cyber criminals
-
సైబర్ నేరాల కట్టడికి ‘ఐ4సీ’
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రోజుకో తరహా మోసంతో అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు దర్యాప్తు సంస్థలు తమదైన శైలిలో అడ్డుకట్ట వేస్తున్నాయి. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరిట మోసగాళ్ల ఆగడాలు బాగా పెరగడంతో వారికన్నా ఒకడుగు ముందుకేసి, వారు మోసాలకు వినియోగిస్తున్న సిమ్కార్డు లు, స్కైప్ ఐడీలు, వాట్సాప్ నంబర్లను బ్లాక్ చేస్తున్నాయి. తాము చేపట్టిన చర్యల్లో భాగంగా సైబర్ మోసగాళ్లు డిజిటల్ స్కామ్లకు వాడిన సుమారు 7.81 లక్షల సిమ్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సైబర్ నేరాలకోసం వినియోగిస్తున్న 2,08,469 ఐఎంఈఐ నంబర్లను కూడా బ్లాక్ చేసినట్లు పేర్కొంది. దేశంలో జరుగుతున్న డిజిటల్ స్కామ్లు, సైబ ర్ నేరాలపై ఇటీవల ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయంతో పరిష్కరించేందుకు హోంశాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’(ఐ4సీ) కృషి చేస్తోందన్నారు. వార్తా పత్రికలు, మెట్రో రైళ్లలో ప్రకటనలు, ఆకాశవాణి.. తదితర మాధ్యమాల ద్వారా దీనిపై ప్రచారం చేస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాలర్ట్యూన్ ప్రచా రాన్ని ప్రారంభించామన్నారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రోజుకు 7 నుంచి 8 సార్లు విధిగా ప్రతి వినియోగదారుడికి వినిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజిటల్ స్కామ్లపై 1930 టోల్ఫ్రీ నంబర్కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందిçస్తున్నామని చెప్పారు. డిజిటల్ స్కామ్ల కోసం ఉపయోగించిన 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను ఐ4సీ గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టిందన్నారు. అలాగే అంతర్జాతీయ స్ఫూఫ్డ్ కాల్స్ను కూడా గుర్తించి అరికడుతున్నట్లు తెలిపారు. వివిధ సైబర్ నేరాలపై వచ్చిన 13.36 లక్షల ఫిర్యాదుల ఆధారంగా రూ.4,386 కోట్లు నేరగాళ్లబారిన పడకుండా చర్యలు తీసుకున్నట్లు బండి వివరించారు. -
బరితెగించిన సైబర్ నేరగాళ్లు
-
ఉద్యోగాల ఎర.. ‘సైబర్’ వెట్టిలో చెర!!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనా స్కామ్స్టర్లు ఆన్లైన్లో విసిరిన ‘ఉద్యోగాల’ వలలో తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. బందీలుగా మారి సైబర్ మోసాల వెట్టిచాకిరీలో విలవిల్లాడుతున్నారు. తమను కాపాడాలంటూ ఓ బాధితుడు ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.విమాన టికెట్ పంపి మరీ..కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన కొక్కిరాల మధుకర్రెడ్డి ఉపాధి కోసం గతంలో దుబాయ్ వెళ్లి వచ్చాడు. ‘బ్యాంకాక్లో రూ. లక్ష జీతంతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం’ అంటూ ఆన్లైన్లో వచ్చిన ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేశామని.. వచ్చి వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటనదారుల నుంచి విమాన టికెట్ అందడంతో గతేడాది డిసెంబర్ 18న బ్యాంకాక్ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మధుకర్రెడ్డి పాస్పోర్టు లాక్కున్న సైబర్ నేరగాళ్లు ఆయన్ను సైబర్ నేరాలు చేసే ‘పని’ చేయాలని హుకుం జారీ చేశారు.గత్యంతరం లేకపోవడంతో..అమెరికాలో నివసించే భారతీయుల చేత క్రిప్టోకరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టించి వారిని మోసగించడమే చైనా సైబర్ నేరగాళ్లు మధుకర్రెడ్డి లాంటి బాధితులకు అప్పగించిన ఉద్యోగం. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్లో మాట్లాడగల నైపుణ్యం ఉన్న బాధితులకు ఈ పనులు అప్పగించారు. అవి రాని యువకులకు మాత్రం అమాయకులకు ఫోన్లు చేసి తీయగా మాట్లాడి (హనీట్రాప్) డబ్బు కాజేసే పనులు ఇచ్చారు. అయితే పాస్పోర్టులు లాక్కోవడంతో విధిలేక చైనా నేరగాళ్లు చెప్పినట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల బాధ్యతలు చేపట్టాక బ్యాంకాక్లో పరిస్థితులు మారడంతో స్కామ్స్టర్లు.. వారి మకాంను బ్యాంకాక్కు 574 కి.మీ. దూరంలోని వాయవ్య మయన్మార్లో ఉన్న ఇంగ్విన్ మయాంగ్ అనే చిన్న పట్టణంలోని ఓ భవంతికి మార్చారు. ఇంగ్విన్ మయాంగ్కు, థాయ్లాండ్ సరిహద్దుకు మధ్య కేవలం నది మాత్రమే అడ్డంకి.కాపాడాలని వేడుకోలు..అక్కడికి వెళ్లాక సైబర్ నేరగాళ్ల అరాచకాలు మితిమీరాయి. ఆహారం ఇవ్వకపోవడం.. తీవ్రంగా కొట్టడంతోపాటు తాగునీరు, విద్యుత్ లేని భవనంలో బాధితులను ఉంచారు. ఈ క్రమంలో ఓ ఫోన్ను సంపాదించిన మధుకర్రెడ్డి.. వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’ని ఆశ్రయించి సాయం చేయాలని కోరాడు. ఉద్యోగ ప్రకటనతో తాము మోసపోయామని, తమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 19 తర్వాత తమను కాల్చి చంపుతామని నేరగాళ్లు బెదిరిస్తున్నారని వాపోయాడు. తనతోపాటు తెలంగాణ, ఏపీ, బిహార్, రాజస్తాన్కు చెందిన దాదాపు 150 మందిని అక్రమంగా బంధించారని వివరించాడు. వెంటనే తమను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాడు. -
ఆ గంట.. కీలకమంట!
పట్నంబజారు: అత్యవసర పరిస్థితుల్లో ఎంతో అవసరమైన సమయంలో మనం వాడే పదం గోల్డెన్ అవర్. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు సంభవించేటప్పుడు మాత్రమే ఈ పదం విని ఉంటారు. ప్రమాదాలు సంభవించిన గంటలోపే క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చడం దీని ఉద్దేశం. ఇదే తరహాలో సైబర్ మోసాలకు గురయ్యే బాధితులు సైతం నేరం జరిగిన గంటలోగా ఫిర్యాదు చేయగలిగితే.. ఖాతాలో పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకునే వీలుంటుంది. బాధితులు చేయాల్సిందల్లా గోల్డెన్ అవర్లో సైబర్ సెల్కు ఫిర్యాదు చేయటమే. జిల్లాలో ఇప్పటివరకు వందల సంఖ్యలో సైబర్ నేరాలు నమోదు అయ్యాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తాము మోసానికి గురయ్యామని ఎస్సీఆర్బీకి ఫిర్యాదు చేయటం ద్వారా, లేదా 1930 సైబర్ సెల్ నంబరు డయల్ చేసి ఫిర్యాదు ఇవ్వడం వలన ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెనక్కి తీసుకువచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదు చేయాలిలా..» మోసపోయామని తెలుసుకున్న వెంటనే బాధితులు 1930 నంబర్కు కాల్ చేయాలి. » లేదంటే https:// cybercrime. gov. in అనే పోర్టల్పై క్లిక్ చేయాలి. హోం పేజీలోకి వెళ్లి ఫైల్ ఎ కంప్లైంట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని నియమాలు, షరతులు చూపిస్తుంది. వాటిని చదివి యాక్సెప్ట్ చేసి రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత సిటిజన్ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ వంటి వివరాలు ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ను బాక్స్లో ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. తర్వాత పేజీలోకి తీసుకెళ్తుంది. అసలు ప్రక్రియ మొదలయ్యేది ఇక్కడే. » ఈ పేజీలో ఒక ఫామ్ కనిపిస్తుంది.. దానిలో జరిగిన సైబర్ మోసం గురించి క్లుప్తంగా రాయాలి. అక్కడ నాలుగు సెక్షన్లుగా విభజించి ఉంటుంది. సాధారణ సమాచారం (విక్టిమ్ ఇన్ఫర్మేషన్), సైబర్ నేరానికి సంబంధించి సమాచారం (సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్), ప్రివ్యూ అనే సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్లో అడిగిన వివరాలను సమరి్పస్తూ.. ప్రక్రియను పూర్తిచేయాలి. మూడు సెక్షన్లు పూర్తయ్యాక ప్రివ్యూను వెరిఫై చేయాలి. అన్ని వివరాలు సరిగా ఉన్నాయని భావిస్తే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఘటన ఎలా జరిగిందనేది వివరాలు నమోదుచేయాలి. నేరానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు (అకౌంట్ ట్రాన్సాక్షన్ తదితర) ఫైల్స్ వంటి ఆధారాలు, సాక్ష్యాలు అందులో పొందుపర్చాలి. వివరాలు సేవ్ చేసి నేరగాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫిల్ చేయాలి. » అంతా వెరిఫై చేసుకున్నాక సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కంప్లైంట్ ఐడీతో పాటు ఇతర వివరాలతో కూడిన ఈ–మెయిల్ వస్తుంది. తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే దుండగుడు డబ్బును వేర్వేరు ఖాతాల్లో మళ్లించేస్తాడు. లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చుకునే ప్రమాదముంది. సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్కు కాల్ చేయాలి. వెంటనే ఫిర్యాదు చేయండి.. సైబర్ మోసానికి గురయ్యేవారు వెంటనే గుర్తించాలి. తక్షణం ఫిర్యాదు చేస్తే మన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలెక్కువ. లేదంటే ఎక్కడ ఉంటారో.. వారి ఖాతాలు ఏ రాష్ట్రానికి చెందినవో.. ఇవన్నీ కనుక్కోవడం పెద్ద ప్రక్రియ అవుతుంది. డయల్ 1930కు గానీ, ఎన్సీఆర్బీ గానీ ఫిర్యాదు చేసి బ్యాంకు వాళ్లను, దగ్గరలో ఉన్న పోలీస్స్టేషన్ను సంప్రదించాలి. తద్వారా బాధితుడికి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీ, గుంటూరు జిల్లా -
వైద్య వ్యవస్థలపై సైబర్ నేరగాళ్ల కన్ను
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక సైబర్ దాడులు భారత్పైనే జరుగుతుండగా.. అందులోనూ వైద్య వ్యవస్థలపైనే అత్యధికంగా సైబర్ దాడులకు నేరగాళ్లు తెగబడుతున్నారు. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ నివేదిక–2025 పేరిట ప్రముఖ సైబర్ సెక్యూరిటీ చెక్పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ విడుదల చేసిన నివేదిక భారత్లో సైబర్ దాడుల తీవ్రతను వెల్లడించింది. నివేదిక ఏం చెప్పిందంటే..2023తో పోలిస్తే 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు 44శాతం పెరిగాయి. ప్రపంచంలోని కీలక మౌలిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సైబర్ దాడుల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లోని మౌలిక వ్యవస్థలపై సగటున వారానికి 1,847 సైబర్ దాడులు జరిగాయి. భారత్లో మాత్రం అంతకు మూడు రెట్లు సైబర్ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని మౌలిక వ్యవస్థలు సగటున వారానికి 3,291 సైబర్ దాడుల బారిన పడటం గమనార్హం. రెండో స్థానంలో విద్యారంగంభారత్లో వైద్య రంగమే అత్యధికంగా సైబర్ దాడుల బారినపడింది. సైబర్ నేరగాళ్లు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలపై సగటున వారానికి 8,614 సైబర్ దాడులకు తెగబడ్డారు. సగటున వారానికి 7,983 సైబర్ దాడులతో విద్యారంగం రెండో స్థానంలోనూ, 4,731 దాడులతో రక్షణ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. 2024 మే నెలలో భారత్ అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడింది. ఆ ఒక్క నెలలోనే వేలిముద్రలు, ఫేషియల్ స్కాన్లతోసహా ఏకంగా 500 జీబీ బయోమెట్రిక్ డేటా చౌర్యానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సహా దేశంలోని ప్రముఖ వైద్యసంస్థలు సైబర్ దాడులతో హడలెత్తిపోయాయి. వైద్య సంస్థల్లోని రోగుల వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు.జెన్ ఏఐని వినియోగించి..జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) ద్వారా సైబర్ నేరగాళ్లు యథేచ్చగా సైబర్ దాడులకు తెగబడుతున్నారు. జెన్ ఏఐ ద్వారా దుష్ప్రచారం, డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి సైబర్ దాడులకు పాల్పడటంతోపాటు బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొట్టడం, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు యత్నించారు. ప్రధానంగా రిమోట్ యాక్సెస్ ట్రోజన్ల ద్వారా ఫేక్ అప్డేట్లతోనే ఈ సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. మొత్తం సైబర్ దాడుల్లో 58 శాతం ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడినవే కావడం గమనార్హం. -
పార్ట్ టైమ్ చీటింగ్!
పార్ట్టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో నిరుద్యోగులు పెరగడంతో వారిని లక్ష్యంగా చేసుకుంటూ నిండాముంచుతున్నారు. ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేయొచ్చు.. పార్ట్టైమ్ జాబ్ అయినా మంచి జీతం వస్తుందని నమ్మిస్తూ నట్టేట ముంచుతున్నారు.రామగిరి మండలం గరిమేకపల్లికి చెందిన 29 ఏళ్ల నిరుద్యోగి ఉద్యోగాల వేటలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘పార్ట్టైమ్ ఉద్యోగం’ పేరుతో వచ్చిన ఆన్లైన్ లింక్ క్లిక్ చేశాడు. ఫార్మాలిటీ ప్రకారం పదే పదే నగదు చెల్లింపులు చేస్తూ మొత్తం రూ.80 వేలు కోల్పోయాడు. నెల రోజులుగా ఈ తతంగం జరుగుతూనే ఉంది. అప్రూవల్ వస్తుందని.. రిజి్రస్టేషన్, వెరిఫికేషన్.. ఇలా పలు కారణాలతో డబ్బులు తీసుకున్నారు. నెల రోజులు గడిచినా ఉద్యోగం మాత్రం రాలేదు. తర్వాత అంతకు ముందు టచ్లోకి వచ్చిన సెల్ఫోన్ నంబర్లన్నీ స్విచాఫ్ వచ్చాయి. దీంతో మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.ధర్మవరం మండలం రేగాటిపల్లికి చెందిన ఓ బీటెక్ విద్యార్థిని ఇంటి వద్దనే ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యోగం వెతుకుతూ.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కింది. ఫొటోలు, మార్కుల జాబితాలు పంపింది. ఆ తర్వాత రూ.20 వేలు అడ్వాన్స్గా కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పారు. కేవలం రెండు నెలల పాటు నెలకు రూ.15 వేలు చొప్పున జీతం ఇచ్చారు. ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తామని మరో రూ.50 వేలు తీసుకుని ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు.సాక్షి, పుట్టపర్తి: కష్టపడకుండా డబ్బులు రావు. అలా వచ్చినా నిలబడవు.. ఈ విషయం తెలియక చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి అప్పులు చేసి మరీ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అమాయకులనే లక్ష్యంగా చేసుకుని గూగుల్ లింక్ క్లిక్ చేస్తే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని నమ్మిస్తూ వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో లెక్క లేనన్ని లింక్లు నిత్యం వస్తుంటాయి. ఏ ఒక్క లింక్ క్లిక్ చేసినా.. ఆ తర్వాత ఫోన్ మన చేతిలో ఉన్నా.. ఆపరేటింగ్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలు, ఫోన్ పే, గూగుల్ పే తదితర నగదు లావాదేవీల యాప్ల ద్వారా నగదు కాజేస్తున్నారు. పలు కోణాల్లో ప్రజలను టార్గెట్ చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదు దోచేస్తున్నారు. రోజుకో చోట సైబర్ నేరం బయట పడుతున్నా.. బలి అవుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తెలిసీ తెలియక సామాజిక మాధ్యమాలను వినియోగించడం తెలీక కొందరు బలి అవుతుండగా.. డబ్బుపై అత్యాశతో ఇంకొందరు సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. ఆఖరికి కేటుగాళ్ల బారిన పడిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే వారిలో కూడా కొందరు బయటికి చెప్పకుండా నష్టపోయినట్లు తెలుసుకుని మౌనంగా ఉండిపోతున్నారు. అప్రమత్తత అవసరం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ లింక్లను క్లిక్ చేయకూడదు. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఉద్యోగ ప్రకటనలు, రీచార్జ్ ఆఫర్లు తదితర వాటిని ఎవరూ నమ్మొద్దు. – వి.రత్న, ఎస్పీ, సత్యసాయి జిల్లా -
ఆన్లైన్ బుకింగ్పై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగ నున్న మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులందరూ ఆన్ లెన్ బుకింగ్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) సూచించింది. ఆన్ లైన్లో హోటల్, ధర్మశాల, గెస్ట్హౌస్ బుకింగ్ల సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 45 రోజులపాటు జరిగే ఈ కుంభమేళాకు లక్షలాది మంది సందర్శకులు రాను న్నందున యాత్రికులను మోసం చేయడానికి సైబర్ నేరస్తులు నకిలీ వెబ్సైట్లు, లింక్లను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఎలాంటి రిజర్వేషన్ లేకుండానే తగ్గింపు ధరలకే వసతిని అందిస్తామంటూ మోసగాళ్లు భక్తులను ఆకర్షిస్తారని.. హోటళ్లు, ధర్మశాల, టెంట్ సిటీలకు ముందస్తు చెల్లింపులను వసూలు చేయడానికి మోసపూరిత వెబ్సైట్లు, నకిలీ బుకింగ్ లింక్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది.టీజీసీఎస్బీ సూచనలు..⇒ అధికారిక మార్గాల్లోనే వసతిని బుక్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ధ్రువీకరించబడిన సంప్రదింపు నంబర్లు, వెబ్సైట్లను ఉపయోగించండి. ఈ అధికారిక వెబ్సైట్ https://kumbh.gov.in/en/ Wheretostaylist అందుబాటులో ఉంది.⇒ అసాధారణంగా తక్కువ ధరలకు వసతిని అందించే తెలియని లింక్లు లేదా ప్రకటనలపై క్లిక్ చేయవద్దు.⇒ తెలియని ఖాతాలకు లేదా అనధికారిక బుకింగ్ ప్లాట్ఫారమ్ల ద్వారా ముందస్తు చెల్లింపులు చేయవద్దు.⇒ అధికారికంగా క్రాస్–చెక్ చేయడం లేదా రాష్ట్ర అధికారు లను నేరుగా సంప్రదించడం ద్వారా ఏదైనా వసతి లేదా సర్వీస్ ప్రొవైడర్ ప్రామాణికతను ధ్రువీకరించుకోండి.⇒ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.⇒ ఒకవేళ మోసానికి గురైనట్లయితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు కాల్ చేయడం ద్వారా లేదా www. cybercrime. gov. in లో అధికారిక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను సందర్శించి ఫిర్యాదు చేయండి.⇒ సైబర్ భద్రతపై మరింత సమాచారం కోసం.. tgcsb.tspolice.gov.in ని సందర్శించండి. -
సైబర్ మోసం తాళలేక విద్యార్థి ఆత్మహత్య
వీణవంక (హుజూరాబాద్): సైబర్ మోసానికి ఓ విద్యార్థి బలైపోయాడు. రూ. 5 వేలు పెట్టుబడి పెడి తే రెండింతలు ఇస్తాం’ అంటూ ఫోన్కు వచ్చిన మె సేజ్కు ఆకర్షితుడై పలు దఫాలుగా కేటుగాళ్లకు రూ.90 వేల మేర ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి మోసపోయాడు. చివరకు మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగ ల్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మహిళా సంఘం నుంచి తల్లి తీసుకున్న చిట్టీ డబ్బులతో.. బేతిగల్ గ్రామంలో నివసిస్తున్న గుమ్మడి సృజన్–ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రిషివర్థన్ (18) ఇటీవల డిప్లొమా పూర్తి చేసి బీటెక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. వారం క్రితం అతని మొబైల్కు కేటుగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట పంపిన సందేశం చూసి ఆకర్షితుడయ్యాడు. తన తల్లి ఇటీవల మహిళా సంఘం నుంచి రూ. 90 వేల చిట్టీ పాడుకోవడంతో వచ్చిన డబ్బును ఇందుకోసం వాడుకోవాలనుకున్నాడు. వెంటనే ఆమె ఖాతాలోంచి ఆ సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. తొలుత రూ. 5 వేలను సైబర్ నేరగాళ్ల ఖాతాకు పంపాడు. అయితే రెట్టింపు సొమ్ము పొందాలంటే రెండో టాస్్కగా రూ. 23,500 పెట్టుబడి పెట్టాలంటూ వారు మెలిక పెట్టడంతో ఆ సొమ్మునూ చెల్లించాడు. మూడో టాస్్కలో రూ. 68 వేలు పెట్టుబడి పెడితే రీఫండ్ వస్తుందని కేటుగాళ్లు నమ్మించడంతో ఆ మొత్తం కూడా బదిలీ చేశాడు. అయితే ఆ సొమ్ముకు రెట్టింపు పొందాలంటే రూ. 2 లక్షల 6 వేలను బదిలీ చేయాలని వారు పేర్కొనడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు కుటుంబ సభ్యులకు లేఖ రాశాడు. ‘సారీ మమ్మీ.. నేను చనిపోతున్నా, రిన్నూ (తమ్ముడు) జాగ్రత్త.. డాడీ, మమ్మీ ఇన్నీ రోజులు నన్ను భరించినందుకు థ్యాంక్స్. నేను ట్రేడింగ్ (స్టాక్ మార్కెట్)లో డబ్బులు పెట్టి మోసపోయా. కంపెనీ వివరాలు నా మొబైల్లో ఉన్నాయి’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. -
సైబర్ చోర్ టెకీస్
సాక్షి, హైదరాబాద్: ‘చదువుకోకపోతే దొంగ అవుతావా?’అని చిన్నప్పుడు స్కూలుకు వెళ్లకపోతే తల్లిదండ్రులు తిట్టడం అందరికీ అనుభవమే. కానీ, మంచి చదువు చదివినవారు కూడా కొందరు ఈజీ మనీకి అలవాటుపడి నేరాల బాట పడుతున్నారు. తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వాడి సైబర్ నేరాలకు తెగబడుతున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) నివేదిక ప్రకారం సైబర్ నేరా లు చేస్తున్నవాళ్లలో 45 శాతం మంది బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత సాంకేతిక విద్య పట్టభద్రులే ఉన్నారు. వారిలోనూ 49 శాతం మంది వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్యనే ఉన్నది. సైబర్ నేరాలకు పాల్పడుతున్నవాళ్లలో మూడు శాతం మంది ప్రభు త్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. ఉక్కుపాదం మోపుతున్న టీజీసీఎస్పీ సైబర్ నేరాల కట్టడి కోసం తెలంగాణ పోలీసులు టీజీసీఎస్బీని ఏర్పాటు చేశారు. ఈ నేరాల తీవ్రత దృష్ట్యా కేసుల దర్యాప్తులో అడ్డంకులను అధిగమించడంతోపాటు పక్కాగా దర్యాప్తు చేపట్టేందుకు నేరుగా టీజీసీఎస్బీ డైరెక్టర్ పర్యవేక్షణ కింద ఈ ఏడాది ఏప్రిల్లో మొత్తం ఏడు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లను (సీసీపీఎస్) ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఆరు నెలల్లో 76 సైబర్ నేరాల్లో దేశవ్యాప్తంగా 165 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులకు తెలంగాణవ్యాప్తంగా 795 సైబర్నేరాలతో, దేశవ్యాప్తంగా 3,357 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్టు అధికారులు తెలిపారు. న్యూ ఢిల్లీ, గుజరాత్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి వీరిని అరెస్టు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీస్లపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. కొన్ని కేసుల్లో స్థానిక పోలీసుల సహకారం సైతం ఉండటంలేదని టీజీసీఎస్బీ పోలీసులు తెలిపారు. ఏ తరహా నేరాలు ఎక్కువ? సైబర్ నేరాల్లో పార్ట్టైం జాబ్స్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ (స్టాక్ ట్రేడింగ్), డిజిటల్ అరెస్టులు, లోన్ యాప్, హ్యాకింగ్, అడ్వరై్టజ్మెంట్, మ్యాట్రిమోనియల్ మోసాలు ఎక్కువ ఉంటున్నాయి. పట్టుబడుతున్న వారిలో సైబర్ మోసాలకు పాల్పడే వారితోపాటు మ్యూల్ బ్యాంక్ ఖాతాదారులు, బ్యాంకు ఖాతాలు ఇచ్చే ఏజెంట్లు, అకౌంట్ ఆపరేటర్లు, సిమ్కార్డులు సరఫరా చేసేవాళ్లు, బ్యాంకు అధికారులు, ట్రావెల్ ఏజెంట్లు, హ్యాకర్లు సైతం ఉన్నారు. సైబర్సేఫ్ తెలంగాణే మా లక్ష్యం సైబర్ నేరగాళ్ల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉన్నాం. సైబర్సేఫ్ తెలంగాణే మా లక్ష్యం. ప్రజలు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దు. మీరు సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్ లేదా 87126 72222 వాట్సప్ నంబర్లో లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn లోనూ ఫిర్యాదు చేయవచ్చు. – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీసీఎస్బీ -
సీవీ ఆనంద్ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్.. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరగాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. నగర పోలీస్ కమిషనర్(సీపీ) సీవీఆనంద్ డీపీతో వాట్సాప్ కాల్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. పాకిస్తాన్ దేశ కోడ్తో వాట్సాప్కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలని ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఇటీవల అక్రమ కేసుల పేరిట ఫేక్ వాట్సాప్కాల్స్ చేస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం పెరిగిపోయిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులతో పాటు కేసులు రిజిస్టర్ అవడం, ఫోన్ కనెక్షన్ను ట్రాయ్ కట్ చేయడం తదితర కారణాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో భారీ చోరీ -
వృద్ధురాలికి సైబర్ నేరగాళ్ల టోకరా
నూజివీడు : సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల మోసానికి రూ.40 లక్షలు పోగొట్టుకున్నారు. నూజివీడు పట్టణంలోని ఉషాబాలా నగర్లో నివాసముండే మందపల్లి కమలాజేసుదాసుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె బెంగళూరులో, చిన్న కుమార్తె, కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. కమలాజేసుదాసు ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ నెల రెండో తేదీ మధ్యాహ్న సమయంలో 9850852151 నంబరు నుంచి ఓ మహిళ కమలా జేసుదాసుకు ఫోన్ చేసి.. తాము ముంబయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరిట పార్శిల్ వచ్చిందని, అందులో ఎండీఎంఏ అనే నిషేధిత డ్రగ్స్ ఉందని చెప్పింది. మీకు మరో కాల్ వస్తుందంటూ కాల్ కట్ చేసింది. ఆ తర్వాత వెంటనే కమలాజేసుదాసుకు 7831062545 నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది.. తాము ముంబయి పోలీసులమని, మీకు డ్రగ్స్తో సంబంధం ఉందని, అమెరికాలో ఉన్న మీ కుటుంబ సభ్యులకూఇందులో సంబంధం ఉందంటూ భయపెట్టారు. ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బు మీ ఖాతాలో ఉందని, మీరు ఏ తప్పూ చేయకుంటే ఆ డబ్బును తమకు ట్రాన్స్ఫర్ చేయాలని, ఏ తప్పూ లేకపోతే మీ డబ్బు మళ్లీ మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో భయపడిన వృద్ధురాలు ఈ నెల మూడో తేదీన రూ.20 లక్షలు, గంట తర్వాత రూ.10 లక్షలు, నాలుగో తేదీన మరో రూ.10 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా వారిచ్చిన ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం తనకు కాల్ వచ్చిన నంబర్కు ఆమె ఫోన్ చేస్తే.. అది పనిచేయడం లేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న కమలా జేసుదాసు.. పట్టణ పోలీస్స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టౌన్ సీఐ పి.సత్యశ్రీనివాస్ కేసు నమోదు చేశారు. -
తెలివిమీరిన సైబర్ నేరగాళ్లు.. ఎమ్మెల్యే పేరుతో డబ్బులు వసూలు
నల్లగొండ జిల్లా :సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమో మరోసారి వెలుగు చూసింది.ఈసారి సైబర్ నేరగాళ్ల అమాయకుల్ని మోసం చేసేందుకు ప్రజా ప్రతినిధుల్ని ఎంచుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యుల పేరుతో సైబర్ నేరగాళ్ల వాట్సాప్ కాల్స్ చేశారు.ఎమ్మెల్యే వేముల వీరేశం పేరుతో డబ్బులు కావాలంటూ ఆయన సన్నిహితులకు మెసేజ్, వాట్సాప్ కాల్స్ చేశారు. సైబర్ కేటుగాళ్ల గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వీరేశం తన పేరుతో మెసేజ్లు,కాల్స్ వస్తున్నాయని,అలాంటి వాటికి స్పందించొద్దని కోరారు. -
15 రోజుల ఆపరేషన్.. 27 మంది సైబర్ క్రిమినల్స్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో కొల్లగొట్టిన సొమ్ము లావాదేవీలు చేసేందుకు తమ బ్యాంకు ఖాతాలను కమీషన్ల కోసం ఇస్తున్న (మ్యూల్ బ్యాంక్ ఖాతాలు) 27 మంది నిందితులను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.టీజీసీఎస్బీ అధికారులు తొలి సారిగా చేపట్టిన అంతర్రాష్ట్ర ఆపరేషన్లో భాగంగా ఈ నిందితులను రాజ స్తాన్లోని 3 ప్రాంతాల్లో అరెస్టు చేసినట్టు బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీజీసీఎస్బీ ఎస్పీ దేవేందర్సింగ్, ఇతర అధికారులతో కలిసి ఆమె మాట్లాడారు. తెలంగాణలో 189 సైబర్ నేరాలతో వీరికి సంబంధం..‘అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి మొదటిసారిగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టాం. రాజస్తాన్లోని జైపూర్, జోథ్పూర్, నాగ్పూర్లలో 15 రోజులపాటు చేసిన ఈ ఆపరేషన్లో 27 మందిని అరెస్ట్ చేశాం. దేశవ్యాప్తంగా జరిగిన 2,223 సైబర్ నేరాలలో వీరు నిందితులుగా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 189 సైబర్ నేరాల్లో వీరికి సంబంధం ఉంది. పట్టుబడిన వారిలో నిరుద్యోగులతోపాటు కాంట్రాక్టర్లు, వ్యాపారాలు చేస్తున్నవారు..ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉన్నారు. నిందితులు అందరూ విద్యావంతులే. వీరంతా 29 మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా రూ. 11.01 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు చేసినట్టు గుర్తించాం. తెలంగాణకు సంబంధించిన 189 కేసులలో కొల్లగొట్టిన రూ.9 కోట్లు వీరి బ్యాంకు ఖాతాల ద్వారానే పలు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. ఈ బ్యాంకు ఖాతాలను వినియోగించి చేసిన మోసాలలో ప్రధానంగా వ్యాపార పెట్టుబడులు, ట్రేడింగ్తోపాటు డిజిటల్ అరెస్టు వంటి నేరాలు ఉన్నాయి’ అని శిఖాగోయల్ వెల్లడించారు. సైబర్ మోసగాళ్ల పనిపట్టేందుకు టీజీ సీఎస్బీ ఆధ్వర్యంలో ఇకపైన కూడా అంతర్రాష్ట్ర ఆపరేషన్లు కొనసాగుతాయని, ఇందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పట్టుబడిన 27 మంది వద్ద నుంచి 31 మొబైల్ ఫోన్లు, 37 సిమ్ కార్డులు, రెండు హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని కీలక విషయాలు తెలుస్తాయన్నారు. కమీషన్ల కోసం తమ బ్యాంకు ఖాతాలను, వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చి చిక్కులు కొనితెచ్చుకోవద్దని ప్రజలను శిఖాగోయల్ హెచ్చరించారు. కాగా, స్పెషల్ ఆపరేషన్లో పాల్గొన్న డీఎస్పీలు కేవీ సూర్యప్రకాశ్, ఫణీందర్, వేణుగోపాల్రెడ్డి, హరికృష్ణ, కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్లు రమేశ్, ఆశిష్రెడ్డి, రవికుమార్, శ్రీను నాయక్, సునీల్, ఇతర సిబ్బందిని శిఖాగోయల్ ప్రత్యేకంగా అభినందించారు. -
అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ గ్యాంగ్ అరెస్ట్.. 27 మందిపై 2023 కేసులు
సాక్షి, హైదరాబాద్: తొలిసారి అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ గ్యాంగ్ను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. వీరిని పట్టుకొవాడినికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని, రాజస్థాన్లో నాలుగు బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయని చెప్పారు. రాజస్థాన్, జైపూర్, జోధ్పూర్లలో ఈ ఆపరేషన్ నిర్వహించామని. 15 రోజుల అపరేషన్లో భాగంగా 27 మంది సైబర్ క్రిమినల్స్ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు అందరూ విద్యావంతులేననని, మొత్తం ముప్పై ఏళ్ళ లోపు వారే ఉన్నారని తెలిపారు.ఒక్కొక్కరు పదుల కేసుల్లో నిందితులుగా ఉన్నారని, ఈ 27 మందిపై తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులు నమోదైనట్లు శిఖా గోయల్ చెప్పారు. దేశ వ్యాప్తంగా 2023 కేసులో వీరు నిందితులుగా ఉన్నారన్నారు. నిందితుల నుంచి 31 మొబైల్ ఫోన్స్, 37 సిమ్ కార్డ్స్, చెక్ బుక్స్లను స్వాధీనం చేసుకున్నామని ెప్పారు. నిందితులు 29 మ్యూల్ అకౌంట్లను సైబర్ క్రైమ్స్ కోసం సేకరించారని తెలిపారు. 11 కోట్లు లావాదేవీలు 29 అకౌంట్ల ద్వారా నిందితులు చేశారని, విచారణలో లావాదేవీల జరిపిన మొత్తం అమౌంట్ పెరిగే అవకాశం ఉందన్నారు.‘సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు స్పెషల్ ఆపరేషన్ చేయలేదు. స్పెషల్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేశాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులు అందర్నీ పట్టుకోగలిగాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా టీమ్స్ బృందాలుగా డిస్పాచ్ అయ్యి నిందితులను అరెస్ట్ చేశారు. మా బృందాలు ఎప్పటికపుడు నేరస్తుల కదలికలు, లోకేషన్లపై నిఘా పెట్టీ అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది కమిషన్ కోసం ఉద్దేశ పూర్వకంగానే మ్యూల్ అకౌంట్ లను నేరస్తులకు ఇస్తున్నారునేరస్తులకు క్రిమినల్ కార్యకలాపాల కోసం అకౌంట్స్ ఇవ్వవద్దు. తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులో నిందితులు రూ. 9 కోట్లు కొల్ల గొట్టారు. నిందితులను అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీసుల సహకరించారు. సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ ఇది లాస్ట్ ఆపరేషన్ కాదు. మొదటిది. నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ దేశంలో ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తాం. నేరగాళ్లు సిటీలు వదిలి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల కొల్లగొట్టిన రూ. 114 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం బాధితులకు తిరిగి ఇచ్చాం. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్ సెంటర్ కు పిర్యాదు చేయాలి. మ్యూల్ అకౌంట్లను ఓపెన్ చేసేముందు క్రాస్ చెక్ చేయాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని తెలిపారు. -
హలో.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి చేతుల్లో డబ్బు పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్ఫ్రీ నంబర్ 1930కు వస్తున్న ఫిర్యాదు కాల్సే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు రోజుకు సరాసరిన 1600 ఫోన్కాల్స్ వచ్చి నట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా ఆర్థిక మోసా లకు సంబంధించినవి 50 శాతం కాగా, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు 50 శాతం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు మొత్తం 460 మంది సైబర్ నేరగాళ్లను 351 కేసుల్లో అరెస్టు చేసినట్టు అధికారులు చెప్పారు.⇒ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ప్రతి రోజూ సరాసరిన 330 ఫిర్యాదులు నమోదవుతున్నాయి. టోల్ ఫ్రీ నంబర్కు వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం ఫిర్యాదులకు 1930 కాల్ సెంటర్ సిబ్బంది సమాధానాలు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఆగస్టు 31 వరకు బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వారు పోగొట్టుకున్న సొమ్ములో 13 శాతం సొమ్మును సకాలంలో ఫిర్యాదు చేయడంతో టీజీసీఎస్బీ అధికారులు కాపాడారు. ఇలా మొత్తం రూ.163 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా చేశారు. -
ఆ రాష్ట్రాల్లో స్కామర్స్... మేము వెళ్ళి చూస్తే ఒక్కొక్కరు
-
సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు
-
సైబర్ నేరగాళ్లే ఎంపీడీవో ఉసురు తీశారు!
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్య ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాళ్ల వేధింపుల కారణంగానే ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్యపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. వెంకటరమణ సెల్ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా రాజస్థాన్లోని బర్కత్పూర్కు చెందిన సైబర్ముఠా వలలో ఎంపీడీవో చిక్కుకున్నట్లు గుర్తించారని తెలిసింది. సుమారు 30మంది ఉన్న ఈ సైబర్ నేరస్తుల ముఠా ఓ యువతి న్యూడ్ వీడియోను ఆధారంగా చేసుకుని ఎంపీడీవోను ఇరుకునపెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆయనను బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు కూడా గుర్తించారని తెలిసింది. మరింత డబ్బులు కావాలని సైబర్ ముఠా ఒత్తిడి చేయడంతో బయటకు చెప్పుకోలేక ఎంపీడీవో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్మ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్లోని బర్కత్పూర్కు చెందిన సైబర్ముఠా సభ్యుడిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఎంపీడీవో అదృశ్యమైన తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నరసాపురంలోని మాధవాయిపాలెం ఫెర్రీ కాంట్రాక్టర్ సీహెచ్ రెడ్డప్ప ధవేజీ ప్రభుత్వానికి రేవు నిర్వహణకు సంబంధించిన లీజు డబ్బులు బకాయి ఉండటంతోనే ఎంపీడీవో కనిపించకుండాపోయారని కూటమి నేతలు ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ ధవేజీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అనుచరుడని, లీజు డబ్బులు చెల్లించకుండా ప్రసాదరాజు ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. అందువల్లే ఒత్తిడికి గురైన ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీడీవో తన కుటుంబ సభ్యులకు వాట్సాప్లో పెట్టిన సూసైడ్ నోట్ కథనాన్ని తెరపైకి తెచ్చారు. అయితే, ఎంపీడీవో ఆత్మహత్యకు, ఫెర్రీ వ్యవహారానికి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
సిమ్ కార్డులతో సైబర్ నేరం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నకిలీ, కాలం చెల్లిన ఆధార్ కార్డులలో చిన్నారుల ఫొటోలను పెట్టి తయారు చేసిన పత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని వాటిని సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరి టీ బ్యూరో (సీఎస్బీ), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. సిమ్ కార్డుల రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 64.5 శాతం మంది కస్టమర్లు మాత్రమే డిజిటల్ కేవైసీని ఆధార్తో లింక్ చేసుకుంటున్నట్టు నివేదిక తేల్చింది.‘టెలికామ్ సిమ్ సబ్స్క్రిప్షన్ ఫ్రాడ్స్–గ్లోబల్ పాలసీ ట్రెండ్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రికమండేషన్స్’ పేరిట నిర్వహించిన ఈ అధ్యయన నివేదికను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సోమవారం టీజీ సీఎస్బీ కార్యాలయంలో ఐఎస్బీ ప్రొఫెసర్లతో కలిసి విడుదల చేశారు. సీఏఎఫ్ (కస్టమర్ అక్విజేషన్ ఫారమ్స్)లోని సమాచారం ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేపట్టినట్టు నివేదికలో పేర్కొన్నారు.హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ నేరాల్లో ఉన్న ఫోన్ నంబర్లకు సంబంధించి మొత్తం 1,600 సీఏఎఫ్ల వివరాలు విశ్లేషించినట్టు తెలిపారు. సైబర్ నేరగాళ్లు వినియోగించిన ఫోన్ నంబర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్స్తో రియల్ టైంలో విశ్లేషించినట్టు వివరించారు. సిమ్ కార్డులు పోతే సమాచారం ఇవ్వాలి: సీఎస్బీ డైరెక్టర్సైబర్ నేరాల్లో సిమ్కార్డు సంబంధిత మోసాలు పెరుగు తున్నాయని, వీటిని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయనం అభిప్రా యపడింది. వినియోగదారుడి వివరాలు వెరిఫికేషన్లో చాలా లోపాలు ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఓటీపీ అథెంటికేషన్లోనూ లోపాలు ఉన్నట్టు వెల్లడించింది. ప్రజలు సిమ్ కార్డులు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ఈ సందర్భంగా శిఖా గోయల్ సూచించారు.పోగొట్టుకున్న సిమ్ కార్డులను వినియోగించి సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, అందులో మన వివరాలు ఉంటాయి కాబట్టి మనం చిక్కుల్లో పడతామని హెచ్చరించారు. అదేవిధంగా వ్యక్తిగత సమాచారాన్ని అవసరానికి మించి ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఈ నివేదిక రూపకల్పనలో ఆపరేషన్స్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, నిజామాబాద్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ ప్రొఫెసర్లు మనీశ్ గంగ్వార్, డా.శ్రుతిమంత్రిలు పాల్గొన్నారు. -
+92 నంబర్తో కాలింగ్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మోసాలకు దారులు వెతుకుతున్నారు. వాట్సాప్ డీపీగా పోలీస్ ఉన్నతాధికారుల ఫొటోలను పెట్టుకుని, ఆ నంబర్ల నుంచి పలువురికి వాట్సాప్ వాయిస్ కాల్స్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి బెదిరింపుల వీడియో ఒకటి డీజీపీ జితేందర్ తన అధికారిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే నమ్మి మోస పోకుండా.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.తెలంగాణ సీఎస్, డీజీపీ పేరిట గతంలోనూ వాట్సాప్ డీపీలతో డబ్బులు డిమాండ్⇒ ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఫొటోను వాట్సాప్డీపీగా పెట్టిన సైబర్ నేరగాళ్లు..సీఎస్ పేరిట నలుగురు వ్యక్తులకు మెసేజ్లు పెట్టారు. అందులో రంజాన్ గిప్ట్ కూపన్లు పంపాలని కోరడంతో అనుమానాస్పదంగా భావించిన సదరు వ్యక్తులు సీఎస్ దృష్టికి తెచ్చారు. దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు.⇒ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా డీజీపీగా పనిచేసిన సమయంలో ఆయన ఫొటోను డీపీగా పెట్టిన నంబర్తో ఈ ఏడాది మే 21న ఓ వ్యాపారికి వాట్సాప్ కాల్ వెళ్లింది. ‘మీ అమ్మాయిని నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఆమెను విడుదల చేయాలంటే రూ.50 వేలు మొబైల్ పేమెంట్ ద్వారా పంపండి అని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు.⇒ ఈ ఏడాది మే 23న వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి కొందరు సైబర్నేరగాళ్లు ఆమె పేరిట డబ్బులు పంపాలంటూ కలెక్టరేట్ సిబ్బందితో పాటు కొందరు ప్రజలకు వాట్సాప్ మెసేజ్లు పంపారు. విషయం తన దృష్టికి రావడంతో కలెక్టర్ వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు..ప్రజలు, అధికారులు ఎవరూ అలాంటి మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు.+92 నంబర్తో వస్తే అది మోసం.. మీ వాట్సాప్కు పోలీసుల పేరిట బెదిరింపు కాల్స్ వస్తే అందులో ఉన్న నంబర్ ఏ సంఖ్యతో మొదలైందో గమనించాలి. ఒకవేళ అది +92 నంబర్తో వస్తే.. పక్కాగా అది సైబర్ నేరగాళ్లపనే అని గుర్తించాలి. వాస్తవానికి +92 కోడ్ పాకి స్తాన్ది. చాలావరకు ఈ నంబర్తో కాల్స్ పాకి స్తాన్ నుంచే వస్తాయని, కొన్నిసార్లు కంప్యూటర్ ప్రోగ్రామ్లతోనూ ఇలాంటికాల్స్ జనరేట్ చేయవచ్చని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు. అనుమానం వస్తే సంచార్ సాథీ పోర్టల్ దృష్టికి తేవాలి.. మీకు తెలియని నంబర్ నుంచి +92తో ప్రారంభమయ్యే కాల్ వచి్చ.. అందులో అవతలి వ్యక్తి మీ వ్యక్తిగత వివరాలు.. మీ ఆధార్ నంబర్, బ్యాంక్ లాగిన్ వివరాలు లేదా ఓటీపీలు.. ఏవైనా అడిగితే చెప్పవద్దు. అలాంటి అనుమానాస్పద నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సంచార్ సాథీ పోర్టల్ (ఠీఠీఠీ. ట్చnఛిజ్చిట ట్చ్చ్టజిజీ.జౌఠి.జీn)‘చక్షు–రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్స్’లో మోసపూరిత సమాచారాన్ని తెలియజేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్రజలకు సూచించింది. ఫేక్ వాట్సాప్కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. పోలీస్ అధికారుల ఫొటోలను డీపీగా పెట్టుకు న్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించి న వాళ్లు పోలీసులకు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. – జితేందర్, డీజీపీ, తెలంగాణ -
మీషో కూపన్ల పేరిట సైబర్మోసం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అయిన మీషో పేరిట సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెర తీస్తున్నారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీషో కంపెనీ నుంచి వచి్చందని భ్రమపడేలా ఓ ఫామ్ను, స్క్రాచ్ కార్డును డిజైన్ చేసి సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేస్తున్నారు. వీటిని అందుకున్న వారిని అందులోని కార్డును స్క్రాచ్ చేయాలని సూచనల్లో పేర్కొంటున్నారు. అలా స్క్రాచ్ చేసిన తర్వాత అందులో మీరు లక్కీ కస్టమర్ కింద లక్కీ కూపన్లో కారు, బంగారం వంటి ఖరీదైన బహుమతులు గెలుచుకున్నారని ఉంటుంది. ఇలా లక్కీ డ్రా తగిలిన వారు వెంటనే మీ స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, మేం అడిగే వివరాలు నమోదు చేయాలని చెబుతారు. ఏదైనా సందేహాలుంటే మీకు ఇచ్చిన దరఖాస్తులోని నంబర్లకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. వివరాలిస్తే అసలుకే మోసం...ఎవరైనా అమాయకులు ఈ ఉచ్చులో చిక్కితే ఇక సైబర్ నేరగాళ్లు తమ విశ్వరూపం చూపిస్తున్నారు. ఇలా స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూర్ కోడ్ స్కాన్ చేసి అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేస్తే ఇక అసలు మోసం మొదలవుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అనుమానాస్పద యాప్లు మనకు తెలియకుండానే మన ఫోన్లోకి ఇన్స్టాల్ అవుతాయి. అదేవిధంగా మనం నమోదు చేసే బ్యాంకుఖాతా, వ్యక్తిగత వివరాలన్నీ తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకుఖాతాల్లోని డబ్బులు కొల్లగొడుతున్నారు.ఇలాంటి కూపన్లు వస్తే నమ్మవద్దని, ఎలాంటి వివరాలు వారితో పంచుకోవద్దని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పట్టణప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా మోసాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. -
సైబర్ నేరగాళ్ల మైండ్ ‘బ్లాక్’
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పడానికి కేంద్రప్రభుత్వం మరో కీలకనిర్ణయం తీసుకుంది. వీరు వినియోగించే మొబైల్ఫోన్లు బ్లాక్ చేయిస్తోంది. తాజాగా 28,200 çహ్యాండ్సెట్స్ బ్లాక్ చేయాలని ఆయా సర్విస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఈ ఫోన్లలో వాడిన 20 లక్షల ఫోన్నంబర్ల పూర్వాపరాలు మరోసారి పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ–కేటుగాళ్లు గత ఏడాది ‘గ్రేటర్’పరిధిలోని బాధితుల నుంచి ఏకంగా రూ.621 కోట్లు కాజేశారంటే సైబర్ నేరాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డార్క్నెట్లో దొరుకుతున్న డేటా ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్లు అక్కడి నుంచే దేశవ్యాప్తంగా బాధితులను టార్గెట్గా చేసుకుంటున్నారు. అయితే దీనికి సెల్ఫోన్ వినియోగదారుల వివరాలు అత్యంత కీలకం. వీరి నంబర్లతో కూడిన డేటా సైబర్ నేరగాళ్లకు డార్క్నెట్లో తేలిగ్గా దొరుకుతోంది. లక్ష మందికి సంబంధించిన ఫోన్ నంబర్లను కేవలం రూ.30 వేలకు విక్రయించేవారు అనేకమంది ఉన్నారు. ఈ డేటా వీరి వద్దకు ఎలా చేరుతోందనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.ప్రీ యాక్టివేటెడ్ సిమ్కార్డులు సైబర్ నేరగాళ్లు తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ బాధితుడు పోలీస్ ఫిర్యాదు చేసినా, దర్యాప్తులో ముందుకు వెళ్లకుండా, వారికి ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ఉండేలా ప్లాన్ చేశారు. బ్యాంకు ఖాతాలు, సెల్నంబర్లు ఇలా ఏదీ తమ పేరుతో లేకుండా చూసుకుంటున్నారు. వీరికి అవసరమైన బ్యాంకు ఖాతాలు, సిమ్కార్డులను సరఫరా చేయడానికి కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. ఇతరుల పేర్లతో ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలతోపాటు ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు సేకరించి సైబర్ నేరగాళ్లకు ఈ ముఠాలు అందజేస్తున్నాయి. బ్యాంకు ఖాతాలు ఇచి్చనందుకు కమీషన్లు, సిమ్కార్డుకు అధిక రేటు వీరికి దక్కుతోంది.ఆ రెండింటితో ఉపయోగం లేక... సైబర్ నేరగాళ్లను కట్టడి చేయడానికి కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తొలినాళ్లలో సైబర్ నేరాలతో సంబంధం ఉన్న బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేసేది. ఈ విధానం పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో మరో అడుగు వేసింది. సైబర్ నేరగాళ్లు వినియోగించినట్టు, వినియోగించే అవకాశమున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించిన సెల్ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడం మొదలెట్టింది. దీంతో తెలివిమీరి వ్యవహరిస్తున్న ఆ కేటుగాళ్లు అధిక సంఖ్యలో ప్రీ యాక్టివేటెడ్ సిమ్కార్డులు సమీకరించడం మొదలెట్టారు. ఒక్కో నేరానికి ఒక్కో సిమ్ వాడుతున్నారని అధికారులు గుర్తించారు. ఫోన్లు బ్లాక్ చేసేలా తాజా నిర్ణయం సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న హ్యాండ్సెట్స్ను బ్లాక్ చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ బాధ్యతల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) పర్యవేక్షించడం మొదలెట్టింది. సైబర్ నేరాల్లో బాధితులుగా మారినవారు నేరుగా, ఆన్లైన్ ద్వారా పోలీసులు లేదా సంబంధిత ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, 1930కు కాల్ చేయడం ద్వారా, వెబ్సైట్, యాప్ల్లో దాఖలవుతున్న వీరి ఫిర్యాదుల్లో తమను సంప్రదించడానికి సైబర్ నేరగాడు వినియోగించిన ఫోన్ నంబర్ వివరాలు ఉంటున్నాయి. ఈ డేటా ఆధారంగానే డీఓటీ మొబైల్ ఫోన్లు బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుటోంది. సర్విసు ప్రొవైడర్ల సహకారంతో.. ఈ సెల్ఫోన్ హ్యాండ్సెట్లు గుర్తించడం, బ్లాక్ చేయడంలో ఆయా నెట్వర్క్ సర్విస్ ప్రొవైడర్ల పాత్ర అత్యంత కీలకం. ప్రతి సెల్ఫోన్కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్గా (ఐఎంఈఐ) పిలిచే ప్రత్యేక నంబర్ ఉంటుంది. ఏ కంపెనీ సిమ్ వాడుతుంటే ఆ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ఈ ఐఎంఈఐ రిజిస్టర్ అవుతుంది. బాధితుల ఫిర్యాదులో ఉన్న సెల్నంబర్ ఆధారంగా సర్విస్ ప్రొవైడర్ల సహకారంతో డీఓటీ ఐఎంఈఐ నంబర్లను గుర్తిస్తోంది. వీటితో జాబితా రూపొందించి ఆయా సర్విస్ ప్రొవైడర్లకు పంపిస్తోంది. దీని ఆధారంగా ఈ ఐఎంఈఐ నంబర్లు ఉన్న ఫోన్లు పనిచేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఆ హ్యాండ్సెట్ బ్లాక్ అయిపోతోంది. ఇటీవల కాలంలో నేరగాళ్లు స్కైప్ కాల్స్ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఈ తరహాకు చెందిన స్కైప్ ఖాతాలను కేంద్రం బ్లాక్ చేయిస్తోంది. -
పబ్లిక్ ప్రాంతాల్లో చార్జింగ్ పోర్టులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ప్రయాణాల సమయంలో మొబైల్ చార్జింగ్ అయిపోయినా.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టులు.. వంటి బహిరంగ ప్రాంతాల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్ర హోంశాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్వేర్ చొప్పించి, డేటా తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ తరహా జ్యూస్ జాకింగ్ స్కామ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జ్యూస్ జాకింగ్కు గురైనట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా www.cybercrime. gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏమిటీ జ్యూస్ జాకింగ్..? చార్జింగ్ పాయింట్లకు అనుసంధానమై ఉంటూ ఫోన్లలో మాల్వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్వేర్లను యూజర్కు తెలియకుండా ఇన్స్టాల్ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్ పోర్టులను వాడే వారికి డేటా తస్కరణ ముప్పు ఎక్కువ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా డేటాను కొట్టేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. జ్యూస్ జాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే ♦ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది. ♦ చార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. ♦అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్ సాధనాలు వెంట పెట్టుకోవడం ఉత్తమం. ♦ మొబైల్ ఫోన్లకు స్క్రీన్లాక్ తప్పకుండా పెట్టుకోవాలి. ♦ వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయాలి. -
ఈ లింక్పై క్లిక్ చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో చేరాలని యువతలో చాలా కలలు కంటుంటారు. ఇలాంటి కలల్నే తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు తెరదీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు. భారత వాయుసేనలో చేరాలంటే తాము ఇచ్చే ప్రకటనలోని లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాౖలెన ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి వాటిల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా అభ్యర్థుల నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ తర్వాత దరఖాస్తు కోసమని, వెరిఫికేషన్ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని వారు సూచించారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఎన్నికల వేళ బరితెగిస్తున్న కేటుగాళ్లు
విజయవాడలోని గుణదలకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. ‘ఎన్నికల సర్వేలో చురుగ్గా పాల్గొంటున్నందున మా పార్టీ నుంచి కొన్ని రీడిమ్ పాయింట్లు ఇస్తున్నాం. ఈ పాయింట్ల కోసం ఈ కింది లింక్ను క్లిక్ చేయండి’ అని అందులో ఉంది. పాయింట్లు వస్తాయనే ఆశతో సదరు వ్యక్తి లింక్ను క్లిక్ చేసి గూగుల్ ఫామ్లో వివరాలు నమోదు చేశాడు. ఆ వివరాల ఆధారంగా బ్యాంక్ ఖాతాలోని నగదును సైబర్ నేరగాళ్లు ఖాళీ చేయడంతో లబోదిబోమన్న బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ (స్పోర్ట్స్): కాలానికి అనుగుణంగా మోసాలకు పాల్పడటంలో ఆరితేరిన సైబర్ నేరగాళ్లు ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరుతో మోసాలకు తెగబడుతున్నారు. సర్వే అంటూ, ఓటరు కార్డు సరి చేయాలంటూ ఫోన్లు చేసి ప్రజల బ్యాంక్ ఖాతాలను లూటీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి నేరుగా ఎవరికీ ఫోన్ కాల్ రాదనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. సర్వే పేరుతో వివరాలు సేకరించి మోసాలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు సర్వేల పేరుతో ప్రజలకు ఫోన్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల స్వభావం తెలుసుకునేందుకు, ఓట్లు అభ్యర్థించేందుకు పార్టీలు రికార్డింగ్ కాల్స్ మాత్రమే చేస్తున్నాయి. దీనినే కొందరు నేరగాళ్లు సైబర్ మోసాలకు వాడుకుంటున్నారు. ఫోన్ చేసిన ఆగంతకుడు ఏదో ఒక పార్టీ సర్వే పేరుతో తియ్యని మాటలతో ముగ్గులోకి దించుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి స్వభావంపై తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే ఆన్లైన్లో ఆకర్షణీయమైన గిఫ్ట్ పంపుతామని ఆశ పెడతారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత మీరు గిఫ్ట్ పొందేందుకు అర్హత సాధించారని నమ్మిస్తారు. గిఫ్ట్ మీ ఇంటికి రావాలంటే మీ ఓటర్ కార్డ్, బ్యాంక్, ఆధార్, పాన్ వివరాలు చెప్పాలని అభ్యర్థిస్తారు. ఈ వివరాలన్నీ సేకరించిన తరువాత ఆయా బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును ఏఈపీఎస్ (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) ద్వారా ఖాళీ చేస్తారు. ఏఈపీఎస్ మోసాల్లో ఖాతాదారుడికి డబ్బులు వేరే ఖాతాకు డెబిట్ అయినట్టు కనీసం మెసేజ్ కూడా రాదు. ఖాతాలో నగదు లేకుండా అదే వ్యక్తి పేరున ఓ సిమ్ తీసుకుని సోషల్ మీడియా ఖాతాలతో పాటు బ్యాంక్ ఖాతా తెరుస్తున్నారు. వేరే వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి నేరగాళ్లు నగదును ముందుగా ఈ బ్యాంక్ ఖాతా, యూపీఐ యాప్లకు బదిలీ చేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధితుడినే నేరగాడిగా మార్చేస్తున్నారు. సామాన్య ప్రజల పేరునే ఎక్కువగా బ్యాంకు ఖాతాలు తెరిచి నగదును ఆయా ఖాతాలకు నేరగాళ్లు బదిలీ చేస్తున్నారు. ఏదైనా ఫిర్యాదు రాగానే దాని ఆధారంగా ఆయా బ్యాంక్ ఖాతాను వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకు ముందుగా స్మార్ట్ ఫోన్ సరిగ్గా వాడటం తెలియని వ్యక్తులే తారసపడుతున్నారు. రీడిమ్ పాయింట్లు ఎరగా చూపి.. సర్వే పేరుతో నేరగాళ్లు పలు రకాల ప్రశ్నలు వేసిన అనంతరం.. సర్వేలో చురుగ్గా పాల్గొన్న మీకు కొన్ని ఎస్బీఐ రీడిమ్ పాయింట్లు ఇచ్చామని, తాము పంపే లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్లో మీ వివరాలు నింపాలని సూచిస్తారు. ఫామ్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా బ్యాంక్ ఖాతాలోని నగదును మొత్తం ఖాళీ చేస్తున్నారు. ఓటర్ కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదంటూ.. ఓటర్ కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదని, వచ్చే ఎన్నికల్లో మీరు ఓటు హక్కును వినియోగించుకోలేరని ఫోన్ ద్వారా ప్రజలను నేరగాళ్లు ఆందోళనకు గురి చేస్తారు. ఎన్నికల సంఘం నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తారు. వివరాలు చెప్తే సరి చేస్తామని, ఎనేబుల్డ్ అయిన కొత్త ఓటరు కార్డుతో నిర్భయంగా ఓటు వేయవచ్చని భరోసా ఇస్తారు. వాట్సాప్కు పంపే లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్లో వివరాలు నమోదు చేయాలని సూచిస్తారు. పాన్, ఆధార్తో పాటు అదనంగా బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి ఖాతాలోని నగదును లూటీ చేస్తారు. అప్రమత్తంగా ఉండండి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఫోన్లు రావని ప్రజలు గ్రహించాలి. ఓటరు కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదని వచ్చే ఫోన్లకు స్పందించవద్దు. సర్వే పేరుతోరాజకీయ పార్టీలు రికార్డింగ్ కాల్స్ మాత్రమే చేస్తున్నాయి. అవతలి వ్యక్తి మాట్లాడే సర్వేలకు స్పందించాల్సిన అవసరం లేదు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు.గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే గూగుల్ ఫామ్లో వివరాలు నమోదు చేయొద్దు. రానున్న రోజుల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగే అవకా>శం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. – ఎస్డీ తేజేశ్వరరావు, ఏసీపీ, సైబర్ క్రైం, విజయవాడ -
‘చక్షు’కు చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: ‘‘హలో.. మీకు లక్కీ లాటరీలో రూ.50 లక్షలు వచ్చాయి.. ఈ మొత్తాన్ని పొందాలంటే మేం చెప్పే బ్యాంకు అకౌంట్ నంబర్కు రూ.లక్ష పంపండి.. మిగిలిన మొత్తం మీ సొంతం అవుతుంది..’’ ‘మీ వాట్సప్ నంబర్కు వచ్చిన లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.. సర్ఫ్రైజ్ గిఫ్ట్ పొందండి..’’ ‘‘హలో.. బ్యాంకు మేనేజర్ను మాట్లాడుతున్నాను.. మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. లేదంటే మీ క్రెడిట్కార్డు, డెబిట్కార్డు బ్లాక్ అయిపోతాయి. మేం అడిగే వివరాలు చెప్పండి..’’ రోజుకో కొత్త తరహా సైబర్ మోసం...సైబర్ నేరగాళ్ల ఎత్తు ఏదైనా.. మూలం మాత్రం మన ఫోన్కు వచ్చే కాల్స్.. లేదంటే ఎస్ఎంఎస్లు. సైబర్ నేరగాళ్లు వివిధ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్కాల్స్, ఎస్ఎంఎస్లు పంపి ఆర్థిక మోసాలకు పాల్పడటం ఇటీవల విపరీతంగా పెరిగింది. ఇలా ఫోన్ నంబర్లను ఉపయోగించి చేస్తున్న మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘చక్షు’అ్రస్తాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత ఫోన్ నంబర్ల వివరాలు ఈ వెబ్ పోర్టల్లో నమోదు చేస్తే.. మోసగాళ్ల పనిపడతాయి దర్యాప్తు సంస్థలు. బ్యాంకులకు సైతం ఈ అనుమానాస్పద ఫోన్ నంబర్లు పంపుతారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు సదరు నంబర్తో తెరిచిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయడంతోపాటు మరొకరు మోసానికి గురికాకుండా కాపాడతారు. సాధారణ పౌరులు సైతం సైబర్ మోసగాళ్ల సమాచారాన్ని, మోసపూరిత ఫోన్ నంబర్ల సమాచారాన్ని చక్షు పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. ఏమిటీ చక్షు పోర్టల్? చక్షు అంటే కన్ను అని అర్థం.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అందిస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్లో చక్షు పేరిట ‘రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్’కొత్త సేవా పోర్టల్ను కేంద్ర కమ్యూనికేషన్స్, ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే ప్రారంభించారు. అనుమానిత మోసపూరిత కాల్లు, సందేశాలు వివరాలు ఇందులో నమోదు చేయవచ్చు. చక్షు పోర్టల్ ఎలా వినియోగించాలి.. ♦ https://sancharsaathi.gov.in లింక్ ద్వారా సంచార్ సాథి పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. ♦ సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్లో చక్షు ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ♦ మోసపూరిత కమ్యూనికేషన్కు సంబంధించిన వివరాలు, ఆ కాల్ లేదా మెసేజ్ వచ్చిన సమయం, ఇతర వివరాలు నమోదు చేయాలి. ♦ ఫిర్యాదు నమోదైన తర్వాత వెరిఫికేషన్ కోసం ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదైన ఫిర్యాదు దర్యాప్తు సంస్థలకు వెళుతుంది. ఏయే అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు ♦అనధికారిక కనెక్షన్లు, మనకు వచ్చిన మోసపూరిత నంబర్లు సదరు వ్యక్తులపై ఉన్నాయా లేదా తనిఖీ చేయించవచ్చు. ♦ మనం పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం చేయవచ్చు. ♦ అనుమానాస్పద విదేశీ నంబర్లపై ఫిర్యాదు చేయవచ్చు. -
ప్రేమికులూ జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రేమికులపై ఫోకస్ పెట్టారు. వాలెంటైన్స్ డే దగ్గర పడుతుండడంతో డిస్కౌంట్లు, ఆఫర్లు, సర్ఫ్రైజ్ గిఫ్ట్ లు, గిఫ్ట్ కూపన్లు అంటూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఏటా ఈ తరహా మోసాలు షరామామూలే అయినా.. ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు తెరతీ స్తున్నారు. మీకు అత్యంత సన్నిహితులు వాలెంటైన్స్ డే సందర్భంగా మీకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ పంపారు.. దాన్ని పొందాలంటే మేం చెప్పిన ఖాతాకు కస్టమ్స్ చార్జి కోసం కొంత మొత్తం పంపండి అంటూ వల వేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రధానంగా చేస్తున్న మోసాలు చూస్తే.. షాపింగ్ ఫ్రాడ్స్..: ఆన్లైన్ షాపింగ్, బెస్ట్ ఆఫర్స్, గిఫ్ట్లు, డిన్నర్లు అంటూ సోషల్మీడియా ఖాతాల్లో మోసపూరిత యాడ్స్ ఇస్తు న్నారు. ఈ ఆఫర్ల కోసం సంప్రదించే వారి నుంచి వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని మోసం చేస్తున్నారు. ఫిషింగ్ ఈమెయిల్స్.. సైబర్ నేరగాళ్లు వాలెంటైన్స్ డేకు సంబంధించి ప్రత్యేక కొటేషన్లు, మెసేజ్లు, ఎమోజీలు, గ్రాఫిక్ వీడియోలు అంటూ ఫిషింగ్ లింక్లను ఈమెయిల్స్కు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్, ల్యాప్టాప్లోకి మాల్వేర్ వచ్చేలా చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ఈ విషయాలు మరవొద్దు..: ► ఆన్లైన్లో వాలెంటైన్స్ డే గిప్ట్లు కొనాలంటే నమ్మదగిన ఈ కామర్స్ వెబ్సైట్లనే ఉపయోగించాలి. కొత్త యాప్స్ వినియోగించాల్సి వస్తే వాటి రేటింగ్ తప్పక చూసుకోవాలి. వాలెంటైన్స్ డే ప్యాకేజీలు, గిఫ్ట్ల పేరిట నమ్మశక్యం కాని ఆఫర్లు ఉంటే అది సైబర్ మోసగాళ్ల అనుమానాస్పద ప్రకటనగా గుర్తించాలి. ►అనుమానాస్పద మెసేజ్లు,ఈ మెయిల్స్లోని లింక్లపై క్లిక్ చేయవద్దు. మీ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా నంబర్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, పిన్ నంబర్లు, సీవీవీ నంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దు. -
హైటెక్ మోసాల ఆటకట్టు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నిందితుడి వద్ద శిక్షణ తీసుకొని, ఆపై సొంతంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ సైబర్ ముఠా గుట్టురట్టయింది. డేటా ఎంట్రీ జాబ్స్ పేరిట నిరుద్యోగులకు వల వేసి.. ఆపై కంపెనీ షరతులను ఉల్లంఘించారని పేర్కొంటూ నకిలీ లీగల్ నోటీసులు పంపించి బాధితుల నుంచి సొమ్ము వసూలు చేసిందీ గ్యాంగ్. తెలంగాణ, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి 25కుపైగా రాష్ట్రాలలో 358 సైబర్ కేసులున్న ఈ ముఠా.. ఇప్పటివరకు సుమారు రూ.100 కోట్లకు పైగానే సొమ్ము వసూలు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ శిల్పవల్లి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. టెలీ కాలర్గా పని చేసి.. గుజరాత్లోని సూరత్లో నకిలీ డేటా ఎంట్రీ కంపెనీలో దిండోలి ప్రాంతానికి చెందిన రాహుల్ అశోక్ భాయ్ భాస్కర్ టెలీ కాలర్గా పని చేశాడు. ఓ సైబర్ క్రైమ్ కేసు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులు కంపెనీ యజమాని నితీష్ ను అరెస్టు చేసి, కాల్ సెంటర్ను మూసేశారు. కాల్ సెంటర్, డేటా ఎంట్రీ కార్యకలాపాలపై పట్టు సాధించిన రాహుల్.. తన స్నేహితులైన సాగర్ పాటిల్, కల్పేష్ థోరట్, నీలేష్ పాటిల్లను సంప్రదించి సైబర్ మోసాల గురించి వివరించాడు. ఈ నలుగురూ కలిసి సూరత్లో ఫ్లోరా సొల్యూషన్ పేరుతో నకిలీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ పోర్టల్స్ నుంచి నిరుద్యోగుల డేటాను సేకరించి, వారికి వాట్సాప్ ద్వారా డేటా ఎంట్రీ జాబ్ సందేశాలను పంపించేవారు. ఆసక్తి కనబరిచిన వారికి జాబ్ లాగిన్ కోసం ఐడీ, పాస్వర్డ్ అందించేవారు. నకిలీ లీగల్ నోటీసులతో బెదిరింపులు.. డేటా ఎంట్రీ పని పూర్తయ్యాక ఉద్యోగికి సొమ్ము చెల్లించకుండా కంపెనీ ప్రమాణాలకు తగిన స్థాయిలో డేటా ఎంట్రీ లేదని మాయమాటలు చెబుతూ సొమ్ము చెల్లించరు. దీంతో కొంతకాలం ఎదురుచూసిన ఉద్యోగికి డేటా ఎంట్రీ చేయడం మానేస్తాడు. అప్పుడే నిందితులు రంగంలోకి దిగుతారు. కంపెనీ నిబంధనలు, షరతులను ఉల్లంఘించారని పేర్కొంటూ నకిలీ లీగర్ నోటీసులను బాధితులకు వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా పంపించి బెదిరింపులకు తెగిస్తారు. నోటీసులు రద్దు చేసుకోవాలంటే చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. ఈక్రమంలో సైబరాబాద్కు చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కి రూ.6.17 లక్షలు మోసపోయాడు. ఇప్పటికే ఈ ముఠాపై సైబరాబాద్లో 11 కేసులున్నాయి. వేలాది బ్యాంకు ఖాతాల విశ్లేషణ.. బాధితులు పంపించిన సొమ్ము ఏ బ్యాంకు ఖాతాలు నుంచి ఎక్కడికి బదిలీ అయ్యాయో విశ్లేíÙంచారు. ఇతరత్రా సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులు రాహుల్, సాగర్, కల్పేష్, నీలేష్లు సూరత్లో ఉన్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం వారిని అరెస్టు చేసి, స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారంట్ నగరానికి తీసుకొచ్చి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. వీరి నుంచి ఆరు ఫోన్లు, ల్యాప్టాప్, 5 డెబిట్ కార్డులను స్వాదీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సోమవారం కస్టడీకి పిటీషన్ దాఖలు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. -
AP: సంక్షేమ పథకాలపై సైబర్ నేరగాళ్ల కన్ను
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై సైబర్ నేరగాళ్లు కన్ను పడింది. అమ్మ ఒడి, చేయూత, జగన్నన విద్యా దీవెన, వైఎస్సార్ కాపు నేస్తం, వాహన మిత్ర లాంటి పథకాలు వస్తున్నాయా అంటూ ఫోన్ కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏదైనా పథకం రాక పోతే వెంటనే డబ్బులు ఖాతాలో వేస్తామంటూ కేటుగాళ్లు లింక్ పంపిస్తున్నారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ కేంద్రంగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఫోన్ చేసి అమాయకుల్ని నిండా ముంచేస్తున్నారు. ఇలాంటి లాంటి ఫోన్ కాల్స్ నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు తెలిపారు. -
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని బెదిరించి రూ.16 లక్షల సైబర్ మోసం
-
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ పై సైబర్ నేరగాళ్ల కన్ను
-
TS: వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్సైట్లో చలాన్లు కడితే ఇక అంతే..
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ చలాన్లను క్లియర్ చేయటానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీ రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన సైబర్ క్రిమినల్స్.. వావాహనదారులను మోసం చేస్తున్నారు. www.echallantspolice.in పేరుతో ఫేక్ వెబ్సైట్ సృష్టించారు. ఈ సైట్లో పేమెంట్ చేయొద్దని, www.echallan.tspolice.gov.in/publicview వెబ్సైట్లో మాత్రమే నగదు పే చేయాలని పోలీసులు వెల్లడించారు. పేటీఎం, మీ-సేవా సెంటర్లలో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. ప్రకటించిన రాయితీ ఆఫర్కు వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈనెల 10వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. చలాన్ల క్లియరెన్స్పై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. నకిలీ వెబ్సైట్ ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులు కొల్లగొడుతున్నారు. నకిలీ వెబ్ సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్ సైట్లలోకి వెళ్లి డబ్బులు చెల్లించ వద్దని హెచ్చరించారు. నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసిన వాళ్లని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు పడ్డారు. ఇదీ చదవండి: ఈ నెల 5 నుంచి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె -
మీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్!
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సర్ఫ్రైజ్ గిప్్టలని, పండగ ఆఫర్లు అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా మీకు ఉచిత బహుమతులు వచ్చాయంటూ వచ్చే మెసేజ్లను, ఫోన్కాల్స్ను నమ్మవద్దని తెలంగాణ సైబర్ బ్యూరో అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా నూతన సంవత్సరం పేరిట దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై భారీ ఆఫర్లు ఉన్నాయంటూ వచ్చే ఎస్సెమ్మెస్లలోని లింక్లపై క్లిక్ చేయవద్దని వారు సూచిస్తున్నారు. ఇలాంటి లింక్లలో సైబర్ నేరగాళ్లు ఫోన్, ల్యాప్లాప్లలోకి వైరస్ను చొప్పించే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరించారు. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా కూపన్లు, గిఫ్ట్లు రావన్న విషయాన్ని గుర్తించాలని, ఇలా మన బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు తీసుకుని అకౌంట్లోని డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. అనుమానాస్పద లింక్లు, ఎస్సెమ్మెస్లపై 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని లేదా cybercrime.gov.in లోనూ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఉద్యోగం ఎర వేస్తారు...క్లిక్ చేస్తే ఊడ్చేస్తారు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను బలహీనతగా చేసుకుని కొంతమంది సైబర్నేరాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో ఆకర్షణీ యమైన వేతనం, తక్కువ శ్రమ అంటూ ఇంటర్నె ట్లో ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ నోటిఫికే షన్లు ఒకటి. ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ ప్రకటనలతో ఎంతోమందిని ఆకర్షించి వారి నుంచి తెలివిగా డబ్బులు గుంజడం, ఆపై కనిపించకుండా తప్పుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. అటువంటి ఊదరగొట్టే ఉద్యోగ ప్రకటనల వెనుక మోసం దాగి ఉన్నట్లు గ్రహించాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. భారీగా ఆదాయం అంటూ ప్రకటనలు ఇస్తున్నారంటే దాని వెనుక సైబర్ నేరగాళ్లు మన వ్యక్తి గత, బ్యాంకు సమాచారం కోసం మాటు వేసి ఉన్నారని పసిగట్టాలని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నా రు. ఎక్కువగా ఉద్యోగావకాశాల కోసం, ఆన్లైన్ జాబ్స్ కోసం ఇంటర్నెట్లో వెదికేవారిని సైతం సైబ ర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసు కుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఉద్యోగం పేరిట మెయిల్స్ లేదా మొబైల్స్కు లింక్స్ పంపిస్తా రని, వాటిని ఏమాత్రం క్లిక్ చేసినా మన సమాచార మంతా వారు తెలుసుకుని అకౌంట్లలోని డబ్బుల్ని ఊడ్చేస్తారని చెబుతున్నారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటం పెద్ద కష్టమేమీ కాదని వారు సూచిస్తున్నారు. ఇవీ సూచనలు.. ► ఆన్లైన్ జాబ్ ఆఫర్లో మనం చేసే పనికి సాధారణం కంటే ఎక్కువ లబ్ధి వచ్చేలా, అత్యధిక సంపాదన ఉండేలా సమాచారం ఉంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్ ఉద్యోగాల పేరిట వచ్చే ఈమెయిల్స్లో అక్షర దోషాలు ఉన్నా, ఎలాంటి ఫోన్ నంబర్లు లేకుండా ఉన్నా కచ్చితంగా అది మోసపూరితమైన లింక్ అని పసిగట్టాలి. ► ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తామంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దు. ► ఆన్లైన్ జాబ్ ఇవ్వాలంటే వ్యక్తిగత సమాచారంతోపాటు పాన్, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు షేర్ చేయాలని కోరుతున్నారంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్లో జాబ్ ఇస్తామని ప్రకటనల రూపంలో వచ్చే వెబ్లింక్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు. -
ఓటీపీలతో రూ.6.90 లక్షలకు కుచ్చుటోపీ
పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్లో పడుతుందని, ఫోన్ పే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మాట్లాడాలని సూచించాడు. తొలుత అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. తనది ఆండ్రాయిడ్ ఫోన్ కాకపోవడంతో ఆ యువకుడు గ్రామానికి చెందిన లింగాల శ్రీను నంబర్ నుంచి గుర్తు తెలియని నంబర్కు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. అయితే.. శ్రీను అకౌంట్లో అమౌంట్ తక్కువగా ఉందని చెప్పడంతో శ్రీను తమ్ముడు లింగాల రమేష్ నంబర్ నుంచి ఫోన్చేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ముగ్గురూ సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అతని మాటలు నమ్మిన రమేష్ తన ఫోన్కు వచ్చిన ఓటీపీ నంబర్లతో పాటు ఫోన్పేకు సంబంధించిన పాస్వర్డ్ను చెప్పటంతో లింగాల రమేష్ అకౌంట్లోని రూ.6.90 లక్షల నగదు మాయమైంది. అయితే.. మాయమైన డబ్బు నుంచి రూ.79 వేల నగదు తిరిగి బాధితుడి అకౌంట్కు జమ అయినట్లు ఎస్సై తెలిపారు. తమకు వచ్చిన ఫోన్ నంబర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది స్విచ్చాఫ్ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్తో పాటు స్థానిక బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారని, డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
అంతర్రాష్ట్ర ‘సైబర్’ ముఠా గుట్టురట్టు
అనంతపురం క్రైం: అమాయక ప్రజల కష్టార్జితాన్ని కమీషన్ల పేరుతో కాజేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసిన అనంతపురం పోలీసులు ఐదుగురు సైబర్ నేరగాళ్లను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ముఠా 16 ఫేక్ అకౌంట్ల ద్వారా ఏపీలో రూ.35.59 కోట్ల లావాదేవీలు జరిపినట్లు తేల్చి.. రూ.14.72 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ 16 ఫేక్ అకౌంట్ల నుంచి మరో 172 ఫేక్ అకౌంట్లలోకి సొమ్మును మళ్లించారు. ఇలా దేశవ్యాప్తంగా జరిగిన లావాదేవీలను అంచనా వేస్తే రూ. 350 కోట్లకు పైగానే కొల్లగొట్టినట్లు పోలీసుల అంచనా. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్థానిక పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఇలా వెలుగులోకి.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఈ నెల 15న కేసు నమోదయ్యింది. దీంతో తీగలాగితే డొంక కదిలింది. ఐదుగురు అరెస్టు .. ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయి. ఉత్తర భారత దేశానికి చెందిన కింగ్ పిన్ను కీలక సూత్రధారిగా గుర్తించిన అనంత పోలీసులు.. కింగ్ పిన్ ముఠాలో పనిచేస్తున్న తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన మహ్మద్ సమ్మద్, వెంకటగిరికి చెందిన వెంకటాచలం, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సందీప్, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అజయ్రెడ్డి, అనంతపురానికి చెందిన సంధ్యారాణిని అరెస్టు చేశారు. కింగ్ పిన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు కింగ్పిన్ నుంచి కమీషన్ రూపంలో రూ.20 లక్షలకు పైగా అందడం గమనార్హం. వివిధ రూపాల్లో మోసాలు.. యూట్యూబ్ యాడ్స్ సబ్ స్క్రైబ్, రేటింగ్లకు అధిక కమీషన్లు, ఆన్లైన్ గేమింగ్, ఓటీపీ, పార్ట్ టైం జాబ్స్ ఇలా రకరకాల పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడ్డారు. వీరిపై దేశవ్యాప్తంగా నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) పోర్టల్లో 1,550 ఫిర్యాదులు నమోదయ్యాయి. రూ.350 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా దోపిడీ చేసిన సొమ్మును దుబాయ్లో డ్రా చేస్తున్నట్లు తేల్చారు. అప్రమత్తంగా ఉండాలి.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ యువతను కొన్ని సైబర్ ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అనవసరమైన లింకులు, వాట్సాప్ కాల్స్, మెసేజీలకు స్పందించొద్దు. ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 సైబర్ పోర్టల్, స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, అనంతపురం -
ఆ 10 జిల్లాల్లో సైబర్ దొంగలు
సాక్షి, హైదరాబాద్: అవి నాలుగు రాష్ట్రాల్లోని పది జిల్లాలు.. అమాయకులకు గాలం వేస్తూ దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు అడ్డాలు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 80శాతానికిపైగా ఆ పది జిల్లాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న నేరగాళ్లు చేస్తున్నవే. ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ జిల్లాలు ఉన్నాయి. కేటుగాళ్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి త్వరగా వెళ్లేపోయే వీలున్న జిల్లాల్లో అడ్డా వేసి, సైబర్ క్రైం పోలీసులకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతున్నారు. అడపాదడపా తెలంగాణ పోలీసులు మినహా మిగతా రాష్ట్రాల పోలీసులు ఈ సైబర్ దొంగలను పట్టుకోలేకపోతున్నారు. ఎక్కువగా సైబర్ నేరగాళ్లు ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో ఉంటున్నారన్న అంశంపై ‘ఫ్యూచర్ క్రైం రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్సీఆర్ఎఫ్)’ఇటీవల విడుదల చేసిన తమ అధ్యయన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లకు కొత్త అడ్డాలుగా మారుతున్న ప్రాంతాల వివరాలనూ పేర్కొంది. ఆ పది జిల్లాలే ఎందుకు? సైబర్ నేరగాళ్లు ఆ పది జిల్లాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారన్న దాని వెనుక కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఈ పది జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని కీలక పట్టణాలకు సమీపంలో ఉండటం, సైబర్ సెక్యూరిటీ పరంగా అంతగా అభివృద్ధి చెందకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎక్కువగా ఉండటం వంటివి సైబర్ మోసగాళ్ల ముఠాలకు కలసి వస్తున్నాయని నివేదిక తేల్చింది. ఆయా జిల్లాల్లో సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్థానికుల సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను వాడుకుంటూ ఈ ఉచ్చులోకి సులభంగా దింపుతున్నాయని పేర్కొంది. ఈ పది జిల్లాల్లో చాలా వరకు దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోనివే. స్థానికంగా పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లను గుర్తించలేకపోవడం, అవసరమైతే అప్పటికప్పుడు రాష్ట్రాలు మార్చేయడంతో పట్టుబడటం కష్టంగా మారుతోంది. కొత్తగా సైబర్ క్రైం హాట్స్పాట్లుగా మారుతున్న ప్రాంతాలివీ.. అస్సాం (బార్పేట, ధుబ్రి, గోల్పర, మోరిగాన్, నగాన్), ఏపీ (చిత్తూర్), బిహార్ (బన్క, బెగుసరాయ్, జముయి, నలంద, పాటా్న, ససరామ్), ఢిల్లీ (అశోక్నగర్, ఉత్తమ్నగర్ వెస్ట్, న్యూఅశోక్నగర్, హర్కేష్ నగర్ ఓక్లా, ఆర్కే పురం, ఆజాద్పురా), గుజరాత్ (అహ్మదాబాద్, సూరత్), హరియాణా (బివాని, మనోత, హసన్పుర్, పల్వల్), జార్ఖండ్ (లటేహర్, ధన్బాద్, సంత్పాల్ పరగణా, హజారీబాగ్, కుంతి, నారాయణపూర్, రాంచీ), కర్ణాటక (బెంగళూరు), మధ్యప్రదేశ్ (గుణా), మహారాష్ట్ర (ఔరంగాబాద్, ముంబై), ఒడిశా (బాలాసోర్, ధేన్కనల్, జజ్పుర్, మయూర్భంజ్), పంజాబ్ (ఫజికా, మొహలి), రాజస్థాన్ (బిదర్కా, బర్మార్, జైపూర్), తమిళనాడు (చెన్నై, కోయంబత్తూర్), తెలంగాణ (హైదరాబాద్, మహబూబ్నగర్), త్రిపుర (ధలాయ్), ఉత్తరప్రదేశ్ (బులందర్షహర్, ఘాజియాబాద్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, సీతాపూర్, గౌతమబుద్ధ నగర్), పశ్చిమ బెంగాల్ (పుర్బ బర్దామన్, దుల్చండ్రియ, భద్రల్, దక్షిణ్ దినాజ్పుర్, బిర్భూమ్, బరున్పురా, కోల్కతా, మల్దా, బరంపూర్). ఏ రాష్ట్ర నేరగాళ్లు ఏ తరహా సైబర్ నేరాలు చేస్తున్నారు? రాజస్తాన్: సెక్స్టార్షన్ (సోషల్ ఇంజనీరింగ్ వ్యూ హాలతో ఫొటోలు, వీడియోలు, వాయిస్ మార్ఫింగ్ చేసి మోసగించడం), ఓఎల్ఎక్స్లో ఆన్లైన్ మార్కెటింగ్ పేరిట మోసాలు, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్. జార్ఖండ్: ఓటీపీ స్కామ్లు (మోసపూరిత పద్ధతుల్లో ఓటీపీలు సేకరించి మోసాలు), కేవైసీ అప్డేషన్, విద్యుత్ బిల్లుల పేరిట, కౌన్ బనేగా కరోడ్పతి పేరిట మోసాలు. ఢిల్లీ: ఆన్లైన్ లోన్యాప్ల పేరిట వేధింపులు, ఆన్లైన్ గిఫ్ట్ పేరిట మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, విద్యుత్ బిల్లులు, జాబ్, ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాలు. ఉత్తరప్రదేశ్: ఫేక్ లింకులు (ఫిషింగ్), ఓటీపీ మోసాలు, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల పేరిట మోసాలు. -
ఫ్రీజ్ చేసిన అకౌంట్లలో రూ.100 కోట్లు
గచ్చిబౌలి : రాష్ట్రవాప్తంగా సైబర్ క్రైం పై వచ్చిన ఫిర్యాదులతో ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లలో రూ.100 కోట్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బాధితులకు అందజేస్తామని సైబర్ క్రైం బ్యూరో ఎస్పీ విశ్వజిత్ కంభంపాటి తెలిపారు. శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్లో సైబర్క్రైం బాధితులకు రికవరీ నగదును సీపీ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్వజిత్ మాట్లాడుతూ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. త్వరగా ఫిర్యాదు చేస్తే ఆ నగదు వెళ్లిన అకౌంట్ను బ్లాక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. ఆలస్యమైతే నగదు చేతులు మారే అవకాశం ఉందన్నారు. దీంతో బాధితులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో నగదును తీసుకున్నప్పుడు ఆలస్యం అయితే క్రిప్టో కరెన్సీకి మళ్లించే అవకాశం ఉందన్నారు. అలా చేసిన తరువాత రికవరీ చేసే వీలుండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైం ఫిర్యాదులతో ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లలో రూ.100 కోట్ల నగదు ఉందని, అన్ని జిల్లాల పోలీసు అధికారులకు సమాచారం అందించామని, త్వరలోనే బాధితులకు అందజేయనున్నట్లు తెలిపారు. డబ్బులు ఇస్తామని ఎరవేసి పాస్ బుక్, డెబిట్ కార్డు, లింక్ చేసిన ఫోన్ నెంబర్ తీసుకుని వేరే అకౌంట్లు తెరచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, అలా సహకరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగన్వార్ మాట్లాడుతూ పెట్టుబడి పేరిట మోసాలకు పాల్పడిన కేసులే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆన్లైన్ వెబ్సైట్స్, మెసెంజర్, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. ఇన్వెస్ట్మెంట్ పేరిట మొదట అదనంగా కొంత కలిపి ఇచ్చి నమ్మకం కలిగిస్తారని తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయగానే కంటాక్ట్లో లేకుండా పోతారని వివరించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మూడు, నాలుగు నెలలు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించినట్లు తెలిపారు. 44 కేసుల్లో రూ.2,23,89,575 రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. 1930 కాల్ సెంటర్ కేవలం ఫిర్యాదును మాత్రమే స్వీకరిస్తారని ఆ తర్వా కేసు ఏ పోలీస్ స్టేషన్కు కేటాయిస్తారో మెసేజ్ వస్తుందన్నారు. కేసు స్టేటస్ను ఆయా పోలీస్ స్టేషన్లలోనే అడగాలని సూచించారు. కార్యక్రమంలో సైబర్ క్రైం డీసీపీ రితిరాజ్, ఏసీపీ, సీఐలు పాల్గొన్నారు. డ్రగ్స్ పేరిట బ్లాక్ మెయిల్ మీరు తైవాన్కు పంపుతున్న ఫెడెక్స్ ఫార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి. ఫోన్ నెంబర్, ఆధార్కార్డు వివరాలతో మీ కు ఫోన్ చేశాం. మేము సీబీఐ అధికారులం మీ పై కేసు నమోదవుతుందని ఓ మహిళను బెదిరించి రూ.10.96 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు అకౌంట్ను ఫ్రీజ్ చేసిన పోలీసులు మొత్తం నగదును రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. పెట్టుబడి పేరిట మోసం గాజుల రామారం ప్రాంతానికి చెందిన యువకుడు మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. మెసేంజర్లో ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలు చూసిన అతను మొదట రూ.1000 పంపిస్తే వెంటనే రూ.1200 వచ్చాయి. రెండో సారి రూ.9,900 పంపిస్తే రూ.12600 పంపారు. అనుమానం వచ్చి యువకుడు స్పందించకుంటే వీడియో కాల్స్ చేసి మరింత ఆశ చూపడంతో అప్పు చేసి రూ.2.92,600 పంపాడు. వెంటనే అటువైపు నుంచి ఎలాంటి స్పందనలేకపోవడం మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రూ.1,50,000 రికవరీ చేసి అతడికి అందజేశారు. -
100 ఖాతాలు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ–క్రిమినల్స్ ఫైనాన్షియల్ నెట్వర్క్ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారం సాగక అడ్డదారి.. ముంబైకి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్ వృత్తిరీత్యా డిజిటల్ మార్కెటింగ్ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్లు తదితరాలకు సంబంధించిన గ్రూప్లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు. 20% కమీషన్తో.. తొలుత భరత్ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు. ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్లో ఉండే స్నేహితుడు ప్రశాంత్ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీగా మార్చి.. దుబాయ్, భారత్లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్కు పంపేవా డు. భరత్ తైవాన్లో ఉండే స్వాంగ్ లిన్కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం భరత్ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
కొత్త రకం మోసం.. బ్యాంకు ఖాతాలు అద్దెకు తీసుకుని లావాదేవీలు..
సాక్షి, సిటీబ్యూరో: ‘రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ ఐటీ ఉద్యోగి పార్ట్ టైం జాబ్ వలలో చిక్కి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. కేసు దర్యాప్తులో పోలీసులు బాధితుడు లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతా, సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా ఒక ఖాతాదారుడిని పట్టుకున్నారు. అయితే విచారణలో తానెవరినీ మోసం చేయలేదని, ఒక ఏజెంట్ సూచన మేరకు తన పేరు మీద కరెంట్ బ్యాంక్ అకౌంట్ తెరిచి ఇచ్చానని చెప్పాడు. ఇందుకుగాను ఆ ఏజెంట్ ప్రతి రోజు రూ.1,000 తన ఖాతాలో జమ చేస్తున్నాడని చెప్పాడు. అంతేతప్ప ఆ ఖాతాతో వారేం చేస్తున్నారో తనకేమీ తెలియదని పోలీసులకు బదులిచ్చాడు.’ ... ఇప్పటివరకు పేదలు, అనాథలు, బిచ్చగాళ్ల పేర్ల మీద ఆధార్, పాన్ కార్డులు సృష్టించి, వాటితో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్న సైబర్ నేరస్తులు.. ఈ తరహా ఖాతాల లభ్యత తక్కువయ్యే సరికి నేరస్తులు రూటు మార్చారు. నిరుద్యోగులు, యువకులను ఆకర్షించి, వారి పేర్ల మీద అకౌంట్ల తీసి, వాటిని అద్దెకు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఈ ఏజెంట్లు వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన నిరుద్యోగులను కలిసి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిస్తున్నారు. ఇందుకోసం వారికి రోజుకు రూ.500–1,000 చెల్లిస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే.. భౌతికంగా మీ బ్యాంకు కిట్, సిమ్ కార్డు ఏజెంట్ దగ్గర ఉంటుంది. కానీ, మీ ఆన్లైన్ లావాదేవీలు మాత్రం విదేశాల నుంచి జరుగుతుంటాయి. ఎలాగంటే.. సైబర్ కేటుగాళ్లు సూచించినట్లుగా ఏజెంట్ మీ సిమ్ను కొత్త ఫోన్లో వేసి మైటీటెక్ట్స్, టీమ్ వ్యూయర్, ఎనీ డెస్క్, క్విక్ అసిస్ట్ వంటి రిమోట్ యాక్సెస్ యాప్లను డౌన్లోడ్ చేసుకుంటాడు. తొలుత సైబర్ నేరస్తులు మోసం చేసిన సొమ్మును మీ ఖాతాలో వేయించుకుంటారు. సొమ్మును ఇతర అకౌంట్లకు బదిలీ చేసేటప్పుడు అవసరమైన ఓటీపీని రిమోట్ యాక్సెస్ యాప్ల ద్వారా ఒకే సమయంలో ఇటు ఏజెంట్, అటు విదేశాల్లో ఉండే నేరస్తుడు చూడగలరు. దీంతో కొట్టేసిన సొమ్మును విడతల వారీగా పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, చివరగా నేరస్తుడి అసలు ఖాతాకు బదిలీ అవుతుంది. కొట్టేసిన మొత్తంలో ఏజెంట్లకు 10–20 శాతం కమీషన్ అందిస్తున్నారు. ఎక్కువగా ఈ దేశాల నుంచే.. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, పార్ట్ టైం జాబ్, లోన్ ఫ్రాడ్ మోసాలు ఎక్కువగా అద్దె బ్యాంకు ఖాతాల నుంచే జరుగుతున్నాయని రాచకొండ సైబర్ క్రైమ్స్ పోలీసు అధికారి తెలిపారు. చైనా, ఫిలిప్పిన్స్, నేపాల్ దేశాల ఎక్కువ నేరస్తులు ఉంటున్నారని పేర్కొన్నారు. ఆర్బీఐ ఏం చేయాలంటే.. ♦ ఇండియాలోని బ్యాంకు ఖాతాల నుంచి విదేశీ ఖాతాలకు నిరంతరం లావాదేవీలు జరిపే అకౌంట్లపై నిఘా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిఘా పెట్టాలి. ♦ విదేశీ అకౌంట్లకు నగదు లావాదేవీలు జరిపే సమయంలో వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా కాకుండా ఐపీ ఆధారిత లావాదేవీలను అనుమతించాలి. దీంతో విదేశీ అకౌంట్లు, సైబర్ నేరస్తుల అక్రమ లావాదేవీలపై నియంత్రణ ఉంటుంది. ♦ ఎక్కువ సొమ్ము బదిలీ జరిగే బ్యాంకు ఖాతాలను పరిశీలిచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ♦ అనుమానాస్పద విదేశీ బ్యాంకు లావాదేవీలపై సంబంధిత బ్యాంకు అధికారులను వెంటనే అప్రమత్తం చేయాలి. ఆయా లావాదేవీలపై వెంటనే నిలిపివేయాలి. ♦ విదేశీ లావాదేవీలు జరిపే ఖాతాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలి. ఆయా ఖాతాదారులు, ఫోన్ నంబరు, ఇంటి చిరునామా ఇతరత్రా వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించుకోవాలి. -
డేంజర్:వాట్సాప్లో పొరపాటున కూడా ఆ లింక్ను క్లిక్ చేయొద్దు
వాట్సప్లో ఓ కొత్త మోసం వేగంగా వ్యాపిస్తోంది. ఈ వాట్సాప్ పింక్ స్కామ్ ఇప్పటికే చాలా మంది వ్యక్తులను మోసగించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు, సైబర్ నిపుణులు ఈ మోసాలకు వ్యతిరేకంగా ఇప్పటికే హెచ్చరించారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ ‘పింక్ రెడ్ అలర్ట్’తో హెచ్చరించింది. ఇంతకీ వాట్సాప్ పింక్ అంటే ఏంటి? ఈ స్కామ్ ఎలా వ్యాపిస్తోంది. మీరు బాధితులైతే ఏం చేయాలి?! తప్పనిసరిగా తెలుసుకోవాలి. పింక్ వాట్సాప్ అంటే..? స్కామర్లు ‘అదనపు ఫీచర్లతో ఉన్న పింక్ వాట్సాప్ను డౌన్లోడ్ చేసుకోమని వినియోగదారులకు మెసేజ్లు పంపుతారు.’ ఈ యాప్ నిజానికి ప్రమాదకరమైన మాల్వేర్. వాట్సాప్ పింక్ని డౌన్లోడ్ చేయడంతో స్కామర్లు ఫోన్ డేటాకు యాక్సెస్ పొందుతారు. దీంతో ఈ యాప్ మన ఫోన్ డేటాను పూర్తిగా దొంగిలించడానికి వీలు కల్పిస్తోంది. బ్యాంక్ వివరాలు, కాంటాక్ట్ నంబర్లు, ఫొటోగ్రాఫ్స్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని స్కామర్లు దొంగిలించి ఉండవచ్చు. అనుమానాస్పద లింక్ల పట్ల జాగ్రత్త తెలియని లేదా అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయడం మానుకోవాలి. ప్రత్యేకించి అవి కొత్త ఫీచర్లు లేదా హానికరమైన లింక్లపై క్లిక్ చేసేలా ఆకట్టుకునే మెసేజ్లు ఉంటే అనుమానించాలి. వాట్సాప్ లేదా ఏదైనా ఇతర అధికారిక సంస్థ నుండి వచ్చినట్లు క్లెయిమ్ చేసే మెసేజ్ను యాక్సెస్ చేస్తే ముందు దాని ప్రామాణికతను ధ్రువీకరించాలి. సమాచారం చట్టబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వాట్సాప్ వెబ్సైట్, సోషల్మీడియా అకౌంట్స్, విశ్వసనీయ వార్తా సమాచారాల నుంచి చెక్ చేయాలి. పేరొందిన యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ మొబైల్ పరికరాన్ని సురక్షితంగా ఉంచచ్చు. ఇవి హానికరమైన యాప్లు లేదా లింక్లను గుర్తించి అడ్డుకోవడంలో సహాయపడతాయి. వాట్సాప్, ఇతర యాప్లను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్లకు అప్డేట్ చేయాలి. సేఫ్టీ అప్డేట్ వల్ల బెదిరింపుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది. వాట్సాప్ మీ బ్యాంకింగ్ వివరాల వంటి సెన్సిటివ్ సమాచారాన్ని మెసేజ్ల ద్వారా ఎప్పటికీ అడగదు. తెలియని లేదా నమ్మదగని అకౌంట్స్తో ఎప్పుడూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. వాట్సాప్ కూడా రెండు దశల ప్రామాణికతతో ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడానికి పిన్ నంబర్ ఉంటుంది. కొత్త ఫోన్లో మీ ఫోన్ నంబర్ యాక్సెస్ అవ్వాలంటే ఈ పిన్ నెంబర్ అవసరం అవుతుంది. మీ అకౌంట్ సేఫ్టీని మెరుగుపరచడానికి వాట్సాప్ సెట్టింగ్లలో ఈ ఫీచర్ని ఇప్పుడే ప్రారంభించవచ్చు. వినియోగదారులకు వచ్చే మెసేజ్లు ఇలా ఉంటాయి.. ‘న్యూ పింక్’ వాట్సాప్ కొత్త ఫీచర్లతో అధికారికంగా ప్రారంభించారు. న్యూ పింక్ లుక్ కొత్త ఫీచర్లతో మీ వాట్సాప్ను ఇప్పుడే అప్డేట్ చేయండి. ఈ కొత్త వాట్సాప్ని ఇప్పుడే ప్రయత్నించండి అనే మెసేజ్లు వస్తుంటాయి. ఫోన్ హైజాక్ చేసిన వాళ్లు మీ కాంటాక్ట్ నుండి వచ్చే మెసేజ్లను కూడా డౌన్లోడ్ చేయవచ్చు. యాప్ నకిలీ వెర్షన్ వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేయడమే కాదు, ఇది యాప్ను డౌన్లోడ్ చేయమని మీ పూర్తి కాంటాక్ట్లోని జాబితాకు మెసేజ్లు కూడా పంపుతుంది. వాట్సాప్ పింక్ అనేది హానికరమైన మాల్వేర్. మొబైల్ ఫోన్లను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఓ నకిలీ సాఫ్ట్వేర్. ఓటీపీలు, కాంటాక్ట్స్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర ఆర్థిక విషయాలతో సహా వినియోగదారుల పరికరాల నుండి పూర్తి సమాచారాన్ని దొంగిలించడానికి హ్యాకర్లు దీనిని ఉపయోగిస్తారు. వ్యక్తులు లింక్లు ఓపెన్ చేసినప్పుడు వారి డిజిటల్ పరికరాలలో హానికరమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. థర్డ్–పార్టీ యాప్ స్టోర్లు లేదా APK ఫైల్స్ నుండి ప్రోగ్రామ్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆపిల్ ఫోన్లో అయితే యాక్సెస్ ఉండదు. వాట్సాప్ పింక్ స్కామ్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్పార్టీ యాప్ స్టోర్లు, ఏపీకే ఫైల్స్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. తమ అక్రమ కార్యకలాపాలకోసం హ్యాకర్లు ఫోన్ గ్యాలరీలో వ్యక్తిగత ఫొటోలను తీసి, బ్లాక్ మెయిలింగ్కు ఉపయోగించుకుంటున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థలు, చట్టాన్ని అమలు చేసే అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్లో వాట్సాప్ పింక్ యాప్ డౌన్లోడ్ చేసి ఉంటే ఇప్పుడే దానిని అన్ ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత, మీ ఫోన్ని బ్యాకప్ చేసి ఫార్మాట్ లేదా రీసెట్ చేయండి. మీరు ఈ వాట్సాప్ పింక్ గురించి ఇతరులకు అవగాహన కల్పించండి. తాజా స్కామ్లను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్నేహితుల, కుటుంబ సభ్యులతో సమాచారాన్ని పంచుకోండి. అవగాహన పెంపొందించడం ద్వారా ఇతరుల స్కామ్ల బారిన పడకుండా మీరు సహాయం చేయవచ్చు. మోసానికి గురైతే బాధితులు జ్టి్ట https://www. cybercrime.gov.in/ పోర్టల్లో రిపోర్ట్ చేయవచ్చు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఉచిత ల్యాప్టాప్లు ఇస్తామని మోసాలు
సాక్షి, హైదరాబాద్: విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఇతర ప్రైవేటు వ్యక్తులతో ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ చేస్తున్నట్టు ఫోన్ సందేశాలను పంపుతున్నారు. వాటిలో వివరాలు నమోదు చేయాలంటూ కొన్ని యూఆర్ఎల్ లింక్లను జత చేస్తున్నారు. ఇవి నిజమైనవని ఎవరైనా నమ్మి ఆ లింక్లను తెరిస్తే అందులో ప్రాథమిక సమాచారం, ఆధార్, ఫోన్, బ్యాంకు ఖాతా నంబర్లు.. ఇలా పూర్తి సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ఫోన్లోకి మాల్వేర్ను మనకు తెలియకుండానే ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇలా వారి వలకు ఎవరైనా చిక్కితే సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను కొల్లగొడుతున్నట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ అధికారులు హెచ్చరించారు. ఉచిత ల్యాప్టాప్ల పేరిట వచ్చే సందేశాలను నమ్మవద్దని వారు కోరుతున్నారు. స్టే సేఫ్ ఆన్లైన్ క్విజ్ ఆన్లైన్ మోసాలపై అవగాహన.. పోటీల గడువు ఈనెల 31 సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచేందుకు కేంద్ర హోంశాఖ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ‘స్టే సేఫ్ ఆన్లైన్..’ నేపథ్యంతో ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. పోటీలకు ఈనెల 31 వరకు గడువుందని అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ క్విజ్లో పాల్గొనదలచిన వారు https://www.mygov.in/staysafeonline లింక్ పై క్లిక్ చేస్తే అదనపు వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. టెలిగ్రామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, https://t.me/ ssoindia లింక్ ద్వారా గ్రూప్లో చేరొచ్చు. ఈ ఆన్లైన్ క్విజ్లో పాల్గొనే వారికి ఒక్కొక్కరికి 10 ప్రశ్నలు ఇస్తారు.. 5 నిమిషాల వ్యవధిలో వీటికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. క్విజ్లో టాప్ 10లో నిలిచే విజేతలకు ఒక్కొ క్కరికి రూ.10 వేల చొప్పున నగదు పురస్కా రం ఇవ్వనున్నారు. క్విజ్లో పాల్గొని 50 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. -
ఫోన్కు స్పందించొద్దు.. వివరాలు చెప్పొద్దు
సిద్దిపేటకమాన్: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సిద్దిపేట పోలీస్కమిషనర్ శ్వేత అన్నారు. లాటరీ, లోన్, బహుమతి పేరుతో, తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని వచ్చే ఫోన్కాల్స్కు ఎవరూ స్పందించకూడదన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంక్, ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు, పిన్ నంబర్లు, ఓటీపీ వంటి వివరాలు చెప్పొద్దన్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరం సైబర్ మోసాల ద్వారా పోగొట్టుకున్న వాటిలో రూ.46,55,964 ఫ్రీజ్ చేశామని, త్వరలో విడతల వారీగా సంబంధిత బాధితుల ఖాతాల్లో జమవుతాయన్నారు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో సోమవారం జరిగిన పలు సైబర్ నేరాలపై సీపీ తెలిపిన వరాల ప్రకారం.. ఇండియన్ బుల్స్ కంపెనీ పేరుతో.. సిద్దిపేట వన్టౌన్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తికి గుర్తుతెలియని ఒకరు ఫోన్చేసి ఇండియా బుల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్గా పరిచయం చేసుకున్నాడు. మీకు లోన్ మంజూరైంది... లోన్ ప్రాసెసింగ్ చార్జీల నిమిత్తం కొంత మొత్తం చెల్లించాలని గుర్తు తెలియని వ్యక్తి సూచించాడు. ఆ మాటలు నమ్మిన బాధితుడు గుర్తు తెలియని వ్యక్తి సూచించిన నంబర్కు ఫోన్ ఫే ద్వారా రూ.10,653 పంపించాడు. తర్వాత మరిన్ని డబ్బులు పంపాలని గుర్తు తెలియని వ్యక్తి భయపెట్టడంతో అనుమానం వచ్చిన బాధితుడు జాతీయ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. లోన్యాప్ పేరిట.. రాజగోపాలపేట పీఎస్ పరిధిలోని ఓ వ్యక్తి ఆన్లైన్లో లోన్ టీకాయాప్లో లోన్ తీసుకుని తిరిగి మిత్తితో సహా అసలు మొత్తం డబ్బు చెల్లించాడు. కానీ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇంకా డబ్బులు చెల్లించాలని బెదిరించడంతో బాధితుడు ఆన్లైన్లో రూ.6,100 పంపించాడు. అనంతరం సైబర్ నేరగాడు మళ్లీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు పంపించాలని లేదంటే నీ ఫొటోలు న్యూడ్గా ఎడిట్ చేసి వాట్సాప్, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బాధితుడిని బెదిరించాడు. అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే జాతీయ హెల్ప్లైన్లో ఫిర్యాదు చేశాడు. మహిళ డీపీతో... రాజగోపాలపేట పీఎస్ పరిధిలోని ఓ మహిళ ఇన్స్ట్రాగామ్ ఖాతాను సైబర్ నేరగాడు హ్యాక్ చేశాడు. తాను ఆపదలో ఉన్నానని డబ్బులు పంపించాలని కోరాడు. స్పందించకపోవడంతో ఆమె డీపీ (ఫొటో)ను ఉపయోగించి వేరే ఫోన్నంబర్ ద్వారా వాట్సాప్ క్రియేట్ చేశాడు. మెసేజ్ పంపించగా స్పందించిన బాధితురాలు ఆన్లైన్లో రూ.5 వేలు పంపించింది. తర్వాత విచారణ చేసుకోగా గుర్తు తెలియని వ్యక్తికి డబ్బులు పంపినట్టు సైబర్ మోసం జరిగినట్టు గుర్తించి ఫిర్యాదు చేసింది. -
డేటింగ్.. చీటింగ్
సాక్షి, హైదరాబాద్: సరదా కోసమో.. కాలక్షేపం కోసమో చేసే కొన్ని పనులు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయనడానికి డేటింగ్ యాప్స్ వ్యవహారం ఓ ఉదాహరణ. ఏదో కాసేపు టైంపాస్ చేద్దామని కొందరు.. ఒంటరితంతో మరికొందరు ఆన్లైన్ డేటింగ్ యాప్ల వలలో చిక్కుతున్నారు. ఈ తరహా మోసాలకు గురవుతున్న వారిలో యువకుల నుంచి వయోవృద్ధులు వరకు ఉంటున్నారు. ఎదుటివారి బలహీనతలను అనుకూలంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు... అందమైన యువతులతో న్యూడ్ వీడియోకాల్స్ మాట్లాడిస్తున్నారు. ఎదుటి వ్యక్తిని మాటల్లో దింపి రెచ్చగొట్టి తర్వాత వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడేలా చేస్తున్నారు. ఆ వీడియోలను రికార్డు చేసి, ఆపై సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో పరువు పోతుందని భావించి బాధితులు సైబర్ నేరస్తులు డిమాండ్ చేసినట్లు రూ. లక్షలు సమర్పిస్తున్నారు. లింక్లు పంపి.. మనకు డేటింగ్ యాప్లపై ఆసక్తి లేకున్నా సోషల్ మీడియాలో మన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కూడా కొందరు సైబర్ నేరగాళ్లు ఈ తరహా లింక్లు పంపి రెచ్చిగొట్టి ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నారాయణగూడ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల ఓ వృద్ధుడికి వీడియోకాల్ చేసిన ఓ యువతి.. ఆ వృద్ధుడిని నగ్నంగా ఫోన్ మాట్లాడేలా చేసి దాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగింది. ఇలా రూ. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న ఆ వృద్ధుడు చివరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. లాలాపేటకు చెందిన 59 ఏళ్ల బీమా కంపెనీ ఉద్యోగి సైతం రూ. 8 లక్షలు ఇదే రీతిలో పోగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు ప్రజల సోషల్ మీడియా ఖాతాల నుంచి సమాచారం సేకరించి వాటి ఆధారంగా డేటింగ్ యాప్ లింక్లు, వాట్సాప్ వీడియో న్యూడ్కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తంగా ఉండటం ద్వారానే ఇలాంటి ముప్పు నుంచి బయటపడగలుగుతామని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు మరవొద్దు... ♦ మన మానసిక పరిస్థితి ఏదైనా సరే ఆన్లైన్ డేటింగ్ యాప్లలో అపరిచిత వ్యక్తులతో స్నేహాలు అవసరమా అన్నది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఆన్లైన్ స్నేహాల వల్ల మోసపోయే కంటే నిజమైన స్నేహితులను, సన్నిహితులను గుర్తించడం ఉత్తమమన్నది తెలుసుకోవాలి. ♦ ఆన్లైన్ మోసగాళ్లకు సోషల్ మీడియా అనేది ప్రధాన వేదిక. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగాం వంటి సోషల్ మీడియా ఖాతాల్లో మనం పెట్టే వ్యక్తిగత సమాచారం, ఫాలో అవుతున్న వ్యక్తులను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు డేటింగ్ యాప్ల లింక్లు పంపి మోసాలకు తెరతీస్తున్నారు. సోషల్ మీడియాలో పరిమితికి మించి వ్యక్తిగత సమాచారం ఇవ్వకపోవడం ఉత్తమం. ♦ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో మన ఫొటోలు, వీడియోలు కేవలం స్నేహితులకే కనపించేలా ప్రొఫైల్ ప్రైవసీ ఆప్షన్లు వాడాలి. దీనివల్ల ఇతరులకు మన వ్యక్తిగత అంశాలు వెల్లకుండా నిరోధించవచ్చు. ♦ అందమైన యువతుల ప్రొఫైల్ ఫొటోలతో (ఫేక్ ప్రొఫైల్స్తో) కొందరు సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. ఇలా వారి వలలో పడే అమాయకులను మోసగిస్తున్నారు. అందువల్ల అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించవద్దు. ♦ మొబైల్ఫోన్, ల్యాప్లాప్, డెస్క్టాప్లకు సెక్యూరిటీ సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. దీనివల్ల సైబర్ నేరగాళ్లు పంపే ఫిషింగ్ లింక్స్, మాల్వేర్స్ నుంచి రక్షణ ఉంటుంది. ♦ డేటింగ్ యాప్స్ పేరిట లింక్లు పంపి స్నేహాలు చేసే వారిని వీలైనంత వరకు వ్యక్తిగత సమాచారం అడిగేందుకు ప్రయత్నించాలి. ప్రశ్నించడం ప్రారంభిస్తే ఫేక్గాళ్లు వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో పరిచయం అయ్యే స్నేహితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దు. ఏ రకమైన ఆన్లైన్ యాప్లోనూ డబ్బు లావాదేవీలు చేయవద్దు. -
పార్సిల్ ట్రాకింగ్ పేరిట కొత్త మోసాలు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో వస్తువులను కొనడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. అయితే మనకు వచ్చే ఆ పార్సిల్ ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు ట్రాకింగ్ చేయడం పరిపాటి. ఇదే అదనుగా ఆన్లైన్లో వస్తువులను కొనేవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ఆన్లైన్లో వస్తువులను ఆర్డర్ చేసేందుకు మా వెబ్సైట్ను సంప్రదించండి.. అంటూ నకిలీ యాడ్స్ను ఇస్తున్నారు. అదేవిధంగా ట్రాకింగ్ కోసం అంటూ ఆన్లైన్లో కొన్ని ఫేక్ కాల్ సెంటర్ నంబర్లను పెడుతున్నారు. వాటిని నమ్మి ఎవరైనా ఆ నంబర్లకు ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారికి నకిలీ మాల్వేర్ లింకులతో కూడిన ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు. వినియోగదారులు ఆ లింక్లపై క్లిక్ చేస్తే మన ఫోన్లోని పూర్తి సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లడంతోపాటు మన ఫోన్లను వారి నియంత్రణలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ట్రాకింగ్ పేరిట ఇచ్చే యాడ్స్ను నమ్మి మోసపోవద్దని, ఆయా కంపెనీల అధికారిక వెబ్సైట్ల నుంచి మాత్రమే ఫోన్ నంబర్లు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. -
సైబర్ సేఫ్టీకి 5 S సూత్రం.. పాస్వర్డ్ల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
రోజువారీ జీవితంలో స్మార్ట్ఫోన్లలోనే సగం సమయం గడిచిపోతోంది. సోషల్ మీడియా యాప్స్ వాడకం మొదలు ఆన్లైన్ ఆర్డర్లు, ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల వరకు పని ఏదైనా ఫోన్, ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరైంది. టెక్నాలజీ వాడకంతో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అంతేస్థాయిలో సైబర్ ముప్పు పొంచి ఉంటుంది. అందుకే సైబర్ జమానాలో సేఫ్గా ఉండేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొన్ని సూచనలు చేసింది. 5ఎస్ సూత్రాన్ని పాటిస్తే సురక్షితంగా ఉండొచ్చని పేర్కొంది. ఏమిటి ఆ 5ఎస్? స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్, సెక్యూర్ నెట్వర్క్, సెక్యూర్ వెబ్సైట్స్ లేదా యాప్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, సస్పీషియస్ లింక్ అలర్ట్...కలిపి 5 ఎస్లుగా పోలీసులు సూత్రీకరించారు. స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం సోషల్ మీడియా ఖాతాలకు, ఆన్లైన్ బ్యాంకు ఖాతాలకు, ఈ–మెయిల్స్కు వేర్వేరు పాస్వర్డ్లు పెట్టుకోవడం ఉత్తమం. ఒకటే పాస్వర్డ్ను అన్నింటికీ పెట్టడం రిస్క్ అని గుర్తించాలి. పాస్వర్డ్లో వీలైనంత వరకు మన పేరు, బర్త్డే తేదీలు, పిల్లల పేర్లు లేకుండా చూసుకోవడం ఉత్తమం. పాస్వర్డ్ను అంకెలు, క్యారెక్టర్లు, పెద్ద, చిన్న అక్షరాల మిళితంగా పెట్టుకోవాలి. పాస్వర్డ్లను ఇతరులకు షేర్ చేయవద్దు. సెక్యూర్ వెబ్సైట్స్, యాప్స్, సెక్యూర్ నెట్వర్క్.. మనం వాడే వెబ్సైట్లు, డౌన్లోడ్ చేసుకొనే యాప్స్ సరైనవేనా అన్నది ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. యాప్లను డౌన్లోడ్ చేసే ముందు ఆ యాప్ రేటింగ్ పరిశీలించాలి. సాఫ్ట్వేర్ అప్డేట్స్.. మొబైల్ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్తో అప్డేట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల సైబర్ దాడుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సరైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను వినియోగించుకోవాలి. సస్పీషియస్ లింక్ అలర్ట్... మనకు మెసేజ్లు, వాట్సాప్ సందేశాలు, ఈ–మెయిల్స్ రూపంలో వచ్చే మెసేజ్లలోని అనుమానాస్పద లింక్లపై ఎట్టిపరిస్థతుల్లోనూ క్లిక్ చేయవద్దు. చాలా తక్కువ అక్షరాలతో ఉండే లింక్లు చాలా వరకు అనుమానాస్పదమైనవని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అక్షర దోషాలు ఉన్న లింక్లు సైతం అనుమానాస్పదమైనవని తెలుసుకోవాలి. -
సైబర్ దంగల్ 2.0.. భారత్ లక్ష్యంగా దాడులకు సిద్ధమైన 160 గ్రూపులు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక లాభం, వ్యక్తిగత కక్ష, ఈర్ష్య.. సైబర్ నేరాలకు, దాడులకు ప్రధానంగా ఇవే కారణాలుగా ఉంటాయి. అయితే ప్రస్తుతం సైబర్ దంగల్ 2.0 తెరపైకి వచ్చింది. రాజకీయ, మతపరమైన విభేదాలతో పాటు తమ ఉనికిని చాటు కోవాలనే ఉద్దేశంతో కూడా సైబర్ నేరగాళ్లు దాడులకు తెగబడుతున్నారు. దీన్ని నిపుణులు సైబర్ హ్యాక్టివిజంగా పేర్కొంటున్నారు. అనానిమస్ సూడాన్, హ్యాక్టివిస్ట్ రష్యా, డ్రాగన్ ఫోర్స్ మలేసియా.. ఇలా అనేక గ్రూపులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి సవాల్ విసురుతున్నాయి. వీటి టార్గెట్లో భారత్ సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉండటం ఆందోళన కలిగించే అంశం. అటో ఎనభై...ఇటో ఎనభై... ఉక్రెయిన్–రష్యా మధ్య ప్రారంభమైన యుద్ధం నేపథ్యంలో అనేక సైబర్ నేరగాళ్ల గ్రూపులు క్రియాశీలంగా మారాయి. సైబర్ నో అనే అంతర్జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం దాదాపు 190 గ్రూపులు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశాయి. వీటిలో 160 భారత్ పైనే గురి పెట్టాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో 80 రష్యాకు మద్దతుగా మిగిలిన సగం ఉక్రెయిన్కు మద్దతుగా వ్యహరిస్తున్నాయి. భారత్ ఏ దేశానికి బహిరంగ మద్దతు ప్రకటిస్తే దాని వ్యతిరేక గ్రూపులు సైబర్ దాడులకు సిద్ధమయ్యాయని సైబర్ నో స్పష్టం చేసింది. అయితే భారత్ ఎలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోకపోవడంతో అవి మిన్నకుండిపోయాయని తెలిపింది. అనేక మంది హ్యాక్టివిస్ట్లు తమ సొంత నమ్మకాలను వ్యతిరేకించే వ్యక్తులను లేదా సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, తెరపైకి రాకుండా, పెద్ద స్థాయిలో నష్టాలు కలిగించకుండా రెచ్చిపోతున్న హ్యాక్టివిస్టులు అనేక మంది ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు. నుపుర్ వ్యాఖ్యలతో దండయాత్ర.. బీజేపీ ఎంపీ నుపుర్ శర్మ గతడాది చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హ్యాక్టివిస్టులు ఒక్కసారిగా దేశంపై దండెత్తారు. కేంద్ర ప్రభుత్వ సైట్లను లక్ష్యంగా చేసుకుని రెచి్చపోయారు. వీరికి చెక్ చెప్పడానికి దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ సాయం కోరాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో భారత్కు వ్యతిరేకంగా ‘డ్రాగన్ ఫోర్స్ మలేసియా’, ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా’అనే రెండు హ్యాకర్ గ్రూపులు రంగంలోకి దిగాయి. నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా జరిగే ఈ దాడిలో పాల్గొనాలని ఆ గ్రూపుల నిర్వాహకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓ వర్గం హ్యాకర్లకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 2 వేల వెబ్సైట్లపై ఈ రెండు గ్రూపులూ పంజా విసిరాయి. ప్రపంచంలో ఉన్న ఇతర హ్యాకర్లు, గ్రూపులు సైతం దాడులకు దిగేలా ప్రేరేపిస్తూ అందుకు అవసరమైన డార్క్వెబ్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ను తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశాయి. భవిష్యత్తులో మరింతగా.. ఈ తరహా సైబర్ దాడులు భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ హ్యాకర్లు తన ఆర్థిక అవసరాల కోసం మరోచోట ఎటాక్ చేస్తారు. అక్కడ ఆర్జించిన అక్రమ సొమ్మును వినియోగించి డార్క్ నెట్ నుంచి కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ సృష్టిస్తారు. వీటినే మాల్వేర్స్గా మారుస్తూ సైబర్ దాడులకు దిగుతారు. వీటిని ఎదుర్కోవాలంటే ప్రతి వ్యవస్థ, సంస్థ సైబర్ సెక్యూరిటీకి ఇచ్చే ప్రాధాన్యం, బడ్జెట్ తదితరాలు పెరగాలి. పటిష్టమైన ఫైర్ వాల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ముందే ప్రకటించి మరీ.. ఈ హ్యాక్టివిస్ట్ గ్యాంగ్లు తాము ఏ దేశాన్ని, ఏ కారణంగా టార్గెట్ చేస్తున్నామో ముందే ప్రకటిస్తుండటం గమనార్హం. దీనికోసం ట్విట్టర్లో ఖాతాలు, టెలిగ్రామ్లో గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ఎటాకర్స్ ఎలాంటి డిమాండ్లు చేయకుండా కేవలం తమ ఉనికి చాటుకోవడం, సైబర్ ప్రపంచాన్ని సవాల్ చేయడం, భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసమే వరుసపెట్టి ఎటాక్స్ చేస్తుంటారు. వీళ్లు ప్రధానంగా డీ డాస్గా పిలిచే డిసస్టట్రి డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్ విధానంలో దాడి చేస్తున్నారు. ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా ఒకేసారి కొన్ని లక్షల హిట్స్ ఆయా వెబ్సైట్స్కు వచ్చేలా చేస్తారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక సర్వర్ కుప్పకూలిపోతుంది. డినైల్ ఆఫ్ సర్వీసెస్ (డీఓఎస్) తరహా ఎటాక్స్ సైతం దాదాపు ఇవే తరహా నష్టాన్ని కల్పిస్తాయి. విమానాశ్రయాలు, ఓడ రేవులతో పాటు ఆస్పత్రులకు సంబంధించిన సర్వర్లు వారి టార్గెట్గా మారుతున్నాయి. -మావులూరి విజయ్కుమార్, సైబర్ నిపుణుడు -
ఇన్స్టాల్ చేసే యాప్తోపాటే ‘రాట్’ వైరస్.. ఫోన్ మీ దగ్గరే ఉంటుంది.. కానీ,
సాక్షి, హైదరాబాద్ : ఆకర్షణీయ సౌకర్యాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించినవి అంటూ అనేక యాప్స్కు సంబంధించిన యాడ్స్ ఇంటర్నెట్, సోషల్మీడియాల్లో రాజ్యమేలుతున్నాయి. వీటితో అవస రం ఉన్నా లేకపోయినా ఉచితం కదా అని అనేక మంది తమ స్మార్ట్ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ–నేరగాళ్లు ప్రయోగిస్తున్న ఆయుధం ‘రాట్’గా పిలిచే రిమోట్ యాక్సెస్ ట్రోజన్. యాప్స్ మాటున నేరగాళ్లు ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ను చొప్పించడం ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వారి సెల్ఫోన్ను తమ అదీనంలోకి తీసుకుని చేయాల్సిన నష్టం చేసేస్తున్నారు. అడుగడుగునా యాప్స్ వినియోగమే... ♦ స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో... వివిధ రకాలైన యాప్స్ వాడకం అంతకంటే ఎక్కువైంది. నిద్ర లేవడం నుంచి ఆహారం తీసుకోవడం, ఉష్టోగ్రతలు తెలుసుకోవడం, వినోదం ఇలా... ఒక్కో ఫోన్లో కనీసం 10–15 యాప్స్ ఉంటున్నాయి. వినియోగదారుడి ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరు తొలుత దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ నంబర్ల డేటాను వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. ఇలా నంబర్లు తమ చేతికొచ్చాక అసలు కథ మొదలవుతుంది. సందేశాలతో ప్రారంభమయ్యే ప్రక్రియతో.. ♦ తాము ఉచితంగా ఇస్తున్న ఫలానా యాప్లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా సోషల్మీడియాల్లో యాడ్స్ పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు అందులో ఉన్న లింక్ను క్లిక్ చేస్తే సదరు యాప్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడికి తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా దీంతోపాటే సదరు క్రిమినల్ పంపిచే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ.. అది సైబర్ క్రిమినల్ ఆదీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న సెల్ఫోన్ను యాక్సెస్ చేస్తూ అవసరమైన విధంగా వాడగలుగుతాడు. అందుకే ఈ వైరస్ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. నేరగాడి అధీనంలోకి వెళ్తే ఖాతా ఖాళీ ♦ మన ఫోన్ సైబర్ నేరగాడి ఆదీనంలోకి వెళ్లిపోయాక మనం ఫోన్లో చేసే ప్రతి చర్యనూ అతడు పర్యవేక్షించగలడు. కాల్స్, ఎస్సెమ్మెస్లతోపాటు సెల్ఫోన్లో ఉన్న సమాచారం, దాని కెమెరాలను సైతం సైబర్ నేరగాడు తన ఆదీనంలోకి తీసుకోగలడు. ఇటీవల సినిమా టికెట్లు మొదలుకుని కొన్ని రకాలైన బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అత్యధిక శాతం సెల్ఫోన్ ద్వారా జరుగుతోంది. వీటి కోసం కోసం మొబైల్ వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ వాడటం లేదా తమ డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతోపాటు లావాదేవీలకు సంబంధించి బ్యాంకు పంపే వన్ టైమ్ పాస్వర్డ్స్ సైతం సెల్ఫోన్కే వస్తుంటాయి. ఎవరైనా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, నెట్బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్స్లను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా... ఓటీపీ నమోదు చేయనిదే లావాదేవీ పూర్తికాదు. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే.. ♦ ఈ ఓటీపీని సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ముందు పంపే యాప్లోని రాట్ ద్వారానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే సంగ్రహిస్తున్నారు. కార్డుల వివరాలు అప్పటికే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఓటీపీ నమోదుచేసి అందినకాడికి స్వాహా చేస్తున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను సైబర్ క్రిమినల్స్ అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో వినియోగదారులు నిద్రలో ఉంటారని, అతడి ప్రమేయం లేకుండానే వచ్చిన ఓటీపీని గుర్తించరని అంటున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, బోగస్ చిరునామాలను పెట్టడమో చేస్తుంటారని వివరిస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా నేరగాళ్లను పట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు/వ్యక్తులు రూపొందించే యాప్స్కు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
ఈ కాల్స్తో జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ వాడకం పరిపాటిగా మారింది. ఇప్పుడు వాట్సప్ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. అంతర్జాతీయ ఫోన్ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్లు చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ప్రధానంగా +254, +84, +63, +374 , +1(218), +1(803) ...తో ప్రారంభయ్యే నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్, మెజేస్లు నమ్మవద్దంటున్న సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నంబర్ల నుంచి వచ్చే మిస్డ్కాల్స్కు సైతం స్పందించవద్దని వారు సూచిస్తున్నారు. స్పామ్ కాల్స్తో సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారని, తర్వాత మోసాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. అదేవిధంగా విదేశీ కోడ్తో ఉంటున్న ఈ నంబర్ల నుంచి వస్తున్న వాట్సాప్ సందేశాల్లో లింక్లను పంపుతున్న సైబర్ కేటుగాళ్లు వాటిపై క్లిక్ చేస్తే మన ఫోన్లోకి మాల్వేర్ను పంపించి, మన ఫోన్ను వారి కంట్రోల్కి తీసుకుంటున్నారు. దాని నుంచి మన బ్యాంకు లావాదేవీల వివరాలు, పాస్వర్డ్లు చోరీ చేసి డబ్బులు కొల్లగొడుతున్నట్టు వారు హెచ్చరించారు. ఇలాంటి కోడ్ నంబర్తో వచ్చే వాట్సాప్ కాల్స్ను లిఫ్ట్ చేయవద్దని, అలాంటి నంబర్లను బ్లాక్ చేయడంతోపాటు పోలీసులకు సమాచారం అందించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సూచించింది. సింగపూర్,వియత్నాంలనుంచి ఆ ఫోన్లు ప్రధానంగా ఈ ఫోన్ కాల్స్ సింగపూర్,వియత్నాం, మలేషియా ప్రాంతాల నుంచి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తరహా నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ ఎక్కువగా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య, లేదంటే తెల్లవారుజామున వస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ తరహా స్పామ్కాల్స్ బెడద నుంచి కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బయటపడొచ్చని సైబర్ఇంటెలిజెన్స్ నిపుణుడు ప్రసాద్ తెలిపారు. ఈ జాగ్రత్తలు మరవొద్దు.. ♦ కొత్త కొత్త కోడ్ నంబర్లలో వచ్చే అంతర్జాతీయ ఫోన్కాల్స్, మెసేజ్లు, లింక్లకు స్పందించవద్దు. ♦ అనుమానాస్పదంగా ఉండే అంతర్జాతీయ ఫోన్ నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలి. ♦ ఫోన్కాల్, లేదా చాటింగ్లో మన వ్యక్తిగత, బ్యాంకు ఖాతా సమాచారాన్ని అడిగితే పంచుకోవద్దు. ♦ సైబర్ క్రైం పోలీసులకు లేదా సైబర్ క్రైం వెబ్సైట్లో సంబంధిత నంబర్లపై ఫిర్యాదు చేయాలి. ♦ మొబైల్ఫోన్, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, యాంటి వైరస్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాటినిబ్లాక్ చేయాలి.. మనకు కొత్త కొత్త కోడ్ నంబర్లతో వచ్చే స్పామ్ కాల్స్ను ఎప్పటికప్పుడు బ్లాక్ చేయాలి. పదేపదే ఇలాంటి కాల్స్ వస్తుంటే ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైం సిబ్బంది దృష్టికి తేవాలి. అదేవిధంగా వాట్సాప్లో ఇతర దేశాల కోడ్ నంబర్లతో మొదలయ్యే నంబర్ల నుంచి వచ్చే వీడియో, ఆడియోకాల్స్కి ఆన్సర్ చేయవద్దు. ఆ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లో ఉండే లింక్లను ఓపెన్ చేయవద్దు. – శ్రీనివాస్ , ఇన్స్పెక్టర్ -
హలో.. మీ పేరుతో ఓ పార్సిల్ వచ్చింది
‘‘మీ పేరు, చిరునామాతో ఉన్న ‘ఫెడెక్స్’ పార్సిల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి. దర్యాప్తు నిమిత్తం మీపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నాం. ఒకవేళ మీపై కేసు నమోదు కాకుండా ఉండాలంటే కస్టమ్స్ అధికారులతో ‘ఒప్పందం’ కుదుర్చుకోండి’’ ఇదీ హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వచ్చిన సైబర్ నేరగాళ్ల ఫోన్కాల్! యువతిని నమ్మించేందుకు ఆమె వాట్సాప్కు డ్రగ్స్ ఉన్న పార్సిల్, కస్టమ్స్ అధికారి ఐడీ కార్డు కూడా పంపించారు. దీంతో భయపడిన ఆమె... కేసు నమోదు చేయొద్దంటూ వేడుకొని ఆన్లైన్ ద్వారా రూ. లక్షలు సమర్పించుకుంది. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు దోపిడీ లకు ఇటీవల కాలంలో దర్యాప్తు అధికారుల అవతారమెత్తుతున్నారు. ముంబై, ఢిల్లీ పోలీసులమని, సీబీఐ, ఈడీ, కస్ట మ్స్ అధికారులమంటూ అమాయ కులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. భయపడి పోతున్న సామాన్యులు రూ. లక్షల్లో ముట్టజెప్పి మోసపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఈ తరహా కేసులు పెద్ద సంఖ్యలో నమోద వుతున్నాయని సైబర్ పోలీసులు తెలిపారు. ఎలా చేస్తున్నారంటే.. సామాజిక మాధ్యమాలు, డేటా ప్రొవైడర్ల ద్వారా సైబర్ నేరస్తులు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఫోన్ చేసి ఢిల్లీ, ముంబై కస్టమ్స్ అధికారులమని పేరు, చిరునామా చెబుతూ సంభాషిస్తారు. మీ పేరు, అడ్రస్తో ఉన్న పార్సిల్ కస్టమ్స్లో అనుమానాస్పదంగా కనిపించి నిలిపివేసినట్లు, తెరిచి చూస్తే అందులో మాదకద్రవ్యాలు, ఇతరత్రా చట్ట వ్యతిరేక ఉత్పత్తులు ఉన్నాయని గుర్తించినట్లు బెదిరిస్తారు. ఫోన్లో ఏమాత్రం బెరుకుగా మాట్లాడుతున్నట్లు అనిపించగానే బెదిరింపులు రెట్టింపు చేస్తారు. మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల కేసులు నమోదు చేస్తామని వరుసగా ఫోన్లు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తారు. కేసు వద్దంటే స్వాహా.. అమాయకులను నమ్మించేందుకు నకిలీ పోలీసు అధి కారుల గుర్తింపు కార్డులు సైతం కేటుగాళ్లు వాట్సాప్ చేస్తారు. ఈ వ్యవహారం నుంచి బయట పడాలంటే దర్యాప్తు సంస్థల అధికారులతో మాట్లాడి ఒప్పందం చేసుకో వాలని సలహా ఇస్తారు. ఆపై కొద్దిసేపటికి మరో నకిలీ అధికారి ఫోన్ చేసి కేసు లేకుండా ఉండాలంటే కొంత నగదు చెల్లించాల్సి ఉంటుందని సూచిస్తారు. ఇలా బాధితులను బెది రించి రూ. లక్షల్లో నగదు కొట్టేస్తున్నారు. ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువ ఈ తరహా మోసాలు ఎక్కువగా ఫెడెక్స్ పార్సిల్ సంస్థ పేరుతో జరుగుతున్నాయని సైబర్ పోలీసులు విచారణలో గుర్తించారు. రాజస్తాన్, హరియాణా, జార్ఖండ్కు చెందిన సైబర్ ముఠాలు ఎక్కువగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
ఆన్లైన్లో మ్యాంగోస్.. పండు కోసం క్లిక్ చేస్తే పైసలు పోతాయ్!
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో ఏ సీజన్ నడిచినా దానిని మోసాలకు వేదికగా మార్చుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. చివరకు మామిడి పళ్లను సైతం వదలడం లేదు. వేసవి అంటే మామిడి పళ్ల ప్రియులకు పండగే. తాజా తాజా వెరైటీలు రుచిచూడాలని తహతహలాడేవారు బోలెడుమంది. సరిగ్గా ఇదే బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు..మీ ఇంటికే తాజా మామిడి పళ్లు పంపుతామంటూ ఆన్లైన్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. అందులో నకిలీ వెబ్సైట్ లింకులు పెడుతున్నారు. అవి నమ్మి ఆన్లైన్లో పళ్లు ఆర్డర్ ఇచ్చేందుకు ప్రయతి్నస్తే అప్పుడు మోసానికి తెరతీస్తున్నారు. మొదట సగం డబ్బులు పేమెంట్ చేస్తేనే ఆర్డర్ పంపుతామని, మొత్తం డబ్బులు ముందే తమ ఖాతాకు పంపితే డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని ఊరిస్తున్నారు. ఇది నమ్మి డబ్బులు పంపిన తర్వాత ఎదురు చూపులే తప్ప..పళ్లు రావడంలేదు. చివరికి తాము మోసపోయామన్న తత్వం బోధపడుతోంది మామిడి ప్రియులకు. ఆన్లైన్ మామిడిపళ్ల పేరుతో దేశవ్యాప్తంగా ఎన్నో నకిలీ వెబ్సైట్లు ఉన్నట్టు వెలుగులోకి వస్తున్నదని కేంద్ర హోం శాఖ పరిధిలో సైబర్ నేరాలపై అప్రమత్తంచేసే పోర్టల్ ‘సైబర్ దోస్త్’వెల్లడించింది. ఈ తరహాలో దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నందున ఆన్లైన్లో పళ్ల కొనుగోలులో జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్డర్ చేసేముందే అది నిజమైన వెబ్సైటా లేక నకిలీదా అన్నది నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. వీలైనంత వరకు ముందుగా డబ్బులు పంపకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
కర్నూలులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు
-
సింపుల్గా కోట్లు కొట్టేస్తున్నారు.. టాప్లో మహారాష్ట్ర
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ నేరాలు భారత దేశంలోనూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. చిరు ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ సైబర్ నేరగాళ్లు వదలడంలేదు. కంప్యూటర్, ఫోన్లతోనే సింపుల్గా పని కానిచ్చేస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇలా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సైబర్ మోసగాళ్లు రూ.731.27 కోట్లు దోచేశారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మూడేళ్లలో 2.13 లక్షల సైబర్ మోసాలు జరిగినట్లు తెలిపింది. ఏటీఎం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్, బ్యాంక్ సర్వర్ నుంచి కస్టమర్ల సమాచారాన్ని హ్యాకింగ్ చేయడం ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తోందని, డిజిటల్ చెల్లింపు భద్రతా నిబంధనలను అమలు చేయాలని బ్యాంకులకు సూచించినట్లు పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు, సైబర్ మోసాల నిరోధం, కంప్యూటర్ భద్రతపై జాతీయ నోడల్ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వివిధ చర్యలను చేపట్టినట్లు తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికం గత మూడేళ్లలో మహారాష్ట్రలో అత్యధికంగా 83,974 సైబర్ మోసాలు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో రూ.240 కోట్లు కొట్టేసినట్లు చెప్పింది. ఆ తరువాత తమిళనాడులో 18,981 సైబర్ మోసాల్లో రూ.69.84 కోట్లు దోచుకున్నారు. హరియాణలో 18,573 కేసుల్లో రూ.66.98 కోట్లు, కర్ణాటకలో 11,916 మోపాల్లో రూ.60.75 కోట్లు కాజేశారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మోసాల సంఖ్య తక్కువగానే ఉంది. తెలంగాణలో 6,900 మోసాల్లో రూ.21.76 కోట్లు కాజేశారు. ఆంధ్రప్రదేశ్లో 1,885 సైబర్ మోసాల్లో రూ.5.69 కోట్లు కాజేసినట్లు పేర్కొంది. సైబర్ మోసాల కట్టడికి తీసుకున్న చర్యలు ♦ అన్ని రకాల సైబర్ నేరాలపై ఫిర్యాదులకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రారంభం ♦ బాధితులకు సహాయం చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ♦ వినియోగదారుల డేటాను గోప్యంగా ఉంచాలని బ్యాంకులకు సూచన ♦ డిజిటల్ సేవల ప్రక్రియను సురక్షితంగా ఉంచడానికి నియంత్రణ చర్యలు చేపట్టాలని బ్యాంకులకు ఆదేశం ♦ సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో పోస్టర్లు ♦ అన్ని లావాదేవీలకు ఆన్లైన్ హెచ్చరికలను తప్పనిసరి ♦ లావాదేవీల మొత్తంపై రోజువారీ పరిమితులు -
ఒక్క ఆధార్.. 11,000 సిమ్ కార్డులు!
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన మహేశ్వర్ (పేరు మార్చాం) ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగి. ఒక రోజు నో యువర్ కస్టమర్ (కేవైసీ) అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందని అతని సెల్ఫోన్కు సందేశం వచ్చింది. దీంతో నిజమేనని నమ్మిన మహేశ్వర్.. మెసేజ్లోని లింక్పై క్లిక్ చేసి, అందులో బ్యాంకు ఖాతా నంబరు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలు నమోదు చేశాడు. అంతే.. ఆ తర్వాత కొన్ని సెకన్లకే తన ఖాతాలో సొమ్ము విత్డ్రా అయినట్టు బ్యాంకు నుంచి సందేశం వచ్చింది. అతను కంగారు నుంచి తేరుకునేలోపు ఖాతా మొత్తం ఖాళీ చేసేశారు సైబర్ నేరస్తులు. దీంతో లబోదిబోమంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి సందేశం వచ్చిన ఫోన్ నంబర్, దానికి అనుసంధానించిన గుర్తింపు కార్డును, బ్యాంకు ఖాతా వివరాలను సైబరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (సీఓఈసీఎస్)లో విశ్లేషించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ మోసాలు, డేటా లీకు, నకిలీ వెబ్సైట్లు వంటి సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న తెలంగాణ పోలీసులకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సేఫ్టీ (సీఓఈసీఎస్) విశ్లేషిస్తుంటుంది. ఇదే క్రమంలో కేవైసీ మోసం కేసును కూడా విశ్లేషించింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో కేవలం ఒక్క ఆధార్ కార్డు గుర్తింపుతో 11 వేల సిమ్ కార్డులు జారీ అయినట్లు సీఓఈసీఎస్ పోలీసులు గుర్తించారు. రెండు సిమ్లు నేరస్తుల చేతుల్లో.. సాధారణంగా కొత్త సిమ్కార్డు తీసుకోవాలంటే ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. టెలీకమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) మార్గదర్శకాల ప్రకారం ఒక్క ఆధార్ కార్డుతో గరిష్టంగా 9 సిమ్ కార్డులను జారీ చేయవచ్చు. కానీ ఈ కేసులో థర్డ్ పార్టీ ఏజెన్సీలు డీఓటీ నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా 11 వేలు సిమ్ కార్డులు జారీ చేశారు. కాగా ఇందులో రెండు సిమ్ కార్డులను సైబర్ నేరస్తులు వినియోగించారని, ఈ ఫోన్ నంబర్ల నుంచే బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్ విభాగాన్ని సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సిమ్ కార్డులను జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. -
డేటా చోరీ సూత్రధారి దొరికాడు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం కేసులో కీలక సూత్రధారిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ జనాభాలో 50 శాతం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి విక్రయిస్తున్న ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 24 రాష్ట్రాలు, 8 మెట్రో నగరాలకు చెందిన సుమారు 70 కోట్ల మంది రహస్య సమాచారాన్ని తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. రక్షణ, విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్టీ, ఆర్టీవోలతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితుడు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలివే.. వెబ్ డిజైనర్ నుంచి... హరియాణాలోని ఫరీదాబాద్కు చెందిన వినయ్ భరద్వాజ్ వెబ్ డిజైనర్గా పనిచేసేవాడు. ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయంతో డేటా సమీకరణ, విక్రయం గురించి తెలుసుకున్నాడు. వెబ్ డిజైనింగ్ కోసం తన వద్దకు వచ్చే కస్టమర్ల వివరాలను మార్కెటింగ్ ఏజెంట్లకు, సైబర్ నేరస్తులకు విక్రయించి సొమ్ము చేసుకొనేవాడు. అప్పనంగా డబ్బు వస్తుండటంతో ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని సైతం తస్కరించాలని నిర్ణయించుకున్నాడు. డేటా సమీకరణ కోసం ఏకంగా 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ఇందులో అమీర్ సొహైల్, మదన్ గోపాల్లు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. విక్రయం కోసం వెబ్సైట్.. తస్కరించిన డేటాను విక్రయించేందుకు ఇన్స్పైర్ వెబ్జ్ వెబ్సైట్ను ప్రారంభించాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాడు. క్లౌడ్ డ్రైవ్ లింక్ల ద్వారా మాత్రమే డేటాను విక్రయించేవాడు. ఇలా గత 8–12 నెలలుగా నిందితుడు డేటా తస్కరణ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు వినయ్ నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అమీర్, మదన్ల కోసం సైబరాబాద్ పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి నెల క్రితం ఓపెన్ సోర్స్ వెబ్సైట్లో తన వ్యక్తిగత సమాచారం చూసి కంగుతిన్నాడు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమాచారం ఎలా బహిర్గతమైందో కూపీ లాగారు. 10 రోజుల క్రితం రెండు కేసులలో 16 మంది డేటా చోరీ నిందితులను పట్టుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. వినయ్ భరద్వాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతనికి నోటీసులు జారీ చేసి అరెస్టు చేశారు. ఈ డేటాతో ఏం చేసేవారంటే.. మార్కెటింగ్ బృందాలు, ఏజెన్సీలు, సైబర్ నేరస్తులు నిందితుడి నుంచి డేటాను కొనుగోలు చేసేవారు. ఉత్పత్తుల ప్రచారం, మార్కెటింగ్ కోసం బల్క్ మెసేజ్లు పంపించడం కోసం ఏజెన్సీలు డేటాను కొనుగోలు చేశాయి. సైబర్ నేరస్తులు కొనుగోలు చేసిన డేటాతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడేవారు. ఎవరెవరి డేటా లీకైంది? ఏ సంస్థ, వ్యక్తులు లీకు చేశారు? వంటి సమస్త సమాచారాన్ని ప్రజలకు ఎలా చేరవేయాలనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నామని సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ శింగేన్వర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల డేటా కూడా.. నిందితుడు విక్రయించిన డేటాలో తెలంగాణ, ఏపీ ప్రజల డేటా కూడా ఉంది. హైదరాబాద్కు చెందిన 56 లక్షలు, ఆంధ్రప్రదేశ్కు చెందిన 2.10 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను నేరస్తుడు విక్రయానికి పెట్టాడు. పన్ను చెల్లింపుదారులు, కంపెనీ సెక్రటరీలు, ఆడిటర్లు, ఉద్యోగస్తుల డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో వ్యక్తుల పేరు, ఫోన్ నంబరు, చిరునామా, ఈ–మెయిల్ ఐడీలు తదితర వివరాలున్నాయి. రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారం లీక్.. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన 2.55 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారాన్ని నేరస్తుడు తస్కరించి విక్రయానికి పెట్టాడు. ఇందులో ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతోపాటు ర్యాంకు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలున్నాయి. దీంతోపాటు ఎల్ఐసీ, విద్యుత్, ఇంధన శాఖ వంటి ప్రభుత్వ సంస్థల సమాచారం కూడా ఉంది. అలాగే 1.26 లక్షల మంది ప్రవాసులు, 5 లక్షల మంది హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)ల డేటా కూడా అంగట్లో విక్రయానికి పెట్టేశాడు. విద్యార్థుల డేటా నేరస్తుల చేతుల్లో.. విద్యాసంస్థలతోపాటు విద్యార్థుల డేటా కూడా నేరస్తుల చేతుల్లోకి చేరింది. బైజూస్, వేదాంతు వంటి ఆన్లైన్ విద్యాసంస్థలకు చెందిన 18 లక్షలు మంది విద్యార్థులు, 1.8 లక్షల మంది నీట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, 30 లక్షల మంది సీబీఎస్ఈ (10, 12వ తరగతి), 3.5 కోట్ల మంది ఇతర విద్యార్థుల డేటాను నేరస్తులు విక్రయానికి పెట్టారు. -
అప్పనంగా డేటా ఇచ్చేస్తున్నాం!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత సాంకేతికత యుగంలో మన పేరు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, పాన్, ఆధార్, ఈ–మెయిల్ అడ్రస్, పాస్వర్డ్లు కేవలం సమాచారం మాత్రమే కావు. మన జీవితాలను నిర్దేశించే అంశాలు. ఇవి సైబర్ నేరగాళ్ల చేతికి వెళితే బ్యాంకు ఖాతాలో ఉన్న మన కష్టార్జితం క్షణాల్లో హాంఫట్ అవ్వొచ్చు. మన పేరిట లోన్లు తీసుకొని ఎగ్గొట్టొచ్చు. కోట్ల మంది డేటాను కొల్లగొట్టిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు ఇటీవలే రట్టు చేశారు. మన డేటా లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనా ఉందని, వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో తప్పనిసరిగా అవగాహన ఏర్పరుచుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ అమ్మకాలని, క్రెడిట్ కార్డులని, ఇన్స్టంట్ లోన్లని, మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయని, కొత్త రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ ప్రారంభోత్సవాలకు విచ్చేయాలంటూ దాదాపు నిత్యం మనకు అపరిచితుల నుంచి ఫోన్కాల్స్ రావడం పరిపాటిగా మారింది. అయితే వారందరికీ మన పేర్లు, ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్లు, ఈ–మెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి. మన వివరాలు మరెవరో కాదు... అప్పనంగా మనమే ఇచ్చేస్తున్నాం! తప్పక డిలీట్ చేయించాలి.. వివిధ అవసరాలు, ప్రభుత్వ పథకాల నిమిత్తం ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్బుక్ మొదటి పేజీ, వివిధ సర్టిఫికెట్ల వంటి వాటిని ఫొటోకాపీ తీయించుకోవడం అనివార్యమవుతోంది. అయితే అలాంటప్పుడు మనం వాట్సాప్ లేదా ఈ–మెయిల్ ద్వారా పంపిన వివరాలను ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్ సెంటర్ లేదా నెట్ సెంటర్ నుంచి డిలీట్ చేయించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కేస్ – 01 ‘గుడ్మార్నింగ్ సార్. యాదాద్రి దగ్గరలో కొత్త వెంచర్ ప్రారంభం కాబోతోంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు. మీ సొంత ప్రాంతానికి వెళ్లే దారిలోనే వెంచర్ ఉంది. తీసుకోండి...’ అంటూ టెలికాలర్ ఫోన్ చేసి తన పేరు, పూర్తి చిరునామా చెప్పడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అవాక్కయ్యాడు. కేస్ – 02 ‘సార్.. మీరు వాడుతున్న ఫ్యూరిఫయర్తో పోలిస్తే మా ప్రొడక్ట్ అన్ని విధాలా ఉత్తమ మైనది. మీరు సరే అంటే మా ఏజెంట్ను మీ ఇంటికి డెమోకు పంపుతాం. మీ చిరునామా ఇదే కదా..’ అంటూ తన ఇంటి అడ్రస్ను ఓ ఉత్పత్తుల సంస్థ ఉద్యోగి ఫోన్లో చెబుతుంటే ఓ ప్రైవేటు ఉద్యోగి నోరెళ్లబెట్టాడు. లాటరీలు, కూపన్ల పేరుతో డేటా సేకరణ... మనం షాపింగ్ మాల్స్కు వెళ్లినప్పుడు లాటరీల కోసమనో లేదా గిఫ్ట్ కూపన్లు ఇచ్చేందుకనో మన వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. అలా అడిగిందే తడవుగా రివార్డు పాయింట్ల కోసం, డిస్కౌంట్ల కోసం, గిఫ్ట్ కూపన్ల కోసం ఆశపడి మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చేస్తున్నాం. ఇలా పోగేసిన డేటాను కొందరు కేటుగాళ్లు కన్సల్టెన్సీలకు 5 పైసలకు ఒక కాంటాక్ట్ చొప్పున అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా కన్సల్టె న్సీలు కొన్ని వేల రూపాయల ఖర్చుతోనే కోట్ల మంది సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ తరహా సంస్థల నుంచి సైబర్ నేరస్తులు గంపగుత్తగా డేటాను కొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో ఉండే వ్యక్తిగత వివరాలను కొన్ని ఆన్లైన్ సంస్థలు డేటా ఎనలిటిక్స్ టెక్నిక్లతో సేకరించి వివిధ కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు అమ్ముకుంటున్నాయి. డేటా ప్రైవసీలో యూరోపియన్ చట్టాలు ఎంతో కఠినం.. యురోపియన్ దేశాల్లో వ్యక్తిగత సమాచారం. వివరాలకు, వ్యక్తి గత గోప్యతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మన వివరాలను అను మతి లేకుండా ఎవరు తీసుకున్నా... వినియోగించినా వెంటనే వారిపై జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం కింద భారీ జరిమానాలతోపాటు జైలుశిక్షలు విధించే అవకాశం ఉంది. ఆ తరహా చట్టాలు మన దేశంలోనూ వస్తేనే వ్యక్తిగత వివరాల గోప్యతకు రక్షణ ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇవ్వొద్దు... వీలైనంత వరకు మీ ఫోన్ నంబర్, చిరునామా, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్, పాన్ వంటి వివరాలను ఇతరులకు ఇవ్వొద్దు. ఇలా ఇవ్వడం వల్ల మన డేటాను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఢిల్లీ -
అయ్యో! ఆర్డర్ మీది కాదా? క్యాన్సిల్ చేస్తా.. ఓటీపీ చెప్పండి చాలు..
ఇంటి లోపల మీరేదో పనిలో ఉంటారు.. ఈలోగా డెలివరీ బాయ్ వచ్చి తలుపు తడతాడు. ఆర్డర్ వచ్చిందంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదే అనుకుంటూ అదే సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్తోనే బుక్ అయింది’ అని నమ్మబలుకుతారు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చింది చెప్పండి చాలు అంటారు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో.. ఇక అంతే.. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాల్లో కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వస్త్రాలు, ఇతర గృహోప కరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగినట్లు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదీ మోసం తీరు.. ఆన్లైన్లో మనం ఆర్డర్ ఇవ్వకుండానే మీ ఇంటికి డెలివరీ బాయ్స్ వచ్చి మీకో ఆర్డర్ వచ్చిందంటారు. తీరా మనం ఆ ఆర్డర్ ఇవ్వలేదని చెబితే పొరపాటున మీ అడ్రస్తో ఈ ఆర్డర్ బుక్ అయినట్లుందని నమ్మబలుకుతారు. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఆ డబ్బులు మా జీతంలోంచి కట్ అవుతాయని, మా కమీషన్ పోతుందని జాలి నటిస్తారు. మీ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చింది దయచేసి అది చెప్పండి చాలు అని నమ్మబలుకుతారు. వారిని నమ్మి మనం ఓటీపీ చెప్పిన వెంటనే అప్పటికే మన వివరాలు సేకరించి ఉంటున్న సైబర్ నేరగాళ్లు మన ఫోన్ను తమ అధీనంలోకి తీసుకుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొడతారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తు్తవులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే దగ్గరలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930 నంబర్కు కాల్ చేసి వివరాలు ఇవ్వాలి. ఏ వివరాలు ఇవ్వొద్దు.. ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్ను క్యాన్సిల్ చేసేందుకు ఓటీపీ చెప్పండి అని ఎవరైనా అడిగితే వివరాలు చెప్పవద్దు. మీరు ఆర్డర్ ఇవ్వకుండా వస్తువులు మీ పేరిట రావని గుర్తించాలి. ఓటీపీ, ఇతర వివరాలు, బ్యాంక్ ఖాతాల గురించి అడిగితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేసే సమయంలోనూ ఆ వెబ్సైట్ నమ్మకమైనదేనా? లేదా? అని తెలుసుకోవాలి. ఆన్లైన్లో వస్తువుల కొనుగోలు, అమ్మకాల్లోనూ మోసం జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని మరవొద్దు. –శ్రీనివాస్,సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ -
లైక్,షేర్.. చీటింగ్
విజయవాడ స్పోర్ట్స్: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని యువత విలవిల్లాడుతున్నది. అత్యాశకు పోయి రూ.లక్షలకు లక్షలు సమర్పించుకుంటుంది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిత్యం ఈ తరహా ఘటనలు ఎక్కడో ఓచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయవాడ సీతారామపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వర్క్ ఫ్రం హోంలో భాగంగా ప్రస్తుతం సీతారామపురంలోని తన ఇంటి నుంచే పనిచేస్తున్నది. ఈ నెల ఐదో తేదీన తన వాట్సాప్కు వచ్చిన మెసేజ్కు ఆకర్షితురాలై వెంటనే మెసేజ్లోని వెబ్సైట్ను క్లిక్ చేసింది. వెబ్సైట్లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకుంటుండగానే సదరు కంపెనీ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ‘ఇన్స్టా గ్రాం, యూ ట్యూబ్, ఫేస్బుక్లో వచ్చే వీడియోలు చూసి లైక్, షేర్ చేస్తే డబ్బులు చెల్లిస్తామని, ఇంట్లో కూర్చునే నెలకు లక్షలు సంపాదించవచ్చు అని ఫోన్లో చెప్పిన వ్యక్తి మాటలను నమ్మింది. యువతికి టాస్క్లు మొదలయ్యాయి. ఆ రోజు తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కాసేపు విరామం ఇచ్చి ఈజీగా వచ్చే డబ్బుల కోసం తాపత్రయపడి కష్టపడి కొత్త పని టాస్క్లు పూర్తి చేసింది. వెంటనే ఆమె బ్యాంక్ ఖాతాలో రూ.1,200 జమయ్యాయి. దీంతో అదే పనిగా మరుసటి రోజు టాస్క్లు పూర్తి చేయడంతో మళ్లీ రూ. 2 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. యువతి బానిసత్వాన్ని గ్రహించిన సైబర్ నేరగాళ్లు ఆమెను అప్పుడే అసలైన ముగ్గులోకి దించారు. ‘రూ.5 వేలు డిపాజిట్ చేసే కొన్ని పేరున్న కంపెనీల టాస్క్లు ఇస్తాం, ఆ కంపెనీ ప్రొడక్టస్కు రేటింగ్ ఇవ్వాలంతే.. ఇది సింపుల్ టాస్క్.. ఎక్కువ లాభాలొస్తాయి..!’ అని నమ్మించారు. రూ.5 వేలు డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేసి వెబ్సైట్ వాలెట్ చెక్ చేసుకుంది. అందులో రూ.10 వేలు జమకావడంతో ఆనందంతో విత్డ్రా చేసుకుందామని విఫలయత్నం చేసింది. వెంటనే కంపెనీ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించింది. రూ. ఏడు వేలు డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేస్తే మీ వాలెట్లో ఉన్న రూ.10 వేలు తీసుకొవచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఆ విధంగానూ చేసినా డబ్బు రాలేదు. బాధితురాలు డబ్బులు డిపాజిట్ చేస్తూనే ఉంది.. తీసుకోవడానికి వీలు లేని డబ్బులు వాలెట్లో పెరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా ఆ యువతి కేవలం 10 రోజుల్లో 14 లక్షల 13 వేల 900 రూపాయలను చెల్లించిన తరువాత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో విసురుతున్న వలలో నిరుద్యోగులతో సహా ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు పడుతుండడం గమనార్హం. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల కేంద్రంగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఘటనలు ఈ ఆన్లైన్ మోసాల బాధితులు రోజురోజుకీ పెరుగుతున్నారు. నిత్యం స్మార్ట్ ఫోన్కే అంకితమవుతున్న వ్యక్తులు ఈ సైబర్ ఉచ్చులో పడుతున్నారు. ఈ ఏడాది జనవరి మూడో తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఈ తరహా ఘటనలపై సైబర్ పోలీస్ స్టేషన్లో 19 కేసులు నమోదయ్యాయి అప్రమత్తంగా ఉండండి.. స్మార్ట్ ఫోన్ వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. సులువుగా డబ్బులు వస్తాయని నమ్మి మోసపోవద్దు. ఈ తరహా ఘటనల్లో సైబర్ నేరగాళ్లు ప్రత్యేకంగా రూపొందించుకున్న ప్రోగ్రామింగ్ ద్వారానే వెబ్ లింక్స్ను తయారు చేస్తారు. డబ్బులు చెల్లింపులు యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ తదితర పద్ధతుల ద్వారా సేకరిస్తారు. నేరగాళ్ల కదలికలపై నిఘా ఉంచాం. బాధితులకు న్యాయం చేస్తాం. – టి.కె.రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా -
సిటీ కంపెనీలకు ‘హిడెన్బర్గ్ బూచి’
సాక్షి, సిటీబ్యూరో: ‘హిడెన్బర్గ్–అదానీ గ్రూప్’ ఎపిసోడ్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇటీవల సైబర్ నేరగాళ్లు ఈ తరహా కార్పొరేట్ బెదిరింపులకు దిగుతున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థకు రూ.వేల కోట్ల టర్నోవర్, దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. దీని అధికారిక ఐడీకి ఈ నెల మొదటి వారంలో ఓ ఈ–మెయిల్ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడిట్ కంపెనీ పంపినట్లు అందులో ఉంది. అందులో అనేక అవకతవకలకు పాల్పడుతూ, రికార్డులను తారుమారు చేయడంతోనే మీ సంస్థకు ఇంత మొత్తం టర్నోవర్ ఉన్నట్లు తమకు తెలిసిందని బెదిరించారు. ఈ విషయం తాము సుదీర్ఘ పరిశోధన తర్వాత గుర్తించామని రాశారు. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కంపెనీ నిర్వాహకుల వివరాలతో పాటు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తమకు పంపాలని మెయిల్లో కోరారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తక్షణం తమకు 75 వేల డాలర్లు బిట్ కాయిన్స్ రూపంలో బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంస్థకు సంబంధించిన సమస్త సమాచారం పబ్లిక్ డొమైన్లోనే ఉండటం, ప్రముఖ ఆడిటింగ్ కంపెనీగా చెప్తున్న వారికి ఈ విషయం తెలియకపోవడంతో అనుమానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో పక్షం రోజుల తర్వాత అదే ఐడీ నుంచి వీరికి మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో డిమాండ్ చేసిన మొత్తం లక్ష డాలర్లు పెరిగిపోయింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న నిర్వాహకులు సొంత ఐటీ టీమ్తో ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఈ నేపథ్యంలో దాన్ని బెంగళూరుకు చెందిన సైబర్ నేరగాళ్లు అమెరికా సర్వర్ను వాడి పంపినట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థ జనరల్ మేనేజర్ శుక్రవారం సిటీ సైబర్ కైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
వచ్చేస్తున్నారు.. సైబర్ కమాండోలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు కమాండోలు అంటే మనకు తెలిసిందే. ప్రత్యేక ఆపరేషన్ల కోసం శిక్షణ పొంది రెప్పపాటులో శత్రు శ్రేణులపై దాడి చేస్తారు. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలో సైబర్ కమాండోలు రంగంలోకి దిగనున్నారు. రోజుకో సవాల్ విసురుతున్న సైబర్ నేరస్తుల ఆటకట్టించేందుకు ఇప్పటికే శిక్షణ పొందారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడు డివిజన్లు, 14 విభాగాలుగా ఏర్పాటైన ఈ బ్యూరో మరో రెండు నెలల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధమైంది. కమిషనరేట్లో ఠాణా, జిల్లాలో సైబర్ సెల్స్.. రాష్ట్రంలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలు, విధివిధానాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సైబర్ నేరాలను కూకటివేళ్లతో సహా పెకిలించేలా క్షేత్రస్థాయి నుంచే సైబర్ నేరాలను నివారించేందుకు ఈ బ్యూరో పనిచేయనుంది. ఈ బ్యూరోలో ప్రధానంగా మూడు డివిజన్లు, 14 విభాగాలుంటాయి. ప్రధాన కార్యాలయం సైబరా బాద్ కమిషనరేట్లో ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లలో ప్రత్యేకంగా సైబర్ పోలీసుస్టేషన్ ఉంటుంది. మిగిలిన జిల్లాలలో సైబర్ కో–ఆర్డినేట్ సెల్స్ ఉంటాయి. స్థానిక పోలీసుల సహకారంతో సైబర్ నేరాల నివారణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు విధులు నిర్వర్తిస్తారు. అధికారులకు విధుల కేటాయింపు.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 454 మంది అధికారులను కేటాయించింది. ఆయా పోలీసులు హ్యాకింగ్, ఫిషింగ్, సైబర్ భద్రతపై శిక్షణ పూర్తి చేసుకొని సైబర్ కమాండోలుగా సిద్ధమయ్యారు. 140 మంది వారియర్లు సైబరాబాద్ కమిషనరేట్లోని ప్రధాన కార్యాల యంలో, మిగిలిన 314 మంది ఇతర కమిషనరేట్లు, జిల్లా కేంద్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. సైబర్ సెక్యూరిటీబ్యూరో ప్రధాన విధులివే.. ►సైబర్ నేరాలకు పాల్పడేవారిని గుర్తించడం, ఆయా రాష్ట్రాల సహకారంతో పట్టుకోవడం ►బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికం ఆపరేటర్ల నోడల్ ఏజెన్సీలతో ఎప్పటి కప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేర గాళ్లు కొల్లగొట్టిన డబ్బును స్తంభింప జేయడం. ►నకిలీ బ్యాంకు ఖాతాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉన్న ఫోన్ నంబర్లను గుర్తించి నియంత్రించడం. ►పలుమార్లు నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నిందితులను గుర్తించి పీడీ యాక్ట్లు నమోదు చేయడం. అంతర్రాష్ట్ర నిందితుల ఆటకట్టు రాజస్తాన్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు సైబర్నేరాలకు అడ్డాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో అంతర్రాష్ట్ర నేరస్తు లను పట్టుకొనేందుకు వెళ్లిన రాష్ట్ర పోలీసులకు అక్కడి పోలీసులు సహకరించకపోవడం, నేరస్తు లు పోలీసులపై కాల్పులు, దాడులు జరపడం కూడా జరిగాయి. ఈ తరహా ఆటంకాలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిష్కారమార్గాలను కను గొంది. ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) వంటి సంస్థల సమన్వయంతో ఈ బ్యూరో పనిచేయనుంది. -
రూ.520కే గన్ డెలివరీ!
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా కేవలం ఫోన్ ద్వారానే కథ నడుపుతూ అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో తయారైన నాటు, నీటు తుపాకులను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఫేస్బుక్లోని మార్కెట్ ప్లేస్ కేంద్రంగా ప్రచారం చేసి మోసాలకు పాల్పడుతున్నారు. తుపాకీకి డబ్బు ఇప్పుడు చెల్లించాల్సిన పనిలేదని, కేవలం రూ.520 అడ్వాన్స్గా చెల్లిస్తే డెలివరీ చేస్తామని, ఆ తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని నమ్మబలుకుతున్నారు. ఇందులో బాధితులు కోల్పోతున్నది చిన్న మొత్తాలే కావడంతో ఎవరూ పోలీసుల వరకు వెళ్లి ఫిర్యాదులు చేయడం లేదు. దీన్నే అదనుగా భావిస్తున్న అనేక ముఠాలు ఈ తరహా నేరాలకు పాల్పడి అనునిత్యం రూ.లక్షల్లో కొల్లగొడుతున్నాయి. తుపాకుల ప్రచారంపై ఫేస్బుక్ పేజీలో పెట్టిన పోస్ట్. (ఇన్సెట్లో) వాట్సాప్ డీపీలో ఉన్న ఫొటో వీడియో రూపంలో ప్రకటన.. ఫేస్బుక్లో ఆల్ ఇండియా డెలివరీ పేరుతో ఓ పేజ్ ఏర్పాటు చేసిన సైబర్ నేరగాళ్లు అందులో తుపాకులు, తపంచాలు, కత్తులకు సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ పేజ్ పైనే 86384 67582 అనే మొబైల్ నంబర్ కూడా ఉంటోంది. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా డెలివరీ చేస్తామంటూ ఓ లింకును పెడుతున్నారు. ఈ ప్రకటనకు ఆకర్షితులైన వాళ్లు ఈ లింక్ క్లిక్ చేస్తే.. అది నేరుగా వాట్సాప్కు వెళ్తోంది. ఫేస్బుక్ పేజ్ పైన ఉన్న నంబర్తోనే పని చేసే ఈ వాట్సాప్ ఖాతాకు డిస్ప్లే పిక్చర్ (డీపీ)గా ఆయుధాలను పక్కన పెట్టుకుని పడుకున్న యువకుడి ఫొటో ఉంటోంది. ఫేస్బుక్ ద్వారా ఈ వాట్సాప్ ఓపెన్ కావడంతోనే తెరిచిన వ్యక్తి ఆ ఆయుధాల వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సందేశం సైతం పోస్టు అవుతోంది. రకరకాల ఫొటోలు షేర్ చేసి.. ఆ వెంటనే స్పందిస్తున్న సైబర్ నేరగాళ్లు వివిధ రకాల తుపాకులకు సంబంధించిన 20–30 ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఎదుటి వారిని పూర్తిగా నమ్మించడానికి ఈ ఫొటోలు కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసినట్లు ఉండకుండా జాగ్రత్తపడుతున్నారు. చేత్తో పట్టుకుని, వాహనాలపై ఉంచి, వస్త్రాల్లో భద్రంగా కట్టి ఉంచిన తుపాకుల ఫొటోలనే షేర్ చేస్తున్నారు. వీటిని చూసిన వాళ్లు అవతలి వారి దగ్గరే అవి ఉన్నట్లు భావిస్తున్నారు. ఇవతలి వ్యక్తి వాటి ఖరీదు చెప్పమంటూ ఆరా తీస్తే... తొలుత ఓ తుపాకీ ఎంచుకుని దాన్ని తనకు రిటర్న్ షేర్ చేయమంటూ సైబర్ నేరగాడు సూచిస్తున్నాడు. అలా చేసిన తరువాత ఆ తుపాకీ ధరను రూ.3 వేల నుంచి రూ.5 వేల మధ్య చెప్పి, ఎక్కడకు కావాలంటే అక్కడకు తెచ్చి ఇస్తామంటున్నాడు. పరీక్షించడం కోసమూ చెల్లింపులు.. తమ వద్ద ఏ తుపాకీ ఖరీదు చేసినా దాంతో పాటు పది తూటాలు ఉచితంగా ఇస్తామంటూ నమ్మిస్తున్నారు. ఆయుధానికి పూర్తి మొత్తం ముందుగా చెల్లించాల్సిన పనిలేదని, అడ్వాన్స్గా కేవలం రూ.520 చెల్లిస్తే డెలివరీ చేస్తామని, ఆ తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని నమ్మబలుకుతున్నారు. తుపాకులపై ఆసక్తి ఉన్న వాళ్లు, తక్కువ ధరకు వస్తోందని భావించిన వారిలో కొందరు ఇది నిజమా? కాదా? అనేది తెలుసుకోవడానికి చెల్లింపులు చేస్తున్నారు. ఈ అడ్వాన్స్ను 89509 45896 నంబర్కు వాట్సాప్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు సూచిస్తున్నారు. ఆ మొత్తం పంపే వరకు సందేశాలు పంపుతూనే ఉంటున్నారు. ఒకసారి తన ఖాతాలో ఆ డబ్బు పడిన తర్వాత బాధితుల నంబర్లను బ్లాక్ చేయడం, వేరే నంబర్ నుంచి కాల్ చేసినా ఎత్తకపోవడం వంటివి చేస్తున్నారు. తాము కోల్పోయింది చిన్న మొత్తమే అనే భావనతో బాధితులూ ఫిర్యాదులు చేయట్లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇది మోసం కాకపోయినా నేరమే.. ఇలాంటి మోసాల్లో ఒక బాధితుడు కోల్పోయేది తక్కువే అయినా... వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో నేరగాళ్లకు చేరేది రూ.లక్షల్లోనే ఉంటుంది. ఈ తరహా నేరాల్లో నేరగాళ్లు వినియోగిస్తున్న ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు బోగస్ వివరాలతో లింకై ఉంటాయి. అందువల్ల వాటి ఆధారంగా సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కష్టసాధ్యం. అయితే బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే మాత్రం ఆ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయించడం ద్వారా వారిని కొంతవరకు కట్టడి చేయొచ్చు. ఇలాంటి మోసపూరిత ప్రకటనల ఉచ్చులో ఎవరూ పడకూడదు. ఇది మోసం కాకుండా నిజంగా ఆయుధాలు డెలివరీ అయినా అదీ నేరమే అవుతుంది. లైసెన్సు లేకుండా ఎవరూ ఎలాంటి ఆ«యుధాలూ కలిగి ఉండరాదు. – డి.ప్రభాకర్ నాయుడు, సైబర్ క్రైమ్ నిపుణుడు -
ఖాతాలు, మనుషులే.. పారసైట్లు!
సాక్షి, హైదరాబాద్: కష్టపడకుండానే డబ్బు వస్తుందన్న ఆశే ఇప్పుడు పోలీస్ కేసులు కొందరి మెడకు చుట్టుకోవడానికి కారణమవుతోంది. కంటికి కనిపించకుండానే బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్లు.. డబ్బుకు ఆశపడే కొందరిని తమ మోసాలకు పావులుగా వాడుకుంటున్నారు. ‘పారసైట్’బ్యాంకు అకౌంట్లను వాడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. పోలీసులు ఎంతో శ్రమించి ఆరా తీస్తే చివరికి అమాయకులు పట్టుబడుతున్నారు. కమిషన్ కోసం బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇస్తే కేసుల్లో ఇరుక్కోక తప్పదని సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు పాటిబండ్ల ప్రసాద్ హెచ్చరించారు. ఖాతాలు.. కమీషన్లు.. వర్క్ఫ్రం హోం పేరిట.. ఎవరైనా తమ వ్యాపారాలు చాలించాలనుకునే వారు తమ కంపెనీలను అమ్మేస్తున్నట్టు ప్రకటనలు ఇస్తే.. అలాంటి వారిని సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో సంప్రదిస్తున్నారు. ‘మీ కంపెనీ కరెంట్ ఖాతాను మాకు వాడుకోవడానికి ఇస్తే.. ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తాం’అంటూ గాలం వేస్తున్నారు. ఇదే తరహాలో సేవింగ్స్ ఖాతాలు ఉన్నవారినీ ప్రలోభ పెడుతున్నారు. డబ్బు వస్తుంటే ఎందుకు పోగొట్టుకోవాలన్న ఆశతో కొందరు ఇందుకు ఓకే అంటున్నారు. ఇలా సేకరించిన కరెంట్, సేవింగ్స్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు అక్రమ సొమ్మును ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వాడుతున్నారు. ఇలా ట్రాన్స్ఫర్ చేసే చోట కూడా తాము చిక్కకుండా.. అమాయకులను వాడుకుంటున్నారు. ‘వర్క్ఫ్రం హోం.. ఇంటి దగ్గర కూర్చునే రోజూ వేలు సంపాదించండి..’అని ఆన్లైన్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కమిషన్ ఆశచూపి పనికి పెట్టుకుంటున్నారు. వారికి పుష్ బటన్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దానికి ఆటో డెబిట్, క్రెడిట్ కార్డులను జత చేస్తారు. ముందస్తుగానే తప్పుడు ఆధార్ వివరాలతో తీసుకున్న సిమ్కార్డులను వాడి వీరికి ఎస్ఎంఎస్ పంపుతారు. డబ్బులను వారు సూచించిన ఖాతాల్లో వేసేలా పుష్బటన్ యాప్లను వాడాలని సూచిస్తారు. మొత్తానికి.. సైబర్ నేరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పుడు ‘పారసైట్’బ్యాంకు ఖాతాల యజమానులు, పుష్బటన్ యాప్ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తులు మాత్రమే పట్టుబడుతుంటారు. అసలు సైబర్ నేరగాళ్లు తప్పించుకుంటారు. ఇలాంటి నేరాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టెలిగ్రామ్ వంటి యాప్స్ను వేదికగా చేసుకుంటున్నారని పాటిబండ్ల ప్రసాద్ తెలిపారు. ఖాతాలు ఇచ్చి ఇరుక్కున్న 233 మంది సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు ఇటీవల ఓ అంతర్జాతీయ ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టును బయటపెట్టారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన రూ.24 కోట్లను సీజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీస్తే.. దొరికినవారంతా అమాయకులే. డబ్బుల ఆశతో తెలిసీతెలియక సైబర్ నేరస్తులకు సహకరించినవారే. సైబర్ నేరగాళ్లు కమీషన్లు ఇస్తామనడంతో బ్యాంకు ఖాతాలు ఇచ్చినవారు, వాటి నుంచి డబ్బుల ట్రాన్స్ఫర్లు చేసినవారే. ఇలాంటి బ్యాంకు ఖాతాలను సైబర్ భద్రత నిపుణులు ‘పారసైట్’అకౌంట్లుగా పిలుస్తున్నారు. ఇలా తమ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన 233 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సైబర్ మోసంలో వారిని పాత్రధారులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. కొద్దిమొత్తాలుగా చేసి.. బిట్కాయిన్లుగా మార్చి.. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును చిన్నచిన్న మొత్తాలుగా మార్చి వాటిని తొలుత వందల బ్యాంకు ఖాతాల్లోకి పంపుతారు. తర్వాత ఆ ఖాతాల నుంచే ఆన్లైన్లో బిట్కాయిన్లుగా మార్చుతున్నారు. బిట్కాయిన్లను విదేశీ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి సొమ్ముగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా చైనాకు చెందిన పలు యాప్స్ కంపెనీలు ఈ నేరాలకు పాల్పడుతున్నాయి. అవన్నీ కూడా తమ కంప్యూటర్ సర్వర్లను హాంగ్కాంగ్, సింగపూర్, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నాయని.. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. మన దేశంలోని దర్యాప్తు సంస్థలు ఈ మోసాలను గుర్తించినా అసలు దోషులను కనిపెట్టడం కష్టమని అంటున్నారు. -
కాల్ చేసి స్కాన్ చేయాలని తొందరపెడుతున్నారా? ఖాతా ఖాళీ కావడం ఖాయం!
►కొండాపూర్కు చెందిన స్వామినాథన్ తన 3 బీహెచ్కే ఇంటిని నెలకు రూ.20 వేలకు అద్దెకు ఇస్తానంటూ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో యాడ్ ఇచ్చారు. రెండురోజుల తర్వాత ఒక వ్యక్తి తాను సీఐఎస్ఎఫ్ అధికారి రాజ్దీప్సింగ్ అని, తనకు పుణే నుంచి హైదరాబాద్కు బదిలీ అయ్యిందంటూ పరిచయం చేసుకున్నాడు. ఇంటి అద్దె అడ్వాన్స్ చెల్లిస్తానని చెప్పి తొలుత కొంత డబ్బు పంపాడు. ఆ తర్వాత మిగతా డబ్బు పంపిస్తానంటూ స్వామినాథన్ను గందరగోళానికి గురిచేసి, తాను పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేయాలంటూ తొందరపెట్టాడు. స్వామినాథన్ అలానే చేయడంతో అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.2.5 లక్షలు అవతలి వ్యక్తికి బదిలీ అయిపోయాయి. ►బల్క్ ఆర్డర్ల పేరిట ఒకేసారి 20 ఫ్రిజ్లు కావాలని ఓ షోరూం నిర్వాహకులకు ఒక అపరిచిత వ్యక్తి కాల్ చేశాడు. ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తానంటూ వాళ్లు పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా తొలుత కొంత డబ్బు పంపాడు. ఆ తర్వాత మరోసారి డబ్బులు పంపించానని, ఆ నగదు మధ్యలో ఆగిపోయిందని చెబుతూ తాను పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేయాలంటూ కంగారు పెట్టాడు. అతడు చెప్పినట్టు చేసిన షోరూం నిర్వాహకులు రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు. సాక్షి, హైదరాబాద్: నగదు లావాదేవీల్లో భాగంగా ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. కొందరు అసలు నగదు అనే మాటే లేకుండా లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే చేసేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ డబ్బులు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ పరిజ్ఞానం అంతగా లేని అమాయకుల్ని మాటలతో మభ్యపెట్టి, గందరగోళానికి గురిచేసి, కంగారు పెట్టేస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. రెగ్యులర్గా ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించే వారు కూడా కొన్నిసార్లు వీరి బారిన పడుతూ వేలు, లక్షల రూపాయలు నష్టపోతున్నారు. కేటుగాళ్లు కూర్చున్న చోటు నుంచి కదలకుండానే తమ జేబులు నింపుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అనుసరిస్తున్న సైబర్ నేరగాళ్లు.. తాజాగా క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ స్కానింగ్తో చేసే చెల్లింపులు ఆధారంగా చేసుకుని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సరికొత్త మోసం.. క్యూరిషింగ్ ఇటీవలి కాలంలో క్యూఆర్ కోడ్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. జేబులో నగదు ఉండాల్సిన పనిలేదు. బ్యాంకులో డబ్బు, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. పెద్ద షోరూంలు మొదలుకుని చిన్న కిరాణా షాపుల్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. నగదు చెల్లింపులకే కాదు.. పెద్ద కంపెనీలు తమ వెబ్సైట్లు, బిజినెస్ కార్డులు, బ్రోచర్లు, ఇలా ప్రతి సమాచారమూ స్కాన్ చేస్తే చాలు వచ్చేలా క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఇస్తున్నాయి. దీంతో సైబర్ దోపిడీగాళ్లు క్యూఆర్ కోడ్పై దృష్టి పెట్టారు. దీన్ని వినియోగిస్తూ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును, అది కుదరకపోతే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కొట్టేస్తున్నారు. ఈ సరికొత్త సైబర్ మోసాన్ని సైబర్ సెక్యూరిటీ నిపుణులు క్యూరిషింగ్గా చెబుతున్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలి క్యూఆర్ కోడ్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ క్యూఆర్ కోడ్లను సృష్టిస్తున్నారు. వీటిని ఉపయోగించి మన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. అనుమానాస్పద క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్లోకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవుతుంటాయి. లేదంటే క్యూఆర్ కోడ్ను మనం స్కాన్ చేయగానే మనల్ని అవి అన్సేఫ్ (సైబర్ నేరగాళ్ల అధీనంలో ఉండే) వెబ్సైట్లలోకి తీసుకెళ్లేలా యూఆర్ఎల్ లింకులు జత చేసి ఉంటున్నాయి’అని చెబుతున్నారు. క్యూఆర్ కోడ్ మోసాలకు ఇక్కడే ఎక్కువ.. ►గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఫ్రీ రీచార్జ్ వంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్లలో జరిగే లావాదేవీలను నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ►వెబ్సైట్లో వస్తువుల అమ్మకాల విషయంలో ఎక్కువగా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయి. ►కోవిడ్ వెరిఫికేషన్ పేరిట కూడా సైబర్ నేరగాళ్లు ఫేక్ క్యూఆర్ కోడ్లను పోస్ట్ చేస్తున్నారు. ► బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాల్లో, ఇతర కంపెనీలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్లపైనా నకిలీ క్యూఆర్ కోడ్ లింక్లు పెడుతున్నారు. ఇలా చేస్తే మేలు.. ►అపరిచితులు పంపే ఈ మెయిల్స్, వాట్సాప్, ఇతర డాక్యుమెంట్లలోని క్యూఆర్ కోడ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కాన్ చేయవద్దు. ►క్యూఆర్ కోడ్ కింద రాసి ఉన్న యూఆర్ఎల్ లింక్, మనం స్కాన్ చేసిన తర్వాత వచ్చిన వివరాలు ఒకేలా ఉన్నాయా లేదా? అన్నది సరిచూసుకోవాలి. ►యూపీఐ ఐడీలు, బ్యాంక్ ఖాతాల వివరాలు అపరిచితులతో ఎట్టిపరిస్థితుల్లో షేర్ చేసుకోవద్దు. ►ఓఎల్ఎక్స్ లేదా ఇతర వెబ్సైట్లలో వస్తువుల క్రయ, విక్రయాలు చేసేటప్పుడు వీలైనంత వరకు ఆన్లైన్ చెల్లింపుల కంటే నగదు లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆన్లైన్ చెల్లింపుల్లో తొందరపడొద్దు ఆన్లైన్ వెబ్సైట్లలో కొనుగోళ్లు చేసేటప్పుడు తొందరపడొద్దు. అవతలి వ్యక్తులు మనల్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని, పిన్ ఎంటర్ చేయాలని గందరగోళ పెడుతున్నట్లయితే అది మోసమని గ్రహించాలి. మనకు పంపే క్యూఆర్ కోడ్ను గమనించినా..మన బ్యాంకు ఖాతా నుంచే డబ్బులు కోతకు గురవుతాయని గుర్తించవచ్చు. – బి.రవికుమార్రెడ్డి, డీఎస్పీ, సీఐడీ సైబర్ క్రైమ్స్ -
‘పబ్లిక్ వైఫై’ వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడంతా ఇంటర్నెట్ జమానా...నెట్తో కనెక్ట్ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్లైన్ షాపింగ్ మొదలు..ఆఫీస్కు ఇన్ఫర్మేషన్ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. కొన్ని సార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో మన ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే.. అయితే ఇకపై పబ్లిక్ వైఫైలు వాడుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి మనం ఈ మెయిల్, ఇతర సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయడం,, ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు చేస్తే మనం నమోదు చేసే యూజర్ ఐడీ, పాస్వర్డ్లను సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ప్రాంతాల్లోని వైఫై వాడినట్లయితే సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారం సైతం కొట్టేసే ప్రమాదం ఉంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పబ్లిక్ వైఫై వాడకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నమ్మదగిన వీపీఎన్(వర్చువల్ ప్రైవేటు నెట్వర్క్)ను ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాలంటున్నారు. వీపీఎన్ ఉండడం వల్ల మన ఫోన్లోని సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు. -
వేలిముద్రలు కొట్టేసి.. బ్యాంకు ఖాతా లూటీ చేసి..
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెర తీస్తున్నారు. తాజాగా ‘ఆధార్’ను ఆధారంగా చేసుకుని దోచుకుంటున్నారు. ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్)’ మోసాలు క్రమంగా పెరుగుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాలు హరియాణా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ల్లో ఇటీవల పెరిగాయన్నారు. ఇవి తెలంగాణలోనూ అక్కడక్కడ వెలుగు చూస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే తెలంగాణ సీఐడీ విభాగంలోని సైబర్ క్రైం పోలీసులు ఈ తరహా కేసులో నిందితుడిని బిహార్లో అరెస్టు చేసి నగరానికి తెచ్చారు. ఈ తరహా మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. – సాక్షి, హైదరాబాద్ ఇలా జరిగితే అప్రమత్తం కావాలి మీకు తెలియకుండానే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంలో మీ బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు పోయినట్టు గుర్తిస్తే వెంటనే మీ ఆధార్ కార్డుతో అనుసంధానమైన మీ వేలిముద్రలను డిజేబుల్ చేసుకోవాలని సైబర్క్రైం పోలీసులు సూచించారు. ఆధార్ వివరాలు గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దన్నారు. వివిధ మార్గాల్లో దొంగిలించిన వేలిముద్రలను సిలికాన్ ఫింగర్ ప్రింట్స్గా రూపొందించి వాటి ద్వారా ఏఈపీఎస్ విధానంలో ఆధార్ లింకై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నట్టు తెలిపారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. ►ఏఈపీఎస్ సదుపాయాన్ని తరచుగా వాడనట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఆ సదుపాయాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలి. ►మీ బయోమెట్రిక్ దుర్వినియోగం కాకుండా ఆధార్ వెబ్సైట్లోకి (https:// resident. uidai. gov. in/ aadhaar& lockunlock) వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ను లాక్ చేసుకోవాలి. ►వీలైనంత వరకు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఆధార్కార్డ్ కాపీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఆధార్కార్డును ఏదైనా ధ్రువీకరణ కోసం వాడాల్సి వస్తే తప్పకుండా మాస్క్డ్ ఆధార్ (ఆధార్ నంబర్పూర్తిగా కనిపించకుండా ఉండేది) కాపీని వాడుకోవాలి. ►సైబర్ నేరం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే 1930 నంబర్కు లేదా www. cybercrime. gov. in లో ఫిర్యాదు చేయాలి. ►అనధికార వెబ్సైట్లు, ఏజెన్సీల వారికి వేలిముద్రలను ఇవ్వవద్దు. మాస్క్డ్ ఆధార్ అంటే? ఆధార్ కార్డులోని మొత్తం 12 నంబర్లలో మొదటి ఎనిమిది నంబర్లు కనిపించకుండా (వాటి స్థానంలో గీగీగీ గుర్తులు ఉంటాయి) కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే దాన్ని మాస్క్డ్ ఆధార్ అంటారు. ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి మాస్క్ ఆధార్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే మన ఆధార్కార్డు ఆన్లైన్లో ఎవరు డౌన్లోడ్ చేసినా పూర్తి వివరాలు కనిపించవు. దీని వల్ల ‘ఆధార్’మోసాలు జరగకుండా కాపాడుకోవచ్చు. ఏఈపీఎస్ అంటే..? ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏపీపీఎస్) అంటే.. ఏటీఎంలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నగదు లావాదేవీల కోసం బ్యాంకు ఏర్పాటు (మైక్రో ఏటీఎంలుగా పేర్కొనవచ్చు) చేసేవి. ఏ బ్యాంక్ ఏజెంట్ అయినా ఆధార్ అథెంటిఫికేషన్ ద్వారా ఇతర ఏ బ్యాంకునకు సంబంధించిన నగదు లావాదేవీలనైనా ఆన్లైన్లో చేయొచ్చు. ఇందుకోసం ఖాతాదారుడి పేరు, బ్యాంక్ ఖాతాకు లింకైన ఆధార్ నంబర్, ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్ర ఉంటే సరిపోతుంది. సదరు ఖాతాదారుడు ఏఈపీస్ విధానంలో నగదు తీసుకోవాలంటే సంబంధిత బాం్యక్ ఏజెంట్ దగ్గరకు వెళ్లి బ్యాంకు పేరు, ఆధార్ నంబర్, వేలిముద్ర ఇస్తే సరిపోతుంది. సరిగ్గా ఇదే అంశాన్ని కొందరు మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ విభాగం వెబ్సైట్ నుంచి వేలిముద్రలను సేకరించి వాటిని సిలికాన్ షీట్ల ద్వారా నకిలీ వేలిముద్రలను తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. -
రెట్టింపు లాభం అంటూ రూ.కోట్లు కొట్టేశారు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టండి..మీ డబ్బు రెట్టింపు అవుతుందంటూ సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద ఏకంగా రూ.1.90 కోట్లు కొట్టేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో నివాసముంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కొంతమంది వ్యక్తులు పరిచయమై తమ కంపెనీ షేర్లు కొనుగోలు చేయాల్సిందిగా కోరారు. అలాచేస్తే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపారు. దీంతో సదరు ఇంజనీరు అత్యాశకు పోయి కొన్ని షేర్లు కొనుగోలు చేశాడు. అయితే సైబర్నేరగాళ్లు చెప్పినసమయానికి అనుకున్నట్లు గానే రెట్టింపు మొత్తాన్ని ఇంజనీరు ఖాతాలో జమ చేశారు. ఇలా పలుమార్లు షేర్లు కొనుగోలు చేయగా..మంచి లాభాలు వచ్చాయి. దీంతో ఏకంగా రూ.1.90 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. అయితే తిరిగి డబ్బులు రావాల్సిన గడువు ముగుస్తున్నప్పటికీ రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంగారెడ్డి జిల్లా పోలీసులను ఆశ్రయించగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో ఉన్నా వదలట్లేదు.. యువతి ఫిర్యాదుతో వెలుగులోకి
హైదరాబాద్: అమెరికాలో ఉంటున్న నగర వాసులను టార్గెట్ చేస్తూ వారి నుంచి రూ.లక్షలు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి వాట్సాప్ గ్రూపుల్లో చొరబడి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దానికి ఢిల్లీలో ఉన్న నేరగాళ్లకు ఇస్తున్నారు. దీంతో ఈ నేరగాళ్లు నగరానికి చెందిన కొందరు యువతులతో వారికి వాట్సాప్ కాల్స్ చేయిస్తూ రుణాలు ఎగ్గొట్టారని కేసులు నమోదు చేయిస్తామని బెదిరిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. లేని పక్షంలో లోన్ ఫ్రాడర్ అంటూ ప్రచారం చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఓ యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిటీ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి... నగరం నలుమూలల నుంచి అమెరికాలోని పలు ప్రాంతాలకు వెళ్లి విద్య, ఉద్యోగం చేస్తున్న తెలుగు వారు వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తుంటారు. తెలిసిన వారి ద్వారా ఆయా గ్రూపుల్లో యాడ్ అవుతున్న కొందరు వ్యక్తులు గ్రూపులోని యువతుల ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. ట్రూకాలర్ ద్వారా వారి పేరును గుర్తించి దాని ద్వారా ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ ఐడీలను సేకరిస్తున్నారు. వీటితో పాటు వారి ఫొటోలు, వారి ప్రొఫైల్స్లో ఉన్న మరికొందరి ఫొటోలు, పేర్లను తెలుసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్నారు. ఆఫీసుకు రావాలంటూ ఒత్తిడి ఈ సమాచారం ఆధారంగా ఢిల్లీ, నోయిడాలో ఉంటున్న సైబర్ నేరగాళ్లు అమ్మాయిలకు వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ప్రముఖ బ్యాంకుల పేర్లు చెబుతూ, లీగల్, రికవరీ టీం సభ్యులుగా పరిచయం చేసుకుంటున్నారు. తమ బ్యాంకులో రుణం తీసుకుని దాన్ని కట్టకుండా పారిపోయారని, ఒక్క రోజులో రుణాన్ని చెల్లించకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. మీకు రూ. లక్ష పెద్ద మొత్తం కాదని, ఇవ్వకపోతే మీ ఫొటోతో సహా లోన్ఫ్రాడర్ అంటూ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ద్వారా పంపడమే కాకుండా, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ పేజీల్లో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇదే క్రమంలో స్నేహితులకు ఫోన్ చేసి రాధ (పేరుమార్చాం) రుణం తీసుకుంది, రెఫరెన్స్ కింద మీ పేరు ఇచ్చారు. ఆమె కడుతుందా..లేక మీరు చెల్లిస్తారా అంటూ వే«ధిస్తున్నారు. వారి ఒత్తిడి తట్టుకోలేక కొందరు రూ. లక్షే కదా అంటూ నేరగాళ్లకు పంపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. యువతి ఫిర్యాదుతో వెలుగులోకి.. అమీర్పేటకు చెందిన ఓ యువతి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. ఆమెకు ఇటీవల ఢిల్లీ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి రుణం కట్టాలని తీవ్ర ఒత్తిడి చేశాడు. ఆమె ఈ తతంగాన్ని మాకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. యూఎస్లో నివాసం ఉంటున్న మీ పిల్లలు, స్నేహితులు, బంధువులు ఇటువంటి ఫోన్ కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, సైబర్క్రైం ఏసీపీ -
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన గుంటూరు జిల్లా యువతి
-
వీడియో కాల్తో విపత్తు.. ఫోన్ లిఫ్ట్ చేశామో పోర్న్ చిత్రాలతో ఎడిట్ చేసి..
సాక్షి, బెంగళూరు: సైబర్ కేటుగాళ్లు కొత్త అస్త్రంగా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వల వేస్తున్నారు. గుర్తుతెలియని లింక్ల ద్వారా అశ్లీల వీడియోలను పంపుతారు, వాటిని చూస్తే చాలు దీనిని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ కు పాల్పడి డబ్బు గుంజేస్తారు. అందులో ఎక్కువగా ఇటీవల విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులను టార్గెట్గా చేసుకున్నారు. పోర్న్ చిత్రాలతో ఎడిట్ చేసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రాంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి పరిచయం చేసుకుని మోసానికి పాల్పడడం, లేదా నేరుగా వాట్సాప్లో వీడియో కాల్ చేయడం జరుగుతుంది. వీడియో కాల్చేసి మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా నగ్నచిత్రాలు చూపిస్తారు. అలా కాల్ను స్క్రీన్షాట్ లేదా రికార్డ్ చేసుకుని బ్లాక్మెయిల్కు దిగుతారు. డబ్బులు ఇవ్వకపోతే లైంగికంగా వేధించారని కేసు పెడతామని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తామని హెచ్చరిస్తారు. దీంతో ఎక్కువమంది డబ్బులు పంపించి మోసపోయారు. అలాగే వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా లింక్లను పంపి ఇదే తరహా మోసాలు జరుగుతున్నాయి. ఒకరికి రూ. 6.95 లక్షల టోపీ ఆర్పీసీ లేఔట్లో నివాసం ఉండే విశ్రాంత అధికారి వంచనకు గురై రూ.6.95 లక్షలు పోగొట్టుకున్నాడు. గత నెల 20వ తేదీన అంకితా గుప్త అనే మహిళ అతని వాట్సాప్కు వీడియో కాల్చేసింది. ఫోన్ తీయగానే అటువైపు నుంచి నగ్నవీడియో కనబడింది. ఈ దృశ్యాలను వంచకులు రికార్డుచేసుకుని వీడియో ఎడిట్ చేశారు. ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే యువతి నగ్నవీడియో చూడటాన్ని సోషల్మీడియాలో అప్లోడ్ చేస్తామని చెప్పి రూ.6.95 లక్షలు కాజేశారు. చివరకు బాధితుడు పశ్చిమ విభాగ సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. చదవండి: (మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ) సైబర్క్రైం పోలీసుల సలహాలు ►ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అకౌంట్ల ప్రొఫైల్స్ లాక్ చేయడం మంచిది. డేటాను నేరగాళ్లు సేకరించే అవకాశం ఉండదు ►గుర్తుతెలియని వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి ►గుర్తుతెలియని నంబరు నుంచి వీడియో కాల్ వస్తే జాగ్రత్త వహించాలి ►అశ్లీల వీడియోలు, ఫోటోలు చూడటం, ఆ వెబ్సైట్లలో చాటింగ్ చేయడం మంచిదికాదు. ►ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే తక్షణమే సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. యువతికి రూ.2.33 లక్షల వంచన బనశంకరి: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో వరుని కోసం గాలిస్తున్న యువతి నుంచి మోసగాడు రూ.2.33 లక్షలు కాజేశాడు. ఉళ్లాల ఉపనగరకు చెందిన సుస్మిత (28) వరుడు కావాలని వివరాలు నమోదు చేసింది. రాజీవ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. నేను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని త్వరలో భారత్కు వస్తానని చెప్పాడు. ఇద్దరూ కాల్స్, చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. భారత్కు రాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజులకిందట ఫోన్చేసి తాను ఇండియాకు వచ్చానని, తన వద్ద ఉన్న విదేశీ కరెన్సీని మార్చుకోవడానికి కొంత రుసుము కావాలని చెప్పగా సుస్మిత అతని ఖాతాలకు రూ.2.33 లక్షలు పంపింది. ఇక అప్పటి నుంచి రాజీవ్ పత్తా లేడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
Hyderabad: మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొంపముంచిన ‘చిత్రాలు’
హిమాయత్నగర్(హైదరాబాద్): నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె పెయింటింగ్ చిత్రాలను కొనుగోలు చేస్తామంటూ లక్షల రూపాయిలు కాజేశారు. దీంతో బాధితురాలు శనివారం సిటీ సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించింది. సోమాజిగూడలో నివాసం ఉండే ఆర్టిస్ట్ నగరంలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తోంది. ఖాళీ టైంలో పెయింటింగ్ వేసి ఆ చిత్రాలను తన ఇన్స్ట్రాగామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తుంటుంది. వీటిని చూసిన కేటుగాడు ఆమెతో మాట కలిపాడు. వాట్సప్ నంబర్ తీసుకుని చాట్ చేసి ఎన్ఎఫ్టీ ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్ వైపు రప్పించాడు. ఈ వెబ్సైట్లో పెయింటింగ్స్ కొనేవారు చాలా మంది ఉన్నారని నమ్మించాడు. తొలుత ఇన్వెస్ట్ చేస్తే లక్షలు వస్తాయన్నాడు. తన పెయింటింగ్స్ అమ్ముడవ్వాలనే ఆశతో ఆర్టిస్ట్ అతగాడు చెప్పిన విధంగా కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత దాని లాభాల కోసం ట్యాక్స్లు, కమీషన్ అంటూ పలు దఫాలుగా ఆమె నుంచి రూ.8లక్షలు కాజేశాడు. ఇంకా ఇంకా అడుగుతూ ఇబ్బంది పెడుతున్న క్రమంలో తాను మోసపోయానని గుర్తించి సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం! -
5జీకి మారాలనుకుంటున్నారా? ఆ లింక్ను క్లిక్ చేశారంటే అంతే..
హలో మీరు 5జీకి మారాలనుకుంటున్నారా?, లింక్ను క్లిక్ చేయండి అంటారు. లేదా మీ 5జీ నంబర్ను బ్యాంకు ఖాతాకి లింక్ చేయాలి, ఓటీపీ చెప్పండి ప్లీజ్ అని అడిగితే అది మోసగాళ్ల పనేనని తెలుసుకోండి. 5జీ పేరుతో అప్పుడే సైబర్ నేరగాళ్లు సొమ్ము కాజేసే ప్రయత్నాలు ప్రారంభించారు. దేశంలో 5 జీ మొబైల్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు అప్పుడే రంగంలోకి దిగారు. మీ నెట్వర్క్ను అప్డేట్ చేసుకోండి అని వంచనకు పాల్పడే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఇప్పటికే బెంగళూరు తో పాటు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా 5 జీ నెట్వర్క్ సేవలు ప్రారంభం కావడం తెలిసిందే. ప్రజలు 4 జీ నుంచి 5జీ కి అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని జిల్లాల్లో సైబర్ మోసాల పట్ల జాగృతం చేస్తున్నారు. జిల్లాకేంద్రాల్లో కరపత్రాలు ముద్రించి సార్వజనిక స్థలాల్లో పంచుతున్నారు. లింక్ ఓపెన్ చేయరాదు మొబైల్ 5 జీ నెట్వర్క్కు, బ్యాంక్ అకౌంట్ కు ఎలాంటి సంబంధం ఉండదు. సైబర్ వంచకులు బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన మొబైల్ నంబరును 5 జీ నెట్వర్క్ కు అప్డేట్ చేస్తామంటారు. నమ్మి వారు చెప్పినట్లు చేస్తే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరించారు. లింక్ పంపించి క్లిక్ చేయమంటే స్పందించరాదు. చదవండి: పులితో ఆటలా? అని అనకండి.. ముద్దులాటలు కూడా..! వైరల్ వీడియో నమ్మితే అంతే సైబర్ వంచకులు ఎయిర్టెల్, జియోతో పాటు ఇతర మొబైల్ నెట్వర్క్ కంపెనీల కాల్సెంటర్ల పేరుతో ఫోన్ చేస్తారు. సిమ్కార్డును 5 జీ కి అప్డేట్ చేస్తామని, ఓటీపీ ని చెప్పాలని నమ్మిస్తారు. ఓటీపీ చెప్పారో.. బ్యాంకు ఖాతాలో నగదు మాయం చేస్తారు. ఇటువంటి కాల్స్ను అస్సలు నమ్మరాదని పోలీసులు తెలిపారు. ఇటీవల వస్తున్న మొబైల్ స్మార్ట్ ఫోన్లు 5 జీ నెట్వర్క్ కు సపోర్ట్ చేస్తాయి. కానీ పాత మొబైల్స్ 4జీ నెట్వర్క్కు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో సైబర్ వంచకులు, 4 జీ మొబైల్స్ను 5జీ కి అప్డేట్ చేస్తామని కాల్స్ చేయడం మొదలైంది. వాట్సాప్ మెసేజ్, లింక్లు పంపుతారు. వాస్తవంగా 4జి మొబైల్స్ని 5జీ కి అప్డేట్ చేయడం సాధ్యం కాదు. -
కొంప ముంచుతున్న అత్యాశ
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలపై పోలీసులు ఎంత ప్రచారం చేసినా కొందరిలో మార్పు రావటం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ, చిన్న మొత్తంలో పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని వాట్సాప్లలో లింకులు పంపిస్తూ సైబర్ నేరస్తులు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరస్తుల చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులే అధికంగా ఉంటున్నాయి. నేరస్తులు ఇతర రాష్ట్రీయులే.. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బహుళ జాతి కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ నిపుణులు, బ్యాంకింగ్ రంగం ఉద్యోగులు సైతం గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి కూడా పాస్కాని సైబర్ మాయగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఇప్పుడు పెట్టుబడితో వారంలో డబుల్, త్రిబుల్ అవుతుందని చెప్పగానే నమ్మి మోసపోతున్నారు. సైబర్ బాధితుల్లో 60 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు ఉండటమే ఇందుకు నిదర్శనం. 200 శాతం పెరిగిన మోసాలు.. ఇతర సైబర్ నేరాలతో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 200 శాతం మేర పెరిగాయని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వడమే మోసాలకు ప్రధాన కారణం. ఉద్యోగిణులు, ఐటీ ఉద్యోగులు, పెన్షన్దారులు కూడా నేరస్తులో వలలో పడిపోతున్నారు. వర్చువల్గా లాభాలు వచి్చనట్లు చూపించి, రూ.5 లక్షల నుంచి కోటి వరకు పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఆ తర్వాత కాంటాక్ట్ కట్ చేస్తున్నారని వివరించారు. యాప్లలో పెట్టుబడితో లక్షల లాభం వచి్చనట్లు ఫోన్లో కనిపించినా అవి బ్యాంక్ ఖాతాలో జమ కావని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. (చదవండి: పండుగ ముగిసింది.. తిరుగు పయనం) -
కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను వదలని సైబర్ నేరగాళ్లు
-
అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ
ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్ సతీశ్ దేశ్పాండేకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్లో మెసేజ్ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ చేశారు. దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్ ఉంది. -
రాజస్థాన్ లో సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్
-
ట్రేడింగ్ పేరుతో హాంఫట్
హిమాయత్నగర్: నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఇద్దరి నుంచి లక్షల రూపాయిలు దండుకోగా..పర్సనల్ లోను పేరుతో మరో వ్యక్తి నుంచి లక్షలు కాజేశారు. రోజులు గడుస్తున్నా డబ్బు రాకపోవడంతో బాధితులు గురువారం సిటీ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినర్కు చెందిన రోషన్అలీకి మూడేళ్ల క్రితం టాటాక్యాపిటల్ లోన్ డిపార్ట్మెంట్ నుంచంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మీ ఫోన్నంబర్పై రూ.3లక్షలు పర్సనల్ లోన్ మంజూరు అయ్యిందన్నాడు. వివిధ కారణాలతో మొదట రూ.1లక్ష తీసుకున్నాడు. లోను అమౌంట్ పెరిగిందని ఆశ పెట్టి మూడేళల్లో పలు దఫాలుగా రూ.17లక్షలు కాజేశాడు. బోయినపల్లికి చెందిన రఘురాం అనే వ్యక్తి ఓ హోటల్లో మేనేజర్గా చేస్తున్నాడు. ఇతని ఫ్రెండ్ రఘురాంని హాంగ్కాంగ్లో ఉండే వ్యక్తికి వాట్సప్ ద్వారా పరిచయం చేశాడు. కొద్దిరోజులు ఇద్దరూ స్నేహితులుగా మాట్లాడుకున్నారు. తాము ఒక కంపెనీలో ట్రేడింగ్ చేస్తున్నామని నువ్వు కూడా పెట్టాలని కోరారు. అతగాడి మాటలకు నమ్మిన రఘురాం ఎఫ్టీఎక్స్ అనే ట్రేడింగ్లో పలు దఫాలుగా రూ.40లక్షలు పెట్టి మోసపోయాడు. మరో వ్యక్తిని క్రిప్టో కరెన్సీ పేరుతో ఆశ పెట్టి అతగాడి నుంచి రూ.7లక్షల 70వేలు దోచుకున్నారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. (చదవండి: మరీ ఇంత అరాచకమా.. భర్తను కాదని ప్రియుడితో జంప్.. ఆ తర్వాత..) -
బిహార్లో హైదరాబాద్ పోలీసులపై కాల్పులు
సాక్షి, హైదరాబాద్: సైబర్ క్రైమ్ కేసులో నేరస్తులైన కొందర్ని బిహార్ నుంచి నగరానికి తీసుకువస్తుండగా ఆదివారం సాయంత్రం అక్కడి నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. బిహార్కు చెందిన మిథిలేశ్ అనే వ్యక్తి తన గ్యాంగ్తో కలిసి సైబర్ నేరాలకు పాల్పడి నగరంలోని పలువురిని నిండా ముంచాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 11న బిహార్లోని నవాడాకు వెళ్లారు. నేరగాళ్లు అక్కడే ఉన్నట్లు గుర్తించి నలుగుర్ని అరెస్టు చేసి తీసుకు వస్తుండగా వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు సురక్షితంగా తప్పించుకున్నారు. కాగా, అప్పటికే పోలీసులు మిథిలేశ్ నుంచి రూ.1.22 కోట్లు నగదు, 3 లగ్జరీ కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: రిక్షా డ్రైవర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళ -
చీకటి ఒప్పందాలు.. సైబర్ నేరస్తులతో బ్యాంకర్ల దోస్తీ
సాక్షి, హైదరాబాద్: ‘నగరానికి చెందిన ఓ బాధితురాలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మోసానికి గురైంది. తన అకౌంట్లోని సొమ్ము మాయం కాగానే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే సంబంధిత బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయాలని పోలీసులు బ్యాంకు నోడల్ ఏజెన్సీకి సూచించారు. అయినా సైబర్ నేరస్తుడు బాధితురాలి అకౌంట్లోని సొమ్మును స్వాహా చేసేశాడు’.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యాంక్ అధికారులు కావాలనే అకౌంట్ను ఫ్రీజ్ చేయడంలో ఆలస్యం చేశారన్న విషయం తెలిసి షాక్ గురయ్యారు. సైబర్ నేరస్తులు బ్యాంక్ అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని, కొట్టేసిన సొమ్ములో వారికీ కమీషన్లు ఇస్తున్నారన్న నిజాలు తెలిసి విస్తుపోయారు. ఝార్ఖండ్, బిహార్ తదితర రాష్ట్రాల్లోని పలు బ్యాంక్లలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అడ్మిని స్ట్రేటర్లు, బ్యాంకర్లు అందరూ నేరస్తులకు సహకరిస్తున్నారని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఒకరు తెలిపారు. జీరో అకౌంట్లయిన జన్ధన్ ఖాతాల్లో రోజుకు రూ.లక్ష, రూ.2 లక్షల లావాదేవీలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని తెలిపారు. బ్యాంకు ఖాతాలలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి దృష్టికి తేవాలి. అధికారులు వాటిని పట్టించుకోకుండా... నేరస్తులకు సహకరిస్తున్నారని ఆయన వివరించారు. చదవండి: మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి నారాజ్! మ్యూల్ అకౌంట్లలోనే లావాదేవీలు.. నిరక్షరాస్యులు, పేదల గుర్తింపు కార్డులతో ఏజెంట్లు నకిలీ(మ్యూల్) అకౌంట్లను తెరిచి, పాస్బుక్, చెక్బుక్, డెబిట్ కార్డ్, ఫోన్ బ్యాంక్ కిట్ మొత్తాన్ని నేరస్తులకు అందజేస్తుంటారు. ఒక్కో ఖాతాకు రూ.25–30 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ బినామీ అకౌంట్లలోనే సైబర్ మోసాల లావాదేవీలను నిర్వహిస్తున్నారు. గుజరాత్, బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి మ్యూల్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటి తాలూకు లావాదేవీలు మాత్రం బిహార్, ఝార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి చేస్తున్నారు. దీంతో కేసు దర్యాప్తులో సైబర్ క్రైమ్ పోలీసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఖాతాదారుల చిరునామాలను ధ్రువీకరించిన తర్వాతే బ్యాంకులు అకౌంట్లను తెరవాలి. లేకపోతే వారి మీద కూడా ఐపీసీ 109 అబాట్మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్లో నమోదయిన ఓ కేసులో బాధితుడి నుంచి కొట్టేసిన రూ.60 లక్షల సొమ్మును నేరస్తులు అసోంకు చెందిన ఒక ఓలా డ్రైవర్ అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఆ డ్రైవర్ నగదును విత్డ్రా చేసి నేరస్తులకు అందించాడు. ఖాతాదారుకు ఆ లావాదేవీ మోసపూరితమైనదని తెలిసినా నేరస్తుడికి సహకరించిన నేపథ్యంలో పోలీసులు ఆ డ్రైవర్పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్ట్ టైం పని అని రూ.3 లక్షలు టోపీ
మైసూరు: పార్ట్ టైం పని ఇప్పిస్తామని నమ్మించి యువతి వద్ద సైబర్ మోసగాళ్లు సుమారు రూ. 3.38 లక్షలను కొట్టేశారు. మైసూరు నగరంలోని కెసరెలో ఈ ఘటన జరిగింది. ఎన్. మైత్రి బాధితురాలు. ఆమె మొబైల్ ఫోన్కు పార్ట్ టైమ్ పని ఉందని గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ నుంచి మెసేజ్ లింక్ వచ్చింది. తరువాత ఆమె వాట్సాప్కు మరో మెసేజ్ వచ్చింది. మీకు పార్ట్ టైమ్ పని కోసం కొన్ని వస్తువులను పంపిస్తాము. మీరు ఇంటి వద్ద ఉండే పని చేసుకోవచ్చు, ఇందుకు కొంత రుసుము చెల్లించాలని మోసగాళ్లు చెప్పారు. వారు చెప్పిన నంబర్కు మైత్రి రూ.100 పంపింది. తరువాత తన బ్యాంకు ఖాతా, ఇతర వివరాలను ఇచ్చింది. వెంటనే ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 3.38 లక్షల నగదు మాయమైంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్కీకి రూ.2.90 లక్షలు మోసం ఐటీ ఇంజనీర్ ఒకరు వెబ్సైట్ ద్వారా సెకెండ్ హ్యాండ్ కారు కొనాలని భారీగా డబ్బు కోల్పోయాడు. ఈ ఘటన మైసూరు నగరంలో చోటు చేసుకుంది. రామకృష్ణ నగరవాసి, టెక్కీ ఎం.మనోజ్ బాధితుడు. ఇతడు కార్వాలె అనే వెబ్సైట్లో తక్కువ ధరకు సెకెండ్ హ్యాండ్ కార్ల కోసం వెతికాడు. అందులో ఒక కారు నచ్చడంతో అక్కడ ఉన్న నంబర్లకు కాల్ చేశాడు. వారు కాల్ ఎత్తకుండా, వాట్సాప్ ద్వారా సమాధానం ఇచ్చారు. వారు లింక్లో పంపినఒక వెబ్సైట్ను తెరిచి అన్ని వివరాలను నమోదు చేశాడు. కారును రూ.2.90 లక్షలకు అమ్ముతామని మోసగాళ్లు చెప్పారు, కారును మైసూరుకు తరలించడానికి రూ.3150 చార్జీ కట్టాలన్నారు. వారు చెప్పినట్లు మనోజ్ ఆన్లైన్లో నగదును చెల్లించాడు. తరువాత ఫోన్ చేయగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఆమె సౌందర్యమే శాపమైంది) -
కొత్త దారిలో సైబర్ మోసగాళ్లు
-
ఓటీపీతో లూటీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన శ్రీనివాస్ హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగి. శనివారం ఉదయం ఆన్ లైన్ డెలివరీ బాయ్ ఫోన్ చేసి ‘సార్ మీకు డెలివరీ వచ్చింది. అడ్రెస్ ఎక్కడ అని అడిగాడు. అదేంటి నేనేమి ఆర్డర్ చేయలేదుగా డెలివరీ రావటం ఏంటని ప్రశ్నచాడు. అవునా అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ చెప్పండని అడిగాడు బాయ్. సరే అని మెసేజ్లోని ఓటీపీ చెప్పాడు. అంతే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలో అమౌంట్ ఖాళీ అయింద్ఙి ... ఇలా డెలివరీ బాయ్ స్కామ్ పేరిట సైబర్ నేరస్తులు లూటీ చేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి మోసాల కేసులు నమోదవుతున్నాయి. ఏమవుతుందో తెలియక బాధితులు ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీ తెలుసుకొని సులభంగా నగదు కొట్టేస్తున్నారు సైబర్ నేరస్తులు. ఎంతో కీలకమైన ఓటీపీలను బాధితుల నుంచి చెప్పించుకునేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు. డార్క్ వెబ్ నుంచి... సైబర్ నేరస్తులు ముందుగానే డార్క్ వెబ్ నుంచి మన ఫోన్ నెంబర్, అది అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత బాధితులకు ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేశారు కదా డెలివరీకి వచ్చాను మీ వీధిలోనే ఉన్నానని చెబుతున్నారు. నేను ఆర్డర్ ఇవ్వలేదని బాధితులు చెప్పగానే అయితే ఓటీపీ చెప్పండి క్యాన్సిల్ చేస్తామని నమ్మిస్తున్నారు. ఓటీపీ చెప్పగానే సెకన్లలో ఫోన్ ను హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు ఓటీపీ అనేది ఆన్ లైన్ లో జరిపే లావాదేవి. అది మీకు మాత్రమే వస్తుంది. కొన్ని సెకన్లు మాత్రమే గడువు ఉంటుంది. ఎవరో పంపిస్తే ఓటీపీ రాదు. తెలియక ఓటీపీ చెప్పారంటే మీ బ్యాంక్ వివరాలు ఇతరులకు మీరే ఇచ్చినట్టు. ఎట్టిపరిస్థితుల్లో ఓటీపీ ఎవరికీ చెప్పకూడదు. – జీ శ్రీధర్, ఏసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ (చదవండి: పదేళ్ల అన్వేషణకు తెర) -
సైబర్ దొంగ భలే స్మార్ట్ గురూ!
బనశంకరి: ఐటీ సీటీలో సైబర్ కేటుగాళ్లు వంచనకు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకొని ఫోన్లు చేసి కేవైసీ, ఆధార్ అనుసంధానం పేరుతో ఓటీపీలు తెలుసుకొని నగదు కొల్లగొట్టేవారు. ప్రస్తుతం కొత్త పంథా అనుసరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయించి ఓటీపీ యాక్సెస్ లేకుండా సులభంగా మీ మొబైల్లో ఉన్న పూర్తిసమాచారం తెలుసుకుని అకౌంట్ నుంచి నగదు కొల్లగొడుతున్నారు. ఇలా సైబర్ వంచకుల బారినపడి లక్షలు పోగొట్టుకున్న బాధితులు సైబర్ క్రైం పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఫోన్పే, గూగుల్పేలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని సరిదిద్దే ముసుగులో వంచకులు మోబైల్ వినియోగదారులకు ఫోన్ చేస్తారు. ప్లేస్టోర్లో అందుబాటులో ఉండే థర్డ్పార్టీ యాప్లైన ఎనీడెస్క్ టీమ్వ్యూవర్హాస్క్, క్విక్సపోర్ట్, రిమోట్డ్రైడ్, ఏర్మిరర్, రిమోట్ కంట్రోలర్ లేదా స్క్రీన్షేర్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. దీంతో వినియోగదారులు యాప్లను డౌన్లోడ్ చేసుకున్న తక్షణం ఆ సెల్ఫోన్ ద్వారా జరిగే కార్యకలాపాలన్నీ వంచకుల చేతిల్లోకి వెళ్లిపోతాయి. దీంతో సులభంగా నెట్బ్యాంకింగ్ సమాచారం, పాస్వర్డ్స్, ప్రముఖ డేటా, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సేకరిస్తారు. బ్యాంకులో నగదు బదిలీకి ప్రయత్నిస్తారు. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీ వినియోగదారుడికి వెళ్లకుండానే వంచకులు తెలుసుకొని నగదు తమ ఖాతాలకు జమ చేస్తారు. బ్లాక్మెయిల్.. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా స్మార్ట్ ఫోన్లను యాక్సెస్ చేసే సైబర్కేటుగాళ్లు మొబైల్స్లోని డేటా, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు దొంగలించి తర్వాత ఫోన్ వినియోగదారులకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తారు. ఇలాంటి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు: ఫోన్పే ఎలాంటి వ్యక్తిగత సమాచారం అడగదు. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్లో ఫోన్పే వినియోగదారులు సహాయవాణి నెంబరు కోసం గాలించరాదు బ్యాంకింగ్ సమస్య లేదా ఏటీఎం వ్యాలిడిటి కొనసాగించే పేరుతో ఫోన్ చేసే వారికి సమాధానం ఇవ్వరాదు ప్లేస్టోర్లో పరిశీలించకుండా ఎలాంటి థర్డ్పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోరాదు మొబైల్లో పరిచయం లేని యాప్లను డిలిట్ చేయాలి ఎవరు ఫోన్చేసి అడిగినా ఓటీపీ, సీవీవీ, పిన్కోడ్ తెలపరాదు ప్రభుత్వం నుంచి లేదా నమ్మకమైన సంస్థ నుంచి అధికారిక యాప్ కాదా అని నిర్ధారించుకోవాలి. (చదవండి: -
ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టాలని..
బనశంకరి (బెంగళూరు): ఆన్లైన్లో కరెంటు బిల్లు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు ఓ మహిళ అకౌంట్ నుంచి రూ.10.76 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7వ తేదీన బెంగళూరులోని కుమారస్వామి లేఔట్ నివాసి డాక్టర్ వాణి ప్రభాకర్ మొబైల్ ఫోన్కు కరెంటు బిల్లు చెల్లించాలని, లేదంటే కనెక్షన్ కట్ అవుతుందని గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన నంబర్కు ఆమె ఫోన్ చేసి విచారించగా.. టీం వ్యూయర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పగా, ఆమె ఇన్స్టాల్ చేసింది. మోసగాళ్లు సూచించిన ఖాతాకు రూ.100 చెల్లించింది. కొద్దిసేపటి తరువాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10.76 లక్షల నగదు వేరే అకౌంట్కు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి విచారించగా డబ్బుపోవడం నిజమేనని తేలింది. దీంతో బాధితురాలు సైబర్క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. -
డీజీపీనీ వదలని సైబర్ నేరగాళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖుల ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్ప డుతున్న సైబర్ నేరగాళ్లు ఈ సారి ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకొని అధికారులు, ప్రజలకు టోకరా వేసే ప్రయత్నం చేశారు. ఓ నంబర్కు మహేందర్రెడ్డి ఫొటో పెట్టి ఒక అధికారికి మెసేజ్ పెట్టారు. వెంటనే ఆ అధికారి అప్రమత్తమై మహేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నైజీరియా నుంచి సైబర్ మోస గాళ్లు ఈ పని చేసినట్లు గుర్తించారు. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ కంపెనీకి ఫిర్యాదు చేసి ఆ సెల్ నంబర్ను బ్లాక్ చేయించినట్టు అధికారులు వెల్ల డించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి ప్రజలకు సూచించారు. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, డీపీల ద్వారా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారని, అలాంటి నంబర్లపై నిఘా పెట్టాలని సూచించారు. -
సైబర్ క్రిమినల్... ట్రిపుల్ యాక్షన్!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. నగరానికి చెందిన ఓ మహిళను మోసం చేయడానికి ఉత్తరాదికి చెందిన ఓ సైబర్ క్రిమినల్ ట్రిపుల్ యాక్షన్ చేశాడు. బాధితురాలి నుంచి ఇప్పటికే రూ.3 లక్షలు కాజేసిన అతగాడు మరో రూ.13 లక్షల కోసం బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె సోమవారం సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేసింది. బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ మానసిక నిపుణురాలు. వివాహిత అయినప్పటికీ కొన్నాళ్ల క్రితం అనివార్య కారణాలతో భర్తకు దూరంగా ఉంటోంది. ఈమెకు ఫేస్బుక్ ద్వారా సుమిత్ సిరోహి అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసింది రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడిగా తెలుస్తోంది. నగర మహిళ, సుమిత్ కొన్నాళ్లు ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు. ఆపై ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని వాట్సాప్లోనూ సంప్రదింపులు జరిపారు. తాను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఎస్సైగా సుమిత్ పరిచయం చేసుకున్నాడు. ఒకటి–రెండుసార్లు బాధితురాలితో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడాడు. ఆ సందర్భాల్లో యూనిఫాంలో ఉండి, వెనుక పోలీసులు కనిపించే చేసి ఈమెను పూర్తిగా నమ్మించాడు. అలా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి పదోన్నతి వచ్చాక చేసుకుందామని ఎర వేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఫేస్బుక్ ద్వారానే బాధితురాలికి రవి కపూర్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసి, బాధితురాలిని పరిచయం చేసుకున్నదీ సుమిత్గా చెప్పుకున్న సైబర్ నేరగాడే. ఈమెతో చాటింగ్ చేసిన ఇతగాడు ముంబైలో నివసించే తాను ఓ బాలీవుడ్ ప్రముఖుడినని చెప్పాడు. దీంతో సుమిత్కు పదోన్నతి కల్పించాలని ఆమె రవిని కోరింది. అందుకు అంగీకరించిన అతడు సుమిత్ను తనకు పరిచయం చేయమని చెప్పాడు. దీంతో ఇతడి నెంబర్ సుమిత్కు ఇచ్చిన మహిళ ఆయనతో మాట్లాడమని చెప్పింది. ఆ తర్వాత ఈమెకు కాల్ చేసిన రవి పదోన్నతి ఇప్పించడానికి రూ.20 లక్షలు ఖర్చవుతాయని చెప్పాడు. ఇతడు మాత్రం వీడియో కాల్స్ చేయలేదు. ఇదే విషయం సుమిత్కు చెప్పిన బాధితురాలు వీలైనంత ఏర్పాటు చేయమంది. అయితే తన వద్ద కేవలం రూ.13 లక్షలు ఉన్నాయని, ఆ మొత్తం నీకు పంపిస్తానని చెప్పాడు. మిగిలింది కలిపి రవికి పంపాలని, మనం తర్వాత చూసుకుందామని నమ్మించాడు. ఏ దశలోనూ రవి పేరుతోనూ మాట్లాడుతున్నది తానే అని ఈమెకు తెలియనీయలేదు. వివిధ దఫాల్లో రూ.13 లక్షల్ని గూగుల్ పే ద్వారా నగర మహిళకు పంపిన సుమిత్ దానికి మరికొంత జోడించి రవికి పంపాలన్నాడు. ఇది నమ్మిన బాధితురాలు తన బంగారం కుదువపెట్టి రూ.3 లక్షలు జోడించింది. ఈ రూ.16 లక్షల్ని రవి అనే వ్యక్తి చెప్పిన ఖాతాకు పంపింది. ఇలా రెండు పాత్రల్ని పోషించిన సైబర్ నేరగాడు డబ్బు చేతికి అందాక మూడో అవతారం ఎత్తాడు. రవి కపూర్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగిగా బాధితురాలికి పరిచయమయ్యాడు. పదోన్నతికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని రోజులు చెప్పాడు. ఆపై హఠాత్తుగా ఫోన్ చేసి రవి కపూర్ హార్ట్ ఎటాక్తో చనిపోయాడన్నాడు. ఆపై అతడి ఫోన్ పని చేయలేదు. ఈ విషయాన్ని బాధితురాలు సుమిత్కు చెప్పింది. ఇలాంటి సందర్భం కోసమే ఇంత కథ నడిపిన సైబర్ నేరగాడు అప్పుడు అసలు ఘట్టం మొదలెట్టాడు. తనకు రవి ఎవరో తెలియదని, నీవే పరిచయం చేశావంటూ ఆరోపించాడు. రూ.13 లక్షలు సైతం నేను నీకే పంపానని, ఆ మొత్తం నువ్వే తిరిగి ఇవ్వాలని బెదిరించాడు. అలా చేయకుంటే ఇంటికి వచ్చి గొడవ చేయడంతో పాటు కేసు పెడతానంటూ భయపెట్టాడు. దీంతో బాధితురాలు సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ మూడు పాత్రలు పోషించింది ఒకే సైబర్ నేరగాడని, అతడి ముఠా సభ్యలు సహకరించారని తేల్చారు. వీరిని పట్టుకోవడానికి సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు. (చదవండి: చుక్కలు చూపించింది! పెళ్లి చేసుకున్న నెలకే గెంటేసి....) -
నెలలోనే 2,500 నకిలీ వేలిముద్రలు.. రూ. 40 లక్షలు హాంఫట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు తెలివిమీరి పోయారు. క్రెడిట్, డెబిట్ కార్డ్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్లు, ఆన్లైన్ సర్వీస్లు ఇలా రకరకాలుగా మోసాలు చేస్తున్న వీరు.. తాజాగా వేలిముద్రలతో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడం మొదలుపెట్టారు. నెల రోజుల్లోనే 2,500 నకిలీ ఫింగర్ ప్రింట్స్ సృష్టించి రూ.40 లక్షల కాజేశారు. రెండున్నరేళ్లుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా కొట్టేసిన సొమ్ము రూ.వందల కోట్లలోనే ఉంటుందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ శింగెనవర్తో కలిసి గురువారం వివరాలు వెల్లడించారు. వెబ్సైట్లోకి వెళ్లి.. ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన నల్లగల్ల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశ్కు రిజిస్ట్రేషన్, బ్యాంకింగ్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. ఈ క్రమంలో తన మకాంను నగరంలోని బీరంగూడకు మార్చాడు. ఆధార్ నంబర్, వేలిముద్రల సహాయంతో బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును ఎలా కాజేయవచ్చో పరిశోధించిన వెంకటేశ్.. నకిలీ గుర్తింపు కార్డ్తో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) లైసెన్స్ను పొందాడు. ఏఈపీఎస్ సేవలను పొందేందుకు అవసరమైన ఆధార్ నంబర్, ఫింగర్ ప్రింట్స్ను పక్క రాష్ట్రానికి చెందిన రిజిస్ట్రేషన్, స్టాంప్స్ వెబ్సైట్లోకి వెళ్లి.. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునేవాడు. నకిలీ వేలి ముద్రల తయారీ ఇలా.. రిజిస్ట్రేషన్ విభాగం నుంచి డౌన్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్లలోని వేలి ముద్రలను ఎక్స్ఎల్, వర్డ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుని ఫొటో షాప్లో వేలిముద్రలు స్పష్టంగా వచ్చేలా డెవలప్ చేసి, దాన్ని బటర్ పేపర్ మీద ప్రింట్ తీసి.. పాలీమర్ లిక్విడ్ పోస్తారు. లిక్విడ్ ఎండిపోవటం కోసం నెయిల్ డ్రయ్యర్ యూవీ లైట్ ల్యాంప్ అనే మిషన్ కింద నకిలీ ముద్రలను ఉంచుతారు. దీంతో నాలుగు నిమిషాల్లో నకిలీ రబ్బర్ వేలిముద్రలు తయారవుతాయి. నకిలీ గుర్తింపు కార్డ్లతో ఏఈపీఎస్ లైసెన్స్.. రాయ్నెట్ అనే కంపెనీ బ్యాంక్లకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) సేవలను అందిస్తుంది. దీని నుంచి 2019లో కొందరు వ్యక్తులు ఈపాయింట్ ఇండియా పేరుతో ఫ్రాంచైజీ తీసుకున్నారు. బిజినెస్ కరస్పాండెట్లను నియమించుకొని గ్రామాల్లో యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, బ్యాంకింగ్ సేవలను అందించడం వీళ్ల పని. ఈ క్రమంలో వెంకటేశ్ నకిలీ గుర్తింపు కార్డ్లను సమర్పించి గత నెల 4న ఏఈపీఎస్ లైసెన్స్ పొందాడు. దీంతో ఇతనికి ఈపాయింట్ ఇండియా యూజర్ ఐడీ, పాస్వర్డ్లను కేటాయించింది. దీని ద్వారా ఎవరైనా సరే యూటిలీటీ బిల్లుల చెల్లింపులు, నగదు డ్రా, బదిలీ వంటి అన్ని రకాల బ్యాంక్ సేవలను వినియోగించుకోవచ్చు. నగదు ఎలా కొట్టేస్తారంటే.. ఈపాయింట్ ఇండియా యాప్లో ఆధార్ నంబర్ను నమోదు చేసి, నకిలీ రబ్బర్ వేలిముద్రను పెడతారు. ఒకవేళ ఆధార్ నంబర్కు బ్యాంక్ ఖాతా నమోదై ఉంటే ప్రొసీడింగ్ అని వస్తుంది. లేకపోతే రాదు. ఇలా నిందితులు అన్ని బ్యాంక్లను పరిశీలించుకుంటూ పోతారు. ఎప్పుడైతే ప్రొసీడింగ్ అని వస్తుందో ఓకే నొక్కగానే ఆ ఆధార్ నంబర్కు లింకై ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్, పేరు, ఎంత బ్యాలెన్స్ ఉందో అన్ని వివరాలు తెలిసిపోతాయి. వెంటనే ఆ బ్యాంక్ ఖాతా నుంచి నిందితులకు చెందిన అకౌంట్లకు నగదును బదిలీ చేసుకుంటారు. సాధారణంగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా నగదు బదిలీ చేయాలంటే ఓటీపీ, డబుల్ అథంటికేషన్ ఉంటుంది. కానీ ఏఈపీఎస్లో అలా ఉండదు. ఇదే నిందితులకు వరంగా మారింది. కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో కేసులు.. ప్రస్తుతానికి ఈ గ్యాంగ్పై సైబరాబాద్లో రెండు, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లోని ఒక్కో కేసు నమోదయ్యాయి. సైబరాబాద్లో 149 బ్యాంక్ ఖాతాల నుంచి రూ.14,64,679 నగదును నిందితులు కాజేశారు. వెంకటేశ్తో పాటు అతనికి సహకరించిన మేఘావత్ శంకర్ నాయక్, రత్నం శ్రీనివాస్, దర్శనం సామేలు, చల్లా మణికంఠ, షేక్ ఖాసిం, విశ్వనాథుల అనిల్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.3.4 లక్షల నగదు, ల్యాప్టాప్, కారుతో పాటు 2,500 నకిలీ వేలిముద్రలు, 121 సిమ్ కార్డ్లు, 20 ఫోన్లు, 13 డెబిట్ కార్డ్లు, పాన్ కార్డ్, రెండు ఆధార్ కార్డ్లు, 3 రూటర్లు, 4 బయోమెట్రిక్ ఫ్రింగర్ ప్రింట్ స్కానర్లు, 3 పెన్ డ్రైవ్లు, 4 కిలోల పాలీమర్ లిక్విడ్, 3 కిలోల ప్రీమర్ లిక్విడ్ బాటిళ్లు, యూవీ నెయిల్ ల్యాంప్, రెండు ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్స్ ఇతరత్రా వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
యూట్యూబ్లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం!
మీరు బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా? అందుకోసం యూట్యూబ్లో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీ వీడియో ప్రిడిక్షన్ను నమ్ముతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. యూట్యూబ్లో ఎలన్ మస్క్ స్కామ్ జరుగుతోంది. జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిట్కాయిన్లపై ఎంతమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి? ఎంత ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ రోజుల్లో భారీ లాభాల్ని ఎలా అర్జిస్తామో? వివరిస్తూ ఎలన్ మస్క్కు చెందిన వీడియోలు, టెస్లా యూట్యూబ్ ఛానల్కు చెందిన వీడియోలతో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతోంది. వాస్తవానికి ఆ లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించేది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈజీ మనీ కోసం కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్న సైబర్ నేరస్తులే ఆ వీడియోల్ని టెలికాస్ట్ చేస్తున్నట్లు తేలింది. ఎలన్ మస్క్ వీడియోలతో లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించి కేటుగాళ్లు భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. ఫేక్ క్రిప్టో ట్రేడింగ్ వెబ్సైట్లను తయారు చేస్తున్నారు. ఎలన్ మస్క్ చెప్పినట్లుగా ఆ వెబ్సైట్లో క్రిప్టో ట్రేడింగ్ నిర్వహిస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులవ్వొచ్చని నకిలీ యాడ్స్తో ఊదరగొట్టేస్తున్నారు. దీంతో టెక్నాలజీ సాయంతో ఎలన్ మస్క్ వీడియోల్ని ప్రసారం చేయడంతో ఇన్వెస్టర్లు పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. అలా వారం రోజుల వ్యవధిలో బిట్ కాయిన్లపై పెద్దమొత్తంలో 23 ట్రాన్సాక్షన్లు, ఎథేరియంపై 18 ట్రాన్సాక్షన్లు నిర్వహించారు. ఇలా 243,000 డాలర్లు మోసపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విచిత్రం ఏంటంటే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ క్రిప్టో ట్రేడింగ్ నిజమని నమ్మి ప్రముఖ చిలీ సంగీతకారుడు ఐసాక్ సైతం మోసపోయాడు. లైవ్ స్ట్రీమింగ్ వీడియో లింకుల్ని క్లిక్ చేయడంతో హ్యాకర్లు ఐసాక్ య్యూట్యూబ్ ఛానల్ను హ్యాక్ చేశారు. తాము అడిగినంత ఇస్తే ఛానల్ను తిరిగి ఇచ్చేస్తామంటూ ఐసాక్ను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో తన పేరుమీద జరుగుతున్న మోసాలపై ఎలన్ మస్క్ స్పందించారు. తన వీడియోలు, టెస్లా యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ వీడియోలతో తన పేరుతో స్కామర్లు అమాయకుల్ని దోచుకుంటున్నారని, అలాంటి స్కామ్ యాడ్స్ను యూట్యూబ్ సంస్థ కట్టడి చేయలేకపోతుందంటూ మండిపడ్డారు. వెంటనే లైవ్ స్ట్రీమింగ్ వీడియోలపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేయాలని ఎలన్ మస్క్ యూట్యూబ్కు విజ్ఞప్తి చేశారు. చదవండి👉 ‘ఇదే..తగ్గించుకుంటే మంచిది’! -
ఆర్థిక మోసాలు.. నయా రూటు!
గతంలో మాదిరి కాకుండా, నేడు దాదాపు అన్ని రకాల ఆర్థిక సేవలను డిజిటల్ రూపంలో ఉన్న చోట నుంచే కదలకుండా పొందే సౌలభ్యం ఉంది. చెల్లింపులను డిజిటల్గా చేస్తున్నాం. మొబైల్ నుంచే షాపింగ్ చేస్తున్నాం. కొన్ని క్లిక్లతో ఇన్స్టంట్గా రుణాలు తీసుకుంటున్నాం. యాప్ నుంచి అవతలి వ్యక్తికి క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నాం. దీంతో ఈ డిజిటల్ వేదికల్లోని కీలక సమాచారం నేరస్థులకు ఆదాయ వనరుగా మారిపోయింది. మోసాలకు వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందుకే ’నాకు తెలుసులే‘ అని అనుకోవద్దు. ఎంత తెలివితనం ఉన్నా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో వచ్చి నిండా ముంచేస్తున్నారు. మోసాలకు నమ్మకమే మూలం. మోసపోయిన తర్వాత కానీ, అర్థం కాదు అందులోని లాజిక్. తాము అవతలి వ్యక్తిని ఏ విధంగా నమ్మి మోసపోయామో? బాధితులను అడిగితే చెబుతారు. అవగాహనే మోసాల బారిన చిక్కుకోకుండా కాపాడుతుంది. ఈ తరహా పలు కొత్త మోసాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఫోన్ కాల్ వెరిఫికేషన్ టీకాల రూపంలోనూ మోసం చేస్తారని ఊహించగలమా? స్థానిక హెల్త్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నామని, ఇంటికే వచ్చి టీకాలు ఇస్తున్నట్టు మీకు కాల్ వస్తే తప్పకుండా సందేహించాల్సిందే. ఇంటికే వచ్చి కరోనా టీకాను ఇస్తామని.. ఇందుకు ఎటువంటి చార్జీ ఉండదని చెబుతారు. ఇందుకోసం చిరునామా, మొబైల్ నంబర్, పాన్, ఆధార్తో ధ్రువీకరిస్తే చాలని చెబుతారు. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ చెబితే ధ్రువీకరణ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇదే ఓటీపీని ఇంటికి వచ్చి టీకా ఇచ్చే వైద్య సిబ్బందికి కూడా చెప్పాల్సి ఉంటుందని సూచిస్తారు. మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని మీరు చెప్పిన తర్వాత ఆ కాల్ను డిస్కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్కు.. బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ నుంచి రుణ దరఖాస్తును ఆమోదించామంటూ ఎస్ఎంఎస్ రావచ్చు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో రుణం మొత్తాన్ని ఆయా బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థ మంజూరు చేయడం కూడా పూర్తి కావచ్చు. ఈ మొత్తాన్ని మీకు కాల్ చేసిన వాళ్లు అప్పటికే తీసేసుకోవడం కూడా పూర్తయి ఉంటుంది. ఫోన్ కాల్ చేసి, ఆధార్, పాన్, చిరునామా వివరాలు తీసుకుంటున్నారంటే అది మోసపూరిత కార్యక్రమమే అని గుర్తించాలి. అధికారికంగా ఎవ్వరూ ఆ వివరాలు అడగరు. ఏంటి మార్గం..? ఆధార్, పాన్ ఈ తరహా వ్యక్తిగత, కీలకమైన వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. వీటి సాయంతో ఓటీపీ రూపంలో రుణాలను తీసుకునే మోసాలు పెరిగిపోయాయి. ఓటీపీ పేరుతో మొబైల్కు వచ్చే ఎస్ఎంఎస్ను పూర్తిగా చదవాలి. ఆ ఓటీపీ దేనికోసం అన్నది అందులో క్లుప్తంగా ఉంటుంది. అందులో లోన్అప్లికేషన్ అని ఏమైనా ఉంటే, వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సదరు బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు ఫీజు ఎత్తివేత 2021 చివరికి 6.9 కోట్ల క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. పట్టణాల్లోని చాలా కుటుంబాలకు కనీసం ఒక క్రెడిట్ కార్డు అయినా ఉంది. క్రెడిట్ కార్డులు వార్షిక నిర్వహణ పేరుతో ఫీజు వసూలు చేస్తుంటాయి. అయినా, వార్షిక ఫీజుల్లేవంటూ క్రెడిట్ కార్డులను ఆయా సంస్థలు మార్కెటింగ్ చేసుకుంటాయి. అది మొదటి ఏడాది వరకేనన్న సూక్ష్మాన్ని ఆయా సంస్థలు చెప్పవు. రెండో ఏడాది నుంచి వార్షిక ఫీజు బాదుడు మొదలవుతుంది. దీన్ని కూడా సైబర్ నేరస్థులు దోపిడీకి మార్గంగా ఎంపిక చేసుకున్నారు. జీవితకాలం పాటు ఎటువంటి వార్షిక ఫీజులేని ఉచిత క్రెడిట్ కార్డు ఇస్తున్నామంటూ సంప్రదిస్తారు. తాము ఫలానా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని నమ్మిస్తారు. అప్పటికే వార్షిక ఫీజు చెల్లిస్తున్న వారిని దాన్ని ఎత్తివేస్తామంటూ బురిడీ కొట్టిస్తారు. వారి మాటలకు మనం స్పందించే విధానం ఆధారంగా మొత్తం అంచనా వేస్తారు. తర్వాత తాము సూచించినట్టు చేయాలంటూ తమ పని మొదలు పెడతారు. ముందు క్రెడిట్ కార్డు నంబర్, దానిపై ఉన్న పేరు చెబుతారు. దాంతో నమ్మకం ఏర్పడేలా చేస్తారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నారు కనుకనే తమ కార్డు వివరాలు తెలుసని భావిస్తాం. కానీ, ఆ వివరాలను వారు అక్రమ మార్గాల్లో సంపాదించారన్నది మనకు తెలియదు. ఇవన్నీ అయిన తర్వాత వారికి అసలైన ఓటీపీ అవసరంపడుతుంది. జీవిత కాలం పాటు క్రెడిట్ కార్డు ఫీజును ఎత్తివేయాలనుకుంటే అందుకు మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలని చెబుతారు. మొబైల్ నంబర్కు ఓటీపీ పంపిస్తారు. మొబైల్కు వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పిన వెంటనే.. క్రెడిట్ కార్డు ఫీజు రద్దయినట్టు చెప్పి కాల్ కట్ చేసేస్తారు. ఇక ఆ తర్వాత మొబైల్కు వరుసగా వచ్చే డెబిట్ లావాదేవీల ఎస్ఎంఎస్లు చూసిన తర్వాత కానీ, మోసం జరిగినట్టు అర్థం కాదు. స్పందించేలోపే ఉన్న మొత్తాన్ని వారు ఊడ్చేస్తారు. ఏంటి మార్గం..? తెలియని వ్యక్తులు కాల్ చేసి, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు గురించి మాట్లాడుతుంటే వెంటనే డిస్ కనెక్ట్ చేసేయాలి. వారితో చర్చించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులకు కాల్ చేస్తే, విషయం చెప్పి పెట్టేస్తారే కానీ, సున్నితమైన సమాచారం, వివరాలను చెప్పాలని కోరరు. పైగా బ్యాంకు ఉద్యోగి కార్డు వివరాలను చెప్పే ప్రయత్నం అసలు చేయరు. ఒకవేళ ఎవరైనా కాల్ చేసి, మీ క్రెడిట్ కార్డు వివరాలు చెబుతుంటే వెంటనే ఆ కాల్ను కట్ చేయాలి. బ్యాంకు యాప్లోకి వెళ్లి కార్డు ఆన్లైన్ లావాదేవీల యాక్సెస్ను, అంతర్జాతీయ యాక్సెస్ ను తాత్కాలికంగా నిలిపివేయాలి. మీకు తెలియకుండా క్రెడిట్ కార్డు వివరాలు సంపాదించినప్పటికీ.. మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ లేకుండా అందులోని బ్యాలన్స్ను వారు ఖాళీ చేయడం అసాధ్యం. అందుకుని ఓటీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దు. కుక్క పిల్లనీ వదలరు.. హైదరాబాద్ వాసి శాంతి (33)కి పెట్స్ అంటే పంచ ప్రాణాలు. పెళ్లయి ఏడేళ్లు అయినా ఇంత వరకు కుక్క పిల్లను పెంచుకోవాలన్న కోరిక నెరవేరలేదు. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అయినా తనకు కుక్కపిల్ల తెచ్చి ఇవ్వాలని భర్తను కోరింది. ఆమె భర్తకు ఫేస్బుక్లో ‘ఇంటి వద్దకే పెట్స్ డెలివరీ’ పేరుతో పోస్ట్ కనపడింది. ఆ వివరాలు తీసుకొచ్చి పెళ్లానికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ నంబర్ కు కాల్ చేసి మాట్లాడింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు. రాజస్తాన్లో ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో తన సెంటర్ ఉందని.. కరోనా కారణంగా తన వద్ద భారీ సంఖ్యలో కుక్కలు ఉండిపోయినట్టు ఒక ఆసక్తికరమైన స్టోరీ చెప్పాడు. వాట్సాప్కు వీడియోలు పంపిస్తాను చూడండి అని కోరాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్ లో వచ్చిన వీడియోలు చూసిన తర్వాత శాంతికి ఆరాటం ఆగలేదు. వెంటనే కుక్కపిల్లకు ఆర్డర్ చేసేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే వీడియోల్లోని కుక్క పిల్లలు అంత క్యూట్గా ఉన్నాయి. మార్కెట్ ధర అయితే ఒక్కో పెట్కు రూ.45,000–50,000 ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో కుక్క పిల్లలు ఉండిపోయినందున ఒకటి రూ.5,000కు ఇస్తానని రాజస్తాన్ కేటుగాడు ఆఫర్ ఇచ్చాడు. అడ్వాన్స్కింద ముందు రూ.2,000 పంపించాలని కోరాడు. రసీదు కూడా ఇస్తానన్నాడు. డెలివరీ సమయంలో మొత్తం చెల్లిస్తానని ఆమె చెప్పడంతో నో అన్నాడు. దాంతో రూ.500 పంపించింది శాంతి. ఆమె పేరుతో రసీదు ప్రింట్ చేసి వాట్సాప్ చేశాడు. వారం రోజుల్లో పెట్ను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారని.. ఆర్మీ వ్యాన్లో రవాణా చేస్తున్నామంటూ ఒక నకిలీ వీడియో పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. డెలివరీ తేదీ వచ్చినా అవతలి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాలేదు. దాంతో ఉండబట్టలేక శాంతి కాల్ చేసింది. ఈ రోజు పెట్ వస్తుందని, గంటలో డెలివరీ వాళ్లు కాల్ చేస్తారని చెప్పాడు. అన్నట్టు గంటలోపే ఒక కొత్త నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీరు డీల్ చేసిన వ్యక్తి మోసగాడని, మిమ్మల్ని మోసం చేశాడంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. వాట్సాప్ లో తాము కోరిన వివరాలన్నీ ఇస్తే ఫిర్యాదు దాఖలు చేస్తామని స్టోరీ వినిపించాడు. ఇదే విషయం ఆమె తన భర్తతో చెప్పింది. అవేమీ చేయకు.. ఇక వదిలేసెయ్ అని అతడు చెప్పాడు. ఇంతకీ వాట్సాప్ లో ఫిర్యాదు కోసం కోరిన వివరాలు ఏవి అనుకున్నారు..? బాధితుని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, నష్టపోయిన మొత్తం, అకౌంట్ నంబర్/ వ్యాలెట్ నంబర్/ యూపీఐ నంబర్, బ్యాంకు ఖాతా లేదా గూగుల్ పే అయితే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్.. ఈ వివరాలన్నీ పంపాలని కోరాడు. అవి కనుక ఇచ్చి ఉంటే.. ఆ ఖాతా లేదా కార్డులోని బ్యాలన్స్ అంతటినీ.. ఓటీపీ కనుక్కుని మరీ మోసగాళ్లు ఊడ్చేసేవాళ్లు. శాంతి భర్తకు చెప్పడం.. అతను ఊరుకోమని చెప్పడంతో మోసం రూ.500కే పరిమితం అయింది. ఆన్లైన్లో తెలియని వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం, తెలియని వారికి డబ్బులు పంపించకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం. అసలు వారితో ఆయా అంశాలు చర్చించవద్దు. నకిలీ రూపాలు.. రోడ్డు పక్కన అంబరెల్లా టెంట్ వేసుకుని మార్కెటింగ్ చేసే వ్యక్తుల పట్ల కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్, బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీల ఉద్యోగులుగా మోసగాళ్లు రూపాలు మారుస్తున్నారు. టెంట్ వేసుక్కూర్చుని తమ వద్దకు విచారణకు వచ్చిన వారిని నిండా ముంచుతున్నారు. వారి వద్దకు వెళ్లి మీరే స్వయంగా విచారించినా.. లేక పక్క నుంచి వెళుతున్నా ఆకర్షణీయ కరపత్రంతో వారు పలకరిస్తారు. తాను ఫలానా బ్యాంకు లేదా బీమా కంపెనీ ఉద్యోగినని.. జీరో బ్యాలన్స్ ఖాతా లేదా.. కొత్త బీమా ప్లాన్ను ఆవిష్కరిస్తున్నామని చెబుతారు. ఈ రోజే ప్లాన్ కొనుగోలు చేస్తే ప్రీమియంలో భారీ రాయితీ ఇస్తామని ఆశ చూపుతారు. కుటుంబం మొత్తానికి రూ.15 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.5,000 కడితే చాలని చెబుతారు. ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి కావాలని అడిగితే.. మరో రూ.1,000 డిస్కౌంట్ ఇస్తామని, ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఆఫర్ ఉండదంటూ ఆలోచనలో పడేస్తారు. ఏదో విధంగా ఒప్పించి ప్రీమియం కట్టించుకోవడం కోసమే వారు అక్కడ కూర్చున్నారని మనకు అర్థం కాదు. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ రెండు వారాల్లో ఇంటికి వస్తుందని.. నచ్చకపోతే అప్పుడు రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం వెనక్కి వస్తుందని పాలసీ తీసుకునేలా చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి రసీదును కూడా ఇస్తారు. కానీ, అదంతా మోసమన్నది నష్టపోయిన తర్వాత కానీ అర్థం కాదు. ఏంటి మార్గం..? రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, స్టాల్స్ పెట్టుకుని ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే వారిని నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి ఆఫర్ అనిపిస్తే ఆ ఉద్యోగి పేరు, ఉద్యోగి గుర్తింపు ఐడీ వివరాలు తీసుకుని బీమా కంపెనీకి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. బీమా పాలసీలు అయినా, క్రెడిట్ కార్డు అయినా, బ్యాంకు ఖాతా అయినా.. మరొకటి అయినా నేరుగా ఆయా బ్యాంకు, బీమా సంస్థల శాఖల నుంచి లేదంటే ఆన్లైన్ పోర్టల్కు వెళ్లి తీసుకోవడమే సురక్షితం. బయట ఇలా మార్కెటింగ్ వ్యక్తుల రూపంలో మంచి ఆఫర్ కనిపిస్తే దాన్ని బ్రాంచ్కు వెళ్లి నిర్ధారించుకుని తీసుకోవాలి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగత ఖాతా లేదా నంబర్కు నగదు బదిలీ చేయవద్దు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. డబ్బులు కొట్టేశారా..! ఆన్లైన్ లేదా టెలిఫోన్ కాల్ రూపంలో ఓటీపీ తీసుకుని మీ కార్డు/వ్యాలెట్లోని డబ్బు లు కొట్టేసినట్టు గుర్తించారా? ఆలస్యం చేయ కండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి జరిగిన ఘటన వివరాలపై ఫిర్యాదు చేయండి. అలాగే. https://cybercrime.gov.in లాగిన్ అయ్యి మోసానికి సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను అప్లోడ్ చేయాలి. అనంతరం కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ పోర్టల్ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం వెళుతుంది. దాంతో సైబర్ నేరస్థుల ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి బాధితుల ఖాతాలకు జమ చేస్తారు. అయితే, ఎంత వేగంగా ఫిర్యాదు చేశారన్న దాని ఆధారంగానే రికవరీ ఆధారపడి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బదిలీ చేసుకున్న మొత్తాన్ని వెంటనే డ్రా చేసుకుంటే రికవరీ కష్టమవుతుంది. -
కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్ ఖతం
రెండు రోజుల క్రితం కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’సినిమా లింక్ వచ్చింది. సినిమా చూడాలన్న ఆసక్తితో చాలామంది లింక్ ఓపెన్ చేశారు. రెండు నిముషాలు సినిమా వచ్చింది. తర్వాత కొత్త లింక్ రావడంతో కొందరు దాన్ని క్లిక్ చేశారు. అంతే బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమైంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నారు. కడపలోని ఏడు రోడ్ల కూడలిలోని ఓ మొబైల్ షాపునకు ఇద్దరు యువకులు వచ్చి ఫోన్ కొన్నారు. ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించారు. ‘అమౌంట్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ’ అంటూ రావడంతో మొబైల్ షాపు యజమాని ఓకే అన్నారు. తర్వాత చెక్ చేస్తే ఒక్క పైసా అమౌంటు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. తీరా చూస్తే నకిలీ ఫోన్ పే యాప్ ద్వారా చెల్లంపులు చేశారని తేలింది. తెలంగాణలో మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు మెయిల్కు ఓ లింక్ వచ్చింది. సిబ్బంది దాన్ని క్లిక్ చేశారు. అంతే బ్యాంకులోని సొమ్ము మాయమైంది. ఇందులో బ్యాంకు సిబ్బందితోపాటు నైజీరియా దేశస్తులను తెలంగాణ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. సాక్షి, కడప కార్పొరేషన్/అర్బన్: మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఆన్లైన్ మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. వివిధ మార్గాల్లో వేలకు వేలు కొల్లగొడుతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నట్టుండి డబ్బు మాయమై పోతోంది. చివరకు ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్లు కూడా నకిలీవి సృష్టించి మోసం చేస్తున్నారు. అమాయకులకు వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారాగానీ, నంబర్ల నుంచిగానీ నేరుగా వెబ్సైట లింకులు పంపించడం, వాటిని నొక్కితే ఖాతాల నుంచి డబ్బు మాయమవడం పరిపాటిగా మారింది. ఇలాంటి మోసాలపై బ్యాంకు మేనేజర్లకు పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కడపలోని ఓ బ్యాంకులో నెల రోజుల వ్యవధిలోనే 50 ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకుల్లో భద్రమనుకుంటే... బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయో, రావోనన్న భయం. ఇంట్లో భద్రం కాదని అనుమానంతో బ్యాంకుల్లోనే దాచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ అక్కడ కూడా భద్రత ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. ఒకవైపు డిజిటల్ సేవలు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ మొబైల్ సేవల కోసం వెళితే డబ్బులు ఎగిరిపోతున్నాయి. దీనిపై బ్యాంకులను, పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం ఉండటం లేదు. 2021లో యోనో కేవైసీ, ఫేక్ మనీ యాప్స్, ఫ్లిప్కార్ట్ లాటరీ, గిఫ్ట్ మనీ, క్రెడ్ యాప్, ఓటీపీ, ఇన్స్రూె ఓఎల్ఎక్స్, జాబ్, ఏనీ డెస్క్ వంటి వాటి ద్వారా 326 మంది రూ.50.04లక్షలు మోసపోయారు. ఎఫ్ఐఆర్ వరకూ రాని సంఘటనలు చాలానే ఉన్నాయి. ఏఈపీఎస్ ద్వారా కూడా మోసాలు సైబర్ నేరగాళ్లు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు మాసాల్లో దీని ద్వారా మోసపోయిన బాధితులు చాలా మంది ఉన్నారు. ఏటీఎం సౌకర్యం లేని ప్రాంతాల్లో నగదును తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏఈపీఎస్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫింగర్ ప్రింట్ సాయంతో రోజుకు రూ.10వేల వరకూ డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో సైబర్ నేరగాళ్లు రూపాల్లో ప్రజల వేలిముద్రలు సేకరించి ఏఈపీఎస్ ద్వారా డబ్బులు దోచేçస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి చేయొద్దు ►కొత్త నంబర్ల నుంచి వచ్చే వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయకూడదు. ►ఎవరైనా క్యాష్ ఇవ్వండి. ఫోన్ పే చేస్తామని అడిగితే నిరాకరించండి. నకిలీ యాప్ ద్రావా పంపితే అమౌంట్ వచ్చినట్లు చూపుతుంది. కానీ మన ఖాతాలో జమ కాదు. ►ఇటీవల హిట్ అయిన సినిమాల పేర్లతో లింకులు వస్తున్నాయి. వీటిని క్లిక్ చేయడం వల్ల మన ఖాతాల్లో డబ్బు మాయమవుతుంది. ►మన ఫోన్ ఇతరులకు ఇవ్వొద్దు. క్యూఆర్ కోడ్ వంటి వివరాలను వారి ఫోన్ సాయంతో తస్కరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ►ఆన్లైన్ బ్యాంకింగ్, పేమెంట్ యాప్లకు సంబంధించిన పాస్వర్డ్లు గోప్యంగా ఉంచుకోవాలి. ►ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్వర్డ్లు నమోదు చేయకూడదు. బ్యాంకులు లింకులు పంపవు చాలాసార్లు పాన్కార్డు, ఆధార్కార్డు లింక్ కాలేదని బ్యాంకుల పేరుతో లింకులు వస్తుంటాయి. కానీ ఏ బ్యాంకులు అలా చేయవు. అలా వచ్చాయంటే నకిలీవని గుర్తించాలి. తెలియని కాల్స్, మెయిల్స్పై క్లిక్ చేయవద్దు. వెబ్సైట్ ద్వారా ఆధార్ను లాక్ చేసుకోవాలి. రుణాలు ఇస్తామని, క్రెడిట్, డెబిట్ కార్డు గడువు తీరిపోయాయని ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగితే చెప్పకూడదు. – దుర్గాప్రసాద్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి లింక్లు క్లిక్ చేయవద్దు. సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తుల మెసేజ్లకు స్పందించవద్దు. ముఖ్యంగా బ్యాంకుల పేరుతో వచ్చే కాల్స్కు, ఓటీపీలు చెప్పవద్దు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేశాం. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – కేకేఎన్ అన్బురాజన్, వైఎస్సార్ జిల్లా ఎస్పీ -
కియాలో డీలర్షిప్ ఇస్తామంటూ మోసం
హిమాయత్నగర్: ప్రముఖ కార్ల కంపెనీ కియా ఇండియా డీలర్షిప్ నీదేనంటూ గుడిమల్కాపూర్కు చెందిన ఓ వ్యాపార వేత్తకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. పలు డాక్యుమెంట్ల రూపంలో అతడి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేశారు. డీలర్షిప్ ఇవ్వకపోవడంతో సోమవారం బాధితుడు సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఏ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రమణకుమార్ కియా కార్ల డీలర్షిప్ కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు. దీంతో ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేసి తాను కియా కంపెనీకి సంబంధించిన వ్యక్తినని తెలిపాడు. ఇండియా డీలర్షిప్ ఇస్తామంటూ నమ్మించాడు. పలు డాక్యుమెంట్స్ తదితర ఖర్చులంటూ రూ.11లక్షలు దోచుకున్నారు. డీలర్షిప్ ఆలస్యం కావడంతో ఇదంతా బోగస్ అని గుర్తించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. క్రిప్టోకరెన్సీ పేరుతో రూ.25 లక్షలు స్వాహా.. క్రిప్టో కరెన్సీలో లాభాలు ఇస్తామంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. సైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్కు చెందిన గుంజన్శర్మ క్రిప్టోకరెన్సీలో బినాన్స్ కొనుగోలు చేసి వాటిని జీడీఎక్స్ అనే యాప్లో పెట్టుబడిగా రూ.25లక్షలు పెట్టాడు. ఆ మొత్తానికి లాభాలు చూపిస్తున్నారే కానీ డబ్బు డ్రా చేసేందుకు ఇవ్వట్లేదు. వారి నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఇదంతా ఫేక్ అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. (చదవండి: పోలీసు కస్టడీకి అభిషేక్, అనిల్ ) -
యువతికి రూ.50 వేలు బురిడీ.. వైన్ ఆర్డర్ చేసి అగచాట్లు
బనశంకరి (బెంగళూరు): ఆన్లైన్లో వైన్ ఆర్డర్ చేసిన యువతి వైన్ అందక, డబ్బులు పోయి బిక్కమొహం వేసింది. ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ కేటుగాళ్లు సుమారు రూ.50 వేలు కాజేశారు. లాల్బాగ్రోడ్డు అపార్టుమెంట్లో నివాసం ఉండే 22 ఏళ్ల యువతి సైబర్ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. మార్చి 22వ తేదీన ఆమె వైన్ను ఇంటికి తెచ్చివ్వాలని ఒక వెబ్సైట్లో ఆర్డర్ చేసి రూ.540 చెల్లించింది. కొద్దిసేపటికి ఒక ఆగంతకుడు కాల్ చేసి వైన్ ఇవ్వడానికి వస్తున్నాను, డెలివరీ ఫీజు కింద రూ.10 చెల్లించాలని, ఇందుకు మీ మొబైల్కు ఒక ఓటీపీ వస్తుందని, చెప్పాలని కోరాడు. ఆమె ఓటీపీ చెప్పిన వెంటనే బ్యాంకు అకౌంట్ నుంచి రూ.49,326 నగదు విత్ డ్రా అయ్యింది. పోలీసులు వంచకుల కోసం గాలిస్తున్నారు. చదవండి: (కోర్టు ఉద్యోగిని ఆత్మహత్య) -
లింకు నొక్కితే ఖాతా ఖాళీ
రెండు రోజుల క్రితం కొన్ని గ్రూపుల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా లింక్ వచ్చింది. సినిమా చూద్దామన్న ఆసక్తితో చాలామంది లింక్ ఓపెన్ చేశారు. రెండు నిమిషాలు సినిమా వచ్చింది. తర్వాత కొత్త లింక్ రావడంతో కొందరు దాన్ని క్లిక్ చేశారు. అంతే బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమైంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతున్నారు. ఈ నెల 19న అనంతపురం సప్తగిరి సర్కిల్లోని ఓ మొబైల్షాపులో ఇద్దరు యువకులు వచ్చి మొబైల్ ఫోన్ కొన్నారు. ఫోన్పే ద్వారా డబ్బు చెల్లించారు. ‘అమౌంట్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ’ అంటూ రావడంతో మొబైల్ షాపు యజమాని ఓకే అన్నారు. తర్వాత చెక్ చేస్తే ఒక్క పైసా అమౌంటు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. తీరా చూస్తే నకిలీ ఫోన్పే యాప్ ద్వారా చెల్లింపులు చేశారని తేలింది. – సాక్షి ప్రతినిధి, అనంతపురం ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఆన్లైన్ మోసగాళ్లకు అవకాశం మారుతున్నాయి. వివిధ మార్గాల్లో వేలకు వేలు కొల్లగొడుతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నట్టుండి డబ్బు మాయమైపోతోంది. చివరకు ఫోన్పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్లు కూడా నకిలీవి సృష్టించి మోసం చేస్తున్నారు. అమాయకులకు వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారా గానీ, నంబర్ల నుంచి నేరుగా గానీ వెబ్సైట్ లింకులు పంపించడం, వాటిని నొక్కితే ఖాతాల నుంచి డబ్బు లాగేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి మోసాలపై బ్యాంకు మేనేజర్లకు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురంలోని ఓ బ్యాంకులో నెల వ్యవధిలోనే 58 ఫిర్యాదులు అందాయి. తాజాగా అనంతపురం జిల్లా ఓడీ చెరువుకు చెందిన శ్రీనివాసులు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా నుంచి రూ.40 వేలు మాయమైంది. బ్యాంకు మేనేజర్ను కలిస్తే తమకు సంబంధం లేదని చెప్పారు. బ్యాంకుల్లో భద్రమనుకుంటే.. బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయో, రావోనన్న భయం. దీంతో బ్యాంకుల్లోనే దాచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ అక్కడా భద్రత ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు. ఒకవైపు డిజిటల్ సేవలు అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ మొబైల్ సేవల కోసం వెళితే డబ్బులు ఎగిరిపోతున్నాయి. దీనిపై బ్యాంకులను, పోలీసులను ఆశ్రయించినా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. ఏఈపీఎస్ ద్వారానూ మోసాలు సైబర్ నేరగాళ్లు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ద్వారానూ మోసాలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు నెలల్లో ఇలా మోసపోయిన బాధితులు జిల్లాలో 30 మందికి పైగానే ఉన్నారు. ఏటీఎం సౌకర్యం లేని ప్రాంతాల్లో నగదును ప్రజలు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏఈపీఎస్ పద్ధతి ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫింగర్ ప్రింట్ సాయంతో రోజుకు రూ.10 వేల వరకు డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజల వేలిముద్రలను సేకరించి ఏఈపీఎస్ ద్వారా డబ్బు దోచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పొరపాట్లు చేయొద్దు.. ► కొత్త నంబర్ల నుంచి వచ్చే వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయకూడదు. ► ఎవరైనా క్యాష్ ఇవ్వండి.. ఫోన్పే చేస్తామని అడిగితే నిరాకరించండి. నకిలీ యాప్ ద్వారా పంపితే అమౌంట్ వచ్చినట్టు చూపిస్తుంది కానీ మన ఖాతాలో జమకాదు. ► ఇటీవల హిట్ సినిమాల పేర్లతో లింకులు వస్తున్నాయి. వీటిని క్లిక్ చేయడం ప్రమాదకరం. ► మన ఫోన్ ఇతరులకు ఇవ్వొద్దు. క్యూఆర్ కోడ్ వంటి వివరాలను వారి ఫోన్ సాయంతో తస్కరించి మోసాలకు పాల్పడే అవకాశముంది. ► ఆన్లైన్ బ్యాంకింగ్, పేమెంట్ యాప్లకు సంబంధించిన పాస్వర్డ్లు గోప్యంగా ఉంచుకోవాలి. ► ఫోన్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్వర్డ్లు నమోదు చేయకూడదు. అప్రమత్తంగా ఉండాల్సిందే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి లింకులూ క్లిక్ చేయొద్దు. సామాజిక మాధ్యమాల్లో గుర్తుతెలియని వ్యక్తుల మెసేజ్లకు స్పందించొద్దు. ముఖ్యంగా వివిధ బ్యాంకుల పేరుతో వచ్చే కాల్స్కు ఓటీపీలు చెప్పవద్దు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ బ్యాంకులు లింకులు పంపవు చాలాసార్లు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ కాలేదని బ్యాంకుల పేరుతో లింకులు వస్తుంటాయి. కానీ ఏ బ్యాంకులూ అలా చేయవు. అలా వచ్చాయంటే నకిలీవని గుర్తించాలి. వాటిపై క్లిక్ చేయొద్దు. వెబ్సైట్ ద్వారా ఆధార్ను లాక్ చేసుకోవాలి. ఈజీ లావాదేవీల కోసం ప్రైవేటు యాప్లను ఆశ్రయించడం మంచిది కాదు. –జి.భాస్కర్రెడ్డి, చీఫ్ మేనేజర్, స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా -
అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా ఆటకట్టు
కడప అర్బన్: ఆన్లైన్ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు మంగళవారం రాత్రి మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్లో అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎం.దేవప్రసాద్ వివరాలు వెల్లడించారు. కడప జిల్లాలోని మైదుకూరు సబ్డివిజన్ పరిధిలోని బ్రహ్మంగారిమఠం మండలం ఎన్.గొల్లపల్లికి చెందిన దేవరకొండ జగదీశ్వరి అనే మహిళకు 2021 జనవరి 11న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఆమె తండ్రి తనకు బాగా తెలుసునని నమ్మబలికాడు. తాను బి.మఠం ఏఎస్ఐ అని, తమ బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని.. రూ.40 వేల సర్దితే..గంటలోనే కానిస్టేబుల్ ద్వారా తిరిగి డబ్బు పంపిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆయన మాటలు నమ్మిన జగదీశ్వరి ఫోన్పే ద్వారా రూ.40,000 పంపింది. డబ్బు పడ్డ వెంటనే ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. దీంతో జగదీశ్వరి తన తండ్రి దేవరకొండ క్రిష్ణయ్యకు విషయం చెప్పింది. ఆయన ఫిర్యాదు మేరకు బి.మఠం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో మరికొంతమందితో కలసి దువ్వూరులో రూ.70 వేలు, ఎర్రగుంట్ల పీఎస్ పరిధిలో రూ.40 వేలు, చిట్వేలిలో రూ.19 వేలు అమాయకుల నుంచి కాజేశారు. ఆయా కేసుల దర్యాప్తులో.. తెలంగాణా రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ పరిధిలోని భగత్సింగ్ నగర్కు చెందిన దువ్వాసి భరత్ను.. సూర్యాపేట్ జిల్లా మోతే మండలం, లాలు తాండకు చెందిన కీలుకాని సాయిచంద్గా గుర్తించారు. మంగళవారం రాత్రి వీరు మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్లో ఉండగా..పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పీడీ యాక్ట్ ఉన్న హైదరాబాద్కు చెందిన శరత్రెడ్డి కూడా ఈ కేసుల్లో నిందితుడిని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామని అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎం.దేవప్రసాద్ తెలిపారు. -
కేటుగాళ్లకే టోకరా!
సాక్షి, హైదరాబాద్: మహేష్ బ్యాంక్ సర్వర్ను హ్యాక్ చేసి చెస్ట్ ఖాతాను కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు రూ.12.93 కోట్లను తొలుత నాలుగు ఖాతాల్లోకి మళ్లించారు. వీటిలో ఒకటి సేవింగ్ అకౌంట్ కాగా... మిగిలినవి కరెంట్ ఖాతాలు. బ్యాంక్ నుంచి సొమ్ము తమ కరెంట్ ఖాతాల్లో పడటంతో ఇద్దరు వ్యాపారులు కొంత మొత్తాన్ని దారి మళ్లించి అప్పులు తీర్చుకున్నారు. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ కోణం తాజాగా బయటపడింది. దీనివల్ల దర్యాప్తు కూడా కొంత ఆలస్యమైనట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న వాటిలో నాగోల్లోని శాన్విక ఎంటర్ప్రైజెస్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఫార్మా హౌస్ ఖాతాలు కూడా ఉన్నాయి. గత నెల 22 తెల్లవారుజాము నుంచి 23 సాయంత్రం వరకు బ్యాంక్ నెట్వర్క్ను తమ ఆధీనంలో ఉంచుకున్న కేటుగాళ్లు చెస్ట్ ఖాతా నుంచి వీటితోపాటు మరో రెండు ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ నాలుగు ఖాతాల్లో పడిన మొత్తాలను దేశవ్యాప్తంగా 129 ఖాతాల్లోకి మళ్లించారు. ఈలోపు శాన్విక, ఫార్మాహౌస్ల నిర్వాహకులకు తమ ఖాతాల్లో భారీ మొత్తాలు డిపాజిట్ అవుతున్నట్లు సందేశాలు వచ్చాయి. తొలుత ఆ డబ్బుపై టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వాళ్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ అవసరాలకు వాడుకున్నారు. నవీన్ (శాన్విక ఎంటర్ప్రైజెస్) రూ.10 లక్షలు, సంపత్కుమార్ (ఫార్మాహౌస్) రూ.5 లక్షలు తమ వారి ఖాతాల్లోకి మళ్లించారు. స్నేహితుడిని గాంధీనగర్కు పంపి... ఈ సందేశాలు వస్తున్న సమయంలో నవీన్ తన స్వస్థలమైన ఓ గ్రామంలో ఉన్నాడు. అక్కడ నుంచి ఫోన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ సాధ్యం కాకపోవడంతో తన స్నేహితుడికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ చెప్పి తన ఖాతాలోని నగదును వేరే ఖాతాల్లోకి మళ్లించమని చెప్పాడు. దీంతో అతడు గాంధీనగర్లోని ఓ నెట్ సెంటర్కు వెళ్లి కంప్యూటర్ ద్వారా ఆపని చేశాడు. ఈ కారణంగానే దర్యాప్తు అధికారులకు గాంధీనగర్లోని ఇంటర్నెట్ సెంటర్ ఐపీలు వచ్చాయి. వీటి ఆధారంగా ఆ సమయంలో కంప్యూటర్ వాడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అతడు విషయం మొత్తం బయటపెట్టాడు. నవీన్ను అదుపులోకి తీసుకోగా తన స్నేహితుడు చెప్పింది నిజమేనని అంగీ కరించాడు. సంపత్కుమార్ నేరుగా తన భార్య ఖాతాలోకే ఆ మొత్తం మళ్లించాడు. అప్పులు తీర్చుకున్నామంటూ... అనుకోకుండా తమ ఖాతాల్లోకి వచ్చిపడుతున్న భారీ మొత్తాలను సొంతానికి వాడుకున్నట్లు వ్యాపా రులు నవీన్, సంపత్లు విచారణలో అంగీకరిం చారు. కాస్త సమయం ఇస్తే తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో నవీన్పై ఎలాం టి సందేహాలు లేవని, అయితే సంపత్ మాత్రం తనకు వచ్చిన సందేశాలను డిలీట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లతో ఇతడికి సంబంధాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా నగదు మళ్లించాడా? అనేది ఆరా తీస్తున్నామని ఓ అధికారి సాక్షికి చెప్పారు. -
సైబర్ మోసగాళ్ల అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్: మన్గో గోనట్స్ వ్యాపారం చేస్తే అధిక లాభాలు వస్తాయని వ్యాపారులను నమ్మించి నగదు వసూలు చేస్తూ భారీ సైబర్ మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు విజయవాడ సైబర్ పోలీసులు చెక్ పెట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ కేంద్రంగా ఈ నేరానికి పాల్పడుతున్న సతీష్శర్మ, కృష్ణశర్మను అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరూ విజయవాడ హనుమాన్పేటకు చెందిన ఓ చెప్పుల వ్యాపారిని ఉచ్చులోకి దింపారు. ముందుగా ఫేస్బుక్ ద్వారా ఓ మహిళను ఆ వ్యాపారికి పరిచయం చేసి మన్గో గోనట్స్ వ్యాపారాన్ని వివరించారు. ఆఫ్రికా దేశాల్లో తక్కువ ధరకు లభించే ఈ నట్స్ను ఇండియాలో అమ్మితే లాభాలు గడించవచ్చని వ్యాపారిని నమ్మించారు. పలు దఫాలుగా రూ.78 లక్షలు వసూలు చేశారు. తరువాత నుంచి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో చెప్పుల వ్యాపారి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు గుజరాత్ కేంద్రంగా సైబర్ నేరానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో ముందుగా నిందితులు సతీష్శర్మ, కృష్ణశర్మకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు వారు స్పందించకపోవడంతో వారిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సైబర్ సీఐ కె.శ్రీనివాస్ తెలిపారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు పంపినట్లు చెప్పారు. -
ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తే నిండా ముంచేశాడు!
సాక్షి, హైదరాబాద్(హిమాయత్నగర్): పార్ట్ టైం ఉద్యోగం కావాలని గూగుల్ సెర్చ్ చేసిన యువతి, యువకుడిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. మాయ మాటలు చెప్పి వారిద్దరి నుంచి లక్షలు కాజేశారు. దీంతో వారు వేర్వేరుగా గురువారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం సరిపోకపోవడంతో పార్ట్టైం జాబ్ చేసుకునేందుకు గూగుల్లో సెర్చ్ చేశాడు. ఓ వ్యక్తి పరిచయమై ఉద్యోగం వచ్చే వరకు ఇన్వెస్ట్ చేయమని సూచించాడు. దీంతో అతగాడు చెప్పిన విధంగా పలు దఫాలుగా రూ. 6.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వలేదు. యువతిని సైతం ఓ వ్యక్తి ఇదే తరహాలో మోసం చేశాడు. ఆమె నుంచి రూ. 2.30 లక్షలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు. తన ప్రమేయం లేకుండా భారత్ యాప్లో నుంచి రూ. 3 లక్షలు స్వాహా అయ్యాయని నగర వాసి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: (డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి..) -
పారా హుషార్: కొత్త ఏడాది.. కొత్త ఆశలతో పాటు కొత్త సమస్యలు
ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి తేరుకుంటోంది! కానీ..ఏళ్లుగా పీడిస్తున్న హ్యాకింగ్, స్కామింగ్ చికాకులు మాత్రం ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేవు సరికదా... వచ్చే ఏడాది మరింత పెరుగుతాయంటోంది నార్టన్ ల్యాబ్స్!! కొత్త పోకడలతో, కొంగొత్త పద్ధతులతో ఐటీ వినియోగదారుల నుంచి డబ్బు లాగేసేందుకు స్కీములేస్తారని... పారాహుషార్ అని హెచ్చరిస్తోందీ సంస్థ! సాక్షి, హైదరాబాద్: 2021కు ముగుస్తోంది. కొత్త ఏడాది.. కొత్త ఆశలతోపాటు... కొత్త సమస్యలు కూడా ఉండబోతున్నాయన్నది నిపుణుల మాట. సైబర్ సెక్యూరిటీ విషయంలో రానున్న 12 నెలలు ఎంతో ఆసక్తికరమని అంటోంది ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ ల్యాబ్స్. క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం దక్కుతున్న తరుణంతో దీన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వాళ్లూ ఎక్కువవుతారని, అకాల వర్షాలు, వరదల్లో చిక్కుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ స్కామర్లు కొంగొత్త స్కీములు రచిస్తారని అంచనా వేస్తోంది. అంతేకాదు.. వీటన్నింటి విరుగుడే లక్ష్యంగా సైబర్ ఆక్టివిజమ్ కూడా ఊపందుకుంటుందని చెబుతోంది. 2022 సంవత్సరంలో సైబర్ ప్రపంచంలో సంభవించగల ఐదు అంశాలు.. నార్టన్ ల్యాబ్స్ అంచనాల మేరకు... క్రిప్టో కరెన్సీ తోడుగా... 2022లో క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల వినియోగానికి అంగీకరించే కంపెనీలు పెరుగుతాయి. అదే సమయంలో ఈ డిజిటల్ కరెన్సీ తీరుతెన్నులు తెలియని అమాయకులను లక్ష్యంగా చేసుకుని స్కామర్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కాయిన్లు ఉచితంగా ఇస్తున్నామని కొందరు, నకిలీ యాప్లతో ఇంకొందరు ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ఆధారిత నేరాలకు పాల్పడుతుండగా.. కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త కుయుక్తులు పన్నే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐడీలు? వర్క్ ఫ్రమ్ హోమ్, జూమ్ కాల్, ఆన్లైన్లో అవసరమైనవి తెప్పించుకోవడం... కరోనా కారణంగా ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిన కార్యక్రమాలివి. ఈ క్రమంలోనే స్మార్ట్ఫోన్లతో అవసరమైన డాక్యుమెంట్లను అటూ ఇటూ పంపుతుండటమూ కద్దు. అయితే వీటితో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో మరింత సురక్షితమైన రీతిలో మన వ్యక్తిగత వివరాలను పంపేందుకు వాటిని గుర్తించే అవసరం ఏర్పడింది. కంప్యూటర్ రంగంలో ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందిన బ్లాక్చెయిన్ టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం వచ్చే ఏడాది జరగనుంది. ఎల్రక్టానిక్ ఐడీ లేదా ‘ఈఐడీ’ పేరుతో బ్లాక్చెయిన్ ఆధారిత గుర్తింపు కార్డుల జారీకి కొన్ని ప్రభుత్వాలూ పట్టుబడుతున్నాయి. సైబర్ నిరసనలు, ఉగ్రవాదమూ... సైబర్ టెర్రరిజమ్, ఆక్టివిజమ్ 2021లోనూ భారీగానే నడిచింది. కాకపోతే వచ్చే ఏడాది ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బు కోసం నేరాలకు పాల్పడటం సైబర్ క్రిమినల్స్ చేసే పనైతే.. హ్యాకింగ్ మాత్రం కొన్నిసార్లు నిరసనలకూ ఉపయోగపడుతున్నాయి. హ్యాక్టివిస్టులంటారు ఇలా నిరసనలకు పాల్పడే వారిని! ఈ రకమైన హ్యాక్టివిజమ్ వచ్చే ఏడాదీ కొనసాగనుంది. ప్రభుత్వాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని బహిరంగపరచడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. నేరగాళ్లకూ అండగా ఏఐ... మానవాళి మరికొంచెం సుఖంగా ఉండేందుకు కృత్రిమ మేధ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వచ్చే ఏడాది ఈ అత్యాధునిక టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల పని కూడా సులువు చేయనుంది. డీప్ఫేక్ వంటి టెక్నాలజీల కారణంగా అసలు, నకిలీల మధ్య అంతరం చెరిగిపోతుండటాన్ని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకోనున్నారు. కష్టాల్లో డబ్బులేరుకునే రకాలు... మనిషి కష్టాలతో కూడా డబ్బులు సంపాదించుకునే రకాలు 2022లో మరింత ఎక్కువవుతారు. చోరీ చేసిన సమాచారం సాయంతో ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బు లాగేసేందుకు వీరు ప్రయత్నిస్తారు. చదవండి: సైబర్ మోసాలకు గురయ్యారా? అయితే ఈ నంబర్ మీకోసమే.. ఎందుకింత గలీజ్ అయితున్నరు? పోలీసులకు రవి ఫిర్యాదు -
'లక్షల్లో ఉన్న షేర్లను కోట్లలోకి తీసుకెళ్తాం'.. ఐటీ ఉద్యోగిని..
సాక్షి, హైదరాబాద్ (హిమాయత్నగర్): ట్రేడింగ్ వెబ్సైట్లో చూశాం, మీరు చాలా షేర్లు రాబట్టుకోగలిగారు. కానీ, దానిపై ఎక్కువ టైం పెట్టలేకపోతున్నారు. మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ మాకిస్తే మేమే ట్రేడింగ్ చేసి లక్షల్లో ఉన్న షేర్లను కోట్లలోకి తీసుకెళ్తామంటూ నగర యువతిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ కాల్ ద్వారా నిమిషాల పాటు మాట్లాడి, ఒప్పించారు. ఇలా తన వద్ద ఉన్న పాస్వర్డ్, యూజర్ ఐడీ తీసుకుని తన షేర్లన్నీ వాళ్ల అకౌంట్లోకి మార్చుకుని మోసం చేశారంటూ ఐటీ ఉద్యోగి గురువారం సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించింది. ఎస్ఐ ప్రశీన్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఓ ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా చేస్తున్న యువతికి ట్రేడింగ్ అంటే ఇష్టం.‘జెరోధా’ అనే వెబ్సైట్లో ఆమె కొంతకాలంగా ట్రేడింగ్ చేస్తూ.. రూ. 9 లక్షల షేర్లను సంపాదించుకున్నారు. ఈ విషయాన్ని సైబర్ నేరగాళ్లు గుర్తించారు. లాగిన్ అయ్యి ఆమెకు చెందిన రూ. 9 లక్షల షేర్లను వారి అకౌంట్లలోకి మార్చుకుని మోసానికి పాల్పడ్డారు. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) ►ఆర్మీ అధికారినంటూ డీసీఎం డ్రైవర్ను మోసం చేశాడో సైబర్ నేరగాడు. తాను ఇల్లు షిఫ్ట్ అవుతున్నాని నమ్మించి, డీసీఎం కావాలని కోరాడు. రూ. 30 వేలకు కిరాయి మాట్లాడుకున్నాడు. అయితే రూ. లక్ష అకౌంట్లో ఉంటేనే తమకు చెందిన డబ్బులు వస్తాయని డ్రైవర్ను నమ్మించాడు. దీంతో డ్రైవర్ రూ. 70 వేలు సదరు అ వ్యక్తికి పంపగా.. రూ. లక్ష అకౌంట్లోకి వచ్చాయి. కానీ.. నువ్వు పంపిన రూ. 70 వేలు రాలేదంటూ చెప్పి పలు దఫాలుగా రూ. 4.50 లక్షలు స్వాహా చేశాడు. ►ఎస్బీఐ అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందంటూ నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేశారు సైబర్ చీటర్స్. బాధితుడికి ఫోన్ చేసి కేవైసీ అప్డేట్ చేయాలని నమ్మబలికి ఓటీపీలు అడిగి రూ. 2.50 లక్షలను లూటీ చేశారు. ►ఇండియామార్ట్ వెబ్సైట్లో ఉన్న ఫోన్ నంబర్కు కాల్ చేసి టీవీలు ఆర్డర్ పెట్టగా.. తనని ఓ వ్యక్తి మోసం చేశాడంటూ వ్యాపారి ఫిర్యాదు చేశాడు. నగరంలోని టీవీల వ్యాపారి ఆర్మీ క్యాంటీన్లకు టీవీలు సప్లై చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇండియా మార్ట్లో ఓ వ్యక్తి అతి తక్కువ ధరకు టీవీలను అమ్ముతామంటూ యాడ్ పెట్టాడు. అది చూసి మాట్లాడగా.. ఎన్వోసీ కూడా పంపాడు. ఆ తర్వాత రూ. 1.50 లక్షలు పంపగా.. ఇప్పటి వరకు టీవీలు రాలేదు. ఆయా కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రశీన్రెడ్డి వివరించారు. చదవండి: (భూత్ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..) -
అంగన్వాడీలకు సైబర్ నేరగాళ్ల కాల్స్
‘‘హలో మేడం.. మేం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైద్య శాఖ సిబ్బంది మాట్లాడుతున్నాం. మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి దరఖాస్తు చేసుకున్నారు కదా! మీకు అమౌంట్ పంపిస్తున్నాం. మీ ఫోన్పే నంబరు చెప్పండి. మీరు చెప్పే ఫోన్పే నంబరులో కనీసం రూ.మూడు వేలు బ్యాలెన్స్ ఉంటేనే నగదు బదిలీ చేయగలం...’’ – ఓ అంగన్వాడీ కార్యకర్తకు సైబర్ నేరగాడి ఫోన్ కాల్ ప్రత్తిపాడు: గుంటూరు జిల్లాలో సోమవారం పలుచోట్ల సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. దీన్ని నమ్మి మోసగాడికి ఓటీపీ వివరాలు వెల్లడించడంతో బ్యాంకు ఖాతా నుంచి క్షణాల్లో డబ్బులు గల్లంతయ్యాయి. ప్రత్తిపాడు మండలంలో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు, ఒక వీవోఏ ఖాతాల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు నగదును కాజేశారు. తమ ఖాతాలో బ్యాలెన్స్ లేదని బాధితులు చెప్పడంతో స్నేహితుల ఖాతా వివరాలు ఇవ్వాలని మోసగాడు సూచించాడు. కేవలం మహిళల ఖాతాలకు మాత్రమే డబ్బులు బదిలీ చేస్తామంటూ వల విసిరాడు. ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్.. బొర్రావారిపాలెం అంగన్వాడీ కార్యకర్తకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులిస్తామంటూ మోసగాడు కాల్ చేశాడు. దీన్ని నమ్మిన బాధితురాలు ఫోన్పే లేకపోవడంతో తొలుత తన భర్త ఖాతా నుంచి స్నేహితురాలైన వీవోఏ ఖాతాకు రూ.8 వేలు బదిలీ చేసింది. ఆ తరువాత ఫోన్కి వచ్చిన ఓటీపీ వివరాలను నేరగాడికి వెల్లడించింది. అంతే రూ.8 వేలతో పాటు వీవోఏ ఖాతాలో ఉన్న రూ.39,996 కూడా కలిపి మొత్తం రూ.47,996 మాయమయ్యాయి. పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త అనూరాధకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తామంటూ ఫోన్ కాల్ వచ్చింది. సైబర్ నేరగాడు ఫోన్పే నంబరు అడగడంతో తన కుమారుడికి ఫోన్ చేసింది. ఫోన్ ఎంగేజ్ రావడంతో స్నేహితురాలైన కొత్తమల్లాయపాలెం అంగన్వాడీ కార్యకర్త మేడా సీతామహాలక్ష్మి ఫోన్పే నెంబరు నేరగాడికి తెలియచేసింది. ఇక్కడా కూడా సేమ్సీన్ రిపీట్. బాధితుల ఖాతా నుంచి రూ.33,997 మాయమయ్యాయి. ఇది అంతటితో ఆగలేదు. హైదరాబాద్లో ఉండే తన సోదరుడు కుంభా వెంకటేశ్వర్లు ఫోన్పే నంబరు కూడా ఇవ్వడంతో ఆయన ఖాతా నుంచి రూ.12,990 గల్లంతయ్యాయి. గనికపూడికి చెందిన మరో అంగన్వాడీ కార్యకర్తకు నేరగాడు ఫోన్ చేసి మీ కుమార్తె ప్రసవానికి రూ.పాతిక వేలు ఇస్తామంటూ నమ్మబలికాడు. ఆమెకు ఫోన్పే లేకపోవడంతో తిక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మరో అంగన్వాడీ కార్యకర్త ఫోన్పే నంబరును ఇచ్చింది. ఆమె ఖాతా నుంచి రూ.11,999 కట్ అయ్యాయి. వీరేకాకుండా గొట్టిపాడు, గనికపూడి గ్రామాలకు చెందిన మరికొందరికి కూడా ఇలాంటి ఫోన్ కాల్సే వచ్చినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ బుధవారం తెలిపారు. బాధితుల కాల్ డేట్ను పరిశీలించగా ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. సైబర్ నేరగాడు మాయం చేసిన నగదును తన ఖాతాకు బదిలీ చేసుకోకుండా నేరుగా ఆన్లైన్ షాపింగ్ (పీవోఎస్ ట్రాన్సాక్షన్) చేసినట్లు తెలుస్తోంది. -
ఐటీ ‘రిటర్న్స్’నూ మళ్లించేశారు..!
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖ నుంచి పన్ను చెల్లింపుదారులకు తిరిగి రావాల్సిన మొత్తాలను సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది. సిటీ కేంద్రంగా ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్న చార్టెడ్ అకౌంటెంట్కు దేశ వ్యాప్తంగా క్లైంట్స్ ఉన్నారు. వారిద్వారా మహారాష్ట్ర పుణేకు చెందిన ప్రవాస భారతీయుడు (ఎన్నారై) పరిచయమయ్యారు. కాలిఫోర్నియాలో ఉండే ఆయన తన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనడంతో సీఏ అంగీకరించారు. ఎన్నారైకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రావాల్సిన రూ. 21 లక్షలను పుణేలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి పంపాలంటూ వాటిలో పొందుపరిచారు. సదరు ఖాతా నంబర్ ఐటీ రికార్డుల్లోనూ ఉంది. నిర్ణీత గడువు ముగిసినా తనకు రావాల్సిన డబ్బు రాలేదని సీఏ దృష్టికి ఎన్నారై తీసుకెళ్లారు. సీఏ ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన అధికారులు సదరు ఎన్నారైకి రావాల్సిన రూ. 21 లక్షలను కొన్ని నెలల క్రితమే చెల్లించామంటూ సమాధానం ఇచ్చారు. అవాక్కైన సీఏ ఆ డబ్బు పంపిన ఖాతా వివరాలు తెలపాల్సిందిగా ఐటీ కాల్ సెంటర్ను సంప్రదించారు. వారందించిన వివరాల మేరకు విశాఖపట్నం ద్వారకానగర్లోని ఇండస్ ఇండ్ బ్యాంకును సీఏ సంప్రదించారు. ఆ ఖాతాలోకి ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 21 లక్షలు జమయ్యాయని, ఆ మొత్తాన్ని ఖాతాదారు డ్రా చేసేసినట్లు బ్యాంకర్లు వెల్లడించారు. ఆ ఖాతాను సైబర్ నేరగాళ్లు కాలిఫోర్నియాలో ఎన్నారై పేరు, వివరాలతోనే ఓపెన్ చేసి.. ఆదాయపు పన్ను శాఖ రికార్డుల్లోకీ జొప్పించారు. ఫలితంగానే రిటర్న్స్కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ శాఖ అందులోకి బదిలీ చేసింది.‘చార్టెడ్ అకౌంటెంట్ ఈ సైబర్ నేరానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు అందిçస్తూ ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు లిఖిత పూర్వకంగా కోరాం’ అని ఏసీపీ కేవీఎం ప్రసాద్ వివరించారు. -
ఆంధ్రప్రదేశ్లో సైబర్ సేఫ్ కియోస్క్లు.. ఇక ఫోన్లు సురక్షితం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని ఓ వ్యాపారవేత్త మొబైల్ ఫోన్కు ఏదో లింక్ వచ్చింది.. ఆయన దాన్ని క్లిక్ చేశారు. అందులో ఏమీ లేదు కానీ ఆయనకు తెలియకుండానే మొబైల్ ఫోన్లో మాల్వేర్ చేరింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఆన్లైన్ బ్యాంక్ ఖాతాల నుంచి ఎవరో నగదు స్వాహా చేసేశారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆ వ్యాపారవేత్త లబోదిబోమన్నారు. ఇలా మొబైల్ ఫోన్ను సాధనంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో సైబర్ కవచ్ పేరిట 50 సైబర్ సేఫ్ కియోస్క్ల ఏర్పాటుకు నిర్ణయించింది. కేసుల కంటే కట్టడే ముఖ్యం మన దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ ఓ అత్యవసర వస్తువుగా మారింది. సంభాషణలు, సందేశాల నుంచి బ్యాంకింగ్, ఈమెయిల్స్, ఇతర లావాదేవీల వరకు అన్నిటికీ మొబైల్ ఫోన్ను వాడాల్సిందే. ఇదే సమయంలో వేధింపురాయుళ్లు, సైబర్, ఆర్థిక నేరగాళ్ల మోసాలకు సాధనంగా కూడా మారుతోంది. వివిధ వైరస్లు, మాల్వేర్, తదితరాల నుంచి మన ఫోన్లకు ముప్పు పొంచి ఉంది. దేశ, విదేశాల నుంచి వివిధ లింక్లు, మెయిళ్లు, వీడియోలు, ప్రకటనలు.. ఇలా పలు రకాలుగా వైరస్లను సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లలోకి పంపుతున్నారు. అనంతరం సైబర్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మోసపోయాక కేసులు నమోదు చేయడం కంటే ముందుగానే మొబైల్ ఫోన్ వాడకందారులకు అవగాహన కల్పించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. తమ మొబైల్ ఫోన్లో ప్రమాదకర వైరస్, మాల్వేర్ ఉన్నాయో, లేదో కూడా 90 శాతం మంది స్మార్ట్ఫోన్ వాడకందారులు గుర్తించలేరు. కాబట్టి వారి ఫోన్లలో ఇవి ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి ‘సైబర్ సేఫ్ కియోస్క్లు’ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్ని రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో వీటికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సైబర్ సేఫ్ కియోస్క్ల్లో సేవలన్నీ ఉచితం.. త్వరలో రాష్ట్రంలో 50 సైబర్ సేఫ్ కియోస్క్లను పోలీసు శాఖ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే గుజరాత్లోని నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ నుంచి వీటిని కొనుగోలు చేసి అన్ని జిల్లాలకు పంపింది. 18 జిల్లా, అర్బన్ పోలీసు ప్రధాన కార్యాలయాల్లో, 18 దిశ పోలీస్స్టేషన్లలో, ప్రముఖ బస్స్టేషన్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో మరో 14 కియోస్క్లను ఏర్పాటు చేస్తారు. ఆ కియోస్క్ల డాష్బోర్డ్లను ఎలా నిర్వహించాలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి కియోస్క్కు అడ్మిన్గా నియమిస్తారు. ఎవరికైనా తమ ఫోన్లో ప్రమాదకర వైరస్ చేరిందని సందేహం కలిగితే ఆ కియోస్క్కు తీసుకువెళ్లి పరీక్షించుకోవచ్చు. కియోస్క్ల్లో ఆ స్మార్ట్ ఫోన్లను స్కాన్ చేసి పరీక్షిస్తారు. వాటిలో ప్రమాదకర వైరస్లు, మాల్వేర్, సాఫ్ట్వేర్లు ఉంటే తొలగిస్తారు. ఈ సేవలన్నీ కూడా ఉచితంగానే అందిస్తారు. -
‘డేటింగ్ వెబ్సైట్లో నా నెంబర్.. అతని వాట్సాప్ డీపీగా నా ఫోటో’
సాక్షి, హిమాయత్నగర్: సైబర్నేరస్తులు విసిరే వలలో నగరవాసులు చిక్కి విలవిల్లాడుతున్నారు. తీరా మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరిట రూ.13 లక్షలు మోసం యూకేలో రియల్ ఎస్టేట్కు మంచి అవకాశాలున్నాయంటూ మెయిల్ రావడంతో అత్యాశకుపోయి రూ.13 లక్షలు పోగొట్టుకున్నాడు నగర వాసి వెంకటమరళీ మనోహర్. యూకేలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలుంటాయని, ఆసక్తి ఉంటే రావాలని కొద్దిరోజుల క్రితం వెంకటమురళీ మనోహర్కు మెయిల్ వచ్చింది. ఇందుకు గాను వీసా, ఇతర ఖర్చులకు రూ.13లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఆ తరువాత ఫోన్ పనిచేయకపోవడంతో బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 25 లక్షల వస్తాయని.. ఆన్లైన్ వేదికగా నడిచే ఎఫ్క్యూ యాప్లో అమీర్పేటకు చెందిన శ్రీధరరావు రూ.9.20 లక్షలు పెట్టుబడి పెట్టాడు. లాభాలు బాగావస్తాయని నమ్మి ఈ పనిచేశాడు. తరువాత రూ.25 లక్షలు లాభం వచ్చినట్లు యాప్లో చూపించింది. డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా ఫలితంలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ► డేటింగ్ వెబ్సైట్లో తన ఫోన్ నెంబర్ పెట్టారంటూ నగర యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్కాల్స్ వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొంది . మరో ఘటనలో ఓ వ్యక్తి తన ఫొటోను అతని వాట్సప్ డీపీగా పెట్టుకుని అసభ్యకరమైన మెసేజ్లు పంపుతున్నారని మహిళ ఫిర్యాదు చేసింది. ►రసూల్పురాకు చెందిన రామ్కుమార్ పేరుపై కాకినాడ, చిత్తూరు ప్రాంతాల్లో రెండు బ్యాంకు ఖాతాలు ఓపెన్ అయ్యాయి. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ►డబీల్పురాకు చెందిన సయ్యద్ సలీమ్ తన పేరుతో ఫే స్బుక్, యూట్యూబ్ పేజీలను కొందరు క్రియేట్ చేసి బిజినెస్ చేసుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకుకే బురిడీ కొట్టి రూ.70 లక్షల రుణం కేపీహెచ్బీకాలనీ: తప్పుడు ధృవీకరణ పత్రాలతో బ్యాంక్ ను మోసం చేసిన ముగ్గురిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ లక్ష్మినారాయణ తెలిపిన మేరకు.. కొండాపూర్ ప్రాంతంలో నివాసముండే కోటకొండ విక్రంబాబు(36) రుణం కోసం కేపీహెచ్బీకాలనీలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాడు. సిబిల్ స్కోర్ సరిగా లేకపోవడంతో రుణం పొందడం కష్టమని బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో అతను హిమాయత్నగర్లోని చార్టర్డ్ అకౌంటెంట్ సంతోష్ను సంప్రదించాడు. అతను జీడిమెట్లకు చెందిన గొట్టిముక్కల సత్యనారాయణ రాజు(40)కు మాదాపూర్లో ప్లై హై ఎంటర్ప్రేజెస్ కంపెనీ ఉందని, దానికి అతనే యజమాని అన్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించాడు. యూసుఫ్ఖాన్, శ్రీశైలం, చంద్రశేఖర్ అనే ముగ్గురు మధ్యవర్తుల సహకారంతో 500 గజాల ఖాళీ స్థలం ఉన్నట్లు చూపారు. వాటిని తనఖాపెట్టి రూ. 70లక్షల రుణాన్ని గొట్టిముక్కల సత్యనారాయణరాజు పేరుతో 2017 సంవత్సరంలో పొందారు. రుణం మంజూరు కాగానే సత్యనారాయణరాజు ఖాతా నుంచి విక్రంబాబు,సంతోష్ల ఖాతాలకు డబ్బు బదిలీ అయింది. రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు గత జనవరిలో కేపీహెచ్బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి గొట్టిముక్కల సత్యనారాయణరాజును మంగళవారం అరెస్టు చేసి విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. బుధవారం విక్రంబాబును, చందానగర్కు చెందిన యుసుఫ్ఖాన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. తెలిసిన వాడే కాజేశాడు! సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి బ్యాంకు ఖాతా నుంచి రూ.13 లక్షలు స్వాహా చేసిన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వీటి ప్రకారం ఆయనకు బాగా తెలిసిన వ్యక్తే ఈ పని చేసినట్లు తేల్చారు. అయితే ఈ నేరంలో ఎలాంటి సిమ్ స్వాపింగ్ జరగలేదని, తస్కరణ మాత్రం జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న అనుమానితుడిని పట్టుకోవడానికి గాలింపు ముమ్మరం చేస్తూ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ విషయంపై మాజీ ఐఏఎస్ అధికారి గత నెలలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతిక దర్యాప్తు నేపథ్యంలో అధికారులు కీలకాంశాలు తెలుసుకున్నారు. మాజీ అధికారి ఇంట్లో పని చేసిన వ్యక్తినే ప్రధాన అనుమానితుడిగా గుర్తించారు. ఆ సమయంలోనే యజమాని సిమ్కార్డు తస్కరించిన అతగాడు తన ఫోన్లో వేసుకున్నట్లు, దాని ఆధారంగా కొన్ని యూపీఐ యాప్స్ను డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్నట్లు తేల్చారు. ఇలా ఆ సెల్ఫోన్ నెంబర్ లింకై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి నగదును బదిలీ చేసుకోవడం, ఖర్చు చేయడం చేసేశాడు. ఈ పనంతా సదరు మాజీ అధికారి వద్ద పని మానేసిన తర్వాత చేశాడు. ఇలా దఫదఫాలుగా మొత్తం రూ. 13 లక్షలు కాజేసే వరకు విషయాన్ని బాధిత అధికారి గుర్తించలేదు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సదరు మాజీ పనివాడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
నకిలీ ఎస్ఎంఎస్.. హానికరమైన యాప్
న్యూఢిల్లీ: కరోనా టీకా పొందాలంటే కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతు యాప్లో పేర్లు, వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అయితే, పేర్ల రిజిస్ట్రేషన్ కోసమంటూ హానికరమైన యాప్ను సూచిస్తూ నకిలీ ఎస్ఎంఎస్ ఒకటి సర్క్యులేట్ అవుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్) సూచించింది. ఇలాంటి యాప్లను ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే ప్రమా దమని హెచ్చరించింది. నకిలీ ఎస్ఎంఎస్లో ఒక లింక్ను సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారని, దానిపై క్లిక్ చేస్తే హానికరమైన యాప్ ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో ఇన్స్టాల్ అవుతుందని తెలిపింది. అనంతరం బాధితుల ఫోన్లలోని కాంటాక్టులన్నింటికీ దానంతట అదే ఎస్ఎంఎస్ రూపంలో చేరుతుందని పేర్కొంది. ఈ యాప్ ఫోన్లలో ఉంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావడం ఖాయమంది. Covid19. apk;Vaci&&Regis.apk; MyVaccin&v2. apk;Cov&Regis.apk; Vccin&Apply.apk. అనే లింక్లను సూచిస్తూ నకిలీ ఎస్ఎంఎస్ వస్తున్నట్లు వెల్లడించింది. కేవలం http:// cowin.gov. in అనే అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. -
ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే!
సాక్షి, హైదరాబాద్: సిటీలోని ఉత్తర మండలానికి చెందిన ఓ వ్యక్తి ఓయో హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలని భావించాడు. ఆ సంస్థను సంప్రదించడానికి అవసరమైన నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేసి నిండా మునిగాడు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఉమేష్ ఇటీవల కరోనా బారినపడ్డాడు. చికిత్స తీసుకున్న అతడికి నెగిటివ్ వచ్చింది. అయితే తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని భావించారు. దీని కోసం తమ ప్రాంతానికి సమీపంలోని ఓయో హోటల్ రూమ్ తీసుకుందామని భావించి ఆ సంస్థ ఫోన్ నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేయగా ఒక నంబర్ లభించింది. అది నకిలీది అని తెలియక ఉమేష్ ఆ నంబర్ను సంప్రదించగా.. ఓయో సంస్థ ప్రతినిధుల మాదిరిగా సైబర్ నేరగాళ్లు మాట్లాడారు. మీకు కావాల్సిన రూమ్ బుక్ చేసుకోవడానికి సహకరిస్తామంటూ క్విక్ సపోర్ట్ (క్యూఎస్) యాప్ను డౌన్లోడ్ చేయించారు. తర్వాత బాధితుడి ఫోన్ను హ్యాక్ చేశారు. రూమ్ బుకింగ్ కోసం తమకు రూ.10 పంపాలన్నారు. ఉమేష్ ఆ మొత్తం తన ఫోన్ నుంచి బదిలీ చేస్తుండగా అతడి యూపీఐ వివరాలను క్యూఎస్ యాప్ ద్వారా తస్కరించారు. వీటిని వినియోగించి అతడి ఖాతా నుంచి రూ.3.08 లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న ఉమేష్ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గూగుల్ను ఆశ్రయించొద్దు ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రముఖ సంస్థల కాల్ సెంటర్ల పేరుతో తమ నంబర్లను గూగుల్లో జొప్పిస్తున్నారని, ఈ విషయం తెలియక సంప్రదించిన అనేక మంది మోసపోతున్నారని పేర్కొన్నారు. ఏదైనా సంస్థకు సంబంధించిన ఫోన్, కాల్ సెంటర్ నంబర్లు అవసరమైతే నేరుగా దాని వెబ్సైట్ లేదా యాప్లనే సంప్రదించాలని సూచిస్తున్నారు. గూగుల్లో ఉన్న వాటిని గుడ్డిగా నమ్మితే నిండా మునుగుతారని హెచ్చరిస్తున్నారు. చదవండి: 128 సార్లు ఓయో హోటల్స్ బుక్ చేసుకున్న ఒకే ఒక్కడు -
ఐఏఎస్ కలని చిదిమేసిన నగ్న వీడియో
బెంగళూరు: ఎంబీఏ పూర్తి చేశాడు. మంచి ప్యాకేజితో ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి. కానీ అతడి దృష్టి మాత్రం కలెక్టర్ జాబ్ మీదనే. ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలని భావించాడు. దీక్షగా చదవడం ప్రారంభించాడు. ఇలానే మరికొంత కాలం చదువు కొనసాగిస్తే.. అతడి కల సాకారమయ్యేది. కానీ ఫేస్బుక్ అతడి జీవితాన్ని, కలని చిదిమేసింది. ఓ యువతి పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ అతడి జీవితానికి ఎండ్ కార్డ్ వేసింది. ‘ఆమె’ మాయలో పడి నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాడు. దాన్ని రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు డబ్బుల కోసం అతడిని బెదిరించడం ప్రారంభించారు. అప్పటికే బాధితుడు వారికి కొంత డబ్బు ఇచ్చాడు. కానీ వేధింపులు ఆగకపోవడంతో.. ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించాడు. అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చాడు. ఆ వివరాలు.. బాధితుడు భట్టరహళ్లి సమీపంలోని కేఆర్ పురంలో నివాసం ఉంటున్నాడు. ఎంబీఏ పూర్తి చేసి.. ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అతడు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. అయితే బాధితుడి ఫేస్బుక్కి వచ్చిన సందేశాలను బట్టి అతడి సోదరి.. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు తట్టుకోలేకనే తన సోదరుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని గ్రహించింది. అసలు సైబర్ సైకోగాళ్లు తన అన్నను ఏ విషయంలో బెదిరిస్తున్నారో తెలుసుకోవాలనుకుంది. ఈ నేపథ్యంలో బాధితుడు మరణించిన రెండు రోజుల తర్వాత నేహా శర్మ అనే అకౌంట్ నుంచి ‘‘నీ ఫోన్ నంబర్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది’’ అంటూ హెచ్చరిస్తూ ఓ సందేశం వచ్చింది. దాంతో బాధితుడి సోదరి సైబర్ నేరగాళ్లకు తన బంధువు నంబర్ సెండ్ చేసింది. ఆ తర్వాత తేజాస్ మరేష్ భాయ్ అనే వ్యక్తి నుంచి తన బంధువు నంబర్కి మెసేజ్ వచ్చింది. తేజాస్ తమకు డబ్బులు ఇవ్వాలని బెదిరించడం ప్రారంభించాడు. దాంతో మృతుడి సోదరి దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం బాధితుడికి నేహా శర్మ అనే ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. యాక్సెప్ట్ చేశాడు. మెసేజ్లతో ప్రారంభం అయిన వారి పరిచయం నగ్నంగా వీడియో కాల్ చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ రోజు యువతి బాధితుడికి కాల్ చేసి.. తన దుస్తులు తొలగించి పూర్తి నగ్నంగా మారింది. ఆ తర్వాత అతడిని కూడా దుస్తులు తొలగించాల్సిందిగా కోరింది. ఆమె కోరిక మేరకు బాధితుడు నగ్నంగా మారి ఫోన్ మాట్లాడటం ప్రారంభించాడు. దాంతో సైబర్ నేరగాళ్లు బాధితుడి వీడియో రికార్డ్ చేశారు. ఆ తర్వాత అతడికి ఫేస్బుక్ ద్వారా ఈ నగ్న వీడియో పంపారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. ఈ వీడియోని అతడి స్నేహితులకు సెండ్ చేస్తానని బెదిరించారు సైబర్ నేరగాళ్లు. దాంతో బాధితుడు తన ఫ్రెండ్స్ వద్ద అప్పు చేసి మరి 36 వేల రూపాయలు వారికి పంపించాడు. ఆ తర్వాత కూడా బెదిరింపులు ఆగకపోవడంతో.. బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: నేను పక్కా పల్లెటూరి వాడిని: ఐఏఎస్ ‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ -
‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్తో వల వేసి.. వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేసి.. స్క్రీన్ రికార్డింగ్తో న్యూడ్ వీడియోలు రికార్డు చేసి.. అందినకాడికి దండుకునే ముఠాలు నానాటికీ రెచ్చిపోతున్నా యి. సెక్స్టార్షన్గా పిలిచే ఈ నేరాలకు సంబంధి చి నగర సైబర్ క్రైమ్ ఠాణాకు దాదాపు ప్రతి రెండు రోజులకు ఓ ఫిర్యాదు వస్తోంది. తాజాగా ఇలాంటి గ్యాంగ్ వల్లో పడి రూ.10 లక్షలు నష్టపోయిన తార్నాకకు చెందిన ఈవెంట్ మేనేజర్ శుక్ర వారం ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తార్నాక ప్రాంతానికి చెందిన ఈవెంట్ మేనేజర్కు కొన్నాళ్ల క్రితం ఓ యువతి పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీన్ని ఆయన యాక్సెప్ట్ చేయడంతో ‘ఆమె’ ఫ్రెండ్గా మారిపోయింది. కొన్నాళ్ల పాటు సదరు ‘యువతి’ మెసెంజర్లో చాటింగ్ చేసింది. ఆ తర్వాత సెక్స్ చాటింగ్ మొదలు పెట్టి వాట్సాప్ నెంబర్ తీసుకుంది. ఇంటర్నెట్ సంగ్రహించిన అర్ధనగ్న, నగ్న వీడియోలను సైబర్ నేరగాళ్లు ప్రత్యేక యాప్స్ ద్వారా తమ ఫోన్లో ఉంచి నగరవాసికి ప్లే చేసి చూపా రు. దీంతో ఇతగాడికి ఆ ‘యువతి’ తనతో మాట్లాడుతూ నగ్నంగా మారిన భావన కలిగింది. దీంతో అతను పూర్తిగా సైబర్ నేరగాళ్ల వల్లో పడిపోయాడు. ఇలా ఒకటిరెండు సార్లు వీడియోలు చూపించిన సైబర్ నేరగాళ్లు ఆపై మాటల్లో దింపి నగర ఈవెంట్ మేనేజర్ సైతం అలానే చేసేలా చేశారు. ఈ దృశ్యాలను స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ ద్వారా రికా ర్డు చేశారు. వీటిని యూట్యూబ్ చానల్లో ఉంచిన లింకుల్ని బాధితుడికి పంపారు. ఇవి చూసి కంగుతిన్న అతగాడు తొలగించాలంటూ కోరాడు. దీనికి రూ.10 లక్షలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు షరతు విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి ఆ మొత్తం బదిలీ చేశారు. ఆపై కొన్ని రోజులకు మరికొంత మొత్తం కావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. దీంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. చదవండి: మీటింగ్...డేటింగ్.. చీటింగ్ -
12సార్లు ఓటీపీ చెప్పాడు.. రూ.1.76 లక్షలు గోవింద
సాక్షి, సిటీబ్యూరో: ఎస్బీఐ క్రెడిట్కార్డుకు సంబంధించిన రీడీమ్ పాయింట్లు ఎక్స్పైర్ అవుతున్నాయంటూ నగరవాసికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.1.76 లక్షలు కాజేశారు. కార్ఖానా ప్రాంతానికి చెందిన బాధితుడికి ఫోన్ చేసిన నేరగాళ్లు ఎక్స్పైరీ అయ్యే పాయింట్లను వెంటనే రీడీమ్ చేసుకోవాలని సూచించారు. దాని కోసమంటూ అతడి కార్డు వివరాలు తెలుసుకున్నారు. ఆపై బాధితుడి ఫోన్కు వచ్చిన ఓటీపీలను తెలుసుకుంటూ ఖాతా నుంచి డబ్బు కాజేశారు. మొత్తం 12 సార్లు ఓటీపీలు చెప్పిన బాధితుడు రూ.1.76 లక్షలు కోల్పోయాడు. అలాగే ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని భావించిన బోరబండ వాసి ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. అందులో కనిపించిన ఓ నెంబర్లో సంప్రదించగా.. వివిధ రకాలైన ఫీజుల పేరు చెప్పిన సైబర్ నేరగాళ్లు రూ.80,800 స్వాహా చేశారు. వీరిద్దరూ వేర్వేరుగా శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక! -
ప్రేమికులు రోజు బహుమతంటూ వల వేస్తారు..
సాక్షి, హైదరాబాద్: డేటా చోరీ చేసేందుకు ఆన్లైన్ కేటుగాళ్లు నూతన పంధాను ఎంచుకున్నారు. ప్రముఖ సంస్థ పేరుతో ఫోన్ చేసి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే బహుమతులు గెలుచుకోవచ్చంటూ ప్రజలను బురడీ కొట్టిస్తున్నారు. ప్రేమికుల రోజును పురస్కరించుకొని తాము అడిగే సులభమైన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంఐ 11 టీ మొబైల్ ఫోన్ గెలుచుకోవాలంటూ గాలం వేసి, మొబైల్ ఫోన్లలో డేటాను తస్కరిస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా సైబర్ నేరగాళ్లు చెప్పే యాప్లను డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్కు స్పందించి, వాళ్లు చెప్పిన విధంగా చేస్తే.. బ్యాంకు లావాదేవీలు మొత్తం సైబర్ నేరగాళ్లు చేతుల్లోకి వెళ్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రజలను బురడీ కొట్టించే క్రమంలో కేటుగాళ్లు లింకులు పంపి, వాట్సప్ గ్రూపులు ద్వారా 20 మంది స్నేహితులకు పంపాలని మెసేజ్లు పంపుతారని, ఇలాంటి వాటికి ప్రజలు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో డేటా చోరీకి సంబంధించి అనేక కేసులు నమోదవుతున్నాయని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు. -
‘విద్యుత్’కు సైబర్ ముప్పు!
సాక్షి, అమరావతి: సైబర్ మూకలు విద్యుత్ నెట్వర్క్పై దాడులకు పాల్పడే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. విదేశీ విద్యుత్ ఉపకరణాల దిగుమతిలో కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తాము సూచించిన ల్యాబొరేటరీలో పరీక్ష జరపకుండా ఏ ఒక్క వస్తువునూ పవర్ సెక్టార్లోకి తీసుకోవద్దంటూ ఇటీవల ఆదేశించింది. దీంతో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తమై.. పలు చర్యలు తీసుకుంది. విద్యుత్ అనేది ప్రధాన జాతీయ మౌలిక వనరు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా ముఖ్యమైనది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. విద్యుత్ వ్యవస్థపై సైబర్ దాడి చేస్తే తక్షణమే కోలుకునే అవకాశం ఉండదు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కంప్యూటర్తో అనుసంధానం కానీ విద్యుత్ సరఫరా ఎక్కడా లేదు. జాతీయ, రాష్ట్రీయ గ్రిడ్లో కమ్యూనికేషన్ సిస్టం ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలన్నీ గ్రిడ్కే లింక్ అయ్యి ఉంటాయి. విద్యుత్ వాడకం పెరిగినా.. తగ్గినా గ్రిడ్ కంట్రోల్ చేయకపోతే క్షణాల్లో నష్టం భారీగా ఉంటుంది. కీలకమైన లోడ్ డిస్పాచ్ సెంటర్స్లోని ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు కూడా ఇంటర్నెట్కు లింక్ అయ్యి ఉంటాయి. విద్యుత్ సెక్టార్లో వాడే ఉపకరణాలను దాదాపుగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. వీటి తయారీలో సాఫ్ట్వేర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో సైబర్ మూకలు విద్యుత్ ఉపకరణాల ద్వారా వైరస్లను పంపే అవకాశముందని కేంద్రం పేర్కొంది. ప్రత్యేక ల్యాబొరేటరీ.. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విదేశీ ఉపకరణాలను పరీక్షించేందుకు కేంద్రం ప్రత్యేకంగా ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసింది. ఇవి కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి. దిగుమతి అయిన ఉపకరణాల నాణ్యత, వాటి సెక్యూరిటీని ఇవి పరిశీలిస్తాయి. అవి ధ్రువీకరించిన తర్వాతే ఉపకరణాలను విద్యుత్ సంస్థలు అనుమతించాలని కేంద్రం సూచించింది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కూడా ఈ నిబంధన కచ్చితంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్లో అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)నుంచి రూ.117 కోట్లు కొట్టేసేందుకు చేసిన ప్రయత్నంలో పలు రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరగాళ్ల పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ స్కామ్ సూత్రధారులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టిన సీఐడీ బృందాలు.. ప్రధాన సూత్రధారి బీహార్కు చెందిన సింగ్ను పట్టుకుని విచారించగా.. అతను కీలక విషయాలు వెల్లడించినట్టు సమాచారం. బీహారే కాకుండా కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ లింకులు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. సింగ్తో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్న సీఐడీ మొత్తం 30 మంది అనుమానితుల జాబితా సిద్ధం చేసింది. మిగతావారి కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో గాలింపు ముమ్మరం చేశాయి. రూ.117 కోట్లు కొట్టేసేందుకు యత్నం గత సెప్టెంబర్లో పశ్చిమబెంగాల్, కర్ణాటకలోని బ్యాంకుల్లో మూడు చెక్కులతో మొత్తం రూ.117 కోట్లు డ్రా చేసేందుకు అగంతకులు ప్రయత్నించారు. ఆ చెక్కులు ఏపీ సీఎంఆర్ఎఫ్కు చెందినవి కావడంతో అనుమానం వచ్చిన ఆయా బ్యాంకుల ప్రతినిధులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలగపూడి బ్రాంచి అధికారులను సంప్రదించారు. అవి ట్యాంపరింగ్ చేసిన నకిలీ చెక్కులుగా నిర్ధారించిన ఎస్బీఐ అధికారులు వాటి చెల్లింపులు నిలిపివేశారు. ఆ తర్వాత కడపలోనూ ఫోర్జరీ చెక్కుతో సీఎంఆర్ఎఫ్ నిధులు రూ.9.95 లక్షలు డ్రా చేసే ప్రయత్నాన్ని బ్యాంకు అధికారులు నిలువరించారు. దీనిపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. చెక్కుల విషయమై క్షేత్రస్థాయిలో పరిశీలించి చిన్న మొత్తాలతో కూడిన చెక్కులను పెద్ద మొత్తాలుగా ట్యాంపర్ చేసినట్లు తేల్చారు. అనంతరం ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు ప్రారంభించారు. 22 మందిని విచారించిన సీఐడీ! తొలుత కర్ణాటకలోని మంగళూరులోను, పశ్చిమబెంగాల్లోని కొల్కతా బ్యాంకుల్లో రికార్డులను సీఐడీ అధికారులు తనిఖీ చేశారు. ఫోర్జరీ చెక్కులు మార్చేందుకు ప్రయత్నించిన రోజుల్లో ఆయా బ్యాంకుల్లోని సీసీ కెమెరాల వీడియో ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే బీహార్కు చెందిన సింగ్ను పట్టుకున్నారు. అతను ఇచ్చిన కీలక సమాచారంతో మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు పలు రాష్ట్రాలకు చెందిన 22 మందిని పట్టుకుని విచారించినట్లు సమాచారం. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాగా నిందితులకు ఏపీకి చెందిన కొందరు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. -
చాలెంజ్లతో జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: నా కొత్త చీర ఎలా ఉంది? ఈ రోజు డాటర్స్ డే..మా అమ్మాయిని దీవించండి.. మా యువ జంట ఎలా ఉంది? అంటూ రకరకాల చాలెంజ్లతో ఫొటోలు, సెల్ఫీలు అప్లోడ్ చేసి వాటికొచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోతున్నారా? అయితే జర జాగ్రత్త. ఇలాంటి చాలెంజ్ల పేరుతో మీ కుటుంబసభ్యుల ఫొటోలు మీరే సైబర్ నేరగాళ్ల చేతుల్లో పెట్టి వారు వేధింపులకు గురయ్యేందుకు కారణమవుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజమని చెబుతున్నారు పోలీసులు. ఇటీవల కపుల్ ఛాలెంజ్ పేరుతో చాలామంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటోలను సైబర్ నేరగాళ్లు డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి ఆర్థిక, లైంగిక వేధింపులకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి వాటిని తొలగించాలంటే..తాము సూచించినంత డబ్బులు పేటీఎం, గూగుల్ పేలో వేయాలని బెదిరింపులకు దిగుతున్నారని, ఫొటోలతో ఇతరులకు సైబర్ వలవేసి నేరాలలో ఇరికించిన ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. కాబట్టి ఎవరికి వారు సోషల్ మీడియాలో స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, ఇష్టం వచ్చినట్లుగా మహిళల ఫొటోలను అప్లోడ్ చేయవద్దని పోలీసులు కోరుతున్నారు. -
మీటింగ్...డేటింగ్.. చీటింగ్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు పంథా మార్చుకుంటున్నారు. అబ్బాయిలకు అందమైన యువతులతో మీటింగ్, డేటింగ్ కల్పిస్తామంటూ నమ్మించి లక్షల్లో దండుకునే మోసానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు వస్తున్నాయి. ఫిమేల్ ఎస్కాట్ సర్వీస్ పేరుతో చేస్తున్న ఈ మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. లోకాంటో.కామ్, ఇండియా డేట్స్, మింగిల్ తదితర డేటింగ్ సైట్లలో ప్రత్యేక డేటింగ్ ప్యాకేజీ పేరుతో మోసగాళ్లు పోస్టులు చేస్తున్నారు. ఏ ప్రాంతమైనా ఏ సమయమైనా కాల్ గరŠల్స్ను పంపిస్తామంటూ...అంతా కస్టమర్ చాయిస్ అంటూ వల విసురుతున్నారు. అలాగే వివిధ నంబర్లతో మోసగాళ్లు వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత చాటింగ్ చేస్తున్నారు. కాస్త దగ్గరయ్యాక బాధితులు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను రికార్డు చేస్తున్నారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి మరీ మరిన్ని డబ్బులు దండుకుంటున్నారు. మరోవైపు అమ్మాయిలు, పెళ్లైన యువతులలతో డేటింగ్ చేయిపిస్తామంటూ వారి ఫోన్ నంబర్ కూడా ఇస్తామంటూ బాధితులను నమ్మిస్తున్నారు. ఆ తర్వాత ప్రారంభ చెలింపులు చేయమనడంతో బాధితులు చేస్తున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ ఫీజు, సేఫ్టీ డిపాజిట్ కింద మరిన్ని డబ్బులు లాగుతున్నారు. మచ్చుకు కేసు ఇలా... కొన్నిరోజుల క్రితం ఓ బాధితుడి సెల్కు క్యూపీ–జెడ్ఎక్స్సీవీబీఎన్ నుంచి ‘మ్యారీడ్ లేడీస్ నీడ్స్ జిమ్స్ మీటింగ్ అండ్ డేటింగ్...30కే పర్ డేట్. కాల్ టూ సెల్ నంబర్’ అంటూ ఎస్ఎంఎస్ వచ్చింది. ఆ నంబర్కు బాధితుడు కాల్ చేయగానే ప్రీతి అనే పేరుతో అమ్మాయి మాట్లాడింది. అతని వివరాలు తెలుసుకున్న ఆమె అమ్మాయిను చూపించాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీజు కింద రూ.34,015 ఫోన్పే ద్వారా చెల్లించాడు.ఆ తర్వాత మరొకరు డ్రైవర్కు రూ.20,000లు చెల్లించాలనడంతో నో అన్నాడు. అవి చెల్లించకుంటే మిమ్మల్ని చంపుతానంటూ బెదిరించడంతో బాధితుడు సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డాటాతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాదీ హ్యాకర్ కోసం వేట! సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ప్రతిష్టాత్మక దూరవిద్య కేంద్ర సింజయోసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఎస్సీడీఎల్) సంస్థకు చెందిన సర్వర్ను హ్యాక్ చేసి, 178 మంది విద్యార్థుల మార్కుల్ని ట్యాంపర్ చేసిన స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న హైదరాబాదీ హ్యాకర్ కోసం పుణే సైబర్ క్రైమ్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఈ స్కామ్లో మరో నిందితుడైన ఆ సంస్థ పరీక్షల నిర్వహణ విభాగం అధిపతి సందీప్ హెంగ్లేను సోమవారం అరెస్టు చేశారు. ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ సేవల్ని అందించే ఎస్సీడీఎల్ సంస్థ కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థులకు అనివార్య పరిస్థితుల్లో గ్రేస్ మార్కులు అందిస్తుంటారు. ఈ మార్కులు పొందే విద్యార్థులు ఆయా పరీక్షలుల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆ సంస్థకు చెందిన పరీక్షల విభాగాధిపతి కొందరు విద్యార్థులతో కుమ్మక్కయ్యారు. వారికి వచ్చిన మార్కుల్ని పెంచడానికి వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. హైదరాబాద్కు చెందిన హ్యాకర్ సహాయంతో సంస్థ సర్వర్ను హ్యాక్ చేయించి 178 మంది విద్యార్థుల మార్కులు ట్యాంపర్ చేయించాడు. 2018 సెప్టెంబర్–2019 డిసెంబర్ మధ్య సాగిన ఈ వ్యవహారంపై ఎస్సీడీఎల్ ఫిర్యాదు మేరకు పుణే సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేసిన విషయం విదితమే. సాంకేతిక ఆధారాలను బట్టి ఎస్సీడీఎల్ సంస్థ పరీక్షల నిర్వహణ విభాగం అధిపతి, హైదరాబాద్ హ్యాకర్ పాత్రలు నిర్థారించారు. వీరి మధ్య జరిగిన కొన్ని వాట్సాప్ చాటింగ్స్ను సేకరించారు. సోమవారం పరీక్షల నిర్వహణ విభాగాధిపతి సందీప్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కీలక విషయాలు సంగ్రహించడంతో పాటు హైదరాబాదీ హ్యాకర్ను పట్టుకోవడానికి అతడిని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పుణే సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు శనివారం వరకు అనుమతించింది. దీంతో సందీప్ను తమ కస్టడీలోకి తీసుకున్న పుణే సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. హైదరాబాదీ హ్యాకర్ను పట్టుకోవడానికి ఇతడిని తీసుకుని నగరానికి ఓ ప్రత్యేక బృందాన్ని పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఫేస్బుక్లో ఫేక్ ప్రొఫైల్స్!
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్ కేంద్రంగా సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఓపక్క పోలీసు అధికారుల్ని, మరోపక్క సాధారణ ప్రజల్ని టార్గెట్గా చేసుకుంటున్నారు. అప్పటికే ఫేస్బుక్ ఖాతాలు ఉన్న వారి ఫొటోలు, పేర్లు వినియోగించి కొత్త ఖాతాలు తెరుస్తున్నారు. వీటి ఆధారంగా ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి, చాటింగ్ చేసి, డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్లలో ఉన్న అధికారులతో పాటు డీజీపీ కార్యాలయంలో పని చేసే వారి పేరుతోనూ ఈ నకిలీ ఖాతాలు తెరుచుకున్నాయి. తాజాగా బాధితులుగా మారిన ముగ్గురు సామాన్య ప్రజలు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరహా నేరాలు చేయడానికి తెగబడుతున్న సైబర్ నేరగాళ్ళు ప్రాథమికంగా ఫేస్బుక్లోకి ప్రవేశిస్తున్నారు. వీలున్నన్ని ఖాతాల వివరాలు సెర్చ్ చేసి ప్రైవసీ సెట్టింగ్స్ లేని వాటిని గుర్తిస్తున్నారు. ఆ ఖాతాల్లో ఉన్న ఫొటోలను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆపై ఆ వారి ప్రొఫైల్ నేమ్లు, డౌన్లోడ్ చేసిన ఫొటోలను వినియోగించి నకిలీ ఖాతాలు సృషిష్టిస్తున్నారు. ఈ కొత్త ఖాతాల నుంచి ఆయా అసలు ఖాతాదారుల ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారికే మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తున్నారు. వీటిని చూస్తున్న ఎదుటి వ్యక్తులు ఆయా తమ ఫ్రెండ్సే అనివార్య కారణాలతో మరో ఖాతా తెరిచి ఉంటారని భావించి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది మొదటి ఘట్టం పూర్తయిన తర్వాత ఆ నకిలీ ఖాతాలు వినియోగించి కొన్నాళ్ళు ‘కొత్త ఫ్రెండ్స్’తో చాటింగ్ చేస్తున్నారు. ఆపై తమకు అత్యవసరం ఉందంటూ ఈ నకిలీ ఖాతాల నుంచి అసలు వ్యక్తుల ఫ్రెండ్స్కు సందేశం పంపిస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పంపాలని, కొన్ని గంటల్లోనే తిరిగి ఇచ్చేస్తానంటూ ఈ–వాలెట్స్లోని బదిలీ చేయాలంటున్నారు. అయితే అనేక మంది ‘స్నేహితులు’ మాత్రం నకిలీ ఖాతా నుంచి డబ్బు ప్రస్తావన వచ్చిన వెంటనే అసలు వ్యక్తుల్ని సంప్రదించి అప్రమత్తం చేస్తున్నారు. ఇలా బుధవారం ముగ్గురు నగవాసులకు తమ పేరులో ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు ఉన్నట్లు, వాటి ద్వారా డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో వీళ్ళు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. మరోపక్క పోలీసు విభాగంలో పని చేస్తున్న అనేకమంది అధికారులు, సిబ్బంది పేర్లతో నకిలీ ఖాతాల సృష్టి ఆగలేదు. ఓ పక్క బాధ్యుల్ని పట్టుకోవడానికి ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. మరోపక్క ఆయా అధికారులు, పోలీసు విభాగాలు ఈ క్రైమ్పై అవగాహన కల్పించడానికి సోషల్మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. -
వ్యాపారికి రూ.60 లక్షల టోకరా
సాక్షి, హైదరాబాద్: ఫేక్ ఈ–మెయిల్ ఐడీతో హైదరాబాద్కి చెందిన ఓ వ్యాపారికి రూ.60 లక్షలు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. జూబ్లీహిల్స్కు చెందిన శేషగిరిరావు ట్రైక్యాడ్ డిజైన్ కన్సల్టెన్సీ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈయనకు తన క్లయింట్ అయిన అమెరికాకు చెందిన గ్లోబల్ జియో సప్లయిస్ సంస్థ నుంచి 3డీ సాఫ్ట్ మౌస్లు దిగుమతి చేసుకుంటుంటారు. ఇటీవల శేషగిరిరావుకు చెందిన అధికారిక ఈ–మెయిల్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో ఆయన అమెరికా సంస్థతో చేస్తున్న వ్యాపార లావాదేవీలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో అమెరికా సంస్థ అధికారిక ఈ–మెయిల్ ఐడీని పోలిన మరో ఐడీని క్రియేట్ చేసి దాన్నుంచి ఈ నెల 8న శేషగిరిరావుకు సైబర్గాళ్లు ఓ మెయిల్ పంపారు. అందులో తమకు చైనా సంస్థతోనూ లావాదేవీలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ దేశంపై అమెరికాలో ఆంక్షలు ఉన్నందున అక్కడి నుంచి తమకు అవసరమైన సరుకును మీరు దిగుమతి చేసుకుని, ఆ సరుకు భారత్ నుంచి వస్తున్నట్లు తమకు ఎగుమతి చేయాలని సూచించారు. అందులోనే చైనాకు చెందిన సంస్థ పేరుతో ఓ చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు పొందుపరిచారు. ఈ ఖాతాలోకి 79,800 డాలర్లు (రూ.60 లక్షలు) జమ చేస్తే మీకు చైనా నుంచి సరుకు వస్తుందంటూ నమ్మించారు. సదరు అమెరికా సంస్థతో శేషగిరిరావుకు 13 ఏళ్లుగా వ్యాపార అనుబంధం ఉండటంతో సదరు ఖాతాలోకి ఈ నెల 18న ఆ మొత్తం జమ చేశాడు. ఇది జరిగిన రెండ్రోజులకు స్పేర్ పార్ట్స్ పంపడానికి మరికొంత మొత్తం చెల్లించాలని సైబర్ నేరగాళ్లు ఇంకో మెయిల్ పంపారు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి తనకు వచ్చిన మెయిల్ ఐడీని పరిశీలించగా మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో ఆయన బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇది నైజీరియన్ల పనిగా అనుమానిస్తున్నారు. -
ఫోన్ నంబర్స్ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే..
సాక్షి హైదరాబాద్: సుభాష్ అర్జంట్ పనిమీద కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు. అంతలో ఫోన్ రావడంతో ఎవరో అని లిఫ్ట్ చేశాడు. సార్.. అంటూ ఓ యువతి గొంతు అవతలినుంచి పలకరించింది. తెలిసిన వాళ్లేమో అని సమాధానమిస్తే.. నగర శివారులో ప్లాట్లు ఉన్నాయి.. తక్కువ ధరకు కొనుగోలు చేస్తారా అని అంటోంది. అసలే చీకాకులో ఉన్న అతను ఫోన్ కట్ చేశాడు. ఇలాంటి ఫోన్లు ఒక్క సుభాష్కే కాదు.. నగరంలో దాదాపు ప్రతి ఒక్కరినీ పలకరిస్తాయి. ఎందుకంటే షాపింగ్ చేసినపుడు ఫోన్ నెంబర్ ఇస్తాం కాబట్టి.. నగర జీవితం ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు బిజీగా ఉంటుంది. దీంతో పాటు ఫోన్ కూడా మనతోపాటు బిజీ అయిపోయింది. ఎప్పుడు.. ఎక్కడ ఉన్నా మొబైల్ ఉండాల్సిందే. కాల్స్ వస్తూనే ఉంటాయి. మనం మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఇటీవల టెలీకాలర్ల నుంచి ఫోన్లు ఎక్కువగా రావడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. సార్.. అంటూ తీయటి గొంతుతో మాట్లాడటం.. సమయం వృథాచేయడం.. లోన్..క్రెడిట్కార్డ్ అంటూ మాట్లాడుతున్నారు. ఎక్కువగా యువతులే ఫోన్లు చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీ, వివిధ బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు.. మార్కెటింగ్ సంస్థల నుంచి కాల్స్ వస్తున్నాయి. వ్యక్తిగత రుణం కావాలా? క్రెడిట్ కార్డు కావాలా..సెల్ఫోన్ నెట్వర్క్లో మంచి ఆఫర్లు ఉన్నాయంటూ ఫోన్ కంపెనీల వారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్స్కు టిప్స్ చెబుతామంటూ కొందరు, నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలో వెంచర్ ఉందని, ప్లాట్ బుక్ చేసుకోమని ఇంకొందరు నిత్యం ఫోన్ చేస్తూనే ఉంటారు. కొత్త సిమ్ తీసుకున్నా... మార్కెటింగ్ కాల్స్కు తోడు నకిలీలు కూడా పుట్టుకొస్తున్నారు. బ్యాంకింగ్, సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వ్యక్తిగత రుణాల పేరిట జరుగుతున్న మోసాల గురించి తెలియని విషయం కాదు. ఇలాంటి వారి వేధింపులు భరించ లేక చాలామంది ఫోన్ నంబర్లు మార్చుతున్నారు. ఆ నంబర్లను కూడా టెలీకాలర్స్ సేకరంచి ఫోన్ చేస్తున్నారు. వారు అందరి ఫోన్ నంబర్లు ఎలా సేకరిస్తున్నారని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సెల్ఫోన్ కంపెనీలతోపాటు పలు మార్గాల ద్వారా ఫోన్ నంబర్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. సాధారణ ప్రజల నుంచి పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ఫోన్ నంబర్లను సైతం సేకరించి కాల్ చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ముందే కరోనా కాలం జనం ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. దీనికి తోడు అ వస్తువు కొనండి మంచి ఆఫర్ ఉంది. మీరు మా సంస్థలో పెట్టుబడి పెడితే అత్యధికంగా వడ్డీ లభిస్తుంది. అని కాల్స్తో ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి కాల్స్ వస్తున్నాయని పలువురు చెబుతున్నారు. నిరంతరం కాల్స్ రావడంతో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకట్ట ఎలా? ఇలా అడ్డూ అదుపు లేకుండా కాల్స్ వస్తుంటే.. ఏం చేయాలో దిక్కుతోచక మొబైల్ యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాక..ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇటువంటి కాల్స్పై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని యూజర్లు కోరుతున్నారు. బ్లాక్ చేసినా... ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశాల మేరకు మార్కెటింగ్ కాల్స్ వద్దనుకునే వారు డీఎన్డీ (డూనాట్ డిస్టర్బ్) ఆప్షన్ ఎంచుకునే వారు. అప్పట్లో మార్కెటింగ్ నంబర్లు వేరుగా కనిపించేవి. డీఎన్డీ ఎంచుకున్న తర్వాత కూడా టెలీకాలర్స్ మార్కెటింగ్ నంబర్స్ నుంచి కాకుండా వేరే ఫోన్ నంబర్ల నుంచి కాల్ చేసి వేధిస్తున్నారు. తరచూ ఫోన్లు వస్తున్నాయని ఆ నంబర్ను బ్లాక్ చేస్తే మరో నంబర్ నుంచి కాల్ చేస్తున్నారు. బ్లాక్ అయిన ఫోన్ నెంబర్లు స్పామ్ (రెడ్ కలర్)లో కనిపిస్తాయి. నంబర్స్ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే.. మనం రోజుల వారి షాపింగ్, ఆసుపత్రులకు, మెడికల్ షాపుల్లో కొనుగోలుచేస్తుంటాం. అప్పుడు బిల్లింగ్ సమయంలో మీ ఫోన్ నంబర్ అడిగి తీసుకుంటారు. ఇలా మనం తెలుసో తెలియకో మన నంబర్ చెబుతాం.ఫోన్ నంబర్ ఇవ్వలేమని చెబితే మీ వస్తువులు బిల్ చేయాలంటే సిస్టమ్లో నంబర్ ఎంటర్ చేయాలని, లేకపోతే బిల్ వీలుకాదని సమాధానం ఇస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా మీ నంబర్ ఇతరులకు వెళ్లిపోతుంది. పలు వ్యాపార సంస్థలు నెంబర్లు ఆయా మాల్స్,వ్యాపార సంస్థల నుంచి సేకరిస్తాయి. పలు సందర్భాల్లో మీకు ఫోన్ చేస్తున్న వ్యక్తి మీ వృత్తి, ఉద్యోగం గురించి కూడా చెబుతాడు. అంటే మీరు షాపింగ్ సమయంలో ఆ వివరాలు రాసిచ్చారన్నమాట. -
ఈమెయిల్ ట్రిక్స్.. సైబర్ ఎటాక్స్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో బ్యాంకులు, హెల్త్కేర్ రంగంలో పనిచేస్తున్న పలు సంస్థలను సైబర్దాడులు గజగజలాడిస్తున్నాయి. ప్రతిరోజూ సరాసరిన మూడు సైబర్ ఎటాక్స్ తమ వద్ద నమోదవుతున్నట్లు నగర కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అండ్ కంట్రోల్ అసోసియేషన్’ తాజా అధ్యయనంలో తేలింది. సైబర్ దాడులతోపాటు ఫిషింగ్ మెయిల్స్తో ఆయా బ్యాంకింగ్, నాన్బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, హెల్త్కేర్ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థలు ఈ దాడులకు గురవుతున్నట్లు ఈ సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మేనేజ్మెంట్ హోదాలో ఉన్నవారికి నిత్యం వివిధ సంస్థలు, వ్యాపార, వాణిజ్య లావాదేవీల నిమిత్తం వచ్చే మెయిల్స్లో సుమారు 26 శాతం ఫిషింగ్ మెయిల్స్(చౌర్యానికి పాల్పడేవి) ఉన్నాయని.. ఉద్యోగులు ఏమరుపాటుగా వీటిని తెరిచి చూస్తే ఆయా సంస్థల డేటాబేస్ చౌర్యంతోపాటు సిస్టం, సాఫ్ట్వేర్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని తేల్చింది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు విధిగా సైబర్ సెక్యూరిటీ అంశంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఇప్పటికే తమ సంస్థకు చెందిన సుమారు 800 మంది నిపుణులు సైబర్దాడుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా సంస్థలకు అవగాహన కల్పించడంతోపాటు పరిశోధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఉపయోగాలివే.. సైబర్ దాడుల నిరోధానికి ఇప్పటికే నగరంలో సైబర్ సెక్యూరిటీ క్లస్టర్లు పనిచేస్తున్నాయని.. వాటితో చేకూరే ప్రయోజనాలను ఈ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. సైబర్ నేరగాళ్ల సమాచారం, వారు వినియోగిస్తున్న సాంకేతికతపై సమస్త సమాచారాన్ని తెలుసుకునే హబ్ను ఏర్పాటు చేయడం, సైబర్ సెక్యూరిటీ క్లస్టర్లో చేరిన సంస్థలు లేదా దేశాలు, సంస్థలకు సైబర్ నేరాల నిరోధానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తారు. నేరాలపై జరిపే పరిశోధనకు నిపుణులు సహకరిస్తారు. ఆయా సంస్థల మధ్య సమన్వయం సాధించడంతోపాటు సైబర్ నేరాలు జరిగిన తీరును సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తారు. భవిష్యత్లో ఇలాంటి నేరాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తారు. విశ్వవ్యాప్తంగా సైబర్ నేరాల నిరోధానికి అవలంభించాల్సిన సాంకేతిక వ్యూహాలను సిద్ధం చేస్తారు. ఈ విషయంలో ఆయా సంస్థలకు అవగాహన కల్పించడంతోపాటు మార్గనిర్ధేశం చేస్తారు. చర్యలివే.. సైబర్ దాడులపై అప్రమత్తమైన రాష్ట్ర ఐటీశాఖ సైతం ఈ విషయంలో పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాల డేటా భద్రంగా దాచేందుకు సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ను నిర్వహిస్తున్న విషయం విధితమే. సైబర్దాడుల నిరోధానికి సైబర్ సెక్యూరిటీ పాలసీని కూడా తీసుకొచ్చినట్లు ఐటీశాఖ వర్గాలు‘సాక్షి’కితెలిపాయి.సెక్యూరిటీఆపరేషన్స్సెంటర్తోపాటుహేగ్సెక్యూరిటీడెల్టా,సీడాక్సంస్థలసౌజన్యంతోసైబర్దాడులనిరోధానికి ప్రయత్నిస్తున్నామన్నాయి. పెరుగుతున్న సైబర్ నేరాలు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గతేడాదిగా సుమారు వెయ్యికిపైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఇందులో సాంకేతిక, సాంకేతికేతర అంశాలున్నాయి. పలు బ్యాంకులు, ఆర్థిక, వాణిజ్య సంస్థలకు చెందిన కంప్యూటర్లు, కంప్యూటర్ల నెట్వర్క్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డేటా, సైబర్ స్పేస్కు ముప్పు వాటిల్లడం, డేటా తస్కరణ, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు వంటి నేరాలు చోటుచేసుకున్నాయి. ఈ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, ప్రోగ్రామ్లు రూపొందించే అంశాలను సైబర్ సెక్యూరిటీ కోర్సులో భాగంగా ఉన్నాయి. ఈ రంగంలో మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. సమాచారం, డేటా భద్రత వంటి అంశాలకు ఇటీవలి కాలంలో పలు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ కోర్సులకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ అంశంపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉన్నతాధికారులకు అవగాహన తప్పనిసరి అని.. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఈ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. -
కోవిడ్ పేషెంట్లకు కొత్తగాలం
సాక్షి, హైదరాబాద్: ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’.. ఈ సామెత సైబర్ నేరగాళ్లకు చక్కగా సరిపోతుంది. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న వేళ.. సైబర్ నేరగాళ్లు సైతం పరిస్థితికి తగినట్లుగా నేరాల రూటు మార్చుకుంటున్నారు. మొన్నటిదాకా పీఎం కేర్స్, ఆరోగ్యసేతు, టిక్టాక్ ప్రో యాప్లతో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు నేరుగా కోవిడ్ పేషెంట్లనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. ఇందుకోసం కోవిడ్ పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడే ఆక్సిమీటర్లను ఎంచుకున్నారు. ఆక్సిమీటర్లను అమ్ముతామంటూ ఫోన్లకు మాల్వేర్లను పంపిస్తూ డబ్బులను కొల్లగొడుతున్నారు. ఏంటి ఈ ఆక్సిమీటర్లు? సాధారణంగా రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన పరికరమే ఈ ఆక్సిమీటర్. ఇవి బహిరంగ మార్కెట్లో రూ.500 నుంచి రూ.5,000 వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పలు ఈ కామర్స్ వెబ్సైట్లు, మెడికల్ షాపులు అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నాయి. కేవలం 3 నుంచి 5 సెంటీమీటర్ల పొడవుండే ఈ పరికరాన్ని చూపుడువేలు చివరన అమరుస్తారు. దానిపై ఉన్న డిజిటల్ తెరపై రక్తంలో ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా ఉందా? సంతృప్త స్థాయిలో ఉందా? అన్నది తెలిసిపోతుంది. మాల్వేర్ పంపి.. తమ కుటుంబంలో ఒకరికి కోవిడ్ సోకి.. ఆక్సిమీటర్ల కోసం గూగుల్లో సెర్చ్ చేస్తోన్న అమాయకులను సైబర్ నేరస్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. కోవిడ్ పేషెంట్లలో ముందుగా ప్రభావితమయ్యే భాగాలు ఊపిరితిత్తులు. ఒక్కొసారి కొందరిలో ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అలాంటి వారిలో ఆక్సిజన్ స్థాయిలు లెక్కించేందుకు వాడే ఈ పరికరం కోసం చాలామంది గూగుల్లో సెర్చ్ చేయడాన్ని గమనించారు. వెంటనే ఆక్సిమీటర్లు అమ్ముతామంటూ అందరి సెల్ఫోన్లకు మాల్వేర్ ఉన్న లింకులను పంపుతున్నారు. ఈ మాల్వేర్లో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే వైరస్లు ఉంటాయి. ఫలితంగా ఈ లింకును క్లిక్ చేసిన క్షణాల్లో బ్యాంకు ఖాతాల్లోని మొత్తం నగదు మాయమవుతుంది. ఇలాంటి పరికరాలేమైనా కొనాలనుకుంటే గుర్తింపు ఉన్న ఈ కామర్స్ సైట్లు, ప్రముఖ మెడికల్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవాలని, అపరిచిత వ్యక్తులు పంపిన అనుమానాస్పద లింకులు క్లిక్ చేసి చేతిలో డబ్బులు పోగొట్టుకోవద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
హలో.. మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా!
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి... కార్డుల వివరాలతో పాటు ఓటీపీలు సైతం సంగ్రహించి... అందినకాడికి దండుకునే జమ్తార ముఠాలు స్థానిక భాషలను సైతం నేర్చుకున్నాయి. ఇటీవల కాలంలో నగరంలోని పలువురికి ఈ ముఠాల నుంచి తెలుగులో ఫోన్లు వచ్చినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఒకప్పుడు హిందీ, ఇంగ్లీషుల్లో మాత్రమే మాట్లాడే ఈ నేరగాళ్లు .. ఆ పంథాలో అందరినీ బురిడీ కొట్టించడం సాధ్యం కావట్లేదనే స్థానిక భాషలపై దృష్టి పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి ఫోన్కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ ప్రాంతమంతా అంతే... జార్ఖండ్ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ వెళ్లే మార్గంలో ఉన్న ప్రాంతం జమ్తార. ల్యాప్టాప్స్, సెల్ఫోన్లతో కూర్చునే యువత దేశ వ్యాప్తంగా అనేక మందికి ‘గాలం’ వేస్తుంటాడు. నగరంలో నమోదవుతున్న ఈ ‘కార్డ్ క్రైమ్’లో 98 శాతం ఈ ప్రాంతానికి చెందిన వారే నిందితులు. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు అనేక మార్గాల ద్వారా డెబిట్/క్రెడిట్ కార్డుల డేటా సేకరిస్తున్న జమ్తార మోసగాళ్లు వాటి ఆధారంగా అసలు అంకానికి తెరలేపుతున్నారు. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డ్స్ తీసుకునే జమ్తార యువకులు వీటినే వినియోగించి కార్డుల డేటాలోని ఫోన్ నంబర్లకు కాల్ చేస్తుంటారు. ఒకప్పుడు కేవలం హిందీ, ఇంగ్లీషు భాషల్లో సంభాషిస్తూ తాము బ్యాంకు మేనేజర్లమని పరిచయం చేసుకుని, కార్డు వివరాలతో పాటు ఓటీపీలు సంగ్రహించే వారు. అయితే ఈ భాషల్లో మాట్లాడితే టార్గెట్ చేసిన వారిలో కొందరికి అర్థం కావట్లేదనే ఉద్దేశంతో స్థానిక భాషలపై దృష్టి పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ మార్గాల్లో నేర్చుకుంటూ... ఈ జమ్తార ముఠాలు తెలుగుతో పాటు వివిధ స్థానిక భాషలను ఇంటర్నెట్తో పాటు కొన్ని పుస్తకాల ద్వారా నేర్చుకుంటున్నారని, వారు వినియోగిస్తున్న పదాలు, ఉచ్ఛారణ శైలిని పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతోందని పోలీసులంటున్నారు. అయితే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన వారికి వీరు ఫోన్లు చేసి స్థానిక భాషలో మాట్లాడటంతో నిజమే అని ఉచ్చులో పడుతున్నారని అంటున్నారు. మరోపక్క ఇటీవల కా>లంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ సిమ్కార్డుల్ని వినియోగిస్తున్న జమ్తార యువత ముందుగానే ఆ నంబర్లను సదరు యాప్లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నంబర్ నుంచి వచ్చిన కాల్ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలుగి తేలిగ్గా బుట్టలో పడుతున్నారు. అప్డేట్, లింకేజ్ పేర్లతో వల... క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన వారికి ఫోన్లు చేసే జమ్తార నేరగాళ్లు ముందుగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి పేరు, ఓ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి,... బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్ కార్డును ఆధార్తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెప్తుంటారు. సాధారణంగా ఆయా బ్యాంకులు జారీ చేసే కార్డులకు చెందిన నంబర్లలో మొదటి నాలుగైదు అంకెలూ ఒకే సిరీస్వి ఉంటాయి. వీటిని ముందుగా చెప్పే మాయగాళ్లు మిగతా అంకెలు అడుగుతారు. ఆపై సీవీవీ కోడ్ కూడా తెలుసుకుని... కొద్దిసేపట్లో మీకో వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుందని, అది కూడా చెప్తేనే లింకేజ్, అప్గ్రెడేషన్ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకోవడం, ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం చేస్తూ టోకరా వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ డేటా ఆధారంగా క్లోన్డ్ క్రెడిట్, డెబిట్ కార్డులను తయారు చేసి డ్రా చేస్తునట్టు వెలుగులోకి వచ్చింది. వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలన్నీ తప్పుడు వివరాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. వారి ఉచ్ఛారణ స్పష్టంగా ఉండదు జమ్తార నేరగాళ్లు మాట్లాడే తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉండదు. ఏ బ్యాంకు ఖాతాదారుడికి ఫోన్ చేసినా తాము ఎస్బీఐ మేనేజర్స్ అంటూ పరిచయం చేసుకుంటారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ఎంత తొందరలో ఉన్నా మీ వ్యక్తిగత వివరాలైన బ్యాంకు కార్డు నంబర్, సీవీవీ కోడ్, ఓటీపీ తదితరాలు చెప్పకూడదు. మరోపక్క ఏ బ్యాంకు అధికారులు ఫోన్లో వ్యక్తిగత వివరాలు, ఓటీపీ వంటివి అడగరు. కార్డుల అప్డేట్, లింకేజ్ ఏదైనా సరే బ్యాంకునకు నేరుగా వెళ్లో, వారి ఏటీఎం కేంద్రం ద్వారానో, అధికారిక వెబ్సైట్ నుంచో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకానీ ఇలా వచ్చే ఫోన్లను నమ్మకూడదు. – సైబర్ క్రైమ్ పోలీసులు -
ఎయిర్టెల్ కస్టమర్లే లక్ష్యం...
సాక్షి, సిటీబ్యూరో: ‘మీ ఎయిర్టెల్ సిమ్ కార్డు మరో 24 గంటల్లో బ్లాక్ అవుతుందని.. కేవైసీఅప్డేట్ చేసుకోవాలి’ అని బల్క్ మెసేజ్లు పంపి.. ఆ తర్వాత సిమ్ బ్లాక్ చేసి లక్షలు కాజేస్తున్న సైబర్ మోసాలు పెరిగాయి. ఈ విధంగా గత 9 రోజుల్లో మియాపూర్కు చెందిన అప్పలనాయుడు రూ.9,20,897, గచ్చిబౌలికి చెందిన కౌశల్ కిశోర్ మిశ్రా రూ.5,94,799, సురేశ్ రమణ రూ.1,03, 990లు మోసపోయారని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని గురువారం తెలిపారు. ‘కొన్నిరోజులుగా ఎయిర్టెల్ కస్టమర్స్కు సైబర్ నేరగాళ్లు బల్క్ మెసేజ్లు పంపిస్తున్నారు. మరో 24 గంటల్లో ఈ కేవైసీ అప్డేట్ చేయకపోతే సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని సంక్షిప్త సమాచారాలు పంపిస్తున్నారు. తర్వాత కస్టమర్ కేర్ ప్రతినిధిగా కాల్ చేసి సిమ్ కార్డు కోసం కస్టమర్ కేర్ సర్వీస్ నంబర్కు మెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నారు. ఆ తర్వాత ఎయిర్టెల్ నుంచి ఆటో జనరేటేడ్ మెసేజ్ను బాధితులకు పంపిస్తున్నారు. అనంతరం ఓ లింక్ను వారి సెల్ నంబర్కు పంపించడంతో అందులో బ్యాంక్ ఖాతా వివరాలు నింపడంతో నేరగాళ్లు వెంటనే ఆ సెల్ నంబర్ను బ్లాక్ చేస్తున్నారు. ఆ తర్వాత వీరు క్యూ ఆర్ కోడ్ సహాయంతో ఈ సిమ్ కార్డు యాక్టివ్ చేసి అందులో ఉన్న డబ్బులను ఇతర బ్యాంక్ ఖాతాలకు మళ్లించి లక్షలు కొల్లగొడుతున్నారు. గత తొమ్మిది రోజుల్లో రూ.16 లక్షలకుపైగా బాధితులు మోసపోయారు. -
ఇన్స్ట్రాగామ్ ఖాతాలున్న యువతులే టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: సోషల్మీడియా యాప్ ఇన్స్ట్రాగామ్ వేదికగా యువతులు, మహిళల్ని పరిచయం చేసుకొని.. కొన్నాళ్ల పాటు స్నేహంగా ఉంటూ చాటింగ్ చేస్తాడు... ఆపై తన వద్ద కొన్ని ‘ఫొటోలు’ ఉన్నాయంటూ బెదిరింపులకు దిగుతాడు... ఓ బాధితురాలి నుంచి వీలున్నంత వసూలు చేసిన తర్వాత ఆమె స్నేహితురాళ్లనే టార్గెట్గా చేసుకుంటాడు... ఈ పంథాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో వందల మందిని మోసం చేసిన ఓ బ్లాక్మెయిలర్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై సైబర్ క్రైమ్ ఠాణా సహా నగరంలోనే ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి గురువారం వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహ్మద్ అహ్మద్ ఆరో తరగతి వరకే చదివాడు. ఆపై తన స్వస్థలంలోనే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇన్స్ట్రాగామ్లో ఖాతా ఉన్న ఇతగాడు దాని ద్వారానే మహిళలు, యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. వాళ్లు యాక్సప్ట్ చేసిన తర్వాత కొన్నాళ్లు స్నేహపూర్వకంగా చాటింగ్ చేస్తాడు. ఇలా వారి నమ్మకం పొందే అహ్మద్ సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటాడు. ఆ తర్వాత నుంచి వాట్సాప్లో చాటింగ్, కాల్స్ చేసే ఇతగాడు ఎదుటి వారు పూర్తిగా తనను నమ్మారని నిర్థారించుకున్నాక అసలు పని ప్రారంభిస్తాడు. వారి ఇన్స్ట్రాగామ్ ఖాతా నుంచి సంగ్రహించిన ఫొటోలను వారికే షేర్ చేస్తాడు. వీటితో పాటు తన వద్ద మరికొన్ని వ్యక్తిగత ఫొటోలు ఉన్నాయంటూ బెదిరిస్తాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే తాను కోరిన మొత్తం చెల్లించాలంటాడు. ఇలా టార్గెట్ చేసిన యువతి/మహిళ నుంచి అందినకాడికి తన ఖాతాల్లో డిపాజిట్ లేదా ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. ఇలా ఓ బాధితురాలి నుంచి వసూలు చేయడం పూర్తయిన తర్వాత ఆమె పేరు, ఫొటోతో ఇన్స్ట్రాగామ్లోనే నకిలీ ఖాతా సృష్టిస్తాడు. దీని ఆధారంగా ఆమె ఫ్రెండ్ లిస్ట్లోని యువతులు, మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. యాక్సప్ట్ చేసిన వారితో కొన్నాళ్లు చాటింగ్, కాల్స్ చేసి ఆపై బెదిరింపులకు దిగుతాడు. బాధితుల నుంచి డబ్బు వసూలు చేయడంతో పాటు తనతో సన్నిహితంగా ఉండాలనీ బెదిరిస్తాడు. ఇతడిపై నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్తో పాటు కామాటిపుర, గోల్కొండ, నారాయణగూడ, మీర్చౌక్, ఫలక్నుమ, సంతోష్నగర్, నేరేడ్మెట్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతడి వల్లోపడి రూ.10 వేలు చెల్లించిన ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీన్ని ఇన్స్పెక్టర్ బి.రమేష్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి అహ్మద్ను నిందితుడిగా గుర్తించారు. ఆదోని వెళ్లిన ప్రత్యేక బృందం గురువారం అరెస్టు చేసి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వందల మందిని ఇతగాడు ఈ పంథాలో మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ వివరాలు సేకరించడానికి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
అవి చూసి కాల్ చేస్తే నిండా మునిగినట్లే
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఫోన్కు రూ.550 రీచార్జ్ చేయించారు. ఆ మొత్తం యాడ్ కాకపోవడంతో ఆ సర్వీస్ ప్రొవైడర్ సంస్థను సంప్రదించడానికి కస్టమర్ కేర్ నెంబర్ కోసం ప్రయత్నించారు. గూగుల్లో కనిపించిన ఓ నెంబర్కు కాల్ చేయగా... ఆ మొత్తం రీఫండ్ చేస్తామంటూ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు బ్యాంకుఖాతా వివరాలు సంగ్రహించారు. వీటిని వినియోగించి ఆమె ఖాతా నుంచి రూ.54,500 కాజేశారు. దీనిపై బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది. ప్రజలకు టోకరా వేయడానికి సమయం, సందర్భాన్ని బట్టి ఒక్కో పంథాను అనుసరించే సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో ఈ పంథాలో టోకరా వేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఆ అంతర్రాష్ట్ర నేరగాళ్లు ఏకంగా గూగుల్లోకే చొచ్చుకుపోయి బురిడీ కొట్టిస్తున్నారు. ప్రతి నెలా కనిష్టంగా రూ.20 లక్షల వరకు టోకరా వేస్తున్నారు. బోగస్ వివరాలతో సిద్ధం చేసి... ఎలాంటి మోసాలు చేయాలన్నా సైబర్ నేరగాళ్లకు ప్రాథమికంగా సిమ్కార్డులు అవసరం. వీటిని నకిలీ పేర్లు, చిరునామాలతో తీసుకుంటున్నారు. బోగస్ వివరాలతో కొన్ని యాప్స్, బ్యాంకు ఖాతాలు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరైతే బ్యాంకు ఖాతాలకు బదులుగా మనీమ్యూల్స్గా పిలిచే దళారుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మెట్రోనగరాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యవతకు కమీషన్ ఆశ చూపుతున్న సైబర్ నేరగాళ్లు వారి వైపు తిప్పుకుంటున్నారు. వీరికి చెందని మనీ ట్రాన్స్ఫర్ యాప్స్, బ్యాంక్ ఖాతాలను తమకు అనుకూలంగా వాడుకుంటూ ఐదు శాతం చొప్పున కమీషన్ ఇస్తున్నారు. సిమ్కార్డులు, బేసిక్ మోడల్ సెల్ఫోన్లతో పాటు బ్యాంకు ఖాతాలు, యాప్స్ సిద్ధమయ్యాక ఈ సైబర్ నేరగాళ్లు అసలు అంకం మొదలు పెడుతున్నారు. గూగుల్లో రిజిస్టర్ చేసుకుని... ఈ సైబర్ నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయటపకుండా ఉండేలా కొన్ని మెయిల్ ఐడీలు సృష్టిస్తున్నారు. వీటిని వినియోగించి గూగుల్లోకి ఎంటర్ అవుతున్న కేటుగాళ్లు అందులో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా తమ నెంబర్లను ఆయా బ్యాంకులకు, ఆయా సంస్థలకు చెందిన కాల్ సెంటర్లవిగా పేర్కొంటూ పొందుపరుస్తున్నారు. ట్రూ కాలర్లో సైతం వీటిని ‘బ్యాంక్’, ‘బ్యాంక్ మేనేజర్’ లేదా ఫలానా సంస్థ పేర్లతోనే రిజిస్టర్ చేసుకున్నారు. గూగుల్ సెర్చ్లో పొందుపరిచిన వారిలో వేటికి వ్యూస్ ఎక్కువగా ఉంటే అది పై భాగానికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సదరు సైబర్ నేరగాళ్లు తమ అనుచరుల ద్వారా ఆయా నెంబర్లకు వ్యూస్ పెరిగేలా చేసి సెర్చ్లో పైకి తీసుకువస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఎవరైనా ఖాతాదారుడు తన బ్యాంక్నకు సంబంధించిన కాల్ సెంటర్ కోసం సెర్చ్ చేస్తే ఈ నేరగాళ్లు పొందుపరిచినవే ముందు కనిపిస్తుంటాయి. పరిష్కారం పేరుతో ఎం.పిన్ పంపిస్తూ... ఇలా కనిపించిన ‘కాల్ సెంటర్’ నెంబర్కు ఖాతాదారుడు కాల్ చేసిన వెంటనే అది సదరు సైబర్ నేరగాడికి చేరిపోతుంది. తాను బ్యాంక్ మేనేజర్ అని, ఫలానా సంస్థ ప్రతినిధి అని అంటూ మాట్లాడే అతగాడు డబ్బు తిరిగి రావాలంటే తాము మరో నెంబర్ నుంచి ఓ ఎస్సెమ్మెస్ పంపుతామని, దాన్ని మళ్లీ అదే నెంబర్కు సెండ్ చేయాలని సూచిస్తుంటారు. ఎవరైనా సరే తమ బ్యాంకు ఖాతాలను నగదు లావాదేవీలు నెరపే వివిధ రకాలైన యాప్స్కు అనుసంధానం చేయాలంటూ యూపీఐగా పిలిచే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కచ్చితంగా ఉండాలి. ఇది కావాలంటే బ్యాంకు ఖాతాతో రిజిస్టర్ అయి ఉన్న సెల్ఫోన్ నుంచి యూపీఏకు సంబంధించిన ఎంపిన్ను బ్యాంక్నకుసంబంధించిన నెంబర్కు పంపాల్సి ఉంటుంది.దీన్నే ఈ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగామార్చుకుంటున్నారు. యాప్స్ను అనుసంధానిస్తూ... తమ వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లలోకి అప్పటికే కొన్ని యాప్స్ను డౌన్లోడ్ చేసి ఉంచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇలా కాల్ వచ్చినప్పుడు ఎంపిన్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని తొలుత తమకు కాల్ చేసిన ఖాతాదారుడికి వేరే నెంబర్ నుంచి పంపిస్తున్నారు. అలా వచ్చిన ఎంపిన్ను అదే నెంబర్కు సెండ్ చేయాలని సూచిస్తున్నారు. ఖాతాదారుడు ఇలా చేస్తే తన బ్యాంకు ఖాతాను వారి యాప్తో అనుసంధానించడానికి యాక్సస్ ఇచ్చినట్లే అవుతుంది. ఆ వెంటనే సదరు నెంబర్ను వినియోగించి యాప్ను యాక్టివేట్ చేయడంతో పాటు ఖాతాదారుడి ఖాతా నుంచి నగదు కాజేస్తున్నారు. ఈ విధానంలో రోజుకు రూ.లక్ష వరకు బదిలీ చేసుకునే అవకాశం ఉండటంతో సైబర్ నేరగాళ్లు తమ యాప్స్కు లేదా మనీమ్యూల్స్ ఖాతాలోకి డబ్బు బదిలీ చేసి స్వాహా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకు ఖాతా లేదా ఈ వ్యాలెట్ వివరాలు, పిన్ నెంబర్లు సంగ్రహించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఆ వివరాలు కోరితే అనుమానించాల్సిందే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీరిలోఅత్యధికులు హిందీలోనే మాట్లాడుతుంటారు. ఏ బ్యాంకైనా.. సంస్థకస్టమర్ బ్యాంకు ఖాతాకు, ఈ–వాలెట్స్కు సంబంధించిన వ్యక్తిగత సమాచారం అడగదు. అలా ఎవరైనా చెప్పమన్నారంటేఅనుమానించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిన్ను ఎవరి సెల్ నెంబర్కు పంపకూడదు. గూగుల్లో చూసినవి అన్నీ నిజమైన కాల్ సెంటర్లు అని నమ్మితే నిండా మునిగినట్లే. గూగుల్ పే పేరుతోనూ గూగుల్లో నకిలీ నెంబర్లు ఉంటున్నాయి. అపరిచితులు, ఫోన్ద్వారా పరిచయమైన వారితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోవడం ఉత్తమం. – కేవీఎం ప్రసాద్, సైబర్ క్రైమ్ ఏసీపీ -
టిండర్తో పరిచయం... వీచాట్తో చాటింగ్
సాక్షి, సిటీబ్యూరో: టిండర్ అప్లికేషన్ ద్వారా అపరిచితులతో పరిచయం పెంచుకొని అనంతరం వీచాట్ అప్లికేషన్తో మరింత దగ్గరై అతి తక్కువ కాలంలో ఎక్కువగా లాభాలు సంపాదించవచ్చని అమాయకులను ఫారెక్స్ ట్రేడ్ పేరుతో టోకరా వేస్తున్న సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు చైనాకు చెందిన మైక్, హంకాంగ్కు చెందిన మీనా పరారీలో ఉండగా, వీరికి బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన హైదరాబాద్ కొండాపూర్కు చెందిన రాజేశ్కుమార్ను అదుపులోకి . వివరాల్లోకి వెళితే..హైదరాబాద్కు చెందిన కె.ఉమాకాంత్కు టిండర్ అప్లికేషన్ ద్వారా మీనాతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ‘వీచాట్’లో చాటింగ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫారెక్స్ ట్రేడ్లో పెట్టుబడులు పెట్టామని సూచించింది. దీంతో ఉమాకాంత్ వీ చాట్ అప్లికేషన్లో మైక్ను సంప్రదించగా మెటా ట్రేడ్4 ఖాతా ఓపెన్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. జూబ్లీహిల్స్లోని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ చేయాలని చెప్పడంతో అతను రూ.2,30,000లు డిపాజిట్ చేశాడు. అయితే దీనికి తగ్గట్టుగానే మైక్ లాభాలు చూపించాడు. దీంతో ఇర్ఫాన్ పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాలో రూ.15,20,000 డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత ఆ డబ్బులను నిందితులు విడతల వారీగా డ్రా చేశారు. చివరకు మోసపోయానని తెలుసుకున్న ఉమాకాంత్ గత నెల 30న సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ డాటా ఆధారంగా బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన కొండాపూర్కు చెందిన రాజేశ్కుమార్ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.కాగా వీరు దేశవ్యాప్తంగా పలువురిని ఫారెక్స్ ట్రేడ్ పేరుతో మోసం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
బాలుడి సరదా ఆటతో ఆవిరైన తండ్రి కష్టం
అమలాపురం టౌన్: స్థానిక గణపతి థియేటర్ సమీపంలో ఓ బాలుడు సరదాగా తన తల్లి స్మార్ట్ ఫోన్ నుంచి ఆడిన ఆన్లైన్ గేమ్తో రూ.5.40 లక్షల దోపిడీకి గురై ఆ కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో.. ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో అర్థం కాక ఆ బాలుడి తల్లి తల్లడిల్లుతోంది. ఆన్లైన్ గేమ్ పేరుతో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు రూ.లక్షలు పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. అమలాపురం పట్టణ పోలీసులకు బాలుడి తల్లి చెప్పిన వివరాలతో ఈ ఆన్లైన్ గేమ్ మోసంలో మరిన్ని కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఆ బాలుడు తన తల్లి స్మార్ట్ ఫోన్తో ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొంటూనే ఖాళీ సమయాల్లో సరదాగా ఆన్లైన్ గేమ్ల్లోకి వెళ్లాడు. 20 రోజులుగా ఆ గేమ్లు ఆడుతున్నాడు. ఫ్రీ ఫైర్ అనే ఆన్లైన్ గేమ్ యాప్ను ఓపెన్ చేశాడు. అందులో వెపన్స్ కొనాలంటే ఫలానా లింక్ ఓపెన్ చేయమంటే అదీ కూడా ఓపెన్ చేశాడు. (అవకాశాలు అంత తేలికకాదు.. ) అందులో ఈ గేమ్ యాప్ నిర్వాహకులు తెలివిగా తొలుత ఆ వెపన్స్ రూ.వంద నుంచి ధర చూపించాడు. ఓటీపీ అడిగినప్పుడు అదీ కూడా టైప్ చేసేశాడు. అలా ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ల విషయాలన్నీ అవతలి వారికి తెలిసే ప్రక్రియ అందులో ఉంటుంది. రూ.వందతో మొదలైన వెపన్స్ కొనుగోలు రూ.400, రూ.1000 నుంచి రూ.5000 వరకు ధరలతో బాలుడి తన స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడంతో తన తల్లికి సంబంధించిన రెండు బ్యాంక్ల అకౌంట్ల నుంచి 20 రోజుల్లో మొత్తం రూ.5.40 లక్షలు డ్రా అయ్యాయి. 20 రోజుల్లో రోజుకు కొంత మొత్తం వంతున అంతా ఆన్లైన్ మోసంతో కొల్లగొట్టేశారు. తల్లి ఏదో అవసరం పడి శనివారం ఏటీఎంకు వెళ్లి రూ.15 వేలు డ్రా చేసేందుకు పిన్ కొడితే డబ్బులు రాలేదు. మళ్లీ రూ.10 వేలు డ్రా చేస్తే నగదు వచ్చింది. అయితే రూ.10 వేలు డ్రా అయిన తర్వాత తన స్మార్ట్ ఫోన్కు రూ.1000 మాత్రమే బ్యాలెన్స్ చూపడంతో తల్లి కంగారు పడింది. తర్వాత రెండు బ్యాంక్లకు వెళ్లి ఆరా తీస్తే రెండు అకౌంట్లలో డబ్బులన్నీ డ్రా అయినట్టు చెప్పడంతో ఆమెకు చెమటలు పట్టాయి. పోలీసులు ఈ కేసుపై పలు కోణాల్లో ఆదివారం ఉదయం విచారించారు. అయితే గేమ్ ఆడినప్పుడల్లా డబ్బులు డ్రా అయినట్టు స్మార్ట్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నా అవి గజిబిజిగా ఉండడంతో అంతగా చదువుకోని ఆమె పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. ఓటీపీ ఇవ్వడం, డ్రా అయిన డబ్బులకు మెసేజ్లు రావడంతో పోలీసులు ఈ కేసు సైబర్ నేరం కింద వస్తుందా? రాదా? అనే దానిపై సైబర్ నేరాల నిపుణలతో సంప్రదిస్తున్నారు. ఆమె భర్త కువైట్లో ఉంటూ తాను అక్కడ కష్ట పడి పనిచేస్తూ భార్య, పిల్లల కోసం రూ.లక్షలు కూడబెట్టి బ్యాంక్లో వేస్తే తమ కొడుకు సరదాగా ఆడిన ఆట ఆ కుటుంబాన్ని కోలుకోని దెబ్బతీసింది. పరాయి దేశంలో తన కుటుంబ కోసం శ్రమకోర్చి సమకూర్చుకున్న ఆదాయం ఇక్కడ అన్లైన్ మోసంతో ఆవిరైపోయింది. -
అవకాశాలు అంత తేలికకాదు..
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సెలబ్రిటీలకు సవాల్ విసురుతున్నారు. ప్రముఖుల పేర్లు, వివరాలు, ఫొటోలు వినియోగిస్తూ యువతులకు వలవేస్తున్నారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇటీవల ఈ తరహా కేసులు మూడు నమోదయ్యాయి. ఇలాంటి నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పూర్తి వివరాలు నిర్ధారించుకోనిదే వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంపిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెలబ్రెటీలకు సంబంధించి నమోదైన మూడు కేసుల్లో ఒక కేసులో నిందితుడిని పట్టుకున్న అధికారులు మిగిలిన కేసులను సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ దేవరకొండగా పేరుతో.. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. తాను ఆయన పర్సనల్ మేనేజర్ను అని, ఆయన్ను కలవాలంటే సంప్రదించాలంటూ ఓ ఫోన్ నంబర్ పొందుపరిచాడు. విజయ్ దేవరకొండ గొంతును అనుకరించగలగటం కూడా ఈ యువకుడికి కలిసి వచ్చింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న అతను పలువురు యువతులతో విజయ్ దేవరకొండ మాదిరిగా మాట్లాడాడు. ఎవరైనా కలవాలని కోరితే... తనను కాదని, మొదట తన డబ్బింగ్ ఆర్టిస్టును కలవాలంటూ తనకు సంబంధించిన మరో నంబర్ ఇచ్చేవాడు. దీనికి కాల్ చేసిన వారితోనూ మాట్లాడటం, చాటింగ్ చేయడం చేశాడు. ఓ యువతికి ప్రేమ పేరుతో ఎర వేసిన ఈ యువకుడు ఆమె కలిసేందుకు హైదరాబాద్కు వచ్చేశాడు. ఈ లోగా విజయ్ దేవరకొండ సంబంధీకులు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు నగరానికి వచ్చిన సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. డైరెక్టర్ అజయ్ భూపతినంటూ... కేవలం హీరోలే కాదు... దర్శకుల పేరుతోనూ సైబర్ నేరగాళ్లు తమ ‘పని’ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి పేరుతో అమ్మాయిలకు వల వేసిన ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆయన పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ కేంద్రంగా యువతుల వివరాలు సేకరించాడు. ఇలా పరిచయం చేసుకుని వారితో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేయడం మొదలెట్టాడు. వారితో తాను అజయ్ భూపతిగానే వారితో పరిచయం చేసుకున్నాడు. తాను త్వరలో విజయ్ దేవరకొండ, విశాల్లతో సినిమా తీయబోతున్నానని, అందులో నటించే అవకాశం కల్పిస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఇలా ఎంపిక పేరుతో ఆ యువతుల నుంచి వ్యక్తిగత ఫొటోలు సైతం సేకరించి వారిని వేధించడం మొదలెట్టాడు. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు అజయ్ భూపతి తీవ్రంగా పరిగణించారు. తన పేరును వినియోగిస్తూ, యువతులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పేరుతో... ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేరుతో మోసాలకు తెర లేపిన వ్యవహారం గత వారం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా కేంద్రంగా ఈ సంస్థ పేరుతో సైబర్ క్రిమినల్స్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దీని ఆధారంగా ఆ సంస్థలో పని చేసే డిజైనర్, మేకప్ మ్యాన్స్గా తమను తాము పరిచయం చేసుకున్నారు. వీరిని సంప్రదించిన యువతులతో సినిమాలో నటించే అవకాశం ఇస్తామంటూ ఎర వేశారు. ఓ ప్రముఖ హీరోతో తమ సంస్థ తమిళ చిత్రం నిర్మించబోతోందని, అందులో హీరోయిన్గా నటించడానికి అవకాశం ఇస్తానంటూ నమ్మబలికారు. అయితే ఈలోపు విషయం గీతా ఆర్ట్స్ నిర్వాహకులకు తెలిసింది. దీంతో ఆ సంస్థ మేనేజర్ తమ బ్యానర్ పేరు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసుల్ని సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు బాధ్యుల్ని గుర్తించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అవకాశాలు అంత తేలికకాదు ఈ సైబర్ నేరగాళ్లు ఎక్కువగా యువతులనే టార్గెట్ చేసుకుంటున్నారు. సినీ హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థ.. ఇలా వివిధ పేర్లు చెబుతూ నటించే అవకాశాల పేరుతో ఎర వేస్తున్నారు. ఆడిషన్లు నిర్వహిస్తామంటూ, అందుకు ఎంపికలు జరుగుతాయంటూ ఫొటోలు సంగ్రహిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు రావడం అంత తేలికకాదని, సోషల్మీడియా ద్వారా ఆ ఎంపికలు జరగవని గుర్తుంచుకోవాలి. నేరుగా సంప్రదించిన తర్వాతే ఎదుటి వారికి ఫొటోలు పంపడం వంటివి చేయాలి. అలా కాకుంటే బ్లాక్మెయిలింగ్ తదితర తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. – సైబర్ క్రైమ్ పోలీసులు -
4 వేల కోసం ప్రయత్నిస్తే 74 వేలు గాయబ్!
సాక్షి, సిటీబ్యూరో: ఓ ఈ–కామర్స్ యాప్లో రూ.4 వేలు వెచ్చింది ఇయర్ ఫోన్స్ ఖరీదు చేశారో యువతి... అది ఎంతకీ డెలివరీ కాకపోవడంతో ఆ సంస్థ నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశారు... అందులో కనిపించిన నకిలీ కాల్ సెంటర్ నెంబర్ అసలుదిగా భావించి సంప్రదించారు... సైబర్ నేరగాళ్ళు చెప్పినవి చెప్పినట్లుగా చేసి రూ.74 వేలు పోగొట్టుకున్నారు. ఈమెతో పాటు సైబర్ నేరగాళ్ళ చేతిలో మరో రూ.1.5 లక్షలు కోల్పోయిన ముగ్గురు బాధితులు బుధవారం సిటీ సైబర్ క్రైౖమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ యువతి ఈ–జీ ఫోన్స్ అనే సంస్థకు చెందిన వెబ్సైట్ ద్వారా ఇయర్ ఫోన్లు ఆర్డర్ చేశారు. (పోస్టు చేయడమే పాపమైంది...) వాటి ఖరీదు రూ.4000 ముందే ఆన్లైన్ ద్వారా చెల్లించేశారు. ఆ సందర్భంగా వెబ్సైట్ వాటి డెలివరీ డేట్ను సూచించింది. ఆ నిర్ణీత గడువు ముగిసినా కొరియర్ ద్వారా సదరు ఇయర్ఫోన్స్ డెలివరీ కాలేదు. దీంతో ఈ–జీ ఫోన్స్ సంస్థను సంప్రదించాలని భావించిన ఆమె దాని ఫోన్ నెంబర్ కోసం సదరు వెబ్సైట్లో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఈ సంస్థ కాల్ సెంటర్ నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశారు. అందులో ఈ–జీ ఫోన్ కాల్సెంటర్ పేరుతో కనిపించిన సెల్ ఫోన్ నెంబర్ నిజమైనదిగా భావించారు. ఆ నెంబర్లో సంప్రదించిన యువతి జరిగిన విషయం చెప్పారు. దీంతో అవతలి వ్యక్తులు ఆ ఆర్డర్కు సంబంధించిన మొత్తం రిటర్న్ చేస్తామని అన్నారు. దానికోసం తాము మీ ఫోన్ నెంబర్కు పంపే లింకు ఓపెన్ చేయాలని సూచించి టీమ్ వ్యూవర్ యాప్ ఇన్స్టల్ చేయించారు. దీన్ని తమ ఫోన్ ద్వారా యాక్సస్ చేసిన సైబర్ నేరగాళ్ళు బాధితురాలి ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని ద్వారా ఆమె ఈ వ్యాలెట్ వినియోగించిన సైబర్ నేరగాళ్ళు రూ.74 వేలు కాజేశారు. ♦ అంబర్పేటకు చెందిన ఓ యువకుడికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్ళు తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజుతో రుణం ఇస్తామని ఆన్లైన్లో ప్రచారం చేసుకున్నారు. ఇది నిజమని నమ్మిన యువకుడు అందులో పేర్కొన్న నెంబర్లలో సంప్రదించారు. సైబర్ నేరగాళ్ళు చెప్పిన వాటికి అంగీకరించడంతో వివిధ ఫీజుల పేరుతో రూ.30 వేలు తమ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. ♦ ఈ–యాడ్స్ సైట్ ఓఎల్ఎక్స్లో ఉన్న సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ విక్రయం ప్రకటనకు నగర యువకుడు స్పందించారు. అందులో ఉన్న నెంబర్లో సంప్రదించగా ఆర్మీ అధికారిలా సైబర్ నేరగాళ్ళు మాట్లాడారు. బేరసారాల తర్వాత ఫ్రిడ్జ్కు రేటు ఖరారైంది. అడ్వాన్సులు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు, చెల్లించిన అధిక మొత్తం రిఫండ్ పేరుతో రూ.82 వేలు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్న మోసగాళ్ళు ఆపై ఫోన్ చేసినా స్పందించకుండా నిండా ముంచారు. ♦ వెస్ట్ మారేడ్పల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆన్లైన్లో ఉన్న ప్రకటనపై స్పందించారు. అవతలి సైబర్ నేరగాళ్ళు వివిధ ఫీజుల పేరుతో రూ.38,500 కాజేశారు. ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రై మ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
లండన్లో కరోనాకు మందు కనిపెట్టారని..
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్గా పరిచయం కావడం... విదేశీయుల ముసుగులో తమ స్నేహ బంధం పెరగాలంటూ కోరడం... దానికి గుర్తుగా బహుమతులు పంపిస్తున్నానంటూ చెప్పడం... ఆనక విమానాశ్రయం కస్టమ్స్ అధికారుల మాదిరిగా ఫోన్ చేసి పన్నుల పేరుతో అందినకాడికి దండుకోవడం.. ఈ తరహాలో సాగే ఫ్రెండ్షిప్ ఫ్రాడ్స్లోకి ఇప్పుడు కరోనా మందులు వచ్చి చేరాయి. లండన్కు చెందిన వ్యక్తిగా చెప్పుకున్న సైబర్ నేరగాడు నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.1.3 లక్షలు స్వాహా చేశాడు. బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరంలోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ ద్వారా లండన్కు చెందిన ప్యాట్రిక్స్ అనే వ్యక్తిగా చెప్పుకున్న సైబర్ నేరగాడు పరిచయం అయ్యాడు. కొన్నాళ్లు సజావుగానే చాటింగ్ చేసిన ప్యాట్రిక్స్ ఆపై అసలు కథ మొదలెట్టాడు. ఇటీవల లండన్లో కరోనాకు మందు కనిపెట్టారని, మన స్నేహానికి గుర్తుగా ఆ ఔషధంతో పాటు 60 వేల పౌండ్లు పార్శిల్ చేస్తున్నానని చెప్పాడు. ఇది జరిగిన మరుసటి రోజు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారుల పేరుతో వ్యాపారికి కాల్ వచ్చింది. లండన్ నుంచి మీ పేరుతో వచ్చిన పార్శిల్లో కొన్ని ఔషధాలతో పాటు పౌండ్లు ఉన్నాయని వాటిని క్లియర్ చేయడానికి కొన్ని చార్జీలు కట్టాలని చెప్పారు. వారి మాటలు నమ్మిన వ్యాపారి తొలుత రూ.1.3 లక్షలు వారు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశారు. అంతటితో ఆగని సైబర్ నేరగాళ్లు పౌండ్లను భారత కరెన్సీలోకి మార్చి అందించాల్సి ఉందని, దానికి కన్వర్షన్ చార్జీల కింద రూ.1.5 లక్షలు చెల్లించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను ఇంటర్నెట్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ కార్యాలయం నంబర్ తీసుకుని సంప్రదించాడు. దీంతో ఇదంతా మోసమని తేలడంతో సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరో ఉదంతంలో యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్లో పోస్టు చేసి ఉన్న ఫోన్ ఖరీదు చేయడానికి ప్రయత్నించిన సంతోష్నగర్కు చెందిన యువకుడు రూ.66 వేలు. కారు ఖరీదు చేయాలని భావించిన శాలిబండ వ్యక్తి రూ.38 వేలు కోల్పోయారు. నగరానికి మరో వ్యక్తి అమేజాన్ ఖాతా నుంచి రూ.46 వేలు విలువైన ఓచర్లు మాయమయ్యాయి. మరో వ్యక్తి ప్రమేయం లేకుండానే అతడి ఖాతా నుంచి రూ.76 వేలు రెండు దఫాల్లో గల్లంతయ్యాయి. వీటిపై బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. -
ఫోన్పే యాప్ పేరు చెప్పి..
నెల్లూరు, ఉదయగిరి: ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి నగదు మాయం చేసిన ఘటన బుధవారం ఉదయగిరిలో వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం మేరకు.. స్థానిక దిలార్భాయ్ వీధికి చెందిన షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి స్వీట్ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ ఫోన్పే యాప్ గడువు తీరిందని, వివరాలు తెలిపితే తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పాడు. ఏటీఎం కార్డు, పిన్ నంబర్ చెబితేనే ఫోన్పే పనిచేస్తుందని నమ్మబలికాడు. దీంతో మహబూబ్ బాషా తనకు ఆ నంబర్లన్నీ తెలియవని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ వ్యక్తి మహబూబ్ బాషా సెల్ఫోన్కు ఒక లింక్ పంపి ఫోన్ చేశాడు. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ ఫోన్పే పునరుద్ధరణ జరుగుతుందని వివరించాడు. దీంతో మహబూబ్ లింక్ ఓపెన్ చేశాడు. ఈక్రమంలో ఖాతాలోని నగదును ఆన్లైన్ ద్వారా డ్రా చేశారని చెబుతున్నాడు. బుధవారం బంధువులకు నగదు పంపేందుకు తన ఫోన్పే ద్వారా బ్యాలెన్స్ పరిశీలించుకోగా రూ.1,03,900 ఉండాల్సి ఉండగా కేవలం 36 పైసలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. దీంతో సదరు వ్యక్తి నగదు మాయం చేశాడని గుర్తించిన మహబూబ్ వెంటనే స్థానిక సిండికేట్ బ్యాంక్కు వెళ్లి అక్కడి అధికారులకు తెలిపాడు. వారి సూచన మేరకు ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఫేస్ బుక్.. ఫేక్ గిఫ్ట్
సాక్షి,సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా పరిచయమై ప్రేమగా నటించి ఖరీదైన బహుమతి పేరుతో సుమారు రూ.38 లక్షల వసూలు చేసిన సైబర్ మోసం వెలుగు చూసింది. పోలీసుల కధనం ప్రకారం.. సికింద్రాబాద్ వెస్ట్ మారేడపల్లికి చెందిన సురేఖ అనే మహిళకు ఫేస్బుక్లో యూకేకు చెందిన వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ కన్ఫమ్ చేయడంతో తాను యూకేలో డాక్టర్ హెర్మన్గా అని పరిచయం చేసుకున్నాడు. ప్రేమగా నటిస్తూ కొద్ది రోజుల తర్వాత మొబైల్ నెంబర్ తీసుకొని వాట్సాప్ చాటింగ్ ప్రారంభించాడు. వాట్స్ప్ చాటింగ్లో త్వరలోనే ఖరీదైన బహుమతి పంపిస్తానని మెసేజ్ పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత ఖరీదైన బహుమతి పంపించానని మరో మెసేజ్ పంపించాడు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారి మాట్లాడుతునాంటూ ఒక ఫోన్ వచ్చింది. మీకు ఒక పార్సిల్ వచ్చింది..అందులో డాలర్స్ ఉన్నాయి.. వాటికి టాక్స్ చెల్లించాల్సి ఉందని ఫోన్లో పేర్కొన్నారు. దీంతో నిజమే అనుకొని నమ్మిన మహిళా సదరు వ్యక్తి చెప్పినట్టుగా ప్రాసెసింగ్ ఫీజు, ఇన్కమ్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ, వివిధ పేర్లతో ఏకంగా రూ. 38 లక్షల రూపాయల వరకు ఆన్ లైన్ ద్వారా చెల్లించింది. అనంతరం సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయిన గ్రహించి సైబర్ క్రై మ్ పోలీసులు పిర్యాదు చేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోస్టు చేయడమే పాపమైంది...
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులపై సైబర్ నేరగాళ్లు విరుచుకుపడుతున్నారు. యాడ్స్ యాప్ ఓఎల్ ఎక్స్లో వస్తువులు ఉంచి అమ్ముతామని, ఇతరులు పొందుపరిచిన వాటికి కొనుగోలు చేస్తామ ని ఫోన్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. వీరి బారిని పడి రూ.5.29 లక్షలు నష్టపోయిన ఐదుగురు బాధితులు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. పోస్టు చేయడమే పాపమైంది... కొవిడ్ విజృంభణ నేపథ్యంలో దీని నిరోధానికి ఉపకరించే వస్తువుల తయారీ, విక్రయాలు పెరిగాయి. ఇందులో భాగంగా నగరానికి చెందిన ఓ మహిళ శానిటైజర్ స్టాండ్లు తయారు చేస్తున్నామని, తక్కువ ధరకు విక్రయిస్తానంటూ ఓఎల్ఎక్స్లో పోస్టు చేశారు. అందులో ఉన్న నంబర్ ద్వారా ఆమెను సంప్రదించిన సైబర్ నేరగాడు తనను ఆర్మీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. తమకు పెద్ద సంఖ్యలో స్టాండ్లు కావాలని కోరాడు. అందుకోసం కొంత మొత్తం అడ్వాన్సు పంపిస్తున్నానని, ఆ మొత్తం తీసుకుని తనకు ఓ నమూనా పంపాలని కోరాడు. నగదు చెల్లింపుల పేరుతో గూగుల్ పే ద్వారా కొన్ని క్యూఆర్ కోడ్స్ పంపాడు. వీటిని నగర మహిళ స్కాన్ చేయడంతో ఈమె ఖాతా నుంచి డబ్బు నేరగాడికి వెళ్లిపోయింది. ఈ విషయం గుర్తించిన ఆమె ఫోన్ చేసి ప్రశ్నించగా.. రీఫండ్ ఇస్తున్నానంటూ మరికొన్ని క్యూఆర్ కోడ్స్ పంపాడు. వీటినీ స్కాన్ చేయగా తిరిగి రావాల్సింది పోయి మరికొంత అతడి ఖాతాలోకి వెళ్లింది. ఇలా ఆమె రూ.1.29 లక్షలు ఆమె కోల్పోయింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి కంప్రెషర్లు తయారు చేస్తుంటాడు. తాను తయారు చేసిన వాటిని విక్రయిస్తానంటూ పోస్టు చేశారు. దీనిని చూసి స్పందించిన సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేస్తామంటూ కాల్ చేశారు. బేరసారాల అనంతరం అడ్వాన్స్ పంపుతున్నామంటూ గూగుల్ పే క్యూఆర్ కోడ్స్ పంపారు. వీటిని బాధితుడు స్కాన్ చేయగా... రూ.1.5 లక్షలు నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి. అమ్ముతామంటూ అందినకాడికి... వేసవి నేపథ్యంలో నగరంలో ఏసీలకు డిమాండ్ పెరిగింది. దీనిని కూడా సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. సెకండ్ హ్యాండ్ ఏసీలు విక్రయిస్తామంటూ యాడ్స్ పోస్టు చేసి వాటిలో తమ ఫోన్ నంబర్లు పొందుపరుస్తున్నారు. వాటిని చూసి స్పందించిన వారి నుంచి ఆన్లైన్లో కాజేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ ఏసీల విక్రయం పేరుతో ఓఎల్ఎక్స్లో ఉన్న యాడ్స్ చూసి స్పందించిన ఇద్దరు నగర వాసులతో సైబర్ నేరగాళ్లు బేరసారాలు చేశారు. చివరకు ఓ రేటు ఖరారు చేసుకున్నారు. నగదు చెల్లిస్తున్నామని, తమకు వచ్చిన నగదు రీఫండ్ ఇస్తున్నామంటూ వీరిద్దరికీ క్యూఆర్ కోడ్స్ పంపారు. వీటిని బాధితులు స్కాన్ చేయగా... ఒకరి నుంచి రూ.1.05లక్షలు, మరొకరి నుంచి రూ.84 వేలు కాజేశారు. నగరానికే చెందిన మరో వ్యక్తి సెకండ్ హ్యాండ్ కారు ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఆయన ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశారు. మారుతి స్విఫ్ట్ కారు విక్రయం పేరుతో ఉన్న యాడ్ చూసిన అతను అందులో పేర్కొన్న ఫోన్ నెంబర్కు కాల్ చేశాడు. స్పందించిన సైబర్ నేరగాళ్లు బేరసారాల తర్వాత కారును రూ.45 వేలకు అమ్మడానికి అంగీకరించారు. ఆ వాహనం పంపిస్తున్నామంటూ చెప్పి అడ్వాన్సు, ఇతర ఖర్చుల పేరుతో రూ.61,300 కాజేశారు. ఈ ఐదుగురు బాధితులు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. -
రూపాయి ఎర వేసి... ఖాతా ఖాళీ చేసి!
ఓ ప్రైవేటు సంస్థను నడుపుతున్న కె.పవిత్ర బ్యాంకు ఖాతాలో ఈ నెల 21న అపరిచిత వ్యక్తి ఖాతా నుంచి రూ.1 జమ అయ్యింది. మరుక్షణమే ఆ అపరిచిత వ్యక్తి తిరిగి రూ.1 రివర్స్ చేసుకున్నాడు. ఇలా నాలుగుసార్లు వేసి.. తీసిన తర్వాత ఒక్కసారిగా రూ.7,900 డ్రా చేశాడు. మళ్లీ అదే పనిగా మరో రూ.1,100ను నాలుగు దఫాలుగా విత్డ్రా చేశాడు. అయితే ఖాతాదారుకు మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్, మెసేజ్ ఏదీ లేదు. ఏదో అవసరం మీద తన ఖాతాలో నగదును పరిశీలిస్తే.. ఈ విత్డ్రా పర్వం వెలుగు చూసింది. వెంటనే ఎల్బీ నగర్లోని సైబర్ క్రైమ్ విభాగంలో, తర్వాత బ్యాంకులో ఫిర్యాదు చేయగా... తమ పొరపాటు కాదని బ్యాంకర్లు చేతులెత్తేయడం గమనార్హం. తన ప్రమేయం లేకుండా, కనీసం తన పొరపాటు లేకుండా నగదు పోవడంతో ఆమె బ్యాంకు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న తరుణంలో నేరగాళ్లు ఇదే పరిజ్ఞానంతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో నగదు తస్కరించడమంటే అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ ద్వారా ఏటీఎం వివరాలు అడగడమో, లేక ఎస్ఎంఎస్లు పంపమనడమో, ఏదో లింక్ పంపి క్లిక్ చేయమనడమో జరిగేది. అలా అవతలి వ్యక్తులు వివరాలు తీసుకున్న తర్వాత ఖాతాలో నగదు స్వాహా చేయడం విన్నాం. కానీ ఎలాంటి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లేకుండా ఖాతాలోని నగదును సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. తాజాగా సైబర్ క్రైమ్ విభాగానికి ఇలాంటి కేసులు అధికంగా వస్తున్నాయి. గత వారం సంగారెడ్డిలోని ఓ టీచరు ఖాతా నుంచి ఏకంగా 20వేలు ఇలా మాయమయ్యాయి. ఇన్సూరెన్స్తో కవరేజీ... బ్యాంకు ఖాతాలో నగదుపోతే వెంటనే బ్యాంకర్కు ఫిర్యాదు చేయాలి. వారి సూచనల ఆధారంగా.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఏటీఎం కార్డుకు ఇన్సూరెన్స్ ఉంటే పొగొట్టుకున్న మొత్తం తిరిగి పొందే వీలుంటుంది. అయితే ఈ ప్రక్రియ అంత సులువేం కాదు. ఫిర్యాదు అనంతరం కార్డుదారు డాటాను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఖాతాదారు పొరపాటు లేదని గ్రహిస్తేనే ఇన్సూరెన్స్ వస్తుంది. ఖాతాదారు తన వివరాలను అపరిచిత వ్యక్తులతో పంచుకుంటే లేదా నగదు పొగొట్టుకోవడంలో తన ప్రమేయం ఉంటే ఇన్సూరెన్స్ వర్తించదని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 21న కె. పవిత్ర ఖాతాలో రూ.9వేలు స్వాహా కావడంపై బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో పాటు తన ప్రమేయం లేకుండా నగదు విత్డ్రా చేయడంపై ఆమె బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అప్రమత్తత లేకుంటే అంతే బ్యాంకు ఖాతాలో నగదు తస్కరించడం అంత సులువైన విషయం కాదు. ఖాతా వివరాలు తెలిసి ఉండటంతోనే ఇది సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఏటీఎం కార్డు నంబర్తో పాటు సీవీవీ నంబర్లు తెలిస్తే చాలు మన ఖాతాలో నిల్వలు కొట్టేయొచ్చు. ఏటీఎంలో నగదు డ్రా చేసిన తర్వాత వచ్చే స్లిప్పు ఆధారంగా కూడా తస్కరించవచ్చు. బ్యాంకు ఖాతా, ఏటీఎం వివరాలు ఇతరులకు ఇవ్వొద్దనే దానిపై ఖాతాదారుల్లో కొంత అవగాహన పెరిగింది. ఈక్రమంలో సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నాలజీ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రతి ఖాతాదారు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏటీ ఎంలలో నగదు విత్డ్రా, ఇతర షాపింగ్ మాల్స్ లేదా దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేశాక డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా జరిగే లావాదేవీలు పూర్తయ్యే వరకు వేచి చూడాలని, లేకుంటే ఖాతా నిర్వహణ సై బర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంద ని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ పాతూరి వెంకటేశ్ గౌడ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
బ్యాంకు పిన్ నెంబరును... కచ్చితంగా మార్చుకోవాలి
సాక్షి, సిటీబ్యూరో : మాగ్నెటిక్ స్ట్రిప్తో కూడిన డెబిట్/క్రెడిట్ కార్డుల్ని నేరగాళ్లు తేలిగ్గా క్లోనింగ్ చేస్తున్నారనే ఉద్దేశంతో బ్యాంకులు చిప్తో కూడిన కార్డుల్ని అమలులోకి తీసుకువచ్చాయి. ఇప్పుడు వీటికీ సైబర్ క్రిమినల్స్ దాడి తప్పట్లేదు. ఈ కార్డుల్నీ క్లోన్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. బుధ, గురువారాల్లోనే ఇద్దరు బాధితులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఓ గ్రాఫిక్ డిజైనర్ నుంచి రూ.50 వేలు, సోమాజిగూడకు చెందిన మరో యువకుడి ఖాతా నుంచి రూ.40,500 ఈ రకంగా కాజేశారు. మొదటి కేసులో బీహార్లోని గయ, రెండో ఉదంతంలో నెల్లూరులోని ఏటీఎం కేంద్రాల నుంచి నగదు డ్రా అయింది. ఈ కేసులు నమోదు చేసిదర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు కార్డు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చేతిలో ఇమిడే స్కిమర్మర్లతో తస్కరణ... మినీ స్కిమ్మర్లుగా పిలిచే అత్యాధునిక యంత్రాలు ప్రస్తుతం ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉండే వీటిని ఖరీదు చేస్తున్న సైబర్ నేరగాళ్ళు వివిధ వాణిజ్య సముదాయాల్లో ఉండే తమ అనుచరులకు అప్పగిస్తున్నారు. వీటిని నిత్యం తమ జేబుల్లో ఉంచుకుంటున్న ఆ అనుచరులు తమ వద్ద షాపింగ్కు వచ్చిన వచ్చిన వినియోగదారులు డబ్బు చెల్లింపు కోసం డెబిట్/క్రెడిట్ కార్డు ఇచ్చినప్పుడు అదును చూసుకుని ఆ కార్డును ఈ స్కిమ్మర్లోనూ ఒకసారి పెట్టి తీస్తున్నారు. దీంతో అందులో ఉండే డేటా మొత్తం వీటిలో నిక్షిప్తమవుతుంది. కస్టమర్ టైప్ చేసేప్పుడు పిన్ నెంబర్ను గమనిస్తున్నారు. ఆపై వినియోగదారుడి కార్డును అతడికి తిరిగి ఇచ్చేస్తున్నారు. కంప్యూటర్/ల్యాప్టాప్కు కనెక్ట్ చేసి... క్రెడిట్/డెబిట్ కార్డుకు సంబంధించిన డేటామొత్తం చిప్లో నిక్షిప్తమై ఉంటుంది. దుండగుల తమ వద్ద ఉన్న స్కిమ్మర్లో కార్డు ఆ వైపునే పెట్టి తీయడంతో డేటా తస్కరణకు గురవుతోంది. ఇలా తస్కరించిన డేటాతో కూడిన స్కిమ్మర్ల, తాము గుర్తించిన పిన్ నెంబర్లను ఈ అనుచరులు ప్ర«ధాన సూత్రధారులకు అందిస్తుంటారు. వీటిని సైబర్ నేరగాళ్ళు తన ల్యాప్టాప్/కంప్యూటర్లకు కనెక్ట్ చేసి వాటిలోకి అప్లోడ్ చేస్తుంటారు. ఆపై ఈ డేటాను డార్క్ నెట్ ద్వారా విక్రయిస్తూ ఉంటారు. దీన్ని ఖరీదు చేస్తున్న దుండగులు రైటర్లను ఖరీదు చేసి, తమ కంప్యూటర్/ల్యాప్టాప్లకు అనుసంధానిస్తుంటారు. ఇలాంటి మిషన్లన్నీ అత్యధికం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నవే ఉంటున్నాయి. ఆన్లైన్లో ఖరీదు చేస్తున్న చిప్లతో కూడిన ఖాళీ కార్డులను ఈ ల్యాప్టాప్/కంప్యూటర్లకు కనెక్ట్ చేసి ఒక్కో కార్డు డేటాను రైట్ చేసి క్లోన్డ్ కార్డులు రూపొందించేస్తుంటారు. అంటే మన క్రెడిట్కార్డుకి నకలు దుండగుడి వద్ద తయారైపోతుందన్న మాట. దేశంలోని పలు ప్రాంతాల్లో ఏజెంట్లు ఇలా తయారైన క్లోన్డ్ కార్డుల్ని వినియోగించడానికి ఈ నేరగాళ్ళు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటారు. వారికి కార్డులు, పిన్ నెంబర్లను పంపిస్తూ ఉంటారు. సీసీ కెమెరాలు లేని ఏటీఎం కేంద్రాలను గుర్తించే ఈ ఏజెంట్లు డబ్బు డ్రా చేస్తూ ఉంటారు. ఆ మొత్తంలో కొంత కమీషన్ మినహాయించుకుని మిగిలింది సూత్రధారులకు అందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎంపిక చేసుకున్న స్వైపింగ్ మిషన్ కలిగిన వారికి అందిస్తూ అక్కడ స్వైపింగ్ చేయిస్తాయి. ఇలా తమ ఖాతాల్లో పడిన మొత్తాన్ని స్వైపింగ్ మిషన్ హోల్డర్లు కొంత కమీషన్ తీసుకుంటూ సైబర్ నేరగాళ్ళకు అప్పగిస్తుంటారు. ఈ రకంగా మనకు తెలియకుండానే క్లోనింగ్ కార్డు ద్వారా మన ఖాతా ఖాళీ అయిపోతుంటుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి: ♦ క్రెడిట్, డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుకవైపు ఉండే సిగ్నేచర్ ప్యానల్లో సంతకం చేయాలి. ♦ బ్యాంకు అధికారులు పంపిన పిన్ నెంబరును అలాగే వాడేయకుండా... కచ్చితంగా మార్చుకోవాలి. ♦ క్రెడిట్/డెబిట్ కార్డు వెనుక వైపు ఉండే సీవీవీ కోడ్లో చివరకు మూడు అంకెలూ కచ్చితంగా గుర్తుపెట్టుకుని, కార్డు పై నుంచి వాటిని చెరిపేయాలి. ♦ మీ క్రెడిట్/డెబిట్ కార్డును దుకాణం, వెయిటర్ తదితరులకు ఇస్తే... అది తిరిగి మీ చేతికి వచ్చే వరకు దృష్టి మళ్లనీయకండి. ♦ ఇటీవల కోవిడ్ భయం నేపథ్యంలో అనేక మంది వ్యాపారులు, ఆయా దుకాణాల్లోని వారు కార్డులు స్వైప్ చేసిన తర్వాత పిన్ నెంబర్ అడిగి వాళ్ళే ఎంటర్ చేసుకుంటున్నారు. ♦ కొన్ని పరిíస్థితులు మినహాయిస్తే వీలున్నంత వరకు దీనికి అనుమతి ఇవ్వొద్దని అధికారులుసూచిస్తున్నారు. -
టార్గెట్ ‘ఆర్మీ’ !
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్ళు నగరానికి చెందిన ఆర్మీ అధికారులు, సిబ్బందిని టార్గెట్గా చేసుకున్నారు. వీరి చేతిలో మోసపోయిన ముగ్గురు ఆర్మీ సంబంధీకులు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో పని చేస్తున్న ఓ ఆర్మీ అధికారి ఇటీవల జియో ఫోన్కు ఆన్లైన్లో రీ–చార్జ్ చేసుకున్నారు. అయితే ఆ మొత్తం తన నెంబర్కు చేరకపోవడంతో సహాయం కోసం ప్రయత్నించారు. గూగుల్లో సెర్చ్ చేసిన ఆయన అందులో జియో కాల్ సెంటర్ పేరుతో కనిపించిన నెంబర్కు కాల్ చేశారు. ఆ సంస్థ ప్రతినిధులుగా స్పందించిన సైబర్ నేరగాళ్ళు విషయం మొత్తం విన్నారు. తాము పంపే లింకు ఓపెన్ చేసి, అందులో కోరిన వివరాలు నింపాలని ఆ వెంటనే మీ మొత్తం తిరిగి వచ్చేస్తుందని నమ్మబలికారు. సైబర్ నేరగాళ్ళ నుంచి వచ్చిన లింకును ఓపెన్ చేసిన ఈయన అందులో కోరిన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఓటీపీని పొందుపరిచారు. వీటి ఆధారంగా సైబర్ నేరగాళ్ళు ఆయన ఖాతా నుంచి రూ.42 వేలు కాజేశారు. మరో ఉదంతంలో తిరుమలగిరిలోని ఆర్మీ కార్యాలయంలో పని చేసే ఓ జవాన్కు ఇటీవల జమ్మూ కాశ్మీర్కు బదిలీ అయింది. ద్విచక్ర వాహనం లేని ఈయన అక్కడకు వెళ్లేలోపే ఒకటి ఖరీదు చేయాలని భావించారు. దానికోసం ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశారు. అందులో ఆర్మీ అధికారి మాదిరిగా, యాక్టివా 5 జీ వాహనం విక్రయం పేరుతో ఉన్న ప్రకటనకు స్పందించారు. బేరసారాల తర్వాత రూ.23 వేలకు వాహనం ఖరీదు చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఆర్మీ అధికారిగా చెప్పుకున్న సైబర్ నేరగాడు ఆర్మీ ట్రాన్స్పోర్ట్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని చెప్పడంతో నగరంలో ఉంటున్న జవాన్ నమ్మేశాడు. ఆ మొత్తం ఆన్లైన్లో బదిలీ చేయగా... మరికొన్ని చార్జీల పేరు చెప్పి మొత్తం రూ.1.3 లక్షలు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. సైబర్ నేరగాళ్ళు ప్రతి సందర్భంలోనూ వాహనం ఖరీదు మినహా మిగిలిన అన్ని చార్జీలకు చెందిన నగదు రిఫండ్ వస్తుందని చెప్పడంతో బాధితుడు చెల్లిస్తూ పోయాడు. మూడో ఉదంతంలో సికింద్రాబాద్లోని మిలటరీ విభాగంలో పని చేసే మరో జవాన్ టార్గెట్గా మారారు. ఈయన స్నేహితుడికి ఇటీవల మరో ప్రాంతానికి బదిలీ అయింది. ఆయన వెళ్తూ తన ఇన్వర్టర్ను అమ్మి పెట్టాలంటూ నగరంలో ఉంటున్న జవాన్కు ఇచ్చి వెళ్లారు. దాన్ని విక్రయించడానికి ఈయన ఓఎల్ఎక్స్ను ఆశ్రయించారు. ఈ ప్రకటన చూశామని, తమకు నచ్చిందని చెప్తూ సైబర్ నేరగాళ్ళు కాల్ చేశారు. సదరు ఇన్వర్టర్ ఖరీదు చేస్తున్నామంటూ చెప్పి క్యూఆర్ కోడ్స్ పంపారు. వీటిని బాధితుడు స్కాన్ చేయడంతో రూ.44 వేలు నేరగాళ్ళ ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. ఈ ముగ్గురూ గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు ఓటీపీ, తదితర ఫ్రాడ్స్తో నగదు కోల్పోయిన బాధితులు సైతం సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
సైబర్ దర్యాప్తునకు బ్రేక్..!
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్డౌన్ ప్రభావం సైబర్ నేరాల దర్యాప్తు మీదా పడింది. అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయినా... ఈ నేరగాళ్ళ ‘కార్యక్రమాలు’ మాత్రం ఆగలేదు. సాధారణ రోజుల మాదిరి కాకపోయినా... పెద్ద సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో 95 శాతం ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారిని పట్టుకోవడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళే ఆస్కారం లేకపోవడంతో దర్యాప్తులు ఆగిపోయాయి. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నగర సైబర్క్రైమ్ ఠాణాలో కేసు పెండెన్సీ పెరిగిపోతోంది. నమోదయ్యే వాటిలో అత్యధికం ‘ఓ’ కేసులే... రాజధానిలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో మూడు రకాలైనవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్మీ ఉద్యోగులుగా పేర్కొంటూ తక్కువ ధరకు వాహనాలు, వస్తువుల పేరుతో యాడ్స్ యాప్ల్లో, ఫేస్బుక్లోని మార్కెట్ ప్లేస్లో పోస్టులు పెట్టి మోసం చేసే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేసిన వ్యక్తిగత సమాచారంతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) కూడా తీసుకోవడం లేదంటే టీమ్ వ్యూవర్ సహా వివిధ రకాలైన యాప్స్ను డౌన్లోడ్ చేయించి ఖాతాలు ఖాళీ చేసే ఓటీపీ మోసాలు మొదటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి. ఉద్యోగాలు, విదేశీ వీసా, ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్, గిఫ్టులు, లాటరీల పేరుతో చేసే కాల్ సెంటర్ ఫ్రాడ్స్ కేసులది మూడో స్థానం. లాక్డౌన్ ఫలితంగా కాల్ సెంటర్లు సైతం మూతపడటంతో ఈ మూడో తరహా కేసులు తగ్గాయి. అయితే మిగిలిన నేరాలకు మాత్రం బ్రేక్ పడలేదు. ఫలితంగా సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు బాధితులు క్యూ కడుతూనే ఉన్నారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే ఈ ఠాణాలో కేసు నమోదు కాలేదు. ఆ ప్రాంతాలకు చెందిన వారే వాంటెడ్... నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వారే 95 శాతం వరకు నిందితులుగా ఉంటున్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య, అశ్లీల సందేశాలు, ఫొటోలు పంపడం, కంపెనీల డేటా దుర్వినియోగం వంటి వాటిలో మాత్రమే స్థానికులు నిందితులుగా ఉంటున్నారు. మిగిలిన నేరాలకు బయటి వారే బాధ్యులని అధికారులు చెప్తున్నారు. మార్కెట్ ప్లేస్, ఓఎల్ఎక్స్ నేరగాళ్ళకు రాజస్థాన్లోని మేవాట్ రీజియన్లో ఉన్న ఆల్వార్, భరత్పూర్... ఓటీపీ ఫ్రాడ్స్టర్స్కు జార్ఖండ్లోని జామ్తార, దేవ్ఘర్, గిరిధ్... కాల్ సెంటర్ల కేంద్రంగా నడిచే ఇతర నేరాలు చేసే వారికి ఢిల్లీ, కోల్కతా అడ్డాలుగా మారాయని ఇప్పటికే గుర్తించారు. ఈ సైబర్ నేరాల్లో నిందితులు బాధితులకు కనిపించరు. కేవలం ఫోన్కాల్స్ ఆధారంగానే వీళ్ళు తమ పని పూర్తి చేసుకుంటారు. ఒక్కోసారి ‘వినిపించకుండా’నూ అందినకాడికి దండుకుంటారు. ఈ తరహా సైబర్ నేరాలు చేసే వాళ్ళు పశ్చిమ బెంగాల్లో ఉన్న చిత్తరంజన్, అసన్సోల్లకు చెందిన వారి బ్యాంకు ఖాతాలు వాడుకుంటున్నారు. అక్కడ అంతా ‘జెంటిల్మెన్లే’... ‘ఈ–నేరగాళ్ళ’ను పట్టుకోవడానికి అనునిత్యం నగర పోలీసులు ఉత్తరాదికి వెళ్తూనే ఉంటారు. ప్రతి నెలా కనీసం పది రోజుల పాటు ఓ బృందం ఆయా ప్రాంతాల్లోనే మకాం పెట్టి, దొరికిన వారిని పట్టుకువస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం లాక్డౌన్, కొరోన విజృంభణ నేపథ్యంలో దర్యాప్తు నిమిత్తం ఆయా రాష్ట్రాలకు వెళ్ళడానికి ఆస్కారం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఈ క్రిమినల్స్పై హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నా... వారి స్వస్థలాల్లో మాత్రం ఎలాంటి నేరాలు చేయరు. దీంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టుకునేలా చేయడం సాధ్యం కాదు. ఫలితంగా కేసుల దర్యాప్తు ఆగిపోతోంది. మార్చి 22 తర్వాత ఒక్క పోలీసు బృందమూ నగరం దాటి బయటకు వెళ్ళేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో పెరిగిపోతున్న పెండెన్సీ ప్రభావం రానున్న రోజుల్లోనూ కనిపిస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారం సిబ్బందిపై తీవ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. నేరుగా ‘మూసేయడమూ’ సాధ్యం కాదు... ఈ సైబర్ నేరగాళ్ళు నూటికి నూరు శాతం నకిలీ ‘ఆధారాలతోనే’ నేరాలు చేస్తుంటారు. బాధితుల్ని సంప్రదించడానికి వినియోగించే ఫోన్ నెంబర్లు, వీరి నుంచి డబ్బు కాజేయడానికి వాడే బ్యాంకు ఖాతాలు, వాలెట్స్ సహా ఏ ఒక్కటీ వీరి పేరుతో ఉండదు. నకిలీ వివరాలతో లేదా కమీషన్లకు ఆశపడి తమకు సహకరించే మనీమ్యూల్స్గా పిలిచే మధ్యవర్తుల సాయంతో తమ ‘పని’ పూర్తి చేసుకుంటారు. ఈ కారణంగానే ఏటా నమోదవుతున్న కేసుల్లో అనేకం ఎలాంటి ఆధారాలు దొరక్క క్లోజ్ అవుతూ ఉంటాయి. ఫిర్యాదులోని అంశాలు, కేసు తీరుతెన్నుల ఆధారంగా ఇలా క్లోజ్ అయ్యే వాటిని సైబర్ క్రైమ్ అధికారులు తేలిగ్గానే గుర్తిస్తారు. అలాగని పెండెన్సీ తగ్గించుకోవడానికి ఇలాంటి కేసుల్ని తక్షణం క్లోజ్ చేయడానికీ ఆస్కారం లేదు. కచ్చితంగా దర్యాప్తు నిమిత్తం ఒకటిరెండుసార్లు ఆయా రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి, పక్కాగా ఆధారాలు దొరలేదని నిరూపించన తర్వాతే ఈ క్లోజర్కు ఆస్కారం ఉంటుంది. ఫలితంగా ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఠాణాలో కేసుల పెండెన్సీ పెరిగిపోతోంది. కేసుల నమోదు ఇలా... 2017– 325, 2018–428, 2019– 1393. ఈ ఏడాది జనవరి–211, ఫిబ్రవరి–260, మార్చి–169, ఏప్రిల్–140, మేలో ఇప్పటి వరకు– 45. -
ఓరిస్, చెట్నీస్ రెస్టారెంట్స్ పేరుతో..
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ కారణంగా నగరంలో హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ యాప్స్ పని చేయట్లేదు. అయినప్పటికీ ఫుడ్ రోడ్ డెలివరీ పేరుతో శ్రీనగర్కాలనీ వాసి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.40 వేలు కాజేశారు. దీంతో బాధితుడు ఆదివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శ్రీనగర్కాలనీలో నివసించే ఓ వ్యక్తి ఫేస్బుక్లో ఓరిస్, చెట్నీస్ రెస్టారెంట్స్ పేరుతో ఉన్న ప్రకటన చూశారు. అందులో ఫోన్ నెంబర్ ఇచ్చిన నేరగాళ్లు తమకు ఫుడ్ ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ చేస్తామని ఎర వేశారు. ఈ ప్రకటన చూసిన బాధితుడు అందులో ఉన్న ఫోన్ నెంబర్లో సంప్రదించారు. ఇతడి నుంచి ఆర్డర్ తీసుకున్న నేరగాళ్లు పేమెంట్ కోసం తాము ఓ గూగుల్ పేజీ పంపుతామని, దాన్ని పూరించాలని చెప్పారు. అలా తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా నగదు చెల్లిస్తే ఆహారం డోర్ డెలివరీ ఇస్తామని చెప్పారు. అలా నేరగాళ్లు పంపిన పేజ్లో బాధితుడు తన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఫోన్కు వచ్చిన వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) సైతం నింపాడు. వీటిని వినియోగించిన సైబర్ నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.40 వేలు కాజేశారు. మరోపక్క చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి నుంచి సైబర్ క్రిమినల్స్ రూ.64 వేలు స్వాహా చేశారు. గడిచిన కొన్నాళ్లుగా ఆయన ఆన్లైన్లోనే నిత్యావసర సరుకులు ఖరీదు చేస్తున్నారు. దీనికోసం ఆయన గ్రోసరీ యాప్ను వినియోగిస్తున్నారు. సరుకులు ఖరీదు చేసిన ప్రతి సందర్భంలోనూ నెట్ బ్యాంకింగ్ నుంచి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండా ఈయన గ్రోసరీ యాప్లో ముందస్తుగా కొంత మొత్తం చెల్లించారు. ఈ మొత్తం నుంచి నిత్యావసర వస్తువులు ఖరీదు చేయగా.. ఇంకా రూ.20 వేలు బ్యాలెన్స్గా ఉండాల్సి ఉంది. అయితే ఇటీవల తనిఖీ చేయగా బాధితుడికి సదరు యాప్లో ఆ మొత్తం కనిపించలేదు. దీంతో కంగారుపడిన ఆయన విషయాన్ని యాప్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లాలని భావించారు. దీనికోసం గూగుల్లో ఆ యాప్నకు సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్ ఆరా తీశారు. అందులో సైబర్ నేరగాళ్లు పొందుపరిచిన నకిలీ నెంబర్ను అసలైందిగా భావించారు. దానికి కాల్ చేయగా... నేరగాళ్లు తాము గ్రోసరీ యాప్ నిర్వాహకులుగా మాట్లాడారు. ఆ మొత్తాన్ని మీ ఖాతాలోకి తిరిగి పంపాలంటే తాము పంపే ఎస్సెమ్మెస్ను ఫలానా ఫోన్ నెంబర్కు సెండ్ చేయాలని సూచించారు. వీరి మాటలు నమ్మిన బాధితుడు అలానే చేశారు. అది యూపీఐ లింకునకు సంబంధించినది కావడంతో ఆయన బ్యాంకు ఖాతాకు సైబర్ నేరగాళ్ల ఫోను అనుసంధానమైంది. దీంతో సైబర్ నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.64 వేలు కాజేశారు. ఈ విషయం గుర్తించిన బాధితుడు ఆదివారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్నీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కరాచీ బేకరీ పేరుతో మోసాలు..
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ బయోలాజికల్–ఈ(బీఈ) లిమిటెడ్లో ఉద్యోగాల పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు దందా చేస్తున్నారు. ఈ సంస్థ పేరుతో ఆన్లైన్లో నోటిఫికేషన్లు సైతం జారీ చేసిన క్రిమినల్స్ అనేక మంది ఆకర్షించారు. వీరి చేతిలో మోసపోయిన కొందరు బాధితులు విషయం తెలియక ఇటీవల బీఈ సంస్థకు ఫోన్లు చేయడం మొదలెట్టారు. తాము మీ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికయ్యామని, తమవద్ద అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. అయితే తాము ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయలేదంటూ వారికి స్పష్టం చేసిన బీఈ విషయాన్ని బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి బీఈ ప్రతినిధులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ నిరుద్యోగులతో సైబర్ నేరగాళ్లు రూ.లక్షలకు ఒప్పందాలు చేసుకున్నారని, అయితే ఎవరైనా నగదు చెల్లించారా? లేదా? అనేది ఆరా తీయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ♦ లాక్డౌన్ నేపథ్యంలో నగరంలోని బేకరీలు సైతం మూతపడ్డాయి. దీన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. కరాచీ బేకరీ పేరుతో ఫేస్బుక్లో ఓ ఖాతా తెరిచారు. ఇందులో కొన్ని నెంబర్లు సైతం పొందుపరిచిన నేరగాళ్లు తమను సంప్రదించిన వారితో ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, డోర్ డెలివరీ చేస్తామంటూ నమ్మించారు. వీరి మాట నమ్మిన అనేక మంది వివిధ వ్యాలెట్ల ద్వారా నగదు చెల్లించి మోసపోయారు. వీరిలో కొందరు బుధవారం ఆ సంస్థ దుకాణాలు తెరవడంతో వెళ్లి సంప్రదించారు. ఇలా ఫేస్బుక్ కేంద్రంగా సాగుతున్న మోసాన్ని తెలుసుకున్న కరాచీ బేకరీ యాజమాన్యం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ♦ కొరియర్లో రావాల్సిన క్రెడిట్ కార్డు కోసం ఒకరు, ఎయిర్ కూలర్ ఖరీదు చేయాలని భావించిన మరొకరు గూగుల్లోని నకిలీ కాల్ సెంటర్ నెంబర్లకు సంప్రదించి నిండా మునిగారు. చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ఎస్బీఐ క్రెడిట్కార్డు బ్లూడార్ట్ కొరియర్లో రావాల్సి ఉంది. నిర్ణీత గడువు ముగిసినా అది డెలివరీ కాకపోవడంతో ఆ సంస్థ వెబ్సైట్లో ట్రాక్ చేశాడు. అందులో ఇంటికి తాళం వేసి ఉండటంతో కార్డు వెనక్కు వచ్చేసినట్లు ఉంది. దీంతో బ్లూడార్ట్ సంస్థ నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశాడు. అక్కడ లభించిన ఓ నకిలీ నెంబర్కు కాల్ చేయగా.. సంస్థ ప్రతినిధుల మాదిరిగా సైబర్ నేరగాళ్లు మాట్లాడారు. ఆ కార్డు పొందాలంటూ తాము పంపే లింకులో ఉండే ఫారం నింపాలని సూచించారు. బాధితుడు ఆ ఫారంలో ఉన్న కాలమ్స్లో తన బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ సైతం నింపాడు. దీంతో అతడి ఖాతా నుంచి రూ.90 వేలు కాజేశారు. నగరానికి చెందిన మరో వ్యక్తి సింఫనీ ఎయిర్కూలర్ ఖరీదు చేయాలని భావించారు. ఆ సంస్థ నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేసి నకిలీ కాల్సెంటర్ నెంబర్కు కాల్ చేశాడు. రూ.9,600కే కూలర్ ఇస్తామంటూ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు గూగుల్ పే యాప్ డౌన్లోడ్ చేయించారు. దాని ద్వారా తమ నెంబర్కు రూ.19,600 పంపాలని సూచించారు. రికార్డుల్లో కూలర్ మొత్తం ధర నమోదు కావాలని, ఆ తర్వాత కూలర్తో పాటు రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. ఈ మాటలు బాధితుడు నమ్మడంతో లావాదేవీ సరిగ్గా జరగలేదంటూ పలు దఫాలుగా అతడి నుంచి రూ.97 వేలు కాజేశారు. ♦ మరోపక్క ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయం పేరుతో యాడ్స్ పొందుపరిచిన సైబర్ నేరగాళ్లు ముగ్గురు నగరవాసులకు టోకరా వేశారు. ఇన్నోవా విక్రయం పేరుతో రూ.65 వేలు, బొలేరో పేరుతో రూ.56 వేలు, హోండా యాక్టివ విక్రయం అంటూ రూ.42 వేలు కాజేశారు. బాధితులకు నేరగాళ్లు ఆర్మీ ఉద్యోగుల మాదిరిగానే పరిచయం అయ్యారు. వీరి ఫిర్యాదుల మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
స్నేహితుడి ఫేస్బుక్ ఐడీ హ్యాక్ చేసి..
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆర్మీ సిపాయితో ఆయన స్నేహితుడి మాదిరిగా చాట్ చేసిన నేరగాళ్లు రూ.1.5 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోపక్క వేర్వేరు నేరాల్లో రూ.2.23 లక్షలు కోల్పోయిన మరో ముగ్గురు బాధితులూ సైబర్ ఠాణాను ఆశ్రయించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో నివసించే ఆర్మీ సిపాయి రాహుల్ తన స్నేహితుడైన మనోజ్ గుప్తతో తరచుగా ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేస్తుండేవారు. ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు మనోజ్ గుప్త ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేశారు. అతడి అనుమతి లేకుండానే అందులో ప్రవేశించి, రాహుల్తో చాటింగ్ కొనసాగించారు. అప్పటి వరకు వీరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో గుర్తించిన సైబర్ నేరగాళ్లు అదే పంథా కొనసాగించారు. ఓ సందర్భంలో తనకు అత్యవసరంగా రూ.1.5 లక్షలు కావాలంటూ మనోజ్ మాదిరిగా సైబర్ నేరగాళ్లు రాహుల్ని కోరారు. ఇలా అడిగింది మనోజే అని భావించిన రాహుల్ తన వద్ద ప్రస్తుతం రూ.లక్ష మాత్రమే ఉందని, దాన్ని పంపిస్తానని సమాధానం ఇచ్చాడు. దీంతో మనోజ్ మాదిరిగా సైబర్ నేరగాళ్లు ఓ గూగుల్ పే నెంబర్ ఇచ్చారు. దీనికి రాహుల్ ఐదు దఫాల్లో రూ.లక్ష బదిలీ చేశారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత మనోజ్కు ఫోన్ చేసిన రాహుల్ డబ్బు అందిందా అని ఆరా తీశారు. డబ్బేంటి అంటూ అతడు ప్రశ్నించగా... తన ఫేస్బుక్ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసిన విషయం అతడు చెప్పాడు. దీంతోరాహుల్ సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరో ఉదంతంలో రూ.1.05 లక్షలు.. వారాసిగూడ ప్రాంతానికి చెందిన సాయి అనే వ్యక్తికి హెడ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్కార్డు ఉంది. ఆ బ్యాంకు నుంచి అంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు కార్డు బ్లాక్ అవుతోందని, అలా కాకుండా ఉండాలంటే వివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని చెప్పారు. నిజమని నమ్మిన సాయి కార్డు వివరాలు, ఓటీపీ చెప్పడంతో ఖాతాలో ఉన్న రూ.1.05 లక్షలు కాజేశారు. కేవైసీ అప్డేట్ అంటూ... బోరబండ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కాల్ చేసిన సైబర్ క్రిమినల్స్ పేటీఎం సంస్థ ప్రతినిధుల మాదిరిగా మాట్లాడారు. కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలంటూ ఓ లింకును పంపారు. అందులో బాధితుడు తన వివరాలు, ఓటీపీ నింపడంతో వీటి ఆధారంగా అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.54 వేలు కాజేశారు. క్లోన్ చేసి విదేశంలో షాపింగ్.. మరోపక్క టోలిచౌకిలో నివసించే ఓ వ్యాపారికి చెందిన క్రెడిట్ కార్డును దుర్వినియోగమైంది. ఇతడి కార్డును క్లోన్ చేసిన నేరగాళ్లు విదేశంలో రూ.64 వేలు షాపింగ్ చేశారు. విషయం తెలుసుకున్న ఆయన సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. -
సైబర్ పంజా
సాక్షి, సిటీబ్యూరో: కరోనా టైమ్లోనూ సైబర్ నేరాలు తగ్గడం లేదు. బాధితుల అమాయకత్వం, అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వివిధ రకాల సైబర్ నేరాల్లో రూ.1.9 లక్షలు పోగొట్టుకున్న నలుగురు బాధితులు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ను ఆశ్రయించారు. కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వివరాలు ఇవీ.. ♦ సైదాబాద్ ప్రాంతానికి చెందిన యువకుడు ఓ డిజిటల్ మార్కెటింగ్ సంస్థలో పని చేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్కు పరిమితమయ్యాడు. ఇతడికి తన యజమాని మాదిరిగా నకిలీ ఈ– మెయిల్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ.20 వేలు కాజేశారు. సైబర్ నేరగాళ్లు అతడి యజమాని పేరును డిప్ప్లే నేమ్గా వినియోగించి మరో ఈ–మెయిల్ ఐడీ సృష్టించారు. దీని ఆధారంగా మూడు రోజుల క్రితం ఓ మెసేజ్ పంపారు. ‘నేను రెండు గంటల పాటు అత్యవసర మీటింగ్లో ఉంటున్నా. అర్జంట్గా ఈ ఖాతాలోకి రూ.20 వేలు బదిలీ చెయ్’ అంటూ ఉంది. కేవలం డిస్ప్లే నేమ్ చూసిన యువకుడు ఇది తన యజమాని నుంచే వచ్చిందని భావించి ఆ మొత్తం బదిలీ చేశాడు. బుధవారం మళ్లీ అదే తరహాలో మెయిల్ పంపిన సైబర్ క్రిమినల్స్ రూ.30 వేలు పంపమన్నారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తన యజమానిని సంప్రదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నేరానికి ముందు నిందితులు బాధితుడు లేదా అతడి యజమాని మెయిల్ను హ్యాక్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ♦ నగరానికి చెందిన ఓ వ్యక్తి తన వ్యాక్యూమ్ క్లీనర్ను విక్రయించాలని భావించి వివరాలను ఓఎల్ఎక్స్లో పోస్టు చేశాడు. దీనిని చూసిన సైబర్ నేరగాళ్లు ఖరీదు చేయడానికి ఆసక్తి ఉందంటూ కాల్ చేశారు. బేరసారాల తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్ కొనడానికి అంగీకరించారు. దానిని తీసుకోవడానికి తన సోదరుడు వస్తాడని చెప్పిన నేరగాడు గూగుల్ పే ద్వారా అడ్వాన్స్ చెల్లిస్తానని చెప్పారు. దీంతో బాధితుడు తన సోదరి ఫోన్ నంబర్ ఇచ్చాడు. దీనికి సైబర్ నేరగాడు తన గూగుల్ పే ఖాతా నుంచి రూ.5 వేలకు మనీ రిక్వెస్ట్ పంపాడు. దీన్ని ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీంతో అతను సైబర్ నేరగాడిని సంప్రదించగా, మీకు ఇవ్వాల్సిన రూ.5 వేలు, పొరపాటున వచ్చిన రూ.5 వేలకు కలిపి రూ.10 వేలు పంపిస్తున్నానని చెప్పాడు. ఆపై రూ.10 వేలకు రిక్వెస్ట్ పంపి ఆ మొత్తం కాజేశాడు. మరో రెండుసార్లు చేసి మొత్తం రూ.75 వేలు కాజేశాడు. ♦ కోవిడ్ నేపథ్యంలో పురానాపూల్కు చెందిన ఓ వ్యక్తి హోల్సేల్గా మాస్కులు తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఈ మేరకు జస్ట్ డయల్లో తన కుమార్తె ఫోన్ నంబర్తో వివరాలు పొందుపరిచాడు. దీని ఆధారంగా ఆమెకు కాల్ చేసిన సైబర్ నేరగాడు తనకు 25 వేల మాస్కులు కావాలని కోరాడు. అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పడంతో గూగుల్ పే ద్వారా పంపిస్తున్నట్లు తెలిపాడు. ఆమెకు రూ.50 వేలకు క్యూఆర్ కోడ్ పంపిన నేరగాడు దాన్ని స్కాన్ చేయించి, ప్రొసీడ్ టు పే యాక్సెప్ట్ చేసేలా చేశాడు. దీంతో ఆమె ఖాతా నుంచి రూ.50 వేలు సైబర్ నేరగాడికి చేరిపోయాయి. ఈ విషయం అతడికి ఫోన్ చేసి చెప్పిన బాధితురాలు డబ్బు రిటర్న్ చేయాలని కోరింది. ఆ ప్రయత్నాలు చేస్తున్నానని, మీ నంబర్తో సాధ్యం కావట్లేదని చెప్పాడు. దీంతో ఆమె తన తండ్రి నంబర్ ఇచ్చింది. దానికి మరో క్యూఆర్ కోడ్ పంపాడు. దాన్నీ స్కాన్ చేయించి మరో రూ.5500 కాజేశాడు. మొత్తం 55,500 పోగొట్టుకున్న బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ♦ జూబ్లీహిల్స్కు చెందిన వ్యక్తి బైక్ ఖరీదు చేయాలని భావించాడు. ఓఎల్ఎక్స్లో ఉన్న యాక్టివా 5జీ నచ్చడంతో అందులో ఉన్న నంబర్లో సంప్రదించాడు. ఇతడితో బేరసారాలు చేసిన ఎదుటి వ్యక్తి అడ్వాన్స్తో పాటు రకరకాల పేర్లు చెప్పి రూ.78 వేలు కాజేశాడు. ఇందులో చాలా మొత్తం వాహనంతో పాటు రీఫండ్ వస్తుందని చెప్పి టోకరా వేశాడు. -
200 రీచార్జ్ చేస్తే.. 64వేలు స్వాహా..!
సాక్షి, సిటీబ్యూరో: ఫోన్ రీచార్జ్ చేసిన రూ.200 విషయం అడగటానికి ఇంటర్నెట్లో ఉన్న నకిలీ కాల్సెంటర్కు ఫోన్ చేసిన నగరవాసి రూ.64వేలు నష్టపోయాడు. ఈ వ్యవహారంపై బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ సోమవారం తన భార్య ఫోన్కు గూగుల్ పే ద్వారా రూ.200 రీచార్జ్ చేశారు. అయితే మంగళవారం ఉదయానికీ ఆ ఫోన్ రీచార్జ్ కాలేదు. గూగుల్ పే ద్వారా నగదు చెల్లించి ఉండటంతో ఆ సంస్థ వారిని సంప్రదించడానికి ప్రయత్నించాడు. వారి నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేసిన బాధితుడికి ఓ నంబర్ కనిపించడంతో దానికి కాల్ చేశాడు. (మహిళా కానిస్టేబుల్కు 'గూగుల్ పే'లో మోసం) ఆ నంబర్ సైబర్ నేరగాళ్లది కావడంతో వారు బాధితుడు చెప్పే విషయం మొత్తం విని రెండు లింకులు పంపారు. బాధితుడి ఫోన్ నుంచి ఆ లింకులను ఫలానా నంబర్కు పంపితే వెంటనే రూ.200 రీచార్జ్ అయిపోతుందని నమ్మబలికారు. బాధితుడు అలానే చేయడంతో అతడి రెండు బ్యాంకు ఖాతాలకు చెందిన యూపీఐ లింకు సైబర్ నేరగాళ్ల ఫోన్కు వెళ్లిపోయింది. దీని ద్వారా నాలుగు లావాదేవీలు చేసిన సైబర్ నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.64వేలు తమ ఖాతాల్లోకి మల్లించుకున్నారు. ఈ విషయం గమనించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి విషయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. -
ఫేస్బుక్ వలలో పడి.. బీమా డబ్బు
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ సమయంలోనూ సైబర్ నేరగాళ్ల ఆగడాలు తగ్గట్లేదు. అనేక రకాలుగా ఎర వేసి నగరవాసుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. నగరంలో వేర్వేరు సంఘటనలో ముగ్గరుని ఎర వేసిన సైబర్ నేరగాళ్లు వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో నగదును కాజేశారు. కుమారుడి బీమా డబ్బు పోగొట్టుకున్న తల్లి నగరానికి చెందిన ఓ వివాహితకు ఫేక్బుక్ ద్వారా వల వేసిన సైబర్ నేరగాళ్ళు ఆమె నుంచి రూ.9.55 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే... నగరంలోని తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ మధ్య తరగతి మహిళ కుమారుడు కొన్నాళ్ళ క్రితం మరణించారు. అతడు అవివాహితుడు కావడంతో పాటు జీవిత బీమాకు తల్లి నామినీగా ఉండటంతో ఆ సొమ్ము తల్లి ఖాతాలోకి వచ్చింది. ఈమెకు గత ఏడాది డిసెంబర్లో ఫేస్బుక్ ద్వారా జిమ్ జే అనే పేరు చెప్పుకున్న నైజీరియన్ పరిచయమయ్యాడు. తాను లండన్లో ఉంటానని, వ్యాపారం చేస్తుంటానని నైజీరియన్ నమ్మబలికాడు. ఓ రోజు తాను ఇండియా వస్తున్నానని, మన స్నేహానికి గుర్తుగా ఓ బహుమతి తీసుకువస్తున్నానంటూ చెప్పాడు. ఇది జరిగిన రెండో రోజు తాను న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నట్లు ఫోన్ చేశాడు. తన వెంట బహుమతిగా తీసుకువచ్చిన వజ్రాలు, పౌండ్లు ఉన్నాయని, వీటి విలువ రూ.కోట్లలో ఉండటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని చెప్పాడు. తనను విడిచిపెట్టాలంటే పన్నుగా రూ.1.8 లక్షలు చెల్లించాల్సి ఉందంటూ నమ్మబలికి ఆమెకు ఓ బ్యాంకు ఖాతా వివరాలు పంపి అందులో డిపాజిట్ చేయించుకున్నాడు. ఆ వెంటనే కస్టమ్స్ అధికారులు తనను విడిచిపెట్టారని, బహుమతిగా తెచ్చినవి మాత్రం సీజ్ చేశారని నమ్మించాడు. ఇది జనవరిలో జరగ్గా... ఇటీవల నిందితుడు మళ్లీ బాధితురాలికి ఫోన్ చేసి అప్పుగా తీసుకున్న రూ.1.8 లక్షలు త్వరలోనే తిరిగి పంపిస్తానన్నాడు. స్వాధీనం చేసుకున్న వజ్రాలు, పౌండ్లు తనకు తిరిగి ఇవ్వడానికి కస్టమ్స్ అధికారులు అంగీకరించట్లేదని, రిజర్వ్ బ్యాంక్ ద్వారా భారతీయుడి ఖాతాలోకే వేస్తామని చెప్పారని పేర్కొన్నాడు. ఈ మాటలకు ఆమె ఆశ పడటంతో.. మీ బ్యాంకు ఖాతాలోకి ఆ డబ్బు రావాలంటే కొన్ని పన్నులు చెల్లించాలని ఆమె నమ్మించి మరో మూడు బ్యాంకు ఖాతా వివరాలు చెప్పి మరికొంత మొత్తం డిపాజిట్ చేయించుకున్నాడు. ఇలా మొత్తం రూ.9.55 లక్షలు ఆమె నుంచి కాజేయడంతో తాను మోసపోతున్నట్లు ఆమెకు అనుమానం వచ్చింది. అప్పటి వరకు భర్తకు చెప్పకుండా కుమారుడి ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన సొమ్ము దారాదత్తం చేసిన ఆమె చివరకు నోరు విప్పింది. సోమవారం జరిగినదంతా భర్తకు చెప్పడంతో ఆయన సైబర్ క్రైమ్ ఠాణాకు తీసుకువచ్చారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కుమారుడి ఇన్సూరెన్స్ సొమ్ము పోగొట్టుకున్న ఈ మధ్య తరగతి భార్యాభర్తలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మార్కెట్ ప్లేస్ ద్వారా మోసపోయిన యువకుడు! ద్విచక్ర వాహనం ఖరీదు చేయడానికి ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన యువకుడు సైబర్ నేరగాళ్ళ వలలో పడ్డాడు. తనకు నచ్చిన సెకండ్ హ్యాండ్ హోండా యాక్టివాను రూ.17 వేలకు కొనడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఆ నేరగాళ్ళ మాటలు నమ్మి రూ.37వేలు చెల్లించి చేతులు కాల్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే... జియాగూడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా మటన్ దుకాణం నిర్వహిస్తుంటాడు. తాను సంచరించడానికి ఓ సెకండ్ హ్యాండ్ బైక్ ఖరీదు చేయాలని భావించి ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. చివరకు ఫేస్బుక్లోని మార్కెట్ ప్లేస్లో కనిపించిన హోండా యాక్టివా ఇతడికి నచ్చడంతో అక్కడ ఉన్న ఫోన్ నెంబర్లో సంప్రదించాడు. సమాధానం ఇచ్చిన అవతలి వ్యక్తి తాను ఆర్మీలో పని చేస్తున్నట్లు నమ్మించి సదరు వాహనాన్ని రూ.17 వేలకు విక్రయించడానికి అంగీకరించాడు. అడ్వాన్స్గా రూ.3,100 ఫోన్ పే ద్వారా తీసుకున్న ఇతగాడు వాహనాన్ని కొరియర్ ద్వారా పంపుతానని, రిసీవ్ చేసుకున్న తర్వాత మిగిలిన మొత్తం చెల్లించాలని సూచించాడు. దీనికి నగరవాసి అంగీకరించాడు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత కొరియర్ బాయ్ని అంటూ మరో వ్యక్తి కాల్ చేసి తాను శంషాబాద్ విమానాశ్రయం సమీపం నుంచి మాట్లాడుతున్నానని, కొరియర్ ద్వారా హోండా యాక్టివా వచ్చిందని, అయితే దాన్ని డెలివరీ ఇవ్వడానికి కొన్న రకాలైన ట్యాక్స్లు, సెస్లు చెల్లించాలని నమ్మబలికాడు. ఈ చెల్లింపులన్నీ కేవలం ఫార్మాలీటీ అని, వాహనంతో పాటు మొత్తం రిఫండ్ వస్తుందని చెప్పాడు. దీంతో బాధితుడు దఫదఫాలుగా రూ.37,200 చెల్లించాడు. చివరకు తాను మోసపోయానని గుర్తించి సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ మధుసూదన్ దర్యాప్తు ప్రారంభించారు. అమ్మాలనుకొని అడ్డంగా మునిగాడు... నగరంలోని బజార్ఘాట్ ప్రాంతానికి చెందిన ఓ చిరు వ్యాపారి ఓఎల్ఎక్స్ ద్వారా క్యారంబోర్డ్ అమ్మాలని భావించి సైబర్ నేరగాళ్ళకు అడ్డంగా దొరికేశాడు. స్థానికంగా చిరు వ్యాపారం చేసే ఈ యువకుడు తన ఇంట్లో ఉన్న క్యారంబోర్డును విక్రయిస్తానంటూ ఓఎల్ఎక్స్లో తన నెంబర్తో సహా పోస్టు చేశాడు. ఇది చూసిన సైబర్ నేరగాడు తాను రూ.1500కు ఖరీదు చేస్తానంటూ కాల్ చేసి డబ్బును గూగుల్ పే ద్వారా పంపిస్తున్నానని చెప్పాడు. తాను పంపే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలని ఆపై ప్రొసీడ్ టు పే నొక్కితే సొమ్ము మీ ఖాతాలోకి వస్తుందని నమ్మించాడు. బాధితుడు అలాగే చేయగా... ఇతడి ఖాతాలోని డబ్బు సైబర్ నేరగాడికి వెళ్ళింది. ఈ విషయం అతడికి ఫోన్ చేసిన చెప్పగా... అది సాంకేతిక సమస్య అంటూ చెప్పిన అతగాడు మరో కోడ్ పంపిస్తున్నానని, దీని ద్వారా మొత్తం వచ్చేస్తుందని చెప్పాడు. ఇలా మొత్తం ఆరు సార్లు బాధితుడితో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించిన సైబర్ నేరగాళ్ళు మొత్తం రూ.63,998 కాజేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ మధుసూదన్ దర్యాప్తు ప్రారంభించారు. -
లాక్డౌన్ తర్వాత నమోదైన కేసు ఇదొక్కటే..
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ ఎఫెక్టుతో దాదాపు అన్ని కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. నడుస్తున్న వాటిలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ జరగడమో లేదా పరిమితంగా సిబ్బంది ఉండటమో జరుగుతోంది. దీంతో దాదాపు కుటుంబ సభ్యులు అంతా ఇళ్ళ వద్దే ఉంటున్నారు. దీని ప్రభావం ఫ్రెండ్షిప్ ఫ్రాడ్పై పడింది. రాజధానిలో ఈ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలతో పాటు మార్చిలో లాక్డౌన్ మొదలయ్యే వరకు దాదాపు పది కేసుల వరకు నమోదయ్యాయి. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి సోమవారం వరకు కేవలం ఒకే ఒక్క కేసు రిజిస్టర్ అయింది. ఈ ఫ్రెండ్ షిప్ స్కామ్కు మూలం ఫేస్బుక్ పేజీలే. బోగస్ పేర్లు, నకిలీ ఐడీలు, ఫోటోలతో ఫేస్బుక్లో పేజీలు క్రియేట్ చేసే నైజీరియన్ ఫ్రాడ్స్టర్స్ వీటిని వినియోగించి అనేక మంది దక్షణ భారతీయులకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తుంటారు. యువకులకు యువతుల మాదిరిగా, యువతులకు యువకులుగా వీటిని పంపుతారు. ఎదుటి వాళ్ళు స్పందించి యాక్సప్ట్ చేసిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. తాము అమెరికా, లండన్, కెనడాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నట్లు చెప్తూ కొన్ని రోజుల పాటు ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా వారితో సంప్రదింపులు కొనసాగిస్తారు. తాము టార్గెట్ చేసిన వ్యక్తులు పూర్తిగా బుట్టలో పడ్డారని తేలిన తర్వాత సైబర్ నేరగాళ్ళు తమ వాట్సాప్ నెంబర్లు షేర్ చేస్తారు. దాదాపు ఇవన్నీ వర్చువల్ నెంబర్లుగా పిలిచే ఇంటర్నెట్ ఆధారితమైనే అయి ఉంటాయి. ఈ కారణంగా వీరు నైజీరియా నుంచి వినియోగించినా అమెరికా, లండన్లకు చెందిన నెంబర్లే డిస్ప్లే అవుతూ ఉంటాయి. దీంతో సైబర్ నేరగాళ్ళు చెప్తున్న మాటల్ని బాధితులు పూర్తిగా నమ్మేస్తారు. హఠాత్తుగా ఓ రోజు మన స్నేహానికి గుర్తుగా మీకో గిఫ్ట్ పంపిస్తున్నామంటూ చెప్పి కొన్ని ఫొటోలను సెండ్ చేస్తారు. ఇది జరిగిన తర్వాతి రోజు విమానాశ్రయంలోని ఎయిర్కార్గో అనో, కస్టమ్స్ అధికారులనో చెప్పుకున్న వ్యక్తుల నుంచి ఫోన్ వస్తుంది. ఫలానా దేశం నుంచి ఫలానా వ్యక్తి విలువైన గిఫ్టులు, నగదు పంపాడని పన్ను చెల్లించాలని, లేదంటే కేసు అవుతుందని చెప్పి అందినకాడికి దండుకుంటారు. లాక్డౌన్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు, కొరియర్స్ రద్దు కావడంతో ఈ పంథాలో మోసం చేయడం నైజీరియన్లకు సాధ్యం కావట్లేదు. దీంతో దేశంలోని మెట్రో నగరాల్లో ఉంటున్న వారిగా చెప్పుకుంటూ పరిచయం చేసుకుని, చాటింగ్స్ తర్వాత వ్యాపార, విద్య, వ్యక్తిగత అవసరాల పేర్లు చెప్పి డబ్బు అడుగుతున్నారు. యువతి/యవకుడిగా చెప్పుకునే ఈ సైబర్ నేరగాడితో చాటింగ్ చేస్తేనే ఎదుటి వ్యక్తి వారి వల్లో పడి బాధితుడిగా మారతాడు. అయితే ప్రస్తుతం అలా చేయడానికి ఇక్కడి వారికి కుదరట్లేదు. తల్లిదండ్రులో, భార్య, భర్త లేదా ఇతర కుటుంబీకులు ఇంట్లోనే ఉంటుండటంతో చాటింగ్ సాధ్యం కావట్లేదు. తమ ఉనికి, స్వరూపం బయటపడుతుందనే ఉద్దేశంతో ఈ తరహా సైబర్ నేరగాళ్ళు ఫోన్లు, వీడియో కాల్స్ కు దూరంగా ఉంటారు. చాటింగ్ చేయనిదే ఎవరూ ఆ సైబర్ నేరగాళ్ళ వల్లో పడరు. ఫలితంగా మోసపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. నగరానికి చెందిన ఓ యువకుడు మాత్రం ఈ ఫ్రెండ్ షిప్ ఫ్రాడ్ బారినపడి రూ.91 వేలు పోగొట్టుకున్నాడు. దీనిపై సోమవారం కేసు నమోదైంది. లాక్డౌన్ తర్వాత నమోదైన కేసు ఇదోక్కటే కావడం గమనార్హం. -
మొబైల్స్ లక్ష్యంగా సైబర్ క్రైమ్స్
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలంలో సైబర్ నేరస్తుల దృష్టి స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై పడింది. లాక్ డౌన్ వల్ల అత్యధికులు స్మార్ట్ఫోన్స్ ద్వారానే ఇంటర్నెట్ను వినియోగిస్తున్న నేపథ్యంలో స్పైవేర్, రాన్సమ్వేర్ల ప్రమాదం వారికి పొంచి ఉందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సెర్ట్–ఇన్)’ హెచ్చరించింది. వినియోగదారుడి ముఖ్యమైన వ్యక్తిగత డేటాను స్పైవేర్ సంగ్రహిస్తుంది. లాగిన్ వివరాల వంటి కీలక రహస్యాలను రాన్సమ్వేర్ తన అధీనంలోకి తీసుకుంటుంది. ఆ తరువాత యూజర్ నుంచి డబ్బు డిమాండ్ చేసి, ఆన్లైన్లో ఆ డబ్బు అందిన తరువాత అవి ఆ వివరాలను విడుదల చేస్తాయి. వ్యక్తిగత ఫోన్లను ఈ ప్రమాదాల నుంచి తప్పించేందుకు సెర్ట్–ఇన్ పలు సూచనలను ఇచ్చింది. అవి... 1) మొబైల్ పరికరణాలు, యాప్స్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఫోన్లోని వ్యక్తిగత డేటాను జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. 2) ఆపరేటింగ్ సిస్టమ్, యాప్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. ఓఎస్ను అందించే సంస్థలు కొన్ని అదనపు సెక్యూరిటీ ఆప్షన్స్ కూడా యూజర్స్కు అందుబాటులో ఉంచుతుంటాయి. 3) ఉపయోగించని యాప్స్ను తొలగించాలి. 4) అధికారిక యాప్ స్టోర్స్ నుంచే యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవాలి. 5) ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఇతర యాప్స్లోకి సైన్ ఇన్ కావడంపై అప్రమత్తంగా ఉండండి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో అనుసంధానమైన యాప్స్ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఆయా సైట్ల నుంచి తీసుకునే ప్రమాదముంది. అలాగే, ఆయా యాప్స్ నుంచి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు కూడా మీ సమాచారాన్ని సంగ్రహించవచ్చు. 6) ఎస్ఎంఎస్, ఈ మెయిల్ ద్వారా వచ్చే లింక్స్ను ఓపెన్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలియని సోర్స్ల ద్వారా ఆ లింక్స్ వస్తే వాటిని ఓపెన్ చేయకండి. 7) పాస్వర్డ్స్ను సేవ్ చేసుకోవాలని కొన్ని యాప్స్ కోరుతుంటాయి. అలా సేవ్ చేసుకోవడం అంత సురక్షితం కాదు. ఒకవేళ ఫోన్ పోతే, మీ వివరాలన్నీ బహిర్గతం అయ్యే ప్రమాదముంది. 8) పబ్లిక్ వైఫై నెట్వర్క్ను వాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పబ్లిక్ వైఫై వాడాల్సి వస్తే.. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసే యాప్స్ను ఓపెన్ చేయకండి. అలాగే, మీ ఫోన్లోని బ్లూటూత్ను అనవసరంగా ఆన్లో ఉంచకండి. 9) మొబైల్ డివైజ్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ సెట్టింగ్స్ను మార్చకండి. 10) మీ నియంత్రణ లేని కంప్యూటర్ లేదా చార్జింగ్ స్టేషన్ ద్వారా ఫోన్ ను చార్జింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండండి. -
ప్రధాన మంత్రి విరాళాలు కొల్లగొట్టడానికి..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా సహాయక చర్యల కోసం ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన సహాయ నిధి తరహాలో సైబర్ నేరగాళ్లు నకిలీది రూపొందించి విరాళాలు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని గమనించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చే వారి కోసం భారత ప్రభుత్వం ఎస్బీఐ బ్యాంకు ద్వారా యూపీఐ ఐడీని క్రియేట్ చేసింది. pmcares@sbi పేరుతో ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది. దీనికి విరాళాల వెల్లువెత్తుతుండటంతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. కరోనా సహాయ చర్య కోసం నిధులు అందించే దాతల్ని బురిడీ కొట్టించడానికి ఆరు బోగస్ యూపీఐ ఐడీలను సృష్టించారు. pmcares@pnb,pmcares@hdfcbank, pmcare@yes bank, pmcare@ybl, pmcare@upi, pmcare@sbi, pmcares@icici' పేర్లతో ఇవి చెలామణి అవుతున్నాయి. ఈ యూపీఐ ఐడీలను పేర్కొంటూ సైబర్ నేరగాళ్లు ప్రతి నిత్యం వేల మందికి ఎస్సెమ్మెస్లు పంపుతూ.. కాల్ సెంటర్ల పేరుతో ఫోన్లు చేసి విరాళాలను కాజేస్తున్నారు. ఈ నకిలీ ఖాతాల్లోకి బదిలీ చేసిన డబ్బు నేరగాళ్లకు చేరుతుందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచిస్తున్నారు. పీఎం కేర్స్కు విరాళం ఇవ్వాలని భావించిన వారు pmindia.gov.in వెబ్సైట్ను వీక్షించాలని పేర్కొన్నారు. -
'కరోనా' మాటున హ్యాకింగ్ 'కాటు'
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మాటున సైబర్ కేటుగాళ్లు హ్యాకింగ్ కాటు వేస్తున్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని ప్రపంచంలోని పలు దేశాల్లో, మన దేశంలో కార్పొరేట్ సంస్థల డేటా చోరీకి పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి, మార్చి 15 నుంచి 19 తేదీ వరకు మరోసారి పెద్ద ఎత్తున సైబర్ ఎటాక్స్ జరిగినట్టు అంతర్జాతీయ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ అందించే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) సైబర్ సెక్యూరిటీ టీమ్ పరిశీలనలో తేలినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం అప్రమత్తమైంది. ఏపీలో అప్రమత్తంగా ఉన్నాం.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు ఆసక్తికర అంశాలను ఎరవేసి ఉచ్చులోకి లాగే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి మోసాలపై టెక్నాలజీని వాడుతున్న వారంతా అప్రమత్తంగా ఉండాలి. కరోనా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇదే విషయాన్ని సాకుగా తీసుకుని దేశంలో కొద్ది రోజులుగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్టు గుర్తించాం. ఆంధ్రప్రదేశ్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సైబర్ ఎటాక్స్ తీరును అప్రమత్తంగానే గమనిస్తున్నాం. సంస్థల డేటా హ్యాకింగ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అనధికార లింక్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎలా జరుగుతోంది? - కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే విధులు (వర్క్ ఫ్రం హోం) నిర్వహించేలా వెసులుబాటు కల్పించడాన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకున్నారు. - కరోనా వైరస్ గురించిన ఆసక్తికర విషయాలు అందించే సాకుతో ఈ మెయిల్స్, యాడ్స్, వెబ్సైట్ లింక్లు, అప్లికేషన్ (యాప్స్) పేరుతో అనేక మందిని వలలోకి లాగుతున్నారు. ఆయా లింక్లను ఆసక్తిగా క్లిక్ చేయగానే కంపెనీ, సంస్థ, వ్యక్తిగత డేటా (సమాచారం) చోరీకి గురవుతోంది. - ‘కోవిడ్ లాక్’ యాప్ పేరుతో పంపిస్తున్న లింక్ను క్లిక్ చేయగానే సాఫ్ట్వేర్ను హ్యాక్ చేసి కంప్యూటర్లను బాŠల్క్ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తేనే కంప్యూటర్ తిరిగి పనిచేస్తుందని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తున్నట్టు గుర్తించారు. - ఇండియాలోనూ ఇదే తరహాలో యజోరాల్ట్ అనే లింక్ ద్వారా మాల్వేర్తో కంప్యూటర్లోకి చొరబడి డేటాను హ్యాక్ చేస్తున్నారు. తద్వారా సంస్థలు, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. యజోరాల్ట్ అనే మాల్వేర్ మూడేళ్ల నుంచి ఇండియాలో ఉన్నప్పటికీ తాజాగా కోవిడ్–19కి సంబంధించిన యాప్లకు లింక్ చేసి మోసాలను తీవ్రతరం చేశారు. -
‘కాల్సెంటర్’తో కాజేశారు!
సాక్షి, సిటీబ్యూరో: గూగుల్లో నకిలీ కాల్ సెంటర్ నెంబర్లు జోప్పించి, ఫోన్లు చేసిన వారిని నిండా ముంచుతున్న ముఠాకు చెందిన ఇద్దరిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్లో పట్టుకున్న వీరిని అక్కడి కోర్టులో హాజరుపరిచి, పీటీ వారెంట్పై సిటీకి తీసుకువచ్చినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి శుక్రవారం తెలిపారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అర్జున్సింగ్ లైమ్ రోడ్ యాప్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉండటంతో టీషర్ట్ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఒక్క టీషర్టే రావడంతో ఆ సంస్థ కాల్ సెంటర్ నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశారు. అందులో లభించిన ఓ నెంబర్కు కాల్ చేయగా... కట్ చేసిన అవతలి వ్యక్తి మరో నెంబర్ నుంచి సంప్రదించాడు. లైమ్రోడ్డు ప్రతినిధిగా పరిచయం చేసుకున్న అతడికి విషయం చెప్పగా మీ సమస్య పరిష్కారం కావడానికి మేము పంపే లింక్ తమ కేంద్ర కార్యాలయానికి చెందిన నెంబర్కు పంపాలంటూ చెప్పి ఆ నెంబర్ ఇచ్చారు. కొద్దిసేపటికి వచ్చిన లింకును అర్జున్ ఆ నెంబర్కు పంపాడు. ప్రాసెస్ పూర్తి కావడానికి అంటూ బాధితుడి నుంచి ఓటీపీ కూడా తీసుకున్నారు. దీంతో ఇతడి బ్యాంకు ఖాతా, సైబర్ నేరగాళ్ళ ఫోన్కు లింకు అయింది. దీనిసాయంతో వాళ్ళు రూ.37,288 కాజేశారు. బాధితుడు ఈ ఏడాది జనవరి మొదటి వారంలో సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ డి.ప్రశాంత్ సాంకేతిక ఆధారాలను బట్టి జార్ఖండ్కు చెందిన మన్సూర్ అన్సారీ, అస్లం రజాలకు ఈ నేరంతో సంబంధం ఉన్నట్లు గుర్తించింది. అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం ఇద్దరినీ అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఈ నిందితుల్లో ఒకరైన మన్సూర్ అన్సారీ జార్ఖండ్లోని పిప్రా గ్రామంలో మేస్త్రీగా పని చేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం అస్లం తదితరులతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇలాంటి ముఠాలు అక్కడ అనేకం ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. -
టార్గెట్.. ఓఎల్ఎక్స్ యూజర్స్
సాక్షి, సిటీబ్యూరో: ఈ–యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా శుక్రవారం ఇందులో ఆర్మీ అధికారులుగా సైబర్ నేరగాళ్ళు పోస్ట్ చేసిన వాహనాల ఫొటోలకు స్పందించి. వాటిని ఖరీదు చేద్దామని భావించి సంప్రదించి రూ.3 లక్షల వరకు నష్టపోయారు. వీళ్ళు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ♦ చాదర్ఘాట్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఖరీదు చేయాలని భావించాడు. ఓఎల్ఎక్స్లో ఆర్మీ అధికారి మాదిరిగా దాన్ని పోస్టు చేసిన వ్యక్తి రూ.65 వేలు ధర నిర్ణయించాడు. అతడిని సంప్రదించిన బాధితుడు తాను ఖరీదు చేసుకుంటానని చెప్పాడు. అంగీకరించిన నేరగాడు ముందుగా గూగుల్ పే ద్వారా రూ.5100 పంపాలని సూచించాడు. ఆ తర్వాత రూ.20,100 పంపిస్తే వాహనం నేరుగా ఇంటికే డెలివరీ ఇస్తామని చెప్పాడు. దీన్ని రూ.2,100గా భావించిన బాధితుడు ఆ మొత్తం బదిలీ చేశాడు. అయితే తాను కోరింది రూ.20,100 అని చెప్పడంతో మిగిలిన రూ.18 వేలు పంపాడు. ఇలా వేర్వేరుగా పంపిస్తే సిస్టం అంగీకరించదని, మరోసారి ఒకే మొత్తంగా పంపాలని, ఇప్పుడు చెల్లించింది తిరిగి ఇచ్చేస్తానంటూ సైబర్ నేరగాడు చెప్పడంతో బాధితుడు అలానే చేశాడు. అప్పటికీ వాహనాన్ని పంపని అతగాడు మరో రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అనుమానించిన బాధితుడు చెల్లించడం ఆపేయగా.. ఇప్పటి వరకు మీరు చెల్లించింది ఆర్మీ ఖాతాలోకి వెళ్ళిపోయిందని, తక్షణం రూ.15 వేలు కట్టకపోతే వాహనంతో పాటు అప్పటి వరకు కట్టిన మొత్తమూ క్యాన్సిల్ అవుతాయని బెదిరించాడు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ♦ ఓఎల్ఎక్స్లో ఆర్మీ అధికారి మాదిరిగా పోస్టు పెట్టిన ఓ యాక్టివాను ఖరీదు చేయాలని నగరానికి చెందిన యువకుడు భావించాడు. వెంటనే అందులో ఉన్న నెంబర్కు సంప్రదించాడు. ఇతడితో సంప్రదింపులు కొనసాగించిన సైబర్ నేరగాడు రూ.24 వేలకు ఆ వాహనం అమ్మడానికి అంగీకరించాడు. ఆపై అనేక పేర్లు చెప్తూ డబ్బు దండుకుంటూ పోయాడు. వాహనం ఖరీదును మించి రూ.65 వేల వరకు గూగుల్ పే ద్వారా బాధితుడు చెల్లించేశాడు. ప్రతి సందర్భంలోనూ సైబర్ నేరగాడు వాహనం విలువ మినహా మిగిలిన మొత్తం రీఫండ్ వస్తుందంటూ చెబుతుండటంతో బాధితుడు నమ్మి మోసపోయాడు. ఎట్టకేలకు తనకు జరగిన నష్టం తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ♦ నగరానికి చెందిన మరో వ్యక్తి ఓఎల్ఎక్స్ నుంచి కారు ఖరీదు చేయడానికి ప్రయత్నించాడు. ఇతడి నుంచి సైబర్ నేరగాళ్ళు రూ.1.95 లక్షలు కాజేయడంతో పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
రూ.20 వేల బండికి రూ.55 వేలు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: సెకండ్ హ్యాండ్ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఓఎల్ఎక్స్ యాప్లో పోస్ట్ చేయడం... ఆకర్షితులై స్పందించిన వారి నుంచి అడ్వాన్సుల పేరుతో అందినంతా కాజేయడం... ఇప్పటి వరకు ఈ పంథాలో రెచ్చిపోయిన ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్లు తాజాగా కొత్త ఎత్తులు వేస్తున్నారు. నైజీరియన్లు మాదిరిగా ఈ వ్యవహారాల కేసుల్లో ట్విస్ట్లు తీసుకువస్తున్నారు. ఈ పేరుతో బాధితుల నుంచి భారీ మొత్తాలు స్వాహా చేస్తున్నారు. ఓఎల్ఎక్స్లో రూ.20 వేలకు ఓ వాహనం ఖరీదు చేద్దామంటూ భావించి, సంప్రదింపులు ప్రారంభించిన బాధితుడు రూ.55 వేలు పోగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు మరో రూ.5 వేలు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తుండటంతో సోమవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నల్లగొండకు చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంటూ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. తాను తిరిగేందుకు ఓ సెకండ్ హ్యాండ్ బైక్ ఖరీదు చేయాలని భావించిన సదరు యువకుడు దాని కోసం ఓఎల్ఎక్స్లో సెర్చ్ చేశాడు. విజయవాడలో పని చేస్తున్న ఆర్మీ అధికారిగా చెప్పుకున్న ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్కు ఆకర్షితులయ్యాడు. అతడిని సంప్రదించి, బేరసారాలు పూర్తి చేసిన తర్వాత రూ.20 వేలకు సదరు ద్విచక్ర వాహనాన్ని ఖరీదు చేయడానికి సిద్ధమయ్యాడు. ఓ సందర్భంలో బాధితుడితో ఫోన్లో మాట్లాడిన నిందితుడు తాను ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో (సీఐఎస్ఎఫ్) పని చేస్తున్నానని, విజయవాడ విమానాశ్రయంలో డ్యూటీ చేస్తున్నానని నమ్మించాడు. రూ.20 వేలను గూగుల్ పే ద్వారా పంపితే వాహనాన్ని పార్శిల్ చేస్తానంటూ చెప్పి తన గుర్తింపుకార్డులు అంటూ నకిలీవి పంపించాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు ఆ మొత్తం బదిలీ చేశాడు. ఇది జరిగిన తర్వాతి రోజు ఓ వాహనాన్ని పార్శిల్ చేస్తున్న ఫొటోను కూడా వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ రెండు రోజులకు మళ్లీ బాధితుడికి కాల్ చేసిన సైబర్ నేరగాడు వాహనం పార్శిల్ను విజయవాడలో రైల్వే పోలీసులు పట్టుకున్నారని చెప్పాడు. పూర్తి స్థాయి క్లియరెన్స్ లేకుండా ఆర్మీ వాహనాన్ని బయటకు పంపిస్తున్నందుకు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. అర్జంటుగా రూ.35 వేలు చెల్లించకపోతే నీ మీద కూడా కేసు నమోదు చేస్తారని భయపెట్టాడు. ఈ మాటల వల్లో పడిన బాధితుడు మరో రూ.35 వేలు గూగుల్ పే ద్వారా పంపాడు. అప్పటికీ ఆగకుండా మరో రూ.5 వేలు కావాలంటూ ఫోన్లు చేస్తుండటంతో తాను మోసపోయానని గుర్తించిన బా«ధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
వీకెండ్లో సిమ్ బ్లాకా?
సాక్షి, సిటీబ్యూరో: వీకెండ్లోనో.. వరుసగా సెలవులు ఉన్నప్పుడో హఠాత్తుగా మీ సిమ్కార్డు పని చేయకుండా బ్లాక్ అయిందా? మీ బ్యాంకు ఖాతా లావాదేవీలతో అది ముడిపడి ఉందా? ఆర్టీజీఎస్ వంటి ప్రక్రియలకు సంబంధించిన పిన్ ఆ నంబర్కే వస్తుంటుందా? అయితే ఇది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడగా అనుమానించాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎవరికైనా ఇలా బ్లాక్ అయి ఉంటే తక్షణం స్పందించి సర్వీస్ ప్రొవైడర్తో పాటు బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. ‘బ్లాక్’తో డమ్మీవి తీసుకుంటున్నారు.. ఉత్తరాదికి చెందిన కొందరు యువకుల్ని వివిధ పట్టణాలు, నగరాలకు పంపి కరెంట్ ఖాతాలు తెరిపిస్తున్న నైజీరియన్లు బ్యాంకుల పేర్లను పోలి ఉండే యూఆర్ఎల్స్తో వెబ్సైట్స్ రూపొందిస్తున్నారు. వీటి ద్వారా వల వేసి వినియోగదారుడి ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు ఆ తర్వాతే అసలు అంకం ప్రారంభిస్తున్నారు. తమ వల్లో పడిన బాధితులు సిమ్కార్డుల్ని వీరు చాకచక్యంగా బ్లాక్ చేయిస్తున్నారని తేలింది. దీనికోసం అతడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో అక్కడకు వెళ్లి సర్వీస్ ప్రొవైడర్లను వారి (బాధితుడి) మాదిరిగానే ఆశ్రయిస్తున్నారు. అప్పటికే ఖాతాదారుడిని సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్ ద్వారా వీరివద్దకు చేరి ఉంటోంది. ఈ వివరాలతో బోగస్ ధ్రువీకరణలు తయారు చేసి వాటిని జత చేస్తూ తమ సిమ్కార్డు పోయిందని, మరోటి ఇప్పించమంటూ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ అందిస్తున్నారు. దీంతో సెల్ కంపెనీల వారు అసలు ఆ నెంబర్తో పని చేస్తున్న సిమ్ను బ్లాక్ చేసి మరోటి ఈ నేరగాళ్లకు అందించేస్తున్నారు. ఈ పనిని ఎక్కువగా వారాంతాల్లో, సెలవు దినాల్లో చేస్తుండటంతో సిమ్ బ్లాక్ అయినట్లు దాని యజమానులు గుర్తించినా... సర్వీస్ ప్రొవైడర్ను సంప్రదించడానికి కొంత సమయం తీసుకుంటున్నారు. అదను చూసుకుని భారీ మొత్తం స్వాహా.. అసలు వ్యక్తి వివరాలతు డూప్లికేట్ సిమ్ తమ చేతికి వచ్చిన తర్వాత సైబర్ నేరగాళ్లు అసలు అంకం ప్రారంభిస్తున్నారు. అప్పటికే ‘వెబ్సైట్’ ద్వారా బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత వివరాలను సంగ్రహించే ఈ– కేటుగాళ్లు వాటిని తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇక తీసుకున్న సిమ్ను వినియోగించి బ్యాంకుకు కాల్ చేస్తున్న నేరగాళ్లు ఖాతాదారుడి మాదిరిగానే మాట్లాడుతూ... ఓ సంస్థకు రియల్– టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) పద్ధతిలో భారీ మొత్తాన్ని బదిలీ చేయనున్నామని, దీనికోసం వన్–టైమ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ (ఓటీపీడబ్ల్యూ) పంపాల్సిందిగా కోరుతున్నారు. ఖాతాదారుడి నంబర్ నుంచే ఫోన్ రావడం, వారు అడిగిన అన్ని వివరాలు చెప్పడంతో బ్యాంకు సిబ్బంది ఓటీపీడబ్ల్యూ ఇచ్చేస్తున్నారు. ఇలా సమస్తం తమ చేతికి వచ్చిన తరవాత టార్గెట్ చేసిన ఖాతాను ఆన్లైన్ ద్వారా యాక్సిస్ చేస్తున్న నేరగాళ్లు అప్పటికే తెరిచి ఉంచిన బోగస్ కరెంట్ ఖాతాల్లోకి నగదును బదిలీ చేస్తున్నారు. వెంటనే దీన్ని డ్రా చేసుకుని ఖాతా మూసేస్తున్నారు. సేవింగ్స్ ఖాతాలనూ ఇదే పంథాలో వివరాలు, సిమ్ సంగ్రహించడం ద్వారా ఖాళీ చేస్తున్నారు. డ్రా చేయడం సాధ్యం కాకపోయినా.. సైబర్ నేరగాళ్లు ఈ కరెంట్, సేవింగ్స్ ఖాతాలను తమ అధీనంలోకి తీసుకుంటూ వాటిలోని నగదును ‘మనీమ్యూల్స్’ ఖాతాల్లోకి మళ్లిస్తుంటారు. ఉత్తరాదికి చెందిన అనేక మంది నిరుద్యోగుల్ని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా బోగస్ ధ్రువీకరణలు తయారు చేయించి, వీటి ఆధారంగా ఖాతాలు తెరిపిస్తున్నారు. నగదు ట్రాన్స్ఫర్ పూర్తికాగానే వారి ద్వారా తక్షణం డ్రా చేయించేస్తున్నారు. సాంకేతికంగా మనీమ్యూల్స్గా పిలిచే వీరికి స్వాహా చేసిన సొమ్ములో 10 నుంచి 30 శాతం కమీషన్లుగా ఇస్తున్నారు. ఎప్పుడైనా విషయం పోలీసుల వరకు వెళ్లి, వారు దర్యాప్తు చేస్తూ వచ్చినా కేవలం ఈ మనీ మ్యూల్స్ మాత్రమే చిక్కుతారు తప్ప అసలు సూత్రధారులు వెలుగులోకి రారు. అనేక సందర్భాల్లో అసలు వ్యక్తులైన బాధితులు మోసం, నగదు బదిలలీ జరిగిన విషయాలను గుర్తించేలోపే నేరగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. వీరు వాడేవన్నీ బోగస్ వివరాలతో తీసుకున్నవి కావడంతో చిక్కడం కూడా కష్టంగా మారుతోంది. కేంద్ర తాజాగా తీసుకున్న ‘కరెన్సీ నిర్ణయం’తో నగదు విత్డ్రాపై ఆంక్షలు వచ్చాయి. దీంతో సైబర్ నేరగాళ్లు నగదు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, డ్రా చేయడం తగ్గించారు. అయినప్పటికీ ఆన్లైన్లో విలువైన వస్తువులు ఖరీదు చేసి, బోగస్ చిరునామాల్లోనే, కొరియర్ వారిని తప్పుదోవ పట్టించో తమ ఉనికి బయటకు రాకుండా వాటిని తీసుకునే ఆస్కారం లేకపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మైక్రో సిమ్కార్డుల ఆధారంగా మరోలా... ఇటీవల కాలంలో అన్ని సెల్ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు మైక్రో సిమ్కార్డుల్ని అందిస్తున్నారు. సెల్ఫోన్లన్నీ ఇవి పట్టే విధంగానే డిజైన్ అవుతుండటంతో పెద్దగా ఉన్న పాత వాటిని ‘రీ–ప్లేస్’ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దీన్ని సైతం సైబర్ నేరగాళ్లు తమను అనుకూలంగా మార్చుకుంటున్నారు. అప్పటికే ‘వెబ్సైట్ల’ ద్వారా వినియోగదారుడి పూర్తి వివరాలు సంగ్రహిస్తున్న సైబర్ నేరగాళ్లు సిమ్ బ్లాకింగ్ కోసం మైక్రో కార్డు ‘విధానాన్ని’ అవలంబిస్తున్నారు. ఈ మార్పిడి కోసం ఎమ్టీ మైక్రో సిమ్కార్డుల్ని తీసుకునే వినియోగదారులు దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ సిమ్ ఐడెంటిటీ (ఐసీఐడీ) నంబర్ను పాత పెద్ద సిమ్ నుంచి సర్వీస్ ప్రొవైడర్కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే తమ తెలివి తేటలు ప్రదర్శిస్తున్న సైబర్ నేరగాళ్లు మైక్రో సిమ్ తీసుకుంటున్నారు. అప్పటికే సంగ్రహించిన వినియోగదారుల్ని సర్వీసు ప్రొవైడర్ల మాదిరిగా సంప్రదిస్తున్నారు. అనివార్య కారణాలు చెప్తూ అప్పటికే వారు వినియోగిస్తున్న పాత సిమ్కార్డు నుంచి తాము పంపే నెంబర్ను (ఐసీఐడీని) సర్వీసు ప్రొవైడర్కు ఎస్సెమ్మెస్ చేయమని చెప్తున్నారు. అలా చేసిన వెంటనే కొన్ని గంటల పాటు సిమ్ పని చేయదని, ఆపై అప్డేట్ అవుతుందని నమ్మబలికుతున్నారు. వీరి వలలో పడిన వినియోగదారులు అలా చేసేసరికి నేరగాళ్లు తీసుకున్న మైక్రో సిమ్ యాక్టివేట్ అవుతోంది. వినియోగదారుల మేల్కొనే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ తరహా నేరాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. -
కారు గిఫ్ట్గా వచ్చిందని..
సాక్షి, సిటీబ్యూరో: ఓ వైబ్సైట్లో ఇయర్ఫోన్లు ఖరీదు చేసిన యువతికి కారు గిఫ్ట్గా వచ్చిందంటూ సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. బాధితురాలు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో సదరు వెబ్సైట్ నుంచి కస్టమర్ల డేటా లీక్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తర మండల పరిధిలోని తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి పది రోజుల క్రితం షాప్క్లూస్ నుంచి రూ.500 వెచ్చించి ఇయర్ఫోన్లు ఖరీదు చేశారు. ఇవి డెలివరీ అయిన తర్వాత ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వాళ్లు తాము షాప్క్లూస్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్నారు. మీరు ఇటీవల తమ సంస్థ నుంచి వస్తువలు కొనుగోలు చేశారు కదా అని చెప్పడంతో ఆమె నమ్మింది. తమ కస్టమర్ల కోసం లక్కీ డ్రా నిర్వహించామని అందులో మీకు రూ.12.6 లక్షల విలువైన కారు గెల్చుకున్నారని చెప్పి ఆమెకు ఎర వేశారు. బాధితురాలు నిజమేనని నమ్మి ఆ కారును ఎలా పొందాలంటూ అడిగారు. కారు డెలివరీ చేయడం కోసం కొన్ని పన్నులు చెల్లించాల్సి ఉందంటూ చెప్పిన సైబర్ నేరగాళ్లు అసలు ‘పని’ ప్రారంభించారు. దాదాపు పది రోజుల పాటు వివిధ ట్యాక్స్ల పేరు చెబుతూ ఆమె నుంచి రూ.68,900 వివిధ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించిన బాధిత యువతి మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు వినియోగించిన ఫోన్ నెంబర్, డబ్బు డిపాజిట్ చేయించుకున్న ఖాతాల వివరాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి నేరాలు తరచు చోటు చేసుకుంటున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం నేరుగా ఏ స్థాయిలో క్రయవిక్రయాలు జరుగుతున్నాయో... దాదాపు అదే స్థాయిలో ఆన్లైన్లో వస్తువులు విక్రయించే వెబ్సైట్లు, యాప్స్లో పుట్టుకువచ్చాయి. వీటిలో పని చేస్తున్న కొందరు నేరగాళ్లు తమ వద్ద షాపింగ్ చేసిన కస్టమర్ల వివరాలు, ఫోన్ నంబర్లకు సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వీటి ఆధారంగా బాధితులకు ఫోన్లు చేస్తున్న సైబర్ క్రిమినల్స్ వారి షాపింగ్ వివరాలు చెప్పి బుట్టలో పడేస్తున్నారు. ఆపై గిఫ్ట్లు పొందడానికి పన్నులు, ఇతర చార్జీల పేర్లు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారని వివరిస్తున్నారు. ఈ తరహా ఫోన్కాల్స్, ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. -
ఇక్కడే ఉంటూ యూఎస్లో ఉన్నట్టు కాల్స్
సాక్షి, సిటీబ్యూరో: రోజురోజుకూ మారుతున్న ఆధునిక సాంకేతికతతోనే సైబర్ వేధింపులను సరికొత్త మార్గంలో చేస్తున్నారు. ఇన్నాళ్లు ఫేస్బుక్, ట్విట్టర్, అర్కుట్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలు, యువతులను వేధిస్తున్న సైబర్ స్టాకర్స్ రూటు మార్చారు. మెదడుకు పదునుపెట్టి సరికొత్త రీతిలో ఆన్లైన్ వేధింపులు చేస్తున్నారు. నిందితుడు హైదరాబాద్లోనే ఉంటూ అమెరికా ఫోన్ నంబర్ ద్వారా అక్కడి నుంచి వేధింపులకు పాల్పడుతున్నట్టగా నమ్మించేలా చేసిన కేసు రాచకొండ సైబర్ క్రైమ్ ఠాణాలో తొలిది నమోదైంది. పోలీసులు రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఆ మొబైల్ నంబర్ కనిపెట్టడంతో నిందితుడు నిజాంపేటకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కోట్ల మాధవ్రావును రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాము నేతృత్వంలోని బృందం గురువారం అరెస్టు చేసింది. అమెరికా నుంచే వేధింపులు చేస్తున్నట్టుగా... మాధవ్రావు డిగ్రీ క్లాస్మేట్ అయిన బాధితురాలి అక్కకు 2015 సంవత్సరంలోకాంటాక్ట్లోకి వచ్చాడు. గతంలో ఉన్న కాస్తా పరిచయంతో స్నేహితులుగా మారారు. కొన్నిరోజులకే ప్రేమిస్తున్నానంటూ మాధవ్రావు చెప్పడంతో ఆమె తిరస్కరించింది. కొన్నిరోజుల తర్వాత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం వచ్చిన మాధవ్రావు తన ప్రేమను తిరస్కరించిన యువతిపై కక్ష కట్టాడు. తనకున్న టెక్నికల్ నాలెడ్జ్తో గూగుల్ ప్లేస్టోర్లోని ఓ యాప్ ద్వారా అమెరికా ఫోన్ నంబర్ (వర్చువల్ నంబర్ ఎవరూ ఉపయోగించనిది) డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ వినియోగించడం మొదలెట్టాడు. ఆ తర్వాత ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి పంపాడు. వీడియోలు కూడా పంపాడు. శారీరక వాంఛ తీర్చాలంటూ రకరకాల మెసేజ్లు వాట్సాప్ చేశాడు. ఈ వేధింపులు తారాస్థాయికి వెళ్లడంతో బాధితురాలు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకున్న ఇన్స్పెక్టర్ రాము నేతృత్వంలోని బృందం టెక్నికల్ టీమ్తో బాగా అధ్యయనం చేసి చివరకు నిందితుడు మాధవరావును పట్టుకున్నారు. వర్చువల్ నంబర్ ఉపయోగించి వాట్సాప్ వేధింపుల వేధించిన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు. -
ఈ–మోసగాడు.. నిండా ముంచాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు సైబర్ నేరాలు జరిగే తీరుతెన్నులపై పోలీసులు అవగాహన కల్పిస్తుండగానే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు ‘అప్డేట్’ అవుతున్నారు. తమ పంథా ఎప్పటికప్పుడు మారుస్తూ ఈ నేరాలపై అవగాహన ఉన్న వారికీ అనుమానం రాకుండా అందినకాడికి దండుకుంటున్నారు. బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన ప్రైవేట్ ఉద్యోగిని కేసే దీనికి తాజా ఉదాహరణ. ఈమెను మాటలతో మాయ చేసిన ఈ–మోసగాడు రూ.9.1 లక్షలు కాజేశాడు. నగరానికి చెందిన ఓ యువతి ప్రైవేట్ ఉద్యోగం చేయడంతో పాటు కొన్నాళ్లుగా సొంతంగా కొన్ని ప్రాజెక్టులు సైతం చేస్తున్నారు. ఆమెకు ప్రస్తుతం వివాహంపై ఆసక్తి లేనప్పటికీ తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు భారత్ మాట్రిమోని సైట్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ప్రొఫైల్ను ప్రస్తుతం కెనాడాలో నివసిస్తున్న పంజాబ్కు చెందిన జాన్ అనే వ్యక్తిగా చెప్పుకొంటూ ఒకరు లైక్ చేశారు. అక్కడి ఎయిర్బస్ సంస్థలో ప్రాజెక్టు మేనేజర్గా పని చేస్తున్నానని చెప్పుకొన్న అతడు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. దీంతో ఇద్దరూ తమ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడంతో వాట్సాప్ ద్వారా చాటింగ్, ఫోన్లు మొదలయ్యాయి. నమ్మకం కలిగేలా.. విద్యాధికురాలైన నగర యువతి దృష్టిలో సైబర్ నేరాలపై పోలీసు విభాగం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తొలుత జాన్ను కూడా అనుమానించిన ఆమె అతడిని పరీక్షించే ఉద్దేశంతో చాటింగ్ చేశారు. డబ్బు ఏమైనా అవసరమా? అంటూ అతడిని ప్రశ్నించారు. అతడి నుంచి ఔనంటూ సమాధానం వస్తే వెంటనే బ్లాక్ చేయాలని భావించారు. దీనికి నో అంటూ సమాధానం ఇచ్చిన సైబర్ నేరగాడు తనపై నమ్మకం కలిగేలా చేశాడు. సాధారణంగా మాట్రిమోనియల్ ఫ్రాడ్స్లో నేరగాళ్ళు బహుమతులు పంపుతున్నామని, తామే వస్తున్నామంటూ చెప్పడం, ఆపై విమానాశ్రయం నుంచి అంటూ కస్టమ్స్ అధికారులుగా ఫోన్లు చేయడం, పన్నుల పేరుతో డబ్బు డిపాజిట్ చేయించుకోవడం.. చేస్తుంటారనే విషయాలపై ఆమెకు అవగాహన ఉంది. వీటిలో జాన్ ఏ పంథాను అనుసరించినా దూరంగా ఉండాలని భావించారు. అయితే ఈ పంథాలకు భిన్నంగా వ్యవహరించిన సైబర్ నేరగాడు ఆమెకు టోకరా వేశాడు. ఎయిర్బస్ సంస్థలో భారీ స్కాం జరిగిందని, దాన్ని జీర్ణించుకోలేని నేపథ్యంలో తాను దాని నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు చెప్పాడు. సొంతంగానే కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్నానని పేర్కొన్నాడు. ఆపై ఆమెకు టోకరా వేయడానికి అసలు కథ ప్రారంభించాడు. విమాన యానానికి సంబంధించి తన ప్రాజెక్టులో అనేక మంది దినసరి కూలీలు పని చేస్తున్నారని, వారికి రోజువారీ చెల్లింపులు ఇబ్బందిగా ఉందని చెప్పాడు. దీనికోసం 10 వేల డాలర్లు అప్పుగా ఇవ్వాలంటూ కోరాడు. అంత మొత్తం తన వద్ద లేవని చెప్పిన యువతి రూ.2 లక్షలు పంపింది. అతడు మోసం చేస్తే చందా ఇచ్చానని భావించాలని ఆమె అనుకున్నారు. ఉద్యోగి చనిపోయాడంటూ నటన.. ఆ తర్వాత మూడు నెలల వరకు జాన్ నుంచి డబ్బు ప్రస్తావన రాలేదు. ఓ రోజు వాట్సాప్ కాల్ చేసిన జాన్... తన వద్ద పని చేసే ఓ ఉద్యోగి చనిపోయాడని, అతనికి ఇన్సూరెన్స్ చేయించక పొరపాటు చేశానంటూ ఏడుస్తున్నట్లు మాట్లాడాడు. దీంతో తనకు ఇబ్బందులు ఎదురుకానున్నాయని, తాను త్వరలోనే హైదరాబాద్కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఇబ్బంది తనకు అడ్డంకిగా మారుతుందని వాపోయాడు. ఈ మాట లు నమ్మిన బాధితురాలు వివిధ దఫాల్లో రూ.7.10 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ మరో కారణం చెబుతూ డబ్బు ప్రస్తావన రావడంతో ఆమె అనుమానించారు. అతడి ఫోన్ నంబర్ను ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా.. అనేక మంది బాధితులు పెట్టిన కామెంట్ ఆమె దృష్టికి వచ్చాయి. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆమె బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న జి.వెంకట రామిరెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వాడిన ఫోన్ నంబర్, బాధితురాలు డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితుడు నైజీరియన్ అయి ఉంటాడని అనుమానిస్తున్నారు.