహాలను గుర్తించారు. రావత్, ఆయన భార్య మధులిక, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ మృతదేహాలను గుర్తించామని, వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన పార్థివ దేహాలను ఆర్మీ బేస్ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరుస్తామని చెప్పారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. మృతదేహాలకు చాలావరకు కాలిపోయాయని, అందుకే గుర్తింపు ప్రక్రియ కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. రావత్ దంపతుల మృతదేహాలను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఢిల్లీలోని 3 కామరాజ్ మార్గ్ నివాసంలో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. రాష్ట్రపతి కోవింద్కు రాజ్నాథ్ వివరణ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలియజేశారు. ఈ దుర్ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. ఈ ప్రమాదంపై త్రివిధ దళాల విచారణకు భారత వైమానిక దళం ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: Tamil Nadu: 30 మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడిలోకి ఆర్టీసీ డ్రైవర్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హెలికాప్టర్ ప్రమాదం: పార్థివ దేహాలను తరలిస్తున్న అంబులెన్స్కు యాక్సిడెంట్
చెన్నై: తమిళనాడులోని కున్నూరులో బుధవారం జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో 13 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తుండగా అంబులెన్సుకు ప్రమాదం జరిగింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఢిల్లీకి తరలించేందుకు గురువారం కున్నూర్ నుంచి సూలూరు ఎయిర్బేస్కు అంబులెన్సుల్లో తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు వద్ద ఓ అంబులెన్సు ముందుగా వెళ్తున్న మరో అంబులెన్సును అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో కొందరు పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే ప్రమాదానికి గురైన అంబులెన్సులోని పార్థివ దేహాలను మరో అంబులెన్సులోకి ఎక్కించారు. శుక్రవారం ఢిల్లీలో బిపిన్ రావత్ అంత్యక్రియలు జరగనున్నాయి. -
'సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్లో బిపిన్ రావత్ పాత్ర మరువలేం'
సాక్షి, హైదరాబాద్: బిపిన్ రావత్లోని కృషి, పట్టుదలే అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని రావత్ స్నేహితుడు కల్నల్ పి.వి. దుర్గాప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'బిపిన్రావత్తో 20 ఏళ్ల పాటు కలిసి పనిచేశాను. ఆయన అందరితో కలసిపోయే స్వభావం కలవాడు. మూడు రక్షణ విభాగాలను ఒకే తాటిపై తీసుకురావడంలో బిపిన్ రావత్ పాత్ర మరువలేనిది. రావత్ కుటుంబం మొత్తం దేశానికి సేవ చేసిన వారే. ఇద్దరం కలిసి ఒకే రెజిమెంట్లో పనిచేశాం. దేశ సరిహద్దుల సమస్యలను ఎదుర్కొనడంలో వ్యూహాలు రచించేవారు. అనేక కీలకమైన ఆపరేషన్లలో రావత్ ముందుండి నడిపించేవాడు. సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్లో రావత్ పాత్ర మరవలేము. రావత్ కుటుంబంతో మాకు మంచి పరిచయం ఉంది. రావత్కు ఇద్దరు కుమార్తెలు. ఇటీవల దుందిగల్ ఎయిర్ పోర్ట్కు వచ్చినప్పుడు చివరిసారిగా కలిశాము. రావత్ మరణం దేశానికి తీరని లోటు. వ్యక్తిగతంగా జీర్ణించుకోలేక పోతున్నాను. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరుపుతారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు ఉంటాయి' అని కల్నల్ పి.వి. దుర్గాప్రసాద్ అన్నారు చదవండి: (Bipin Rawat: భయమంటే తెలియని.. అలుపెరగని సైనికుడు) -
సైనికుడు సాయితేజ కుటుంబానికి అండగా మంచు కుటుంబం
సాక్షి, చిత్తూరు: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన చిత్తూరుకు చెందిన సైనికుడు సాయి తేజ్ కుటుంబానికి మంచు మోహన్ బాబు కుటుంబం అండగా నిలిచింది. లాన్స్ నాయక్ సాయి తేజ ఇద్దరు పిల్లలను ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని హీరో మంచు విష్ణు వెల్లడించారు. త్వరలోనే చిత్తూరుకు వచ్చి సాయి తేజ కుటుంబాన్ని కలుస్తానని పేర్కొన్నారు. కాగా సాయితేజ అంత్యక్రియలు శుక్రవారం చిత్తూరు జిల్లా రేగడిపల్లిలో నిర్వహించనున్నారు. కాగా తమిళనాడు కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో ప్రయాణిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా మరణించారు. ఊహించిన ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేడ గ్రామం షాక్కు గురైంది. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్జా(5) పాప దర్శిని (2) సంతానం. సాయితేజ కుటుంబానికి మంచు విష్ణుపరామర్శ విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను ' మా ' అధ్యక్షుడు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ మంచు విష్ణు పరామర్శించారు. మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు . యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారకరం వ్యక్తం చేశారు 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని ఆయన శ్యామలకు తెలిపారు. -
రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో బుధవారం చోటుచేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులు ఈ ప్రమాదంలో అసువులు బాశారు. కోయంబత్తూరులోని సూలూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా ఎయిర్ఫోర్స్కు చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మరో 11 మంది దుర్మరణం పాలవ్వడం విషాదాన్ని నింపింది. (పప్పా నా హీరో, బెస్ట్ ఫ్రెండ్..బిగ్గెస్ట్ మోటివేటర్: బ్రిగేడియర్ లిడ్డర్ కుమార్తె కన్నీరు) ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక హెలికాప్టర్లలో ఒకటి, రష్యాకుచెందిన Mi-17V-5 హెలికాప్టర్ నీలగిరిలోని కూనూర్ సమీపంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రదేశంలో జనరల్ బిపిన్ రావత్ను సజీవంగా చూశానని ప్రత్యక్ష సాక్షి శివ కుమార్ తెలిపారు. టీ ఎస్టేట్లో పనిచేస్తున్న శివ మంటలు చెలరేగి హెలికాప్టర్ పడిపోవడం తాను స్వయంగా చూశానని పేర్కొన్నాడు. దీంతో తనతోపాటు కొంతమంది సంఘటనా స్థలానికి చేరుకుని శిధిలాలలో జనరల్ను సజీవంగా చూశానని వెల్లడించినట్టు ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. అక్కడ మూడు మృతదేహాలు పడి పోయి ఉన్నాయి. ఇంతలో ప్రాణాలతో ఉన్న ఒకతను మంచినీళ్లు కావాలని అడిగారని శివ కుమార్ చెప్పారు. వెంటనే ఆయనను బెడ్షీట్లో చుట్టి కిందికి తీసుకొచ్చి, రక్షణ దళాలకు అప్పగించాం. మూడు గంటల తరువాత ఆయనే బిపిన్ రావత్ అని ఎవరో చెప్పారని శివకుమార్ తెలిపారు. అయితే ఆ తరువాత ఆయన చనిపోయారని తెలిసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ఇంత చేసిన వ్యక్తికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయాను. నీళ్లు ఇచ్చి ఉంటే బతికే వారేమో.. ఆయనను కాపాడుకోలేక పోయినందుకు రాత్రంతా నిద్ర పట్టలేదంటూ శివ కుమార్ కంటతడి పెట్టారు. కాగా ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయపటడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ వెల్లింగ్టన్లోని మిలిటరీ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మెరుగైన చికిత్సకోసం ఆయనకు బెంగళూరుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రమాదస్థలినుంచి బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు హెలికాప్టర్ ఎందుకు కూలి పోయింది అనే అంశాలను పరిశోధించనున్నారు. -
తదుపరి సీడీఎస్ రేసులో నరవాణె..?!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భద్రతా రంగంలో అత్యున్నత పోస్టు చీఫ్ ఆఫ్ డిఫెన్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. దానిలో భాగంగా దేశ భద్రతకు కీలకమైన ఆర్మీ, వాయు, నావిక దళాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును రూపొందించింది. వయసు, అనుభవం పరంగా సీనియర్ అయిన బిపిన్ రావత్ను తొలి సీడీఎస్గా 2019లో నియమించింది మోదీ ప్రభుత్వం. అయితే దురదృష్టం కొద్ది ఆయన పదవి చేపట్టిన రెండున్నరళ్లేకే అకాల మరణం పొందారు. తమిళనాడు, కూనూరు సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. సైనిక బలగాలకు కొత్త రూపు తెచ్చిన రావత్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదంతో పాటు.. మోదీ సర్కార్కు పలు సవాళ్లను కూడా తీసుకొచ్చింది. తదుపరి సీడీఎస్గా ఎవరిని నియమించాలన్నది.. ప్రభుత్వం, ముఖ్యంగా రక్షణ శాఖ ముందున్న తక్షణ సవాలు. (చదవండి: చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్) అనుభవం ఆధారంగానే రావత్కు అవకాశం... ప్రస్తుతం రక్షణ శాఖలో సీడీఎస్ పదవికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక మొదటి సీడీఎస్గా బాధ్యతలు స్వీకరించిన బిపిన్ రావత్ సాయుధ దళాల కోసం ఎన్నో సంస్కర్ణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. రావత్ ఇండియన్ ఆర్మీ చీఫ్ పదవి కాలం ముగియడానికి అనగా పదవీ విరమణకు ఒక్క రోజు ముందుగా ఆయనను సీడీఎస్గా నియమిస్తూ.. మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం ఆధారంగానే 2019లో రావత్ని సీడీఎస్గా నియమించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన రెండున్నరేళ్ల కాలంలోనే ఆయన మృత్యువాత పడ్డారు వారాల వ్యవధిలో ప్రభుత్వం తదుపరి సీడీఎస్ ఎవరనేది ప్రకటించనున్నట్లు సమాచారం. సీడీఎస్ ఎంపికకు ఎలాంటి నిర్దేశిత నియమాలు లేవు. సరిహద్దు భద్రతా సవాళ్లను దృష్టిలో పెట్టుకుని.. కేంద్ర ప్రభుత్వం సీడీఎస్ నియామకంపై నిర్ణయం తీసుకుంటుంది. (చదవండి: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) సీడీఎస్ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. సీడీఎస్ నియామక ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. భారత ఆర్మీ, వాయుసేన, నావిక దళాలకు చెందిన ఏ కమాండింగ్ అధికారిని అయినా సీడీఎస్గా నియమించవచ్చు. ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే సీడీఎస్గా నియమితుడయ్యే వ్యక్తి వయసు 65 ఏళ్లకు మించకూడదు. రావత్ తర్వాత సీనియర్ నరవాణెనే... ప్రస్తుత విషయానికి వస్తే.. సైనిక దళాలకు పని చేస్తున్న చీఫ్లలో.. బిపిన్ రావత్ తర్వాత సీనియర్.. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె. తదుపరి సీడీఎస్గా నరవాణెని నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత ఆర్మీ చీఫ్గా నరవాణె పదవీ కాలం 2022, ఏప్రిల్ వరకు ఉంది. అంతేకాక ఆర్మీ చీఫ్గా జనరల్ రావత్ నుంచే నరవాణె.. 2019, డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు. అయితే నేవీ, ఎయిర్ఫోర్స్లో ఉన్న ప్రస్తుత ఉన్నతాధికారులతో పోలిస్తే.. నరవాణెనే సీనియర్. ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరీ ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఆ ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలను స్వీకరించారు. ఆర్ హరి కుమార్ నేవీ చీఫ్ అడ్మైర్గా గత నెల 30న నియమితులయ్యారు. దీనితో నరవాణెనే తదుపరి సీడీఎస్గా ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదవండి: Bipin Rawat: భయమంటే తెలియని.. అలుపెరగని సైనికుడు -
Hyderabad: బిపిన్ రావత్ యాదిలో..
సాక్షి, హైదరాబాద్: త్రివిధ దళాల చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2017లో ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది చివర్లో సికింద్రాబాద్లోని ప్రతిష్టాత్మక డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజీ (సీడీఎం)ని, 2018 డిసెంబర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఎంసీఈఎంఈ)ని సందర్శించారు. సీడీఎం సందర్శనలో భాగంగా హయ్యర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కోర్సు (హెచ్డీఎంసీ)లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. దేశ రక్షణలో ఆర్మీ ప్రాముఖ్యత, అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా ఆర్మీ పని తీరును మెరుగుపరుచుకోవడంపై పలు కీలక సూచనలు చేశారు. 2019 డిసెంబర్ 14న తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈ 99వ స్నాతకోత్సవానికి సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీ సందర్శన సందర్భంగా.. ఈ సందర్భంగా ఎంసీఈఎంఈలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మిలిటరీ అధికారులకు పట్టాలను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. 2019 తర్వాత బిపిన్ రావత్ సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ను సందర్శించలేదు. ఇక్కడి ప్రతిష్టాత్మక శిక్షణ సంస్థలకు సంబంధించిన కార్యక్రమాలకు వెబ్నార్ ద్వారా హాజరయ్యేవారు. ఎంసీఈఎంఈ స్నాతకోత్సవంలో.. – కంటోన్మెంట్ చదవండి: CDS Bipin Rawat: సెలవిక దళపతి... వెల్లింగ్టన్లో మృతులకు నివాళి -
CDS Bipin Rawat: సెలవిక దళపతి... వెల్లింగ్టన్లో మృతులకు నివాళి
సాక్షి, చెన్నై: భారతీయ సైనిక బలగాల చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన వీర యోధుడిని హెలికాప్టర్ ప్రమాదం కబళించింది. దేశ తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) బిపిన్ రావత్ బుధవారం ఛాపర్ ప్రమాదంలో అసువులు బాశారు. గతంలో ఒకసారి ఇలాంటి ప్రమాదం నుంచే రావత్ తృటిలో బయటపడ్డారు. కానీ ఈసారి దురదృష్టం వెన్నాడింది. దేశ సైనిక బలగాలకు కొత్త రూపుతెచ్చిన రావత్ మరణంతో దేశం దిగ్భ్రాంతి చెందింది. పలువురు ప్రముఖులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు. సూలూరు ఎయిర్ బేస్నుండి వెల్లింగ్టన్ వెళ్తూ ఛాపర్ ప్రమాదంలో రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11మంది సైనికాధికారులు సైతం దుర్మరణం చెందారు. ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ రావత్ దుర్మరణం) మరణించినవారిలో ఏపీ లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగడంతో బాధితులను రక్షించేందుకు స్థానికులు చేసిన యత్నాలు ఫలించలేదు. ఘటనా స్థలిలో దేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. దుర్ఘటనపై భారత వాయుసేన విచారణకు ఆదేశించింది. రావత్ మరణవార్త వినగానే సీసీఎస్(కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశమైంది. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి పార్థివ దేహాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకువెళ్తారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతారు. 1978లో సెకండ్ లెఫ్టినెంట్గా చేరి 2019లో దేశ భద్రతాదళాల ఉమ్మడి అధిపతిగా ఎదిగే క్రమంలో ఆయన పలు పురస్కారాలు అందుకున్నారు. భారత్లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారైన ఈ ఫోర్స్టార్ జనరల్ సేవలను, తెచ్చినన రక్షణ సంస్కరణలను త్రివిధ దళాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాయి. శుక్రవారం రాజ్నాధ్ సింగ్ పార్లమెంట్లో ప్రమాదంపై ప్రకటన చేశారు. 1.ఉదయం 9గంటలకు ఢిల్లీ నుంచి రావత్ బయలుదేరారు. ఉదయం 11.34 గంటలకు సూలూర్ ఎయిర్బేస్కు చేరారు. 2.11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ అయింది. 3.మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో కూనూర్ వద్ద ప్రమాదం జరిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్ -
హెలికాప్టర్ ప్రమాదం.. లోక్సభలో రాజ్నాథ్ సింగ్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో దేశ ప్రథమ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్తో పాటు మరో 11 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం లోక్సభలో ప్రకటన చేశారు. (చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. ►బుధవారం వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది ►సూలూరు ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 11:48 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. ►మధ్యాహ్నం 12:08 గంటలకుహెలికాప్టర్కు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ►కాసేపటికి హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారు. భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లారు. ►అప్పటికే హెలికాప్టర్ మంటల్లో ఉంది. ►గాయపడ్డవారిఇన సహాయక బృందాలు వెల్లింగ్టన్ ఆస్పత్రికి తరలించాయి. ►హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. రావత్తో పాటు ఆయన భార్య మృతి చెందడం బాధాకరం. ►భౌతికకాయాలు గురువారం సాయంత్రానికి ఢిల్లీ చేరతాయి. ►హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది అని తెలిపారు. రాజ్నాథ్ సింగ్ ప్రకటన అనంతరం లోక్సభ స్పీకర్ హోం బిర్లా, సభ్యులు బిపిన్ రావత్ సహా మిగతా వారి మృతికి సంతాపం తెలిపారు. చదవండి: బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే -
చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్
పౌరి (ఉత్తరాఖండ్): బిపిన్ రావత్ రిటైరయ్యాక ఉత్తరాఖండ్లోని స్వగ్రామమైన ‘సైనా’లో ఇళ్లు కట్టుకోవాలని అనుకున్నారు. 2018 చివరిసారిగా ఆయన సొంతూరును సందర్శించారని బిపిన్ మేనమామ భరత్ తెలిపారు. పౌరి జిల్లాలోని ద్వారిఖాల్ బ్లాక్లో సైనీ గ్రామం ఉంది. ఈ ఊర్లో ప్రస్తుతం నివసిస్తున్న జనరల్ ఏకైక బంధువు భరత్. ‘2018లో వచ్చినపుడు కులదేవతకు పూజ చేశారు. రిటైరయ్యాక ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటానని చెప్పారు. స్వగ్రామంతో బిపిన్కు అనుబంధం ఎక్కువ. ఊరి జనం ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం తనను బాధిస్తోందని, రిటైరయ్యాక ఈ ప్రాంతం కోసం ఏదైనా చేస్తానని గ్రామస్తులకు చెప్పారు. బిపిన్ ఫోన్లో నాతో మాట్లాడేవారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో సైనీకి వస్తానన్నారు’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పారు భరత్. (చదవండి: బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే) తన మేనల్లుడి కోరిక తీరకుండానే ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు. రావత్ సతీమణి మధులిక సొంతూరు మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని సొహాగ్పూర్. ప్రస్తుతం ఆమె కుటుంబం షాడోల్లో ఉన్న పూర్వీకుల ఇంట్లో నివశిస్తున్నారు. వచ్చే ఏడాది సొహాగ్పూర్ వచ్చి సైనిక పాఠశాల పనులు ప్రారంభిస్తానని రావత్ చెప్పినట్లు బావమరిది యశవర్ధన్ అన్నారు. చదవండి: విమాన ప్రమాదం అంటే గుర్తొచ్చేది బ్లాక్బాక్స్.. అసలు దానికథేంటి..? -
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా.. లేక మరేదైనా కారణామా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు వాయుసేన అధికారులు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. హెలికాప్టర్ కూలడానికి కొన్ని సెకన్ల ముందు చోటు చేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ప్రమాదం చోటు చేసుకోవడానికి కొన్ని సెకన్ల ముందటి ఈ వీడియోలో హెలికాప్టర్ పొగ మంచులో చిక్కుకున్న దృశ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అంతవరకు బాగానే ప్రయాణించిన హెలికాప్టర్ ఉన్నట్లుండి పొగ మంచులో చిక్కుకోవడంతో.. ఈ ప్రమాదం సంభవించింది. (చదవండి: Helicopter Crash: ఆయనొక్కరే బతికిబయటపడ్డారు) హెలికాప్టర్ పొగ మంచులో చిక్కుకున్న సమయంలో కింద కొందరు జనాలు ఉన్నారు. వారికి హెలికాప్టర్ కూలిన చప్పుడు వినిపించింది. ప్రమాదం గురించి వారు తమిళ్లో మాట్లాడుకోవడం దీనిలో రికార్డయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో.. ప్రమాదంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. అలానే హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ కూడా లభ్యం అయినట్లు అధికారులు ప్రకటించారు. (చదవండి: ప్రముఖులను కబళించిన హెలికాప్టర్ ప్రమాదాలు) మంగళవారం చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్యతో మొత్తం 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తెలుగు జవాను కూడా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాకు చెందిన సాయి తేజ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్కు వెళ్లాడా’’ -
హెలికాఫ్టర్ దుర్ఘటన: మృత్యువుతో పోరాడుతున్నకెప్టెన్ వరుణ్!
తమిళనాడు కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. అయితే రావత్ను బలికొన్న హెలికాప్టర్ ప్రమాదంలో ఒకేఒక్కడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో డైరెక్టింగ్ స్టాఫ్గా పనిచేస్తున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ తీవ్రగాయాలతో హెలికాప్టర్ దుర్ఘటన నుంచి బతికిబయటపడ్డారు. చదవండి: CDS Bipin Rawat: బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే ప్రస్తుతం ఆయన వెల్లింగ్టన్లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 48 గంటలు గడిస్తేనే గానీ ఆయన పరిస్థితిపై అంచనాకి రాలేమని వైద్యులు వెల్లడించారు. గతేడాది ఒక విమాన ప్రమాదం నుంచి ఆయన తృటిలో బయటపడడమే కాకుండా, తన సాహసానికి ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన శౌర్య చక్ర అవార్డు అందుకున్నారు. 2020 ఏరియల్ ఎమర్జెన్సీ సందర్భంగా తాను నడిపే ఎల్సీఏ తేజాస్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ను కాపాడినందుకు ఆయనకు శౌర్యచక్ర అవార్డునిచ్చారు. చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్కు వెళ్లాడా’’ 2020లో ఎల్సీఏ(లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్) స్క్వాడ్రన్లో ఆయన వింగ్కమాండర్గా ఉన్నారు. 2020 అక్టోబర్ 12న విమానంలోని కొన్ని వ్యవస్థల్లో చేసిన మార్పులను పరీక్షించేందుకు ఎల్సీఏలోని ఒక విమానాన్ని చెకింగ్కు తీసుకుపోయారు. ఆ సమయంలో కాక్పిట్ పీడన వ్యవస్థ ఫెయిలయింది. దీన్ని ఆయన సరిగా గుర్తించి జాగ్రత్తతో విమానాన్ని ల్యాండ్ చేశారు. ప్యారాచూట్తో ఆయన బయటపడే అవకాశం ఉన్నా, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి యత్నించి సఫలమయ్యారు. -
హెలికాప్టర్ ఘటనలో మృతి చెందిన వారికి పార్లమెంట్లో సంతాపం
02: 35 PM ►మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి ప్రారంభమైన లోక్సభ 11: 25 AM ► ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దాన్ని డీకోడ్ కోసం ఢిల్లీ లేదా బెంగళూరు తరలించే అవకాశం ఉంది. 11: 20 AM ► లోక్సభలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. బిపిన్ రావత్ దంపతులు, బృందంతో కూడిన హెలికాప్టర్ బుధవారం ఉదయం 11.35 నిమిషాలకు సులూరు నుంచి వెల్లింగ్టన్ బయలుదేరిందన్నారు. మధ్యాహ్నం 12.08 గంటలకు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయని తెలిపారు. ► ఈ క్రమంలో 12.20 నిమిషాలకు ప్రమాదం జరిగిందనన్నారు.పేలుడు సంభవించినప్పుడు హెలికాప్టర్లో 14 మంది ఉన్నారని.. వీరిలో 13 మంది మృతి చెందారని తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారికి పార్లమెంట్ సభ్యులు సంతాపం తెలిపారు. అమరుల భౌతిక కాయాలు సాయంత్రానికి ఢిల్లీ చేరతాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 11: 05 AM ► తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులతో పాటు.. మొత్తం 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గురువారం లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రమాదం జరిగిన ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తున్నారు. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం సభ ప్రారంభమయ్యింది. -
బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే
సాక్షి, న్యూఢిల్లీ: రావత్ శత్రుదేశాలపై నిర్మొహమాటంగా మాటలు సంధించేవారు. ఈటెల్లాంటి మాటలతో విరుచుకుపడేవారు. ఆ వాగ్భాణాల్లో మచ్చుకు కొన్ని... ‘చైనా, పాకిస్తాన్ల దురాక్రమణ కాంక్ష భారత సైన్యం అనుక్షణం అప్రమత్తంగా ఉండేటట్లు చేస్తోంది. సరిహద్దులతో పాటు... తీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా గట్టి నిఘా అవసరం. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నపుడు... ఎటువైపు నుంచి యుద్ధం మొదలవుతుందో ... అది ఎక్కడి దారితీస్తుందో తెలియదు. కాబట్టి ఇరువైపులా సర్వసన్నద్ధంగా ఉండాల్సిందే.’ ‘పాక్తో చైనా స్నేహం, జమ్మూకశ్మీర్పై డ్రాగన్ వైఖరిని బట్టి చూస్తే వారిది భారత్ వ్యతిరేక అనుబంధంగా అభివర్ణించొచ్చు.’ ‘చైనా ధనబలాన్ని, వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకొని ఇరుగుపోరుగు దేశాల్లో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.’ ‘పాక్ను నియంత్రించాల్సిన అవసరం లేదు. అదే క్రమేపీ తమ దేశంపై పట్టు కోల్పోతోంది. దానికోసం మనం ప్రత్యేకంగా కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం లేదు. వారే కొంపను అంటించుకునే క్రమంలో ఉన్నారు.’ ‘మిత్రులను సంపాదించుకోవడం తేలికే. కాని శత్రువులే మనను నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చేస్తారు’. చదవండి: హెలికాఫ్టర్ దుర్ఘటన: మృత్యువుతో పోరాడుతున్నకెప్టెన్ వరుణ్! ప్రముఖులను కబళించిన హెలికాప్టర్ ప్రమాదాలు -
సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్కు వెళ్లాడా’’
Lance Naik Saiteja: ‘పాప దర్శిని ఏం చేస్తోంది.. మోక్షజ్ఞ స్కూల్కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది. వీడియో కాల్ చేస్తా’ అంటూ భార్య శ్యామలతో లాన్స్నాయక్ బి.సాయితేజ బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడారు. భార్య, పాపను వీడియోకాల్లో చూస్తూ తాను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో కలిసి తమిళనాడు వెళుతున్నానని.. వీలు కుదిరితే సాయంత్రం చేస్తానని టాటా చెప్పిన సాయితేజ.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటనతో సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామం షాక్కు గురైంది. ప్రమాద విషయం తెలుసుకున్న సాయితేజ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు మదనపల్లెలో భార్య శ్యామల నివాసం ఉంటున్న ఇంటికి, ఎగువరేగడ గ్రామంలో తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ చనిపోయాడని తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని, ఎలాంటి దుర్వార్త ఏ సమయంలో వినాల్సి వస్తోందని బాధాతప్త హృదయాలతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సాయితేజ మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సిపాయిగా ఎంపికై.. లాన్స్నాయక్ స్థాయికి.. 28 ఏళ్ల సాయితేజ 2013లో బెంగళూరు రెజిమెంట్కు ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పొందుతూ డిపార్ట్మెంట్కు సంబంధించిన పరీక్షలు రాసి ఏడాది తర్వాత ప్యారా కమాండోగా ఎంపికై 11వ పారాలో లాన్స్నాయక్గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో భాగంగా కశ్మీర్, బెంగళూరు హెడ్క్వార్టర్స్లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలోబిపిన్ రావత్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. తల్లి భువనేశ్వరి మాజీ ఎంపీటీసీ, తండ్రి మోహన్ సాధారణ రైతు. తమ్ముడు మహేష్ఆర్మీలో సిపాయిగా సిక్కింలో పని చేస్తున్నారు. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2) సంతానం. కుమారుడు మోక్షజ్ఞ చదువు కోసం సాయితేజ భార్య శ్యామల మదనపల్లె ఎస్బీఐ కాలనీ రోడ్ నెం.3లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయితేజ చివరిగా సెప్టెంబర్లో వినాయక చవితికి స్వస్థలానికి వచ్చి వెళ్లారు. -
ప్రముఖులను కబళించిన హెలికాప్టర్ ప్రమాదాలు
List Of Famous Persons Died In Helicopter Crash: దూరాభారాలను ఆఘమేఘాల మీద చేరుకునేందుకు ఉపయోగపడే హెలికాప్టర్లు ఒక్కోమారు మృత్యువాహనాలుగా మారుతున్నాయి. తెలుగురాష్ట్రాలకు సంబంధించి హెలికాప్టర్ ప్రమాదం అనగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకువస్తారు. జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన హెలికాప్టర్ 2009లో నల్లమల అడవుల ప్రాంతంలో కూలిపోయింది. గతంలో పలువురు మిలటరీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఛాపర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రక్షణ, మిలటరీ ప్రముఖులు.. ►1963 జమ్ముకాశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లెఫ్టినెంట్ జనరల్ దౌలత్సింగ్ సహా ఆరుగురు మిలటరీ అధికారులు మృతి చెందారు. ►1997లో రక్షణ శాఖ సహాయమంత్రి ఎన్వీఎన్ సోము, మేజర్ జనరల్ రమేశ్ చంద్ర నాగ్పాల్ పయనిస్తున్న హెలికాప్టర్ అరుణాచల్ప్రదేశ్లో తవాంగ్ సమీపంలో కుప్పకూలింది. మొత్తం నలుగురు మరణించారు. ►1993లో ఒక మిలటరీ హెలికాప్టర్ భూటాన్లో కూలిపోయింది. ఇందులో భారతీయ తూర్పు ప్రాంత ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జమీల్ మొహ్మద్తో సహా 8మంది మిలటరీ అధికారులు మరణించారు. అధికారిక పర్యటనలో భాగంగా వారు భూటాన్కు వెళ్లారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు.. ►2009 సెప్టెంబర్ 2న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ►2011 ఏప్రిల్ 30న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీఖాండూ పయనిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై ఆయనతో పాటు నలుగురు దుర్మరణం పాలయ్యారు. ►2005లో హరియాణా విద్యుత్శాఖ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఓపీ జిందాల్, వ్యవసాయశాఖ మంత్రి సురేందర్ సింగ్ యూపీలోని షహరాన్పూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ►2002 మార్చి 3న అప్పటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కృష్ణా జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు హెలికాప్టర్ కైకలూరులోని ఒక చెరువులో కూలిపోయింది. గతంలో త్రుటిలో బయటపడ్డారు.. 2015లో రావత్ ప్రయాణిస్తున్న ఛాపర్ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన నాగాలాండ్లోని దీమాపూర్ ఆర్మీక్యాంపునకు వెళ్తున్నారు. రంగపహర్ హెలిపాడ్ నుంచి చీతా హెలిక్యాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కూలిపోయింది. ముక్కుభాగం నేరుగా నేలను ఢీ కొట్టింది. అయితే ఆ సమయంలో రావత్తో పాటు అందులో పయనిస్తున్న ఒక కల్నల్, ఇద్దరు పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆరేళ్ల తర్వాత అలాంటి ఛాపర్ ప్రమాదమే రావత్ను బలితీసుకుంది. -
రేగడపల్లె ముద్దుబిడ్డ.. నిను మరువదు ఈ గడ్డ!
రేగడపల్లె.. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఓ కుగ్రామం. భరతమాత ముద్దుబిడ్డకు జన్మనిచ్చిన ఈ పల్లె ఇప్పుడు మౌనంగా రోదిస్తోంది. దేశానికే భద్రత కల్పించే అధికారికి రక్షణ కవచంగా నిలిచిన ఓ వీరుడు ఊహించని ప్రమాదంలో కన్నుమూయగా, నా బిడ్డడేనని గర్వంగా చాటుతోంది. మూడు పదుల వయసు కూడా లేని యువకుడు.. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి దేశం తలెత్తుకునే స్థాయికి ఎదిగి ఈ నేలలోనే ఒదిగిపోయాడు. విధి నిర్వహణలోనే∙వీర మరణం పొందాడు. దీంతో సొంతూరు కన్నీరు పెడుతోంది. దేశ సేవకు నడుంబిగించిన బి.సాయితేజ(27) అకాల మరణంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బి.కొత్తకోట: తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లాన్స్నాయక్ బి.సాయితేజ మృత్యువాత పడ్డారు. దేశ భద్రత పర్యవేక్షించే సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారి అయిన ఈ యువ జవాను మృతితో స్వగ్రామం రేగడపల్లె కన్నీటి పర్యంతమవుతోంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతులకు బి.సాయితేజ, బి.మహేష్బాబు సంతానం. సాయితేజ స్థానికంగానే చదువుకున్నాడు. 10వ తరగతి పూర్తి కాగానే దేశానికి సేవ చేయాలనే తపనతో సైన్యంలో చేరాడు. డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్కు హజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పారా కమెండో పరీక్ష రాసి ఉత్తీర్ణతతో 11వ పారా లాన్స్ నాయక్ హోదా దక్కించుకున్నాడు. చీఫ్ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఏర్పాటయ్యాక తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్కు వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తున్నాడు. రోజూ 10 కి.మీ రన్నింగ్ ఢిల్లీలో ఉన్నా, రేగడలో ఉన్నా సాయితేజ ప్రతిరోజు ఉదయం 10 కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాడు. శరీర దృఢత్వానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం చూసి ఊరే ఆశ్చర్యపోయేది. క్రికెట్ అడటమంటే కూడా ఎంతో ఇష్టం. గ్రామానికి చెందిన యువకులను క్రికెట్ టోర్నమెంట్లకు పంపుతూ ప్రోత్సహించేవాడు. ఎక్కడ క్రీడలు జరుగుతున్నా పాల్గొనేవాడు. రేగడలో ఉన్నన్ని రోజులు అందరితో కలసిమెలిసి ఉండటమేకాదు ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించేవాడని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. మంచి మిత్రుడు రేగడపల్లెకు చెందిన సాయితేజ, నేను మంచి స్నేహితులం. సాయితేజ 2012లో సైన్యంలో చేరగా, నేను 2014లో సీఆర్పీఎఫ్లో చేరా. ఇద్దరం ఒకేసారి సెలవులు తీసుకొని స్వగ్రామానికి వచ్చేవాళ్లం. నెలరోజులు ఎంతో సందడిగా గడిచిపోయేది. సాయితేజ మరణం నన్ను కలచివేస్తోంది. – వై.మనోజ్కుమార్రెడ్డి, సీఆర్పీఎఫ్ జవాను, రేగడపల్లె దేశ సేవలోనే ఇద్దరు కుమారులు పిల్లలు కళ్లముందే ఉండాలి.. కంటికి రెప్పలా చూసుకోవాలి.. పిల్లాపాపలతో ఇల్లు కళకళలాడాలి.. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఈ సంతోషమే. కానీ బి.మోహన్, బి.భువనేశ్వరి దంపతులు తమ కంటిపాపలను దేశ సేవకు అంకితం చేశారు. గొప్పగా బతికే ధనధాన్యాలు లేకపోయినా.. దేశానికే రక్షణ కల్పించే తమ బిడ్డలను చూసి ఉప్పొంగిపోయారు. ఉన్న ఇద్దరు పిల్లలు సైన్యంలో చేరగా.. పెద్ద కొడుకు రక్షణ విధుల్లోనే కన్నుమూశాడు. ఆ వీరునికి జన్మనిచ్చిన దంపతులను చూసి ఆ ఊరంతా ఒక్కటై వచ్చి ఓదారుస్తోంది. ఊరు ఊరే కదిలింది.. ఆ ఊరి పిల్లోడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడనే సమాచారం తెలియగానే ఊరు ఊరే సాయితేజ ఇంటి వద్దకు చేరింది. అప్పటికే విషయం తెలిసి కుప్పకూలిన జవాను తల్లిదండ్రులు బి.మోహన్, బి.భువనేశ్వరికి కుటుంబ సభ్యులై ఓదార్చారు. రక్షణ విధుల్లో తలమునకలయ్యే సాయితేజ సెలవుల్లో గ్రామానికి వచ్చినప్పుడు తలలో నాలుకగా మెలుగుతూ అందరి ఆప్యాయత చూరగొన్నాడు. అలాంటి తమ ఊరి ముద్దుబిడ్డ ఇకలేడంటే ఇప్పటికీ ఆ ఊరు నమ్మలేకపోతోంది. ఏం జరిగిందో తెలియక... ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియక చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని అందరి ముఖాల్లోకి దీనంగా చూస్తున్నారు. ఈ దృశ్యం చూసి కన్నీరుకార్చని హృదయం లేదు. -
అనూహ్య దుర్ఘటన
ఇది హృదయాన్ని కలచివేసే అనూహ్య దుర్ఘటన. దేశంలో త్రివిధ సైనిక దళాలకు పెద్ద తలకాయ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సైనిక హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం తమిళనాడులో ప్రమాదానికి గురికావడం, రావత్ – ఆయన సతీమణి సహా 13 మంది దుర్మరణం దిగ్భ్రాంతికరం. దట్టమైన చెట్లు, తేయాకు తోటలు నిండిన నీలగిరుల్లో, కూనూరుకు సమీపంలో 5 నిమిషాల్లో గమ్యానికి చేరతారనగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోనే అత్యంత కీలక సైనికాధికారి మరణానికి కారణమైన ఈ ప్రమాదం అనేక భావోద్వేగాలకూ, తొలి దశలో రక్షణపరమైన అనుమానాలకూ దారి తీస్తోంది. గత ప్రమాదాల కథ గిర్రున రీలులా తిరుగుతోంది. తొందరపడి ఒక నిర్ధారణకు రావడం సరైనది కాదు కానీ, అసలు ఇలాంటి వీఐపీల ప్రయాణాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారా అని సామాన్యుల్లో సందేహం రేపుతోంది. 2015లో నాగాలాండ్లో ఓ సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ టేకాఫ్ అయ్యీ అవగానే 20 అడుగుల ఎత్తున ప్రమాదానికి గురైనప్పుడు రావత్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కానీ, ఈసారి అదృష్టం ఆయనకు ముఖం చాటేసింది. అయితే, భారత తొలి సీడీఎస్గా నియుక్తులైన అదృష్టం రావత్కే దక్కింది. హోదా రీత్యా భారత సర్వసైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి కాగా, ఆ తర్వాతి స్థానం ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ది. దేశరక్షణ వ్యవహారాల్లో ప్రధానికీ, రక్షణ మంత్రికీ సీడీఎస్ కీలక సలహాదారు. అలాంటి అత్యున్నత స్థాయి వ్యక్తి దుర్మరణం దేశానికి భారీ నష్టం. తదుపరి చర్యల కోసం ‘రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ’ (సీసీఎస్) హుటాహుటిన సమావేశమవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ప్రతిసారీ రావత్ హాజరయ్యే ఆ భేటీ ఈసారి ఆయన లేకనే జరగాల్సి రావడం విషాదం. నాలుగు స్టార్లు ధరించిన అరుదైన జనరల్గా ఎదిగిన 63 ఏళ్ళ రావత్ 1978 నుంచి ఇప్పటికి 43 ఏళ్ళుగా భారత సైన్యంలో విశేష సేవలందిస్తూ వచ్చారు. గతంలో ఆర్మీ చీఫ్గా వ్యవహరించారు. కీలక ఘట్టాల్లో వీరోచిత సైనికుడిగా తన సత్తా చాటి, ఎన్నో గౌరవ పతకాలు అందుకున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో శాంతి పరిరక్షణ బాధ్యతలు, ఈశాన్యంలో తీవ్రవాద నిరోధక చర్యలు, సరిహద్దు ఆవల మయన్మార్ ఆపరేషన్లు, ఆ మధ్య సర్జికల్ దాడుల్లో రావత్ కీలక పాత్రధారి. రిటైరయ్యే లోగా నెరవేర్చాల్సిన బృహత్తర బాధ్యత చాలా ఉందని సీడీఎస్గా చెబుతూ వచ్చారు. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత, త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం, సైన్యంలో అవసరమైన సంస్కరణల కోసం సీడీఎస్ అనే ప్రత్యేక హోదా ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. రెండు దశాబ్దాల తాత్సారం తర్వాత, రెండేళ్ళ క్రితం అది కార్యరూపం దాల్చింది. ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా రావత్ దూరదృష్టితో, చురుకుగా ముందుకు సాగారు. అప్పటి దాకా ఆలోచనలకే పరిమితమైన సైనిక సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. సౌత్ బ్లాక్లోని కార్యాలయంలో బల్ల నిండా ఫైళ్ళు, నిరంతర సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతూ వచ్చారు. అనుకున్నది సాధించే దాకా విశ్రమించని వ్యక్తిగా పేరున్న రావత్ విమర్శలు, వివాదాలు వచ్చిపడ్డా వెనక్కి తగ్గలేదు. అదేమంటే, ‘నేనేమీ అందరినీ మెప్పించి, ఎన్నికల్లో గెలవనక్కర్లేదుగా’ అని నవ్వేయడం ఆయన విలక్షణ శైలి. దేశ రక్షణకు కీలకమైన ఇంతటి వ్యక్తి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇలా కూలిపోవడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. మునుపు సంజయ్ గాంధీ (1980 జూన్), కాంగ్రెస్ నేత మాధవరావ్ సింధియా (2001 సెప్టెంబర్) విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. తెలుగువారైన లోక్సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి (2002 మార్చి), సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి (2009 సెప్టెంబర్), అలాగే అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండూ (2011 మే) తదితరులు వివిధ హెలికాప్టర్ ప్రమాదాల్లో అకాల మరణం పాలయ్యారు. ఆ ప్రమాదాలపై అనేక అనుమానాలు, తేలని విచారణలు తెలిసిందే. ఇప్పటి ఈ తాజా ప్రమాదానికి కారణం – అననుకూల వాతావరణమా? వాహనంలో వచ్చిపడ్డ సాంకేతిక సమస్యా? పైలట్ల అనుభవ రాహిత్యమా? ఇలా ఎన్నో బేతాళ ప్రశ్నలు. విచారణలో నిజాలు నిగ్గు తేలతాయి. ఎయిర్ మార్షల్ స్థాయి ఉన్నతాధికారి సారథ్యంలో త్రివిధ దళాధికారులతో లోతైన విచారణ జరపనున్నట్టు సమాచారం. రష్యా నుంచి భారత సైన్యంలోకి వచ్చిన జవనాశ్వంగా ‘మీ–17వీ5’ హెలికాప్టర్లకు పేరు. ప్రముఖుల ప్రయాణాలకూ, కీలక రవాణాకూ చాలాకాలంగా నమ్మకమైన ఈ ఛాపర్లు ప్రమాదం పాలవడం ఆశ్చర్యమే. సీనియర్లు, అనుభవజ్ఞులైన పైలట్లే ఇలాంటి వీవీఐపీల హెలికాప్టర్లను నడుపుతారు. ప్రముఖుల ప్రయాణాలకు ముందు వాటిని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఆయిల్ మార్చడం మొదలు అనేక చిన్న విడిభాగాలను మార్చడం దాకా అనేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బుధవారం ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నారట. కానీ, ఊహించని రీతిలో తక్కువ ఎత్తులో ఛాపర్ ప్రయాణిస్తోందనీ, ఓ భారీ వృక్షానికి గుద్దుకుందనీ, ఇంధన ట్యాంకు పేలి, కాలిపోయిందనీ కథనం. అంతా పైకి కనిపిస్తున్నట్టనిపించినా, బ్లాక్బాక్స్ విశ్లేషణ సహా లోతైన విచారణ తర్వాతే కనిపించని కారణాలు తెలియరావచ్చు. ఏమైనా జరగకూడని నష్టం జరిగేపోయింది. వర్తమానానికి అవసరమైన కీలక సైనిక సంస్కరణలు చేయడానికి రావత్ సిద్ధమవుతున్న వేళ, దేశానికి పశ్చిమ, ఉత్తరాల నుంచి పాక్, చైనాలతో ముప్పున్న వేళ ఆయనను పోగొట్టుకోవడం ఓ అశనిపాతం. ఈ భారత వీరపుత్రుడు అర్ధంతరంగా వదిలేసివెళ్ళిన సంస్కరణల సత్కార్యాన్ని పూర్తి చేయడమే ఆయనకు నిజమైన నివాళి. -
విమాన ప్రమాదం అంటే గుర్తొచ్చేది బ్లాక్బాక్స్.. అసలు దానికథేంటి..?
విమాన ప్రమాదం జరిగిన మనకు మెదట వినిపించే పదం బ్లాక్ బాక్స్. తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో బుధవారం ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో చీచీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 12 మంది ఆర్మీ అధికారులు ఉన్నారు. అయితే వీరీలో బిపిన్ రావత్తో సహా 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కెప్టెన్ వరుణ్సింగ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ కోసం అధికారులు వెతుకుతున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదంపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి అందులో ఏముంటుంది అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. బ్లాక్బాక్స్ను ప్రత్యేకమైన పదార్థంతో.. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని తయారు చేస్తారు. చదవండి: (Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు..) నిజానికి విమానాల్లో రెండు బ్లాక్ బాక్స్లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ జెట్ రికార్డర్. ఇందులో విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, ఏ దిశలో ప్రయాణిస్తుంది.. ఎంత వేగంగా ప్రయాణిస్తుంది లాంటి సమాచారం రికార్డ్ అవుతుంటుంది. రెండవది కాక్ పిట్ రికార్డర్.. అంటే విమానం నడిపే పైలెట్ తన సహ పైలెట్తో మాట్లాడే మాటలను, గ్రౌండ్ కంట్రోల్ రూమ్తో మాట్లాడే మాటలను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది విమానానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది. చదవండి: (కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు) ప్రయాణ సమయాల్లో రాడార్ సిగ్నల్స్ అందకున్నప్పటికీ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదానికి గురైనా విమానం వెనుక భాగం తక్కువగా నష్టపోతుంది. బ్లాక్ బాక్స్ అంటే నల్లగా కాకుండా ముదురు నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్ను సులభంగా గుర్తించడానికి ఈ రంగు పూస్తారు. ప్రమాద సమయానికి రెండు గంటల ముందు డాటా మాత్రమే ఇందులో ఉంటుంది. అందువలన ప్రమాదానికి ముందు ఏం జరిగిందో సులభంగా టేపుల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. -
బిపిన్ రావత్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: బిపిన్ రావత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలిన సంఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాద ఘటన వార్తతో కలత చెందానన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు.. -
Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ రావత్ దుర్మరణం
కూనూర్: బుధవారం తమిళనాడు కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. 2019లో ఆయన సీడీఎస్గా నియమితులయ్యారు. డిఫెన్స్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్(డీడబ్లు్యడబ్ల్యయే) అధ్యక్షురాలిగా మధులిక సేవలనందిస్తున్నారు. రావత్ మరణాన్ని భారత వైమానిక శాఖ(ఐఏఎఫ్) నిర్ధారించింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే బతికి బయటపడ్డారని, ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది. మరణించినవారిలో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి అవశేషాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకుపోనున్నట్లు పోలీసు, రక్షణవర్గాలు తెలిపాయి. శుక్రవారం వీరికి ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ‘‘ దుర్ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా 11 మంది మరణించారని తెలిపేందుకు విచారిస్తున్నాం’’ అని వైమానిక శాఖ ట్వీట్ చేసింది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో ప్రసంగించేందుకు రావత్ రావాల్సిఉంది. ఇదే కాలేజీలో రావత్ గతంలో విద్యాభ్యాసం చేశారు. చదువుకున్న చోటికి వెళ్తూ మృత్యు ఒడిలోకి రావత్ చేరటం విధివైపరీత్యం. ప్రమాదంలో బతికిబయటపడ్డ వరుణ్ సింగ్ ఈ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నారు. మృతుల్లో రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కే సింగ్, నాయక్ గురుసేవక్సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్నాయక్ వివేక్, లాన్స్ నాయక్ బీ సాయితేజ, హవల్దార్ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్ ఉన్నారని అధికారులు చెప్పారు. వీరిలో సాయితేజ ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. బిపిన్కు భద్రతాధికారిగా పనిచేస్తున్నారు. బిపిన్ మరణంతో సైనిక దళాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. ఆయన వ్యూహాలను, సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాయి. 2016–2019 కాలంలో ఆయన ఆర్మీ చీఫ్గా పనిచేశారు. అనంతరం రక్షణబలగాల ఉమ్మడి అధిపతిగా నియమితులయ్యారు. రావత్ మరణంపై ఆర్మీ చీఫ్ నరవణె, తదితర ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రావత్ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆర్మీ ట్వీట్ చేసింది. సీసీఎస్ అత్యవసర సమావేశం రావత్ ప్రయాణిస్తున్న ఛాపర్ క్రాష్ అయిందన్న వార్త నేపథ్యంలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశమైంది. ఇందులో ప్రధాని, రక్షణ; హోం, ఆర్థిక, విదేశాంగ మంత్రులతో పాటు కేబినెట్ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యులతో పాటు కేబినెట్ సభ్యులు రావత్ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. కొత్త సీడీఎస్గా ఎవరినైనా నియమిస్తారా? లేదా? అన్న విషయమై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రమాద వివరాలను రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్, ప్రధాని మోదీకి వివరించారు. ఐఏఎఫ్ చీఫ్ను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. తదనంతరం రాజ్నాధ్ ఢిల్లీలోని రావత్ నివాసానికి వెళ్లి రావత్ కుమార్తెను పరామర్శించారు. రావత్ గొప్ప సైనికుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రావత్ మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాద సంఘటనపై శుక్రవారం రాజ్నాధ్ పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. ఇలా జరిగింది... ►ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి రావత్ తదితరులు బుధవారం ఉదయం 9గంటలకు బయలుదేరారు. ►ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ ఎయిర్బేస్కు చేరారు. ►11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ అయింది. 45 నిమిషాల్లో వెల్లింగ్టన్లోని స్టాఫ్కాలేజీకి చేరాల్సిఉంది. ►మధ్యాహ్నం సుమారు 12.20 గంటలప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలియగానే ప్రమాదస్థలానికి 8 అంబులెన్సులు, వైద్య బృందాలు చేరుకున్నాయి. ►నీలగిరి జిల్లాలోని కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతంలో ఛాపర్ కూలిపోయింది. స్థానికులు తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించారు. ►పొగమంచు వాతావరణంలో ఛాపర్ బాగా కిందకు వచ్చిందని, కూనూర్ సమీపంలోని ఒక లోయలో కూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ►ఘటనా స్థలికి చేరేటప్పటికే మంటలు ఛాపర్ను ఆక్రమించాయని తెలిపారు. ►కూలిపోయే సమయంలో ఒక ఇంటిని హెలికాప్టర్ గుద్దుకుంది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ►ఛాపర్ నుంచి ఇద్దరు వ్యక్తులు పడిపోయారని ప్రత్యక్ష సాక్షి పెరుమాళ్ చెప్పారు. ప్రమాద ప్రాంతంలోని చెట్లు ధ్వంసం అయ్యాయి. ►ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు స్థానికులు యత్నించినా ఉపయోగం లేకపోయింది. ►ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగాయి, పరిసరాల్లోని చెట్లుచేమా తగలబడ్డాయి. వీటిని ఆర్పేందుకు అక్కడివారు యత్నించారు. ►మంటలు అదుపులోకి వచ్చాక చూస్తే ప్రయాణీకులు మరణించినట్లు తెలిసింది. ►గుర్తు తెలియని విధంగా దేహాలు కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించి మృతులను నిర్ధారించారు. ►మధ్యాహ్నం 1.53 గంటలకు రావత్ మరణాన్ని ఐఏఎఫ్ అధికారికంగా ధృవీకరించింది. ►సాయంత్రం 6.03 గంటలకు మరణవార్తను ఐఏఎఫ్ ప్రకటించింది. ఉలిక్కిపడ్డ పశ్చిమ కనుమలు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రావత్ పయనిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనతో పశ్చిమ కనుమలు ఉలిక్కిపడ్డాయి. నీలగిరి జిల్లాలోని తేయాకు తోటల్లోని కార్మికులు తొలిసారి ఈ దుర్ఘటనను గుర్తించారు. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించడాన్ని గమనించారు. చప్పుళ్లు ఏదో ప్రమాదానికి సంకేతమని గుర్తించి వెంటనే సంఘటనా స్థలాన్ని వెతుకుతూ వెళ్లారు. అప్పటికింకా ఆ ప్రాంతంలో కొంత పొగమంచు ఉంది. అక్కడకు వెళ్లాక భగభగలాడే మంటలు, లోహవస్తువులు విరిగిపోతున్న ధ్వనులను గుర్తించి నివ్వెరపోయారు. ప్రమాదం జరిగిందని స్థానికులు సాయం చేసేందుకు తయారయ్యారు. పెద్ద మంటల కారణంగా సంఘటన స్థలం దగ్గరకు పోలేకపోయారు. దాదాపు అరగంట పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయని సాక్షులు చెప్పారు. దిగ్భ్రాంతికి గురి చేసింది.. హెలికాప్టర్ ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. రావత్, అతని సతీమణి మధులిక మృతి దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అందరికీ నా నివాళులు. వారి కుటుంబాలకు నా సానుభూతి. – ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఊహించని విషాదం హెలికాప్టర్ ప్రమాదం ఊహించని విషాదం. రావత్, ఆయన సతీమణితో సహా ఈ ప్రమాదంలో మరణించిన పదకొండు సైనికుల కుటుంబాలకు నా సానుభూతి. ఈ కష్టకాలంలో నా ఆలోచనలన్నీ వాళ్ల కుటుంబాలతోనే ఉంటాయి. ఈ దుఃఖ సమయంలో దేశమంతా ఐక్యతతో ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా హృదయపూర్వక నివాళులు. – కాంగ్రెస్నేత రాహుల్గాంధీ వారి మరణం తీరనిలోటు... జనరల్ బిపిన్రావత్, 11 మంది సైనికుల అకాల మరణం దేశానికి, సాయుధ బలగాలకు తీరని లోటు. ప్రమాదం తీవ్రమైన వేదనను మిగిల్చింది. – కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆయన మరణం బాధించింది.. ఇది విషాదకరమైన రోజు. బిపిన్ ధీర సైనికుడు. మాతృభూమికోసం ఎనలేని సేవలందించాడు. ఆయన అంకితభావం, చేసిన సేవ మాటల్లో చెప్పలేనిది. ఆయన మరణం నాకెంతో బాధను మిగిల్చింది. – కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలురావడం లేదు... కూనూర్లో జరిగిన ప్రమాదం విచారకరం. అది విని నేను షాక్కు గురయ్యాను. నా సంతాపాన్ని తెలపడానికి మాటలు రావడం లేదు – పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత ప్రగాఢ సానుభూతి... భారత మొట్టమొదటి సీడీఎస్ జనరల్ బిపిన్రావత్, ఆయన సతీమణి మధులిక, 11 మంది సైనికుల మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశానికిది తీరని లోటు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. – తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కె.స్టాలిన్ రావత్ మరణం తీరనిలోటు భారత సైన్యానికి 42 ఏళ్లపాటు సేవలందించిన బిపిన్ రావత్ మరణం దేశానికి, సైన్యానికి తీరనిలోటు. రావత్సతీమణి, మరో 11 మంది సైనికాధికారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దేశ సేవలో అమరులైన వారి ఆత్మకు శాంతి కలగాలి. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కలచివేసింది... సీడీఎస్ బిపిన్ రావత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నా. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ సహా ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. దేశ రక్షణ రంగానికి రావత్ చేసిన సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – తెలంగాణ సీఎం కేసీఆర్ గొప్ప వ్యూహకర్త... బిపిన్ రావత్ గొప్ప రక్షణ వ్యూహకర్త, నిజమైన దేశభక్తుడిని దేశం కోల్పోయింది. ఆయన మృతి దేశానికి తీరనిలోటు. ఆయన నాయకత్వంలో ఇండియన్ ఆర్మీ ఎంతోశౌర్యపరాక్రమాలను చూపింది. – ఆర్ఎస్ఎస్ కలచివేసింది... రావత్ మృతి కలచివేసింది. దేశానికి తీరని లోటు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయాలపాలైన వరుణ్ త్వరగా కోలుకోవాలి. – ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చదవండి: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బిపిన్ రావత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ''జనరల్ బిపిన్ రావత్ అద్భుత సైనికుడు. నిజమైన దేశభక్తుడు. ఆయన మన సాయుధ బలగాలను, భద్రతా యంత్రాంగ ఆధునీకీకరణలో దోహదపడ్డారు. వ్యూహాత్మక విషయాలపై ఆయన ఆలోచనలు అసాధారణం. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఓం శాంతి’ . అని ట్వీట్ చేశారు. చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు.. Gen Bipin Rawat was an outstanding soldier. A true patriot, he greatly contributed to modernising our armed forces and security apparatus. His insights and perspectives on strategic matters were exceptional. His passing away has saddened me deeply. Om Shanti. pic.twitter.com/YOuQvFT7Et — Narendra Modi (@narendramodi) December 8, 2021 రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ సంతాపం జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక అకాల మరణం పట్ల రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం తన ధీర కుమారుల్లో ఒకరిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభూమికి అతని నాలుగు దశాబ్దాల నిస్వార్థ సేవ అసాధారణమైన శౌర్యం, వీరత్వం గుర్తించబడిందన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో మరణించిన ప్రతి ఒక్కరికి నివాళులు అర్పించడంలో తాను తోటి పౌరులతో కలుస్తానని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. I am shocked and anguished over the untimely demise of Gen. Bipin Rawat and his wife, Madhulika ji. The nation has lost one of its bravest sons. His four decades of selfless service to the motherland was marked by exceptional gallantry and heroism. My condolences to his family. — President of India (@rashtrapatibhvn) December 8, 2021 అమిత్ షా నివాళి బిపిన్ రావత్ మరణం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. ఇదో బాధాకరమైన రోజుగా ఆయన అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్న.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: Bipin Rawat : హెలికాప్టర్ ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫేక్ వీడియో రాజ్నాథ్ సానుభూతి బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది మరణంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిపిన్ మరణం.. దేశ సాయుధ దళాలకు తీరని లోటు అని ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం జనరల్ బిపిన్ రావత్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఈప్రమాదంలో రావత్తో పాటు ఆయన భార్య, ఇతర ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచి వేసిందన్నారు. దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ఏపీ గవర్నర్ దిగ్బ్రాంతి భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలిన సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన గవర్నర్ తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. -
Bipin Rawat: ఎంఐ హెలికాప్టర్.. మృత్యువుకి మరో పేరు.. 42 మందికి పైగా దుర్మరణం
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ చివరి సారిగా ఎంఐ 17 వీ 5 హెలికాప్టర్లో ప్రయాణం చేశారు. ఎయిర్ఫోర్స్లో ఈ హెలికాప్టర్లు కీలకంగా ఉన్నాయి. ఒకేసారి 30 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ హెలికాప్టర్లు క్యారియర్లుగా ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే గత పదేళ్లుగా ఈ హెలికాప్టర్లు వరుసగా ప్రమాదాలు గురవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ హెలికాప్టర్ క్రాష్లలో 42 మందికి పైగా సైనికులను దేశం కోల్పోయింది. - 2021 డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన క్రాష్లో సీడీఎస్ బిపిన్ రావత్ ఆయన భార్య మధుళికతో కలిపి మొత్తం 14 మంది దుర్మరణం పాలయ్యారు. సీడీఎస్ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. - 2019 ఫిబ్రవరి 27న శ్రీనగర్ ఎయిర్ బేస్ స్టేషన్ నుంచి రోటీన్ వర్క్లో భాగంగా టేకాఫ్ అయిన విమానం పది నిమిషాలకే శ్రీనగర్ సమీపంలోని బుడ్గామ్ దగ్గర కూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు త్రీవంగా గాయపడ్డారు. - 2018 ఏప్రిల్ 18న ఉత్తర్ఖండ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుప్తకాశి నుంచి కేదార్నాథ్ బయల్దేరిన చాపర్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఎదురయ్యాయి. పైలెట్లు ఏంతో నేర్పుగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఆరుగురు క్రూ క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు. - 2017 అక్టోబరు 6న అరుణాచల్ ప్రదేశ్లో వివాస్పద తవాంగ్ ఏరియాలో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్యలతో అడవుల్లో కూలిపోయింది. సమయానికి సహాయ కార్యక్రమాలు కూడా అందలేదు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు సిబ్బంది మరణించారు. - 2013 జూన్ 25 వదర సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ కేథార్నాథ్ నుంచి గుప్తకాశికి వస్తుండగా గౌరీకుండ్ దగ్గర క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. - 2012 ఆగస్టు 30న గుజరాత్లోని ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన హెలికాప్టర్ కొద్ది సేపటికే ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటనలో మొత్తం 9 మంది చనిపోయారు. - 2010 నవంబరు 19న తవాంగ్ నుంచి గువహాటికి బయల్దేరిన ఐదు నిమిషాలకే బొందిర్ అనే కొండల నడుమ హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. చదవండి:హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత -
Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు..
సాక్షి, చెన్నై: భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్టు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బిపిన్ రావత్ ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్టు వెల్లడిచింది. చదవండి: (Bipin Rawat Chopper Crash: మృత్యువుతో పోరాడి కన్నుమూసిన రావత్) అయితే ఈ ప్రమాదంలో ఏపీ వాసి సాయితేజ్ కూడా మృతి చెందాడు. ఇతడి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. చదవండి: (Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం!) -
Bipin Rawat : హెలికాప్టర్ ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫేక్ వీడియో
చెన్నై: తమిళనాడు కూనురు నీలగిరికొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందినట్లు వాయుసేన ధృవీకరించింది. అయితే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద దృశ్యాలు ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత ఇలా సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో.. ఆకాశంలో ఉన్నప్పుడే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. మంటల మధ్యనే దాదాపు రెండు నిమిషాల పాటు హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో అందులో ఉన్న కొందరు హెలికాప్టర్ నుంచి బయటకు దూకే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్ పూర్తిగా అదుపు కోల్పోయి నిటారుగా వేగంగా నేలను ఢీ కొట్టింది. ఈ ఘటన ప్రత్యక్ష సాక్షులు సైతం మీడియాలో ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఆకాశంలోనే మంటలు చెలరేగాయని.. కొందరు బయటకు దూకారని చెపుతున్న మాటలు టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. దీంతో ఈ వీడియో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్దే అని అంతా భావించారు. చదవండి: కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 13 మంది మృతి అయితే వాస్తవానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఫేక్. ఇది ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి సంంబంధించినది కాదు. 2020 ఫిబ్రవరిలో సిరియాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో. అక్కడ ఆకాశంలో మంటల్లో చిక్కుకున్నప్పుడు వీడియో తీశారు. తాజాగా కొందరు ఈ ఫేక్ వీడియోను ప్రచారంలోకి తెచ్చారు. Bipin Rawat Helicopter Crashed In Tamil Nadu live Video #bipinrawat #helicopter #IndianArmy #BIGBREAKING pic.twitter.com/CgwCqZ0bSr — Marwadi Club (@MarwadiClub) December 8, 2021 -
హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత
కూనూర్: బుధవారం తమిళనాడు కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. 2019లో ఆయన సీడీఎస్గా నియమితులయ్యారు. డిఫెన్స్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్(డీడబ్ల్యూడబ్లూయే) అధ్యక్షురాలిగా మధులిక సేవలనందిస్తున్నారు. రావత్ మరణాన్ని భారత వైమానిక శాఖ(ఐఏఎఫ్) నిర్ధారించింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే బతికి బయటపడ్డారని, ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది. మరణించినవారిలో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి అవశేషాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకుపోనున్నట్లు పోలీసు, రక్షణవర్గాలు తెలిపాయి. శుక్రవారం వీరికి ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ‘‘ దుర్ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా 11 మంది మరణించారని తెలిపేందుకు విచారిస్తున్నాం’’ అని వైమానిక శాఖ ట్వీట్ చేసింది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో ప్రసంగించేందుకు రావత్ రావాల్సిఉంది. ఇదే కాలేజీలో రావత్ గతంలో విద్యాభ్యాసం చేశారు. చదువుకున్న చోటికి వెళ్తూ మృత్యు ఒడిలోకి రావత్ చేరటం విధివైపరీత్యం. ప్రమాదంలో బతికిబయటపడ్డ వరుణ్ సింగ్ ఈ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నారు. మృతుల్లో రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కే సింగ్, నాయక్ గురుసేవక్సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్నాయక్ వివేక్, లాన్స్ నాయక్ బీ సాయితేజ, హవల్దార్ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్ ఉన్నారని అధికారులు చెప్పారు. (రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి) వీరిలో సాయితేజ ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. బిపిన్కు భద్రతాధికారిగా పనిచేస్తున్నారు. బిపిన్ మరణంతో సైనిక దళాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. ఆయన వ్యూహాలను, సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాయి. 2016–2019 కాలంలో ఆయన ఆర్మీ చీఫ్గా పనిచేశారు. అనంతరం రక్షణబలగాల ఉమ్మడి అధిపతిగా నియమితులయ్యారు. రావత్ మరణంపై ఆర్మీ చీఫ్ నరవణె, తదితర ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రావత్ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆర్మీ ట్వీట్ చేసింది. సీసీఎస్ అత్యవసర సమావేశం రావత్ ప్రయాణిస్తున్న ఛాపర్ క్రాష్ అయిందన్న వార్త నేపథ్యంలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశమైంది. ఇందులో ప్రధాని, రక్షణ; హోం, ఆర్థిక, విదేశాంగ మంత్రులతో పాటు కేబినెట్ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యులతో పాటు కేబినెట్ సభ్యులు రావత్ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. కొత్త సీడీఎస్గా ఎవరినైనా నియమిస్తారా? లేదా? అన్న విషయమై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రమాద వివరాలను రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్, ప్రధాని మోదీకి వివరించారు. ఐఏఎఫ్ చీఫ్ను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. తదనంతరం రాజ్నాధ్ ఢిల్లీలోని రావత్ నివాసానికి వెళ్లి రావత్ కుమార్తెను పరామర్శించారు. రావత్ గొప్ప సైనికుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రావత్ మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాద సంఘటనపై శుక్రవారం రాజ్నాధ్ పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. చదవండి: Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం! ఇలా జరిగింది... ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి రావత్ తదితరులు బుధవారం ఉదయం 9గంటలకు బయలుదేరారు. ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ ఎయిర్బేస్కు చేరారు. 11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ అయింది. 45 నిమిషాల్లో వెల్లింగ్టన్లోని స్టాఫ్కాలేజీకి చేరాల్సిఉంది. మధ్యాహ్నం సుమారు 12.20 గంటలప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలియగానే ప్రమాదస్థలానికి 8 అంబులెన్సులు, వైద్య బృందాలు చేరుకున్నాయి. నీలగిరి జిల్లాలోని కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతంలో ఛాపర్ కూలిపోయింది. స్థానికులు తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించారు. పొగమంచు వాతావరణంలో ఛాపర్ బాగా కిందకు వచ్చిందని, కూనూర్ సమీపంలోని ఒక లోయలో కూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఘటనా స్థలికి చేరేటప్పటికే మంటలు ఛాపర్ను ఆక్రమించాయని తెలిపారు. కూలిపోయే సమయంలో ఒక ఇంటిని హెలికాప్టర్ గుద్దుకుంది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఛాపర్ నుంచి ఇద్దరు వ్యక్తులు పడిపోయారని ప్రత్యక్ష సాక్షి పెరుమాళ్ చెప్పారు. ప్రమాద ప్రాంతంలోని చెట్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు స్థానికులు యత్నించినా ఉపయోగం లేకపోయింది. ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగాయి, పరిసరాల్లోని చెట్లుచేమా తగలబడ్డాయి. వీటిని ఆర్పేందుకు అక్కడివారు యత్నించారు. మంటలు అదుపులోకి వచ్చాక చూస్తే ప్రయాణీకులు మరణించినట్లు తెలిసింది. గుర్తు తెలియని విధంగా దేహాలు కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించి మృతులను నిర్ధారించారు. మధ్యాహ్నం 1.53 గంటలకు రావత్ మరణాన్ని ఐఏఎఫ్ అధికారికంగా ధృవీకరించింది. సాయంత్రం 6.03 గంటలకు మరణవార్తను ఐఏఎఫ్ ప్రకటించింది. ఉలిక్కిపడ్డ పశ్చిమ కనుమలు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రావత్ పయనిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనతో పశ్చిమ కనుమలు ఉలిక్కిపడ్డాయి. నీలగిరి జిల్లాలోని తేయాకు తోటల్లోని కార్మికులు తొలిసారి ఈ దుర్ఘటనను గుర్తించారు. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించడాన్ని గమనించారు. చప్పుళ్లు ఏదో ప్రమాదానికి సంకేతమని గుర్తించి వెంటనే సంఘటనా స్థలాన్ని వెతుకుతూ వెళ్లారు. అప్పటికింకా ఆ ప్రాంతంలో కొంత పొగమంచు ఉంది. అక్కడకు వెళ్లాక భగభగలాడే మంటలు, లోహవస్తువులు విరిగిపోతున్న ధ్వనులను గుర్తించి నివ్వెరపోయారు. ప్రమాదం జరిగిందని స్థానికులు సాయం చేసేందుకు తయారయ్యారు. పెద్ద మంటల కారణంగా సంఘటన స్థలం దగ్గరకు పోలేకపోయారు. దాదాపు అరగంట పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయని సాక్షులు చెప్పారు. -
Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం!
చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయణిస్తున్న హెలికాప్టర్ మరో పది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు గల కారణాలు ఏమిటనే అంశంపై ఇప్పటికే ఎయిర్ఫోర్స్ విచారణకు ఆదేశించింది. అయితే గమ్యస్థానానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ఢిల్లీ నుంచి సూలూరు మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ప్యానెక్స్ కర్టెన్ రైజర్ సమావేశంలో బిపిన్ రావత్ పాల్గొన్నారు. బుధవారం తమిళనాడులోని వెల్లింగ్టన్లో ఉన్న డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో భార్యతో పాటు కలిసి ఆయన తమిళనాడు పర్యటనకు వచ్చారు. 11:48కి టేకాఫ్ సూలూరు ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి అత్యదిక సౌకర్యాలు ఉన్న క్యారియర్ హెలికాప్టర్ ఎంఐ 17లో భార్యతో కలిసి మరో పన్నెండు మంది ఆర్మీ అధికారులతో ఆయన వెల్లింగ్టన్కి బయలు దేరారు. ఉదయం 11:48 నిమిషాలకు హెలికాప్టర్ సూలూరు ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయ్యింది. నీలగిరి కొండల్లో విస్తరించిన దట్టమైన అడవుల గుండా ప్రయాణించి ఈ హెలికాప్టర్ వెల్లింగ్టన్ చేరుకోవాల్సి ఉంది. సూలూరు నుంచి వెల్లింగ్టన్ల మధ్య 94 కిలోమీటర్ల దూరం ఉంది. 12:22కి మిస్సింగ్ సూలూరు నుంచి హెలికాప్టర్ బయల్దేరిన తర్వాత దాదాపు గమ్యస్థానం దరిదాపులకు చేరే వరకు ప్రయాణం సజావుగానే సాగింది.దాదాపు అరగంట తర్వాత ప్రయాణ మార్గంలో ఇబ్బందులు తలెత్తడంతో బేస్స్టేషన్తో సంప్రదింపులు చేశారు. చివరగా మధ్యాహ్నం 12.22 గంటల సమయంలో బేస్ స్టేషన్తో సంబంధాలు తెగిపోయాయి. స్థానికులు మధ్యాహ్నం 12:27 గంటల సమయంలో హెలికాప్టర్ క్రాష్ అయినట్టుగా చెబుతున్నారు. ఆ ఐదు నిమిషాల్లో వెల్లింగ్టన్ సమీపంలో కూనూరు అటవీ ప్రాంతం సమీపంలో ప్రమాదం జరిగింది. ఇక్కడి నుంచి వెల్లింగ్టన్లో డిఫెన్స్ స్టాప్ కాలేజీకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో పది నిమిషాలు ప్రయాణం చేస్తే హెలికాప్టర్ క్షేమంగా ల్యాండ్ అయ్యేది. కానీ మధ్యాహ్నం 12:22 గంటల నుంచి 12:27 గంటల వ్యవధిలో జరిగిన వరుస ఘటనలో హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. శిథిలాలను నాంచప్ప చత్తరాం కట్టేరీ ప్రాంతంలో లభించాయి. క్షణాల్లోనే మరో ఐదు పది నిమిషాల్లో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. జనావాస ప్రాంతాలకు సమీపంలో ప్రమాదం జరగడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ మంటల తీవ్రత, క్రాష్ కారణంగా అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. హెలికాప్టర్లోని ప్రయాణిస్తున్న 14 మంది చనిపోయారు. ప్రమాదస్థలిలో తీవ్రంగా గాయపడిన బిపిన్ రావత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చదవండి: ఘోర ప్రమాదం.. ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణించిన వారి వివరాలు.. -
'అలా చేస్తేనే ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు'
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మరికొంతమంది అధికారులు ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు తెలిపారు. ప్రమాదంలో 13 మంది మృత్యువాత పడ్డారు. కాగా, ప్రమాద ఘటనపై మాజీ మేజర్ శ్రీనివాస్ స్పందిస్తూ.. బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ అత్యంత సురక్షితమైది. ఇది ప్రమాదామా? లేదా ఏదైనా కుట్ర కోణమా అన్న దానిపై అన్ని కోణాల్లో విచారణ జరగాలి. హైలెవెల్ కమిటీ చేత విచారణ జరపాలి. బ్లాక్బాక్స్లో పైలెట్ సంభాషణలు రికార్డ్ అవుతాయి. బ్లాక్బాక్స్ని రికవరీ చేసి వాటిని డీ కోడ్ చేస్తే చివరి నిమిషంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో వారు మాట్లాడిన మాటలు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరిగింది అనేది తెలుసుకోవచ్చు' అని మాజీ మేజర్ శ్రీనివాస్ అన్నారు. చదవండి: (బిపిన్రావత్కు అత్యవసర చికిత్స.. మిగతా వారంతా దుర్మరణం) -
గతంలోనూ బిపిన్ రావత్ ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం.. ఎక్కడంటే?
భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కొయంబత్తూర్, కూనూరు మధ్యలో బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య మధులిక, ఏడుగురు ఆర్మీ అధికారులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబరు 31 2019న భారతదేశపు మొదటి చీఫ్ ఢిఫెన్స్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ రావత్ గతంలోనూ చాపర్ ప్రమాదానికి గురయ్యారు. కాగా, ఫిబ్రవరి 3, 2015న నాగాలాండ్లోని దిమాపూర్లో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బిపిన్ రావత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో ఆయన లెఫ్టినెంట్ జనరల్గా పని చేస్తున్నారు. దిమాపూర్ పర్యటనకు ఆర్మీ హెలికాప్టర్లో బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఆయన ప్రయాణిస్తున్న చాపర్ కూలిపోయింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా ప్రమాదం చోటు చేసుకోగా, రావత్తో పాటు ఇద్దరు పైలట్లు, ఒక కల్నల్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ ప్రమాదంలో జనరల్ రావత్కు స్వల్ప గాయాలయ్యాయి. చదవండి: Tamilnadu Army Helicopter Crash: తునాతునకలైన హెలికాప్టర్.. ఫోటోలు, వీడియో దృశ్యాలు -
Bipin Rawat Wife Madhulika Dies: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే
CDS Bipin Rawat Wife Madhulika All Need To Know Died In Helicopter Crash: ఓ వ్యక్తి తను ఎంచుకున్న రంగం.. విధి నిర్వహణలో విజయవంతంగా కొనసాగుతున్నారంటే అందులో జీవిత భాగస్వామి పాత్ర కచ్చితంగా ఉండే ఉంటుంది. భర్తకు భార్య.. భార్యకు భర్త చేదోడువాదోడుగా ఉంటే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోతుంది. ఇటు వ్యక్తిగత.. అటు వృత్తిగత జీవితం సమతుల్యం చేసుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగితే చిక్కులు ఉండవు. భారత సీడీఎస్ బిపిన్ రావత్- ఆయన భార్య మధులిక రావత్ గురించి వింటే ఈ మాటలు అక్షరాలా నిజమనిపిస్తాయి. భారత దేశపు మొట్టమొదటి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్) బిపిన్ రావత్. ఈశాన్య రాష్ట్రాలతోపాటు పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి ఆర్మీ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత సీడీఎస్గా బాధ్యతలు చేపట్టారు. సైన్యం, నావికా, వైమానిక దళాలను సమన్వయపరుస్తూ సైనిక సంబంధిత విషయాల్లో రక్షణమంత్రికి సలహాదారుగా వ్యవహరించడం సీడీఎస్ ప్రధాన బాధ్యత. మరి ఇంతటి కీలక హోదాలో ఉన్న వ్యక్తి తన కర్తవ్యాన్ని సజావుగా నిర్వహించాలంటే... కుటుంబం నుంచి సహకారం అవసరం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భార్య మధులిక రూపంలో ఆయనకు చక్కని తోడు ఉంది. ఈ జంట అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు రత్నాల్లాంటి కుమార్తెలు. తాను సైతం... భర్తకు తగ్గ భార్య ఆమె. రావత్ సీడీఎస్గా ఉంటే.. ఆయన సతీమణి మధులిక సైతం అమరవీర సైనికుల భార్యలకు అండగా నిలబడ్డారు. దేశంలోని అతిపెద్ద ఎన్జీవో ఏడబ్ల్యూడబ్ల్యూఏ(ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్) అధ్యక్షురాలు ఆమె. వీర నారీల(అమర సైనికుల భార్యలు), వారి పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అంతేగాక విధి నిర్వహణలో వీర మరణం పొందిన సైనికులపై ఆధారపడిన ఇతర కుటుంబ సభ్యుల బాగోగులను కూడా ఈ ఎన్జీవో పర్యవేక్షిస్తుంది. సాధికారికతకై కృషి చేస్తూ.. వీర నారీల సాధికారికతకై మధులిక కృషి చేస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు, చాక్లెట్లు, కేకుల తయారీలో శిక్షణ ఇప్పిస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడేలా అండగా నిలుస్తున్నారు. అంతేగాక ఆరోగ్య అవగాహనా కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నారు. ఆఖరి శ్వాస వరకు.. భర్త వెంటే.. సీడీఎస్గా ఎల్లప్పుడు బిజీగా ఉంటే బిపిన్ రావత్ తమిళనాడు పర్యటనకు వచ్చారు. వెల్లింగ్టన్లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్( Mi-17V-5)లో బుధవారం బయల్దేరారు. అయితే, ఈ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం విదితమే. ఆ సమయంలో భర్తతో పాటు మధులిక కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తూ వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విషాదమేమిటంటే.. చివరి శ్వాస వరకు భర్త వెన్నంటే ఉండి.. ఆఖరి మజిలీలోనూ మధులిక ఆయన తోడు పంచుకున్నారు. మధులిక మరణం ఆమె కుటుంబ సభ్యులు, ఏడబ్ల్యూడబ్ల్యూఏకు మాత్రమే కాదు.. ఇతరులకు సాయం చేయాలనుకునే గొప్ప గుణాన్ని ఆరాధించగల ప్రతి ఒక్కరికి తీరని లోటు. చదవండి: Gen Bipin Rawat Chopper Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే మంటలు చెలరేగుతూ..’ -
Bipin Rawat Chopper Crash: మృత్యువుతో పోరాడి కన్నుమూసిన రావత్
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. కెప్టెన్ వరుణ్సింగ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బిపిన్ రావత్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న బిపిన్ రావత్కు వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందించారు. కానీ కొద్దిసేపటికే బిపిన్ రావత్ మృతి చెందారు. ప్రమాదంలో బిపిన్ రావత్, భార్య మధులికతో పాటు 13 మంది మృతిచెందారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉండటంతో డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నారు. చదవండి: (కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు) -
తునాతునకలైన హెలికాప్టర్.. ఫోటోలు, వీడియో దృశ్యాలు
చెన్నై: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో తమిళనాడులోని కోయంబత్తూరు ,కూనూరు మధ్య చోటు చేసుకుంది. హెలికాప్టర్ చెట్టుని ఢీకొట్టి మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పాటు సహాయక చర్యలను ప్రారంభించింది. ( చదవండి: Gen Bipin Rawat Chopper Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే ఆ ప్రాంతమంతా మృతదేహాలతో’.. ) -
బిపిన్ రావత్ ప్రయాణించిన MI 17 V5 హెలికాప్టర్ ప్రత్యేకతలు
చెన్నై: తమిళనాడులోని నీలగిరి కొండల్లో నేలకూలి, తీవ్ర విషాదాన్ని మిగిలి్చన ఎంఐ–17వీ5 హెలికాప్టర్పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. సాంకేతికంగా అడ్వాన్స్డ్ హెలికాప్టర్గా భావించే ఎంఐ–8 శ్రేణిలో ఇదే అత్యుత్తమమైనది. దీన్ని ఎంఐ–8 హెలికాప్టర్ నుంచే అభివృద్ధి చేశారు. ఎంఐ–8 ఎయిర్ ఫ్రేమ్పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్ను తమిళనాడులోని సూలూరు ఎయిర్బేస్లో ఉపయోగిస్తున్నారు. MI 17 V5 హెలికాప్టర్ అన్నింటిలో టాప్ ఎయిర్క్రాఫ్ట్ రకం సైనిక రవాణా హెలికాప్టర్. సైనిక ఆపరేషన్లు, ప్రకృతి విపత్తుల్లోనూ సేవలందించగలదు. డిజైన్ చేసిందెవరు? రష్యాలోని మిల్ మాస్కో హెలికాప్టర్ ప్లాంట్ రూపొందించింది? రష్యా హెలికాప్టర్ల సంస్థకు అనుబంధ సంస్థ కజాన్ ఉత్పత్తి నుంచి భారత్కు చేరిందిలా ► 1975లో తొలి ఎంఐ–17 హెలికాప్టర్ తయారీ ఎగుమతికి ఉద్దేశించిన హెలికాప్టర్లను ఎంఐ–17గా వ్యవహరిస్తారు. రష్యా సైనిక దళాలు మాత్రం వీటిని ఎంఐ–8ఎంటీ హెలికాప్టర్లుగా పిలుస్తాయి. ► 2008 ఎంఐ–17వీ5 హెలికాప్టర్ల కొనుగోలు కోసం రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ► 2011 భారత వైమానిక దళానికి అందజేత ప్రారంభం. 2012 నుండి సేవలు. చదవండి: హెలికాప్టర్ ప్రమాదంపై రేపు పార్లమెంట్లో ప్రకటన ముఖ్యాంశాలు.. ► ఎంఐ–17వీ5.. హెలికాప్టర్ ప్రపంచంలో అత్యాధునిక రవాణా హెలికాప్టర్. సరుకులు, ఆయుధాల రవాణా కోసం డిజైన్ చేశారు. ► సైనికులను కూడా చేరవేయవచ్చు. అగ్ని మాపక సిబ్బందికి సాయపడుతుంది. కాన్వాయ్ ఎస్కార్ట్గా, పెట్రోలింగ్కు, గాలింపునకు, సహాయక చర్యల్లోనూ సేవలందిస్తాయి. ► ప్రపంచవ్యాప్తంగా ఈ హెలికాప్టర్లను 60 దేశాలు వినియోగిస్తున్నాయి. చదవండి: ఘోర ప్రమాదం: ఆర్మీ హెలికాప్టర్లో ప్రమాణించింది వీరే.. MI 17 V5 ప్రత్యేకతలు ► ఎంఐ–17వీ5 మధ్యశ్రేణి హెలికాప్టర్లో వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించే రాడార్, రాత్రిపూట సైతం వీక్షించే పరికరాలు ఉన్నాయి. ► గరిష్టంగా 13,000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఎక్కడా ఆగకుండా 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ► 36 మంది సైనికులను లేదా 4,000 కిలోల పేలోడును తరలించగలదు. ► రాత్రి, పగలు ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా చక్కగా పనిచేస్తుంది. రాత్రిపూట కూడా ల్యాండింగ్ చేయొచ్చు. ► గత పదేళ్లలో ఐఎం–17వీ5 హెలికాప్టర్లు కొన్ని ప్రమాదాలకు గురయ్యాయి. ► కొన్ని రోజుల క్రితం తూర్పు అరుణాచల్ ప్రదేశ్లో కుప్పకూలింది. ఇద్దరు పైలట్లు, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ► 2018 ఏప్రిల్ 3న ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో కూలిపోయింది. ఇందులోని ఆరుగురు ప్రాణాలతో తప్పించుకోగలిగారు. ► 2017 అక్టోబర్ 7న చైనా సరిహద్దు వైపు వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో నేలకూలింది. మొత్తం ఏడుగురు మృతిచెందారు. ► 2013 జూన్ 15న ఉత్తరాఖండ్లో వరద సహాయక చర్యల్లో పాల్గొని కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ► 2012 ఆగస్టు 30న గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్బేస్ సమీపంలో రెండు ఎంఐ–17వీ5 హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి. 9 మంది వైమానిక దళం జవాన్లు మరణించారు. చదవండి: బిపిన్రావత్ ఇంటికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ -
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు
తమిళనాడు: భారత వైమానిక చర్రితలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ ఉన్నతాధికారి, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంపై ఆర్మీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ బిపిన్ రావత్ మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ పోర్స్ అధికారికంగా ప్రకటించింది. ఆయనతో పాటు మధులిక రావత్తో సహా 11 మంది మరణించినట్లు ప్రకటించింది.ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: బిపిన్ రావత్.. వాటితో ముప్పు అని చెప్పిన మరుసటి రోజే! కారణాలు ఏమై ఉండొచ్చు? సీడీఎస్ జనరల్ బీపీఎస్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయనే దానిపై నిపుణులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలిలా ఉన్నాయి. 1. వాతావరణం: ఎంఐ–17వి5 కూలిపోవడానికి అననుకూల వాతావరణమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా వార్తలొచ్చాయి. ‘అన్నివేళలా ఇలాంటి దుర్ఘటనలకు వాతావరణమే ప్రధాన కారణంగా ఉంటుంది. పశ్చిమకనుమల్లో వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేం’ అని ఈ హెలికాప్టర్ మాజీ పైలెట్ అమితాబ్ రంజన్ అన్నారు 2. విద్యుత్ తీగలు: మానవ ఆవాసాలకు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది కాబట్టి విద్యుత్ తీగల్లో చిక్కుకుపోయి ఉండొచ్చనే ఊహాగానాలూ ఉన్నాయి. 3. సాంకేతిక లోపం: ‘ఈ ఛాపర్లు కొత్తవి కావు. పైలట్లు బాగా సుశిక్షితులు. బాగా అనుభవజ్ఞులు. వీవీఐపీలకు వీరిని కేటాయిస్తారు. అయితే పైలెట్ల తప్పిదమైనా అయ్యుండాలి లేదా సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగుండొచ్చు. ఈ దశలో ఇంతకన్నా ఏమీ చెప్పలేం. దర్యాప్తులో తేలాలి’ 4. ఏ ఎత్తులో దిగడం మొదలైందనేది ముఖ్యం ల్యాండింగ్కు సిద్ధమవుతూ ఎన్ని ఫీట్ల ఎత్తు నుంచి క్రమేపీ కిందకు దిగుతూ వచ్చిందనేది తెలియాలి. కొండప్రాంతం కాబట్టి ఎత్తు తగ్గింపులో ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందే. దర్యాప్తులోనే ఇది తేలాలి. కాగా, ప్రమాదానికి వాతావరణం కానీ, సాంకేతిక లోపం కానీ కారణమై ఉండొచ్చని మాజీ ఎమ్ఐ-17 పైలెట్ అమితాబ్ రంజన్ అభిప్రాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారణాలపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. -
బిపిన్ రావత్.. వాటితో ముప్పు అని చెప్పిన మరుసటి రోజే!
భారత దేశపు మొట్టమొదటి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి బిపిన్ రావత్ బయో వార్ ముప్పు గురించి ప్రకటించిన మరుసటి రోజే హెలికాప్టర్ క్రాష్ ప్రమాదంలో చిక్కుకున్నారు. డిసెంబరు 20 నుంచి 22 వరకు పూనేలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, థాయ్లాండ్, శ్రీలంక, ఇండియా) దేశాల కూటమి బిమ్స్టెక్ ఆధ్వర్యంలో విపత్తు నిర్వాహాణకు సంబంధించి పానెక్స్ 21 సదస్సు జరగనుంది. దీనికి కర్టెన్ రైజర్ కార్యక్రమం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది. ఇందులో సీడీఎస్ బిపిన్ రావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడిందన్నారు. కరోనా విపత్తు సమయంలో సాయుధ బలగాలు శ్రమించి పని చేశాయన్నారు. అయితే రాబోయే రోజుల్లో ప్రపంచానికి బయోవార్ ముప్పు ఉందనింటూ రావత్ హెచ్చరించారు. బయోవార్ ఇప్పుడిప్పుడే ఓ రూపు తీసుకుంటోందన్నారు. ఈ బయోవార్ని కలిసికట్టుగా ఎదుర్కొవాలంటూ బిమ్స్టెక్ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పరస్పర సహాకారం అందించుకోవాలని సూచించారు. ప్రమాదం పానెక్స్ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన తమిళనాడు పర్యటనకు వచ్చారు. భార్య, ఇతర ఆర్మీ అధికారులతో కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా కూనురు దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు చనిపోయినట్టు అధికారులు ప్రకటించగా.. ఆర్మీ విచారణకు ఆదేశించింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత బిపిన్ రావత్, ఆయన భార్య ఆచూకీ లభించలేదు. అధికారులు ఈ విషయంపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో దేశవ్యాప్తంగా బిపిన్ రావత్ తాజా పరిస్థితిపై ఆందోళన నెలకొంది. చివరకు సాయంత్రం 6 గంటల సమయంలో బిపిన్ రావత్ చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరఖండ్ నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్న బిపిన్ రావత్ ఉత్తర్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఆర్మీలో పని చేసి లెఫ్టినెంట్ జనరల్ హోదాలో రిటైర్ అయ్యారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా ఆయన ఆర్మీలోకి వచ్చారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ ఆర్మీ చీఫ్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా త్రివిధ దళలాకు అధిపతిగా 2020 జనవరి 1న పదవీ బాధ్యలు స్వీకరించారు. చదవండి: కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 11 మంది మృతి -
IAF Helicopter Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే మంటలు చెలరేగుతూ..’
భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ బుధవారం కుప్పకూలింది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన హెలికాఫ్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నట్టు భారతీయ వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ప్రమాద స్థలాన్ని మొదట చూసిన ప్రత్యక్ష సాక్షి కృష్ణస్వామి కథనం ప్రకారం.. ఆ పరిసరాల్లో తాను ఉండగా హఠాత్తుగా పెద్ద శబ్దం వచ్చిందని, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి శబ్దం విన్న ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపాడు. అక్కడ చూడగా.. ఓ చాపర్ చెట్టును ఢీ కొట్టి, మంటలు చెలరేగాయని తెలిపాడు. అదే క్రమంలో హెలికాప్టర్ మరో చెట్టును ఢీ కొట్టడం కళ్లారా చూశానని తెలిపాడు. ఈ ఘటనలో హెలికాప్టర్ నుంచి అనేక మృతదేహాలు పడిపోవడం తాను చూశానని అతను చెప్పాడు. ఏం జరుగుతుందో అర్థంకాక తాను ఇరుగుపొరుగు వారితో పాటు అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. కాగా, ప్రమాదం జరిగిన హెలీకాప్టర్లో మొత్తం 14మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది. Krishnaswamy was the first eyewitness at the crash site. 'Heard a loud noise & that's when I saw the copter approaching. As it was descending, it caught on fire. It crashed into a big tree & was immediately engulfed in smoke. Then the entire chopper caught on fire.'@TheQuint pic.twitter.com/HMP4LEH396 — Smitha T K (@smitha_tk) December 8, 2021 చదవండి: TN Army Helicopter Crash: బ్రేకింగ్ న్యూస్: కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 11 మంది మృతి -
ఘోర ప్రమాదం: ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణించింది వీరే..
చెన్నై: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ Mi-17V-5 తమిళనాడులో బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిన విషయం తెలిసిందే. బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక రావత్, కుమార్తె, సిబ్బందితో కలిపి మొత్తం 14 మందితో తమిళనాడులోని సలూన్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా నీలగిరి కొండల్లోని కూనూరులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్ నుంచి భారీగా మంటలు చెలరేగి కాలిబూడిదైంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను విల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని భారత వాయుసేన విభాగం ధ్రువీకరించింది. జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్ కూనూరు సమీపంలో కూలిపోయినట్లు ఐఏఎఫ్ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. చదవండి: హెలికాప్టర్ నుంచి మృతదేహాలు పడటం కళ్లారా చూశా: ప్రత్యక్ష సాక్షి బిపిన్ రావత్ షెడ్యూల్ ఇలా.. వెల్లింగ్టన్లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రావత్, ఆయన భార్య, మరో 12 మందితో కలిసి ఉదయం 11.40 గంటల ప్రాంతంలో బయలుదేరారు. వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలిపోయింది. ఆర్మీ అధికారిక కార్యక్రమంలో మధ్యాహ్నం 2:40 గంటలకు రావత్ మాట్లాడాల్సి ఉంది. హెలికాప్టర్లో ప్రయాణించిన వారి వివరాలు.. 1. బిపిన్ రావత్ 2.మధులిక రావత్ 3. బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ 4. లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్ 5. ఎన్కే గురు సేవక్ సింగ్ 6. ఎన్కే జీతేంద్రకుమార్ 7. లాన్స్ నాయక్ వివేక్ కుమార్ 8. లాన్స్ నాయక్ సాయి తేజ 9. హవల్దార్ సత్పాల్.. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. #WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Gen Bipin Rawat, his staff and some family members were in the chopper. (Video Source: Locals involved in search and rescue operation) pic.twitter.com/YkBVlzsk1J — ANI (@ANI) December 8, 2021 -
Bipin Rawat: భయమంటే తెలియని.. అలుపెరగని సైనికుడు
న్యూఢిల్లీ: భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. దేశ భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న ఆయన ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూకశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయడంలో సమర్థంగా పనిచేశారు. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి దాయాది దేశం పాకిస్తాన్ గుండెల్లో దడ పుట్టించారు. సైనికుడిగా 40 ఏళ్లు నిర్విరామంగా మాతృదేశానికి సేవలందించారు. భారత సైన్యంలో ఆయన ప్రయాణం ఆసక్తికరం. అత్యున్నత అధికారిగా పైకి ఎదిగిన తీరు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. తరతరాలుగా దేశ సేవలోనే.. బిపిన్ రావత్ కుటుంబం తరతరాలుగా భారత సైన్యంలో సేవలందిస్తోంది. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ లెఫ్టినెంట్ జనరల్గా పనిచేశారు. బిపిన్ 1958 మార్చి 16న ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరీ గర్వాల్ జిల్లాలో జన్మించారు. డెహ్రాడూన్లోని కాంబ్రియన్ హాల్ స్కూల్, షిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్లో చదివారు. తమిళనాడు రాష్ట్రం వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ(డీఎస్ఎస్సీ)లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అమెరికాలో కాన్సాస్లోని ఫోర్ట్ లీవెన్వర్త్లో ఉన్న యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్సు అభ్యసించారు. దేవీ అహల్యా యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తిచేశారు. 1978 డిసెంబర్ 16న 11వ గూర్ఖా రైఫిల్స్ దళానికి చెందిన 5వ బెటాలియన్లో సెకండ్ లెఫ్టినెంట్గా చేరారు. సైనికుడిగా జీవితాన్ని ఆరంభించారు. తూర్పు సెక్టార్లో భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద విధులు నిర్వర్తించారు. తర్వాత బ్రిగేడియర్గా పదోన్నతి పొందారు. సోపోర్లో రాష్ట్రీయ రైఫిల్స్ 5వ సెక్టార్ అధికారిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితి మిషన్ కింద కాంగో దేశంలో మల్టీనేషనల్ బ్రిగేడ్లో సేవలందించారు. మేజర్ జనరల్గా పదోన్నతి పొందాక యూరీలోని 19వ ఇన్ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్గా వ్యవహరించారు. లెఫ్టినెంట్ జనరల్గా దిమాపూర్, పుణేలో పనిచేశారు. 2016లో దక్షిణ కమాండ్లో కమాండింగ్–ఇన్–చీఫ్ జనరల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. కొన్ని నెలలకే ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా పదోన్నతి పొందారు. 2016 డిసెంబర్లో భారత సైన్యానికి 27వ అధినేతగా(ఆర్మీ చీఫ్) బాధ్యతలు నియమితులయ్యారు. బిపిన్ రావత్కు భార్య మధూలిక రావత్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భయమంటే ఏమిటో తెలియదు ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా రావత్కు ఓ పేరుంది. భయమంటే ఏమిటో ఆయనకు తెలియదని, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారని సహచరులు చెబుతుం టారు. ఆర్మీ చీఫ్గా, సీడీఎస్గా పలు సందర్భాల్లో రావత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2016 నుంచి 2019 దాకా ఆర్మీ చీఫ్గా జమ్మూకశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. భారత్కు చైనా నుంచే అసలు ముప్పు పొంచి ఉందని, డ్రాగన్ను దీటుగా ఎదిరించడానికి మన సైనిక దళాలను బలోపేతం చేయాలంటూ ప్రభుత్వాన్ని ఒప్పించారు. చదవండి: (Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం!) 2017లో డోక్లామ్ ఘటన కంటే ముందు ఆయన చైనా కుతంత్రాన్ని గుర్తించారు. నాగా మిలిటెంట్లను అణచివేయడానికి 2015లో భారత సైన్యం మయన్మార్ భూభాగంలోకి అడుగుపెట్టి మరీ దాడులు చేయడంలో రావత్దే ముఖ్యపాత్ర. పాకిస్తాన్పై సర్జికల్ దాడులకు స్వయంగా ప్రణాళిక రూపొందించారు. పాక్లోని బాలాకోట్లో జైషే మొహమ్మద్ నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఫైటర్ జెట్లతో బాంబుల వర్షం కురిపించారు. 40 ఏళ్ల కెరీర్లో ఎక్కువ కాలం ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్లోని ఘర్షణాత్మక ప్రాంతాల్లోనే జనరల్ రావత్ విధులు నిర్వర్తించారు. 2019లో పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చదవండి: (భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే) భారత సైన్యంలో అంచెలంచెలుగా.. ► సెకండ్ లెఫ్టినెంట్ 1978 డిసెంబర్ 16 ► లెఫ్టినెంట్ 1980 డిసెంబర్ 16 ►కెప్టెన్ 1984 జూలై 31 ► మేజర్ 1989 డిసెంబర్ 16 ► లెఫ్టినెంట్ కల్నల్ 1998 జూన్ 1 ► కల్నల్ 2003 ఆగస్టు 1 ► బ్రిగేడియర్ 2007 అక్టోబర్ 1 ► మేజర్ జనరల్ 2011 అక్టోబర్ 20 ► లెఫ్టినెంట్ జనరల్ 2014 జూన్ 1 ► జనరల్(సీఓఏఎస్) 2017 జనవరి 1 ►జనరల్(సీడీఎస్) 2019 డిసెంబర్ 31 -
హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి
Live Updates: 06:10 PM హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి చెందినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident. — Indian Air Force (@IAF_MCC) December 8, 2021 05:45 PM రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్ని పర్యటనలు రద్దు చేసుకున్నారు. మహారాష్ట్రలోని కొత్త దర్బార్ హాల్ను ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి హాజరుకావాల్సి ఉంది. ప్రస్థుత పరిస్థితుల దృష్ట్యా పర్యటనను రద్ధు చేసుకున్నట్లు సమాచారం. 05:18 PM ►సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ భేటీ జరగనుంది. ప్రధాని మోడీ నివాసంలో సిసిఎస్ సమావేశం జరగనుంది. 05:03 PM హెలికాప్టర్లో 14 మంది ప్రయాణం చేస్తుండగా, 13 మంది మృతిచెందారు. ప్రమాదంలో రావత్ భార్య మధులిక కన్నుమూశారు. సీడీఎస్ బీపీన్ రావత్ గాయాలతో బయటపడ్డారు. హుటాహుటిన రావత్ను ఆసుపత్రికి తరలించారు. వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో రావత్కు చికిత్స అందిస్తున్నారు. 04:50 PM ►బిపిన్ రావత్కు అత్యవసర చికిత్స 04:20 PM ►సూలూరు ఎయిర్బేస్కు బయల్దేరిన ఎయిర్ చీఫ్ మార్షల్ ►కాసేపట్లో సూలూరు ఎయిర్బేస్కు ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి 04:10PM ►హెలికాప్టర్ ప్రమాదంపై గురువారం పార్లమెంట్లో ప్రకటన ►ప్రమాద ఘటనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న రక్షణ శాఖ మంత్రి 03:50PM సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. తనకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం బిపిన్రావత్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 03:44PM ►బిపిన్రావత్ ఇంటికి కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ 03:34PM ►ప్రమాదానికి వాతావరణం కానీ, సాంకేతిక లోపం కానీ కారణమై ఉండొచ్చని ఎక్స్ ఎమ్ఐ-17 పైలెట్ అమితాబ్ రంజన్ అన్నారు. 03:25PM హెలికాప్టర్ ప్రమాదంపై సందేహాలు.. 1. ప్రతికూల వాతావరణమా? 2. సాంకేతిక లోపలా..? 3. హెలికాప్టర్ విద్యుత్ తీగలకు తాకిందా..? 4. తక్కువ ఎత్తులో ప్రయాణించిందా..? 5. విజిబులిటీ లేకపోవడమా..? 03:20PM ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. పెద్ద శబ్దాలు వినిపించడంతో ఏం జరిగిందో చూడటానికి ఇంటి నుంచి బయటకు రాగా ఛాపర్ చెట్టును ఢీ కొంటూ, మంటలు చెలరేగడం, మరో ముగ్గురుని ఢీ కొట్టడం కళ్లారా చూశాను. వెంటనే ఇరుగుపొరుగువారికి, అధికారులకు సమాచారం అందించాను. ప్రమాద సమయంలో హెలికాప్టర్ నుంచి అనేక మృతదేహాలు పడటం చూశాను. 03:15PM ►కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సమావేశం అనంతరం ఘటనాస్థలికి వెళ్లనున్న రాజ్నాథ్ 03:05PM వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలీకాప్టర్లో సీడీఎస్ బిపిన్రావత్తో సహా ఆయన భార్య మధులిక, మరికొందరు కుటుంబసభ్యులు, సీడీఎస్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన సహాయ సిబ్బంది ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగతా 11 మంది దుర్మరణం పాలైనట్టు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. హెలికాప్టర్ సామర్థ్యం 24 మంది. 02:53PM తమిళనాడు సీఎం ఆరా.. హెలికాప్టర్ ప్రమాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 02:23PM కేబినెట్ భేటీ.. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందన్న విషయం తెలిసిన వెంటనే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అయ్యింది. 02:04PM ప్రధాని సమీక్ష.. హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రమాద వివరాలను మోదీకి వివరించారు. స్పందించారు. రాజ్నాథ్ సింగ్ ప్రమాదం గురించి పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. Tamil Nadu Army Helicopter Crash Telugu Live Updates: తమిళనాడులో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ కూనూరు వద్ద అటవీ ప్రాంతంలో కుప్ప కూలింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో మొత్తం 14 మంది ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. కాగా, భారత వాయుసేన ప్రమాదాన్ని అధికారంగా ధ్రువీకరించింది. విచారణకు ఆదేశించింది. -
కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 13 మంది మృతి
Tamil Nadu Army Helicopter Crash Video: బుధవారం తమిళనాడు కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. 2019లో ఆయన సీడీఎస్గా నియమితులయ్యారు. డిఫెన్స్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్(డీడబ్లు్యడబ్ల్యయే) అధ్యక్షురాలిగా మధులిక సేవలనందిస్తున్నారు. రావత్ మరణాన్ని భారత వైమానిక శాఖ(ఐఏఎఫ్) నిర్ధారించింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే బతికి బయటపడ్డారని, ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది. మరణించినవారిలో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి అవశేషాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకుపోనున్నట్లు పోలీసు, రక్షణవర్గాలు తెలిపాయి. శుక్రవారం వీరికి ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ‘‘ దుర్ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా 11 మంది మరణించారని తెలిపేందుకు విచారిస్తున్నాం’’ అని వైమానిక శాఖ ట్వీట్ చేసింది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో ప్రసంగించేందుకు రావత్ రావాల్సిఉంది. ఇదే కాలేజీలో రావత్ గతంలో విద్యాభ్యాసం చేశారు. చదువుకున్న చోటికి వెళ్తూ మృత్యు ఒడిలోకి రావత్ చేరటం విధివైపరీత్యం. ప్రమాదంలో బతికిబయటపడ్డ వరుణ్ సింగ్ ఈ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నారు. (చదవండి: త్రివిధ దళాలకు డీఆర్డీఓ వ్యవస్థలు) మృతుల్లో రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కే సింగ్, నాయక్ గురుసేవక్సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్నాయక్ వివేక్, లాన్స్ నాయక్ బీ సాయితేజ, హవల్దార్ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్ ఉన్నారని అధికారులు చెప్పారు. వీరిలో సాయితేజ ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. బిపిన్కు భద్రతాధికారిగా పనిచేస్తున్నారు. బిపిన్ మరణంతో సైనిక దళాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. ఆయన వ్యూహాలను, సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాయి. 2016–2019 కాలంలో ఆయన ఆర్మీ చీఫ్గా పనిచేశారు. అనంతరం రక్షణబలగాల ఉమ్మడి అధిపతిగా నియమితులయ్యారు. రావత్ మరణంపై ఆర్మీ చీఫ్ నరవణె, తదితర ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రావత్ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆర్మీ ట్వీట్ చేసింది. సీసీఎస్ అత్యవసర సమావేశం రావత్ ప్రయాణిస్తున్న ఛాపర్ క్రాష్ అయిందన్న వార్త నేపథ్యంలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశమైంది. ఇందులో ప్రధాని, రక్షణ; హోం, ఆర్థిక, విదేశాంగ మంత్రులతో పాటు కేబినెట్ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యులతో పాటు కేబినెట్ సభ్యులు రావత్ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. కొత్త సీడీఎస్గా ఎవరినైనా నియమిస్తారా? లేదా? అన్న విషయమై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రమాద వివరాలను రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్, ప్రధాని మోదీకి వివరించారు. ఐఏఎఫ్ చీఫ్ను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. తదనంతరం రాజ్నాధ్ ఢిల్లీలోని రావత్ నివాసానికి వెళ్లి రావత్ కుమార్తెను పరామర్శించారు. రావత్ గొప్ప సైనికుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రావత్ మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాద సంఘటనపై శుక్రవారం రాజ్నాధ్ పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. (చదవండి: కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం) ఇలా జరిగింది... ►ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి రావత్ తదితరులు బుధవారం ఉదయం 9గంటలకు బయలుదేరారు. ►ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ ఎయిర్బేస్కు చేరారు. ►11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ అయింది. 45 నిమిషాల్లో వెల్లింగ్టన్లోని స్టాఫ్కాలేజీకి చేరాల్సిఉంది. ►మధ్యాహ్నం సుమారు 12.20 గంటలప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలియగానే ప్రమాదస్థలానికి 8 అంబులెన్సులు, వైద్య బృందాలు చేరుకున్నాయి. ►నీలగిరి జిల్లాలోని కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతంలో ఛాపర్ కూలిపోయింది. స్థానికులు తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించారు. ►పొగమంచు వాతావరణంలో ఛాపర్ బాగా కిందకు వచ్చిందని, కూనూర్ సమీపంలోని ఒక లోయలో కూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ►ఘటనా స్థలికి చేరేటప్పటికే మంటలు ఛాపర్ను ఆక్రమించాయని తెలిపారు. ►కూలిపోయే సమయంలో ఒక ఇంటిని హెలికాప్టర్ గుద్దుకుంది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ►ఛాపర్ నుంచి ఇద్దరు వ్యక్తులు పడిపోయారని ప్రత్యక్ష సాక్షి పెరుమాళ్ చెప్పారు. ప్రమాద ప్రాంతంలోని చెట్లు ధ్వంసం అయ్యాయి. ►ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు స్థానికులు యత్నించినా ఉపయోగం లేకపోయింది. ►ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగాయి, పరిసరాల్లోని చెట్లుచేమా తగలబడ్డాయి. వీటిని ఆర్పేందుకు అక్కడివారు యత్నించారు. ►మంటలు అదుపులోకి వచ్చాక చూస్తే ప్రయాణీకులు మరణించినట్లు తెలిసింది. ►గుర్తు తెలియని విధంగా దేహాలు కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించి మృతులను నిర్ధారించారు. ►మధ్యాహ్నం 1.53 గంటలకు రావత్ మరణాన్ని ఐఏఎఫ్ అధికారికంగా ధృవీకరించింది. ►సాయంత్రం 6.03 గంటలకు మరణవార్తను ఐఏఎఫ్ ప్రకటించింది. ఉలిక్కిపడ్డ పశ్చిమ కనుమలు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రావత్ పయనిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనతో పశ్చిమ కనుమలు ఉలిక్కిపడ్డాయి. నీలగిరి జిల్లాలోని తేయాకు తోటల్లోని కార్మికులు తొలిసారి ఈ దుర్ఘటనను గుర్తించారు. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించడాన్ని గమనించారు. చప్పుళ్లు ఏదో ప్రమాదానికి సంకేతమని గుర్తించి వెంటనే సంఘటనా స్థలాన్ని వెతుకుతూ వెళ్లారు. అప్పటికింకా ఆ ప్రాంతంలో కొంత పొగమంచు ఉంది. అక్కడకు వెళ్లాక భగభగలాడే మంటలు, లోహవస్తువులు విరిగిపోతున్న ధ్వనులను గుర్తించి నివ్వెరపోయారు. ప్రమాదం జరిగిందని స్థానికులు సాయం చేసేందుకు తయారయ్యారు. పెద్ద మంటల కారణంగా సంఘటన స్థలం దగ్గరకు పోలేకపోయారు. దాదాపు అరగంట పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయని సాక్షులు చెప్పారు. -
భారత్ భద్రతకు చైనా నుంచి అతిపెద్ద ముప్పు
న్యూఢిల్లీ: భారత్ భద్రతకు డ్రాగన్ దేశం చైనా నుంచి అతిపెద్ద ముప్పు పొంచి ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎఫ్) బిపిన్ రావత్ ఉద్ఘాటించారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం గత ఏడాది తరలించిన వేలాది మంది సైనికులను, ఆయుధాలను ఇప్పుడే వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేదని తెలిపారు. సమీప భవిష్యత్తులోనూ అది సాధ్యం కాదని అన్నారు. భారత్–చైనా మధ్య సరిహద్దు వివాదానికి పరిష్కారం లభించడం లేదని, ఇరు దేశాల మధ్య విశ్వాసం కొరవడడం, అనుమానాలు పొడసూపుతుండడమే ఇందుకు కారణమని వివరించారు. సరిహద్దులో గానీ, సముద్రంలో గానీ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ధీటుగా బదులు చెప్పేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్లో తాలిబన్ పాలన పునఃప్రారంభం కావడం భారత్ భద్రతకు ప్రమాదకరమైన పరిణామమేనని వివరించారు. అఫ్గానిస్తాన్ నుంచి అందే ఆయుధాలతో జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు బలం పుంజుకొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య భీకర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరు పక్షాలు పదుల సంఖ్యలో ప్రాణనష్టాన్ని ఎదుర్కొన్నాయి. సరిహద్దుకు భారత్, చైనా భారీగా సైన్యాన్ని, ఆయుధాలను తరలించాయి. సైన్యాన్ని వెనక్కి రప్పించడానికి ఆరు పక్షాల మధ్య ఇప్పటిదాకా 13 దఫాలు చర్చలు జరిగాయి. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఇరు దేశాలు ఎల్ఏసీ వద్ద పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించాయి. సరిహద్దు వెంట తమ భూభాగాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటున్నాయి. -
చైనా కొత్త గ్రామాల నిర్మాణం: తొలిసారి పెదవి విప్పిన భారత్
న్యూఢిల్లీ: భారత భూభాగంపై చైనా ఒక కొత్త గ్రామాన్నే నిర్మిస్తోందన్న ప్రచారంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ స్పందించారు. అందులో నిజం లేదని తెలిపారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనా తన భూభాగంలోనే కొత్త గ్రామాల నిర్మాణం సాగుతున్నట్లు వెల్లడించారు. మన గడ్డపై చైనా అడుగు పెట్టలేదన్నారు. ఆయన గురువారం టైమ్స్ నౌ సదస్సులో మాట్లాడారు. భారత్, చైనా సైనిక బలగాలు సరిహద్దు వద్ద వారికి నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఉన్నాయని వెల్లడించారు. భవిష్యత్తు అవసరాల కోసం సైనికులను తరలించడానికి చైనా ప్రభుత్వం వారి భూభాగంలోనే కొత్త గ్రామాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోందని రావత్ పేర్కొన్నారు. ఆక్రమణలను ఒప్పుకోం: భారత్ సరిహద్దు వెంట భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడాన్ని ఏనాడూ అంగీకరించలేదని భారత్ తాజాగా స్పష్టంచేసింది. సరిహద్దు వెంట పరిస్థితులపై చైనా చేస్తున్న అసంబద్ధ వాదనలతో తాము ఏకీభవించబోమని భారత్ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ తూర్పు సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంబడి చివరి భారత భూభాగంలో కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించి గ్రామాన్ని నిర్మించిందన్న అమెరికా నివేదికపై భారత్ తొలిసారిగా పెదవి విప్పింది. ఈ అంశాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిది అరిందం బాగ్చీ మాట్లాడారు. ‘ సరిహద్దు వెంట చైనా నిర్మాణ కార్యకలాపాలు జోరందుకున్నాయని మాకు తెలుసు. దశాబ్దాల క్రితం ఆక్రమించిన ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని మాకు సమాచారముంది. అమెరికా నివేదికనూ పరిగణనలోకి తీసుకున్నాం’ అని అరిందం చెప్పారు. ‘ భారత భూభాగాలను ఆక్రమించడాన్ని మేం ఏనాడూ అంగీకరించలేదు. అవి మా ప్రాంతాలేనంటూ చైనా చేసిన వాదనలనూ మేం ఒప్పుకోలేదు. దౌత్య మార్గాల్లో భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది’ అని ఆయన స్పష్టంచేశారు. -
త్రివిధ దళాలకు డీఆర్డీఓ వ్యవస్థలు
న్యూఢిల్లీ: రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన మూడు భద్రత వ్యవస్థలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం త్రివిధ దళాల అధిపతులకు అందజేశారు. ఇండియన్ మారిటైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్(ఇమ్సాస్)ను నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరమ్బీర్ సింగ్కు, అస్త్ర ఎంకే –1 క్షిపణి వ్యవస్థను వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియాకు, బోర్డర్ సర్వీలెన్స్ సిస్టమ్(బాస్)ను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణెకు రాజ్నాథ్ అందజేశారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో రక్షణ శా ఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు. క్షిపణుల కంటే సెల్ ఫోన్లే శక్తివంతం మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ భద్రత విషయంలో కొత్త ముప్పు పొంచి ఉంటోందని, యుద్ధ రీతులు సైతం మారిపోతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారం చండీగఢ్లో జరిగిన మిలటరీ లిటరేచర్ ఫెస్టివల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దేశాల మధ్య ఘర్షణల విషయంలో సోషల్ మీడియా అధిక ప్రభావం చూపుతోందని గుర్తుచేశారు. క్షిపణుల కంటే మొబైల్ ఫోన్ల పరిధే ఎక్కువ అని తెలిపారు. శత్రువు సరిహద్దు దాటకుండానే మరో దేశంలోని ప్రజలను చేరుకొనే సాంకేతికత వచ్చిందని, అందుకే ప్రతి ఒక్కరూ సైనికుడి పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. -
‘సరిహద్దు ఉద్రిక్తత.. యుద్ధం రాదని చెప్పలేం’
న్యూఢిల్లీ: సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని.. చైనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి రాదని చెప్పలేము అన్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇరు దేశాల మధ్య ఎనిమిదవ రౌండ్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్న నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ.. ‘తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితులు ఉద్రిక్తతంగానే ఉన్నాయి. లద్దాఖ్లో పెను సాహసానికి పాల్పడిన పిపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఊహించని ఫలితాలు చవి చూడాల్సి వచ్చింది. మన దళాలు చైనా ఆర్మీ చర్యలను ఎంతో ధృడంగా ఎదుర్కొన్నాయి’ అని తెలిపారు. ‘మొత్తం భద్రతా చర్యల్లో భాగంగా సరిహద్దు ఘర్షణలు, అతిక్రమణలు, ప్రేరేపించని వ్యూహాత్మక సైనిక చర్యలు వంటి కవ్వింపు చర్యలతో సరిహద్దులో ఒక పెద్ద సంఘర్షణ తలెత్తింది. దీన్ని తేలికగా తీసుకోలేము’ అన్నారు. ఇక భద్రతా సవాళ్ల గురించి మాట్లాడుతూ.. అణ్వాయుధ సంపత్తి కల రెండు పొరుగు దేశాలతో నిరంతర ఘర్షణ తప్పదని.. ఫలితంగా ప్రాంతీయ వ్యూహాత్మక అస్థితరకు దారి తీసే అవకాశం ఉందన్నారు. యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇరు దేశాలతో భారత్ ఎంతో సమన్వయంగా వ్యవహరిస్తుందని అన్నారు రావత్. (చదవండి: భారత సైన్యం కీలక నిర్ణయం..!) అలానే సీమాంతర ఉగ్రవాదంపై కూడా స్పందించారు రావత్. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద చర్యలను భారత రక్షణ దళాలు బలంగా తిప్పి కొడతాయని తెలిపారు. ‘ఉడి, బాలాకోట్ ప్రాంతంలో చేసిన సర్జికల్ స్ట్రైయిక్స్తో పాక్కు గుణపాఠం నేర్పాము. ఇక దాయాది దేశం మన భూభాగంలోకి ఎల్ఓసీ వెంబడి ఉగ్రవాదులను పంపించాలంటే భయపడుతుంది’ అన్నారు. జమ్ము కశ్మీర్లో పాక్, భారత్ వ్యతిరేక ప్రచారంతో పరోక్ష యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయని రావత్ తెలిపారు. -
దుస్సాహసానికి దిగితే తీవ్ర నష్టం: రావత్
న్యూఢిల్లీ: సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు తగిన రీతిలో బదులిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. డ్రాగన్ దేశం ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగినా అందుకు సరైన విధంగా బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం సన్నద్ధంగా ఉందని చెప్పారు. తూర్పు లద్దాఖ్లోని కొన్నిప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా తెగబడిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా గురువారం నాటి అమెరికా- భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం ఆన్లైన్ చర్చా కార్యక్రమంలో రావత్ మాట్లాడారు. (చదవండి: రెచ్చగొడితే తిప్పికొడతాం) భారత్ అణు యుద్ధం నుంచి సంప్రదాయ యుద్ధాల వరకు ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, అయితే వాటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు సాయుధ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయని చెప్పారు. టిబెట్లోని తమ స్థావరాల్లో, వ్యూహాత్మక రైల్వే లైన్ల అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో చైనా చేస్తున్న కార్యకలాపాలను భారత్ నిశితంగా గమనిస్తోందని రావత్ అన్నారు. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ దుస్సాహసానికి దిగితే ఆ దేశం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాక్ జమ్మూకశ్మీర్లోకి ఉగ్రవాదులను ఎలా ఎగదోస్తోందో ఆయన సవివరంగా చెప్పారు. (చదవండి: ఆయుధ సంపత్తిని పెంచుకునే పనిలో చైనా! ) ‘‘ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో పొంచి ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్కు చైనా ఆర్థిక సహాయం అందిస్తోంది. అంతేగాక పాకిస్తాన్కు సైనిక, దౌత్యపరంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు దిగుతోంది. అయితే వీటన్నింటిని సమర్థవంతంగా తిప్పి కొట్టగల సత్తా భారత్కు ఉంది. ఇక చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో పాకిస్తాన్.. ఉత్తర సరిహద్దుల్లో మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే నిజంగానే పాకిస్తాన్ దుస్సాహసానికి దిగితే ఆ దేశం తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది’’ అని రావత్ హెచ్చరికలు జారీ చేశారు.