December
-
నిరాశపరిచిన షిప్పింగ్ కార్పొరేషన్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో బలహీన పనితీరు నమోదు చేసింది. ఈ కాలానికి రూ.75 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.134 కోట్లతో పోల్చి చూస్తే 44 శాతం తగ్గిపోయింది. కార్యకలాపాల ద్వారా రూ.1,350 కోట్ల ఆదాయం సమకూరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోనూ ఆదాయం రూ.1,363 కోట్లుగా ఉండడం గమనార్హం. వ్యయాలు రూ.1,214 కోట్ల నుంచి రూ.1,277 కోట్లకు ఎగిశాయి. వ్యయాలు గణనీయంగా పెరిగిపోవడం లాభాలకు చిల్లుపెట్టినట్టు తెలుస్తోంది. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు 1%పైగా నష్టపోయి రూ.192 వద్ద స్థిరపడింది. -
మౌలికం మందగమనం
న్యూఢిల్లీ: కీలక మౌలిక(ఇన్ఫ్రా) రంగ వృద్ధి 2024 డిసెంబర్ నెలలో కాస్త మందగించింది. 4 శాతానికి పరిమితమైంది. 8 మౌలిక రంగాల వృద్ధి అంతక్రితం ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా నమోదైంది. నెలవారీగా చూస్తే అంటే 2024 నవంబర్లోనూ 4.4 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం నేచురల్ గ్యాస్ ఉత్పత్తి క్షీణతను చవిచూసింది. అంతేకాకుండా వివిధ రంగాలలో ఉత్పత్తి నీరసించింది. బొగ్గు 5.3 శాతం, రిఫైనరీ ప్రొడక్టులు 2.8 శాతం, ఎరువులు 1.7 శాతం, స్టీల్ 5.1 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. అయితే అంతక్రితం డిసెంబర్లో వీటి ఉత్పత్తిలో వరుసగా 10.8 శాతం, 4.1 శాతం, 5.9 శాతం, 8.3 శాతం చొప్పున పురోగతి నమోదైంది. కాగా.. సిమెంట్ తయారీ 4 శాతం, విద్యుదుత్పత్తి 5.1 శాతం వృద్ధిని అందుకున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–డిసెంబర్లో కీలక రంగాలు బొగ్గు, చమురు, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి 4.2 శాతం పుంజుకుంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో 8.3 శాతం వృద్ధి నమోదైంది. ఈ 8 కీలక మౌలిక రంగాలు దేశీ పారిశ్రామిక ప్రగతిని సూచించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)లో 40 శాతానికిపైగా వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. -
డిసెంబర్లో నియామకాల జోరు
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నియామకాలు డిసెంబర్లో జోరందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 31 శాతం పెరిగినట్టు ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన ఆరు నెలల్లో నియామకాలు 12 శాతం పెరిగాయి. ఆన్లైన్ జాబ్ పోస్టింగ్ల ద్వారా ఈ వివరాలను ఫౌండిట్ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్లో డిసెంబర్ నెలలో నియామకాలు 36 శాతం పెరిగాయి. → కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, తయారీ, నిర్మాణం, ఇంజనీరింగ్ రంగాల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 57 శాతం నుంచి 60 శాతం వరకు ఈ రంగాల్లో నియామకాలు డిసెంబర్లో పెరిగాయి. → ఏఐ ఉద్యోగాలు గడిచిన రెండేళ్లలో 42 శాతం వృద్ధితో 2,53,000కు చేరాయి. పైథాన్, ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, డీప్ లెరి్నంగ్, ఎస్క్యూఎల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నైపుణ్యాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. టెన్సార్ఫ్లో, పైటార్చ్ తదితర ఏఐ ఫ్రేమ్వర్క్ల్లో నైపుణ్యాలున్న వారికి సైతం అధిక డిమాండ్ కనిపించింది. → హెచ్ఆర్ అడ్మిన్ ఉద్యోగ నియామకాలు గత మూడు నెలల్లో 21 శాతం పెరిగాయి. → మెడికల్ ఉద్యోగాలు సైతం 44 శాతం అధికంగా నమోదయ్యాయి. టెలీ మెడిసిన్, డయాగ్నోస్టిక్స్, నర్సింగ్, హెల్త్కేర్ అనలిస్ట్ తదితర హెల్త్టెక్ ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది. → డిసెంబర్లో కోయింబత్తూరులో అత్యధికంగా 58 శాతం మేర నియామకాలు పెరిగాయి. బెంగళూరులో 41 శాతం, చెన్నైలో 37 శాతం చొప్పున అధిక నియామకాలు జరిగాయి. ముంబైలో 23 శాతం, ఢిల్లీ ఎన్సీఆర్లో 33 శాతం చొప్పున అధిక నియామకాలు చోటుచేసుకున్నాయి. → టైర్–2, 3 నగరాలు హెల్త్కేర్ కేంద్రాలకు నిలయాలుగా మారుతున్నాయి. వీటికి సంబంధించి నియామకాలు 30 శాతం పెరిగాయి. → బెంగళూరులో 26 శాతం, పుణెలో 17 శాతం, ఢిల్లీలో 14 శాతం చొప్పున ఏఐ నియామకాలు వృద్ధి చెందాయి. ఏఐ కీలకం.. ‘‘అన్ని రంగాల్లోనూ నియామకాలు పెరగడం ఉద్యోగ మార్కెట్ చురుకుదనాన్ని, బలాన్ని తెలియజేస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లలో ఏఐ ఉద్యోగాల్లో 42 శాతం పెరగడం గమనార్హం. 2025లోనూ ఏఐ ఉద్యోగ నియామకాల్లో 14 శాతం మేర వృద్ది ఉండొచ్చు. ఏఐ ఇకపై ప్రస్తుత, భవిష్యత్ మానవ వనరులకు కీలకంగా కొనసాగుతుంది’’అని ఫౌండిట్ సీఈవో వి.సురేష్ అన్నారు. -
స్పల్పంగా తగ్గిన ఎగుమతులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఎగుమతులు వరుసగా రెండో నెలా క్షీణించాయి. 2023 డిసెంబర్తో పోలిస్తే గతేడాది డిసెంబర్లో స్వల్పంగా ఒక్క శాతం తగ్గి 38.01 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా దిగుమతులు 5 శాతం పెరిగి 59.95 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 21.94 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బుధవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. డిసెంబర్లో పెట్రోలియం, రత్నాభరణాలు, రసాయనాల ఎగుమతుల వృద్ధి నెమ్మదించింది. అయితే, జౌళి, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, బియ్యం, మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులు మెరుగ్గా నమోదయ్యాయి. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ఎగుమతుల గణాంకాలు మెరుగ్గా ఉన్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. వాణిజ్య గణాంకాలను సమగ్రంగా విశ్లేషించే విదంగా కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత డేటా అనలిటిక్స్ ప్లాట్ఫాంను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా వాణిజ్యానికి సవాళ్లతోపాటు కమోడిటీలు, లోహాల ధరల్లో హెచ్చుతగ్గులే ఎగుమతుల క్షీణతకు దారి తీసినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ తెలిపారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 1.6 శాతం పెరిగి 321.71 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 5.15 శాతం పెరిగి 532.48 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 189.74 బిలియన్ డాలర్ల నుంచి 210.77 బిలియన్ డాలర్లకు చేరింది. ఇతర వివరాల్లోకి వెళ్తే.. → డిసెంబర్లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 29 శాతం క్షీణించి 4.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → ఎల్రక్టానిక్స్ ఎగుమతులు ఏకంగా 35.11 శాతం పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. 24 నెలల్లో ఇది గరిష్ట స్థాయి. → బంగారం దిగుమతులు 55 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులు 211 శాతం పెరిగి 421.91 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → సేవల రంగం ఎగుమతులు 31.63 బిలియన్ డాలర్ల నుంచి 32.66 బిలియన్ డాలర్లకు పెరిగాయి. → సవరించిన గణాంకాల ప్రకారం 2024 నవంబర్లో ఎగుమతులు 5 శాతం తగ్గి 32.03 బిలియన్ డాలర్లకు క్షీణించగా, దిగుమతులు 16 శాతం పెరిగి 63.86 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 31.83 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నవంబర్లో పసిడి దిగుమతులను 9.84 బిలియన్ డాలర్లకు సవరించారు. → డిసెంబర్లో అమెరికా, సౌదీ, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, శ్రీలంకకు భారత్ అత్యధికంగా ఎగుమతులు చేయగా .. చైనా స్విట్జర్లాండ్, థాయ్ల్యాండ్, జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. -
ఈక్విటీ ఫండ్స్లోకిపెట్టుబడుల ప్రవాహం
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు డిసెంబర్ నెలలో దుమ్మురేపాయి. అక్టోబర్ నెలలో నికరంగా 14 శాతం మేర పెట్టుబడులను కోల్పోయిన ఈక్విటీ ఫండ్స్.. తిరిగి డిసెంబర్ నెలలో రూ.41156 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెలలో నికర ఈక్విటీ పెట్టుబడులు రూ.35,943 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగాయి. వరుసగా 46వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. ఈక్విటీలోని అన్ని విభాగాల పథకాల్లోకి నికర పెట్టుబడులు వచ్చాయి. 2024 మొత్తం మీద ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్టర్లు రూ.3.94 లక్షల కోట్లను పెట్టుబడి పెట్టారు. 2023తో పోల్చితే 144 శాతం అధికం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. ఎప్పటి మాదిరే మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాలు తమ జోరును కొనసాగించాయి. ఈ రెండు విభాగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్కు సైతం డిమాండ్ కొనసాగింది. డిసెంబర్లో డెట్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.1.3 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోయాయి. దీంతో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి డిసెంబర్లో రూ.80,355 కోట్లను ఇన్వెస్టర్లను వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా పరిశ్రమ నిర్వహణలోని పెట్టుబడుల విలువ (ఏయూఎం) నెలవారీగా 1.7 శాతం తగ్గి డిసెంబర్ చివరికి రూ.66.9 లక్షల కోట్లకు పరిమితమైంది. విభాగాల వారీగా.. → స్మాల్క్యాప్, మిడ్క్యాప్ ఫండ్స్కు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి రూ.4,667 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మిడ్క్యాప్ ఫండ్స్లోకి రూ.5,093 కోట్లు వచ్చాయి. నవంబర్ నెలతో పోల్చి చూస్తే స్మాల్క్యాప్లోకి 13 శాతం, మిడ్క్యాప్ ఫండ్స్లోకి 4 శాతం అధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్టర్లు అధిక రాబడుల కోసం వీటిని ఎంపిక చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. → లార్జ్క్యాప్ పథకాలు రూ.2,010 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. నవంబర్లో వచి్చన రూ.2,500 కోట్లతో పోల్చితే 20% తగ్గాయి. → సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,331 కోట్లను ఆకర్షించాయి. నవంబర్లో వచి్చన రూ.7,658 కోట్లతో పోల్చితే రెట్టింపయ్యాయి. → డిసెంబర్లో 33 కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు (ఎన్ఎఫ్వో) మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.13,643 కోట్లను రాబట్టాయి. నవంబర్లో మొత్తం 18 ఎన్ఎఫ్వో ఇష్యూలు రాగా, అవి సమీకరించిన మొత్తం రూ.4,000 కోట్లు కావడం గమనార్హం. ఏకంగా మూడింతలకుపైగా పెరిగినట్టు తెలుస్తోంది. → ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లోకి రూ.4,770 కోట్లు వచ్చాయి. నవంబర్లో వచి్చన రూ.5,084 కోట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. మల్టీక్యాప్ ఫండ్స్ 15 శాతం తక్కువగా రూ.3,075 కోట్లను ఆకర్షించాయి. → లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్లో రూ.3,811 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూ.640 కోట్లను ఆకర్షించాయి. 2024 సంవత్సరం మొత్తం మీద గోల్డ్ ఫండ్స్లోకి రూ.11,226 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.సిప్ పెట్టుబడుల్లో వృద్ధి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో డిసెంబర్లో ఈక్విటీ పథకాల్లోకి రూ.26,459 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఆల్టైమ్ గరిష్ట స్థాయి. నవంబర్ నెల సిప్ పెట్టుబడులు రూ.25,320 కోట్లతో పోల్చి చూస్తే 5 శాతం పెరిగాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ పెట్టుబడుల విలువ రూ.13.63 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్లలో నమ్మకానికి నిదర్శనం ‘‘ఎన్ఎఫ్వోలు, సిప్ పెట్టుబడులు, ఏక మొత్తంలో కొనుగోళ్లు నికర పెట్టుబడుల ప్రవాహానికి తోడ్పడ్డాయి. పెట్టుబడులు బలంగా రావడం మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి నిదర్శనం’’అని కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ సేల్స్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు. మార్కెట్ అస్థిరతల్లోనూ సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం అన్నది దీర్ఘకాల పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నట్టు మిరే అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ డి్రస్టిబ్యూషన్ హెడ్ సురంజన బోర్తకుర్ పేర్కొన్నారు. -
పెట్రోల్, డీజిల్కు అధిక డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వినియోగం డిసెంబర్ నెలలో గణనీయంగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలోని వినియోగంతో పోల్చి చూస్తే, పెట్రోల్ అమ్మకాలు (ప్రభుత్వరంగ సంస్థల) 10 శాతం పెరిగి 2.99 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్పీసీఎల్ ద్వారా 90 శాతం ఇంధన విక్రయాలు నడుస్తుంటాయి. క్రితం ఏడాది డిసెంబర్ నెలలో పెట్రోల్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ అమ్మకాలు సైతం 4.9 శాతం పెరిగి 7.07 మిలియన్ టన్నులకు చేరాయి. నవంబర్ నెలలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 8.3 శాతం, 5.9 శాతం చొప్పున పెరగడం గమనార్హం. వరుసగా రెండో నెలలోనూ వృద్ధి నమోదైంది. డిసెంబర్లో క్రిస్మస్ సెలవుల సందర్భంగా పర్యటనలు పెరగడం, ఖరీఫ్ సాగు సందర్భంగా యంత్రాలకు ఇంధన వినియోగం పెరగడం వినియోగంలో వృద్ధికి దారితీసింది. ఇక ఈ ఏడాది నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డిసెంబర్లో పెట్రోల్ అమ్మకాలు 3.6 శాతం, డీజిల్ అమ్మకాలు 1.7 శాతం చొప్పున తక్కువగా ఉండడం గమనార్హం. దేశ ఇంధన మార్కెట్లో 40 శాతం డీజిల్ రూపంలోనే వినియోగం అవుతుంటుంది. ముఖ్యంగా 70 శాతం డీజిల్ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు డిసెంబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 6.8 శాతం పెరిగి 6,96,400 టన్నులుగా ఉన్నాయి. వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగం 5 శాతానికి పైగా పెరిగి 2.87 మిలియన్ టన్నులకు చేరింది. -
డిసెంబర్లో భారీగా విద్యుత్ వినియోగం
దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలలో విద్యుత్ వినియోగం (power consumption) గణనీయంగా పెరిగింది. 6 శాతం పెరిగి 130.40 బిలియన్ యూనిట్లుగా నమోదైంది. 2023 డిసెంబర్ నెలలో వినియోగం 123.17 బిలియన్ యూనిట్లుగా ఉంది. రోజువారీ గరిష్ట సరఫరా (గరిష్ట డిమాండ్) 224.16 గిగావాట్లుగా నమోదైంది.2024 మే నెలలో 250 గిగావాట్లు ఇప్పటి వరకు గరిష్ట రోజువారీ రికార్డుగా ఉంది. 2024 వేసవి సీజన్కు గరిష్ట రోజువారీ డిమాండ్ 260 గిగావాట్లకు చేరుకోవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ అంచనా వేయడం గమనార్హం. ఇక 2025 వేసవి సీజన్కు గరిష్ట డిమాండ్ 270 గిగావాట్లకు చేరుకోవచ్చని భావిస్తోంది.రూమ్ హీటర్లు, వాటర్ హీటర్లు, గీజర్ల వాడకం డిసెంబర్లో విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు మరింత కనిష్టానికి చేరుకునే అవకాశాలతో విద్యుత్ వినియోగం జనవరిలోనూ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
స్థిరంగా దూసుకెళుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. గ్రామీణ వినియోగం పునరుద్ధరణ, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల అలాగే బలమైన సేవల ఎగుమతులు భారత్ ఎకానమీ పటిష్టతకు కారణమవుతున్నాయని వివరించింది. ఆయా అంశాల దన్నుతో మార్చితో ముగిసే 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 6.6 శాతం నమోదవుతుందని ఆర్బీఐ 2024 డిసెంబర్ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. → షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీలు) పటిష్టంగా ఉన్నాయి. వాటి లాభదాయకత పెరుగుతోంది. మొండి బకాయిలు తగ్గుతున్నాయి. తగిన మూలధన మద్దతు లభిస్తోంది. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) బఫర్లతో గణనీయంగా శక్తివంతమయ్యాయి. రుణాలపై రాబడి (ఆర్ఓఏ)ఈక్విటీపై రాబడి (ఆర్ఓఈ) దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉండగా, స్థూల మొండిబకాయిల నిష్పత్తి పలు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. రుణ నాణ్యత మెరుగుపడడం బ్యాంకింగ్కు పూర్తి సానుకూల అంశం. స్థూల మొండిబకాయిల (జీఎన్పీఏ)నిష్పత్తి 2024 సెపె్టంబరు నాటికి 12 ఏళ్ల కనిష్ఠ స్థాయికి 2.6 శాతానికి తగ్గింది. → మొదటి రెండు త్రైమాసికాల్లో బలహీన వృద్ధి ఫలితాలు వచ్చినప్పటికీ, నిర్మాణాత్మక వృద్ధి అంశాలు స్థిరంగా ఉన్నా యి. 2024–25 మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి పునరుద్ధరణ జరుగుతుంది. దేశీయ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన సేవల ఎగుమతులు, ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంగా ఉంటాయి. → కరీఫ్, రబీ పంట భారీ దిగుబడులు ద్రవ్యోల్బణాన్ని పూర్తి అదుపులోనికి తీసుకువచ్చే అవకాశం ఉంది. æ అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ సరఫరా చైన్పై అలాగే కమోడిటీ ధరలపై ఒత్తిడిని పెంచే అవకాశాలు ఉన్నాయి. 2025లో వృద్ధి అవకాశాలు మెరుగు భారత ఆర్థిక వ్యవస్థకు 2025లో మంచి వృద్ధి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు, వ్యాపార వర్గాల్లో విశ్వాసం ఇందుకు దోహదపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, స్థిరత్వంపై మేము దృష్టి సారిస్తున్నాం. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో వృద్ధి ఊపందుకుంది. – ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముందుమాట -
ఢిల్లీలో కొత్త రికార్డు..వందేళ్ల తర్వాత అంతటి వర్షం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ(Delhi)లో వర్షం(Rain) సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏకంగా 101 ఏళ్ల తర్వాత ఢిల్లీలో డిసెంబర్ నెలలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం నమోదై రికార్డు సృష్టించింది. శనివారం(డిసెంబర్ 28) ఉదయం 8.30 వరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 41.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.సరిగ్గా 101 ఏళ్ల క్రితం 1923 డిసెంబర్ 3వ తేదీన 75.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంతటి వర్షం తర్వాత మళ్లీ డిసెంబర్(December)లో శనివారమే అత్యధిక వర్షం పడింది.వాతావరణ శాఖ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 13డిగ్రీలకు పడిపోయాయి. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచి పలుచోట్ల ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.భారీ వర్షం కారణంగా రాజధాని నగరంలో క్షీణించిన వాయునాణ్యత ఒక్కసారిగా మెరుగుపడింది.ఇదీ చదవండి: అమ్మో ఇవేం ఎండలు -
సుదీర్ఘ రాత్రికి కారణమేమిటి?
ఈ ఏడాది డిసెంబర్ 21కి ఓ ప్రత్యేకత ఉంది. పగటి సమయం 8 గంటలూ, రాత్రి సమయం 16 గంటలూ ఉంటుందని అంటున్నారు. కానీ, పదమూడున్నర గంటలే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.సాధారణంగా ప్రతిరోజూ మనకు 12 గంటల పగలు 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. అయితే రుతువులను బట్టి, భూమిపై ఉన్న ప్రాంతాన్ని బట్టి పగలు – రాత్రుల సమయంలో ఎక్కువ తక్కువలూ ఉంటాయి. భూమి ఇరుసు 23.4ని కోణంలో వంగి ఉండటం వలన సూర్యుని నుండి వెలువడే సూర్యకాంతి భూమిపైన సమానంగా కాకుండా వివిధ కాలాలలో వివిధ రీతుల్లో పడుతుంది. ఫలితంగా రాత్రి–పగలు సమయాల్లో ఒక్కోసారి ఎక్కువ తేడాలు వస్తాయి. దీన్నే ‘ఆయనాతం’ అంటారు.సంవత్సరంలో రెండుసార్లు అయనాతం ఏర్పడుతుంది. మొదటిది వేసవి కాలపు ఆయనాతం కాగా, రెండవది శీతాకాలపు ఆయనాతం. శీతాకాలపు ఆయనాతం డిసెంబర్ 19–23 తేదీల మధ్యలో ఏదో ఒక రోజు ఏర్పడుతుంది. ఈరోజు మనం చూసేది శీతాకాలపు అయనా తాన్నే. ఇదే సమయంలో ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. శీతకాల ఆయనాతంతో భూమి ఉత్తరాయణం ప్రారంభిస్తుంది. అంటే... సూర్యుడు ఉత్తర దిశ వైపుకు కదలడం ప్రారంభిస్తాడు. అదే క్రమంలో జనవరి నుండి పగలు సమయం క్రమంగా పెరుగుతూ రాత్రి సమయం క్రమంగా తగ్గుతుంది.చదవండి: పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!అయనాతం వంటి వాటిని ఆసరా చేసుకుని కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. గ్రహణం ఏర్పడడం, ఆయనాతం ఏర్పడడం, నెలలో ఒకసారి పౌర్ణమి, ఒకసారి అమావాస్య ఏర్పడడం... ఇవన్నీ ప్రకృతిలో చోటు చేసుకునే సహజ ప్రకియలు. శాస్త్రీయ సమాచారాన్ని అర్థం చేసుకుని మోసగాళ్ల పాలబడకుండా జాగ్రత్తగా ఉండాలి. మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.– చార్వాక, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్ -
బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులు
2024 డిసెంబర్ నెల ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా బ్యాంకులకు ఈ నెలలో వరుస సెలవులు రానున్నాయి. ఈ సెలవులు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయా?.. సెలవు రోజుల్లో ఆన్లైన్ కార్యకలాపాల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.➤డిసెంబర్ 25న క్రిస్మస్, కాబట్టి దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.➤డిసెంబర్ 26, 27వ తేదీలలో మిజోరం, నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఈ కారణంగా అక్కడి బ్యాంకులకు మాత్రమే సెలవు.➤డిసెంబర్ 28, 29వ తేదీలు వరుసగా నాల్గవ శనివారం, ఆదివారం. ఈ కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.➤డిసెంబర్ 30వ తేదీ మేఘాలయాలో యు కియాంగ్ నంగ్బా.. ఈ సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
కొనుగోళ్లకే ఎఫ్పీఐల ఓటు
గత నెలలో దేశీ స్టాక్స్లో భారీగా ఇన్వెస్ట్ చేసిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల(డిసెంబర్)లోనూ కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్పీఐలు రూ. 22,766 కోట్ల విలువైన స్టాక్స్ సొంతం చేసుకున్నారు. ఇందుకు ప్రధానంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు ప్రభావం చూపుతున్నాయి. కాగా.. అక్టోబర్లో మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,017 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లోనూ నికరంగా 21,612 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెపె్టంబర్లో గత 9 నెలల్లోనే అధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
వింటర్ చిల్స్..
వింటర్ అంటేనే వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీ పార్టీ లవర్స్కి అలవాటు. అందుకే డిసెంబర్ నెల వచ్చెరా అంటే పార్టీలకు వేళాయెరా అన్నట్టు ఉంటుంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పారీ్టల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో క్రేజీగా మారిన కొన్ని పార్టీస్టైల్స్ గురించి.. నలుగురమూ కలిశామా.. తిన్నామా.. తాగామా.. తెల్లారిందా.. అన్నట్టు కాకుండా తాము నిర్వహించే పార్టీలకు ఆసక్తికరమైన థీమ్ జతచేయడం అనే అలవాటు నగరంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్గా మార్చాలని పార్టీ లవర్స్ ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా వెరైటీ థీమ్స్ అన్వేíÙస్తున్నారు. దీంతో వెరైటీ పార్టీస్ పుట్టుకొస్తున్నాయి వాటిలో కొన్ని.. ట్విన్నింగ్.. స్టన్నింగ్.. తల్లీ కూతుళ్లు కావచ్చు, తండ్రీ కొడుకులు కావచ్చు.. భార్యాభర్తలు కూడా కావచ్చు.. కలిసి పుట్టకపోయినా కవలలం కాకపోయినా మేం ఇద్దరం కాదు ఒక్కరమే.. అనే భావన వచ్చేలా అనుబంధాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని అందిస్తుందీ ట్విన్నింగ్ పార్టీ. ఇటీవల నగరంలో పలు చోట్ల దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్టీకి వచ్చే అతిథులు జంటగా వస్తారు. ఒకే రంగు దుస్తులు ధరించడం దగ్గర నుంచి వారిద్దరి మధ్య అనుబంధాన్ని వీలున్నన్ని మార్గాల్లో వ్యక్తీకరించడమే ఈ పార్టీల్లో థీమ్. ఫ్యూజన్.. ఫన్.. భారతీయతను, పాశ్యాత్య రీతులను కలగలిపేదే ఫ్యూజన్ పార్టీ. వీటినే ఇండో వెస్ట్రన్ పారీ్టస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పార్టీలో వేడుక జరిగే ప్రదేశం అలంకరణ నుంచీ వస్త్రధారణ వరకూ ఫ్యూజన్ శైలి ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు లాంతర్లు, దీపాలు వంటి సంప్రదాయ వెలుగుల సరసనే ఎల్ఈడీ లైట్స్ అలంకరించడం.. అదే విధంగా అతిథులు లెహంగా, స్కర్ట్స్కు క్రాప్ టాప్స్ను జత చేయడం లేదా కుర్తా షర్ట్స్కు జీన్స్ కలపడం.. ఇలా ఉంటుంది. వంటకాల నుంచి కాక్టైల్స్ వరకూ విందు వినోదాలన్నీ భారతీయ, పాశ్చాత్య మేళవింపుతోనే ఉంటాయి. రాయల్టీ.. పార్టీ.. ఇండియన్ రాయల్టీ థీమ్తో నిర్వహించే పార్టీలో అంతా రిచ్ లుక్ ఉట్టిపడుతుంది. సిల్్క, వెల్వెట్, గోల్డ్, రెడ్ రాయల్ బ్లూ.. కలర్ ఫ్యాబ్రిక్తో పార్టీ ప్రదేశం అంతా అలంకరణతో మెరిసిపోతుంటుంది. వింటేజ్ క్యాండిల్బ్రాస్, రాయల్ థ్రోన్స్, గ్రాండ్ షాండ్లియర్స్.. వగైరాలతో రిచ్ టచ్ ఇస్తాయి. అతిథులు ఖరీదైన దేశంలో పేరొందిన ప్రాంతాల దుస్తులు, షేర్వానీ.. వగైరాలు ధరిస్తారు. వెండి ప్లేట్లలో విందు వడ్డిస్తుంటే.. అందుకు తగిన నేపథ్యంలో లైవ్ గజల్స్ తరహా సంగీతాలు వినిపిస్తుంటాయి. బాలీవుడ్.. స్టైల్.. నగరం టాలీవుడ్కి కేరాఫ్ అయినప్పటికీ.. పారీ్టస్ ఇచ్చిపుచ్చుకోడంలో బాలీవుడ్ స్టైల్ పారీ్ట.. అంటూ ఒకటి ఉంది తప్ప టాలీవుడ్ థీమ్ ఇంకా తెరకెక్కలేదు. ఈ పారీ్టలో బాలీవుడ్ పోస్టర్స్, ఫెయిరీ లైట్స్, క్లాసిక్ బాలీవుడ్ లైవ్ మ్యూజిక్.. ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఫ్లోర్పై బాలీవుడ్ హిట్స్కి అతిథులు తమ అభిమాన చిత్రంలోని స్టెప్స్ జత చేస్తారు. ఈ పార్టీలోనే బెస్ట్ డ్యాన్సర్, మోస్ట్ గ్లామరస్ అవుట్ ఫిట్.. తదితర సరదా అవార్డ్స్ కూడా ఉంటాయి. పూల్.. పారీ్టస్.. నగరంలోని స్టార్ హోటల్స్లో మాత్రమే కాదు కొందరి సొంత భవనాల్లోనూ కొందరికి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. కేవలం స్విమ్మింగ్కు మాత్రమే కాదు పారీ్టలకు కూడా పూల్ కేరాఫ్గా మారింది. పూల్ దగ్గర నిర్వహించే పారీ్టస్ కోసం పూల్ ఆవరణం మొత్తం ఆక్వా థీమ్తో డెకరేట్ చేస్తున్నారు. ఈవెంట్ మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ తదితర సరదా ఆటలూ పూల్ రీడింగ్స్ వంటి ఆసక్తికరమైన సెషన్లూ ఉంటాయి. పూల్ పారీ్టలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల ధగధగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి. పాట్ లాక్.. ఫుడ్ క్లిక్.. చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచి్చన, వచి్చన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్థాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ఆరోగ్యకరం.. ఆర్గానిక్.. ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు భారీగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పారీ్టస్కి కూడా అంటుకుంది. ఎకో ఫ్రెండ్లీ లేదా ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. నగరంలో చాలా మందికి శివార్లలో పార్మ్ హౌజ్లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలతో పాటు సహజ పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తున్నారు. డెస్టినేషన్..ప్యాషన్.. ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా.. ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమెటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పారీ్టలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే. ప్రస్తుతం బ్యాచిలర్ పారీ్టలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్కిషోర్ అంటున్నారు. సిటీకి దగ్గరలో ఉన్న అనంతగిరి మొదలుకుని కాస్త దూరంలో ఉన్న లోనావాలా, దండేలి, మతేరన్ తదితర హిల్ స్టేషన్స్ వరకూ డెస్టినేషన్ పారీ్టస్ జరుగుతున్నాయి.ట్రెడిషనల్గా.. ట్రెండీగా.. సంక్రాంతి టైమ్లో ట్రెడిషనల్ పారీ్టస్ ఎక్కువగా జరుగుతుంటాయి. వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకు రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడుతుందనే ఆలోచనే దీనికి కారణమన్నారు. -
2024లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ధర రూ. 25వేలు కంటే తక్కువే..
2024 ముగుస్తోంది. లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.25,000 లోపు ధర వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.వన్ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE4)ప్రస్తుతం మార్కెట్లో రూ. 25వేలలోపు ధర వద్ద లభిస్తున్న అత్యుత్తమ స్మార్ట్ఫోన్లలో 'వన్ప్లస్ నార్డ్ సీఈ4' ఒకటి. ఇది మంచి పనితీరును అందించడం మాత్రమే కాకుండా.. బ్యాటరీ కెపాసిటీ కూడా ఉత్తమగానే ఉంటుంది. 6.74 ఇంచెస్ వైబ్రెంట్ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ పొందుతుంది. మంచి ఫోటోల కోసం లేదా ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే క్వాలిటీ వంటివి కోరుకునవారికి ఇది బెస్ట్ ఆప్షన్.రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro)మంచి డిస్ప్లే, బెస్ట్ పర్ఫామెన్స్ కోరుకునే వారికి 'రెడ్మీ నోట్ 13 ప్రో' ఉత్తమ ఎంపిక. దీని ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. 6.67 ఇంచెస్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్.. 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ పొందుతుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. 5100mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ రోజంతా పనిచేస్తుంది.మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion)అద్భుతమైన డిజైన్ కలిగి, మంచి పనితీరును అందించే స్మార్ట్ఫోన్ కోసం ఎదురు చూసేవారికి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఓ మంచి ఆప్షన్. ఇది స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ పొందుతుంది. ఈ స్మార్ట్ఫోన్ డిస్ప్లే 6.7 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ.. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కు సపోర్ట్ చేస్తుంది.మోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo)మోటరోలా ఎడ్జ్ 50 నియో కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్ఫోన్. ఇది డైనమిక్ 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన.. 6.4 ఇంచెస్ డిస్ప్లే పొందుతుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, గుండ్రంగా ఉండే కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 50 MP ప్రైమరీ లెన్స్ & 32 MP సెల్ఫీ షూటర్ వంటివి ఈ స్మార్ట్ఫోన్లో ఉన్నాయి.వివో టీ3 ప్రో (Vivo T3 Pro)లెదర్ బ్యాక్తో సొగసైన.. స్లిమ్ డిజైన్ పొందిన ఈ స్మార్ట్ఫోన్ 6.77 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే పొందుతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ కలిగిన ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీ పొందుతుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండటం వల్ల తక్కువ కాంతిలో కూడా ఫోటోలు తీసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది.నథింగ్ ఫోన్ (2ఏ) (Nothing Phone (2a))పాలికార్బోనేట్ బ్యాక్తో, ప్లాస్టిక్ బిల్డ్ కలిగిన ఈ ప్రీమియం ఫోన్ ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. ఇందులోని గ్లిఫ్ ఇంటర్ఫేస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. గేమింగ్ కోసం కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ రోజు వినియోగాన్ని నిర్ధారిస్తుంది. ఇది డ్యూయల్ 50 MP రియర్ కెమెరాలు కలిగి ఉండటం వల్ల ఉత్తమ ఫోటో అనుభవాన్ని పొందవచ్చు. -
ఈ నెల 12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళా
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకు ప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహార ప్రాసెసింగ్పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. ఇదీ చదవండి : నిలువు పుచ్చ తోట!అవును..నిజమే! -
కేకుపుట్టించే టేస్ట్!
ప్రయాణం చేస్తూనే అల్పాహారం తీసుకోవాలనుకున్న ఓ యువ ప్రొఫెషనల్ దీని కోసం అరటి వాల్నట్ కేక్ తయారు చేసుకుంటాడు. బిజీగా ఉండే ఓ మోడ్రన్ మదర్.. చిన్నపిల్లల స్నాక్ బాక్స్ కోసం తన ప్యాంట్రీలో నిల్వ చేసిన ఫ్రూట్ పుడ్డింగ్ కేక్ని బయటకు తీసి రెడీగా ఉంచుతుంది. ఇలా ఉదయాన్నే తీసుకునే అల్పాహారం నుంచి రాత్రి పూట ఆస్వాదించే బ్రౌనీస్ వరకూ.. కేక్స్ నగరవాసుల వేగవంతమైన డైలీ రొటీన్లో భాగం అయిపోయాయి. ఇక న్యూఇయర్ని, క్రిస్మస్లను మోసుకొచ్చే డిసెంబర్ నెలలో అయితే కేక్ల సందడికి హద్దే ఉండదని చెప్పాలి. కేకుల వినియోగంలో సౌలభ్యంతో పాటు వాటి రుచి కారణంగా చాలా మందికి ఆహారపరంగా ప్రాధాన్యత జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన సిటిజనులు హోమ్ బేకింగ్ను అలవాటు చేసుకున్నారు. అలా పదుల సంఖ్యలో పుట్టుకొచి్చన హోమ్ బేకర్స్.. ఆన్లైన్ వేదికగా అనేక మందికి వీటిని చేరువ చేశారు. దీంతో ఈ డెజర్ట్ సిటిజనులకు మరింత ఇష్టమైన ఆహారంగా మారింది. హాట్ కేక్.. ఈట్ రైట్.. సిటీలో విరివిగా వినియోగంలో ఉన్నవాటిని ప్యాకేజ్డ్ కేకులు: ఆరి్టసానల్ కేక్లుగా విభజించవచ్చు. వీటిలో స్పాంజ్ కేక్లు, కప్ కేక్లు, చీజ్ కేక్లు, కేక్ పాప్స్ వంటివి వేగంగా తినే పని ముగించాలనుకునేవారికి ఇష్టమైనవిగా మారాయి. దీనికి తోడు పలు బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న వివిధ రుచులు ఆకట్టుకునే ప్యాకేజ్లతో మరింతగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్లెయిన్ స్పాంజ్ కేకులు, ఫ్రాస్టెడ్ ఐసింగ్, స్విస్ రోల్స్, ఫ్రూట్ ఫిల్డ్ మఫిన్ల వరకు అందుబాటులో ఉన్న అనేక రకాల ప్యాకేజ్డ్ కేక్లకు డిమాండ్ బాగా ఉంది. గులాబ్ జామూన్, రస్మలై కేకులు లేదా ఫిర్ని తిరమిసు ఇలా బ్రెడ్ తయారీదారులు మన రుచులతో పాశ్చాత్య డెజర్ట్లను చొప్పిస్తున్నారు. పండుగలకూ పసందే.. పుట్టిన రోజులు లేదా వివాహాలతో పాటు కేక్ సంప్రదాయం భారతీయ పండుగలకు కూడా విస్తరించింది. రాఖీ, దీపావళి భాయ్ దూజ్ వంటి పండుగలు సంప్రదాయ స్వీట్లు – బహుమతులతో పాటు కేక్లను బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సంప్రదాయ స్వీట్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నప్పటికీ, కేక్ను బహుమతిగా ఇవ్వడం అనేది కూడా క్రమక్రమంగా ఊపందుకుంటోంది. అలా ఇచ్చి పుచ్చుకోవాలనుకునేవారి కోసం రిచ్ ప్లమ్ కేక్, విక్టోరియన్ ప్లమ్ కేక్, చాకొలెట్ ఐసింగ్ కేక్, వెనీలా ఐసింగ్ కేక్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బట్టర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్ కేకులతో పాటు ఫ్రెష్ ఫ్రూట్ కేక్, క్యారామిల్ కేక్, చాకొలెట్ ఆల్మండ్ కేక్.. వంటì వెన్నో.. సిటీ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఊపుతెచ్చిన.. ఈ–కామర్స్ఇ–కామర్స్ ప్లాట్ఫారమ్ల వల్ల కొన్ని గంటల్లో ఫ్యాన్సీ కేక్లను పంపడం/స్వీకరించడం çసర్వసాధారణమైపోయింది. కేక్ గిఫ్టింగ్ కోసం ఈ ప్లాట్ఫారమ్ల ద్వారా కొనుగోలు చేసి, బహుమతిగా పంపే సౌలభ్యంతో కేక్ల విక్రయాల్లో 12–15% పెంపునకు ఈ సైట్లు కారణమయ్యాయని అంచనా. ప్రముఖ ఆన్లైన్ బేకరీ రిటైల్ చైన్ అయిన విన్నీ విక్రయాల తీరు రాఖీ, భాయ్ దూజ్ లేదా దీపావళి వంటి పండుగల సమయంలో డిమాండ్కు అద్దం పడుతోంది. ఏతావాతా ప్లాట్ఫారమ్ల వెల్లువ కేక్ గిఫ్టింగ్ మార్కెట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. రాఖీ, భైదూజ్ దీపావళి వంటి పండుగల సమయంలో కేక్ విక్రయాల దాదాపు 20% వృద్ధి రేటును చూసింది. సోషల్.. సోస్టైల్.. డిజైనర్ కేక్స్ హవాకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తోంది. ఆకర్షణీయమైన వెరైటీలను సోషల్ వేదికలపై ఇన్ఫ్లుయెన్సర్లు, ఫుడ్ బ్లాగర్లు తాజా కేక్ డిజైన్లను క్రమం తప్పకుండా ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రత్యేక సందర్భాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన కేక్ల వైపు వినియోగదారుల చూపు మళ్లేలా చేస్తున్నారు. పరిశ్రమ నివేదికల ప్రకారం, సోషల్ మీడియా ప్రభావం వల్ల దేశంలో కేక్ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా 20శాతం వరకూ పెరుగుతోందట.సందర్భమేదైనా.. సందడి కేక్స్దే.. ఒకప్పుడు కేక్స్ను కేవలం బర్త్డేలకు మాత్రమే ఎక్కువగా వినియోగించేవారు. క్రిస్మస్, న్యూ ఇయర్లతో పాటు ఇప్పుడు ఇవి విభిన్న సందర్భాలకు విస్తరించాయి. చిన్నారుల పుట్టిన రోజుల్ని ప్రతినెలా జరపడం దగ్గర నుంచీ వివాహ వార్షికోత్సవాల దాకా అలాగే కొత్తగా జాబ్లో చేరడం దగ్గర నుంచీ ప్రమోషన్స్, పదవీ విరమణ దాకా.. ఇలా అనేకానేక సందర్భాలకు కేక్స్ను వినియోగించడం జరుగుతోంది. పైనాపిల్ కేక్, బటర్స్కాచ్ కేక్, ఛీజ్ కేక్, బిస్కోటి కేక్.. తదితర వెరైటీలకు ఫుల్ డిమాండ్ ఉంది. – సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ -
డిసెంబర్లో బ్యాంకులు పనిచేసేది కొన్ని రోజులే..
Bank Holidays in December 2024: నవంబర్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో డిసెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేస్తాయి.. ఏయే రోజుల్లో మూతపడతాయి అన్న వివరాలతో డిసెంబర్ బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను ఇక్కడ అందిస్తున్నాం..ఆర్బీఐ ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. డిసెంబర్ నెలలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు అధిక మొత్తంలో వరుస సెలవులు ఉన్నాయి. ముఖ్యంగా పండుగలు, ప్రాంతీయ, జాతీయ విశేష సందర్భాల నేపథ్యంలో బ్యాంకులు కొన్ని రోజులే పనిచేయనున్నాయి.డిసెంబర్లో బ్యాంకులకు వారాంతపు సెలవులతో సహా కనీసం 17 లిస్టెడ్ సెలవులు ఉన్నాయి. కొన్ని దీర్ఘ వారాంతాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాంకుకు మీ సందర్శనలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. బ్యాంక్ సెలవులు దేశంలోని రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.డిసెంబర్లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాడిసెంబర్ 1 - ఆదివారండిసెంబర్ 3 - శుక్రవారం - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్ (గోవా)డిసెంబర్ 8 - ఆదివారం డిసెంబర్ 12 - మంగళవారం - పా-టోగన్ నెంగ్మింజ సంగ్మా (మేఘాలయ)డిసెంబర్ 14 - రెండవ శనివారండిసెంబర్ 15 - ఆదివారండిసెంబర్ 18 - బుధవారం - యు సోసో థామ్ వర్ధంతి (మేఘాలయ)డిసెంబర్ 19 - గురువారం - గోవా విమోచన దినం (గోవా)డిసెంబర్ 22 - ఆదివారండిసెంబర్ 24 - మంగళవారం - క్రిస్మస్ ఈవ్ (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 25 - బుధవారం - క్రిస్మస్ (దేశమంతా)డిసెంబర్ 26 - గురువారం - క్రిస్మస్ వేడుక (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 27 - శుక్రవారం - క్రిస్మస్ వేడుక (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)డిసెంబర్ 28 - నాల్గవ శనివారండిసెంబర్ 29 - ఆదివారండిసెంబర్ 30 - సోమవారం - యు కియాంగ్ నంగ్బా (మేఘాలయ)డిసెంబర్ 31- మంగళవారం - నూతన సంవత్సర వేడుక/లాసాంగ్/నామ్సూంగ్ (మిజోరం, సిక్కిం) -
డిసెంబర్లో భారీగా పెళ్లిళ్లు.. మోగనున్న పెళ్లి బాజా
సాక్షి, అమలాపురం: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తోంది. బ్రహ్మచారులు కొత్త బంధంలో ఒదిగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కన్నెపిల్లలు సిగ్గుల మొగ్గలవుతూ ముస్తాబులకు రెడీ అవుతున్నారు. పెళ్లి ఏర్పాట్లకు వధూవరుల కుటుంబాలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. నగలు, వస్త్రాలు, కల్యాణ మండపాలు, సన్నాయి, కేటరింగ్కు డిమాండ్ ఏర్పడింది. నగలు, వస్త్ర దుకాణాల్లో అప్పుడే షాపింగ్ కళ పెరిగిపోయింది. పెళ్లి బంధం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైంది. తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆచితూచి శుభఘడియలను ఎంచుకుని ముడేస్తారు. తద్వారా వారి వివాహ బంధం జీవితకాలం ఎలాంటి ఆటుపోట్లకు లోనవకుండా ఉండాలని కోరుకుంటారు.మార్గశిరం మంచిదని..మార్గశిర (డిసెంబర్) మాసంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ మాసంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. మార్గశిర మాసంలో బలమైన ముహూర్తాలు ఉండటంతో పాటు జనవరిలో పుష్యమాసం కావడం.. మార్చి రెండో వారం నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) రానుండటంతో ఇప్పుడున్న ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేయాలని పెద్దలు ఆరాటపడుతున్నారు. ప్రస్తుత కార్తీక మాసంలో ఈ నెల 24న చివరి ముహూర్తం ఉంది. కార్తీకంలో పెళ్లిళ్లు జరిగినా పెద్దగా లేవనే చెప్పాలి. డిసెంబర్ 2వ తేదీ నుంచి మార్గశిర మాసం మొదలు కానుండటంతో వివాహాలు అధిక సంఖ్యలో జరగనున్నాయి. తెలుగునాట మాఘం, వైశాఖం, శ్రావణ మాసాల తరువాత మార్గశిర మాసంలోనే ఎక్కువగా వివాహాలు జరుగుతుంటాయి. జనవరిలో ముహూర్తాలు లేవుడిసెంబర్ 25 తరువాత నుంచి జనవరి 30వ తేదీ వరకూ పుష్యమాసంలో వివాహాలు, ఇతర శుభ కార్యక్రమాలు పెద్దగా చేయరు. జనవరి 31 నుంచి మార్చి 7వ తేదీ వరకూ మాఘమాసంలో ముహూర్తాలున్నాయి. మార్చి 13 నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) మొదలు కానుండటంతో ముహూర్తాల కోసం మళ్లీ నెల రోజులకు పైగా ఎదురుచూపులు తప్పవు. ఈ కారణాలతో మార్చి 7లోపు పెళ్లిళ్లు చేసేందుకు చాలామంది ఆరాటపడుతున్నారు.7న అతి పెద్ద ముహూర్తండిసెంబర్ నెల పొడవునా ముహూర్తాలున్నాయి. ఆ నెలలో ఏడో తేదీ అతి పెద్ద ముహూర్తం. ఆ రోజున సుమారు 30 పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టాను. డిసెంబర్ 22వ తేదీ ఆదివారం సైతం పెద్దఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. జనవరిలో పుష్యమాసం కావడంతో పెద్దగా ముహూర్తాలు లేవు. ఈ కారణంగా డిసెంబర్లో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. – దైవజ్ఞరత్న ఉపద్రష్ట నాగాదిత్య సిద్ధాంతి, అమలాపురం25 వరకూ శుభముహూర్తాలుమార్గశిర మాసంలో డిసెంబర్ 4వ తేదీ బుధవారం బలమైన ముహూర్తాలున్నాయని పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి 7.54 గంటలకు, తెల్లవారుజామున 4.28 గంటలకు (తెల్లవారితే గురువారం), అలాగే 5, 6 తేదీల్లో ముహూర్తాలున్నాయి. 7వ తేదీన కూడా అతి పెద్ద ముహూర్తాలున్నాయి. ఆ రోజు రాత్రి 7.50, తెల్లవారుజామున 4.24 (8వ తేదీ ఉదయం) రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరగనున్నాయి. అలాగే, 10వ తేదీన సైతం అధిక సంఖ్యలో వివాహాలు చేయనున్నారు. డిసెంబర్ 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో పెళ్లిళ్లతో పాటు, వివిధ శుభ కార్యక్రమాలకు సైతం మంచి ముహూర్తాలు ఉన్నాయి. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్.. గోవాలో పెళ్లి? (ఫోటోలు)
-
48లక్షల పెళ్లిళ్లు.. రూ.5.76లక్షల కోట్లు ఖర్చు
సాక్షి అమరావతి: జూన్ నెలాఖరు నుంచి సరైన ముహూర్తాలు లేవు. వివాహాలు, శుభకార్యాలు వాయిదా పడుతూ వస్తు న్నాయి. ఎట్టకేలకు ఇక ముహూర్తం కుదిరింది. వధూవరులు ఒక్కటయ్యే తరుణం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శనివారం నుంచి పెళ్లి సందడి అంబరాన్ని తాకనుంది. ఈ ఏడాది చివరి వరకు ఇది కోలాహలం కొనసాగనుంది. అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 81 మధ్య 23 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ఘడియల్లో దాదాపు 48లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాన్సెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఎఐటీ) తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023వ సంవత్సరంలో చివరి మూడు నెలల్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. సుమారు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు ఉన్న ముహూర్తాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 48లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క పెళ్లి వేడుకకు సగటున రూ.12 లక్షలు ఖర్చు పెడతారని అంచనా. ఈ లెక్కన ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.5,76 లక్షల కోట్లు ఖర్చు అవుతుం దాని ప్రాథమికంగా లెక్క తేల్చారు.షాపింగ్ సందడి షురూ..దసరా పండుగతోపాటు పెళ్లిళ్ల షాపింగ్ కూడా కొందరు. ప్రారంభించారు. దీంతో మార్కెట్లో సైతం సందడి నెలకొంది. భోజనాలు, క్యాటరింగ్, కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, డెకరేషన్లకు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖల ప్రీం టింగ్స్, ఫ్లెక్సీ ప్రింటర్స్, ఫొబో గ్రావర్లు, టెంట్ హౌస్, వంటమేస్త్రీలు, ముట పనివాళ్లు, క్యాటరింగ్ బాయ్స్, బ్యూటీ మనన్లు, మెహందీ ఆది పూలు అమ్మేవాళ్లు, మంగళ వాయిద్య కళాకారులు, డీజే మ్యూజి నివ్వాహకులు ఇలా పెళ్లి వేడుకతో ప్రతి ఒక్కరిని ముందుగానే ఎంపిక చేసుకుని అడ్వాన్సులు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. దేశంలో సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి సంపన్నుల వరకు పెళ్లి వేడుక అన్నట్లుగా ఖర్చు చేస్తున్నారు. ఎంగేజ్మెంట్, ఫ్రీ వెడ్డింగ్, హల్దీ, రిసెప్షన్ పోస్ట్ వెడ్డింగ్... ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకకు రాజీపడకుండా నిర్వహిస్తున్నారు. అందువల్ల ఈ ఏడాది చివరి వరకు దేశవ్యాప్తంగా పెళ్లి సందడి ఉంటుందని సీఏఐటీ వెల్లడించింది.ముహూర్తాలు.. ఇవీ అక్టోబర్ 12, 13, 16, 20,27వ తేదీల్లో మహూర్తాలు ఉన్నాయి. నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 16,17. డిసెంబర్లో 5,6,7 8, 11, 12, 14, 15, 26 వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి మాసం ప్రారంభం కావడంతో మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలు వరకు శుభ ముహూ కోసం ఆగాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఏడాురు దీపావళి తర్వాత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉపనయనాలు, గృహప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతాయని అంచనా. -
కొత్త హంగులతో పునరాగమనం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్ఫూర్తితో ప్రారంభమైన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. 2017లో నిలిచిపోయిన హెచ్ఐఎల్ను తిరిగి ఆరంభించాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. ఈసారి లీగ్కు సరికొత్త హంగులు అద్దగా... పురుషులతో పాటు మహిళల విభాగంలో పోటీలుజరగనున్నాయి. డిసెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్ కోసం ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు ప్లేయర్ల వేలం జరగనుంది. ఒక్కో జట్టులో 24 మంది ప్లేయర్లు ఉండనున్నారు. ఇందులో నలుగురు జూనియర్ ఆటగాళ్లు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టును రెసల్యూట్ స్పోర్ట్స్ కంపెనీ సొంతం చేసుకుంది. మహిళల లీగ్ తుదిపోరు వచ్చే ఏడాది జనగరి 26న, పురుషుల ఫైనల్ ఫిబ్రవరి 1న నిర్వహించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రకటించాడు. ఏడేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న లీగ్ విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, క్రీడావిభాగం దేశంలో హాకీ క్రీడకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఏడేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభం కానుంది. 2013లో ప్రారంభమైన లీగ్ ఐదు సీజన్లు పాటు విజయవంతంగా కొనసాగిన తర్వాత 2017లో అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ శుక్రవారం వెల్లడించాడు. గతంలో పురుషుల విభాగంలో మాత్రమే పోటీలు జరగగా... ఈ సారి మహిళల విభాగంలోనూ మ్యాచ్లు జరగనున్నాయి. హెచ్ఐఎల్ తిరిగి ప్రారంభమవడం ద్వారా ఆటకు మరింత ఆదరణ దక్కడంతో పాటు... మహిళల హాకీలో కోత్త జోష్ రానుంది. భారత మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీ హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి... ఈ లీగ్ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేయగా... ఇప్పటికి కార్యరూపం దాలి్చంది. హెచ్ఐఎల్కు టిర్కీనే చైర్మన్గా వ్యవహరించనున్నాడు. ‘జాతీయ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లను అందించడంలో హాకి ఇండియా లీగ్ కీలక పాత్ర పోషించనుంది. హాకీ క్రీడలో కొత్త అధ్యాయానికి నేడు తెర లేచినట్లు అనిపిస్తోంది. అడగ్గానే హెచ్ఐఎల్ కోసం 35 రోజుల సమయాన్ని కేటాయించిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)కు ధన్యవాదాలు. హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దీని కోసం కృషి చేశా. ఇప్పటికి కల సాకారమైంది’ అని టీర్కీ పేర్కొన్నాడు. హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్ మాట్లాడుతూ... భారత్లో హాకీ కేవలం క్రీడ మాత్రమే కాదని దీనికి భారతీయుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. 2036 వరకు భారత హాకీకి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్గా వ్యవహరించనుందని పునరుద్ఘాటించారు. జట్ల వివరాలు పురుషుల విభాగంలో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. వాటిలో చెన్నై జట్టుకు చార్లెస్ గ్రూప్, లక్నో జట్టుకు యదు స్పోర్ట్స్, పంజాబ్ జట్టుకు జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్ జట్టుకు ష్రాచీ స్పోర్ట్స్, హైదరాబాద్ జట్టుకు రెసల్యూట్ స్పోర్ట్స్, రాంచీ జట్టుకు నవోయమ్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులుగా కొనసాగనున్నారు. టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతికి చెందిన ఎస్జీ స్పోర్ట్స్ కంపెనీ ఢిల్లీ జట్టును సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో హరియాణా జట్టును జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్ టీమ్ను ష్రాచీ స్పోర్ట్స్, ఢిల్లీ జట్టును ఎస్జీ స్పోర్ట్స్, ఒడిశా జట్టును నవోయమ్ స్పోర్ట్స్ సొంతం చేసుకున్నాయి. మరో రెండు ఫ్రాంచైజీల యజమానులను త్వరలోనే వెల్లడించనున్నారు. » పురుషుల విభాగంలో 8 జట్లు, మహిళల విభాగంలో 6 జట్లు లీగ్లో పాల్గొననున్నాయి. గతంలో కేవలం పురుషుల విభాగంలోనే పోటీలు జరగగా.. తొలిసారి మహిళా లీగ్ను ప్రవేశ పెడుతున్నారు. » పురుషుల విభాగంలో పోటీలను రౌర్కెలాలో, మహిళల మ్యాచ్లను రాంచీలో నిర్వహించనున్నారు. » ఒక్కో జట్టులో 24 మంది ఆటగాళ్లు ఉండనున్నారు. వారిలో 16 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీయులకు అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో నలుగురు జూనియర్ ప్లేయర్లు తప్పనిసరి. » డిసెంబర్ 28న ఈ లీగ్ ప్రారంభం కానుండగా... మహిళల విభాగంలో వచ్చే ఏడాది జనవరి 26న రాంచీలో ఫైనల్ జరగనుంది. పురుషుల విభాగంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రౌర్కెలాలో తుదిపోరు జరగనుంది. » ఈనెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ప్లేయర్ల వేలంలో అన్ని ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. ప్లేయర్ల కనీస ధరను మూడు కేటగిరీలుగా (రూ. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు) విభజించారు. » ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు పురుషుల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 4 కోట్లు... మహిళల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 2 కోట్లు ఖర్చు చేయవచ్చు. » 2013లో తొలిసారి నిర్వహించిన హెచ్ఐఎల్లో రాంచీ రైనోస్ టైటిల్ సాధించగా.. ఆ తర్వాత 2014లో ఢిల్లీ వేవ్రైడర్స్, 2015లో రాంచీ రాయ్స్, 2016లో పంజాబ్ వారియర్స్, 2017లో కళింగ లాన్సర్స్ చాంపియన్గా నిలిచాయి. » పారిస్ ఒలింపిక్స్ తర్వాత హాకీ ఆటకు గుడ్బై చెప్పిన భారత దిగ్గజ గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఢిల్లీ జట్టుకు డైరెక్టర్గా వ్యవహరించనున్నాడు. -
డిసెంబరులో పట్టాలపైకి వందేభారత్ స్లీపర్ రైలు
భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది.2019లో వందేభారత్ చైర్-కార్ రైలును ప్రారంభించారు. ఇప్పుడు వస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు ఈ సిరీస్లో మూడవ ఎడిషన్. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు గుజరాత్లో నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అధికారికంగా ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. ఈ రైలును రెండు నెలల పాటు పరీక్షించనున్నారు.వందే భారత్ తొలి స్లీపర్ రైలు బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఇఎంఎల్) ప్లాంట్ నుండి సెప్టెంబర్ 20 నాటికల్లా బయలుదేరుతుందని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐపీఎఫ్) చెన్నై జనరల్ మేనేజర్ యూ సుబ్బారావు మీడియాకు తెలిపారు. దీని తర్వాత రైలు ట్రయల్ రన్ జరగనుంది. వాయువ్య రైల్వే జోన్లో హైస్పీడ్ రైలు ట్రయల్ను నిర్వహించనున్నారు.స్లీపర్ వందేభారత్లో స్టెయిన్లెస్ స్టీల్ కార్ బాడీ, ప్రయాణీకులకు మెరుగైన రక్షణ సదుపాయాలు, జీఎఫ్ఆర్పీ ఇంటీరియర్ ప్యానెల్లు, ఏరోడైనమిక్ డిజైన్, మాడ్యులర్ ప్యాంట్రీ, ఫైర్ సేఫ్టీ కంప్లైయెన్స్, డిసేబుల్డ్ ప్యాసింజర్ల సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, సెన్సార్ ఆధారిత ఇంటర్కమ్యూనికేషన్, ఫైర్ బారియర్ డోర్లు ఉన్నాయి. యూఎస్బీ ఛార్జింగ్తో కూడిన ఎర్గోనామిక్ టాయిలెట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్ కూడా దీనిలో ఉండనున్నాయి. -
బన్నీ పుష్ప-2 కు పోటీగా మంచు విష్ణు కన్నప్ప..
-
డిసెంబరు నాటికి రామాలయ నిర్మాణం పూర్తి!
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను సమీక్షించారు. 2024 డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తికానున్నదని వెల్లడించారు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఉదయం 12:16 గంటలకు సూర్యుని కిరణాలు ఐదు నిమిషాల పాటు బాలరాముణ్ణి తాకుతాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రామనవమి నాడు ఉదయం 3:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రామ్లల్లాను భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు. ఆరోజున బ్రహ్మ ముహూర్తంలో మంగళ హారతి, అభిషేకం తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. అయోధ్యలోని సుగ్రీవ కోట, బిర్లా ధర్మశాల, శ్రీరామ జన్మభూమి ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వంద ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ఆలయంలో నిర్వహించే అన్ని పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామన్నారు. -
ఈపీఎఫ్వో కిందకు 15.62 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో 15.62 లక్షల మంది సభ్యులు డిసెంబర్ నెలలో చేరారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే సభ్యుల చేరికలో 12 శాతం వృద్ధి నమోదైంది. అదే 2022 డిసెంబర్ నెల చేరికలతో పోలిస్తే 4.62 శాతం వృద్ధి కనిపించింది. ఉపాధి అవకాశాల పెరుగుదల, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, మరిన్ని సంస్థలకు చేరువ అయ్యేందుకు ఈపీఎఫ్వో చేపడుతున్న కార్యక్రమాలు సభ్యుల పెరుగుదలకు సాయపడుతున్నట్టు కేంద్ర కారి్మక శాఖ ప్రకటించింది. 8.41 లక్షల మంది ఈపీఎఫ్వో కింద మొదటిసారి నమోదు అయ్యారు. అంటే తొలిసారి వీరు సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్తో పోలిస్తే కొత్త సభ్యుల పెరుగుదల 14 శాతంగా ఉంది. పైగా డిసెంబర్ నెలకు సంబంధించిన నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మంది 18–25 వయసులోని వారే కావడం గమనార్హం. మిగిలిన సభ్యులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం ద్వారా తమ ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకున్నారు. 2.09 లక్షల మంది మహిళలు.. 8.41 లక్షల కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే 7.57 శాతం అధికం. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. డిసెంబర్ నెలకు సంబంధించి కొత్త చేరికల్లో 58.33 శాతం ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర వాటా 21.63 శాతంగా ఉంది. ఐరన్ అండ్ స్టీల్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, జనరల్ ఇన్సూరెన్స్ రంగాలు ఎక్కువ మందికి అవకాశం కల్పించాయి. -
కొత్త చందాదారుల ఆకర్షణలో జియో టాప్
న్యూఢిల్లీ: కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో మరోసారి రిలయన్స్ జియో ముందుంది. 2023 డిసెంబర్ నెలకు గాను 39.94 లక్షల మొబైల్ చందాదారులను జియో సొంతం చేసుకుంది. భారతీ ఎయిర్టెల్ కిందకు కొత్తగా 18.5 లక్షల మంది కస్టమర్లు వచ్చి చేరారు. అదే సమయంలో ఎప్పటి మాదిరే వొడాఫోన్ ఐడియా మరో 13.68 లక్షల కస్టమర్లను డిసెంబర్లో కోల్పోయింది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ 1.5 లక్షల కస్టమర్లు, ఎంటీఎన్ఎల్ 4,420 మంది కస్టమర్ల చొప్పున నష్టపోయాయి. మొత్తం టెలికం చందాదారులు 2023 నవంబర్ నా టికి 1,185.73 మిలియన్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 1,190.33 మిలియన్లకు (119 కోట్లకు) చేరారు. నెలవారీగా ఇది 0.39 శాతం వృద్ధికి సమానం. బ్రాడ్బ్యాండ్ చందాదారులు సైతం 90.4 కోట్లకు పెరిగారు. వైర్లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య నవంబర్ చివరికి 3.15 కోట్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 3.18 కోట్లకు పెరిగింది. వైర్లైన్ విభాగంలో జియో 2.46 లక్షల కొత్త కస్టమర్లను సాధించింది. ఎయిర్టెల్ 82,317 మంది, వొడాఫోన్ ఐడియా 9,656, క్వాండ్రంట్ 6,926 కస్టమర్ల చొప్పున సొంతం చేసుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 34,250 మంది, టాటా టెలిసరీ్వసెస్ 22,628 మంది చొప్పున కస్టమర్లను కోల్పోయాయి. -
కొత్తగా 18.86 లక్షల మందికి ఈఎస్ఐ.. ఆసక్తికర అంశం ఏంటంటే..
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ESIC ) కిందకు డిసెంబర్ నెలలో 18.86 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదే నెలలో 23,347 సంస్థలు ఈఎస్ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభింనట్లుగా తెలుస్తోంది. కొత్త సభ్యుల్లో 8.83 లక్షల మంది (47 శాతం) వయసు 25 ఏళ్లలోపే ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక నికరంగా నమోదైన మహిళా సభ్యుల సంఖ్య 3.59 లక్షలుగా ఉంది. అలాగే, డిసెంబర్లో 47 ట్రాన్స్జెండర్లకు సైతం ఉద్యోగ అవకాశాలు లభించాయి. సమాజంలోని ప్రతివర్గానికీ ప్రయోజనాలు అందించేందుకు ఈఎస్ఐసీ కట్టుబడి ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కార్మిక శాఖ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం.. ఈఎస్ఐసీ కింద అధికారిక ఉద్యోగ కల్పన నవంబర్లో 1.59 మిలియన్ల కొత్త ఉద్యోగులతో పోలిస్తే, డిసెంబర్లో నెలవారీగా 18.2 శాతం పెరిగింది. ఏప్రిల్లో 17.8 లక్షల మంది, మేలో 20.2 లక్షల మంది, జూన్లో 20.2 లక్షల మంది, జూలైలో 19.8 లక్షలు, ఆగస్టులో 19.4 లక్షలు, సెప్టెంబర్లో 18.8 లక్షలు, అక్టోబర్లో 17.8 లక్షల మంది ఈఎస్ఐసీలో కొత్తగా చేరుతూ వచ్చారు. -
పవర్గ్రిడ్ కార్పొరేషన్ రూ. 4.50 డివిడెండ్
న్యూఢిల్లీ: పవర్గ్రిడ్ కార్పొరేషన్ డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి పనితీరు పరంగా రాణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని లాభం రూ.3,645 కోట్లతో పోల్చి చూసినప్పుడు 11 శాతం పెరిగి రూ.4,028 కోట్లకు చేరింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.11,530 కోట్ల నుంచి రూ.11,820 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ.7,690 కోట్ల మూలధన వ్యయాలను వినియోగించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆరు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్టులను బిడ్డింగ్లో గెలుచుకుంది. వీటి నిర్మాణ అంచనా వ్యయం రూ.20,479 కోట్లుగా ఉంది. డిసెంబర్ చివరికి పవర్గ్రిడ్ సంస్థ నిర్వహణలోని ట్రాన్స్మిషన్ ఆస్తుల నిడివి 1,76,530 సర్క్యూట్ కిలోమీటర్లుగా ఉంది. అలాగే, 276 సబ్ స్టేషన్లు, 5,17,860 మెగావోల్ట్ యాంపియర్స్ ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.4.50 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. -
దేశీ ఎల్రక్టానిక్ కంపెనీలకు మెరుగైన రేటింగ్స్
న్యూఢిల్లీ: బ్రాండ్ల ఆమోదయోగ్యతకు సంబంధించి గ్లోబల్ కంపెనీలకు దీటుగా దేశీ ఎల్రక్టానిక్స్ కంపెనీలు ఉంటున్నాయి. లావా, క్యూబో వంటి సంస్థలకు మెరుగైన రేటింగ్స్ లభిస్తున్నాయి. మార్కెట్ అనాలిసిస్ సంస్థ టెక్ఆర్క్ డిసెంబరులో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ–కామర్స్ ప్లాట్ఫాంలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో 35 ఉత్పత్తుల కేటగిరీలవ్యాప్తంగా 25 బ్రాండ్లపై దీన్ని నిర్వహించారు. ‘రియల్మీ, రెడ్మీ వంటి గ్లోబల్ బ్రాండ్స్కి ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లలో 4.3 రేటింగ్ ఉన్నట్లు మా విశ్లేషణలో వెల్లడైంది. వాటితో పోలిస్తే పరిశ్రమ ప్రమాణాలకు దాదాపు సమానస్థాయిలో లావా మొదలైన సంస్థలకు 4.2 రేటింగ్ ఉంది‘ అని నివేదిక పేర్కొంది. లావాకు 90.2 శాతం మంది అత్యధిక రేటింగ్స్ (4, 5 స్థాయిలో) ఇవ్వగా, గ్లోబల్ బ్రాండ్స్కి వచి్చన 4, 5 స్థాయి రేటింగ్స్ 75.8 శాతమే ఉన్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కేటగిరీలో హీరో గ్రూప్ సంస్థ క్యూబో ఏకంగా పరిశ్రమ సగటు 4 రేటింగ్స్ను కూడా దాటేసి 4.1 రేటింగ్స్ దక్కించుకుంది. అయితే, అంతర్జాతీయ సంస్థలకు అత్యధిక స్థాయిలో 4, 5 రేటింగ్స్ ఉన్నాయి. వేరబుల్ కేటగిరీల్లో మాత్రం రియల్మీ, రెడ్మీ, ఒప్పో, వన్ప్లస్ నార్డ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్స్తో పోలిస్తే భారతీయ బ్రాండ్స్కి పరిశ్రమ బెంచ్మార్క్ కన్నా తక్కువ రేటింగ్స్ ఉన్నాయి. పరిశ్రమ బెంచ్మార్క్ రేటింగ్స్ 4.2గా ఉండగా .. భారతీయ బ్రాండ్స్ అయిన నాయిస్, బోల్ట్ ఆడియోకి 4.1, ఆ తర్వాత బోట్..పీట్రాన్కు 4.0 రేటింగ్స్ లభించాయి. మివి, గిజ్మోర్, నంబర్కి సగటున 3.9 రేటింగ్ ఉంది. యాపిల్, శాంసంగ్ల టార్గెట్ యూజర్ల సెగ్మెంట్ భిన్నమైనది కావడంతో వాటిని ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదు. -
నాలుగు నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగువబాట పట్టింది. కూరగాయాలు, పప్పులు, వంట దినుసుల ధరల మంటతో డిసెంబర్ మాసానికి 5.69%కి పెరిగింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి కావడం గమనించాలి. వినియోగ ధరల సూచీ (సీపీఐ/రిటైల్) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 నవంబర్ నెలలో 5.55%గా ఉంటే, 2022 డిసెంబర్ నెలకు 5.72%గా ఉంది. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో సగం వాటా కలిగిన ఆహారోత్పత్తుల ధరలు (కూరగాయలతో కూడిన).. గతేడాది నవంబర్ నెలలో 8.7%గా ఉంటే, డిసెంబర్ నెలలో 9.53%కి పెరిగిపోయాయి. 2022 డిసెంబర్లో వీటి ధరలు సూచీలో 4.19% వద్దే ఉండడం గమనార్హం. 2023 ఆగస్ట్లో ద్రవ్యోల్బణం 6.83% గరిష్ట స్థాయిని తాకిన తర్వాత నుంచి కొంత తగ్గుతూ వచ్చింది. కూరగాయల విభాగం ద్రవ్యోల్బణం 27.64%గా ఉంది. పప్పులకు సంబంధించి 20.73%, వంట దినుసుల ద్రవ్యోల్బణం 19.69% చొప్పున నమోదైంది. ఆహార విభాగంలోనే... సీపీఐ ద్రవ్యోల్బణం త్రైమాసికం వారీగా పెరిగిపోవడం అన్నది ఆహారం, పానీయాల విభాగం వల్లేనని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. మిగిలిన అన్ని విభాగాల్లో ద్రవ్యోల్బణం కొంత తగ్గడం లేదంటే అదే స్థాయిలో కొసాగినట్టు తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దీర్ఘకాలంలో 4% స్థాయిలో (2 శాతం అటూ ఇటూ దాటకుండా) పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. -
ఈ ఏడాది నియామకాల్లో రికవరీ
ముంబై: డిసెంబర్లో జాబ్ మార్కెట్ కోలుకుంటున్న సంకేతాలు కనిపించిన నేపథ్యంలో ఈ ఏడాది నియామకాలు మెరుగుపడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. 2024లో మొత్తం హైరింగ్ 8.3 శాతం వృద్ధి చెందవచ్చని భావిస్తున్నారు. కన్సల్టెన్సీ సంస్థ ఫౌండిట్ రూపొందించిన వార్షిక ట్రెండ్స్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది డిసెంబర్లో హైరింగ్లో 2 శాతం వృద్ధి నమోదైంది. కొత్త సంవత్సరంలో నియామకాల వృద్ధి 8.3 శాతంగా ఉండవచ్చని, బెంగళూరులో అత్యధికంగా 11 శాతం వృద్ధి నమోదు కావచ్చని నివేదిక పేర్కొంది. తయారీ, బీఎఫ్ఎస్ఐ, ఆటోమోటివ్, రిటైల్, ట్రావెల్, టూరిజం విభాగంలో హైరింగ్ ఎక్కువగా ఉండనుంది. 2022తో పోలిస్తే 2023లో హైరింగ్ కార్యకలాపాలు 5 శాతం తగ్గాయి. అయితే, డిసెంబర్లో కాస్త మెరుగ్గా 2 శాతం వృద్ధి కనపర్చింది. 2022 మధ్య నుంచి జాబ్ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న ట్రెండ్ 2023 ఆఖర్లో మారిందని నివేదిక తెలిపింది. ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ సరైన వారిని నియమించుకోవడంలో వ్యాపార సంస్థలకు సవాళ్లు ఎదురవుతున్నాయని, జాబ్ ఓపెనింగ్స్, హైరింగ్ మధ్య వ్యత్యాసం ఇదే సూచిస్తోందని పేర్కొంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తమ ప్లాట్ఫామ్లో నమోదైన డేటాను విశ్లేషించిన మీదట ఫౌండిట్ ఈ నివేదికను రూపొందించింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ 2023లో కొన్ని రంగాలు చెప్పుకోతగ్గ స్థాయిలో వృద్ధి కనపర్చాయి. మారిటైమ్, షిప్పింగ్ పరిశ్రమలో నియామకాలు 28 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా వాణిజ్యం పెరగడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు తగ్గుముఖం పట్టడం ఇందుకు తోడ్పడ్డాయి. అలాగే రిటైల్, ట్రైవెల్, టూరిజం రంగాల్లో కూడా 25 శాతం వృద్ధి నమోదైంది. అడ్వరై్టజింగ్, మార్కెట్ రీసెర్చ్, పబ్లిక్ రిలేషన్స్ రంగాల్లో 18 శాతం పెరుగుదల కనిపించింది. æ 2024లో కొత్త టెక్నాలజీల్లో అనుభవమున్న నిపుణులకు డిమాండ్ పెరగనుంది. కృత్రిమ మేథ/మెíÙన్ లెరి్నంగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు గణనీయంగా అవకాశాలు ఉంటాయి. -
ప్రపంచ పరిణామాలు, క్యూ3 ఫలితాలు కీలకం
ముంబై: ప్రపంచ పరిణామాలు, దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం దలాల్ స్ట్రీట్కు దిశానిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టబడుల సరళీపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు ట్రేడింగ్పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ఈ కొత్త ఏడాది 2024 తొలి వారంలో జరిగిన అయిదు ట్రేడింగ్ సెషన్లలో సూచీలు మూడింటిలో లాభాలు ఆర్జించగా, రెండింటిలో నష్టాలు చవిచూశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 214 పాయింట్లు, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయాయి. ‘‘దేశీయ కార్పొరేట్ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు ప్రకటన నేపథ్యంలో మార్కెట్ పరిమిత శ్రేణి ట్రేడవుతూ, ఒడిదుడుకులకు లోనవ్వొచ్చు. స్థిరమైన ర్యాలీ కొనసాగితే అమ్మకం, అనూహ్యంగా పతనమైతే నాణ్యమైన షేర్ల కొనుగోళ్లు వ్యూహాన్ని అమలు చేయడం ఉత్తమం. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. సాంకేతికంగా నిఫ్టీ 21,750 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. ఈ స్థాయిని చేధించగలిగితే 22,000 స్థాయిని పరీక్షిస్తుంది. దిగువ స్థాయిలో 21,600 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. క్యూ3 ఫలితాల సీజన్ ప్రారంభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మూడో త్రైమాసిక కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్ ఈ వారం ప్రారంభం కానుంది. దేశీయ ఐటీ అగ్రగామి సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్లు గురువారం( జనవరి 11న) ఆర్థిక ఫలితాలను ప్రకటించి దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్కు తెరతీయనున్నాయి. మరుసటి రోజు విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఆనంద్ రాఠి, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ డిసెంబర్ క్వార్టర్ పనితీరును వెల్లడించనున్నాయి. క్యూ3 ఫలితాల వెల్లడి సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలు యూరోజోన్ నవంబర్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక సేవల గణాంకాలు సోమవారం విడుదల అవుతాయి. జపాన్ నవంబర్ గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్ నవంబర్ నిరుద్యోగ రేటు, అమెరికా నవంబర్ వాణిజ్య లోటు గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. అమెరికా నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా గురువారం ప్రకటించనుంది. ఇక వారాంతాపు రోజైన శుక్రవారం దేశీయ నవంబర్ రిటైల్, ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. అదే రోజున జనవరి 5తో ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వలు, డిసెంబర్ 29తో ముగిసిన వారం బ్యాంకింగ్ రుణ, డిపాజిట్ వృద్ధి గణాంకాలు విడుదల కానున్నాయి. కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. ప్రపంచ పరిణామాలు ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్ల దాడులతో ఎగుమతులపై భారీ ప్రభావం చూపుతోంది. అమెరికా బాండ్లపై రాబడులు గతవారం రోజుల్లో 18 బేసిస్ పాయింట్లు పెరిగి 4 శాతానికి పైగా చేరుకున్నాయి. యూఎస్ డిసెంబర్ పేరోల్ డేటా అంచనాలకు మించి నమోదవడం ‘ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ వాదనలకు బలాన్నివ్వొచ్చు. కావున ప్రపంచ పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా లేవు. 5 ట్రేడింగ్ సెషన్లల్లో రూ.4,800 కోట్ల పెట్టుబడులు కొత్త ఏడాది తొలివారంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐలు జనవరి 1–5 తేదీల్లో రూ.4,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారతీయ బలమైన ఆర్థిక వ్యవస్థ పనితీరుపై విశ్వాసం ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. డెట్ మార్కెట్లో అదనంగా మరో రూ.4000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ డేటా వెల్లడించింది. ‘‘అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలతో కొత్త ఏడాదిలోనూ భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ కుమార్ తెలిపారు. ఇదే సమయంలో (జనవరి 1–5 తేదీల్లో) సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.7,296 కోట్ల ఈక్విటీలు విక్రయించారు. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. డెట్ మార్కెట్లో రూ.68,663 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
జీఎస్టీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు డిసెంబర్లో రూ.1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 ఇదే నెలతో పోలిస్తే ఈ విలువ 10 శాతం అధికం. ఏప్రిల్–డిసెంబర్ 2023 మధ్య జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగి రూ.14.97 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో వసూళ్లు సగటున 12 శాతం వృద్ధితో రూ.1.66 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలో తీరిది... ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్ నెలల్లో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు ఒనగూరాయి. జూలై వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు. ఆగస్టు వసూళ్లు రూ. 1.59 లక్షల కోట్లుకాగా, సెప్టెంబర్లో రూ. 1.63 లక్షల కోట్ల జీఎస్టీ రాబడి నమోదయ్యింది. ఇక అక్టోబర్ విషయానికి వస్తే. వసూళ్లు భారీగా రూ.1.72 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలైలో ప్రారంభం తర్వాత ఇవి రెండవ భారీ స్థాయి వసూళ్లు (2023 ఏప్రిల్ తర్వాత). నవంబర్లో వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు. ఎకానమీ క్రియాశీలత, పన్నుల ఎగవేతలను అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు, వసూళ్ల వ్యవస్థలో సామర్థ్యం పెంపు, పండుగల డిమాండ్ జీఎస్టీ భారీ వసూళ్లకు కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న నెలల్లో సైతం ఇదే ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం ఆదాయం రూ.1,64,882 ఇందులో సీజీఎస్టీ రూ.30,443 ఎస్జీఎస్టీ రూ.37,935 ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 84,255 సెస్ రూ.12,249 -
పోటెత్తిన ఎఫ్పీఐల పెట్టుబడులు...
విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో ఇప్పటికి వరకు (1–22 తేదీల మధ్య) రూ. 57,300 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎఫ్పీఐల పెట్టుబడుల్లో ఇదే గరిష్టం. ‘‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ గెలుపొందడం+తో బలమైన ఆరి్థక వృద్ధి, రాజకీయ సుస్థిరత ఏర్పడొచ్చనే ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ స్థిరంగా తగ్గుతోంది. ఈ పరిణామాలు ఎఫ్ఐఐల కొనుగోళ్లను ప్రేరేపించాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలతో కొత్త ఏడాదిలోనూ భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ కుమార్ తెలిపారు. ఈ ఏడాదిలో మొత్తంగా భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐల పెట్టుబడులు రూ.1.62 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. ఇక డెట్ మార్కెట్లోకి డిసెంబర్ నెలలో రూ. 15,545 కోట్ల ఎఫ్పీఐ నిధులు వచ్చి చేరాయి. గత నెలలో రూ.14,860 కోట్లు, అక్టోబర్లో 6,381 కోట్ల నిధులు వచ్చాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్తో పాటు ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, టెలికం రంగాల్లో ఎఫ్పీఐ పెట్టుబడులు ఎక్కువగా పెట్టుబడి పెట్టారని గణాంకాలు చెబుతున్నాయి. -
గోవా విముక్తికి భారత్ ఏం చేసింది?
మన దేశంలో గోవా విమోచన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 19న నిర్వహిస్తుంటారు. దేశంలోని అందమైన బీచ్లు కలిగిన రాష్ట్రం గోవా. నైట్ లైఫ్కు గోవా ప్రసిద్ధి చెందింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, అనేక రాచరిక రాష్ట్రాలు విదేశీ శక్తుల చేతుల్లో ఉండేవి. ఇటువంటి రాష్ట్రాల్లో గోవా ఒకటి. భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించింది. అయితే గోవా రాష్ట్రం అప్పటికి పోర్చుగీసు ఆధీనంలో ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 14 సంవత్సరాల తర్వాత 1961 డిసెంబర్ 19న గోవా భారతదేశంలో చేరింది. నాటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 19ని గోవా విమోచన దినంగా జరుపుకుంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాటి ప్రభుత్వం, ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.. గోవా స్వాతంత్ర్యం కోసం అనేక సార్లు చర్చలు జరిపారు. అయితే పోర్చుగీస్.. గోవాకు విముక్తి కల్పించేందుకు ఏమాత్రం అంగీకరించలేదు. పోర్చుగీస్తో చర్చలు విఫలమైన తరువాత భారత ప్రభుత్వం గోవా స్వాతంత్ర్యం కోసం ‘ఆపరేషన్ విజయ్’ ప్రారంభించింది. గోవాకు విముక్తి కల్పించేందుకు 30 వేల మంది సైనికులతో కూడిన బృందాన్ని భారత్ యుద్ధరంగంలోకి దించింది. మూడు వేలమంది పోర్చుగీస్ సైనికులపై భారత వైమానిక దళం, నేవీ, ఆర్మీ దాడి చేశాయి. ఈ దాడి కేవలం 36 గంటలపాటు కొనసాగింది. దీంతో పోర్చుగీస్ బేషరతుగా గోవాపై నియంత్రణను వదులుకోవాలని నిర్ణయించుకుంది. ఈ దాడి తరువాత గోవా.. భారతదేశంలో చేరి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. అయితే 1987, మే 30న గోవాకు భారత్ పూర్తి రాష్ట్ర స్థాయి హోదాను కల్పించింది. నాటి నుండి ప్రతీ ఏటా మే 30ని గోవా వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.70 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు డిసెంబర్ 17వ తేదీ నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగి రూ.13,70,388 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) వాటా రూ.6.95 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ), సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వాటా రూ.6.73 లక్షల కోట్లు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన సమాచారం ప్రకారం, 2023–24 బడ్జెట్ లక్ష్యాల్లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 75 శాతానికి చేరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.63 లక్షల కోట్లు. 2023–24లో ఈ లక్ష్యాన్ని రూ.18.23 లక్షల కోట్లుగా బడ్జెట్ నిర్దేశించుకుంది. రిఫండ్స్ రూ.2.25 లక్షల కోట్లు.. కాగా, డిసెంబర్ 17 వరకూ రిఫండ్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు. వీటిని కూడా కలుపుకుంటే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.15.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.7.90 లక్షల కోట్లు, ఎస్టీటీసహా వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.8.03 లక్షల కోట్లు. వేర్వేరుగా వసూళ్లను పరిశీలిస్తే... అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు రూ.6.25 లక్షల కోట్లు, టీడీఎస్ రూ.7.71 లక్షల కోట్లు, సెల్ప్–అసెస్మెంట్ ట్యాక్స్ రూ.1.49 లక్షల కోట్లు. రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్ రూ. 36,651 కోట్లు. ఇతర హెడ్స్ కింద వసూళ్ల మ్తొతం రూ.14,455 కోట్లు. లక్ష్యాల సాధనపై భరోసా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. పరోక్ష పన్నుల (వస్తు సేవల పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్) వసూళ్ల లక్ష్యం రూ.15.38 లక్షల కోట్లు. వెరసి మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 33.61 లక్షల కోట్లు. ఈ స్థాయి పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, డిసెంబర్ 17 వరకూ ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 21 శాతం పెరిగాయి. పరోక్ష పన్ను దాదాపు 5 శాతం అధికంగా నమోదయ్యాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల మొత్తం రూ.30.54 లక్షల కోట్లు. 2023–24లో దీనిని 10 శాతం (రూ.33.61 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యాన్ని బడ్జెట్ నిర్దేశించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్సభలో ఓట్ ఆన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. లోక్సభకు ఎన్నికల అనంతరం కొలువుదీరే నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. -
ఎఫ్పీఐల దూకుడు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత ఈక్విటీల పట్ల దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు సాగిస్తూ వచ్చిన ఎఫ్పీఐలు, ఈ నెలలో మాత్రం భారీ పెట్టుబడులకు మొగ్గు చూపించారు. డిసెంబర్ నెలలో మొదటి ఆరు ట్రేడింగ్ రోజుల్లో (8వ తేదీ నాటికి) ఏకంగా రూ.26,505 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండడం, మూడు రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ మెజారిటీ సాధించడంతో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగుతుందన్న స్పష్టత ఎఫ్పీఐల్లో సానుకూలతకు దారితీసింది. అక్టోబర్ నెలలోనూ ఎఫ్పీఐలు నికరంగా రూ.9,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు ఆగస్ట్, సెపె్టంబర్ నెలలో రూ.39,300 కోట్ల మేర పెట్టుబడులను వారు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఇక మీదట ఎఫ్పీఐల పెట్టుబడులు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందన్న సంకేతాల ఫలితమే ఎఫ్పీఐల పెట్టుబడులు భారీగా రావడానికి కారణమని ఫిడెల్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వ్యవస్థాపకుడు కిస్లే ఉపాధ్యాయ పేర్కొన్నారు. ‘‘2024 సాధారణ ఎన్నికల అనంతరం రాజకీయ స్థిరత్వం, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యోల్బణం తగ్గడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ స్థిరంగా తగ్గుతూ వస్తుండడం, బ్రెండ్ క్రూడ్ ధరల్లో దిద్దుబాటు భారత్కు అనుకూలించే అంశాలు’’అని విజయ్ కుమార్ వివరించారు. వీటిల్లో పెట్టుబడులు ‘‘వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నుంచి రేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకేతం ఇవ్వడం, అధిక వడ్డీ రేట్ల వాతావరణం నుంచి మళ్లనున్నట్టు సూచించడమే అవుతుంది. దీంతో ఇతర కరెన్సీలతో యూఎస్ డాలర్ బలహీనపడడం మొదలైంది’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ క్షీణించడంతో ఎఫ్పీఐలు భారత ఈక్విటీల్లో ఉన్న రిస్్క–రాబడుల తీరును తిరిగి మదించడానికి దారితీసినట్టు చెప్పారు. బ్యాంకులు, ఐటీ, టెలికం, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో ఎఫ్పీఐల కొనుగోళ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటి వరకు ఎఫ్పీఐలు ఈక్విటీల్లో రూ.1.31 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్లో రూ.55,867 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
జపాన్లో దీపావళిని పోలిన పండగ ఉంది తెలుసా!
మన దీపావళి ఇటీవలే జరిగింది. అచ్చం మన దీపావళిని పోలిన పండుగనే జపానీయులు కూడా ఏటేటా జరుపుకొంటారు. ఈ పండుగ పేరు ‘చిచిబు యమాత్సురి’– అంటే రాత్రి వేడుక అని అర్థం. దాదాపు మూడు శతాబ్దాలుగా జపానీయులు ఈ పండుగను జరుపుకొంటూ వస్తున్నారు. ఇది రెండు రోజుల పండుగ. ప్రతి ఏటా డిసెంబర్ 2, 3 తేదీల్లో జపాన్ ప్రజలు ఘనంగా ఈ పండుగను జరుపుకొంటారు. ఒకుచిచిబు పర్వతసానువుల దిగువన ఉండే చిచిబు పట్టణంలో ఈ వేడుకలు జరుగుతాయి. రాజధాని టోక్యో సహా వివిధ నగరాలు, పట్టణాలకు చెందిన ప్రజలు ఇక్కడకు చేరుకుని, ఘనంగా పండుగ చేసుకుంటారు. సాయంత్రం చీకటి పడుతూనే ప్రార్థన మందిరాలను, ఇళ్లను సంప్రదాయబద్ధమైన లాంతరు దీపాలతో అలంకరిస్తారు. వీథుల్లో ఊరేగింపులు జరుపుతారు. ప్రార్థన మందిరాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పండుగ మొదటి రోజున ప్రార్థనలు, విందు వినోదాలతో గడుపుతారు. రెండోరోజైన డిసెంబర్ 3న రాత్రి వేళ ఇళ్లను, ప్రార్థన మందిరాలను లాంతరు దీపాలతో అలంకరించి, భారీ ఎత్తున బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకల్లో చిచిబు పట్టణం బాణసంచా కాల్పులతో హోరెత్తుతుంది. ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే బాణసంచా మెరుపులు కనిపిస్తాయి. రంగు రంగుల తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వంటి బాణసంచా కాల్పుల్లో పిల్లలూ పెద్దలూ అంతా ఉత్సాహంగా పాల్గొంటారు. చిచిబు పట్టణంలోని ప్రధాన ప్రార్థన మందిరమైన చిచిబు మందిరంలో ఈ వేడుకలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. ఈ మందిరం రాత్రివేళ దీపకాంతులతో ధగధగలాడిపోతుంది. వేలాది మంది జనాలు ఇక్కడకు చేరుకుని, బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ మందిరం నుంచి కలపతో తయారు చేసిన రథాల వంటి ‘యతాయి’ వాహనాలను దీపాలతో అలంకరించి వీథుల్లో ఊరేగిస్తూ బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. (చదవండి: అక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమే! అణు రియాక్టర్ పేలుడు ఏదీ సంభవించలేదు కానీ..!) -
ఓటీటీలో 37 సినిమాలు/ సిరీస్లు.. ఓ పట్టు పట్టేయండి మరి!
ఓటీటీలకు గిరాకీ పెరిగిపోయింది. అటు థియేటర్లో రిలీజైన సినిమాలను, ఇటు సొంతంగా సినిమాలు, సిరీస్లు నిర్మిస్తూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు ట్రెండ్కు తగ్గట్లుగా విభిన్న కంటెంట్తో సినీప్రియులను ఆకర్షిస్తున్నాయి. 2023కి ముగింపు పలకడానికి ఇంకా ఒక్క నెల మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ ఏడాదికిగానూ ఎక్కువ పాపులర్ అయిన సిరీస్లు ఇవే అని ఐఎమ్డీబీ ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో ఫర్జి, గన్స్ అండ్ గులాబ్స్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లు టాప్ 3లో వరుసగా చోటు దక్కించుకున్నాయి. కోహ్రా, అసుర్ 2 నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. రానా నాయుడు ఆరో స్థానంలో ఉండగా దహాద్, సాస్, బహు ఔర్ ఫ్లెమింగో, స్కూప్, జూబ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటికి పోటీనిచ్చేందుకు కొత్త సినిమాలు, సిరీస్లు రిలీజ్కు రెడీ అయ్యాయి. మరి డిసెంబర్ నెలలో ఓటీటీలోకి వచ్చే చిత్రాలు, సిరీస్లేంటో చూసేద్దాం... అమెజాన్ ప్రైమ్ ► క్యాండీ కేన్ లేన్ - డిసెంబర్ 1 ► మేరీ లిటిల్ బ్యాట్మెన్ - డిసెంబర్ 8 ► యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ - డిసెంబర్ 8 ► రేచర్ 2 - డిసెంబర్ 15 హాట్స్టార్ ♦ ద షెఫర్డ్ - డిసెంబర్ 1 ♦ మాన్స్టర్ ఇన్సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ - డిసెంబర్ 1 ♦ ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ - డిసెంబర్ 1 ♦ ద ఫ్రీలాన్సర్: ద కన్క్లూజన్ - డిసెంబర్ 15 ♦ బీటీఎస్ మోనమెంట్స్: బియాండ్ ద స్టార్స్ - డిసెంబర్ 20 ♦ పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలంపియన్స్ - డిసెంబర్ 20 నెట్ఫ్లిక్స్ ► మే డిసెంబర్ - డిసెంబర్ 1 ► మిషన్ రాణిగంజ్ - డిసెంబర్ 1 ► స్వీట్ హోమ్ 2 - డిసెంబర్ 1 ► ద ఆర్చీస్ - డిసెంబర్ 7 ► మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ - డిసెంబర్ 7 ► జిగర్తాండ డబుల్ ఎక్స్ - డిసెంబర్ 8 ► లీవ్ ద వరల్డ్ బిహైండ్ - డిసెంబర్ 8 ► ద క్రౌన్ సీజన్ 6, రెండో భాగం - డిసెంబర్ 14 ► చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ యానిమేట్ ఫిలిం - డిసెంబర్ 15 ► ట్రెవర్ నోవా: వేర్ వాస్ ఐ - డిసెంబర్ 19 ► మాస్ట్రో - డిసెంబర్ 20 ► రెబల్ మూన్: ద చైల్డ్ ఆఫ్ ఫైర్ - డిసెంబర్ 22 ► జియోంగ్సియోంగ్ క్రియేచర్ సీజన్ 1 పార్ట్ 1 - డిసెంబర్ 22 ► కర్రీ అండ్ సైనేడ్: ద జెల్లీ జోసెఫ్ కేస్ డాక్యుమెంటరీ - డిసెంబర్ 22 ► రిక్కీ జెర్వాయిస్: అర్మగెడాన్ - డిసెంబర్ 25 ► మనీ హెయిస్ట్ బెర్లిన్ - డిసెంబర్ 29 లయన్స్ గేట్ ప్లే ♦ డిటెక్టివ్ నైట్: రోగ్ - డిసెంబర్ 1 జియో సినిమా ► 800 (సినిమా) - డిసెంబర్ 2 ► జర హట్కే జర బచ్కే - డిసెంబర్ 2 ► స్మోదర్డ్ - డిసెంబర్ 8 ► స్కూబీ డూ అండ్ క్రిప్టో టూ - డిసెంబర్ 10 ► ద బ్లాకెనింగ్ - డిసెంబర్ 16 ► ఆస్టరాయిడ్ సిటీ - డిసెంబర్ 25 సోనీలివ్ ♦ చమక్ సిరీస్ - డిసెంబర్ 7 జీ5 ► కడక్ సింగ్ - డిసెంబర్ 8 ► కూసే మునిస్వామి వీరప్పన్ - డిసెంబర్ 8 యాపిల్ టీవీ ♦ ద ఫ్యామిలీ ప్లాన్ - డిసెంబర్ 15 చదవండి: ఆ కంటెస్టెంట్ చేతికి ఫినాలే అస్త్ర.. ఎలిమినేషన్ గండం గట్టెక్కితేనే టాప్ 5లోకి -
అమెరికాలోనే హెచ్–1బీ వీసాల రెన్యూవల్
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులకు అమెరికా స్టేట్ ఫర్ వీసా సరీ్వసెస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ జూలీ స్టఫ్ట్ శుభవార్త చెప్పారు. హెచ్–1బీ వీసాల రెన్యూవల్ (స్టాంపింగ్) కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని, అమెరికాలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ నుంచి మూడు నెలలపాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని కేటగిరీల్లో హెచ్–1బీ వీసాలకు డొమెస్టిక్ రెన్యూవల్ ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో భారత ఐటీ నిపుణులు హెచ్–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాజా నిర్ణయంతో వీరికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వ్యయ ప్రయాసలు తప్పుతాయి. అయితే, తొలి దశలో 20,000 మందికే ఈ వెసులుబాటు కలి్పంచనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత దశల వారీగా మరికొంతమందికి అవకాశం కలి్పస్తారు. డిసెంబర్ నుంచి మూడు నెలల్లోగా హెచ్–1బీ వీసా గడువు ముగిసేవారు వీసా రెన్యూవల్ (స్టాంపింగ్)ను అమెరికాలోనే చేసుకోవచ్చు. అమెరికా వీసాలకు భారత్లో భారీ డిమాండ్ ఉందని జూలీ స్టఫ్ట్ గుర్తుచేశారు. వీసా కోసం కొన్ని సందర్భాల్లో ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వస్తోందని చెప్పారు. భారతీయులకు సాధ్యమైనంత త్వరగా వీసా అపాయింట్మెంట్లు ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. ఇందులో ఒక మార్గంగా డొమెస్టిక్ వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. దీనివల్ల భారతీయ టెకీలకు లబ్ధి కలుగుతుందన్నారు మనవారికి 1.4 లక్షల వీసాలు 2022లో భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో 1.4 లక్షలకుపైగా వీసాలు జారీ చేసినట్లు స్టఫ్ట్ వెల్లడించారు. అమెరికా వర్సిటీల్లో తరగతుల ప్రారంభానికి ముందే భారత్లో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేయడానికి సిబ్బంది కొన్నిసార్లు వారమంతా పనిచేస్తున్నారని తెలిపారు. -
హైదరాబాద్లో వైజాగ్
యాక్షన్ మోడ్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు హీరో వరుణ్ తేజ్. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. వైర ఎంటర్టైన్ మెంట్స్పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్కి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ‘‘దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. 24 ఏళ్ల వ్యవధిలో (1958 –1982) జరిగే ఈ సినిమాలో వరుణ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నారు. 1950, 1980 నాటి వాతావరణాన్ని తలపించేలా భారీ సెట్స్ను రూపొందిస్తున్నాం. హైదరాబాద్లో ఓల్డ్ వైజాగ్ సిటీని క్రియేట్ చేసేందుకు ఓ భారీ సెట్ను నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు నలుగురు ఫైట్ మాస్టర్స్ వర్క్ చేస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్కుమార్. -
ఏటా 10 శాతం చొప్పున జీవితాంతం
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు నుంచి నాలుగు వరకు నూతన పాలసీలను ఆవిష్కరించనుంది. నూతన వ్యాపార ప్రీమియంలో రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ‘‘గతేడాదితో పోలిస్తే రెండంకెల వృద్ధిని సాధిస్తాం. ఎందుకంటే ఇండివిడ్యువల్ రిటైల్ వ్యాపారం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆకర్షణీయమైన కొత్త పాలసీలను ఆవిష్కరించనున్నాం’’అని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఎల్ఐసీ ఒక ఉత్పత్తిని తీసుకువస్తుందని వెల్లడించారు. దీనితో మార్కెట్లో మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్లో తెచ్చే నూతన పాలసీ గురించి వివరిస్తూ.. పాలసీ మెచ్యూరిటీ తర్వాత (గడువు ముగిసిన అనంతరం) జీవితాంతం ఏటా సమ్ అష్యూర్డ్లో (బీమా కవరేజీలో) 10 శాతం చొప్పున లభిస్తుందని తెలిపారు. ఇది మార్కెట్లో సంచలనాన్ని సృష్టిస్తుందన్నారు. 20–25 ఏళ్ల తర్వాత ఎంత చొప్పున వస్తుంది, ఎంత ప్రీమియం చెల్లించాలన్నది తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నారు. ఈ ప్లాన్పై రుణ సదుపాయం, ముందస్తు ఉపసంహరణకూ అవకాశం ఉంటుందన్నారు. హామీతో కూడిన రాబడులు ఇచ్చే పాలసీలకు పాలసీదారులు, వాటాదారులు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతూ.. తమ కంపెనీ వాటాదారుల్లో చాలా మంది పాలసీదారులుగా ఉన్నట్టు మహంతి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) నూతన వ్యాపార ప్రీమియం (ఇండివిడ్యువల్) 2.65 శాతమే వృద్ధి చెంది రూ.25,184 కోట్లకు చేరుకోవడం గమనార్హం. -
డిసెంబర్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు !
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ రెండో వారంలో మొదలవుతాయని సమాచారం. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయని, డిసెంబర్ 25న క్రిస్మస్కు ముందు ముగుస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో స్టాండింగ్ కమిటీ ఇటీవలే ఆమోదించిన కొత్త చట్టాలు ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్నాయి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు సైతం పార్లమెంటు వద్ద పెండింగ్లో ఉంది. శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ మూడో వారంలో మొదలై క్రిస్మస్ ముందు ముగియడం ఆనవాయితీగా వస్తోంది. -
డిసెంబర్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది డిసెంబర్లో 4జీ సేవలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ముందుగా పరిమిత స్థాయిలో మొదలుపెట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్లో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు తెలిపారు. జూన్ తర్వాత 4జీ సర్వీసులను 5జీకి అప్గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. ‘డిసెంబర్లో పంజాబ్లో 4జీ సేవల ను ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధంగా ఉంది. 200 సైట్లలో నెట్వర్క్ సిద్ధంగా ఉంది. 3,000 సైట్లను ఇన్స్టాల్ చేసే ప్రక్రియలో ఉన్నాం‘ అని పుర్వార్ చెప్పారు. నెట్వర్క్ను క్రమంగా నెలకు 6,000 సైట్లతో మొదలుపెట్టి ఆ తర్వాత 15,000 సైట్ల వరకు పెంచుకోనున్నట్లు తెలిపారు. మొత్తం మీద 2024 జూన్ నాటికి 4జీ విస్తరణ పూర్తి చే యాలని నిర్దేశించుకున్నట్లు పుర్వార్ పేర్కొన్నారు. -
డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న జరుగుతాయి. దీనికి సంబంధించి నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత నవంబర్ 22న తుది అభ్యర్థుల జాబితా(ఫారం–7ఏ) ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఓట్లు లెక్కించి ఫలితాల ప్రకటిస్తారు’.. రాష్ట్ర శాసనసభ ఎన్నికల కసరత్తులో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం రూపొందించుకున్న ఓ తాత్కాలిక ఎన్నికల షెడ్యూల్ మాత్రమే ఇది. దీనిని అనుసరించే ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ కార్యక్రమాలకు గడువు కూడా నిర్దేశించారు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీని ముద్రించి కార్యాలయ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచారు. రాష్ట్ర శాసనసభకు 2018లో జరిగిన సాధారణ ఎన్నికల షెడ్యూల్ సైతం ఇదే కావడం గమనార్హం. అయితే కొన్నిరోజులు అటుఇటుగా ఇదే షెడ్యూల్తో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. వాస్తవానికి తెలంగాణతోసహా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నిర్వహణకు అక్టోబర్ తొలివారం లేదా ఆ తర్వాత ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన కేంద్ర ఎన్నికలసంఘం ఫుల్ బెంచ్ అక్టోబర్ 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఆ తర్వాత వాస్తవ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. ఇదీ ఎన్నికల సంఘం వర్క్ కేలండర్ నిర్దిష్ట తేదీలు/గడువులతో వచ్చే అక్టోబర్ టు డిసెంబర్ వరకు రోజువారీగా చేయాల్సిన కార్యాక్రమాలతో ఎన్నికల సంఘం ఓ కేలండర్ రూపొందించింది. అక్టోబర్లోగా ఈ పనులు పూర్తవ్వాలి ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్లకు ప్రథమస్థాయి తనిఖీలు పూర్తయ్యాయి. ఎన్నికల సామగ్రి సమీకరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్ ఎంపిక, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన/నిర్థారణ, దర్యాప్తు సంస్థల నోడల్ అధికారులు/సహాయ వ్యయ పరిశీలకులు/ వ్యయ పర్యవేక్షణ బృందాలు/ రిటర్నింగ్ అధికారులు/సెక్టార్ అధికారులకు వేర్వేరుగా శిక్షణ, జిల్లాలకు నిధుల కేటాయింపు, అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన ధరల ఖరారు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్/స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్స్/వీడియో సర్వేలియన్స్ టీమ్ల ఏర్పాటు తదితర పనులన్నీ వచ్చే అక్టోబర్నెలలోగా పూర్తి చేయాలని సీఈఓ కార్యాలయం నిర్దేశించుకుంది. నవంబర్లో.. నవంబర్లో వివిధ స్థాయిల్లోని పోలీసు అధికారులకు శిక్షణ, పోలింగ్ సిబ్బందికి నియామక ఆదేశాల జారీ, సోషల్ మీడియాపై పర్యవేక్షణ, ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్, వ్యయ పరిశీలకులకు శిక్షణ, పోలింగ్ కేంద్రాల ప్రకటన, వికలాంగులు/80 ఏళ్లకు పైబడిన వయో వృద్ధులైన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు హక్కు కల్పించడానికి ఫారం 12డీ దరఖాస్తుల స్వీకరణ, సీ–విజిల్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల స్వీకరణ, పెయిడ్ వార్తలపై సమీక్ష, ఎన్నికల్లో వినియోగించేందుకు సమీకృత ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్/కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, బ్యాలెట్ పత్రాల ముద్రణ, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ, ఈవీఎంలకు రెండో ర్యాండమైజేషన్ నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ల పంపిణీ/స్వీకరణ తదితరాలన్నీ పూర్తి చేయాలి. డిసెంబర్లో.. డిసెంబర్ నెలలో పోలింగ్ సిబ్బందికి తుదిశిక్షణ, పోలింగ్ కేంద్రాలకు రవాణా సదుపాయ కల్పన, పోలింగ్కు 48 గంటల ముందు మద్యం అమ్మకాలపై నిషేధం, పోలింగ్, కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలి. -
ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు
గౌహతి: డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. టిన్సుకియాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ వచ్చే 45 రోజుల్లో ఈ బిల్లును సిద్ధం చేసి డిసెంబర్ సమావేశాల్లో ప్రవేశపెడతామని అన్నారు. లీగల్ కమిటీ.. శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ అసోం ప్రభుత్వం బహుభార్యత్వం బిల్లును సీరియస్గా తీసుకుందని దీనిపై ఒక లీగల్ కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. బహుభార్యత్వాన్ని నిషేధించడంలో సాధ్యాసాధ్యాలు గురించి అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని సూచించినట్లు తెలిపారు. ప్రజాభిప్రాయం కూడా.. ఇదే అంశంపై ప్రజాభిప్రాయాలను కూడా సేకరించగా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని మొత్తం 149 మంది నుంచి అభిప్రాయసేకరణ చేయగా వారిలో 146 మంది సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మరో ముగ్గురు మాత్రం బహుభార్యత్వాన్ని సమర్ధించినట్లు తెలిపారు. బిల్లును రూపొందించడమే మా తదుపరి కార్యాచరణని అన్నారు. వీలైతే రాష్ట్రంలో లవ్ జిహాద్ను కూడా అంతం చేసే విధంగా ఇదే బిల్లులో మరికొన్ని అంశాలను కూడా చేర్చనున్నామన్నారు. ఈ సందర్బంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు ఉపసంహరించే చట్టం గురించి ప్రస్తావిస్తూ.. అది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమని ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని.. ఈ నెలాఖరులో కేంద్రంతో చర్చించి కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటామని అన్నారు. సాయుధ దళాల ప్రత్యేక చట్టం.. 1958 సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రాంతాల్లో ప్రజా జీవనానికి ఇబ్బంది లేకుండా చేయడానికి పార్లమెంట్ వారికి ఈ అధికారాలను మంజూరు చేసింది. 1972లో ఈ చట్టాన్ని సవరిస్తూ ఒకసారి ఇబ్బందికరమైన ప్రాంతమని ప్రకటించాక అక్కడ కనీసం మూడు నెలల పాటు విధులు నిర్వర్తించేందుకు సాయుధ దళాలకు ప్రత్యేక అధికారముంటుంది. #WATCH | On banning polygamy in the state, Assam CM Himanta Biswa Sarma says "A legal committee was formed to check if polygamy can be banned by the state govt or not. Later, we asked the public for their opinion if they had any objections. We received a total of 149 suggestions… pic.twitter.com/ZC9U2TNSQQ — ANI (@ANI) September 3, 2023 ఇది కూడా చదవండి: సరదా సన్నివేశం.. రాహుల్కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ -
డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రైతులెవ్వరూ బ్యాంకులకు ఒక్క రూపాయి కట్టవద్దని, ఈ ఏడాది డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలంగాణలో ఏర్పడే ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో కొల్లాపూర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, పార్లమెంటులో నోరు తెరవకపోయినా కేసీఆర్ను పాలమూరు జిల్లా భుజాలపై మోసిందని, అయినా పాలమూరు ప్రజలను కేసీఆర్ వంచించారని విమర్శించారు. పాలమూరు ప్రజానీకం ఈసారి జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి కాంగ్రెస్ను గెలిపించే బాధ్యత తీసుకోవాలని, పాలమూరులో 14కు 14 స్థానాలు గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్కు 100 స్థానాలు ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన తిరిగి ప్రతి తలుపు తట్టాలని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రూ.500కే మహిళలకు వంటగ్యాస్ సిలెండర్ అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. -
పవర్ఫుల్ పోలీస్
సీహెచ్వీ సుమన్ బాబు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గిద్దలూరు పోలీస్స్టేషన్ ’. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రోడక్షన్స్ పై ఈ మూవీ రూపొందుతోంది. సుమన్ బాబు మాట్లాడుతూ– ‘‘చట్టం ఎవరి చుట్టం కాదు. కర్తవ్యమే ప్రాణం అని నిరూపించిన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథే ‘గిద్దలూరు పోలీస్స్టేషన్ ’. అందరూ ఆలోచించే కథ, కథనం ఉంటుంది. ఆగస్ట్ 15న మా సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తాం. డిసెంబరులో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్ పులిగిల్ల, కెమెరా: గణేష్, లైన్ ప్రోడ్యూసర్: అబ్దుల్ రెహమాన్ . -
పెద్ద పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో 11 శాతం పెరిగినట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏడు పట్టణాల్లో 149 మిలియన్ చదరపు అడుగులు (ఎంఎస్ఎఫ్) అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. గత పదేళ్లలో ఒక త్రైమాసికం వారీ అత్యధిక విక్రయాలు ఇవేనని పేర్కొంది. డిమాండ్ మెరుగ్గా ఉండడమే వృద్ధికి మద్దతునిచ్చినట్టు తెలిపింది. 2022–23 మొదటి తొమ్మిది నెలల్లో (2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) ఈ ఏడు ప్రధాన పట్టణాల్లో 412 ఎంఎస్ఎఫ్ అడుగుల ఇళ్లను విక్రయించినట్టు ఇక్రా తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల్లో విక్రయాలు 307 ఎంఎస్ఎఫ్తో పోలిస్తే 30 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. కరోనా మహమ్మారి తర్వాత కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో మార్పు వచ్చిందంటూ.. లగ్జరీ, మధ్య స్థాయి ధరల ఇళ్ల వాటా పెరిగినట్టు వివరించింది. 2019–20లో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతం, మధ్యస్థాయి ధరల ఇళ్ల వాటా 36 శాతం చొప్పున ఉంటే.. 2022–23 ఏప్రిల్–డిసెంబర్ కాలానికి లగ్జరీ ఇళ్ల అమ్మకాల వాటా 16 శాతానికి పెరిగితే, మధ్యస్థాయి ఇళ్ల విక్రయాల వాటా 42 శాతానికి చేరింది. హైదరాబాద్తోపాటు, చెన్నై బెంగళూరు, కోల్కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, పుణె పట్టణాలకు సంబంధించి ఇక్రా గణాంకాలు విడుదల చేసింది. 2023–24లో 16 శాతం.. ‘‘రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు విలువ పరంగా 2022–23లో 8–12 శాతం మేర వృద్ధి చెందొచ్చు. 2023–24లో 14–16 శాతం మధ్య పెరగొచ్చు’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, కో గ్రూప్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. టాప్–12 డెవలపర్ల ప్రాథమిక గణాంకాల ఆధారంగా వేసిన అంచనాలుగా ఇక్రా పేర్కొంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెరుగుదల గృహ కొనుగోళ్లపై లేదని తెలిపింది. ‘‘కరోనా ముందున్న నాటి రేట్ల కంటే ఇప్పటికీ గృహ రుణాలపై రేట్లు తక్కువే ఉన్నాయి. కనుక కొనుగోలు శక్తి ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. తక్కువ నిల్వలు, డెవలపర్లు తమకు అనుకూలంగా ప్రాజెక్టులు ప్రారంభించడం, ఉద్యోగ మార్కెట్లో మందగమనం, వడ్డీ రేట్లు మరింత పెరుగుదల కొనుగోలు శక్తిపై చూపించే అంశాలు’’అని పేర్కొంది. 2022 డిసెంబర్ నాటికి అమ్ముడుపోని ఇళ్ల పరిమాణం 839 ఎంఎస్ఎఫ్గా ఉందని ఇక్రా తెలిపింది. 2021 డిసెంబర్లో విక్రయం కాని ఇళ్లు 923 ఎంఎస్ఎఫ్తో పోలిస్తే తక్కువేనని గుర్తు చేసింది. వార్షికంగా చూస్తే 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం పెరిగినట్టు పేర్కొంది. పెరిగిన నిర్మాణ వ్యయాలను కస్టమర్లకు బదిలీ చేయడమే ధరల పెరుగుదలకు కారణంగా తెలిపింది. -
విదేశాలకు ఆకాశ ఎయిర్
బెంగళూరు: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనుంది. డిసెంబర్ నాటికి పెద్ద ఎత్తున విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో వినయ్ దూబే బుధవారం వెల్లడించారు. ‘ఇప్పటికే 72 విమానాలకు ఆర్డర్ ఇచ్చాం. వీటిలో 18 సంస్థ ఖాతాలో చేరాయి. కొత్తగా ఇవ్వనున్న ఆర్డర్ మూడంకెల స్థాయిలో ఉంటుంది. ఏడాది కాలంలో 300 మంది పైలట్లను నియమించుకుంటాం. బెంగళూరులో లెర్నింగ్ అకాడెమీ స్థాపించనున్నాం. వచ్చే పదేళ్లలో సంస్థకు కనీసం 3,500 మంది పైలట్లు అవసరం అవుతారు’ అని వివరించారు. సిబ్బందిలో మహిళల సంఖ్య 37 శాతం ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది ఆకాశ ఎయిర్ లక్ష్యం. గతంలోనే ఆర్డర్ ఇచ్చిన 72 విమానాలను బోయింగ్ 2027 మార్చి నాటికి డెలివరీ చేయనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆరు నెలలు పూర్తి చేసుకున్న ఆకాశ ఎయిర్ 10 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. హైదరాబాద్, వైజాగ్తోసహా 14 నగరాల్లో సేవలు అందిస్తోంది. 2023 ఆగస్ట్ నాటికి వారంలో 1,000 సర్వీసులు నడపాలని లక్ష్యంగా చేసుకుంది. -
మూడో త్రైమాసికంలో భారత్ వృద్ధి 4.6 శాతం: ఎస్బీఐ అంచనా
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డిసెంబర్ త్రైమాసికంలో 4.6 శాతమన్న అంచనాలను బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంత్ ఘోష్ వెలువరించారు. రెండవ త్రైమాసికంలో ఉన్న ఆశావహ పరిస్థితుల్లో తమ 30 హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు లేవని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో వృద్ధి 4.4 శాతమన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బీఐ) అంచనాలకన్నా ఎస్బీఐ గ్రూప్ ఎకనమిక్ అడ్వైజర్ లెక్కలు అధికంగా ఉండడం గమనార్హం. కాగా, ఆర్థిక సంవత్సరంలో (2022-23) 6.8 శాతం అంచనాలను 7 శాతానికి పెంచుతున్నట్లు ఘోష్ పేర్కొన్నా రు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్లో ఎకానమీ వృద్ధి రేటు 13.5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికానికి ఇది 6.3 శాతానికి పడిపోయింది. 2023-24లో వృద్ధి 5.9శాతం : ఇండియా రేటింగ్స్ కాగా, 2023- 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.9 శాతమని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. -
EPFO: డిసెంబర్లో కార్యాలయాల కళకళ..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డిసెంబర్ 2022లో 14.93 లక్షల మంది కొత్త సభ్యత్వం నమోదయ్యింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది 2 శాతం (32,635 మంది) అధికమని కార్మిక మంత్రిత్వశాఖ 2022 డిసెంబర్కు సంబంధించి విడుదల చేసిన (తొలి) గణాంకాలు పేర్కొన్నాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఈపీఎఫ్ఓలో చేరిన 14.93 లక్షల మందిలో దాదాపు 8.02 లక్షల మంది కొత్త ఉద్యోగులు. వీరు మొదటిసారి సామాజిక భద్రతా వ్యవస్థ– ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చారు. అంటే మొదటిసారి వ్యవస్థాగతమైన ఉపాధిని వీరు పొందారన్నమాట. ► కొత్తగా చేరిన 8.02 లక్షల మందిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులు 2.39 లక్షల మంది. 22–25 సంవత్సరాల మధ్య వారు 2.08 లక్షల మంది. 18 నుంచి 25 సంవ త్సరాల మధ్య వయస్సు కలవారు మొత్తం సంఖ్యలో (8.02 లక్షల మంది) 55.64% మంది. ► సమీక్షా నెల్లో 3.84 లక్షల మంది ఈపీఎఫ్ఓ నుంచి బయటకు వెళ్లగా, 10.74 లక్షల మంది బయ టకు వెళ్లి మళ్లీ కొత్త ఉద్యోగాల్లో చేరారు. తద్వా రా తిరిగి ఈపీఎఫ్ఓలో సభ్యత్వం పొందారు. ఈఎస్ఐసీలోనూ భారీ పెరుగుదల కాగా, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లో కూడా 2022 డిసెంబర్లో కొత్త ఉద్యోగులు 18.03 లక్షల మంది చేరాయి. 2021 డిసంబర్తో పోల్చితే ఈ సంఖ్య 14.52 లక్షలు పెరగడం గమనార్హం. ఈఎస్ఐసీ కింద డిసెంబర్ 2022లో 27,700 కొత్త సంస్థలు రిజిస్టరయ్యాయి. కొత్తగా చేరిన 18.03 లక్షల మంది ఉద్యోగుల్లో 25 సంవత్సరాలపైబడినవారు 8.30 లక్షల మంది. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈఎస్ఐ స్కీమ్లో చేరినవారిలో 80 మంది ట్రాన్స్జెండర్లు. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
India industrial production index: తగ్గిన పారిశ్రామిక వృద్ధి స్పీడ్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 2022 డిసెంబర్లో మందగించింది. సమీక్షా నెల్లో ఇందుకు సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. నవంబర్లో ఈ రేటు 7.3 శాతం. మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు, డిమాండ్కు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ రంగాల పేలవ పనితీరు డిసెంబర్ గణాంకాలపై పడినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెలువరించిన లెక్కలు పేర్కొంటున్నాయి. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల రంగం ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం కూడా వృద్ధి (5.1 శాతం) నుంచి క్షీణతకు (–10.4 శాతం) మారింది. సబ్బులు, షాంపూల వంటి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ రంగంలో వృద్ధి రేటు తగ్గింది. వార్షికంగా పరిశీలిస్తే మాత్రం 2021 డిసెంబర్కన్నా 2022 డిసెంబర్లో పనితీరు మెరుగ్గా ఉండడం ఊరటనిస్తున్న అంశం. అప్పట్లో ఐఐపీ వృద్ధి రేటు కేవలం 1 శాతం మాత్రమే. 9 నెలల్లో ఇలా... మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్– డిసెంబర్) ఐఐపీ 5.4 శాతం పురోగమించగా, 2021 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 15.3 శాతంగా ఉంది. 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి ఈ వృద్ధి రేటు 5.5 శాతం -
ఆదిత్య బిర్లా లాభం 94 శాతం డౌన్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కన్సాలిడేటెడ్ లాభం డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు, 94 శాతం తగ్గిపోయి రూ.11 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.197 కోట్లుగా ఉంది. ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.3,589 కోట్లకు చేరింది. ప్రధానంగా మార్కెటింగ్ వ్యయాలు, వ్యూహాత్మక పెట్టుబడులు రెండు రెట్లు పెరగడం నికర లాభం తగ్గిపోయేందుకు కారణమైనట్టు సంస్థ తెలిపింది. వ్యయాలు 31 శాతం పెరిగి రూ.3,603 కోట్లుగా ఉన్నాయి. మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్స్టయిల్ విభాగం ఆదాయం 24 శాతం పెరిగి రూ.2,466 కోట్లుగా ఉంటే, ప్యాంటలూన్స్ ఆదాయం 9 శాతం పెరిగి రూ.1,159 కోట్లుగా ఉంది. తన బ్రండెడ్ అవుట్లెట్లను 245 వరకు పెంచుకుంది. -
Collegium Controversy: ఇబ్బందికరంగా కేంద్రం తీరు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గత డిసెంబర్లో కొలీజియం సిఫార్సు చేసిన ఐదు పేర్లను త్వరలో ఆమోదించనున్నట్టు కేంద్రం పేర్కొంది. రాజస్తాన్, పట్నా, మణిపూర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్కరోల్, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్తో పాటు పట్నా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అష్నదుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రా వీరిలో ఉన్నారు. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్లో పె డుతున్న వైనంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనానికి అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి శుక్రవారం ఈ మేరకు సమాచారమిచ్చారు. ‘‘ఆ ఐదు సిఫార్సులు గత డిసెంబర్ 13న చేసినవి. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది’’ అని ధర్మాసనం గుర్తు చేయగా, ఆదివారానికల్లా నియామక ఉత్తర్వులు రావచ్చని బదులిచ్చారు. కోర్టులపై దాడి పరిపాటైంది: జస్టిస్ కౌల్ కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతున్న తీరుపై ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల సిఫార్సు సంగతేమిటని ప్రశ్నించింది. అందుకు ఇంకాస్త సమయం పడుతుందని ఏజీ చెప్పగా మండిపడింది. ‘‘ఇది చాలా చాలా సీరియస్ అంశం. ఈ విషయంలో కేంద్రం వైఖరి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. బదిలీ సిఫార్సులను కూడా పెండింగ్లో పెడితే మేమింకేం చేయాలని మీరు ఆశిస్తున్నట్టు? మీరు ఉత్తర్వులిచ్చే దాకా సదరు న్యాయమూర్తులు చేతులు ముడుచుకుని కూర్చోవాలా? మీరదే కోరుకుంటున్నారా?’’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ‘‘ఈ విషయంలో మేం ఒక వైఖరికి వచ్చి అతి కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. అది అంతిమంగా అందరికీ చాలా అసౌకర్యంగా ఉంటుంది’’ అంటూ ఏజీని హెచ్చరించింది. ‘‘హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల్లో జాప్యాన్ని అస్సలు అనుమతించేది లేదు. ఎందుకంటే ఈ విషయంలో కేంద్రం పాత్ర అతి స్వల్పం. ఈ విషయమై ఎవరో మూడో శక్తి మాతో ఆటలాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోం. మీ జాప్యం వల్ల న్యాయ, పాలనపరమైన విధులకు విఘాతం కలగడం అస్సలు ఆమోదనీయం కాదు’’ అంటూ మండిపడింది. ‘‘హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఒక న్యాయమూర్తి పేరును కొలీజియం సిఫార్సు చేస్తే ఇప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరో 19 రోజుల్లో ఆయన రిటైరవుతున్నారు. సీజే అవకుండానే రిటైరవాలని మీరు ఆశిస్తున్నట్టా?’’ అని నిలదీసింది. ఇది తమ దృష్టిలో ఉందని, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏజీ బదులిచ్చినా సంతృప్తి చెందలేదు. ‘‘కొలీజియం సిఫార్సులను ఒక్కోసారి రాత్రికి రాత్రే ఆమోదిస్తున్నారు. మరికొన్నిసార్లు విపరీతంగా జాప్యం చేస్తున్నారు’’ అంటూ తీవ్రంగా తప్పుబట్టింది. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లనూ పెండింగ్లో పెడుతున్నారని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులపై బయట తీవ్ర దాడికి పాల్పడుతున్నారని మరో న్యాయవాది ఆరోపించగా వీటికి అలవాటు పడిపోయామని జస్టిస్ కౌల్ ఆవేదన వెలిబుచ్చారు. విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు. కొలీజియం విషయమై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడం తెలిసిందే. కొలీజియం సిఫార్సులను కేంద్రం పెండింగ్లో పెట్టడం దాన్ని మరింత పెంచింది. తాజాగా అలహాబాద్, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం జనవరి 31న సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 27 మందే ఉన్నారు. -
జీఎస్టీ వసూళ్లు.. రూ.1.50 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు డిసెంబర్లో 15% పెరుగుదలతో రూ.1,49,507 కోట్లకు చేరాయి. 2021 ఇదే నెలతో (రూ.1.30 లక్షల కోట్లు) పోల్చితే ఈ పెరుగుదల 15 శాతంగా నమోదయ్యింది. తయారీ, వినియోగ రంగాల నుంచి డిమాండ్ పటిష్టంగా ఉందని గణాంకాలు వెల్లడించాయి. వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లను అధిగమించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది వరుసగా 9వ నెల. -
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
న్యూఢిల్లీ: భారత్లో నిరుద్యోగం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. డిసెంబర్లో అత్యధికంగా 8.3% శాతానికి నిరుద్యోగం రేటు ఎగబాకింది. గత 16 నెలల్లో అదే అత్యధికమని సెంటర్ ఫర్ మోనటిరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఒక నివేదికలో తెలిపింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 2022 నవంబర్లో 8.96 ఉంటే, డిసెంబర్ వచ్చేసరికి 10.09 శాతానికి పెరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు నవంబర్లో 7.55% ఉంటే స్వల్పంగా తగ్గి డిసెంబర్ నాటికి 7.44శాతానికి చేరుకుంది. నిరుద్యోగం రేటు అత్యధికంగా హర్యానాలో 37.4% ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ (28.5%), ఢిల్లీ (20.8%) ఉన్నాయి. కేంద్రానికి అతి పెద్ద సవాల్ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం అదుపు చెయ్యడం, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం మోదీ సర్కార్ ముందున్న అతి పెద్ద సవాల్గా ఉంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పాదయాత్రలో కూడా అధిక ధరలు, నిరుద్యోగం సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇలాంటి సమయంలో నిరుద్యోగం రేటు మరోసారి పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమే. అయితే కరోనా భయాలు తొలగిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల భాగస్వామ్యం బాగా పెరిగిందని, ఇది నిజంగానే మంచి విషయమని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ వ్యాస్ చెప్పారు. గత ఏడాది కాలంలో ఉపాధి కార్మికులు భాగస్వామ్యం రేటు పెరిగి డిసెంబర్లో అత్యధికంగా 40.48% నమోదైందని ఆయన వివరించారు. -
New Year Celebrations: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో ..
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని శనివారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుపనున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని వివిధ మెట్రో కారిడార్లలో తెల్లవారు జామున ఒంటిగంటకు ప్రారంభ స్టేషన్ నుంచి చివరి రైలు బయలుదేరి 2 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మరోవైపు వేడుకలను దృష్టిలో ఉంచుకొని మెట్రో స్టేషన్లు, రైళ్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఇళ్లకు చేరుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు... నూతన సంవత్సరం సందర్భంగా కల్వరి టెంపుల్లో జరిగే వేడుకలకు వెళ్లే భక్తుల కోసం శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వివిధ రూట్లలో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ తెలిపారు. నాంపల్లి–లింగంపల్లి, ఫలక్నుమా–లింగంపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. న్యూ ఇయర్ విషెస్ ఇలా తెలియజేయండి మీ సన్నిహితులకు -
ఈక్విటీలపై ఎఫ్పీఐల ఆసక్తి
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల(డిసెంబర్)లో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీలలో నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. అనిశ్చుతులలోనూ రూ. 11,557 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కోవిడ్ ఆందోళనల నేపథ్యంలోనూ దేశీ ఈక్విటీలపట్ల ఆసక్తి చూపారు. అయితే సమీప భవిష్యత్లో యూఎస్ స్థూల ఆర్థిక గణాంకాలు, కోవిడ్ పరిస్థితులు ఎఫ్పీఐ పెట్టుబడులపై ప్రభావం చూపనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ పేర్కొన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం డిసెంబర్ 1–23 మధ్య ఎఫ్పీఐలు నికరంగా రూ. 11,557 కోట్ల విలవైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. కాగా.. గత నెల(నవంబర్)లో ఎఫ్పీఐలు మరింత అధికంగా రూ. 36,200 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! ఇందుకు యూఎస్ డాలరు బలహీనపడటం, స్థూల ఆర్థిక పరిస్థితుల సానుకూలత దోహదం చేశాయి. అయితే అంతకుముందు అంటే అక్టోబర్లో నామమాత్రంగా రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. సెప్టెంబర్లో రూ. 7,624 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. -
ఐదు వారాల తర్వాత ఫారెక్స్ దిగువముఖం
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా ఐదు వారాల పెరుగుదల తర్వాత డిసెంబర్ 16తో ముగిసిన వారంలో తగ్గాయి. డిసెంబర్ 9వ తేదీన 564.06 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫారెక్స్ నిల్వలు 16తో ముగిసిన వారానికి 571 మిలియన్ డాలర్లు తగ్గి 563.499 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తాజా గణాంకాలు వెల్లడించాయి. అక్టోబర్ 2021లో దేశ విదేశీ మారకపు విలువ 645 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే ప్రపంచ పరిణామాలు, ఒత్తిళ్లు, రూపాయిని రక్షించుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ చర్యలతో గరిష్టం నుంచి దాదాపు 100 బిలియన్ డాలర్లు తగ్గి దాదాపు ఒక దశలో 540 బిలియన్ డాలర్ల వరకూ పడ్డాయి. -
ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్కు అదిరే ఆఫర్: పది ఎస్1 ప్రో స్కూటర్లు ఫ్రీ
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్కు ఓలా ఎలక్ట్రిక్ గుడ్ న్యూస్ చెప్పింది.డిసెంబర్ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ టు రిమెంబర్ అంటూ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్పై భారీ తగ్గింపును అందిస్తోంది. అలాగే జీరో డౌన్ పేమెంట్తో పాటు మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. అయితే బేస్ వేరియంట్పై ఈ ఆఫర్ వర్తించదు. అలాగే 10 ఈ స్కూటర్లను ఉచితంగా అందించనుంది. గతంలో అక్టోబర్లోప్రకటించిన ఈ ఆఫర్ను తర్వాత నవంబర్ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆఫర్ను డిసెంబర్ 31 2022 వరకు పొడిగించింది. ఓలా ఎస్1 ప్రోపై డిస్కౌంట్ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్పై రూ.10వేల తగ్గింపును అందిస్తోంది. తద్వారా ఈ స్కూటర్ను రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్)కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.1,39,999. జీరో డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్తో నెలకు కనిష్టంగా రూ.2,499 ఈఎంఐ ఆప్షన్తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేయవచ్చు. 8.99 శాతం వడ్డీరేటుతోపాటు, వెహికల్ ఫైనాన్స్పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది. ఉండదు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా లభ్యం. 10 ఎస్1 ప్రో స్కూటర్లు ఉచితంగా పది ఎస్1 ప్రో స్కూటర్లను కస్టమర్లకు ఉచితంగా అందించేందుకు కాంటెస్టును నిర్వహిస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. లక్ష యూనిట్ల విక్రయాలను అత్యంత వేగంగా సాధించిన సంస్థగా ఓలా అవతరించింది, అలాగే ఈ సెగ్మెంట్లో 50 శాతానికి పైగా ఆదాయ మార్కెట్ వాటాతో వరుసగా 3 నెలలో( నవంబరు) కూడా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్గా కూడా అవతరించింది. కాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు నవంబర్ 2022లో 20,000 యూనిట్లను దాటేశాయని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే విస్తరణలో భాగంగా 11 నగరాల్లో 14 కొత్త ఎక్స్పీరియన్స్ కేంద్రాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. త్వరలోనే మరో 100 సెంటర్లను ప్రారంభించాలని ఓలా భావిస్తోంది. From winning an Ola 🛵, to endless offers while buying it...if there weren’t enough reasons to switch to the Ola S1, here are some more. Own the #1 EV in India and make it a December to remember! 🎁🥳🎄 #EndICEage ⚡️ pic.twitter.com/8aZyqcy9pq — Ola Electric (@OlaElectric) December 5, 2022 -
మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే...!
సాక్షి,ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి డిసెంబరు నెలలో కూడా కొన్ని ఎంపిక చేసిన కార్లపై డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ముఖ్యంగా వచ్చేఏడాది జనవరి నుంచి అన్ని మోడళ్లకార్ల ధరలను పెంచక తప్పదని ఇటీవల ప్రకటించిన తరువాత అందిస్తున్న ఈ తగ్గింపు ధరలకు ప్రాధాన్యత లభిస్తోంది. స్విఫ్ట్, డిజైర్, వవ్యాగన్ ఆర్, సెలెరియో తోపాటు, న్యూజెన్ ఆల్టో, మారుతి అరేనా మోడళ్లపై కొనుగోలు దారులు డిస్కౌంట్ ఆఫర్ను పొందివచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్, క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్లుంటాయి. అలాగే నవంబరు నెలలో మాదిరిగానే ఎర్టిగా ఎమ్పివి. బ్రాండ్-న్యూ బ్రెజ్జా ఎస్యూవీలపై డిస్కౌంట్లు ఉండవు. మారుతి సుజుకి డిసెంబర్ 2022 నెలలో తన అరేనా లైన్ వాహన తగ్గింపును రూ. 52,000 వరకు అందిస్తోంది ఇటీవల విడుదల చేసిన మారుతి సుజుకి ఆల్టో కె10 మాన్యువల్ మోడల్స్పై రూ.52,000 వరకు డిస్కౌంట్. ఏఎంటీ మోడల్స్ రూ. 22వేలు, ఇటీవల విడుదలైన సీఎన్జీ మోడల్ కూడా రూ.45,100 తగ్గింపుతో అందుబాటులో ఉంది. సెలెరియో సీఎన్జీ రూ. 45,100, పెట్రోల్-మాన్యువల్ కార్లపై రూ. 36వేల వరకు తగ్గింపు అందు బాటులో ఉంది. ఏఎంటీ వెర్షన్పై రూ. 21,000 తగ్గింపు లభ్యం. హై ఎండ్ వేరియంట్లపై రూ. 42,000 వరకు తగ్గింపు , బేసిక్ మోడల్స్పై 17వేలు తగ్గింపు అందిస్తోంది. మారుతి మాన్యువల్ ఎస్-ప్రెస్సో వేరియంట్లపై గరిష్టంగా రూ. 46,000, ఏఎంటీ వేరియంట్లు రూ. 20వేలు, సీఎస్జీ వేరియంట్పై రూ. 45,100 తగ్గింపు లభిస్తుంది. అలాగే స్విప్ట్ ఏఎంటీ, మాన్యువల్ మోడల్స్ రెండింటిలోనూ దాదాపు రూ. 32వేలు తగ్గింపు. -
డిజిటల్ బిల్లు ముసాయిదా కమింగ్ సూన్
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా బిల్లు ముసాయిదా డిసెంబర్ ఆఖరు కల్లా సంప్రదింపుల కోసం సిద్ధం కాగలదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వ్యక్తిగతయేతర డేటా యాజమాన్య అధికారాలు, డేటా పోర్టబిలిటీ తదితర అంశాలు కూడా ఇందులో ఉంటాయని ఆయన వివరించారు. సమకాలీనమైనదిగా, అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా చట్టం ఉంటుందని మంత్రి చెప్పారు. 22 ఏళ్ల నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం స్థానంలో కేంద్రం దీన్ని ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం ఇటీవలే డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు ముసాయిదా విడుదల చేసింది. మరోవైపు, ’వేరబుల్స్’ (వాచీలు మొదలైనవి)కి కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వర్తింప చేసే యోచన ఉందని చంద్రశేఖర్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో వేరబుల్స్ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. -
వినియోగదారులకు శుభవార్త: దిగిరానున్న వంట గ్యాస్ ధర
సాక్షి, ముంబై: మరికొన్ని రోజుట్లో వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందనుంది. దేశంలోని సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా గ్యాస్ ధరపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వెలుడుతున్నాయి. దీనికి తోడు తగ్గుతున్న చమురు ధరలు ఈ అంచనాలకు ఊతమిస్తున్నాయి. (షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి?) వంట గ్యాస్ను చౌకగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా సీఎన్జీ, ఎల్పీసీ గ్యాస్ రెండింటి ధరలను తగ్గించే అవకాశం ఉందని అంచనా. గత కొంత కాలంగా కోవిడ్ మహమ్మారి, ఇటీవలి భౌగోళిక రాజకీయ సంక్షోభం గ్యాస్ ధర పెరగడంతో ప్రజలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ ధరల నియంత్రణకు సెప్టెంబరులో ఏర్పాటైన కమిటీ ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. దీని కింద ప్రభుత్వ రంగ సంస్థల పాత సెక్టార్ నుంచి వచ్చే సహజ వాయువు ధర పరిమితిని నిర్ణయించాలని ప్లాన్ చేస్తోంది. ఇది గ్యాస్ కోసం సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు కిరీట్ ఎస్ పరేఖ్ నేతృత్వంలోని కమిటీ నవంబర్ 29న ప్యానెల్ సభ్యులు తమ సిఫార్సులను సమర్పించనున్నారు. ఈ అంచనాలు నిజమైతే సామాన్య ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుంది. (ఉద్యోగులను భారీగా పెంచుకోనున్న కంపెనీ) కాగా ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీలు ధరలను సమీక్షించడం తెలిసిన సంగతే. గత నెలలో కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు తగ్గించిన సంగతి తెలిసిందే. -
December 2022: వచ్చేస్తున్నాయ్.. కల్యాణ ఘడియలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి పెళ్లి కళ రానుంది. మరికొద్ది రోజుల్లో నగరమంతటా బాజాభజంత్రీలు మోగనున్నాయి. మూఢాల కారణంగా మూడు నెలలుగా శుభ కార్యాలు నిలిచిపోయాయి. ఈ నెలాఖరుతో అవి తొలగిపోనున్నాయి. దీంతో డిసెంబరు మొదటి వారం నుంచి పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు. కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు బుక్ అయ్యాయి. మరోవైపు కొంతకాలంగా స్తబ్దత నెలకొన్న మార్కెట్లు సైతం క్రమంగా కళకళలాడుతున్నాయి. డిసెంబరు నెలలో కేవలం 5 ముహూర్తాలే ఉండడంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ మేరకు ఒక్కో ఫంక్షన్ హాల్లో రోజుకు కనీసం రెండు పెళ్లిళ్ల చొప్పున బుక్ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. డిసెంబరు తర్వాత తిరిగి ఫిబ్రవరి వరకు ముహూర్తాలు లేకపోవడంతోనూ డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు పురోహితులు పేర్కొన్నారు. ఉందిలే మంచి ముహూర్తం.. సాధారణంగా కార్తీకమాసంలో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. కానీ.. ఈసారి శుభకార్యాలకు ఎంతో అనుకూలమైన కార్తీక మాసంలో మూఢాలు ఉండడంతో పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు వంటి కార్యక్రమాలు కూడా జరగలేదు. అన్ని రకాల శుభ కార్యక్రమాలను నగరవాసులు వాయిదా వేసుకున్నారు. సెప్టెంబరు 22న మొదలైన మూఢాలు ఈ నెల 27 వరకు ఉన్నాయి. దీంతో అందరూ డిసెంబరు ముహూర్తాల కోసమే ఎదురు చూస్తున్నారు. దృక్ సిద్ధాంతం మేరకు డిసెంబరులో 4, 8, 14, 17, 18వ తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నట్లు ప్రముఖ వేదపండితులు చిర్రావూరి శివరామకృష్ణ తెలిపారు. పూర్వ సిద్ధాంతం ప్రకారం ఈ నెలలో మరికొన్ని అదనపు ముహూర్తాలు కూడా ఉన్నప్పటికీ ఈ అయిదే ముఖ్యమైనవి కావడంతో ఆయా రోజుల్లోనే ఎక్కువ పెళ్లిళ్లు జరగనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో ఎక్కువ శాతం కన్య రాశి, సింహరాశి ముహూర్తాలే ఉన్నాయి. 4వ తేదీ రాత్రి 11.30 గంటలకు, తిరిగి తెల్లవారు జామున ఒంటిగంటకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ►8వ తేదీ గురువారం రాత్రి 11.38 గంటలకు కన్యా లగ్నం, రాత్రి 1.20 గంటలకు నిశీధి ముహూర్తం ఉన్నట్లు పురోహిత వర్గాలు పేర్కొన్నాయి. 14వ తేదీన బుధవారం, మహానక్షత్రం రాత్రి 11.27 గంటలకు మంచి ముహూర్తం ఉంది. 17వ తేదీ రాత్రి హస్తా నక్షత్రం, రాత్రి 11.15 గంటలకు, 18వ తేదీ ఆదివారం చిత్ర నక్షత్రంలో రాత్రి 11.11 గంటలకు,. తిరిగి అర్ధరాత్రి 12.47కు సింహలగ్నం ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత జనవరి 26వ తేదీ వరకు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. తిరిగి ఫిబ్రవరి నెలలోనే మరోసారి బాజాభజంత్రీలు మోగనున్నాయి. దీంతో డిసెంబరు ముహూర్తాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. ►డిసెంబరు నెలలో వేల సంఖ్యలో పెళ్లిళ్ల కోసం సుమారు 10 వేలకు పైగా ఫంక్షన్ హాళ్లు. మండపాలు తదితర వేదికలు ఇప్పటికే బుక్ అయ్యా యి. సుమారు 25 వేలకు పైగా జంటలు ఈ నెలలో ఒక్కటి కానున్నట్లు పురోహితులు అంచనా వేస్తున్నారు. కానీ.. ఈ సంఖ్య ఇంకా పెరి గే అవకాశం కూడా ఉంది. అలాగే ఫంక్షన్ హాళ్ల కు సైతం ఇంకా డిమాండ్ పెరగనుంది. వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలు, ఇతర మార్కెట్లలో సైతం గిరాకీ ఊపందుకోనుంది. ముహూర్తాలు కూడా కలిసి రావచ్చు దృక్ సిద్ధాంతం ప్రకారం డిసెంబరులో 5 ముహూర్తాలే ఉన్నాయి. కానీ కొందరు పురోహితులు పూర్వసిద్ధాంతాన్ని అనుసరించి ముహూర్తాలను నిర్ణయిస్తారు. ఈ మేరకు డిసెంబరులో మరిన్ని ముహూర్తాలు కూడా ఉండవచ్చు. – చిర్రావూరి శివరామకృష్ణ, వేద పండితులు -
డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈడీ, ఐటీ దాడుల ప్రకంపనల వేళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. కేంద్రం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల తెలంగాణకు రూ.40వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు
-
Bank Holidays December 2022:13 రోజులు సెలవులు
సాక్షి, ముంబై: ఆర్బీఐ డేటా ప్రకారం డిసెంబర్ నెలలో బ్యాంకులు 13 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. డిసెంబర్లో వచ్చే రెండు, నాలుగు శనివారాలు 4 ఆదివారాలతో పాటు రిజర్వ్ బ్యాంకు ప్రతి నెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేస్తుంది. బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకొని దాని కనుగుణంగా ప్లాన్ చేసుకోవడం బెటర్. డిసెంబర్లో 3,4,10,11,18,24,25 తేదీల్లో దేశవ్యాప్త సెలవు. అలాగే డిసెంబర్ 24న, క్రిస్మస్, నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. డిసెంబర్లో బ్యాంకులకు సెలవులు: డిసెంబర్ 3 - శనివారం (సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ , గోవాలో హాలిడే) డిసెంబర్ 4 -ఆదివారం డిసెంబర్ 10- రెండో శనివారం డిసెంబర్ 11 -ఆదివారం డిసెంబర్ 12- సోమవారం (పా టాగన్ నెంగ్మింజ సంగం, మేఘాలయలో సెలవు) డిసెంబర్ 18 - ఆదివారం డిసెంబర్ 19 - సోమవారం (గోవా లిబరేషన్ డే,గోవాలో సెలవు) డిసెంబర్ 24- శనివారం ( క్రిస్మస్, నాలుగో శనివారం దేశవ్యాప్త సెలవు) డిసెంబర్ 25 - ఆదివారం డిసెంబర్ 26- సోమవారం (క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్ మిజోరం, సిక్కిం, మేఘాలయలో హాలిడే) డిసెంబర్ 29- గురువారం (గురు గోవింద్ సింగ్ పుట్టినరోజు,చండీగఢ్లో హాలిడే) డిసెంబర్ 30- శుక్రవారం ( యు కియాంగ్ నంగ్వా మేఘాలయలో సెలవు డిసెంబర్ 31 - శనివారం (నూతన సంవత్సర వేడుకలు, మిజోరంలో సెలవు) రాష్ట్రాల పండుగల ఆధారంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి. -
ముహూర్తాల్లేవ్.. శుభకార్యాలకు బ్రేక్
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): శ్రావణంలో 15 రోజులపాటు భాజాభజంత్రీలు మోగగా సోమవారం నుంచి డిసెంబర్ 2 వరకు ముహూర్తాలు లేవు. తిరిగి డిసెంబర్ 3 నుంచి 19వ తేదీ వరకు పది ముహూర్తాలే ఉన్నాయి. అప్పటివరకు శుభకార్యాలకు ఆగాల్సిందే. ఈ నెల 24వ తేదీ పవిత్ర శ్రావణ బహుళ ద్వాదశీ బుధవారం పునర్వసు నక్షత్రంతో పెళ్లిళ్లు కాకుండా ఇతర కార్యక్రమాలకు సంబంధించి మంచిరోజులూ ముగుస్తాయి. సెప్టెంబర్ 17 నుంచి శుక్ర మౌఢ్యమి సెప్టెంబర్ 17 భాద్రపద బహుళ సప్తమి నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభమై అక్టోబర్లో వచ్చే అశ్వయుజ, నవంబర్లో వచ్చే పావన కార్తీక మాసాల్లోనూ కొనసాగుతుంది. మార్గశిర శుద్ధ దశమి డిసెంబర్ 2న ఇది ముగుస్తుంది. డిసెంబర్ 24 నుంచి పుష్యమాసం పుష్యమాసం డిసెంబర్ 24 నుంచి ప్రారంభమై జనవరి 21వ తేదీ వరకు ఉంటుంది ఈ రోజుల్లో శుభముహ్తూరాలు లేవు. తిరిగి జనవరి 22 నుంచి మాఘమాసం ప్రారంభమై, మార్చి 19 వరకు వరుసగా అన్నీ మంచి రోజులే. వివాహాది, సమస్త శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ నెల చివరలో పండుగలు ►25న మాసశివరాత్రి ►27న పొలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది. ►30న కుడుముల తదియ ►31న వినాయక చతుర్థి, నవరాత్రోత్సవాలు ప్రారంభం ►సెప్టెంబర్ 9న నిమజ్జనోత్సవం. అస్తమించని మౌఢ్యం.. శుక్రాస్తమయం అస్తమించిన మౌఢ్యమని, దీన్నే శుక్ర మౌఢ్యమి అని అంటారు. ఇది ఉన్న కాలంలో గ్రహాలు çశుభ ఫలితాలు ఇవ్వవు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టవద్దు. కొత్తగా ఎలాంటి పనులు ప్రారంభించకూడదు. – మంగళంపల్లి శ్రీనివాసశర్మ, నగర వైదిక పురోహితుడు, కరీంనగర్ డిసెంబర్లోనే ముహూర్తాలు.. శ్రావణంలో శుభకార్యాలకు ముహూర్తాలు సోమవారంతో ముగుస్తాయి. మళ్లీ డిసెంబర్ వచ్చే మార్గశిర వరకు ఆగాల్సిందే. ఆ నెలలోనూ కేవలం 10 రోజులే ముహూర్తాలున్నాయి. మళ్లీ జనవరి 22 నుంచి మాఘమాసంలో ఉంటాయి. – పవనకృష్ణ శర్మ, ప్రధానార్చకుడు, శ్రీదుర్గాభవాని ఆలయం, నగునూర్, కరీంనగర్ -
పారిశ్రామిక ఉత్పత్తి... నాలుగో నెలా నిరాశే!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా నాల్గవ నెల 2021 డిసెంబర్లోనూ పేలవంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 0.4 శాతంగా నమోదయినట్లు (2020 ఇదే నెలతో పోల్చి) జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రెండంకెల్లో వృద్ధి నమోదయ్యింది. అటు తర్వాత క్రమంగా బలహీనపడింది. 2020 లో బేస్ ఎఫెక్ట్ ప్రభావం క్రమంగా తొలగిపోతూ రావడం కూడా దీనికి కారణం. సెప్టెంబర్లో 4.4 శాతం, అక్టోబర్లో 4 శాతం, నవంబర్లో 1.3 శాతం (తొలి 1.4 శాతానికి దిగువముఖంగా సవరణ) వృద్ధి రేట్లు నమోదయ్యాయి. కొన్ని కీలక రంగాల పనితీరును పరిశీలిస్తే.. ► మైనింగ్ రంగంలో వృద్ధి 2.6 శాతంగా నమోదయ్యింది. ► విద్యుత్ ఉత్పత్తి 2.8 శాతం పెరిగింది. ► పెట్టుబడులు, భారీ యంత్రసామాగ్రి కొనుగోళ్లను ప్రతిబింబించే క్యాపిటల్ గూడ్స్ విభాగం కూడా 2021 డిసెంబర్లో క్షీణతలోనే ఉంది. క్షీణరేటు 4.6 శాతంగా నమోదయ్యింది. 2020 ఇదే నెలల్లో ఈ విభాగంలో 2.2 శాతం వృద్ధి నమోదయ్యింది. ► రిఫ్రిజిరేటర్లు, ఎయిర్కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా 2.7 శాతం క్షీణతను నమోదయ్యింది. 2020 డిసెంబర్లో ఈ విభాగంలో 6.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ► ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కు సంబంధించి విభాగంలో ఉత్పత్తి కూడా 0.6 శాతం క్షీణతలోనే ఉంది. 2020 డిసెంబర్లో ఈ విభాగం 1.9 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. తొమ్మిది నెలల్లో ఇలా... ఇక ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 15.2 శాతం. లో బేస్ దీనికి ప్రధాన కారణం. 2020 ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 13.3 శాతం క్షీణత నమోదయ్యింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... -
ఆటో అమ్మకాలపై చిప్ ఎఫెక్ట్
ముంబై: దేశీయ ఆటో తయారీ కంపెనీల డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. గతేడాది చివరి నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు క్షీణించాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, స్కోడా అమ్మకాలు మెరుగుపడ్డాయి. ఇదే డిసెంబర్లో ద్విచక్ర వాహన కంపెనీలైన హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు స్వల్పంగా క్షీణించాయి. ఆర్థిక రికవరీతో వాణిజ్య వాహనాలకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ విభాగానికి చెందిన వోల్వో ఐషర్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం వాహన అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ► మారుతీ గతేడాది డిసెంబర్లో దేశీయంగా 1,23,016 వాహనాలను అమ్మింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో (2020) లో విక్రయించిన 1,40,754 యూనిట్లతో పోలిస్తే 13 % తక్కువ గా ఉంది. 2021లో 12.14 లక్షల యూనిట్లను విక్రయించింది. ► ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాటా మోటార్స్ 50% వృద్ధిని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్లో ఈ సంస్థ 23,545 కార్లను అమ్మగా.. 2021లో 35,299 యూనిట్లను అమ్మింది. దేశీయ ఆటో పరిశ్రమపై డిసెంబర్నూ సెమికండెక్టర్ల కొరత ప్రభావం కొనసాగింది. ప్రతికూలతల కంటే సానుకూలతలు ఎక్కువగా ఉండటంతో కొత్త ఏడాది అమ్మకాలపై ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నాము. అయితే ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, సెమికండెక్టర్ల కొరత సమస్యలు పరిశ్రమకు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలాయి. శశాంక్ శ్రీవాస్తవ మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
కొత్త ఏడాది ఊపుతో తెగ తాగేశారు.. మొత్తం రూ.2,901 కోట్ల మద్యం..
సాక్షి, హైదరాబాద్: పెరిగిన చలి, కొత్త ఏడాది ఊపుతో గతేడాది చివర్లో మందుబాబులు కేసులకు కేసులు మందు, బీర్లు లాగించేశారు. డిసెంబర్ చివరి 4 రోజుల్లో రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి సుమారు రూ.600 కోట్ల విలువైన మద్యం మార్కెట్లోకి వెళ్లింది. 2021, డిసెంబర్ 31న దాదాపు రూ.171 కోట్ల మద్యం అమ్ముడుపో వడం గమనార్హం. ఇక, డిసెంబర్ నెల మొత్తం మీద రూ.2,901 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ నెలలో 40.11 లక్షల కేసుల లిక్కర్, 33.93 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ. గత ఏడాది డిసెంబర్లో 33.23 లక్షల కేసుల లిక్కర్, 26.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,276 కోట్లు. ఇక, 2021 సంవత్సరం మొత్తం మీద 2.73 కోట్ల లిక్కర్ కేసులు, 2.45 కోట్ల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ. 18,868 కోట్ల పైమాటే. అదే 2020లో రూ.16,254 కోట్ల విలువైన మద్యం అమ్ముడయింది. 2020తో పోలిస్తే 2021లో 16 శాతం ఎక్కువ మద్యం విక్రయాలు జరిగినట్లు ఎౖMð్సజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చదవండి: అరుదైన రాయి.. కాపాడుకోవాలోయి -
Liquor Sales: తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డుల మోత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్శాఖ తెలిపింది. డిసెంబర్ నెలలోనే తెలంగాలో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే రూ.171 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. గత ఐదు వ్యవధిలోనేనే రూ.902 కోట్ల మద్యాన్ని మందుబాబులు స్వాహా చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా డిసెంబర్ నెలలో 3,435 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం డిసెంబర్లో 2,764 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2020లో 25,602కోట్ల అమ్మకాలు జరగ్గా.. 2021 శుక్రవారం సాయంత్రానికే 30,196 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో 6,970 కోట్లు, నల్గొండ జిల్లాలో 3288 కోట్లు, హైదరాబాద్లో 3,201 కోట్ల అమ్మకాలు నమోదయినట్లు ఎక్సైజ్శాఖ వెల్లడించింది. చదవండి: (కేకలు, అరుపులు.. జూబ్లీహిల్స్లో యువతి హల్చల్) -
రోహిత్ శర్మకు అచ్చొచ్చిన డిసెంబర్ నెల.. ఎందుకో తెలుసా..?
Rohit Sharma Achieved Many Milestones In December: రోహిత్ శర్మ టీమిండియా పరిమిత ఓవర్ల ఫుల్టైమ్ కెప్టెన్(వన్డే కెప్టెన్)గా 2021 డిసెంబర్ 8న నియమితుడైన సంగతి తెలిసిందే. అయితే యాధృచ్చికంగా అతనికి ఈ నెల భలే కలిసొస్తుంది. గతంలో మైదానం లోపల, వెలుపల ఎన్నో మైలురాళ్లను రోహిత్ ఇదే నెలలో చేరుకున్నాడు. అతని వ్యక్తిగత జీవితంలో డిసెంబర్ నెల ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. రోహిత్ 2017 డిసెంబర్లో తొలిసారి టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. కోహ్లి గైర్హాజరీలో శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో రోహిత్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ సిరీస్లో జరిగిన ఓ టీ20 మ్యాచ్లో రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ(36 బంతుల్లో) సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ వ్యక్తిగత జీవితంలోనూ డిసెంబర్ చాలా ప్రత్యేకమైంది. 2015, డిసెంబర్ 13న రోహిత్.. రితికా సజ్దేను వివాహం చేసుకున్నాడు. అలాగే రోహిత్, రితికల కుమార్తె అదర కూడా 2018లో ఇదే నెలలో(డిసెంబర్ 30) జన్మించింది. ఇలా చాలా ఘనతలను రోహిత్ డిసెంబర్ నెల సాధించాడు. తాజాగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా సారధ్య బాధ్యతలను చేపట్టనుండడంతో రోహిత్కు డిసెంబర్ మాసం చిరకాలం గుర్తుండిపోయేదిగా మారింది. చదవండి: ఆమె నా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్.. తన వల్లే ఇదంతా: రోహిత్ శర్మ -
డిసెంబరులో ఐపీవోల జాతర.. రూ. 10 వేల కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయుల్లో తిరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూల జోరు కొనసాగుతోంది. నవంబర్లో 10 కంపెనీలు విజయవంతంగా ఐపీవోలను ముగించగా.. డిసెంబర్లోనూ మరో 10 కంపెనీలు లైన్లో ఉన్నాయి. ఇవి దాదాపు రూ. 10,000 కోట్ల పైగా సమీకరించనున్నాయి. ఇప్పటికే స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, టెగా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలకు మార్కెట్లో సబ్స్క్రిప్షన్ కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ట్రావెల్, హాస్పిటాలిటీ టెక్నాలజీ సేవల సంస్థ రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, ఆర్థిక సేవల గ్రూప్ ఆనంద్ రాఠీలో భాగమైన ఆనంద్ రాఠీ వెల్త్, గ్లోబల్ హెల్త్, హెల్తియం మెడ్టెక్ మొదలైనవి డిసెంబర్ ఐపీవోల జాబితాలో ఉన్నాయి. రేట్గెయిన్ ఇష్యూ డిసెంబర్ 7–9 మధ్య ప్రారంభం కానుండగా, ఆనంద్ రాఠీ వెల్త్ ఐపీవో డిసెంబర్ 2న మొదలవుతుంది. ఇక మెడాంటా బ్రాండ్ ఆస్పత్రులను నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్, ఫార్మసీ రిటైల్ చెయిన్ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్, హెల్తియం మెడ్టెక్ కూడా ఐపీవోలకు సిద్ధమవుతున్నాయి. ఇవి కాకుండా మెట్రో బ్రాండ్స్, శ్రీరామ్ ప్రాపర్టీస్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, శ్రీ బజరంగ్ పవర్ అండ్ ఇస్పాత్, వీఎల్సీసీ హెల్త్కేర్ హెల్త్కేర్ కూడా డిసెంబర్లోనే పబ్లిక్ ఇష్యూకి రానున్నాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు తెలిపారు. బుల్ రన్ ఊతం.. పబ్లిక్ ఇష్యూల ద్వారా సమీకరించే నిధులను ఆయా కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాల విస్తరణ, రుణ భారాన్ని తగ్గించుకోవడం, ఇతర కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. కొన్ని ఇష్యూల ద్వారా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ప్రమోటర్లు తమ వాటాల్లో కొంత భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించి నిధులు సమీకరించుకున్నారు. ఐపీవోల జోరు కొనసాగడానికి ఈక్విటీ మార్కెట్లలో బుల్ రన్ కారణమని లెర్న్యాప్డాట్కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రతీక్ సింగ్ చెప్పారు. ‘ఏ కంపెనీ అయినా పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలంటే బుల్ మార్కెట్ అత్యంత అనువైనది. అందుకే చాలా కంపెనీలు ప్రస్తుతం లిస్టింగ్కు వస్తున్నాయి. ఇలాంటి మార్కెట్లలో సెంటిమెంటును తమకు ప్రయోజనకరంగా మల్చుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తాయి. విజయం కూడా సాధిస్తాయి‘ అని ఆయన పేర్కొన్నారు. చాలా మటుకు ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి బంపర్ స్పందన లభిస్తోంది కూడా. పలు ఇష్యూలు అనేక రెట్లు సబ్స్క్రయిబ్ అవుతుండటం ఇందుకు నిదర్శనం. మార్కెట్లు నెమ్మదించి, మళ్లీ పడే దాకా ఐపీవోల ట్రెండ్ కొనసాగుతుందని, సమీప భవిష్యత్లో మరిన్ని టెక్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించేందుకు ముందుకు వస్తాయని ప్రతీక్ సింగ్ తెలిపారు. భవిష్యత్లో మార్కెట్లు క్షీణిస్తే.. ఐపీవోలు కూడా తగ్గుతాయి అని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 51 కంపెనీలు.. ఎక్సే్ంజీల గణాంకాల ప్రకారం 2021లో ఇప్పటిదాకా 51 కంపెనీలు ఐపీవోలకు వచ్చాయి. రూ. 1 లక్ష కోట్ల పైగా సమీకరించాయి. ఇవి కాకుండా ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్విట్), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్) కూడా పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. ఐపీవో ద్వారా పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన పవర్గ్రిడ్ ఇన్విట్ రూ. 7,735 కోట్లు, బ్రూక్ఫీల్డ్ ఇండియా రీట్ రూ. 3,800 కోట్లు సేకరించాయి. 2020 మొత్తం మీద పబ్లిక్ ఇష్యూల ద్వారా 15 కంపెనీలు రూ. 26,611 కోట్లు సమీకరించాయి. 2017లో అత్యధికంగా ఐపీవోల సందడి కనిపించింది. అప్పట్లో 36 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఏకంగా రూ. 67,147 కోట్లు సేకరించాయి. మళ్లీ ఆ స్థాయిని మించిన ఐపీవోల సందడి 2021లో కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీవోకి స్నాప్డీల్ రూ. 1,870 కోట్ల సమీకరణ యోచన ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. సుమారు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1,870 కోట్లు) సమీకరించాలని యోచిస్తోంది. దీని ప్రకారం సంస్థ విలువ సుమారు 1.5–1.7 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను మరికొన్ని వారాల్లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి స్నాప్డీల్ సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్–జనవరిలో ప్రాస్పెక్టస్ సమర్పించాలని, అనుమతులు వచ్చాక 2022 ప్రథమార్ధంలో ఐపీవోకి రావాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి. పబ్లిక్ ఇష్యూ సందర్భంగా వ్యవస్థాపకులు తమ వాటాలను విక్రయించే యోచనలో లేరని పేర్కొన్నాయి. ఇతర ప్రధాన వాటాదారులు కూడా అదే అభిప్రాయంతో ఉండవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. స్నాప్డీల్లో సాఫ్ట్బ్యాంక్, బ్లాక్రాక్, టెమాసెక్ హోల్డింగ్స్, ఈబే వంటి దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. ఒకప్పుడు దేశీ ఈ–కామర్స్ రంగంలో స్నాప్డీల్ ఒక వెలుగు వెలిగింది. కానీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి సంస్థల రాకతో.. పోటీలో వెనుకబడింది. ఒక దశలో ఫ్లిప్కార్ట్లో విలీన అవకాశం వచ్చినప్పటికీ ... డీల్ కుదుర్చుకోలేదు. స్వయంగా ఆర్థికంగా బలపడే లక్ష్యంతో స్నాప్డీల్ 2.0 వ్యూహాన్ని అమలుకు మొగ్గు చూపింది. చదవండి: బంగారానికి ప్రత్యేక బ్యాంకు ఉండాలి -
భారత్ బాండ్ ఈటీఎఫ్తో రూ.10,000 కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్రం డిసెంబర్లోగా భారత్ బాండ్ ఈటీఎఫ్ (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ద్వారా రూ.10,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశం ఉందని ఆర్థిక శాఖలో ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పురోగతి ప్రణాళికలకు ఈ నిధులను వినియోగిస్తారు. ఇదే జరిగితే భారత్ బాండ్ ఈటీఎఫ్ జారీ ఇది మూడవ విడత అవుతుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల సులభతర రుణాలకు సంబంధించి ఒక పెట్టుబడి సాధనం. ఈటీఎఫ్ ప్రస్తుతం ప్రభుత్వ రంగ కంపెనీల ’ఏఏఏ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. 2020 జూలైలో రెండవ విడత భారత్ బాండ్ ఈటీఎఫ్ జారీ జరిగింది. మూడురెట్లకుపైగా ఇది ఓవర్సబ్స్రై్కబ్ అయ్యింది. రూ.11,000 కోట్ల సమీకరణలు జరిగాయి. ఇక 2019 డిసెంబర్లో వచ్చిన తొలి ఆఫర్ ద్వారా రూ.12,400 కోట్ల సమీరణలు జరిగాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్కు మొదటి విడతలో మూడు, పది సంవత్సరాల మెచ్యూరిటీ ఆప్షన్లు ఉండగా, రెండవ విడతకు ఐదు, 12 సంవత్సరాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎడెల్వైస్ అసెట్ మేనేజ్మెంట్ ఈ పథకం ఫండ్ మేనేజర్. -
డిసెంబర్ 16 నుంచి సీటీఈటీ
న్యూఢిల్లీ: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటీఈటీ)ని డిసెంబర్ 16–జనవరి 13వ తేదీల మధ్యలో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తెలిపింది. దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారితంగా 20 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్ష సిలబస్, భాష, అర్హత విధానం, పరీక్ష ఫీజు, పరీక్ష జరిగే నగరాలు, మిగతా ముఖ్య సమాచారాన్ని సీటీఈటీ వెబ్సైట్ https://ctet.nic.in లో ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. సీటీఈటీ వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అభ్యర్థులకు తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించింది. -
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా.. ఈసారైనా నెగ్గుకొచ్చేనా..?
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో(డిసెంబర్) భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈమేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు శుక్రవారం నిర్ధారించింది. పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్లు, మూడు వన్డేలు, నాలుగు టీ 20 మ్యాచ్లు ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఈ ద్వైపాక్షిక సిరీస్.. వచ్చే ఏడాది జనవరి 25న ముగుస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగే ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 17న జొహన్నెస్బర్గ్ వేదికగా జరగనుంది. అనంతరం సెంచూరియన్ వేదికగా రెండో టెస్ట్ డిసెంబర్ 26న(బాక్సింగ్ డే టెస్ట్), మూడో టెస్ట్ జొహన్నెస్బర్గ్ వేదికగా జనవరి 3న మొదలవుతాయి. ఇక మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే జనవరి 11న, రెండో వన్డే జనవరి 14న, మూడో వన్డే జనవరి 19న జరగనున్నాయి. ఆతర్వాత నాలుగు టీ20 మ్యాచ్లు వరుసగా జనవరి 19(పార్ల్), జనవరి 21(కేప్టౌన్), జనవరి 23(పార్ల్), జనవరి 26న(పార్ల్) షెడ్యూలయ్యాయి. టీమిండియా చివరిసారిగా 2018లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఆ పర్యటనలో భారత్ టెస్ట్ సిరీస్ను కోల్పోగా.. వన్డే, టీ20 సిరీస్లను గెలుచుకుంది. ఇక ఇరు జట్ల మధ్య గతేడాది మార్చిలో(భారత పర్యటన) షెడ్యూలైన పరిమిత ఓవర్ల సిరీస్.. కరోనా కారణంగా పూర్తిగా రద్దైన సంగతి తెలిసిందే. చదవండి: స్టార్ ఆటగాళ్లకు మొండిచేయి.. దక్షిణాఫ్రికా టీ20 జట్టు ఇదే -
ధనుష్ తెలుగు సినిమా.. అప్పుడే షూటింగ్ స్టార్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఓ డైరెక్ట్ ఫిల్మ్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు. నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఈ ఏడాది డిసెంబరులో ఆరంభించాలనుకుంటున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దే పనిలో శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నారని తెలిసింది.