Cost
-
వలసదారుల విమానాలకు అంత ఖర్చా..?
వాషింగ్టన్:డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు తిప్పి పంపుతున్నారు. ఈ విమాన ప్రయాణాల కోసం అమెరికా భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.పౌర విమానాల్లో కాకుండా వలసదారులను అమెరికా ప్రత్యేక సైనిక విమానాల్లో తరలిస్తుండటంతోనే ఎక్కువగా ఖర్చవుతోందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా 205 మంది భారతీయులతో కూడిన మిలిటరీ విమానం బయల్దేరింది. ఈ విమాన ఖర్చు గంటకు కొన్ని వేల డాలర్లని అమెరికా అధికారులు చెబుతున్నారు.వలసదారులను వెనక్కి పంపే కేంద్ర ప్రభుత్వ వర్గాల సమన్వయం కూడా ఉన్నట్లు సమాచారం. గతంలోనూ వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.అయితే భారత్ విషయంలో మాత్రం అమెరికాకు ఇదే తొలి అడుగు.వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఔరా! ఆ పుట్టగొడుగు.. ఐదు లక్షలట!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ అన్ని రంగాలతో పాటు ఆహార రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా విభిన్న రకాల ఆహారానికీ నగరం కేంద్రంగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే బంజారాహిల్స్లో నూతనంగా ప్రారంభమైన ఫుడ్స్టోరీస్ వేదికగా అక్షరాల రూ.5 లక్షల విలువ చేసే పుట్టగొడుగు (మష్రూమ్) అందరినీ ఔరా అనిపిస్తోంది. కాంటినెంటల్ ఫుడ్తో విభిన్న ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలకు నెలవైన నగరంలో మొట్టమొదటి సారి ఈ రిషీ మష్రూమ్ సందడి చేస్తోంది. పారిస్కు చెందిన ఆర్కిటెక్చరల్ ఏజెన్సీ మల్హెర్బే ఏర్పాటు చేసిన ఈ ప్రముఖ ఫుడ్స్టోరీస్ దేశంలో రెండోది కావడం విశేషం. ఈ ఫుడ్స్టోరీస్ వేదికగా ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన డియోర్, మోయెట్–హెన్నెస్సీ, పారిస్ ఏరోపోర్ట్, గివెన్చీ వంటి బ్రాండ్లు సందడి చేస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన పండ్లు, సుగంధ ద్రవ్యాలు, లగ్జరీ జపనీస్ చాక్లెట్లు, గ్లోబల్ ప్యాంట్రీ, చీస్, మాంసాహార ఉత్పత్తులు ఆకర్షిస్తున్నాయి. ఫుడ్స్టోరీస్ కిచెన్ స్టూడియో ఫుడ్ లవర్స్ను అలరిస్తోందని సహ వ్యవస్థాపకురాలు అష్ని బియానీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 వేలకు పైగా అత్యుత్తమ పదార్థాలను 4 గంటల్లోపు ఇంటికే డెలివరీ చేసే సేవలు ప్రారంభించామన్నారు. ఇదీ చదవండి: అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ -
దీపికా స్టైలిష్ డ్రెస్, చూడ్డానికి చాలా సింపుల్ : కానీ ధర తెలిస్తే షాక్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా భర్తతో రణ్వీర్తో కలిసి విమానాశ్రయంలో తళుక్కున మెరిసింది. ఈ సందర్బంగా లవబుల్ కపుల్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్లో ఫ్యాన్స్ను మురిపించారు. ఎప్పటిలాగానే నవ్వుతూ మీడియాకు ఫోజులిచ్చారు.కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత తల్లిదండ్రులుగా జంటగా కనిపించారు. ట్రెండింగ్ వైడ్ లెగ్ జీన్స్, పాప్లిన్ స్లిట్ షర్ట్లో చాలా సింపుల్గా కనిపించింది. కానీ ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?ఎయిర్పోర్ట్లో నల్ల చారల చొక్కా, ప్యాంట్ చాలా సింపుల్గా కంఫర్టబుల్గా చిక్ స్టైల్తో మెప్పించింది గ్లోబల్ ఐకాన్. లీ మిల్ కలెక్షన్కు చెందిన ఈ డ్రెస్ ధర 79,100. దీనికి జతగా సిటిజన్స్ ఆఫ్ హ్యుమానిటీ హై రైజ్ వైడ్ లెగ్ జీన్స్ను ధరించింది. దీని ధర సుమారు రూ. 39వేలే. (యాపిల్లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్బీఐ కన్ను?!)అంతేనా లగ్జరీ ఎలిమెంట్ను జోడిస్తూ లూయిస్ విట్టన్ సన్ గ్లాసెస్తో తన లుక్కి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఇంకా అద్భుతమైన కార్టియర్ శాంటాస్ డి కార్టియర్ వాచ్తో రూపాన్ని పూర్తి చేసింది, దీని ధర రూ.3,080,000. ఇదీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం Power couple Ranveer Singh and Deepika Padukone turn heads at the Mumbai airport with their effortless style and charm 💕#RanveerSingh #DeepikaPadukone #deepveer #Bollywood #iwmbuzz @RanveerOfficial @deepikapadukone pic.twitter.com/TE2Al4PK7J— IWMBuzz (@iwmbuzz) January 7, 2025 ఇక రణవీర్ సింగ్ తన జుట్టును పోనీ టైల్లో కట్టి, తన క్యాజువల్ బెస్ట్ డ్రెస్లో అందరికీ హాయ్ చెప్పాడు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూతురు దువాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల దీపిక 39వ పుట్టినరోజు (జనవరి,5)కు ఈ జంట మాల్దీవుల్లో సెల్రబేషన్స్ ముగించుకొని తిరిగి ముంబై చేరుకున్నారు. కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో కలిసి దీపికా కల్కి( Kalki ) సినిమాలో నటించింది. గర్భంతో ఉన్న మహిళగా నటనతో విమర్శకులను సైతం మెప్పించింది. ప్రెగ్నెంట్గా ఉన్నపుడే ఈ సినిమాలో నటించడం మాత్రమే కాదు, నిండు గర్భంతో ప్రమోషన్స్లో పాల్గొని అందర్నీ మెస్మరైజ్ చేసింది.ఈ ప్రమోషన్స్లో రూ.1.14 లక్షల విలువైన బ్లాక్ డ్రెస్తో ఆకట్టుకుంది. Magda రూ.41.500 విలువైన Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది. కోటి రూపాయల విలువచేసే బ్రేస్ లేట్ కూడా ధరించిన విషయం తెలిసిందే. -
రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో '2025 రేంజ్ రోవర్ స్పోర్ట్' రూ.1.45 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దేశీయ విఫణిలో తయారైన ఈ కారు ధర రూ.5 లక్షలు పెరిగింది. బ్రాండ్ ఇప్పుడు డైనమిక్ ఎస్ఈ వేరియంట్ను నిలిపివేసి.. స్థానికంగా తయారైన 'డైనమిక్ హెచ్ఎస్ఈ' వేరియంట్తో భర్తీ చేశారు.2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ.. 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 400 హార్స్ పవర్ అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 351 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతాయి.సాంటోరిని బ్లాక్, వారెసిన్ బ్లూ, ఫుజి వైట్, ఛారెంటే గ్రే, జియోలా గ్రీన్ అనే కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఆటో పార్కింగ్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్ రోడ్ క్రూయిజ్ కంట్రోల్, మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ అండ్ హీటెడ్ రియర్ సీట్లు వంటి వాటిని పొందుతుంది.కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్, లో స్పీడ్ మ్యాన్యువరింగ్ లైట్లు, డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లను పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. -
ఏడాదిలో 1,895 మందికి లేఆఫ్స్!
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ 2024 ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులను తగ్గించుకుంది. ఏడాదిలో శాశ్వత ఉద్యోగుల్లో 716 మంది పురుషులు, 618 మంది మహిళలను ఉద్యోగం నుంచి తొలగించింది. నాన్ పర్మినెంట్ సిబ్బంది విభాగంలో 531 మంది పురుషులు, 30 మంది మహిళలకు లేఆఫ్స్ ప్రకటించింది. నిర్వహణ అవసరాలకు అనుగుణంగా ఖర్చులను సర్దుబాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.వేతన మార్పులుపర్మినెంట్ ఉద్యోగుల్లో 74% మంది పురుషులు కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు కంపెనీ గుర్తించింది. ఇది గతంలో 61%గా ఉండేది. ఈ కేటగిరీలోని మహిళలు 37% నుంచి 56%కి పెరిగారు. నాన్ పర్మినెంట్ ఉద్యోగుల్లో కనీస వేతనం కంటే ఎక్కువ సంపాదించే పురుషులు 1 శాతం నుంచి 8 శాతానికి, మహిళలు 2 శాతం నుంచి 16 శాతానికి పెరిగారని సంస్థ పేర్కొంది.ఖర్చు తగ్గింపు: ఉద్యోగాల్లో కోతలు, వారికి అందించే ప్రయోజనాలు తగ్గించుకోవడం ద్వారా ఖర్చులు 9% తగ్గి రూ.770.44 కోట్లకు చేరుకున్నాయి.ఛైర్మన్ వేతనం: కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ సగటు ఉద్యోగి వేతనం కంటే 211 రెట్లు అధికంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో వేతనం, ఇతర అలవెన్స్ల రూపంలో ఆయన రూ.5.4 కోట్లు అందుకున్నారు.ఆర్థిక పనితీరుకంపెనీ మొత్తం ఆదాయం గతంతో పోలిస్తే 14 శాతం క్షీణించి రూ.8496.96 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణలో ఉన్న మొత్తం విమానాల సంఖ్య 76గా ఉండేది. ఇది 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 65కు తగ్గింది. ప్రస్తుతం స్పైస్ జెట్ 60 విమానాలను నడుపుతుండగా, బకాయిలు చెల్లించని కారణంగా కొన్ని విమానాలు నిలిచిపోయాయి.ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!నిధుల సమీకరణక్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా ఇటీవల కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరించింది. వీటితో ఇప్పటికే పెండింగ్లో ఉన్న జీఎస్టీ, టీడీఎస్ బకాయిలను చెల్లించి కీలక సెటిల్మెంట్లను పూర్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. స్పైస్ జెట్ 2026 నాటికి 100 విమానాలను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
హైదరాబాద్లో ఫ్లాట్ కొంటున్నారా..? ధరలు.. ఏ ఏరియాలో ఎంత?
సాక్షి, సిటీబ్యూరో: స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి రేట్లు పెరుగుతుండటంతో అపార్ట్మెంట్ల ధరలు సైతం పెరుగుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు, గృహాల సరఫరా తక్కువగా ఉంటుంది.కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్లో అంతర్జాతీయ మౌలిక వసతులు, హైరైజ్ ప్రాజెక్ట్లతో ఫ్లాట్ల ధరలు ఎక్కువ పలుకుతున్నాయి. కరోనా తర్వాత విశాలమైన అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో బిల్డర్లు హైరైజ్ ప్రాజెక్ట్లలో స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్ వంటి ఆధునిక వసతులను కల్పిస్తున్నారు.కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, నానక్రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటి పరిధిలో చ.అ.కు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పైగానే ధరలు ఉంటున్నాయి. నగరంలో అపార్ట్మెంట్ చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,500 ఖర్చవుతోంది. భవనం ఎత్తును బట్టి నిర్మాణ వ్యయం పెరుగుతూంటుంది.నోట్: అపార్ట్మెంట్ విస్తీర్ణం, వసతులు, ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్..!ఒక మీటర్ ఏకంగా..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి విన్నారా..?. ఈ ఫ్యాబ్రిక్ ఒక మీటర్ ఖరీదే దాదాపు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. ఇది మార్కెట్లో దొరకడం కూడా కష్టమే. ఖరీదు కూడా కళ్లు చెదిరే రేంజ్లో ఉంటుంది. ఏంటి ఈ ప్యాబ్రిక్ విశిష్టత..?. ఎందుకంత ఖరీదు అంటే..ఈ ఫ్యాబ్రిక్ ఉన్నిని దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాల్లో ఉండే వికునా అనే ఒక విధమైన ఒంటె నుంచి సేకరిస్తారట. అందువల్లే ఈ ఫ్యాబ్రిక్ని వికునా అని పిలుస్తారు. దీనితో టానీ అనే కోటులు డిజైన్ చేస్తారట. ఏదో గొర్రెల మాదిరి పెంపుడు జంతువుగా ఈ ఒంటెలను పెంచడం సాధ్యం కాదట. అలాగే ఈ ఒంటె నుంచి ఉన్ని ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సేకరించగలరట.అలాగే ఇవి తక్కువ ఉన్నినే ఉత్పత్తి చేస్తాయట. ఆండియాన్ ఎత్తైన పర్వతాల్లో ఉండే చలి నుంచి రక్షణగా ఆ ఒంటెలపై ఈ మృదువైన ఉన్ని ఉంటుందట. ఇది గాలిని ఏ మాత్రం చొరబడనీయకుండా శరీరానికి హత్తుకుపోయేల వెచ్చగా ఉంచుతుందట. అలాగే వికునాల నుంచి ఉన్నిని సేకరించడానికి చాలా సమయం పడుతుందట కూడా. అత్యంత జాగ్రత్తలు తీసుకుని చాలా ఓపికతో ఆ జంతువు నుంచి ఉన్నిని సేకరించాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఎవరు ధరిస్తారంటే..రాయల్టీకి చిహ్నమైన ఈ ఫ్యాబ్రిక్ని ఎక్కువగా సెలబ్రిటీలు, ప్రముఖులు ధరిస్తారు. అయితే ప్రస్తుతం స్పానిష్ ఆక్రమణతో ఈ జంతువుల అంతరించిపోయే జంతువులు జాబితాలో చేరిపోయిందని చెబుతున్నారు ప్యాషన్ నిపుణులు. అదీగాక ఈ జంతువుల పెంపకం సాధ్యం కానీ పని అయితే వాటి నుంచి ఉన్నిని సేకరించడం అనేది కూడా అత్యంత క్లిష్టమైన పని అందువల్లే ఈ ఉన్ని ఒక మీటరు ముక్క ధర సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందని చెబుతున్నారు ఫ్యాషన్ ఔత్సాహికులు.ఇప్పటి వరకు అత్యం లగ్జరియస్ ఫ్యాబ్రిక్లు అయిన మెరినో, కష్మెరె వంటి ఉన్ని దుస్తులు కంటే ఇదే అత్యంత ఖరీదైనది. అయితే మెరినో, కష్మెరె వంటివి అందుబాటులో ఉన్నంత ఈజీగా ఈ వికునా ఫ్యాబ్రిక్ ఉన్ని దొరకడం బహు కష్టం. ఈ ఉన్నితో చేసిన కోటు ధర రూ. 17 లక్షలకు పైనే ఉంటుందట. లోరో పియానా, బ్రియోని, కిటాన్తో సహా పలు ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ హౌస్ల్లో ఈ వికునా కలెక్షన్స్ ఉంటాయట.(చదవండి: మిసెస్ ఆసియాకు భారత్ తరపున మన హైదరాబాదీ..!) -
ఏం ఉందబ్బా హ్యాండ్బ్యాగ్ డిజైన్..! అచ్చం ఆకుకూరలా..
ఎన్నో రకాల బ్రాండెడ్ హ్యాండ్బ్యాగ్లు చూసుంటారు. అందాల భామలు, సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించే అత్యంత లగ్జరియస్ బ్యాగ్లను ఎన్నో రకాలు చూశాం. అయితే వాటన్నింటిని తలదన్నేలా అత్యంత వెరైటీ బ్యాగ్ని రూపొందించింది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ మోస్చినో. ఇటీవల కొన్ని ప్రముఖ బ్రాండ్లు అత్యంత హాస్యస్పదమైన రీతిలో బ్యాగ్లు డిజైన్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి ఈ లగ్జరీ బ్రాండ్ మోస్చినో కూడా చేరిపోయిందా అనిపిస్తుంది ఈ బ్యాగ్ డిజైన్ చూస్తే..ఎలా ఉందంటే..మోస్చినో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ హ్యండ్ బ్యాగ్ అచ్చం కొత్తిమీర కట్టలా కనిపిస్తుంది. అలా రూపొందించాలనే క్రియేటివిటీని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అచ్చం ఆకుకూర మాదిరిగా చక్కగా డిజైన్ చేశారు. ఇది డిజిటల్ ప్రింట్తో కూడిన కొత్తిమీర ఆకృతిలో ఉన్న పర్సు. ఇది త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్తో కనిపిస్తుంది. ఆ పర్సుపై కనిపించే ఆకులు కూడా సహజత్వం ఉట్టిపడేలా చాలా అద్భతంగా డిజైన్ చేశారు. దీని ధర వింటే మాత్రం అంత ఖరీదు అవసరమా అనే ఫీల్ తప్పక వస్తుంది. కొత్తిమీర ఆకృతిలో ఉన్న ఈ హ్యండ్బ్యాగ్ ధర అక్షరాల రూ. 3 లక్షలు పైనే ఉంటుందట. హైరేంజ్ ఫ్యాషన్ అంటే ఇదేనేమో. ఏం బ్రాండ్లో ఏమో..! క్రియేటివిటీలో మేటర్ నిల్ ధరలు మాత్రం వామ్మో.. అనేలా ఉన్నాయి కదూ..!.(చదవండి: సోనమ్ కపూర్ లేటెస్ట్ లెహంగా ..కానీ బ్లౌజ్ మట్టితో..!) -
‘నా ఉద్యోగం పోయింది, పీడా పోయింది’ : మహిళా టెకీ ఆనందం
దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా తయారయ్యాయి ఉద్యోగుల జీవితాలు. ఎపుడు, ఎందుకు, ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. ముఖ్యంగా సంక్షోభంలో చిక్కుకున్న ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. ఇక మహిళా ఉద్యోగుల పరిస్థితి గురించి చెప్పనక్కరలేదు. కానీ ఒక మహిళా టెకీ మాత్రం ఆ తొక్కలో ఉద్యోగం పోతే పోయింది అంటోంది. ఏడాదికి రూ. 76 లక్షల జీతం వచ్చే ఉద్యోగం పోయినా చాలా సంతోషంగా ఉన్నా అంటోంది 24 ఏళ్ల యాక్చురియల్ అనలిస్ట్ . స్టోరీ ఏంటంటే..!మనీ కంట్రోల్ కథనం ప్రకారం చికాగోలోని డెలాయిట్ కంపెనీలో అననిష్ట్గా పనిచేది సియెర్రా డెస్మరాట్టి. ఏడాది రూ. 76 లక్షల వేతనంతో 2022లో ఉద్యోగంలో చేరింది. అయితే ఐటీ రంగ సంక్షోభం,కాస్ట్ కటింగ్లో భాగంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ. మామూలుగా అయితే నా ఉద్యోగం పోయింది అని అందరం డీలా పడిపోదాం, ఏడ్చి గగ్గోలు పెడతాం కదా, కానీ సియెర్రా మాత్రం ఎగిరి గంతేసిందట. దాదాపు సంవత్సరం కాలం తరువాత ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. జీవితంలో ఏం జరిగినా మన మంచికే అను సానుకూల ధోరణే తన సంతోషానికి కారణమని చెప్పుకొచ్చింది. జీవితంలో తనకేదైనా మంచి జరిగిందంటే, అది ఉద్యోగం పోవడమేనని తెలిపింది. ‘‘రోజంతా కుర్చీలో కూర్చొని కూర్చొని వెన్నునొప్పి వచ్చింది. తొమ్మిది కిలోల బరువు పెరిగా, పొట్టి బట్టలేసుకుని తోటి ఉద్యోగుల ముందు నడవం నా వల్ల కాలే...’’ అంటూ తన ఇబ్బందులను ఏకరువు పెట్టింది. 11 గంటల పనితో, మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురయ్యానని పేర్కొంది. రూ. 76 లక్షల జీతం గురించి కూడా ఆమె పెద్దగా బెంగపడలేదు. జీతమే జీవితంకాదు. పొద్దుపు చేసిన డబ్బుతో కొన్నాళ్లు గడిపి, తరువాత ట్రాన్స్అమెరికాకు చెందిన కంపెనీలో యాక్చురియల్ అనలిస్ట్గా రిమోట్ ఉద్యోగాన్ని సాధించి ఇపుడు నేను చాలా హ్యాపీ అంటోంది సియెర్రా. కొత్త ఉద్యోగం పాతదిలాగే ఉన్నప్పటికీ పని సంస్కృతి చాలా భిన్నంగా ఉందట. కొత్త వర్క్ప్లేస్లోని ఉన్నతాధికారులు డ్యూటీ ముగియగానే ఆఫీసు నుంచి వెళ్లిపోవచ్చంటారట. దీంతో తనకు కొంత సమయం మిగిలుతోందని చెప్పింది ఆనందంగా.సో..అదన్నమాట..! పోయినదాని గురించి బాధపడుతూ కూచుంటే ప్రయోజనం ఉండదు. ఇదీ మన మంచికే అనుకొని మరో కొత్త అవకాశాన్ని వెదుక్కోవడమే. మనసుంటే మార్గం ఉంటుంది.. కాదు కాదు.. టాలెంట్ ఉంటే కొలువు వెతుక్కుంటూ వస్తుంది!ఇదీ చదవండి: కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి! -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ఏకంగా ఓ లగ్జరీ కారు ధర..!
పురుగే కదా అని తీసిపారేయ్యకండి. ఎందుకంటే..? కొన్ని పురుగులు మనం ఊహించనంత ఖరీదైనవిగా కూడా ఉంటాయి. అలాంటి కోవకు చెందిందే ఈ కీటకం. ఈ పురుగు ధర వింటే నోరెళ్లబెడతారు. అంత ధర ఎందుకంటే..?ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో 'స్టాగ్ బీటిల్' ఒకటి. ఒక స్టాగ్ బీటిల్ విలువ ఏకంగా రూ. 75 లక్షలు. ఎందుకుంటే దీన్ని అదృష్ట చిహ్నంగా పరిగణిస్తారట. ఈ కీటకాన్ని ఉంచుకుంటే ఒక్క రోజులనే లక్షాధికారి అవుతారని నమ్ముతారట. ఈ కీటకాలు చెక్కలపై ఆధారపడి జీవించే జీవి. అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. లండన్ ఆధారిత నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం.. ఈ కీటకాలు 2 నుంచి 6 గ్రాముల మధ్య బరువు ఉంటాయి. సగటు జీవితకాలం 3 నుంచి 7 ఏళ్లు. మగవారి పొడవు 35 నుంచి 75 మిమీ అయితే, ఆడవారు 30 నుంచి 50 మిమీ పొడవు. వీటిని ఔషధ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు.అవి ఎక్కడ ఉంటాయంటే?స్టాగ్ బీటిల్స్ వెచ్చని, ఉష్ణమండల వాతావరణంలో వృద్ధి చెందుతాయి. చల్లని ఉష్ణోగ్రతలు వీటికి పడదు. ఇవి సహజంగా అడవులలో నివసిస్తాయి. ఎక్కువగా ముళ్లపొదలు, సాంప్రదాయ తోటలు, పార్కులు, తోటలు వంటి పట్టణ ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి. ఇవి చనిపోయిన వృక్ష కలపను ఆవాసంగా చేసుకుని జీవిస్తాయి. ఏమి తింటాయంటే..?అడల్ట్ స్టాగ్ బీటిల్స్ ప్రధానంగా చెట్ల సాప్ ద్రవాన్ని, కుళ్ళిన పండ్ల నుండి వచ్చే రసం వంటి తీపి ద్రవాలను తింటాయి. లార్వాదశలో ఇవి తీసుకొన్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే అధికంగా ఆధారపడతాయి. తొలిదశలో ఇవి కలపను తన పదునైన దవడలతో చీల్చి తింటాయి. కేవలం చనిపోయిన మొక్కల కలపనే తింటాయి. అయితే చక్కటి వృక్ష సంపదకు హాని చేయవు. కేవలం మృత వృక్షాలను మాత్రమే ఆహారంగా తీసుకొంటాయి.(చదవండి: మిస్ సుప్రానేషనల్ 2024 టైటిల్ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ!) -
బొమ్మరిల్లు ముద్దుగుమ్మ జెనిలియా డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు ‘వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ’ డైలాగ్ ఎంతమంది అబ్బాయిల మైండ్స్లో నాటుకుపోయిందో! ‘బొమ్మరిల్లు’లో అలా అడిగిన హ..హ..హాసిని.. జెనీలియా కూడా ఎంతమంది కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టిందో! ఇప్పటికీ ఆమె పట్ల అదే క్రేజ్ చిన్న నుంచి పెద్ద వరకు. ఆమె గ్లామర్కీ అదే గ్రేస్..ఆడవాళ్లకు మెరిసే ముక్కుపుడక ఇచ్చే అందమే వేరు. నా దృష్టిలో ఆడవాళ్ల జ్యూలరీలో ముక్కుపుడకను మించింది లేదు. అలాగే చీరకట్టును బీట్ చేసే ట్రెడిషనల్ వేర్ లేదు! అని అంటోంది జెనీలియా. ఇక ఆమె ట్రెడిషనల్ వేర్లో అయినా.. మోడర్న్ డ్రెస్లో అయినా! దేన్నయినా ఫ్యాషన్గా మలచుకోగల స్టయిల్ జెనీలియాది!. ఆ స్టయిల్ కోసం జెనీలియా ఈ బ్రాండ్స్నీ కన్సిడర్ చేస్తుంది. ఒసా బై ఆదర్శ్ వెడ్డింగ్ కలెక్షన్స్కి కేరాఫ్ ఇది. దీని స్థాపకుడు ఆదర్శ్ మఖ్రియా. దేశంలోని సంప్రదాయ వస్త్రరీతులన్నిటికీ తన బ్రాండ్ని పడుగు.. పేకలుగా మార్చాడు. ఎంబ్రాయిడరీ, అప్లిక్ వర్క్లతో పెళ్లి వస్త్రాలకు కొత్త కళను అద్దుతాడు. అందుకే ఈ డిజైన్స్కి డిమాండ్ ఎక్కువ. కోల్కతా, ఢిల్లీల్లో స్టోర్స్ ఉన్నాయి. మల్టీడిజైనర్ స్టోర్స్లోనూ ఈ బ్రాండ్ అందుబాటులో ఉంటుంది. ధర మాత్రం సామాన్యులకు అందేలా ఉండదు. .జెనిలియా ధరించిన ఒసా బై ఆదర్శ్ డ్రెస్ ధర రూ. 1,77,555 నారాయణ్ జ్యూలర్స్ 80 ఇయర్స్ ఓల్డ్ బ్రాండ్ ఇది. సంప్రదాయ నగలు.. ఆధునిక ఆభరణాలు.. రెండిటికీ పెట్టింది పేరు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజీలేని నాణ్యత.. కల్తీకాని నమ్మకానికి పర్యాయపదం ఈ జ్యూలర్స్. ధర.. ఆభరణాల డిజైన్, క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ద పింక్ పోట్లీ ఇది ముంబై బ్రాండ్. హ్యాండీ క్రాఫ్ట్స్ బ్యాగ్స్, పోట్లీలు, బట్వాలకు ప్రసిద్ధి. దీపా, ప్రణతి అనే తల్లీకూతుళ్ల ఆవిష్కార ఈ పింక్ పోట్లీ. ప్రొడక్షన్ విషయాలు దీపా చూసుకుంటే బ్రాండింగ్, మార్కెటింగ్, బిజినెస్ వ్యవహారాలు ప్రణతి చూసుకుంటుంది. ఆలియా భట్, కరీనా కపూర్, సోనం కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలెందరో దీనికి హాట్ ఫేవరేట్స్. ధరలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. జ్యూలరీ బ్రాండ్: నారాయణ్ జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: జయ బచ్చన్ జుట్టు రహస్యం ఇదే..!) -
తన ప్రత్యేకత సిల్వర్ స్క్రీనే కాదు.. ఇన్స్టా ప్యాషన్ కూడా..
ప్రియంకా మోహన్.. నటించబోయే నెక్స్›్ట మూవీ కోసం ఎంతమంది ఎదురుచూస్తారో.. సోషల్ మీడియాలో ఆమె నెక్స్›్ట ఫొటో కోసమూ అంతేమంది వేచి చూస్తుంటారు. దీన్నిబట్టే చెప్పొచ్చు స్టోరీస్ సెలెక్షన్లో ప్రియంకా ఎంత ప్రత్యేకంగా ఉంటుందో! సిల్వర్ స్క్రీన్ కథే కాదు.. ఇన్స్టాలోని ఫ్యాషన్ స్టోరీనూ! ఆ స్టోరీ టెల్లింగ్లో ఈ బ్రాండ్స్ కూడా పార్ట్నర్సే! అకోయ జ్యూలరీ.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ట్రెండ్కి తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్లో తెగ క్రేజ్ సంపాదించుకుంటోంది. ఆ క్రేజే ఈ బ్రాండ్ను సెలబ్రిటీలకూ దగ్గర చేస్తోంది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్లైన్ లోనే కొనుగోలు చేసే వీలుంది. దేవ్నాగరి.. అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియంకా.. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నారు. కానీ అమ్మమ్మ స్ఫూర్తితో చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవ్నాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లో ఈ డిజైన్స్ లభిస్తాయి. చీర బ్రాండ్: దేవ్నాగరి, రూ. 57,000 జ్యూలరీ బ్రాండ్: అకోయ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇవి చదవండి: Alia Bhatt: తనకు 'ఆలూ' అనే ముద్దు పేరు ఎలా వచ్చిందో తెలుసా! -
రూ. 450తో వ్యాపారం.. నెలల వ్యవధిలో రోజుకు రెండు వేల ఆదాయం!
దేశంలోని చాలామంది రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ రకాల వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ఆవులు, గేదెల పెంపకాన్ని వదిలి కోళ్ల పెంపకంవైపు దృష్టి సారిస్తున్నారు. ఇది వారికి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. ప్రస్తుతం దేశీ కోడి మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చిన్న, సన్నకారు పశుపోషకులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. బీహార్లోని బెగుసరాయ్ జిల్లా భగవాన్పూర్ బ్లాక్కు చెందిన ముఖేష్ పాశ్వాన్ భార్య సంగీతా దేవి గతంలో గేదెలను పోషిస్తూ ఆదాయాన్ని ఆర్జించేవారు. దీనిలో అంతగా లాభాలు లేకపోవడంతో ఆమె దేశవాళీ కోళ్లను వాణిజ్యపరంగా పెంచడం ప్రారంభించారు. బీహార్ ప్రభుత్వం అందించే జీవిక ఐపీడీఎస్ థర్డ్ ఫేజ్ పథకం కింద రూ.450 వెచ్చించి, 25 దేశీకోళ్లను కొనుగోలు చేసి వాటి పెంపకాన్ని చేపట్టినట్లు సంగీత మీడియాకు తెలిపారు. ఆమె దేశవాళీ కోళ్లతో పాటు కడక్నాథ్, సోనాలి, ఎఫ్ఎఫ్జీ జాతుల కోళ్లను కూడా పెంచసాగారు. కోడి మాంసంతో పాటు గుడ్లు, కోడిపిల్లలను సిద్ధం చేయడం ద్వారా ఆమె వ్యాపారాన్ని మరింత వృద్ధి చేశారు. ఇప్పుడు గ్రామానికి చెందిన పలువురు మహిళలు సంగీత దగ్గర దేశీ కోళ్ల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు వస్తున్నారు. 25 కోళ్లతో వ్యాపారం ప్రారంభించిన ఆమె దగ్గర ప్రస్తుతం 100 కోళ్లు ఉన్నాయి. స్థానికంగా కోడి గుడ్డు ధర మార్కెట్లో రూ.20 వరకూ ఉంది. ప్రస్తుతం ఆమె పెంచుతున్న కోళ్ల నుంచి ప్రతిరోజూ రూ. 200 విలువైన గుడ్లు వస్తున్నాయి. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కోడి మాంసం సిద్ధమవుతోంది. వీటిని విక్రయిస్తూ ఆమె రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఆదాయాన్ని అందుకుంటోంది. -
'హలో' మూవీ భామ చీర ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!
దర్శకుడు ప్రియదర్శన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన కల్యాణి విభిన్న పాత్రలు పోషిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. హీరోయిన్గా రాణిస్తోంది. నటిగా గుర్తింపులో ఆమె ఎంచుకుంటున్న పాత్రలు.. ఆమె అభినయం తోడవుతుంటే.. హీరోయిన్గా రాణించడానికి మాత్రం ఆమె అనుసరిస్తున్న ఫ్యాషన్ అండ్ స్టయిలే హెల్ప్ అవుతున్నాయి. అలా హెల్ప్ అవుతున్న బ్రాండ్స్లో కొన్నిటి గురించి.. దీప్తి.. హైదరాబాద్కు చెందిన డిజైనర్ దీప్తి పోతినేని.. 1980ల నాటి ఫ్యాషన్ను పునః సృష్టించడంలో సిద్ధహస్తురాలు. అప్పటి పట్టు, ప్యూర్ ఆర్గంజా, టిష్యూ, కాటన్ ఫ్యాబ్రిక్స్తో రూపొందించే యూనిక్ డిజైనర్ చీరలు దీప్తిని ఎయిటీస్ స్పెషలిస్ట్ డిజైనర్గా నిలబెట్టాయి. ఎక్కువగా సంప్రదాయ ఎంబ్రాయిడరీనే వాడుతుంటుంది. ఈ మధ్యనే తన పేరు మీదే హైదరాబాద్లో ఓ ఫ్యాషన్ హౌస్నూ ప్రారంభించింది. డిజైన్ ను బట్టే ధరలు ఉంటాయి.. వేల నుంచి లక్షల్లో! ఆన్ లైన్ లోనూ లభ్యం. కళ్యాణ్ జ్యూలర్స్.. టాప్–100 విలాసవంతమైన బ్రాండ్స్లో కల్యాణ్ జ్యూలర్స్ ఒకటి. 1908లో ప్రారంభమైన ఈ సంస్థకు ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రముఖ నగరాల్లో మొత్తం 150 బ్రాంచ్లున్నాయి. సరికొత్త డిజైన్సే దీని బ్రాండ్ వాల్యూ అయితే కొనుగోలుదారుల నమ్మకం ఈ బ్రాండ్కి యాడెడ్ వాల్యూ. నాణ్యత, డిజైన్ను బట్టే ధరలు. ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూలరీ బ్రాండ్: కల్యాణ్ జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చీర డిజైనర్: దీప్తి (రూ.52,800) కంఫర్ట్ జోన్లో గ్రోత్ ఉండదు. గ్రోత్ జోన్లో కంఫర్ట్ ఉండదు. నేను ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా. అందుకే అప్పుడప్పుడు.. ఎంచుకునే పాత్రల్లో, ఫ్యాషన్లో ప్రయోగాలు చేస్తుంటా! – కల్యాణీ ప్రియదర్శన్. ఇవి చదవండి: హెల్త్: 'మెగా షేప్ మసాజర్' తో.. ఫిట్నెస్ సెంటర్స్కి చెక్! -
అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ...
భూమిమీద బతికే మనిషికి అన్నీ సమస్యలే... ఇంటి రెంట్ మొదలుకొని ఇన్స్యూరెన్స్ వరకూ అన్నీ మోయలేనంత భారమే. అందుకే దీనికి పరిష్కారం క్రూయిజ్ షిప్లో బతకడం అంటూ తేల్చిపారేస్తున్నారు జాన్, హెన్సెస్సీ దంపతులు. క్రూయిజ్ షిప్లో నివసించడం అంటూ మొదలుపెడితే మీరు యుటిలిటీ బిల్లులు, ఆటో బీమా, ఆస్తి బీమా మొదలైనవి అస్సలు చెల్లించాల్సిన అవసరం లేదని జాన్, హెన్సెస్సీలు ముక్తకంఠంతో చెబుతున్నారు. క్రూయిజ్ షిప్లో నివసించేందుకు సిద్ధమైన జాన్, హెన్సెస్సీ దంపతులు 2020లో ఫ్లోరిడా(అమెరికా)లోని తమ ఇల్లు, వ్యాపారం, విలువైన వస్తువులను విక్రయించేశారు. రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైన్స్లో 274 రోజుల ప్రయాణం కోసం టిక్కెట్లను కొనుగోలు చేశారు..‘ఇప్పుడు మేము టెలిఫోన్ బిల్లు, షిప్పింగ్ బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని క్రెడిట్ కార్టు మా దగ్గర ఉన్నాయి. ఇకపై మేము ఇంటి అద్దె, వాహన బీమా, ఆస్తి బీమా, యుటిలిటీ బిల్లులు... ఇలా పెద్ద జాబితాను చెల్లించాల్సిన అవసరం లేదు’ అని ఆ దంపతులు పేర్కొన్నారు. ఈ దంపతులు త్వరలో రెసిడెన్షియల్ క్రూయిజ్ షిప్ ఎక్కనున్నారు. దానిలో వారు క్యాబిన్ను కొనుగోలు చేశారు. ఇందుకోసం వారు ‘విల్లా వీ’ని ఎంచుకున్నారు. ఇది శాశ్వత నివాసాన్ని అందించే తొలి క్రూయిజ్ షిప్లలో ఒకటి. దీనిలోని ప్రయాణికులలో 30శాతం మంది పూర్తి సమయం దీనిలోనే ఉంటారు. మిగిలిన 85శాతం ప్రయాణికులు యూఎస్ పౌరులు. ఈ క్రూయిజ్ షిప్లోని క్యాబిన్ ధర 99 వేల డాలర్లు(ఒక డాలర్ రూ. 83). సీ వ్యూ కలిగిన బాల్కనీ విల్లాల ధర 249 వేల డాలర్లు. క్యాబిన్లలో కిచెన్, అతిథుల కోసం లివింగ్ రూమ్లో పుల్ డౌన్ బెడ్ ఉంటాయి. ఇందులో నివాసం కల్పించుకున్నవారు పోర్ట్ ఛార్జీలు చెల్లించాక తమ కుటుంబాలను ఉచితంగా ఆన్బోర్డ్లోకి తీసుకువచ్చేందుకు అనుమతివుంటుంది. ‘విల్లా వీ’ సీఈఓ మైకేల్ పెటర్సన్ మీడియాతో మాట్లాడుతూ తమ షిప్లోని దాదాపు సగం క్యాబిన్లలో వ్యాపార యజమానులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారన్నారు. కాగా జాన్, హెన్సెస్సీ దంపతులు క్రూయిజ్లో ఉంటూనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు నడుస్తుంటారు. ఈ భారీ షిప్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూగోళాన్ని చుట్టుముడుతుంది. వెచ్చని వాతావరణంలో ఉండేందుకు సూర్యుడిని అనుసరిస్తుంది. జాన్, హెన్సెస్సీ దంపతులు తమకు కనిపించినవారందరికీ ఈ భూమిమీద నివసించడం కన్నా ఇలా క్రూయిజ్ షిప్లో బతకడమే చౌకైనదని, అదే ఉత్తమమని సలహా ఇస్తుంటారు. ఇది కూడా చదవండి: పాక్ రాజకీయాల్లో పెను సంచలనాలు! -
పెళ్లి చూపులు భామ ధరించిన గూలబీ రంగు చీర ఎంతంటే..
రితు వర్మకు నటన ఒక ప్యాషన్. అందుకే రాశి కన్నా వాసికే విలువ ఇస్తుంది. మంచి పాత్రలతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ విషయంలో కూడా స్టయిల్ కన్నా సౌకర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్నామంటే మన లుక్ను పర్ఫెక్ట్గా మెయిన్టేన్ చేయాల్సిందే! అలాగయితేనే ఇండస్ట్రీలో నెగ్గుకురాగలం అంటోంది రితు వర్మ. ఇక ఆమె కంఫర్ట్గా ఫీలయ్యే బ్రాండ్స్లో ఓ రెండిటి గురించి.. మద్దిన్ మధురిత దత్తా, స్తాంజిన్ డాజిస్.. బిజినెస్ పార్ట్నర్సే కాదు మంచి స్నేహితులు కూడా! ఫ్యాషన్ పై వారికి ఉన్న అభిరుచి, ఆలోచనలు ఏకమవడంతో ఇద్దరూ కలసి కెరీర్ను స్టార్ట్ చేశారు. ముంబైలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2012లో తమ ఇద్దరి పేరుతోనే ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్నే ఉపయోగిస్తారు. ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన, సంప్రదాయ డిజైన్స్లో వీరిది పెట్టింది పేరు. ఈ బ్రాండ్ వేర్ ధర కాస్త ఎక్కువే. ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటుంది. శీతల్ జవేరి జ్యూయెల్స్.. నాటి.. ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్లో శీతల్ జవేరి జ్యూయెల్స్ ఒకటి. నాణ్యత, నైపుణ్యమే దీని బ్రాండ్ వాల్యూ. సంప్రదాయ నగలతోపాటు మోడర్న్ డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర క్వాలిటీ, డిజైన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్లోనూ లభ్యం. ఈ శీతల్ జవేరి జ్యూయెల్స్ బ్రాండ్ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: క్యూట్లుక్తో కట్టిపడేసే కృతి సనన్ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..) -
హైదరాబాద్ టూ అమెరికా: ఇలా చేస్తే తక్కువ ధరకే విమాన టికెట్లు!
అమెరికా వెళ్లే ప్రయాణికులు కాస్త ముందస్తు ప్లానింగ్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో అమెరికా ప్రయాణం చేయొచ్చు. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి అమెరికాకు ప్రయాణం చేసే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. మాములుగా అమెరికా వెళ్లే ప్రయాణికులు ఆన్ లైన్ లో తమకు నచ్చిన వెబ్ సైట్ లో అమెరికా వెళ్లేందుకు టికెట్ రేట్ ఎంత ఉందో ప్రయాణానికి కొన్ని రోజుల ముందు ప్లాన్ చేసుకుంటారు. మరికొంత మంది అయితే ఎక్కువ స్టాప్స్ ఉండే ఫ్లైట్ లను ఎంచుకుంటే తక్కువ ధర లో టికెట్ దొరుకుతుందని వెదుకుతారు. అలా సాధారణంగా ట్రై చేయకుండా మేం చెప్పే విధంగా ట్రై చేస్తే మీరు తక్కువ ఖర్చుతోనే అమెరికా వెళ్లొచ్చు. సాధారణంగా అయితే అమెరికా లోని న్యూయార్క్ నగరానికి వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులు హైదరాబాద్ నుండి న్యూయార్క్ కి టికెట్ బుక్ చేసుకుంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ముంబై వరకు డొమెస్టిక్ ఫ్లైట్ లో తీసుకువెళ్లి అక్కడి నుండి ఇస్తాంబుల్ వరకు ఇంటర్ నేషనల్ ఫ్లైట్ తీసుకువెళ్లి మళ్లి అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ లో న్యూయార్క్ కి చేరుకుంటారు. ఇలా అయితే సాధారణ ప్రయాణం కోసం టికెట్ బుక్ చేసుకుంటే ఇండిగో ఎయిర్ లైన్స్ అయితే సుమారు లక్ష రూపాయల నుండి లక్షన్నర వరకు టికెట్ చార్జ్ అవుతుంది. ఇలా ట్రై చేయండి, బోలెడంత డబ్బు ఆదా హైదరాబాద్ నుండి న్యూయార్క్ కి కొన్ని ప్రయోగాలు చేస్తే మీరు చాలా తక్కువ ఖర్చుతో నే అమెరికా వెళ్లొచ్చు. అది ఎలా అంటే మొదట హైదరాబాద్ నుండి నేరుగా దుబాయ్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే ఒక ప్రయాణికునికి ఒక నెల ముందు టికెట్ తీసుకుంటే సుమారు 10వేల నుండి 12వేల వరకు ఛార్జ్ అవుతుంది. దుబాయ్ నుండి న్యూయార్క్ కి టికెట్ సెపరేట్ గా బుక్ చేసుకుంటే సుమారు 43వేల నుండి 48 వేలల్లోనే టికెట్ లభిస్తుంది. మొత్తం కలిపితే రూ. 60 వేలు మాత్రమే అవుతుంది. దీంతో హైదరాబాద్ నుండి ముంబై మీదుగా ఇస్తాంబుల్ నుండి న్యూయార్క్ వెళితే ఒకలక్ష 25వేల నుండి లక్షన్నర వరకు అయ్యే ఖర్చు… అదే దుబాయ్ వెళ్లి అక్కడి నుండి న్యూయార్క్ కి బుక్ చేసుకుంటే కేవలం 60 వేల నుండి 70వేల తక్కువ ధరతోనే ప్రయాణం కంప్లీట్ అవుతుంది. ఇలా చేయడంతో వెయిటింగ్ పీరియడ్ తప్పడంతో పాటు ఇతర దేశాలను చూసే వీలు కూడా ఉంటుంది. కాకపోతే అరైవల్ ఆన్ వీసా ఉన్న దేశాలకు అయితే మీకు సులంభంగా అవుతుంంది. లేకుంటే వీసా దేశాలు అయితే మళ్లీ వీసా కోసం సెపరేట్ గా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరొక విధంగా ట్రై చేయాలనుంటే అమెరికాలోని న్యూయార్క్ వెళ్లానుకుంటే ముందుగా హైదరాబాద్ నుండి శ్రీలంక దేశ రాజధాని కొలంబోకు టికెట్ బుక్ చేసుకుంటే ఒక వ్యక్తికి సుమారు 11వేల రూపాయల్లో టికెట్ వస్తుంది. కొలంబో నుండి న్యూయార్క్ కి టికెట్ బుక్ చేసుకుంటే సుమారు 56వేల రూపాయాల్లోనే టికెట్ దొరుకుతుంది. అంటే సుమారు 67వేల రూపాయలతో అమెరికాలోని న్యూయార్క్ కి చేరుకోవచ్చు. అదేవిధంగా శ్రీలంక దేశం కూడా చూసినట్లవుతుంది. కాబట్టి కొంచెం ట్రిక్కులు ప్లే చేస్తే ఇతర దేశాలను చూసినట్లుంటుంది తక్కువ ఖర్చుతోనే ప్రయాణం కంప్లీట్ అవుతుంది. -మంగ వెంకన్న, సాక్షి టీవీ -
ఇండియా పేరు 'భారత్'గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే?
గత కొన్ని రోజుల నుంచి ఇండియా పేరుని భారత్గా మార్చాలనే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీని కోసం 2023 సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగస్టు 31న ప్రకటించారు. అయితే ఇండియా పేరు భారత్గా మారిస్తే.. ఎలాంటి ఆర్థిక పరిణామాలు ఎదురవుతాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఔట్లుక్ బిజినెస్ నివేదికల ప్రకారం, ఇండియా భారత్గా మారాలంటే ఏకంగా రూ. 14 వేలకోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కొన్ని దేశాలు పేర్లు మార్చుకోవడం వల్ల ఎంత ఖర్చయింది అనే వివరాల ఆధారంగా ఇంత పెద్ద మొత్తం ఖర్చు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2018లో ఆఫ్రికాలోని స్వాజిల్యాండ్ దేశం పేరుని ఎస్వంటిని (Eswantini)గా మార్చడానికి సుమారు 60 మిలియన్ డాలర్లు ఖర్చయినట్లు ప్రముఖ న్యాయవాది 'డారెన్ అలివర్' గణాంకాలు వెల్లడించాయి. అంతే కాకుండా ఈయన ప్రకారం ఒక పెద్ద దేశం సగటు మార్కెటింగ్ బడ్జెట్ దాని మొత్తం ఆదాయంలో దాదాపు 6 శాతం వరకు ఉంటుంది. కాగా రీబ్రాండింగ్ కోసం మొత్తం మార్కెటింగ్ బడ్జెట్లో 10 శాతం వరకు ఖర్చవుతుంది. అలివర్ సూత్రం ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆదాయం మొత్తం రూ.23.84 లక్షల కోట్లు. కావున అలివర్ (Oliver) సూత్రం ప్రకారం రూ. 23.84 లక్షల కోట్లు × 0.006 = రూ. 14,304 కోట్లు (రీబ్రాండింగ్ మొత్తం). ఈ విధంగా భారత్ పేరుగా ఇండియా స్థిరపడాలంటే వేలకోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇండియా అన్న పేరుని భారత్గా మార్చితే.. ఇండియా పేరు ఉన్న ప్రతి చోటా (కరెన్సీ నోట్ల మీద, ఆధార్, పాన్, ప్రభుత్వ సంస్థలు ఇలా) భారత్ అనే పదం చేర్చాలి వస్తుందని, ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఇలా అయితే ఎలా గురూ.. కేవలం 48 గంటల్లో అన్నీ బుక్కయిపోయాయ్! ఇప్పటికే భారతదేశంలోని కొన్ని నగరాల పేర్లు కూడా మార్చడం జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం ఛత్రపతి శంభాజీనగర్గా.. హోషంగాబాద్ 2021లో నర్మదాపురంగా, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నగరం 2018లో ప్రయాగ్రాజ్గా పేరు మార్చింది. అలహాబాద్ పేరు మార్చడం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 300 కోట్లకు పైనే ఖర్చు అయినట్లు ఇండియా టుడే గతంలో నివేదించింది. ఈ లెక్క ప్రకారం ఇండియా.. భారత్గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చు అవుతుందో ఊహించవచ్చు. -
అందాల భామ ఆలియా ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
కెరీర్ కెరీరే.. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే! దేనినీ దేనికోసం వదులుకోవడంలేదు నేటి నటీమణులు! అందుకే గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్నా.. పెళ్లి.. పిల్లలు.. కుటుంబం విషయంలో కాంప్రమైజ్ కావడంలేదు. ఆ లిస్ట్లో చాలామందే ఉన్నా.. ఇక్కడ చెప్పుకుంటోంది మాత్రం బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ గురించి.. ఇక ఆమె తన గురించి చెబుతూ.. నా మనసు చెప్పిందే వింటాను. జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం. జీవితమే మనకు ప్లాన్ ఇస్తుంది అని అంటోంది ఆలియా. ఈ సందర్భంగా గ్లామర్ ప్రపంచంలో ఒకఆమె క్రియేట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్ గురించి! ఆ ట్రెండ్లో పార్ట్నర్స్ అయిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మనీష్ మల్హోత్రా.. డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. ఫ్యాషన్ వరల్డ్కి బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఈ డిజైనర్.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా సినీపరిశ్రమలోనూ తన స్థానం పదిలం చేసుకున్నాడు. అయితే అతని డిజైన్స్ని సామాన్యుడు అందుకోవాలంటే మాత్రం కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లోనూ లభ్యం. ఇంతకీ ఆలియా ధరించిన మల్హోత్రా డిజైనర్ చీర ధర రూ. 1,35000/- ఆమ్రపాలి జ్యూలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు.. రాజపుత్రుల నుంచి గిరిపుత్రుల వరకు వారి కళను, వారు ధరించే ఆభరణాలను ఆధునిక తరానికి చూపించాలనే ఉద్దేశంతో జైపూర్లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియమ్ను స్థాపించారు. దాని సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి వాటినే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. అలా ఆమ్రపాలి బ్రాండ్ మొదలైంది. డిజైన్ మాత్రమే యాంటిక్ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్ యాంటిక్ పీస్ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆమ్రపాలికి ఆన్లైన్ మార్కెట్టూ విస్తృతమే. (చదవండి: స్టన్నింగ్ లుక్తో మెరిసిపోతున్న రకుల్ ధరించిన చీర ధర ఎంతంటే..) -
అతియా, అనుష్కాలు ధరించిన టాప్ ధర వింటే..షాకవ్వాల్సిందే!
సెలబ్రెటీలు ధరించే డ్రెస్లు ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి. వాటి ధర కూడా ఖరీదుగానే ఉంటాయి. క్రికెటర్లనే పెళ్లి చేసుకున్న భాలీవుడ్ భామలు ఇద్దరూ ఒకేలాంటి స్లీవ్లె్లెస్ టాప్లు ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయినా అతియా శెట్టి క్రికెటర్ కేఎల్ రాహుల్ని గత నెలలో పెళ్లిబంధంలో ఒక్కటయ్యారు. ఇక అనుష్కా క్రికెటర్ విరాట్ని కోహ్లిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి వామిక అను కూతురు కూడా ఉంది. ఇక ఈ ఇద్దరు ఒకే బ్రాండ్ మాలీకి చెందిన దుస్తులు ధరించారు. అందులో ఇద్దరు తమ అందంతో చూపురులను కట్టిపడేశారు. అయితే వారు ధరించి ఆ షార్ట్ టాప్ల ధర వింటే షాకవ్వడం ఖాయం. సెలబ్రెటీలు దరించేవి చాలా ఖరీదైనవే అయినప్పటికీ..కొన్ని దుస్తులుకు ఇంతపెట్టారా అనే ఫీల్ వస్తుంది. అది సహజం. ఏ చీర లేదా లెహంగా అంత ధర ఉందంటే ఓకే చిన్న షార్ట్ లాంటి టాప్ ఏకంగా రూ. 18000/ అంటే నిజమేనా? అనిపిస్తుంది కదా! కానీ బ్రాండ్లకు పెట్టింది పేరు అయిన మలై బ్రాండ్ ధరలు ఎక్కువనే చెప్పాలి. ఆయా ఫ్యాషన్ కాస్ట్యూమ్లు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇక అతియా శెట్టి గూలాబీ రంగు స్లీవ్లెస్ టాప్, జీన్స్ ఫ్యాంట్లో అదర్సు అన్నట్లు ఉంది. View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) చక్కటి ఈయర్ రింగ్స్, మ్యాచింగ్ లిప్స్టిక్తో మంచి లుక్తో ట్రెండీగా ఉంది అతియా. ఇక అనుష్క శర్మ కూడా సేమ్ అదే మాదిరి పసుపు రంగు టాప్లో చూడచక్కగా ఉంది. కంఫర్ట్ దుస్తులకే ప్రాధాన్యం ఇచ్చే అనుష్క రెండు నెలల క్రితం ఈ టాప్ని ధరించిన ఫోటోని నెట్టింట షేర్ చేసింది. ఇప్పుడూ అతియా అదే టాప్ వేసుకోవడంతో నెలక్రితం నాటి అనుష్క ఫోటోతో కలిపి అతియా ఫోటో నెట్టింట సందడి చేయడం. దీంతో నెటిజన్లు మీ భుజాలను కవర్ చేసేలా డ్రస్లు వేయకూడదనుకుంటున్నారా అంటూ సెటైరికల్ కామెంట్లతో పోస్ట్లు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ ఇద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) (చదవండి: పండుగ వేళ ..కంచిపట్టు చీరతో మరింత కళగా మార్చేయండి!) -
చంద్రునిపైకి ఒక వాటర్ బాటిల్ పంపాలంటే.. అదానీ, అంబానీలే ఆలోచించాలి!
చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ కోసం భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మిషన్ కోసం భారత్ రూ.615 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇతర దేశాలు ఇటువంటి మిషన్ల కోసం ఇంతకన్నా ఎక్కువ మొత్తమే ఖర్చు చేస్తాయి. ఏ దేశమైనా ఒక వ్యక్తిని లేదా ఏదైనా వస్తువును చంద్రునిపైకి పంపాలనుకుంటే అందుకు అయ్యే వ్యయం అధికంగా ఉంటుంది. ఏ దేశమైనా చంద్రునిపైకి వాటర్ బాటిల్ పంపాలనుకుంటే, దానికి ఎంత వ్యయం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రునిపైకి మనిషిని పంపడానికి అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. 1972వ సంవత్సరంలో యూజీన్ సెర్నాన్ చంద్రుని ఉపరితలంపై నడిచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రుని ఉపరితలంపైకి ఒక వ్యక్తి చేరుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. నిజానికి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు.. చంద్రునిపైకి మనిషిని పంపాలని అమెరికా ప్లాన్ చేసింది. అయితే ఇందుకు అయ్యే వ్యయాన్ని అంచనా వేసినప్పుడు 104,000 అమెరికా డాలర్లు ఖర్చవుతుందని తేలింది. ఇంత భారీ మొత్తం వ్యయం చేసేందుకు అమెరికా వెనక్కి తగ్గింది. చంద్రునిపైకి మనిషిని పంపడానికి ఇంత భారీ మొత్తంలో ఖర్చవుతుందని తేలినప్పుడు ఒక వాటర్ బాటిల్ పంపాలంటే ఎంత ఖర్చవుతుందనే విషయానికి వద్దాం. నిజానికి ఇప్పటి వరకు అలాంటి ప్రయోగం జరగలేదు. అయితే ఒక వాటర్ బాటిల్ను సురక్షితంగా పంపడానికి, అంతరిక్ష నౌకలో ఉపయోగించే భద్రత, సాంకేతికత ఒక వ్యక్తిని చంద్రునిపైకి పంపిన రీతిలోనే ఉంటుంది. అయితే మనిషిని పంపడానికి అయ్యే వ్యయం కన్నా కాస్త తక్కువ ఉండవచ్చు. అయినా ఈ మొత్తం అధికంగానే ఉంటుంది. ఇంతమొత్తం ఖర్చు చేసేందుకు మన దేశానికి చెందిన బడా వ్యాపారవేత్తలైన అదానీ, అంబానీలే ఆలోచించాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ.. -
డీజే టిల్లు ఫేమ్ నేహా ధరించిన అల్లికల చీర ధర ఎంతంటే..!
‘సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా..’ పాటలో ఇటీవల డాన్స్తో అదరగొట్టిన నటి నేహా శెట్టి... ఫ్యాషన్లోనూ అంతే రీతిలో అదరగొడుతోంది.. ఈ ఫ్యాషన్ బ్రాండ్స్తో! చిన్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్లు వేసుకుంటూ మురిసిపోయేదాన్ని. ఇప్పటికీ ఆ పిచ్చి పోలేదు. ఇక మోడలింగ్ చేసే టైమ్లో ఫ్యాషన్పై అవగాహన పెరిగింది. అందుకే చాలా వరకు నా స్టైలింగ్ మొత్తం నేనే చూసుకుంటా. పౌల్మీ అండ్ హర్ష్ ఇద్దరు స్నేహితులు కలసి స్థాపించిన ఈ సంస్థ, ఆరంభంలోనే అందమైన డిజైన్స్తో పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. చేతితో చేసే అల్లికలకే ప్రాధాన్యం. అందుకే, లేట్గా వచ్చినా లేటేస్ట్గా ఉంటాయి వీరి డిజైన్స్. ప్రస్తుతం భారత్తో పాటు, అమెరికా నుంచి కూడా ఆర్డర్లను తీసుకుంటున్నారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్ లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. నేహా శెట్టి ధరించిన పౌల్మీ అండ్ హర్ష్ బ్రాండ్ చీర ధర రూ. 42,800/- అభిలాష ఫైన్ జ్యూయల్స్ పదేళ్ల కిందట మొదలైందీ బ్రాండ్. వ్యవస్థాపకురాలు.. అభిలాష. నగల పట్ల, నగల డిజైన్స్ పట్ల తనకున్న ఆసక్తి, అభిరుచితో స్ఫూర్తి పొంది ఈ జ్యూలరీ బ్రాండ్ను స్థాపించారు ఆమె. అనతికాలంలోనే ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్తోపాటు దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి ప్రపంచ నగరాలకూ విస్తరించారు. నాణ్యత, డిజైన్స్ను బట్టే ధరలు. --దీపిక కొండి (చదవండి: అందంతో కట్టిపడేస్తున్న అమైరా ధరించిన చీర ధర వింటే షాకవ్వాల్సిందే!) -
ఇషా అంబానీ అంటే అంతే: అన్కట్డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?
ఆసియాలోనే అత్యంత ధనవంతులైన కుటుంబానికి చెందిన బిజినెస్ ఉమెన్ ఇషా అంబానీ వ్యాపార ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం బిలియనీర్ ముఖేష అంబానీ కుమార్తెగానే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తోంది. అందేకాదు ఫ్యాషన్ ఐకాన్గా తన ఫ్యాన్స్నుఆకట్టుకుంటూనే ఉంటుంది. చూడచక్కని లెహంగా, ముచ్చటైన చీరలు, రాయల్ జ్యువెలరీ, అంతకుమించిన ఫ్యాషన్ అండ్ క్లాసీ స్టైల్తో అందర్నీ మెస్మరైజ్ చేయడం ఇషా స్పెషాల్టీ. ఈ నేపథ్యంలో 165 కోట్ల అన్కట్ డైమండ్ నెక్లెస్ వార్తల్లో నిలిచింది. (బర్త్ డే నాడు కొత్త బిజినెస్లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!) ఇషా అంబానీ ఖరీదైన వస్తువులలో డైమండ్ నెక్లెస్ స్పెషల్గా నిలుస్తోంది. ఇషా తన వివాహానికి ముందు జరిగిన వేడుకలో మొదట ధరించిన అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్ కూడా ఒకటి. దీని ధర ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఆభరణాలు, వజ్రాల నిపుణుల ప్రకారం, 20 మిలియన్ల డాలర్లు (సుమారుగా రూ. 165 కోట్లు) ఉంటుందని అంచనా. ఇషా ప్రీ-వెడ్డింగ్ వేడుక గురించి మాట్లాడుకుంటే ఫ్యాషన్స్టార్ ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షెల్ఫ్ల నుండి రాణి పింక్ లెహంగాతో పాటు కాస్ట్లీ డైమండ్ నెక్లెస్తో అందరి దృష్టిని ఆకర్షించింది. బెస్పోక్ అన్కట్ నెక్లెస్లో 50 పెద్ద అన్కట్ డైమండ్లతో చాలా స్పెషల్గా రూపొందించారట. అలాగే బనీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ను గ్రాండ్ ఈవెంట్ సందర్బంగా ఇషా అదే నెక్లెస్ను ధరించింది. ఈవెంట్లో డిజైనర్ ద్వయం అబు జానీ అండ్ సందీప్ ఖోస్లా రూపొందించిన ఎరుపు రంగు టల్లే కేప్తో అందమైన రెడ్ కలర్ వాలెంటినో గౌను ధరించింది. కాగా 2008లో ఫోర్బ్స్ 'యంగెస్ట్ బిలియనీర్ వారసురాలు' జాబితాలో ఇషా అంబానీ రెండవ స్థానంలో నిలిచింది. యేల్ యూనివర్శిటీ సైకాలజీ , సౌత్ ఏషియన్ స్టడీస్లో పట్టా పొందిన ఇషా రిలయన్స్కుచెందిన టెలికాం, రీటైల్ బిజినెస్లో దూసుకు పోతోంది. డిసెంబర్ 12, 2018న బిలియనీర్, అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ల కుమారుడు, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్తో వివాహైంది. ఇషాకు ఇద్దరు పిల్లలు (ట్విన్స్) ఉన్నారు. -
మెహందీ కలర్ చీర కట్టులో అను ఇమ్మాన్యుయేల్..ధర ఎంతంటే..
అను ఇమ్మాన్యుయేల్.. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ను సంపాదించుకుంది. ఈ స్టార్ ఫ్యాషన్కి ఓ స్టయిల్ని క్రియేట్ చేసిన బ్రాండ్స్లో కొన్నింటిని చూద్దాం.. నలుపు రంగు దుస్తులు, డెనిమ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ప్రతి అమ్మాయికి బయటకెళ్లినపుడు సేఫ్టీ పిన్స్ అవసరం. నా పర్సులో ఎప్పుడూ ఉంటాయి. బ్రాండ్ వాల్యూ: ఐకేయా ఐకేయా అంటే సంస్కృతంలో ‘నా గుర్తింపు’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే క్లాసిక్, టైమ్లెస్ ఫ్యాషన్ డిజన్స్కి ప్రత్యేకం ఈ బ్రాండ్. ఢిల్లీకి చెందిన డిజైనర్ ఇషా ధింగ్రా.. 2013లో దీనిని ప్రారంభించారు. మూస డిజైన్స్కి చెక్ పెట్టేలా ఉండే ఈ డిజైన్స్కి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ధరలు కాస్త ఎక్కువే. విదేశాల్లోనూ వీటికి మంచి గిరాకి ఉంది. ఢిల్లీలో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. అను ఇమ్మాన్యుయేల్ ధరించి చీర బ్రాండ్ ఐకేయా రూ. 74,500/- హౌస్ ఆఫ్ శిఖా చాలామంది అమ్మాయిల్లాగే .. శిఖా మంగల్కి కూడా ఆభరణాలంటే ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ఆసక్తిగా మారింది. అందుకే బిజినెస్ మేనేజ్మెంజ్ కోర్సు పూర్తయిన వెంటనే 2014లో ‘హౌస్ ఆఫ్ శిఖా’ను ప్రారంభించారు. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్కి పాముఖ్యతనివ్వడంతో.. డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టైల్ ప్రతిబింబిస్తుంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. పేరుకు దేశీ లేబుల్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. అను ధరించిన జ్యూలరీ బ్రాండ్ ధర రూ. 6,000 – అను ఇమ్మాన్యుయేల్ --దీపిక కొండి (చదవండి: హాయ్..‘అమిగోస్’ అంటూ వచ్చిన ఆశికా రంగనాథ్ ధరించిన చీర ధర ఎంతంటే..!) -
రెస్టారెంట్లో ఖరీదైన వాటర్ బాటిల్ అంటగట్టారని.. ‘పైసా వసూల్’ పనిచేసి..
ఖరీదైన రెస్టారెంట్లలో బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భాల్లో కాస్త నిట్టూరుస్తూనే బిల్లు చెల్లిస్తుంటాం. తాజాగా ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్ రితికా బోరా రెస్టారెంట్లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఆమె రెస్టారెంట్లో వాటర్ బాటిల్కు ఆర్డర్ చేయగా, దానికి ఆమె భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె క్యాప్షన్లో ‘మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్కు స్నేహితురాలితో పాటు వెళ్లాను. అక్కడ వాటర్ బాటిల్కు రూ.350 చెల్లించాల్సి వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆ బాటిల్ను నాతో పాటు ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీనిని తిరిగి వినియోగించవచ్చని భావించాను. ఈ విధంగా నేను మాత్రమే చేస్తున్నానా? మీరు కూడా చేస్తారా?’ అని అమె ప్రశ్నించింది. Met up with a friend at this fancy restaurant for lunch, and you won't believe they charged 350 rps for a bottle of water! So, I decided to bring the bottle home with me so that I can reuse it. Is it only me or u have done this too? pic.twitter.com/AecGPLuoV8 — Ritika Borah (@coach_ritika) July 10, 2023 ఎక్కడైనా వాటర్ బాటిల్ రూ. 20కి లభ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్లో ఏకంగా వాటర్బాటిల్కు రూ. 350 చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. రితికా బోరా పోస్టును చూసిన పలువరు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకు రెస్టారెంట్లలో ఎదురైన అనుభవాలను తెలియజేయగా, మరికొందు ‘పైసా వసూల్’ పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
ఆలస్యం వల్ల రూ. 4.80 లక్షల కోట్ల భారం
న్యూఢిల్లీ: మౌలిక రంగంలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. ఫలితంగా వీటి నిర్మాణ వ్యయం మే నాటికి రూ.4.80 లక్షల కోట్ల మేర పెరిగిపోయింది. కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ నివేదికను పరిశీలించినప్పుడు ఈ విషయం తేటతెల్లమైంది. రూ.150 కోట్లు, అంతకుమించిన వ్యయంతో కూడిన ప్రాజెక్టులను ప్రణాళికా శాఖ పర్యవేక్షిస్తుంటుంది. మొత్తం 1,681 ప్రాజెక్టులకు గాను 814 ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 408 ప్రాజెక్టులు నిర్మాణ వ్యయం పెరిగిపోయినట్టు నివేదించాయి. 1,681 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.24,16,872 కోట్లు కాగా, వీటిని పూర్తి చేయడానికి రూ.28,96,947 కోట్లు వ్యయం అవుతుందని ప్రణాళిక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే రూ.4,80,075 కోట్ల మేర నిర్మాణ వ్యయం పెరిగినట్టు తెలుస్తోంది. 2023 మే నాటికి ఈ ప్రాజెక్టులపై రూ.15,23,957 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం అంచనా వ్యయంలో 52.61 శాతం మేర ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. మొత్తం ఆలస్యంగా నడుస్తున్న 814 ప్రాజెక్టుల్లో 200 వరకు ఒకటి నుంచి 12 నెలల ఆలస్యంతో నడుస్తుంటే, 183 ప్రాజెక్టులు 13–24 నెలలు, 300 ప్రాజెక్టులు 25–60 నెలలు, 131 ప్రాజెక్టులు 60 నెలలకు పైగా ఆలస్యం అయ్యాయి. -
ఈ గుడ్ల ధరలు తెలిస్తే.. గుడ్లు తేలేస్తారు!
చాలామందికి గుడ్డు రోజువారీ ఆహారంలో భాగం. గుడ్లతో ప్రతీరోజూ వంటకాలు చేసుకునేవారు ఉన్నారు. మరి ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుడ్లు కూడా ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? వాటికి అంత ధర ఎందుకు ఉంటుందో తెలిస్తే ఎవరూ ఒక పట్టాన నమ్మలేరు. ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా తినే ఆహారాలలో గుడ్డు ఒకటి. సాధారణంగా అందరూ తెల్లని గుడ్లు తింటారు. వీటి ధర రూ.5 నుంచి రూ.10 మధ్య ఉంటుంది. అయితే కాస్త డబ్బులు అధికంగా ఉండేవారు దేశీ గుడ్లను తింటుంటారు. ఇవి కాస్త గులాబీరంగులో ఉంటాయి. వీటి ధర రూ. 20 నుంచి రూ. 25 మధ్య ఉంటుంది. మరికొందరు వివిధ పక్షుల గుడ్లను కూడా తింటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్లు.. రోత్స్చైల్డ్ ఫాబెర్జ్ ఈస్టర్ గుడ్లు. ఈ గుడ్డు ధర రూ. 9.6 మిలియన్ డాలర్లు. దీని ధర భారత కరెన్సీలో చూస్తే రూ. 78 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. వికీపీడియాలోని సమాచారం మేరకు ఈ గుడ్డుపై పూర్తిస్థాయిలో వజ్రాలను పొదిగారు. ఇది బంగారు కవర్ కలిగివుంటుంది. అయితే ఈ గుడ్డు తినేందుకు కాదు. అలంకరణ కోసం తీర్చిదిద్దారు. పైగా ఇది ఆర్టిఫిషియల్ గుడ్డు. ఖరీదైన గుడ్ల పరంగా చూస్తే రెండవ స్థానంలో మిరాజ్ ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ధర 8.4 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దీనిని చూస్తే రూ. 69 కోట్లకు సమానం. 18 కేరెట్ల బంగారంతో రూపొందించిన ఈ గుడ్డును వేయి వజ్రాలతో అలంకరించారు. ఈ గుడ్డును చూసే వారికి అది గుడ్డు సైజులో ఉన్న వజ్రం అని అనిపిస్తుంది. మూడవ స్థానంలో డైమండ్ స్టెల్లా ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ఖరీదు సుమారు రూ. 82 లక్షలు. ఈ గుడ్డు 65 సెంటీమీటర్ల పొడవు కలిగివుంటుంది. ఈ గుడ్డునుకొనాలంటే మీ కున్న ఇంటిని అమ్మేయాల్సి వస్తుంది. ఈ గుడ్డు చూసేందుకు చాక్లెట్ మాదిరిగా ఉంటుంది. ఈ గుడ్డు పైభాగంలో వజ్రాలు పొదిగి ఉండడంతో పాటు దీనిని బంగారంతో రూపొందించారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. -
పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు..
భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తాజాగా ప్రారంభించారు. రూ.20,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో భాగంగా కొత్త పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ను నిర్మించారు. 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాత భవనం కంటే మూడు రెట్లు అధిక పరిమాణంలో ఆకట్టుకునే హంగులతో కొత్త పార్లమెంట్ భవనం రూపొందింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పార్లమెంట్ భవనాన్ని ఏ నిర్మాణ సంస్థ కట్టింది. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయింది.. వంటి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం... నిర్మాణ సంస్థ ఇదే.. భారత పార్లమెంట్ నూతన భవనాన్ని టాటా గ్రూప్నకు చెందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. 2020లో లార్సెన్ అండ్ టూబ్రో (L&T)పై రూ. 3.1 కోట్ల స్వల్ప మార్జిన్తో రూ. 861.9 కోట్లకు ఈ ప్రాజెక్ట్ను దక్కించుకుంది. మొదట్లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ పోటీలో నిలిచినా తరువాత బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలింది. రూ.940 కోట్లు.. 21 నెలల్లోనే పూర్తి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.940 కోట్లు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని కేవలం 21 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది టాటా కంపెనీ. ఇదీ చదవండి: రూ.75 నాణెం విడుదల.. కొత్త కాయిన్ ఇలా పొందండి.. -
అంబానీనా మజాకా...కార్ రేటు తెలిస్తే కళ్ళు తిరుగుతాయి
-
బర్త్డే రోజున చరణ్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజును సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్గా సెలబ్రెట్ చేసుకున్నాడు. మార్చి 27తో చరణ్ 38వ వసంతంలోకి అడుగు పెట్టాడు. సోమవారం రాత్రి జరిగిన చరణ్ బర్త్డే పార్టీలో టాలీవుడ్ స్టార్ హీరోలు, డైరెక్టర్స్ పాల్గొని సందడి చేశారు. ఇక చరణ్ బర్త్డే సందర్భంగా RC15 నుంచి వరుస అప్డేట్స్ వదిలారు మేకర్స్. చదవండి: బిగ్బాస్ అలీ రేజాతో రొమాంటిక్ సీన్పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి తనయుడిని ముద్దాడుతూ ఓ ఫొటో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం స్వయంగా ఇంటికి వెళ్లి చరణ్కి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో చరణ్ ధరించిన లైట్ బ్లూ షర్ట్పై అందరి దృష్టి పడింది. బర్త్డే సందర్భంగా చరణ్ వేసుకున్న ఆ షర్ట్ స్పెషాలిటీ, బ్రాండ్ ఏంటి? అని ఫ్యాన్స్ ఆరా తీయగా దాని ధర తెలిసి అంతా అవాక్కవుతున్నారు. చదవండి: తొలిసారి బేబీ బంప్తో ఉపాసన.. ఫొటోలు వైరల్ దీంతో చరణ్ షర్ట్ కాస్ట్ వైరల్గా మారింది. కాగా ఈ షర్ట్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేయగా ఇది ఫార్ ఫేచ్ అనే ఫారిన్ షాపింగ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు కనిపించింది. జాన్యా వటనాబి ప్యాచ్ వర్క్తో డిజైన్ చేసిన ఈ షర్ట్ను డీటైల్ అని పిలుస్తారు. ఇక ఈ వెబ్ సైట్ ప్రకారం.. ఈ షర్ట్ ధర 983 డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే భారత కరెన్సీ ప్రకారం 80,961 రూపాయలు. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. -
నాగ చైతన్య కొత్త ఇంటి ఖరీదు అన్ని కోట్లా!
అక్కినేని నాగచైతన్య ఇటీవల కొత్త ఇల్లు కొన్న విషయం దాదాపు అందరికి తెలిసింది. అత్యంత విలాసవంతమైన సదుపాయాలు కలిగిన ఈ ఇంటిలోకి గృహప్రవేశం కూడా చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు & వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే నాగచైతన్య కొన్న కొత్త ఇల్లు ఖరీదు చాలామందికి ఇంకా ప్రశ్నర్థకంగానే మిగిలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నాగ చైతన్య కొత్త ఇంటి ధర సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ ఇంటిని తన అభిరుచికి తగినట్లుగా, లగ్జరీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. తన సన్నిహితులకు దగ్గరగా ఉండాలన్న కారణంగా కుటుంబీకులకు సమీపంలోని నిర్మించుకున్నాడు. (ఇదీ చదవండి: ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు! వందల కోట్ల జీతాలు తీసుకుంటున్న మనోళ్లు) నాగ చైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ఇంట్లో ఉండేవారు. అయితే వారి విడాకుల తరువాత వారిద్దరూ ఆ ఇంటిని వదిలేసారు. కొన్ని నెలల పాటు తండ్రితోనే ఉన్న ఇతడు ఇటీవలే కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. నాగ చైతన్య వద్ద అత్యంత ఖరీదైన 'ఫెరారీ 488జీటీబీ' కారుతో పాటు బీఎండబ్ల్యూ 740 ఎల్ఐ, నిస్సాన్ జిటి-ఆర్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ కూడా ఉన్నాయి. అంతే కాకుండా MV అగస్టా, బీఎండబ్ల్యూ 9RT వంటి అరుదైన బైకులు ఉన్నాయి. -
అట్లుంటది మరి.. రూ.6 లక్షల మేకపోతు!
సాక్షి, హైదరాబాద్: ఈ చిత్రంలో కనిపిస్తున్న మేకపోతు బరువు 110 కిలోలు, వయసు 3 ఏళ్లు. నల్లమచ్చ లేని ఈ జమునాపారి మేకపోతు రాజస్తాన్కు చెందినది. శంకర్ కిచర్ అనే రైతు పెంచుతున్న దీని విలువ అక్షరాలా రూ. 6 లక్షలు! ఉత్తరప్రదేశ్లోని మథుర సమీపంలో ఉన్న నేషనల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ (ఎన్ఎస్ఐఎఫ్ఆర్జీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్ గోట్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్’లో బరువు విభాగంలో ఈ మేకపోతు ప్రథమ బహుమతి పొందింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి గొర్రె, మేకపోతులు ఈ ప్రదర్శనకు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా ‘ఇండస్ట్రీ సైంటిస్ట్ ఫార్మర్స్ ఇంటర్ఫేస్’ పేరిట నిర్వహించిన ఒకరోజు సదస్సుకు రాష్ట్రం నుంచి పలువురు గోట్ఫామ్స్ యజమానులు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో జీవాల సంపద పెరిగినందున వాటిపై పరిశోధనల కోసం జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ పేర్కొన్నారు. -
తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవే..
-
వామ్మో.. చిరు వాడే వాచ్ అంత కాస్ట్లీనా! ధరెంతో తెలుసా?
సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. ఏది తిన్నా, ఎటు వెళ్లినా, ఏం ధరించినా అది సెన్సెషనల్ టాపిక్గా మారుతుంది. ఇటు అభిమానులు సైతం తాము ఇష్టపడే స్టార్ల లైఫ్స్టైల్ను ఇంట్రెస్ట్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారు వాడే కార్లు, దుస్తులు, వాచ్ బ్రాండ్లను, వాటి ధరల గురించి సెర్చ్ చేస్తుంటారు. ఇక ఎక్కువ బ్రాండ్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తరచూ వార్తల్లో నిలస్తుంటాడు. ఇక రామ్ చరణ్కు వాచ్లు అంటే పిచ్చి.. ఇప్పటికే రకరకాల టాప్ బ్రాండ్ వాచ్లను తన కలెక్షన్స్లో చేర్చేశాడు. చదవండి: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట! ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర హాట్టాపిక్గా మారింది. రీసెంట్గా చిరు నటించిన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఆయన తరచూ మూవీ ఈవెంట్స్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేతికి రకరకాల బ్రాండ్ వాచ్లు దర్శనం ఇస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ కన్ను వాటిపై పడింది. దీంతో మెగాస్టార్ వాడుతున్న ఆ వాచీల బ్రాండ్స్, వాటి ధర గురించి ఆరా తీస్తున్నారు. దీంతో చిరు వాచ్ ధరలను చూసి అభిమానులంతా నోరేళ్ల బెడుతున్నారట. చిరు దగ్గర ఎన్నో బ్రాండ్ వాచీలు ఉన్నాయట. చదవండి: లవ్టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! ట్వీట్కి లైక్ కొడతావా? అంటూ ఫైర్ అందులో రోలేక్ వాచ్ అత్యంత కాస్ట్లీ అని తెలుస్తోంది. రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ధర అక్షరాలా 1 కోటీ 86 లక్షల 91 వేలకు పైనే ఉంటుందని సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి వాడే మరో వాచ్ కూడా ఉంది. ఎ లాంగే అండ్ సోహ్నే వాచ్.. లాంగే కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర దాదాపు రూ. 33 లక్షల 77వేల పైనే ఉంటుందట. దీంతో చిరు వాచీల ధరలను చూసి అంతా అవాక్కావుతున్నారట. ఆయన ఒక్క వాచీ జీవితమంత లగ్జరీగా బతికేయచ్చంటూ నెటిజన్లు ఫన్నిగా కామెంట్స్ చేస్తున్నారు. -
అక్కడ ఉల్లి ధర వింటే..కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం!
మన దేశంలో ఎప్పుడైన పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో లేక అనావృష్టి సమయాల్లోనో ధరలు అధికమవుతాయి. అప్పుడే మనకు ఉల్లి ధర ఆకాశన్నంటుతుంది. పైగా అది కూడా మహా అయితే కేజి 30 నుంచి 70 మధ్యలో పెరుగుతుంది. దానికే మనవాళ్లు చేసే హడావిడి అంతా ఇంతకాదు. ఇదే అదనుగా రెస్టారెంట్ నుంచి చిన్న కాక హోటల్ వరకు రేట్లు పెంచేయడం, ఉల్లి లేని వంటకాలు అందించడం వంటివి చేస్తారు. కానీ ఇక్కడ ఈ దేశంలోని ఉల్లి పాయాల ధర వింటే అమ్మ బాబోయ్ అంటారు. కచ్చితంగా కొనేందుకు ముందుకు రావడానికి కూడా జంకుతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. వివరాల్లోకెళ్తే...ఫిలిప్పీన్స్లో ఉల్లిపాయాల ధర చాలా ఘోరంగా ఉంటుంది. ఏకంగా కేజీ ఉల్లిపాయాలు సుమారు వెయ్యి రూపాయాలు వరకు పలుకుతోంది. అక్కడ ప్రస్తుతం ఉల్లి చాలా విలాసవంతమైన వస్తువుగా మారింది. ఇంతకు మునుపు అక్కడ ప్రజలు మూడు నుంచి నాలుగు కేజీల ఉల్లిపాయాలు కొనేవారు. ప్రస్తుతం అక్కడ ఎంతో అవసరం అనుకుంటే గానీ, అదికూడా కేవలం అరకేజీనే కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. గత మూడు నెలల నుంచే ఈ దారుణమైన ధర పలుకుతోందని చెబుతున్నారు. వాస్తవానికి ఫిలిప్పీన్స్ వాసులు ఆహారంలో ప్రధానంగా ఉల్లిని విరివిగా ఉపయోగిస్తారు. ఇప్పుడు వారంతా దాని ప్లేస్లో మరోదాన్ని జోడించి తినాల్సి వస్తోందని వాపోయారు. ఈ మేరకు అక్కడ వ్యవసాయ కార్యదర్శి ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ పెరుగతున్న ఆహార ధరల పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పేర్కొన్నారు. ఆయన ఉత్పత్తిని పెంచే దిశగా పలు ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఫిలిప్పీన్స్ రెండు భారీ తుపాన్లను ఎదుర్కొంది. దీంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. అక్కడ ప్రజలు పెళ్లిళ్లకు ఉపయోగించే డెకరేషన్లో ఉల్లిని ఉపయోగించాలని చూస్తున్నారు కొందరూ. ఎందుకంటే ఆ తతంగం తర్వాత ఆ ఉల్లిపాయాలు కొందరూ పేద ప్రజలకు ఉపయోగపడతాయని, అదే పూలు అయితే వాడిపోతాయి ఉపయోగం ఉండదు అనేది వారి ఆలోచన. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. పాపం అక్కడి ప్రభుత్వం సైతం ప్రజలకు భారం తగ్గించేలా...ధరల పెరుగుదలను నియంత్రించటానికి నానా అగచాట్లు పడుతోంది. (చదవండి: పాక్లో భూకంపం) -
మ్యూజిక్ లవర్స్కి అదిరిపోయే గుడ్న్యూస్.. సగం ధరకే యాపిల్ ఎయిర్పాడ్స్!
యాపిల్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఉత్పత్తులుకు డిమాండ్ మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. ఐఫోన్, ఎయిర్పాడ్స్, ఐప్యాడ్ ఇలా ఏదైనా టూ కాస్ట్లీగా ఉంటాయి. అయినా కూడా ఇవి సేల్స్ పరంగా దుమ్ము దులుపుతుంటాయి. అందుకు ఈ బ్రాండ్పై ఉన్న నమ్మకం, ఇందులో ఉపయోగిస్తున్న టెక్నాలజీ కారణమనే చెప్పాలి. అయితే యాపిల్ ఎయిర్పాడ్స్ ధరలు కూడా భారీ స్థాయిలో ధరలు ఉండడంతో, మిగిలిన ఉత్పత్తులతో పాలిస్తే ఇవి వినియోగదారులను అంతగా ఆకట్టుకోకపోతున్నామని యాపిల్ భావిస్తోంది. అందుకే తక్కువ ధరలో ఎయిర్పాడ్స్ను తీసుకురావాలని యోచిస్తోంది. ఆడియో మార్కెట్పై కన్ను... రూ.8 వేలకే సమాచారం ప్రకారం.. యాపిల్ సరసమైన ధరలలో ఎయిర్పాడ్స్ తీసుకురావడం మాత్రమే కాకుండా, కొత్త తరం ఎయిర్పాడ్స్ మాక్స్( AirPods Max)పై కూడా పనిచేస్తోంది.సరసమైన ఎయిర్పాడ్స్ ధర 99 డాలర్లు(ఇది భారతదేశంలో కరెన్సీ ప్రకారం దాదాపు రూ.8000) ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎయిర్పాడ్స్ సరఫరాదారులను కూడా మార్చాలని కంపెనీ చూస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ ధరలో యాపిల్ ఎయిర్పాడ్స్ అందుబాటులోకి వస్తే సేల్స్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. అయితే, బడ్జెట్లో వచ్చే ఎయిర్పాడ్స్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండకపోవచ్చని అనలిస్టులు చెబుతున్నారు. ఎయిర్పాడ్స్ను తక్కువ ధరలో తీసుకురావడం ద్వారా ఆడియో మార్కెట్లోనూ తమ సేల్స్పెంచుకోవాలన్నది యాపిల్ లక్ష్యంగా తెలుస్తోంది. ఒకవేళ రూ.8వేల ధరలో తీసుకొస్తే యాపిల్ సేల్స్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యాపిల్ ఎయిర్పాడ్స్ (Airpods) కొనాలంటే కనీసం రూ.15వేలు వెచ్చించాల్సిందే. చదవండి: అమెజాన్ యూజర్లకు గుడ్న్యూస్.. తక్కువ ధరకే కొత్త ప్లాన్, ప్రైమ్ కంటే చవక! -
చూపులో సైకిల్.. రేటులో బుల్లెట్
సాక్షి, ఫిఠాపురం: చూడటానికి అది సైకిలే కానీ రేటులో మాత్రం బుల్లెట్తో పోటీ పడుతోంది. సామాన్యుడి వాహనం సైకిల్ అసామాన్యంగా మారిపోయింది. కాకినాడకు చెందిన ఓ ఫర్నిచర్ వ్యాపారి తన కుమారుడు చైతన్య కోసం ఏకంగా విదేశాల నుంచి సైకిల్ కొనుగోలు చేశారు. ఇటలీకి చెందిన ఈ సైకిల్ రేటు అక్షరాలా రూ.1.40 లక్షలు. మోటారు సైకిల్ మాదిరిగా రిజిస్ట్రేషన్ నంబరుతో పాటు లైసెన్సు కలిపి అంత ధర అయ్యిందని చెబుతున్నారు. చూడటానికి మామూలు సైకిల్లానే ఉన్నా నిర్మాణంలో కొత్తదనం కనిపిస్తోంది. బుల్లెట్ బండి రేటుతో పోటీ పడుతున్న ఈ సైకిల్ ప్రస్తుతం పిఠాపురం రోడ్డులో ఆకర్షణగా నిలుస్తోంది. (చదవండి: రిపోర్ట్లో అసలు గుట్టు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని..) -
ఐదేళ్లలో 36 సార్లు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఖర్చు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో విదేశాల్లో అధికారిక పర్యటనలు చేపట్టారు. తాజాగా గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను పార్లమెంట్లో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు.. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ.239 కోట్లుకుపైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ‘అంతర్జాతీయంగా వివిధ దేశాలతో సన్నిహత సంబంధాలను పెంపొందించుకోవటం, స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను విస్తరించటమే ప్రధాని విదేశీ పర్యటనల లక్ష్యం. దేశ ప్రయోజనాలతో పాటు విదేశాఘ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఈ పర్యటనలు ఎంతో ముఖ్యం.’ అని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్. మోదీ విదేశీ పర్యటన వివరాలు.. ► ఇటీవల జీ20 సమ్మిట్ కోసం పీఎం మోదీ ఇండోనేసియాకు వెళ్లారు. దాని ఖర్చు రూ.32,09,760గా కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతకు ముందు సెప్టెంబర్ 26-28 మధ్య జపాన్ పర్యటనకు వెళ్లగా అప్పడు రూ.23,86,536 అయింది. ► 2022 తొలినాళ్లలో యూరప్ పర్యటనకు రూ.2,15,61,304, 2019 సెప్టెంబర్ 21-28 మధ్య అమెరికా వెళ్లగా రూ.23,27,09,000 అయింది. ► గడిచిన ఐదేళ్లలో 36 విదేశీ పర్యటనలు చేయగా అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి కేంద్రం ఖర్చు చేసింది. ► 2017లో తొలుత ఫిలిప్పైన్స్లో పర్యటించారు. 2021లో బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీకి వెళ్లారు. మొత్తంగా ఐదేళ్లలో రూ.239 కోట్లు ఖర్చు కాగా.. అందులో అమెరికా వెళ్లినప్పుడు అత్యధికంగా రూ.23 కోట్లు ఖర్చు అయింది. ఇదీ చదవండి: సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు -
బ్రహ్మస్త్ర ప్రమోషన్లో ఆలియా ధరించిన డ్రెస్ ధరెంతో తెలుసా?
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇటీవల విడుదలైన గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్ సినిమాల విజయంతో హుషారు మీద ఉన్న ఈ భామ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమా చేస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య పాత్రలో నటించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్కు దగ్గర పడుతున్నవేళ ఆలియా తన భర్తతో కలిసి ప్రమోషన్లో పాల్గొంది. ఇప్పుడు ఆలియా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. అయినా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషన్లో పాల్గొంటుంది. తాజాగా.. ఈ నటి బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్లో భాగంగా తన బేబీ బంప్తో దర్శనమిచ్చింది. గూచీ బ్రాండ్కు చెందిన పింక్ కలర్ డ్రెస్, మ్యాచింగ్ బ్లాక్ ప్యాంట్ కోట్తో స్టైలిష్గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చదవండి: Samantha: సమంత ఎక్కడ? ఎందుకు సైలెంట్గా ఉంది? కారణం ఇదేనా! అయితే ఆలియా ధరించిన ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా? దీని గురించి ఏకంగా నెట్టింట్లో చర్చే జరుగుతోంది. పింక్ కలర్ చిఫాన్ రఫుల్ టాప్ ధర గూచీ అధికారిక వెబ్సైట్లో 4,100 డాలర్లుగా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 3,27,883 రూపాయలన్న మాట. ఒక్క డ్రెస్కు ఆలియా అంత ఖర్చు పెట్టడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. -
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు భారీ షాక్!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్. త్వరలో భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం మొబైల్స్లో వినియోగించే ఇన్ పుట్స్పై (ఫోన్లో వినియోగించే విడి భాగాలు) కస్టమ్ డ్యూటీ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త కస్టమ్ ఛార్జీలు అమల్లోకి వస్తే .. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు పెరిగిన ధరల్ని కొనుగోలు దారులకు బదలాయించే అవకాశం ఉంది. దీంతో దేశీయంగా తయారయ్యే స్మార్ట్ ఫోన్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. పలు నివేదికల ప్రకారం..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (cbic) విభాగంగా ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్ల డిస్ప్లే అసెంబ్లీ దిగుమతిపై 10శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ విధిస్తుంది. ఆ కస్టమ్ డ్యూటీని మరో 5 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. "సిమ్ ట్రే, యాంటెన్నా పిన్, స్పీకర్ నెట్, పవర్ కీ, స్లయిడర్ స్విచ్, బ్యాటరీ కంపార్ట్మెంట్, వాల్యూమ్, పవర్, సెన్సార్లు, స్పీకర్లు, ఫింగర్ ప్రింట్ మొదలైన వాటి కోసం ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్లు (ఎఫ్పీసీ), ఇతర వస్తువులు డిస్ప్లే అసెంబ్లీతో దిగుమతి చేసుకుంటే 15శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ అమలవుతుందని సీబీఐసీ తెలిపింది. నో క్లారిటీ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలైన వివో,ఒప్పోలతో పాటు ఇతర కంపెనీలు కస్టమ్ డ్యూటీ ఎగవేతకు పాల్పడ్డాయని సీబీఐసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై.. ఫోన్ల విడిభాగాల్ని దిగుమతి చేసుకుంటే ఎంత కస్టమ్ డ్యూటీ చెల్లించాలనే అంశంపై స్పష్టత లేదని, అందుకే సీబీఐసీ అధికారులు నోటీసులు అందించినట్లు పలు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ స్పష్టం చేశాయి. ఈ తరుణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అధికారులు ఫోన్ల విడి భాగాలపై విధించే కస్టమ్ డ్యూటీ ఎంత చెల్లించాలనే అంశంపై స్పష్టత ఇవ్వడం గమనార్హం. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
ఎంత మోసమో?..నెటిజన్ పోస్ట్కు కామెంట్ల వరద, స్పందించిన జొమాటో!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆన్లైన్, ఆఫ్లైన్ ఫుడ్ ఆర్డర్ బిల్లుల వివాదంపై జొమాటో స్పందించింది. రాహుల్ కాబ్రా ఆఫ్లైన్ ఫుడ్ ఆర్డర్ ధరను జొమాటో డెలివరీ చేసే ఫుడ్ ఆర్డర్ ధరను పోల్చుతూ పోస్ట్ చేశాడు. ఆఫ్లైన్లో ఉన్న ధర కంటే జొమాటో పెద్ద మొత్తంలో కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేస్తుందని ఆరోపించాడు.ఆ ఆరోపణలపై జొమాటో రిప్లయి ఇచ్చింది. కస్టమర్లకు,రెస్టారెంట్ల మధ్య జొమాటో అనుసంధానంగా పనిచేస్తుంది.ఆఫ్లైన్లో అందించే ధరలకు జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే కాబ్రా పోస్ట్పై స్పందిస్తూ.. కస్టమర్ ఫిర్యాదుల్ని రెస్టారెంట్ల దృష్టికి తీసుకొని వెళ్తామని వెల్లడించింది. కామెంట్ల వరద రాహుల్ కాబ్రా ఓ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. అయితే రెండు మూడు రోజుల క్రితం రాహుల్కు బాగా ఆకలి వేయడంతో ఆఫ్లైన్లో చెక్ చేసి వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలను ఆర్డర్ పెట్టాడు. ఫుడ్తో పాటు,ఇతర అదనపు ట్యాక్స్లు అన్నీ కలుపుకొని బిల్లు రూ.512 అయ్యింది. జొమాటోలో చెక్ చేస్తే ఆ ధర కాస్త రూ.75 డిస్కౌంట్ తీసేస్తే రూ.689.90గా ఉండడంతో కంగుతిన్నాడు. అంతా మోసం, దగా జొమాటో కస్టమర్ల దగ్గరనుంచి ఎంత మొత్తం వసూలు చేస్తుందో మీరే చూడండి అంటూ తాను ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఆఫ్లైన్, ఆన్లైన్ బిల్స్ను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆఫ్లైన్లో ఫుడ్ ఆర్డర్పై ఉన్న ధర కంటే జోమాటో ఎక్కువగానే 34.76% శాతంతో 690-512 =రూ.178 వసూలు చేసినట్లు రాహుల్ మండిపడ్డాడు. ఫుడ్ ఆర్డర్పై ఇక రాహుల్ పెట్టిన లింక్డ్ఇన్ పోస్ట్ తెగ వైరల్ అయ్యింది.ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ల నుంచి జొమాటో ఎంత వసూలు చేస్తుందో మీరే చూడండి అంటూ బిల్స్కు సంబంధించిన బిల్స్ను సైతం షేర్ చేశాడు. వీటిపై స్పందించిన నెటిజన్లు ఈ దిగ్గజ ఫుడ్ ఆగ్రిగ్రేటర్పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలా ఇప్పటి వరకు కాబ్రా పెట్టిన పోస్ట్కు 2వేల కామెంట్లు, 12వేలకు మందికి పైగా నెటిజన్లు అతనికి సపోర్ట్ చేస్తూ లైక్ కొట్టారు. -
రాజయ్యపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ పైపులైన్
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్రతీరానికి భారీ పై పులైను ఆదివారం కొట్టుకొచ్చింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ పైపులైను చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. చాలామంది ఈ పైపులైనును ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కానీ భారీ పైపులైను కావడంతో కదపలేకపోయారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ డి.వెంకన్న రాజయ్యపేట సముద్రతీరానికి వెళ్లి పైపులైన్ను పరిశీలించారు. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది కేంద్ర రక్షణ శాఖ ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం సమీపంలో నిర్మిస్తున్న ఎన్ఏవోబీ (నేవల్ ఆల్టర్నేనేటివ్ బేస్)కు చెందిన పైపులైనుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నేవల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. (క్లిక్: మార్కాపురం వాసిని అభినందించిన ప్రధాని మోదీ) -
అత్యంత ఖరీదైన వెజిటేబుల్ ఇదే...ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే
ప్రభుత్వం కాస్త ధరలు పెంచితే చాలు ధరలు ఆకాశాన్నంటాయి.. సామాన్యుడి నడ్డి విరిచేశారంటూ మనం గగ్గోలు పెట్టేస్తాం. వాస్తవానికి చౌకగా దొరికే కాయగూరలు సైతం ఒక్కోసారి కొనేందకు భారంగా ఉండే విధంగా ధర పలుకుతుంటాయి. అధిక వర్షాల కారణంగానో లేక పెట్రోల్ ధరలు పెరగడం వల్లనో కాయగూరల ధరలు పెరిగిపోతుంటాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్యుడే కాకుండా ఓ మోస్తారుగా డబ్బున్నవాడు సైతం కాస్త వెనకడుగు వేస్తాడు. అయిన కాయగూరలు మహా అయితే కిలో సుమారు రూ.50 నుంచి 100లోపే పలుకుతుంది. కానీ ఇక్కడొక కాయగూర ధర వింటే కచ్చితంగా నోరెళ్ల బడతారు. వివర్లాకెళ్తే...ఈ కాయగూరని కొనాలంటే.. ఒక కిలోకి సుమారు రూ.లక్ష రూపాయాల పైనే వెచ్చించాల్సిందే. వాస్తవానికి ఇంత ఖరీదైన కాయగూరలు గురించి ఇప్పటి వరకు ఎవరు విని ఉండే అవకాశం లేదు. ఇంత ధర పలికే కాయగూర సామాన్యుడే కాదు ధనవంతుడు కూడా కొనేందుకు ఆలోచిస్తాడు. ఇంతకీ ఏంటి ఈ కాయగూరలో ఉన్న ప్రత్యేకత? ఎందుకింత ధర అంటే...ఈ కాయగూర పేరు "హాప్ షూట్స్". ఈ కాయగూరల పువ్వులను హాప్ కోన్స్ అంటారు. వీటిని బీర్ తయారీలో ఉపయోగిస్తారు. మిగిలిని కొమ్మలను కూరగాయాలుగా వాడుకుంటారు.ఈ కాయగూర మొక్క కాండాన్ని కూడా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇటీవలే ఇప్పుడిప్పుడే ఈ కాయగూరలను తినేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు ఈ కాయగూరని బిహార్లోని ఒక యువకుడు పండిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాప్ షూట్స్ని భారత్లోని బిహార్కి చెందిన తొలి యువ రైతు అమ్రేష్ సింగ్ దీన్ని సాగు చేస్తుండటం విశేషం. (చదవండి: ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు: వీడియో వైరల్) -
ధర ఎక్కువైంది బాస్.. కొంచెం తగ్గిస్తే బెటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజురోజుకీ అధికం అవుతున్న ఇంధన భారాన్ని తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇంకేముంది ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీ కొనుగోలుదార్లకు సబ్సిడీలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ రంగంలోకి కొత్త కంపెనీలూ పుట్టుకొస్తున్నాయి. పరిశోధన, తయారీ అనుభవం లేకుండా మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్లు అగ్నికి ఆహుతై ప్రాణాలనూ బలిగొనడం ఆందోళన కలిగిస్తోంది. జనాభిప్రాయం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వే నిర్వహించింది. ఈ–టూ వీలర్లు సురక్షితం కాదన్న అభిప్రాయాన్ని అత్యధికులు వెల్లడించారు. ఈ వాహనాలు ఖరీదైనవని, తక్కువ ధరలో లభిస్తే కొనుగోలుకు సిద్ధమన్న సంకేతాలను ఇస్తూనే అధిక దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం ఉండాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 1,50,886 మంది సర్వేలో పాల్గొన్నారు. వీరిలో చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 92.5 శాతం ఉండడం గమనార్హం. భవిష్యత్ ఈవీలదే.. ఎలక్ట్రిక్ టూ వీలర్లు సురక్షితం కాదని 57 శాతం మంది తేల్చి చెప్పారు. ఈ వాహనాల అగ్ని ప్రమాదాలు దీర్ఘకాలంలో వాటి అమ్మకాలపై ప్రభావం చూపుతాయని 1.14 లక్షల మంది (75.9 శాతం) స్పష్టం చేశారు. భవిష్యత్ మాత్రం ఎలక్ట్రిక్దేనని మూడింట రెండొంతుల మంది వెల్లడించారు. కొత్త కంపెనీకి బదులు ఇప్పటికే ద్విచక్ర వాహన రంగం లో ఉన్న సంస్థ నుంచి ఈవీ కొనుగోలుకు 55 శాతం పైగా ఆసక్తి చూపారు. ధర ఎక్కువ ఈ–స్కూటర్లు ఖరీదైనవని మూడింట రెండొంతుల మంది అభిప్రాయపడ్డారు. తక్కువ ధరలో లభించే మోడళ్లకే అత్యధికులు మొగ్గు చూపారు. రూ.50 వేల లోపు ధర కలిగిన ఈ–టూ వీలర్ కొనుగోలుకు 71 వేల మంది ఆసక్తి కనబరిచారు. వాహనం ఫుల్ చార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉండాలని 66 వేల మంది అభిప్రాయపడ్డారు. దేశంలో ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్లో ఈ–టూ వీలర్ల అమ్మకాలు సుమారు 1 శాతం తగ్గి 49,166 యూనిట్లకు చేరుకున్నాయి. చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్లు తగలబడటానికి కారణాలు ఇవి .. -
రియల్ ఎస్టేట్ డెవలపర్లకు భారీ షాక్!
సాక్షి, హైదరాబాద్: అధిక రుణాలు, నిధుల లేమిలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరొక గుదిబండలాగా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్ ధరలు గత ఏడాది కాలంలో 20 శాతం మేర పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10–12 శాతం పెరిగిందని కొల్లియర్స్ రీసెర్చ్ తెలిపింది. టోకు ధరల ద్రవ్యోల్బణం, మెటీరియల్ ధరలు రెండంకెల పెరుగుదలను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8–9 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రవాణా పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరుగుదల కారణంగా ఇన్పుట్ కాస్ట్ పెరిగాయని కొల్లియర్స్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో స్టీల్ ధరలు 30 శాతం, సిమెంట్ 22 శాతం, కాపర్ 40 శాతం, అల్యూమీనియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగాయని వివరించారు. దీంతో గతేడాది మార్చిలో నివాస సముదాయాల నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,060గా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300లకు, అలాగే ఇండస్ట్రియల్ నిర్మాణ వ్యయం గతేడాది రూ.1,900ల నుంచి ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,100లకు పెరిగిందని వివరించారు. ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నిర్మాణ పనులను చేపడుతున్న అందుబాటు, మధ్య స్థాయి గృహ నిర్మాణ డెవలపర్లకు తాజాగా పెరిగిన నిర్మాణ వ్యయం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వ్యయ భారం నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు డెవలపర్లు ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితని పేర్కొన్నారు. -
ప్రయోగాత్మకంగా డీజిల్ బస్సు ఎలక్ట్రిక్గా మార్పు! ఇక నుంచి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సు వచ్చింది. అయితే ఇది కొత్త బస్సు కాదు. డీజిల్ భారం నుంచి బయటపడేం దుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయోగంలో భాగంగా రూపుదిద్దుకున్న బస్సు. అంటే డీజిల్తో నడిచే బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారన్న మాట. ఈ బస్సు శుక్రవారం హైదరాబాద్లోని ముషీరాబాద్ డిపోకు చేరుకుంది. ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది, డీజిల్తో పోలిస్తే ఎంత ఆదా చేస్తుంది, నిర్వహణ వ్యయం ఎంత తగ్గుతుంది, ట్రాఫిక్ రద్దీలో ఎలా నడుస్తుందన్న అంశాలను బేరీజు వేసుకుని మరిన్ని బస్సులను ఎలక్ట్రిక్గా మార్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. అయితే అవి కేవలం విమానాశ్రయానికి వచ్చిపోయే వారికే సేవలందిస్తున్నాయి. వాటికి భిన్నంగా ఈ బస్సు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఖర్చు తగ్గింపే లక్ష్యం ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది. జీతాల తర్వాత అంత భారీ వ్యయం డీజిల్ కోసం అవుతోంది. ఒక్కో బస్సుకు కి.మీ.కు రూ.20 వరకు ఖర్చు అవుతోంది. జీతాలను తగ్గించుకోవటం సాధ్యం కాదు. కానీ డీజిల్ ఖర్చును తగ్గించుకునే వెసులుబాటు ఉండటంతో ఆర్టీసీ ఆ దిశగా యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపింది. ఎలక్ట్రిక్ బస్సుకు కి.మీ.కు కేవలం రూ.6 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే డీజిల్ బస్సుతో పోల్చితే ప్రతి కి.మీ.పై రూ.14కు పైగా మిగులుతుందన్నమాట. కానీ ఒక్కో కొత్త ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.కోటిన్నర పైమాటే. అంత వ్యయంతో ఎలక్ట్రిక్ బస్సులు కొనే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పిడి (కన్వర్షన్) చేసేందుకు ఉన్న అవకాశాన్ని సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఇందుకు ఒక్కో బస్సుకు రూ.65 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతుండటం కూడా ఆర్టీసీని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కేంద్రంగా ఎలక్ట్రిక్ రైలు లోకోమోటివ్లు తయారు చేసే ఓ సంస్థను సంప్రదించింది. ఆ సంస్థ అంగీకరించడంతో ముషీరాబాద్–2 డిపోకు చెందిన ఓ డీజిల్ బస్సును ఇవ్వగా దాన్ని ఎలక్ట్రిక్ బస్సుగా కన్వర్ట్ చేసిన సదరు సంస్థ శుక్రవారం ఆర్టీసీకి అప్పగించింది. దీంతో దాని పనితీరును నెల రోజుల పాటు పరిశీలించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఆ సంస్థకే నిర్వహణ బాధ్యతలు! ప్రస్తుతం కన్వర్షన్ ఖర్చును కూడా ఆర్టీసీ భరించలేదు. దీంతో బస్సును కన్వర్ట్ చేసిన తర్వాత నిర్ధారిత కాలం పాటు ఆ సంస్థే బస్సులను నిర్వహించుకుని, అద్దె వసూలు చేసుకుని, నిర్ధారిత కాలం తర్వాత బస్సులను ఆర్టీసీకి అప్పగించే విధానంపై ఆర్టీసీ ఆసక్తి చూపుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
వైట్ టీ షర్ట్లో అదిరిపోయిన సమంత.. టీ షర్ట్ ధరెంతంటే ?
స్టార్ హీరోయిన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అందం, అభినయం, ఫిట్నెస్తో సినీ ప్రేక్షకుల్నీ అలరిస్తోంది. సమంత ఉంటే సినిమాకు మంచి ఫలితమే దక్కుతుందని దర్శకనిర్మాతలు ఆమె వెంట క్యూ కడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ల వంటి ప్రాజెక్టులతో సామ్ ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫిట్నెస్, మోటివేషనల్ పోస్ట్తో యాక్టివ్గా ఉంటుంది. సమంతకు ఫిట్నెస్తో పాటు డ్రెస్సింగ్ స్టైల్పై కూడా ప్రత్యేక అవగాహన ఉంది. విభిన్నమైన డ్రైస్సింగ్ స్టైల్స్తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది సామ్. తాజాగా సమంత ముంబైలోని ఓ సెలూన్ నుంచి బయటకు వస్తూ కెమెరా కళ్లకు చిక్కింది. ప్రస్తుతం ఆ ఫొటోల్లో సమంత వేసుకున్న వైట్ టీ షర్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ చర్చంతా సామ్ వేసుకున్న టీ షర్ట్ ఖరీదు గురించి. ఎందుకంటే సామ్ వేసుకున్న ఆ 'ఆర్13 వైట్ టీ షర్ట్' ధర సుమారు రూ. 17,000 ఉంటుందట. వైట్ రిప్డ్ టీతో జత చేసిన బేసిక్ బ్లాక్ జీన్స్, వైట్ స్పోర్ట్స్ షూలు ధరించి మాస్క్ పెట్టుకుని ఆకట్టుకుంది సామ్ లుక్. త్వరలో ఈ స్టైల్ను ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి మరీ. -
వినియోగదారులకు భారీ షాక్, వీటి ధరలు పెరగనున్నాయ్
వినియోగదారులకు గృహోపకరణ సంస్థలు భారీ షాకివవ్వనున్నాయి. జనవరి ఫెస్టివల్ సీజన్ నుంచి మార్చి ఈ మూడు నెలల మధ్య కాలంలో ఫ్రిజ్, ఏసీల ధరలు భారీగా పెంచనున్నాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్ సెస్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) ప్రకారం..ముడి సరకుతో పాటు సరుకు రవాణా పెరగడంతో కన్జ్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్ను 5 నుంచి 10 శాతం వరకు పెంచేందుకు ఆయా కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. కమోడిటీస్, గ్లోబల్ ఫ్రైట్, ముడి సరుకు పెరుగుదలతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ కేటగిరీలలో ఉత్పత్తుల ధరలను 3 నుండి 5 శాతం వరకు పెంచడానికి చర్యలు తీసుకున్నామని హైయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ తెలిపారు. ఇప్పటికే ఏసీల ధరలను 8శాతం వరకు పెంచిన పానాసోనిక్, మరింత పెంచే ఆలోచనలో ఉందని, అందుకే గృహోపకరణాల ధరల పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎయిర్ కండీషనర్లు ఇప్పటికే దాదాపు 8 శాతం పెరిగాయి.పెరుగుతున్న వస్తువులు, సప్లయ్ చైన్ ధరల్ని బట్టి వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, గృహోపకరణాల ధరల పెరగొచ్చని పానాసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. కాగా, భారత్లో రూ.75 వేల కోట్లున్న ఇండియన్ అప్లయన్స్ మార్కెట్ కోవిడ్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. లాక్డౌన్, చిప్ కొరతతో పాటు ఉత్పత్తులు తగ్గి పోవడం,అదే సమయంలో డిమాండ్లు పెరగడంతో పలు కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. చదవండి: 2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..! -
తెలంగాణ: నష్టాల ఆర్టీసీలో దుబారా..!
సాక్షి, హైదరాబాద్: దుబారాను నియంత్రించటంలో ఆర్టీసీ బరాబర్ అశ్రద్ధ వహిస్తోంది. ఫలితంగా అప్పులకుప్పగా మారిన రుణాలపై ఏడాదికి రూ.250 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. మూడు నాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాని పక్షంలో ప్రైవేటీకరించటానికి వెనకాడనని సీఎం కేసీఆర్ హెచ్చరించారంటూ రెండు రోజుల కింద ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ దుబారా అంశం చర్చకు వచ్చింది. డీజిల్ ఖర్చు, జీతాలు, విడిభాగాల వ్యయం తప్పనిసరిగా భరించాల్సినవే. కానీ, దుబారాను అరికట్టడం అధికారుల చేతుల్లో పని. దుబారా ఇలా.. హైదరాబాద్–3 డిపోలో 27 గరుడ బస్సులున్నాయి. వీటి కోసం డ్రైవర్లు, కండక్టర్లు పోను 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. డిపో కరెంటు బిల్లు నెలకు రూ.70 వేల వరకు వస్తోంది. ఈ డిపోలో ఉన్నవన్నీ దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులే. ఇవి డిపోల వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవు. 15 కి.మీ. నుంచి 30 కి.మీ.మేర ఖాళీగా ప్రయాణించి బీహెచ్ఈఎల్, మియాపూర్, ఇమ్లీబన్ బస్స్టేషన్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. నిత్యం బస్స్టేషన్ల వరకు ఖాళీగా వెళ్లటం, అక్కడి నుంచి ఖాళీగా తిరిగి రావటంతో ఒక్కో బస్సు అనవసరంగా రూ.2 వేలకుపైచిలుకు డీజిల్ను కాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బస్సులను మియాపూర్, బీహెచ్ఈఎల్ లాంటి డిపోలకే కేటాయిస్తే వృథా వ్యయాన్ని అరికట్టవచ్చు. సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్ పక్కనే పికెట్ డిపో ఉంటుంది. ఈ డిపోలో ఆర్టీసీ సొంత బస్సులు 30, అద్దె బస్సులు 40 ఉన్నాయి. అద్దె బస్సుల నిర్వహణ వాటి యజమానులదే అయినందున డిపోలోకి అవి రావు. సొంతంగా ఉన్న 30 బస్సుల కోసం ఓ పెద్ద భవనం, డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఇలా డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా 50 మంది సిబ్బంది పని చేస్తున్నారు. భవనానికి కరెంటు బిల్లు నెలకు రూ.80 వేల వరకు వస్తోంది. హైదరాబాద్–2 డిపోలో సొంత బస్సులు 39 ఉంటే 42 అద్దె బస్సులు న్నాయి. ఈ బస్సులకు డ్రైవర్లు, కండ క్టర్లు పోను 50 మంది సిబ్బంది ఉన్నారు. కరెంటు బిల్లు రూ.80 వేలు వస్తోంది. ఇలాంటి చిన్న డిపోలను ఎత్తేసి ఆ బస్సులను వేరే డిపో ల్లో కలిపేస్తే ఈ వృథా వ్యయం ఉండదు. ఈ డిపోలు లేకపోతే వాటిల్లోని పెద్ద పోస్టులు రద్దవుతాయి. జీతాలు, కరెంటు బిల్లు వంటి భారాలు ఉండవు. డిపో భవనాలను ప్రైవేటు సంస్థలకు అద్దెకిస్తే ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతుంది. అనవసరపు ట్రిప్పులతో.. రాష్ట్రంలోని కొన్ని చిన్న పట్టణాల నుంచి హైదరా బాద్కు 45 నిమిషాలకో బస్సు తిప్పు తున్నారు. కానీ, ఆయా బస్సులు సిటీ చేరేటప్పటికీ 90% మేర ఖాళీగా ఉంటున్నాయి. అలాంటప్పుడు సిటీ ట్రిప్పులను గంటన్నరకు ఒకటి చొప్పున పెడితే ఈ ఖాళీ ట్రిప్పుల దుబారా ఉండదు. కరీం నగర్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, కొత్త గూడెం, నిజామాబాద్, మెదక్, మహ బూబ్నగర్, కల్వకుర్తి, నల్లగొండ, సూర్యాపేట లాంటి పట్టణాల్లో ఈ సమస్య ఉంది. హైదరాబాద్కు వెళ్లేందుకు కరీంనగర్, వరంగల్ లాంటి బస్టాండ్లలో ఒకేసారి పలు డిపోల బస్సులు వచ్చి ప్లాట్ఫారమ్లలో నిలబడుతున్నాయి. ఇవన్నీ 70 శాతం లోపు ఆక్యుపెన్సీ రేషియోతోనే నడుస్తున్నాయి. నాన్స్టాప్ బస్సుల్లో అయితే ఇక సిటీకి వచ్చే వరకు మధ్యలో ఎక్కడా ప్రయాణికులు ఎక్కే వీలు ఉండటం లేదు. ఇది ప్రస్తుతం ఆర్టీసీలో పెద్ద దుబారాగా మారింది. పండగలు లాంటి ప్రత్యేక సందర్భాలు, వారాంతాల్లో తప్ప మిగతారోజుల్లో ఈ ట్రిప్పులకు డిమాండ్ ఉండటం లేదు. అయినా అనవసరంగా తిప్పుతున్నారు. -
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు, అదనంగా ఎంత ప్రీమియం చెల్లించాలి?
వాహనదారుల సంక్షేమాన్ని కోరుతూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు తప్పనిసరి చేస్తూ మద్రాసు హై కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసేప్పుడు ఎంత ఆర్థిక భారం పడుతుంది. అమలు విధానం ఎలా ఉండవచచ్చు, కోర్టు తీర్పుపై ఇటు వాహన తయారీ సంస్థలు, అటు ఇన్సురెన్సు కంపెనీలు ఏమనుకుంటున్నాయి ? బంపర్ టూ బంపర్ లక్షలు ఖర్చు పెట్టి వాహనం కొనుగోలు చేసే సందర్భంలో ఇన్సెరెన్సు ప్రీమియం కట్డడంలో చాలా మంది వెనుకాముందు ఆలోచిస్తారు. ప్రీమియం తగ్గించుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తారు. దీనికి తగ్గట్టే ఇన్సెరెన్సు సంస్థలు, వాటి ఏజెంట్లు అతి తక్కువ ప్రీమియం ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సు ప్లాన్లనే చెబుతుంటారు. ఇప్పటి వరకు ఈ తరహా పద్దతే ఎక్కువగా చెల్లుబాటు అవుతూ వస్తోంది. అయితే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మొదటి ఐదేళ్ల పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరి చేసింది మద్రాసు హై కోర్టు. అంటే వాహనానికి ఏదైనా ప్రమాదం వాటిలినప్పుడు ఆ వాహనంతో పాటు దాని యజమాని లేదా డ్రైవరు, అందులో ప్రయాణించే వ్యక్తులందరికీ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. ప్రీమియం ఎంత పెరుగుతుంది? కొత్త వాహనాలకు కొనుగోలు చేసేప్పుడు నూటికి తొంభైశాతం మంది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సునే చేయిస్తున్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించేప్పుడే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులకు వెళ్తున్నారు. ప్రస్తుతం వాహన నెట్ప్రైస్లో 3 శాతం మొత్తాన్ని ఒక ఏడాది పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలని కోర్టు సూచించింది. ఆ లెక్కన వాహనం ధరలో 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచితే మార్కెట్వాల్యూ, తరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సురెన్సు ప్రీమియం దాదాపు మూడింతలు పెరిగిపోతుంది. ఆర్థిక భారం ఎంతంటే ? ఐదేళ్ల కాలానికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును లెక్కించందుకు హ్యుందాయ్ కంపెనీకి చెంది వెన్యూ కారును పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడు ఒక ఏడాది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్కి రూ. 38,900 ప్రీమియంగా ఉంది. ఇదే ఇన్సురెన్సును ఐదేళ్ల కాలానికి తీసుకుంటే ప్రీమియం మొత్తం ఒకేసారి రూ. 1,26,690కి చేరుతుంది. అంటే వినియోగదారుడు ప్రస్తుతం చెల్లిస్తుదానికి అదనంగా రూ. 87,790లు చెల్లించాల్సి వస్తుంది. వివిధ మోడళ్లను బట్టి ఈ ప్రీమియం మారుతుంది. వాహన తయారీ సంస్థలు ఏమంటున్నాయి ? కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే ఆటో మొబైల్ పరిశ్రమ కొలుకుంటోంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు ధరల తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకసారి ఐదేళ్లకు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ని కోర్టు తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనాల ధరలు పెరిగిపోతాయని, ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతుందని వాహన తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకి హ్యుందాయ్ వెన్యూ వాహనానికి సంబంధించి ఒక ఏడాది బంపర్ టూ బంపర్ రెండేళ్లు థర్డ్ పార్టీ ఇన్సురెన్సుతో కలిసి నెట్ప్రైస్ రూ. 9,96,310 ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల ఇన్సునెన్సు ప్రీమియం చెల్లించాలంటే రూ.10,84,295 చెల్లించాల్సి వస్తుంది. అదే మారుతి బ్రెజా విషయానికి వస్తే ఈ మొత్తం రూ.9,86,199 నుంచి రూ. 10,76,180కి చేరుకుంటుంది. ఇన్సురెన్సు కంపెనీ స్పందన ఏంటీ ? ఏ తరహా పాలసీ తీసుకోవాలి, ప్రీమియం ఎంత చెల్లించాలనే అంశంపై వాహన కొనుగోలుదారులను తాము ఒత్తిడి చేసేది ఏమీ ఉండదని ఇన్సురెన్సు కంపెనీలు చెబుతున్నాయి. మోటారు వాహన చట్టాలను లోబడి వాహన కొనుగోలుదారుడి ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే పాలసీలు చేయిస్తామని చెబుతున్నాయి. వాహనం కొనుగోలు చేసేప్పుడు చాలా మంది మొదటి ఏడాదికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ చేయిస్తారని, ఆ తర్వాత వాహనం వాడే విధానం, రిస్క్ ఆధారంగా థర్డ్పార్టీ లేదా బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సులు తీసుకుంటారని ఇన్సురెన్సు కంపెనీ ఏజెంట్లు వెల్లడిస్తున్నారు. చదవండి : బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
ఆ విషయంలో అమెరికాను వెనక్కి నెట్టిన ఇండియా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మేకిన్ ఇన్ ఇండియా కాన్సెప్టు క్రమంగా ప్రభావం చూపుతోంది. మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయం ఇటీవల విడుదలైన ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించి ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ వివిధ అంశాలపై ప్రతీ ఏడు సర్వేలు నిర్వహిస్తోంది. ఈ ఏడు నిర్వహించిన సర్వేలో ఇండియా సానుకూల ప్రగతిని సాధించినట్టు ఈ సర్వే ప్రకటించింది. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో ఇండియా పరిస్థితి మెరుగైంది. ప్రపంచంలోనే తయారీ రంగానికి సంబంధించి అత్యంత అనుకూలమైన దేశాల్లో రెండో స్థానం సాధించింది. ఇంతకు ముందు ఈ స్థానంలో అమెరికా ఉండేది. యూఎస్ఏను వెనక్కి నెట్టి ఇండియా ద్వితీయ స్థానానికి చేరుకుంది. ఇక ఎప్పటిలాగే మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో చైనానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియాకు అనుకూలించేనా ? ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల్లో సింహభాగం అమెరికాకు చెందినవే ఉన్నాయి. ఇటీవల చైనాతో నెలకొన్న వివాదం నేపథ్యంలో చైనాలో ఉన్న తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలించే యోచనలో అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికా కంపెనీలకు ఏషియాలో తయారీ హబ్గా చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా ఎదిగేందుకు అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది. ఈ అంశంలో ఇండియాకు ఇండోనేషియా, తైవాన్, వియత్నాంల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వ్యయ నియంత్రణలో వెనుకబాటు తయారీ రంగంలో ఇండియా పరిస్థితి మెరుగైనప్పటికీ వ్యయ నియంత్రణలో ఇండియా వెనుకడుగు వేసినట్టు ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వే ప్రకటించింది. గతంలో కాస్ట్ సినారియోలో ఇండియా ద్వితీయ స్థానంలో ఉండగా ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. అనూహ్యంగా ఇండోనేషియా ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు థాయ్లాండ్ ఎనిమిదో స్థానం నుంచి ఐదో స్థానానికి వచ్చి చేరింది. వ్యయ నియంత్రణలో ఇండియాకు తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక కాస్ట్ విషయంలో కూడా ప్రథమ స్థానంలో చైనానే ఉంది. ఇండియాలో రిస్క్ ఎక్కువ బిజినెస్ రిస్క్కు సంబంధించి ఇండియాకు ప్రతికూల ఫలితాలే ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వేలో వెల్లడయ్యాయి. ముఖ్యంగా పాలసీలు, పొలిటికల్ ప్రెషర్లను పరిగణలోకి తీసుకుని ఈ సర్వేను రూపొందించగా ఇండియా టాప్ దేశాల సరసన కాకుండా రిస్క్ ఎక్కువగా ఉన్న మలేషియా, బెల్జియం, ఇండోనేషియా, బల్గేరియా, రోమేనియా, థాయ్లాండ్, హంగరీ, కొలంబియా, ఇటలీ, పేరు, వియత్నాంల సరసన నిలిచింది. ఈ విభాగంలో కూడా చైనా మొదటి స్థానంలో ఉండగా కెనడా, అమెరికా, ఫిన్లాండ్, చెక్ రిప్లబిక్ దేశాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మెరుగుపడాల్సిందే తయారీ యూనిట్కు కావాల్సిన స్థలం, మానవ వనరులు విషయంలో ఇండియా స్థానం మెరుగైనా పొలిటికల్ ప్రెషర్, పాలసీల విషయంలో వెనుకబడే ఉంది. ఇక కాస్ట్ విషయంలో తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. చదవండి : సోలార్ పవర్ ప్రాజెక్టులో దూసుకెళ్తున్న టాటా పవర్ -
తగ్గడంలే... ఇళ్ల ధరలు పెరుగుతాయట!
సాక్షి, వెబ్డెస్క్: అద్దె ఇళ్లలో ఉండే సవాలక్ష నిబంధనలకు తోడు కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో సొంతిళ్లు అవసరమనుకునే వారి సంఖ్య పెరిగింది. అప్పు చేసైనా సరే ఇది నా ఇల్లు అనిపించుకుందామనే ప్రయత్నాలు పెరిగాయి. అయితే అంతకు ముందే ఇంటి నిర్మాణ రంగంలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సొంతింటికి కల మరోసారి మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతోంది. స్టీలు ధరలకు రెక్కలు ఇంటి నిర్మాణ రంగంలో కీలకమైన స్టీలు ధరలు ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. లాక్డౌన్ కంటే ముందు హోల్సేల్ మార్కెట్లో 8 మిల్లీమీటరు స్టీలు టన్ను ధర రూ.42,000 ఉండగా ఇప్పుడు టన్ను స్టీలు ధర రూ.57,00లకు చేరుకుంది. ఇదే తరహాలో సిమెంటు బ్యాగు ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. వీటితో పాటు ఇంటి నిర్మాణంలో కీలకమైన కాపర్ ధర 40 శాతం, అల్యుమినియం ధర 60 శాతం పెరిగినట్టు డెవలపర్లు చెబుతున్నారు. డిమాండ్ పెరిగింది కరోనా కల్లోల సమయంలో అద్దె ఇళ్లలో ఎదురైన ఇబ్బందులతో సొంత ఇల్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరిగింది. అయితే పెరిగిన ధరలు వారికి షాక్ ఇస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్తో ఇప్పటికే సేవింగ్స్ చాలా ఖర్చుకావడం, ఎక్కువ మందికి జీతాల్లో కోతలు పడ్డాయి. ఈ తరుణంలో లోన్లు తీసుకుని ఇళ్లు కొందామనుకునే వారికి పెరుగుతున్న ధరలు అశనిపాతంలా మారాయి. కట్టాలన్నా కష్టమే డెవలపర్లు ఒకేసారి పెద్ద ఎత్తున సిమెంటు, స్టీలు కొనడం వల్ల హోల్సేల్ ధరలకు లభిస్తున్నాయి. కానీ జిల్లా కేంద్రాలు, ఇతర చిన్న పట్టణాల్లో ఇంటి నిర్మాణం స్వంతంగా చేపట్టాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో టన్ను స్టీలు ధర 65,000 దగ్గర ఉంది. సిమెంటు బ్యాగు రూ. 400 దగ్గర లభిస్తోంది. దీంతో సొంతింటి కల భారంగా మారుతోంది. పెరిగిన లేబర్ కష్టాలు గతంలో బీహార్, ఉత్తర్ప్రదేశ్, ఒడిషాల నుంచి లేబర్ పెద్ద సంఖ్యలో హైదరాబాద్తో పాటు పెద్ద ప్రాజెక్టులు, జిల్లా కేంద్రాల్లో పనికి వచ్చే వారు. లోకల్ లేబర్తో పోల్చితే వీరు తక్కువ కూలీలకే పనులకు వచ్చేవారు. వరుస లాక్డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన లేబర్లో చాలా మంది అక్కడే ఉండి పోయారు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల కొరత ఏర్పడింది. డబుల్ కూలీ ఇస్తే తప్ప లేబర్ దొరికే పరిస్థితి లేదంటున్నారు డెవలపర్స్. 30 శాతం పెరుగుతాయి కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. మరోవైపు క్రమంగా నిర్మాణ రంగం కూడా గాడిన పడుతోంది. ధీర్ఘకాలం పాటు మధ్యలో ఆగిపోయిన భవనాల్లో తిరిగి పనులు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్ల ధరలు పెరిగిన మాట వాస్తవమేని, అయినా సరే ఇప్పుడు ఇళ్లు కొనడమే మంచిందని, పెరిగిన ముడి పదార్థాల ధరల వల్ల రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు కనీసం 30 శాతం వరకు పెరగవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు అంటున్నారు. స్టీలు ధరల పెరుగుదల (టన్ను ధర ) స్టీలు సైజు 2020 ఫిబ్రవరి 2021 ఆగస్టు 8 ఎంఎం రూ.42,000 రూ.57,000 10 ఎంఎం రూ. 41,000 రూ.56,000 12 ఎంఎం రూ.40,5000 రూ 56,000 14 ఎంఎం రూ.41,000 రూ.56,000 16 ఎంఎం రూ.41,000 రూ. 56,000 -
కేంద్రమే ఏదో ఒకటి చేయాలి, కార్ల ధరలపై మారుతి సుజుకీ
న్యూఢిల్లీ: కార్ల కొనుగోలు వ్యయం ఎక్కువగా ఉండడం వల్ల డిమాండ్ తగ్గుతున్నట్టు మారుతి సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్లో కార్లపై గరిష్ట స్థాయిలోని జీఎస్టీ, తదితర కారణాలను ఆయన ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రాలు ఈ భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోకపోతే పరిశ్రమ సరైన వృద్ధిని చూడలేదని అభిప్రాయపడ్డారు. మారుతి సుజుకీ వార్షిక నివేదికలో వాటాదారులకు ఆయన తన సందేశం ఇచ్చారు. ‘‘కార్లపై జీఎస్టీ అంతకుముందు ఎక్సైజ్ సుంకం ఆధారంగా ఉంది. ఇతర ప్రధాన దేశాలతో పోలిస్తే జీఎస్టీ ఎంతో ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలు తగ్గించేందుకు ముందుకు రాకపోతే చక్కని వృద్ధి సాధ్యపడదు’’ అని ఆయన వివరించారు. 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కరోనా మహమ్మారి గణనీయమైన ప్రభావం చూపిందంటూ.. వచ్చే మూడు త్రైమాసికాల్లో పనితీరు అన్నది ప్రధానంగా ప్రజలు తీసుకునే వ్యాక్సిన్లు, రక్షణ చర్యలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ‘‘ఈ ఏడాది మార్చిలో 2021–22 ఆర్థిక సంవత్సరంపై ఎంతో ఆశావహంగా ఉన్నాం. కరోనా మహమ్మారి ఒక్కసారిగా తీవ్రంగా విరుచుకుపడడం అందరినీ ఆశ్చర్యపరించింది. ఇది దేశవ్యాప్తంగా లాక్డౌన్లు, ఆంక్షలకు దారితీసింది. దీంతో ఉత్పత్తి, విక్రయాలు పడిపోయాయి. అంతకుముందు త్రైమాసికంలో కోలుకున్న డిమాండ్ మళ్లీ పడిపోయింది. దీంతో క్యూ1లో విక్రయాలు 3,53,600 యూనిట్లకే పరిమితమయ్యాయి’’ అని భార్గవ పేర్కొన్నారు. వైరస్ ప్రభావంపైనే భవిష్యత్తు విక్రయాలు ఆధారపడి ఉంటాయన్నారు. వ్యాక్సినేషన్ విస్తృత ప్రాతిపదికన జరగాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ దిశలో తగిన చర్యలు అవసరమన్నారు. -
కరీనా కపూర్ ధరించిన మాస్క్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ముంబై :బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవలె రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. డెలీవరీ అయిన నెలరోజుల్లోనే తిరిగి వర్క్మూడ్లోకి వచ్చేసేంది కరీనా కపూర్. జిమ్లో వర్కవుట్లు చేస్తూ తిరిగి ఫిట్నెస్పై దృష్టి పెట్టింది. సినిమా షూటింగుల్లోనూ పాల్గొంటుంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసత్య ప్రచారాలు నమ్మకండి..మాస్క్ ధరించండి అంటూ కరీనా కపూర్ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టును షేర్ చేశారు. ఇందులో కరీనా ధరించన ఈ మాస్క్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. సాధారణంగానే సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని కాస్ట్లీగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఆ జాబితాలోకి మాస్క్ కూడా వచ్చి చేరింది. ఇప్పుడుమాస్క్ లేనిదే అడుగు బయటపెట్టే పరిస్థితి లేనందున సెలబ్రిటీలు వాటిని మరింత స్టైలిష్గా డిజైన్ చేయించుకుంటున్నారు. తాజాగా కరీనా కపూర్ ధరించిన మాస్క్ ధర తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆమె ధరించిన మాస్క్ లూయిస్ విట్టన్ బ్రాండ్కు చెందింది. నలుపు రంగులో ఉన్న ఈ మాస్క్పై 'ఎల్వి' సింబల్తో వైట్ కలర్ ఎంబ్రాడయిరీ చేసి ఉంది. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) దీంతో ఈ మాస్క్ ధర తెలుసుకుందామని సెర్చ్ చేసిన నెటిజన్లకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే దీని ధర అక్షరాలా $355 (26వేలకు పైమాటే). ఇక గతంలోనూ ఇదే బ్రాండ్ మాస్క్ను దీపికా పదుకొణె, రణబీర్ కపూర్, సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ధరించారు. దీంతో ఈ మాస్క్ గురించి సోషల్మీడియాలో చర్చ నడుస్తుంది. మీరు కూడా ఇలాంటి మాస్క్ కొనాలనుకుంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ఈ బ్రాండ్ మాస్క్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. చదవండి : ఎన్టీఆర్ ధరించిన మాస్క్ ధరెంతో తెలుసా? కరీనా రెండో కొడుకు ఫోటో షేర్ చేసిన రణ్ధీర్ -
తెలంగాణలో ‘ప్రైవేట్’ టీకా రేటెంతో..?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేసే కరోనా టీకాకు ఎంత ధర ఖరారు చేస్తారన్న దానిపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ మొదలైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ వర్గాలకు చెందినవారు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న 236 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా టీకా వేయించుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తప్ప ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేసేందుకు అనుమతి లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశా యి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి టీకా తీసుకోవాలని తెలిపాయి. అంతమాత్రాన వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లోకి వచ్చినట్లుగా భావించకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా ధర ఎంత ఉండవచ్చనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రూ.300 నుంచి రూ.400 మధ్య ఉండే అవకాశముందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై నేడో రేపో స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి, ఫ్రంట్లైన్ వర్కర్లకు మాత్రమే ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ కనుసన్నల్లోనే ప్రైవేట్ వ్యాక్సినేషన్! ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో టీకా కార్యక్రమాన్ని ఎవరు పర్యవేక్షిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే ఆయా ఆసుపత్రులకు ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్ నుంచే టీకాలు సరఫరా అవుతాయా లేక నేరుగా కంపెనీల నుంచే వెళతాయా అన్నదానిపైనా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోవిన్ యాప్ను ఆధునీకరించే పనిలో ఉంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, కొన్ని మార్పులు చేర్పులతో కోవిన్ యాప్ రెండో వెర్షన్ను తీసుకురానుంది. అది నేడో రేపో అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వారికి సరఫరా అయిన వ్యాక్సిన్ వివరాలు తప్పనిసరిగా యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అర్హులైన లబ్ధిదారుల వివరాలను యాప్లో నమోదు చేశాకే టీకా వేయాలి. అలాగే ఏరోజు ఎన్ని టీకాలు వేశారో ఇంకెన్ని మిగిలాయో నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రైవేట్లోనూ పకడ్బందీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని, దీన్ని పర్యవేక్షించేందుకు కొందరు అధికారులను నియమిస్తామని కూడా ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీకా వేసే సిబ్బందికి ఈ మేరకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కేసులు నమోదైనా వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. టీకా ఉచితంగా తీసుకోండి ప్రైవేట్లో డబ్బులకు కరోనా టీకా వేస్తారు కాబట్టి, లబ్ధిదారులు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేసే టీకాలనే తీసుకోవాలి. కిందిస్థాయి పీహెచ్సీలు మొదలు గాంధీ, ఉస్మానియా వంటి పెద్దాసుపత్రుల వరకు దాదాపు 1,250కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా అందుబాటులో ఉంది. మున్ముందు రాష్ట్రంలో దాదాపు 4,500కు పైగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ టీకా అందుబాటులో ఉంచుతాం. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు -
రాధేశ్యామ్ : ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం 6కోట్లు!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్స్టోరీ ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాధేశ్యామ్లో ప్రభాస్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని, కేవలం ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసమే నిర్మాతలు 6కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డిజైనర్ టీం పని చేసిందని, ప్రభాస్ కెరియర్లోనే అత్యంత కాస్ట్లీ కాస్టూమ్స్ ఇవేనని సమాచారం. యూరప్ నేపథ్యంలో వింటేజ్ పిరియాడికల్ కథకు తగ్గట్లు ప్రభాస్ లుక్ కోసం చాలా జాగ్రత్తలు పాటించారట మూవీ టీం. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూలై 30న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమా విడుదలైన పది రోజులకే అంటే ఆగస్టు 11న ప్రభాస్ మరో చిత్రం ఆదిపురుష్ విడుదల కానుండటం గమనార్హం. చదవండి : (ప్రేమ కోసం చచ్చే టైప్ కాదంటున్న ప్రభాస్) (‘సలార్’ స్పెషల్ సాంగ్లో ప్రియాంక చోప్రా!) -
ధరలు చూసి ‘బోరు’మనాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: నీటి సమస్యను అధిగమించేందుకు ఇంట్లోనో... పొలం దగ్గరో బోరు వేయాలనుకుంటున్నారా.. అయితే కనీసం రెండు, మూడు లక్షలు సిద్ధం చేసుకోవల్సిందే. ఎందుకంటే బోరు తవ్వకం చార్జీలు భారీ పెరిగాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ధరలు సగటున యాభై శాతానికిపైగా పెరిగిపోయాయి. లాక్డౌన్, ఆ తర్వాతి పరిస్థితులు, డీజిల్ ధరలు, లేబర్ చార్జీల పెరుగుదల తదితర అంశాలను చూపుతూ రిగ్ ఓనర్ల సంఘం బోరు తవ్వకం ధరలను అమాంతం పెంచేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారీగా ధరల్లో కాస్త వ్యత్యాసం ఉన్నప్పటికీ... మొత్తంగా ధరల పెంపు భారీగా ఉండడంతో బోరు తవ్వించాలనున్న వాళ్లు ధరలు చూసి బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెయ్యి ఫీట్లకు రూ.2లక్షల పైమాటే.... బోరు తవ్వేందుకు చార్జీల తీరు స్లాబుల ఆధారంగా ఉంటుంది. భూమిలోకి డ్రిల్ చేసే ప్రతి వంద ఫీట్లకు ఒక్కో ధర ఉంటుంది. లోతుకు వెళ్తున్న కొద్ది బోర్వెల్ మిషన్పై ఒత్తిడి పెరగడంతో ధరలను క్రమంగా పెంచుతారు. రంగారెడ్డి జిల్లాలో కోవిడ్–19కు ముందు బోరు తవ్వేందుకు ప్రారంభంలో తొలి వంద ఫీట్లకు (అడుగులు) ఫీట్కు రూ.45 చొప్పున ఉండేది. క్రమంగా ప్రతి వంద ఫీట్లకు రూ.10 చొప్పున, 500 ఫీట్లు దాటిన తర్వాత రూ.20 చొప్పున, 800 ఫీట్లు దాటిన తర్వాత రూ.50 చొప్పున ధరలు పెంచేవాళ్లు. ప్రస్తుతం ఈ ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రారంభంలో తొలి వంద ఫీట్ల వరకు ఫీట్కు రూ.70గా నిర్ధారించగా... ఆ తర్వాత వందకు రూ.80 చొప్పున తర్వాతి వంద ఫీట్లపై రూ.100... ఇలా పెంచుతూ 900–1000 ఫీట్లలోతు తవ్వేందుకు ధర రూ.360గా ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. 2019లో 900–1000 ఫీట్ల లోతు తవ్వేందుకు ధర రూ.200 చొప్పున మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.160 పెంచేశారు. మొత్తంగా వెయ్యి ఫీట్ల లోతుకు బోరు తవ్వేందుకు ఏడాదిన్నర క్రితం గరిష్టంగా 1.25 లక్షలు (కేసింగ్, చార్జీలన్నీ కలిపి) కాగా... ప్రస్తుతం రూ.2.30 లక్షలు అవుతోంది. డీజిల్, కూలీల ధరలు పెరగడం వల్లే.. డీజిల్ ధరలు ఏడాదిన్నర క్రితంతో పోల్చుకుంటే ప్రస్తుతం 25 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అదేవిధంగా లాక్డౌన్ తర్వాత లేబర్ షార్టేజీతో కూలీల ధరలు కూడా పెరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే బోరు తవ్వకం ధరలు పెంచాం. – జె.గంగారెడ్డి, బోర్వెల్ నిర్వాహకుడు, బీఎన్ రెడ్డి నగర్, హైదరాబాద్ రెండేళ్లలో డబుల్ ఖర్చయ్యింది నాకున్న నాలుగున్నర ఎకరాల పొలంలో రెండేళ్ల క్రితం బోరు తవ్వించా. దాదాపు 900 ఫీట్లు వేశారు. అప్పుడు రూ.80 వేలు ఖర్చు అయ్యింది. ఇప్పుడు పూర్తిగా వరి వేయాలను కోవడంతో ఒక్క బోరు సరిపోదని 15 రోజుల క్రితం మరొకటి తవ్వించా. ఇదివరకు తవ్విన వ్యక్తే 950 ఫీట్లు తవ్వి రూ.1.92 లక్షల బిల్లు చేతిలో పెట్టాడు. రెండేళ్ల వ్యవధిలో డబుల్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. – డి.లక్ష్మణరావు, రైతు, మాల్ గ్రామం, రంగారెడ్డి జిల్లా -
58 దేశాలు, రూ. 517 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 నుండి ఇప్పటివరకూ మొత్తం 58 దేశాలను సందర్శించారు. ఈ మొత్తం వ్యయం 517 కోట్ల రూపాయలని మంగళవారం రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం తెలిపింది. విపక్ష సభ్యుల కోరిక మేరకు మోదీ విదేశీ పర్యటనలు, ఖర్చుల వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ పార్లమెంటు ముందుంచారు. ప్రధాని మోదీ అత్యధికంగా అమెరికా, రష్యా, చైనా దేశాలను ఐదు సార్లు పర్యటించినట్లు మురళీధరన్ తెలిపారు. ప్రధానమంత్రి సందర్శించిన ఇతర దేశాలలో సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శ్రీలంక ఉన్నాయని చెప్పారు. దీంతోపాటు ఒకసారి చైనాలో పర్యటించారు. ఈ నెల ప్రారంభంలో థాయ్లాండ్ను కూడా మోదీ సందర్శించారు. అయితే కరోనా, ప్రపంచవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మోదీ విదేశీ పర్యటనకు వెళ్లలేదని వివరించారు. చివరిగా గతేడాది నవంబర్లో బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లినట్లు ఆయన చెప్పారు. వాణిజ్య, సాంకేతిక, రక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ విదేశీ పర్యటనలు సహాయపడ్డాయన్నారు. తద్వారా ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై భారతదేశ దృక్పథాలపై ఇతర దేశాలలో అవగాహనను పెంచిందని మురళీధరన్ చెప్పారు. (ఐరాసను సంస్కరించాల్సిన తరుణమిదే!) కాగా 2014 నుంచి డిసెంబర్ 2018 వరకు మోదీ విదేశీ పర్యటనలకు రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయినట్లు 2018 డిసెంబర్లో కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పటి విదేశాంగ శాఖ మంత్రి వికె సింగ్ ప్రకటించిన డేటా ప్రకారం జూన్ 15, 2014, డిసెంబర్ 2018 మధ్య కాలంలో ప్రధానమంత్రి విమానాల నిర్వహణ ఖర్చు 1,583.18 కోట్లు, చార్టర్డ్ విమానాల కోసం 429.25 కోట్లు ఖర్చు చేశారు. హాట్లైన్ వసతుల కోసం మొత్తం ఖర్చు 9.11 కోట్లుగా ప్రకటించారు. మోదీ విదేశీ పర్యటనలపై ప్రతిపక్ష పార్టీల విసుర్లు, ప్రధానంగా గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన జాతీయ ఎన్నికలకు ముందు, వ్యవసాయ రంగంలో సంక్షోభ సమయంలో విదేశీ పర్యటనలు అవసరమా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. -
మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ 446.52 కోట్లు వెచ్చించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. చార్టర్డ్ విమానాలతో కలిపి ఇంత మొత్తం ఖర్చయిందని లోక్సభలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఓ ప్రశ్నకు బదులిస్తూ తెలిపారు. ఇక 2015-16లో రూ 121.85 కోట్లు, 2016-17లో రూ 78.52 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు. 2017-18లో ఈ వ్యయం రూ 99.90 కోట్లు కాగా, 2018-19లో రూ 100 కోట్లు, 2019-20లో రూ 46.43 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ఖర్చయిందని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై భారీగా ఖర్చు పెడుతున్నారన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించడం గమనార్హం. చదవండి : హోలీ వేడుకలకు దూరంగా ఉందాం! -
సంక్షేమంలో సర్దుపాట్లు..
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం సర్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలగకుండా ఖర్చులు తగ్గించుకుంటూ ప్రాధాన్యత కార్యక్రమాలకు అనుగుణం గా నిధులు వెచ్చించాలని సూచిస్తోంది. ఈ మేరకు సంక్షేమ శాఖలు, అనుబంధ విభాగాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు పంపింది. ఇటీవల సంక్షేమ శాఖ ల వారీగా ఆర్థిక శాఖ సమీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో 2019–20 బడ్జెట్ కేటాయింపులపై చర్చించడంతోపాటు సంక్షేమ శాఖల వారీగా అవసరాలను ప్రాధాన్యత క్రమంలో ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే శాఖల వినతులను పరిశీలిస్తూనే.. నిధుల సర్దుబాటుపై పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ట్రెజరీ ద్వారా చెల్లింపుల ప్రక్రియ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతుండగా.. ప్రభుత్వ శాఖలే నేరుగా చెల్లించే అంశాలపై పలు రకాల మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. సంక్షేమ శాఖ సంచాలక కార్యాలయాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఖజానా శాఖకు అనుసంధానం కాగా.. కార్పొరేషన్లు, సొసైటీలు, ఫెడరేషన్లకు సంబంధించి మాత్రం నేరుగా చెల్లింపులు చేసే వీలుంది. ఇందుకు ఆయా శాఖలకు పీడీ ఖాతాలతోపాటు ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం, వాటిపై వచ్చే వడ్డీని వినియోగించుకునే అధికారం ఉంది. ప్రభుత్వ అనుమతితోనే ఇవన్నీ నిర్వహించినప్పటికీ.. నిధుల వినియోగంలో స్వతంత్రత ఉంటుంది. తాజాగా వాటికి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల ని ప్రభుత్వం పరోక్ష ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాల్లో నిల్వలెన్ని... రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు సంబంధించి కార్పొరేషన్లు, సొసైటీలకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలుంటాయి. డిపాజిట్లు చేసేందుకు కూడా ప్రత్యేక ఖాతా లుంటాయి. వీటితో పాటు ఇంజనీరింగ్ విభాగాలున్న శాఖలకు వేరుగా పీడీ ఖాతాలుంటాయి. కొన్ని శాఖలకు రెండు, అంతకంటే ఎక్కువ ఖాతాలు న్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఆర్థిక శాఖ సూచనలు చేసింది. ఖాతాల్లో నిల్వలపై త్వరలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఆచితూచి ఖర్చు చేయండి వ్యయ కుదింపు చర్యలపైనా దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ప్రాధాన్యత అంశాలకే ఖర్చులు చేయాలని, నిర్మాణ పనులు వద్దని స్పష్టం చేసింది. గురుకుల పాఠశాలల్లో, వసతి గృహాల్లో, ఇతర విద్యాసంస్థల్లో మరమ్మతు పనులను జాగ్రత్తగా చేయాలని, అత్యవసరమైన వాటికే ఖర్చు లు చేయాలని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన గురుకుల పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించాలని గురుకుల విద్యాసంస్థల సొసైటీలు ప్రతిపాదనలు సమర్పించగా.. సున్నితంగా తిరస్కరించడం గమనార్హం. -
సేవకో రేటు!
సాక్షి, అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో కొందరు సిబ్బంది.. సేవలకు రేటు కట్టారు. ఒక్కోసేవకు రేటు ఫిక్స్ చేసి ఇక్కడికొచ్చేవారి జేబులు ఖాళీ చేస్తున్నారు. పేదలమని డబ్బులివ్వకపోతే...నోటికి పని చెబుతారు. అందరిముందే దుర్భాషలాడుతూ పరుపుతీస్తారు. అందుకే ధర్మాస్పత్రికి వచ్చేందుకే జనం జంకుతున్నారు. సిబ్బందితోనే... ఇబ్బంది సర్వజనాస్పత్రిలోని గైనిక్, లేబర్ వార్డు సిబ్బంది (వైద్యులు, స్టాఫ్నర్సులు కాదు) తీరుతో ఇక్కడికి ప్రసవాలకు వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది అడిగినంత ఇవ్వకపోతే పురిటి నొప్పుల కంటే ఇక్కడి సిబ్బంది పెట్టే టార్చరే ఎక్కువగా ఉంటుందని గర్భిణీలు, బాలింతలు వాపోతున్నారు. బాలింతలకు ‘జనని సురక్ష యోజన’ కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బు కన్నా ముందే సిబ్బందికి రూ.1,500 వరకు ముట్టజెప్పాల్సి వస్తోందంటున్నారు. రూ.500 సరిపోదమ్మా ‘‘సిజేరియన్ చేసిన వెంటనే బాబును శుభ్రం చేశాం. మరీ రూ.500 ఇస్తే ఏం సరిపోతుంది. మేము చాలా మందిమి ఉన్నాం...’’ అని వైద్యసిబ్బంది డిమాండ్ చేస్తున్నారని రాప్తాడు మండలం గొందిరెడ్డి పల్లికి చెందిన బాలింత సునీత వాపోయింది. ఆమెకు జూన్ 25న ఆస్పత్రిలోని లేబర్ వార్డులో సిజేరియన్ చేయగా...ఇక్కడి సిబ్బంది డబ్బుకోసం ఇబ్బంది పెట్టారని చెబుతోంది. ఇక స్ట్రెచ్చర్ నుంచి గైనిక్ వార్డుకి తీసుకొచ్చినందుకు రూ 100, చీర మార్చినందుకు రూ 100, కుట్లు శుభ్రం చేస్తున్నందుకూ రూ.50 తీసుకుంటున్నారని సునీత తల్లి సుశీల చెబుతున్నారు. ప్రసవం అయ్యాక శిశువును శుభ్రం చేయాలంటే.. రూ.500 బాలింతను స్ట్రెచ్చర్పై గైనిక్ వార్డుకు తీసుకొస్తే.. రూ 100 చీర మార్చినందుకు.. రూ 100 కుట్లు శుభ్రం చేస్తున్నందుకు.. రూ.50 కుట్లు విప్పేందుకు.. రూ. 200 వీల్చైర్లో అంబులెన్స్ వరకూ తీసుకెళ్తే.. రూ.100 ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రుల్లో సేవలకు చేసే చార్జ్ కాదు.. మన సర్వజనాస్పత్రిలోనే రోగుల నుంచి సిబ్బంది ముక్కు పిండి వసూలు చేస్తున్న మొత్తం. అడిగినంత ఇవ్వకపోతే ఇక బూతులే. డబ్బులివ్వకపోతే నరకమే! సర్వజనాస్పత్రికి వచ్చే వారంతా నిరుపేదలే. అందకూ కూలినాలి పనులు చేసుకునేవారే. అలాంటి వారినీ ఆస్పత్రిలోని లేబర్, గైనిక్ విభాగంలోని సిబ్బంది పీడిస్తున్నారు. ఆస్పత్రిలోని లేబర్వార్డులో రోజూ 30 నుంచి 40 ప్రసవాలు జరుగుతుండగా... వీటితో 10 నుంచి 12 సిజేరియన్లు ఉంటాయి. సిజేరియన్ అయిన వారి నుంచి సిబ్బంది భారీగా వసూలు చేస్తున్నారు. పైగా ఆమాత్రం ఇవ్వలేనోళ్లు కడుపెందుకు తెచ్చుకోవాలని నీచంగా మాట్లాడుతున్నట్లు గర్భిణులు వాపోతున్నారు. చీర మారిస్తే రూ.50 ప్రతి దానికి యాభైలు, వందలు. మేము యాడనుంచి తీసుకురావాలి. మా కోడలు అశ్వినికి పొద్దున్నే డ్రస్ మార్చాలంటే రూ.50 ఇస్తేనే చేస్తామంటారు. ఆ డబ్బుల్లేకనే గదా గవర్నమెంట్ ఆస్పత్రికి వచ్చింది. ఉన్నోళ్లుంటారు.. పూట గడవనోళ్లు ఉంటారు... లేనోళ్లను ఇబ్బంది పెట్టకండయ్యా. మీకు దండం పెడతాం. – ఆదెమ్మ, దంతలూరు, బీకేఎస్ మగబిడ్డ పుట్టాడు కదా... ఆ మాత్రం ఇవ్వలేవా..? ‘‘మగ బిడ్డ పుట్టాడు కదా...? ప్రసవమైనప్పుడు ఏమీ ఇవ్వలేదు. కనీసం బిడ్డను శుభ్రం చేసిన దానికి, యూరిన్ పైప్ వేసినందుకైనా డబ్బులివ్వు’’ అని అడుగుతున్నారని కూడేరు మండలం కలగళ్ల గ్రామానికి చెందిన బాలింత ఆదిలక్ష్మి వాపోయింది. ఆమె జూన్ 25న ప్రసవం కాగా..డబ్బుకోసం సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కన్నీటిపర్యంతమయ్యింది. డబ్బులివ్వకుంటే అందరి ముందే దూషిస్తున్నారని, పరువు పోతుందని భావించి డబ్బులిస్తున్నామని చెబుతోంది. కూలి పనులు చేసుకునే తమ లాంటి పేదోళ్లతో ఇలా డబ్బులు తీసుకోవడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చర్యలు తీసుకుంటాం ఆస్పత్రిలో వైద్య సేవలన్నీ ఉచితం. ఇక్కడ సిబ్బందికి చిల్లిగవ్వ ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే నా దృష్టికి తీసుకురావచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే గైనిక్, లేబర్ తదితర విభాగాల వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి వాటికి ఫుల్స్టాప్ పెడతాం. – డాక్టర్ బాబూలాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
నాడు 6 పైసలు.. నేడు రూ.46
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీలు, అభ్యర్థులు ప్రచారం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంటే, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది. మొదటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పార్టీలు పెరిగాయి. అభ్యర్థులూ పెరిగారు. దాంతో పాటే ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ వ్యయం కూడా పెరుగుతోంది. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి రూ.10 కోట్లు ఖర్చయ్యాయి. అంటే ఒక ఓటరుకు 6 పైసలు ఖర్చయినట్టు. అదే 2014 నాటికి ఎన్నికల వ్యయం రూ.3,870 కోట్లకు చేరింది. అంటే ఒక ఓటరుపై రూ.46 వెచ్చిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఒక ఓటరుపై రూ.15 ఖర్చు చేసింది. అభ్యర్థుల ప్రచార వ్యయం, భద్రతా ఏర్పాట్ల ఖర్చు మినహా మిగతా ఖర్చు ఇది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల సంఘం ఓటరు నమోదు ప్రచారం చేపట్టడం, దాని కోసం భారీగా ప్రకటనలు జారీ చేయడం, ఎన్నికల జాబితాలను డిజిటలైజ్ చేయడం వంటి చర్యలతో ఇటీవల ఎన్నికల వ్యయం బాగా పెరిగింది. అలాగే, ఎన్నికల సిబ్బందికి ఇస్తున్న గౌరవ భృతి పెరగడం, వారికి శిక్షణ నివ్వడానికి రాకపోకల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కొత్తగా రాజకీయ పార్టీల ప్రచారాన్ని, పోలింగ్ సరళిని వీడియో తీస్తున్నారు. దీని ఖర్చు కూడా ఎన్నికల సంఘం ఖాతాలోకే వెళుతుంది. అమెరికా కంటే ఎక్కువ దేశంలో ఎన్నికల నిర్వహణ భారీ వ్యయంతో కూడుకుందని అమెరికా నిపుణులు చెబుతున్నారు. 2019 ఎన్నికల వ్యయం దేశ చరిత్రలోనే అత్యధికంగా ఉండవచ్చని, బహుశా ప్రపంచంలో మరే ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంత ఖర్చు ఉండదని వారంటున్నారు. 2016లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, కాంగ్రెస్ ఎన్నికలు కలిపి జరిగాయి. వీటికి మొత్తం 650 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. 2014లో మన దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు 500 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయని అంచనా. 2019 ఎన్నికల వ్యయం దీన్ని మించిపోతుందని కార్నేజ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ థింక్ ట్యాంక్కు చెందిన మిలన్ వైష్ణవ్ చెప్పారు. -
నన్ను కట్టుకో
‘‘అబ్బ.. ఎంత బాగుందోనే ఈ చీర...’’ కళ్లల్లో మెరుపుతో కాంప్లిమెంట్ ఇచ్చింది మందాకిని.‘‘కదా... అందుకే.. బడ్జెట్ కంటే ఎక్కువైనా కొనేసుకున్నా ...’’ అపురూపంగా చీరను హత్తుకుంటూ తార. ‘‘ఊ... చాలాబాగుందే..’’ మందాకిని మనసంతా చీరమీదే ఉంది. ‘‘ఎక్కడ కొన్నావ్?’’ ఆదుర్దాగా అడిగింది .‘‘అదృశ్యపట్టులో’’ ఉత్సాహంగా తార. ‘‘ అయితే.. నా పెళ్లి షాపింగ్ కూడా అక్కడే చేస్తా...’’ మందాకిని. పదిహేను రోజుల్లో తార పెళ్లి. ఫార్మాసిస్ట్. ప్రాక్టికల్గా ఉండే మనిషి. అనవసర ఖర్చులకు దూరం. అందుకే పెళ్లి కూడా చాలా సింపుల్గా జరగాలని పెళ్లికొడుకు వాళ్లతో ఒప్పించింది. కట్నం ముచ్చటేరానివ్వలేదు. కాని ఈ పెళ్లి చీర పట్లే ఎందుకో విపరీతమైన కాంక్షను కనబరిచింది. వందల చీరల్లో ఈ చీరే ఆకర్షించింది ఆమెను. ఎన్ని సార్లు దాన్ని చూడొద్దనుకున్నా.. దానివైపే మనసు లాగింది. దాని ధర చూశాక గుండె గుభేల్మనడంతో పక్కన పడేసింది కూడా. అయినా అది తననే చూస్తున్నట్టు.. నన్ను తీసుకో అంటూ అభ్యర్థించినట్టూ.. వెంటాడినట్టూ అనిపించింది తారకు. దాంతో ఆ చీరనే తీసుకుంది. తార తల్లి, మేనత్తకు ఆశ్చర్యమేసింది...పీనాసిగా ముద్రేసుకున్న తార.. పెళ్లి చీర విషయంలో ఇంత ఉదారంగా ఉందేంటని! ‘‘ ఇంకా వారమే ఉందే. బ్లౌజ్ కుట్టడానికి ఇవ్వనేలేదు. చీరకు ఫాల్ కూడా వేయాలి. ఎప్పుడిస్తావ్?’’ కేకలేసింది తార మేనత్త పెళ్లి సరంజామా అంతా సర్దుతూ.‘‘ఇస్తాలే అత్తా...’’ నీరసంగా తార ..కాఫీ కప్తో మేనత్త పక్కనే కూర్చుంటూ.‘‘ఇంకెప్పుడూ?’’ అంది పసుపు కొమ్ముల మూట విప్పుతూ మేనత్త. ‘‘అబ్బా.. అది మూటకట్టేసేయత్తా’’ చిరాగ్గా తార. ‘‘ఏమైందే? శుభమాని పసుపు మూట విప్పుతూంటే కట్టేయమంటావ్’’ మేనకోడలి ప్రవర్తనకు విస్తు పోతూ.‘‘ తీసేయ్ ’’ అని అరుస్తూ ఆ మూటను కాలుతో విసిరికొట్టింది తార.అవాక్కయి నోరెళ్లబెట్టింది మేనత్త. ఎంత కోపన్నయినా బ్యాలెన్స్ చేసుకునే పిల్ల.. ఇలా అకారణంగా చిరాకుపడడం.. ఇదే మొదటిసారి. కొంపదీసి ఈ పెళ్లిగాని ఇష్టంలేదా ఏంటీ? ఒక్క క్షణంలోనే రకరకాల ఆలోచనలు మేనత్తకు. ‘‘అత్తా.. పసుకొమ్ముల మూటేంటి? అలా గిరాటేశారు?’’ అమాయకంగా తార.. షాక్ మేనత్తకు. ‘‘అత్తా..నిన్నే అడుగుతోంది? ’’చేష్టలుడిగిన మేనత్త భుజం పట్టి ఊపుతూ తార.‘‘ ఎవరు గిరాటేసారో నీకు తెలీదా’’ అయోమయంగా అడిగింది మేనత్త. ‘‘ నాకేం తెలుసత్తా? నేనిప్పుడే కదా వచ్చింది ’’ అంటూ నేల మీద గొంతుక్కూర్చుని పసుపు కొమ్ములన్నీ ఏరసాగింది. మతిపోయింది మేనత్తకు. వంగి.. తార గడ్డాన్ని పట్టుకుని తల పైకెత్తుతూ.. ‘‘ఏమే... వీటిని ఎవరు విసిరికొట్టారో నిజంగానే నీకు తెలీదా?’’ అడిగింది.‘‘ఏమైందత్తా నీకు?’’ గాబరాగా తార. తల పట్టుక్కూలబడ్డది మేనత్త. మధ్యాహ్నం భోజనాలప్పుడు.. ఎంత వడ్డిస్తున్నా వద్దనడం లేదు తార. వంచిన తలెత్తకుండా తింటూనే ఉంది. ఉదయం జరిగిన సంఘటనతో ఇంకా తేరుకోని మేనత్త.. తార తింటున్న తీరుతో మరింత గందరగోళంలో పడిపోయింది. ఇంట్లో వాళ్లందరికీ వింతగానే ఉంది. తారను అలా వదిలేసి మౌనంగా వేరే గదిలోకి వెళ్లిపోయారు వాళ్లు ఏమీ అర్థంకాక. మేనత్త కూడా మళ్లీ మళ్లీ తిరిగి చూస్తూ భయం భయంగానే అక్కడి నుంచి కదిలింది. లోపల గదిలో ఉన్న తార తల్లిదండ్రులకు పొద్దున జరిగిన విషయం చెప్పింది ఆమె. కారణం కనుక్కొనే యోచనలో పడ్డారంతా. ఇంతలోకే వగరుస్తూ ఆ గదిలోకి వచ్చింది తార.. ‘‘అమ్మా.. ఆకలేస్తోందే. అన్నం పెట్టవా? మందాకిని వస్తానంది. తినేసి పార్లర్కు, అక్కడి నుంచి టైలర్ దగ్గరకూ వెళ్లాలి.. బ్లౌజ్ ఇవ్వాలి.. ఫాల్ కుట్టించాలి.. అమ్మో.. టెన్షన్ వచ్చేస్తుంది’’ అంది ఫోన్లో ఏదో నంబర్ కలుపుతూమేనత్తకైతే మొహంలో నెత్తురు చుక్కలేదు.. మిగతా వాళ్లది ఉదయం మేనత్తకు ఎదురైన అనుభవమే!తార తండ్రి.. మెల్లగా భార్య వెనకాలకు వచ్చి.. మోచేత్తో పొడిచాడు.. ‘‘వెళ్లి పిల్లకు అన్నం పెట్టు’’ అన్నట్టుగా!కన్ఫ్యూజన్ స్టేట్లోనే తార తల్లి డైనింగ్ హాల్లోకి వెళ్లింది ‘‘రామ్మా.. అన్నం పెడతాను’’ అని కూతురిని పిలుస్తూ!‘‘ఆ.. ఆ..’’ అని తల్లికి సమాధానమిస్తూ ఫోన్లోంచి తల పైకెత్తింది. కళ్లు పెద్దవి చేస్తూ అందరూ తననే చూస్తూండే సరికి.. ‘‘ఏమైంది’’ అడిగింది . ఏమీ కాలేదన్నట్టుగా తలలూపారు అందరూ! ‘‘మరెందుకలా చూస్తున్నారంతా?’’ ఈసారి ఆశ్చర్యం తారది. సేమ్ ఓల్డ్ ఎక్స్ప్రెషన్లో ఫ్యామిలీ మెంబర్స్.ఏంటో అన్నట్టుగా భూజాలెగరేస్తూ నడిచింది తార భోజనాల గదిలోకి. పెళ్లికి మూడు రోజుల ముందు.... ఉదయం ఏడైంది.. దగ్గరి చుట్టాలతో తారా వాళ్లిల్లంతా సందడిగా ఉంది. వదినామరదళ్ల పరాచికాలు.. బావామరదుల వేళాకోళాలు.. అత్తాకోడళ్ల సరదాలతో కళకళలాడుతోంది. కాని అసలు మనుషుల మొహాల్లో సంతోషం కనపడ్డం లేదు. బయటికి నవ్వు నటిస్తున్నారు కాని లోపలంతా తెలియని భయం... పూటపూటకూ మారుతున్న తార బిహేవియర్ గురించి. పెళ్లి కూతురుని చేయడానికి పీట మీద కూర్చోబెట్టారు తారను. అమ్మమ్మ, నానమ్మతోపాటు అత్త వరస, పిన్ని వరస, అక్క వరస అయ్యేవాళ్లంతా ఒక్కొక్కళ్లే వచ్చి బొట్టు పెడ్తున్నారు...తార తల్లి,మేనత్త ఉగ్గబట్టుకుంటున్నారు.. తార ఎప్పుడు ఎలా.. రియాక్ట్ అవుతుందోనని!వాళ్ల అంచానాలను తారుమారు చేస్తూ ... తార .. చక్కగా నవ్వుతూ.. సిగ్గు పడుతూ కూర్చుంది. పసుపు రాస్తున్నారు.. నలుగు పెడ్తున్నారు.. మంగళ వాద్యాలు మోగుతున్నాయి.. పెరట్లో ఆరుబయట ఆనవాయితీగా మంగళ స్నానం చేయించాక.. షాంపూతో తలంటుకొమ్మని పెరట్లోనే ఉన్న బాత్రూమ్లోకి పంపించారుతారను.టిఫిన్ పని చూసేందుకు వాళ్లంతా వంటింట్లోకి వెళ్లబోతుంటే తార ఎదురు పడింది. నిశ్చేష్టులయ్యారంతా. అసంకల్పితంగానే వెనక్కి తిరిగి చూశారు బాత్రూమ్ వైపు. తలుపు వేసే ఉంది. మళ్లీ తార ౖవైపు తిరిగారు. ‘‘సారీ.. అమ్మా.. అలారం మోగినా మెలకువ రాలేదు. ముహూర్తం ఎనిమిదిలోపు ఎప్పుడైనా అన్నారు కదా?’’అంది తార. యాంత్రికంగా తలూపింది తార తల్లి. ‘‘బ్రష్చేసుకొని వస్తానుండండి’’ అంటూ పెరట్లోని బాత్రూమ్లోకి వెళ్లింది. మతి పోయినంత పనైంది అందరికీ! వీళ్ల స్థితి ఇలా ఉండగా.. తార అన్నయ్యకు ఫోన్కాల్ వచ్చింది. ‘‘సర్.. మీరు ఈ మధ్యఅదృశ్యపట్టులో ఏమైనా షాపింగ్ చేశారా?’’‘‘అవును’’‘‘అక్కడ బిల్ డిటైల్స్లో మీ నంబర్ తీసుకుని ఫోన్ చేస్తున్నా సర్.. ఒకవేళ పెళ్లి చీర కొంటే మాత్రం అది కట్టుకోవద్దని చెప్పండి. కొనే వరకు నన్నుతీసుకో అని.. కొన్నాక నన్ను కట్టుకో అంటూ కలలో కూడా వెంటాడుతుంది ఆ చీర. మా చెల్లి ఆ షాప్లోనే పనిచేసేది. పెళ్లి కుదిరాక అక్కడే పెళ్లి చీర కొనుక్కుంది. పెళ్లికొడుక్కి ఇదివరకే పెళ్లయిందని తెలిసి పీటల మీద పెళ్లి ఆగిపోయింది. మా చెల్లి ఆ చీరతోనే ఉరేసుకుంది సర్’’ఫోన్ డిస్కనెక్ట్ చేసి గబగబా తల్లి దగ్గరకు పరిగెత్తాడు తార వాళ్ల అన్నయ్య. - సరస్వతి రమ -
రూపాయి నాణెం = రూ.1.11?
సాక్షి,ముంబై: రూపాయి నాణేన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.1.11. అవునా... అని ఆశ్యర్యంగా అనిపించినా ఇదే నిజం. ఆర్బీఐ అధికారికంగా అందించిన సమాచారం ప్రకారం ఒక రూపాయి నాణెం తయారీకి అయ్యే ఖర్చు అక్షరాలా రూపాయి పదకొండు పైసలు. అంటే దాని మార్కెట్ వాల్యూ కంటే అధికంగా ఖర్చు అవుతోందన్న మాట. ఆర్టీఐ ద్వారా ఇండియా టుడే అడిగిన ప్రశ్నను వివిధ ప్రభుత్వ నాణేల ముద్రణా కార్యాలను పంపించింది రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా. అయితే నాణేల ఉత్పత్తి కయ్యే మొత్తం వ్యయం వివరాలను అందించేందుకు ఇండియన్ గవర్నమెంట్ మింట్ (ఐజీఎం) నిరాకరించింది. సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 8 (1) (డీ) ప్రకారం వాణిజ్య రహస్యమని పేర్కొంది. మింట్ అందించిన సమాచారం ప్రకారం గడిచిన రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన ఖర్చు ఇటీవలకాలంలో భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో నాణేల తయారీని భారీగా తగ్గించి వేసింది మింట్. 2016-17లో 2201 మిలియన్ల నాణేలను తయారుచేసిన మింట్..2015-16లో 2151 మిలియన్లుగా ఉన్నాయి. వీటిలో రూపాయి నాణేల 903 మిలియన్ల నుంచి 630 మిలియన్లకు తగ్గించింది. హైదరాబాద్ మింట్ కూడా గత నాలుగు సంవత్సరాల గణాంకాల సమాచారాన్ని అందించింది. ముంబైతోపాటు హైదరాబాద్లలో ఉన్న మింట్ కేంద్రాల్లో రూ.10, రూ.5, రూ.2. రూ.1 నాణేలు తయారవుతున్నాయని మింట్ తెలిపింది. ఖర్చులు పెరిగినప్పటికీ నాణేల తయారీని నిలిపివేసే అవకాశాలు లేవని మింట్ ప్రకటించింది. అయితే రూపాయి నాణెంతో పోలిస్తే మిగిలిన నాణేల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది. రూ. 1.28 ఖర్చుతో రూ. 2 నాణెం తయారవుతుండగా, 5 రూ. నాణేనికి రూ.3.69, 10 రూపాయల నాణేనికి రూ. 5.54 ఖర్చు అవుతోంది. -
పెద్ద లక్ష్యం
లక్ష్యం ఏమిటో నిర్థారించుకున్నాక దాని కోసం చేయవలసిన కష్టమంతా చేయాల్సిందే. అతనిదొక ఎగువ మధ్యతరగతి కుటుంబం. తన వాటాగా తండ్రి ఇచ్చిన డబ్బుకు మరికాస్త అప్పు చేసి ఆ వచ్చిన డబ్బుతో కాస్త పెద్ద హోటల్ పెట్టాలనుకున్నాడు. లక్ష్యం నిర్ణయించుకున్నాడు కాబట్టి దానిని నెరవేర్చుకోవడం కోసం ముందు ఏదయినా హోటల్లో పనిచేసి కొంత అనుభవం గడించాలనుకున్నాడు. ఓ హోటల్కు వెళ్లి లెక్కలు రాసే పని అడిగాడు. తన దగ్గర పనేమీ లేదు పొమ్మని చెప్పి లోపల ఏదో పని చూసుకుని కొద్దిసేపటి తర్వాత వచ్చాడు యజమాని. ఆ యువకుడు అక్కడే ఉండటం చూసి ఇంకా ఎందుకున్నావని అడిగాడు. ‘‘సార్, నాకు ఉద్యోగం ఏమీ లేదు కాబట్టి, మీరు ఏ పని చెప్పినా చేస్తాను. బజారుకు వెళ్లి హోటల్కి కావలసిన సరుకులు తీసుకు వస్తాను, వచ్చిన కష్టమర్లను రిసీవ్ చేసుకుని వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుంటాను. మీరు జీతం ఎంత ఇచ్చినా ఫరవాలేదు’’ అని ప్రాధేయపడ్డాడు. ఆ యజమానికి జాలేసి, వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. ఈ యువకుడు హోటల్లోకి అవసరమైన సరుకులు, కూరగాయలు మధ్యవర్తులతో పని లేకుండా స్వయంగా తనే వెళ్లి కొనడం దగ్గర నుంచి çహోటల్ను శుభ్రంగా ఉంచడం, వచ్చిన వారికి మర్యాద చేయడం వంటి పనులతో హోటల్కు ఖర్చులు తగ్గించి, రాబడి పెంచాడు. తన మంచితనంతో, సామర్థ్యంతో తొందరలోనే అసిస్టెంట్ మేనేజర్గా, ఆ తర్వాత మేనేజర్గా ఉద్యోగోన్నతి పొందాడు. కొద్దికాలానికి ఆ పెద్దాయన పొరుగు దేశంలో స్థిరపడదలచి ఈ యువకుడికి నామమాత్రపు ధరకే ఆ హోటల్ను విక్రయించాడు. ఆ యువకుడు తాను పని చేసే హోటల్కు యజమాని అయ్యాడు. అలా మొదలైన ఆ యువకుడి ప్రస్థానం అంతటితో ఆగలేదు. ఎన్నో హోటల్స్ను స్థాపించాడు. ఎందరో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ప్రేరణ అయ్యాడు. ఆనాటి ఆ యువకుడే మోహన్ సింగ్ ఒబెరాయ్. స్టార్ హోటల్స్లో తనదైన ముద్ర వేసిన ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ అయ్యాడు. పెద్ద లక్ష్యాన్ని ఎంచుకోగానే సరిపోదు, అది స్పష్టంగానూ, అర్థవంతంగానూ ఉండాలి. దానిని ఎలాగైనా నెరవేర్చుకునే తపన, వచ్చిన చిన్న అవకాశాలని కూడా అందిపుచ్చుకునే ఓర్పూ నేర్పూ ఉండాలి. – డి.వి.ఆర్. -
రూపాయితో... పండుగ చేసుకునేదెలా?
‘‘ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకుని పండుగ చేస్కో...!’’ జగన్నాథ్ దర్జాగా చెప్పాడు కృష్ణతో. కానీ, కృష్ణ ముఖం వెలిగి పోలేదు. బక్కచిక్కిన రూపాయి ఒక్కసారిగా తన కళ్లలో మెదలడంతో అతడి ముఖంపై ఆందోళన కనిపించింది. దీంతో ‘‘ఏమైంది కృష్ణా...?’’ అంటూ జగన్నాథ్ ప్రశ్నించాడు. ‘‘రూ.వెయ్యితో పండుగ చేసుకోవడం కాదు... అది నాకు దండగే. దీంతో 15 డాలర్లు కూడా రావు. ఓ జత డ్రెస్ కూడా కొనలేను..’’ అంటూ ఓ మంత్ర దండకం వినిపించటంతో అది విని జగన్నాథ్ ముఖంలోనూ మార్పు కనిపించింది. నిజానికి ఈ బక్క రూపాయి ఇప్పుడు సామాన్యుడి కొనుగోళ్లపై పెద్ద భారాన్నే మోపబోతోంది. పండుగల సీజన్కు ముందు రూపాయి దెబ్బను తలచుకుని అటు కంపెనీలు, ఇటు సగటు వినియోగదారులు కూడా నిట్టూర్చే పరిస్థితి. ఎందుకంటే రూపాయి కారణంగా పడే ప్రభావాన్ని ఉత్పత్తుల ధరలను పెంచుతూ కస్టమర్లకు బదిలీ చేసేందుకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, కార్ల కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇంత వరకూ పండగ సమయంలో కొందామని వేచి చూసిన వారిని తాజా పరిణామాలు పునరాలోచనలో పడేస్తున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 72కు సమీపంలోకి వచ్చేసింది. ఇది అటు కంపెనీలు, ఇటు వినియోగదారులకూ రుచించనిదే. రూపాయి ఈ ఏడాది పండుగ అమ్మకాలకు గండికొట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన అయితే ఉంది. రూపాయి క్షీణతతో పెరిగిన ముడి సరుకుల (లోహాలు, ప్లాస్టిక్) ధరలతో కంపెనీలకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ విడిభాగాల ధరలకు ప్రామాణికం డాలరే. ఈ నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి ధరల భారాన్ని దింపుకునేందుకు కంపెనీలు ఉత్పత్తుల ధరల్ని పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఎల్జీ, హాయర్, గోద్రేజ్ అప్లయన్సెస్ 3–5 శాతం స్థాయిలో ఈ నెల్లోనే ధరల్ని పెంచేశాయి. ప్యానాసోనిక్ ఇండియా కూడా 2–3 శాతం వరకు ధరల్ని అతి త్వరలోనే పెంచనుందని అంచనా. కార్ల కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ, పలు రకాల మోడళ్ల ధరలను రూ.6,100 వరకు పెంచింది. రూపాయి క్షీణత భారాన్ని ఇలా దింపుకుంది. అలాగే, టయోటా కిర్లోస్కర్ కూడా ధరల్ని ఈ నెల్లోనే 2–3 శాతం వరకు పెంచేసింది. డిమాండ్కు దెబ్బ అయితే, ఈ ధరల పెంపు డిమాండ్ను దెబ్బతీస్తుందన్న ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా కంపెనీలు ఎక్కువగా అమ్మకాలను నమోదు చేసుకునే పండుగల సీజన్ డిమాండ్పై ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. విక్రయాలు 5–10 శాతం వరకు తగ్గొచ్చని కన్జూమర్ డ్యూరబుల్ ఉత్పత్తుల విక్రేతల అంచనా. రూపాయి విలువ ఇంకా పడితే, కంపెనీలు మరింత ధరల్ని పెంచితే ఈ డిమాండ్ ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా జరగాల్సింది కాదు... ‘‘రూపాయి క్షీణత అన్నది అనువుగాని సమయంలో జరుగుతోంది. జూలైలో జీఎస్టీ రేట్లు 10 శాతం తగ్గించడంతో పండుగల విక్రయాలపై ఆశలు పెట్టుకున్నాం. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేశాం. కానీ, ప్రస్తుత ధరల పెంపుతో పండుగల డిమాండ్పై గణనీయ ప్రభావమే పడనుంది’’ అని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ పేర్కొన్నారు. వినియోగదారుల వెనకడుగు ‘‘పరిశ్రమ కొంత కాలం పాటు సింగిల్ డిజిట్ వృద్ధినే చూసింది. జీఎస్టీ రేట్ల కోతతో పరిస్థితి మారుతుందని ఆశించాం. కానీ, వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంది’’ అని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అన్నారు. ఓ స్థాయికి మించి పెంచలేం ‘‘దీర్ఘకాలంలో రూపాయి స్థిరపడుతుందని భావించడం లేదు. రూపాయి డాలర్తో ఏటా 6 శాతం మేర క్షీణిస్తుందన్న దానికి సిద్ధపడ్డాం. 2–3 శాతం ధరల పెంపు పడుతున్న రూపాయి ప్రభావాన్ని కొంతవరకే అడ్డుకోగలదు. కానీ, ఓ స్థాయికి మించి ధరలను పెంచలేం. ఎందుకంటే ఇది అమ్మకాలపై ఒత్తిడికి దారితీస్తుంది’’ అని టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ తెలిపారు. టీవీల ధరలకూ రెక్కలు ఇక టీవీలు కూడా రూపాయి కారణంగా ఖరీదవుతున్నాయి. కొన్ని టీవీల కంపెనీలు ఈ నెల మధ్య నుంచే ధరల్ని పెంచనున్నాయి. థామ్సన్, కొడాక్ టీవీల తయారీ లైసెన్స్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ఇప్పటికే ధరల్ని పెంచేసింది. ఆగస్ట్లో ఒకసారి, సెప్టెంబర్లో మరోసారి ధరల్ని పెంచడం జరిగిందని, 12 శాతం మేర ధరలు పెరిగినట్టు సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్సింగ్ మార్వా తెలిపారు. -
గిట్టుబాటు ధరలేక ఉల్లిరైతు విలవిల
-
బొమ్మ కొనివ్వు నాన్నా
ఒకరోజు ఒక పిల్లాడు తన తండ్రితో కలిసి జాతరకు వెళ్లాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోషపరచాలని తండ్రి తపన. జాతరలో బోల్డన్ని బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించుకుని మురిసిపోవాలని కొడుకు ఆలోచన. పిల్లవాడికి కబుర్లు చెబుతూ మెల్లగా నడుస్తున్నాడు తండ్రి. ఇంకా తనకి బొమ్మలేమీ కొనిపెట్టలేదని ఆందోళన పడుతున్నాడు పిల్లాడు. ఇంతలో పిల్లాడికి ఒక బొమ్మ నచ్చింది. ఆ బొమ్మ కొనిమ్మన్నాడు. ఆ బొమ్మవంకా, దాని పైన ఉన్న ధర వంకా చూశాడు తండ్రి. ఆ తర్వాత జేబులో ఉన్న డబ్బును చూసుకున్నాడు.‘‘ఇది వద్దులే’’ అంటూ ముందుకు నడిపించాడు కొడుకుని. డబ్బంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో భార్య తీసుకుని రమ్మని చెప్పిన సరుకుల మాటేమిటి అని ఆలోచిస్తూనే, ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోషపెట్టాలనుకున్నాడు తండ్రి. ఇంతలో ఎవరో తండ్రిని పలకరించారు. కొడుకు చేయి వదిలి వారితో మాట్లాడుతున్నాడు. జాతరలో జనం పెరిగారు. పిల్లాడు తండ్రిని గమనించకుండా ముందుకెళ్లిపోయాడు. కాసేపయ్యాక వెనక్కి తిరిగి చూస్తే తండ్రి కనిపించలేదు. భయమేసింది. దిగులుతో ఏడుపు మొదలైంది. ఏడుస్తున్న ఆ పిల్లాణ్ణి చూసి అందరూ పోగయ్యారు. ‘‘నీకు బోలెడన్ని బొమ్మలిస్తాము. ఏడవకు’’ అన్నారెవరో.‘‘నాకు నాన్న కావాలి’’ అన్నాడు పిల్లాడు వెక్కుతూ. ఇంకెవరో రకరకాల తినుబండారాలు తీసుకొచ్చి పిల్లాడి చేతిలో పెట్టారు. ‘‘నాకు నాన్న కావాలి’’ అని వెక్కిళ్లు పెట్టాడు. ఆశ్చర్యం! ఆ పిల్లాడికిప్పుడు బొమ్మల గురించిన ఆలోచనే లేదు. ‘నాన్న కావాలి’ అంతే! ఇంతలో కొడుకును వెదుక్కుంటూ అక్కడికొచ్చాడు నాన్న. వెలిగిపోతున్న ముఖంతో తండ్రిని అతుక్కుపోయాడు ఆ పిల్లాడు.తెలిసిన వాళ్లెవరో కనిపిస్తే చేబదులు తీసుకొచ్చిన తండ్రి ‘‘బొమ్మలు కొందాం పద’’ అన్నాడు.‘‘నాకు బొమ్మలేమీ వద్దు. ఇంటికెళదాం’’ అన్నాడు కొడుకు! దేవుణ్ణి అవి కావాలి, ఇవి కావాలి అని కోరుకుంటాం. అడిగిందల్లా ఇవ్వలేదని బాధపడతాం. ఇంతలో ఏదో జరుగుతుంది. అప్పుడు మనమే వేడుకుంటాం దేవుణ్ణి.. కనీసం ఇలాగైనా ఉంచు స్వామీ’’ అని. దేవుడు గీసిన పెద్దగీత ముందు మన కోరికలనే చిన్న గీతలు చిన్నబోతాయన్నమాట. – డి.వి.ఆర్. -
కొఠియాలో వారపు సంత ప్రారంభం
సాలూరు రూరల్ : వివాదాస్పద ఆంధ్ర–ఒడిశా సరిహద్దు కొఠియా గ్రూప్ గ్రామాల్లో ప్రజలను తమ వైపునకు తిప్పుకునే అన్ని ప్రయత్నాలు ఒడిశా ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా కొఠియా గ్రామంలో ఒడిశా ఆధ్వర్యంలో వారపు సంతను బుధవారం ప్రారంభిచారు. ఈ సందర్భంగా ప్రజలతో నిర్వహించిన సమావేశంలో అధికారులు, నాయకులు మాట్లాడుతూ కొఠియా గ్రూప్ గ్రామాలు ఒడిశా రాష్ట్రానికి చెందినవేనని స్పష్టం చేశారు. ప్రతి బుధవారం ఇక్కడ వారపు సంత జరుగుతుందని ప్రభుత్వ నిధులతో సంతను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు విత్తనాలు మార్కెట్ ధరకే అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలోనే ప్రతి బుధవారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఏ విషయంలోనూ ఆంధ్రాపై ఆధారపడవద్దని సూచించారు. ఈ గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలో ర్యాలి నిర్వహించారు. ఇంతవరకూ కొఠియా గ్రూప్ గ్రామాల ప్రజలు ప్రతి మంగళవారం ఆంధ్రా రాష్ట్రంలోని సారిక పంచాయతీ నేరెళ్లవలసలో జరిగే వారపు సంతకు వచ్చేవారు. ప్రస్తుతం కొఠియాలోనే ఒడిశా ప్రభుత్వం వారపు సంతను ఏర్పాటు చేయడంతో వారికి సంత అందుబాటులోకి వచ్చినట్టయింది. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కృషి బాస్రౌత్, ఎమ్మెల్యే ప్రఫుల్ కుమార్ పంగి, మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, పొట్టంగి మాజీ ఎంపీ జయరాం పంగి, పొట్టంగి బ్లాక్ ఛైర్మన్ జగజ్జిత్ పంగి తదితరులు పాల్గొన్నారు. -
నెయిల్ పాలిష్ ధర వింటే.. గుండె ఆగుతుంది?!
ప్రతి మనిషి జీవితంలో తన స్థాయిలో లగ్జరీని కోరుకుంటున్నాడు. వస్తువు ఎలాంటిది అయినా.. దాని ఖరీదు మాత్రం తన స్థాయికన్నా అధికంగా ఉండాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రతి వస్తువును తయారీదారులు అదే స్థాయిలో రూపొందించిస్తున్నారు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తేన్న నెయిల్ పాలిష్ కూడా అటువంటిదే. దీనిని ప్రపంచంలోని కోటీశ్వరుల్లో చాలాతక్కువ మంది మాత్రమే ఉపయోగించలరు. లగ్జరీకి పరాకాష్టగా కూడాదీనిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ఖరీదు. కేవలం కోటీ 63 లక్షల 66 వేల రూపాయలు మాత్రమే. దీనిని దిగుమతి చేసుకోవాలంటే అదనంగా మరో పది లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. ఇంతటి ఖరీదైన నెయిల్ పాలిష్ని లాస ఏంజెల్స్లోని లగ్జరీ సౌందర్య సాధానాల తయారీ సంస్థ అజాతురే రూపొందించింది. ఈ నెయిల్ పాలిష్లో 267 కేరట్ల బ్లాక్ డైమండ్ను ఉపయోగించారు. అందుకే ఇంత ఖరీదు అని సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ బ్లాక్ డైమండ్ నెయిల్ పాలిష్ను కేవలం ఆర్డర్ మీద మాత్రమే తయారు చేస్తామని చెప్పారు. -
ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్
ఐఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్. బ్యాటరీ లోపాలు, కొరతతో ఇబ్బందులు పడుతున్న కస్టమర్లు ఇకమీదట ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్మెంట్ తొందరగానే సాధించవచ్చు. అదీ కూడా చాల తక్కువ ధరకే. సుమారు 2 వేల రూపాయలు (అన్ని కలుపుకొని) కే లభించనుంది. తాజాగా బ్యాటరీ రీప్లేస్మెంట్ ఖరీదు అంతర్జాతీయంగా 29 డాలర్లుగా ఉండగా, మన దేశానికి సంబంధించి దీని ధర పన్నులతో కలిపి దాదాపు 2600రూపాయలకు లభించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఫోన్ కేంద్రాల్లో ఈ తగ్గింపు ధర వర్తించనుంది. సవరించిన రేట్లకు పాత ఐఫోన్ మోడళ్లకు బ్యాటరీ అందుబాటులో ఉన్నట్టు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో ఆపిల్ కేంద్రాలు ధృవీకరించాయి. చాలా పాత ఐ ఫోన్లతోపాటు, ఐ ఫోన్ 6, 6ప్లస్, 6ఎస్, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ తదితర మిగిలిన మోడళ్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పటివరకు దీని రూ . 6,500గా ఉండడంతో పాటు...బ్యాటరీ కోసం దీర్ఘకాలం వెయిట్ చేయాల్సి వచ్చేది. అయితే ఆపిల్ అధీకృత సేవా కేంద్రాల దగ్గర సంబంధిత ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్మెంట్కు అర్హత ఉందా , లేదా అనేది చెక్ చేసుకోవాలి. కాగా ఇటీవల పాత ఐ ఫోన్ బ్యాటరీ లోపం కారణంగా ఐ ఫోన్ స్లో కావడం, లేదా షట్ డౌన్ కావడం వివాదం రేపింది. దీంతో ఐఫోన్ మేకర్ ఆపిల్ గత నెలలో బ్యాటరీ రీప్లేస్ మెంట్ పథకాన్ని ప్రారంభించింది. -
పెరిగిన ‘విద్యుత్’ వ్యయం!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సరఫరా వ్యయం ఏటికేటికి పెరిగిపోతోంది. వచ్చే ఏడాది (2018–19) రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కోసం రూ.35,714 కోట్లు అవసరమని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తాజాగా నివేదించాయి. ఇందులో విద్యుత్ కొనుగోళ్లకే రూ.27,903 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. శుక్రవారం 2018–19కి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్)ను డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. వచ్చేఏడాది రాష్ట్రంలో అమలు చేసే విద్యుత్ చార్జీల పట్టిక లేకుండా ఈ ప్రతిపాదనలు సమర్పించడంతో 2018–19లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరుగుతాయా లేక యథాతథంగా ఉంటాయా అన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. గతేడాదిలాగే చార్జీల వివరాలను మరికొన్ని రోజుల తర్వాత ఈఆర్సీకి డిస్కంలు ప్రత్యేకంగా ప్రతిపాదించను న్నాయి. అప్పుడే చార్జీల పెంపుపై స్పష్టత రానుంది. 2019లో జరిగే ఎన్నికల నేపథ్యం లో విద్యుత్ చార్జీలు పెంచొద్దని సీఎం కేసీఆర్ డిస్కంలను ఆదేశించినా.. డిస్కంలు చార్జీల అంశాన్ని సస్పెన్స్లో పెట్టడం గమనార్హం. యూనిట్కు రూ.6.42 వ్యయం.. డిస్కంలు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు సగటున యూనిట్కు రూ.6.42 వ్యయం కానుంది. 2018–19 కోసం డిస్కంలు 67,573 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఒప్పందాల రూపంలో ముందస్తుగా సమీకరించి పెట్టుకోగా.. వాస్తవ విద్యుత్ డిమాండ్ 64,291 మిలియన్ యూనిట్లే ఉండనుంది. -
అమ్మా.. నాన్నా... అలవాట్లు!!
► అప్పు తీర్చటం నుంచి బీమా దాకా వారే గురువులు ► మనీ మేనేజిమెంట్లో తల్లిదండ్రుల ప్రభావమే అధికం మనం ఏం నేర్చుకున్నా దాన్లో తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. పొదుపు, ఖర్చు అలవాట్లు కూడా వచ్చేది వారి నుంచే. నిజం చెప్పొద్దూ!! ఎవరైనా తమ కలల్ని, జీవిత లక్ష్యాల్ని సాకారం చేసుకోవటానికి ఆర్థిక విషయాలు తెలిసి ఉండటమనేది అత్యంత కీలకం. అందుకని మనకు సంక్రమించిన ఖర్చు, పొదుపు అలవాట్లను విశ్లేషించుకోవటంలో తప్పు లేదు. చక్కని జీవితానికి చక్కని అలవాట్లే పునాది. దాన్లో చెడు ఉంటే గనక... ఆదిలోనే తుంచేయాలి. సదరు అలవాట్ల సింçహావలోకనమే ఈ ప్రయత్నం. రుణాల చెల్లింపులెలా ఉన్నాయ్? ఆ మధ్య కోపెన్హెగన్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్లు ఓ ఆసక్తికరమైన అధ్యయనం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న 50 లక్షల మందికి చెందిన 3 కోట్ల రుణాలను విశ్లేషించారు. 2011– 2014 మధ్య తీసుకున్న రుణాలవి. వాళ్లు కనుక్కున్నదేమిటంటే... తల్లిదండ్రులు గనక రుణాలు తిరిగి చెల్లించటంలో డీఫాల్ట్ అయితే... వారి పిల్లలూ డీఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువని. ఇవి ఎంత ఎక్కువంటే... డీఫాల్ట్ కాని తల్లిదండ్రుల పిల్లలకంటే దాదాపు నాలుగు రెట్లు!!. కుటుంబ ఆదాయాలు, తెలివితేటలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలూ ఇలాగే ఉండటం గమనార్హం. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే... మీ తల్లిదండ్రులు రుణాల చెల్లింపులు ఎలా చేశారో తెలుసుకోవటమే కాదు. రుణాల విషయంలో మీ వైఖరినీ విశ్లేషించుకోండి. ఒక్కటి గుర్తుంచుకోండి!! తీసుకున్న అప్పును తిరిగి చెల్లించటమనేది నైతికంగా, చట్టపరంగా మీ బాధ్యత. అదేకాదు! చక్కని చెల్లింపు అలవాట్లు మీ క్రెడిట్ స్కోరునూ పెంచుతాయి. తద్వారా తక్కువ వడ్డీకే కొత్త రుణాలు దొరుకుతాయి. సంప్రదాయ పాలసీలను కొనొద్దు... ఓ తెలిసిన బంధువో, మిత్రుడో వచ్చి గ్యారంటీ లాభాలుంటాయంటూ సంప్రదాయ బీమా పాలసీలను అంటగట్టడం మనకు కొత్తేమీ కాదు. దీర్ఘకాలంలో ఇవన్నీ అర్థంలేని పాలసీలుగా మిగిలిపోతాయి. ఇలాంటి బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయటమనేది ఓ సమస్య కూడా. ఎందుకంటే ఈ ప్లాన్లలోని తప్పనిసరి లాకిన్ పీరియడ్ మిమ్మల్ని వాటి నుంచి బయటపడకుండా చేస్తుంది. ఒక వాటిపై వచ్చే రాబడి అత్యంత తక్కువ. దాని బదులు తగినంత కవరేజీ ఉండేలా టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ల వంటి ఎక్కువ రాబడినిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయటం తెలివైన పని. తగినంత కవరేజీ ఉందా? భారతీయుల్లో చాలామంది జీవిత బీమాను తీసుకునేది పన్నుల నుంచి బయటపడటానికే. కొందరు దాన్నో ఇన్వెస్ట్మెంట్లా కూడా చూస్తుంటారు. బీమా ఉన్న వ్యక్తి ఒకవేళ మరణించినా, ఆసుపత్రిలో ఉన్నా ఆ కుటుంబానికి వాస్తవంగా ఎంత రక్షణ కావాలన్నది మాత్రం వారు చూడరు. మీ కుటుంబ సభ్యులు కనక మీపై ఆధారపడి ఉంటే... మీపై ఆధారపడ్డ భార్య/భర్త తాలూకు ఆదాయ అవసరాలు, రుణ చెల్లింపులు, పిల్లల చదువు ఖర్చులు, ఆరోగ్య ఖర్చులు, ఇతర రోజువారీ అవసరాల వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని అందుకు తగినంత బీమాను టర్మ్ ప్లాన్ రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మీపై ఆధారపడ్డ వారిని అలా వదిలేయలేరు కదా!! ఆరోగ్య బీమా లేదా? చాలామంది ఆరోగ్య బీమా లేకుండానే తమ జీవితంలో చివరి మజిలీని చేరుకుని ఉంటారు. ఆ సమయంలో వారి ఆరోగ్యం చాలా ఒడిదుడుకులకు గురవుతుంటుంది. మరోవంక బీమా ఉండదు. ఆ సమయంలో ఆరోగ్య బీమా కొనుగోలు చేయటం కూడా చాలా కష్టం. పొరపాటున ఆసుపత్రి పాలయితే కుటుంబ పొదుపు, పెట్టుబడులు ఠక్కున ఆవిరయిపోతుంటాయి. ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే యుక్త వయసు నుంచే చక్కని ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవటంతో పాటు దాన్ని చిరకాలం కొనసాగించాలి. తెలివైన పెట్టుబడి సాధనాలున్నాయ్ మీకు కావాల్సినప్పుడు మీ డబ్బు మీ చేతికిరావాలి. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చాలావరకూ ఒక మోస్తరు రాబడినిస్తాయి కానీ పన్ను పరంగా అంత సమర్థమైనవి కావు. ఎండోమెంట్ బీమా పాలసీలంటే తక్కువ రాబడితో పాటు లాకిన్లూ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. కానీ పన్ను తప్పదు. అందుకని మెరుగైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలు వెతుక్కోవాలి. వీటన్నిటికీ జవాబిచ్చే మ్యూచువల్ ఫండ్లలో గడిచిన రెండేళ్లుగా ఇన్వెస్ట్మెంట్లు బాగా పెరుగుతున్నాయి. వాటిలో పన్ను ఆదాతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవేశించొచ్చు... బయటపడొచ్చు కూడా. రిస్కును బట్టే రాబడులుంటాయి. నెలకు రూ.500 నుంచి మొదలుపెట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పుత్తడి ఎల్లవేళలా మెరవదు... సంప్రదాయంగా బంగారం కూడా పెట్టుబడి సాధనంగా వస్తోంది. దాని ప్రయోజనాలు దానికున్నాయి. ఈ లోహాన్ని కావాల్సినట్టు మార్చుకోవచ్చు. పాడైపోదు. ఆభరణంగానూ వాడొచ్చు. కానీ పెట్టుబడిగా వచ్చేసరికి ప్యూరిటీ, మార్కెట్ రాబడి, దాచుకోవటమనే సమస్యలు దీనికీ ఉన్నాయి. ఆభరణంగా వాడుకోవాలంటే ‘బంగారం’లా కొనుక్కోవచ్చు. కానీ పెట్టుబడిగా అయితే మాత్రం మీ పోర్టుఫోలియోలో దాన్ని కొంతవరకే పరిమితం చేయాలి. గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ సావరిన్ బాండ్ల వంటి సాధనాలను పరిశీలించొచ్చు. -
దిగొచ్చిన వెల్లుల్లి ధర
తాడేపల్లిగూడెం : వెల్లుల్లిపాయల ధర భారీగా తగ్గింది. పంట దిగుబడులు పెరగడంతో ధర దిగొచ్చింది. కొంతకాలం క్రితం వరకు కిలో రూ.120 పలికింది. దీంతో ప్రజలు గగ్గోలు పెట్టారు. ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్కు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రోజుకు మూడు, నాలుగు లారీల సరుకు వస్తోంది. అయితే కొనే వ్యాపారులు కరువయ్యారు. 50 కిలోల బస్తా నాణ్యతను బట్టి రూ.1,100 నుంచి 2,150 వరకు ఉంది. గతంలో ఇదే బస్తా రూ.6 వేల వరకు పలకడం గమనార్హం. -
చుక్కల్లోనే కూరగాయల ధరలు
తాడేపల్లిగూడెం : టమాటాల ధర బాటలో వంకాయలు పయనిస్తున్నాయి. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్లో వంకాయలు ధరకు రెక్కలు వచ్చాయి. నల్ల వంకాయల ధర కిలో రూ.40కి ఎగబాకింది. తెల్లవంకాయల ధర రూ.50 పలికింది. క్యాప్సికం ధర కెవ్వుమనిపించి కిలో రూ.80కి చేరుకుంది. బీన్స్ సెంచరీ మార్కుకు చేరాయి. కీరా కూడా కిలో రూ.50కి చేరుకుంది. దొండకాయలు కిలో రూ.30, బెండకాయలు రూ.30, బీర రూ.40, దోసకాయలు రూ.24, కంద రూ.40, క్యాబేజీ రూ.20, క్యారెట్ రూ.40, బీట్రూట్ రూ.30, బీన్స్ రూ.90 ధర పలికాయి. చామ రూ.40, మిర్చి రూ.40కి అమ్మారు. మామిడికాయ ఒకటీ రూ.10, ములగకాడలు జత రూ.12 చేసి విక్రయించారు. టమాటాలు కాస్త కనికరం చూపించాయి. గుత్తగా 25 కిలోల ట్రే రూ.1,800 నుంచి రూ.1,600కి తగ్గింది. రిౖటైల్గా మాత్రం కిలో రూ.80 అమ్మారు. -
మీరు ఖర్చు మనుషులా?
సెల్ఫ్ చెక్ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నది సామెత. అగ్రరాజ్యానికైనా, బిల్గేట్స్కైనా ఇదే సూత్రం. మీరు సరదాలకు పోయి ఇంటిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారా? లేక ఆదా చేసి ఆదాయాన్ని కూడ బెడుతున్నారా? మీరెటు పయనిస్తున్నారో తెలుసుకోవాలంటే స్వయంగా చెక్ చేసుకోండి. 1. మీరు ఓ ఎగ్జిబిషన్కి వెళ్లినప్పుడు ఖరీదైన కళాఖండాలు కనిపిస్తే వాటివల్ల ఉపయోగం లేకపోయినా కొనేస్తారు. ఎ. కాదు బి. అవును 2. ఇప్పటి వరకు మీ నెలసరి బడ్జెట్కంటే ఎక్కువ మీరు ఖర్చు చేయలేదు. ఎ. అవును బి. కాదు 3. మీ రొటీన్ ఉద్యోగంతో పాటు ఆదాయం పెంచుకోవడానికి పార్ట్ టైమ్ వర్క్ కూడా చేస్తుంటారు. ఎ. అవును బి. కాదు 4. బ్యాంక్లో సేవింగ్స్ చేయటం లేదు. ఎ. కాదు బి. అవును 5. మీ పర్స్ సహకరించకపోయినా సరే క్యాబ్లలోనే ప్రయాణిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మీకు నచ్చదు. ఎ. కాదు బి. అవును 6. తరచూ కొత్త డ్రస్లు కొంటూనే ఉంటారు. ఎ. కాదు బి. అవును 7. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చులు అవుతున్నప్పుడు విలాసాలను తగ్గించుకోవడంలో కొంత కఠినంగానే ఉంటారు. ఎ. అవును బి. కాదు 8. అప్పు చేసి అయినా సరే మీ సరదాలు తీర్చుకుంటారు. ఎ. కాదు బి. అవును ‘ఎ’ సమాధానాలు 6 దాటితే మీరు సంసారాన్ని సజావుగా నడిపిస్తున్నారని అర్థం. అనవసర ఖర్చులకు పోకుండా డబ్బు జాగ్రత్త చేస్తుంటారు. ‘బి’ సమాధానాలు 6 కంటే ఎక్కువ వస్తే మీకు డబ్బంటే జాగ్రత్త లేదని అర్థం. అనవసర డాబులకు పోయి అప్పుడప్పుడు బోర్లాపడుతుంటారు. -
తగ్గని టమోత
రిటైల్లో కిలో రూ.80 కిలో చిక్కుడుకాయలు రూ.120 చుక్కలనంటిన కూరగాయలు తాడేపల్లిగూడెం : ట’మోత’ ఇంకా తగ్గలేదు. కొండెక్కిన టమాటాల ధర దిగిరానంటోంది. డిమాండ్కు తగిన సరుకు సరఫరా లేకపోవడంతో ధరలు తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం గుత్త మార్కెట్లో వీటి ధర 25 కిలోల ట్రే రూ.1,800 పలికింది. విడిగా కిలో రూ.80కి మార్కెట్లో టమాటాలు దొరికాయి. వీటికి తోడు అన్నట్టుగా చిక్కుడుకాయలు సై అన్నాయి. నల్లజర్ల మండలం ఆవపాడు నుంచి మార్కెట్కు వచ్చే చిక్కుడుకాయలు ధర పదికిలోలు రూ.800 పలికింది. విడిగా మార్కెట్లో కిలో రూ.120కి చేరింది. క్యారెట్ 40, బీట్రూట్ రూ.40కు విక్రయించారు. క్యాప్సికం, బీన్స్ కిలో రూ.80కు విక్రయించారు. తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు కిలో రూ.40 లభించాయి. బీరకాయల ధర మాత్రం కిలో రూ.40 నుంచి రూ.30కి పడిపోయింది. దొండకాయలు కిలో రూ.20, బెండకాయలు రూ.24, కంద రూ.40, చామ రూ.40, చిలకడదుంపలు రూ.30, దోసకాయలు రూ.16, క్యాబేజీ రూ.16, గోరుచిక్కుళ్లు రూ.24లకు లభించాయి. ములగకాడలు జత రూ.12 చేసి అమ్మారు. మామిడికాయలు జతకు రూ.20 విక్రయించారు. ఘాటెక్కించిన కొత్తిమిర ధర కాస్త దిగివచ్చింది. కిలో రూ.50 లభించగా, విడిగా కట్ట పదిరూపాయలకు విక్రయించారు. పచ్చిమిరప కూడా ఘాటు తగ్గించుకుంది. కిలో విడిగా రూ.50కి దొరికింది. బంగాళాదుంపలు. ఉల్లిపాయలు సాధారణ ధరలకే దొరికాయి. -
ధర రాక... దరి లేక..
►అంతరాష్ట్రీయంగా డిమాండ్ ►ఒడిదుడుకుల్లో కొబ్బరి రైతు తగ్గిపోతున్న తోటల విస్తీర్ణం ►గిట్టుబాటు కాని ధరలు కాయకు రూ.3 నుంచి రూ.5లు ►మార్కెట్లో మాత్రం అధిక రేటు విదేశాలకూ ఎగుమతులు ►కొత్తగా జీఎస్టీ తలపోటు నరసాపురం: జిల్లా పేరు చెపితే వరి తరువాత గుర్తుకు వచ్చేది కొబ్బరి. దేశంలో కేరళ తరువాత ఎక్కువ స్థాయిలో కొబ్బరి ఎగుమతులు సాగించేది మన రాష్ట్రమే. రాష్ట్రంలో కూడా గోదావరి జిల్లాల నుంచే కొబ్బరి ఎగుమతులు ఎక్కువగా సాగుతుంటాయి. ఇందులో మన జిల్లా స్థానం ప్రత్యేకమైనది. కొడుకును నమ్ముకునే బదులు ఓ కొబ్బరి చెట్టును పెంచుకుంటే మేలనే నానుడి జిల్లాలో ఎప్పటి నుంచో ఉంది. కొబ్బరి చెట్టు ఆర్ధికంగా ఆసరాగా ఉంటుందనే భరోసా అందరిలో ఉంటుంది. అలాంటి కొబ్బరి పరిశ్రమ ప్రస్తుతం ఒడిదుడుకుల్లో పడింది. బయట మార్కెట్లో డిమాండ్ను బట్టి రూ. 15లు నుంచి రూ. 20లు వరకూ కొబ్బరి కాయధర పలుకుతోంది. అదే రైతుకు మాత్రం రూ. 3 నుంచి రూ. 5లు వరకూ మాత్రమే దక్కుతోంది. డిమాండ్ను బట్టి ఒక్కోసారి రైతుకు మరో అర్ధ రూపాయో, రూపాయో పెరుగుతుంది అంతే. కేవలం రైతులే కాదు కొబ్బరి దింపు, వలుపు, లారీల్లోకి, ట్రాక్టర్లలోకి ఎగుమతి, దిగుమతి.. ఇలా జిల్లాలో కొబ్బరి పరిశ్రమపై ఆధాపరడి వేల కుటంబాలు జీవిస్తున్నాయి. ఇంకోవైపు జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం ప్రతీ ఏటా తగ్గుతోంది. చెరువుల సాగు పెరగడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ కొబ్బరి ఎగుమతులపై ఎలాంటి పన్నులు లేవు. అయితే కొత్తగా జీఎస్టీ పరిధిలోకి కొబ్బరిని పరోక్షంగా తీసుకొచ్చారు. దీంతో జిల్లాలో కొబ్బరి ఎగుమతులు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి కూడా. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో కొబ్బరిసాగు, పరిశ్రమ కూడా సంక్షభంలోకి వెళుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. డిమాండ్ ఫుల్.. రైతుకు నిల్.. జిల్లాలో పాలకొల్లు కేంద్రంగా కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి విస్తృతంగా సాగుతుంది. రోజుకు 50 లారీలు తక్కువ కాకుండా ప్రతీరోజూ ఎగుమతి అవుతుంటాయి. అంటే జిల్లా నుంచి రోజుకు రూ. 1 కోటి నుంచి రూ. 1.50 కోట్ల వరకూ కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి జరుగుతుంది. జార్ఖండ్, హర్యానా, చత్తీస్గడ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఉత్తర భారతదేశంలోని 14 రాష్ట్రాలకు ఇక్కడ నుంచి కొబ్బరి ఎగుమతులు జరుగుతాయి. కోఫ్రా (పైచెక్క తొలగించిన కురిడి), ఇడిబుల్ కోఫ్రా (ఆయిల్కు వినియోగించే విధంగా ముక్కలు చేసినవి), కోఫ్రా స్లైస్ (తరుము) రింగ్స్అండ్స్లైసెస్ (కురిడికాయను చిన్నచిన్న ముక్కలుగా చేసినవి) విదేశాలకు ఎగుమతి అవుతాయి. కొబ్బరికి ఇంత డిమాండ్ ఉంది. అయితే కొబ్బరి రైతులకు డిమాండ్కు అనుగుణంగా ధర దక్కడం లేదు. గుంటూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో కాయ ధర రూ. 15లు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల్లో అయితే రూ. 20లు నుంచి రూ. 25లు వరకూ ఉంది. ఇక్కడి రైతుకు రూ. 5లు మాత్రమే దక్కుతుంది. రైతు వద్ద తీసుకున్న కాయ బయట ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగురెట్లు పలుకుతుందన్నమాట. ప్రస్తుతం జాతీయంగా కొబ్బరికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో కాయ ఒక్కింటికి రైతుకు రూ. 5ల నుంచి రూ. 7లు వరకూ సైజును బట్టి ముట్టజెపుతున్నారు. కొబ్బరి బొండాలదీ ఇదే పరిస్థితి. రైతులు చాలా కాలంగా దారుణంగా నష్టపోతున్నారు. జిల్లాలో తగ్గుతున్న విస్తీర్ణం.. జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఆక్వాసాగు పెరగడంతో భూములు అన్నీ చెరువులుగా మారడం ఒక కారణమైతే, కొత్తగా కొబ్బరిసాగుకు రైతులు మొగ్గు చూపకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో 22 మండలాల్లో కొబ్బరిసాగు విస్తృతంగా సాగుతోంది. నరసాపురం, పాలకొల్లు, ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాల్లో విపరీతంగా సాగవుతోంది. కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, పెదవేగి, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, భీమడోలు, నల్లజర్ల మండలాల్లో కూడా సాగు ఎక్కువగా ఉంది. డెల్టాలో అయితే చేను గట్ల మధ్య కొబ్బరి మొక్కలు పెంచే సంప్రదాయం ఎక్కువగా ఉంది. మెట్టలో మాత్రం తోటల పెంపకం ఎక్కువగా జరుగుతుంది. డెల్టాలో చెరువులు ఎక్కువగా తవ్వుతుండటంతో కొబ్బరి చెట్లను భారీగా నరికి వేస్తున్నారు. తుఫాన్ల ప్రభావంతో చెట్లు పడిపోవడం, కొత్తగా కొబ్బరి మొక్కలు నాటక పోవడం కూడా జరుగుతోంది. దీంతో విస్తీర్ణం తగ్గిపోతోంది. జిల్లాలో ప్రస్తుతం 98 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. చెరువుగట్లపైనా, రోడ్ల పక్కనా ఉన్నవాటితో కలుపుకుని. పదేళ్ల క్రితం అయితే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరితోటలు ఉండేవి. చెరువుల తవ్వకాలు ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో 20వేల ఎకరాలుపైనే కొబ్బరి చెట్లు మాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు అన్నం పెట్టడమే కాకుండా కొబ్బరి పరిశ్రమ జిల్లాలో వేల మందికి ఉపాధి చూపిస్తోంది. కొబ్బరి ఎగుమతులకు సంబంధించి ఒలుపు, లోడింగ్, ట్రాన్స్పోర్ట్, వ్యాపారం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ రంగంపై జిల్లాలో 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కొబ్బరి సాగు సంక్షోభంలోకి వెళితే వీరందరకీ గడ్డు పరిస్థితి తప్పదు. జీఎస్టీ తలపోటు... కొత్తగా జీఎస్టీ తలనొప్పి కొబ్బరి ఎగుమతులకు పట్టుకుంది. ప్రస్తుతం కొబ్బరి ఎగుమతులకు ఎలాంటి వాణిజ్య పన్నులు లేవు. ప్రస్తుతం జీఎస్టీలోకి కొబ్బరి ఎగుమతులను ప్రత్యక్షంగా చేర్చనప్పటికీ, పరోక్షంగా భారం వేశారు. కొబ్బరిలోడు లారీ ఎగుమతికి సంబంధించి హమాలీ లోడింగ్ చార్జీలు, గన్నీ సంచుల చార్జీలు, దళారీ కమీషన్, లారీ కిరాయి వీటన్నిటినీ ఎగుమతి దారులు బిల్లులో పొందు పరుస్తారు. వీటికి సర్వీస్టాక్స్ నిమిత్తం ఇప్పుడు జీఎస్టీలో 18శాతం విధించారు. అంటే ఒకలారీ లోడుకు అదనంగా ఇప్పుడు జీఎస్టీ క్రింద రూ. 20 నుంచి రూ 25వేల వరకూ ఖర్చవుతుంది. దీంతో ఎగుమతి దారులు గత 10 రోజులుగా ఎగుమతులు నిలిపివేశారు. మొత్తంగా రెండు రోజుల నుంచి ఎగుమతులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే జీఎస్టీ విధానంలో స్పష్టతలేక పోవడంతో ఎగుమతులు మందకొడిగా సాగుతున్నాయి. రూ. 5లు మించి ధర ఉండదు చిలకా సత్యనారాయణ, మర్రితిప్ప, నరసాపురం మండలం, కొబ్బరి రైతు కొబ్బరి పువ్వు నుంచి కాయగా మారడానికి 40 రోజులు పడుతుంది. చెట్టును పెంచాలంటే పదేళ్లు పైనే పడుతుంది. కాయకి ప్రస్తుతం రూ. 5లు ఇచ్చి మా దగ్గర కొంటున్నారు. మేమే ఏదైనా గుడి దగ్గర కాయ కొనుక్కోవాలంటే రూ. 15లు పెట్టాలి. మాకు ఎప్పుడూ రూ. 5లు, రూ. 6లు మించి ఇవ్వరు. ధరలేని రోజుల్లో అయితే కాయ ఓ రూపాయి, రాపాయిన్నరకు కూడా కొంటారు. ఎరువులు అవీ వేసి పెంచే పని లేదు కాబట్టి , ఏదో అలా వెళ్లిపోతుంది. మా పరిస్థితి మాత్రం దారుణం. కొబ్బరి చెట్ల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి ప్రాంతాల నుంచి గతంలో వచ్చినంత దిగుబడి రావడం లేదు. గత మూడేళ్లలో అయితే మరీ దారుణంగా ఉంది. చెట్ల సంఖ్య తగ్గిపోవడమే కారణం. చేల గట్ల మధ్య ఇక్కడ ఎక్కువ సంఖ్యలో చెట్లు ఉండేవి. ఇప్పుడు చెరువులు తవ్వేస్తున్నారు. మొగల్తూరు లాంటి ప్రాంతాల్లో తోటలు కూడా తవ్వేసి చెరువులు చేసేస్తున్నారు. 20 ఏళ్లుగా కొబ్బరి వలుపు పని చేస్తున్నాను. ఇప్పుడు 100 కాయలు ఒలిస్తే రూ. 70లు ఇస్తున్నారు. ఈ మధ్యనే కూలి పెరిగింది. మొన్నటి వరకూ కాయకు అర్ధ రూపాయి ఇచ్చేవారు. కాపుబాగా కాస్తే మాకు పని ఉంటుంది. ధరలేక పోయినా, ఎగుమతులు లేక పోయినా పని ఉండదు. ఈ పని చేసేవాళ్లం మరో పని చేయలేము. కొబ్బరి ఎగుమతులపై గతంలో వాణిజ్య పన్నులు ఉండేవి. అయితే 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రద్దు చేశారు. ప్రస్తుతం ఎలాంటి పన్నులు లేవు. అయితే కిరాయి, హమాలి చార్జీలు వాటిపై 18శాతం జీఎస్టీ ఉందని అంటున్నారు. కొంతమంది లేదంటున్నారు. ఈ విషయంలో స్పష్టతలేదు. అందుకే కొన్ని రోజులు ఎగుమతులు కూడా నిలిపివేశారు. కొబ్బరి ఎగుమతులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకూడదు. -
పాతాళానికి చేరిన ఉల్లి ధరలు
-
జీఎస్టీతో వంటగ్యాస్ చౌక!
తగ్గనున్న నిత్యావసర వస్తువుల బడ్జెట్ న్యూఢిల్లీ: వంటగ్యాస్ (ఎల్పీజీ), నోట్ పుస్తకాలు, ఇన్సులిన్, అల్యూమినియం ఫాయిల్స్, అగర్బత్తి ఇలా నిత్యావసర వస్తువుల్లో చాలా వాటి ధరలు జీఎస్టీ అమలు కారణంగా జూలై 1 నుంచి చౌకగా లభించనున్నాయి. ఎందుకంటే వీటిపై ప్రస్తుతమున్న వివిధ రకాల పన్నుల కంటే తక్కువ పన్నునే జీఎస్టీ మండలి ఖరారు చేసింది. ఇలా పన్ను తగ్గే వాటిలో పాలపొడి, పెరుగు, మజ్జిగ, బ్రాండ్ పేరు లేని తేనె, డైరీ ఉత్పత్తులు, జున్ను, మసాలా దినుసులు, టీ, గోధుమలు, బియ్యం, గోధుమ, మైదా పిండి, కొబ్బరి నూనె, పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, ఆవనూనె, పంచదార, చక్కెరతో చేసిన మిఠాయిలు, పాస్తా, నూడుల్స్, పండ్లు, కూరగాయలు, పచ్చళ్లు, మురబ్బా, కెచప్, సాస్లు, ఇన్స్టంట్ ఫుడ్ మిక్స్లు, మినరల్ వాటర్, ఐస్, సిమెంట్, బొగ్గు, కిరోసిన్ (పీడీఎస్), పళ్ల పొడి, సబ్బులు, ఎక్స్రే ఫిల్మ్, మెడికల్ డయాగ్నస్టిక్ కిట్లు ఉన్నాయి. ప్రస్తుతంతో పోలిస్తే జీఎస్టీలో పన్నులు తగ్గే వాటి వివరాలతో కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అలాగే, డ్రాయింగ్ పుస్తకాలు, సిల్క్, వూలె న్, కాటన్ వస్త్రాలు, రెడీమేడ్ వస్త్రాలు, రూ.500లోపున్న పాద రక్షలు, హెల్మెట్లు, ఎల్పీజీ స్టవ్, కళ్లద్దాలు, చెంచాలు, ఫోర్క్లు కూడా ధరలు తగ్గనున్నాయి.