box office collection
-
బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత ఓ చిన్న సినిమా భారీ విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు సైతం రెండు, మూడు రోజులకే ఢీలా పడుతున్నవేళ..ఈ చిన్న చిత్రం మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్ని పెంచుకుంటూ రికార్డు దిశగా పరుగులు తీస్తోంది. ఆ చిత్రం పేరే ‘కోర్ట్’ (Court: State Vs Nobody). నాని (Nani) నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలై తొలి రోజే పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ఫలితంగా మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్టాక్తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మొత్తంగా రిలీజైన నాలుగు రోజులకే రూ. 28.9 కోట్లను రాబట్టి.. నానికి కాసుల వర్షం కురిపించిదీ చిత్రం. ఒక్క నాలుగో రోజునే 4.50 కోట్ల గ్రాస్ సాధించిదంటే.. ఈ చిన్న చిత్రం సత్తా ఎంటో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్లోనూ ఈ సినిమా బాగా వసూళ్లు రాబడుతోంది. ఈ వీకెండ్లో ఓవర్సీస్ కలెక్షన్స్ 1 మిలియన్ డాలర్స్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోర్ట్ విషయానికొస్తే.. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. శివాజీ కీలక పాత్ర పోషించాడు. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టం గురించి ఈ చిత్రంలో చర్చించారు. కోర్ట్రూమ్ డ్రామా బాగా పండడం, ఎమోషనల్ సన్నివేశాలు హృదయాలను హత్తుకునేలా ఉండడం సినిమాకు విజయాన్ని అందించాయి. #CourtTelugu continues its dominance at the box office this week ❤🔥Collects a gross of 28.9+ CRORES WORLDWIDE in 4 days 💥💥Book your tickets for #Court now! ▶️ https://t.co/C8ZZHbyhHW#CourtStateVsANobody ⚖️ Presented by Natural Star @NameisNani Starring… pic.twitter.com/AiUSVO3RCD— Wall Poster Cinema (@walpostercinema) March 18, 2025 -
Chhaava Movie: ఇండియాలోనే 500 కోట్లు దాటిన కలెక్షన్లు
-
‘ఛావా’ తెలుగు వెర్షన్కి ఊహించని ఓపెనింగ్స్!
విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie). ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సంపాదించుంది. మూడు వారాల తర్వాత నిన్న (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. టాలీవుడ్లో కూడా ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విక్కీ కౌశల్ నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు మంచి కలెక్షన్లలే రాబట్టింది. (ఛావా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి తొలి రోజు 3.03 కోట్ల రూపాయలను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఓ డబ్బింగ్ సినిమాకు ఫస్ట్డే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం రికార్డే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 483.58 కోట్లను రాబట్టింది.ఛావా విషయానికొస్తే.. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. శంభాజీ పాత్రలో విక్కీ నటించగా.. ఆయన భార్య ఏసుబాయి పాత్రను రష్మిక పోషించింది. ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా..ఔరంగాజేబు పాత్రలో కనిపించి, తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
రీరిలీజ్తో రూ.50కోట్ల కలెక్షన్లు.. తొలి చిత్రంగా రికార్డు!
టాలీవుడ్ స్టార్స్ అభిమానులకు రీ రిలీజ్ల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా మహేష్బాబు, ప్రభాస్,.. తదితరుల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అలా రీ రిలీజ్ అయిన సినిమాలకు ధియేటర్లలో కాసుల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఆయా సినిమా ధియేటర్ల వద్ద అభిమానుల జాతర కనిపిస్తోంది. తాజాగా రామ్చరణ్ సినిమా ఆరెంజ్ సైతం వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయి భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపధ్యంలో మరికొన్ని సినిమాల రీ రిలీజ్లకు సిద్ధమవుతున్నాయి కూడా. ఈ ట్రెండ్ ఇటు టాలీవుడ్లో మాత్రమే కాదు బాలీవుడ్లోనూ జోరందుకుంది. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇక్కడ లాగే అక్కడా కనిపిస్తోంది.ఇటీవలే అలా రీ రిలీజ్ అయిన ఓ సినిమా సినీ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ చరిత్ర సృష్టిస్తోంది. పైగా ఆ సినిమా కధానాయకుడు కూడా ఏ సల్మానో, అమీర్ ఖానో కాకుండా ఒక చిన్న స్థాయి హీరో కావడం విశేషం. ఆ సినిమా హీరో గతంలో పలు తెలుగు సినిమాల ద్వారా మనకూ చిరపరిచితుడే. అతడే హర్షవర్ధన్ రాణే, అతను మావ్రా హోకేన్ నటించిన సనమ్ తేరి కసమ్(Sanam Teri Kasam ) మళ్లీ విడుదలైన చిత్రాల బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించింది. థియేటర్లలో రీరిలీజ్ అయిన తర్వాత ఇండియన్ హిస్టరీలో 50 కోట్ల రూపాయల మార్కును దాటిన మొదటి సినిమాగా ఇప్పుడు రికార్డు సృష్టించింది.(చదవండి: మజాకా మూవీ రివ్యూ)చిత్ర నిర్మాత దీపక్ ముకుత్ ఇన్స్ట్రాగామ్లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు, ‘‘మా చిత్రం రికార్డులను బద్దలు కొడుతోంది, అదంతా మీ ఎడతెగని ప్రేమ వల్లనే’’ అంటూ. ఈ రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 5, 2016న థియేటర్లలో విడుదలైంది, కానీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇది వాలెంటైన్స్ వీక్లో మళ్లీ విడుదలై అప్పటి నుంచీ థియేటర్లలో నడుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా హారర్ సినిమా తుంబాద్ కలెక్షన్స్ను అధిగమించింది దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన రీ–రిలీజ్ చిత్రంగా నిలిచింది. తుంబాద్.. రూ.32 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడితే...సనమ్ తేరి కసమ్ రీ–రిలీజ్ కేవలం 16 రోజుల్లోనే 32 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ రూ.53 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఈ సినిమా విజయం వినోద పరిశ్రమ హిట్ ఫార్ములాను మార్చివేసింది, చిన్న బడ్జెట్తో చేసిన సాధారణ ప్రేమకథ సైతం పెద్ద హిట్ అవుతుందని నిరూపించింది. .సనమ్ తేరి కసమ్ చిత్రానికి రాధికా రావు వినయ్ సప్రు దర్శకత్వం వహించారు చిరంతన్ దాస్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే, మావ్రా హోకానే, విజయ్ రాజ్ మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. తకిట తకిట అనే తెలుగు సినిమా ద్వారా సినీరంగానికి పరిచయం కావడం విశేషం. హర్షవర్ధన్ రాణే... ఆ తర్వాత అవును, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, ఫిదా వంటి చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. -
బాక్సాఫీస్పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!
విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఛావా’(Chhaava Movie). మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలి రోజే హిట్ టాక్కి అందుకుంది. విక్కీ యాక్టింగ్తో పాటు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మేకింగ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా తీశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టింది. మొదటి రోజు ఈ చిత్రం దాదాపు రూ.31 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. ఈ ఏడాదిలో బాలీవుడ్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. విక్కీ కౌశల్ కెరీర్లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన తొలి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. గతంలో విక్కీ నటించిన సినిమాలలో తొలి రోజు అత్యధికంగా బాడ్ న్యూజ్(2024) రూ.8.62 కోట్లు, సామ్ బహదూర్ రూ.5.75 కోట్లు, జరా హాట్కే జరా బచ్కే రూ.5.49 కోట్లు సాధించాయి. ఛావా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.విక్కీపై ప్రశంసలు..‘ఛావా’విజయంలో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించాడు. శంభాజీగా విక్కీ కౌశల్ను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించాడని పలు వెబ్సైట్స్ తమ రివ్యూలో తెలిపాయి. వార్ యాక్షన్స్ అదరగొట్టేశాడట. క్లైమాక్స్ ఫైట్ సీన్లో వీక్కీ రుద్ర తాండవం చేశాడని చెబుతున్నారు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఉటేకర్ ఎంచుకున్న పాయింట్లో గొప్ప కథ, ఊహించని ట్విస్ట్లు లేకపోయినా శంభాజీ పాత్ర, యాక్షన్ సీక్వెన్స్ సినిమాను నిలబెట్టాయి. -
సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?
సంక్రాంతి బరిలో దిగిన గేమ్ ఛేంజర్ సినిమా సైలెంట్ అయిపోయింది. మొదట్లో డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టగా దాన్ని సైతం వెనక్కు నెడుతూ టాప్ ప్లేస్లో నిలబడింది సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie). జనవరి 14న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.165 కోట్లకు పైగా రాబట్టింది. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డుకెక్కిందని చిత్రయూనిట్ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్ధలు కొట్టింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్టైం హిట్గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. యూకెలో 1,95,628 పౌండ్లు వసూలు చేసింది. ఈ బ్లాక్బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.డాకు మహారాజ్ కలెక్షన్స్ ఎంత?డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి ఎనిమిది రోజుల్లో రూ.156 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్లో మెరిసింది. తమన్ సంగీతం అందించగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరించాడు. #SankranthikiVasthunam is redefining MASS with it’s CLASS FAMILY ENTERTAINMENT🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam joins the elite 100Crore+ share club in just 6 days 💥💥💥ALL TIME HIGHEST FOR VICTORY @Venkymama ❤️🔥ALL TIME #2 HIGHEST FOR Hit Machine @AnilRavipudi ❤️🔥… pic.twitter.com/zjjrKwNoJk— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025Victory @venkymama is firing on all cylinders with #SankranthikiVasthunam at the box office🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam has now become the ALL-TIME HIGHEST COLLECTED FILM IN AP & TS on its 6th day💥💥💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶… pic.twitter.com/dv97e3aeVl— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025The KING OF SANKRANTHI roars louder with every passing day 🪓🔥#DaakuMaharaaj storms past 𝟏𝟓𝟔+ 𝐂𝐫𝐨𝐫𝐞𝐬 Gross Worldwide in 8 DAYS 💥Celebrate the unstoppable reign of 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna in cinemas near you ❤️🔥… pic.twitter.com/hHvfs5Ac28— Sithara Entertainments (@SitharaEnts) January 20, 2025 చదవండి: వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను! -
సంక్రాంతికి వస్తున్నాం రికార్డు వసూళ్లు..3 రోజుల్లోనే భారీ మైల్ స్టోన్..
-
3 కోట్ల బడ్జెట్.. 136 కోట్ల కలెక్షన్స్.. ‘పుష్ప2’ని మించిన హిట్!
రపరపరపరప అన్నట్టుగా వరుసపెట్టి విలన్లను మాత్రమే కాదు అంతకు ముందు సినిమాలు నెలకొల్పిన ప్రతీ రికార్డ్నూ నరుక్కుంటూ పోయాడు పుష్ప2. అంతకు ముందు వరకూ ఠీవీగా నిలుచున్న అనేక మంది నెంబర్ వన్ హీరోలు సైతం తమ స్థాయి గురించి తాము సందేహించుకునేలా చేశాడు అల్లు అర్జున్. అయితే అసలైన హిట్ ఇది కాదని, కనీ వినీ ఎరుగని కలెక్షన్లు సాధించినప్పటికీ పుష్ప2 అత్యద్భుతమైన హిట్ గా చెప్పలేమని ట్రేడ్ పండితులు కొందరు తీర్మానిస్తున్నారు.అంతేకాదు ఆ మాట కొస్తే గత ఏడాది సినిమాల్లో కలెక్షన్ల పరంగా రికార్డ్స్ బద్ధలు కొట్టిన పలు సినిమాలు కూడా హిట్స్ కిందకు రావని అంటున్నారు. ఒకే ఒక సినిమా మాత్రం టాప్ హిట్గా స్పష్టం చేస్తున్నారు. దీనికి గాను వారు అందిస్తున్న విశ్లేషణ ఏమిటంటే...గత ఏడాది భారతీయ సినిమాకు చెప్పుకోదగ్గ అద్భుతమైన సంవత్సరంగా మార్చడంలో పలు టాప్ మూవీస్ కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించిన రెండు సినిమాలు పుష్ప 2: ది రూల్, కల్కి 2898... రెండూ గత ఏడాదిలోనే విడుదలయ్యాయి. అదే విధంగా శ్రద్ధా కపూర్ రాజ్కుమార్ రావుల హర్రర్ కామెడీ స్ట్రీ 2 కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 850 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా అవతరించింది.అయితే, ఒక దక్షిణ భారతీయ చిత్రం వాటన్నింటినీ అధిగమించి, భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. విశేషం ఏమిటంటే ప్రధాన తారలు ఎవరూ కనిపించని ఈ చిత్రం కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఆ మలయాళ చిత్రం పేరు ప్రేమలు. ఇటీవలి కాలంలో భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా ప్రేమలు నిలిచింది. ఈ విషయానన్ని ప్రముఖ ఆంగ్లపత్రిక హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది. గిరీష్ దర్శకత్వం వహించిన ప్రేమలు చిత్రం సచిన్ అనే యువకుడి చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, ఈ చిత్రం దాని నిర్మాణ బడ్జెట్లో 45 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించింది. రూ. 3 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ప్రేమలు ప్రపంచవ్యాప్తంగా రూ. 136 కోట్లు వసూలు చేసింది, తద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రంగా నిలవడం మాత్రమే కాదు. అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రంగా కూడా నిలిచింది.మరోవైపు పుష్ప 2: ది రూల్, కల్కి 2898.. స్త్రీ 2 వంటివన్నీ భారీ బడ్జెట్ చిత్రాలనేవి తెలిసిందే. దీని వలన తయారీదారులు తమ ఉత్పత్తి ఖర్చులను త్వరగా రికవరీ చేసుకోవచ్చు. అగ్రతారలైన ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ తదితరులు నటించిన కల్కి 2898.. బడ్జెట్ రూ. 600 కోట్ల పై మాటే. ఫలితంగా ప్రేమలుతో పోలిస్తే తక్కువ లాభాల శాతం వచ్చింది. అదేవిధంగా, అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ బాక్స్ ఆఫీస్ హిట్ అయినప్పటికీ దాని నిర్మాణ బడ్జెట్ రూ. 350 కోట్లపై మాటే దాంతో భారీ పెట్టుబడి దీని లాభాల మార్జిన్ను తగ్గించింది. అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో రెండో స్థానం సాధించిన స్ట్రీ 2 దాని బడ్జెట్కు పది రెట్లు సంపాదించింది. ఈ సినిమా రూ. 90 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొంది 850 కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకుంది. -
బాలయ్య డాకు మహారాజ్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే సక్సెస్ టాక్ రావడంతో అందరి దృష్టి కలెక్షన్లపై పడింది.డాకు మహారాజ్ మొదటి రోజు వసూళ్ల పరంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది. యూఎస్లో అరుదైన రికార్డ్..బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ అరుదైన ఘనత సాధించింది. తొలిరోజే యూఎస్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మొదటి రోజే అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్ను షేర్ చేసింది.డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.ఆకట్టుకుంటున్న బాలయ్య డైలాగ్స్బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్కు ఆకట్టుకుంటున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్ను కట్టిపడేసింది. 'సింహం నక్కల మీద కొస్తే వార్ అవ్వదు'.. 'వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి, చచ్చేవాడు కాదు’.. లాంటి డైలాగ్స్ నెట్టింట వైరలవుతున్నాయి.కాగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్గా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు.దేశీయంగా నెట్ వసూళ్లు ఎంతంటే?ఇండియా వ్యాప్తంగా చూస్తే రూ.22.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్గా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాత్రలో అభిమానులను అలరించింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీ..డాకు మహారాజ్కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ పార్టీలో మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్తో అలరించిన ముద్దుగుమ్మ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.సాంగ్పై విమర్శలు..డాకు మహారాజ్లోని దబిడి దిబిడి సాంగ్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. #DaakuMaharaaj sets the box office on fire and owns SANKRANTHI with Thunderous BLOCKBUSTER ❤️🔥𝟓𝟔 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐨𝐧 𝐃𝐀𝐘 𝟏 🪓🔥#BlockbusterHuntingDaakuMaharaaj – THE BIGGEST OPENING for #NBK garu 🧨That’s how 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/nz3eSZM46a— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2025 -
బెంగాల్లో తగ్గేదే లే!
‘తగ్గేదే లే’ అన్నది హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా రెండు భాగాల్లోని డైలాగ్. సుకుమార్ దర్శకత్వంలో వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ చిత్రం ఆ డైలాగ్కి తగ్గట్టే ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2’ దాదాపు రూ.1800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే హిందీలో ఏ స్ట్రయిట్ చిత్రం వసూలు చేయనంత అంటూ... దాదాపు రూ. 800 కోట్ల గ్రాస్ని వసూలు చేయడం విశేషం. ఇక బెంగాల్లో ఈ చిత్రం ఓ రికార్డ్ సాధించింది.మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్ చాలా చిన్నది. తక్కువ బడ్జెట్ చిత్రాలు రూపొందుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్ ఓబిజాన్’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదు... మరి... ‘పుష్ప’ అంటే వైల్డ్ ఫైర్.... లోకల్ కాదు... ఇంటర్నేషనల్. -
ఆ దేశాన్నీ వదిలిపెట్టని పుష్పగాడు!.. ఏకంగా ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా?
-
పుష్పగాడి ఊచకోత.. ఆరు రోజుల్లోనే బాక్సులు బద్దలు
-
రికార్డులు రప్పా రప్పా...
‘‘ఆ బిడ్డ మీద ఒక్క చిన్న గీత పడాలా... గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా...’’ అంటూ విలన్లకి వార్నింగ్ ఇస్తాడు పుష్పరాజ్. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన బోలెడన్ని పవర్ఫుల్ డైలాగ్స్లో ఇదొకటి. ఇక ఇక్కడ పేర్కొన్న డైలాగ్లానే రప్పా రప్పా అంటూ ఇప్పటివరకూ ఉన్న రికార్డులను చెరిపేసి, సరికొత్త రికార్డులను సృష్టించారు అల్లు అర్జున్.ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రూ. 294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులను సెట్ చేసింది ‘పుష్ప2: ది రూల్’ సినిమా.అల్లు అర్జున్, రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం (డిసెంబరు 5)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబరు 4న రాత్రి 9:30 గంటల నుంచి ప్రారంభమైన ప్రీమియర్స్కి అనూహ్యమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్లో ఈ చిత్రం విడుదలైంది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా మొదటి రోజు రూ. 294 కోట్ల గ్రాస్తో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇండియాలో ఇప్పటివరకు మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ (2022) రూ. 233 కోట్ల గ్రాస్తో ప్రథమ స్థానంలో ఉంది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. అయితే రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లతో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బ్రేక్ చేసింది ‘పుష్ప 2: ది రూల్’.అదే విధంగా నైజాంలోనూ రికార్డులను తిరగ రాసింది ‘పుష్ప 2’. ఇప్పటివరకూ మొదటి రోజు వసూళ్లలో రూ. 23కోట్ల గ్రాస్తో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మొదటి స్థానంలో ఉండగా, రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త రికార్డుని సృష్టించి, మొదటి స్థానంలో నిలిచింది ‘పుష్ప 2: ది రూల్’. హిందీలోనూ తొలి రోజు రూ. 72 కోట్ల వసూళ్లతో ‘పుష్ప 2’ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్లో ఇప్పటివరకు మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే, తాజాగా ‘పుష్ప 2’ రూ. 72 కోట్ల వసూళ్లతో ‘జవాన్’ని రెండో స్థానానికి పరిమితం చేసింది. హిందీలో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్కు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ క్రియేట్ చేశారు. ‘పుష్ప: ది రైజ్’ (2021) చిత్రంలో తన అద్భుతమైన నటనకుగానూ జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఆ సినిమా బ్లాక్బస్టర్ కావడం, ఆయనకి జాతీయ అవార్డు రావడంతో ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్కి స్టార్డమ్, ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఈ కారణంగానే హిందీలో ‘పుష్ప 2’కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి... రానున్న రోజుల్లో రప్పా రప్పా అంటూ ‘పుష్ప 2’ ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో వేచి చూడాల్సిందే. -
బద్దలవుతున్న బాక్సాఫీస్ రికార్డులు..
-
టాలీవుడ్ని నిండా ముంచిన నవంబర్.. 22 సినిమాలు ఫ్లాప్!
టాలీవుడ్లో ఒక సెంటిమెంట్ ఉంది. నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు సక్సెస్ కావని భావిస్తారు. అందుకే ఈ నెలలో పెద్ద సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఈ సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అయింది. గతేడాది మాదిరే ఈ ఏడాది నవంబర్ కూడా టాలీవుడ్కి కలిసి రాలేదు. ఈ నెలలో రిలీజైన సినిమాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.నవంబర్ మెదటి వారంలోనే దాదాపు 10 సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ కూడా ఉంది. కానీ ఏ ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు. ఇక నిఖిల్ సినిమా అయితే భారీ ఫ్లాప్ని మూటకట్టుకుంది. జితెందర్ రెడ్డి సినిమాకు ఓ మోస్తారు టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇక మంచు లక్ష్మి ఆదిపర్వం, హెబ్బా పటేల్ ‘ధూంధాం’ లాంటి సినిమాలు ఫ్లాప్ టాక్నే మూటగట్టుకున్నాయి.ఇక రెండోవారంలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మట్కా. మెగా ప్రిన్స్ వరుణ్ సందేశ్ నటించిన ఈ చిత్రం.. నవంబర్ 14న విడుదలై ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట ఫ్లాప్గా నిలిచింది. ఇక భారీ అంచనాలతో వచ్చి సూర్య ‘కంగువా’..ఘోర పరాజయాన్ని చవిచూసింది.(చదవండి: హైదరాబాద్లో ‘పుష్ప 2’ ఈవెంట్.. చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్!)ఇక నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ పోరులో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సత్యదేవ్తో పాటు మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా పోటీ పడ్డారు. విశ్వక్ నటించిన మెకానిక్ రాకీ, సత్యదేవ్ నటించిన జీబ్రా రెండూ.. నవంబర్ 22న విడుదలయ్యాయి. వీటిలో మెకానిక్ రాకీ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. సెకండాఫ్ బాగున్నా.. ఫస్టాఫ్ని భరించడం కష్టమేనని రివ్యూస్ చెప్పాయి. అయితే కొంతవరకు అయినా కలెక్షన్స్ వస్తాయని భావించినా.. మూడో రోజు నుంచే సినిమా గురించి మాట్లాడుకోవడం మానేశారు. (చదవండి: చైనాలో 'మహారాజా' రెండు రోజుల కలెక్షన్స్.. భారీ రికార్డ్)ఇక సత్యదేవ్ జీబ్రా మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి స్క్రీన్స్ కూడా పెరిగాయి. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. వీకెండ్ తర్వాత ఆ జోష్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇక అశోక్ గల్లా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రమైతే ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకుంది.ఇక నవంబర్ చివరి వారంలో మరో నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో రోటి కపడా రొమాన్స్ మూవీకి మంచి టాక్ లభించింది. సినిమా బాగున్నప్పటికీ.. అప్పటికే ప్రేక్షకులంతా పుష్ప 2 ఫీవర్లోకి వెళ్లారు. మొత్తంగా నవంబర్ నెల అయితే ఎప్పటి మాదిరే టాలీవుడ్ని నిండా ముంచేసింది. ఈ నెలలో వచ్చిన 22 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక డిసెంబర్లో మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ పుంజుకునే అవకాశం ఉంది. పుష్ప 2తో పాటు మరిన్ని పెద్ద సినిమాలు ఈ నెలలో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ ఇయర్ ‘క్లైమాక్స్’ ఎలా ఉంటుందో చూడాలి. -
బరిలోకి మహేశ్, చరణ్, సమంత.. అయినా ఫ్లాప్ తప్పలేదు!
సినీ ప్రేక్షకుడు మారాడు. ఒకప్పుడు తన అభిమాన నటీనటుల సినిమా ఎలా ఉన్నా సరే థియేటర్కి వెళ్లి చూసేవాడు. కానీ ఇప్పుడు హీరోహీరోయిన్ల మొఖం చూడట్లేదు. కథలో దమ్ముంటేనే సినిమా చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయినా సరే.. టికెట్ తెగాలంటే మంచి కంటెంట్ ఉండాల్సిందే. లేదంటే అపజయం తప్పదు. దీనికి ఇటీవల విడుదలైన ‘జిగ్రా’ సినిమానే మంచి ఉదాహరణ.బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జిగ్రా’. వేదాంగ్ రైనా, మనోజ్ పవా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలై తొలి రోజే ఫ్లాప్ టాక్ని మూటగట్టుకుంది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వీకెండ్ మొత్తంలో రూ. 20 కోట్ల కలెక్షన్స్ని కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారం మొత్తంలో హిందీలోనే కేవలం రూ. 18 కోట్ల మాత్రమే వసూలు చేసిందంటే..ఇక మిగతా భాషల్లో కలెక్షన్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.అపజయాన్ని ఆపలేకపోయినా స్టార్స్ఆలియా భట్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేశారు. తెలుగులో హీరో రానా రిలీజ్ చేశాడు. వాస్తవానికి హిందీ తర్వాత ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది తెలుగులోనే అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం ట్రైలర్ని విడుదల చేశాడు. సూపర్స్టార్ మహేశ్బాబు సోషల్ మీడియా వేదికగా తన మద్దతును ప్రకటించాడు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్కి స్టార్ హీరోయిన్ సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై.. తన వంతు సాయం అందించారు. ఇలా స్టార్స్ అంతా తమకు తోచిన సహాయం అందించినా.. జిగ్రాకు విజయం అందించలేకపోయారు. తెలుగులో మూడు రోజుల్లో కేవలం 18 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చిన ఓ చిన్న సినిమాకు కూడా ఇంతకంటే ఎక్కువే వస్తాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే కథలో దమ్ము లేనప్పడు ఏ హీరో అయినా ఏం చేయగలడు? కాస్త బాగున్న సినిమాను ప్రచారం చేస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ కంటెంట్లేని సినిమాకు ఎంత ప్రచారం చేసిన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. విషయం వీక్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందనడానికి ‘జీగ్రా’ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. -
బాక్సాఫీస్ ని గడగడలాడిస్తున్న దేవర
-
Stree 2: రూ.50 కోట్ల బడ్జెట్.. రూ. 500 కోట్ల కలెక్షన్స్!
కంటెంట్ ఈజ్ కింగ్.. ఇప్పుడు ఇండియన్ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న మాట ఇది. ఒకప్పుడు హీరోహీరోయిన్లను చూసి ప్రేక్షకులు సినిమా థియేటర్కి వెళ్లేవారు..కానీ ఇప్పుడు కథను నమ్మి వెళ్తున్నారు. కథ నచ్చితే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా సినిమాను హిట్ చేస్తున్నారు. స్త్రీ 2 చిత్రం ఆ కోవలోకి చెందినదే. బడా హీరోలెవరు ఈ చిత్రంలో లేరు. కానీ ఆ హీరోల సినిమాలకు మించిన కలెక్షన్స్ని రాబడుతోంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిస్టరీ క్రియేట్ చేస్తోంది.ఊహించని విజయంశ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ 2 చిత్రం ఆగస్ట్ 15న విడుదలైంది. రిలీజ్కి ముందు వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ..ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. తొలి రోజు ఈచిత్రానికి రూ. 51 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓ చిన్న చిత్రానికి ఈ మధ్యకాలంలో ఈ స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ అమాంతం పెరిగిపోయాయి. మూడో వారంలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 509 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.#Stree2 is rock-steady at the #BO, firmly holding its ground on a working day [third Mon]... Mass circuits - particularly non-national chains + single screens at Tier-2 and Tier-3 centres - are driving its biz... Expected to enjoy a smooth, uninterrupted run right till #Dussehra.… pic.twitter.com/AdUGp3v4Ff— taran adarsh (@taran_adarsh) September 3, 2024 -
బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది?
కంటెంట్ బాగుంటే చాలు నటీనటులు, భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు నేటి ప్రేక్షకులు. ఏ భాషలోనే తెరకెక్కించినా చాలు.. హిట్ టాక్ వస్తే థియేటర్స్కి వెళ్లి చూస్తున్నారు. అలా ఇప్పుడు బాలీవుడ్ మూవీ స్త్రీ 2కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తోంది. రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.135 కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది.(చదవండి: బ్రదర్ అంటే బెస్ట్ ఫ్రెండ్: సితార ఘట్టమనేని)వాస్తవానికి ఈ సినిమాకి ప్రిమియర్ షో నుంచే హిట్ టాక్ వచ్చింది. తొలి రోజు ఏకంగా రూ. 51 కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయి కలెక్షన్స్ రాలేదు. వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రావడం కూడా సినిమాకు ప్లస్ అయింది. దీనికి తోడు ఆగస్ట్ 15న విడుదలైన చిత్రాలన్నీ ప్లాప్ టాక్ మూటగట్టుకోవడం కూడా స్త్రీ 2కు కలిసొచ్చింది. స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.(చదవండి: మమ్ముట్టి ‘టర్బో’ మూవీ రివ్యూ)దర్శకుడు అమర్ కౌశిక్ వైవిధ్యమైన స్క్రీన్ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ఒకవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వులు పంచుతోంది. కామెడీ, హారర్ రెండింటిని బ్యాలన్స్ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని సాగించాడు. ఇక ప్రత్యేక పాటలో తమన్నా స్టెప్పులేయడం.. అక్షయ్ కుమార్ అతిథి పాత్ర లో కనిపించడం సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. ఈ చిత్రం కచ్చితంగా 500 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని సీనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
‘కమిటీ కుర్రోళ్లు’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న(ఆగస్ట్ 10)విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో చక్కగా తెరకెక్కించారని అందరూ ప్రశంసిచారు.ప్రశంసలతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ..ఇక వీకెండ్స్ అయిన శనివారం, ఆదివారం రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. -
గత పదిహేనేళ్లలో ఇలాంటి కలెక్షన్లు ఎవ్వరూ చూసుండరు..
-
రూ. 1000 కోట్ల క్లబ్లోకి ‘కల్కి’.. అరుదైన రికార్డు!
ఊహించిందే నిజమైంది. ‘కల్కి 2898 ఏడీ’ రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్ల కొల్లగొట్టడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలే నిజమైయ్యాయి. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’చిత్రం రెండు వారాల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిలీజ్ రోజే(జూన్ 27) హిట్టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు రూ. 191 కోట్లను వసూలు చేసి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పటికి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లు వచ్చాయాని మేకర్స్ ప్రకటించారు. (చదవండి: వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జర్నలిస్ట్పై నటి రోహిణి ఫైర్)రిలీజ్ అయి రెండు వారాలు దాటినా..ఇప్పటికీ సక్సెఫుల్ కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ప్రభాస్, అమితాబ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.ఏడో చిత్రంగా ‘కల్కి’ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఏడోది. అంతకు ముందు దంగల్ (2016) రూ.2024 కోట్లు, బాహుబలి2 (2017) రూ.1810 కోట్లు, ఆర్ఆర్ఆర్ (2022) 1387 కోట్లు, కేజీయఫ్2 (2022) రూ.1250 కోట్లు, జవాన్ (2023) రూ.1148 కోట్లు, పఠాన్ (2023) రూ.1050 కోట్లు వసూలు చేశాయి. -
500 కోట్ల వైపు కల్కి పరుగులు.. హాలీవుడ్ మూవీని మించి కలెక్షన్స్
-
మరోసారి బాక్సాఫీస్ దగ్గర రికార్డుల ఫెస్టివల్..
-
దుమ్ము రేపుతున్న చిన్న మూవీ.. అప్పుడే సెంచరీ క్లబ్లోకి..
చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. బాలీవుడ్ బడా సినిమాల పోటీని తట్టుకుని నిలబడింది. హారర్ సినిమా ముంజా తాజాగా వంద కోట్ల క్లబ్లోకి చేరింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఆదిత్య సపోట్దర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోనా సింగ్, అభయ్ వర్మ, శార్వరి వాగ్ ప్రధాన పాత్రలు పోషించారు.జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఈ మూవీకి ఓటేస్తున్నారు. అలా ఈ చిత్రం 17 రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ వసూళ్ల దూకుడికి గురువారం (జూన్ 27) అడ్డుకట్ట పడే అవకాశముంది. ఆ రోజు ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా రిలీజవుతుండటంతో ముంజా రేసులో వెనకబడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ముంజా.. మిస్టర్ అండ్ మిసెస్ మహి, చందు ఛాంపియన్ వంటి భారీ చిత్రాలను వెనక్కు నెట్టి సెంచరీ సాధించడం గొప్ప విషయమనే చెప్పాలి! Munjya laughs and scares its way to 100 Cr! Thank you for the historic third weekend. We couldn’t have done it without you! ❤️Book your tickets now.🎟️ - https://t.co/z6yE2V5CHC#Munjya, a must-watch entertainer for families and kids, running successfully in cinemas now!… pic.twitter.com/1EJo4Beg8W— Maddockfilms (@MaddockFilms) June 24, 2024 -
‘గం..గం..గణేశా’తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. భారీ అంచనాల మధ్య నిన్న (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్తో దూసుకెళ్తోంది. (చదవండి: ‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ)ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్డే ఈ మూవీ 1.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. -
బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు
రూ.100 కోట్ల కలెక్షన్స్.. ఒకప్పుడు టాలీవుడ్కి ఇది రికార్డు కలెక్షన్స్. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేవి. మాములు హీరోల సినిమాలకు రూ.20 కోట్లు వస్తేనే అది సూపర్ హిట్. కానీ ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి మారింది. కుర్రహీరోలు సైతం బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. రికార్డు స్థాయి కలెక్షన్స్ని రాబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ కలెక్షన్స్ని యంగ్ హీరోస్ రాబడుతున్నారు. మన టాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న యంగ్ హీరోలపై ఓ లుక్కేయండి -
సూర్య.. 1000 కోట్లు వసూలు చేస్తాడా?
ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతుంది. ఇక మన టాలీవుడ్ నుంచి అయితే చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా బ్రాండ్ తోనే తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న కోలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు మనవాళ్లనే ఫాలో అవుతున్నారు. తమ సినిమాలను కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఎలాగైనా పాన్ ఇండియా పోటీలో తాము కూడా పై చేయి సాధించాలని కసిగా ఉన్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో టాలీవుడ్ పాటు కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ కోలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు రూ. 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక కన్నడ నుంచి కేజీయఫ్, కేజీయఫ్ 2 చిత్రాలు కూడా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కోలీవుడ్ నుంచి జైలర్ కచ్చితంగా రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ అది రూ. 600 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇక ఇప్పుడు కోలీవుడ్ ఆశలన్నీ సూర్యపైనే ఉన్నాయి. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం కంగువా రూ. 1000 కోట్లు సాధించి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ చూస్తుంటే కచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేసే మొట్టమొదటి చిత్రం అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చిత్ర నిర్మాతలు కూడా రూ. 1000 కోట్లే టార్గెట్గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కంగువా పార్ట్ 1 ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
టిల్లు తుపాన్, 100 కోట్లు లోడింగ్..?
-
Tillu Square Box Office Collection: బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న ‘టిల్లుగాడు’
లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినంటోన్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. టిల్లుగాడి మ్యానరిజం, పంచ్ డైలాగ్స్కి సినీ ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. ఫలితంగా తొలిరోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఫస్ట్డే రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. (చదవండి: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ) అలాగే అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు 1 మిలియన్ డాలర్స్కి పైగా వసూళ్లను రాబట్టింది. హిట్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2022లో వచ్చిన డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. Tillu Registers a 𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 Start at the Box-Office with 𝟐𝟑.𝟕 𝐆𝐑𝐎𝐒𝐒 on 𝐃𝐀𝐘 𝟏 🔥 Our Starboy 🌟 is shattering the records all over! 💥💥 Book your tickets here - https://t.co/vEd8ktSAEW #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala… pic.twitter.com/Dz7hqglg5Z — Sithara Entertainments (@SitharaEnts) March 30, 2024 -
మాట మీద నిలబడ్డ నాగ్! నా సామిరంగకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మల్టీస్టారర్ సినిమాలకున్న క్రేజే వేరు. ఇద్దరు హీరోలు తెరమీద కనిపిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవు. అలాంటిది ఈ సంక్రాంతికి ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాతో సందడి చేశారు. అగ్ర హీరో అక్కినేని నాగార్జున యువ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్లతో కలిసి నా సామిరంగ సినిమా చేశాడు. ఈ మూవీలో ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించాడు. మూడు రోజుల్లోనే అన్ని కోట్లా? 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్గా ఇది తెరకెక్కింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం.. బ్లాక్బస్టర్ కొడుతున్నాం అని చెప్పిన నాగ్ తన మాటను నిలబెట్టుకునేలా కనిపిస్తున్నాడు. మూడు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.24.8 కోట్లు (గ్రాస్) రాబట్టింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. బ్రేక్ ఈవెన్కు దగ్గర్లో.. వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్కు దగ్గరగా ఉందని వెల్లడించింది. నాగార్జున జోరు చూస్తుంటే మరో రెండు,మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటేసి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా నాగార్జున.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తమిళ డైరెక్టర్ నవీన్తో సినిమా చేయనున్నాడు. ‘బ్రహ్మస్త్ర 2’ లోనూ భాగం కానున్నాడు. Sankranthi KING #NaaSaamiRanga STORM at BO on Kanuma Day!🔥🔥 Total 3 Days WW gross is 24.8 crores💥 Festive celebrations in theatres will continue on Day 4 too🥳#NaaSaamiRangaJaathara 🎟 https://t.co/1i8BJmy6kJ KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u… pic.twitter.com/ayPwBdQk19 — BA Raju's Team (@baraju_SuperHit) January 17, 2024 చదవండి: హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, యాంకర్గా.. ఈ నెలలో ప్రియుడితో పెళ్లి -
సలార్ కి 1000 కోట్లు కష్టమే..
-
500 కోట్ల క్లబ్ లో చేరిన సలార్..
-
వీకెండ్ దాటినా సలార్ అదే జోరు..500 కోట్లతో బాక్సాఫీస్ షేక్
-
సలార్ కూడా వెయ్యి కోట్లు కొడతాడా ?
-
అందుకే నా సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి: సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ హీరోగా ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో ‘ది బుల్’ అనే సినిమా తెరకెక్కనుంది. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మార్చిలో ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో పారా మిలిటరీ ఆఫీసర్గా సల్మాన్ ఖాన్ నటిస్తారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక తన సినిమాల వైఫల్యాల (‘అంతిమ్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లను ఉద్దేశిస్తూ..) గురించి కూడా సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నా సినిమాలు విడుదలైనప్పుడు, ఆ సినిమాల టికెట్ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ధరలతో విడుదల చేస్తే ఆ సినిమాల కలెక్షన్స్ కూడా భారీగానే ఉంటాయి. నా తర్వాతి సినిమాను అలాగే రిలీజ్ చేయాలనుకుంటున్నాను’ అని సల్మాన్ అన్నారు. అంతేకాదు.. తక్కువ సినిమా టికెట్ ధరలతో ప్రజల డబ్బును మేం సేవ్ చేస్తున్న విషయం అందరికీ సరిగ్గా అర్థం కావడం లేదని కూడా సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. -
లియో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 500 కోట్లు..
-
రూ.1000 కోట్ల కల.. డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే!
ఈ ఏడాది పఠాన్, జవాన్ లాంటి వెయ్యి కోట్ల సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్లు దూకుడు మీదుంది. వీటి మధ్య లో వచ్చిన గదర్ 2 కూడా 500 కోట్లకు పైగానే రాబట్టింది.ఇక కోలీవుడ్ కూడా ముందు జైలర్ తో,ఇప్పుడు లియోతో రెండు సార్లు 500 కోట్ల వసూళ్లను చూసింది. కానీ టాలీవుడ్ మాత్రం ఈ ఏడాదిలో ఇంకా ఈ స్థాయిలో విజయాలను చూడలేదు. సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య మూవీ ఒకటే 225 కోట్లు రాబ్టటింది.ఇప్పటికీ టాలీవుడ్స్ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్ గా కొనసాగుతోంది. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 400 కోట్లకు పైగా రాబట్టినా,ఆది బాలీవుడ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. (చదవండి: హీరోయిన్తో రహస్యంగా లవ్..? సిగ్గుపడిపోయిన యంగ్ హీరో!) ఆశలన్నీ సలార్పైనే డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న సలార్ మూవీపై టాలీవుడ్ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ చిత్రం కచ్చితంగా రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2తో ఇప్పటికే రూ.1200కోట్ల వసూళ్లను చూశాడు. అలాగే ప్రభాస్ ఫ్లాప్ సినిమాకు కూడా రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకవేళ హిట్ పడితే మాత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ ఓ లెక్కనే కాదు. (చదవండి: ‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ రివ్యూ ) భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ సలార్ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.175 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అదే నిజమైతే మాత్రం టాలీవుడ్ నుంచే ఈ చిత్రం రూ. 300 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంఉటంది. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే రూ.300 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఆ లెక్కలు ఈజీగా రూ. 1000 కోట్లు దాటుతాయి. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో డిసెంబర్ 22 తర్వాత తెలుస్తుంది. -
10000 కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్..
-
రూ.1100 కోట్ల క్లబ్లో ‘జవాన్’.. చరిత్ర సృష్టించిన షారుఖ్!
కింగ్ఖాన్ షారుఖ్ ఖాన్ మళ్లీ పుంజుకున్నాడు. వరుస ప్లాఫులు రావడంతో కొన్నాళ్లకు సినిమాకు గ్యాప్ ఇచ్చి.. పఠాన్తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అదే జోష్లో ఈ ఏడాది ‘జవాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. షారుఖ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రంగా జావాన్ నిలిచింది. సినిమా విడుదలై నెల రోజులు అయినప్పటికీ..దేశ వ్యాప్తంగా రోజులు దాదపు రూ.కోటి వసూళ్లను రాబడుతోందంటే.. జవాన్ సృష్టించిన సునామీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమిర్ తర్వాతే షారుఖ్ జవాన్ ఎన్ని రికార్డులు సృష్టించిన.. కలెక్షన్ల పరంగా మాత్రం దంగల్ని అందుకోవడం కష్టమే. ప్రపంచ వ్యాప్తంగా జవాన్ కలెక్షన్స్ రూ. 1103 కోట్ల వద్ద ఉన్నాయి. కేజీయఫ్ 2 (రూ. 1215 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.1230 కోట్లు), బాహుబలి 2 (రూ. 1780 కోట్లు), దంగల్ (రూ. 2400 కోట్లు) సినిమాలతో పోలిస్తే.. జవాన్ ఇంకా వెనకబడే ఉంది. ఇంకా చైనాలో జవాన్ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు కాబట్టి.. ఒక వేళ అక్కడ కూడా హిట్ అయితే మాత్రం కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలను ఈజీగా క్రాస్ చేస్తుంది. ఈ చిత్రంలో షారుఖ్కి జోడిగా నయనతార నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించారు. విజయ్ సేతుపతి విలన్గా నటించాడు. జవాన్ రికార్డులు విడుదలైన వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్ని దాటిన తొలి హిందీ చిత్రం అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం పఠాన్ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్ స్టార్గా షారుఖ్ చరిత్రకెక్కాడు. బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రం Jawan 🤝 Making & breaking box office records every day! 🔥 Book your tickets now!https://t.co/B5xelUahHO Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/JCdsrHFp6r — Red Chillies Entertainment (@RedChilliesEnt) October 6, 2023 -
7 రోజులు.. రూ.600 కోట్లు.. ‘జవాన్’ సరికొత్త రికార్డు
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. వీకెండ్తో పాటు వీక్ డేస్లో కూడా మంచి కలెక్షన్స్ని రాబట్టింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.570 కోట్ల వసూళ్లను సాధించి చరిత్రకెక్కింది. ఇక ఏడో రోజు కూడా జవాన్ మంచి వసూళ్లనే సాధించాడు. ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం వారం రోజుల్లో రూ. 621 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. జావాన్ ఖాతాలో అరుదైన రికార్డు విడుదలైన తొలి రోజు జవాన్ చిత్రానికి బ్లాక్బస్టర్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ముఖ్యంగా హిందీలో రోజు రోజుకి కలెక్షన్స్ సంఖ్య పెరుగుతోంది. దక్షిణాదికి చెందిన నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించడంతో అక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. మొత్తంగా వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్ని దాటిన తొలి హిందీ చిత్రంగా జవాన్ అరుదైన రికార్డుని సాధించింది. (చదవండి: మాట నిలబెట్టుకున్న విజయ్.. రూ. కోటి పంపిణీకి లిస్ట్ రెడీ!) అలాగే ఈ ఏడాదిలో షారుఖ్ నటించిన రెండు చిత్రాలు (పఠాన్, జవాన్) కూడా 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం గమనార్హం. పఠాన్ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది. అలాగే ఒకే ఏడాదిలో ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్ స్టార్గా షారుఖ్ చరిత్రకెక్కాడు. అంతేకాదు అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం కూడా ఇదే. అంతకు ముందు బాహుబలి 2 హిందీ వెర్షన్ 250 మార్కును స్కోర్ చేయడానికి 8 రోజులు పట్టింది. ఆ తర్వాత కేజీయఫ్ 2, పఠాన్ చిత్రాలు ఐదు రోజుల్లో ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకుంది. జవాన్ మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. -
బాక్సాఫీస్ వద్ద ‘ఖుషి’ జోరు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఎట్టకేలకు విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడింది. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘ఖుషి’. సమంత హీరోయిన్. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం(సెప్టెంబర్ 1) విడుదలై.. తొలిరోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. విజయ్-సమంతల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీకి సినీ ప్రియులు ఫిదా అయ్యారు. అద్భుతమైన పాటలు, బీజీఎం, విజువల్స్తో ‘ఖుషి’ విజయంలో కీలక పాత్ర పోషించాయి. (చదవండి: ‘ఖుషి’మూవీ రివ్యూ) ఫస్ట్ డేనే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. తొలో రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.30.1కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఏరియాల వారిగా చూస్తే.. ‘నైజాం రూ.5.15 కోట్లు, సీడెడ్ రూ.91 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.1.13 కోట్లు, ఈస్ట్ రూ.66 లక్షలు, వెస్ట్ రూ.63 లక్షలు, గుంటూరు రూ. 66 లక్షలు, కృష్ణా రూ. 44లక్షలు, నెల్లూరు రూ.29 లక్షలు, కర్ణాటక-రెస్టాఫ్ ఇండయాలో రూ.85 లక్షలు, ఇతర భాషల్లో రూ.45 లక్షల వసూళ్లను రాబట్టింది. యూస్లో ఖుషి జోరు ఇక యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఖుషి జోరు కనిపిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 8 లక్షల డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. వన్ మిలియన్ మార్క్ వైపు వేగంగా పరుగులు పెడుతోంది. ఖుషికి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే...మరిన్ని సర్ ప్రైజింగ్ బాక్సాఫీస్ నెంబర్స్ సాధిస్తుందని అనుకోవచ్చు. Families Kushi 🥰❤️ Box Office Kushi 🔥 Blockbuster Family Entertainer #Kushi ❤️ Sensational Day 1 with 30.1 CR GROSS WORLDWIDE and a super strong Day 2 on cards 🔥 Book your tickets now! - https://t.co/16jRp6UqHu#BlockbusterKushi 🩷@TheDeverakonda @Samanthaprabhu2… pic.twitter.com/EcD9AcAmoO — Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2023 -
‘గాండీవధారి అర్జున’ కలెక్షన్స్.. వరుణ్ కెరీర్లోనే అతి తక్కువ..ఎంతంటే?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. ఓ మోస్తరు అంచనాల మధ్య శుక్రవారం(ఆగస్ట్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. కథ, కథనంలో కొత్తదనం లేదని, దర్శకుడు మేకింగ్పై పెట్టిన దృష్టి బలమైన కథను రాయడంలో పెట్టలేదని విమర్శలు వచ్చాయి. పలు వెబ్సైట్లు కూడా ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలే ఇచ్చాయి. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంలో ఈ చిత్రం విఫలమైంది. (చదవండి: సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి) వరుణ్ కెరీర్లోనే అతి తక్కువగా కేవలం 1.9కోట్ల కనెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఏరియాల వారిగా చూస్తే..నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్లో రూ.15 లక్షలు, ఆంధ్రాలో రూ.65లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్ ఆఫ్ ఇండియాలో రూ.50 లక్షలు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.1.40 కోట్ల గ్రాస్, రూ. 75లక్షల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. (చదవండి: ‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ) వరుణ్ కెరీర్లోనే డిజాస్టర్గా మిగిలిన వరుణ్ గత సినిమా గని తొలి రోజు రూ. 3 కోట్లు రాబట్టడం గమనార్హం. ఈ లెక్కన వరుణ్ కెరీర్లోనే గండీవధారి అతిపెద్ద డిజాస్టర్గా మిగిలిపోయే అవకాశం మెండుగా ఉంది. ఇక ఈ చిత్రానికి రూ. 17 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగినటట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 18 కోట్లు రాబట్టాలి. తొలి రోజే వసూళ్లు దారణంగా ఉండడంతో బ్రేక్ ఈవెన్ అసాధ్యమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బిగ్గెస్ట్ డిజాస్టర్గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. భారీ అంచనాల మధ్య ఆగస్ట్11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో చిరు కెరీర్లోనే భారీ డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం అందులో పావు వంతు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయిందనే వార్తలు వినిపిస్తునాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం రూ. 30 కోట్లను మాత్రమే వసూలు చేసింది. రూ.50 కోట్ల నష్టం! మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో భోళా శంకర్కి భారీగా ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 80 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇప్పటి వరకు కేలవం రూ.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే ఇంకా 50 కోట్లు కలెక్ట్ చేస్తేగానీ ఈ చిత్రం సేఫ్జోన్లోకి వెల్లదు. ఈ చిత్రం విడుదలే ఇప్పటికే పది రోజులు దాటింటి. పైగా తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్. కాబట్టి ఇక ఈ సినిమా థియేటర్లలోనుంచి తీసేసే చాన్స్ ఎక్కువగా ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ చిత్రానికి రూ.50 కోట్ల నష్టం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర్ నిర్మించిన ఈ చిత్రం కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. కానీ చివరకు నెట్ఫిక్స్ ఓటీటీ రైట్స్ని దక్కించుకుంది. అది కూడా రూ. 30 కోట్లకు. అయితే ఇదంతా సినిమా రిలీజ్కు ముందు జరిగింది. మెగాస్టార్ గత చిత్రం వాల్తేరు వీరయ్య ఓటీటీ రైట్స్ కూడా ఈ సంస్థే దక్కించుకుంది. దానికి మంచి రిజల్ట్ రావడంతో.. భోళా శంకర్కి భారీ ధర చెల్లించి, ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. అయితే సినిమా విడుదల తర్వాత ఫలితంగా దారుణంగా రావడంతో ఆ ఎఫెక్ట్ ఓటీటీపై కూడా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏమేరకు ఆదరిస్తారో చూడాలి. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు? సాధారణంగా ఏ చిత్రమైనా భారీ విజయం సాధిస్తే.. ఓటీటీలో కాస్త లేట్గా స్ట్రీమింగ్ అవుతాయి. మొదట ఫలానా డేట్కి స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నా.. సినిమా ఫలితాన్ని బట్టి వాయిదా వేస్తారు. అదే డిజాస్టర్ టాక్ వస్తే మాత్రం అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. భోళా శంకర్ విషయంలోనూ అదే జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని తొలుత భావించారట. కానీ టాక్ దారుణంగా రావడంతో అనుకున్నదాని కంటే ముందే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. సెప్టెంబర్ 18న నుంచి నెప్ట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్క్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సింది. -
‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేశ్, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 11) విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజే నెగెటివ్ టాక్ లభించింది. మెగాస్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. (చదవండి: భోళా శంకర్ మూవీ రివ్యూ) ‘భోళా శంకర్’ ఫస్ట్డే కలెక్షన్స్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ చిత్రం రూ.28 కోట్ల గ్రాస్(రూ.18.61 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా రూ. 15.51 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ.4.50 కోట్లు, సీడెడ్- రూ.2 కోట్లు, ఈస్ట్-1.50 కోట్లు, వెస్ట్- రూ.1.85 కోట్లు, గుంటూరు- రూ.2.07 కోట్లు, కృష్ణా- రూ.1.02 కోట్లు, నెల్లూరు-రూ.73లక్షలు, కర్ణాటక, ఓవర్సీస్లో మొత్తంగా రూ. 3.1 కోట్లు వసూలు చేసింది. టార్గెట్ రూ.82 కోట్లు భోళా శంకర్ చిత్రానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రిరీలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో అంత స్థాయిలో వసూళ్లను రాబట్టకపోవచ్చునని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రజనీకాంత్ ‘జైలర్’సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కూడా ‘భోళా శంకర్’పై పడే అవకాశం ఉంది. చిరు గత సినిమాల కలెక్షన్స్ ఎంత? ఇక చిరంజీవి గత చిత్రాల వసూళ్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇది కాస్త తక్కువనే చెప్పాలి. చిరంజీవి గత ఐదు సినిమాల ఫస్ట్డే వసూళ్లను పరిశీలిస్తే.. వాల్తేరు వీరయ్య-రూ.22.75 కోట్లు, గాడ్ ఫాదర్-రూ.12.83 కోట్లు, ఆచార్య- రూ.28.29 కోట్లు, సైరా- రూ. 36.37 కోట్లు, ఖైదీ నెం 150- రూ. 23.16 కోట్ల వసూళ్లను రాబట్టాయి. భోళా శంకర్కు తొలి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. -
దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బేబీ’. ‘కలర్ ఫోటో’ సినిమాకు కథ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ట్రైయాంగిల్ లవ్స్టోరీగా వచ్చిన ఈ చిత్రానికి యువత బాగా కలెక్ట్ అయింది. ఫలితంగా తొలి రోజు భాకీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ఈ చిత్రం రూ.7.1 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇటీవల కాలంలో ఓ చిన్న చిత్రానికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెంట్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: బేబీ మూవీ రివ్యూ) ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రూ.7.40 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.8 కోట్లుగా ఫిక్సైయింది. తొలి రోజే రూ.7.1 కోట్లు వసూలు చేసి, బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చింది. రెండో రోజుతో ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాట పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బేబీ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం -రూ. 2.3 కోట్లు ►సీడెడ్- రూ.54.7 లక్షలు ►ఈస్ట్: రూ.40.5 లక్షలు ►వెస్ట్: 21.6 లక్షలు ►వైజాగ్: రూ.80.08లక్షలు ►కృష్ణా: రూ.34.6లక్షలు ►గుంటూరు: రూ.29.3లక్షలు ►నెల్లూరు: రూ.17.83లక్షలు ►కర్ణాటక+ ROI: రూ.20.32లక్షలు ►ఓవర్సీస్: 1.74 కోట్లు ►మొత్తం : 7.1 కోట్లు Audience Love for CULT BLOCKBUSTER #BabyTheMovie has grossed a whopping 7.1CR Worldwide on DAY 1 💥 Book your tickets today 👇 🎟️ https://t.co/IUpZAiAOvH#CultBlockbusterBaby pic.twitter.com/YCU7ygrT32 — GSK Media (@GskMedia_PR) July 15, 2023 -
ఆదిపురుష్ కథ ముగిసినట్టే
-
దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
కంటెంట్ నచ్చితే డబ్బింగ్ సినిమానా, రీమేక్ చిత్రమా అని చూడకుండా థియేటర్స్కి బారులు తీస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో ఇతర భాష చిత్రాలు ఎక్కువగా డబ్ అవుతుంటాయి. తాజాగా తెలుగులో విడుదలైన మలయాళ సూపర్ హిట్ ‘2018’ చిత్రానికి కూడా టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటిరోజు 1 కోట్లు వసూలు చేసింది. (చదవండి: 2018 మూవీ రివ్యూ) కేవలం మౌత్ టాక్ ఈ సినిమా రెండో రోజు 1.7 గ్రాస్ ను సాధించింది. మొదటి రోజు కంటే రెండవరోజు కలక్షన్స్ పెరగడం అతి తక్కువ సినిమాలకు జరుగుతుంది. 2018 సినిమాకి అమాంతం 70 కలక్షన్స్ పెరగడం శుభసూచకం. తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాను ఆదరిస్తారు అని నమ్మిన ప్రముఖ నిర్మాత బన్నీవాసు నమ్మకం మరోసారి రుజువైంది. ఈ రెండు రోజులు గాను ఈ సినిమా మొత్తం కలక్షన్స్ 2.7 కోట్ల గ్రాస్ పైగా ఉంది. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. -
Custody Box Office Collection: ‘కస్టడీ’కి ఊహించని కలెక్షన్స్, ఎంతంటే..
నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ‘బంగార్రాజు’ తర్వాత కృతి శెట్టి మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తుంది. పవన్ కుమార్ సమర్పణలో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు. (చదవండి: కస్టడీ మూవీ రివ్యూ) భారీ అంచనాల మధ్య శుక్రవారం(మే12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. ఫలితంగా తొలి రోజు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. (చదవండి: రాజకీయాల్లోకి రీఎంట్రీ? కన్ఫర్మ్ చేసిన బండ్ల గణేశ్ ) ట్రేడ్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలిరోజు దాదాపు రూ.4 కోట్లను మాత్రమే వసూలు చేసింది. ఆంధ్ర తెలంగాణలో రూ.2.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.22.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.23.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. -
‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటెట్ మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి ‘అయ్యగారి’కి పక్కా హిట్ వస్తుందని అక్కినేని అభిమానులు ఆశపడ్డారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. తొలిరోజు ఈ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు తక్కువ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం ఫస్ట్డే ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 7 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. అందులో తెలుగు రాష్ట్రాలలోనే రూ.4 కోట్లు వసూలు చేయడం గమనార్హం. (చదవండి: కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని) ఇక ప్రాంతాల వారిగా చూస్తే నైజాంలో 1.33 కోట్లు, సీడెడ్ - రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్ర - రూ. 54 లక్షలు, ఈస్ట్ - రూ. 29 లక్షలు, వెస్ట్ - రూ. 30 లక్షలు, గుంటూరు - రూ. 52 లక్షలు, కృష్ణా - రూ. 22 లక్షలు, నెల్లూరు - రూ. 16 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.అఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్(సుమార్ రూ.80 కోట్లు)తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వైడ్గా రు. 37 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు. 38 కోట్ల షేర్ వస్తేనే అఖిల్ బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కుతాడు. (చదవండి: బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..) కానీ తొలి రోజే ఇంత తక్కువ వసూళ్లను రాబట్టిందంటే.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే అఫీషియల్గా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు రాకపోయినా, ఈ రిపోర్ట్స్ చూస్తే మాత్రం నిజంగానే అఖిల్ కెరీర్లో ఏజెంట్ అతిపెద్ద డిజాస్టర్గా కాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ కాగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. -
బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం గతేడాదిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక నిన్న (ఏప్రిల్28) రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైంది. ఈ చిత్రానికి ఫస్ట్డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వినిపించింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. (చదవండి: పొన్నియన్ సెల్వన్ 2 మూవీ రివ్యూ) వీటిలో ఒక్క తమిళనాడులోనే రూ.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. కేరళలో రూ.2.8 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.80 కోట్లు, కర్ణాటకలో రూ.4.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.55 కోట్లు, ఓవర్సీస్లో రూ.24.70 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఈ చిత్రం మొత్తంగా రూ.170 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.172 కోట్లు సాధించాలి. తొలి రోజే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో వీకెండ్లోగా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: నాటు నాటు నా టాప్ సాంగ్స్ లిస్టులోనే లేదు: కీరవాణి షాకింగ్ కామెంట్స్) మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. -
ఫుల్ ఖుషీలో సుకుమార్...
-
సినిమా అట్టర్ ప్లాప్.. కలెక్షన్ మాత్రం బీభత్సం
-
కాకి సెంటిమెంట్ తో వండర్స్ క్రీయేట్ చేస్తున్న విరూపాక్ష కలెక్షన్
-
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విరూపాక్ష’.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
చాలా కాలం తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడింది. యాక్సిడెంట్ తర్వాత ఆయన నటించిన ‘విరూపాక్ష’ మూవీ ఈ నెల 21న విడుదలై హిట్ టాక్తో దూసుకెళ్తోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రూ.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు అంతకంటే ఎక్కువగా రూ5.80 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్ల షేర్, రూ. 24.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని దక్కించుకుంది. ఈ మూవీకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 23 కోట్లను వసూలు చేయాలి. రెండు రోజుల్లో రూ.13.65 కోట్లు సాధించింది. అంటే రూ. 9.35 కోట్ల 5 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మూవీకి వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. మరో రెండు రోజుల్లో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాంధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి సాయి తేజ్ రీఎంట్రీతోనే బిగ్ కొట్టాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: 20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!) ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ప్లే అందించగా.. ఆయన శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వం వహించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. సాయితేజ్కి జోడిగా సంయుక్త మీనన్ నటించగా.. రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషించారు. -
‘శాకుంతలం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్.. భరతుడిగా అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ నటించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం (ఏప్రిల్ 14)విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. వీఎఫ్ఎక్స్ విషయంలో ఆడియన్స్ నిరాశకు గురయ్యారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం ఊహించినదానికంటే చాలా తక్కువ కలెక్షన్స్ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ. 4.70 కోట్ల గ్రాస్, రూ. 2.24 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో రూ.2 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. (చదవండి: ‘శాకుంతలం’ మూవీ రివ్యూ) ఏరియా వైజ్గా చూస్తే.. నైజాంలో రూ. 52 లక్షలు, సీడెడ్ రూ.10 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ.8లక్షలు, వెస్ట్ గోదావరి రూ.4 లక్షలు, గుంటూరు రూ. 8 లక్షలు, కృష్ణ రూ. 8లక్షలు, నెల్లూరు రూ. 3లక్షలు చొప్పున వసూళ్లను రాబట్టింది. తమిళ్, కర్ణాటక, ఇతల ప్రాంతాలలో కలిసి రూ. 42 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల వెల్లడిస్తున్నాయి. ఈ వీకెండ్లో కలెక్షన్స్ కాస్త పెరిగే అవకాశం ఉంది. రూ. 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తుంది. రూ.19 కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సినిమాకు ఫస్ట్ డే రూ 2.24 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చింది. అంటే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే.. ఇంకా రూ. 16.76 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా అనుకున్న టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి. -
రూ.100 కోట్ల క్లబ్లోకి ‘దసరా’.. టీమ్ మెంబర్స్కు గోల్డ్ కాయిన్స్!
నేనురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’. శ్రీరామనవమి సంద్భంగా మార్చి 30న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కించన ఈ చిత్రంలో నాని ఊరమాస్ లుక్లో అదరగొట్టేశాడు. ఫలితంగా తొలి రోజే రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిసింది. రెండు రోజుల్లోన్లే రూ. 50 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. ఈజీగా వంద కోట్ల క్లబ్లోకి చేరుతుందని అంతా భావించారు. అనుకున్నట్లే దసరా సినిమా కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. మార్చి 30న ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఏప్రిల్ 5 నాటికి దసరా సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నాని కెరీర్లో రూ. 100 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రంగా ‘దసరా’ నిలిచింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. శ్రీకాంత్కు కి బీఎండబ్ల్యూ కారు ఇక దసరా విజయం చూసి నిర్మాత చెరుకూరి సుధాకర్ మురిసిపోతున్నాడు. వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్బులోకి చేరడంతో.. తెగ ఆనందపడిపోతున్న నిర్మాత.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్గా ఇచ్చాడు.అలాగే ఈ మూవీ కోసం పనిచేసిన కీ మెంబర్స్ అందరికీ తలో 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ కూడా బహుమతిగా అందజేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Our effort. Your gift 🙏🏼 Cinema wins ♥️#Dasara pic.twitter.com/Rn0VR6nFkL — Nani (@NameisNani) April 5, 2023 -
‘దసరా’కు దిమ్మతిరిగే కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎంతంటే?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తోంది. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం..తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఊరమాస్ నటనతో అదరగొట్టేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాని, కీర్తి సురేశ్ నటనతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: ‘దసరా’మూవీ రివ్యూ) ఫలితంగా కలెక్షన్స్ పరంగా ‘దసరా’ దూసుకెళ్తోంది. తొలి రోజే రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.15 కోట్ల కలెక్షన్స్ని రాబట్టి సత్తా చాటింది. మొత్తం రెండు రోజుల్లో దాదాపు రూ.53 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. నైజాం ఏరియాలో ఈ సినిమా రూ. 10.25 కోట్లకు పైగా వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్లోనూ ‘దసరా’దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో అక్కడ 1.2 మిలియన్ డాలర్లను వసూలు చేసి నాని ఖతాలో నయా రికార్డును చేర్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కాబట్టి ఈ వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. #Dasara's MASS RAMPAGE at the Box Office ❤️🔥 53+ CRORES Gross Worldwide in 2 days 💥🔥 - https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbuster Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP @saregamasouth pic.twitter.com/xPi31ks9Ir — SLV Cinemas (@SLVCinemasOffl) April 1, 2023 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘బలగం’.. 9వ రోజు రికార్డు కలెక్షన్స్!
కంటెంట్ బాగుంటే.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు పట్టించుకోరని ‘బలగం’తో మరోసారి రుజువైంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఊహించని విజయాన్ని సాధించింది. తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని.. కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. ఈ వారం పెద్ద సినిమాలేవి లేకపోవడంతో థియేటర్స్ సంఖ్యని కూడా పెంచుకున్న ఈ సినిమా.. 9వ రోజు ఎవరూ ఊహించనవి విధంగా ఏకంగా రూ.1.77 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. 9 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా రూ.9.15 కోట్లను వసూళ్లు చేసి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 5.52 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3.63 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 9.15 కోట్లు గ్రాస్తో పాటు రూ. 4.02 కోట్లు షేర్ను వసూలు చేసి సత్తా చాటుకుంది. జబర్దస్త్ వేణు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవగా దిల్ రాజు నిర్మించాడు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్రామ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. -
‘పఠాన్’ కొత్త చరిత్ర.. ‘బాహుబలి’ రికార్డు బద్దలైంది
హిందీలో ‘బాహుబలి’ని దాటేశాడు ‘పఠాన్’. షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో రూపొందిన హిందీ చిత్రం ‘పఠాన్’. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న విడుదలైంది. ఇటీవల ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ను సాధించి, ఓ రికార్డును నమోదు చేసుకుంది. కాగా హిందీలో అత్యధిక నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించిన టాప్ ప్లేస్ (దాదాపు రూ. 510 నెట్ కలెక్షన్స్)లో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్క్లూజన్’ ఉండేది. ఈ రికార్డును ‘పఠాన్’ చిత్రం అధిగమించింది. ‘‘హిందీలో నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ‘బాహుబలి: ది కన్క్లూజన్’ రికార్డును అధిగమించిన షారుక్ ఖాన్, చిత్రదర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, యశ్రాజ్ సంస్థకు శుభాకాంక్షలు. రికార్డులు ఉన్నది బ్రేక్ కావడం కోసమే’’ అని ట్వీట్ చేశారు ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ. ‘బాహుబలి’లాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్. మేం మరింత కష్టపడటానికి ఆ సినిమా స్ఫూర్తిగా నిలిచింది’’ అని యశ్ రాజ్ సంస్థ ట్వీట్ చేసింది. Congratulations to @iamsrk sir, #SiddharthAnand @yrf and the entire team of #Pathaan on crossing @BaahubaliMovie 2 Hindi NBOC. Records are meant to be broken and I am happy it was none other than @iamsrk who did it! 😃 https://t.co/cUighGJmhu — Shobu Yarlagadda (@Shobu_) March 4, 2023 -
Mohanlal: వందల కోట్ల స్టార్ హీరోకి దారుణ పరిస్థితి!
మాలీవుడ్ స్టార్ హీరోల్లో మోహన్లాల్ ఒకరు. ఆరు పదుల వయస్సులో కూడా కుర్ర హీరోలు సైతం షాక్ అయ్యేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అక్కడ లాల్ నటించిన చిత్రాలను టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాం. అయితే ఇదంత కాయిన్కి ఒకవైపే. మరోవైపు మాలీవుడ్లో మోహన్లాల్ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు లాల్ సినిమా అంటే వంద కోట్ల కలెక్షన్స్.. కాని ఇప్పుడు కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ కూడా దాటడం లేదు. రెండేళ్ల క్రితం వరకు మోహన్లాల్ మాలీవుడ్ బాక్సాఫీస్ను శాసిస్తూ వచ్చాడు. పులి మురుగన్ సినిమాతో మాలీవుడ్కు రూ.100 కోట్లు, లూసీఫర్ తో రూ.150 కోట్ల వసూళ్లను చూపించాడు. అయితే కరోనా తర్వాత మోహన్లాల్కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ స్టార్ హీరో గతేడాది మాన్స్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన అలోన్ (Alone) సినిమాకు అయితే తొలి రోజే గెటివ్ టాక్ రావడం అభిమానులను షాక్కు గురిచేసింది. అసలు ఇలాంటి కథను మోహన్లాల్ లాంటి స్టార్ హీరో ఎలా అంగీకరించారంటూ కొంత మంది విమర్శకులు కామెంట్ చేశారు. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు వసూళ్లు రూ.40 లక్షలు కూడా దాటలేదు. దీంతో లాల్ ఫ్యూచర్పై మాలీవుడ్లో టెన్షన్ మొదలైంది. కానీ ఈ బిగ్స్టార్ త్వరలోనే స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్లాల్ చేతిలో లూసీఫర్ 2, దృశ్యం3 చిత్రాలు ఉన్నాయి. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
బాక్సాఫీస్పై ‘వీరయ్య’ వీరంగం.. 9 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
జనవరి 15న సంక్రాంతి పండగ అయిపోయింది. కాని మెగాస్టార్ చిరంజీవి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ సంబరాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. పూనకాలు కూడా కొనసాగుతున్నాయి. జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చాడు వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన చిత్రం కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే కలెక్షన్స్ని రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి పండక్కి బాస్ వస్తే బాక్సాఫీస్ పీస్ పీస్ అవుతుందని ఈ చిత్రం ద్వారా మరో సారి ప్రూవ్ అయింది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిన వీరయ్య... తొమ్మిది రోజుల్లో రూ.182 కోట్ల గ్రాస్(106 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వారిగా పరిశీలిస్తే.. నైజాంలో రూ.28.87కోట్లు, సీడెడ్లో రూ.15.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.13.24 కోట్లు, గుంటూరు రూ.6.72 కోట్లు, కృష్ణ రూ.6.47 కోట్లు, నెల్లూరులో రూ.3.38 కోట్లతో షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో సైతం వాల్తేరు వీరయ్య మేనియా కనిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ఏలో చిరు జోరు కొనసాగుతోంది. అక్కడ కూడా వాల్తేరు వీరయ్య 2 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ కు బ్లాక్ బస్టర్ పడితే అనకాపల్లి టు అమెరికా పూనకాలు కామన్ అనే విషయాన్ని మరోసారి నిజం చేసింది. -
బాక్సాఫీస్పై ‘ధమాకా’ మోత..రూ.50 కోట్ల మార్క్ దిశగా పరుగులు!
మాస్ మహారాజా ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 23ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్.. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తొలి రోజే రూ.10 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో మొత్తం రూ.49 కోట్ల కలెక్షన్స్ రాబట్టి క్రాక్ తర్వా త మళ్లీ ఆ రేంజ్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఇదే ఊపు కొనసాగితే ఈ వారాంతలో వంద కోట్ల గ్రాస్ మార్కును కూడా టచ్ అయ్య చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల చెబుతున్నాయి. ఈ సినిమాకు మాస్తో పాటు క్లాస్ సెంటర్స్లోనూ మంచి స్పందన రావడం విశేషం. మాస్ మహారాజా రవి తేజ డబల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్ప్లే-మాటలు అందించారు. MassMaharaja @RaviTeja_offl 's MASSive 5️⃣ Days BoxOffice Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka Book your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/7xAKb4X78o — People Media Factory (@peoplemediafcy) December 28, 2022 -
18 Pages Box Office Collection: ‘18 పేజెస్’ ఫస్ట్ కలెక్షన్స్ ఎంతంటే..
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రెండో చిత్రం ‘18 పేజెస్’. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించాడు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం..ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.3.45 కోట్ల(రూ.1.75 షేర్) కలెక్షన్స్ రాబట్టింది. అత్యధికంగా నిజాంలో రూ.1.05 కోట్లు, సీడెడ్లో రూ.0.25 కోట్లు, ఆంధ్రాలో రూ.1.05 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.12.50 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజు రూ.1.75 కోట్లు మాత్రమే సాధించింది. ఇంకో రూ.10.75 కోట్ల కలెక్షన్స్ రాబడితే ఈ చిత్రం సేఫ్ జోన్లోకి వెళ్తుంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ డేస్లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని, బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సీనీ వర్గాలు చెబుతున్నాయి. -
బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న ‘ధమాకా’.. ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
మాస్ మహారాజా హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ శుక్రవారం(డిసెంబర్ 23) ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలిరోజే మంచి టాక్ని సంపాదించుకుంది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్.. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. రొటీన్ కథే అయినప్పటికీ.. రవితేజ నుంచి ఫాన్స్ ఏం ఆశిస్తారో అవన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు త్రినాధ రావు నక్కిన. అందుకే ఈ సినిమా తొలి రోజు ఈ సినిమా భారీ కలెక్షన్స్ని రాబట్టింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. (చదవండి: ధమాకా మూవీ రివ్యూ) ఈ సినిమా మాస్తో పాటు క్లాస్ సెంటర్స్లోనూ అనూహ్యంగా బిజినెస్ చేసింది. నైజాంతో సహా చాలా సెంటర్లలో రవితేజకి ధమాకా బిగ్గెస్ట్ డే వన్ గ్రాసర్గా నిలిచింది. నైజాంలో రూ.2.10 కోట్లు, సీడెడ్లో రూ.72 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.56 లక్షలు, ఈస్ట్ రూ.24 లక్షలు, వెస్ట్ 26 లక్షలు, గుంటూరు రూ.40 లక్షలు, కృష్ణాలో రూ.25 లక్షల చొప్పున వసూలు చేసింది. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రానికి మంచి ఓపెన్సింగ్ వచ్చాయి. క్రిస్మస్ సెలవులు ఉండడంతో ఈ వీకెండ్ కలెక్షన్లు భారీగాపెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. MassMaharaja @RaviTeja_offl 's MASSive Box Office Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka Book your tickets nowhttps://t.co/iZ40p9utmY#DhamakaFromDec23@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/pr8bQO2z2R — People Media Factory (@peoplemediafcy) December 24, 2022 -
మరో మలయాళ సంచలనం..రూ.6 కోట్లతో తీస్తే.. రూ.42 కోట్ల కలెక్షన్స్!
సీనీ ప్రేక్షకులు ఆలోచన మారింది. ఒకప్పుడు స్టార్ హీరోహీరోయిన్ ఉంటే చాలు.. ఎలాంటి సినిమానైనా ఆదరించేవాళ్లు. తమ అభిమాన హీరో అయితే.. సినిమా బాలేకపోయినా థియేటర్స్కి వెళ్లి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు వారి ఆలోచనలో మార్పు వచ్చింది. మంచి కంటెంట్ ఉంటే చాలు.. హీరో హీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్కి వెళ్తున్నారు. దానికి మంచి ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘కాంతర’ చిత్రమే. ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి పెద్ద స్టార్ హీరో ఏం కాదు. కానీ ఆయన సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆడింది. ఊహించని కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. తాజాగా మలయాళ చిత్రం ‘జయ జయ జయహే’ కూడా అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంది. పేరున్న నటీనటులేవరు అందులో లేకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. మలయాళంలో చిన్న సినిమాగా అక్టోబర్ 28న విడుదలైన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.42 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది. బేసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను కేవలం 42 రోజుల్లోనే తీయడం మరో విశేషం. ‘జయ జయ జయహే’ కథేంటంటే.. జయ భారతి(దర్శన రాజేంద్రన్) మధ్య తరగతికి చెందిన తెలివైన అమ్మాయి. స్వతంత్ర భావజాలం కలిగిన అమ్మాయి. ఆమె చదువు పూర్తి కాకముందే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు. పెళ్లి తర్వాత కూడా తాను చదువుకుంటానని, తన నిర్ణయాన్ని అంగీకరించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని చెబుతుంది. జయ నిర్ణయాన్ని అంగీకరించడంతో పౌల్ట్రీ యజమాని రాజేష్(బేసిల్ జోసెఫ్)తో పెళ్లి జరుగుతుంది. పెళ్ళి తర్వాత రాజేష్ జయ చదువు వాయిదా వేస్తూ ఇంట్లో జరిగే ప్రతిదీ తన ఇష్ట ప్రకారమే జరగాలని మొండిగా ఉంటాడు. ఆ తర్వాత జయను శారీరకంగా కూడా హింసిస్తాడు. అది సర్వ సాధారణ వ్యవహారంగా మారటంతో జయ తల్లిదండ్రుల మద్దతు కోరుతుంది. కానీ వారు సర్దుకుపొమ్మని చెబుతారు. తనకు సాయం చేసేందుకు ఎవరూ రారన్న నిజాన్ని గ్రహించి తదనుగుణంగా చర్యలు తీసుకుని తన కష్టాలకు ఎలా ముగింపు పలికింది అనేది మిగతా కథ. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. -
‘యశోద’ ఫస్ట్డే కలెక్షన్స్ .. సమంత క్రేజ్ మాములుగా లేదుగా!
స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం(నవంబర్ 11) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మంచి స్పందన లభించింది. సరోగసీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత పోరాట ఘట్టాలు ప్రేక్షలను మెప్పించాయి. టీజర్, ట్రైలర్కు భారీ స్పందన లభించడంతో తొలిరోజు భారీ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. ఫలితంగా ఫస్ట్డే ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. (చదవండి: ‘యశోద’ మూవీ రివ్యూ) ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం యశోద చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగారూ. 3.25 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల విషయానికొసే.. నైజాంలో రూ.84 లక్షలు, సీడెడ్లో రూ.18 లక్షలు, ఆంధ్రాలో రూ.63 లక్షలు వసూలు చేసింది. ఇక ఇతర ప్రాంతాల విషయానికొస్తే.. తమిళనాడులో రూ.14 లక్షలు, మలయాళంలో రూ.10 లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో కలిసి రూ.20 లక్షల వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్లో రూ.84 లక్షలు కలుపుకుంటే ఈ చిత్రం మొత్తంగా రూ.3.25 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇది సమంత క్రేజ్కి ఎక్కువనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకు సైతం తొలి రోజు ఈ స్థాయి కలెక్షన్స్ రావడంలేదు. ఆ విషయంలో సమంత సక్సెస్ సాధించనట్లే. కానీ యశోదకు అయిన బిజినెస్ దృష్ట్యా ఈ వసూళ్లు తక్కువని ఈ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యశోద చిత్రానికి రూ.21 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.22.5కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. తొలి రోజు రూ.3.25 కోట్లు రాబట్టడంతో ఈ సినిమా ఇంకా రూ.19.25ట్లు వసూళ్లు చేయాల్సి ఉంటుంది. -
టాలీవుడ్లో దూసుకెళ్తున్న ‘కాంతార’.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..
‘కేజీయఫ్’తర్వాత కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తున్నాయి. శాండిల్ వుడ్ చిత్రాలపై యావత్ భారత్ సీనీ ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అందుకే కన్నడ మేకర్స్ పాన్ ఇండియా స్థాయి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం కన్నడ ప్రేక్షకుల కోసమే రూపొందిస్తుంటే.. అవి కూడా మిగతా భాషల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా చిన్న చిత్రాలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన తాజా కన్నడ చిత్రం ‘కాంతార’.ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. (చదవండి: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘కాంతర’ బడ్జెట్ ఎంతో తెలుసా..?) తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. శనివారం(అక్టోబర్ 15)టాలీవుడ్లో రిలీజైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఒక్క రోజే రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి తెలుగులో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.114 కోట్ల షేర్ వసూళ్లని రాబట్టి రికార్డుని సృష్టించింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ నిర్మించారు. -
బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘కాంతార’ బడ్జెట్ ఎంతో తెలుసా?
చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఆక్కడ ప్రభంజనం సృష్టించింది. కేవలం 15 రోజుల్లోనే ఒక్క కన్నడలోనే రూ.92 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్ వుడ్లో కేజీయఫ్2 తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘కాంతారా’నే. ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 15 రోజుల్లో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: కాంతార మూవీ రివ్యూ) అంతటి సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారావిడుదల చేశారు. శనివారం(అక్టోబర్ 15)టాలీవుడ్లో రిలీజైన ఈ చిత్రం.. మంచి ఓపెనింగ్స్ని సాధించింది. ఈ సినిమా తెలుగు హక్కులు కేవలం రూ.2 కోట్లకు అమ్ముడు పోయాయి. అయితే తొలిరోజే హిట్ టాక్ రావడంతో రూ. కోటీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హీరో,హీరోయిన్లు ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. కానీ కేవలం కథ మాత్రమే ఆడియన్స్ని థియేటర్స్కి రప్పిస్తుంది. అయితే ఈ సినిమాను థియేటర్స్లో చూస్తే భారీ బడ్జెట్తో నిర్మించినట్లు కనిపిస్తుంది. కానీ ఈ సినిమా మేకింగ్కి అయిన ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వందల కోట్లు కొల్లగొడుతున్న ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి కేవలం రూ.16 కోట్ల బడ్జెట్తోనే తెరకెక్కించారట. ఈ లెక్కన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి వచ్చిన హిట్ టాక్ చూస్తే.. కేవలం తెలుగులోనే బడ్జెట్కి పెట్టిన రూ.16 కోట్లు ఈజీగా వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. -
బాక్సాఫీస్పై ‘గాడ్ ఫాదర్’ దండయాత్ర.. రెండో రోజూ భారీ కలెక్షన్స్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్ ఇది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి రేంజ్కి తగ్గ సినిమా రావడంతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ‘గాడ్ ఫాదర్’పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.38 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించిన ‘గాడ్ ఫాదర్’.. రెండో రోజు కూడా అదే దూకుడు ప్రదర్శించింది. రెండో రోజు వరల్డ్ వైడ్గా రూ.31 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాకు తొలి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడం సహజమే. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ డేతో పోలిస్తే సెకండ్ డే 20 నుంచి 30 శాతం వసూళ్లు పడిపోతాయి. కానీ గాడ్ ఫాదర్ విషయంలో అలా జరగలేదు. రెండో రోజు కూడా భారీ వసూళ్లును సాధించి రికార్డు సాధించింది. రెండు రోజుల్లో మొత్తం రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సినిమాకు హిట్ టాక్ రావడం, దసరా సెలవులు కొనసాగుతుండడంతో వీకెండ్లోగా ఈ సినిమా ఈజీగా రూ.100 కోట్ల మార్క్ను దాటేస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. -
రూ.100 కోట్ల క్లబ్లోకి ‘పొన్నియన్ సెల్వన్’.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్రాజ్, శరత్కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచన సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన లభించగా, తమిళనాట మాత్రం హిట్ టాక్ వచ్చింది. దీంతో అక్కడ ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ రూ.100 కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు పెడుతోంది. విడుదలైన రెండు రోజులకే ఒక్క తమిళనాడులోనే రూ.47 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కేరళలో రూ.6 కోట్లు, ఓవర్సీస్లో దాదాపు 60 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రం దాదాపు రూ.147 కోట్ల గ్రాస్, రూ.75 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళనాడుతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్డే కలెక్షన్స్.. టాలీవుడ్లో సరికొత్త రికార్డు
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారూక్ ఖాన్ మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరోలు నటించడంతో తొలి రోజు మాత్రం రికార్డు స్థాయిలో వసూళ్ల రాబట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాత కరణ్ జోహర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. హాలీడే కాకపోయినప్పటికీ ఇండియా వైడ్గా రూ. 35-38 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్లో కూడా మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 6.7 కోట్లు గ్రాస్(రూ.3.7 కోట్ల షేర్) వసూళ్లను సాధించింది. తెలుగులోకి అనువాదమైన బాలీవుడ్ చిత్రాల్లో ఇది సరికొత్త రికార్డు. అంతకు ముందు ఆమిర్ ధూమ్ 3 చిత్రం రూ.4.7 కోట్లు సాధించింది. ఆ రికార్డుని బ్రహ్మాస్త్ర బద్దలు కొట్టింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్(హిందీ, తెలుగు వెర్షన్లతో కలిపి) జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. Humbled…grateful…yet can’t control my excitement! Thank you♥️ #Brahmastra pic.twitter.com/00pl9PGO5K — Karan Johar (@karanjohar) September 10, 2022 -
Laal Singh Chaddha: సినిమా అట్టర్ ఫ్లాప్.. కలెక్షన్స్లో రికార్డు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్సింగ్ చడ్డా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్గా వచ్చిన ఈ చిత్రంపై బాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది. వరుసగా డిజాస్టర్లతో సతమతమవుతున్న బాలీవుడ్ బాక్సాఫీస్కు ఊపిరి అందిస్తుందని భావించారు. కానీ ఆగస్ట్ 11న విడుదలైన ఈచిత్రం భారీ డిజాస్టర్గా నిలిచింది. ఆమిర్ ఖాన్ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇండియాలో దాదాపు రూ.60 కోట్లను మాత్రమే వసూలు చేసి ఆమిర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. (చదవండి: తారక్ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు) అయితే విదేశాల్లో మాత్రం ‘లాల్సింగ్’ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా ‘లాల్సింగ్ చడ్డా’ నిలిచింది. ఓవర్సీస్లో 7.5 మిలియన్ల డాలర్స్ కలెక్ట్ చేసి గంగూబాయి కతియావాడి (7.47 మిలియన్స్ డాలర్స్), భూల్ భూలయ్య 2(5.88 మిలియన్స్ డాలర్స్) పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.126 కోట్లను వసూలు చేసింది. అద్వెత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. -
‘కార్తికేయ 2’ సంచలనం.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
చిన్న సినిమా వచ్చి పెద్ద విజయం అందుకున్న చిత్రం ‘కార్తికేయ 2’. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 15.44 కోట్ల షేర్(26.50 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.11.54 కోట్ల షేర్, 17.80 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజుకి థియేటర్స్ సంఖ్య పెరుగుతుంది. దీంతో ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరుసగా.. 3.50 కోట్లు, 3.81 కోట్లు, 4.23 కోట్లు సాధించి, నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. (చదవండి: గుడ్న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్, బేబీ బంప్తో సర్ప్రైజ్) సిని విశ్లేషకుల సమాచారం ప్రకారం... కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.13.30కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. మూడు రోజుల్లోనే ఆ మార్క్ని దాటేసి లాభాల బాట పట్టింది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో ఈ వీకెండ్ వరకు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్తికేయ2 మూడు రోజుల కలెక్షన్స్(ఏరియాల వారిగా) ► నైజాం -రూ.4.06 కోట్లు ► సీడెడ్ - రూ.1.83 కోట్లు ► ఈస్ట్ - రూ.99లక్షలు ► వెస్ట్ - రూ. 73 లక్షలు ► ఉత్తరాంధ్ర -రూ. 1.51 కోట్లు ► గుంటూరు- రూ. 1.14 కోట్లు ► కృష్ణా - రూ. 87 లక్షలు ► నెల్లూరు - రూ.41 లక్షలు ►కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ. 70 లక్షలు ►ఓవర్సీస్- రూ.2.60 కోట్లు ►నార్త్ ఇండియా-రూ.60లక్షలు ►మొత్తం రూ.15.44 కోట్లు(26.50 కోట్లు గ్రాస్) -
బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ‘కార్తికేయ 2’ .. ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్టాక్ సంపాదించుకుంది. (చదవండి: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ) దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్స్ లభించనప్పటికీ.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.50 కోట్ల గ్రాస్, రూ.5.05 కోట్ల షేర్ వసూళ్లని రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.5.30 కోట్ల గ్రాస్, రూ.3.50 కోట్ల షేర్ కలెక్షన్స్ని రాబట్టి.. నిఖిల్ కెరీర్లోనే ఫస్ట్డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘కార్తికేయ2’ నిలిచింది. నిఖిల్ గత ఐదు సినిమాల తొలిరోజు వసూళ్లని పరిశీలిస్తే.. అర్జున్ సురవరం రూ.1.38 కోట్లు, కిర్రాక్ పార్టీ రూ.1.65 కోట్లు, కేశవా రూ.1.58 కోట్లు, ఎక్కడికి పోతావు చిన్నవాడా రూ.1.25 కోట్ల షేర్స్ అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ2 తొలిరోజు కలెక్షన్స్(ఏరియాల వారిగా) ► నైజాం - రూ.1.24 కోట్లు ► సీడెడ్ -రూ.40 లక్షలు ► ఈస్ట్ - రూ.33 లక్షలు ► వెస్ట్ - రూ.20 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.45లక్షలు ► గుంటూరు- రూ.44 లక్షలు ► కృష్ణా - రూ.27 లక్షలు ► నెల్లూరు - రూ.17 లక్షలు ► మెత్తం రూ. రూ.3.50 కోట్లు(షేర్) సిని విశ్లేషకుల సమాచారం ప్రకారం... కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాసం ఉండాలి. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మళ్లీ అదే మోసం.. ఆశలన్నీ ‘లైగర్’పైనే
బాలీవుడ్కు వరుసగా షాక్స్ తగులుతూనే ఉన్నాయి. అక్కడి హీరోలు వరుస పెట్టి ఉత్తరాది ఆడియెన్స్ కు షాక్స్ ఇస్తూనే ఉన్నారు. యంగ్ హీరోలు సరేసరి కనీసం స్టార్ హీరోలైనా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తారు అంటే ఆమిర్ ఖాన్ లాంటి హీరో కూడా మోసం చేసేసాడు.మొత్తంగా నార్త్ సైడ్ ఫిల్మ్ బిజినెస్ ఇప్పట్లో గాడిన పడే అవకాశాలే కనిపించడం లేదు. (చదవండి: కావాలనే టార్గెట్ చేశారు.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి: కరీనా కపూర్) కొన్నేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను శాసిస్తున్న హీరోలు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్. ఇండిపెన్డెన్స్ డే వీకెండ్ కావడంతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 11న ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చెడ్డా’గా వస్తే, అక్షయ్ ఏమో ‘రక్షా బంధన్’ అంటూ సెంటిమెంట్ మూవీ తీసుకొచ్చాడు. ఇద్దరు స్టార్ హీరో పూర్తిగా పడిపోయిన బాలీవుడ్ బిజినెస్ ను నిలబెడతారని అందరూ అనుకున్నారు. కానీ వీరిద్దరు తీసుకొచ్చిన సినిమాలు ఉత్తరాది వారికి అస్సలు నచ్చలేదు. దాంతో తొలి రోజు వసూళ్లు దారుణంగా వచ్చాయి. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా తొలి రోజు ఇండియా వరకు చూసుకుంటే 12 కోట్లు అట. మొత్తంగా శనివారం వరకు అంటే మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 27.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తొలి రోజు వసూళ్లు 8 కోట్లు దాటాయట. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 21.60 కోట్లు వసూలు చేసిందట. మొత్తంగా ఇద్దరు స్టార్ హీరోలు కలసి వచ్చినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు పట్టుమని 20 కోట్లు దాటించలేకపోయారు. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ ఈ రేంజ్ లో డిజప్పాయింట్ చేస్తాడని బీటౌన్ అస్సలు ఊహించలేదు. (చదవండి: ‘లాల్సింగ్ చడ్డా’ మూవీ రివ్యూ) ఈ సిచ్యూవేషన్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఆదుకునేది ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ నుంచి వెళ్తున్న మరో పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ తప్పకుండా హిందీ మార్కెట్ కు కొంత లైఫ్ ఇస్తుందని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కరణ్ జోహర్ లాంటి పెద్ద నిర్మాత బ్యానర్ నుంచి మూవీ రిలీజ్ అవుతుండం, విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కు జనం ఎగబడుతుండటం చూస్తుంటే లైగర్ ఓపెనింగ్స్ వేరే లెవల్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకే లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ నిరాశపరిచినా లైగర్ వస్తున్నాడు కదా అనే కాన్ఫిడెన్స్ బీటౌన్ ఎగ్జిబీటర్స్ లో కనిపిస్తోంది. -
'పోకిరి' స్పెషల్ షో.. దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు
సూపర్ స్టార్ మహేశ్బాబు- మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పోకిరి. 2006లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. మహేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ చిత్రం. తాజాగా ఆగస్ట్9న మహేశ్ బాబు బర్త్డే సందర్భంగా మరోసారి థియేరట్స్లో పోకిరి చిత్రం సందడి చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల కోలాహాలం మధ్య ఈ సినిమాకి మరోసారి భారీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసింది. నైజాంలో రూ. 69 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 4లక్షలు ఇలా మొత్తంగా రూ. 1.5కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.స్పెషల్ షోస్కు ఈ రేంజ్లో వసూళ్లు రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. -
Sita Ramam: రెండో రోజు పుంజుకున్న‘సీతారామం’ కలెక్షన్స్.. ఎంతంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. (చదవండి: 'సీతారామం' ఫస్ట్ ఛాయిస్ పూజా హెగ్డేనే, కానీ ఏమైందంటే..) పోటీలో ఉన్న ‘బింబిసార’ ఉండటం.. ఆ చిత్రానికి కూడా హిట్ టాక్ రావడంతో తొలిరోజు ‘సీతారామం’ రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. అయితే రెండో మాత్రం ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండో రూ. 3.63 కోట్లు షేర్ వసూలు సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే ఇది రూ. 7.25 కోట్లు. మొత్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.6.68 కోట్ల షేర్, రూ.13.30 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టంది. ‘సీతారామం’ క్లాసిక్ లవ్ స్టోరీ కాబట్టి ఏ సెంటర్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది. బీ,సీ సెంటర్లో ‘బింబిసార’ జోరు వలన కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం కాస్త వెనకబడింది.అయితే ఇలాంటి క్లాసిక్ చిత్రాలకు కలెక్షన్స్ మెల్లి మెల్లిగాపెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి మొత్తంగా రూ.16.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.17 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ‘సీతారామం’ రెండు రోజుల కలెక్షన్స్.. ► నైజాం - రూ.1.39 కోట్లు ► సీడెడ్ - రూ.37 లక్షలు ► ఈస్ట్ - రూ.34 లక్షలు ► వెస్ట్ - రూ. 20 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.55లక్షలు ► గుంటూరు- రూ. 30 లక్షలు ► కృష్ణా - రూ.30 లక్షలు ► నెల్లూరు - రూ.13 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.35 లక్షలు ► ఇతర భాషలు రూ. 90 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.85 కోట్లు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ.6.68 కోట్లు(రూ.13.30 కోట్ల గ్రాస్) -
Bimbisara: రెండో రోజు అదే జోరు.. ఊహించని కలెక్షన్స్!
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ శుక్రవారం (ఆగస్ట్ 05) విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు రెండూ హిట్ టాక్తో దూసుకెళ్తున్నాయి. వీటిలో కలెక్షన్స్ పరంగా బింబిసార ఒకడుగు ముందు ఉంది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించారు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. (చదవండి: హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?) నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టగా.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగింది. రెండో రోజు ఈ చిత్రం రూ.4.52 కోట్లను రాబట్టింది. ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం రెండు రోజులకి రూ.12.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు రూ.3.63 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బింబిసార’ రెండు రోజుల కలెక్షన్స్.. ► నైజాం - రూ. 3.92 కోట్లు ► సీడెడ్ - రూ. 2.24 కోట్లు ► ఈస్ట్ - రూ. 70 లక్షలు ► వెస్ట్ - రూ.55 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.1.55 కోట్లు ► గుంటూరు- రూ.89 లక్షలు ► కృష్ణా - రూ.59 లక్షలు ► నెల్లూరు - రూ.38 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ. 0.50 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.05 కోట్లు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 12.37 కోట్లు(రూ.20 కోట్ల గ్రాస్) -
Sita Ramam Movie Box Office Collection: ‘సీతరామం’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. సీత, రామ్ల లవ్స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. (చదవండి: ‘సీతారామం’ మూవీ రివ్యూ) అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సీతారామం సినిమాకు రూ. 2.25 కోట్లు గ్రాస్(రూ.1.50 కోట్ల షేర్) కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 5.60 కోట్ల గ్రాస్, రూ. రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ‘సీతారామం’ క్లాసిక్ లవ్ స్టోరీ అవ్వడంతో ఏ సెంటర్ ఆడియన్స్ బాకా కనెక్ట్ అయినప్పటికీ.. బీ, సీ సెంటర్ ‘బింబిసార’ జోరు వలన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. అయితే ఇలాంటి చిత్రాలకు కలెక్షన్స్ మెల్లి మెల్లిగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సీతారామం’ చిత్రానికి మొత్తంగా రూ.16.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.17 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. తొలి రోజు రూ.3.05 కోట్లు వసూలు చేసింది. ఇంకా రూ.13.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రానికి వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సీతారామం’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.54 లక్షలు ► సీడెడ్ - రూ.16 లక్షలు ► ఈస్ట్ - రూ.15 లక్షలు ► వెస్ట్ - రూ.8లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.23 లక్షలు ► గుంటూరు- రూ.16లక్షలు ► కృష్ణా - రూ.13 లక్షలు ► నెల్లూరు - రూ. 5లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.15 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.05 కోట్లు ► ఇతర భాషలు రూ.35 లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. రూ.3.05 కోట్లు(రూ.5.60 గ్రాస్ వసూలు) -
Bimbisara Box Office Collection: బాక్సాఫీస్పై ‘బింబిసారుడి’ దాడి.. తొలి రోజు ఎంతంటే..
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. (చదవండి: 'బింబిసార' మూవీ రివ్యూ) దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.30 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది (చదవండి: బాక్సాఫీస్ కళ కళ.. సంతోషంలో స్టార్ హీరోలు..ట్వీట్స్ వైరల్) కల్యాణ్ రామ్ కెరీర్లో ఫస్ట్డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. కల్యాణ్ రామ్ గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే.. ఎంత మంచివాడవురా రూ.2.20 కోట్లు, 118 రూ.1.60 కోట్లు, నా నువ్వే రూ.0.75 కోట్లు, ఎంఎల్ఏ రూ. 2.72 కోట్లు, ఇజం 3.09 కోట్ల షేర్స్ అందుకున్నాయి. రూ.40 కోట్ల బడ్జెట్తో బింబిసార చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘బింబిసార’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.2.15 కోట్లు ► సీడెడ్ - రూ.1.29 కోట్లు ► ఈస్ట్ - రూ.43 లక్షలు ► వెస్ట్ - రూ.36 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.90 లక్షలు ► గుంటూరు- రూ.54 లక్షలు ► కృష్ణా - రూ. 34 లక్షలు ► నెల్లూరు - రూ.26 క్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.0.32 లక్షలు ► ఓవర్సీస్ రూ.65లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 7.27 కోట్ల షేర్ (రూ.11.50 కోట్ల గ్రాస్) -
‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫస్ట్డే కలెక్షన్స్.. రవితేజకు భారీ షాక్!
మాస్ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. యువ దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య జులై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మిశ్రమ స్పందన లభించింది.దీంతో ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. (చదవండి: ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కేవలం రూ.3.30 కోట్ల షేర్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో రూ.2.82 కోట్లను రాబట్టి..ఇటీవల కాలంలో రవితేజ కెరీర్లో ఫస్ట్డే అతి తక్కువ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. రవితేజ గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే... ఖిలాడీ రూ. 4.30 కోట్లు, క్రాక్ రూ. 6.25, డిస్కో రాజా రూ.2.54 అమర్ అక్బర్ ఆంటోని రూ. 3.40 కోట్ల షేర్స్ అందుకున్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.85 లక్షలు ► సీడెడ్ - రూ.52 లక్షలు ► ఈస్ట్ - రూ.31 లక్షలు ► వెస్ట్ - రూ.16 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.45 లక్షలు ► గుంటూరు- రూ.24 లక్షలు ► కృష్ణా - రూ.17 లక్షలు ► నెల్లూరు - రూ.12 లక్షలు ► రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ - రూ.58 లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 3.30 కోట్ల షేర్ -
‘థాంక్యూ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. చైతూ కెరీర్లోనే తొలిసారి ఇలా..
నాగచైతన్య, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. ‘మనం’లాంటి క్లాసిక్ హిట్ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది. అవికా గోర్, మాళవికా నాయర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. (చదవండి: ‘థాంక్యూ’ మూవీ రివ్యూ) భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ చిత్రం కేవలం రూ. 1.65 కోట్ల మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా రూ. 2.16 కోట్లు షేర్ కలెక్షన్స్ని రాబట్టింది. ఈ చిత్రం దాదాపు రూ.24 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అని పించుకోవాలంటే దాదాపు రూ. 25 కోట్ల వసూళ్లని రాబట్టాలి. కానీ తొలి రోజు కేవలం రూ.2.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇటీవల కాలంలో నాగచైతన్య నటించిన ఏ చిత్రానికి కూడా తొలి రోజు ఇంత తక్కువ కలెక్షన్స్ రాలేదు. తండ్రి నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు చిత్రం తొలి రోజు రూ.9.06 కోట్లు వసూలు చేస్తే.. సోలో హీరోగా నటించిన లవ్స్టోరీ రూ. 7.13 కోట్లు, మజిలీ 5.6 కోట్లు వసూలు చేసింది. ‘థ్యాంక్యూ’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ. 72 లక్షలు ► సీడెడ్ - రూ. 20 లక్షలు ► ఈస్ట్ - రూ. 14 లక్షలు ► వెస్ట్ - రూ. 8 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ. 22 లక్షలు ► గుంటూరు- రూ. 10 లక్షలు ► కృష్ణా - రూ. 12 లక్షలు ► నెల్లూరు - రూ. 7 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.6 లక్షలు ►ఓవర్సీస్- రూ. రూ.45 లక్షలు ►మొత్తం- 2.16 కోట్లు షేర్, రూ.3.70 కోట్లు గ్రాస్ -
F3: సమ్మర్ సోగ్గాళ్లకు 40 రోజులు పూర్తి.. ఎన్ని కోట్లు వసూలు చేశారంటే..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలై త్రిపుల్ బస్టర్గా నిలిచింది. వరుణ్, వెంకటేశ్ల కామెడీకి థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వారు. నేటితో ఈ చిత్రం 40 రోజులు పూర్తి చేసుకొని 50 రోజుల థియేట్రికల్ రన్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో 10 థియేటర్లపై పైగా విజయవంతంగా రన్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. (చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య) సమ్మర్ సోగాళ్లు అంటూ వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయించడమే కాకుండా... నిర్మాతలకు కాసుల వర్షాన్ని కూడా కురిపించింది. ఒక్క నైజాంలో ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 134 కోట్ల గ్రాస్, రూ.70.94 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. నిర్మాతల నిర్ణయం మేరకు దాదాపు 50 రోజుల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. జులై 22న ఈ చిత్రం సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం.. ఓటీటీ వేదికపై ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఎఫ్3 క్లోజింగ్ కలెక్షన్స్ ► నైజాం - రూ.20.57 కోట్లు ► సీడెడ్ -8.58 కోట్లు ► ఈస్ట్ - 4.18 కోట్లు ► వెస్ట్ -3.14 కోట్లు ► ఉత్తరాంధ్ర - 7.48 కోట్లు ► గుంటూరు- 4.18 కోట్లు ► కృష్ణా -3.23 కోట్లు ► నెల్లూరు - 2.31 కోట్లు ► రెస్టాఫ్ ఇండియా- 2 కోట్లు ► ఓవర్సీస్- రూ.10 కోట్లు ► ఏపీ/తెలంగాణ వాటా- రూ.53.94 కోట్లు ► మొత్తం రూ.134 కోట్లు(గ్రాస్),రూ.70.94 కోట్లు(షేర్) #F3Movie Continues the Glorious Run of 40 DAYS in Theatres! 🥳✨ Sticked to the word of not releasing in OTT until 8 weeks & Running Successfully! 👍🏻✅#F3TripleBlockbuster 🔥🤩@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official @adityamusic pic.twitter.com/ne28cInzNO — Sri Venkateswara Creations (@SVC_official) July 5, 2022 -
‘పక్కా కమర్షియల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. విలక్షణ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచాల మధ్య ఈ శుక్రవారం(జులై 1) విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. గోపిచంద్ యాక్షన్, రాశీఖన్నా గ్లామర్, మారుతి స్టైల్ కామెడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. (చదవండి: ‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ) ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు మొత్తంగా ఈ చిత్రం రూ.6.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. గోపీచంద్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా పక్కా కమర్షియల్ కావడం గమనార్హం. ఈ వారం పెద్ద సినిమాలేవి లేకపోడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #PakkaCommercial Mints 𝟔.𝟑 𝐂𝐑 𝐆𝐑𝐎𝐒𝐒 Worldwide on 𝐃𝐀𝐘 𝟏, Best opening day at Box-Office for 𝐌𝐀𝐂𝐇𝐎 𝐒𝐓𝐀𝐑 @YoursGopichand 🔥💥 Don't Miss the ACTION - FUN Entertainer on big screens!🤩 🎟️: https://t.co/BcOUgurfwK @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas pic.twitter.com/hFG2iRWf5F — GA2 Pictures (@GA2Official) July 2, 2022 -
బాక్సాఫీస్పై ‘మేజర్’ అటాక్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లా?
విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. హీరోగా చేసినవి తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ గుర్తింపును సంపాదించిపెట్టాయి. తాజాగా అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం మేజర్. 26\11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. తొలి రోజు నుంచి ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. (చదవండి: మేజర్ మూవీ రివ్యూ) తొలి రోజు ఈ చిత్రం రూ.7.12 కోట్ల షేర్, 13.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా.. రెండో రోజు అంతకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.24.5 కోట్ల గ్రాస్, రూ.13.48 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇది అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్. ఈ చిత్రానికి నార్త్లో కలెక్షన్స్ రెండో రోజు 50 శాతం పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ ఈ చిత్రం వసూలు రెండో రోజు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో త్వరలోనే 1 మిలియన్ క్లబ్బులో చేరేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..రూ.15 కోట్ల షేర్ రాబట్టాలి. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్గా నటించగా, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. #Major sees a huge 50% jump in Hindi circuits today (Day 2), compared to yesterday (Day 1).. Good content always prevails.. 👌 @AdiviSesh — Ramesh Bala (@rameshlaus) June 4, 2022 -
బాక్సాఫీస్పై ‘విక్రమ్’ దాడి.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘విక్రమ్’తో వెండితెరపై సందడి చేశాడు లోకనాయకుడు కమల్ హాసన్. ‘ఖైదీ’,‘మాస్టర్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది.యాక్షన్ సీన్స్లో కమల్ హాసన్ చూపించిన యాటీట్యూడ్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 67 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫైట్స్ సీన్స్ చేశాడు. కమల్ని ఫ్యాన్స్ తెరపై ఎలా చూడాలని కోరుకున్నారో అలా చూపించాడు. అందుకే ఈ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ.45 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఒక్క తమిళనాడులో రూ.20 కోట్లు వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో రూ.4.02 కోట్లు, ఏపీ, తెలంగాణలో రూ.3.70, కేరళలో రూ.5.20 కోట్లు, ఓవర్సీస్లో రూ.11.50 కోట్లను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ వారంతంలో ఈ చిత్రం ఈజీగా రూ.100 కోట్ల క్లబ్ చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. చదవండి: Vikram Telugu Movie Review: ‘విక్రమ్’ మూవీ రివ్యూ -
స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న ఆడియెన్స్
బాలీవుడ్ లో వింత ట్రెండ్ కొనసాగుతోంది. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న స్టార్స్ నటించిన మూవీస్ కు మినియం కలెక్షన్స్ ఉండటం లేదు.లేడీ సూపర్ స్టార్ కంగనా నటించిన భారీ బడ్జెట్ ఫిల్మ్ ధాకడ్ ఇటీవలే అక్కడ రిలీజైంది. సుమారు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఈ మూవీ పట్టుమని 3 కోట్లు రాబట్టుకులేకపోయింది.అన్నిటికంటే కంగనాకు పెద్ద అవమానం ఏంటంటే సినిమా రిలీజైన 8వ రోజున కేవలం 20 టికెట్లు అమ్ముడుపోవడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. జెర్సీ విషయంలో షాహిద్ కపూర్,జాయేష్ భాయ్ జోర్దార్ తో రణవీర్ సింగ్, ధాకడ్ తో కంగనా ఆడియెన్స్ నుంచి అవుట్ రైట్ రిజెక్షన్ ఎదుర్కొన్నారు. బాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ అనేక్ కూడా బాక్సాఫీస్ వద్ద 5 కోట్లు మార్క్ దాటేందుకు అష్టకష్టాలు పడుతోంది. థియేటర్స్ కు వచ్చిన సినిమాల సంగతి ఇలా ఉంటే థియేటర్ కు వచ్చేందుకు రెడీ అవుతున్న మరికొన్ని సినిమాలను ర్యాగింగ్ చేస్తున్నారు నెటిజన్స్. ఆమిర్ ఖాన్ నటించిన కొత్త చిత్రం లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ లో రిలీజ్ అవుతోంది. 2018లో తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ డిజాస్టర్ కావడంతో కొంత సమయం తీసుకుని ఆమిర్ ఈ చిత్రంతో తిరిగొస్తున్నాడు. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ అఫీసియల్ రీమేక్ లాల్ సింగ్ చెద్దా. తెలుగు నటుడు నాగ చైతన్య ముఖ్యపాత్రలో పోషించాడు. ప్రమోషన్స్ లో భాగం యూనిట్ ఇటీవలే ఐపీఎల్ ఫైనల్లో ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ పై కూడా బాలీవుడ్ లో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మూవీలో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ గతంలో వచ్చిన పీకే, ధూమ్ 3 చిత్రాల్లో కనిపించిన విధంగానే ఉందంటున్నారు నెటిజన్స్. అంతేకాదు ఈ మూవీ గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ దారిలోనే ఉందంటూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కు చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారు. -
F3 రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ మల్టీస్టారర్గా, అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ఎఫ్3. మే 27న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోష్ని కనబరిచింది. రెండో రోజు ఈ చిత్రం 9.85కోట్ల షేర్ రాబట్టింది. (చదవండి: ఎఫ్3 మూవీ రివ్యూ) ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండో రోజు రూ.8.4 కోట్లను వసూలు చేసింది. ఏపీ తెలంగాణలో ఇప్పటి వరకు రూ.18.77 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్లోనూ ఎఫ్3కి మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికాలో ఈ చిత్రం 750కే డాలర్లను రాబట్టింది. వారాంతంలో ఈ చిత్రం అక్కడ 1 మిలియన్ డాలర్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్డాలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్3 రెండు రోజుల కలెక్షన్స్: ► నైజాం - 8.16 కోట్లు ► సీడెడ్ - 2.38 కోట్లు ► ఈస్ట్ - 1.28 కోట్లు ► వెస్ట్ - 1.22 కోట్లు ► ఉత్తరాంధ్ర - 2.22 కోట్లు ► గుంటూరు- 1.42 కోట్లు ► కృష్ణా - 1.17 కోట్లు ► నెల్లూరు - 85 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- 1.20 కోట్లు ►ఓవర్సీస్-3.60 కోట్లు ►మొత్తం 23.50 కోట్లు(షేర్) -
ఎఫ్3కి ఫస్ట్డే ఊహించని కలెక్షన్స్... ఎంతంటే.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ హీరోలుగా నటించిన తాజా చిత్ర ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం(మే 27)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షోతోనే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. (చదవండి: ఎఫ్3 మూవీ రివ్యూ) తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 10.35 కోట్లు షేర్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెరికాలో ఈ చిత్రం 0.5మిలియన్ డాలర్లను వసూలు చేసింది. వారాంతంలోఘీ చిత్రం అక్కడ 1 మిలియన్ డాలర్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఈచిత్రానికి మొత్తంగా రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్కు రూ.64 కోట్ల షేర్ రాబట్టాలి. ఎఫ్3 ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం - రూ.4.06 కోట్లు ► సీడెడ్ - రూ.1.26 కోట్లు ► ఈస్ట్ - రూ.76 లక్షలు ► వెస్ట్ - రూ.96లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.1.18 కోట్లు ► గుంటూరు- రూ.88 లక్షలు ► కృష్ణా - రూ. 67 లక్షలు ► నెల్లూరు - రూ.62లక్షలు ► మొత్తం రూ.10.37కోట్లు America la modhalaindhi Soggalla Hawa 🤑 A blockbu$ter start at the U$ box office🤩#F3Movie premieres & 1st Day grossed $5️⃣0️⃣0️⃣K+ & Counting🇺🇸 Watch #F3TripleBlockbuster in your nearest cinemas😀@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @SVC_official @PharsFilm @PrimeMediaUS pic.twitter.com/hCuVSMbG9y — Sri Venkateswara Creations (@SVC_official) May 28, 2022 -
‘బాక్సాఫీస్పై ‘సర్కారు వారి పాట’ దండయాత్ర
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్న ఈ చిత్రం.. బాక్సాపీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. (చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే..) కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్ని సాధించి, రికార్డు క్రియేట్ చేసింది. ఐదు రోజుల్లో రూ.100కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రమిది. నైజాం ఏరియాల్లో ఈ చిత్రం 31.47 కోట్ల వసూళ్లను రాబట్టింది. నైజాంలో 30కోట్లకు పైగా వసూళ్ల సాధించిన మూడో చిత్రమిది. ఈ చిత్రానికి దాదాపు రూ.120 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. మరో 20 కోట్ల రూపాయలను వసూలు చేయాల్సి ఉంది. ఇదే స్పీడ్ కొనసాగితే మరో మూడు, నాలుగు రోజుల్లోనే ‘సర్కారు వారి పాట’ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సర్కారు వారి పాట ఐదు రోజులు కలెక్షన్స్ వివరాలు ► నైజాం - రూ.31.47 కోట్లు ► సీడెడ్ - రూ.10.44 కోట్లు ► ఈస్ట్ - రూ.7.05కోట్లు ► వెస్ట్ - రూ.4.65కోట్లు ► ఉత్తరాంధ్ర - రూ.10.25 కోట్లు ► గుంటూరు- రూ.7.85కోట్లు ► కృష్ణా - రూ.5.76కోట్లు ► నెల్లూరు - రూ.3.12 కోట్లు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- 7.75 కోట్లు ►ఓవర్సీస్-12.1 కోట్లు ►మొత్తం 100.44 కోట్లు(షేర్) #BlockbusterSVP is setting new benchmarks in TFI 🔥#SVP #SVPMania #SarkaruVaariPaata Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/g4bAenYhDI — Mythri Movie Makers (@MythriOfficial) May 17, 2022 -
'సర్కారు వారి పాట’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
బాబు ల్యాండ్ అయితే బాక్సాఫీస్ కు బ్యాండే అంటుంటారు ఫ్యాన్స్. ఈ మాటను మరోసారి నిజం చేసాడు మహేశ్బాబు. సర్కారువారి పాట పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్ స్టార్.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే జోష్ని కనబరిచాడు. వరల్డ్ వైడ్గా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.103 కోట్ల గ్రాస్ని సాధించింది. ఏపీ, తెలంగాణల్లో కలిపి రెండో రోజు రూ.11.64 కోట్లను వసూలు చేసింది. నైజాంలో రూ.5.2 కోట్లు, సీడెడ్ 1.45 కోట్లు, ఉత్తరాంధ్ర 1.65 కోట్లు, ఈస్ట్ 1.08 కోట్లు, వెస్ట్ 45 లక్షలు, గుంటూరు 51 లక్షలు, కృష్ణా 89 లక్షలు, నెల్లూరులో 41లక్షల రూపాయలను వసూలు చేసింది. (చదవండి: మహేశ్ హీరోయిన్స్ మాస్ ఇమేజ్ పక్కా!) మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ.48.27 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. రూ.50 కోట్ల క్లబ్లో చేరడానికి రెడీగా ఉంది. ఇక అమెరికాలో అయితే ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం అక్కడ 1.5 మిలియన్స్ డాలర్లను కలెక్ట్ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. సర్కారు వారి పాట రెండు రోజులు కలెక్షన్స్ వివరాలు(ఏపీ & తెలంగాణ) ► నైజాం - రూ.17.44 కోట్లు ► సీడెడ్ - రూ.6.15 కోట్లు ► ఈస్ట్ - రూ.4.33 కోట్లు ► వెస్ట్ - రూ.3.19కోట్లు ► ఉత్తరాంధ్ర - రూ.5.38 కోట్లు ► గుంటూరు- రూ.6.34కోట్లు ► కృష్ణా - రూ.3.47 కోట్లు ► నెల్లూరు - రూ.1.97 కోట్లు ► మొత్తం రూ.48.27 కోట్లు -
‘సర్కారు వారి పాట’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
Sarkaru Vaari Paata First Day Collection: సూపర్ స్టార్ మహేశ్బాబు మోస్ట్ అవెటెడ్ మూవీ సర్కారు వారి పాట గురువారం(మే 12) విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న దాదాపు అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మహేశ్ నుంచి వచ్చిన సినిమా ఇది. (చదవండి: ‘సర్కారు వారి పాట’ రివ్యూ) తెరపై సూపర్ స్టార్ చాలా స్టైలీష్గా కనిపించడం.. కామెడీ, యాక్షన్తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. మహేశ్ బాబు సత్తా ఏంటో మరోసారి గుర్తు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం - రూ. 12.24 కోట్లు ► సీడెడ్ - రూ. 4.7 కోట్లు ► ఈస్ట్ - రూ. 3.25 కోట్లు ► వెస్ట్ - రూ. 2.74 కోట్లు ► ఉత్తరాంధ్ర - రూ. 3.73 కోట్లు ► గుంటూరు- రూ. 5.83 కోట్లు ► కృష్ణా - రూ. 2.58 కోట్లు ► నెల్లూరు - రూ. 1.56 కోట్లు ► మొత్తం రూ.36.69 కోట్లు #SVP AP/TG Share 36.63Cr ALL TIME RECORD for Regional Film🤘💥#BlockbusterSVP #SarkaruVaariPaata https://t.co/QyE7gPFZIp — SarkaruVaariPaata (@SVPTheFilm) May 13, 2022 -
‘ఆచార్య ’ సినిమా రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆచార్య మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం(ఏప్రిల్ 29)ఈ సినిమా విడుదలయ్యింది. చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్వాప్తంగా 42 కోట్లు గ్రాస్, 31. కోట్లు షేర్ సాధించింది.రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 5.15 కోట్ల షేర్ని రాబట్టింది. (చదవండి: ‘ఆచార్య’ మూవీ రివ్యూ) నైజాంలో రూ.2.20 కోట్లు, , సీడెడ్లో రూ. 63 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.53 లక్షలు, ఈస్ట్లో రూ. 33 లక్షలు, వెస్ట్లో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 50 లక్షలు, కృష్ణాలో రూ. 43 లక్షలు , నెల్లూరులో రూ. 25 లక్షల కలెక్షన్స్ని రాబట్టింది. రెండు రోజుల్లో ప్రపంచవ్వాప్తంగా 62.85 కోట్లు గ్రాస్, 41.07 కోట్లు షేర్ సాధించింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆచార్య’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 29) ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ మూవీకి తొలిరోజు మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఫస్ట్డే కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల గ్రాస్, 29.5 కోట్లు షేర్ సొంతం చేసుకుంది. (చదవండి: ‘ఆచార్య’ మూవీ రివ్యూ) నైజాంలో రూ.7.90 కోట్లు, సీడెడ్లో రూ.4.6 కోట్లు, ఈస్ట్లో రూ.2.53, వెస్ట్లో 2.90, గుంటూరులో 3.76, కృష్ణలో రూ.1.90, నెల్లూరులో 2.30 కోట్లను రాబట్టింది. కర్ణాటక ఇతర రాష్ట్రాలలో 1.60 కోట్లు వసూల్ చేసింది. ప్రపంచవ్వాప్తంగా 42 కోట్లు గ్రాస్, 31. కోట్లు షేర్ సాంధించింది. ఆచార్య చిత్రానికి రూ.133 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 134 కోట్ల షేర్ రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం రూ.31.93 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.102.07 కోట్లు షేర్ ను రాబట్టాలి. మిక్స్ డ్ టాక్ తెచ్చకున్న ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మేరకు వసూళ్లను రాబడుతుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచిచూడాల్సిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాకీ భాయ్ ఊచకోత.. నాలుగో చిత్రంగా కేజీయఫ్ 2
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంతే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. బాలీవుడ్లో అయితే ఏ సినిమాకు సాధ్యం కాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో రూ.350 కోట్లకు పైగా రాబట్టి.. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత రూ. వెయ్యికోట్ల క్లబ్లో చేరిన నాలుగో చిత్రంగా ‘కేజీయఫ్ 2’ నిలిచింది. ఇక టాలీవుడ్లోనూ కేజీయఫ్ 2 ఇంకా తగ్గలేదు. 15 రోజుల్లో ఈ చిత్రం 77.31 కోట్ల షేర్ని రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’ పేరిట ఉండేది.పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. #KGFChapter2 has crossed ₹ 1,000 Crs Gross Mark at the WW Box Office.. Only the 4th Indian Movie to do so after #Dangal , #Baahubali2 and #RRRMovie — Ramesh Bala (@rameshlaus) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాకీభాయ్ ఊచకోత.. 6 రోజుల్లో ‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ ఎంతంటే
కేజీయఫ్ 2తో రాకీ భాయ్ ఇండియన్ బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తున్నాడు. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంతే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూళ్లు చేసి రికార్డును సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్లో సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. అక్కడ ఈ మూవీ ఆరు రోజుల్లో రూ. 238.70 కోట్లను రాబట్టింది. మంగళవారం ఒక్క రోజే 19.14 కోట్లను వసూలు చేయడం విశేషం. టాలీవుడ్లో తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం.. 6 రోజుల్లో రూ.62.71 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’ పేరిట ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో 'కేజీయఫ్ 2' చిత్రానికి రూ. 74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 75 కోట్ల వరకు షేర్ను రాబట్టాల్సి ఉంది. కేజీయఫ్ 2 కలెక్షన్ల జాతర ఇలాగే కొనసాగితే మాత్రం .. మరో రెండు, మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. ఓవర్సీస్లోనూ రాకీభాయ్ హవా కొనసాగుతుంది. యూఎస్లో కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. అక్కడ ఈ చిత్రం ఏకంగా ఐదు రోజుల్లో 5 మిలియన్ డాలర్లను రాబట్టింది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్, హీరోయిన్గా శ్రీనిధి నటించారు. రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. #KGF2 is SUPER-STRONG on Day 6... Will cross ₹ 250 cr mark today [Wed, Day 7]... AGAIN, THE FASTEST TO HIT ₹ 250 CR... Thu 53.95 cr, Fri 46.79 cr, Sat 42.90 cr, Sun 50.35 cr, Mon 25.57 cr, Tue 19.14 cr. Total: ₹ 238.70 cr. #India biz. #Hindi Version. pic.twitter.com/zSXLjNcsnU — taran adarsh (@taran_adarsh) April 20, 2022 -
కలెక్షన్లు కురిపిస్తూ రికార్డు సృష్టిస్తోన్న 'లక్ష్మీ'
ఒకప్పుడు హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసే ట్రెండ్ నడిచేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు బాలీవుడ్లో వరుసగా పట్టాలెక్కుతున్నాయి. ఒక్క తెలుగు మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఇండస్ట్రీ మీదనే బాలీవుడ్ దర్శకనిర్మాతల కన్ను పడింది. ఇక్కడి సినిమాలను తిరిగి రూపొందిస్తూ ఒరిజినల్ కన్నా పెద్ద హిట్టు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు, తమిళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన 'కాంచన' చిత్రం హిందీలో 'లక్ష్మీ'గా తెరకెక్కింది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు. (చదవండి: నటిపై ట్రోలింగ్: దేవుళ్ల మీదే ఎగతాళా?) స్టార్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్ల ఓపెనింగ్ కోసం వేచి చూడకుండా నవంబర్ 9న ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ హాట్స్టార్లో రిలీజైంది. అదే రోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, పపువా న్యూగినియా, యూఏఈలో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే ఒకటిన్నర కోట్లు రాబట్టింది. ఫిజిలో 17, ఆస్ట్రేలియాలో 70, న్యూజిలాండ్లో 42 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక హాట్స్టార్ వీఐపీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కరోనా కాలంలో ఇలాంటి వసూళ్లు రావడం గొప్ప విషయమని విశ్లేషకులు అంటున్నారు కాగా మొదట్లో ఈ చిత్రానికి 'లక్ష్మీ బాంబ్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే లక్ష్మీ అంటే పవిత్రమైన పేరు అని, టైటిల్ దాన్ని కించపరిచేలా ఉందని శ్రీ రాజ్పుత్ కర్ణిసేన సినిమా యూనిట్కు నోటీసులు పంపింది. దీంతో చిత్ర యూనిట్ టైటిల్ను లక్ష్మీ అని మార్చక తప్పలేదు. (చదవండి: టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల) -
‘మలంగ్’కు రానుంది గడ్డు కాలమే
ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మలంగ్: అన్లిష్ ద మ్యాడ్నెస్’. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల మందుకు వచ్చింది. ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మధ్య సరైన హిట్ దొరకని ఆదిత్య కపూర్కు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చిందనే చెప్పవచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో ఆదిత్య విజృంభిస్తే, ప్రేమ సన్నివేశాల్లో దిశా అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఎక్కువ భాగం గోవాలోనే షూటింగ్ జరుపుకుంది. (మలంగ్ ట్రైలర్ను వీక్షించండి) ‘మలంగ్’ తొలివారం మంచి వసూళ్లనే రాబట్టింది. విడుదలైన తొలి నాడు సుమారు రూ.7 కోట్లు రాబట్టగా తర్వాతి రోజుల్లో వరుసగా రూ. 8, 10 కోట్లు కురిపించింది. దీంతో వీకెండ్లో పుంజుకున్నట్లు కనిపించినా.. సోమవారానికి మాత్రం వసూళ్లు రూ.4 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. తొలుత కలెక్షన్లలో దూకుడు ప్రదర్శించిన ఈ చిత్రం దాన్ని కొనసాగించడంలో మాత్రం కాస్త తడబడుతోంది. మొత్తంగా ఇప్పటివరకు రూ.36 కోట్లు రాబట్టింది. కాగా వాలంటైన్స్ డే నాడు కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ నటించిన రొమాంటిక్ డ్రామా సినిమా ‘లవ్ ఆజ్ కల్2’ విడుదల అవుతుండటంతో ‘మలంగ్’ వసూళ్లకు గండిపడే అవకాశాలున్నాయి. (ఔను: వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు) చదవండి: బైక్పై షికారు చేస్తున్న సారా, కార్తీక్! -
తగ్గని జోష్.. ‘సరిలేరు’కు భారీ వసూళ్లు!
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండటంతో తర్వలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ వందకోట్ల మార్క్ను దాటేసే అవకాశముందని అంటున్నారు. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండోరోజు శనివారం సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలిమూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్లకు చేరువగా వచ్చిందని అంటున్నారు. అధికారిక లెక్కలు వస్తే.. తొలి మూడురోజుల్లో ఈ సినిమా వందకోట్ల మార్క్ను దాటిందా? లేదా? అన్నది తెలిసే అవకాశముంది. మరోవైపు ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కుతుండటంతో రోజుకొక ప్రొమో, ప్రమోషన్ వీడియలతో ఈ చిత్రయూనిట్ హల్చల్ చేస్తోంది. తాజాగా ‘బ్లాక్బస్టర్కా బాప్’ ప్రొమో వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్స్టార్ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పెద్దగా కథ లేకపోయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలపై దర్శకుడు అనిల్ బాగా ఫోకస్ చేశాడని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో బాక్సాఫీస్ వద్ద ‘సరిలేరు నీకెవ్వరు’ భారీగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రెడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. -
తన్హాజీ.. కలెక్షన్ల తుఫాన్!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ హీరోగా తెరకెక్కిన పిరియడ్ డ్రామ ‘తన్హాజీ : ది అన్సంగ్ వారియర్’. బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లో ఏకంగా రూ. 61.7 కోట్లు వసూలు చేసింది. మరాఠా యోధుడి కథ కావడంతో మహారాష్ట్రలో అద్భుతంగా వసూళ్లు రాబడుతున్న ఈ మూవీ... ఇటు మెట్రో నగరాల్లోని మల్టిప్లెక్స్ల్లో, మాస్ థియేటర్లలో సత్తా చాటుతోంది. శుక్రవారం తొలిరోజు రూ. 15.10 కోట్లు, శనివారం రూ. 20.57 కోట్లు రాబట్టిన తన్హాజీ.. ఆదివారం మరింతగా పుంజుకొని రూ. 26.08 కోట్లు రాబట్టిందని, మొత్తంగా రూ. 61.75 కోట్లను ఈ సినిమా మూడోరోజుల్లో రాబట్టిందని ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో అజయ్ దేవ్గన్ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యాధ్యక్షుడైన తన్హాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1670లో జరిగిన సింహగఢ్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఈ మరాఠా యోధుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తుండగా, ఆయన భార్య సావిత్రిబాయి ములుసరేగా కాజోల్ నటించారు. విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. 3డీ టెక్నాలజీలో భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కింది. -
రివ్యూలు పెదవి విరిచినా.. భారీ వసూళ్లు!
ముంబై: అక్షయ్కుమార్ తాజా సినిమా ‘హౌజ్ఫుల్-4’.... సూపర్హిట్ కామెడీ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన హౌజ్ఫుల్ సినిమాల్లో ఇది నాలుగో సినిమా. ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. తాజా సీక్వెల్లో అక్షయ్కుమార్తోపాటు బాబీడియోల్, రితేశ్ దేశ్ముఖ్, కృతీ సనన్, పూజా హెగ్డే, కృతి కర్బంద, దగ్గుబాటి రానా వంటి స్టార్ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పట్ల విమర్శకులు పెదవి విరిచారు. ఈ కామెడీ సినిమా అంతగా నవ్వించేలా లేదని, హాస్యం కంటే అర్థంలేని వెర్రితనమే ఎక్కువగా ఉందని రివ్యూలు వచ్చాయి. అయినా, బాక్సాఫీస్ వద్ద అక్షయ్ సినిమా మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. తొలిరోజు రూ. 19.08 కోట్లు వసూలు చేసిన హౌజ్ఫుల్-4.. రెండోరోజు రూ. 18.81 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండురోజుల్లో ఈ సినిమా 37.89 కోట్లు వసూలు చేసింది. దీపావళి పండుగ సీజన్లో ఈ స్థాయిలో వసూళ్లు రావడం గొప్ప విషయమేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా నిలకడగా వసూళ్లు సాధిస్తే.. సూపర్హిట్ అయ్యే అవకాశముందని అంటున్నారు. -
వార్ వసూళ్లు: మరో భారీ రికార్డు
ముంబై : బాలీవుడ్ టాప్ హీరోలైన హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ సినిమా వార్.. ఈ సినిమా ఊహించినట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన వార్.. అప్రతిహతంగా కలెక్షన్లు రాబడుతూ.. మూడు వారాల్లోనే రూ. 300 కోట్ల క్లబ్బులోకి ఎంటరైంది. ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ చిత్రాల్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా వార్ రికార్డులకెక్కింది. వరుసగా మూడో వీకెండ్లోనూ వార్ కలెక్షన్లు పెద్ద ఎత్తున ఉండటం గమనార్హం. గాంధీ జయంతికి విడుదలై తొలిరోజే 50 కోట్లకుపైగా వసూలు చేసి.. బాలీవుడ్లోనే హైయ్యెస్ట్ ఓపెనర్గా నిలిచిన వార్.. దసరా సీజన్ను కూడా సద్వినియోగం చేసుకుంటూ దుమ్మురేపింది. ఇప్పుడు దీపావళి వరకు బాక్సాఫీస్ వద్దకు వార్కు గట్టి పోటీ లేకపోవడంతో వసూళ్లు ఇలాగే కొనసాగే అవకాశముంది. మూడో వీకెండ్లో గత శుక్రవారం రూ. 2.80 కోట్లు, శనివారం రూ. 4.35 కోట్లు, ఆదివారం సుమారు రూ. 6 కోట్లు వసూలు చేసిన వార్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కలపుకొని రూ. 301. 75 కోట్లు సాధించింది. ఇందులో హిందీ వెర్షన్ వాటా.. సుమారుగా 288.30 కోట్లుగా ఉంది. రూ. 300 కోట్లు వసూలు చేయడం ద్వారా ఈ ఏడాది విడుదలైన కబీర్ సింగ్ లైఫ్టైమ్ వసూళ్లను వార్ అధిగమించింది. అదేవిధంగా ఆమీర్ ఖాన్ ‘ధూమ్-3’ రికార్డును కూడా దాటింది. యష్రాజ్ ఫిలిమ్స్ (వైఆర్ఎఫ్)కు ఈ సినిమా అతిపెద్ద ఊరట అని చెప్పవచ్చు. వైఆర్ఎఫ్ నిర్మించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా గత ఏడాది దీపావళికి విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ నష్టాలను మిగిల్చిన ఆ ఘోర పరాభవం నుంచి వార్ సినిమాతో వైఆర్ఎఫ్ గట్టెక్కింది. అంతేకాకుండా వార్ జోరు కొనసాగించేందుకు త్వరలోనే మరో సీక్వెల్ను పట్టాలెక్కించబోతుంది. ఈ సినిమాలో హృతిక్ ఒక హీరోగా కొనసాగనున్నాడు. టైగర్ స్థానంలో మరో స్టార్ హీరోను సీక్వెల్లో తీసుకోనున్నారు. ఇక, ఓవర్సీస్లో సత్తా చాటిన వార్ సినిమా అంతర్జాతీయ మార్కెట్లో వందకోట్ల వసూళ్ల దిశగా సాగుతోంది. -
వారెవ్వా ‘వార్’... కలెక్షన్ల తుఫాన్!
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్లు హీరోలుగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.. బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది. ఈ ఏడాది అతిపెద్ద మల్టీస్టారర్గా, బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ప్రమోటైన ‘వార్’కు పాజిటివ్ రివ్యూలతోపాటు ఆడియెన్స్ టాక్ కూడా బలంగా ఉండటంతో తొలిరోజు నుంచే రికార్డుస్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు ఏకంగా రూ. 53.35 కోట్లు రాబట్టి.. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన వార్.. రెండోరోజు గురువారం రూ. 23.10 కోట్లు, మూడో రోజు శుక్రవారం రూ. 21.25 కోట్లు సాధించింది. తొలి మూడు రోజుల్లోనే హిందీ వెర్షన్లో రూ. 96 కోట్లు, తెలుగు, తమిళ వెర్షన్లలో రూ. 4.15 కోట్లు సాధించి.. మొత్తం రూ. 100.15 కోట్లు వార్ తన ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వార్ జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరింత వసూళ్లు సాధించి.. రికార్డులు బద్దలుకొట్టే అవకాశం కనిపిస్తోంది. గురువారం, శుక్రవారం సాధారణ వర్కింగ్ డేస్ అయినప్పటికీ.. వార్ తిరుగులేని రీతిలో వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు సాధించిన ఐదో యశ్రాజ్ ఫిలిమ్స్ సినిమాగా వార్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇంతకుముందు ధూమ్-3, సుల్తాన్, టైగర్ జిందా హై, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలు తొలి మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులో చేరాయి. బాలీవుడ్ చరిత్రలో తొలిరోజు రికార్డు.. బాలీవుడ్ చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా వార్ నిలిచింది. గతంలో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన మల్టీస్టారర్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ తొలిరోజు 52.50 కోట్లు వసూలు చేయగా.. రూ. 53.35 కోట్లతో ఆ రికార్డును వార్ చెరిపేసింది. ఈ రెండు సినిమాలు యష్రాజ్ ఫిల్మిమ్స్ తీసినవే కావడం గమనార్హం. ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అత్యధిక రోజు వసూళ్లు సాధించిన సినిమాగా వార్ మొదటిస్థానంలో ఉండగా.. భారత్ (42.30 కోట్లు), మిషన్ మంగళ్ ( 29.16 కోట్లు), సాహో (24.40కోట్లు), కళంక్ (21.60కోట్లు) వరుసగా తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా ప్రభావం వార్పై ఉంటుందని భావించారు. కానీ, అంతగా ఆ ప్రభావం లేదని వసూళ్లు చాటుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వార్ సినిమాలో హృతిక్ కబీర్గా, టైగర్ ఖలీద్గా కనిపించనున్నారు. గురుశిష్యులైన వీరిద్దరు ప్రత్యర్థులుగా ఎందుకు మారారు అన్నదే వార్ కథ. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతోపాటు పలు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. -
సైరాకు భారీగా కలెక్షన్స్.. 3రోజుల్లోనే వందకోట్లు!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’... రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ నేపథ్యంతో అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడం.. రివ్యూలు కూడా పాజిటివ్గా ఉండటంతో ‘సైరా’ భారీ వసూళ్లు రాబడుతోంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న (బుధవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన మార్కెట్ అయిన ఏపీ, తెలంగాణలో ఈ సినిమా సత్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సైరా రూ. 32 కోట్లు రాబట్టింది. పాజిటివ్ టాక్ ఉండటంతో తొలి మూడు రోజుల్లో సైరాకు భారీగా వసూళ్లు దక్కినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 14.62 కోట్లు రాబట్టింది. ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. నైజాంలో మూడురోజుల కలెక్షన్ వివరాలు (తొలిరోజు రూ. 8.10 కోట్లు, రెండోరోజు రూ. 3.98 కోట్లు, మూడో రోజు రూ. 2.54 కోట్లు) ట్విటర్లో వెల్లడించారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ సైరా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ. 1.5 మిలియన్ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని రమేశ్ బాలా మరో ట్వీట్లో వెల్లడించారు. అత్యంత భారీ బడ్జెట్తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘సైరా’ సినిమా విడుదలైన ప్రతీ చోట హిట్ టాక్తో భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రానికి సామాన్య అభిమానులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. చిరంజీవి నటనకు, సినిమాను తెరకెక్కించిన విధానానికి ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ‘సైరా’థియేటర్లలోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ సినిమాపై సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
4 రోజుల్లో 50 కోట్లు రాబట్టిన ‘గల్లీ బాయ్’
ముంబై: రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన తాజా సినిమా ‘గల్లీ బాయ్’.. దేశీ ర్యాప్ కల్చర్ సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా గత గురువారం విడుదలైన ఈ సినిమా నాలుగురోజుల్లో 51.15 కోట్లు రాబట్టింది. వీకెండ్లో చివరిరోజైన ఆదివారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టి మొదటి ఐదు రోజుల్లో రూ. 70 కోట్లు దాటే అవకాశముందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్లో తెలిపారు. మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా వరుసగా గురువారం రూ. 19.40 కోట్లు, శుక్రవారం రూ. 13.10 కోట్లు, శనివారం రూ. 18.65 కోట్లు వసూలు చేసిందని ఆయన తెలిపారు. -
బడ్జెట్ 125 కోట్లు.. ఫస్ట్ కలెక్షన్..?
ముంబై: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘మణికర్ణిక’ సినిమా మొదటి రోజు సాధారణ వసూళ్లు మాత్రమే సాధించింది. దేశవ్యాప్తంగా తొలిరోజు కేవలం రూ.8.75 కోట్లు రాబట్టింది. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఈ సినిమాకు విమ్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారనే దానిపై వసూళ్లు ఆధారపడనున్నాయి. వారాంతంలో వసూళ్లు పెరిగే అవకశాముందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడితో కలిసి కంగనా రనౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయేంద్ర ప్రసాద్ రచనా సహకారం అందించారు. అతుల్ కులకర్ణి, డానీ డెంజొప్ప, జిషు సేన్గుప్తా, రిచర్డ్ కీప్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. (‘మణికర్ణిక’ మూవీ రివ్యూ) -
రజనీ ‘కాలా’... దుమ్మురేపుతున్న వసూళ్లు!
చెన్నై : సూపర్స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘కాలా’... అంతగా గ్రాండ్ ఓపెనింగ్స్ను రాబట్టలేకపోయింది. రజనీ సినిమాలంటే సహజంగానే బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. కలెక్షన్ల సునామీ పోటెత్తుతుంది. అయితే, తొలిరోజు కాలా సినిమాకు చాలావరకు థియేటర్లు హౌస్ఫుల్ కాలేదని, అన్బుక్డ్ సీట్లు చాలా మిగిలిపోయాయని వార్తలు వచ్చాయి. రెండోరోజు నుంచి ఈ సినిమా వసూళ్లు మెల్లిగా ఊపందుకున్నాయని సినీ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండ్రోరోజుల్లో ఒక్క చెన్నైలోనే కాలా సినిమా మూడు కోట్లు వసూలు చేసింది. ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్లో మిలియన్ మార్క్ (రూ. 6.83 కోట్లు)ను అందుకుంది. మొత్తానికి టాక్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. కాలా సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్లో వెల్లడించారు. చెన్నైలో ఈ సినిమా తొలి వీకెండ్లో రూ. 4.9 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో కాలా సినిమా సంచలన వసూళ్లు రాబడుతోంది. పద్మావతి సినిమా తర్వాత అత్యధిక విదేశీ వసూళ్లు రాబట్టిన సినిమాగా కాలా నిలిచింది. శాటిలైట్, మ్యూజిక్ తదితర హక్కుల ద్వారా విడుదలకు ముందే రూ. 230 కోట్ల బిజినెస్ చేసిన కాలా.. విడుదల తర్వాత కూడా వసూళ్లతో ఆకట్టుకుంటోందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా సినిమా రజనీ ద్రవిడ డాన్గా, మురికివాడల్లో నివసించే తన ప్రజల హక్కుల కాపాడే వ్యక్తిగా అద్భుతమైన నటన కనబర్చారు. #BREAKING: In 3 Days, #Kaala has crossed ₹ 100 Cr Gross at the WW Box Office.. pic.twitter.com/N9NS1no2Mg — Ramesh Bala (@rameshlaus) June 10, 2018 -
ప్చ్: చైనాలో బాహుబలి-2 కలెక్షన్లు కూడా..!
దర్శకదీరుడు రాజమౌళి దృశ్యకావ్యం ‘బాహుబలి: ద కన్క్లూజన్’ భారీ అంచనాలతో చైనాలో విడుదలైంది. బాహుబలి మొదటి పార్టు చైనాలో ఫెయిల్ కావడంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని.. చిత్రబృందం పొరుగుదేశంలో గతవారం ఈ సినిమాను విడుదల చేశారు. చైనీయుల అభిరుచికి తగినట్టు మార్పులు చేసినప్పటికీ.. బాహుబలి-2 సినిమా అక్కడి సినీ ప్రేమికులను ఆకట్టుకోలేకపోయింది. తొలిరోజు ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. దీంతో చైనాలోనూ బాహుబలి ప్రభంజనం ఖాయమని భావించారు. కానీ, ఆ తర్వాతి రోజుల్లో ప్రేక్షకులను థియేటర్ల వైపునకు రప్పించడంలో ఈ సినిమా విఫలమైంది. మొత్తంగా మొదటి మూడురోజుల్లో బాహుబలి-2 రూ. 51.20 కోట్లు వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. గతంలో మొదటి వీకెండ్లో ఆమిర్ ఖాన్ సీక్రెట్ సూపర్స్టార్ రూ. 173.82 కోట్లు వసూలుచేస్తే.. ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియం సినిమా రూ. 102.18 కోట్లు రాబట్టింది. కానీ బాహుబలి-2 మాత్రం మొదటివారంలో ఆశించినంత వసూళ్లు రాబట్టలేకపోయింది. ‘చైనాలో బాహుబలి-2 ఆశించినంత వసూళ్లు రాబట్టడం లేదు. శుక్రవారం 2.43 మిలియన్ డాలర్లు రాబట్టిన ఈ సినిమా శనివారం 2.92 మిలియన్ డాలర్లు, ఆదివారం 2.26 మిలియన్ డాలర్లు.. మొత్తంగా 7.63 మిలియన్ డాలర్లు (రూ. 51.20 కోట్లు) వసూలు చేసింది’ అని తరణ్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో భారీగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో రెండో భాగం విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను మరోసారి ఎడిటింగ్ చేయించారు. అంతేకాదు ఏకంగా 7వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. బాహుబలి నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు తొలిరోజు ఫలించినట్టు కనిపించినా.. ఆ తర్వాత మాత్రం కలెక్షన్లు ఊపందుకోలేదు. అయితే, బాహుబలి తొలి భాగం చైనాలో ఫుల్ రన్లో సాధించిన 1.18 మిలియన్ డాలర్ల కలెక్షన్లను.. బాహుబలి 2 తొలి రోజే సాధించింది. -
‘పద్మావత్’ విజయంపై కర్ణిసేన కామెంట్
జైపూర్: వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కర్ణిసేన ‘పద్మావత్’ బాక్సాఫీస్ వసూళ్లపై కర్ణిసేన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఇది భారతదేశం. ఇక్కడ సన్నిలియోన్(మాజీ పోర్న్ స్టార్)కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నార’ని కర్ణిసేన ప్రతినిధి విజేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ‘పద్మావత్’కు సానుకూల రివ్యూలు వచ్చాయని, మంచి కలెక్షన్లు సాధిస్తోందని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆయన ఈవిధంగా స్పందించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ఈ సినిమాను కర్ణిసేన వ్యతిరేకిస్తూనే ఉంది. ముమ్మాటికీ ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని పునరుద్ఘాటించారు. ‘ఈ సినిమాలో చూపించినట్టుగా గర్భవతిగా ఉన్న మహిళ జౌహర్ లేదా ఆత్మాహుతికి పాల్పడదు. చిత్తోర్గఢ్ కోటపై ఖిల్జీ 55 ఏళ్ల వయసులో దండెత్తాడు. కానీ ఈ సినిమాలో అతడు 25 ఏళ్ల వయసులో దాడి చేసినట్టు చూపించారు. అలాగే చిత్తోర్గఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ పగలగొట్టకపోయినా, పగలగొట్టినట్టు తెరకెక్కించారు. చరిత్ర ప్రకారం చూస్తే కోట ద్వారాన్ని పెకలించి తనతో పాటు ఢిల్లీకి ఖిల్జీ తీసుకుపోయినట్టు ఉంది. 400 ఏళ్ల తర్వాత భతర్పూర్ రాజు ఈ ద్వారాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రతిష్టించారు. కానీ సినిమాలో చిత్తోర్గఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ పగలకొట్టుకుని లోపలికి ప్రదేశించినట్టుగా చిత్రీకరించారు. ఇలాంటి వక్రీకరణలు చాలా ఉన్నాయ’ని విజేంద్ర సింగ్ వివరించారు. జనవరి 25న విడుదలైన ‘పద్మావత్’ సినిమా ఇప్పటివరకు రూ. 150 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకుల అంచనా. -
అబ్బాయి మిడిల్ క్లాస్.. వసూళ్లు హైక్లాస్
సాక్షి, హైదరాబాద్: మిడిల్ క్లాస్ అబ్బాయి(ఎంసీఏ) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. తొలి రోజే భారీ వసూళ్లతో సత్తా చాటాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని కెరీర్లో అత్యధిక ఆరంభ వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 11 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలిపాయి. ఆస్ట్రేలియాలో రూ.15.47 లక్షలు రాబట్టినట్టు బాలీవుడ్ మార్కెట్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ ఓపెనింగ్ కలెక్షన్లు భారీగా ఉండటం విశేషం. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ధియేటర్లు 70 శాతం వరకు నిండాయని సమాచారం. దిల్ రాజు నిర్మాత కావడం, పబ్లిసిటీ బాగా చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. కలెక్షన్ల జోరు ఇదేవిధంగా కొనసాగితే నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఎంసీఏ నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి నటించింది. భూమిక, రాజీవ్ కనకాల, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
‘అర్జున్ రెడ్డి’ కి కలెక్షన్ల వర్షం..
వివాదాలు, ప్రశంసలతో ఓ ట్రెండ్ సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. విజయ్ దేవరకొండ, శాలిని పాండే జోడిగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తొలి వారంలోనే 30 కోట్ల మార్కును దాటింది. ఎలాంటి పెద్ద స్టార్లు లేకుండా ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి హిట్ టాక్ తెచ్చుకొంది. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు అర్జన్రెడ్డి తొలి వారంలోనే 34.3 కోట్ల గ్రాసును వసూలు చేసింది. చిన్న బడ్డెట్తో తెరకెక్కిన ఈ చిత్రం డిస్టిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది. ఇటీవల కాలంలో ఏ సినిమా లేనంతా నిడివితో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమాకు మరో పది నిమిషాల సీన్స్ ను యాడ్ చేశారు. మూడు గంటల ఒక నిమిషం నిడివితో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక పై మూడు గంటల పదకొండు నిమిషాల నిడివితో ప్రదర్శించనున్నారు. ఈ సీన్స్ ను సెకండ్ హాఫ్ లో యాడ్ చేయనున్నారట. సోమవారం నుంచి థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతుండటంతో అదే రోజు ఈ సన్నివేశాలను యాడ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి.. కొత్త సీన్స్ యాడ్ చేసిన తరువాత మరోసారి సత్తా చాటుతుందని భావిస్తున్నారు మేకర్స్. -
నిరాశ పరిచిన షారుఖ్ సినిమా కలెక్షన్లు..
ముంబాయి: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం ‘జబ్ హారీ మెట్ సెజల్’ సినిమా కలెక్షన్లు నిరాశ పరిచాయి. దేశ వ్యాప్తంగా తొలి రోజు రూ. 15.25 కోట్లు వసూలు చేసింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షారుఖ్ ఖాన్కు ఇది మింగుడు పడని విషయం. షారుఖ్, అనుష్క శర్మ జంటగా ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. పంజాబ్ టూర్ గైడ్ హారీ, గుజరాతీ యువతి సెజల్ మధ్య సాగే ఈ రొమాంటిక్ చిత్రం తొలి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రముఖ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్ర తొలి రోజు కలెక్షన్లను ట్వీట్ చేయడంతో పాటు.. లాంగ్ వీకెండ్ ఉండటంతో త్వరలోనే కలెక్షన్లు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తన గత చిత్రం రయీస్లో గ్యాంగ్స్టర్ పాత్ర పోషించిన షారుఖ్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి ప్రేమికుడిగా కనిపించాడు. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో తొలి రోజు కలెక్షన్ల రికార్డులను పరిశీలిస్తే.. తొలిస్థానంలో బాహుబలి-2 ఉండగా.. ఈ చిత్రం నాలుగో స్థానంలో నిలిచింది. శుక్ర, శని, ఆదివారాలతో పాటు సోమవారం రక్షాబంధన్ కూడ తోడవడంతో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశం ఉందని తరణ్ ఆదర్శ్ ట్విట్ చేశారు. -
భారీ బడ్జెట్: కలెక్షన్లు బాగున్నా.. ప్లాప్ తప్పదా!
'జగ్గా జాసూస్'.. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా నటించిన తాజా మ్యూజికల్ అడ్వెంచర్ మూవీ. మొదటి వారాంతంలో ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. తొలి మూడురోజుల్లో బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 35 కోట్లు వసూలు చేసింది. నిజానికి ఇవి మంచి వసూళ్లే. చిన్న సినిమా అయితే.. ఈపాటికి సూపర్హిట్ క్రెడిట్ కూడా వచ్చేది. కానీ, 'జగ్గా జసూస్' భారీ బడ్జెట్ సినిమా. ప్రఖ్యాత నిర్మాణ డిస్నీ.. ఫీల్గుడ్ కంటెంట్తో రూ. 110 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించింది. అందుకే ఈ సినిమా హిట్టా.. ఫట్టా ఇప్పుడే చెప్పలేమంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ లెక్కల ప్రకారం.. జగ్గాజాసూస్ తొలిరోజు రూ. 8.57 కోట్లు వసూలు చేసింది. రెండోరోజు రూ. 11.53 కోట్లు రాబట్టింది. మూడోరోజు ఆదివారం మరికాస్త మెరుగుపడి రూ. 13.07 కోట్లను సొంతం చేసుకుంది. మొత్తం రూ. 33.17 కోట్లను ఈ చిత్రం రాబట్టింది. ఈ సినిమాకు క్రమంగా ఫ్యామిలీ ఆడియెన్స్ పెరుగుతుండటం ఊరట కలిగించే విషయం. అయితే, రూ. 110 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా నష్టాలను తప్పించుకుంటుందా? అన్నది సోమవారం వసూళ్ల వివరాలు వస్తే తప్పా చెప్పలేమని బాలీవుడ్ సినీ పండితులు అంటున్నారు. రూ. 40.. రూ. 50 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపొంది ఉంటే.. లాభాలు దక్కించుకొని ఉండేదని అంటున్నారు. -
డిస్ట్రిబ్యూటర్లకు దిగ్భ్రాంతే మిగిలింది!!
సల్మాన్ ఖాన్ 'ట్యూబ్లైట్' బాక్సాఫీస్ వద్ద వెలుగలేదు. కనాకష్టంగా రూ. 100 కోట్ల మార్క్ను దాటిన ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర దిగ్భ్రాంతే మిగిలింది. సల్మాన్ ఖాన్ కెరీర్లో 'వాంటెడ్' చిత్రం తర్వాత అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా 'ట్యూబ్లైటే'నని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో ఈద్ సందర్భంగా వచ్చిన సల్మాన్ సినిమాలు భారీ ఎత్తున బిజినెస్ చేశాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూటర్లు 'ట్యూబ్లైట్' సినిమా థియేట్రికల్ హక్కులను కళ్లుచెదిరే ధరకు కొనుగోలు చేశారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా కూడా ఆడకపోవడం డిస్ట్రిబ్యూటర్లను తీవ్ర నష్టాలు మిగిల్చినట్టు తెలుస్తోంది. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం మొదటి తొమ్మిదిరోజుల్లో ట్యూబ్లైట్ 107.32 కోట్లు వసూలు చేసింది. కానీ ఈ సినిమా కనీసం రూ. 300-350 కోట్లు వసూలుచేస్తేనే డిస్ట్రిబ్యూటర్లు లాభం వచ్చే పరిస్థితి ఉందని సినీ విశ్లేషకుడు గిరీష్ జోహార్ తెలిపారు. సల్మాన్ ఈద్ రిలీజ్ కావడంతో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. ట్యూబ్లైట్ థియేట్రికల్ హక్కులు రూ. 132 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా శాటిలైట్, మ్యూజిక్ హక్కులు వరుసగా రూ. 55 కోట్లు, రూ. 38 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడకపోవడంతో ఈ ధరలను సవరించే అవకాశం ఉందని చెప్తున్నారు. సినిమా బాక్సాఫీస్ లెక్కల ఆధారంగానే ఈ హక్కుల ఒప్పందాలు కుదురుతుండటంతో సినిమాలు ప్లాప్ అయితే.. ధర తగ్గించుకునే వెసులుబాటును ఆయా వర్గాలు కోరుతున్నట్టు చెప్తున్నారు. మొత్తానికి ట్యూబ్లైట్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 125 కోట్లు వసూలు చేస్తే గొప్ప అని భావిస్తున్నారు. -
ట్యూబ్లైట్: మూడో రోజు వసూళ్లు ఎంతో తెలుసా!
కబీర్ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన తాజా సినిమా ‘ట్యూబ్లైట్’ అంచనాలను అందుకోవడంలో విఫలమైనట్టే కనిపిస్తోంది. ఈద్ సందర్భంగా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా తొలి మూడురోజుల్లో మిశ్రమ వసూళ్లు మాత్రమే రాబట్టింది. తొలిరోజు కేవలం రూ. 21.15 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు, మూడో రోజు కూడా పుంజుకోలేదు. రెండో రోజు శనివారం 21.17 కోట్లు, మూడో రోజు ఆదివారం దాదాపు రూ. 22 కోట్లు సాధించింది. మొత్తంగా మొదటి మూడు రోజుల్లో ఈ సినిమాకు రూ. 60 కోట్లకు వసూళ్లు దక్కాయి. రంజాన్ పర్వదినం కావడంతో నాలుగోరోజు వసూళ్లు పెరగవచ్చునని భావిస్తున్నారు. నాలుగో రోజు వసూళ్లు గణనీయంగా పెరిగితే మొదటి వీకెండ్లోనే ఈ సినిమా వందకోట్ల మార్క్ను చేరుకొనే అవకాశముందని భావిస్తున్నారు. అదే నెగిటివ్ రివ్యూలు, డివైడ్ మౌత్టాక్ ఈ సినిమాను బాగా దెబ్బతీస్తున్నట్టు కనిపిస్తోంది. సోమవారం, మంగళవారం కూడా ‘ట్యూబ్లైట్’ కలెక్షన్లు పుంజుకోకుంటే.. ఇది బాక్సాఫీస్ వద్ద సరిగ్గా వెలుగనట్టేనని వినిపిస్తోంది. -
తొలిరోజు బాహుబలి రికార్డు కలెక్షన్లు!
-
తొలిరోజు బాహుబలి రికార్డు కలెక్షన్లు!
ముంబై: దేశ వ్యాప్తంగా 6500 స్ర్కీన్లపై విడుదలైన బాహుబలి-2 తొలిరోజు రికార్డు కలెక్షన్లు సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా.. ఈ ఏడాదిలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల రూపాయల కోట్ల క్లబ్లో చేరినా ఆశ్చర్యం లేదని డిస్ట్రిబ్యూటర్ అక్షయ్ రతి చెప్పారు. తొలిరోజు 70 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావచ్చని అంచనా వేశారు. బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన ఆమీర్ ఖాన్ దంగల్ సినిమా పేరిట ఉన్న అడ్వాన్స్ బుకింగ్ రికార్డును బాహుబలి-2 బ్రేక్ చేసిందని బుక్మైషో నిర్వాహకులు చెప్పారు. ఇప్పటికే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టు తెలిపారు. 'దేశ వ్యాప్తంగా వస్తున్న సమాచారం ప్రకారం బాహుబలి-2 థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. భారీగా ప్రేక్షకుల రాకతో థియేటర్ల బయట సందడి నెలకొంది' అంటూ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తగా, ఉత్తరాదిన కూడా సినిమా హాళ్లు 90 శాతం నిండాయని అంచనా. టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బాహుబలి ది కంక్లూజన్’ పై రివ్యూలు పాజిటివ్గా ఉన్నాయి. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్ల నటనకు, సాంకేతిక నిపుణుల పనితీరుకు ప్రశంసలు వస్తున్నాయి. -
రివ్యూలు బాగున్నా.. కలెక్షన్లు అంతమాత్రమే
ముంబై: ఒకేరోజు విడుదలైన బాలీవుడ్ సినిమాలు రేయీస్, కాబిల్లకు బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. వసూళ్లలో రేయీస్ దూసుకెళ్తుండగా, కాబిల్ వెనుకబడింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నా కాబిల్ సినిమాకు రోజురోజుకూ కలెక్షన్లు పడిపోతున్నాయి. జనవరి 25న విడుదలైన కాబిల్ ఏడు రోజుల్లో 61.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆదివారం వరకు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాగా సోమవారం నుంచి బాగా తగ్గాయి. సోమవారం 4 కోట్లు, మంగళవారం 3.5 కోట్ల రూపాయలు వచ్చాయి. కాబిల్లో హృతిక్ సరసన యామీ గౌతమ్ నటించింది. కాగా జనవరి 25న విడుదలైన రేయీస్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లో 62.56 కోట్లు, దేశంలో 152.61 కోట్ల రూపాయలు వచ్చాయి. -
దుమ్మురేపుతున్న 'రాయిస్'.. తొలి రికార్డు!
షారుఖ్ ఖాన్ తాజా సినిమా 'రాయిస్' భారీ వసూళ్లతో వందకోట్ల క్లబ్బు వైపు దూసుకుపోతున్నది. ఐదురోజుల్లో దేశీయంగా రూ. 93. 24 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా త్వరలోనే వందకోట్ల క్లబ్బులో అడుగుపెట్టనుంది. దీంతో ఈ ప్రతిష్టాత్మక లిస్ట్లో చోటు సాధించిన ఏడో షారుఖ్ సినిమాగా రికార్డు సొంతం చేసుకోనుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన సినిమాగా బాక్సాఫీస్ రూల్ చేస్తున్న 'రాయిస్' ఆదివారం రూ. 17.8 కోట్లు సాధించింది. అయితే, ఈ సినిమాకు పోటీగా దిగిన హృతిక్ రోషన్ 'కాబిల్' సినిమా కూడా మంచి వసూళ్లే రాబడుతున్నది. సంజయ్ గుప్తా దర్శకత్వంలో వైవిధ్యమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా తొలి ఐదురోజుల్లో దేశీయంగా రూ. 67.46 కోట్లు సాధించింది. ఆదివారం షారుఖ్ సినిమాకు గట్టిపోటీనిస్తూ.. 'కాబిల్' రూ. 15.61 కోట్లు సాధించడం గమనార్హం. బుధవారం విడుదలైన షారుఖ్ 'రాయిస్' సినిమా.. తొలిరోజు రూ. 20.42 కోట్లు, రెండో రోజు రూ. 26.30 కోట్లను వసూలు చేసింది. మూడో రోజు రూ. 13.11 కోట్లు, నాలుగో రోజు రూ. 15.61 కోట్లు, ఐదో రోజు రూ. 17.80 కోట్లు సాధించిందని, మొత్తంగా 'రాయిస్' రూ. 93.24 కోట్లు రాబట్టిందని తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుత వారంలోనూ వసూళ్లు ఈ సినిమాకు కీలకం కానున్నాయని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ స్టామినాతో పోల్లుకుంటే ఈ కలెక్షన్లు తక్కువేనని చెప్పాలి. ఇతర బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, ఆమిర్ఖాన్ సినిమాల ఓపెనింగ్స్తో పోల్చుకుంటే షారుఖ్ వెనుకబడినట్టేనని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. షారుఖ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధానపాత్రలో రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయిస్' సినిమాకు విమర్శకుల నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా షారుఖ్ను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండటంతో మొదట్లో 'కాబిల్' కన్నా మెరుగైన వసూళ్లు ఈ సినిమా రాబట్టింది. అయితే, రానురాను 'కాబిల్' సినిమాకు కూడా ఆదరణ పెరుగుతుండటంతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య పోటాపోటీ నెలకొంది. -
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'రాయిస్'
-
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'రాయిస్'
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'రాయిస్' షారుఖ్ ఖాన్ తాజా సినిమా 'రాయిస్' భారీ వసూళ్లు రాబడుతున్నది. హృతిక్ రోషన్ 'కాబిల్' సినిమాతో పోటీపడినా.. షారుఖ్ 'రాయిస్' కలెక్షన్లలో పైచేయి సాధించింది. రెండురోజుల్లో ఈ సినిమా దేశీయంగా రూ. 46.72 కోట్లు కొల్లగొట్టింది. బుధవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 20.42 కోట్లు, రెండో రోజు రూ. 26.30 కోట్లను వసూలు చేసింది. ఓవర్సీస్లో మరో తొమ్మిది కోట్లు తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ స్టామినాతో పోల్లుకుంటే ఈ కలెక్షన్లు తక్కువేనని చెప్పాలి. ఇతర బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, ఆమిర్ఖాన్ సినిమాల ఓపెనింగ్స్తో పోల్చుకుంటే షారుఖ్ వెనుకబడినట్టేనని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. షారుఖ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధానపాత్రలో రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయిస్' సినిమాకు విమర్శకుల నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా షారుఖ్ను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండటంతో 'కాబిల్' కన్నా మెరుగైన వసూళ్లు ఈ సినిమా రాబడుతున్నది. ఐదు రోజుల ఓపెనింగ్ వీకెండ్ ఉండటం కూడా 'రాయిస్' కలిసి వచ్చే విషయం. వసూళ్లు ఇలాగే నిలకడగా కొనసాగితే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. 'రాయిస్' సినిమాకు అద్భుతమైన వసూళ్లు సాధిస్తున్నదని, తొలిరెండురోజుల్లో దేశీయంగా రూ. 46.72 కోట్లు, ఓవర్సీస్లో రూ. 9.53 కోట్లు ఈ సినిమా రాబట్టిందని, మున్ముందు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింతగా దూసుకుపోయే అవకాశముందని బాలీవుడ్ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. -
మరో 'భారీ' రికార్డు సృష్టించిన ఆమిర్ 'దంగల్'!
ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన రెజ్లింగ్ డ్రామా 'దంగల్' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఆడబిడ్డల్లోని శక్తిని చాటి ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపుతున్న ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దేశీయ మార్కెట్లో 'దంగల్' రూ. 350 కోట్ల మార్క్ను దాటింది. ఈ సినిమా మూడు వారాల్లో రూ. 345.30 కోట్లు వసూలు చేసింది. అయినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద 'దంగల్' కలెక్షన్ల జోరు తగ్గలేదు. గత వారాంతంలో శుక్రవారం రూ. 10.80 కోట్లు, శనివారం రూ. 14.33 కోట్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ. 345 కోట్లు సాధించిన ఈ సినిమా అంతర్జాతీయంగా మరో 180.58 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. మరో కొత్త క్లబ్కు తెరతీసిన ఆమిర్.. 'దంగల్' సినిమాతో మరో కొత్త క్లబ్బుకు ఆమిర్ ఖాన్ తెరతీశారు. అదే రూ. 350 కోట్ల క్లబ్బు. ఇప్పటివరకు వందకోట్ల క్లబ్బును 'గజనీ'తో, రెండువందల కోట్ల క్లబ్బును 'త్రీ ఇడియట్స్', రూ. 300 కోట్ల క్లబ్బును 'పీకే'తో మొట్టమొదట ప్రారంభించిన ఆమిర్ తాజాగా రూ. 350 కోట్ల క్లబ్బులోనూ మొదట తానే అడుగుపెట్టాడు. మరో విశేషమేమిటంటే గత ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమా 'దంగల్', హాలీవుడ్ సినిమా 'ద జంగల్ బుక్' డిస్నీ ఇండియా నిర్మించినవే కావడం గమనార్హం. తన కూతుళ్లను అంతర్జాతీయ మెడళ్లను సాధించగలిగే రెజ్లింగ్ ధీశాలిలుగా తీర్చిదిద్దిన రెజ్లర్ మహవీర్సింగ్ ఫోగాట్ జీవితచరిత్ర ఆధారంగా అత్యంత హృద్యంగా 'దంగల్' సినిమాను దర్శకుడు నితేష్ తీవారి తెరకెక్కించారు. -
రెండో రోజూ భారీ కలెక్షన్లు
న్యూఢిల్లీ: కరణ్ జోహార్ సినిమా ఏ దిల్ హై ముష్కిల్ రెండో రోజూ భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాకు శనివారం 13.10 కోట్ల రూపాయలు (నెట్) వచ్చాయి. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా మొత్తం 26.40 కోట్ల రూపాయలు (నెట్) వసూలు చేసింది. దీపావళి కానుకగా శుక్రవారం 3 వేల స్క్రీన్లపై విడుదలైన ఏ దిల్ హై ముష్కిల్ తొలి రోజు దేశంలో 13.30 కోట్ల రూపాయలు (నెట్) వసూలు చేసింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్ నటించారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. కాగా పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. -
‘ప్రేమమ్’కు రికార్డు కలెక్షన్లు!
-
‘ప్రేమమ్’కు రికార్డు కలెక్షన్లు!
అక్కినేని నాగాచైతన్య తాజా సినిమా ‘ప్రేమమ్’ మంచి కలెక్షన్లు రాబడుతోంది. మలయాళం రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్టాక్ రావడం కలిసి వచ్చింది. దీంతో చైతూ సినిమాల పరంగా కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదుచేస్తున్నది. అమెరికాలో ఈ సినిమా రెండురోజుల్లోనే అర మిలియన్ డాలర్ మార్క్ (రూ. 3.32 కోట్ల) కు చేరువగా వచ్చింది. నాగార్జున, వెంకటేశ్ అతిథి పాత్రల్లో మెరిసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ స్థిరంగా వసూళ్లు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఇక, బ్లూస్కై సినిమాస్ సంస్థ ‘ప్రేమమ్’ విదేశీ హక్కులను సొంతం చేసుకొని.. ఉత్తర అమెరికా అంతటా 120 తెరల్లో విడుదల చేసింది. ఈ సినిమా అమెరికాలో తొలిరోజు 1,34,819 డాలర్ల వసూళ్లను రాబట్టింది. నాగాచైతన్య సినిమాల్లో అమెరికాలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే. గతంలో ‘దోచేయ్’ సినిమా పేరిట ఈ రికార్డు ఉండేది. మూడురోజుల్లో ‘దోచెయ్’ 1.30 లక్షల డాలర్ల కలెక్షన్లు రాబట్టగా.. తొలిరోజే ‘ప్రేమమ్’ అంతకుమించి రాబట్టింది. ఇక గురువారం ప్రీమియర్ షోల ద్వారా 74,219 డాలర్లు వసూలయ్యాయి. ప్రీమియర్ షోలు, తొలిరోజు వసూళ్ల ద్వారా ‘ప్రేమమ్’ సినిమా 2.09 లక్షల డాలర్లు (రూ. 1.39 కోట్లు) రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇక రెండోరోజు శనివారం 1.57 లక్షల డాలర్లు రాబట్టినట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా 3.66 లక్షల డాలర్ల (రూ. 2.4 కోట్ల) వసూలు చేసిందని, మున్ముందు ‘ప్రేమమ్’ వసూళ్లు మరింతగా పెరగొచ్చునని అంటున్నారు. -
'జనతా గ్యారేజ్' మరో భారీ రికార్డు!
-
'జనతా గ్యారేజ్' మరో భారీ రికార్డు!
జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్' కలెక్షన్ల విషయంలో ఇప్పటికీ జోరు ప్రదర్శిస్తున్నది. తెలుగు సినీ చలనచిత్ర చరిత్రలో మూడో అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా మూడోవారంలో నిలకడగా వసూళ్లు రాబడుతున్నది. మూడోవారానికి ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.106 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇందులో రూ. 81.4 కోట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వచ్చాయని తెలుస్తోంది. ఇక ఒక్క కర్ణాటకలో రూ.16 కోట్లు వసూలుకాగా, కేరళలో రూ. 4 కోట్లు రాబట్టింది. 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ. 120 కోట్లు వసూలు చేసిన ’జనతా గ్యారేజ్’... బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో పవన్ కల్యాణ్ ’అత్తారింటికి దారేది’ సినిమా వసూళ్లను ’జనతా’ దాటేసిందని బాక్సాఫీస్ టాక్ ను బట్టి తెలుస్తోంది. ఇక అమెరికాలోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. మూడువారంలో అమెరికాలో ’జనతా గ్యారేజ్’ వసూళ్లు బాగున్నాయని, మొత్తంగా అగ్రరాజ్యంలో ఈ సినిమా 17,77,542 డాలర్లు (రూ. 11.92 కోట్లు) సాధించిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మొత్తంగా ఈ సినిమా అమెరికాలో రెండు మిలియన్ డాలర్ల మార్క్ రాబట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రకృతి ప్రేమికుడిగా సరికొత్త పాత్రలో తారక్ విభిన్నంగా కనిపించిన ’జనతా గ్యారేజ్’.. మోహన్ లాల్, సమంత, నిత్యమీనన్ వంటి భారీ తారాగణంతో రూపొందింది. ఈ సినిమాకు మొదట డివైడ్ టాక్ వచ్చినా.. ఎన్టీఆర్, మోహన్లాల్ నటన ప్లస్ అయింది. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ చూపిన అభినయానికి ప్రశంసలు దక్కుతున్నాయి. -
హైప్ ఎక్కువ... కలెక్షన్లు తక్కువ
భారీ అంచనాలతో విడుదలైన కత్రినా కైఫ్, సిద్ధార్థ మల్హోత్రా బాలీవుడ్ సినిమా 'బార్ బార్ దేఖో' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. తొలి మూడు రోజుల్లో భారత్లో 21.16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆశ్చర్యకరంగా ఆదివారం వసూళ్లు మరింత తగ్గాయి. శుక్రవారం రూ. 6.81 కోట్లు, శనివారం రూ. 7.65 కోట్లు, ఆదివారం రూ. 6.70 కోట్లు రాబట్టిందని హిందీ సినీ విమర్శకుడు, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. నిత్యా మెహ్రా దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 'బార్ బార్ దేఖో'లో కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య సన్నివేశాలు సినిమా విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ కలెక్షన్లు ఖాయమని భావించారు. సినిమా విడుదలైన తర్వాత అంచనాలు తల్లకిందులయ్యాయి. #BaarBaarDekho Fri 6.81 cr, Sat 7.65 cr, Sun 6.70 cr. Total: ₹ 21.16 cr. India biz. — taran adarsh (@taran_adarsh) 12 September 2016 -
రెండో రోజు పెరిగిన కలెక్షన్లు
కత్రినా కైఫ్, సిద్ధార్థ మల్హోత్రా నటించిన బాలీవుడ్ సినిమా 'బార్ బార్ దేఖో' తొలి రెండు రోజుల్లో భారత్లో 14.46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. తొలిరోజు 6.81 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో రోజు 7.65 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆదివారం కూడా ఇదే స్థాయిలో కలెక్షన్లు రావచ్చని భావిస్తున్నారు. నిత్యా మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ రోమాంటిక్ డ్రామా ఫిల్మ్ 'బార్ బార్ దేఖో'లో కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ డిఫరెంట్ లుక్లో కనిపించింది. భోజనం తక్కువగా తీసుకోవడంతో పాటు జిమ్లో బాగా కష్టపడ్డానని కత్రినా చెప్పింది. -
డివైడ్ టాక్ వచ్చినా స్థిరంగా కలెక్షన్లు!
దక్షిణాది టాప్ డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన తాజా బాలీవుడ్ సినిమా 'అకీరా'. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన ఈ లేడి ఒరియంటెడ్ సినిమా ఇటు ప్రేక్షకుల నుంచి, అటు విమర్శకుల నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. ప్రారంభంలో ఈ సినిమాకు బాగా నిరాశాపూరితంగా వసూళ్లు దక్కినా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. సెప్టెంబర్ 2న విడుదలైన ఈ సినిమా మంగళవారం కూడా చెప్పుకోదగినస్థాయిలో వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఐదు రోజుల్లో రూ. 22.45 కోట్లను ఈ సినిమా తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం, సోనాక్షి, మురగదాస్ కు మంచి ఇమేజ్ ఉండటం ఈ సినిమా థియేటర్లవైపు ప్రేక్షకులను నడిపిస్తోంది. 'అకీరా' తొలిరోజు కేవలం రూ. 5.15 కోట్లు సాధించి నిరాశపరచగా, రెండోరోజు రూ. 5.30 కోట్లు వసూలు చేసింది. మూడోరోజు వసూళ్లు గణనీయంగా పెరిగి.. రూ.6.20 కోట్లు రాబట్టింది. ఇక సోమవారం రూ. 3.40 కోట్లు రాబట్టగా, మంగళవారం రూ. 2.40 కోట్లు రాబట్టిందని, మొత్తంగా భారత్ లో ఈ సినిమా రూ. 22.45 కోట్లు రాబట్టిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు. రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి సేఫ్ ప్రాజెక్టు అయ్యే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. మురగదాస్కు సోనాక్షి సిన్హాతో ఇది రెండో సినిమా. అక్షయ్కుమార్, సోనాక్షి జంటగా ఆయన తీసిన 'హాలీడే: ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతకుముందు ఆయన అమీర్ఖాన్తో తీసిన 'గజనీ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
వందకోట్ల దిశగా దూసుకుపోతున్న 'జనతా'!
తొలి వారంలో తిరుగులేని వసూళ్లు సాధించడంతో జూనియర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' శరవేగంగా వందకోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. తెలుగు, మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమా.. తొలివారంలో రెండు భాషల్లో కలిపి.. మొత్తంగా రూ. 79 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని 'ఆంధ్ర బాక్పాఫీస్' కథనాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల జాతీయ పత్రిక తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే రూ. 51 కోట్లు వసూలు చేసింది. అలాగే, కేరళ, అమెరికాల్లోనూ రికార్డు వసూళ్లు రాబట్టింది. అమెరికాలో రూ. 10.5 కోట్లు, కేరళలో రూ. 9.50 కోట్లు వసూలు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన 'జనతా గ్యారేజ్' తొలిరోజు రికార్డు స్థాయిలో రూ. 21 కోట్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత వేగవంతంగా వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో రాజమౌళి 'బాహుబలి' సినిమా రికార్డులను కూడా 'జనతా గ్యారేజ్' అధిగమించినట్టు చెప్తున్నారు. ఆంధ్రలోని వైజాగ్, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు భారత్ లోనూ, అటు అమెరికాలోనూ వారాంతపు పొడిగింపు ఉండటం ఈ సినిమాకు బాగా కలిసివచ్చింది. తొలి వీకెండ్ ముగిసిన తర్వాత సోమ, మంగళవారాల్లోనూ 'జనతా గ్యారేజ్' నిలకడగా వసూళ్లు సాధిస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ప్రకృతి ప్రేమికుడిగా జూనియర్ ఎన్టీఆర్ నటన, హీరోకు దీటుగా మోహన్ లాల్ పాత్రను తీర్చిదిద్దడం బాగా కలిసి వచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు. -
‘జనతా గ్యారేజ్’ కు వసూళ్ల వర్షం
జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ అమెరికాలో దూసుకుపోతోంది. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అమెరికాలో ఈ సినిమా వసూళ్లు రూ. 10 కోట్లు దాటాయి. సోమవారం నాటికి రూ. 10.30 కోట్లు కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. డివైడ్ టాక్ వచ్చినా ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుండడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. నాలుగురోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ను అధిగమించి టాలీవుడ్లో 'బాహుబలి' తర్వాత అత్యంత వేగంగా రూ. 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా 'జనతా గ్యారేజ్' రికార్డు సృష్టించింది. కలెక్షన్లు నిలకడగా ఉండడంతో ‘జనతా గ్యారేజ్’ రూ.100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలున్నాయని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. Telugu film #JanathaGarage did GOOD biz on Mon [Labor Day holiday] in USA... Mon $ 115,793. Total: $ 1,553,591 [₹ 10.30 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) 6 September 2016 -
'జనతా గ్యారేజ్' భారీ రికార్డు!
జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్'. ప్రకృతి ప్రేమికుడిగా సరికొత్త పాత్రలో తారక్ విభిన్నంగా కనిపించిన ఈ సినిమా.. రికార్డులను బద్దలుకొడుతూ ముందుకుసాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా..' నాలుగురోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ను దాటింది. తద్వారా టాలీవుడ్లో 'బాహుబలి' తర్వాత అత్యంత వేగంగా రూ. 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా 'జనతా గ్యారేజ్' రికార్డు సృష్టించింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. ఎన్టీఆర్, మోహన్లాల్ వంటి భారీ తారాగణం ఉండటం 'జనతా గ్యారేజ్'కు ప్లస్ అయింది. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ చూపిన అభినయానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాకు రివ్యూలు ఎలా వచ్చినా తొలిరోజు వసూళ్లు మాత్రం దుమ్మురేపాయి. ఏకంగా తొలిరోజు రూ. 21 కోట్లు కొల్లగొట్టిన 'జనతా గ్యారేజ్'.. నాలుగో రోజైన ఆదివారం రూ. 5 కోట్లు మాత్రమే సాధించినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఈ సినిమా దాదాపు రూ. 9.31 కోట్ల (1.4 మిలియన్ డాలర్ల) వసూళ్లు రాబట్టింది. డివైడ్ టాక్ వచ్చినా పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్', మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' తొలి వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టాయి. 'సర్దార్ గబ్బర్సింగ్' రూ. 40 కోట్లు, 'బ్రహ్మోత్సవం' రూ. 30 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ రెండు సినిమాలను అధిగమించి భారీస్థాయిలో తారక్ సినిమా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. అమెరికాలో మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్లను సాధించిన ఎన్టీఆర్ నాలుగో సినిమా ఇది. ఇంతకుమునుపు నాన్నకు ప్రేమతో, టెంపర్, బాద్షా సినిమాలు అగ్రరాజ్యంలో మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లు సాధించాయి. టాక్ ఎలా ఉన్నా 'జనతా గ్యారేజ్' వసూళ్లు స్థిరంగా ఉండటంతో మున్ముందు కలెక్షన్లపరంగా మరిన్ని రికార్డులు ఈ సినిమా సృష్టించవచ్చునని భావిస్తున్నారు. -
మూడో రోజు బాగా పెరిగిన కలెక్షన్లు!
భారీ యాక్షన్ సినిమాల్ని తెరకెక్కించే దర్శకుడు మురగదాస్.. సోనాక్షి సిన్హాతో ఆయన తీసిన లేడి ఒరియంటెడ్ సినిమా 'అకీరా' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ పోరాట సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న 'అకీరా' తొలిరోజు కేవలం రూ. 5.15 కోట్లు సాధించి నిరాశపరచగా, రెండోరోజు రూ. 5.30 కోట్లు వసూలు చేసింది. మూడోరోజు మాత్రం ఈ సినిమా వసూళ్లు గణనీయంగా పెరిగాయి. మూడోరోజైన ఆదివారం ఈ సినిమా ఏకంగా రూ.6.20 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా తొలి వీకెండ్లో రూ. 16 కోట్లు కొల్లగొట్టింది. దక్షిణాది డైరెక్టర్ అయిన మురగదాస్కు సోనాక్షి సిన్హాతో ఇది రెండో సినిమా. అక్షయ్కుమార్, సోనాక్షి జంటగా ఆయన తీసిన 'హాలీడే: ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతకుముందు ఆయన అమీర్ఖాన్తో తీసిన 'గజనీ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
కాసుల వర్షం కురిపిస్తున్న ‘జనతా గ్యారేజ్’
-
కాసుల వర్షం కురిపిస్తున్న ‘జనతా గ్యారేజ్’
ఎన్టీఆర్ తాజా సినిమా ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ ను దాటేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. కబాలి(రూ.87.5 కోట్లు), బాహుబలి(రూ.73 కోట్లు) తర్వాత అత్యధిక ఓపెన్సింగ్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలియింది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జనతా గ్యారేజ్’ తొలి రోజే రూ. 41 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో తొలి మూడు రోజుల్లో రూ. 6.34 కోట్లు కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. రూ. 40 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా సూపర్ హిట్ అంటున్నారు. లాంగ్ వీకెండ్ ఉండటం వరుసగా సెలవులు కూడా రావటంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Telugu film #JanathaGarage is having a TERRIFIC RUN in USA... Wed + Thu $ 737,816, Fri $ 215,221. Total: $ 953,037 [₹ 6.34 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) 3 September 2016 -
మూడు రోజుల్లో రూ. 20.45 కోట్ల కలెక్షన్లు
ముంబై: టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'ఎ ఫ్లయింగ్ జాట్' బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా వసూళ్లు రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లో రూ. 20.45 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. ఈ నెల 25న ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజు రూ. 7.10 కోట్లు, రెండో రోజు రూ. 6 కోట్లు మూడో రోజు రూ. 7.35 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు. 'ఎ ఫ్లయింగ్ జాట్' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో అనుకున్నస్థాయిలో ఆరంభ వసూళ్లు రాలేదు. రెమో ఫెర్నాండెజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించింది. కీలకపాత్రలో నాథన్ జోన్స్ నటించాడు. -
'బాబు బంగారం' భారీ కలెక్షన్లు
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన 'బాబు బంగారం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి నాలుగు రోజుల్లో రూ. 25 కోట్లు కలెక్షన్లు సాధించింది. వెంకటేశ్ సోలోగా నటించిన సినిమాకు భారీస్థాయిలో చాలా కాలం తర్వాత వసూళ్లు వచ్చాయని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. నాలుగు రోజుల వీకెండ్ లో ఈ సినిమా రూ. 25 కోట్ల గ్రాస్, రూ. 17 కోట్ల షేర్ సాధించిందని వెల్లడించారు. తమ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడంపై నిర్మాత నాగవంశీ సంతోషం వ్యక్తం చేశారు. 'బాబు బంగారం'కు స్పందన బాగుందని, తమ సినిమా విజయవంతం అయిందనడానికి వసూళ్లే నిదర్శనమని అన్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 12న విడుదలైంది. వెంకటేశ్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. -
సుల్తాన్ మోసపోయాడా ?
-
'సుల్తాన్' కలెక్షన్ల వెనుక గూడుపుఠాణి!
జూలై 6న విడుదలైన సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమా వస్తూనే కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. తొలిరోజే రూ. 36 కోట్లకుపైగా కొల్లగొట్టిన ఈ సినిమా.. తొలి వీకెండ్లో రూ.100 కోట్లను తన ఖాతాలో వేసుకొంది. రెండోవారంలోనూ వసూళ్ల ప్రభంజనం కొనసాగడంతో కొన్నిరోజుల్లోనే 200 కోట్ల క్లబ్బులోనూ 'సుల్తాన్' చేరిపోయింది. సల్మాన్ఖాన్, అనుష్క శర్మ జంటగా ఓ మల్లయోధుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలుకొడుతుందని పరిశీలకులు భావించారు. సల్మాన్ ఖాన్ 'బజరంగీ భాయ్జాన్' తర్వాత దేశంలో రూ. 300 కోట్లు వసూలుచేసిన మరో సినిమాగా 'సుల్తాన్' నిలుస్తుందని ఆశించారు. కానీ, రానురాను 'సుల్తాన్' వసూళ్లు దారుణంగా తగ్గిపోయాయి. ఇప్పుడు నాలుగో వారంలోకి ప్రవేశించినప్పటికీ 'సుల్తాన్' రూ. 300 కోట్ల క్లబ్బులోకి ప్రవేశించలేదు. నాలుగో వారం ముగిసేసరికి ఈ సినిమా రూ. 297.56 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. అభిమానుల అనుమానం! 'సుల్తాన్' కలెక్షన్ల విషయంలో సల్మాన్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 'సుల్తాన్' నిర్మాత అయిన యష్రాజ్ ఫిలిమ్స్ (వైఎఆర్ఎఫ్) సంస్థ కావాలనే సినిమా వసూళ్లను తక్కువచేసి చూపిస్తున్నదని మండిపడుతున్నారు. 'సుల్తాన్' సినిమా దేశీయంగా రూ.300 కోట్ల క్లబ్బులో చేరితే.. లాభాల్లో తనకు గణనీయమైన వాటా ఇవ్వాలని సల్మాన్ నిర్మాతతో ఒప్పందం చేసుకున్నాడట. సాధారణంగా బాలీవుడ్ ఖాన్ త్రయం తమ సినిమా లాభాల విషయంలో నిర్మాతతో ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. అదేవిధంగా నిర్మాతతో సల్మాన్ కూడా ఒప్పందం చేసుకున్నాడని, దీంతో 'సుల్తాన్' రూ. 300 కోట్ల క్లబ్బులో చేరకుండా తక్కువ వసూళ్లను నిర్మాత చూపిస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. 'సుల్తాన్ వసూళ్లను తక్కువ చేసి చూపడం మానండి' అంటూ (#YRFStopReducingSULTANFigures) ట్విట్టర్లో సల్మాన్ ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారం ఇప్పుడు ట్రేండ్ అవుతోంది. దీనిపై చిత్రయూనిట్ ఏమంటుందో చూడాలి? -
మూడ్రోజుల్లో 'కబాలి' కలెక్షన్ ఎంతో తెలుసా?
‘కబాలి’ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి రజనీకాంత్ రుజువు చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాను తలదన్నేరీతిలో ‘కబాలి’ తొలి మూడురోజుల్లో వసూళ్లు రాబట్టింది. ‘సుల్తాన్’ సినిమా తొలి మూడురోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేయగా.. ‘కబాలి’ కూడా తొలి మూడురోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ ను దాటింది. ఈ సినిమా తొలి మూడురోజుల వసూళ్లు ఎంత అనేది వివరాలు తెలియకపోయినా.. మొదటి మూడురోజుల్లో ‘కబాలి’ వందకోట్ల మార్క్ను క్రాస్ చేసిందని సినీ పండితులు చెప్తున్నారు. భారీ అంచనాలతో, రజనీ మేనియాతో విడుదలైన ‘కబాలి’ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. మొదటిరోజే రూ. 48 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ‘సుల్తాన్’ రికార్డును దాటేసింది. ‘సుల్తాన్’ సినిమా తొలిరోజు రూ. 36.54 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు కలెక్షన్ల విషయంలో ‘సుల్తాన్’ రికార్డును అధిగమించినప్పటికీ ‘బాహుబలి’ (రూ.50 కోట్లు) రికార్డును ‘కబాలి’ దాటలేకపోయింది. ఇక, రెండో, మూడోరోజున కూడా ‘కబాలి’ సినిమా భారీగా రికార్డు కొల్లగొట్టిందని, నెగిటివ్ టాక్ ఈ సినిమా ప్రారంభ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదని సినీ పండితులు చెప్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఈ సినిమా వసూళ్లు భారీస్థాయిలో ఉన్నారని చెప్పారు. సాధారణంగా దక్షిణ భారతంలోనే రజనీ ఫ్యాన్స్ కు ఎక్కువ. ఉత్తర భారతంలో పెద్దగా ఆయన చిత్రాలు ఆడవు. అయితే, ఈ అపప్రథను తాజాగా ‘కబాలి’ దూరం చేసింది. ఉత్తర భారతంలోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నదని బాలీవుడ్ ట్రేడ్ అనాలిసిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఉత్తర భారతంలో తొలి రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 11.4 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలిరోజున తమిళనాడులో రూ. 21.5 కోట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రూ. 13.5 కోట్లు వసూలు చేసింది. -
ఆన్ లైన్ లో లీక్.. ఆ సిన్మా కొంపముంచింది!
అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'మస్తీ', 'గ్రాండ్ మస్తీ' సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. 'గ్రాండ్ మస్తీ' సినిమా అయితే ఏకంగా వందకోట్లు వసూలు చేసి.. ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో వెల్లువెత్తడానికి గేట్లు ఎత్తేసింది. ఈ నేపథ్యంలో'మస్తీ' సిరీస్ లో వస్తున్న 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' సినిమా కూడా బాగా కాసుల వర్షం కురిపిస్తుందని చిత్రయూనిట్ భావించింది. అయితే; 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీక్ కావడం.. ఈ సినిమా ఆశలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆన్ లైన్ లో లీకవ్వడంతో అనుకున్న తేదీ కన్నా ఒక వారం ముందే ఈ సినిమాను ప్రేక్షకుల మీదకు వదిలారు. అయినా, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది. తొలి వీకెండ్ లో కేవలం రూ. 2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమవ్వడంతో చిత్ర దర్శకుడు ఇంద్రకుమార్, హీరోలు వివేక్ ఒబరాయ్, రితేశ్ దేశ్ ముఖ్, ఆఫ్తాబ్ శివదాసని తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' తన కలెక్షన్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నాడు. 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'ని చిత్తుచేస్తూ 'సుల్తాన్' రెండోవారంలోనూ భారీగా వసూళ్లు రాబడుతున్నాడు. రెండో వీకెండ్ మొదటి రోజైన శుక్రవారం ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 7.43 కోట్లు వసూలు చేసింది. దీంతో జూలై 6న విడుదలైన ఈ సినిమా మొత్తంగా దేశంలో రూ. 236.59 కోట్లు వసూలు చేసి.. కలెక్షన్ల పరంగా గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. -
'సుల్తాన్' ఓపెనింగ్స్ రూ.150 కోట్లు?
ముంబై: 'సుల్తాన్' గత రికార్డులను బ్రేక్ చేయనున్నాడా. బాక్సాఫీస్ లో కొత్త రికార్డు నెలకొల్పనున్నాడా. బుధవారం ఒక్కరోజే 150 కోట్లు కలెక్షన్లు సాధించనున్నాడా. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'సుల్తాన్' బుధవారం విడుదలవుతున్న నేపథ్యంలో ట్రేడ్ ఎనలిస్టులు బాక్సాఫీస్ కలెక్షన్లు అంచనా వేయడం మొదలు పెట్టారు. ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. రంజాన్ కానుకగా రేపు విడుదలవుతున్న 'సుల్తాన్' మొదటి వారం కలెక్షన్లు కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఈ సినిమా ఓపెనింగ్స్ రూ. 160 కోట్లు ఉంటాయని ట్రేడ్ ఎక్స్ఫర్ట్ అముల్ మోహన్ అంచనా వేశారు. సల్మాన్ ఖాన్, యశ్ రాజ్ ఫిలిమ్స్, రంజాన్ రోజున విడుదల ఈ మూడు సమీకరణాల నేపథ్యంలో 'సుల్తాన్'కు భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశముందని మరో ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు రెట్టింపవుతూ వచ్చాయని గుర్తు చేశారు. దీంతో 'సుల్తాన్'పై అంచనాలు భారీగా ఉన్నాయని వివరించారు. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. 'సుల్తాన్'కు జోడిగా అనుష్క శర్మ నటించింది. -
కలెక్షన్లలో దూసుకుపోతున్న 'ఫ్యాన్'!
కింగ్ ఖాన్ షారుఖ్ తాజా సినిమా 'ఫ్యాన్' అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతుండగా.. రివ్యూ రేటింగ్స్ కూడా బాగానే వచ్చాయి. హీరో- అభిమానికి మధ్య పోరాటంగా తెరకెక్కిన ఈ సినిమాతో షారుఖ్ మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా కలెక్షన్ల విషయానికొస్తే.. ఊహించినట్టే 'ఫ్యాన్' భారీ వసూళ్లను రాబడుతున్నది. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ. 19.20 కోట్లు వసూలు చేసింది. రెండోరోజుకు వచ్చేసరికి ఈ సినిమా కలెక్షన్లలో భారీ కోత నమోదైంది. రెండో రోజు కేవలం రూ. 15.40 కోట్లు రాబట్టింది. మొత్తంగా భారత్లో ఈ సినిమా విడుదలైన తొలి రెండు రోజుల్లో రూ. 34.60 కోట్లు రాబట్టగా.. విదేశాల్లో రూ. 17.93 కోట్లు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలసిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. -
'నిజమే సినిమా కలెక్షన్ తగ్గింది'
కోల్ కతా: దేశంలో మత అసహనం పెరిగిపోతుదంటూ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ స్పష్టం చేశాడు. తన వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే' సినిమా కలెక్షన్లపై పడడంతో విచారం వ్యక్తం చేశాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వక్రీకరించారని వాపోయాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కోల్ కతా వచ్చిన షారూఖ్ మీడియాతో మాట్లాడాడు. 'అసహనంపై నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనుకోవడం లేదు. వివరణ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా. నా కళ్లతో చూసిందే నేను మాట్లాడాను. నా గురించి ప్రజలకు తెలుసు. అయితే నేను మాట్లాడినదాన్ని వారు అర్థం చేసుకోలేదు. నా వ్యాఖ్యలను సరిగా ప్రజెంట్ చేయలేదు. నా మాటలతో ఎవరైనా బాధపడివుంటే విచారం వ్యక్తం చేస్తున్నా' అని షారూఖ్ చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే' కలెక్షన్లపై పడిందని అతడు అంగీకరించాడు. వివాదాల జోలికి పోకుండా తన సినిమాను అందరూ చూడాలని విజ్ఞప్తి చేశాడు. ప్రాంతం, కులం, మతం, లింగ వివక్ష లేకుండా అందరూ తనను 25 ఏళ్లుగా ఆదరిస్తున్నారని తెలిపాడు. తన సినిమాల ద్వారానే తన ప్రేమను వారికి తిరిగి ఇవ్వగలనని చెప్పాడు. కొంతమంది దుష్ప్రచారం చేసినంతమాత్రానా తన దేశభక్తిని శంకించాల్సిన పనిలేదన్నాడు. -
భజరంగీని దాటేసిన ధన్పాయో!
సల్మాన్ఖాన్, సోనంకపూర్ జంటగా నటించిన ప్రేమ్రతన్ ధన్పాయో చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించి.. సల్మాన్ గత సినిమా బజరంగీ భాయ్జాన్ రికార్డును అధిగమించింది. ప్రేమ్రతన్ ధన్పాయో తొలి రెండురోజుల్లో రూ. 71.38 కోట్లను వసూలు చేసినట్టు తెలిసింది. 2015 సంవత్సరంలో తొలిరెండురోజుల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఈ చిత్రం రికార్డులకెక్కింది. ఇంతకుమునుపు బజరంగీ భాయ్జాన్ చిత్రం రెండురోజుల్లో రూ. 63.75 కోట్ల వసూళ్లు రాబట్టింది. కుటుంబకథా చిత్రాలను అందంగా తెరకెక్కించే సూరజ్ బార్జాత్యా తీసిన ప్రేమ్రతన్ ధన్పాయో సినిమాకు మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ తొలిరోజు రికార్డుస్థాయిలో రూ. 40.35 కోట్లను వసూలు చేసింది. అయితే, రెండోరోజు ఈ సినిమా కలెక్షన్ 23శాతం పడిపోయింది. మొత్తానికి మూడు రోజుల్లో ఈ సినిమా వందకోట్ల మార్కును దాటే అవకాశముంది. -
కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కాకముట్టై
-
మనం కురిపిస్తోన్న ధనం