-
అండర్సన్ సంచలన నిర్ణయం.. 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై!
ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు ఆండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న ఆండర్సన్.. ఈ వేసవి సీజన్తో టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నాడు. ఈ ఏడాది జూలైలో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగే తొలి టెస్టు అనంతరం తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు విడ్కోలు పలకున్నట్లు ఆండర్సన్ ప్రకటించాడు. ఈ విషయాన్ని శనివారం సోషల్ మీడియా వేదికగా 41 ఏళ్ల ఆండర్సన్ వెల్లడించాడు."ఈ వేసవిలో లార్డ్స్లో వెస్టిండీస్తో జరిగే మొదటి టెస్ట్ నా చివరి టెస్టు మ్యాచ్. 20 ఏళ్లకు పైగా నా దేశానికి అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. నేను ఎంతో ఇష్టపడే ఆటకు విడ్కోలు పలుకుతుండడం చాలా బాధగా ఉంది. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ఇంగ్లండ్ క్రికెట్కు ,అభిమానులకు ధన్యవాదాలంటూ" ఇన్స్టాగ్రామ్లో జేమ్స్ రాసుకొచ్చాడు. ఇక ఆండర్సన్కు వరల్డ్క్రికెట్లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్గా 400 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by James Anderson (@jimmya9) -
విరాట్ గొప్ప బ్యాటర్.. ఎంట్రీ ఇస్తే ఏం చేయాలో తెలుసు!
'Respect His Prowess & Competitiveness': టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఆటంటే తనకెంతో గౌరవమని.. అతడు భాగంగా ఉన్న జట్టుతో పోటీపడటాన్ని తాను ఆస్వాదించేవాడినని గుర్తు చేసుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలు కోహ్లి సొంతమన్న మెకల్లమ్.. ప్రత్యర్థి జట్టుతో అతడు పోటీపడే తీరు మజా అందిస్తుందని పేర్కొన్నాడు. ఏదేమైనా మూడో టెస్టుతో కోహ్లి రీ ఎంట్రీ ఇస్తే అతడిని ఎదుర్కొనేందుకు తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు. కాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కెప్టెన్ బెన్ స్టోక్స్తో కలిసి.. ‘బజ్బాల్’ పేరిట సంప్రదాయ క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఇంగ్లండ్ విజయవంతంగా ముందుకు సాగుతుండటం విశేషం. ఈ క్రమంలో భారత్ వేదికగా టీమిండియాతో తొలి టెస్టులో గెలుపొందిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్లో మాత్రం భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ రెండు టెస్టులకు భారత మాజీ సారథి విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరమయ్యాడు. అందుకే కోహ్లి దూరం గర్భవతిగా ఉన్న భార్య అనుష్క శర్మ కోసం అతడు సమయం కేటాయించాడని కోహ్లి స్నేహితుడు ఏబీ డివిలియర్స్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు కోహ్లి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లి పోటీతత్వం అంటే నాకెంతో గౌరవం ఈ నేపథ్యంలో బ్రెండన్ మెకల్లమ్ టాక్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘గొప్ప క్రికెటర్లలో విరాట్ కోహ్లి ఒకడు. అతడి ఆట, పోటీతత్వం అంటే నాకెంతో గౌరవం. తనతో మ్యాచ్లు ఆడటాన్ని నేను ఆస్వాదించేవాడిని. విజయవంతమైన ఆటగాడితో పోటీ పడటం అంటే.. మనం కూడా ఎంతో కొంత నేర్చుకునే వీలు ఉంటుంది కదా!’’ అంటూ కోహ్లిని కొనియాడాడు. మూడో టెస్టు నేపథ్యంలో కోహ్లి తిరిగి వస్తే.. అతడిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై దృష్టి సారించామని మెకల్లమ్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా కోహ్లి రీఎంట్రీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం గురించి రాహుల్ ద్రవిడ్కు ప్రశ్న ఎదురుకాగా.. సెలక్టర్లకే కోహ్లి అందుబాటులో ఉండే విషయం గురించి అవగాహన ఉంటుందని తెలిపాడు. అతడితో వాళ్లు టచ్లో ఉన్నారని.. జట్టు ప్రకటన నాటికి క్లారిటీ వస్తుందంటూ మాట దాటేశాడు. చదవండి: శివం దూబేకు విశ్రాంతి.. శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ! -
మళ్లీ స్పిన్ పిచ్కు సిద్ధమే!
విశాఖపట్నం: రెండో టెస్టులోనూ స్పిన్ పిచ్పై సమరానికి సిద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. స్పిన్నర్ టామ్ హార్లీ మాయాజాలంతో హైదరాబాద్ టెస్టులో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్లో 1–0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్లో మరో పూర్తిస్థాయి స్పిన్ ట్రాక్ ఎదురైనా... తమ దళంలో అందుబాటులో ఉన్న నలుగురు స్పిన్నర్లతో దీటుగా ఎదుర్కొంటామని కోచ్ చెప్పారు. ‘ఒకవేళ తొలి టెస్టులాగే వైజాగ్లోని పిచ్ కూడా స్పిన్కే అనుకూలిస్తే భయపడం. జట్టులోని స్పిన్నర్లు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. షోయబ్ బషీర్ అబుదాబిలో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆడే సిరీస్లోనూ రాణించే నైపుణ్యం అతనికి ఉంది. తప్పకుండా ఇక్కడ కూడా అతను ప్రభావం చూపుతాడు’ అని మెకల్లమ్ అన్నాడు. వైజాగ్ చేరుకున్న ఇరుజట్లు భారత్, ఇంగ్లండ్ జట్లు మంగళవారం సాయంత్రం వైజాగ్ చేరుకున్నాయి. నేరుగా హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు అక్కడి నుంచి బస చేసే హోటల్కు వెళ్లిపోయారు. అనంతరం ఆటగాళ్లంతా ప్రయాణ బడలిక దృష్ట్యా పూర్తిగా హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టు జరుగుతుంది. -
ఇంగ్లండ్ కోచ్ మెక్కల్లమ్కు చేదు అనుభవం..
యాసెస్ సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. మూడోరోజు ఆటలో రెండు సెషన్లు దాదాపు వర్షంతో తుడిచిపెట్టుకుపోయినప్పటికి.. ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కేవలం ఆఖరి సెషన్లోనే మిగతా ఆరు వికెట్లు కూల్చిన ఇంగ్లండ్.. ఆసీస్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 251 పరుగుల టార్గెట్ను ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో ఇంగ్లండ్ గెలుస్తుందా.. లేక ఆసీస్ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంటుందా అనేది చూడాలి. కాగా లార్డ్స్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు సహా సిబ్బందికి ఏదో ఒక రకంగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ అభిమానుల దృష్టిలో అలెక్స్ కేరీ విలన్గా మారిపోయాడు. ఇక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్కు కూడా లీడ్స్లోని హెడ్డింగ్లే స్టేడియంలో చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టు ప్రారంభానికి ముందు స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎంట్రీ పాస్ లేదని ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ను స్టేడియం లోపలికి అనుమతించలేదని సమాచారం. ఇంగ్లండ్ మీడియాలో దీని గురించి కథనాలు వెలువడ్డాయి. ఆ కథనాల ప్రకారం.. సరైన ఎంట్రీ పాస్ లేకపోవడంతో మెక్కల్లమ్ను భద్రతా సిబ్బంది గేటు వద్ద ఆపేశారు. డ్యూటీలో ఉన్న సెక్యురిటీ గార్డ్ మెక్కల్లమ్ను గుర్తుపట్టలేదు. అంతేకాకుండా అతడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో సెక్యురిటీ గార్డ్ తన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెక్కల్లమ్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భద్రతా సిబ్బందిని హెచ్చరించి అక్కడి నుంచి ముందుకుసాగాడు. ఇక మెక్కల్లమ్ న్యూజిలాండ్ తరపున 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టి20 మ్యాచ్లు ఆడి.. ఓవరాల్గా అన్ని ఫార్మాట్లు కలిపి 14,676 పరుగులు సాధించాడు. విధ్వంసకర బ్యాటర్గా పేరు పొందిన మెక్కల్లమ్ ఖాతాలో 19 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
ఈ మెక్ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడు.. శతక్కొట్టి చుక్కలు చూపించాడు
వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఒమన్తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్లో స్కాట్లాండ్ యువ ఆటగాడు బ్రాండన్ మెక్ముల్లెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో మెక్ముల్లెన్ 92 బంతుల్లోనే శతక్కొట్టి, ఒమన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ తర్వాత మరింత వేగంగా ఆడిన మెక్ముల్లెన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రాండన్ మెక్ముల్లెన్ పేరు హిట్టింగ్ దిగ్గజం, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ పేరుకు దగ్గరగా ఉండటం, మెక్కల్లమ్ తరహాలో మెక్ముల్లెన్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం చూసి నెటిజన్లు ఈ స్కాటిష్ హిట్టర్ను మెక్కల్లమ్తో పోలుస్తున్నారు. ఈ మెక్ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడంటూ కితాబిస్తున్నారు. పైగా మెక్ముల్లెన్ బౌలింగ్లోనూ ఇరగదీశాడంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, 23 ఏళ్ల మెక్ముల్లెన్.. స్కాట్లాండ్ తరఫున 11 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 326 పరుగులు చేసి.. బౌలింగ్లో ఓసారి 5 వికెట్ల ఘనతతో 17 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, బులవాయో వేదికగా ఒమన్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు. -
'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్తో బిజీగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. బజ్బాల్ ఆటతీరుతో దూకుడు మీదున్న ఇంగ్లండ్కు.. ఆసీస్ ఓటమి రుచి చూపించి బ్రేకులు వేసింది. అయితే 2021లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ 0-4 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దెబ్బతో అప్పటి టెస్టు కెప్టెన్ జో రూట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా.. బ్యాటింగ్ మెంటార్గా ఉన్న గ్రహం థోర్ఫ్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న అష్లే గైల్స్ తమ పదవులను కోల్పోయారు. ఆ తర్వాత రాబ్ కీ అనే వ్యక్తి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి కొత్త డైరెక్టర్గా ఎంపికయ్యాడు. కాగా రాబ్ కీ వచ్చీ రావడంతోనే తన మార్క్ను చూపించే ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి మెక్కల్లమ్ కంటే ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా పాంటింగ్ తాజాగా రివీల్ చేశాడు. గురిల్లా క్రికెట్పాడ్ కాస్ట్కు ఇంటర్య్వూ ఇచ్చిన పాంటింగ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మెక్కల్లమ్ కంటే ముందు ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవికి నన్ను ముందు సంప్రదించారు. ఈ విషయంలో రాబ్ కీ కీలకంగా వ్యవహరించాడు. అతనే స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇంగ్లండ్ టెస్టు కోచ్గా ఆఫర్ ఇచ్చాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో దానిని తిరస్కరించా. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కోచ్గా ఫుల్టైమ్ పనిచేయడానికి అప్పటికి నేను మానసికంగా సిద్దం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు కావడం.. అంతర్జాతీయ కోచ్గా ఉంటే జట్టుతో పాటు వివిధ దేశాలకు పర్యటించాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని అనుకోలేదు. అందుకే కోచ్ పదవి ఆఫర్ను తిరస్కరించాల్సి వచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ను ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ పదవి వరించింది. రూట్ స్థానంలో బెన్ స్టోక్స్ టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. వీరిద్దరు కలిసిన తర్వాత ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ పూర్తిగా మారిపోయింది. బజ్బాల్ క్రికెట్ను పరిచయం చేసిన ఈ ద్వయం ఇంగ్లండ్కు టెస్టుల్లో వరుస విజయాలు కట్టబెట్టారు. ఈ ఇద్దరు బాధ్యతలు తీసుకున్నాకా ఇంగ్లండ్ టెస్టుల్లో 13 మ్యాచ్ల్లో 11 విజయాలు సాధించడంతో పాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లపై సిరీస్ విజయాలు సాధించింది. చదవండి: హెచ్సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
ఇంగ్లండ్ హెడ్ కోచ్కు బిగ్ షాక్.. వివాదంలో మెకల్లమ్!
లండన్: ఇంగ్లండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఒక బెట్టింగ్ కంపెనీ ‘22బెట్ ఇండియా’కు అతను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో బెట్టింగ్ చేయమంటూ అభిమానులను ప్రోత్సహిస్తూ అతను ఇచ్చిన ప్రకటనలు ఇటీవల వెల్లువెత్తాయి. సైప్రస్లో రిజిస్టర్ అయిన బెట్22తో గత నవంబర్లో మెకల్లమ్ ఒప్పందం కుదర్చుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దీనిపై దృష్టి సారించింది. ఈసీబీ అవినీతి నిరోధక విభాగం నిబంధనల ప్రకారం ‘ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెట్టింగ్లో పాల్గొనడం, పాల్గొనేలా చేయడం లేదా అందుకు ప్రోత్సహించడం చేయరాదు’. టీమ్ హెడ్ కోచ్గా మెకల్లమ్కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లు ఈసీబీ ప్రకటించింది. న్యూజిలాండ్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తుండటంతో ‘22బెట్ ఇండియా’పై ఆ దేశం నిషేధం విధించింది కూడా. ఆ దేశానికి చెందిన ‘ప్రాబ్లమ్ గ్యాంబ్లింగ్ ఫౌండేషన్’ సంస్థనే మెకల్లమ్ గురించి ఈసీబీకి తెలియజేసింది. మెకల్లమ్ కోచ్గా వచ్చాక ఆడిన 12 టెస్టుల్లో ఇంగ్లండ్ 10 టెస్టులు గెలిచింది. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్రైజర్స్ ఆటగాడిగా -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా స్టోక్స్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్తో జరగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో స్టోక్స్ తన మొదటి సిక్స్తో ఈ రికార్డును తన పేరిట లిఖించకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఇంగ్లండ్ హెడ్ కోచ్ మెకల్లమ్ పేరిట ఉండేది. తన కెరీర్లో 101 మ్యాచ్లు ఆడిన మెకల్లమ్107 సిక్స్లు బాదాడు. తాజా మ్యాచ్తో మెకల్లమ్ రికార్డును స్టోక్స్ బ్రేక్ చేశాడు. కాగా స్టోక్స్ ఇప్పటివరకు 90 మ్యాచుల్లో 108 సిక్స్లు కొట్టాడు. ఇక తర్వాత స్థానాల్లో ఆడమ్ గిల్ క్రిస్ట్ (100), క్రిస్ గేల్(98), జాక్వెస్ కల్లీస్ (97) వరసగా ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 19 పరుగులు చేసిన స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్లో 31 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 72 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 365 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్ 384 పరుగుల ముందంజలో ఉంది. కాగా టెస్టు మ్యాచ్ను ఇంగ్లండ్ వన్డే తరహాలో ఆడుతోంది. చదవండి: Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం.. Most Test Sixes: 109 BEN STOKES 🏴 (164 innings) 107 Brendon McCullum 🇳🇿 (176) 100 Adam Gilchrist 🇦🇺 (137) 98 Chris Gayle 🏝️ (182) 97 Jacques Kallis 🇿🇦 (280) 91 Virender Sehwag 🇮🇳 (180) 88 Brian Lara 🏝️ (232) 87 Chris Cairns 🇳🇿 (104)#NZvENG #NZvsENG — Fox Sports Lab (@FoxSportsLab) February 18, 2023 -
T20 WC: టీ20 వరల్డ్కప్-2022.. రోహిత్ శర్మను ఊరిస్తున్న ఐదు అరుదైన రికార్డులు
T20 World Cup 2022- Rohit Sharma: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి కౌంట్డౌన్ మొదలైంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం (అక్టోబరు 16) నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే టీమిండియా సభ్యుడిగా పలుసార్లు ఈ మెగా టోర్నీ ఆడిన రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్గా కొత్త హోదాలో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో అద్భుత రికార్డు ఉన్న హిట్మ్యాన్ను ఊరిస్తున్న ఐదు రికార్డులను ఓసారి పరిశీలిద్దాం. 1.కెప్టెన్గా అరుదైన రికార్డు సాధించే అవకాశం యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ హిట్టర్ క్రిస్గేల్ 2010 ప్రపంచకప్లో తమ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ సందర్భంగా టీమిండియాతో మ్యాచ్లో 66 బంతులు ఎదుర్కొన్న అతడు 98 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఒక కెప్టెన్కు ఇదే అత్యధిక స్కోరు. ఇప్పుడు రోహిత్ శర్మకు ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశం ముందుంది. టీమిండియా ఓపెనర్గా బరిలోకి దిగనున్న హిట్మ్యాన్ 99 లేదంటే ఏకంగా సెంచరీ సాధించాడంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా నిలుస్తాడు. 2. నాలుగో స్థానం నుంచి.. టీ20 వరల్డ్కప్లో శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్దనేకు అత్యధిక పరుగుల వీరుడిగా రికార్డు ఉంది. మొత్తంగా ఐదుసార్లు ఈ ఐసీసీ ఈవెంట్ ఆడిన జయవర్ధనే 1016 పరుగులు సాధించాడు. విండీస్ హిట్టర్ క్రిస్గేల్ 965, తిలకరత్నె దిల్షాన్ 897 పరుగులతో అతడి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాన్ని రోహిత్ శర్మ ఆక్రమించాడు. ఇప్పటి వరకు 847 పరుగులు సాధించాడు. ఈసారి ప్రపంచకప్లో అతడు మొత్తంగా 169 పరుగులు సాధిస్తే అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. 3. ఈ రికార్డు లాంఛనమే! హిట్మ్యాన్ రోహిత్ శర్మ 2007లో టీమిండియా తరఫున తొలిసారి టీ20 వరల్డ్కప్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 33 మ్యాచ్లు ఆడిన అతడు.. మరో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకుంటే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా నిలుస్తాడు. ధోని, గేల్, ముష్షికర్ రహీంలను దాటుకుని.. శ్రీలంక ఆటగాడు తిలకరత్నె దిల్షాన్(35 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతాడు. ఎలాంటి ఆటంకాలు, గాయాల బెడద వంటివి లేకుండా రోహిత్ బరిలోకి దిగితే ఈ రికార్డు సాధించడం లాంఛనమే! ఇప్పటి వరకు టీ20 వరల్డ్కప్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు ►తిలకరత్నె దిల్షాన్-35 ►డ్వేన్ బ్రావో- 34 ►షోయబ్ మాలిక్- 34 ►ఎంఎస్ ధోని- 33 ►క్రిస్ గేల్-33 ►ముష్ఫికర్ రహీం- 33 ►రోహిత్ శర్మ- 33 4. బ్రెండన్ మెకల్లమ్ రికార్డు అధిగమించే అవకాశం న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఇంగ్లండ్ ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ టీ20 వరల్డ్కప్ చరిత్రలో తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. 2012లో బంగ్లాదేశ్తో మ్యాచ్లో 58 బంతుల్లో 123 పరుగులు సాధించి.. అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. ఇక మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 65 బంతుల్లో 79 పరుగులు. 2010లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ఈ స్కోరు సాధించాడు. ఇక పొట్టి క్రికెట్లో ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్లో 4 సెంచరీలు నమోదు చేసిన హిట్మ్యాన్ .. మరో శతకం బాదడం సహా అదనంగా మరో 24 పరుగులు సాధిస్తే మెకల్లమ్ను అధిగమించే అవకాశం ఉంది. 5. ఇంకో మూడు సిక్స్లు కొడితే టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ శర్మ కచ్చితంగా బద్దలు కొట్టగల మరో రికార్డు ఇది. ఇప్పటి వరకు ఈ ఐసీసీ టోర్నీలో 31 సిక్సర్లు కొట్టిన హిట్మ్యాన్.. మరో మూడు సిక్స్లు బాదితే చాలు. ఈ మేజర్ ఈవెంట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. తద్వారా టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు(33 సిక్స్లు) బద్దలు కొడతాడు. అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆరంభ మ్యాచ్లోనే రోహిత్ శర్మ ఈ ఫీట్ నమోదు చేయాలని ఆశిస్తూ హిట్మ్యాన్కు ఆల్ ది బెస్ట్ చెబుదాం!! -సాక్షి, వెబ్డెస్క్ చదవండి: Ind Vs WA XI: రాహుల్ ఇన్నింగ్స్ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్.. టీమిండియాకు తప్పని ఓటమి -
నాకసలు ఈ జాబ్ అవసరమే లేదు.. నేనిది కోరుకోలేదు: ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్
England vs South Africa, 3rd Test: బ్రెండన్ మెకల్లమ్.. ఈ న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ ఇంగ్లండ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ జట్టు ఇంతవరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. కొత్త కెప్టెన్ బెన్స్టోక్స్ సారథ్యంలో మే నుంచి వరుస విజయాలు సాధిస్తోంది. బజ్బాల్ విధానంతో దూకుడైన ఆట కనబరుస్తూ స్వదేశంలో సంచలనాలు నమోదు చేసింది. తాజాగా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను కూడా సొంతం చేసుకుంది. లండన్ వేదికగా ముగిసిన ఆఖరి టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-1తో గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాకసలు ఈ జాబ్ అవసరమే లేదు! ఈ మేరకు స్కై స్పోర్ట్స్తో మాట్లాడిన బ్రెండన్ మెకల్లమ్.. ‘‘నిజానికి నాకసలు ఇంగ్లండ్ కోచ్గా జాబ్ అవసరమే లేదు! అయితే.. ఆ పదవి నన్ను వరించింది. నాకిది నచ్చింది. ఇప్పుడు నా పనిని ప్రేమిస్తున్నాను. ఇంతకు ముందెన్నడూ నాకు ఇలాంటి అనుభవం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇక్కడ ప్రతిభకు కొదువ లేదు. ఆట పట్ల వారి అంకితభావాన్ని దగ్గరగా గమనిస్తున్నా. ముఖ్యంగా స్టోక్స్తో కలిసి పనిచేయడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. తనొక అద్భుతమైన మనిషి. తనకెవ్వరూ సాటిరారు. తను గొప్ప నాయకుడు. కెప్టెన్గా సరైన వ్యక్తి’’ అని చెప్పుకొచ్చాడు. కేకేఆర్ను వీడి.. ఇంగ్లండ్ కోచ్గా.. తాము ఇలాగే వరుస సిరీస్లు గెలుస్తూ అభిమానులకు ఆనందం పంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్లోని అసలైన మజాను ప్రేక్షకులకు అందిస్తామని తెలిపాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్రైడర్స్కు మెకల్లమ్ కోచ్గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఇంగ్లండ్కు మార్గదర్శనం చేసే క్రమంలో అతడు కేకేఆర్కు దూరం కాగా.. 2023 సీజన్కు గానూ చంద్రకాంత్ పండిట్ను తమ హెడ్కోచ్గా నియమించుకుంది కోల్కతా ఫ్రాంఛైజీ. చదవండి: T20 WC: నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్.. కానీ ఏం లాభం? క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్ -
బజ్బాల్.. టెస్ట్ క్రికెట్లో సరికొత్త మంత్ర
Bazball: బజ్బాల్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న పదం. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాలోవర్స్ అంతా ప్రస్తుతం ఈ పదంపైనే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటీ బజ్బాల్..? క్రికెట్కి ఈ పదానికి ఉన్న సంబంధం ఏంటి..? వివరాలు ఈ ఆర్టికల్లో చూద్దాం. ఇటీవల న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య ముగిసిన టెస్ట్ సిరీస్ తర్వాత క్రికెట్ సర్కిల్స్లో వినిపిస్తున్న పదం బజ్బాల్. ఈ సిరీస్లో ఇంగ్లండ్ అనుసరించిన మెరుపుదాడి విధానాన్నే బజ్బాల్ అని అంటారు. మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ నిర్ధేశించిన భారీ టర్గెట్లను ( 277, 299, 296) బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలోని న్యూ ఇంగ్లండ్ జట్టు బజ్బాల్ విధానాన్ని అవలంబించి అవలీలగా ఛేదించింది. తాజాగా టీమిండియాతో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్లోనూ ఇంగ్లండ్ ఇదే మంత్రను ఫాలో అయి సక్సెస్ అయ్యింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు రూట్, బెయిర్స్టో టీమిండియా బౌలర్లపై మెరుపుదాడికి దిగి 378 పరుగుల భారీ టార్గెట్ను ఈజీగా ఊదేశారు. డిఫెన్స్ మోడ్లో సాగే టెస్ట్ క్రికెట్లో గెలుపే లక్ష్యంగా బ్యాటింగ్ చేసే ఈ అటాకింగ్ స్టయిల్నే బజ్బాల్ అంటారు. మెక్కల్లమ్, స్టోక్స్లు ఇంగ్లండ్ కోచింగ్, సారధ్య బాధ్యతలు చేపట్టాక ఈ వ్యూహాన్ని పకడ్బందీగా ఆచరణలో పెడుతున్నారు. ఈ ద్వయం టెస్ట్ క్రికెట్ రూపు రేఖలను మార్చేస్తూ, సంప్రదాయ క్రికెట్కు సరికొత్త శోభను తెస్తుంది. బ్యాటర్లు నిర్భయంగా ఎదురుదాడికి దిగే బజ్బాల్ విధానంపై ప్రస్తుతం అన్ని దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. ఈ సరికొత్త అప్రోచ్ వల్ల టెస్ట్ క్రికెట్ కళ తప్పుతుందని కొందరు భావిస్తుంటే, జనరేషన్కు తగ్గట్టుగా ఆటలో వేగం ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బజ్బాల్ అప్రోచ్ టీమిండియాకు అయితే కొత్త కాదు. 2000 దశకం ఆరంభంలో నజఫ్గడ్ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విధానాన్ని అప్లై చేసి బౌలర్లపై తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగాడు. టెస్ట్ల్లో వీరూ ఒక్కరోజే భారీ డబుల్ సెంచరీ (284) బాదడం మనందరికీ తెలుసు. చదవండి: Ind Vs Eng: రీషెడ్యూల్డ్ టెస్టు గెలవాల్సింది.. కానీ: రోహిత్ శర్మ -
టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..!
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 100 సిక్స్లు బాదిన మూడో క్రికెటర్గా రికార్డులకెక్కాడు. లీడ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతోన్న మూడో టెస్టులో స్టోక్స్ ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డును 151 టెస్టు ఇన్నింగ్స్లలో స్టోక్స్ సాధించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో 107 సిక్స్లతో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఉండగా, ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా అరుదైన ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ ఆటగాడు స్టోక్స్ కావడం విశేషం. టెస్టుల్లో అత్యధిక సిక్స్లు బాదిన క్రికెటర్లు బ్రెండన్ మెకల్లమ్- 107(176 ఇన్నింగ్స్లు) ఆడమ్ గిల్క్రిస్ట్-100( 137 ఇన్నింగ్స్లు) బెన్ స్టోక్స్-100 (151 ఇన్నింగ్స్లు) క్రిస్ గేల్-98 (182 ఇన్నింగ్స్లు) జాక్వెస్ కల్లిస్- 97(280 ఇన్నింగ్స్లు) వీరేంద్ర సెహ్వాగ్-91(104 ఇన్నింగ్స్లు) బ్రియాన్ లారా-88(232 ఇన్నింగ్స్లు) క్రిస్ క్రేయన్స్-87(104 ఇన్నింగ్స్లు) వివ్ రిచర్డ్స్-84(182 ఇన్నింగ్స్లు) ఆండ్రూ ఫ్లింటాఫ్-82(130 ఇన్నింగ్స్లు) చదవండి:T20 WC 2022: 'ఆ ఆల్రౌండర్కు భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం' -
'ఏడాది వ్యవధిలో ఎంత మార్పు'.. కొత్త కెప్టెన్, కోచ్ అడుగుపెట్టిన వేళ
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ను సమస్యలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు విజయవంతమైన కెప్టెన్గా వెలిగిన జో రూట్.. గతేడాది మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో వంక పెట్టలేకున్నా.. కెప్టెన్సీలో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. రూట్ కెప్టెన్సీలో గత 13 టెస్టుల్లో ఇంగ్లండ్ ఒకే ఒక్క విజయం నమోదు చేసింది. అది కూడా గతేడాది భారత్తో లీడ్స్లో జరిగిన టెస్టు మ్యాచ్. ఆ తర్వాత జరిగిన 12 టెస్టుల్లో ఆరింటిలో ఓడిపోయిన ఇంగ్లండ్ మరో ఆరింటిని డ్రా చేసుకుంది. ఇంగ్లండ్ వరుసగా ఓడిన టెస్టు సిరీస్ల్లో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్తో పాటు వెస్టిండీస్ సిరీస్లు ఉన్నాయి. దీంతో జట్టును మొత్తం ప్రక్షాళన చేయాల్సిందేనని అభిమానులు విమర్శలు కురిపించారు. వరుస సిరీస్ ఓటములకు బాధ్యత వహిస్తూ రూట్ కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కొత్త కెప్టెన్గా రావడం.. కొత్త కోచ్గా బ్రెండన్ మెక్కల్లమ్ అడుగుపెట్టడంతో ఇంగ్లండ్ దశ పూర్తిగా మారిపోయింది. కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ వచ్చాకా ఇంగ్లండ్ టెస్టుల్లో వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. అది ఏకపక్ష విజయాలు కావడం విశేషం. ఆరు నెలల క్రితం వరుస ఓటములతో కుంగిపోయిన ఇంగ్లండ్ జట్టు తాజాగా మాత్రం బలంగా తయారైంది. దానికి కొత్త కోచ్, కొత్త కెప్టెన్ అడుగుపెట్టిన వేళా విశేషమే అని పలువురు మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఇంగ్లండ్ ఆటతీరుపై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘సరిగ్గా ఏడాది క్రితం జూన్ 2021లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో 75 ఓవర్లలో 273 పరుగుల టార్గెట్ని ఛేదించినలేక 70 ఓవర్లలో 170 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ని డ్రా చేసుకుంది ఇంగ్లాండ్. సరిగ్గా ఏడాది తర్వాత జూన్ 2022లో అదే న్యూజిలాండ్ 72 ఓవర్లలో 299 పరుగుల టార్గెట్ నిర్దేశిస్తే, దాన్ని 50 ఓవర్లలోనే ఛేదించేసింది... ఏడాదిలోనే మైండ్సెట్ ఎంతలా మారింది.. కొత్త కోచ్, కెప్టెన్ అడుగుపెట్టిన వేళా విశేషమే’ అంటూ తెలిపాడు. ఇక నాటింగ్హామ్లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్లతో సంచలన విజయం సాధించింది. 299 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి సెషన్లో ఇంగ్లండ్ విజయానికి 160 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనిపించింది. కానీ బెయిర్స్టో (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్స్లు), స్టోక్స్ (75 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్లు) విధ్వంసక బ్యాటింగ్తో ఇంగ్లండ్ విజయతీరాలకు చేరింది. June 2021: NZ set Eng 273 in 75 overs. Eng bat out a draw scoring 170/3 (70). June 2022: NZ set Eng 299 in 72 overs. Eng chase it down in 50 overs! What changed? Mindset. #ENGvNZ pic.twitter.com/zOMbJMB51I — Wasim Jaffer (@WasimJaffer14) June 14, 2022 We’ve just chased 299 in 50 overs in a Test match on day five 🤯 Scorecard & Videos: https://t.co/ffFnHnaIPX 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/EPG1oNUWuD — England Cricket (@englandcricket) June 14, 2022 చదవండి: 16 ఓవర్లలో 160 పరుగులు.. విధ్వంసానికి పరాకాష్ట.. టెస్టు క్రికెట్లో నయా రికార్డు 'సంజూ శాంసన్లో అదే పెద్ద మైనస్.. అందుకే'.. క్రికెట్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు -
సెంచరీతో చెలరేగిన జో రూట్.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జో రూట్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. రూట్ 170 బంతుల్లో 115 పరుగులు సాధించాడు. విజయానికి 61పరుగులు కావాల్సిన నేపథ్యంలో నాలుగో రోజు 216/5 స్కోరుతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది. రూట్తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ 54, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 32 పరుగులతో రాణించారు. రూట్, ఫోక్స్ కలిసి 120పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లండ్ తొలి మ్యాచ్లోనే విజయం నమోదు చేయడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 132 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ సైతం 141పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్లో కోలుకున్న న్యూజిలాండ్ 285పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్లో డార్లీ మిచెల్ 108,టామ్ బ్లండెల్ 96 పరుగులతో రాణించారు. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ పేసర్ కైలీ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బ్యాటర్లకు చక్కులు చూపించాడు. ఈ దశలో రూట్, స్టోక్స్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక స్టోక్స్ ఔటయ్యక రూట్..ఫోక్స్తో కలిసి ఇంగ్లండ్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్బై చెప్పనున్న పంజాబ్ కింగ్స్ ..! -
IPL 2022: చాలా కాలం బెంచ్కే పరిమితం.. కానీ ఇప్పుడు సూపర్: మెకల్లమ్
IPL 2022 KKR Vs LSG- Rinku Singh: కోల్కతా నైట్రైడర్స్ యువ ఆటగాడు రింకూ సింగ్పై ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో అతడు కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. జట్టుకు అవసరమైన సమయంలో తానున్నానంటూ భరోసానిచ్చే గొప్ప ఆట తీరు అతడి సొంతమని కొనియాడాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనను తాను నిరూపించుకున్నాడని రింకూను.. మెకల్లమ్ ప్రశంసించాడు. కాగా ఐదేళ్లుగా కేకేఆర్తో ఉన్న రింకూ ఐపీఎల్-2022లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్లలో 174 పరుగులు సాధించాడు. ముఖ్యంగా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో విజయతీరాలకు చేర్చి సత్తా చాటాడు. ప్లే ఆఫ్స్ రేసులో కీలకమైన లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లోనూ రింకూ ఆఖరి వరకు పోరాడిన తీరు అమోఘం. బుధవారం(మే 18) నాటి మ్యాచ్లో ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అతడు 15 బంతుల్లోనే రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. కానీ రెండు పరుగుల తేడాతో ఓడి కేకేఆర్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో అతడి వీరోచిత పోరాటం వృథాగా పోయింది. అయితే, మ్యాచ్ ఓడినా మనసులు గెలిచాడంటూ రింకూపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్ హెడ్కోచ్ మెకల్లమ్ మాట్లాడుతూ.. ‘‘రింకూ సింగ్పై కేకేఆర్ ఫ్రాంఛైజీ నమ్మకం ఉంచింది. రానున్న కాలంలో అతడు కీలక సభ్యుడిగా ఎదిగే అవకాశం ఉంది. మిడిలార్డర్లో రాణిస్తూనే ఒంటిచేత్తో జట్టును గెలిపించగల కొంతమంది ఆటగాళ్లలో రింకూ ఒకడు. తన ఆట తీరు అద్బుతం. ఐదేళ్లుగా ఐపీఎల్లో భాగమయ్యాడు. చాలా కాలం పాటు బెంచ్కే పరిమితమయ్యాడు. కానీ అవకాశం వచ్చినపుడు విజృంభించాడు. కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా అదరగొట్టాడు. సరైన సమయంలో తానేంటో నిరూపించుకున్నాడు. భవిష్యత్తులో తను మరింతగా రాణిస్తాడు’’ అని రింకూను కొనియాడాడు. ఐపీఎల్ మ్యాచ్ 66: లక్నో వర్సెస్ కేకేఆర్ స్కోర్లు లక్నో- 210/0 (20) కేకేఆర్- 208/8 (20) చదవండి👉🏾Shreyas Iyer: ఐపీఎల్-2022.. కేకేఆర్ అవుట్.. నేనేమీ బాధపడటం లేదు: శ్రేయస్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); WHAT. A. GAME !!@LucknowIPL clinch a thriller by 2 runs. Scorecard - https://t.co/NbhFO1ozC7 #KKRvLSG #TATAIPL pic.twitter.com/7AkXzwfeYk — IndianPremierLeague (@IPL) May 18, 2022 View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్గా మాథ్యూ మాట్..
ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టు హెడ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ మాట్ ఎంపికయ్యాడు. మాట్ నాలుగేళ్లు ఇంగ్లండ్ కోచ్గా పనిచేయనున్నాడు. ఇక ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్ జట్టు నెదర్లాండ్స్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచే మాట్ కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. కాగా మాట్ గత ఏడేళ్లుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. మాట్ కోచ్గా ఉన్న కాలంలోనే ఆస్టేలియా జట్టు వన్డే ప్రపంచకప్, రెండు టీ20 ప్రపంచకప్లు కైవసం చేసుకుంది. "ఇంగ్లండ్ జట్టుకు ప్రధాన కోచ్గా మాథ్యూ మాట్ను నియమించడం మాకు సంతోషంగా ఉంది. అతడు ఈ బాధ్యతలు చెపట్టేందుకు అంగీకరించడం మా అదృష్టం" అని ఇంగ్లండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పేర్కొన్నారు. ఇక ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్గా బ్రెండన్ మెకల్లమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: Brendon McCullum: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్గా బ్రెండన్ మెక్ కల్లమ్.. -
Eng Vs NZ: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్.. వాళ్లిద్దరికీ చోటు!
England Vs New Zealand Test Series 2022: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్లలో కివీస్తో తలపడబోయే జట్టులో 13 మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. కాగా మూడు టెస్టు మ్యాచ్ల కోసం న్యూజిలాండ్ ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఇక టెస్టు కెప్టెన్గా బెన్ స్టోక్స్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇదే మొదటి సిరీస్ కావడం విశేషం. అదే విధంగా కోచ్గా బ్రెండన్ మెకల్లమ్కు కూడా ఇదే తొలి సిరీస్.. అది కూడా సొంతజట్టుపై కావడం మరో విశేషం. ఇక ఈ సిరీస్తో జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తిరిగి జట్టులోకి రానున్నారు. ఇక దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న హారీ బ్రూక్, మాథ్యూ పాట్స్ అరంగేట్రం చేయనున్నారు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ ప్రకటించిన 13 మంది సభ్యుల జట్టు: బెన్ స్టోక్స్(కెప్టెన్), జో రూట్, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్స్టో, స్టువర్ట్ బ్రాడ్, హారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్: జూన్ 02- 06 తొలి టెస్టు: లార్డ్స్ మైదానం జూన్ 10-14 రెండో టెస్టు: ట్రెంట్ బ్రిడ్జ్ జూన్ 23- 27 మూడో టెస్టు: హెడ్డింగ్లీ, లీడ్స్ చదవండి👉🏾Kane Williamson: సన్రైజర్స్కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ చదవండి👉🏾Zubayr Hamza: సౌతాఫ్రికా బ్యాటర్పై ఐసీసీ నిషేధం -
'ఇక ఇంగ్లండ్ జట్టు టీ20లా టెస్టు క్రికెట్ ఆడనుంది'
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా మెకల్లమ్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు హెడ్ కోచ్గా ఉన్నాడు. కాగా ఇంగ్లండ్ కోచ్గా ఎంపికైన మెకల్లమ్పై కేకేఆర్ ఆస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. మెకల్లమ్కు రెడ్-బాల్ కోచ్గా అనుభవం లేదని, రాబోయే రోజుల్లో ఇంగ్లండ్ టెస్ట్ ఫార్మాట్లో టీ20లా దూకుడుగా ఆడుతుందని నాయర్ అభిప్రాయపడ్డాడు. "బెన్ స్టోక్స్, బ్రెండన్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్లో దూకుడుగా ఆడుతుందని నేను భావిస్తున్నాను. వీరిద్దరి కలియికలో ఇంగ్లండ్ జట్టు వైట్బాల్ ఫార్మాట్లా ఆడుతుంది. టెస్టుల్లో బ్యాటర్లు భారీ షాట్లు, రిస్క్ తీసుకుని ఆడటం చూస్తాం. రాబోయే రోజుల్లో ఇంగ్లండ్ను అత్యుత్తమ జట్టుగా తీర్చుదిద్దుతాడన్న నమ్మకం నాకు ఉంది. అతడు ముందుగా ఆటగాళ్ల బలాలు, బలహీనతలను గుర్తించి ఆపై తన సలహాలు ఇస్తాడు" అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్.. యువ ఆటగాడు వచ్చేశాడు..! -
మెక్కల్లమ్ పారితోషికం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఇంగ్లండ్ నూతన టెస్టు కోచ్గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ ఎంపికయిన సంగతి తెలిసిందే. కోచ్ సిల్వర్వుడ్ స్థానంలో కొత్త కోచ్గా వచ్చిన మెక్కల్లమ్ జట్టును గాడిలో పెడతాడేమో చూడాలి. అసలే వరుస టెస్టు సిరీస్ వైఫల్యాలు ఇంగ్లండ్ను దెబ్బతీశాయి. ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నాయకత్వ పగ్గాలు ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు అప్పగించింది. కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ కలయికలో సరికొత్తగా కనిపిస్తున్న ఇంగ్లండ్ స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ను గెలిచి మళ్లీ ట్రాక్లోకి వస్తుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే.. మెక్కల్లమ్ నాలుగేళ్ల పాటు ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్గా పనిచేయనున్నాడు. అందుకు సంబంధించి నాలుగేళ్ల కాలానికి గానూ మెక్కల్లమ్కు ఈసీబీ భారీగా చెల్లించనుంది. టెలిగ్రాఫ్.యూకే కథనం ప్రకారం 2 యూరో మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 18.88 కోట్లు) మెక్కల్లమ్తో నాలుగేళ్ల కాలానికి ఈసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక హెడ్కోచ్కు ఈసీబీ ఇంత మొత్తంలో చెల్లించడం ఇదే మొదటిసారి అని వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్లకు ఎంత చెల్లిస్తామనేది గ్రేడ్స్ ప్రకటించే క్రికెట్ బోర్డులు కోచ్లకు ఎంత చెల్లిస్తున్నామనేది ఎక్కడా బహిరంగపరచలేదు. అయితే మెక్కల్లమ్పై ఉన్న నమ్మకంతోనే ఈసీబీ అతనికి పెద్ద మొత్తం చెల్లిస్తుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇక ఇంగ్లండ్ టెస్టు హెడ్కోచ్గా ఎంపికైన మెక్కల్లమ్ స్పందించాడు. ''ఇంగ్లండ్ క్రికెట్కు సేవలందించడానికి ఉవ్విళ్లూరుతున్నా. నాపై నమ్మకంతో బోర్డు నాకు అప్పగించిన బాధ్యతలను పాజిటివ్ ధోరణితో నిలబెట్టుకుంటా. ఓటములతో కుంగిపోయిన ఇంగ్లండ్ జట్టును గాడిలోపెట్టడానికి ప్రయత్నిసా. బెన్ స్టోక్స్తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు ఒక ఆటగాడిగా అతను నాకు పరిచయం.. ఇకపై ఇద్దరి సమన్వయంతో జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత మాపై ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ బోర్డు ఇంగ్లండ్ టెస్ట్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. మరోవైపు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్స్టెన్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మెంటార్గా ఉన్నాడు. చదవండి: IPL 2022: క్రికెట్కు వీరాభిమాని.. ఇతని స్టైల్ వేరు RCB Play-Off Chances: ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశం ఎంత?.. కోహ్లిపై డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్గా బ్రెండన్ మెక్ కల్లమ్..
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురువారం వెల్లడించింది. ఇక యాషెస్ సిరీస్లో ఘోర పరాభావం తర్వాత క్రిస్ సిల్వర్ వుడ్ ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా టెస్టు కెప్టెన్సీ నుంచి జో రూట్ కూడా తప్పుకున్నాడు. అతడి స్థానంలో బెన్ స్టోక్స్ సారథిగా ఎంపికయ్యాడు. ఇక ఈ ఏడాది జూన్లో న్యూజిలాండ్ జట్టు 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ సిరీస్ నుంచే మెక్ కల్లమ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇక మెక్ కల్లమ్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు హెడ్ కోచ్గా ఉన్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా బ్రెండన్ మెక్ కల్లమ్ని నియమించడం మాకు ఆనందంగా ఉంది. అతడు ఈ బాధ్యతలు చెపట్టేందుకు అంగీకరించడం మా అదృష్టం. మెక్ కల్లమ్ రాకతో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పేర్కొన్నారు. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి' -
ఇంగ్లండ్ హెడ్ కోచ్గా బ్రెండన్ మెక్కల్లమ్..!
లండన్: ఇటీవలి కాలంలో వరుస పరాజయాల బాట పట్టిన ఇంగ్లండ్ టెస్ట్ టీమ్.. పూర్వ వైభవం సాధించే క్రమంలో జట్టులో సమూల మార్పులకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత కెప్టెన్ను మార్చిన ఆ జట్టు.. తాజాగా కొత్త కోచ్ను నియమించే పనిలో నిమగ్నమైంది. జో రూట్ రాజీనామా చేశాక బెన్ స్టోక్స్కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పిన ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు).. టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం న్యూజిలాండ్ మాజీ సారధి, కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెక్ కల్లమ్, ఈసీబీ మధ్య చర్చలు కూడా ముగిసినట్టు సమాచారం. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. గత కొద్ది రోజులుగా మెక్ కల్లమ్తో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది. కాగా, ఇంగ్లండ్ టెస్ట్ జట్టు గతేడాది భారత పర్యటనకు వచ్చినప్పట్నుంచి వరుస పరాజయాల బాట పట్టి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ బోర్డు ఇంగ్లండ్ టెస్ట్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. కాగా, జూన్లో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచే స్టోక్స్ ఇంగ్లండ్ సారథిగా బాధ్యతలు చేపడతాడు. ఒకవేళ ఈసీబీతో మెక్కల్లమ్కు డీల్ కుదిరితే.. అతను తన సొంత జట్టుకు వ్యతిరేకంగా పని చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్స్టెన్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మెంటార్గా ఉన్నాడు. చదవండి; 'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది' -
ఇంగ్లండ్ వైట్బాల్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్!
ఇంగ్లండ్ టెస్టు కోచ్గా క్రిస్ సిల్వర్వుడ్పై వేటు పడినప్పటి నుంచి అతని స్థానంలో కొత్త కోచ్ ఎవరనే దానిపై ఈసీబీలో పెద్ద చర్చ నడిచింది. గత ఏడాది కాలంగా ఇంగ్లండ్ టెస్టుల్లో దారుణ ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. వరుస సిరీస్ ఓటములకు బాధ్యత వహిస్తూ ఇటీవలే జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు ఈసీబీ(ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు) టెస్టు పగ్గాలు అప్పజెప్పింది. ఇక టెస్టు ప్రధాన కోచ్గా సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్స్టన్ను ఎంపిక చేసింది. 2011లో వన్డే వరల్డ్కప్ టీమిండియా గెలవడంలో కిర్స్టన్ పాత్ర మరువలేనిది. ఇక టెస్టు కోచ్తో పాటు.. వైట్బాల్ క్రికెట్ కోచ్ను ఈసీబీ ఎంపికచేయనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్కు ఆడిన సమయంలో బెస్ట్ బ్యాటర్గా గుర్తింపు పొందిన మెక్కల్లమ్.. మంచి వ్యూహాలు పన్నగల కెప్టెన్గా రాణించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మెక్కల్లమ్ ఇంగ్లండ్ను గాడిలో పెడతాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇంగ్లండ్ కోచ్గా పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు మెక్కల్లమ్ ఒక ప్రకటనలో తెలిపాడు. ఇక కిర్స్టన్ లాగే మెక్కల్లమ్ కూడా సక్సెస్ఫుల్ కోచ్. ప్రస్తుతం ఐపీఎల్లో మెక్కల్లమ్ రెండుసార్లు విజేతగా నిలిచిన కేకేఆర్కు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక 2012లో న్యూజిలాండ్ క్రికెట్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతని కెప్టెన్సీలో కివీస్ 2015 వన్డే ప్రపంచకప్లో తొలిసారి ఫైనల్ చేరింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భంగపడి రన్నరప్గా నిలిచింది. చదవండి: IPL 2022: నైట్షిప్టులు..ఏడాది పాటు ఒక్క పూట భోజనం; ఎవరీ కుమార్ కార్తికేయ? Ajaz Patel: భారత్పై పదికి పది వికెట్లు తీసిన బౌలర్ టీషర్ట్ వేలానికి.. -
ఆరోజు అలా.. ఇప్పుడిలా.. పాపం మెకల్లమ్.. పర్లేదు.. తలెత్తుకోండి!
IPL 2022 RR Vs KKR: పదిహేనేళ్ల క్రితం... ఏప్రిల్ 18న... కోల్కతా నైట్రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్కు తెరలేచింది. ఇక క్యాష్ రిచ్ లీగ్గా పేరుగాంచిన ఐపీఎల్ మొదటి మ్యాచ్(ఏప్రిల్)లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ బ్రెండన్ మెకల్లమ్ సృష్టించిన పరుగుల సునామీని క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేరు. వైభవోపేతంగా ఆరంభమైన మొదటి సీజన్ తొలి మ్యాచ్లో కేకేఆర్,ఆర్బీబీ పోటీపడ్డాయి. కర్ణాటకలోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఒక్కసారిగా విజృంభించాడు.. కేకేఆర్ తరపున బరిలోకి దిగిన కివీస్ బ్యాటర్ మెకల్లమ్ ధాటికి ప్రత్యర్థి జట్టు విలవిల్లాడిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఆరు బంతులలో ఒక్క పరుగు కూడా సాధించలేకపోయిన మెకల్లమ్.. ఆ తర్వాత విజృంభించాడు. నాలుగు బంతుల్లో 18 పరుగులు సాధించి తన ఖాతా తెరిచాడు. ఇక అంతే.. ఆ తర్వాత మెల్లకమ్ ఇన్నింగ్స్కు బ్రేక్ వేయడం ఏ బౌలర్కూ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో కేవలం 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్స్లతో 158 పరుగులతో మెకల్లమ్ అజేయంగా నిలిచాడు. మెకల్లమ్ విధ్వంసకర ఇన్నింగ్స్ మూలంగా ఆర్సీబీ ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది కేకేఆర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభవాన్ని అందించిన ఈ మ్యాచ్లో బౌలింగ్ విభాగంలో విఫలమైన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్లోనూ రాణించలేకపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 15.1 ఓవర్లలోనే 82 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 140 పరగుల తేడాతో కోల్కతా ఘన విజయం సాధించింది. ఇక కేకేఆర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మెకల్లమ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో కేకేఆర్ విజయం సాధించడంతో కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. యాజమాన్యానికి ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అయితే, విశేషం ఏమిటంటే.. నాడు కేకేఆర్ బ్యాటర్గా జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన మెకల్లమ్.. ఐపీఎల్-2022లో హెడ్కోచ్గా తమ జట్టును మాత్రం ఈ ప్రత్యేకమైన రోజున(ఏప్రిల్ 18)న విజేతగా చూడలేకపోయాడు. ఐపీఎల్-2022లో భాగంగా.. తొలి సీజన్ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా పయనించినా.. 17వ ఓవర్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజువేంద్ర చహల్ తన అద్భుతమైన బౌలింగ్తో కేకేఆర్ పతనానికి బాటలు వేశాడు. ఇక ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో చివరకు రాజస్తాన్నే విజయం వరించింది. ఏడు పరుగుల తేడాతో సంజూ శాంసన్ సేన గెలుపొందింది. తలెత్తుకోండి! ఈ పరిణామాల నేపథ్యంలో కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తమ జట్టును ఉద్దేశించి భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ‘‘చాలా బాగా ఆడారు. శ్రేయస్ అయ్యర్, ఆరోన్ ఫించ్, ఉమేశ్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. 150వ మ్యాచ్ ఆడిన సునిల్ నరైన్కు అభినందనలు. 15 ఏళ్ల క్రితం బ్రెండన్ మెకల్లమ్ ఇదే రోజు నువ్వు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. మనం ఇప్పుడు ఈ మ్యాచ్లో ఓడిపోయాం. కిందపడినపుడే మరింత పట్టుదలగా ముందుకు వెళ్లగలం. తలెత్తుకుని ఉండాలి మీరు’’ అని షారుఖ్ మంగళవారం ట్వీట్ చేశాడు. రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ స్కోర్లు: రాజస్తాన్- 217/5 (20) కోల్కతా- 210 (19.4) చదవండి: ‘అమ్మ చెప్పింది.. శ్రేయస్ అయ్యర్ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ WHAT. A. GAME! WHAT. A. FINISH! 👏 👏 The 1⃣5⃣-year celebration of the IPL done right, courtesy a cracker of a match! 👌 👌@rajasthanroyals hold their nerve to seal a thrilling win over #KKR. 👍 👍 Scorecard ▶️ https://t.co/f4zhSrBNHi#TATAIPL | #RRvKKR pic.twitter.com/c2gFuwobFg — IndianPremierLeague (@IPL) April 18, 2022 Well played boys. Stupendous effort by @ShreyasIyer15 @AaronFinch5 @y_umesh congrats to #SunilNarine for the 150th match & @Bazmccullum for that innings 15 yrs ago. I know we lost but if we have to go down this is the only way to do it! Keep ur chins up…. — Shah Rukh Khan (@iamsrk) April 18, 2022 -
IPL 2022: అహ్మదాబాద్ 8 కోట్లు పెట్టింది.. వదిలేసినందుకు చాలా బాధగా ఉంది: హెడ్కోచ్
శుభ్మన్ గిల్... ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున 58 మ్యాచ్లు ఆడాడు. గత సీజన్లో 17 ఇన్నింగ్స్లో 478 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. కానీ... ఐపీఎల్ మెగా వేలం-2022కు రిటెన్షన్ సమయంలో కేకేఆర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కెప్టెన్ కాగలడని భావించిన శుభ్మన్ గిల్ను వదిలేసుకుంది. ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు) , వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు)ను రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్లో కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ గిల్ను సొంతం చేసుకుంది. వేలానికి ముందు ముగ్గురు ప్లేయర్లను ఎంపిక చేసుకునే క్రమంలో రూ. 8 కోట్లు వెచ్చించి ఈ టీమిండియా ఓపెనర్ను తమ జట్టులో చేర్చుకుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ రిటెన్షన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభ గల యువ ఓపెనర్ గిల్ను దూరం చేసుకోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. ‘‘సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్ దశాద్దకాలంగా సేవలు అందిస్తున్నారు. వరుణ్ చక్రవర్తి సామర్థ్యమేమిటో గత రెండు సీజన్ల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక ఐపీఎల్ 2021 రెండో అంచెలో వెంకటేశ్ అయ్యర్ సృష్టించిన చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరికి వీరే సాటి. తనదైన రోజున ఆండ్రీ రసెల్ ఎలాంటి అద్భుతాలు చేయగలడో అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లను వదిలేయాల్సి వచ్చింది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ను కోల్పోవడం నిరాశ కలిగించింది. కొన్నిసార్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. ఏదేమైనా మెగా వేలానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం’’ అని మెకల్లమ్ చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో మెగా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చదవండి: ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచలనం సృష్టించిన జాసన్ హోల్డర్ "I'd love to hear some suggestions from the fans: Which players do they think we should target and also, why?" - @Bazmccullum Register for #KKRMockAuction here 👉 https://t.co/vsfROhjYuZ if you haven't already!#GalaxyOfKnights #KKR #IPL pic.twitter.com/k8MOOZ1ddQ — KolkataKnightRiders (@KKRiders) January 29, 2022 -
IPL 2021 Final: అదే మనల్ని మరింత ప్రమాదకరంగా మార్చే అంశం!
Brendon McCullum Comments: ‘‘ఒక్కసారి అన్నీ గుర్తుకు తెచ్చుకోండి.. ఏడు మ్యాచ్లలో కేవలం రెండే విజయాలు. ఆ ప్రయాణాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు చెప్పబోయే స్ఫూర్తిదాయక కథల గురించి ఊహించుకోండి. మీ అనుభవాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మన ముందున్న లక్ష్యం అదే. మనల్ని ఉత్తేజపరిచి... ఎగ్జైట్మెంట్కు గురిచేసేది అదే. మనం పెద్దగా కోల్పోయేదేం లేదు. అదే మనల్ని మరింత ప్రమాదకరంగా మార్చే అంశం’’- కోల్కతా నైట్రైడర్స్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్... జట్టును ఉద్దేశించి ఈ మేరకు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు. తొలి అంచెలో ఘోరమైన ప్రదర్శన కనబరిచిన సమయంలో జట్టులో జోష్ నింపేందుకు ప్రయత్నించాడు. ఆ మాటలను నిజం చేస్తూ... కేకేఆర్ ఆటగాళ్లు రెండో అంచెలో అద్భుత ప్రదర్శనను కనబరిచి... వరుస విజయాలతో ఫైనల్కు దూసుకువచ్చారు. ఇక అక్టోబరు 15న చెన్నై సూపర్కింగ్స్తో టైటిల్ పోరుకు సిద్ధమవుతున్న సమయంలో ఫ్రాంఛైజీ మెకల్లమ్ స్పీచ్ వీడియోను షేర్ చేసింది. అభిమానులను ఈ వీడియో విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా కోవిడ్ కారణంగా ఐపీఎల్-2021 సీజన్ వాయిదా పడే నాటికి ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం రెండింట మాత్రమే గెలుపొందిన కేకేఆర్.. పాయింట్ల పట్టికలో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అయితే, సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా రెండో అంచె ప్రారంభమైన తర్వాత... కోల్కతా రాత మారింది. ఏడు మ్యాచ్లలో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: IPL 2021 Final Today: ఆ జట్టుదే పైచేయి... ముందు ఫీల్డింగ్ ఎంచుకుంటే గెలుపు ఖాయమా? Tonight's our 𝙩𝙧𝙮𝙨𝙩 𝙬𝙞𝙩𝙝 𝙙𝙚𝙨𝙩𝙞𝙣𝙮! 💜#KKR #CSKvKKR #AmiKKR #KorboLorboJeetbo #আমিKKR #IPL2021 pic.twitter.com/X0u50MHBR0 — KolkataKnightRiders (@KKRiders) October 15, 2021
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement