camera
-
ఐఫోన్ 16పై పేటీఎం సీఈఓ విమర్శలు
మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' యాపిల్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంఘటన మరువక ముందే.. పేటీఎం కో ఫౌండర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) 'విజయ్ శేఖర్ శర్మ' ఐఫోన్ 16 మీద విమర్శలు కురిపించారు.''ఐఫోన్ 16లో కెమెరా (సాఫ్ట్వేర్/యాప్) చాలా దారుణంగా ఉంది. నేను ఇప్పుడు పిక్సెల్ గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఇలాంటి అనుభవం ఎదురైందా'' అని పేటీఎం సీఈఓ తన ఎక్స్ (Twitter) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.విజయ్ శేఖర్ శర్మ పోస్ట్పై మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ పర్మీందర్ సింగ్ స్పందించారు. కెమెరా లేదా యాప్లో ఏదో తప్పు ఉందని ఆయన అన్నారు. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' స్పందిస్తూ.. పిక్సెల్ అద్భుతంగా ఉందని అన్నారు.గూగుల్ పిక్సెల్ ఫోన్ చాలా అద్భుతంగా ఉంది. కెమెరా క్వాలిటీ కూడా ఇతర ఫోన్ల కంటే బాగానే ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ ఫోన్ లేటెస్ట్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీకి ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఐఫోన్ 16 కంటే కూడా ఉత్తమంగా ఉందని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.I am surprised how the iPhone killed its camera (software / app) so badly in 16. It is so bad that I am seriously thinking of a Pixel now. Anyone else going through the same struggles ?— Vijay Shekhar Sharma (@vijayshekhar) January 19, 2025 -
సీఎంఆర్ కాలేజీ ఘటనలో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు లభ్యమైన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎంఆర్ కాలేజీ గాల్ట్స్ హాస్టల్ ఘటనపై విచారణకు మహిళా కమిషన్ సెక్రెటరీ ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైబారాబాద్ సీపీ అవినాష్ మహంతికి సూచించారు.ఈ సందర్భంగా , రాష్ట్ర ఉమెన్ కమిషన్ మెంబర్ పద్మజా రమణ మాట్లాడుతూ.. సీఎంఆర్ గర్ల్స్ కాలేజీలో జరిగిన ఘటనపై స్టూడెంట్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. పూర్తి వివరాలు ఉమెన్ కమిషన్ చైర్మన్కి అందిస్తాం. ఉమెన్ కమిషన్ చైర్మన్ సుమోటాగా కేసు తీసుకున్నారు. అటు సీఎంఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కి నోటీసులు ఇచ్చాం. స్టూడెంట్స్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా తేడా జరిగితే సీఎంఆర్ గర్ల్స్ కాలేజీ యాజమాన్యంపై సీరియస్ యాక్షన్ ఉంటుంది’ అని హెచ్చరించారు. బాత్రూమ్లో లభ్యమైన కెమెరాలపై విద్యార్థినుల చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో తాముండగా.. అగంతకులు హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా బాత్రూమ్లలో మూడు చోట్ల కెమెరాలను గుర్తించినట్లు విద్యార్థునులు స్పష్టం చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన స్మార్ట్ ఫోన్లలో ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. అయితే, ఈ తరుణంలో గురువారం సాయంత్రం సీఎంఆర్ కాలేజీ హాస్టల్ను మహిళా కమిషన్ తనిఖీ చేసింది. అనంతరం, సీఏంఆర్ కాలేజి హాస్టల్లో జరిగిన నిజానిజాలను తేల్చాలని సైబారాబాద్ సీపీ అవినాష్ మహంతికి సూచించింది. 👉చదవండి : సీక్రెట్ కెమెరాలపై విద్యార్థినుల ఆందోళన -
ప్రపంచంలో అతిచిన్న కెమెరా ఇదే
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఇమేజ్ సెన్సర్ చిప్. అమెరికన్ కెమెరాల తయారీ కంపెనీ ‘ఓమ్నివిజన్’ కెమెరాల్లో ఉపయోగించే ఈ ఇమేజ్ సెన్సర్ చిప్ను ‘ఓవీఎం 6948’ పేరుతో ఇటీవల రూపొందించింది.‘చిప్ ఆన్ టిప్’ అనే ప్రచారంతో అందుబాటులోకి తెచ్చిన ఈ చిప్ ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇమేజ్ సెన్సర్ చిప్గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. దీని పొడవు 0.65 మి.మీ., వెడల్పు 0.65 మి.మీ., మందం 1.158 మి.మీ. అంటే, దాదాపు ఒక పంచదార రేణువంత పరిమాణంలో ఉంటుంది.ఇది 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. ఎండోస్కోప్ సహా వివిధ వైద్య పరికరాల కెమెరాల్లో ఉపయోగించడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. ఇది సెకనుకు 30 ఫ్రేముల సామర్థ్యంతో వీడియోలు కూడా తీయగలదు. -
ఈ ఐఫోన్ వాడుతుంటే.. మీకే ఈ అలర్ట్!
ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) వినియోగదారులకు యాపిల్ ముఖ్యమైన అలర్ట్ను జారీ చేసింది. కొన్ని నెలల క్రితం తయారైన ఐఫోన్ 14 ప్లస్ యూనిట్లలో తలెత్తిన రియర్ కెమెరా సమస్య కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ప్రభావితమైన ఫోన్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అధీకృత యాపిల్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద సర్వీసింగ్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది.రియర్ కెమెరా సమస్య తమ హ్యాండ్సెట్పై ప్రభావం చూపిందో లేదో కస్టమర్లు తమ క్రమ సంఖ్యను కంపెనీకి అందించడం ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్లో రియర్ కెమెరాకు మరమ్మతుల కోసం ఇప్పటికే డబ్బు చెల్లించినవారు ఆ మొత్తాన్ని రీఫండ్ పొందవచ్చు.సమస్య ఇదే..ఐఫోన్ 14 ప్లస్లో రియర్ కెమెరా సమస్య మరమ్మతు కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇందుకోసం సపోర్ట్ పేజీని ఏర్పాటు చేసింది. అసలేంటి సమస్య అంటే.. రియర్ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ప్రివ్యూ చూపించడం లేదు. అయితే ఈ చాలా తక్కువ ఫోన్లలోనే ఉత్పన్నమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇవి 2023 ఏప్రిల్ 10 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 28 మధ్య తయారైనవి.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!అయితే తమ ఫోన్లలో ఇలా సమస్య ఉంటే కంపెనీ ఉచిత సర్వీసింగ్ ప్రోగ్రామ్ పొందడానికి అర్హత ఉందా.. లేదా అన్న విషయాన్ని యాపిల్ ఏర్పాటు చేసిన సపోర్ట్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నంబర్ నమోదు చేస్తే మీ ఫోన్కి ఫ్రీ సర్వీసింగ్ వస్తుందో రాదో తెలుస్తుంది. యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ ఫోన్ కొనుగోలు తేది నుంచి మూడేళ్లపాటు వర్తిస్తుంది. -
ప్రపంచంలోనే పే....ద్ద కెమెరా!
ఏకంగా 3,200 మెగాపిక్సెల్స్. సామర్థ్యం. 5.5 అడుగుల ఎత్తు, ఏకంగా 12.25 అడుగల పొడవుతో పెద్ద సైజు కారును తలపించే పరిమాణం. దాదాపు 2,800 కిలోల బరువు! 320–1,050 ఎన్ఎం వేవ్లెంగ్త్ రేంజ్. ఒక్కో ఇమేజ్ కవరేజీ పరిధిలోకి కనీసం 40 పూర్ణ చంద్రులు పట్టేంత ఏరియా! ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా తాలూకు విశేషాల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంతకీ ఇది ఎక్కడుందంటారా? చిలీలో రూపుదిద్దుకుంటున్న వెరా రూబిన్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేస్తున్న సరికొత్త టెలిస్కోప్లో. రాజధాని శాంటియాగోకు 500 కి.మీ. దూరంలోని సెరో పాచ్న్ పర్వత శిఖరంపై 2015 నుంచీ నిర్మాణంలో ఉన్న ఈ అబ్జర్వేటరీ త్వరలో ప్రారంభం కానుంది. అందులోని ఈ అతి పెద్ద కెమెరా ప్రతి మూడు రోజులకోసారి రాత్రివేళ దాని కంటికి కని్పంచినంత మేరకూ ఆకాశాన్ని ఫొటోల్లో బంధించనుంది. అలా అంతరిక్ష శాస్త్రవేత్తలకు పదేళ్లపాటు రోజుకు కనీసం వెయ్యి చొప్పున ఫొటోలను అందుబాటులోకి తెస్తుంది! అంటే రోజుకు 20 టెరాబైట్ల డేటాను అందజేస్తుంది. ఇది ఒక యూజర్ నెట్ఫ్లిక్స్లో సగటున మూడేళ్లపాటు చూసే ప్రోగ్సామ్స్, లేదా స్పాటిఫైలో ఏకంగా 50 ఏళ్ల పాటు వినే పాటల డేటాకు సమానం! ఈ క్రమంలో మనకిప్పటిదాకా తెలియని ఏకంగా 1,700 కోట్ల కొత్త నక్షత్రాలను, 2,000 కోట్ల నక్షత్ర మండలాలను ఈ కెమెరా వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు. దీన్ని లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ (ఎల్ఎస్ఎస్టీ) కెమెరాగా పిలుస్తున్నారు. అంతేగాక అంతరిక్షంలో సంభవించే చిన్నా పెద్దా మార్పులకు సంబంధించి ప్రతి రాత్రీ ఏకంగా కోటి అలెర్టులను కూడా ఈ టెలిస్కోప్ పంపనుందట కూడా! ‘‘ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. వెరా రూబిన్ అబ్జర్వేటరీ మున్ముందు మరెన్నో ఘనకార్యాలు చేయనుంది’’ అని ఆ సంస్థ ఆస్ట్రానమిస్టు క్లేర్ హిగ్స్ చెబుతున్నారు. కృష్ణపదార్థం (డార్క్ మ్యా టర్), కృష్ణ శక్తి (డార్క్ ఎనర్జీ) వంటి పలు మిస్టరీలను ఛేదించడంలో కూడా కీలకపాత్ర పోషించే చాన్సుందన్నారు. ఈ టెలిస్కోప్కు 2016లో మరణించిన అమెరికా అంతరిక్ష శాస్త్రజు్ఞడు వెరా రూబిన్ పేరు పెట్టారు. ఇది ఏడాది లోపులో అందుబాటులోకి వస్తుందని అంచనా.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తల్లిని కెమెరాలో బంధిస్తున్న ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య (ఫోటోలు)
-
గుడ్లవల్లేరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనలో వాష్రూమ్లలో రహస్య కెమెరాలను అమర్చి వీడియోలను చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎన్నో రోజులుగా వ్యవహారం జరుగుతున్నా బయటకెందుకు రాలేదని ప్రశి్నంచింది. అర్థరాత్రి వరకూ విద్యార్థినులు ధర్నా చేయడం.. ఘటనపై వివిధ పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచి్చనట్లు ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీచేసింది. విద్యార్థినుల వీడియోలను రహస్య కెమెరాలతో రికార్డ్ చేసి, వాటిని అమ్మడం వంటి వ్యవహారాలు జరగడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడింది. ఈ విషయంలో కళాశాల యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా ఉందని తీవ్రస్థాయిలో ప్రశి్నంచింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సైతం తమకు వివరించాలని అందులో పేర్కొంది. -
కొత్త ఫోన్: ప్రీమియం కెమెరా ఫీచర్స్ బడ్జెట్ ధరలోనే..
తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లు అందించే మొబైల్ బ్రాండ్ పోకో (Poco) భారత్లో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పోకో ఎం6 (Poco M6) సిరీస్కి ‘పోకో ఎం6 ప్లస్ 5జీ’ (Poco M6 Plus 5G) పేరుతో ఇంకొక ఫోన్ను జోడించింది. ఈ సిరీస్లో ఇప్పటికే పోకో ఎం6, పోకో ఎం6 ప్రో మోడల్స్ ఉన్నాయి.Poco M6 Plus స్పెసిఫికేషన్స్ » స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్) » గరిష్టంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ » అదనంగా 8GB వర్చువల్ ర్యామ్» ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ ఓఎస్» 2400 x 1080 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.79-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే» డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 3x ఇన్-సెన్సార్ జూమ్ సపోర్ట్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్తో 108-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ » సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా» 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5030mAh బ్యాటరీ» సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్Poco M6 Plus ధర, లభ్యతపోకో ఎం6 ప్లస్ 5జీ గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే 6GB + 128GB వేరియంట్ ధర రూ.13,499. అదే 8GB + 128GB వేరియంట్ అయితే రూ. 14,499. ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. -
రీల్స్ కోసం కెమెరా కొనేందుకు ఓనర్ ఇంట్లో చోరీ
ఢిల్లీ: ఇన్స్ట్రామ్లో రీల్స్ చేసి ఫేమస్ కావాలనుకున్న ఓ పని మనిషి కెమెరా కొనుక్కొవటం కోసం.. ఓనర్ ఇంట్లోనే రూ.లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకొంది. నగలతో పరారైన ఆమెను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వివరాలు.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ బంగ్లాలో నీతూ యాదవ్ అనే మహిళ పని చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ కావాలనుంది.అందుకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పోస్టు చేస్తుండేది. అక్కడితో ఆగకుండా యూట్యూబ్ ఒక ఛానెల్ను ఓపెన్ చేసి డబ్బు సంపాదించాలిని ప్లాన్ వేసింది. అయితే దానికి రీల్స్ చేసేందుకు మంచి క్వాలిటీ ఉన్న డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనాలనుకుంది. అయితే ఆమె వద్ద అంత డబ్బు లేకపోవడంతో కుటుంబ సభ్యులును డబ్బు అడిగింది. కానీ వారం సహాయం చేయకపోవటంతో తాను పనిచేసే ఓనర్ ఇంట్లోనే చోరీ చేయాలని నిర్ణయించుకుంది. ఓనర్లు లేని సమయం చూసి బంగారం, వెండి వస్తువులతో పారిపోయింది. ఇంట్లో కనిపించని ఆమెకు ఒనర్లు కాల్ చేస్తే.. ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. ఇంట్లో ఉండే నగలు కనిపించకపోవడంతో పనిమనిషిపై వచ్చి.. ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక.. స్థానికుల సమాచారంతో నగల బ్యాగ్తో ఢిల్లీ దాటాలనుకున్న ఆమెన పోలీసులు అరెస్టు చేశారు. అయితే కెమెరాను కొనడానికి ఎవ్వరు అప్పుగానైనా డబ్బు ఇవ్వకపోవటంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు. -
చిత్తంతో చిత్రప్రయాణం
ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగికి ఆఫీస్కు అవతలి ప్రపంచంపై దృష్టి మళ్లదు. పనే ప్రపంచం అవుతుంది. దీప్తి ఆస్థాన మాత్రం ఆఫీస్ క్యూబికల్కు ఆవలి ప్రపంచాన్ని చూడాలనుకుంది. కెమెరా తన నేస్తం అయింది. దేశమంతా తిరుగుతూ స్త్రీల జీవితంలోని ఎన్నో కోణాలను కెమెరా కంటితో ఆవిష్కరిస్తోంది... సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం నుంచి సెల్ఫ్ లెర్నింగ్ ఫోటోగ్రాఫర్గా ప్రయాణం దీప్తి అస్థాన జీవన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు క్యూబికల్ అవతల తనకు తెలియని ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంది. ఎక్కడికి ప్రయాణం చేసినా కెమెరా తనతోపాటు వచ్చేది. సంభాషించేది. కెమెరా ద్వారా ప్రయాణాలలో లోతైన అర్థాన్ని, సామాజిక ప్రయోజ నాన్ని కనుగొంది దీప్తి. మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి, తాను కలుసుకున్న వ్యక్తుల జీవిత కథలను ప్రపంచంతో పంచుకోవడానికి ఫొటోగ్రఫీ దీప్తికి బలమైన మాధ్యమంలా ఉపయోగపడింది. సాధారణంగా దూర ప్రయాణాలు అనగానే ప్రముఖ, ప్రసిద్ధ స్థలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ దీప్తి మాత్రం అనామక, అంతగా ఎవరూ పట్టించుకోనిప్రాంతాలకు వెళ్లేది. ఆప్రాంతాల గురించి ఎవరూ పనిగట్టుకొని ఫొటోలు తీసి ఉండరు. నాలుగు ముక్కలు రాసి ఉండరు. ఆ పని దీప్తి చేసింది. ఆ తరువాత...‘ఉమెన్ ఇండియా’ప్రాజెక్ట్తో తన ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఇది ఒకటి రెండు నెలల పరిమిత కాల ప్రయాణం కాదు. సంవత్సరాలుగా సాగిన ప్రయాణం. పట్టణాల్లోని మార్పుల సంగతి ఎలా ఉన్నా, పల్లెప్రజలు మాత్రం గతంలోనే ఉన్నారని గ్రహించింది దీప్తి. బాల్య వివాహాల నుంచి ఆడపిల్లలు చదువుకు దూరం కావడం వరకు కెమెరా కంటితో ఎన్నో సమస్యలను లోకం దృష్టికి తీసుకువచ్చి మహిళలు తమ గళం విప్పడానికి ఒక వేదికను నిర్మించింది. సోషల్ మీడియా దృష్టిలో పడని మహిళల సమస్యలను అదే మీడియా ద్వారా నలుగురి దృష్టికి తీసుకు వచ్చింది. సమస్యల గురించి మాత్రమే కాకుండా వివిధప్రాంతాలలోని సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టింది. ‘నా ప్రాజెక్ట్లో అన్ని కథలు మనుగడ కోసం చేసే పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాదు. జీవితాన్ని, సంస్కృతిని సెలబ్రెట్ చేసుకునేవి కూడా’ అంటుంది దీప్తి. స్ఫూర్తిదాయకమైన కథలు మార్పు తీసుకురాగలవా?’ అని అడిగితే ‘అందుకు నేనే ఉదాహరణ. ఆ మార్పు ముందు నాలోనే వచ్చింది’ అంటుంది దీప్తి. తాను షూట్ చేయడానికి ఎంచుకునే ప్రదేశాలతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. గుజరాత్లోని మిధాపూర్లో పన్నెండేళ్ల భారతితో మాట్లాడింది దీప్తి. ఆ అమ్మాయి ఎప్పుడూ బడి ముఖం చూడలేదు. కొంతకాలం ఇంటిపట్టునే ఉన్న భారతి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు కూలిపనికి వెళుతుంది. ఈ చిన్నారి పెద్ద పెద్ద తట్టలను మోస్తున్న దృశ్యం చూసి దీప్తికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘భారతి అందమైన, చురుకైన అమ్మాయి. ఆమె భవిష్యత్ కూలిపనులకు పరిమితం కావాల్పిందేనా? అనే బాధ కలిగింది. కెమెరా గురించి భారతి ఆసక్తిగా తెలుసుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఇలాంటి పిల్లలకు కొత్త దారి చూపితే పురోగమించగలరు’ అంటుంది దీప్తి. భారతి లాంటి ఎంతోమంది పిల్లల కథలను లోకం దృష్టికి తీసుకువచ్చింది. పట్టణ ప్రాం తాలలో పెరిగిన దీప్తి దేశ విదేశాల్లో ఎన్నో మెట్రోపాలిటన్ నగరాలలో పనిచేసింది. ‘సమాజ నిర్మాణంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి సమాన అవకాశాలు లేవు’ అనే ఎరుక ఆమెను ఎప్పటికప్పుడు కొత్తప్రాంతాలకు తీసుకు వెళుతుంది. కొత్త జీవితాలను ఆవిష్కరించేలా చేస్తున్న దీప్తి ప్రస్తుతం గోవాలో ఉంటోంది. లక్ష్యంతో కూడిన ప్రయాణం భావాలను వ్యక్తీకరించడానికి పుస్తకం రాయడం, ఉపన్యాసం చేయడం లాగే ఫొటోగ్రఫీ కూడా ఒక సాధనం. నేను తీసిన చిత్రాలు నా భావాలకు అద్దం పట్టేలా ఉంటాయి. ఒక మహిళగా ఇతర మహిళలు, పిల్లలతో మాట్లాడడం నాకు సులువు అయింది. సోలోగా ట్రావెల్ చేయడంలో లైఫ్స్కిల్స్ క్రమక్రమంగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ప్రయాణానికి ఒక లక్ష్యం తోడైతే అది అద్భుతంగా ఉంటుంది. – దీప్తి అస్థాన వారి జీవితంలో భాగం అవుతాను కెమెరా ఉన్నా సరే, ఎదుటి వ్యక్తి జీవితపు లోతు అప్పటికప్పుడు ఆవిష్కారం కాదు. వారితో సరిగ్గా కనెక్ట్ కాగలగాలి. మనం వారిని అర్థం చేసుకున్నట్లే వారూ మనల్ని అర్థం చేసుకోవాలి. తమ గురించి తెలుసుకోవడంలో, కెమెరా ఉపయోగించడంలో ఎలాంటి వాణిజ్య ప్రయోజనం లేదనే భావన వారికి కలగాలి. ఇదేమంత సులభం కాదు. అలా అని జటిలం కాదు. మన ఓపిక, ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఫోటోలు తీసుకున్నప్పుడు వారి జీవితంలో భాగం అవుతాను. వారు నాలో భాగం అవుతారు. కలిసి భోజనం చేస్తాం. సరదా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటాం. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ మూలకు వెళ్లినా తమలో భాగంగా చూసుకున్నారు. ఆత్మీయత పంచారు. ఇది నా అదృష్టం. – దీప్తి అస్థాన -
కవిత్వాన్ని ముద్రించే కెమెరా
ప్రపంచవ్యాప్తంగా కెమెరాలు ఫొటోలు, వీడియోలు తీయడానికే ఉపయోగపడతాయి. పోలరాయిడ్ కెమెరాలైతే, తక్షణమే ఫొటోలను ముద్రించి అందిస్తాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న కెమెరాను పోలరాయిడ్ కెమెరా స్ఫూర్తితోనే తయారు చేశారు. అయితే, ఇది ఫొటోలకు బదులుగా కవిత్వాన్ని ముద్రిస్తుంది. ఈ కెమెరాతో ఏవైనా దృశ్యాలను బంధిస్తే, దృశ్యాలకు అనుగుణమైన కవిత్వాన్ని ముద్రించి అందిస్తుంది. దృశ్యాల ద్వారా కవిత్వాన్ని సృష్టించడానికి ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఈ కెమెరా విడిభాగాలుగా దొరుకుతుంది. విడిభాగాలను జోడించుకుని, దీనిని ఎవరికి వారే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో సింగిల్బోర్డ్ కంప్యూటర్, రేకు డబ్బా, వెబ్కామ్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దీని ద్వారా కోరుకున్న స్థానిక భాషల్లో కూడా కవిత్వాన్ని ముద్రించుకోవచ్చు. థర్మల్ పేపర్పై ఈ కెమెరా ముద్రించే కవితల కాగితాలు చూడటానికి సూపర్ మార్కెట్ రశీదుల్లా కనిపిస్తాయి. అమెరికన్ డిజైనర్ శామ్ గార్ఫీల్డ్ ఈ కెమెరాకు రూపకల్పన చేశాడు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
మొక్కల ఊసులు రికార్డయ్యాయి ఇలా!
ఇంతకుమునుపు మొక్కలు మాట్లాడతాయని, అవి కూడా బాధలకు ప్రతిస్పందిస్తాయని విన్నాం. అందుకు సంబంధించిన విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా వెల్లడించారు కూడా. ఎప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకుని ప్రతిస్పందిస్తాయన్నది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. దీన్ని పరిశోధకులు తాజాగా చేధించడమే గాక మొక్కలు మాట్లాడుకోవడాన్ని కెమెరాలో బంధించి మరీ వివరించారు. వివరాల్లోకెళ్తే..జపాన్కి చెందిన శాస్త్రవేత్తల బృందం అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది.మొక్కలు ఒకదానికొకటి మాట్లాడుకోవడం నిజమేనని వీడియోలో బంధించి మరీ ప్రూవ్ చేసి చూపించారు. మొక్కలు కమ్యూనికేట్ చేయడానికి గాలిలో ఉండే సమ్మేళనాలను వినియోగించుకుంటాయిని, అవి పొగమంచుతో చుట్టబడి ఉంటాయని అన్నారు. ఈ సమ్మెళనాలను వాసనలుగా వినియోగించుగకుని ప్రమాదం గురించి మరొక మొక్కను హెచ్చరిస్తాయని చెబుతున్నారు. ఈ మేరకు జపాన్ శాస్త్రవేత్తలు రికార్డ్ చేసిన వీడియోలో.. మొక్కలు ఎలా ఆ సిగ్నల్స్ని స్వీకరించి ప్రతిస్పందిస్తాయన్నది ప్రత్యక్షంగా చేసి చూపించారు. సైతామ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ మసాత్సుగు టొయోటా నేతృత్వంలోని పరిశోధకులు బృందం ఈ విషయాన్నికమ్యూనికేషన్స్ జర్నల్లో వెల్లడించింది. ఇక్కడ మొక్కలు కీటకాలు లేదా ఇతరత్ర కారణాల వల్ల గాయపడిన లేదా దెబ్బతిన్న మొక్కలు మరోక మొక్కను హెచ్చరించేందుకు అస్థిర కర్బన సమ్మేళనాలను(వీఓసీ) విడుదల చేస్తుందని తెలిపారు పరిశోధకులు. గాల్లో విడుదలైన ఆ వీఓసీలను గాయపడిన మొక్కలు గ్రహించి తక్షణమే వివిధ రక్షణ ప్రతిస్పందనలు ప్రేరేపిస్తాయని తెలిపారు. అస్థిర కర్బన సమ్మేళనాలలో కాల్షియం అయాన్లు ఉండటం వల్ల మొక్కలు జరిపే ఈ కమ్యూనికేషన్ ప్రక్రియను కాల్షియం సిగ్నలింగ్ అని పిలవొచ్చని సైంటిస్టులు అన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా రెండు టమాటా మొక్కలు, ఆవాల జాతికి చెందిన రెండు అరబిడోప్సిస్ థాలియానా జాతి కలుపుమొక్కలను పక్కపక్కన తొట్టిల్లో ఉంచారు. కాల్షియం సిగ్నలింగ్ అనేది మొక్కల ఆకులపై స్పష్టంగా కనిపించేలా ఈ మొక్కలకు బయో సెన్సర్లను బిగించారు. అనంతరం ఒక టమాటా మొక్క, ఒక అరబిడోప్సిస్ థాలియానా మొక్క ఉన్న తొట్టిలలోకి గొంగళి పురుగులను వేశారు. ఆ వెంటనే పురుగులు మొక్కలపైకి ఎక్కి ఆకులను తినడం ప్రారంభించాయి. దీంతో ఈ మొక్కలు స్పందించి.. వెంటనే కాల్షియం సిగ్నళ్లను రిలీజ్ చేశాయి. ఆ పక్కనే ఆరోగ్యకర స్థితిలో ఉన్న రెండు మొక్కలు ఈ సిగ్నళ్లను గ్రహించడం కూడా జరిగిపోయింది. దీంతో వెంటనే మొక్కల్లోని బయోసెన్సర్లు స్పందించి.. ఆకుల్లో కాల్షియం అయాన్లు యాక్టివేట్ అయిన ప్రదేశాన్ని మెరుస్తున్నట్లుగా హైలైట్ చేసి చూపించాయి. ఇదంతా లైవ్లో కెమెరాలో రికార్డయింది. If #plants could talk, they’d do so thru chemical signals about predators (aphids, caterpillars, gardeners with shears/pesticides…). Plants CAN talk (which we’ve known), but molecular biologists at Saitama University in Japan caught it 1st on film. https://t.co/44gXzMerK5 pic.twitter.com/DcLAlV1iti — HoneyGirlGrows (@HoneyGirlGrows) January 20, 2024 (చదవండి: మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
నిషిద్ధ కాంతి చిక్కింది
ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ–01–24–014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపట్టింది. వాటికి సంబంధించి అబ్బురపరిచే ఫొటోలను భూమికి పంపింది. టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ (ఏసీఎస్) ఈ ఘనత సాధించింది. అత్యంత స్పష్టతతో ఉన్న ఫొటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న ఎంసీజీ గెలాక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు. కాస్మిక్ ఫొటోగ్రఫీ చరిత్రలోనే దీన్ని అత్యంత అరుదైన ఫీట్గా అభివరి్ణస్తున్నారు. హబుల్ ఫొటోల్లో కన్పిస్తున్న ఎంసీజీ గెలాక్సీ పూర్తిస్థాయిలో వికసించిన నిర్మాణం, అత్యంత శక్తిమంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తోంది. ఇది అత్యంత చురుకైన కేంద్రకాలున్న టైప్–2 సీఫెర్ట్ గెలాక్సీల జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది. సీఫెర్ట్ గెలాక్సీలు అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసార్ల సమీపంలో ఉంటాయి. అయితే క్వాసార్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రమూ కని్పంచనీయనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి. సీఫెర్ట్ గెలాక్సీలు మాత్రం వీక్షణకు అనువుగానే ఉంటాయి. కానీ అత్యంత సుదూరంలో ఉన్న కారణంగా వీటి వెలుతురు ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కలేదు. ఆ కారణంగానే సైంటిస్టుల పరిభాషలో దాన్ని ‘నిషిద్ధ కాంతి’గా ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. పైగా ఈ కాంతి పుంజాలు భూమ్మీద మనకు ఇప్పటిదాకా తెలిసిన పరిమాణ భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తిగా అతీతమన్నది సైంటిస్టుల నమ్మకం. అనంత విశ్వంలో అంతటి సుదూర అంతరిక్ష క్షేత్రంలో మన భౌతిక శాస్త్ర నియమాలన్నీ తల్లకిందులవుతాయని వారు చెబుతుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవ్వరినీ వదలని ఏఐ కెమెరాలు.. ఈ సారి పోలీసులకే..
అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై సుమారు 726 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసింది. సేఫ్ కేరళ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించి వారికి చలానాలు జారీ చేస్తాయి. ఏఐ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి కేరళలో ట్రాఫిక్ ఉల్లంఘనలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. సీట్ బెల్టు ధరించకపోయినా, హెల్మెట్ పెట్టుకోకపోయినా ఆలాంటి వాహనాలను గుర్తించి ఏఐ కెమరాలు ఫోటోలు తీస్తాయి. సంబంధిత అధికారులు చలానాలు జారీ చేస్తారు. గతంలో ఓ స్కూటరిస్టుకు ఏకంగా రూ. 86,500 చలాన్ జారీ చేసిన సంఘటన మరువక ముందే.. ఏఐ కెమెరా ఇటీవల పోలీస్ వాహనానికి కూడా చలాన్ జారీ చేసింది. KL01 BK 5117 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన కారులో వెళ్తున్న పోలీసు (కో-ప్యాసింజర్) సీట్ బెల్ట్ ధరించకపోవడంతో ఫోటో తీసి చలాన్ జారీ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by modz_own_country (@modz_own_country) -
కార్మికులు కనిపించారు
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగం కూలిన 10వ రోజైన మంగళవారం సానుకూల పరిణామం సంభవించింది. లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులతో వారి కోసం బయట వేచి ఉన్న కుటుంబసభ్యులు మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడారు. అంతేకాకుండా, లోపలున్న వారికి సంబంధించిన విజువల్స్ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చాయి. దీంతో, కూలిన సొరంగం శిథిలాల్లోంచి తవ్విన ఆరంగుళాల పైప్లైన్ ద్వారా ఎండోస్కోపిక్ కెమెరాను పంపించి, లోపలున్న వారి యోగ క్షేమాలను తెలుసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనట్లయింది. ఈ పైపును 53 మీటర్ల మేర అడ్డుపడిన శిథిలాల గుండా సోమవారం లోపలికి ప్రవేశపెట్టారు. కెమెరాను సోమ వారం రాత్రి ఢిల్లీ నుంచి అక్కడికి పంపించారు. పసుపు, తెలుపు రంగుల హెల్మెట్లను ధరించిన కార్మికులు, పైపులైన్ద్వారా లోపలికి పంపించిన ఆహార పదార్థాలను ఒకరికొకరు అందించుకుంటూ, మాట్లాడుకుంటూ ఆ విజువల్స్లో కనిపించారు. బయటున్న అధికారులు పెద్ద స్క్రీన్పై వారిని చూస్తూ తగు సూచనలు ఇచ్చారు. కెమెరా లెన్స్ శుభ్రంగా ఉంచుతూ, తమను తాము పరిచయం చేసుకోవాలని కోరారు. పైప్లైన్ దగ్గరకు చేరుకుని లోపలికి పంపించిన వాకీటాకీలతో మాట్లాడాలని చెప్పారు. అనంతరం ఆ కెమెరాను వెనక్కి తీశారు. ఇప్పటికే కొందరి కుటుంబసభ్యులు నాలుగంగుళాల కంప్రెషర్ ట్యూబ్ ద్వారా లోపలున్న తమ వారితో మాట్లాడారు. ఆ ట్యూబ్ ద్వారానే డ్రైఫ్రూట్స్ వంటివి కూడా లోపలికి పంపించారు. అయితే, తాజాగా అందుబాటులోకి వచ్చిన పైప్లైన్ కార్మికుల పాలిటి లైఫ్లైన్గా మారింది. ఇంతకుముందు కంటే ఎక్కువ ఆహారాన్ని పంపొచ్చు. కుటుంబసభ్యులతో మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. కొత్త పైపు ద్వారా లోపలున్న వారికి నారింజ, అరటి, యాపిల్ పండ్లు, బాటిళ్లలో కిచిడీ, సెల్ఫోన్లు, చార్జెర్లను సైతం పంపించారు. ఒక డాక్టర్ కూడా లోపలున్న కార్మికులతో మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడుపులో మంట, మూత్ర విజర్జనలో సమస్య..తదితరాలను తెలపగా వారికి మల్టీవిటమిన్ ట్యాబెట్లు, ఎలక్ట్రోలైట్ పౌడర్, యాంటీ డిప్రెస్సెంట్లను పంపినట్లు డాక్టర్ పీఎస్ పొఖ్రియాల్ చెప్పారు. సొరంగంలో చిక్కుకుపోయిన ప్రదీప్ కిక్సు క్షేమంగానే ఉన్నట్లు ఆయన మరదలు తెలిపారు. -
సొరంగ బాధితుల ఫొటోలను ఎండోస్కోపిక్ కెమెరా ఎలా తీసింది?
ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్లో గత 9 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో వారికి పైపు ద్వారా ఘన ఆహారాన్ని అందించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దీనితోపాటు ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా కార్మికుల పరిస్థితిని అధికారులు గమనించారు. రెస్క్యూ బృందం ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున వారి దగ్గరకు ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపారు. వారి క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అందుకే ఎండోస్కోపిక్ కెమెరా అంటే ఏమిటో.. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ కెమెరాలను మానవ శరీరంలోని అంతర్గత అవయవాలను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఎండోస్కోపిక్ కెమెరాలు అత్యంత సాంకేతికంగా పనిచేస్తాయి. సరైన రోగనిర్ధారణ, వ్యాధులకు తగిన చికిత్స అందించేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వైద్యులు వినియోగిస్తారు. ఆధునిక ఎండోస్కోపిక్ కెమెరాలు ‘చిప్-ఆన్-టిప్’ సాంకేతికతతో పనిచేస్తాయి. కెమెరా చివరిలో ఉన్న సాఫ్ట్ ప్యాకేజీ ద్వారా ఫొటోలు తీయడం జరుగుతుంది. ఈ కెమెరా పైన ఎల్ఈడీ లైట్ ఉంటుంది. ఫలితంగా ఈ కెమెరా చీకటిగా ఉన్న ప్రదేశాలలో కూడా చిత్రాలను క్లిక్ చేయగలుగుతుంది. ఉత్తరాఖండ్లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం అధికారులు ఫ్లెక్సీ కెమెరాను ఉపయోగించారు. పైప్లైన్లోని చిన్న రంధ్రం ద్వారా కెమెరాను సొరంగం లోనికి పంపించి బాధితుల గురించి తెలుసుకున్నారు. ఇది కూడా చదవండి: యాంటీమాటర్ అంటే ఏమిటి? ఎందుకు అత్యంత శక్తివంతం? -
కెమెరాల్లో రీళ్లు వేసుకుని, ఫొటోలు తీసేలా ఫిల్మ్రోల్
డిజిటల్ కెమెరాలు, స్మార్ట్ఫోన్లు వచ్చాక రీళ్లు వేసుకునే పాతకాలం కెమెరాలు కనుమరుగైపోయాయి. పాత పద్ధతిలో కెమెరాల్లో రీళ్లు వేసుకుని, ఫొటోలు తీయడం ఇష్టపడేవారి కోసం తాజాగా డిజిటల్ ఫిల్మ్రోల్ అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ ఫొటోగ్రఫీ కంపెనీ ‘ఐయామ్ బ్యాక్’ ఈ డిజిటల్ ఫిల్మ్రోల్ను ఇటీవల రూపొందించింది. ఇందులోని ఫిల్మ్ రోల్ హోల్డర్లో 20 మెగాపిక్సెల్ సోనీ 4/3 సెన్సర్, బ్యాటరీ, మెమరీ కార్డ్ స్లాట్ ఉంటాయి. ఈ డిజిటల్ ఫిల్మ్ రోల్ హోల్డర్ను ఎలాంటి 35 ఎంఎం కెమెరాలోనైనా ఉపయోగించుకోవచ్చు. పాతకాలం నికాన్, కేనన్, పెంటాక్స్, ఒలింపస్ తదితర కంపెనీల 35 ఎంఎం కెమెరాల్లో ఈ డిజిటల్ ఫిల్మ్రోల్ను వేసి, వాటితో ఇంచక్కా ఫొటోలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ‘కిక్స్టార్టర్’ ద్వారా ఆన్లైన్లో ప్రీఆర్డర్పై అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. -
కెమెరాలో ఎన్ని ట్రిక్కులుంటాయంటే.. చూసేదంతా భ్రమే
-
బాల ఫొటోగ్రాఫర్ల కోసం అదిరిపోయే కెమెరా..ఫీచర్లు ఏంటంటే?
చిన్నారులు ఫొటో తీసుకుంటున్న ఈ కెమెరా ప్రత్యేకంగా బాల ఫొటోగ్రాఫర్ల కోసం రూపొందించినది. ఇందులో ఫొటోలు తీసుకోవడంతో పాటు ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ఆస్ట్రేలియన్ కంపెనీ వీ–టెక్ ‘కిడిజూమ్’ పేరుతో ఈ కెమెరాను మార్కెట్లోకి తెచ్చింది. ఇది 2.0 మెగాపిక్సెల్ కెమెరా. ఇందులో నాలుగు రెట్లు జూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో 35 ఫొటో ఎఫెక్ట్స్, నాలుగు గేమ్స్, నాలుగు యాప్స్ కూడా ఉంటాయి. ఈ కెమెరాతో తీసుకున్న ఫొటోలను చిన్నారులు తమంతట తామే కోరుకున్న రీతిలో ఎడిట్ చేసుకోవచ్చు. వాటిని కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ఈ కెమెరా చక్కని కాలక్షేపంగా ఉంటుంది. పొరపాటున చేయిజారినా పగిలిపోని విధంగా దీన్ని దృఢంగా రూపొందించడం విశేషం. దీని ధర 63.74 డాలర్లు (రూ.5,306) మాత్రమే! -
రొమాంటిక్ ఫోటో క్లిక్ చేసిన ఏఐ కెమెరా.. వావ్ అంటున్న నెటిజన్లు!
ఆధునిక కాలంలో టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని ఉపయోగించుకుంటూ మనుషులు తమ పనిని మరింత సులభతరం చేసుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేయడానికి ఈ ఏడాది ప్రారంభంలో సుమారు 726 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆ ఫోటోలను గమనించి చలానాలు విధిస్తున్నారు. ఇటీవల ఒక AI ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏఐ కెమెరా తీసిన ఫోటోలో ఓ క్యూట్ రొమాంటిక్ జంటను చూడవచ్చు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హైరిజల్యూషన్ కెమెరా రాత్రి సమయంలో కూడా అద్భుతంగా వైట్ అండ్ బ్లాక్ ఫోటో తీసింది. ఇందులో బైక్ రైడర్ హెల్మెట్ ధరించాడు, వెనుక ఉన్న అమ్మాయి హెల్మెట్ ధరించలేదు. ఈ కారణంగా వారికి జరిమానా విధించారు. ఈ ఫోటోలు అమ్మాయి నవ్వుతుండటం చూడవచ్చు. వండి భ్రాంతన్మార్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ ఫోటో పోస్ట్ చేస్తూ.. డబ్బులిచ్చి పెట్టుకునే పెయిడ్ ఫోటోగ్రాఫర్లు కూడా ఇంతమంచి ఫోటో తీయలేరేమో? అయితే ఇది కలర్ ఫోటో అయితే ఇంకా బాగుండేదని వెల్లడించాడు. అయితే జరిమానా అందుకున్న వ్యక్తి ఇలాగే భావించాడా? లేదా అనే తెలియాలి. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. ఏఐ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కేరళలో ప్రమాదాలలలో మరణించే వారి సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. ఈ ప్రాజెక్టు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 232 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘన సంఖ్య కూడా బాగా తగ్గింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 500, టూ వీలర్ మీద ముగ్గురు వ్యక్తులు వెళ్తే రూ. 1,000. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రైడింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తే రూ. 2000 జరిమానా విధించబడుతుంది. View this post on Instagram A post shared by Vandibhranthanmar (@vandi_bhranthanmar) -
ఆదిత్య సెల్ఫీ..!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడి దిశగా దూసుకుపోతున్న ఆదిత్య–ఎల్1 కెమెరా పని మొదలుపెట్టింది. తన సెల్ఫీతోపాటు భూమి, చంద్రుడిని కూడా క్లిక్ మనిపించింది. ఈ మేరకు ఆదిత్య–ఎల్1 నుంచి అందుకున్న ఫొటోలను బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో విడుదల చేసింది. ఆదిత్య–ఎల్1లో అమర్చిన కెమెరా ఈనెల 4న తీసిన సెల్ఫీలో వీఈఎల్సీ (విజిబుల్ ఎమిషన్ లైన్), ఎస్యూఐటీ(సోలార్ అ్రల్టావయొలెట్) పరికరాలు కనిపిస్తున్నాయి. అదే కెమెరా భూమి, చంద్రుడి ఫొటోలను కూడా తీసింది. ఆదిత్య–ఎల్1లో అమర్చిన ఏడు వేర్వేరు పేలోడ్లలో వీఈఎల్సీ, ఎస్యూఐటీలు కూడా ఉన్నాయి. ఆదిత్య–ఎల్1 భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజియన్ పాయింట్1(ఎల్1)లోని తన నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నాక సూర్యుడి చుట్టు పరిభ్రమిస్తూ వీఈఎల్సీ పేలోడ్ ద్వారా రోజుకు 1,440 ఫొటోలను తీసి భూనియంత్రిత కేంద్రాలకు విశ్లేషణ నిమిత్తం పంపించనుంది. -
అత్యంత అరుదైన చేప! ఐతే ఇది ఈత కొట్టదట..ఏకంగా..
నీటిలో చేపలు ఈతకొడతాయి. అయితే, ఇదొక వింత చేప. నీటి అడుగున ఇది నడుస్తుంది. దీనికి ముందు వైపు చేతుల్లా ఉపయోగపడే కాళ్లు పెద్దగా ఉంటాయి. వెనుకవైపు కాళ్లు చాలా చిన్నగా ఉంటాయి. అందువల్ల దీనిని హ్యాండ్ఫిష్ అంటారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ రకమైన చేప కెమెరా కంటికి చిక్కింది. ఇదివరకు విక్టోరియా తీరానికి చేరువలోని సముద్రంలో 1986లో ఒకసారి, 1996లో ఒకసారి ఇలాంటి హ్యాండ్ఫిష్ చేప కనిపించింది. ఇటీవల టాస్మానియా ఈశాన్యాన ఉన్న ఫ్లిండర్స్ దీవికి చేరువలో సముద్రం అడుగున నడుస్తున్న ఈ హ్యాండ్ఫిష్ అండర్వాటర్ కెమెరాకు చిక్కింది. ఇది నీటికి 292 అడుగుల లోతున ఉండగా కెమెరాకు చిక్కినట్లు కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ) శాస్త్రవేత్త కార్లీ డివైన్ తెలిపారు. సీఎస్ఐఆర్ఓ శాస్త్రవేత్తలు టాస్మానియా సముద్ర జలాల్లో పరిశోధనల కోసం ‘ఆర్వీ ఇన్వెస్టిగేటర్’ ఓడలో అన్వేషణ సాగిస్తుండగా, ఈ అరుదైన చేప వారి కెమెరాకు చిక్కడం విశేషం. (చదవండి: అక్కడ హోటళ్లలోని గదులను చూస్తే..కంగుతినడం ఖాయం!) -
వాట్ ఏ టెక్నాలజీ.. ఈజీగా ఈత కొట్టేయొచ్చు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే తొలి అండర్వాటర్ కెమెరా ఇది. ఈత కొట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్లు ప్రమాదాలకు గురైతే, ఈ కెమెరా వెంటనే గుర్తిస్తుంది. ఇందులోని డ్రౌనింగ్ డిటెక్షన్ సిస్టమ్ మునిగిపోతున్న వారిని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇళ్లలోను, హోటల్స్లోను ఉండే స్విమింగ్పూల్స్లో ఉపయోగించడానికి ఇది పూర్తిగా అనువుగా ఉంటుంది. అమెరికన్ గృహోపకరణాలు, స్విమింగ్పూల్ రక్షణ పరికరాల తయారీ సంస్థ ‘కోరల్’ ఈ అండర్వాటర్ సెక్యూరిటీ కెమెరాను ‘మైలో’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ‘మైలో’ కెమెరా నిరంతరం స్విమింగ్పూల్ను కనిపెడుతూనే ఉంటుంది. ఈతకొడుతూ ఎవరైనా మునిగిపోతున్నట్లు గుర్తిస్తే, దీని యాప్ ద్వారా అనుసంధానమైన కుటుంబ సభ్యులు, సంబంధీకుల స్మార్ట్ఫోన్లకు తక్షణమే సమాచారం పంపుతుంది. దీని ధర 1499.15 డాలర్లు (సుమారు రూ.1.25 లక్షలు). (చదవండి: ఇలా కూడా నిద్రపోవచ్చా!..వర్క్ప్లేస్లో కూడా..) -
ప్రాణాలు కాపాడే.. ప్రపంచంలోనే తొలి ‘AI’ కెమెరా.. ధర ఎంతంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే తొలి అండర్వాటర్ కెమెరా ఇది. ఈత కొట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్లు ప్రమాదాలకు గురైతే, ఈ కెమెరా వెంటనే గుర్తిస్తుంది. ఇందులోని డ్రౌనింగ్ డిటెక్షన్ సిస్టమ్ మునిగిపోతున్న వారిని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇళ్లలోను, హోటల్స్లోను ఉండే స్విమింగ్పూల్స్లో ఉపయోగించడానికి ఇది పూర్తిగా అనువుగా ఉంటుంది. అమెరికన్ గృహోపకరణాలు, స్విమింగ్పూల్ రక్షణ పరికరాల తయారీ సంస్థ ‘కోరల్’ ఈ అండర్వాటర్ సెక్యూరిటీ కెమెరాను ‘మైలో’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ‘మైలో’ కెమెరా నిరంతరం స్విమింగ్పూల్ను కనిపెడుతూనే ఉంటుంది. ఈతకొడుతూ ఎవరైనా మునిగిపోతున్నట్లు గుర్తిస్తే, దీని యాప్ ద్వారా అనుసంధానమైన కుటుంబ సభ్యులు, సంబంధీకుల స్మార్ట్ఫోన్లకు తక్షణమే సమాచారం పంపుతుంది. దీని ధర 1499.15 డాలర్లు (సుమారు రూ.1.25 లక్షలు). -
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని చంద్రుని ఉపరితలం..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. రోవర్ ప్రగ్యాన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని ఇస్రో తెలిపింది. అన్ని ప్రక్రియలు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో పూర్తి అయ్యాయని స్పష్టం చేసింది. రోవర్ కదలికలు ప్రారంభమయ్యాయని తెలిపింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగేప్పుడు చివరి క్షణంలో తీసిన జాబిల్లి వీడియోను షేర్ చేసింది. Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal. 🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today. 🔸Rover mobility operations have commenced. 🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday. — ISRO (@isro) August 24, 2023 దక్షిణ ధృవంపైనే ఎందుకు..? చంద్రయాన్ 3 దిగ్విజయంగా జాబిల్లిపై కాలు మోపింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. దక్షిణ ధృవాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నపై ఇస్రో చీఫ్ సోమనాథ్ సమాధానమిచ్చారు. 'చంద్రుని దక్షిణ ధృవంపై సూర్మరశ్మి పడే అవకాశాలు లేవు. నీరు, ఖనిజాలకు సంబంధించిన వివరాలు లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చంద్రుని నివాసానికి సంబంధించిన వివరాలు కూడా దక్షిణ ధృవం వద్ద లభిస్తాయి. అందుకే ఈ ధృవం వైపే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడానికి పలు దేశాలు ప్రయత్నించాయి' అని తెలిపారు. 'చంద్రయాన్ 2 ప్రయత్నంలో విఫలమైన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఓ ఏడాది చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలపైనే అధ్యయనం చేశాం. మరో ఏడాది ఆ తప్పులను సరిచేయడంపైనే పనిచేశాం. మరో ఏడాది వాటిని పరీక్షించి చూసుకున్నాం. చివరగా నాలుగేళ్లకు చంద్రయాన్ 3ని ప్రయోగించాం.' అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అయింది. ఇప్పటికే ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. మరో 14 రోజులపాటు చంద్రునిపై పనిచేయనుంది. ఇదీ చదవండి: జాబిల్లిపై మూడు సింహాల అడుగులు.. రోవర్కు సారనాథ్ అశోక చిహ్నం.. -
డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్లో ఫైటింగ్.. పొట్టుపొట్టు కొట్టుకున్నారు..!
అమెరికాలోని అలబామాలోని రివర్ ఫ్రంట్ పార్క్లో దారుణం జరిగింది. కొందరు యువకులు ఓ సెక్యూరిటీ గార్డ్పై పిడిగుద్దులు కురిపించారు. ఓ బోటును పక్కకు జరపమని సెక్యూరిటీ గార్డ్ అడిగిన నేపథ్యంలో ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. Yo this is wild 😭 A group of white men attacked a black security guard after the security asked them to move their pontoon boat so the big Harriot can dock. They refused to & attacked the security guard. A group of black men seen & went defend him by beating the white men 💯🙌🏾 pic.twitter.com/Qzo3U3Kq1r — Shannonnn sharpes Burner (PARODY Account) (@shannonsharpeee) August 6, 2023 యువకులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. మొదట ఓ యువకుడు సెక్యూరిటీ గార్డ్పై దాడి చేశాడు. అనంతరం అతనికి మద్దతుగా వచ్చిన మరికొందరు పిడిగుద్దులు కురిపించారు. విచక్షణా రహితంగా ఆయనపై దాడి చేశారు. చొక్కాలు విప్పుకుని ఒకరిపై మరొకరు దాడికి తెగబడ్డారు. డబ్ల్యడబ్ల్యూఈ స్థాయిలో కుర్చీలతో చొక్కాలు విప్పుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందులో మహిళలు కూడా పాలు పంచుకున్నారు. ఘర్షణలో కొందరిని నదిలో నెట్టేశారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇదీ చదవండి: ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే.. -
టెక్ టమారం : ఎగిరిపోయే సెల్ఫీ కెమెరాలు వచ్చేశాయి..ధరెంతంటే?!
స్మార్ట్ఫోన్లో సెల్ఫీలు తీసుకోవడం అందరికీ తెలిసిన సంగతే! స్మార్ట్ఫోన్తో సెల్ఫీలు తీసుకోవడంలో చాలా పరిమితులు ఉన్నాయి. పరిమితమైన భంగిమల్లోనే ఫొటోలు తీసుకోవడం సాధ్యమవుతుంది. సెల్ఫీలను మరింత చక్కగా, స్పష్టంగా తీసుకునేందుకు వీలైన డ్రోన్ కెమెరాను అమెరికన్ కంపెనీ ‘హోవర్’ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. అరచేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉండే ఈ డ్రోన్ కెమెరా చాలా తేలికగా కూడా ఉంటుంది. దీని బరువు 125 గ్రాములు మాత్రమే. దీనిని అరచేతి నుంచే టేకాఫ్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా దీని కదలికలను నియంత్రించవచ్చు. ఇందులో క్విక్షాట్ మోడ్ను ఎంపిక చేసుకుంటే, వెంట వెంటనే సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీస్తుంది. ఫాలో మోడ్ను ఎంపిక చేసుకుంటే, మనం కోరుకున్న చోటుకు అనుసరిస్తూ వీడియోలు చిత్రిస్తుంది. ఇది తీసే ఫొటోలను, వీడియోల ప్రీవ్యూలను మొబైల్లో లైవ్లో చూసుకోవచ్చు. ‘హోవర్ కెమెరా ఎక్స్1’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ కెమెరా వీడియో బ్లాగర్లకు, ఔత్సాహిక ఫిలిమ్ మేకర్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని ధర 389 డాలర్లు (రూ.31,924) మాత్రమే! -
ప్రపంచం లోనే అతి చిన్న మిర్రర్ లెస్ కెమెరా..!
-
రెజ్లర్ల అంశంపై రైతు నాయకుల మధ్య వాగ్వాదం..ఒకరికొకరు వేళ్లు చూపుతూ..
హరియాణా:రెజ్లర్ల అంశంపై చర్చించేందుకు హరియాణాలో సమావేశమైన 'ఖాప్ పంచాయతీ' సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వేదికపై సభ్యులు అరుస్తూ.. ఒకరికొకరు వేళ్లు చూపించుకున్నారు. గొడవకు గల కారణాలు తెలియనప్పటికీ ఈ వీడియో వైరల్గా మారింది. రెజ్లర్ల ఆందోళనపై తదుపరి చర్యలు తీసుకోవడానికి రైతులతో పాటు 31 మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఇందులో 9 మందితో కూడిన ప్రత్యేక కమిటి ఆ అంశాలలో దిశానిర్ధేశం చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. #WATCH | Scuffle breaks out between the members of Khap panchayat during their meeting in support of wrestlers' protest in Kurukshetra, Haryana pic.twitter.com/Nj15aQgxZ9 — ANI (@ANI) June 2, 2023 రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆరోపించారు. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్,బజరంగ్ పునియాతో సహా పలువురు అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్న ఆటగాళ్లు బాధిత రెజ్లర్ల తరపున నిరసనలను చేపట్టారు. తమ పతకాలను గంగలో నిమజ్జనం చేస్తామని రెజ్లర్లు ప్రకటించి గత మంగళవారం హరిద్వార్కు వెళ్లారు.రైతు నాయకులు చివరి నిమిషంలో ఒప్పించి మద్దతు తెలపడంతో రెజ్లర్లు తమ ప్రణాళికలను మార్చుకున్నారు. రెజ్లర్లకు పలువురు రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలిపారు. 1983 ప్రపంచ కప్ గెలిచిన క్రికెట్ జట్టు సభ్యులు కూడా రెజ్లర్లకు అండగా నిలబడ్డారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ప్రభుత్వం ఆటగాళ్ల సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఖండించారు. ఆరోపణలు రుజువైతే ఉరివేసుకుంటానని అన్నారు. చదవండి:ఏడుగురిని ఒకే తరహాలో!.. బ్రిజ్ భూషణ్పై సంచలన నిందారోపణలు -
ఆ హైవేపై ప్రమాదాల నివారణకు ఏఐ లెన్స్ కెమెరా.. దాని సామర్థ్యం ఎంతంటే...
మహారాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న పలు చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ నేపధ్యంలోనే ముంబై-పూణె ఎక్స్ప్రెస్ హైవే ట్రాఫిక్ మనేజిమెంట్ సిస్టమ్(హెచ్టీఎంఎస్)కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సిస్టమ్ ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తికావచ్చని సమాచారం. ఈ సిస్టమ్తో వాహన వేగాన్ని గుర్తించడమే కాకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపట్టేందుకు మరింత అవకాశం లభిస్తుంది. ఈ సిస్టమ్ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో కొనసాగనుంది. గడచిన కొద్ది నెలల నుంచి రవాణాశాఖ రాష్ట్రంలోని అన్ని ఆర్టీవోలకు రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని ఆదేశించింది. కాగా హెచ్టీఎంఎస్లో ముంబై నుంచి పూణె మధ్య 93 స్పాట్లలో హైటెక్ కెమెరాలను ఇన్స్టాల్ చేయనున్నారు. ఈ కెమెరాలు వాహన వేగాన్ని గుర్తించే సామర్థ్యం కలిగివుంటాయి. ఈ కెమెరాలలో హైరిజల్యూషన్ ఉన్న కారణంగా వాహనంలోని డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదో కూడా ఈ కెమెరా చూపిస్తుంది. ఏఐ ఆధారిత లెన్సులు కలిగిన ఈ కెమెరా.. వాహన నంబరు ప్లేటు ఆధారంగా సమాచారాన్నంతా సేకరించి, వెంటనే కంట్రోల్ రూమ్కు పంపిస్తుంది. ఈ హైవేలో ఇలాంటి 370 కెమెరాలను అమరుస్తున్నారు. ఎక్స్ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నందున వాటి నియంత్రణకు హెచ్టీఎంఎస్ ప్రాజెక్టు ప్రారంభమయ్యింది. ఇది సమగ్రంగా కార్యకలాలు ప్రారంభించాక రోడ్డు ప్రమాదాలు మరింతగా తగ్గుతాయని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. -
మాల్వేర్ 'దామ్'తో జాగ్రత్త.. అలా చేస్తే..మీ ఫోన్ డేటా మొత్తం హ్యాక్
కొత్తరకమైన ఆండ్రాయిడ్ మాల్వేర్ 'దామ్'తో జాగ్రత్తగా ఉండమని కేంద్ర సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మెుబైల్ ఫోన్లలోకి దామ్ ప్రవేశించి డేటాను హ్యాక్ చేస్తుంది. కాల్ రికార్డ్స్, హిస్టరీ, కెమెరాలోని సమాచారాన్ని స్వాధీనం చేసుకుంటుంది. లక్షిత డివైజ్లపై రాన్సమ్వేర్ను సృష్టించి యాంటీ వైరస్ ప్రోగ్రామ్లను కూడా సులభంగా ఛేదించగలదని వెల్లడించింది. డివైజ్లోకి ఈ మాల్వేర్ చొరబడిన తర్వాత మెుబైల్ సెక్యూరిటీని మభ్యపెడుతుంది. ఆ తర్వాత సున్నితమైన డేటాను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి తన ప్రయత్నంలో సఫలమైతే ఫోన్లోని హిస్టరీని, బుక్మార్క్ను, కాల్ లాగ్స్ వంటి కీలక సమాచారాన్ని సులభంగా రాబడుతుంది. సమాచారాన్ని రాబట్టుకున్న తర్వాత ఒరిజినల్ డేటాను డిలీట్ చేసి, హ్యాక్ చేసిన డేటాను '.enc' ఫార్మాట్లో ఎన్క్ట్రిప్ట్ చేసుకుని భద్రపరుచుకుంటుందని వెల్లడించాయి. దీంతో పాటు ఫైల్స్ను అప్లోడ్, డైన్లోడ్, అడ్వాన్స్డ్ ఎన్క్రిప్టెడ్ స్టాండర్డ్ ఆల్గారిథంతో కమాండ్ అండ్ కంట్రోల్ను తన ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీని భారిన పడకుండా ఉండాలంటే అనుమానాస్పద మెసేజ్లు, లింక్స్పై క్లిక్ చేయకూడదని సైబర్ సెక్యూరిటీ టీం తెలిపింది. యూఆర్ఎల్లో 'bitly','tinyur' వంటివి ఉంటే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. చదవండి:హెలిప్యాడ్ను అలానే ఎందుకు రూపొందిస్తారో తెలుసా? -
దంపతులు మధ్య చిచ్చు రేపిన ట్రాఫిక్ కెమెరా పిక్స్..జైలుపాలైన భర్త
కేరళ రాష్ట్రం ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు అత్యాధునిక ట్రాఫిక్ కెమరాలను ఏర్పాటు చేసింది. ఆ ట్రాఫిక్ కెమెరాలు ప్రస్తుతం వివాదస్పదమవ్వడమే గాక ఏకంగా ఓ కుంటుంబంలో కలతలు తెచ్చిపెట్టింది. కేరళలోని ఓ వ్యక్తి ఓ మహిళా స్నేహితురాలితో బైక్పై ప్రయాణించాడు. అతడు ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందో వారి మొబైల్కి ఫోటోతో సహా మెసేజ్ వెళ్లింది. ఐతే అతడి బైక్ భార్య పేరు మీద ఉండటంతో ఆమె మొబైల్కి మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె బైక్పై ఎక్కించుకున్న మహిళ ఎవరని ప్రశ్నించింది భార్య. నిజానికి ఆ మహిళ ఎవరో తనకు తెలియదని, తాను కేవలం ఆమెకు లిఫ్ట్ ఇచ్చానని భార్యాతో చెప్పాడు. కానీ ఆమె నమ్మలేదు. దీంతో ఇరువురి మద్య ఈ విషయమై గొడవలయ్యాయి. ఆ తర్వాత ఆమె తనపట్ల, కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపర్చడమే గాక జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని అధికారులు తెలిపారు. కాగా, సేఫ్ కేరళలో భాగంగా రోడ్డు భద్రతా ప్రాజెక్టు రహదారులపై ఈ అత్యాధునిక ట్రాఫిక్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాల ఒప్పందాల్లో చాలా అవినీతి జరిగిందంటూ కేరళ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆ కెమెరాలు సామాన్య ప్రయాణికుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పాలు చేస్తుండటం బాధకరం. (చదవండి: కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పెషెంట్..) -
రోబోటిక్ వీడియో కెమెరా: ధర తెలిస్తే షాకవుతారు
సాక్షి, ముంబై: జపానీస్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ ‘పానసోనిక్’ కొత్తగా రోబోటిక్ వీడియో కెమెరాను విడుదల చేసింది. ‘ఏడబ్ల్యూ–యూఈ 160 యూహెచ్డీ 4కే 1 ఎంఓఎస్ పీటీజ్’ పేరుతో విడుదల చేసిన ఈ కెమెరా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యంత స్పష్టమైన చిత్రాలను, వీడియోలను తీయగలదు. ఇందులో ఎంఓఎస్ సెన్సర్, లో పాస్ ఫిల్టర్, హైస్పీడ్ ఫ్రేమ్ రేట్స్ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. పరిసరాల్లోని వెలుగు నీడలకు అనుగుణంగా ఈ కెమెరా తనను తానే సర్దుకుని స్పష్టమైన వీడియోలను చిత్రించగలదు. జూమ్, టిల్ట్ వంటివి రిమోట్తో నియంత్రించవచ్చు. ఇది స్లోమోషన్ వీడియోలను కూడా పూర్తి స్పష్టతతో తీయగలదు. ఈ కెమెరాకు సంబంధించిన యాప్ను స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే, దాని ద్వారా కెమెరా పనితీరును సులువుగా నియంత్రించుకోవచ్చు. దీని ధర 14,495 డాలర్లు (రూ.11.93 లక్షలు). -
కసిగా ఉన్నట్లున్నాడు.. కెమెరాలు బద్దలైపోతున్నాయి
ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ మంచి కసి మీద ఉన్నట్లున్నాడు. తన తొలి ఐపీఎల్ ఆడడం కోసం ఇప్పటికే భారత్కు చేరుకున్న రూట్ రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో రూట్ తన ప్రాక్టీస్ను ముమ్మరం చేశాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రూట్ ఒక్కసారి కూడా ఐపీఎల్లో పాల్గొనలేదు. కనీస ధర రూ. కోటికే రాజస్తాన్కు అమ్ముడుపోయిన రూట్ తన బ్యాటింగ్ పవర్ను చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటివరకు 32 టి20లు ఆడిన రూట్ 126 స్ట్రైక్రేట్తో పరుగులు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 90గా ఉంది.ఇటీవలే అబుదాబి వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ టి20లో రూట్ బ్యాటింగ్లో అదరగొట్టాడు. తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేసి టి20 క్రికెటర్గా తాను పనికివస్తానని చెప్పకనే చెప్పాడు. ఇక ప్రాక్టీస్లో భాగంగా రూట్ కొట్టిన బంతి కెమెరాను బ్రేక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రూట్ తన సిగ్నేచర్ కవర్ డ్రైవ్ ఆడగా.. బంతి నేరుగా కెమెరాను తాకడంతో అది ముక్కలయింది. ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేసుకున్న రాజస్తాన్ రాయల్స్.. ''26.03.2023.. రాజస్తాన్ రాయల్స్ తరపున జో రూట్ ఫస్ట్బాల్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక రాజస్తాన్ రాయల్స్ గతేడాది ఐపీఎల్లో రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. జాస్ బట్లర్(863 పరుగులు) తన కెరీర్లోనే సూపర్ఫామ్ కనబరచడంతో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్తాన్ ఫైనల్కు చేరుకుంది. అయితే ఫైనల్లో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఖంగుతిని రన్నరప్తో సరిపెట్టుకుంది. 26.03.23 - Joe Root’s first ball as a Royal! 😂💗 pic.twitter.com/xvfGSgur0I — Rajasthan Royals (@rajasthanroyals) March 26, 2023 చదవండి: బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ! Lionel Messi: 'వొడువని ముచ్చట'.. అరుదైన గౌరవం -
Amazon Mega Electronics Day sale: అద్భుతమైన ఆఫర్లు, డోంట్ మిస్!
సాక్షి,ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్పై మరో సేల్ను ప్రకటించింది. మెగా ఎలక్ట్రానిక్స్ సేల్లో ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లు హెడ్ఫోన్లు తదితర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. మార్చి 14 వరకు కొనసాగనున్న ఈ స్పెషల్ సేల్ ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ ‘రిథమ్’ సన్గ్లాసెస్: భారీ తగ్గింపుతో) మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఈవెంట్లో శాంసంగ్, యాపిల్, బోట్, పైర్ బాల్ట్, లెనోవో, ఆసుస్, కెనాన్, సోనీ లాంటి ప్రముఖ బ్రాండ్స్ ఉత్పత్తులు తగ్గింపు ధరల్లో అందించనుంది. హెడ్ఫోన్లు, టాబ్లెట్లు,పీసీ యాక్సెసరీలు, కెమెరాలతో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై అద్భుతమైన డీల్స్ , ఆఫర్లను అందిస్తుంది. దీంతోపాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. మెగా సేల్లో కొన్ని ప్రత్యేక ఆఫర్లు ♦ ఆసుస్ వివో బుక్ 14 ల్యాప్టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 35,990కి అందుబాటులో ఉంది ♦ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3ల్యాప్టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 33,490కే కొనుగోలు చేయవచ్చు ♦ ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ స్మార్ట్ వాచ్ రూ. 1,699కే లభ్యం. ♦ రూ. 34,990కే యాపిల్ వాచ్ ఎస్ఈ లభిస్తుంది. బ్యాంకు కార్డ్ కొనుగోళ్లగా రూ. 1500 తగ్గింపు అదనం ♦ ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో రూ. 1,599కి, నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్ రూ. 1,199కి అందుబాటులో ఉంది. ♦ సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా జెడ్వీ 1 రూ. 69,490కి లభిస్తోంది. -
పవర్ఫుల్ షావోమీ 13 ప్రో వచ్చేసింది: రూ. 22 వేల దాకా ఆఫర్
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో ఆవిష్కరించిన షావోమీ 13 ప్రోని తీసుకొచ్చింది. పవర్ఫుల్ చిప్సెట్తో ఐఫోన్ 14 పోటీగా దీన్ని లాంచ్ చేసిందని టెక్ వర్గాల అంచనా. షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ 6.73 2K E6 AMOLED LTPO కర్వ్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1900నిట్స్ పీక్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 LPDDR5X UFS 4.0 ఆండ్రాయిడ్ 13 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50+50+50 ట్రిపుల్రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4820mAh బ్యాటరీ 120 వాట్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ధర, సేల్, ఆఫర్: మార్చి 10 నుండి షావోమీ 13 ప్రో సేల్ మొదలవుతుంది. ధర రూ. 79,999 అమెజాన్, ఎంఐ రిటైల్ స్టోర్లలో రూ.79,999కి అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక తక్షణ బ్యాంక్ తగ్గింపు రూ. 10,000 లేదా షావోమీ యూజర్లకు రూ. 12,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. -
ఇదేమి ఖర్మరా బాబు.. క్రికెట్ స్టేడియంలో కెమరాలు చోరీ! పాక్లో అంతే?
ప్రస్తుతం జరుగున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ మరోసారి భద్రతా లోపం బయటపడింది. ఈ ఏడాది ఈ లీగ్కు కరాచీ, ముల్తాన్, రావల్పిండి, లాహోర్ అతిథ్యం ఇస్తున్నాయి. అయితే ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు రావల్పిండి, లాహోర్లో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఫిబ్రవరి 26(ఆదివారం) లాహోర్ క్యాలండెర్స్, పెషావర్ జల్మీ మ్యాచ్తో లాహోర్ లెగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ భద్రత కోసం లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎనిమిది సెక్యూరిటీ కెమెరాలు చోరికి గురయ్యాయి. సెక్యూరిటీ కెమెరాలతో పాటు జనరేటర్ బ్యాటరీలు, ఫైబర్ కేబుల్స్ కూడా ఎత్తుకుపోయినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. చోరీకి గురైన వస్తువులన్నీ దాదాపు కోటి రూపాయలు విలువ చేస్తాయని పాకిస్తాన్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ఇందుకు సంబంధించి గుల్బర్గ్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా గడ్డాఫీ స్టేడియంలోనే క్వాలిఫియర్, ఎలిమినేటర్తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో మరో సారి భద్రతా వైఫల్యం తలెత్తడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. చదవండి: IND vs AUS: 'ఆసీస్ను క్లీన్ స్వీప్ చేస్తే.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టీమిండియాదే' -
కెమెరా ముందు కుడితే లక్షలు వస్తున్నాయి
‘నీ విద్య నువు సరిగా నేర్చుకో... డబ్బు, గుర్తింపు అవే వస్తాయి’ అంటోంది ఈ టైలరమ్మ. బట్టలు కొత్తగా కుట్టడం కూడా లక్షలు తెచ్చి పెడతాయా? .. పెడతాయి. పల్లెటూళ్లో వ్యవసాయం చేసుకుంటూ రాత్రిళ్లు కుట్టు పని చేసిన ధోలీ యూ ట్యూబ్లో అందరూ టాలెంట్ ప్రదర్శించడం చూసి తను కూడా టైలరింగ్ను యూ ట్యూబ్లో చూపెట్టింది. రకరకాల స్త్రీల దుస్తులను కట్ చేసి కెమెరా ముందు కుడుతుండేసరికి లక్షల మంది ఫాలోయెర్లు ఏర్పడ్డారు. కుట్టడానికి ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. యూ ట్యూబ్ నెల తిరిగే సరికి చెక్ పంపుతోంది. అవార్డులు కూడా మొదలయ్యాయి. కత్తెర, టేప్తో ఒక మహిళ సాధించిన విజయం ఇది. నవ్యమైన ఐడియానే ఆమె విజయానికి కారణం. ‘కొందరు విధిని నమ్ముకుని కూచుంటారు. కొందరు మాత్రం తమ విధిరాతను తామే రాసుకుంటారు’ అంటుంది ధోలి. ఈమె ఇప్పుడు రాజ్ మసంద్లో ఉంటుంది. ఇది రాజస్థాన్లోని ఒక మోస్తరు సిటీ. కాని అక్కడి నుంచే దేశం మొత్తానికి తెలిసింది. ఇంకా చెప్పాలంటే ఎక్కడెక్కడైతే భారతీయులు ఉన్నారో అక్కడి వారికి కూడా తెలిసింది. దానికి కారణం బట్టలు కుట్టడంలో ధోలికి ఉండే విశేష ప్రతిభ, సృజనాత్మకత. వేగం. కొత్తదనం. స్త్రీలు ధరించే అన్ని రకాల వస్త్రాలను మరింత కొత్తగా ఎలా చేయవచ్చో, ఎలా ఆకర్షణీయంగా మలచవచ్చో ధోలి చేసే వీడియోల్లో చూడొచ్చు. కొందరు విద్యను దాచుకుంటారు. కాని ధోలి తనలాంటి స్త్రీలు టైలరింగ్ నేర్చుకుని తమ కాళ్ల మీద తాము నిలబడాలని తెలిసిందంతా చెప్పేస్తుంది. అందుకే ఆమెకు అంత ప్రచారం. మన్నన. బాల్య వివాహం చేసుకుని ధోలిది రాజస్థాన్లోని భరత్పూర్. తండ్రి వ్యవసాయం చేసేవాడు. వెనుకబడిన ్రపాంతం కావడంతో 10 సంవత్సరాలకే పెళ్లి చేసి ఈడేరాక అత్తారింటికి పంపాడు. 18 ఏళ్లు వచ్చేసరికి ధోలి ముగ్గురు పిల్లల తల్లి. అత్తారింటిలో పెద్ద కోడలు కావడం వల్ల బండెడు చాకిరీ ఉండేది. పగలు పొ లంలో కూలి పని చేసేది. పాలు పితికి అమ్మేది. చిన్నప్పటి నుంచి టైలరింగ్ అంటే ఆసక్తి ఉండటం వల్ల నేర్చుకోవడంతో రాత్రిళ్లు కరెంటు లేని ఇంట్లో కిరోసిన్ దీపం కింద కుట్టేది. కాని బతుకు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగానే ఉండేది. సిటీకి మారాక కొన్ని కారణాల వల్ల పట్నమైన రాజ్ మసంద్కు ధోలి కాపురం మార్చింది. అక్కడ టైలరింగ్ మొదలెట్టింది. 2016లో యూట్యూబ్ ఆమె దృష్టికి వచ్చింది. అందులో రకరకాల వ్యక్తులు తమకు తెలిసిన విద్యలు వీడియోలు చేసి పెట్టడం గమనించింది. ‘నేనెందుకు నా టైలర్ విద్యను ప్రదర్శించకూడదు’ అని వీడియోలు చేసి పెట్టింది. రోడ్డు మీద ఉండే తన ఇంటిలో రోడ్డు రణగొణ ధ్వనుల మధ్య ఆ వీడియోలు చేసి అప్లోడ్ చేసింది. కాని అంతగా గుర్తింపు రాలేదు. ధోలి ఆగలేదు. వీడియోలు బాగా గమనించి ఎలా చేయాలో తెలుసుకుని 2017లో ‘ఘోరి ఫ్యాషన్ డిజైనర్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది. 27 కోట్ల వ్యూస్ టైలరింగ్ పని నేర్చుకోవాలని చాలా మంది స్త్రీలకు ఉంటుంది. కొత్త కొత్త ఫ్యాషన్స్ ఫాలో కావాలని మరికొంత మంది స్త్రీలకు ఉంటుంది. వీరంతా వెంటనే ధోలి చేస్తున్న వీడియోలను ఇష్టపడి చానల్కు సబ్స్క్రయిబ్ చేశారు. ఏ బట్టను ఏ మోడల్తో ఎలా కుట్టాలో ధోలి చకచకా చెప్తూ కుట్టి చూపుతుంది కాబట్టి వాటిని ఫాలో కాసాగారు. కుర్తీలు, అనార్కలి డ్రస్సులు, బ్లౌజ్లు... ఒకటని ఏముంది చాలా కొత్తరకంగా ధోలి డిజైన్లు ఉంటాయి. యూ ట్యూబ్ నుంచి తొలి పారితోషికంగా 11 వేల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ఆమెకు 16 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఇప్పటికి 700 వీడియోలు చేసి అప్లోడ్ చేసింది. వీటికి 27 కోట్ల వ్యూస్ వచ్చాయి. యూ ట్యూబ్ నుంచి నెలకు లక్షకు పైగా పారితోషికం అందుతోంది. అంటే ధోలి ఎంత సక్సెస్ఫుల్ టైలరమ్మో అర్థం చేసుకోవచ్చు. తన ప్రచారం కోసం ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ అకౌంట్లు తెరిచింది. రోజుకు 20 రూపాయల నుంచి ఒకప్పుడు పల్లెటూళ్లో రాత్రిళ్లు బట్టలు కుడితే అతి కష్టమ్మీద రోజుకు 20 రూపాయలు వచ్చేవి. ఇవాళ ధోలి కేవలం తన ప్రతిభ, సృజనాత్మకతతో పాటు సోషల్ మీడియా సహాయంగా పెద్ద సంపాదన చూస్తోంది. రాజ్ మసంద్లో మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుంది. ఆమెను పిలిచి అవార్డులు ఇచ్చి గౌరవిస్తున్నారు. ‘ఎదుటి వారిని ఓడించడం కంటే మనం గెలవడం ముఖ్యం అనుకోవాలి. మనలోని ప్రతికూల భావాలను తీసేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం’ అంటుంది ధోలి. -
బుజ్జాయిల కోసం బుల్లి కెమెరా
స్మార్ట్ఫోన్లకు అలవాటుపడిన పిల్లలను ఆ అలవాటు నుంచి దూరం చేయాలంటే, ఈ బుల్లి కెమెరానే సరైన సాధనం అని చెబుతున్నారు దీని తయారీదారులు. చిన్నారులు సులువుగా ఉపయోగించుకునేలా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. పాతకాలం పోలరాయిడ్ కెమెరా మాదిరిగానే ఇది పనిచేస్తుంది. దీంతో తీసే ఫొటోలో ఎప్పటికప్పుడు ప్రింట్ అయి బయటకు వచ్చేస్తాయి. శక్తిమంతమైన లెన్స్, ఫ్లాష్ ఉండటంతో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కూడా దీంతో చక్కని ఫొటోలు తీసుకోవచ్చు. అయితే, దీని నుంచి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో మాత్రమే వస్తాయి. జపాన్కు చెందిన ‘కూల్ డిజైన్స్’ కంపెనీ ఈ కెమెరాను రూపొందించింది. దీని ధర 129 డాలర్లు (రూ.10,527) మాత్రమే! -
పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపడింది!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన నేమ్తో పాటు ఫేమ్ను సంపాదించుకుంది ఐఫోన్. దీని తయారీ వెనుక ఏ విషయాన్ని యాపిల్ కంపెనీ బయటపెట్టేది కాదు. అయితే తాజాగా సంస్థ సీఈఓ ఐఫోన్లకు సంబంధించి ఓ పెద్ద సీక్రెట్ని రివీల్ చేశారు. అదేంటో తెలుసుకుందాం! ఐఫోన్ కెమెరాతో క్లిక్ చేస్తే ఫోటో అద్భుతంగా రావాల్సిందే. ఎందుకంటే దాని క్లారిటీ అలాంటిది మరీ. తాజాగా జపాన్ పర్యటనలో ఉన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ కెమెరాలకు సంబంధించి పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. ఐఫోన్ కెమెరాలను సోనీ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. అత్యున్నత కెమెరా సెన్సర్ల కోసం దశాబ్ధకాలంగా సోనీ సంస్థతో తాము చేతులు కలిపామని కుక్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. తమ భాగస్వామ్యం నిరంతం కొనసాగుతుందన్నారు. సంవత్సరాలుగా, ఆపిల్ ఐఫోన్ మోడల్లలో ఉపయోగించే హార్డ్వేర్ గురించి పెదవి విప్పలేదు. అంతేకాకుండా ఏదైనా ఐఫోన్ మోడల్స్లో కూడా అధికారిక స్పెక్స్ షీట్న్ చూసినట్లయితే, కంపెనీ ర్యామ్, కెమెరా రిజల్యూషన్ సహా నిర్దిష్ట వివరాలను ఎప్పుడూ వెల్లడించలేదు. సోనీ ఐఫోన్ల కోసం కెమెరా సెన్సార్లను తయారు చేస్తుందన్న విషయాన్ని టిమ్ కుక్ తొలిసారిగా వెల్లడించడం గమనార్హం. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సోనీ తన కెమెరా సెన్సార్ పనితనం మరింత పెంచేందుకు కొత్త సెమీకండక్టర్ ఆర్కిటెక్చర్ను ఉపయోగించే కొత్త ఇమేజ్ సెన్సార్ను అభివృద్ధి చేస్తోందట. We’ve been partnering with Sony for over a decade to create the world’s leading camera sensors for iPhone. Thanks to Ken and everyone on the team for showing me around the cutting-edge facility in Kumamoto today. pic.twitter.com/462SEkUbhi — Tim Cook (@tim_cook) December 13, 2022 చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
Oskar Barnack: ఫొటోజర్నలిజం పితామహుడు
జర్మనీ దేశస్థుడైన ఆస్కార్ బర్నాక్ కెమెరా డిజైనర్, కంటి అద్దాల ఇంజనీర్, పారిశ్రామిక వేత్త కూడా. ఆయన రూపొందించిన ‘లైకా’ కెమెరా అనేక మార్పులతో ఇప్పటికీ అన్నిదేశాల్లో వాడకంలో ఉంది. మొదట డాగురే 183 సంవత్సరాల క్రితం ‘కెమెరా’ను కనుగొన్నారు. తొలుత తయారైన కెమెరాలు పెద్దసైజులో ఉండేవి. ఫొటోలు తీయడం కూడా చాలా ఖర్చుతో కూడి ఉండేది. ఆ తర్వాత 75 ఏళ్లకు ఆస్కార్ బర్నాక్ అతిసూక్ష్మమైన సైజులో ఉండే కెమెరాను రూపొందించి మొదటి ప్రపంచ యుద్ధం (1914) సంఘటనలను కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించి పత్రికా రంగానికి ప్రాణం పోశాడు. అందుకే వీరిని ‘ఫొటోజర్నలిజం పితామహుడు’ అంటారు. వారు తీసిన చిత్రాలు 1916లో ప్రచురింపబడి ప్రపంచ మానవాళికి యుద్ధం వల్ల జరిగే నష్టాలను తెలియ చెప్పటంలో కీలకపాత్ర పోషించాయి. ఆస్కార్ బర్నాక్ జన్మదినం నవంబర్ 1ని ‘ప్రపంచ ఫొటోజర్నలిజం’ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ఎన్నో కొత్త కంపెనీల చిన్న కెమెరాలు ఎన్ని వచ్చినా ఈనాటికీ డిజిటల్ యుగంలో కూడా ఆస్కార్ బర్నాక్ సృష్టించిన లైకా విధాన కెమెరా అత్యంత పరిపూర్ణమైంది. 1914 తర్వాత వార్తలు, సమాచార ఫొటోగ్రఫీ జర్నలిజం ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపచేయటంలో ఆయన ఆవిష్కరణ కీలక పాత్ర వహించింది. 1932లో ఓ అడుగు ముందుకువేసి బర్నాక్ కెమెరా లోపల ఒక చిన్న మోటారు అమర్చి ఒక దృశ్యాన్ని తీయగానే ఫిలిం ముందుకు జరిగే విధానానికి నాందిపలికి 1937లో ప్రపంచానికి పరిచయం చేశారు. (క్లిక్ చేయండి: ‘అనంత’ సాంస్కృతిక సేనాని) ఈమధ్య ఆ కెమెరాను వేలంవేయగా దాదాపుగా 19కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. బర్నాక్ 57వ ఏట 16 జనవరి 1936న అకాల మరణం చెందారు. 1979 నుంచీ ఆయన శత జయంతి సందర్భంగా ‘లైకా ఆస్కార్ బర్నాక్’ అంతర్జాతీయ అవార్డును ప్రతి ఏటా ఫొటో జర్నలిజంలో విశేషంగా కృషిచేసిన వారికి లైకా సంస్థ అందిస్తోంది. – టి. శ్రీనివాసరెడ్డి, ఫొటోజర్నలిస్ట్ ఫెలో ఆఫ్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ, గ్రేట్ బ్రిటన్ (నవంబర్ 1న ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవం) -
మహిళపై మంత్రి చేతివాటం ... తర్వాత పాదాలను తాకి...
బెంగళూరు: ఒక మంత్రి తీవ్ర అసహనంతో బహిరంగంగా ఒక మహిళ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే....కర్ణాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి వి సోమన్న చామరాజనగర్ జిల్లా హంగల గ్రామంలో సుమారు 175 మందికి భూ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో ఒక మహిళ తనకు భూమి పట్టా రాలేదన్న కోపంతో ఆయన మీదకు వచ్చింది. దీంతో సదరు మంత్రి ఆ మహిళ చెంప చెళ్లుమనిపించారు. ఐతే ఆ మహిళ తర్వాత సదరు మంత్రి పాదాలను తాకి మరీ ఆశీర్వాదం తీసుకుంది. తదనంతరం ఆ మంత్రి కూడా సదరు మహిళకు క్షమాపణాలు చెప్పారు. వాస్తవానికి మంత్రిగారు ఆ కార్యక్రమానికి చాలా ఆలస్యంగా చేరుకున్నారు. మరోవైపు ఆమెకు భూమి పట్టా అందకపోవడం, వారందర్నీ ఎదురుచూసేలా చేయడం తదతర కారణాల రీత్యా ఆయన ఇలాంటి సంఘటనను ఎదుర్కోవల్సి వచ్చింది. అచ్చం అలానే ఇటీవల ఒక జనతాదళ్(సెక్యులర్) నాయకుడు శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్పై ఇలానే చేతివాటం చూపి కెమెరాకు చిక్కిన సంగతి తెలిసింది. (చదవండి: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు) -
సంచలనం, భారత్లోకి మొదటి 200 మెగా పిక్సల్ కెమెరా ఫోన్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే!
అమెరికా స్మార్ట్ఫోన్ కంపెనీ మోటోరోలా (Motorola) అదిరిపోయే స్పెసిఫికేషన్లతో రెండు మొబైల్స్ని భారత్లో గ్రాండ్గా లాంచ్ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా (Motorola Edge 30 Ultra), మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ (Motorola Edge 30 Fusion) పేరుతో ఈ రెండు సెప్టంబర్ 13న ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ విషయాన్ని మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా 200 మెగాపిక్సెల్ కెమెరా కావడం.. ఈ ఫోన్ ప్రత్యేకతని చెప్పచ్చు. మరోరకంగా చెప్పలంటే ఇంత భారీ స్థాయిలో పిక్సల్ కెమెరాతో దేశంలో లాంచ్ కానున్న తొలి మొబైల్ కూడా ఇదే. అదిరిపోయే దీని ప్రత్యేకతలు, ఫీచర్లను ఓ లుక్కేద్దాం. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ప్రత్యేకతలు ►క్వాల్కామ్ పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్. ►ఎడ్జ్ 30 అల్ట్రా ట్రిపుల్ కెమెరా సెటప్, 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ సెన్సార్. ముందు భాగంలో, 60-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ►6.67-అంగుళాల పూర్తి-HD+ OLED డిస్ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ►4,160mAh బ్యాటరీ, 125వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, వైర్లెస్ చార్జింగ్. డాల్బీ అట్మోస్కు సపోర్ట్ చేసే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు. మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ప్రత్యేతలు ►స్నాప్డ్రాగన్ 888+ (Qualcomm Snapdragon) ప్రాసెసర్, ►6.55 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ pOLED డిస్ప్లే. 144Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్. ►Motorola Edge 30 Fusion వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. కెమెరా పరంగా, ఎడ్జ్ 30 ఫ్యూజన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో పాటు 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. ముందు భాగంలో, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ►4,400mAh బ్యాటరీ, 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్. ఇప్పటికే ఈ రెండు స్మార్ట్ఫోన్లు యూరోపియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యాయి. ఎడ్జ్ 30 ప్యూజన్ ఐరోపాలో 600 యూరోలు (సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ. 48,000) ఉంటుందని అంచనా. ఇది ఫ్యూజన్ కాస్మిక్ గ్రే, అరోరా వైట్, సోలార్ గోల్డ్, నెప్ట్యూన్ బ్లూ వంటి కలర్స్లో లభ్యమవుతుంది. అదేవిధంగా, ఎడ్జ్ 30 అల్ట్రా ధర 899.99 యూరోలు (సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ. 72,900) ఉంటుందని అంచనా. ఈ మొబైల్ స్టార్లైట్ వైట్, ఇంటర్స్టెల్లార్ బ్లాక్ రంగులలో వస్తోంది. చదవండి: ట్విటర్పై మరో బాంబు వేసిన ఎలాన్ మస్క్ -
రెండోసారి కెమెరాకు చిక్కిన రాయల్ బెంగాల్ టైగర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నాలుగు నెలల్లో రెండోసారి రాయల్ బెంగాల్ టైగర్ (పెద్దపులి) అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని పులిగొమ్మి గ్రామ శివారులోని తోటలో ఆదివారం ఆవును చంపేసింది. ఆ కళేబరం వద్ద అటవీశాఖ అధికారులు నాలుగు సీసీ కెమెరాలను అమర్చారు. మిగిలిన కళేబరాన్ని తీసుకెళ్లేందుకు సోమవారం రాత్రి ఆ ప్రాంతానికి పెద్దపులి వచ్చిన దృశ్యాలను కెమెరాలు చిత్రీకరించాయి. ఆ చిత్రాల విశ్లేషణ కోసం గుంటూరులోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్వో) శంబంగి వెంకటేష్ చెప్పారు. ప్రాథమిక పరిశీలన మేరకు అది మగ పులి అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గత 4 నెలల కాలంలో కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల ఆనవాళ్లు కనిపించిన పులి ఇదేనని ఒక అంచనాకు వచ్చారు. మరో ఆవు హతం... విజయనగరం జిల్లా బొబ్బిలి ఫారెస్టు రేంజ్ పరిధిలోని బొబ్బిలి–బాడంగి మండలం సరిహద్దులోని హరిజన పాల్తేరు గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి మరో ఆవుపై పెద్దపులి దాడి చేసింది. దాన్ని చంపేసి కళేబరాన్ని సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లింది. మిగిలిన కళేబరాన్ని గురువారం ఉదయం గుర్తించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. ఆ ఆనవాళ్లను బట్టి ఉత్తర దిక్కుగా బొబ్బిలి మండలంలోని అలజంగి, పిరిడి గ్రామాల వైపు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. (క్లిక్: అక్కా.. తమ్ముడు.. ఓ స్కూటర్) -
డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు
పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కుమార్తె ఫొటో తండ్రికి జీవిత కాలపు తోడుయవ్వనంలో ఉన్నప్పుడు నాన్న తీయించుకున్న ఛాయా చిత్రం అమ్మ దాచుకున్న రహస్యం. బీరువాలో దొరికే నానమ్మ ఫొటో బాల్యానికి దగ్గరి దారి. గోడ మధ్యన వేలాడుతూ కనిపించే టెన్త్ క్లాస్ గ్రూప్ ఫొటో ఎన్నో జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్. పెళ్లి ఆల్బమ్లు, విహారాల ఫొటోలు చిటికెలో బాధను మాయం చేయగల మందులు. ఫొటో అంటే కేవలం కాగితం కాదు .. అందరి గతం. కాలాన్ని బంధించే శక్తి దీనికి మాత్రమే ఉంది. జ్ఞాపకాల ఖజానా టెక్కలి: ఫొటో తీయడం.. బాగులేకపోతే డిలీట్ చేయడం. ఫొటోగ్రఫీ గతం కంటే ఈజీ అయిపోయింది. డిజిటల్ వచ్చినప్పటి నుంచి ఫొటోలు తీయడంలో ఉన్న కిక్కు పోయింది. కెమెరా కడుపులో రీళ్లు ఉన్నప్పుడు అపురూప క్షణం కోసం గంటల కొద్దీ వేచి ఉండడం, సరైన చిత్రాన్ని తీయడానికి ఏకాగ్రతతో ఎదురు చూడడం, తదేక దీక్షతో క్లిక్ మనిపించడం చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. మెమొరీ కార్డులు వ చ్చి రీళ్లకు సమాధి కట్టేశాయి. పాత తరం కెమెరాను చూస్తే చాలాకాలానికి చూసిన బంధువులా అనిపిస్తుంది. బాల్య జ్ఞాపకమేదో కళ్ల ముందు కనిపిస్తుంది. అలాంటి జ్ఞాపకాల పెట్టెలను టెక్కలికి చెందిన హనుమంతు మల్లేశ్వరరావు సేకరిస్తున్నారు. వృత్తిరీత్యా వీడియో ఎడిటర్ అ యిన మల్లేశ్వరరావు పాతతరం కెమెరాలు సేకరించడం హాబీగా పెట్టుకున్నారు. తెలిసిన వ్యక్తుల వద్ద ఉన్న పా తతరం కెమెరాలను సేకరించడం మొదలు పెట్టారు. 50 ఏళ్ల నాటి కెమెరాను పరిశీలిస్తున్న మల్లేశ్వరరావు గత కొన్ని రోజులుగా పాతతరం కెమెరాల సేకరణ వేటలో నిమగ్నమయ్యారు. యాభై ఏళ్ల కిందటి కెమెరాలను కూడా సేకరించారు. సాగరసంగమం సినిమాలోని ఓ సన్నివేశంలో కమల్హాసన్కు ఓ బాలుడు ఫొటోలు తీసే కెమెరా అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కెమెరాను కూడా సంపాదించారు. రీల్ కెమెరా నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాక్షన్ డిజిటల్ కెమెరాల వరకు వివిధ రకాల వీడియో, ఫొటో కెమెరాలను సేకరించి భద్రపరిచారు. మల్లేశ్వరరావు వీడియో కెమెరాల్లో ఎన్ఈజీఎస్, త్రీసీసీడీ, 3500 తో పాటు మరి కొన్ని పాతతరం వీడియో కెమెరాలు మల్లేశ్వరరావు వద్ద ఉన్నాయి. వీటితో పాటు వివిధ రకాల రీల్ కెమెరాలతో పాటు సరికొత్త 7డీ, 70డీ, ఫోర్కె, గోప్రో, గింబల్, స్లైడర్ తదితర కెమెరాలను సేకరించారు. విహంగాలతో దోస్తీ జి.సిగడాం: వృత్తి రీత్యా ఆయన ఇంజినీర్. ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం. తలమునకలయ్యే పని. కానీ ఆయన ఒక రోజు పని చేస్తున్న సమయంలో ఓ పక్షి ప్రాణాల కోసం కొట్టుకుంటూ నేల మీద పడింది. ఆయన దాన్ని రక్షించి పంజరంలో పెట్టి కాపాడారు. ఆ క్షణం నుంచి ఆ ఇంజినీర్ జీవితం మరో మేలి మలుపు తిరిగింది. పక్షులపై ప్రేమ పెరిగింది. కెమెరా కంటితో పక్షుల కదలికలు చూడడం అలవాటైంది. సాధారణంగా పక్షులను చూసి ఆస్వాదించే కంటే ఫొటోలు తీసి ఆ క్షణాలను నిక్షిప్తం చేయడంలో మజా తెలిసింది. ఇంకే ముంది అప్పటి నుంచి పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 105 రకాల పక్షుల ఫొటోలు తీసి భద్రపరిచారు. కిశోర్ తీసిన పక్షుల చిత్రాలు జి.సిగడాం మండలం పెంట గ్రామానికి చెందిన పెరుంబుదూరి నర్సిహంమూర్తి పెద్ద కుమారుడు పెరుంబుదూరి కిశోర్ పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇటీవలే సొంత ఊరికి వచ్చి కిశోర్ ప్రతి రోజు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి పక్షుల ఫొటోలు సేకరిస్తున్నారు. అవి ఎలా గుడ్లు పెడుతున్నాయి, బుల్లి పిట్టలు ఎలా జన్మిస్తున్నాయి, వాటి ఆహారం ఎలా పంచుకుంటున్నాయి అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఇటీవల తామర ఆకులపై నెమలి తోక జకనా అనే పక్షి రాకపోకలు, విన్యాసాలను ఫొటోలు తీసి నిక్షిప్తం చేశారు. గుడ్లు పెట్టిన దశ నుంచి పొదిగే దశ వరకు అన్నింటినీ సేకరించారు. ఈ ఫొటోల కోసం సెలవుల్లో అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. -
సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్ఫోన్ సొంతం!
స్మార్ట్ఫోన్లో దాదాపు అందరి చేతుల్లోనూ ఉంటున్నాయి. స్మార్ట్ఫోన్లకు కెమెరాలు తప్పనిసరి హంగు. చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటే జనాలు ఆగుతారా? ఎడాపెడా సెల్ఫీలతో పాటు ప్రయాణాల్లో కనిపించిన దృశ్యాలనల్లా ఫొటోలు తీసేయడం మామూలైపోయింది. వందలాదిగా తీసిన ఫొటోలను ప్రింట్ చేయడం కొంత కష్టమే! ఫొటో ల్యాబ్లకు వెళ్లాలి. స్మార్ట్ఫోన్లో తీసిన ఫొటోలను కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసి, నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని ప్రింట్ చేయించుకోవాలి. ఇదంతా కొంత ప్రయాసతో కూడిన ప్రక్రియ. ఇప్పుడంత ప్రయాస అక్కర్లేదు. స్మార్ట్ఫోన్ కెమెరా ప్రింటర్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా జపానీస్ ఫొటోగ్రఫీ బ్రాండ్ ‘ఫుజీ ఫిల్మ్’ స్మార్ట్ఫోన్ల నుంచి ఫొటోలను నేరుగా ప్రింట్ చేసేందుకు అనువైన స్మార్ట్ఫోన్ కెమెరా ప్రింటర్ను ‘ఇన్స్టాక్స్ మినీలింక్ 2’ పేరిట అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ఫోన్తో పాటు ఈ ప్రింటర్ కూడా వెంట ఉంటే, ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు ఫొటోలను ప్రింట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది జపాన్తో పాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. చదవండి: అకౌంట్లో డబ్బులు కొట్టేసే యాప్స్: తక్షణమే డిలీట్ చేయండి! -
ఎగిరే కెమెరా.. అదిరిందయ్యా
కెమెరా గాల్లో ఎగురుతూ మన చుట్టూ తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీస్తుంటే ఎలా ఉంటుంది? వారెవా.. భలే ఉంటుంది అంటారు కదా. అచ్చం ఇలాంటి ప్రత్యేకతలతోనే స్నాప్ చాట్ కంపెనీ ఓ ఎగిరే కెమెరాను విడుదల చేసింది. ఎలాంటి సెటప్ అవసరం లేకుండా దానంతట అదే పని చేసే ఈ కెమెరాకు ‘పిక్సీ’ అని పేరు పెట్టింది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉండదు. వెళ్లాల్సిన 4 మార్గాలు ముందే ఇందులో నిర్దేశించి ఉంటాయి. మనకు కావాల్సిన మార్గాన్ని ఎంచుకొని బటన్ నొక్కితే గాల్లో తేలియాడుతుంది. మనతో పాటు కదులుతుంది. ఫొటోలు, వీడియోలు తీస్తుంది. అంతా అయిపోయాక మన అరచేయిని కింద పెడితే వచ్చి వాలిపోతుంది. దీన్ని ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్లలో అందుబాటులోకి తెచ్చారు. ధర రూ. 17,600. దీని బరువు 101 గ్రాములు. ఇందులో 12 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 2.7కె వీడియోలు తీస్తుంది. 16జీబీ డేటాను నిల్వ చేసుకుంటుంది. అంటే దాదాపు వెయ్యి ఫొటోలు, వంద వీడియోల వరకు తీస్తుంది. పిక్సీ బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో కంపెనీ చెప్పలేదు. అయితే ఫుల్గా చార్జ్ చేస్తే దాదాపు 5 నుంచి 8 సార్లు ఎగురుతుందని చెబుతున్నారు. ఒక్కసారి ఎగిరితే దాదాపు 10 నుంచి 20 సెకన్లు గాల్లో ఉంటుంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
నేరస్తుడితో లిప్లాక్ చేసిన మహిళా న్యాయమూర్తి.. వీడియో వైరల్
ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మధ్య చిగురిస్తుందో చెప్పలేం. రెండు అక్షరాల ప్రేమ రెండు జీవితాలను పెనవేస్తోంది. అయితే అందరి ప్రేమలు విజయవంతంగా ముగియవు.. కొన్ని మధ్యలోనే ముగిసిపోతాయాయి. సాధారణంగా స్నేహితులు, క్లాస్మెట్స్, సహోద్యోగులిద్దరూ ప్రేమలో పడటం చూశాం. కానీ న్యాయమూర్తి, నేరస్తుడితో ప్రేమలో పడినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి కొంచెం వింతగా నిజంగానే ఇది జరిగింది. ఒక మహిళా న్యాయమూర్తి ఏకంగా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో ప్రేమలో పడింది. దక్షిణ చుబుట్ ప్రావిన్స్లోని ఓ మహిళా న్యాయమూర్తి, నిందితుడు జైల్లో రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో వీరిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఘటన అర్జెంటీనాలో డిసెంబరు 29న చోటుచేసుకుంది. ఇందులో ఓ పోలీస్ అధికారిని హత్య చేసిన జైలులో ఉన్న క్రిస్టియన్ ‘మై’ బస్టోస్ అనే ఖైదీ న్యాయమూర్తి మారియల్ సువారెజ్ ముద్దుపెట్టుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది: చదవండి: వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ.. 2009లో పోలీస్ అధికారి లియాండ్రో 'టిటో' రాబర్ట్స్ని బస్టోస్ హత్య చేశాడు. అతనికి జీవిత ఖైదు విధించాలా వద్దా అని నిర్ణయించే న్యాయమూర్తుల ప్యానెల్లో మారియల్ భాగం. బస్టోస్కు జీవిత ఖైదుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక న్యాయమూర్తి ఆమె. బస్టోస్ను ‘అత్యంత ప్రమాదకరమైన ఖైదీ’ అని చెప్పినప్పటికీ, యావజ్జీవ శిక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్యానెల్లోని ఏకైక న్యాయమూర్తి సువారెజ్. బస్టోస్ను రక్షించడానికి ఆమె ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. దీంతో అతడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. మరోవైపు మహిళా న్యాయమూర్తి ఖైదీని ముద్దు పెట్టుకుంటున్న వీడియో బయటపడడంతో దీనిపై విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలిపారు. చదవండి: కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్ VIDEO DOCUMENTO. AMIGOS ARGENTINA TOCO FONDO. JUEZA QUE INTEGRO TRIBUNAL QUE CONDENO A PERPETUA AL ASESINO DE UN POLICIA EN CHUBUT, FUE HACERLE MATE Y MIMOS A LA PRISION AL CONDENADO. FUE SUMARIADA. LA JUEZA SE LLAMA, MARIEL ALEJANDRA SUAREZ. pic.twitter.com/Gf07UEIA1H — MARCELO FAVA (@MARCELOFAVAOK) January 4, 2022 -
ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరా.. సైజ్ ఎంతో తెలుసా?
సాధారణంగా మనం రోజూ వాడే ఫోన్లలో ఉండే కెమెరాలే మనకు కనిపించే అతి చిన్న కెమెరాలు కదా. వాటి సైజు ఎంతుంటుంది.. పప్పు గింజంత. కానీ కంటికి కనిపించీ కనిపించని పరిమాణంలో కెమెరాను చూసుంటారా? ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు తయారుచేసి చూపించారు. మనం వాడే సన్నరకం ఉప్పులోని రేణువంత పరిమాణంలో ఉండే కెమెరాను రూపొందించి ‘వావ్’ అనిపించారు. సాధారణ కెమెరాలు తీస్తే ఫొటోలు కలర్ఫుల్గా, స్పష్టంగా ఎలా వస్తాయో ఆ స్థాయిలో తీసేలా ఈ అర మిల్లీమీటర్ కెమెరాను రూపొందించారు. ఎలా తయారు చేశారు? ఈ కెమెరా తయారీకి అర మిల్లీమీటర్ పరిమాణంలోని గ్లాస్ లాంటి ‘ ఆప్టికల్ మెటాసర్ఫేస్’ను వాడారు. సాధారణ కెమెరాల్లో సూర్యకాంతిని అదుపుచేయడానికి గాజు లేదా ప్లాస్టిక్ లెన్సులు వాడతారు. మరి ఈ చిన్న కెమెరాలో ఏం వాడి ఉంటారు? అంటే.. హెచ్ఐవీ వైరస్ సైజులో ఉండే స్తూపాకార పరికరాలు (సిలిండ్రికల్ పోస్ట్స్) 16 లక్షలు ఉపయోగించారు. అసలే కంటికి సరిగా కనిపించనంత సైజులో ఉన్న ఈ అతి చిన్న కెమెరాలోనూ సిలిండ్రికల్ పోస్టులను అద్భుతంగా అమర్చారు. చదవండి: హోండూరస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా చిన్న కెమెరాతో తీసినది.. రెగ్యులర్ కెమెరాతో పైగా వీటిల్లో ఒక్కో పోస్టుకూ ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. యాంటెన్నా లాగా ఇవి పని చేస్తాయి. వీటిపై పడిన కాంతికి అవి ఎలా స్పందించాయో మెషీన్ లెర్నింగ్ అల్గారిథం ద్వారా గుర్తించి దాని ఆధారంగా ఫొటోను ముద్రిస్తారు. వీటిల్లో ముందువైపు ఆప్టికల్ టెక్నాలజీని, రెండోవైపు న్యూరల్ టెక్నాలజీని వాడారు. ఇప్పటివరకు తయారు చేసిన ‘కలర్ మెటా సర్ఫేస్’ రకం కెమెరాల్లో స్పష్టమైన ఫొటోలు తీసేది ఇదే. తన సైజుకన్నా 5 లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను కూడా సులభంగా ఫొటోలు తీసేస్తుంది. చదవండి: పడుచు కుర్రాడనుకుంటున్నారా.. అసలు వయసు తెలిస్తే.. షాకవుతారు సమస్యలున్నాయా? గతంలో చిన్న సైజు కెమెరాలతో తీసే ఫొటోలు సరిగా వచ్చేవి కావు. ఈ కొత్త కెమెరాతో ఆ సమస్యను అధిగమించారు. అయితే ఫొటోల చివర్లో కాస్త అస్పష్టంగా ఉన్నట్టు కనిపించినా అంత చిన్న సైజు కెమెరా మామూలు కెమెరాలతో పోటీ పడి ఫొటోలు తీయడం గొప్పే. పైగా సాధారణ కాంతిలో కూడా అద్భుతంగా ఇది పని చేస్తుంది. ఎక్కడెక్కడ వాడొచ్చు? చిన్న సైజు రోబోల్లో ఈ కెమెరాలను వాడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధులను గుర్తించడానికి, చికిత్స చేయడానికి వైద్యులు కూడా ఉపయోగించవచ్చని అంటున్నారు. మున్ముందు మన ఫోన్లకు వెనకాల మూడు కెమెరాలు అక్కర్లేదని, వెనకభాగమంతా పెద్ద కెమెరా అయిపోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కెమెరా క్వాలిటీ పెంచడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. వస్తువులను గుర్తుపట్టే ‘సెన్సింగ్’ సాంకేతికతను కూడా జోడించాలని చూస్తున్నారు. – సాక్షి సెంట్రల్డెస్క్ -
Cheena Kapoor: కొత్త దారి...కెమెరా చెప్పే కథలు
‘మనుషులే కాదు కెమెరా కూడా కథలు చెబుతుంది...వినే మనసు ఉంటే!’ అంటుంది చీనాకపూర్. దిల్లీలో ఇంజనీరింగ్ చేసిన చీనా లండన్లో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసింది. అయితే ‘జీవితంలో ఉద్యోగం’ కాదు ‘ఉద్యోగమే జీవితం’లాంటి పరిస్థితి ఎదురైంది. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. అప్పుడు వచ్చిన ఆలోచనే కెమెరా చెప్పే కథలు. అయితే ఇవి ప్రకృతి అందాలను కళ్లకు కట్టే కథలు కాదు. కాల్పనిక కథలు అంతకంటే కాదు. కదిలించే నిజజీవిత కథలు. మానసిక సమస్య బాధితుల ఆశ్రమం నుంచి రెడ్లైట్ ఏరియాల వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లింది చీనా. వారి జీవితాన్ని, దైన్యాన్ని ఫొటోల్లోకి తీసుకువచ్చింది. ‘ఫర్గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ చీనాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఆలోచన ఎలా వచ్చిందంటే... చీనా వాళ్ల బంధువుల కుర్రాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటి నుంచి అతడి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదు. కుటుంబ సభ్యులు ఆమెను ఒక ఆశ్రమంలో చేర్చి చేతులు దులుపుకున్నారు. 35 సంవత్సరాల నుంచి ఆమె అక్కడే ఉంటోంది. వచ్చి చూసే వారు లేరు. పలకరించేవారు లేరు. ఆమెను చూడడానికి ఒకసారి ఆశ్రమానికి వెళ్లింది చీనా. అక్కడ తన బంధువులాంటి ఎంతో మందిని చూసి చలించిపోయింది. ఆ సమయంలోనే ‘ఫర్గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అంటారు. ఆర్థిక విషయాలే కాదు ఆరోగ్య విషయాలు కూడా మానవసంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ‘ఫర్గాటెన్ డాటర్స్’ చెప్పకనే చెబుతుంది. ఆరోగ్య సమస్యలు ఉంటే అయిన వారు కూడా కాని వారవుతారా! అలాంటి ఎంతోమంది బాధిత మహిళల దీనస్థితికి చిత్రరూపం ఇచ్చింది చీనా. రెడ్లైట్ ప్రాంతాలకు వెళ్లేముందు వద్దని వారించారు చాలామంది. అయితే చీనాకపూర్ వారి మాటలు వినలేదు. అక్కడ ఎన్నో దృశ్యాలు. కనిపించే దృశ్యం ఒకటి... కనిపించని దృశ్యం ఒకటి. వీటిని ఆమె కెమెరా పట్టుకోగలిగింది. ఎప్పుడూ ఎవరో వచ్చే ఆ ప్రాంతంలో ‘భద్రత’ లేదనే విషయం అర్థమైంది. అక్కడ ఉన్న ఎంతోమందితో తాను మాట్లాడింది. వారి కన్నీటికథలను డాక్యుమెంట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా చీనా నిర్వహించే ‘మై షాట్ స్టోరీస్’కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. తాను చేస్తున్న పనికి ‘యూనిసెఫ్’లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రశంసలు లభించాయి. డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్గా చీనా కపూర్కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అయితే తన గుర్తింపు కంటే గుర్తింపుకు నోచుకోని బాధిత సమూహాల పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది చీనా కపూర్. -
ఎవరబ్బా ఈ వీడియో తీసింది.. ఓ రేంజ్లో ఉంది
అందమైన ఫొటోలు, వీడియోలు తీయాలంటే ప్రొఫెషనల్ కెమెరాపర్సన్ అయ్యి ఉండాలా?. చేతిలో ఫోన్, కెమెరాలు ఉంటే చాలూ తీసేయొచ్చు. కాకపోతే ఈరోజుల్లో సోషల్మీడియాలో షేర్ చేయడానికి ‘జస్ట్ వాంట్ టు షూట్ ఏ లిటిల్ వీడియో’ అనుకునే వాళ్లు.. అది కచ్చితంగా అందరూ మాట్లాడుకునేలా ఉండాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ‘క్వాలిటీ’ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. అలాంటి వాళ్ల కోసం సినిమాటిక్ మోడ్ను అందిస్తోంది ఐఫోన్ 13. పైన మీరు చూస్తున్నది మెక్సికో సిటీలో గత కొంతకాలంగా తీసిన దృశ్యాలు. ఎంత బాగున్నాయో కదా! ఏదో హాలీవుడ్ రేంజ్ వీడియోలాగా అనిపిస్తుందా? కానీ, ఇది తీసింది ఓ ఫోన్తో. అదీ ఐఫోన్ 13 ప్రోతో. ఇందులోని సినిమాటిక్ మోడ్ వెర్షన్ ఇప్పుడు యూత్లో హాట్ టాపిక్గా మారింది. వీడియోగ్రాఫర్ జె.మారిసన్, సింగర్ జూలియ వోల్ఫ్(ఫాలింగ్ ఇన్ లవ్ సాంగ్ ఫేమ్) మ్యూజిక్ వీడియోలను స్టూడియోలలో కాకుండా రోడ్ల మీద చిత్రీకరించి శబ్భాష్ అనిపించుకున్నాడు. దీనికి కారణం ఐఫోన్13 సినిమాటిక్ మోడ్ అంటాడు మారిసన్. ‘ఐఫోన్13 ప్రో నా చేతుల్లోకి తీసుకోగానే మొదట నేను ఆసక్తితో పరీక్షించింది సినిమాటిక్ మోడ్. చాలా షార్ప్ అనిపించింది. మీలో టాలెంట్ తక్కువైనా సరే, సాధారణ లొకేషన్స్ అయినా సరే ఖరీదైన లుక్ తీసుకురావచ్చు. కిట్ భారం లేకుండా ట్రావెల్ వీడియోలకు సినిమాటిక్ లుక్ ఇవ్వొచ్చు’ అంటున్నాడు మారిసన్. అడ్వాన్స్డ్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ‘సినిమాటిక్ మోడ్’ ఐఫోన్13 నాలుగు మోడల్స్లోనూ అందుబాటులో ఉంది. చదవండి: ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్లో దుమ్మురేపిన ఇండియన్స్..! సెప్టెంబర్ 14 ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్ ఈవెంట్’ జరిగిన తరువాత యాపిల్ ఐఫోన్13 సిరీస్లోని లాంగర్ బ్యాటరీలైఫ్, హైయర్ స్క్రీన్బ్రైట్నెస్, మెరుగైన కెమెరాసిస్టమ్...ఇలా ఆసక్తికరమైన విషయాలు, ఫెంటాస్టిక్ అప్గ్రేడ్ల గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. వీటిలో యూత్ను ఆకట్టుకుంటున్న ఫీచర్... సినిమాటిక్ మోడ్. డిజిటల్ ఫొటోగ్రఫీ శకం మొదలైన తరువాత ఆనాటి ఫిల్మ్కెమెరాలతో సాధ్యమైనవి సాధ్యం చేయడం తోపాటు ‘రీల్’కు అందని సూక్ష్మఅంశాలను కాప్చర్ చేయడం, పరిమితులతో కూడిన విన్యెటింగ్(రిడక్షన్ ఆఫ్ ఇమేజెస్ బ్రైట్నెస్) పరిధిని పెంచడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ వీడియో ప్రేమికులను ఆకట్టుకునే ఫీచర్లకు ప్రాధ్యానత ఇస్తుంది. తాజా ‘సినిమాటిక్ మోడ్’ హెడ్లైన్ న్యూఫీచర్గా నిలిచింది. ‘సినిమాటిక్ మోడ్’తో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా...వీడియో బ్యాక్గ్రౌండ్ను బ్లర్ చేయవచ్చు. ఆటో–ఫోకస్ సెట్ చేసుకోవచ్చు. పోట్రాయిట్ మోడ్ వీడియోలకు, ఫోకస్ పాయింట్లను ఎంపిక చేసుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ట్రెడిషనల్ వీడియో మోడ్తో పోల్చితే ‘స్పెషల్’ మోడ్గా చెప్పే దీనిలో రిజల్యూషన్, ఫ్రేమ్రేట్ మెరుగ్గా ఉంటుంది. డెప్త్ ఇన్ఫర్మేషన్(సైట్లో ఉండే అబ్జెక్ట్స్కు కెమెరాకు మధ్య ఉండే దూరం)ను రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారంతో వీడియో షూట్ చేసిన తరువాత కూడా సీన్లో ఫోకస్ను షిఫ్ట్ చేసుకోవచ్చు. మోడ్రన్ డే మూవీస్లో ‘డెప్త్ ఆఫ్ ఫీల్డ్’ కీలక పాత్ర పోషిస్తుంది. ‘డెప్త్ ఆఫ్ ఫీల్డ్’ను ఎడిట్ చేసుకోవడానికి ఇక ప్రొఫెషనల్ కెమెరాలు మాత్రమే అవసరం లేదు. మూవీస్లో కనిపించే ‘ఐకానిక్ విజువల్ ఎఫెక్ట్’ను సినిమాటిక్మోడ్తో పునఃసృష్టి చేసే ప్రయత్నం చేసింది ఐఫోన్ 13. డాల్బీ విజన్ హెచ్డీఆర్లో సినిమాటిక్మోడ్ వీడియోలను రికార్డ్ చేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే స్టూడియో లు, ప్రొఫెషనల్ లైటింగ్, ఖరీదైన సాంకేతిక పరికరాలు అవసరం లేకుండానే... వీడియోలకు సినిమాటిక్ లుక్ తీసుకు రావచ్చు. చదవండి: Apple iPhone 13 .. యాపిల్ అదిరిపోయే ఆఫర్ -
World Photography Day :వరల్డ్ ఫోటోగ్రఫీ డే పై ప్రత్యేక కథనం
-
లీకైన వన్ ప్లస్ నార్డ్ 2 కెమెరా, డిస్ప్లే ఫీచర్లు
కొద్ది రోజుల క్రితమే వన్ ప్లస్ నార్డ్ సీఈ విడుదల అయ్యిందో లేదో అప్పుడే వన్ ప్లస్ నార్డ్ 2కి సంబంధించిన పుకార్లు బయటకి వస్తున్నాయి. గత ఏడాది విడుదల చేసిన వన్ ప్లస్ నార్డ్ కి కొనసాగింపుగా దీనిని తీసుకొస్తున్నారు. వన్ ప్లస్ నార్డ్ 2 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, హోల్-పంచ్ డిస్ ప్లేతో వస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఈ స్మార్ట్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్ లను వెల్లడించిన టిప్ స్టార్ స్టీవ్ హెమ్మర్ స్టాఫర్ అకా @OnLeaks సోమవారం మరికొన్ని వివరాలను షేర్ చేశారు. ఏఐ బెంచ్ మార్క్ వెబ్ సైట్ లో లిస్టింగ్ ద్వారా స్మార్ట్ ఫోన్ ఎస్ వోసిపై సమాచారం లీక్ అయిన వెంటనే ఈ వార్త వచ్చింది. ఈ ఫోన్ జూలైలో మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 6.43 అంగుళాల ఫుల్ హెచ్ డి + అమోల్డ్ డిస్ ప్లేతో వస్తున్నట్లు సమాచారం. ట్విట్టర్ లో హెమ్మర్స్ఆఫర్(అకా ఆన్ లీక్స్) షేర్ చేసిన వివరాల ప్రకారం.. వన్ ప్లస్ నార్డ్ 2 డిస్ప్లే పై ఎడమ మూలలో సెల్ఫీ స్నాపర్ హోల్-పంచ్ కటౌట్ ను కలిగి ఉంటుంది. ఇందులో వాల్యూమ్ రాకర్ ఎడమ అంచున ఉంది, కుడి అంచులో పవర్ బటన్, అలర్ట్ స్లైడర్ ఉంది. వన్ ప్లస్ నార్డ్ 2లో ట్రిపుల్ కెమెరా సెటప్, ఎడమ మూలలో దీర్ఘచతురస్రాకార మాడ్యూల్ లో ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తుంది. ఇంకా యుఎస్ బి టైప్-సీ పోర్ట్, సీమ్ ట్రే, దిగువన స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. ఏఐ బెంచ్ మార్క్ లిస్టింగ్ ప్రకారం స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ తో వస్తుందని తెలుస్తుంది. చదవండి: ల్యాప్టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి! -
బెస్ట్ కెమెరా ఫీచర్ తో వన్ప్లస్ కొత్త సిరీస్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ మార్చి 23న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వన్ప్లస్ 9ప్రో కెమెరాకు సంబందించిన కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. వన్ప్లస్ ప్రధాన లోపం కెమెరా కాబట్టి ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి హస్సెల్ బ్లేడ్ తో కలిసి వస్తుంది. రాబోయే వన్ప్లస్ 9 సిరీస్ మొబైల్స్ కెమెరా పనితీరు ఇతర ఫ్లాగ్షిప్ ఫోన్ల కంటే మెరుగ్గా ఉండనున్నట్లు తెలుస్తుంది. వన్ప్లస్ 9 ప్రో ప్రధాన కెమెరాలో సోనీ IMX789 సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాలో సోనీ IMX766 సెన్సార్ను తీసుకొస్తున్నట్లు గతంలో ధృవీకరించారు. వన్ప్లస్ సీఈఓ పీట్ లా వన్ప్లస్ 9 సిరీస్ కెమెరా పనితీరును పరీక్షించడం కోసం DxOMarkకు పంపించరని తెలుస్తుంది. DxOMark కెమెరా పనితీరుతో పాటు డిస్ ప్లే, ఆడియో, వైర్ లెస్ స్పీకర్ వంటి కీలక అంశాలకు సంబంధించి రేటింగ్ ఇచ్చే ఒక స్వతంత్ర సంస్థ. వన్ప్లస్ 9 ప్రో వేరియంట్ ఆస్ట్రల్ బ్లాక్, మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుందని వస్తుందని తెలుస్తుంది. రాబోయే వన్ప్లస్ 9 సిరీస్లో క్వాల్కామ్ రాబోయే స్నాప్డ్రాగన్ 875 చిప్ మరియు 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం. ఈ మొబైల్ యొక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11ను తీసుకొస్తునట్లు సమాచారం. చదవండి: 2022లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్ -
అద్దెకు తీసుకున్న కెమెరాతో పరార్
అమీర్పేట: ఓఎల్ఎక్స్ ద్వారా కెమెరాను అద్దెకు తీసుకున్న వ్యక్తులు కనిపించకుండా పోయారు. దీంతో బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కడప జిల్లా ఎర్రగొండ్లకు చెందిన విక్రమ్కుమార్రెడ్డి అమీర్పేట శవభాగ్లోని చిలుకూరి బాలాజీ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. షార్డ్ ఫిలీం తీసేందుకు గత ఏడాది రూ.60 వేలు వెచ్చించి కెనాన్ కెమెరా కొనుగోలు చేశాడు. కాగా ఓఎల్ఎక్స్లో పెట్టి కెమెరాను అద్దెకు ఇవ్వడం ప్రారంభించాడు. ఈ నెల 16న లింగరాజు, కిషోర్ అనే వ్యక్తులు వచ్చి రెండు రోజుల పాటు కెమెరా అద్దెకు కావాలని తీసుకుని వెళ్లారు. వారం రోజులు అవుతున్నా కెమెరా తీసుకురాలేదు. వారికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో విక్రమ్కుమార్రెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఓ తండ్రి కన్న కూతురునే.. -
వన్ప్లస్ ప్రియులకి గుడ్ న్యూస్
గత వారమే వన్ప్లస్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ బీటా వెర్షన్ ను వన్ప్లస్ 7, 7టీ సిరీస్ కోసం విడుదల చేసింది. వన్ప్లస్ తన వినియోగదారులకు కెమెరా విషయంలో ఇంకా మంచి అనుభూతిని అందించడానికి కొత్త అప్డేట్ ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా తన ఫోన్ కెమెరా యాప్కి ప్రత్యేక మోడ్స్ జోడించి తీసుకొస్తోంది. వన్ప్లస్ కెమెరాలో 6.4.23 వెర్షన్ కింద "టిల్ట్-షిఫ్ట్, స్టార్ట్ బస్ట్, మూన్, హైపర్ లాప్స్" అనే కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది. వీటితో వన్ప్లస్ యూజర్లు తమ ఫోన్ కెమెరాతో ఫొటోలను ఇతరుల కంటే భిన్నంగా తీయవచ్చు.(చదవండి: మోటోరోలా ఎడ్జ్ ఎస్లో సరికొత్త ఫీచర్స్) ప్రస్తుతం ఈ సరికొత్త వన్ప్లస్ కెమెరా ఫీచర్లను కొందరు యూజర్లకు మాత్రమే ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న వన్ప్లస్ 9 సిరీస్లో వీటిని తీసుకొస్తారని సమాచారం. కొత్తగా తీసుకురాబోయే టిల్ట్-షిప్ట్ మోడ్తో సాధారణ ఫోటోలను చాలా చిన్న ఫొటోలుగా క్రియేట్ చేయవచ్చు. అలాగే "స్టార్బర్స్ట్" మోడ్తో సూర్యని లాగా ప్రకాశించే ప్రతి దానిని ఒక నక్షత్రంలాగా మార్చవచ్చు. రాత్రి వేళలో ఆకాశాన్ని ఫోటోలను తీయడానికి ఇష్టపడే యూజర్లు మూన్ మోడ్ ఫిల్టర్లు వాడి చందమామ రంగుల్ని మార్చొచ్చు. -
ఐఫోన్13 కెమెరా ఫీచర్లు వైరల్
ఆపిల్ ఐఫోన్ 12 లాంచ్ అయ్యి కొద్దీ నెలలు అయిందో లేదో అపుడే ఆపిల్ ఐఫోన్13పై పలు పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ ఫోన్ విడుదలకు ఏడాది సమయం ఉన్న తాజాగా ఐఫోన్13లో రాబోయే కెమెరా గురుంచి అనేక రూమర్లు వస్తున్నాయి. దీనిలో పెద్ద కెమెరా సెన్సార్ రాబోతున్నట్లు సమాచారం. టెక్ నిపుణుడు రాస్ యంగ్ ప్రకారం, ఐఫోన్ 13 ప్రో మరియు 13 ప్రో మాక్స్ లో పెద్ద సెన్సార్లను కలిగి ఉండనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా రాత్రి వేళలో ఐఫోన్ 12 కంటే మంచి నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చు. ఐఫోన్ 13 మరియు 13 మినీలకు ఐఫోన్ 12 ప్రో మాక్స్ కెమెరా సెన్సార్ లభిస్తుందని విశ్లేషకుడు చెప్పారు. వీటిలో కొత్త 'సెన్సార్ షిఫ్ట్' టెక్ లేదా డుయో కంప్యూటేషనల్ టెక్ ఉపయోగిస్తారా అనే దానిపై స్పష్టత లేదు.(చదవండి: మార్కెట్ లోకి మరో బడ్జెట్ గేమింగ్ ఫోన్) రాబోయే ఐఫోన్లలో మెరుగైన అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను చేర్చడం విశేషం. వైడ్ యాంగిల్ సెన్సార్ల కోసం ఆపిల్ 13 ప్రో మరియు 13 ప్రో మాక్స్లలో ఎపర్చర్ను పెంచనున్నారు. దీని అర్థం వేగవంతమైన షాట్లు మరియు వైడ్ యాంగిల్ డెప్త్ చిత్రాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం లెన్స్ f/2.4 ఎపర్చర్తో వస్తుంది, అయితే ఐఫోన్ 13ప్రోలో మోడల్స్ 5-ఎలిమెంట్ లెన్స్కు బదులుగా 6-ఎలిమెంట్ లెన్స్తో f/1.8 ఎపర్చర్ తో రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐఫోన్ 12 ప్రో మాక్స్కు పరిమితం అయిన 'సెన్సార్ షిఫ్ట్' ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీ వచ్చే ఏడాది ఐఫోన్ 13 ప్రో మరియు 13 ప్రో మాక్స్ రెండింటిలోనూ వస్తుందని నిపుణుల అంచనా. చిత్రాలను క్లిక్ చేసేటప్పుడు లేదా వీడియోలను షూట్ చేసేటప్పుడు లెన్స్ స్థిరంగా ఉండటానికి దాని సెన్సార్ షిఫ్ట్ సెకనుకు 5000 సర్దుబాట్లు చేయగలదని ఆపిల్ పేర్కొంది. -
600 మెగా పిక్సెల్ కెమెరాతో శామ్సంగ్
టెక్ దిగ్గజం శామ్సంగ్ 600 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ను అభివృద్ధి చేస్తున్నట్లు టిప్స్టర్ ఐస్ యూనివర్స్ పేర్కొంది. ఇటీవలి తన ట్వీట్లో శామ్సంగ్ “నిజంగా 600 ఎంపీ సెన్సార్లను అభివృద్ధి చేస్తోంది!” అని టిప్స్టర్ పేర్కొన్నారు. 4కె, 8కె వీడియో రికార్డింగ్ టెక్నాలజీ కోసం దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మనిషి కంటి(576 ఎంపీ) కంటే చాలా శక్తివంతమైన కెమెరా సెన్సార్ గా నిలుస్తుంది. మామూలుగా మన కళ్లకి కనిపించని ఎన్నో రకాల డీటెయిల్స్ ఇలాంటి కెమెరా ద్వారా క్యాప్చర్ చేయబడతాయి. (చదవండి: బిగ్ బ్యాటరీతో రానున్న మోటో జీ9 పవర్) Samsung is really doing 600MP sensors! pic.twitter.com/vGgsfxsGGh — Ice universe (@UniverseIce) December 5, 2020 కొన్ని నివేదికల ప్రకారం శామ్సంగ్ కెమెరా ఐసోసెల్ 600ఎంపీ సెన్సార్ పై పని చేయనుందని సమాచారం. మనం వీడియో తీసేటప్పుడు జూమ్ చేసినప్పుడు 4కె, 8కె వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుందని లీకైన స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ ప్రస్తుత స్మార్ట్ఫోన్లో 600 ఎంపీ కెమెరాను తీసుకొస్తే కెమెరా బంప్ 22 మిమీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఫోన్ వెనుక భాగంలో 12 శాతం స్థలాన్ని ఆక్రమించనుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది భవిష్యత్ లో దీనిని తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని గురుంచి శామ్సంగ్ నుండి ఎటువంటి సమాచారం లేదు. శామ్సంగ్ సంస్థ సుదీర్ఘకాలంగా స్మార్ట్ ఫోన్ డిస్ప్లేలతోపాటు, శక్తివంతమైన కెమెరా సెన్సార్లని కూడా స్వయంగా తయారు చేస్తోంది. -
ఫేస్బుక్పై గూఢచర్యం కేసు
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్పై మరో కేసు నమోదయ్యింది. మొబైల్లోని కెమరాను అనధికారికంగా ఉపయోగించడం ద్వారా ఇన్స్టాగ్రామ్ వినియోగదారులపై గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలతో కేసు నమోదయ్యింది. ఐఫోన్లోని ఫోటో షేరింగ్ యాప్ కెమెరాను వినియోగించని సమయంలో కూడా యాక్సెస్ చేస్తున్నట్లు జూలైలో మీడియా నివేదికలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఈ దావా నమోదయ్యింది. అయితే ఫేస్బుక్ ఈ నివేదికలను ఖండించింది.. దాన్ని ఒక బగ్గా వర్ణించింది.. సరి చేస్తున్నామని తెలిపింది. ఇన్స్టాగ్రామ్ ఐఫోన్ కెమెరాలను యాక్సెస్ చేస్తోందనే వార్తలను తప్పుడు నోటిఫికేషన్లుగా అభివర్ణించింది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో గురువారం దాఖలు చేసిన ఫిర్యాదులో, న్యూజెర్సీ ఇన్స్టాగ్రామ్ యూజర్ బ్రిటనీ కొండిటి కెమెరా యాప్ ఉపయోగం ఉద్దేశపూర్వకంగా ఉందని.. దానితో వినియోగదారుల “లాభదాయకమైన, విలువైన డాటాను సేకరించే ఉద్దేశ్యంతో ఇది పని చేస్తుంది’’ అని వాదించారు. (చదవండి: ఫేస్బుక్ ఇండియా ఎండీకి నోటీసులు) ఫిర్యాదు ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల ప్రైవేట్, సన్నిహిత వ్యక్తిగత డాటాను పొందడంతో సహా విలువైన ఇన్సైట్స్, మార్కెట్ పరిశోధనలను సేకరించగలవని వెల్లడించారు. అయితే దీనిపై స్పందించడానికి ఫేస్బుక్ నిరాకరించింది. గత నెలలో దాఖలు చేసిన ఒక దావాలో, ఫేస్బుక్ తన 100 మిలియన్లకు పైగా ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల బయోమెట్రిక్ డాటాను చట్టవిరుద్ధంగా పొందడానికి ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించారని ఆరోపించారు. ఫేస్బుక్ ఈ వాదనను ఖండించింది. ఇన్స్టాగ్రామ్ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించదని తెలిపింది. -
ఫోన్ విరగ్గొట్టేస్తానన్నాను!
ఏ పాత్ర చేస్తే కెమెరా ముందు ఆ పాత్రలా మారిపోతుంటారు చాలామంది నటీనటులు. ఒకవేళ ఆ పాత్రతో బాగా కనెక్ట్ అయితే షూటింగ్ పూర్తయ్యాక కాసేపు ఆ పాత్రలానే ఉండిపోతారు. తాప్సీ ఆ కోవకే చెందుతారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నేను ఒక పాత్ర చేస్తున్నప్పుడు షూటింగ్ ప్యాకప్ చెప్పాక కూడా ఆ పాత్ర ప్రభావం కనీసం పది శాతం అయినా నా మీద ఉంటుంది. అందుకు ఓ ఉదాహరణ చెబుతాను. ‘మన్మర్జియాన్’ సినిమాలో నేను ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయిగా చేశాను. మనసులో అనుకున్నది ముఖం మీద చెప్పేస్తాను.గట్టిగా మాట్లాడే పాత్ర. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా ఆ పాత్రలోనే ఉండిపోయాను. అలాంటి సమయంలో ఒక వ్యక్తి నా అనుమతి తీసుకోకుండా ఫోన్తో ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. అంతే.. ‘ఆ ఫోన్ నువ్వు లోపల పెట్టకపోతే ఫోన్ని విరగ్గొడతాను’ అని అరిచేశాను. అంత చిన్న విష యానికి అంతలా రియాక్ట్ కానవసరంలేదు. అయితే ఆ పాత్ర తాలూకు ప్రభావం ఉండటంతో అలా చేశాను’’ అన్నారు. -
షావొమీ 100 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్లలో 48 మెగాపిక్సెల్ కెమెరాను మాత్రమే చూశాం. త్వరలో 64 ఎంపీ కెమెరాతో శాంసంగ్, షావొమీతోపాటు రియల్మీ స్మార్ట్ఫోన్లు విడుదల చేయనున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే కనీవినీ ఎరుగని రీతిలో 100 ఎంపీ కెమెరా స్మార్ట్ఫోన్కు శ్రీకారం చుట్టినట్టు షావొమీ ప్రకటించింది. శాంసంగ్ సెన్సార్తో ఇది రూపుదిద్దుకోనుందని సమాచారం. 108,000,000 పిక్సెల్స్, 12032గీ9024 రిజొల్యూషన్ ఉండనుంది. అల్ట్రా క్లియర్ కెమెరా ఆవిష్కరించనున్నట్టు షావొమీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ వెల్లడించారు. ప్రపంచంలో ఈ స్థాయి కెమెరా ఉన్న స్మార్ట్ఫోన్ ఇదే కానుంది. 100 ఎంపీ కెమెరా మోడల్ను అభివృద్ధి చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చిలో లెనొవో ప్రకటించడం గమనార్హం. కాగా, 100కు బదులుగా 108 ఎంపీతో షావొమీ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. -
మల్టీ కెమెరా స్మార్ట్ఫోన్ల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మంచి కెమెరా, పెద్ద స్క్రీన్, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ, ర్యామ్.. ఇవీ ఇటీవలి కాలం వరకు స్మార్ట్ఫోన్ కస్టమర్ల తొలి ప్రాధాన్యతలు. ఇప్పుడీ ట్రెండ్ మారిపోయింది. సామాజిక మాధ్యమాల పుణ్యమాని అత్యాధునిక పాప్–అప్, మల్టీ కెమెరా స్మార్ట్ఫోనే వినియోగదారుల ఏకైక డిమాండ్గా నిలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేవైపు నాలుగు కెమెరాలున్న మోడళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. ఇటీవలే అయిదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్వ్యూ ఫోన్ను తీసుకొచ్చింది. 64 మెగా పిక్సెల్ కెమెరాతో కూడిన ఫోన్లు కొద్ది రోజుల్లో కస్టమర్ల చేతుల్లో క్లిక్మనిపించనున్నాయి. కెమెరాను కేంద్రంగా చేసుకునే మోడళ్ల రూపకల్పనలో కంపెనీలు నిమగ్నమవడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో కెమెరా టెక్నాలజీతోనే కంపెనీలు తమ ప్రత్యేకతను చాటుకోవాల్సిందేనని జర్మనీకి చెందిన ఆప్టికల్స్ తయారీ దిగ్గజం జాయిస్ సీఈవో మైఖేల్ కాష్కే స్పష్టం చేశారు. కెమెరాల సామర్థ్యం పెరగడంతో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరు మీదున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మారుతున్న కంపెనీల ధోరణి.. స్మార్ట్ఫోన్ల డిజైన్, ఫీచర్ల విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. స్క్రీన్కు ఆనుకుని చుట్టుపక్కల ఉండే ప్లాస్టిక్, మెటల్తో కూడిన బెజెల్ తగ్గుతూ వచ్చింది. బెజెల్ లెస్ మోడళ్ల రాకతో డిస్ప్లే సైజు పెరిగింది. ర్యామ్ సామర్థ్యం 12 జీబీకి, ఇంటర్నల్ మెమరీ 256 జీబీ వరకు చేరింది. బ్యాటరీ పవర్ 5,000 ఎంఏహెచ్ దాటింది. 4కే (యూహెచ్డీ) స్క్రీన్, డెకాకోర్ ప్రాసెసర్, వైర్లెస్ చార్జింగ్ మోడళ్లూ వచ్చి చేరాయి. ఇన్ని మార్పులు వచ్చినప్పటికీ వినియోగదార్ల ప్రాధాన్యత మాత్రం కెమెరాకేనని ‘బిగ్ సి’ మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీలు పోటీపడీ మరీ లెన్స్పై దృష్టిసారిస్తున్నాయి. అధిక మెగా పిక్సెల్తోపాటు మల్టిపుల్ కెమెరాల రాక అధికమైంది అని వివరించారు. మల్టిపుల్ లెన్స్ కెమెరాలు, లార్జ్ సైజ్ ఇమేజ్ సెన్సార్ల అమ్మకాల జోరుతో జపాన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజం సోనీ కార్పొరేషన్ జూన్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రూ.14,490 కోట్ల నిర్వహణ లాభాలను ఆర్జించింది. ఈ మొత్తం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18.4%అధికంగా ఉందంటే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. మల్టీ కెమెరాలకే మొగ్గు.. ప్రపంచ స్మార్ట్ఫోన్ రంగంలో మల్టీ కెమెరాలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి. బెజెల్ లేకుండా పూర్తి డిస్ప్లేతో ఫోన్లను అందించేందుకు పాప్–అప్ సెల్ఫీ కెమెరాలతో మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆప్టికల్ జూమ్, ఫాస్ట్ ఆటో ఫోకస్, వైడ్ యాంగిల్ వంటి ఫీచర్లతో ఇవి రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఇక వెనుకవైపు రెండింటితో మొదలై అయిదు కెమెరాల స్థాయికి వచ్చిందంటే ట్రెండ్ను అర్థం చేసుకోవచ్చు. ‘ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో అందమైన ఫొటోలను పోస్ట్ చేసేందుకు కస్టమర్లు పాప్–అప్తోపాటు వెనుకవైపు మూడు, నాలుగు కెమెరాలున్న ఫోన్లు కోరుకుంటున్నారు. పాప్–అప్ కెమెరా మోడల్ ఇప్పుడు రూ.18 వేలకూ లభిస్తోంది’ అని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. వివిధ కంపెనీల నుంచి క్వాడ్, ట్రిపుల్ కెమెరా మోడళ్లు 90 వరకు ఉంటాయి. 48 మెగాపిక్సెల్తో ప్రధాన కెమెరా ఉన్న మోడళ్లు 60 దాకా ఉన్నాయి. వీటిలో చాలామటుకు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. 48 ఎంపీతో కూడిన డ్యూయల్ ఫ్రంట్ కెమెరా ఫోన్లూ వచ్చి చేరాయి. 48 ఎంపీ రొటేటింగ్ పాప్–అప్ కెమెరాతో సామ్సంగ్ గెలాక్సీ ఏ80ని ఆవిష్కరించింది. 64 ఎంపీ ప్రధాన కెమెరాతో షావొమీ, రియల్మీ త్వరలో రంగంలోకి దిగుతున్నాయి. దేశంలో 2019లో 15–16 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. -
నాలుగో సింహానికి మూడో నేత్రం
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్ ప్రొటెక్షన్ వింగ్ వంటి వినూత్న పద్ధతులతో ముందుకు సాగుతున్న రాష్ట్ర పోలీసులు మరో కొత్త ప్రయత్నా నికి శ్రీకారం చుట్టారు. పోలీసింగ్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు శాంతి భద్రతల విభాగం పోలీసులకు బాడీ వోర్న్ కెమెరా లేదా చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు ఇవ్వనున్నారు. ఇవి స్థానిక ఎస్పీ, కమిషనరేట్లతో పాటు, డీజీపీ ఆఫీసుకు కూడా అనుసంధానమై ఉంటాయి. ఫలితంగా ఘటనాస్థలంలో జరుగుతున్న కార్యక్రమాలను డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులు కూడా ప్రత్యక్షంగా వీక్షించగలరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా తొలిదశలో అన్ని జిల్లాల్లోని ముఖ్యమైన 10 పోలీస్ స్టేషన్ల సిబ్బందికి వీటిని పంపిణీ చేశారు. తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లకు అందజేస్తారు. అందజేసిన సిబ్బందికి హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో వీటి వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. రాజధానిలో ఫలితాలివ్వడంతో..! చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు హైదరాబాద్లో ట్రాఫిక్ విభాగం పోలీసులు చాలా కాలం నుంచే అమలు చేస్తున్నారు. రాజధానిలో ధర్నాలు జరిగినప్పుడు వీటిని సివిల్ పోలీసులు వినియోగించారు. హైదరాబాద్లో సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు పంపిణీ చేయాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ఘటనాస్థలంలో సాక్ష్యాధారాల సేకరణకు ఈ విధానం దోహదపడనుంది. ఆందోళనలు, అల్లర్లు, విపత్తులు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం ఫోన్లు, వాకీటాకీల ద్వారానే చెప్పే వీలుంది. ఈ విధానం ద్వారా ఉన్నతాధికారులు వేగంగా స్పందించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది. ప్రత్యేకతలేంటి? విదేశాల్లో వీటి వినియోగం ఎప్పట్నుంచో ఉంది. వీటికి 3జీ, 4జీ, ఆడియో, వీడియో సదుపాయంతో పాటు జీపీఎస్ కనెక్షన్ ఉంటుంది. రికార్డింగ్ బటన్ ఆప్షన్తో పాటు 400 నుంచి 500 గ్రాముల బరువు ఉంటాయి. ఈ కెమెరాలను భుజానికి ధరించేందుకు వీలుగా రూపొందిం చారు. వీటిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో) ఆదేశాల మేరకు సిబ్బంది వినియోగిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు వీటిని వాడుతున్నారు. -
సినిమా షూటింగ్ అంటూ మోసం!
బంజారాహిల్స్: సినిమా షూటింగ్ కోసమని కెమెరాలు అద్దెకు తీసుకోవడం... వాటిని తిరిగి ఇవ్వకుండా విక్రయించడం... వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం... ఇలా మోసాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న ఓ కేటుగాడిని పోలీసులు వలపన్ని పట్టుకొని రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ ఎస్ఐ ఎ.రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... బెల్లంపల్లికి చెందిన విజ్ఞాన్ దాసరి(27) మణికొండలో నివాసం ఉంటూ తాను ఈవెంట్ ఆర్గనైజర్నని ప్రచారం చేసుకుంటాడు. గత నెల 19న శ్రీకృష్ణానగర్లో సినిమా షూటింగ్లకు కెమెరాలను అద్దెకిచ్చే మహేష్ను కలిసి తాను సినిమా తీస్తున్నానని, రెండు రోజుల పాటు కెమెరా అద్దెకు కావాలని చెప్పి రూ.6 లక్షల విలువ చేసే కెమెరా తీసుకెళ్లాడు. ఎంతకు తిరిగి రాకపోగా ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కా నిఘా వేసిన పోలీసులు నిందితుడిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారించారు. అద్దెకు తీసుకున్న కెమెరాను రూ.90 వేలకు విక్రయించి ఆ డబ్బుతో గోవాకు వెళ్లి జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కెమెరాను రికవరీ చేసిన పోలీసులు లోతుగా విచారించగా గతంలో కూడా మియాపూర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కెమెరాలు అద్దెకు తీసుకొని అమ్ముకొని జల్సాలు చేసినట్లు తేలింది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 406, 420 కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. -
ఆన్లైన్లో పరిచయం.. ఆపై మోసం..
అజిత్సింగ్నగర్(విజయవాడ సెంట్రల్): ఆన్లైన్లో కెమెరా అమ్ముతామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన బెంగళూరు యువకుడిని నున్న రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్నగర్ ప్రాంతానికి చెందిన నాగచైతన్య (17) అనే విద్యార్థికి బెంగళూరుకు చెందిన సయ్యద్ ఫుర్ఖాన్ (19) అనే యువకుడు ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. బెంగళూరులో ఒక ఆఫర్ పెట్టారని రూ.1.50 లక్షల విలువైన ఫొటో కెమెరా రూ.60 వేలకే లభిస్తుందని ఫుర్ఖాన్ నాగచైతన్యకు తెలిపాడు. ముందుగా 30 వేలు ఇస్తే కెమెరా పంపుతానని.. కెమెరా చూసుకుని మిగిలిన రూ.30 వేలు ఇవ్వాలంటూ నమ్మబలకడంతో అతని మాటలపై ఆశపెట్టుకున్న నాగచైతన్య పేటీఎం ద్వారా ఫుర్ఖాన్కు రూ. 29 వేలు పంపాడు. ఎన్ని రోజులైనా కెమెరా రాకపోకవడంతో ఫుర్ఖాన్కు ఫోన్ చేసినా, ఫేస్బుక్ ద్వారా ప్రయత్నిస్తున్నా అతని నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో మోసపోయానని గమనించిన నాగచైతన్య నున్న రూరల్ పోలీసులకు ఆగస్టు 13న ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి బెంగళూరులోని ఫుర్ఖాన్ను గురువారం అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.ఈ కేసులో మరో ముగ్గురు నిందితులున్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తామని నున్న ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. -
కాంతిని స్లోమోషన్లో చూడాలనుందా?
వాషింగ్టన్: కాంతిని అత్యంత స్లో మోషన్లో బంధించగల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరాను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెమెరా సెకనుకి 10 లక్షల కోట్ల ఫ్రేమ్స్ను కేప్చర్ చేయగలదని తెలిపారు. ఇంత వరకు అంతుచిక్కని కాంతి, పదార్థం మధ్య జరిగే చర్యల గురించి తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ కెమెరాను అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. కాంతి అధ్యయన శాస్త్రంలో ఇటీవల పుట్టుకొచ్చిన కొత్త ఆవిష్కరణల వల్ల జీవ, భౌతిక శాస్త్రాల్లో అతి సూక్ష్మ విశ్లేషణలకు కొత్త దారులు తెరుచుకున్నాయి. ఈ పద్ధతులను వినియోగించుకోవాలంటే, ఒకేసారి షార్ట్ టెంపోరల్ రిజల్యూషన్లో చిత్రాలను కచ్చితత్వంతో రికార్డు చేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న ఇమేజింగ్ పద్ధతుల ద్వారా అల్ట్రాషార్ట్ లేజర్ పల్సస్ పద్ధతి ద్వారా ఈ విశ్లేషణలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. కంప్రెస్డ్ అల్ట్రాఫాస్ట్ ఫొటోగ్రఫీ (కప్) టెక్నాలజీ కొంతమేరకు ఉపయోగకరంగా ఉన్నా.. పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఇప్పుడు ఈ టెక్నాలజీనే మరింత మెరుగుపర్చి నూతన సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేమ్స్ను బంధించే ఫెమ్టో సెకండ్ సామర్థ్యమున్న కెమెరాకు స్థిర చిత్రాలను బంధించే మరో కెమెరాను జతచేశారు. దీంతో అత్యంత నాణ్యమైన చిత్రాలను సెకనుకి 10 ట్రిలియన్ల ఫ్రేమ్స్ వరకు బంధించవచ్చని కాల్టెక్ ఆప్టికల్ ఇమేజింగ్ లాబోరేటరీ(కాయిల్) డైరెక్టర్ లిహాంగ్ వాంగ్ వెల్లడించారు. టీ–కప్గా పిలిచే ఈ నూతన కెమెరా సాయంతో బయో మెడికల్, మెటీరియల్ సైన్స్, ఇతర విభాగాలకు అవసరమైన కొత్తతరం మైక్రోస్కోప్లను అభివృద్ధి చేయవచ్చని వాంగ్ తెలిపారు. ఈ కెమెరాను ఉపయోగించి తొలుత 25 ఫ్రేములలో 400 ఫెమ్టో సెకన్ల వ్యవధిలోనే కాంతి పుంజం ఆకారం, తీవ్రత, పరావర్తన కోణాన్ని పరిశీలించినట్లు చెప్పారు. దీని వేగాన్ని భవిష్యత్తులో సెకనుకు క్వాడ్రిలియన్ ఫ్రేములకు పెంచడానికి అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. -
తెల్లముఖాలేశాం!
అవి ఇప్పటి వలే డిజిటల్ కెమెరాలు అందుబాటులో లేని రోజులు. మా ఫ్రెండ్ ఒకరి దగ్గర చిన్న కెమెరా ఒకటి ఉండేది. పిక్నిక్ మొదలు తీర్థయాత్రల వరకు రీల్లు కొనుక్కొని ఫోటోలు దిగేవాళ్లం. ఒకసారి ఫ్రెండు పెళ్లికి పూరీ(ఒడిషా)కి వెళ్లాం.పెళ్లి కార్యక్రమాలలో ఫోటోలతో పాటు జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణంలో, సముద్రం దగ్గర ఫోటోలు దిగాలని కలలు కన్నాం.ఆ రోజు పూరీకి ప్రయాణం. హడావిడి పనులతో రీలు కొనడానికి సమయం చిక్కింది కాదు.ఒక పెద్దాయన మా బాధను చూసి...‘‘పూరీలో సవాలక్ష స్టూడియోలు ఉంటాయి. కావలసిన రీలు దొరకడం ఏమంత కష్టం కాదు’’ అనడంతో మా నిరాశ మాయమైంది. పూరీ చేరిన రోజు ఆదివారం కనుక దుకాణాలన్నీ మూసి ఉన్నాయి.‘అయ్యో!’ అనుకున్నాం.కూపీ తీస్తే ‘‘ఒక స్టూడియో ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ప్రయత్నించి చూడండి’’ అన్నాడు ఒక వ్యక్తి.రిక్షా మాట్లాడుకొని వెళ్లాం.అప్పటికీ చాలా సమయం వృథా అయింది.హడావిడిగా రిక్షా దిగి ఆ స్టూడియోలో రీలు కొని కెమెరాలో లోడు చేసి సముద్ర తీరం చేరుకున్నాం. వచ్చిపోయే కెరటాలతో రకరకాల ఫోజులలో ఫోటోలు దిగాం. ఆ తరువాత పెళ్లి ఫోటోలు తీయడం మొదలుపెట్టాం. అమ్మలక్కలైతే పనులు ఎగ్గొట్టి మరీ రకరకాల చీరల్లో ఫోటోలు దిగారు. మరునాడు రీలు ఇచ్చాం. సాయంత్రం వస్తే ఎన్ని కరెక్ట్గా వచ్చాయో చూసి చెబుతాను అన్నాడు ఫోటోగ్రాఫర్.సాయంత్రం స్టూడియోకు వెళ్లాం.ఫోటోలు ఎలా వచ్చాయో అనే ఆసక్తి మాలో అంతకంతకూ పెరుగుతోంది.ఫోటోగ్రాఫర్ రీలు విప్పి చూపించాడు.అంతా తెల్లగా కనబడింది.అది చూసి మేము తెల్లముఖాలేశాం.రీలు మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైర్ అయిందట. హడావిడిలో ఇది మేము పట్టించుకోలేదు. ఒకరి ముఖాలు ఒకరం చూసుకొని వెర్రి నవ్వొకటి నవ్వుకోవడం తప్ప ఏం చేయగలం? – ఏ.గోవిందరాజులు ఖరగ్పూర్ -
డూప్లికేట్ కెమెరా విక్రయించాడని..
ముషీరాబాద్/చిక్కడపల్లి : ఓఎల్ఎక్స్లో డూప్లికేట్ కెమెరా విక్రయించాడనే కోపంతో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాంనగర్ జెమిని కాలనీకి చెందిన ఆకాష్సింగ్ నెల రోజుల క్రితం ఓఎల్ఎక్స్లో తన కెమెరాను విక్రయానికి పెట్టగా, కిషన్బాగ్కు చెందిన కరన్వీర్సింగ్ రూ.15వేలకు కొనుగోలు చేశాడు. దానిని రిపేర్షాపులో చూపించగా డూప్లికేట్ అని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన కరణ్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గురువారం చిక్కడపల్లిలోని ఓ కెమెరా రిపేర్ దుకాణం వద్దకు రావాలని ఆకాశ్సింగ్ చెప్పడంతో కరన్వీర్సింగ్ అక్కడకు వచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన అక్కడే ఉన్న పేపర్లు కట్ చేసే బ్లేడ్తో ఆకాశ్సింగ్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ముషీరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరుమలగిరిలోని మిలటరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిక్కడపల్లి పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి ఏసిపి ప్రదీప్కుమార్రెడ్డి నేతృత్వంలో చిక్కడపల్లి డిఐ రాకేష్, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సముద్రంలో పోయింది.. రెండేళ్లకు దొరికింది!
ఒకినావా: ఒక్కోసారి సినిమాల్లోకంటే నిజజీవితంలో జరిగే అద్భుతాలు మనల్ని ఎంతో థ్రిల్ చేస్తాయి. అలాంటి ఓ ఘటనే థాయ్లాండ్లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. జపాన్లోని ఒకినావా బీచ్కు సరదాగా సర్ఫింగ్కు వెళ్లిన సెరినా సుబకిహారా సముద్రంలో తన కెమెరాను పోగొట్టుకున్నాడు. ఎంతగా వెతికినా దొరకలేదు. సముద్రగర్భంలో కలిసిపోయిందనుకొని ఆశలు వదిలేసుకున్నాడు. ఇది జరిగి రెండేళ్లయింది. కానీ ఆయనతోపాటు ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఆ కెమెరా మళ్లీ దర్శనమిచ్చింది. అదీ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయ్లాండ్లో..! ఇదే ఆశ్చర్యం కలిగించే విషయమైతే.. ఆ కెమెరా చెక్కు చెదరకుండా.. పర్ఫెక్ట్గా పనిచేసే కండిషన్లో, ఫుల్ చార్చింగ్తో ఉందట. అదెలా దొరికిందటే.. లీ అనే వ్యక్తి పిల్లలతో కలిసి సరదాగా బీచ్కు వెళ్లాడు. అక్కడ తమకు దొరికిన కెమెరాను పిల్లలు లీకి తెచ్చి ఇచ్చారు. అప్పటికే దానిచుట్టూ నాచు, షెల్స్ వంటివి పేరుకుపోయాయి. వాటన్నింటినీ తొలగించి చూస్తే కెమెరా కనిపించింది. ఆన్ ఆఫ్ బటన్ నొక్కగానే ఆశ్చర్యకరంగా కెమెరా ఆన్ అయింది. పైగా అందులో బ్యాటరీ కూడా ఫుల్గా ఉందట. దీంతో ఎలాగైనా దానిని పోగొట్టుకున్న వ్యక్తికి అందజేయాలనుకున్నారు. అందుకు ఫేస్బుక్ను వేదికగా ఎంచుకొని విషయమంతా ఫొటోలతో సహా అందులో రాశారు. అలా.. చివరకు తన కెమెరా గురించి తెలుసుకున్న సెరినా సుబకిహారా ఎంతో ఆనందపడ్డాడు. కెమెరాను తిరిగి ఇచ్చినందుకు లీ, పిల్లల బృందానికి థ్యాంక్స్ చెప్పాడు. రెండేళ్లు నీళ్లలో ఉన్నా చెక్కు చెదరకుండా కాపాడిన వాటర్ప్రూఫ్ కేస్కు, కెమెరా తన వద్దకు చేరడానికి సహకరించిన ఫేస్బుక్ స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపాడు. -
డీడీ కెమెరాకు లేడీ లెన్స్
ఇంకొక గాజు తెరను మహిళలు భళ్లున బద్దలు కొట్టారు! ‘లైన్మన్’ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కోర్టు నుండి ఆదేశాలు తెచ్చుకున్నారు. విద్యుత్శాఖలోని 2,553 జూనియర్ లైన్మన్ ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కేవలం పురుష అభ్యర్థుల దరఖాస్తులను మాత్రమే స్వీకరించే విధంగా ఆ సాఫ్ట్వేర్ తయారై ఉండటంతో మహిళలు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీనిపై మహిళా అభ్యర్థులు కోర్టుకు వెళ్లి, దరఖాస్తుకు అనుమతి తెచ్చుకున్నారు (దరఖాస్తుకు ఇవాళ్టితో గడువు ముగుస్తోంది). ఈ నేపథ్యంలో... ముప్పై ఏళ్ల క్రితమే ‘మెన్’ పోస్టుల సామ్రాజ్యంలోకి తన అప్లికేషన్ని బాణంలా సంధించిన ఓ కెమెరా ఉమన్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది. ‘మెన్’ అనే పేరున్న పోస్టుకి అప్లై చేసుకుంది! దూరదర్శన్లో చేరి, కెమెరాఉమన్గా క్లిక్ అయింది. మనిషికి జెండర్ గానీ, పనికి జెండర్ ఏంటీ అంటూ...మూడు దశాబ్దాలుగా వీక్షకులకు విశ్వదర్శనం చేయిస్తోంది జయశ్రీ పూరి. ముప్పై రెండేళ్లనాటి మాట! అప్పుడామె వయసు 23. దరఖాస్తు చేసిన ఉద్యోగం పేరు కెమెరామన్. అప్పటి వరకు మన దేశంలోని ఆ పోస్టులో ‘ఉ’ అనే అక్షరం లేదు. ఆ రంగం మగవాళ్లదే. అందుకే ఆ ఉద్యోగం పేరు ‘కెమెరామన్’. నోటిఫికేషన్లో కూడా కెమెరామన్ పోస్టుకు ఇంటర్వ్యూ అనే ప్రచురించారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ఆమెకు ఆఫర్ లెటర్ ఇచ్చేటప్పుడు తలెత్తింది సందేహం. ఒకఉమన్కి ‘కెమెరామన్’ డిజిగ్నేషన్ ఇవ్వవచ్చా? అని. అదేమీ పట్టించుకోలేదు జయశ్రీ పూరి. ఆఫర్ లెటర్ రాగానే వెళ్లి దూరదర్శన్లో కెమెరాఉమన్గా ఉద్యోగంలో చేరారు జయశ్రీ పూరి. అసలేమీ తెలియకుండానే! ‘‘ఆ ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి రావడాన్ని ఆశ్చర్యంగా చూశారు ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్లు. వాళ్లను అంతకంటే ఆశ్చర్యపరిచిన విషయం.. నా సమాధానం. ‘నీకు కెమెరా గురించి క్షుణ్ణంగా తెలుసా?’ అని అడిగారు. ‘నాకేమీ తెలియదని, నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉందని, నేర్చుకుని నైపుణ్యంతో పని చేస్తాననీ’ చెప్పాను. ‘నువ్వేం చదివావు?’ అని అడిగారు నా సర్టిఫికేట్స్ చూస్తూ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేస్తున్నానప్పటికి. నా చదువుకు సంబంధం లేకపోయినా, పేపర్లో వచ్చిన ప్రకటన చూసి ఆసక్తితో వచ్చానని చెప్పాను. ఉద్యోగం ఇచ్చారు’’ అని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటారు జయశ్రీ. ఇప్పుడామెకి 55 ఏళ్లు. ఉద్యోగంలో చేరిన తొలి రోజులను ఎవరు మాత్రం మర్చిపోగలరు? ‘‘నాకు ఈ ఫీల్డ్ అస్సలే తెలియదు. ఉత్సాహం కొద్దీ కెమెరాతో పనిచేయడంలో ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగంలో చేరిపోయాను. స్టూడియోలో అడుగుపెట్టిన తొలి క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తే. హాలీవుడ్ సినిమా సెట్టింగ్కంటే తక్కువగా ఏమీ లేదనిపించింది’’ అంటారీ కేరళ కెమెరాఉమన్. పది కిలోల బరువైన ఉద్యోగం ఇరవై మూడేళ్ల అమ్మాయి, సన్నగా, నాజూగ్గా ఉన్న అమ్మాయి సుమారు పది కిలోల వీడియో కెమెరాతో కుస్తీ పడుతుంటే కొందరు ముచ్చటగా చూసేవాళ్లు. మరికొందరు జాలి చూపేవారు. ఆ కెమెరా బరువును తాము మోస్తూ ఆ అమ్మాయికి కొంచెం రిలీఫ్ ఇద్దాం అనుకున్న వాళ్లూ ఉండి ఉంటారు. రకరకాల సానుభూతులు వ్యక్తం అయ్యేవి. అయితే ‘షేమ్’ అన్న మాటను జయశ్రీ ఊహించలేదు. ఆ మాట విన్న రోజును మర్చిపోలేనంటారామె.సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడిని ఇంటర్వ్యూ చేయాల్సిన అసైన్మెంట్ అది. జయశ్రీతో పాటు మరో అసిస్టెంట్ కూడా ఉన్నాడు. ఇంటర్వ్యూ ఇచ్చే పెద్దాయనకు ఓ పీఆర్వో కూడా ఉన్నాడు. పెద్దాయనకు సమయం ఎంతో విలువైనది. ఆ సమయంలో తమకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎప్పుడు వీలవుతుందో తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికే పీఆర్వో వెంట నడుస్తూ ఉన్నారు జయశ్రీ, ఆమె అసిస్టెంట్ కెమెరామన్. అతడితోపాటు లిఫ్ట్లో అడుగుపెట్టింది జయశ్రీ. ఆమె కెమెరా.. అసిస్టెంట్ కెమెరామన్ దగ్గరే ఉంది. అతడు లిఫ్ట్ బయటే ఉన్నాడు. అప్పుడు అడిగాడు పిఆర్వో.. కెమెరాపర్సన్ ఎవరు అని. నేనే అంది జయశ్రీ. ‘షేమ్’ అని అన్నాడతను! ఆ మాట ఆమెను బాణంలా తాకింది. షేమ్ అనడంతోపాటు మరోమాట కూడా అన్నాడా పిఆర్వో. ‘‘చూడండి మేడమ్! కెమెరాపర్సన్కి బిడ్డలాంటిది కెమెరా. ఒక సంగీతకారుడికి సంగీతవాద్యం బరువు కాకూడదు. అలాగే మీకు కెమెరా కూడా. ముందు మీరు కెమెరాను మీ బిడ్డను ప్రేమించినట్లు ప్రేమించండి. ఆ తర్వాత మాత్రమే దాంతో మీరు అద్భుతాలు చేయగలుగుతారు’’ అన్నాడాయన. ఆ మాటలు అప్పటికి జయశ్రీని షాక్కు గురి చేశాయి. కానీ అవే వేద వాక్యాలు అయ్యాయి ఆమెకు. ఆ క్షణం నుంచి ఆమెను డ్యూటీలో కెమెరా లేకుండా చూసిన వారు లేరు. స్టాఫంతా సోదరిలా ఆదరించారు ఇది మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం సహజమే. అప్పట్లో ఇన్నేసి టెలివిజన్ చానళ్లు లేవు, దూరదర్శన్ ఒక్కటే ఉండేది. ఎక్కడ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వెళ్లినా మగవాళ్లే ఉండేవారు. అలాగని మహిళ అయిన కారణంగా జయశ్రీపై ఎటువంటి వివక్షా ఉండేది కాదు. ఒక సోదరిలాగా ఆదరించేవారు. ‘‘ఆఫీస్లో అసైన్మెంట్లు వేయడంలోనూ మహిళ అయిన కారణంగా నాకు తక్కువ చేయలేదెప్పుడూ. కీలకమైన సంఘటనలు కూడా కవర్ చేశాను. 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీని కవర్ చేశాను. నాగపట్టణమ్ వెళ్లి బాధితుల వ్య«థలను షూట్ చేశాను. రాష్ట్రపతి భవన్ ముందు రాజ్పథ్లో రిపబ్లిక్ డే పెరేడ్లను కవర్ చేశాను. ఎర్రకోట బురుజు మీద ప్రధాని ప్రసంగాలనూ కవర్చేశాను. వాటితోపాటు మాజీ ప్రధాని వాజ్పేయి నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ వరకు వారి ప్రత్యేకమైన ఈవెంట్స్ను షూట్ చేసే అవకాశం నాకు వచ్చింది’’ అంటారు జయశ్రీ. కష్టపడటంలోనే అందం ఉంది ‘‘మనం ఏ ప్రొఫెషన్లో అడుగుపెట్టినా సరే, ఆ ప్రొఫెషన్ మీద ప్రేమను పెంచుకోవాలి. అందులో మన వంతుగా నూటికి నూరు శాతం అవుట్పుట్ ఇవ్వాలి. అలా శ్రమించినప్పుడు అనేక అవాంతరాలు వాటికవే దూరమై పోతాయి. మహిళలు ఈ ఫీల్డ్లో పని చేయడం కష్టం అంటుంటారు. ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోతుందని, గ్లామర్ పోతుందని కూడా వింటుంటాను. నా మట్టుకు నేను నా ఉద్యోగంలో చెమట చిందే వరకు పని చేయడమే అసలైన గ్లామర్ అనుకుంటాను’’ అన్నారు జయశ్రీ. టెన్షన్ పెట్టరు.. టెన్షన్ పడనివ్వరు ఉద్యోగంలో చేరిన కొద్ది నెలలకే పెళ్లి చేసుకున్నాను. నా ఉద్యోగం ఎలాంటిదో తెలుసుకునే నాతో జీవితం పంచుకున్నారు కాబట్టి నా భర్త నుంచి ఎటువంటి ఇబ్బంది రాలేదు. పైగా నేను డ్యూటీలో ఉన్నంత సేపు ఇంటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. నేను అవుటాఫ్ స్టేషన్ వెళ్లాల్సినప్పుడు మా అమ్మాయిలిద్దరి బాధ్యత ఆయనే చూసుకుంటారు. – జయశ్రీ పూరి, సీనియర్ కెమెరాఉమన్ – మంజీర ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సహోద్యోగినితో కలిసి నవ్వులు చిందిస్తూ జయశ్రీ (ఎడమ వైపు) కలామ్ ఇంటర్వ్యూను షూట్ చేస్తున్న జయశ్రీ -
కెమెరా చూసి మొహం చాటేసింది
సాక్షి, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటి రేఖ కెమెరాను చూసి పరుగులు తీశారు. రీసెంట్గా షాపింగ్ వెళ్లిన ఆమెను చిత్రీకరించేందుకు ఓ అభిమాని ప్రయత్నించాడు. కంప్లీట్ తెలుపు దుస్తుల్లో ఉన్న ఆమె షాపు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెను వీడియో తీస్తున్న దృశ్యాన్ని ఆమె గమనించారు. ఒక్కసారిగా ఆ కెమెరాను చూసి ముఖం చాటేసింది. ఆపై అలాగే వేగంగా వెళ్తూ కారులో కూర్చుని నిష్క్రమించింది. ఆ సమయంలో ఆమె మేనేజర్ ఆమె వెంటే ఉన్నారు. కెమెరా ముందు ఏ మాత్రం బెణుకు లేకుండా నటించే రేఖ.. ఎందుకిలా చేసింది చెప్మా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
దొంగలకే చుక్కలు చూపించిదెవరంటే...
పక్కా ప్లాన్తో వచ్చిన దొంగలకు అక్కడున్న గ్లాస్ కౌంటర్ చుక్కలు చూపించిన వైనం కెమెరాకు చిక్కింది. చోరాగ్రేసరుల రకరకాల చోళకళ గురించి మనం చాలానే విన్నాం. అయినా ఎక్కడో ఒక చోట ఒక చిన్న క్లూతో దొరికిపోవడం మామూలే. ముఖ్యంగా సీసీ టీవీలు వచ్చిన తరువాత పోలీసులకు ఈ పని మరింత సులువైంది. అయితే మలేసియాలోని ఓ జ్యుయలరీ షాపులో దొంగతనానికి వచ్చిన దొంగలకు అనుకోని చుక్కెదురైంది. ఎంత చోమటోడ్చినా ఫలితం దక్కకపోవడంతో తోకముడవక తప్పలేదు. ఈ దోపిడీ ప్రయత్నంచేసిన దొంగల ముఠాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నలుగురు దొంగల ముఠా సెక్యూరిటీని గన్తో బెదిరించి మరీ మలేషియాలోని ఒక ఆభరణాల దుకాణంలోకి ఎంటర్ అయింది. ముఖాలకు హెల్మెట్లు, సుత్తులు లాంటి సరుకు సరంజామాతో పనిలోకి దిగారు. తమ వెంట తెచ్చుకున్న సుత్తెలతో జ్యూయెలరీ షోరూమ్లోవున్న డిస్ ప్లే కౌంటర్ గ్లాసులను పగల కొట్టడానికి ట్రై చేశారు. ఒకరి తరువాత ఒకరు ఇద్దరు దొంగలు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అది చాలా మందంగా వుండడంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసినవికావడంతో ఆ గ్లాస్ పగల్లేదు. ఇక చేసేదేమీలేక అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. ఈ తతంగమంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కెడై ఇమాస్ శ్రీ ఆలం జ్యుయల్లరీ షోరూం లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫేస్బుక్ లో దాదాపు 6 మిలియన్లకు పైగా వ్యూస్ను, వేలాది షేర్లను సొంతం చేసుకుంది. -
చక్కర్లు కొడుతున్న సమంత ఫోటోలు
మెగా హీరో రామ్ చరణ్, సమంత జంటగా రూపొందుతున్న తాజా చిత్రం రంగస్థలం 1985కి సంబంధించి మరో ఫోటోను షేర్ చేశారు హీరోయిన్ సమంత. సుకుమార్ దర్శకత్వంలో కోనసీమ అందాలతో షూటింగ్ కార్యక్రమాలు ఇ టీవల జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని పాత్రలకు సంబంధించిన విశేషాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మెగాహీరో రామ్ చరణ్ లుంగీ లుక్ వైరల్ కాగా, తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ట్రెడిషనల్ ఫోటో కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు షేర్ చేసిన చెరువు గట్టు మీద కూర్చొని తన పాదాలను చూపుతూ దిగిన ఫోటోకూడా అభిమానులను బాగానే ఆకట్టుకున్న సంగతితెలిసిందే. పదహారణాల పల్లెటూరు అమ్మాయిలా చెరువు గట్టుపై కూర్చొని ఉన్న ఫోటోని సోమవారం తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి జతగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఒకటి అభిమానుల మనసు దోచుకుంటోంది. కెమెరా అద్భుతమైన చిత్రాలను క్యాప్చర్ చేసేటపుడు చివరికి వేడి, అలసట నొప్పి ఇలాంటివి పెద్ద విషయాలు కాదంటూ సూర్తాస్తమయాన గట్టు ఒడ్డున కూర్చున్న ఓ బ్యూటిఫుల్ ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. కెమెరా ఎక్స్ట్రా ఆర్డినరీ దృశ్యాలనే క్యాప్చర్ చేస్తుందంటూ కొన్ని ఫోటోలను ఉంచారు. దీంతో లైక్ల వెల్లువ కురుస్తోంది. -
చిత్ర తేజం..దృశ్యకావ్యం
- సైకిల్పై 6వేల కి.మీ యాత్ర – 16 రాష్ట్రాల్లో పర్యటన – కెమెరాతో వేలాదిగా ప్రకృతి చిత్రాలు – కర్నూలు యువకుని ప్రతిభ కర్నూలు(హాస్పిటల్): ప్రకృతిలో ఎన్నెన్నో వింతలు..వాటిని రెండు కళ్లతో చూడటం అందరికీ సాధ్యం కాదు. అందుకే కెమెరా కళ్లను కూడా మనిషి జతచేసుకున్నాడు. ఆ ‘కళ్ల’తో ఈ ప్రకృతిని మరింత అందంగా చూపించాలనే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉన్నాడు. ఆ కెమెరా కళ్ల ద్వారా వచ్చిన దృశ్యాలు నిత్యం మనకు మేగజైన్లు, పత్రికల్లో, టీవీ చానళ్లు, సినిమాలలో అద్భుతంగా కనిపిస్తుంటాయి. కర్నూలుకు చెందిన కుర్రాడు తేజేశ్వర్ ఇదే పని చేస్తున్నాడు. కెమెరా భుజాన వేసుకుని దేశంలోని 16 రాష్ట్రాల్లో సైకిల్పై సాహస యాత్ర చేశాడు. సుమారు 6వేల కిలోమీటర్లు ప్రయాణించి అద్భుత చిత్రాలు బంధించాడు. కర్నూలు నగరంలోని నెహ్రూనగర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు శ్రీనివాసులు, పార్వతికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడైన మద్దికెర తేజేశ్వర్ బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ను హైదరాబాద్లోని జేబీఐఈటీ కాలేజిలో చదివాడు. తనకు చిన్నతనం నుంచి ఫొటోగ్రఫీ, ప్రయాణం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే చదువు మధ్యలో మూడు నెలల పాటు ముంబయిలోని ఫ్యాషన్ ప్రో సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ ఫొటోగ్రఫి, సెల్ఫ్ న్యూడ్ ఫొటోగ్రఫి, స్ట్రీట్ ఫొటోగ్రఫి, నేచర్ ఫొటోగ్రఫిలో తర్ఫీదు పొందాడు. ఆ సమయంలో అక్కడి అధ్యాపకురాలు ప్రాచీ చపేకర్ సూచనలు ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. శిక్షణ తర్వాత కొన్నాళ్ల పాటు మోడరన్ ఇండియా మేగజైన్లో ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్గా పనిచేశాడు. ప్రకృతి అందాల ఫోటోల కోసం సైకిల్ యాత్ర ఈ ప్రకృతి, అందమైన ప్రపంచాన్ని తన కెమెరాలో బంధించాలని తేజేశ్వర్ కలలు కనేవాడు. ఆ కలలకు రూపాన్ని కల్పించేందుకు గత సంవత్సరం ఆగష్టు 6వ తేదిన ముంబయి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. అక్కడ నుంచి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణా, పూణే, కర్నాటక, గోవా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేశాడు. తనకు చిన్నతనం నుంచి ఇష్టమైన ప్రయాణం, ఫొటోగ్రఫి అనే ఇష్టాలను ఆయన ఈ విధంగా తీర్చుకున్నాడు. యాత్రలో కనిపించిన ప్రతి అందమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇప్పటి వరకు 6వేలకు పైగా కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. నేచర్ ఫోటోగ్రఫి కోసం, సోషల్ డాక్యుమెంటరీ కోసం ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపాడు. ‘జాంటీ’ తోడుగా కష్టం ఇష్టంగా...! –తేజేశ్వర్, నేచర్ ఫొటోగ్రాఫర్ సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో ఒకానొక సమయంలో తీవ్ర అలసట, అయిష్టం ఏర్పడేది. కొన్నిసార్లు ముందుకు సాగబుద్ధి అయ్యేది కాదు. నా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలంటే తోడు అవసరమని భావించాను. ఈ మేరకు జైపూర్లో రూ.8వేలు వెచ్చించి జర్మన్ షెప్పర్డ్ అనే జాతి కుక్కపిల్లను కొనుగోలు చేశాను. దానిని వెంట బెట్టుకుని యాత్ర ప్రారంభించాను. ఆ మరునాడు జైపూర్ రోడ్డుపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటిరోడ్స్ కనిపించాడు. ఆయన స్నేహితురాలు సమంత నాలాగే ఒక మంచి ఉద్దేశంతో 8వేల కిలోమీటర్ల పరుగు చేస్తోంది. వారిద్దరూ జైపూర్ రోడ్డుపై నన్ను చూసి ఆపారు. నా గురించి, నేను చేస్తున్న పని గురించి తెలుసుకున్నారు. నా వద్ద ఉన్న కుక్కపిల్లను చూసి ముచ్చటపడ్డారు. దీనికి ఏం పేరు పెట్టావని అడిగారు. ఇంకా పేరు పెట్టలేదన్నాను. వెంటనే సమంత దీనికి ‘జాంటిరోడ్స్’ అని పేరు పెట్టాలని సూచించారు. వారి సూచన మేరకు కుక్కపిల్లకు ఆ పేరే పెట్టాను. అప్పటి నుంచి ఆ కుక్కపిల్ల నన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతోంది. -
చాక చక్యంతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన జవాన్
-
దేశ రాజధానిలో నడిరోడ్డుపై లైవ్ మర్డర్
-
ఇక కంటి చూపుతో ఫోటోలు తీయవచ్చు
-
శాంసంగ్ న్యూ గెలాక్సీ ఎలా ఉంటుందో తెలుసా?
గెలాక్సీ నోట్7 సంక్షోభంతో ఇటు మార్కెట్లో తమ కీర్తిప్రతిష్టలను.. అటు కంపెనీ లాభాలను భారీగా కోల్పోయిన శాంసంగ్, తన అప్కమింగ్ డివైజ్పై నమ్మకాలను భారీగా ఆశలు పెంచేసుకుంది. ఎలాగైనా మళ్లీ మార్కెట్లో తమ స్థానాన్ని సంపాదించుకోవడం కోసం, గెలాక్సీ ఎస్8ను పలు జాగ్రత్తలతో రూపొందిస్తోంది. సరికొత్త డిజైన్, మెరుగైన కెమెరాలతో వినియోగదారుల ముందుకు తీసుకొస్తామని శాంసంగ్ చెప్పింది. ఈ ఫోన్కు సంబంధించిన డిజైన్ రూపరేఖలను కంపెనీ రివీల్ చేసింది. మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఈ హైఎండ్ స్మార్ట్ఫోన్ను స్లిక్ డిజైన్తో రూపొందిస్తున్నామని, కెమెరాను మెరుగుపరిచామని పేర్కొంది. మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సర్వీసుతో ఇది వినియోగదారులను అలరించనుందని వెల్లడించింది. అయితే ఈ ఫోన్కు సంబంధించిన ఒక్క ఫీచర్ను కూడా కంపెనీ రివీల్ చేయలేదు. అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్-ఇంటిలిజెన్స్ సాప్ట్వేర్ కంపెనీని కొనుగోలు చేసిన శాంసంగ్, ఏఐ రంగంలో మార్కెట్లో తమ పరపతిని పెంచుకోవాలని ఆశిస్తోంది. ఆపిల్ మొబైల్ డివైజ్ల కోసం డిజిటల్ వాయిస్-అసిస్టెంట్ కింద సిరి యాప్ను ఈ వివ్ డెవలపర్లే అభివృద్ధి చేశారు. ఈ సంస్థను గత నెలలో శాంసంగ్ కొనుగోలు చేసేసింది. ప్రాథమిక లీకేజీల ప్రకారం మార్కెట్లోకి రాబోతున్న అప్కమింగ్ శాంసంగ్ ఫీచర్లు.. 5.5 అంగుళాల 4కే సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 6జీబీ ర్యామ్, డ్యూయల్ కెమెరా సెట్అప్(16 ఎంపీ, 8ఎంపీ కెమెరాలు)గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే అప్టికల్ ఫింగర్ప్రింట్ టెక్నాలజీతో రాబోతున్న కంపెనీ మొదటి స్మార్ట్ఫోన్ ఇదేనట. అయితే పలు రిపోర్టుల ప్రకారం గెలాక్సీ ఎస్7లో నెలకొన్న సమస్యను కనుగొనడానికి కంపెనీ తలమునకలై ఉన్న నేపథ్యంలో గెలాక్సీ ఎస్8 రూపకల్పన ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. -
పేలిన 'రియల్' బుల్లెట్
-
పేలిన 'రియల్' బుల్లెట్
బోయిన్పల్లిలో సినీఫక్కీలో కాల్పులు ► ‘అన్నా..’ అని పిలిచి కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై కాల్పులకు దిగిన దుండగుడు ► ప్రాణభయంతో పక్కనున్న ఆసుపత్రిలోకి పరుగు ► అయినా వదలకుండా వెంటాడిన దుండగుడు ► టాయిలెట్ గదిలో దాక్కున్నా అక్కడికి వెళ్లి కాల్పులు ► గోడ దూకి బయటకు పరుగులుపెట్టిన యాదగిరి ► తుపాకీ లాక్కొని కిందపడిపోవడంతో పారిపోయిన దుండగుడు.. ► అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగుబాటు ► భూవివాదాలే కారణం కావొచ్చు: పోలీసులు హైదరాబాద్: వెనుక నుంచి వచ్చాడు.. ‘అన్నా..’ అని పిలిచాడు.. వెనక్కి తిరగ్గానే ఒక్కసారిగా కాల్పులకు దిగాడు.. ఛాతీలోకి బుల్లెట్ దిగింది.. బాధితుడు రక్తమోడుతూనే ప్రాణభయంతో పరుగులు పెట్టాడు.. అయినా దుండగుడు వదల్లేదు.. వెనుక నుంచే తుపాకీతో వెంటాడాడు.. పక్కనే ఉన్న ఆసుపత్రిలోకి పరుగెత్తి డాక్టర్ రూంలోకి వెళ్తే అక్కడకూ వచ్చి తుపాకీ పేల్చాడు.. అక్కడ్నుంచి తప్పించుకొని టాయిలెట్ గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నా వదల్లేదు.. అక్కడికి వచ్చి డోర్ పగులగొట్టే యత్నం చేశాడు.. ఎలాగోలా తప్పించుకొని రోడ్డుపైకి వచ్చి దుండగుడి చేతిలోని తుపాకీ లాక్కొని కొంత దూరం పరుగెత్తి కిందపడిపోయాడు.. చనిపోయాడనుకొన్న దుండగుడు అక్కడ్నుంచి జారుకున్నాడు!! సినీఫక్కీలో జరిగిన ఈ కాల్పుల వేట శనివారం బోయిన్పల్లిలో చోటుచేసుకుంది. శుక్రవారం అల్వాల్ పరిధిలో కాల్పుల ఘటన మరచిపోకముందే బోయిన్పల్లిలో కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరిపై జరిగిన ఈ కాల్పుల ఉదంతం కలకలం సృష్టించింది. సుపారీ కిల్లర్ కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన యాదగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భూ వివాదాల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుడు పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. వెనకాలే వచ్చి.. అన్నా అని పిలిచి.. బోయిన్పల్లి పరిధిలోని మల్లికార్జుననగర్ భాగ్యశ్రీ ఎన్క్లేవ్లో నివసించే కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరికి కొందరితో సివిల్ వివాదాలున్నాయి. శనివారం ఉదయం 10.35 గంటలకు ఆయన తన ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఇంటికి సమీపంలోని శ్రీనివాస మెటర్నిటీ అండ్ నర్సింగ్ హోమ్ ఆసుపత్రి వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి వచ్చిన దుండగుడు ‘అన్నా’ అని పిలిచాడు. యాదగిరి వెనక్కు తిరిగి చూడగా.. దుండగుడు తన వద్ద ఉన్న తపంచాతో ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. ఓ తూటా యాదగిరి ఛాతి కింద భాగంలోకి దూసుకుపోయింది. దుండగుడు వరుసగా మూడు రౌండ్లు కాల్చగా ఒకటి మాత్రమే యాదగిరికి తగిలింది. వెంటనే ఆయన ప్రాణభయంతో షటర్ ద్వారా ఆస్పత్రిలోకి పరుగులు తీశాడు. నేరుగా వైద్యుడి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. దుండగుడు రహదారి వైపు వైద్యుడి గది కిటికీ అద్దాలను ధ్వంసం చేసి మరోసారి కాల్చేందుకు యత్నించాడు. దీంతో యాదగిరి ఆ గదిలోంచి ఆస్పత్రి లోపలికి పరుగులు పెట్టాడు. ఓ టాయిలెట్లో దూరి గడియ పెట్టుకున్నాడు. ఆస్పత్రిలోకి ప్రవేశించిన దండగుడు మరో రౌండ్ కాల్పులు జరుపుతూ టాయ్లెట్ వద్దకు వెళ్లాడు. దాని తలుపు పగులకొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో యాదగిరి టాయ్లెట్ గోడ పై భాగంలో ఉన్న అద్దాలను ధ్వంసం చేసి, కమోడ్ ఎక్కి పక్కనే పాథలాజికల్ ల్యాబ్లోకి దూకాడు. అక్కడ్నుంచి ఆస్పత్రి వెనుక డోర్ ద్వారా బయటకొచ్చి ప్రహరీ గోడ దూకేందుకు యత్నించినా కుదరలేదు. దీంతో అక్కడే ఉన్న గేటు ద్వారా బయటకొచ్చి రోడ్డుపై పరుగు తీశాడు. అప్పటికీ వెంటాడుతూ వచ్చిన దుండగుడు మరో రౌండ్ కాల్చాడు. ఈ సమయంలో దుండగుడితో పెనుగులాడిన యాదగిరి అతడి చేతిలోని తుపాకీ లాక్కొని వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి కింద పడిపోయాడు. అప్పటికే కాస్త దూరం వెంటాడిన దుండగుడు కింద పడిన యాదగిరి చనిపోయాడని భావించి జారుకున్నాడు. మొత్తమ్మీద ఆరు రౌండ్ల కాల్పులు జరపగా... నాలుగు ఖాళీ తూటాలు ఘటనాస్థలి, ఆస్పత్రి, దాని వెనుక భాగంలో పడి ఉన్నాయి. వైద్యానికి నిరాకరించిన డాక్టర్.. ఛాతీ కింది భాగంగా బుల్లెట్ గాయమైన యాదగిరి కాసేపటికి తేరుకొన్నాడు. దుండగుడు వెళ్లిపోవడంతో లేచి ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయాలని వైద్యుడిని కోరాడు. డాక్టర్ నిరాకరించడంతో ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి బోయిన్పల్లి పోలీసుస్టేషన్కు వెళ్లాడు. దుండగుడి నుంచి లాక్కున్న నాటు తుపాకీని పోలీసులకు అప్పగించి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు సికింద్రాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కాల్పుల ఉదంతంలో ఇద్దరు దుండగులు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఒకరు సహకరించగా... మరొకరు కాల్పులకు దిగినట్లు చెబుతున్నారు. ఘటనాస్థలికి చుట్టుపక్కల మార్గాల్లోని సీసీ కెమెరాలు ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రెండో తుపాకీ ఎక్కడిది? దుండగుడు కాల్పులకు దిగడంతో ఆస్పత్రిలోకి దూరిన యాదగిరి డాక్టర్ రూం వద్ద ఉన్న డస్ట్బిన్లో ఓ నాటు తుపాకీ పడేశాడు. ఆస్పత్రి వెనుక పెనుగులాటలో దుండగుడి నుంచి తుపాకీ లాక్కుని, దాన్ని పోలీసుస్టేషన్లో అప్పగించాడు. ఈ నేపథ్యంలో డస్ట్బిన్లో పడేసిన నాటు తుపాకీ ఎవరిదనే కోణంలో ఆరా తీస్తున్నారు. యాదగిరి దీన్ని తన వద్ద ఉంచుకుని సంచరిస్తున్నాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్పల్లి సమీపంలోని మచ్చ బొల్లారంలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు, యాదగిరిపై హత్యాయత్నానికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు యాదగిరిపై కాల్పులకు తెగబడింది హస్మత్పేటకు చెందిన పాత నేరగాడు డాకూరి బాబుగా తెలుస్తోంది. ఇతడు గతంలో హస్మత్పేట చెరువు వద్ద రియల్టర్ శివరాజ్ను హత్య చేశాడు. అది సుపారీ హత్య కావడంతో.. ఇది కూడా అదే తరహాకు చెందినదే అని అనుమానిస్తున్నారు. ఇతడు పోలీసు ఎదుట లొంగిపోగా విచారణ నిమిత్తం టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. యాదగిరి హత్యకు సుపారీ ఇచ్చిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. బాబుకు సహకరించాడని భావిస్తున్న మరో నిందితుడు రాజు పరారీలో ఉన్నాడని తెలిసింది.