-
టిల్లు తుపాన్, 100 కోట్లు లోడింగ్..?
-
Tillu Square Box Office Collection: బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న ‘టిల్లుగాడు’
లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినంటోన్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. టిల్లుగాడి మ్యానరిజం, పంచ్ డైలాగ్స్కి సినీ ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. ఫలితంగా తొలిరోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఫస్ట్డే రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. (చదవండి: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ) అలాగే అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు 1 మిలియన్ డాలర్స్కి పైగా వసూళ్లను రాబట్టింది. హిట్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2022లో వచ్చిన డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. Tillu Registers a 𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 Start at the Box-Office with 𝟐𝟑.𝟕 𝐆𝐑𝐎𝐒𝐒 on 𝐃𝐀𝐘 𝟏 🔥 Our Starboy 🌟 is shattering the records all over! 💥💥 Book your tickets here - https://t.co/vEd8ktSAEW #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala… pic.twitter.com/Dz7hqglg5Z — Sithara Entertainments (@SitharaEnts) March 30, 2024 -
మాట మీద నిలబడ్డ నాగ్! నా సామిరంగకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మల్టీస్టారర్ సినిమాలకున్న క్రేజే వేరు. ఇద్దరు హీరోలు తెరమీద కనిపిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవు. అలాంటిది ఈ సంక్రాంతికి ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాతో సందడి చేశారు. అగ్ర హీరో అక్కినేని నాగార్జున యువ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్లతో కలిసి నా సామిరంగ సినిమా చేశాడు. ఈ మూవీలో ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించాడు. మూడు రోజుల్లోనే అన్ని కోట్లా? 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్గా ఇది తెరకెక్కింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం.. బ్లాక్బస్టర్ కొడుతున్నాం అని చెప్పిన నాగ్ తన మాటను నిలబెట్టుకునేలా కనిపిస్తున్నాడు. మూడు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.24.8 కోట్లు (గ్రాస్) రాబట్టింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. బ్రేక్ ఈవెన్కు దగ్గర్లో.. వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్కు దగ్గరగా ఉందని వెల్లడించింది. నాగార్జున జోరు చూస్తుంటే మరో రెండు,మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటేసి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా నాగార్జున.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తమిళ డైరెక్టర్ నవీన్తో సినిమా చేయనున్నాడు. ‘బ్రహ్మస్త్ర 2’ లోనూ భాగం కానున్నాడు. Sankranthi KING #NaaSaamiRanga STORM at BO on Kanuma Day!🔥🔥 Total 3 Days WW gross is 24.8 crores💥 Festive celebrations in theatres will continue on Day 4 too🥳#NaaSaamiRangaJaathara 🎟 https://t.co/1i8BJmy6kJ KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u… pic.twitter.com/ayPwBdQk19 — BA Raju's Team (@baraju_SuperHit) January 17, 2024 చదవండి: హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, యాంకర్గా.. ఈ నెలలో ప్రియుడితో పెళ్లి -
సలార్ కి 1000 కోట్లు కష్టమే..
-
500 కోట్ల క్లబ్ లో చేరిన సలార్..
-
వీకెండ్ దాటినా సలార్ అదే జోరు..500 కోట్లతో బాక్సాఫీస్ షేక్
-
సలార్ కూడా వెయ్యి కోట్లు కొడతాడా ?
-
అందుకే నా సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి: సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ హీరోగా ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో ‘ది బుల్’ అనే సినిమా తెరకెక్కనుంది. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మార్చిలో ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో పారా మిలిటరీ ఆఫీసర్గా సల్మాన్ ఖాన్ నటిస్తారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక తన సినిమాల వైఫల్యాల (‘అంతిమ్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లను ఉద్దేశిస్తూ..) గురించి కూడా సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నా సినిమాలు విడుదలైనప్పుడు, ఆ సినిమాల టికెట్ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ధరలతో విడుదల చేస్తే ఆ సినిమాల కలెక్షన్స్ కూడా భారీగానే ఉంటాయి. నా తర్వాతి సినిమాను అలాగే రిలీజ్ చేయాలనుకుంటున్నాను’ అని సల్మాన్ అన్నారు. అంతేకాదు.. తక్కువ సినిమా టికెట్ ధరలతో ప్రజల డబ్బును మేం సేవ్ చేస్తున్న విషయం అందరికీ సరిగ్గా అర్థం కావడం లేదని కూడా సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. -
లియో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 500 కోట్లు..
-
రూ.1000 కోట్ల కల.. డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే!
ఈ ఏడాది పఠాన్, జవాన్ లాంటి వెయ్యి కోట్ల సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్లు దూకుడు మీదుంది. వీటి మధ్య లో వచ్చిన గదర్ 2 కూడా 500 కోట్లకు పైగానే రాబట్టింది.ఇక కోలీవుడ్ కూడా ముందు జైలర్ తో,ఇప్పుడు లియోతో రెండు సార్లు 500 కోట్ల వసూళ్లను చూసింది. కానీ టాలీవుడ్ మాత్రం ఈ ఏడాదిలో ఇంకా ఈ స్థాయిలో విజయాలను చూడలేదు. సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య మూవీ ఒకటే 225 కోట్లు రాబ్టటింది.ఇప్పటికీ టాలీవుడ్స్ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్ గా కొనసాగుతోంది. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 400 కోట్లకు పైగా రాబట్టినా,ఆది బాలీవుడ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. (చదవండి: హీరోయిన్తో రహస్యంగా లవ్..? సిగ్గుపడిపోయిన యంగ్ హీరో!) ఆశలన్నీ సలార్పైనే డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న సలార్ మూవీపై టాలీవుడ్ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ చిత్రం కచ్చితంగా రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2తో ఇప్పటికే రూ.1200కోట్ల వసూళ్లను చూశాడు. అలాగే ప్రభాస్ ఫ్లాప్ సినిమాకు కూడా రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకవేళ హిట్ పడితే మాత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ ఓ లెక్కనే కాదు. (చదవండి: ‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ రివ్యూ ) భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ సలార్ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.175 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అదే నిజమైతే మాత్రం టాలీవుడ్ నుంచే ఈ చిత్రం రూ. 300 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంఉటంది. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే రూ.300 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఆ లెక్కలు ఈజీగా రూ. 1000 కోట్లు దాటుతాయి. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో డిసెంబర్ 22 తర్వాత తెలుస్తుంది. -
10000 కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్..
-
రూ.1100 కోట్ల క్లబ్లో ‘జవాన్’.. చరిత్ర సృష్టించిన షారుఖ్!
కింగ్ఖాన్ షారుఖ్ ఖాన్ మళ్లీ పుంజుకున్నాడు. వరుస ప్లాఫులు రావడంతో కొన్నాళ్లకు సినిమాకు గ్యాప్ ఇచ్చి.. పఠాన్తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అదే జోష్లో ఈ ఏడాది ‘జవాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. షారుఖ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రంగా జావాన్ నిలిచింది. సినిమా విడుదలై నెల రోజులు అయినప్పటికీ..దేశ వ్యాప్తంగా రోజులు దాదపు రూ.కోటి వసూళ్లను రాబడుతోందంటే.. జవాన్ సృష్టించిన సునామీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమిర్ తర్వాతే షారుఖ్ జవాన్ ఎన్ని రికార్డులు సృష్టించిన.. కలెక్షన్ల పరంగా మాత్రం దంగల్ని అందుకోవడం కష్టమే. ప్రపంచ వ్యాప్తంగా జవాన్ కలెక్షన్స్ రూ. 1103 కోట్ల వద్ద ఉన్నాయి. కేజీయఫ్ 2 (రూ. 1215 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.1230 కోట్లు), బాహుబలి 2 (రూ. 1780 కోట్లు), దంగల్ (రూ. 2400 కోట్లు) సినిమాలతో పోలిస్తే.. జవాన్ ఇంకా వెనకబడే ఉంది. ఇంకా చైనాలో జవాన్ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు కాబట్టి.. ఒక వేళ అక్కడ కూడా హిట్ అయితే మాత్రం కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలను ఈజీగా క్రాస్ చేస్తుంది. ఈ చిత్రంలో షారుఖ్కి జోడిగా నయనతార నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించారు. విజయ్ సేతుపతి విలన్గా నటించాడు. జవాన్ రికార్డులు విడుదలైన వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్ని దాటిన తొలి హిందీ చిత్రం అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం పఠాన్ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్ స్టార్గా షారుఖ్ చరిత్రకెక్కాడు. బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రం Jawan 🤝 Making & breaking box office records every day! 🔥 Book your tickets now!https://t.co/B5xelUahHO Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/JCdsrHFp6r — Red Chillies Entertainment (@RedChilliesEnt) October 6, 2023 -
7 రోజులు.. రూ.600 కోట్లు.. ‘జవాన్’ సరికొత్త రికార్డు
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. వీకెండ్తో పాటు వీక్ డేస్లో కూడా మంచి కలెక్షన్స్ని రాబట్టింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.570 కోట్ల వసూళ్లను సాధించి చరిత్రకెక్కింది. ఇక ఏడో రోజు కూడా జవాన్ మంచి వసూళ్లనే సాధించాడు. ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం వారం రోజుల్లో రూ. 621 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. జావాన్ ఖాతాలో అరుదైన రికార్డు విడుదలైన తొలి రోజు జవాన్ చిత్రానికి బ్లాక్బస్టర్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ముఖ్యంగా హిందీలో రోజు రోజుకి కలెక్షన్స్ సంఖ్య పెరుగుతోంది. దక్షిణాదికి చెందిన నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించడంతో అక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. మొత్తంగా వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్ని దాటిన తొలి హిందీ చిత్రంగా జవాన్ అరుదైన రికార్డుని సాధించింది. (చదవండి: మాట నిలబెట్టుకున్న విజయ్.. రూ. కోటి పంపిణీకి లిస్ట్ రెడీ!) అలాగే ఈ ఏడాదిలో షారుఖ్ నటించిన రెండు చిత్రాలు (పఠాన్, జవాన్) కూడా 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం గమనార్హం. పఠాన్ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది. అలాగే ఒకే ఏడాదిలో ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్ స్టార్గా షారుఖ్ చరిత్రకెక్కాడు. అంతేకాదు అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం కూడా ఇదే. అంతకు ముందు బాహుబలి 2 హిందీ వెర్షన్ 250 మార్కును స్కోర్ చేయడానికి 8 రోజులు పట్టింది. ఆ తర్వాత కేజీయఫ్ 2, పఠాన్ చిత్రాలు ఐదు రోజుల్లో ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంది. జవాన్ మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. -
బాక్సాఫీస్ వద్ద ‘ఖుషి’ జోరు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఎట్టకేలకు విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడింది. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘ఖుషి’. సమంత హీరోయిన్. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం(సెప్టెంబర్ 1) విడుదలై.. తొలిరోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. విజయ్-సమంతల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీకి సినీ ప్రియులు ఫిదా అయ్యారు. అద్భుతమైన పాటలు, బీజీఎం, విజువల్స్తో ‘ఖుషి’ విజయంలో కీలక పాత్ర పోషించాయి. (చదవండి: ‘ఖుషి’మూవీ రివ్యూ) ఫస్ట్ డేనే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. తొలో రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.30.1కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఏరియాల వారిగా చూస్తే.. ‘నైజాం రూ.5.15 కోట్లు, సీడెడ్ రూ.91 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.1.13 కోట్లు, ఈస్ట్ రూ.66 లక్షలు, వెస్ట్ రూ.63 లక్షలు, గుంటూరు రూ. 66 లక్షలు, కృష్ణా రూ. 44లక్షలు, నెల్లూరు రూ.29 లక్షలు, కర్ణాటక-రెస్టాఫ్ ఇండయాలో రూ.85 లక్షలు, ఇతర భాషల్లో రూ.45 లక్షల వసూళ్లను రాబట్టింది. యూస్లో ఖుషి జోరు ఇక యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఖుషి జోరు కనిపిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 8 లక్షల డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. వన్ మిలియన్ మార్క్ వైపు వేగంగా పరుగులు పెడుతోంది. ఖుషికి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే...మరిన్ని సర్ ప్రైజింగ్ బాక్సాఫీస్ నెంబర్స్ సాధిస్తుందని అనుకోవచ్చు. Families Kushi 🥰❤️ Box Office Kushi 🔥 Blockbuster Family Entertainer #Kushi ❤️ Sensational Day 1 with 30.1 CR GROSS WORLDWIDE and a super strong Day 2 on cards 🔥 Book your tickets now! - https://t.co/16jRp6UqHu#BlockbusterKushi 🩷@TheDeverakonda @Samanthaprabhu2… pic.twitter.com/EcD9AcAmoO — Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2023 -
‘గాండీవధారి అర్జున’ కలెక్షన్స్.. వరుణ్ కెరీర్లోనే అతి తక్కువ..ఎంతంటే?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. ఓ మోస్తరు అంచనాల మధ్య శుక్రవారం(ఆగస్ట్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. కథ, కథనంలో కొత్తదనం లేదని, దర్శకుడు మేకింగ్పై పెట్టిన దృష్టి బలమైన కథను రాయడంలో పెట్టలేదని విమర్శలు వచ్చాయి. పలు వెబ్సైట్లు కూడా ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలే ఇచ్చాయి. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంలో ఈ చిత్రం విఫలమైంది. (చదవండి: సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి) వరుణ్ కెరీర్లోనే అతి తక్కువగా కేవలం 1.9కోట్ల కనెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఏరియాల వారిగా చూస్తే..నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్లో రూ.15 లక్షలు, ఆంధ్రాలో రూ.65లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్ ఆఫ్ ఇండియాలో రూ.50 లక్షలు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.1.40 కోట్ల గ్రాస్, రూ. 75లక్షల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. (చదవండి: ‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ) వరుణ్ కెరీర్లోనే డిజాస్టర్గా మిగిలిన వరుణ్ గత సినిమా గని తొలి రోజు రూ. 3 కోట్లు రాబట్టడం గమనార్హం. ఈ లెక్కన వరుణ్ కెరీర్లోనే గండీవధారి అతిపెద్ద డిజాస్టర్గా మిగిలిపోయే అవకాశం మెండుగా ఉంది. ఇక ఈ చిత్రానికి రూ. 17 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగినటట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 18 కోట్లు రాబట్టాలి. తొలి రోజే వసూళ్లు దారణంగా ఉండడంతో బ్రేక్ ఈవెన్ అసాధ్యమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బిగ్గెస్ట్ డిజాస్టర్గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. భారీ అంచనాల మధ్య ఆగస్ట్11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో చిరు కెరీర్లోనే భారీ డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం అందులో పావు వంతు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయిందనే వార్తలు వినిపిస్తునాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం రూ. 30 కోట్లను మాత్రమే వసూలు చేసింది. రూ.50 కోట్ల నష్టం! మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో భోళా శంకర్కి భారీగా ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 80 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇప్పటి వరకు కేలవం రూ.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే ఇంకా 50 కోట్లు కలెక్ట్ చేస్తేగానీ ఈ చిత్రం సేఫ్జోన్లోకి వెల్లదు. ఈ చిత్రం విడుదలే ఇప్పటికే పది రోజులు దాటింటి. పైగా తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్. కాబట్టి ఇక ఈ సినిమా థియేటర్లలోనుంచి తీసేసే చాన్స్ ఎక్కువగా ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ చిత్రానికి రూ.50 కోట్ల నష్టం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర్ నిర్మించిన ఈ చిత్రం కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. కానీ చివరకు నెట్ఫిక్స్ ఓటీటీ రైట్స్ని దక్కించుకుంది. అది కూడా రూ. 30 కోట్లకు. అయితే ఇదంతా సినిమా రిలీజ్కు ముందు జరిగింది. మెగాస్టార్ గత చిత్రం వాల్తేరు వీరయ్య ఓటీటీ రైట్స్ కూడా ఈ సంస్థే దక్కించుకుంది. దానికి మంచి రిజల్ట్ రావడంతో.. భోళా శంకర్కి భారీ ధర చెల్లించి, ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. అయితే సినిమా విడుదల తర్వాత ఫలితంగా దారుణంగా రావడంతో ఆ ఎఫెక్ట్ ఓటీటీపై కూడా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏమేరకు ఆదరిస్తారో చూడాలి. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు? సాధారణంగా ఏ చిత్రమైనా భారీ విజయం సాధిస్తే.. ఓటీటీలో కాస్త లేట్గా స్ట్రీమింగ్ అవుతాయి. మొదట ఫలానా డేట్కి స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నా.. సినిమా ఫలితాన్ని బట్టి వాయిదా వేస్తారు. అదే డిజాస్టర్ టాక్ వస్తే మాత్రం అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. భోళా శంకర్ విషయంలోనూ అదే జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని తొలుత భావించారట. కానీ టాక్ దారుణంగా రావడంతో అనుకున్నదాని కంటే ముందే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. సెప్టెంబర్ 18న నుంచి నెప్ట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్క్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సింది. -
‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేశ్, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 11) విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజే నెగెటివ్ టాక్ లభించింది. మెగాస్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. (చదవండి: భోళా శంకర్ మూవీ రివ్యూ) ‘భోళా శంకర్’ ఫస్ట్డే కలెక్షన్స్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ చిత్రం రూ.28 కోట్ల గ్రాస్(రూ.18.61 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా రూ. 15.51 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ.4.50 కోట్లు, సీడెడ్- రూ.2 కోట్లు, ఈస్ట్-1.50 కోట్లు, వెస్ట్- రూ.1.85 కోట్లు, గుంటూరు- రూ.2.07 కోట్లు, కృష్ణా- రూ.1.02 కోట్లు, నెల్లూరు-రూ.73లక్షలు, కర్ణాటక, ఓవర్సీస్లో మొత్తంగా రూ. 3.1 కోట్లు వసూలు చేసింది. టార్గెట్ రూ.82 కోట్లు భోళా శంకర్ చిత్రానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రిరీలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో అంత స్థాయిలో వసూళ్లను రాబట్టకపోవచ్చునని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రజనీకాంత్ ‘జైలర్’సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కూడా ‘భోళా శంకర్’పై పడే అవకాశం ఉంది. చిరు గత సినిమాల కలెక్షన్స్ ఎంత? ఇక చిరంజీవి గత చిత్రాల వసూళ్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇది కాస్త తక్కువనే చెప్పాలి. చిరంజీవి గత ఐదు సినిమాల ఫస్ట్డే వసూళ్లను పరిశీలిస్తే.. వాల్తేరు వీరయ్య-రూ.22.75 కోట్లు, గాడ్ ఫాదర్-రూ.12.83 కోట్లు, ఆచార్య- రూ.28.29 కోట్లు, సైరా- రూ. 36.37 కోట్లు, ఖైదీ నెం 150- రూ. 23.16 కోట్ల వసూళ్లను రాబట్టాయి. భోళా శంకర్కు తొలి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. -
దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బేబీ’. ‘కలర్ ఫోటో’ సినిమాకు కథ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ట్రైయాంగిల్ లవ్స్టోరీగా వచ్చిన ఈ చిత్రానికి యువత బాగా కలెక్ట్ అయింది. ఫలితంగా తొలి రోజు భాకీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ఈ చిత్రం రూ.7.1 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇటీవల కాలంలో ఓ చిన్న చిత్రానికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెంట్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: బేబీ మూవీ రివ్యూ) ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రూ.7.40 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.8 కోట్లుగా ఫిక్సైయింది. తొలి రోజే రూ.7.1 కోట్లు వసూలు చేసి, బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చింది. రెండో రోజుతో ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాట పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బేబీ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం -రూ. 2.3 కోట్లు ►సీడెడ్- రూ.54.7 లక్షలు ►ఈస్ట్: రూ.40.5 లక్షలు ►వెస్ట్: 21.6 లక్షలు ►వైజాగ్: రూ.80.08లక్షలు ►కృష్ణా: రూ.34.6లక్షలు ►గుంటూరు: రూ.29.3లక్షలు ►నెల్లూరు: రూ.17.83లక్షలు ►కర్ణాటక+ ROI: రూ.20.32లక్షలు ►ఓవర్సీస్: 1.74 కోట్లు ►మొత్తం : 7.1 కోట్లు Audience Love for CULT BLOCKBUSTER #BabyTheMovie has grossed a whopping 7.1CR Worldwide on DAY 1 💥 Book your tickets today 👇 🎟️ https://t.co/IUpZAiAOvH#CultBlockbusterBaby pic.twitter.com/YCU7ygrT32 — GSK Media (@GskMedia_PR) July 15, 2023 -
ఆదిపురుష్ కథ ముగిసినట్టే
-
దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
కంటెంట్ నచ్చితే డబ్బింగ్ సినిమానా, రీమేక్ చిత్రమా అని చూడకుండా థియేటర్స్కి బారులు తీస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో ఇతర భాష చిత్రాలు ఎక్కువగా డబ్ అవుతుంటాయి. తాజాగా తెలుగులో విడుదలైన మలయాళ సూపర్ హిట్ ‘2018’ చిత్రానికి కూడా టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటిరోజు 1 కోట్లు వసూలు చేసింది. (చదవండి: 2018 మూవీ రివ్యూ) కేవలం మౌత్ టాక్ ఈ సినిమా రెండో రోజు 1.7 గ్రాస్ ను సాధించింది. మొదటి రోజు కంటే రెండవరోజు కలక్షన్స్ పెరగడం అతి తక్కువ సినిమాలకు జరుగుతుంది. 2018 సినిమాకి అమాంతం 70 కలక్షన్స్ పెరగడం శుభసూచకం. తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాను ఆదరిస్తారు అని నమ్మిన ప్రముఖ నిర్మాత బన్నీవాసు నమ్మకం మరోసారి రుజువైంది. ఈ రెండు రోజులు గాను ఈ సినిమా మొత్తం కలక్షన్స్ 2.7 కోట్ల గ్రాస్ పైగా ఉంది. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. -
Custody Box Office Collection: ‘కస్టడీ’కి ఊహించని కలెక్షన్స్, ఎంతంటే..
నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ‘బంగార్రాజు’ తర్వాత కృతి శెట్టి మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తుంది. పవన్ కుమార్ సమర్పణలో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు. (చదవండి: కస్టడీ మూవీ రివ్యూ) భారీ అంచనాల మధ్య శుక్రవారం(మే12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. ఫలితంగా తొలి రోజు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. (చదవండి: రాజకీయాల్లోకి రీఎంట్రీ? కన్ఫర్మ్ చేసిన బండ్ల గణేశ్ ) ట్రేడ్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలిరోజు దాదాపు రూ.4 కోట్లను మాత్రమే వసూలు చేసింది. ఆంధ్ర తెలంగాణలో రూ.2.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.22.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.23.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. -
‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటెట్ మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి ‘అయ్యగారి’కి పక్కా హిట్ వస్తుందని అక్కినేని అభిమానులు ఆశపడ్డారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. తొలిరోజు ఈ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు తక్కువ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం ఫస్ట్డే ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 7 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. అందులో తెలుగు రాష్ట్రాలలోనే రూ.4 కోట్లు వసూలు చేయడం గమనార్హం. (చదవండి: కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని) ఇక ప్రాంతాల వారిగా చూస్తే నైజాంలో 1.33 కోట్లు, సీడెడ్ - రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్ర - రూ. 54 లక్షలు, ఈస్ట్ - రూ. 29 లక్షలు, వెస్ట్ - రూ. 30 లక్షలు, గుంటూరు - రూ. 52 లక్షలు, కృష్ణా - రూ. 22 లక్షలు, నెల్లూరు - రూ. 16 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.అఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్(సుమార్ రూ.80 కోట్లు)తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వైడ్గా రు. 37 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు. 38 కోట్ల షేర్ వస్తేనే అఖిల్ బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కుతాడు. (చదవండి: బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..) కానీ తొలి రోజే ఇంత తక్కువ వసూళ్లను రాబట్టిందంటే.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే అఫీషియల్గా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు రాకపోయినా, ఈ రిపోర్ట్స్ చూస్తే మాత్రం నిజంగానే అఖిల్ కెరీర్లో ఏజెంట్ అతిపెద్ద డిజాస్టర్గా కాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ కాగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. -
బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం గతేడాదిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక నిన్న (ఏప్రిల్28) రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైంది. ఈ చిత్రానికి ఫస్ట్డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వినిపించింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. (చదవండి: పొన్నియన్ సెల్వన్ 2 మూవీ రివ్యూ) వీటిలో ఒక్క తమిళనాడులోనే రూ.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. కేరళలో రూ.2.8 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.80 కోట్లు, కర్ణాటకలో రూ.4.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.55 కోట్లు, ఓవర్సీస్లో రూ.24.70 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఈ చిత్రం మొత్తంగా రూ.170 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.172 కోట్లు సాధించాలి. తొలి రోజే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో వీకెండ్లోగా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: నాటు నాటు నా టాప్ సాంగ్స్ లిస్టులోనే లేదు: కీరవాణి షాకింగ్ కామెంట్స్) మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. -
ఫుల్ ఖుషీలో సుకుమార్...
-
సినిమా అట్టర్ ప్లాప్.. కలెక్షన్ మాత్రం బీభత్సం
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ
మాయావతి పార్టీ మరో లిస్ట్..
రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!
ఆ ఓటర్లే కీలకం..!
కమల్హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
RCB vs PBKS: ధర్మశాలలో గర్జించేదెవరు?
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్కు లేఖ రాసిన జేజేపీ
తప్పక చదవండి
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement