DGP Mahendar Reddy
-
డీజీపీ మహేందర్రెడ్డి పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) ఎం.మహేందర్రెడ్డి శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మహేందర్రెడ్డి పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఉదయం 8:25 గంటలకు పరేడ్ నిర్వహించనున్నారు. నూతన డీజీపీగా అంజనీకుమార్ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు అంజనీకుమార్కు ప్రస్తుత డీజీపీ మహేందర్రెడ్డి గౌరవ లాఠీని అందిస్తారు. అనంతరం అంజనీకుమార్ను డీజీపీ కుర్చీలో గౌరవప్రదంగా కూర్చోబెట్టనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మహేందర్రెడ్డికి సీనియర్ అధికారులు, ఇతర సిబ్బంది వీడ్కోలు పలకనున్నారు. మహేందర్రెడ్డి సేవలు అభినందనీయం: హోంమంత్రి డీజీపీగా పదవీ విరమణ పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని డీజీపీ ఎం.మహేందర్రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శాలువాతో సత్కరించారు. ఈ మేరకు లక్డీకాపూల్లోని హోంమంత్రి కార్యాలయానికి వెళ్లిన డీజీపీ మహేందర్రెడ్డి హోంమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డికి మంత్రి చార్మినార్ జ్ఞాపికను అందించారు. పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్రెడ్డి చక్కటి సేవలందించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశారని ప్రశంసించారు. విధినిర్వహణలో తనదైన ముద్రవేశారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా, డీజీపీగా, ఇతర అనేక హోదాల్లోనూ పనిచేసి అందరి మన్ననలు పొందారని హోంమంత్రి గుర్తు చేశారు. డీజీపీగా మహేందర్రెడ్డి పనిచేసిన ఈ ఐదేళ్లలో తెలంగాణ పోలీసు శాఖను దేశంలోనే అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. గురువారం బదిలీలు పొందిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీపీలు జితేందర్, సంజయ్ కుమార్ జైన్ తదితరులు సైతం హోంమంత్రిని కలిశారు. -
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో 2022 ఏడాదిలో పోలీస్ శాఖ సఫలీకృతమైనట్టు డీజీపీ ఎం.మహేందర్రెడ్డి చెప్పారు. సైబర్ నేరాలు సహా కొన్ని రకాల నేరాలు కొంత పెరిగినా...నేరస్తులకు శిక్షలు పడే శాతం గతేడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగి 56 శాతానికి చేరడం సంతృప్తినిచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఏడాది మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించగలిగామన్నారు. మతఘర్షణలు ఇతర నేరాల కట్టడిలో పోలీస్శాఖలోని అధికారులు, సిబ్బంది అంతా ఒక బృందంగా కలిసికట్టుగా పనిచేశారని డీజీపీ తెలిపారు. భవిష్యత్తులో సైబర్నేరాల ముప్పు మరింత పెరగనుందని, ఆ దిశగా పోలీస్శాఖ సమాయత్తమయ్యేలా ఎన్నో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. గురువారం లక్డీకాపూల్లోని తెలంగాణ పోలీస్ కేంద్ర కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ 2022 వార్షిక నివేదిక, తెలంగాణ పోలీస్ ట్రాన్స్ఫార్మేషనల్ జర్నీ నివేదికలను విడుదల చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా నిలిచిన ఉప్పల్, కోదాడ టొన్, ఆదిలాబాద్ వన్టౌన్, లక్ష్మీదేవిపల్లి, సిరోల్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల)కు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేందర్రెడ్డి సుదీర్ఘంగా ప్రసగించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీస్శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలు, గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సరళి తదితర అంశాలను వివరించారు. నాలుగు మూల సూత్రాలతో ముందుకెళ్లాం.. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షణతోపాటు మారుతున్న నేరసరళికి అనుగుణంగా మార్పు చెందేలా పోలీస్శాఖ బలోపేతానికి ప్రాసెస్, టెక్నాలజీ, కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ అనే నాలుగు మూల సూత్రాలను అనుసరించినట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఎక్కడ ఉన్నా భద్రంగా ఉన్నామన్న విశ్వాసాన్ని ప్రజల్లో, అదే సమయంలో తెలంగాణలో నేరం చేస్తే తప్పక పట్టుబడతామన్న భయాన్ని నేరస్తుల్లో తేగలిగామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడంలో పోలీస్తోపాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయ పర్చేలా తీసుకువచ్చిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్శాఖకు చేరిన అదనపు వనరుగా డీజీపీ పేర్కొన్నారు. రానున్న ఐదారేళ్లలో దేశంలోనే ఉత్తమ సంక్షేమ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ స్ట్రీట్ వెండార్స్తో సీసీటీవీల బిగింపు మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా నిఘా నేత్రాలుగా మారిన సీసీటీవీల ఏర్పాటుపై ప్రజల్లో తొలుత ఎన్నో అనుమానాలు ఉండేవని డీజీపీ గుర్తు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా తొలిసారి సీసీటీవీలను ఏర్పాటు చేసుకునేందుకు బంజారాహిల్స్లో తోపుడు బండ్ల వాళ్లు ముందుకు వచ్చారన్నారు. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రజలు, పలు సంస్థలు, ఎన్జీఓల సహకారంతో ప్రస్తుతం 10,25,849 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరి పోలీస్శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. కాగా, దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో కమిషన్ నివేదిక హైకోర్టుకు సమర్పించిందని, దానిపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుందని, ఆ ప్రాసెస్ కొనసాగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా డీజీపీ తెలిపారు. అన్ని రోడ్లపై స్పీడ్ లిమిట్కు సంబంధించిన సైన్బోర్డులు ఏర్పాటు చేసేలా ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకుంటామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్భగవత్, అడిషనల్ డీజీలు నాగిరెడ్డి, సందీప్శాండిల్య, సంజయ్జైన్, ఐజీ కమలాసన్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్స్ ఈనెల 31తో తన పదవీ కాలం పూర్తవుతుందని, గత 36 ఏళ్లుగా తన వృత్తిగత జీవితంలో అనేక అవకాశాలు ఇచ్చిన అన్ని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, సీఎస్లు, ఇతర సిబ్బందికి అందరికీ డీజీపీ ఎం.మహేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన వృత్తిగత జీవితంలో మీడియా ఎంతో సహకరించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. -
తెలంగాణలో ఐపీఎస్ల బదిలీలు.. ఇన్చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. డిసెంబర్ 31వ తేదీతో ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో బదిలీలు జరిగాయి. బదిలీల అనంతరం తెలంగాణ ఇన్చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. - సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్. - రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్. - ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు. - లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్. - హోంశాఖ కార్యదర్శిగా జితేందర్. -
టీఎస్పీఐసీసీసీ చైర్మన్గా డీజీపీ మహేందర్రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ ‘సూపర్ పోస్టు’ను సృష్టిస్తున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఇటీవలే ప్రారంభించిన ‘తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్పీఐసీసీసీ)’కు ప్రభుత్వం చైర్మన్ను నియమించనుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ఎం.మహేందర్రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. తర్వాత ఆయననే ఈ పోస్టులో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర పోలీసు విభాగం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైతం ఐసీసీసీ చైర్మన్ ఆధీనంలోనే ఉండనున్నట్టు సమాచారం. రాష్ట్ర పోలీసు చరిత్రలో ఇలాంటి పోస్టు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇప్పటివరకు సలహాదారులే.. రాష్ట్ర పోలీసు విభాగంలో డీజీపీతోపాటు వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన వారి సేవలను వినియోగించుకోవడం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే వారిని శాంతిభద్రతల విభాగం సలహాదారులుగానో, చట్ట సవరణ, పోలీసు మ్యాన్యువల్లలో మార్పుచేర్పులకు సంబంధించిన కమిటీలకు ఇన్చార్జులుగానో నియమింవారు. మాజీ డీజీపీలు ఏకే మహంతి, అనురాగ్శర్మలతోపాటు రిటైర్డ్ ఐజీ గంగాధర్ల నియామకాలు ఈ కోవలోకే వస్తాయి. మరికొందరు పదవీ విరమణ చేసిన డీఎస్పీలు, అదనపు ఎస్పీల సేవలనూ వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు. కొందరైతే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా పనిచేస్తున్నారు. వారంతా గవర్నర్, హోంమంత్రి, డీజీపీ లేదా ఆయా యూనిట్లకు నేతృత్వం వహించే పోలీసు ఉన్నతాధికారి ఆధీనంలో పని చేస్తుంటారు. దీనికి భిన్నంగా ఎం.మహేందర్రెడ్డిని ఐసీసీసీ చైర్మన్గా కేబినెట్ హోదాలో నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పునర్వ్యవస్థీకరణతో కలిపి.. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మూడింటిలో జోన్లు, డివిజన్లతోపాటు పోలీస్స్టేషన్ల సంఖ్య పెంపునకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించింది. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శాంతిభద్రతలు, నేరాలు, ట్రాఫిక్.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేసి పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు రూపొందించింది. హైదరాబాద్కు 1,252, సైబరాబాద్కు 750, రాచకొండకు 763 మంది అదనపు సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం ఐసీసీసీ చైర్మన్గా మహేందర్రెడ్డిని నియమించాలని, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పాటు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆయన ఆధీనంలోకి తీసుకురావాలని నిర్ణయించడంతో మార్పులు జరిగాయి. కేబినెట్ మూడు కమిషనరేట్ల ప్రతిపాదనలకు అదనంగా ఐసీసీసీ కోసం 400, సైబర్ సెక్యూరిటీ వింగ్ కోసం 500 పోస్టులను కూడా జోడించి ఆమోదముద్ర వేసింది. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కలిపి మొత్తంగా 3,965 పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పోలీసు విభాగం వినియోగిస్తున్న టెక్నాలజీల నిర్వహణతోపాటు ఐసీసీసీ మొత్తం దాని చైర్మన్ ఆ«ధీనంలోకి వెళుతుంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో కొనసాగుతున్న ఐసీసీసీకి సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లోని ఏడో అంతస్తులో చైర్మన్ కార్యాలయం ఉండనుంది. ఇటీవల ఐసీసీసీకి వెళ్లిన మహేందర్రెడ్డి ఆ చాంబర్ను పరిశీలించారని.. ఈ వారాంతంలో లేదా వచ్చే నెల మొదటివారంలో ఐసీసీసీ చైర్మన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
విద్యార్థుల రక్షణ సామాజిక బాధ్యత
సాక్షి, హైదరాబాద్: స్కూల్ విద్యార్థుల భద్రత, రక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరముందని పాఠశాల విద్యార్థుల భద్రత, రక్షణ కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ముందు పలువురు అభిప్రాయపడ్డారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రాణీకుముదిని అధ్యక్షురాలిగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం హైదరాబాద్ ఎంహెచ్ఆర్డీలో వివిధ వర్గాలతో భేటీ అయి, వారి సలహాలు, సూచనలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ స్వాతి లక్రా, ప్రభుత్వ కార్యదర్శి దివ్య దేవరాజన్, డీపీజీ మహేందర్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన పాల్గొన్నారు. పిల్లలపై జరిగే ఘటనలను మార్గదర్శకాల రూపకల్పనపై కమిటీ సలహాలు తీసుకుంది. డీజీపీ మాట్లాడుతూ భద్రత, రక్షణవిషయంలో యాజమాన్యాలను భాగస్వాముల ను చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవస్థీకృత చట్టంలో మార్గదర్శకాల రూపకల్పన చేయాలన్నారు. ఘటన జరగకముందే మేల్కొనే వ్యవస్థ ఏర్పాటు అవసర మని స్వాతి లక్రా సూచించారు. పిల్లలరక్షణ సామాజిక బాధ్యతగా అందరూ భావించాలని దేవసేన అన్నారు. సమావేశంలో వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. -
గురుకులంలో సీటు రాకుంటే రైతు అయ్యేవాడిని
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల విద్యాలయంలో సీటు రాకపోయిఉంటే.. సొంత ఊరైన ఖమ్మం జిల్లా కూసుమంచిలో వ్యవసాయం చేసేవాడినని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. చిన్ననాటి స్నేహితులు కూడా వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తాను ఉద్యోగ విరమణ చేసేలోపు చదువుకున్న పాఠశాలను సందర్శించాలనుకున్న డీజీపీ.. మంగళవారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల విద్యాలయానికి వచ్చారు. సుమారు రెండు గంటల పాటు ఆయన విద్యాలయంలో గడిపారు. గురుకుల విద్యాలయం ఏర్పాటుకు కారణమైన మద్ది నారాయణరెడ్డి, దివంగత పీఎం పీవీ నర్సింహారావు విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ సర్వేల్ గురుకులం ఎన్నో నేర్పిందని, విద్యాపరంగా వేసిన పునాది తన జీవితాన్ని మలుపు తిప్పిందని వివరించారు. డీజీపీ స్థాయికి ఎదగడానికి ఈ గురుకులమే కారణమని ఆయన స్పష్టం చేశారు. తన గురువులు నేర్పిన విలువలు ఇప్పటి వరకు దిక్సూచిలా పనిచేస్తున్నా యన్నారు. గురుకులంలో చదివితే ప్రపంచంలో దేన్నైనా జయించవచ్చని చెప్పారు. -
రాజకీయాల్లోకీ సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు త్వరలోనే ప్రత్యేక చట్టాలను అమలు చేయనున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. చట్టాల రూపకల్పనలో నల్సార్ విశ్వవిద్యాలయం నిమగ్నమైందని, ఈమేరకు వర్సిటీతో ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ప్రత్యేక సైబర్ చట్టాలతో కేసుల విచారణ, దర్యాప్తు వేగవంతమవడంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని స్పష్టంచేశారు. సైబర్ చట్టాలను అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని తెలిపారు. శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, సైయంట్ సంస్థల సహకారంతో పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం దేశంలోనే మొదటిది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తులు, సంస్థలతోపాటు రాజకీయాల్లో కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు గూగుల్ పే ద్వారా ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీ చేశారని ఆరోపించారు. పోలీసులు, న్యాయ విభాగాలు మాత్రమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజకీయాల్లో సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కసారి రిజిస్టర్లోకి ఎక్కితే... అమెరికా తరహాలో లైంగిక నేరస్తుల జాబితా తెలంగాణలోనూ అమలు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల జాబితాతో ప్రత్యేక వెబ్సైట్ రూపొందించాలని సూచించారు. నిందితుల పేరు, ఇతరత్రా వివరాలను రిజిస్టర్లో ఎక్కించాలని, ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఒకసారి రిజిస్టర్లో ఎక్కితే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు, రాయితీలకూ అనర్హులుగా ఉంటారని హెచ్చరించారు. డ్రోన్ పోలీసింగ్.. అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, మోసపోతున్న వారిలో విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం విచారకరమని కేటీఆర్ చెప్పారు. సైబర్ మోసాల బారిన పడిన వారు 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పోలీసు యంత్రాంగం సాధ్యమైనంత ఎక్కువగా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ‘మారుమూల ప్రాంతంలోని బాధితుడు డయల్ 100కు కాల్ చేస్తే పోలీసు వెళ్లాలంటే సమయం పడుతుంది. పోలీసు కంటే ముందే కెమెరా, సైరన్, లైట్తో డ్రోన్ వెళ్లి అక్కడి పరిస్థితిని పోలీసులకు చేర్చే స్థాయికి రాష్ట్రం ఎదగాలి. ఈ మేరకు డీజీపీ, హోంమంత్రి కార్యాచరణ రూపొందించాలి’ అని కేటీఆర్ చెప్పారు. నెక్ట్స్జెన్ పోలీసింగ్: డీజీపీ మహేందర్ రెడ్డి సాధారణ పోలీసులు, సిబ్బంది స్థానంలో టెక్ పోలీస్, నెక్ట్స్జెన్ పోలీసుగా మారాల్సిన అవసరం ఏర్పడిందని డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించవచ్చని, దీంతో రాష్ట్ర ఆదాయం కూడా మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ ఎకో సిస్టమ్ బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని, సైబర్ సేఫ్టీ కేంద్రం ఏర్పాటుకు కారణమిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్రావు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఏసీబీ డీజీ అంజనీకుమార్ యాదవ్, పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, సైయంట్ ఫౌండర్, చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక నేరాలపై ఎస్హెచ్వోలకు అవగాహన ఉండాలి : డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక నేరాలపై పోలీసు స్టేషన్ అధికారులకు(ఎస్హెచ్వో)లకు అవగాహన ఉండా లని రాష్ట్ర డీజీపీ పి.మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక నేరాలు అరుదుగా జరిగేవని, వాటిని సీసీఎస్ లేదా సీఐడీకి బదిలీ చేసేవాళ్లమని, మారిన పరిస్థితుల్లో ఆర్థిక నేరాలు అధికమైనందున వాటి దర్యాప్తు బాధ్యతను సంబంధిత పోలీసుస్టేషన్లకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. గురువారం మాసబ్ట్యాంక్లోని పోలీసు ఆఫీ సర్స్ మెస్లో ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎఫ్) డీజీ ఉమేష్ష్రాఫ్ రచించిన ‘ఎకనామిక్ అఫెన్సెస్–హ్యాండ్ బుక్ ఫర్ ఇన్వెస్టిగేషన్’ను డీజీపీ ఆవిష్కరించారు. అడిషనల్ డీజీ జితేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యకమ్రంలో డీజీపీ మాట్లాడుతూ..యువ పోలీస్ అధికారులకు మార్గ దర్శకంగా ఉండేందుకు సర్వీసులో ఉన్న ప్రతీ సీనియర్ పోలీస్ అధికారి తమ అనుభవాలతో రచనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా నేరాల స్వభావాలలో మార్పులు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా, ఇటీవల కాలంలో ఆర్థిక పరమైన నేరాలు అధికమయ్యాయన్నారు. ఉమేష్ ష్రాఫ్ రచించిన పుస్తకాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిస్తామని, ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డీజీపీ తెలిపారు. మాజీగవర్నర్, రిటైర్డ్ డీజీ పి.ఎస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, తాను క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఆర్థికపరమైన అవకతవకలు, నేరాలు సహకార సంఘాల నుంచే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. ఉమేష్ ష్రాఫ్ రాసిన మరో పుస్తకం క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ పరిచయ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎంవీ కృష్ణారావు, అరవింద్ రావు, సాంబశివరావు, ఉమేష్ కుమార్, రాజీవ్ త్రివేది, రత్నారెడ్డిలతోపాటు అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్, అంజనీకుమార్, శివధర్రెడ్డి, రాజీవ్ రతన్, సంజయ్ జైన్, విజయ్ కుమర్, అభిలాష బిష్త్, నాగిరెడ్డి, కమలహాసన్ రెడ్డి హాజరయ్యారు. -
క్షణాల్లో నకిలీని పట్టేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: బోగస్ సర్టిఫికెట్ల నియంత్రణకు మరో అడుగు పడింది. ఈ దిశగా స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఉన్నత విద్యామండలి రూపొందించిన ఈ వెబ్సైట్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. 27 భాషల్లో ఈ వెబ్సైట్ సేవలు పొందేలా డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, డీజీపీ మహేందర్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వెబ్సైట్ రీ డిజైనర్ ప్రొఫెసర్ నవీన్కుమార్, పలు యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. తెలంగాణ విద్యాసంస్థల విశ్వసనీయతను విశ్వవ్యాప్తంగా చాటడానికే ఈ వెబ్సైట్ను రూపొందించినట్లు వక్తలు చెప్పారు. తక్షణ వెరిఫికేషన్ కూడా.. ‘ఆధార్, ఈమెయిల్ వంటి వివరాలతో ఎవరైనా ఈ వెబ్సైట్కు లింక్ అవ్వొచ్చు. తక్షణ వెరిఫికేషన్ కోరే వారికి కొన్ని నిమిషాల్లోనే పరిమిత సమాచారం ఇస్తాం. సమగ్ర సమాచారం కోరే వారికి కొంత వ్యవధితో వెరిఫికేషన్ పూర్తి చేసి సమాచారం పంపుతాం. దీనికి రూ.1,500 వరకూ రుసుము ఉంటుంది. మార్కులు, ఎక్కడ చదివింది, అన్ని వివరాలను డిజిటల్ సంతకంతో అందిస్తాం. 15 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థుల సమాచారం 2010 నుంచి అందుబాటులో ఉంది. ఏ దేశం నుంచైనా, ఏ సంస్థ అయినా అనుమానం ఉన్న సర్టిఫికెట్ అసలైనదా లేదా నకిలీదా అనేది కేవలం కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు’ అని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి చెప్పారు. కొత్త టెక్నాలజీ పరిధిలోకి ఇంటర్, టెన్త్ బోర్డులను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ చెప్పారు. ఈ సైట్నూ హాక్ చేసే ఘనులున్నారు: డీజీపీ మహేందర్రెడ్డి ఇప్పటివరకూ ఉద్యోగాలకు వెళ్లే యువత సరిఫికెట్లు అసలో, నకిలీవో తెలుసుకోవాలంటే తీవ్ర జాప్యం జరిగేది. దీనివల్ల యువకుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసే ఒక ముఠాను పట్టుకుంటే, మరికొన్ని ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్లు దేశ విదేశాల్లో ఉన్నారు. కన్సల్టెన్సీలూ ఫేక్ సర్టిఫికెట్లు ప్రోత్సహిస్తున్నాయి. రియల్ టైమ్లో ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారం. రాబోయేకాలంలో ఇందులోనూ హ్యాకర్స్ ప్రవేశించే వీలుంది. బ్లాక్చైన్ టెక్నాలజీతో మరింత పటిష్టం చేయాలి. తెలంగాణ చరిత్రలో మైలురాయి: సబిత తెలంగాణ విద్య చరిత్రలో ఇదో మైలురాయి. దేశంలోనే తొలిసారి మన రాష్ట్రంలోనే దీన్ని తెచ్చాం. నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టాలన్న ఆలోచనకు అనుగుణంగా అన్నిస్థాయిల అధికారులు చొరవ తీసుకున్నారు. టెక్నాలజీని వాడుకుని జరిగే మోసాలకు ఇది అడ్డుకట్ట వేస్తుంది. దీన్ని ఆషామాషీగా ప్రారంభించి వదిలేయకుండా మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలి. మన రాష్ట్రంలో జారీ చేసే సర్టిఫికెట్లు నకిలీలు చేయలేరనేది నిరూపించాలి. -
అవసాన దశలో మావోయిస్టు ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమం నాయకత్వ లేమితో బలహీనమై అవసాన దశలో ఉందని, ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోవచ్చని డీజీపీ మహేందర్రెడ్డి వ్యాఖ్యానించారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని, ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు ఆలూరి ఉషారాణి శనివారం డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్క అలియాస్ పోచక్క అలియాస్ భాను దీదీగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారని.. అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో మావోయిస్టు ఉద్యమం నుంచి తప్పుకొని లొంగిపోయారని ప్రకటించారు. ‘‘ఉషారాణి కుటుంబ నేపథ్యమంతా మావోయిస్టు ఉద్యమంతో ముడిపడి ఉంది. తండ్రి ఆలూరి భుజంగరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విరసంలో సభ్యుడిగా కొనసాగారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పీపుల్స్వార్లో చేరారు. ఉషారాణి గుడివాడ ఏఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడే ఆర్ఎస్యూలో చేరి, 1987లో విద్యార్థి సంఘ నేతగా ఎన్నికయ్యారు. 1991లో పీపుల్స్వార్లో చేరి మునుగోడు దళ కమాండర్గా పనిచేశారు. 1998 యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్పై దాడిచేసి ఒకరిని చంపి, ఆయుధాలు తీసుకెళ్తున్న సమయంలో ఆమె భర్త ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ఉషారాణి 2002 నుంచి ఇప్పటివరకు దండకారణ్య జోనల్ కమిటీలో పనిచేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 2019లో సరెండర్ అవుతానని పార్టీని కోరారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు లొంగిపోయారు’’ అని డీజీపీ వివరించారు. మావోయిస్టు పార్టీకి నాయకత్వలోపం మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్న సీనియర్లు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. జంపన్న, సుధాకర్ సరెండర్ అయిన తర్వాత మావోయిస్టు పార్టీకి సరైన నాయకత్వం లేదన్నారు. మావోయిస్టు పార్టీకి అగ్ర నాయకత్వం లేక బలహీనపడిందని ఉషారాణి ద్వారా తెలుసుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం పార్టీలోకి కొత్తగా వస్తున్న వారికి ఐడియాలజీ లేదని.. నాయకత్వ లోపం వల్ల మావోయిస్టు పార్టీ దానికదే కూలిపోతుందని వ్యాఖ్యానించారు. సెంట్రల్ కమిటీలో కీలకమైన 11 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని.. వారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పారు. సెంట్రల్ కమిటీ మెంబర్ ముప్పాళ్ల లక్ష్మణరావు నడవలేకపోతున్నారని, కనీసం మాట్లాడే పరిస్థితిలో కూడా లేరని.. ఆనంద్ కూడా అనారోగ్యంతో ఉన్నారని పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోతే మంచి వైద్యసేవలు అందిస్తామని, సాధారణ జీవితం గడపవచ్చని చెప్పారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి పోలీసు విభాగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. -
మావోయిస్టుల ఇలాకాలో పోలీస్ బాస్లు
చర్ల: మావోయిస్టుల ఇలాకాగా పేరున్న ఛత్తీస్గఢ్కు సరిహ ద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నాపురం వద్ద సీఆర్పీఎఫ్ క్యాంపును వారు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్ ద్వారా చెన్నాపురం చేరుకున్న వారు క్యాంపు పరిసరాలతో పాటు అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. అదనపు డీజీపీ ఎస్.ఎస్.చతుర్వేది, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ అదనపు డీజీ నళిన్ప్రభాత్, సదరన్ సెక్టార్ ఐజీ మహేష్చంద్ర లడ్డా, కుంట డీఐజీ రాజీవ్కుమార్ ఠాకూర్, డీఐజీ ఎస్.ఎన్.మిశ్రా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా క్యాంపులు సీఆర్పీఎఫ్ క్యాంపు ప్రారంభించిన అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ, నక్సల్స్ నిర్మూలన కోసం కేంద్ర హోం శాఖ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగా లను పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరులో క్యాంపులు ఏర్పాటుచేయగా, జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్పీఎఫ్ బలగాల సమన్వయంతో ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు. కాగా, అమాయకపు ఆదివాసీ గిరిజనులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు తెలంగాణలో ఆదరణ కోల్పోయారని మహేందర్రెడ్డి పేరొన్నారు. సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్సింగ్ మాట్లాడుతూ మావోయిస్టులకు అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల పోలీసుల పనితీరు అభినందనీయమని తెలిపారు. -
నిమజ్జనం పై డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ప్రకటన
-
వజ్రోత్సవాల ముగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలుగా ఘనంగా నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ముఖ్య అతిధిగా హాజరు కాను న్నారు. ఈ వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను, ఇటీవల అంతర్జాతీయ వేదికపై ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను సీఎం సన్మానించనున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత విభావరి, వాయిద్య కళాకారుడు శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన, వార్సీ బ్రదర్స్ ఖవ్వాలి, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. వజ్రోత్స వాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియో ప్రదర్శిస్తారు. అనంతరం లేజర్ షో, ఆ తర్వాత బాణాసంచా కార్యక్రమా లుంటాయని అధికారులు తెలిపారు. వజ్రోత్స వాల్లో భాగంగా థియేటర్లలో ప్రదర్శించిన గాంధీ సినిమాను దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు తిలకించినట్టు అధికారులు పేర్కొన్నారు. -
పుస్తక ప్రదర్శనతో బాపూ భావజాలం ఆకళింపు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ ఆలోచనలను, భావజాలాన్ని ఆకళింపు చేసుకొనేందుకు పుస్తక ప్రదర్శన ఎంతో దోహదం చేస్తుందని సీఎస్ సోమేశ్కుమార్ అన్నారు. ‘మంచి పుస్తకం చెంతన ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే‘.. అన్న గాంధీ సూక్తిని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ ఇండోర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి సహా ఇతర సీనియర్ అధికారులతో కలసి సీఎస్ శనివారం పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ చరఖాను, చేనేత మగ్గాన్ని, ఎద్దు గానుగ యంత్రాన్ని తిలకించారు. -
స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వజ్రోత్సవాల ప్రారంభోత్సవాన్ని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఆయన సందేశానికి ముందు 75 మంది వీణ వాయిద్య కళాకారులతో దేశభక్తి గీతాల వాయిద్య ప్రదర్శన, స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఇతర నృత్యాలు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన డీజీపీ మహేందర్రెడ్డి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ డైరక్టర్ రాజమౌళి, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరక్టర్ హరికృష్ణ తదితరులతో కలిసి హెచ్ఐసీసీ వేదికను పరిశీలించారు. ఈనెల 8న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆహ్వానితులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
సీసీసీ ఆలోచన ఆయనదే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మానవ సమాజం ఉన్నంతకాలం.. పోలీసింగ్ వ్యవస్థ నిరంతరం కొనసాగుతుందని, ఆ వ్యవస్థ ఎంత బలంగా, శ్రేష్టంగా ఉంటే.. సమాజానికి అంత రక్షణ, భద్రత ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. హైదరాబాద్లో ఇంతటి కమాండింగ్ వ్యవస్థ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరని, కానీ, చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ భవన నిర్మాణానికి ముఖ్య ప్రేరణ, కర్త, రూపకర్త, ప్రధాన వ్యక్తి డీజీపీ మహేందర్రెడ్డినే అని సీఎం కేసీఆర్ తెలిపారు. మొత్తం క్రెడిట్ ఆయనకే దక్కాలని, అలాగే ఈ భవనం నిర్మాణానికి సహకరించిన సంబంధిత శాఖ మంత్రి, విభాగాలు, కంపెనీలు కూడా ఇందులో భాగం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి సీసీసీ నిర్వహణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ.. యావత్ పరిపాలనకు ఉపయోగకరంగా ఉంటుందని, నార్మల్ రోజుల్లో ఒకలా.. విపత్తుల రోజుల్లో మరోలా ఉంటుందని ఆ సమయంలో మహేందర్రెడ్డి చెప్పారని గుర్తు చేసుకున్నారు. గొప్పపనితనం ప్రదర్శించేందుకు గొప్ప వేదిక ఏర్పాటును సాకారం చేసుకున్నందుకు తెలంగాణ పోలీస్ శాఖకు హృదకపూర్వక అభినందనలు తెలిపారు. రెండేళ్ల క్రితమే ఈ భవనం పూర్తి కావాలని, కరోనా వల్ల కొద్దిగా ఆలస్య మైందని సీఎం కేసీఆర్ వివరించారు. సమాజం కోసం పాటుపడుతున్న పోలీసులకు సెల్యూట్ చెప్పిన సీఎం కేసీఆర్.. సంస్కారవంతమైన పోలీసింగ్ వ్యవస్థ అంతటా రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ను అరికట్టేందుకు సమర్థవంతంగా పని చేయాలని, ఆ మహమ్మారిని తరిమి కొట్టాలని పోలీస్ శాఖకు పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ సహకారం పోలీసులకు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారాయన. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ మహిళా భద్రత అంశాన్ని.. తమ వెంట వచ్చిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిణితో స్వయంగా పరీక్షించి ధృవీకరించిన ఘటనను సైతం సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. ఫ్రెండ్లీ పోలీస్గా తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశానికి కలికితురాయి నిలవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
టెక్నాలజీ వినియోగంతో మరింత భద్రత
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం వల్ల మరింత పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టడానికి వీలవుతుందని డీజీపీ మహేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఉబెర్ యాప్ సంస్థతో కలసి లైవ్ లింక్ షేర్ టూల్ను ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వల్ల రియల్ టైమ్ లొకేషన్తో పాటు యూజర్ వివరాలు త్వరితగతిన తెలుస్తాయని, దీని వల్ల ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించడం సులభమవుతుందన్నారు. భద్రత కోసమే: ఉబెర్ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు తాము సేఫ్టీ టూల్ కిట్ ద్వారా లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించామని ఉబెర్ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే తమ యాప్లో అనేక భద్రతా అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ లైవ్ లింక్ టూల్ కిట్ సోమవారం నుంచి పోలీస్ శాఖకు లింకు అవుతుందని తెలిపారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న స్వాతిలక్రా తదితరులు సేఫ్టీ టూల్ కిట్ పని ఇలా.. డ్రైవర్ భద్రతతో పాటు ప్రయాణికుల సేఫ్టీకి ఉబెర్ సంస్థ యాప్ లైవ్ లొకేషన్, పోలీస్ కంట్రోల్ సెంటర్, డయల్ 100కి చేరిపోయేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉబెర్ యాప్లోని సేఫ్టీ టూల్ కిట్లో బ్లూ షీల్డ్ క్లిక్ చేయగానే వాహనం నంబర్, డ్రైవర్ పేరుతో పాటు ప్రతీ నాలుగు సెకండ్లకు ఒకసారి వాహనం లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరిపోతుంది. ప్రయాణికులు సైతం ఈ లింక్తో షేర్ ఆప్షన్ క్లిక్ చేయవచ్చు. ఒకవేళ షేర్ వద్దనుకుంటే ఉబెర్ యాప్లోని ఎస్ఓఎస్ ఉపయోగించుకోవచ్చు. ప్రమాద సమయంలో ఎస్ఓఎస్ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్కు క్షణాల్లో కాల్ వెళ్తుంది. దీని వల్ల అటు ప్రయాణికులు, ఇటు వాహన డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదం ఉన్నా దగ్గరలోని పెట్రోలింగ్ వాహనం సంఘటన స్థలికి చేరుకుంటుంది. -
డీజీపీనీ వదలని సైబర్ నేరగాళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖుల ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్ప డుతున్న సైబర్ నేరగాళ్లు ఈ సారి ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకొని అధికారులు, ప్రజలకు టోకరా వేసే ప్రయత్నం చేశారు. ఓ నంబర్కు మహేందర్రెడ్డి ఫొటో పెట్టి ఒక అధికారికి మెసేజ్ పెట్టారు. వెంటనే ఆ అధికారి అప్రమత్తమై మహేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నైజీరియా నుంచి సైబర్ మోస గాళ్లు ఈ పని చేసినట్లు గుర్తించారు. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ కంపెనీకి ఫిర్యాదు చేసి ఆ సెల్ నంబర్ను బ్లాక్ చేయించినట్టు అధికారులు వెల్ల డించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి ప్రజలకు సూచించారు. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, డీపీల ద్వారా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారని, అలాంటి నంబర్లపై నిఘా పెట్టాలని సూచించారు. -
డీజీపీ మహేందర్ రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్ల వసూళ్లు
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఏదో రకంగా కేటుగాళ్లు.. ప్రజలను బురిడీ కొట్టించి.. డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని సైతం సైబర్ నేరగాళ్లు వదలలేదు. 97857 43029 నెంబర్కు డీజీపీ డీపీ పెట్టి కేటుగాళ్లు మోసాలను తీర లేపారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు, సామాన్యులకు డీజీపీ పేరుతో సైబర్ నేరగాళ్లు మెసేజ్లు పంపుతున్నారు. దీనిపై ఆరా తీసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఈ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: 1,518 సివిల్ కేసుల పరిష్కారం -
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీతో సైబర్ నేరాల ఆటకట్టు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్స్లెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐటీ సంస్థలు, ఐఐటీ, ఐబీఎం సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో సైబర్ సేఫ్టీ, జాతీయ భద్రత అనే అంశంపై శనివారం జరిగిన జాతీయ సదస్సులో డీజీపీ మహేందర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. సైబర్ నేరాల నిరోధంపై రూపొందించిన చైతన్య, అవగాహన పోస్టర్లను డీజీపీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రతీ స్టేషన్లో సైబర్ వారియర్ సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీస్ కీలక పాత్ర పోషిస్తోందని దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 800 లకు పైగా పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సైబర్ వారియర్లుగా నియమించామని డీజీపీ తెలిపారు. జిల్లా, కమిషనరేట్, రాష్ట్రస్థాయిలోను సైబర్ నేరాల పరిశోధన విభాగాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సైబర్ నేరం అనేది వ్యక్తులనే కాకుండా ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలకు ముప్పుగా పరిణమించిందని తద్వారా దేశ భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సదస్సుల్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర హోంశాఖ డైరెక్టర్ పౌసమి బసు, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇంటెలిజెన్స్ ఐజీ రాజేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ట్రాన్స్జెండర్ల డిమాండ్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: మహిళలు, పురుషులతో సమానంగా తమకూ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఇన్వార్డులో వైజయంతి వసంత, ఓరుగంటి లైలా, చంద్రముఖి మువ్వల తదితరులు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన అన్ని విభాగాల్లోని పోస్టుల్లో తమకు ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని బుధవారం డీజీపీ కార్యాలయం వద్ద ట్రాన్స్జెండర్లు నిరసన చేపట్టారు. అందరితో సమానంగా బతికే హక్కు ట్రాన్స్జెండర్లకు ఉందంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులిచ్చిన తీర్పులను, 2021లో కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్లను కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. బోర్డు విడుదల చేసిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు తమకు 45 రోజుల సమయం ఇవ్వాలని, దరఖాస్తు ఫారమ్లో స్త్రీ, పురుషులతో పాటుగా ట్రాన్స్జెండర్ ఆప్షన్ జోడించాలని డిమాండ్ చేశారు. -
‘బిహార్’.. హాట్హాట్..
సాక్షి, హైదరాబాద్: పొలిటికల్ వర్సెస్ పోలీస్.. ఇది కొత్తదేమీ కాదు కానీ తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా బిహారీ బ్యాచ్ అంటూ రాష్ట్రంలోని కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లను ఉద్దేశించి వారం రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డీ.. రాజీనామా చేసి కేసీఆర్ ముఖాన కొట్టు అన్న వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు దీటుగానే స్పందించాయి. ఒక రాష్ట్రానికి చెందిన అధికారులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం బుధవారమే తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా రేవంత్రెడ్డి గురువారం సంబంధిత ఐఏఎస్లు, ఐపీఎస్లకు ఇచ్చిన కీలక పోస్టింగ్లపై రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో ఈ వివాదం మరింత ముదురుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఒకే కుర్చీలో కూర్చోవడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని రేవంత్ ఆ లేఖలో సూచించారు. దీనిపై తాజాగా ఐపీఎస్ అధికారుల సంఘం స్పందించింది. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టింగుల్లో పక్షపాత వైఖరి తెలంగాణలో బిహార్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలతో పాటు కీలకమైన విభాగాలను కేటాయించ డంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఆ విభాగాలకు అధిపతులుగా పనిచేయడం వల్ల అవినీతి పెరిగిపోతోందని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగులపై పక్షపాత వైఖరి వీడాలంటూ గురువారం సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 157 మంది ఐఏఎస్లు, 139 మంది ఐపీఎస్ అధికారులుండగా ప్రభుత్వ, ప్రధాన కార్యదర్శి నుంచి ఇన్చార్జి డీజీపీ వరకు బిహార్ అధికారులనే ఇవ్వడం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎందుకు లూప్లైన్లో పెడుతున్నారో చెప్పాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై ఐపీఎస్ల ఆగ్రహం రేవంత్రెడ్డి చేసిన బిహార్ బ్యాచ్ వ్యాఖ్యలను రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం గురువారం తీవ్రంగా ఖండించింది. ఆలిండియా సర్వీసు రూల్స్ తెలియకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని ఒక ప్రకటనలో విమర్శించింది. అఖిల భారత సర్వీస్ రూల్స్ ప్రకారం జరిగే అధికారుల కేటాయింపులపై వివాదాస్పదంగా మాట్లాడటం సరైంది కాదని పేర్కొంది. పోస్టింగ్ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ విచక్షణతో కూడుకున్నదని కూడా స్పష్టం చేసింది. డీజీపీ మహేందర్రెడ్డి బలవంతంగా సెలవులో వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, బిహార్కు చెందిన ఐపీఎస్లను డీజీపీ చేసేందుకే ఇలా చేశారని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసోసియేçషన్ తీవ్రంగా ఖండించింది. మహేందర్రెడ్డి ఇంట్లో జారిపడటంతో డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి కోసం మెడికల్ లీవులో వెళ్లారని వివరించింది. వ్యక్తిగత ప్రయోజనం కోసం అధికారుల మధ్య చిచ్చు పెట్టి, రాష్ట్రాల వారీగా విభజించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా స్పందించింది. బలవంతపు సెలవు నిజం కాదు: డీజీపీ తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందం టూ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్త వం కాదని డీజీపీ మహేందర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంట్లో జారిపడిన సంఘటనలో ఎడమ భుజంపైన ఎముకకు మూడు చోట్ల హెయిర్లైన్ ఫ్రాక్చర్ జరిగిందని తెలిపారు. లోపలి గాయం మానేందుకు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినందునే ఫిబ్రవరి 18వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నానని వివరించారు. వైద్యుల సలహా మేరకు తిరిగి విధుల్లో చేరతానని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందం టూ తప్పుడు, బాధ్యతా రహిత ప్రచారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఒక పార్టీకి రాష్ట్ర నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదని, తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈ విధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీ వ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఒక ఉన్నత స్థాయి, బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఈ విధమైన ఆరోపణలను చేయడం ఆక్షేపణీయమని, ప్రభుత్వంపై అపో హలు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
సంజయ్పై దాడి సంగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉద్యోగుల సమస్య లపై దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ను కార్యాలయంలోకి వెళ్లి అరెస్టు చేసిన అంశంలో రాష్ట్ర సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీ, ఇతర పోలీసు అధికారులకు లోక్సభ ప్రివి లేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ అంశంలో బండి సంజయ్ ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. దాడి, అరెస్టు ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ వాదనలు విని.. ఆయన సమ ర్పించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను పరిశీలించింది. తర్వాత కొద్దిగంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమన్లు్ల జారీ అయ్యాయి. ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ శని వారం ఆదేశించారు. సమన్లు జారీ అయిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, హుజూరా బాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి, జమ్మికుంట ఇన్ స్పెక్టర్ కొమ్మినేని రాంచందర్రావు, హుజూరా బాద్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస్, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాసరావు, కరీంనగర్ టూటౌన్ ఇన్స్పెక్టర్ చలమల్ల నరేశ్ ఉన్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల భరతం పడతాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: నకిలీ డిగ్రీలను తయారు చేస్తున్న నేరస్తుల భరతం పడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. దీనికోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమన్వయంతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సోమవారం ఆయన ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ యూనివర్సిటీలు ఇచ్చే సరిఫికెట్లన్నీ ఒకే పోర్టల్ ద్వారా సంబంధిత కంపెనీలు తేలికగా పరిశీలించుకునే అవకాశం ఉందన్నారు. ఎక్కడైనా నకిలీ అని తేలితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వీసీలకు సూచించారు. ఈ ప్రక్రియలో పోలీసులు పూర్తి సహకారం అందిస్తారని చెప్పారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ దిశగా అన్ని యూనివర్సిటీలు డేటాను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ నకిలీల గుర్తింపునకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామన్నారు. అవసరమైన సంస్థలు పోర్టల్కు లాగిన్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2016 వరకు అన్ని సర్టిఫికెట్లు ఆన్లైన్ చేశామని, త్వరలో మిగతా సంవత్సరాలవి కూడా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ వెంకటరమణ, యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
ఏడాదంతా ‘కోవిడ్ డ్యూటీ’లోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని డీజీపీ ఎం. మహేందర్రెడ్డి తెలిపారు. 2020 తరహాలోనే 2021లో సంవత్సరమంతా కోవిడ్ విధుల్లో బాధ్యతాయుతంగా పనిచేశామని... వైద్య, ఆరోగ్య, రెవెన్యూ సహా ఇతర శాఖల సమన్వ యంతో ప్రజలకు సేవలు అందించామన్నారు. దీంతో ప్రజల నుంచి పోలీసులకు మంచిపేరు లభించిందన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఇతర ఉన్నతాధికారులతో కలసి వార్షిక నేర నివేది క–2021ను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ శాం తిభద్రతల పరిరక్షణలో సఫలీకృతమయ్యా మని, నేరాల నియంత్రణ, నేరస్తులను అరె స్టులో మంచి ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్రాన్ని నేర, మావోయిస్టురహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. 2020లో లాక్డౌన్ నేపథ్యంలో నేరాలు తక్కువగా నమోదయ్యాయని, ఈ నేపథ్యంలోనే ఆ ఏడాదితో పోలిస్తే 2021లో నేరాల నమోదు 4.6 శాతం పెరిగిందని వివరించారు. 2021లో జరిగిన హత్యలు, కిడ్నాప్లు సహా వివిధ నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మొత్తం 1,32,906 కేసులు... వివిధ నేరాలకు సంబంధించి 2020లో మొ త్తం 1,35,537 నమోదవగా 2021లో మొత్తం కేసుల సంఖ్య 1,32,906గా నమోదైంది. 2021లో 838 హత్య కేసులు, 1,218 కిడ్నాప్, 2,382 రేప్ కేసులు నమోదయ్యాయి. 98 మంది మావోయిస్టుల అరెస్ట్.. ♦2021లో 98 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. మరో 133 మంది లొంగిపోయారు. స్టేట్ కమిటీలో ఇంకా 100 ఉండగా వారిలో కేవలం 30 మందే తెలంగాణకు చెందిన వారు. మిగతా 70 మంది ఛత్తీస్గఢ్వాసులు. ఆ రాష్ట్రంతో కలసి మావోయిస్టులను కట్టడి చేస్తున్నాం. 38,812 మంది నేర నిర్ధారణ ♦2021లో మొత్తం 38,812 మంది నిందితు లు దోషులుగా నిరూపితం కాగా.. 80 కేసుల్లో 126 మందికి జీవితఖైదు పడింది. శిక్షల శాతం 48.5 నుంచి 50.3 శాతానికి చేరింది. పదేపదే నేరాలు చేస్తున్న 664 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించాం. 5 నిమిషాల్లోనే స్పాట్కు... ♦డయల్ 100 నంబర్కు వచ్చే కాల్స్కు పోలీసులు సత్వరం స్పందించాలనే లక్ష్యంతో రెస్పాన్స్ టైమ్ను గణిస్తున్నాం. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 7 నిమిషాల్లో పట్టణాలు, నగరాల్లో 5 నిమిషాల్లో పోలీసులు స్పాట్కు చేరుకుంటున్నారు. రూ. 53 కోట్ల విలువైన సొత్తు రికవరీ... ♦2021లో మొత్తం 17,429 దొంగతనాలు నమోదవగా రూ. 113 కోట్ల విలువైన సొ త్తు దొంగలపాలైంది. వాటిలో 7,682 కే సులను (44%) కొలిక్కి తెచ్చి రూ. 53 కో ట్ల (47%) విలువైన సొత్తు రికవరీ చేశాం. 838 జీరో ఎఫ్ఐఆర్లు... ♦నేరం జరిగినప్పుడు పరిధుల సమస్యతో బాధితుడు ఠాణాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడకుండా ఉండటానికి రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేపడుతున్నాం. 2020లో ఇలాంటి కేసులు 517 నమోదవగా 2021లో అవి 838కి పెరిగాయి. వాటిని ఆయా పరిధిల్లోని ఠాణాలకు బదిలీ చేస్తున్నాం. 4 నెలల్లో ట్విన్ టవర్స్... ♦హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్మి తమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 3–4 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ఇక్కడ నుంచి మానిటర్ చేయవచ్చు. రిటైరయ్యేలోగా ప్రతి పోలీసుకూ ఇల్లు ♦ప్రతి ఒక్కపోలీసుకు రిటైరయ్యే సమ యానికి సొంత ఇల్లు ఉండాలన్నదే మా లక్ష్యం. దీనికి ప్రభుత్వం సహకరిస్తోంది. ప్రతిజిల్లాకు ఓ పోలీసు కల్యాణ మం డపం, అనువైన ప్రతిచోటా పెట్రోల్ బం కుల ఏర్పాటుతో ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. సిబ్బందికి నామమాత్రపు వడ్డీ లేదా వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం. -
ఈటల ఓటమికి ప్రయత్నించారంటూ వెయ్యికి పైగా ఫోన్లు: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శనివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో పాటు డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్లో గెల్లు శ్రీనివాస్కు మద్దతు ఇచ్చారని, ఈటల రాజేందర్ ఓటమికి ప్రయత్నించారని ఆగంతకులు ఫోన్లు చేస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. తన ఫోన్ నెంబర్ను ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియాలో పెట్టి ఆగంతకులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండ్రోజుల నుంచి వెయ్యికి పైగా ఫోన్లు వచ్చాయని, దీని వెనుక ఎవరున్నారో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీని కోరినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. తనపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం బాధిస్తోందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తనను ఇటీవల అభినందించిన వ్యవహారాన్ని గుర్తుచేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హోంమంత్రి, డీజీపీ నుంచి న్యాయం చేస్తామన్న హామీ లభించిందని కృష్ణయ్య తెలిపారు. (చదవండి: TSRTC: బస్సు చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్) -
డీజీపీ, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: డీజీపీ మహేందర్రెడ్డితోపాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగిన మీడియా చిట్చాట్లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజికవర్గం ఆధారంగా డీజీపీని అనుమానిస్తున్నారని, ఇది తగదని అన్నా రు. పోలీసుల్లో ఒకే విభాగానికి ప్రభుత్వపెద్దలు పెద్దపీట వేస్తున్నారని, పోలీసు శాఖ రెండు వర్గాలుగా చీలిపోయిందని వ్యాఖ్యానించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా పేరొందిన కరీంనగర్ జిల్లాకు చెందిన వేణుగోపాల్రావు, నర్సింగరావు, ప్రవీణ్రావు, రమణకుమార్లతో కూడిన 30 మంది బృందంతో రాజకీయ నేతలపై ఆధునిక సాంకేతికతతో నిఘా పెట్టారని, దీని కోసం ఓ విశ్రాంత ఐపీఎస్ నేతృత్వంలో ప్రత్యేక సెల్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవర్గానికి చెందిన ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా తమవర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారని, ఈ మేరకు ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి గజానన్ని డిప్యుటేషన్ మీద తీసుకువచ్చారని ఆరోపించారు. తనకు అనుకూలమైన అధికారులకు హైదరాబాద్లో పోస్టింగులు ఇప్పించుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. వాటాల పంచాయితీతోనే ఉపఎన్నిక ఇరవై ఏళ్లు మంత్రి హరీశ్రావుతో సహవాసం చేసిన ఈటల రాజేందర్ అకస్మాత్తుగా దొంగ ఎలా అయ్యారని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ చైర్మన్గా ఉన్న టీఆర్ఎస్ అనే కంపెనీలో వాటా అడుగుతున్నాడన్న అక్కసుతోనే రాజేందర్ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ము పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాలే ఈటల రాజీనామాకు దారితీశాయని, అందుకే హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ తోడుదొంగలేనని విమర్శించారు. ఏడేళ్లలో ప్రధాని గ్యాస్, పెట్రో, నిత్యావసరాల ధరలు పెంచడం తప్ప ఇంకేమీ చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ నయా నిజాం అని, తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు అల్లుడు హరీశ్రావు అనే ఖాసీం రిజ్వీని దింపారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీలో కేసీఆర్ బీజేపీ, నడ్డా బీజేపీ అని రెండు విభాగాలు ఉన్నాయని, బండి సంజయ్ ఆటలో అరటి పండు అని వ్యాఖ్యానించారు. అందుకే మురళీధర్ రావు, సుగుణాకర్రావు, విద్యాసాగర్రావులు బండి సంజయ్ని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 2022లో ముందస్తు ఎన్నికలకు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్లో ముసలం పుడుతుందని రేవంత్ జోస్యం చెప్పారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు 2022 డిసెంబర్లో కేసీఆర్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. సీఎం కేసీఆర్కు సూసైడ్ టెండెన్సీ ఉందని, ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెదరగొట్టడం ఆయనకు అలవాటేనని అన్నారు. ఇందుకు 2004 నుంచి 2018 వరకు తన పార్టీ ప్రజాప్రతినిధులు, ఆయన చేసిన రాజీనామాలు, ముందస్తు ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. దళితబంధు కోసం ఇప్పుడు కేటాయించిన రూ.రెండు వేల కోట్లనే విడుదల చేయలేదని,మాటలతో మభ్యపెట్టే కేసీఆర్ను 2022 ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడిస్తారని, ఆ దెబ్బకు కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటారని అన్నారు. హైదరాబాద్లో వరద సాయం కోసం రూ.10 వేలే సరిగా ఇవ్వనివారు, దళితబంధు కింద లక్షలాది మందికి రూ.10 లక్షల చొప్పున ఎలా ఇస్తారని ప్రశ్నించారు. -
తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: నాలా విషాదం: మణికొండ డీఈ సస్పెన్షన్! -
మహిళలపై నేరాలకు సైబర్ ల్యాబ్తో చెక్: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ ల్యాబ్ దోహ దపడుతుందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఈ తరహా నేరాలను నివారించేందుకు రాష్ట్ర పోలీసుశాఖలో సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర మహిళాభద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి.స్వాతిలక్రా, సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ పరిశోధనాకేంద్రం (సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్) అధికారుల మధ్య కుదిరిన అవగాహనాఒప్పందంపై శుక్రవారం డీజీపీ సమక్షంలో సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఐ.జి సుమతి, సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్ డైరెక్టర్ ప్రసాద్ పాటిబండ్ల తదితరులు హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50 శాతమున్న మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, దీనిలో భాగంగానే సైబర్ ల్యాబ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందినప్పుడే వాటిని అరికట్టడం సాధ్యమవుతుందని, సైబర్ నేరాలపట్ల ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు సైబర్ ల్యాబ్ చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. 2020–21ను సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సైబర్ నేరాల నియంత్రణ, పరిష్కారానికి సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని స్వాతిలక్రా అన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్ట్రాగాం, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల ద్వారానే ఈ నేరాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, దేశంలోనే తొలిసారిగా ఈ సైబర్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. -
దేశంలోనే తొలి మహిళా సైబర్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సైబర్ ల్యాబ్ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డితో సీఆర్సీఐడీఎఫ్ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఫోరెన్సిక్)తో డీజీపీ కార్యాలయంలో శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనున్నారు. ఈ కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి కూడా పాల్గొంటారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ)తో పాటు, మహారాష్ట్ర పోలీసులతో పలు ప్రాజెక్టుల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. రాష్ట్ర విమెన్సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ సైబర్ ల్యాబ్ నడుస్తుంది. ఇందుకోసం విమెన్సేఫ్టీ వింగ్ మూడో అంతస్తులో ల్యాబ్ నిర్మించారు. ఇందులో పనిచేసేందుకు డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు, సైబర్ క్రైం ఇన్వెస్టిగేటర్స్, కంటెంట్ రైటర్స్ను నియమించారు. ఈ నెలాఖరున కార్యకలాపాలు ప్రారంభించనుంది. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత
-
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది.మావో అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ కుమారుడు రావుల రంజిత్ బుధవారం రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం రంజిత్ దండకారణ్యం బెటాలియన్ కమిటీ చీఫ్గా కొనసాగుతున్నాడు. కాగా రెండు సంవత్సరాల క్రితం తండ్రి రామన్న ఆనారోగ్య సమస్యతో రామన్న చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రంజిత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ముగ్దుర్ మండలం బెక్కల్ గ్రామం.ఈ సందర్భంగా రావుల రంజిత్ను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడారు. '' మావోయిస్టు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ ప్రస్తుతం ప్లాటున్ కమిటి మెంబర్గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా కు చెందిన మావోయిస్టు నేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న కుమారుడు రంజిత్ 1998లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించాడు. తండ్రి రామన్న ఆధ్వర్యంలో రంజిత్ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2017లో రామన్న సలహా మేరకు సెకండ్ బెటాలియన్ లో రంజిత్ జాయిన్ అయి 2019 వరకు మెంబర్గా వ్యవహరించాడు. అయితే తండ్రి మరణం తర్వాత రంజిత్ అనేక అవమానాలకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో పార్టీ మాత్రం అతని లొంగుబాటుకు అంగీకరించలేదు. ఈ మధ్యన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తనంతట తాను లొంగిపోవాలని రంజిత్ భావించాడు. 2017 నుండి 2019 ఆమ్స్ బెటాలియన్ లో పని చేసాడు.2018 కాసారం అటాక్ లో కీలక పాత్ర పోషించాడు..2021 లో జీరం అటాక్తో పాట 2020 మినప అటాక్లో సైతం రంజిత్ చురుగ్గా వ్యవహరించాడు. కరోనా పాండమిక్ సమయంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నారు. తెలంగాణ రాష్టం నుంచి 11 మంది, ఆంద్రప్రదేశ్ నుంచి 3 మంది సెంట్రల్ కమి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న 14 మంది మావోయిస్టులు లొంగిపోవాలి. 4 లక్షల పరిహారం తో పాటు ప్రస్తుత ఖర్చులకు 5 వేలు అందజేస్తున్నాం.'' అంటూ తెలిపారు. -
అవగాహనతోనే ఆన్లైన్ వేధింపులకు చెక్: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: డేటా వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆన్లైన్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు, మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన, విద్యాశాఖ కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా, విమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి రిత్విక, సైబర్సేఫ్టీ నిపుణులు రక్షితా టాండన్ హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ, టీనేజీ విద్యార్థులు, మహిళలు సైబర్ వేధింపుల బారిన పడే ప్రమాదాలు అధికంగా ఉన్నాయని, ఇలాంటి వాటిపై అవగాహన ఉంటే అప్రమత్తంగా ఉండొచ్చన్నారు. సైబ్హర్–3లో విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతోంది. జూలై 1 నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా 10 నెలలపాటు నిర్వహించబోతున్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేయనున్నారు. కాగా, దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న గౌరవం, కీర్తి మరింత పెంచే విధంగా పోలీస్ అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. మంగళవారం పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో రాజీ పడొద్దన్నారు. వర్టికల్స్ అమలుపై డీజీపీ అభినందన వర్టికల్ ఫంక్షనల్ అమలులో 2020 –21లో ఉత్తమ ఫలితాలు సాధించిన 223 పోలీస్ స్టేషన్ల అధికారులకు డీజీపీ ప్రత్యేక పురస్కారాలు ప్రకటించారు. 17 ఫంక్షనల్ వెర్టికల్స్ అమలులో తాడూర్ పోలీస్ స్టేషన్కు మొదటి స్థానం, కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్కు రెండవ, రామగుండం పోలీస్ స్టేషన్కి 3వ స్థానం, అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు నాలుగవ స్థానం లభించాయి. ఈ సందర్భంగా సంబంధిత ఎస్హెచ్ఓలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. అనంతరం ఇన్వెస్టిగేషన్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
మరియమ్మ కుమారుడికి డీజీపీ మహేందర్రెడ్డి పరామర్శ
సాక్షి, నల్గొండ/ఖమ్మం: దొంగతనం కేసులో అరెస్టయిన దళిత మహిళ మరియమ్మ లాకప్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె కుమారుడు ఖమ్మం జిల్లాలోని సంకల్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్ను తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి ఆదివారం పరామర్శించారు. లాకప్డెత్ ఘటనపై కుటుంబసభ్యుల నుంచి డీజీపీ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు అడ్డగూడురులో ఏం జరిగిందని, ఎవరు మరియమ్మ, ఉదయ్ కిరణ్ను కొట్టారని అడిగి తెలుసుకున్నారు. విచారణ సమయంలో వారిని ఎంతమంది కొట్టారని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.డీజీపీ ముందు ఉదయ్ కిరణ్ కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు తమను అత్యంత క్రూరంగా కొట్టారని డీజీపీకి తెలిపాడు. తమకు న్యాయం చేయాలని ఉదయ్ కిరణ్ డీజీపీని వేడుకున్నాడు. ప్రభుత్వం అండగా ఉంటుందని డీజీపీ భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులను సస్పెండ్ చేశామని చెప్పారు. అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మరియమ్మ ఘటన బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని డీజీపీ తెలిపారు. మరియమ్మ కుటుంబం నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియ జేస్తామన్నారు. రూల్స్ విరుద్ధంగా ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: మరియమ్మ, ఆమె కుమారుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ? -
ఖమ్మం లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన
-
Telangana: పోలీసులకు తీపికబురు
సాక్షి, హైదరాబాద్: పోలీసు సిబ్బందికి డీజీపీ మహేందర్రెడ్డి తీపి కబురు అందించారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు అందరికీ ఇంటి రుణపరిమితిని పెంచుతూ, అదే సమయంలో రుణాల వడ్డీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన భద్రత– ఆరోగ్య భద్రత ట్రస్ట్ బోర్డు మీటింగ్లో.. ప్లాటు కొనుగోలు వడ్డీరేటును 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించారు. పిల్లల విదేశీ విద్యా రుణాలను అన్ని హోదాల్లోని వారికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ఈ సందర్భంగా డీజీపీకి తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇల్లు కట్టుకునేందుకు లోన్లు ఇలా... కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై స్థాయి దాకా రూ. 35 లక్షల నుంచి 40 లక్షలు, ఎస్సై నుంచి సీఐ వరకు రూ. 45 లక్షల నుంచి 50 లక్షలు, డీఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు రూ.55 లక్షల నుంచి 60 లక్షలు, ఐపీఎస్లకు రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షలకు రుణ పరిమితి పెంచారు. ప్లాటు కొనుగోలుకు రుణం పెంపు కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు రూ. 20 లక్షల నుంచి 25 లక్షలు, ఎస్సై నుంచి సీఐ వరకు రూ. 25 లక్షల నుంచి రూ.30 లక్షలు, డీఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు రూ.30 నుంచి రూ.35 లక్షలు, ఐపీఎస్లకు రూ.40 లక్షల నుంచి 45 లక్షలకు రుణ పరిమితిని పెంచారు. చదవండి: Telangana: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త -
తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచుతున్నాం: డీహెచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని డీహెచ్ శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. గతనెల 29న లక్ష కరోనా పరీక్షలు జరిగాయని, రెండోదశ ఫీవర్ సర్వేలో 68.56 శాతం మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. తెంగాణలో కరోనా కట్టడి చర్యలపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కోవిడ్ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా డీహెచ్, డీజీపీ, కార్మిక జైళ్లశాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. ఈ సందర్భంగా డీహెచ్ తన వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్ ఆస్పత్రులపై ఫిర్యాదుల పరిశీలనకు ముగ్గురు ఐఏఎస్లతో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.ఇప్పటి వరకు 10 ఆస్పత్రుల కరోనా చికిత్స లైసెన్స్ రద్దు చేసినట్లు, బ్లాక్ ఫంగస్ మందులకు దేశవ్యాప్తంగా కొరత ఉందన్నారు. బ్లాక్ ఫంగస్ ఔషధాలు కొనుగోలు చేస్తున్నామని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు 1500 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, కరోనా చికిత్సలకు తగినన్ని ఆస్పత్రులు, పడకలు ఉన్నాయన్నారు ఔషధాల బ్లాక్ మార్కెట్పై 150 కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. ఈ మేరకు డీజీపీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు పెట్టి.. రూ.35.81 కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించనందుకు 41,872 కేసులు నమోదు చేసినట్లు, జనం గుమిగుడినందుకు 13,867 కేసులు పెట్టినట్లు తెలిపారు. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు, లాక్డౌన్ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని హైకోర్టుకు వెల్లడించారు. చదవండి: పిల్లలకు థర్డ్వేవ్ అలర్ట్.. ముప్పును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు! మద్యం ప్రియులు.. మే నెలలో ఎంత తాగారో తెలుసా! -
కరోనా చైన్ బ్రేక్ చేయడం కోసమే లాక్డౌన్ పొడిగింపు- డీజీపీ మహేందర్ రెడ్డి
-
హైదరాబాద్లో డీజీపీ సుడిగాలి పర్యటన
-
Telangana Police: ఆపదా.. మేమున్నాం పదా!
►సార్.. నా పేరు సంతోష్ కర్ణాటకలో బ్యాంకు ఉద్యోగిని. ఆడిటింగ్ కోసం ప్రతివారం హైదరాబాద్ రావాలి. ఎలా సార్.. అంటూ డీజీపీకి ట్వీట్ చేశాడు. నిమిషాల్లో డీజీపీ బృందం స్పందించింది. ఈ–పాస్ లింక్ పంపి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ►వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉండే 9 నెలల గర్భవతి అయిన స్వర్ణ, ఆమె భర్త అశోక్ లాక్డౌన్ వల్ల సొంతూరికి వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటే గమనించిన మామునూరు ఏసీపీ వెంటనే పోలీసు వాహనంలో వారిని ఇంటికి చేర్చారు. సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కఠినతరం చేసినప్పటి నుంచి, ఎవరికి ఏ సమయంలో ఆపద వచ్చి నా డీజీపీ ట్విట్టర్ హ్యాండిల్ @TelanganaDGP టీమ్ వెంటనే స్పందిస్తోంది. ఎక్కడి నుంచి ఏ సమస్యలపై ట్వీట్ వచ్చినా.. ఆయా జిల్లాల ఎస్పీలు, సీపీలను అప్రమత్తం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా వారి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తోంది. ఆకస్మిక మరణాలు, వైద్య సాయం, రక్తదానం తదితర అత్యవసర అంశాలకు టీమ్ సభ్యులు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ పరిష్కారం కాని పక్షంలో కారణాలు వివరిస్తున్నారు. ఈ–పాస్ https//policeportal.tspolice.gov.in దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70 వేల మందికిపైగా ఈ–పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యవసరమైన వాటన్నిటినీ అనుమతిస్తూ మిగతావి తిరస్కరిస్తున్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాల వంటి వాటికి సంబంధించి దరఖాస్తులు మాత్రం పెండింగ్లో ఉంటున్నాయి. సేవా ఆహార్ యాప్.. ఈ నెల 7న తెలంగాణ పోలీసులు.. వివిధ ఎన్జీవోలు, ఫుడ్ డెలివరీ సంస్థలతో కలిసి ప్రారంభించిన సేవా ఆహార్ యాప్కు మంచి స్పందన వస్తోంది. రోజుకు 2,200 మంది కరోనా పాజిటివ్ రోగులకు ఈ యాప్ ద్వారా ఆహారం అందజేస్తున్నారు. ఇప్పటిదాకా 40 వేల ప్లేట్ల భోజనం అందించినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ నుంచి రోజూ అదనంగా మరో 200 ప్లేట్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సేవా ఆహార్యాప్ లేదా 77996 16163 వాట్సాప్ నంబరులో ఉదయం 6 గంటలలోగా ఆర్డర్ పెడితే మధ్యాహ్నానికల్లా ఆహారాన్ని ఇంటి వద్దకు లేదా ఆసుపత్రి వద్దకు వచ్చి అందజేస్తారు. రోగులు, మహిళలకు చేయూత ఉదయంపూట దారితప్పిన, రవాణా సౌకర్యా ల్లేక ఇబ్బందులు పడుతున్న రోగులు, వృద్ధు లను పోలీసులు క్షేమంగా వారి ఇళ్లకు చేరుస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సోమవారం మీర్చౌక్ ఏసీపీ ఆనంద్ ఆసుపత్రికి వెళ్తున్న మహిళలను పోలీసు వాహనంలో తరలించి చికిత్స అందేలా చూశా రు. సకాలంలో ఇంటికి చేరుకోలేకపోయిన వారిని తమ వాహనం లేదా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపుతున్నారు. సోమవారం అన్ని కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ఇలాంటి సహాయ కార్యక్రమా లు చేపట్టారు. దీనికితోడు డయల్ 100కి కాల్ చేసినా స్థానిక పోలీసుస్టేషన్కు సమాచారం అందించి సాయం అందేలా చూస్తున్నారు. -
Lockdown: ఫుడ్ డెలివరీపై కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ను కఠినతరం చేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఆదివారం పోలీసులు వెనక్కి తగ్గారు. విద్యుత్ శాఖ ఉద్యోగులపై లాఠీచార్జి విషయమై ఆ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డీజీపీతో మాట్లాడగా.. తలసేమియా రుగ్మతకు సంబంధించిన వారిని అడ్డుకోవడంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా స్పందించడంతో పోలీసులు దిగివచ్చారు. శనివారం అర్ధరాత్రి డీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో సమీక్ష నిర్వహించి ఫుడ్ డెలివరీ సేవలకు అంతరాయం కలగించరాదని ఆదేశించారు. అదే విధంగా తలసేమియా రుగ్మత గలవారిని, విద్యుత్ ఉద్యోగులను అడ్డుకోరాదని సూచించారు. దీంతో ఆదివారం పోలీసులు వారికి ఇబ్బందులు కలిగించలేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసివేశారు. జాతీయ రహదారులు మినహా రాష్ట్ర రహదారులను మూసివేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాలనీ రోడ్ల నుంచి రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు లాఠీలు ఝుళిపించడం, తనిఖీలు ముమ్మరం చేయడంతో రోడ్ల మీద జనసంచారం పూర్తిగా అదుపులోకి వచ్చింది. దీనికితోడు సరుకు రవాణా వాహనాలను నగరాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే అనుమతించడంతో రోడ్లపై వాహనాలు తగ్గిపోయాయి. అత్యవసర విభాగాలు, మెడికల్, ఫార్మా, విద్యుత్, వ్యవసాయ తదితర అనుమతి ఉన్న రంగాల ఉద్యోగులను పోలీసులు ఐడీలు చూసి అనుమతించారు. ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్రతోపాటు అన్ని జిల్లాల సీపీలు, ఎస్పీలు దగ్గరుండి పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అన్ని నగరాల్లో డ్రోన్ల ద్వారా గల్లీలు, కాలనీలను పర్యవేక్షించారు.కాగా, పాసులు కావాల్సిన వారు https://policeportal.tspolice. gov.in దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. మార్కెట్లలో రద్దీ లాక్డౌన్ మినహాయింపు సమయమైన ఉదయం 6 నుంచి 10 గంటల వరకు జనాల తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఆదివారం కావడంతో మటన్, చికెట్, చేపల మార్కెట్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. ఎక్కడా సామాజిక దూరం పాటించలేదు. అయితే, పోలీసుల ఆదేశాల మేరకు కూరగాయలు, ఇతర విక్రయదారులు ఉదయం 10 గంటలకన్నా ముందే వ్యాపార సముదాయాలు మూసివేసి ఇళ్లకు కదిలారు. అయితే, కొందరు ఆకతాయిలు మాత్రం 10 గంటల వరకు ఏదో కారణంతో కరోనా నిబంధనలు తుంగలోతొక్కి రోడ్లపై సంచరించారు. -
Lockdown: 9.30 గంటలకే వ్యాపారం ఆపేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దుకాణదారులు, వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు.. రోజూ ఉదయం 9.30కే కార్యకలాపాలు ఆపేయాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. ఎవరూ కూడా చిన్నచిన్న కారణాలతో బయటికి రావొద్దని, అవసరమైన వస్తువులన్నీ సమీపంలోనే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. శనివారం డీజీపీ గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్వయంగా తిరుగుతూ లాక్డౌన్ పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘అనవసరంగా వాహనాలు రోడ్డు మీదికివస్తే సీజ్ చేస్తాం. లాక్డౌన్ తరువాతే వాటి విడుదల ఉంటుంది. అది కూడా కోర్టు ద్వారా తీసుకోవాలి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల ఇచ్చిన మినహాయింపును సద్వినియోగం చేసుకోవాలి. లాక్ డౌన్లో అనుమతి ఉన్న పరిశ్రమలు కూడా ఈ సమయానికి అనుగుణంగానే షిప్టులు ఉండేలా చూసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులు తప్ప మిగిలిన రోడ్లన్నీ మూసివేస్తాం. టౌన్లు, సిటీల ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లను మూసివేస్తున్నాం. మినహాయింపు సమయంలో మాత్రమే వాటిని తెరుస్తాం. దీనివల్ల రోడ్ల మీద అనవసర సంచారాన్ని నియంత్రించవచ్చు’’అని డీజీపీ చెప్పారు. ప్రజలంతా లాక్డౌన్ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాత మందుల చీటీలు పట్టుకుని రోడ్ల మీదికి వచ్చినా.. వాహనాలు సీజ్ చేసి, కేసులు పెడతామని హెచ్చరించారు. కూరగాయల మార్కెట్లలో రద్దీ నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్లు, స్థానిక మున్సిపల్, మార్కెటింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. -
లాక్డౌన్ కోసం లాఠీ పట్టారు
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: శనివారం ఉదయం 10.30 గంటలు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లోకి వచ్చీపోయే దారులన్నీ మూతపడ్డాయి.. ప్రధాన రహదారులన్నిటా చెక్పోస్టులు కట్టుదిట్టం అయ్యాయి.. రోడ్లపైకి వచ్చినవారిని వచ్చినట్టు పోలీసులు ఆపేశారు. అనవసరంగా వచ్చినట్టు కనిపించినవారిపై లాఠీలు ఝళిపించారు. ఎక్కడివారిని అక్కడ్నుంచే వెనక్కి పంపేశారు.. రాష్ట్రంలో పలుచోట్ల లాక్డౌన్ సరిగా అమలు కావడం లేదని, కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. పోలీసులు పకడ్బందీగా లాక్డౌన్ అమలుపై దృష్టిపెట్టారు. హైదరాబాద్లో డీజీపీ, జిల్లాల్లో ఎస్పీలు, కమిషనర్లు నేరుగా రంగంలోకి దిగి పర్యవేక్షించారు. అవసరం లేకున్నా రోడ్డు మీదికి వచ్చిన వాహనాలను సీజ్ చేసి, కేసులు పెట్టారు. పలుచోట్ల పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నిరోజులు సరిగా పట్టించుకోకుండా.. ఇప్పుడు అవసరంపై బయటికొచ్చిన వారిపైనా ప్రతాపం చూపడం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమైంది. సీఎం కేసీఆర్ ఆగ్రహంతో.. శుక్రవారం వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి, లాక్డౌన్ పరిస్థితులపై అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో లాక్డౌన్ సరిగా అమలుకావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. శనివారం 10 గంటల తర్వాత రోడ్డుపై కనిపించిన వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. అకారణంగా బయటికి వచ్చిన వారిపై లాఠీచార్జి చేసి, వేలాది వాహనాలు సీజ్ చేశారు. నల్లగొండ, వరంగల్, మరికొన్ని జిల్లాల్లో డ్రోన్ కెమెరాలతో లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించారు. మంచిర్యాల జిల్లాలో రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ స్వయంగా లాఠీ పట్టి రోడ్డుపైకి వచ్చిన వారిని కట్టడి చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో, ప్రధాన రహదారులపై మూడు రకాల చెక్పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఫుడ్ డెలివరీ బాయ్స్పై ప్రతాపం! హైదరాబాద్లో వందల మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ను అడ్డుకుని, లాఠీచార్జి చేయడం, వాహనాలు సీజ్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఫుడ్ డెలివరీకి మినహాయింపు ఉందని.. ఆస్పత్రుల్లో, ఇళ్లలో ఉన్న వేల మంది కరోనా రోగులకు ఆహారం సరఫరా చేస్తున్నామని.. తమను అడ్డుకోవడం ఏమిటని వారు నిలదీశారు. ఫుడ్ డెలివరీ బాయ్స్పై లాఠీచార్జిని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పలువురు రాజకీయ నాయకులు తప్పుబట్టారు. అయితే తాము ఫుడ్ తీసుకెళ్తున్న వారిని ఏమీ అనలేదని, గుర్తింపు కార్డులు లేకుండా.. కేవలం స్విగ్గీ, జొమాటో టీషర్టులు వేసుకుని తిరుగుతున్నవారి వాహనాలనే సీజ్ చేశామని పోలీసులు అన్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో.. స్విగ్గీ, జొమాటో సంస్థలు శనివారం తమ ఫుడ్ డెలివరీ సర్వీసులను నిలిపివేశాయి. డెలివరీ బాయ్స్పై పోలీసుల లాఠీచార్జిని తప్పుపడుతూ.. న్యాయవాది కారం కొమిరెడ్డి మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. జీవో నం 102 ప్రకారం.. ప్రభుత్వమే ఫుడ్ డెలివరీ సర్వీసులను అనుమతించినపుడు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అత్యవసరమైన వారినీ అడ్డుకోవడంపై.. పలుచోట్ల తలసేమియా రోగులు, వారికి రక్తదానం చేయడానికి వెళ్తున్న దాతలను సైతం పోలీసులు అడ్డుకోవడం కనిపించింది. దీనిపై తలసేమియా రోగుల తల్లిదండ్రులు డీజీపీకి మొరపెట్టుకున్నారు. తమను అనుమతించాలని, ప్రాణాలు ఆపదలో పడతాయని ప్రాధేయపడ్డారు. నల్లగొండలో విద్యుత్ సిబ్బంది, మీడియా, ఇతర శాఖల ఉద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. 6 నుంచి 10 మధ్య గందరగోళం! లాక్ డౌన్ సమయంలో పోలీసుల హడావుడి ఇకవైపు అయితే.. అంతకుముందు మినహాయింపు సమయం 6 నుంచి 10 గంటల మధ్య పరిస్థితి గందరగోళంగా మారింది. ఎక్కడ చూసినా జనం గుంపులు, గుంపులుగా బయటికివచ్చారు. వ్యాపార సంస్థలు, దుకాణాల వద్ద భౌతిక దూరం అనేది ఎక్కడా పాటించలేదు. ఈ నాలుగు గంటల్లో ఎక్కడా పోలీసులు కనిపించలేదు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకునే లేకుండా పోయారు. -
రూల్స్ బ్రేక్ చేస్తే వాహనాలు సీజ్ చేస్తాం: డీజీపీ మహేందర్ రెడ్డి
-
నల్గొండ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్
-
లాక్డౌన్: విద్యుత్ సిబ్బందికి ఇబ్బందులు.. మంత్రి ఫైర్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ పేరిట పోలీసులు విద్యుత్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మే 12 నుంచి లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ నుంచి అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వాటిలో విద్యుత్ శాఖ కూడా ఉంది. ఈ నేపథ్యంలో నల్గొండలో లాక్డౌన్లో భాగంగా పోలీసులు విద్యుత్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగులు తమ ఐడీ కార్డులు చూపిస్తున్నా పోలీసులు వినిపించుకోవడమే గాక అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో శనివారం విద్యుత్ ఉద్యోగులు ఈ విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాగా నల్గొండ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి అనంతరం డీజీపీతోనూ ఈ అంశంపై చర్చించారు. విద్యుత్శాఖ అత్యవసర సర్వీసు కిందకు వస్తుందన్నారు. విద్యుత్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. విద్యుత్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. చదవండి: లాక్డౌన్: చికెన్ వ్యాపారి కారుకు ప్రెస్ స్టిక్కర్.. చివరికి! -
Lockdown: సీఎం కేసీఆర్ ఆదేశం.. రంగంలోకి డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రోడ్డేక్కితే చాలు.. రోక్కం వసూలు చేస్తున్నారు.. లాక్ డౌన్ గీత దాటితే చాలు.. కేసులు కట్టేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించని వారికి కేసులతో పోలీసులు వణుకు పుట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్లో పలు చెక్పోస్టుల వద్ద తనిఖీలను ఆయన పర్యవేక్షించారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్: డీజీపీ తెలంగాణలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉదయం 6 నుంచి 10 లోగా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. తెలంగాణ సరిహద్దుల వద్ద లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కట్టడి చేయడానికి ప్రజలందరూ సహకరించాలని మహేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. విస్తృత తనిఖీలు.. మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ ఎమర్జెన్సీ, పాసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు.. భారీగా వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలను పాటించనివారిపై కేసుల నమోదు చేస్తున్నారు. నిన్నటి వరకు కేవలం లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చిన వాహనాలకు జరిమానాలు మాత్రమే విధించిన పోలీసులు.. ఇవాళ నుంచి సీజ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం అనుమతులు ఉన్నవారు మాత్రమే సంబంధిత ఐడి కార్డు గానీ, లెటర్స్ గానీ తీసుకొని రావాలని వాటిని చూపిస్తేనే అనుమతి ఇస్తామంటున్నారు. పొంతన లేని సమాధానం చెప్పే వారిపై మరింత కఠినంగా.. సికింద్రాబాద్లోని బేగంపేట్ చిలకలగూడ బోయినపల్లి, మారేడ్పల్లి, కార్ఖానా పరిధిలో పోలీసులు ప్రధాన రోడ్లపై ఎక్కడికక్కడ చెక్ పోస్ట్లను ఏర్పాటు చేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులను నిలిపివేసి ఏ కారణాల చేత బయటకు వచ్చారో వివరాలు తెలుసుకొని పంపిస్తున్నారు. పొంతన లేని సమాధానం చెప్పే వారిపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తూ వాహనాలను సీజ్ చేస్తున్నారు. బేగంపేటలో అడిషనల్ సీపీ అవినాష్ మహంతి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలను పర్యవేక్షించారు. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రోడ్డుపై ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలను కొనసాగిస్తున్నారు. లాక్డౌన్లో సరకు రవాణా వాహనాలకు అనుమతి లేదు లాక్డౌన్లో సరకు రవాణా వాహనాలకు అనుమతి లేదని సీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి గూడ్స్ వాహనాలకు అనుమతి లేదని సీపీ వెల్లడించారు. చదవండి: భారత్కు మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు కరోనా సోకిన వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో.. -
లాక్డౌన్: పావు తక్కువ పదికే రంగంలోకి పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఉదయం 10 గంటల తరువాత కూడా రోడ్లపై ప్రజలు కనిపిస్తున్నారని, లాక్డౌన్ కఠిన అమలుకు ఉ.9.45లకే పోలీసులు రంగంలోకి దిగాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30 వరకు లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో అనుమతి లేని వాహనాలను సీజ్ చేయాలని, ప్రతీ వీధిలోనూ పోలీసు వాహనాలు సైరన్ వేసుకుని తిరగాలని సూచించారు. లాక్డౌన్ అమలుపై జోనల్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బుధవా రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీపీ జితేంద ర్, ఇంటెలిజెన్స్ విభాగం ఐజీ ప్రభాకర్రావు పాల్గొ న్న ఈ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రం లో లాక్డౌన్ అమలుతీరును ప్రతిరోజూ జిల్లాల వారీగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారని వెల్లడించారు. మే 30 తర్వాత తిరిగి పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్డౌన్ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. అంతా ఫీల్డ్లో ఉండాల్సిందే.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నా.. 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాల కోసం వస్తున్నారని డీజీపీ అన్నారు. మార్కెట్లు, దుకాణాల వద్ద ప్రజలు గుమికూడటం కనిపిస్తోందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుంచే తమ అవసరాల కోసం వెళ్లేలా ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. 10 గంటల తర్వాత కూడా వీధుల్లో పెద్ద ఎత్తున జన సంచారం ఉంటోందని, దీని నివారణకు తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉదయం 9:45 గంటల నుంచే పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీ, డీఎస్పీ, ఏసీపీ స్థాయి ఉన్నతాధికారులంతా కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న ఫిష్ మార్కెట్లు, వెజిటేబుల్ మార్కెట్లలో జనం రద్దీని తగ్గించేందుకు మార్కెటింగ్, మున్సిపల్, సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా మార్కెట్లను వికేంద్రీకరించేలా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ప్రధాన రహదారుల్లోనే లాక్డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు జరగాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు అన్ని పెట్రోలింగ్ వాహనాలు సైరన్ వేసి సంచరించాలని సూచించారు. -
తెలంగాణలో లాక్డౌన్ అమలు విఫలం
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ అమలు తీరు పట్ల విమర్శలు వెల్లువేత్తతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో సడలింపుల సమయం 10 గంటల తర్వాత కూడా ప్రజలు యథేచ్చగా రోడ్లపైకి గుంపులు గుంపులుగా వస్తున్నారు. పోలీసు శాఖ విచ్చలవిడిగా పాసులు జారీ చేయడమే దీనికి ప్రధాన కారణం, సాధారణ రోజుల్లాగానే రోడ్లపైకి జనం వస్తున్నారు. తెలంగాణలో లాక్డౌన్ అమలులో పోలీసు శాఖ విఫలమైంది అని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో వెంటనే డీజీపీ వెంటనే సమావేశం నిర్వహించి జోనల్ ఐజీలు, డీఐజీలు, కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. మే 30వ తేదీ అనంతరం తిరిగి లాక్డౌన్ ను పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తుందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుండే తమ అవసరాలకై వెళ్లే విధంగా ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. 10 గంటల అనంతరం వీధుల్లో పెద్ద ఎత్తున జనసంచారం ఉంటుందని, దీనిని నివారించేందుకై సరైననా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న ఫిష్ మార్కెట్లు, వెజిటేబుల్ మార్కెట్లలో జన సామర్థ్యాన్ని తగ్గిచేందుకు మార్కెటింగ్, మున్సిపల్, సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా మార్కెట్లను వికేంద్రించే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఉదయం 10 గంటల అనంతరం అనుమతిలేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే తాత్కాలికంగా సీజ్ చేయాలని అన్నారు. కేవలం ప్రధాన రహదారుల్లోనే లాక్డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు. లాక్డౌన్ నిబందనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టాలని సూచించారు. లాక్డౌన్ సమయం ముగియగానే ఉదయం 10 గంటలకు అన్ని పెట్రోలింగ్ వాహనాలు సైరన్ వేసి సంచరించాలని తెలిపారు. లాక్డౌన్ అమలుపై సామన్య ప్రజానికం నుండి సహాయ సహకారాలు అందుతున్నాయని, ఈ విషయంలో పోలీసు శాఖపై ఏవిధమైన ఫిర్యాదులు అందడంలేదని అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ బంక్ లను పూర్తిస్థాయిలో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసిందని, అయితే లాక్డౌన్ అనంతరం కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ రవాణా లాంటి వాహనాలు మాత్రమే పెట్రోల్ బంకులకు అనుమతించాలని స్పష్టం చేశారు. చదవండి: లాక్డౌన్ నుంచి వీటికి మినహాయింపు -
కరోనా నిబంధనలు గాలికి..జరిమానాలు 30 కోట్లపైనే..!
సాక్షి, హైదరాబాద్: ‘‘కరోనా వైరస్ చలనం లేనిది, అది ఎక్కడికీ ప్రయాణించలేదు. కానీ, మనుషులే వాహకాలుగా దాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ముక్కు నోరు ద్వారా వ్యాపించే ఈ వైరస్ కట్టడికి మాస్కు, భౌతికదూరం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కానీ, కొందరు పౌరులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. అయినా, కొందరు ఈ విషయాన్ని పట్టించుకోవ డం లేదు. ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు 4,38,123 మంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. అందులో లాక్డౌన్లో 12 నుంచి 15 వ తేదీ వరకు 50,367 కేసులు నమోదయ్యాయంటే ఉల్లంఘనలు ఏ స్థాయిలో జరుగుతు న్నాయో అర్థమవుతుంది. వీరందరిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐపీసీ ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.30.66 కోట్ల జరిమానా వసూలు చేశారు’’అని సోమవారం హైకోర్టుకు స్వయంగా సమర్పించిన నివేదికలో డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రోజూ దాదాపు పదివేల కేసులు ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు 45 రోజుల్లో 4.3 లక్షల కేసులు నమోదయ్యాయి. రోజుకు 9,736 కేసులు. భారీగా గుమిగూడటం, బహిరంగంగా మద్యం తాగడం, బర్త్ డే పార్టీలు చేసుకోవడం తదితరాలన్నీ కలిపి 50,367 కేసులు నమోదయ్యాయంటే ఉల్లంఘనలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. వీరిలో కొందరు రాజకీయ నేతలు కూడా తమ పుట్టినరోజు పేరుతో కరోనా నిబంధనలు పాటించకపోవడం గమనార్హం. బాధ్యతగా ప్రవర్తించని వారెవరినీ తాము ఉపేక్షించబోమని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసుశాఖ స్పష్టం చేసింది. -
Lockdown: మాస్కులు లేకుండా తిరిగిన వారినుంచి రూ. 31 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మాస్కులు లేని వారి నుంచి మొత్తం రూ.31 కోట్లు వసూలు చేశామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. బ్లాక్ మార్కెట్లో ఔషధల అమ్మకాలపై 98 కేసులు నమోదు చేసినట్లు, మాస్కులు ధరించని వారిపై 3,39,412 కేసుల ఫైల్ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ రోజు(మంగళవారం) విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు హాజరయ్యారు. అలాగే, తెలంగాణలో లాక్డౌన్, కరోనా నిబంధనలపై డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక అందించారు. ఇందులో భాగంగా.. భౌతిక దూరం పాటించనందుకు మొత్తం 22,560 కేసులు నమోదయ్యాయని డీజీపీ న్యాయస్థానానికి వివరించారు. కరోనా నేపథ్యంలో కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ చెప్పారు. బ్లాక్ మార్కెట్లో ఔషధల అమ్మకాన్ని నిరోధిస్తున్నామని, ఇప్పటికి 98 కేసులు నమోదు చేశామని వివరించారు. లాక్డౌన్ పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 1 నుంచి 14 వరకు నిబంధనల ఉల్లంఘనల కింద మొత్తం 4,31,823 కేసులు నమోదు చేశామని చెప్పారు. మాస్కులు ధరించని వారికి మొత్తం రూ.31 కోట్ల జరిమానా విధించామని తెలిపారు. కాగా లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధులు, పేదవారికి వ్యాక్సినేషన్ కోసం ఎన్జీవోలతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ పెట్టాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను కరోనా వారియర్లుగా గుర్తించాలని హైకోర్టు చెప్పింది. చదవండి: TS: ‘వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు నిర్వహించడంలేదు’ -
Telangana High Court: ప్రైవేటు దోపిడీని అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య చికిత్సలు, సీటీ స్కాన్లాంటి పరీ క్షలు, ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ లాంటి మం దులకు గరిష్ట ధరలు నిర్ణయిస్తూ తాజా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నియంత్రణ ఆంక్షలను మరింత కఠి నతరం చేయాలని, అనూహ్యంగా పెరుగుతున్న కేసులు, మరణాలను దృష్టిలో ఉంచుకొని వారాం తపు లాక్డౌన్ పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అలాగే రాత్రి కర్ఫ్యూను కొనసాగించే విషయంపై ఈనెల 8వ తేదీ కంటే ముందే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సం దర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి, ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. సమృద్ధిగా కరోనా పరీక్షల కిట్లు: డాక్టర్ శ్రీనివాసరావు గతంలో ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చేవారని, అయితే ప్రస్తుతం లక్షణాలు ఉన్న వారు మాత్రమే పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారని డాక్టర్ శ్రీనివాసరావు నివేదించారు. ఈ కారణంగానే పరీక్షల సంఖ్య తగ్గుతోందని, పరీక్ష కిట్లు సమృద్ధిగా ఉన్నాయని వివరించారు. ఈ వివరణతో సంతృప్తి చెందని కోర్టు.. ప్రజల దగ్గరికే వెళ్లి పరీక్షలు చేయాలని సూచించింది. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్టులో ఉన్న వారికి పరీక్షలు చేయాలని ఆదేశించింది. అలాగే ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలను 24 గంటల్లో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వివాహ శుభకార్యాల్లో, అంత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యను తగ్గించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు గత ఏడాది ఇచ్చిన జీవోను సవరిస్తూ 24 గంటల్లో కొత్త మార్గదర్శకాలతో మరో జీవో జారీ చేయాలని ఆదేశించింది. ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు సరఫరా చేయడం లేదని డాక్టర్ శ్రీనివాసరావు నివేదించారు. రాష్ట్రంలో 18–44 మధ్య వయస్సు గలవారి కోసం 3.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలని, వీరికి వ్యాక్సిన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. కాగా కేంద్రం కేటాయించిన ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు సహా ఇతర మందులు నిర్ణీత సమయంలోగా రాష్ట్రానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. అలాగే తమిళనాడు నుంచి ఆక్సిజన్ రానందున ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ అందించాలని కూడా ఆదేశించింది. కాల్ సెంటర్లకు అనూహ్య స్పందన: ఏజీ కరోనా రోగుల కోసం హితం యాప్ అందుబాటులోకి తెచ్చామని, అలాగే కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వీటికి అనూహ్య స్పందన లభిస్తోందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. అయితే కరోనా చికిత్సలకు సంబంధించిన సమాచారం తెలియజేసేలా అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని, అలాగే వీటిని అనుసంధానిస్తూ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ధర్మాసనం సూచించింది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆస్పత్రుల సిబ్బంది బ్లాక్మార్కెటింగ్ చేస్తున్నారు: డీజీపీ కరోనా నియంత్రణ ఆంక్షలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 859 పెట్రోలింగ్ వాహనాలు, 1,523 ద్విచక్ర వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని డీజీపీ మహేందర్రెడ్డి నివేదించారు. కరోనా నియంత్రణ మందులను అక్రమంగా విక్రయిస్తున్న 39 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆసుపత్రుల సిబ్బందే ఎక్కువగా మందులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలిపారు. దీంతో మందులను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి హైకోర్టు స్పష్టం చేసింది. మాస్కు లేకుండా వెళ్తున్న వారి వాహనాలను సీజ్ చేసే విషయాన్ని పరిశీలించాలని, ఈ మేరకు పోలీసులకు అధికారాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆసుపత్రుల వద్ద హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలి భౌతికదూరం పాటింపు విషయంలో రెవెన్యూ, స్థానిక సంస్థల అధికారులతో కలిసి ఫంక్షన్ హాల్స్, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోర్టు సూచించింది. అలాగే ఆసుపత్రుల దగ్గర రోగులు, వారి సహాయకులు అయోమయానికి గురవుతున్నారని, వారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించింది. అంత్యక్రియల కోసం ఎన్ని స్మశానాలు ఏర్పాటు చేశారు? అందులో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? జైళ్ళలో ఉన్న ఖైదీలు, వృద్ధులు, వికలాంగులు తదితరులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ? తదితర వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. లక్ష టెస్టులు చేసేలా చర్యలు తీసుకోండి గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రెండురోజుల్లో నిపుణులతో కమిటీ వేయాలని, కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని, ఆన్లైన్లో సమావేశమవుతోందన్న ప్రభుత్వ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. పరీక్షలు పెంచాలని పదేపదే ఆదేశించినా తగ్గిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల సంఖ్య తగ్గించడం ద్వారా వాస్తవ కేసుల సంఖ్య ఎలా తెలుస్తుందని, రోజూ లక్ష పరీక్షలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చదవండి: విషాదం: కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి మృతి శ్మశానానికి దారి చూపుతూ నాయకుల ఫ్లెక్సీలు.. సిగ్గుందా మీకు! -
బ్లాక్మార్కెట్పై సీఎం సీరియస్: హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలా.. వద్దా అనే విషయంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో కరోనా సెకండ్ వేవ్, నైట్ కర్ఫ్యూ, ఔషధాల బ్లాక్మార్కెట్, రంజాన్ ప్రార్థనలు తదితర విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా మొదటివేవ్లో పోలీసుశాఖ సమర్థంగా పనిచేసిందని, ప్రస్తుతం సెకండ్వేవ్లోనూ మరింత మెరుగ్గా పనిచేస్తోందని కితాబిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు, వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, రెమిడెసివిర్ తదితర ఇంజెక్షన్లతో సహా ఇతర అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు. కొందరు ప్రజలు భయంతోనో లేదా ముందుజాగ్రత్తతోనే ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇంట్లో పెట్టుకుంటున్నారని.. దీంతో సిలిండర్ల కొరత ఏర్పడే ప్రమాదముందని, అనవసరంగా కొన్న మందులు కూడా పాడైపోతాయని చెప్పారు. అదే సమయంలో కొందరు ఆక్సిజన్, రెమిడెసివిర్, ఇతర అత్యవసర మందులను నల్ల బజారులో విక్రయిస్తున్నారని, వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రాణాలు కాపాడే ఔషధాలను నల్లబజారులో విక్రయిస్తుండటంపై సీఎం సీరియస్గా ఉన్నారని మహమూద్ అలీ చెప్పారు. ప్రజలంతా తప్పకుండా భౌతికదూరం పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, రాచకొండ కమిషనర్ మహేశ్ భాగవత్ పాల్గొన్నారు. కాగా, సమీక్ష సమావేశం అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ ఓ టీవీ చానల్తో మాట్లాడారు. ఈనెల 30వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది కదా? లాక్డౌన్ పెడతారా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. రాష్ట్రంలోని పరిస్థితులపై త్వరలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. వాస్తవానికి సీఎంకు లాక్డౌన్ పెట్టడం ఇష్టం లేదని చెప్పారు. కాగా, రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తే మరో 3–4 వారాల్లో వైరస్ అదుపులోకి వస్తుందని.. అలాంటప్పుడు లాక్డౌన్ పెట్టాలనే ఆలోచనే ఉండదని పేర్కొన్నారు. -
ఇక సులువుగా పోలీస్ వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇకపై పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికేషన్ (పీవీసీ), పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల (పీసీసీ)కు పోలీసు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్లు కావాలనుకున్న వారు నేరుగా ఆన్లైన్లో ఐ–వెరిఫై ద్వారా దరఖా స్తు చేసుకునే విధానాన్ని పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానాన్ని డీజీపీ మహేందర్రెడ్డి తన కార్యాలయంలో ప్రారంభించారు. www.tspolice.gov.inను క్లిక్ చేసి పోలీస్ వెరిఫికేషన్–క్లియరెన్స్ ఆప్షన్స్ ఎంచుకుని.. నిబంధనలను ఫాలో అయితే సరిపోతుంది. పోలీసు వెరిఫికేషన్ సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ సంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ శాఖ సంబంధ కార్యాలయాలు, అందులో అపాయింట్ అయ్యే ప్రైవేటు ఉద్యోగులు. ఆయా కార్యాలయాల్లో ఇతర సేవల కోసం పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు పోలీసు వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, వలస వెళ్లే పౌరులకు ఇది అవసరం. ఒకసారి దరఖాస్తు పూర్తి చేశాక పోలీసుల పని మొదలవుతుంది. దీనిపై సందేహాలుంటే హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలి. ఇవీ లాభాలు.. ► ఈ విధానం అందుబాటులోకి రావడం వల్ల పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. ► డాక్యుమెంట్ల దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపులు సులభతరంగా మారుతాయి. ► ఆన్లైన్ దరఖాస్తుల్లోని ఫొటోల ఆధారంగా నేరచరిత కలిగిన వారిని సులువుగా గుర్తించే వీలుంది. ► దరఖాస్తుల పరిశీలనకు అదనపు మానవ వనరుల వినియోగం తగ్గింపు. ► దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకునే సదుపాయం దరఖాస్తుదారులకు కలుగుతుంది. -
పౌరులతో దురుసుగా ప్రవర్తించకూడదు: డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూఅమలుపై పోలీస్ ఐజీలు, కమీషనర్లు, ఎస్పీలతో తెలంగాణ డీజీపీ ఎమ్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవోలో పేర్కొన్న విధంగా పటిష్టంగా కర్ప్యూను అమలుచేయాలని తెలిపారు. అంతేకాకుండా అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలను రాత్రి 8 గంటలకు మూసివేయాలని పేర్కొన్నారు. ఏ గూడ్స్ వాహనాలను ఆపకూడదన్నారు. కాగా, నైట్ కర్ఫ్యూలో మినహాయింపు ఉన్నవారు సెల్స్ ఐడెంటిటీ కార్డును కచ్చితంగా వెంట ఉంచుకోవాలని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని పోలీసులకు విజ్ఙప్తి చేశారు. అంతేకాకుండా కర్ఫ్యూ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలను పాటించాలని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్,జితేందర్, ఐ. జీ. లు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, రాజేష్ కుమార్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: అంతా తూచ్.. అది నకిలీ పోలీస్ నోటిఫికేషన్ -
వైన్స్, బార్ల వల్ల కరోనా వ్యాప్తి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బార్లు, మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుండవచ్చని, కానీ కరోనా వ్యాప్తికి ఈ కేంద్రాలు అడ్డాగా మారుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలు పాటించని బార్లు, మద్యం దుకాణాలు, పబ్బులు, క్లబ్బులు, ఫంక్షన్ హాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటి లైసెన్సులు, అనుమతులు రద్దు చేయాలని తేల్చిచెప్పింది. ఆయా సంస్థల నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అందిన లేఖలను ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి విచారణకు స్వీకరించిన ధర్మాసనం వాటిపై గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పరీక్షలు ఇంతేనా? ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని తాము ఆదేశించినా ప్రభుత్వం వాటి సంఖ్యను ఆశించిన స్థాయిలో పెంచలేదని ధర్మాసనం ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పరీక్షల్లో 20 శాతంలోపే ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా గ్రామీణ జిల్లాల్లో వాటి సంఖ్య 5 శాతానికి మించట్లేదని అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం నిర్దేశించిన మేరకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలను 70 శాతానికి పెంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్రెడ్డి నివేదిక సమర్పించారు. కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మాస్క్ ధరించని 1,16,467 మందికి జరిమానా విధించినట్లు డీజీపీ నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితితో పోలిస్తే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, పాతబస్తీకి వెళ్తే 2 రోజుల్లో లక్షల మంది మాస్క్ లేకుండా దొరుకుతారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. బార్లు, వైన్స్, పబ్బులు, క్లబ్బులు, మాల్స్, థియేటర్ల దగ్గర ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ను ధర్మాసనం ఆదేశించింది. వైద్య నిపుణులతో కమిటీ... రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని తాము చెప్పట్లేదని, అయితే కరోనా కేసుల ఆధారంగా మైక్రో, కంటైన్మెంట్ జోన్లను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి పరిమిత సంఖ్యలోనే ప్రజలు హాజరయ్యేలా చూడాలని, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్–17 కింద వెంటనే వైద్య నిపుణులతో అడ్వయిజరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 100 మంది ఉద్యోగుల కంటే ఎక్కువ మంది ఉంటే వారికి కార్యాలయాల్లోనే వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. కరోనా చికిత్స అందిస్తున్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సీరో సర్వేలెన్స్ నివేదికతోపాటు కంటైన్మెంట్ జోన్ల వివరాలను తదుపరి విచారణలోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఒక్క డోసు టీకా కూడా వృథా కాకుండా చూడాలని సూచించింది. రాష్ట్రానికి అందిన టీకా డోసుల సంఖ్య, వృథా అయిన వ్యాక్సిన్ల సంఖ్య, టీకా అందుకున్న లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే... పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేసుకోవాలనే నిబంధన పెట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈ నెల 14లోగా స్థాయీ నివేదికను సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. చదవండి: 10 మందిలో ఒకరిపై కరోనా దీర్ఘకాల ప్రభావం -
సర్వే: షీ టీమ్ల పనితీరుపై 89 శాతం సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: నేర నియంత్రణలో స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు వస్తాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలు, గృహహింస, లైంగిక వేధింపుల నిరోధంపై స్వయం సహాయక బృందాల మహిళలకు చైతన్యం, అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లు కలసి పనిచేయనున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకుడు సత్యనారాయణ, పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రాల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. జూమ్ ద్వారా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, దేశంలో తొలిసారిగా అడిషనల్ డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని గుర్తుచేశారు. పోలీసులు ప్రతిచోటా భౌతికంగా ఉండలేరని, ఈ నేపథ్యంలోనే స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా సమాజ భద్రతలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. 89 శాతం మంది సంతృప్తి.. షీ టీమ్లకు 2020లో 5 వేల ఫిర్యాదులు అందాయని మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా చెప్పారు. షీ టీమ్ల పనితీరుపై ప్రముఖ సంస్థ సెస్ ద్వారా సర్వే నిర్వహించగా 89 శాతం మంది షీ టీమ్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో 1.70 లక్షల మహిళా బృందాల్లో 17 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, వీరికి గృహహింస, పని ప్రాంతాల్లో వేధింపులు, ఇతర సామాజిక సమస్యలపై చైతన్యం కల్పించడం హర్షణీయమని మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు. పలు స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు. అనంతరం యూజర్ ఫ్రెండ్లీ సాంకేతిక విధానం క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసే పోస్టర్, కౌమార బాలికలపై జరిగే సైబర్ క్రైమ్స్ నిరోధం తదితరాలపై ప్రచురించిన పుస్తకాలను డీజీపీ ఆవిష్కరించారు. వేధింపులపై క్యూఆర్ కోడ్తో ఫిర్యాదు.. ఇటు మహిళల భద్రతకు చేపట్టిన చర్యల్లో భాగంగా క్యూఆర్ కోడ్ (కాప్స్ యాప్)తో ఫిర్యాదు చేసే విధానాన్ని పోలీస్ మహిళా భద్రతా విభాగం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా క్యూఆర్ కోడ్ సాయంతో మహిళలపై వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు, పని ప్రాంతాల్లో వేధింపులు తదితర సమస్యలపై మహిళా భద్రతా విభాగానికి ఫిర్యాదు చేసే విధానాన్ని సోమవారం డీజీపీ మహేందర్రెడ్డి ప్రారంభించారు. తమ మొబైల్ ఫోన్లో ఈ లింక్ను సేవ్ చేసుకొని, లింక్ ఓపెన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫిర్యాదుల పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో ఫిర్యాదు వివరాలు నమోదు చేస్తే ఆ ఫిర్యాదు షీ టీమ్ సెంట్రల్ సర్వర్కు వెళ్తుంది. క్యూఆర్ కోడ్ ద్వారా అందే ఫిర్యాదులపై తీసుకునే చర్యలు, అధికారుల ప్రవర్తన తదితరాలపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. -
వరంగల్ పోలీసులపై డీజీపీ ప్రశంసలు
వరంగల్ క్రైం : ఇటీవల కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేసే నేరాల సంఖ్య పెరుగుతోంది. సెల్ఫోన్కు వచ్చే ఓటీపీని అపరిచిత వ్యక్తులకు చెబితే క్షణాల్లో బ్యాంకులో ఉన్న సొమ్ము స్వాహా అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిందితులు దేశ, విదేశాల్లో ఉండి తమ నేరాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. యువతులు, మహిళలను వేధించడం, సామాజిక మాధ్యమాల ద్వారా ఇబ్బంది పెట్టే ఆకతాయిల ఆట కట్టించడం తదితర కేసుల్లో సాంకేతిక అంశాలను సేకరించడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన సైబర్ క్రైం విభాగం పోలీసులు చాటుతున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పోలీస్ బాస్ మహేందర్రెడ్డి వరంగల్ సిబ్బందిపై శభాష్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో వరంగల్ సైబర్ క్రైం పోలీసుల ప్రతిభ రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. సైబర్ వారియర్స్తో శిక్షణ రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల కాలంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా డీజీపీ కార్యాలయం నుంచి ‘సైబర్ వారియర్స్’ పేరిట రాష్ట్రంలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ట్యాబ్లు అందజేసి పిటీ కేసులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు డయల్ 100 కు వచ్చే ఫోన్లకు 5 నుంచి 10 నిమిషాలలో స్పందించేలా చూస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. అధునాతన పరికరాలు, అత్యాధునిక విభాగం వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని సైబర్ విభాగంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ఉన్నాయి. 2018 మార్చి 18న ఈ విభాగం ప్రారంభమైంది. పోలీస్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడిచే ఈ విభాగంలో ఒక ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక అసిస్టెంట్ ఎనలైటికల్ అధికారితో పాటు తొమ్మిది మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. వీరందరూ బీటెక్విద్యార్హతతో కలిగి ఉన్న నేపథ్యంలో సాంకేతిక పరమైన అంశాలపై మంచి పట్టు ఉండి అనేక కేసుల్లో కీలక సమాచారాన్ని అందించగలుగుతున్నారు. ఓటీపీ, బ్యాంకు, వాట్సప్, ఫేస్బుక్, లాటరీ, ఉద్యోగాలు, గిప్ట్లు పేరిట జరుగుతున్న మోసాలు, యువతులు, మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తదితర అంశాల్లో విచారణ సిబ్బందికి కీలక సమాచారం అందిస్తూ నేరస్తుల ఆట కట్టిస్తున్నారు. ఇదే సమయంలో వరంగల్ సైబర్ పోలీస్ విభాగం ఆధ్వర్యాన ప్రజలను చైతన్యపరిచేలా వీడియో సందేశాలను వాట్సప్ ద్వారా పంపిస్తున్నారు. వీఓఐటీ ఇంటర్నెట్ కాల్స్ను చేధించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బాలుడు కుసుమ దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో వరంగల్ సైబర్ క్రైం పోలీసులు అందించిన సాంకేతిక సమాచారంతోనే నిందితుడిని గుర్తించగలిగారు. బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగుడు ఆయన తల్లిదండ్రులకు ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేస్తుండడంతో గుర్తించడం సాధ్యం కాలేదు. ఈ మేరకు రంగంలోకి దిగిన సైబర్ బృందం వీఓఐటీ ఇంటర్నెట్ కాల్స్ను చేధించి నిందితుడిని అరెస్ట్ చేయించగలిగారు. ఈ విషయంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ పోలీసులకు సైతం దొరకని సమాచారాన్ని వరంగల్ సైబర్ పోలీసులు అందించడం విశేషం. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది మంది హత్యల కేసులో సాంకేతిక సమాచారమే కీలకంగా మారింది. ఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. నిందితుడు చేసిన ఫోన్ల ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు ఆయనను గుర్తించారు. అనంతరం కోర్టులో కూడా సాంకేతిక ఆధారాలను సమర్పించడంతో నిందితుడికి ఉరిశిక్ష ఖరారైంది. ఆన్లైన్ రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకుంటే... వారి ఫోన్లలో నంబర్లు సేవ్ అయి ఉన్న వ్యక్తులకు చెడుగా సమాచారం ఇస్తూ ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను గుర్తించడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం అధికారులు పాత్ర కీలకంగా మారింది. బెంగళూరు కేంద్రంగా రుణాలు ఇస్తూ, వేధిస్తున్న నలుగురు నిందితుల అరెస్టులో వరంగల్ సైబర్ పోలీసులు కీలకపాత్ర పోసించారు. చదవండి : (ఈ-కామర్స్లో తెలుగుతో తెలివిగా టోకరా..) (రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం ) -
దేశంలోనే పోలీస్ రంగంలో ఇదే మొదటిసారి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను పోలీస్ శాఖ నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇద్దరు, సెమి అర్బన్ పోలీస్ స్టేషన్లలో ముగ్గురు, అన్ని కమిషనరేట్ పోలీస్ స్టేషన్లలో అయిదుగురు చొప్పున పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. దాదాపు 1988 పోలీసు అధికారులను ఎంపిక చేసి నేటి నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణాకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలిస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను నియమించడం దేశంలోనే పోలీసు రంగంలో ఇదే మొదటిసారని తెలిపారు. మారుమూల గ్రామాలకు కూడా 4జీ మొబైల్ సేవలు విస్తరించిన ప్రస్తుత కాలంలో ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా రిమోట్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. అధికంగా పెరుగుతున్న ఈ సైబర్ నేరాలను ముందుగానే గుర్తించి వాటిని నిరోధించడం, సైబర్ నేరాలను సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు ఈ సైబర్ వారియర్లు కీలకపాత్ర వహిస్తారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులకు రోజువారి విధి నిర్వహణలో ఇప్పటికే 17 మార్గదర్శకాలను రూపొందించి అమలు చేయడం జరుగుతుందని, ఇక నుండి సైబర్ నేరాలను నిరోధించడం 18వ నిబంధనగా ఉంటుందని డీజీపీ అన్నారు. సాంప్రదాయ నేరాల కన్నా సైబర్ నేరాలు భిన్నంగా ఉంటాయని, వీటిని ఎదుర్కోవడానికే సైబర్ ఆధారిత నేరాలు, వాటిని ముందస్తుగా గుర్తించడం, దర్యాప్తు చేయడం, ప్రజలను చైతన్య పర్చడం తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగే ప్రతి నేర సంఘటనలోను సైబర్ నేర సంబంధిత కాంపోనెంట్ ఉంటుందని అన్నారు. సాధారణ నేరాలను దర్యాప్తుచేసే అధికారులకు ఈ సైబర్ వారియర్లు తోడ్పాటునందిస్తే నేరాల దర్యాప్తు త్వరితగతిన పూర్తి అవుతుందని అన్నారు. రోజురోజుకు సైబర్ నేరస్తులు ఆధునిక పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాల్సిన అవసరముందని అన్నారు. ప్రస్తుత 2021 సంవత్సరాన్ని సైబర్ సేఫ్టి సంవత్సరంగా జనవరి 1వ తేదీన ప్రకటించడం జరిగిందని, దీనిలో భాగంగానే ఐజి రాజేష్ కుమార్ ను ఈ విభాగానికి ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని డి.జి.పి మహేందర్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులతో ఐజి రాజేష్ కుమార్ సమన్వయ అధికారిగా ఉంటారని పేర్కొన్నారు. అడిషనల్ డి.జి గోవింద్ సింగ్, ఐ.జి రాజేష్ కుమార్ లు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సైబర్ వారియర్స్ అనే పుస్తకాన్ని డి.జి.పి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. చదవండి: పాస్పోర్టు కేసులో పోలీసులు, విదేశీయుల అరెస్ట్ కీలకంగా మారిన బిట్టు.. మధుపై అనుమానం! -
పోలీస్శాఖలో వినూత్న కార్యక్రమానికి డీజీపీ శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్ సేఫ్టీ వింగ్, పెట్రో కార్స్, బ్లూకోల్ట్స్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ వంటి అనేక వైవిధ్య కార్యక్రమాలను అమలు చేస్తోన్న డీజీపీ మహేందర్రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి పనితీరు మదింపును మొదలుపెట్టారు. ఏ రోజు ఎవరు ఏం పనిచేశారు? దాన్ని ఎప్పటిలోగా పూర్తి చేశారు? అందుకోసం ఎలాంటి పద్ధతులు అవలంబించారు? తదితర విషయాలన్నీ ఇకపై డీజీపీ కార్యాలయంలో నమోదవుతాయి. ఆ వివరాలన్నీ పరిశీలించి ప్రతి ఒక్కరికీ పాయింట్లు ఇస్తారు. అంటే పోలీసు ఉద్యోగి పనితీరుకు ఈ పాయింట్లే ప్రామాణికంగా నిలుస్తాయన్నమాట. పదోన్నతులు, పురస్కారాలు, అలాగే బదిలీలు, పనిష్మెంట్లకు ఈ పాయింట్లే ఆధారం కానున్నాయి. సిబ్బందిలో జవాబుదారీతనాన్ని, పోటీ తత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా, పదోన్నతులు, బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించే దిశగా డీజీపీ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్సేఫ్టీ వింగ్, వర్టికల్స్ (నిర్దిష్టంగా పని విభజన)ను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్న సమయంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. వర్టికల్స్లో గణాంకాలు గతంలో ఒక పోలీసుస్టేషన్ పరిధిలో నేరం జరిగితే దాని దర్యాప్తు నుంచి శిక్ష పడేంత వరకూ అన్నిటికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లే (ఎస్హెచ్ఓ) బాధ్యత వహించాల్సి వచ్చేది. కిందిస్థాయి సిబ్బంది సరైన సహకారం అందించకున్నా.. దాని ఫలితాలు, పర్యవసానాలు ఎస్హెచ్ఓనే అనుభవించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల కిందట వర్టికల్స్ అమల్లోకి తెచ్చారు. అంటే రిసెప్షన్ మొదలుకుని వారెంట్లు, సమన్లు, దర్యాప్తు, ఎస్హెచ్ఓ, కమ్యూనిటీ పోలీసింగ్, డయల్ 100, ట్రాఫిక్.. ఇలా ప్రతి ఒక్కరికి, ప్రతి విభాగానికి నిర్దిష్ట బాధ్యతలు (పని), నిర్దిష్ట సిబ్బందిని కేటాయించారు. అంటే ఎవరి పనికి, ఎవరి విభాగానికి వారే బాధ్యులన్నమాట. ఈ విధంగా ఎస్హెచ్ఓలకు ఊరట లభించింది. ప్రస్తుతం ఆయా వర్టికల్స్లోనే సిబ్బంది రోజువారీ పనికి సంబంధించిన గణాంకాలు నమోదవుతుంటాయి. ఈ గణాంకాలను డీజీపీ కార్యాలయం నిరంతరం సమీక్షిస్తూ ఉంటుంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు వచ్చిన ఫిర్యాదులు, చేసిన పని, దాని పరిష్కారం, ఎంత సమయంలో పూర్తి చేశారు.. తదితర విషయాలపై నిరంతర సమీక్ష ఉంటుంది. ప్రతి పని నమోదవుతుంది. దాని ఆధారంగా పాయింట్లు నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించారు. ప్రతిరోజూ సిబ్బంది వీటిని ఠాణాలో తనిఖీ చేసుకోవచ్చు. మిగతా ఠాణాల్లోని సిబ్బంది సాధించిన పాయింట్లు, తమ పాయింట్లు చూసుకుని తాము ఏ స్థానంలో ఉన్నామో తెలుసుకోవచ్చు. ఇందులో చివరి స్థానమైన రెడ్జోన్లో ఉన్న వారిని అప్రమత్తం చేయడం, వారందరినీ ఆరెంజ్ జోన్కు తీసుకురావడం, ఆరెంజ్లో ఉన్న వారిని గ్రీన్ జోన్కు వచ్చేలా చేసేందుకు ఎస్హెచ్ఓ, జిల్లా అధికారులు కృషి చేస్తారు. హెచ్ఆర్ఎంఎస్తో అనుసంధానం ఈ వివరాలను త్వరలో పోలీసు విభాగంలో ప్రారంభించనున్న హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్ఆర్ఎంఎస్)కు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ప్రతి సిబ్బంది తన పనిని మదింపు చేసుకుని, తప్పులు సరిదిద్దుకుని ముందుకుసాగే అవకాశం కలుగుతుంది. -
2021లో ప్రముఖుల లక్ష్యాలేంటో ఓ లుక్కేద్దాం..
కొత్త సంవత్సరం వస్తుందనగానే.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మనలో చాలా మంది లక్ష్యం పెట్టుకుంటారు.. చేస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. న్యూఇయర్ రిజల్యూషన్ పెట్టుకోవడం అన్నది పరిపాటి. వీటిని కచ్చితంగా పాటించేవాళ్లు కొందరైతే.. 31న ఒట్టు పెట్టుకుని.. ఒకటో తేదీ సరికి దాన్ని గట్టు మీద పెట్టేసేవాళ్లు మరికొందరు.. మన సంగతి అలా ఉంచితే.. నిత్యం బిజీబిజీగా గడిపే ప్రముఖులు ఈసారి ఏమనుకుంటున్నారు? ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు 2021లో స్వదేశీ వస్తువులకే ‘సై’ అన్న ప్రముఖ వ్యక్తి ఎవరు? సొంతూళ్లో ఇల్లు కట్టుకోవడమే ఈ ఏడాది టార్గెట్ అన్న కామ్రేడ్ ఎవరు? హరీశ్రావు ఏం చేస్తానన్నారు? సీఎస్ ఏం రాస్తారన్నారు? ఇంతకీ కొత్త ఏడాదిలో డీజీపీ మహేందర్రెడ్డి టార్గెట్ ఏమిటి? లోకల్కేవోకల్.. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లోకల్–వోకల్ నినాదం ఇచ్చారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని 2021లో పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడాలని నిర్ణయించా. రోజూ ఉదయం గంటసేపు యోగ, వ్యాయామం చేస్తాను. సమతుల ఆహారం నేను తీసుకుంటుంటాను. కొత్త ఏడాదిలో ఈ విషయాల్లో శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నాను. ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. – రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటిదాక చదివా.. ఇక రాస్తా కొత్త సంవత్సరంలో బాగా పుస్తకాలు చదవడంతో పాటు పుస్తకాలు రాయడాన్ని మళ్లీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న. మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ పేరుతో ఇప్పటికే రాసినా.. వాటిని గూగుల్లో ఎవరైనా చూడవచ్చు. ఈ ఏడాది అభివృద్ధి అనే అంశంపై పుస్తకాలు రాయాలనుకుంటున్నా. అంతేకాదు.. ఆరోగ్యంపై మరింత ఫోకస్గా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ ఏడాది వ్యాయామం చేయడం ప్రారంభిస్తా. – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హెల్త్ అండ్ ఫిట్నెస్పైనే.. శరీరం ఫిట్గా ఉంటే ఎలాంటి వ్యాధినైనా, విపత్తునైనా ఎదుర్కోగలుగుతాం. మానవాళిపై కరోనా వైరస్ విసిరిన పంజా మన ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పింది. అందుకే, కొత్త సంవత్సరంలో హెల్త్ అండ్ ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. నాతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యంపైనా శ్రద్ధ పెడతా. – డీజీపీ ఎం.మహేందర్రెడ్డి రెండు మూడు ఉన్నాయి.. నాకు రెండు, మూడు లక్ష్యాలు ఉన్నాయి. సహజసిద్ధమైన అడవులు, సుందర ప్రదేశాలతోపాటు నదుల వెంట పయనిస్తూ చేసే ప్రయాణం నాకెంతో ఇష్టం. అందుకే ప్రత్యేకమైన అటవీ, వృక్ష సంపదకు, సముద్ర జీవనానికి కేరాఫ్ అయిన అండమాన్, నికోబార్ దీవులను ఈ కొత్త సంవత్సరంలో తప్పక విజిట్ చేస్తాను. ఈ ఏడాది చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, కల్పిత సాహిత్యం మరింత ఎక్కువ చదవాలనుకుంటున్నాను. – ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభ సిక్స్ డేస్ ఏ వీక్.. ఈ ఏడాది తప్పనిసరిగా వారంలో ఆరు రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నది నా లక్ష్యం. గతేడాది అనుకున్నా.. సాధ్యమవలేదు.. ఈసారి మాత్రం పక్కా.. శారీరక దృఢత్వంతోనే మానసిక సంకల్పం కూడా బలంగా ఉంటుందని నేను నమ్ముతాను. అంతేకాదు.. ఆత్మవిశ్వాసంతోపాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.. – స్వాతి లక్రా, ఏడీజీ, విమెన్ సేఫ్టీ వింగ్ నేను.. నా రెహాన్.. ఈ బిజీబిజీ పనుల్లో నేను గ్రహించనే లేదు.. నా కొడుకు రెహాన్ పెద్దవాడు అయిపోతున్నాడు. వాడికిప్పుడు 12 ఏళ్లు. ఈ కొత్త ఏడాది వాడికి బెస్ట్ ఫ్రెండ్గా మారాలని నిర్ణయించుకున్నా.. ఈ సంవత్సరం ఎలా ఉందో చూశాం. అందుకే 2021లో ఫిట్నెస్ మీద ఫోకస్ పెడతా. వ్యాయామానికి మరింత టైం కేటాయిస్తాను. – సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ ఎల్ఎల్ఎం పూర్తి చేయాలి 2015లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత ఎల్ఎల్ఎం కోసం అడ్మిషన్ తీసుకున్నా. అయితే పని ఒత్తిడి నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయా. 2021లో అది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు ఇచ్చే తర్ఫీదును మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాను. – రాచకొండ సీపీ మహేష్ భగవత్ బోలెడు పుస్తకాలు చదవాలి ఇప్పటివరకు వీకెండ్లో ఒక పుస్తకం మాత్రమే చదివేవాడిని. 2021లో మాత్రం ప్రతీ వీకెండ్లో బోలెడన్ని పుస్తకాలు చదవాలని డిసైడ్ అయ్యా. బోలెడన్ని అంటే కనీసం మూడు నాలుగు పుస్తకాలైనా చదవాలి. గతంలో మూడు నెలలకోసారి సెలవులపై దేశ విదేశాలకు టూర్ వెళ్లేవాడిని. కొత్త సంవత్సరంలో మాత్రం కనీసం రెండు నెలలకోసారి వారం రోజులపాటు సెలవులపై వెళ్లాల్సిందే. – సన్షైన్ ఎండీ డా. గురువారెడ్డి లాస్ట్ ఇయర్లా చేయను.. అందరూ తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని కోవిడ్ పరిస్థితులు నొక్కి చెప్పాయి. నేను చాలా కాలంగా యోగా చేస్తున్నా.. అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వల్ల నాలుగు నెలల నుంచి చేయడం లేదు. ఈమారు గత ఏడాదిలా కాదు.. యోగాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా.. అలాగే ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలని నిర్ణయం తీసుకున్నా. – మంత్రి టి.హరీశ్రావు ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజా జీవితంలో ఉండేవాళ్లు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ ఉంటారు. అందుకేవ్యక్తిగత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నా. అలాగే నా జీవితంలో గ్రీన్ ఇండియా చాలెంజ్కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇన్నాళ్లూ రాజకీయాల్లో లెఫ్టిజమ్, రైటిజం అంటూ అనేక ఇజాలు వింటూ వచ్చాం. కానీ రాబోయే రోజుల్లో అంతా గ్రీనిజమే. – ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ 5 కి.మీ. వాకింగ్ మస్ట్.. నాకు వాకింగ్ చేసే అలవాటు ఉంది. అయితే.. రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మాత్రం అలా చేయను. 2021లో శరీర దారుఢ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక నడక మానే ప్రసక్తే లేదు. రోజూ ఉదయం, సాయంత్రం కనీసం 5 కిలోమీటర్లు తగ్గకుండా నడుస్తా.. వ్యక్తిగతంగా కొత్త సంవత్సరంలో నేను నిర్దేశించుకుంటున్న లక్ష్యం ఇదే.. – టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ఊర్లో ఓ ఇల్లు ఈ మధ్య చలో సొంతూరు నినాదం పెరుగుతోంది. నాక్కూడా సొంతూళ్లో ఇల్లుండాలనే కోర్కె బలంగా ఉంది. అమెరికాలో వున్న పిల్లలు అప్పుడప్పుడు వచ్చి.. మన పద్ధతులు చూడకుంటే.. మనతో మమేకం కాలేరు.. అందుకే మేం కూడా ఊర్లో ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఇక అభ్యుదయ సంగీతం , అన్నమయ్య కీర్తనలు , ఫ్లూట్ మ్యూజిక్ నాకిష్టం.. అవి వింటూ.. అలా మనవళ్లతో కాలక్షేపం చేయాలని ఉంది. – సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ -
నేర, మావో రహిత తెలంగాణే లక్ష్యం
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో పలు రకాల నేరాలు తగ్గుముఖం పట్టాయి. సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి. నేరాల అదుపులోనూ పోలీసుల పనితీరు మెరుగైంది. నేర, మావోయిస్టు రహిత తెలంగాణే తమ లక్ష్యమని డీజీపీ డాక్టర్ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన నేరాలపై బుధవారం వార్షిక నివేదిక విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. డీజీపీ ఇంకా ఏమన్నారంటే... 2020లో అనేక విపత్తులు, వరదలు, కరోనా వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల వెంట నిలిచాం. మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేశాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలలో దాదాపు 6 శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది 1,60,571 కేసులు నమోదు కాగా, 2020లో 1,50,922 కేసులు నమోదయ్యాయి. 2019లో 1,780 లైంగికదాడులు జరగ్గా 2020లో ఆ సంఖ్య 1,934కు చేరింది. ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి ఘటనాస్థలానికి కేవలం 8 నిమిషాల్లో చేరుకుంటున్నాం. ఎమర్జెన్సీ రెస్పాన్స్లో దేశంలోనే ఇది అత్యుత్తమ సగటు. ప్రజలకు చేరవయ్యేందుకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకున్నాం. డీజీపీ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు ఏమిటంటే.. 11 ఎన్కౌంటర్లలో 11 మంది మావోయిస్టులు హతమయ్యారు. 135 మంది అరెస్టు కాగా, 45 మంది లొంగిపోయారు. 22 ఆయుధాలు, రూ.23 లక్షల నగదు స్వాధీనం. 33 జిల్లాల తెలంగాణలో 30 జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు లేవు. ►లాక్డౌన్ కాలంలో 6,000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వారిలో 72 మంది మరణించారు. ►లొకేషన్ బేస్డ్ సర్వీస్ ద్వారా డయల్ 100కు ఫోన్ చేసిన బాధితులు ఎక్కడున్నారో కనిపెడుతున్నాం. ►డయల్ 100/ డయల్ 112లకు 12,45,680 ఫిర్యాదులు వచ్చాయి. సోషల్ మీడియా కంప్లైంట్స్ 1,59,915, రిసెప్షన్ ఫిర్యాదులు 6,78,189, హాక్ ఐకి 1,15,743 ఫిర్యాదులు ►ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో 300 కేసుల్లో నేరస్తుల్ని, పాస్పోర్టు వెరిఫికేషన్లో 22 మంది నేరచరితులను గుర్తించాం. ►దర్పణ్ యాప్ ద్వారా 33 మంది పిల్లల ఆచూకీ కనుగొన్నాం ►2020లో 624 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. 350 మందిపై ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు ► షీ–టీములకు 4,855 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 567 ఎఫ్ఐఆర్లు నమోదు. ►రాష్ట్రవ్యాప్తంగా ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను ఏర్పాటు చేశాం. త్వరలో వీటిని ప్రతి జిల్లా/ కమిషనరేట్లలో ఏర్పాటు చేస్తాం. ► డిపార్ట్మెంట్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(హెచ్ఆర్ఎంఎస్) అమలుకు శ్రీకారం ►వికారాబాద్, సంగారెడ్డి, వరంగల్లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం. ►థర్డ్పార్టీ ద్వారా పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ►ఆపరేషన్ స్మైల్–6లో 1,292 మందిని, ఆపరేషన్ ముస్కాన్లో 741 మంది పిల్లలను రక్షించాం. ►మానవ అక్రమ రవాణా ముఠాల నుంచి 383 మందిని కాపాడాం. ►వర్టికల్ ఫంక్షనింగ్ ద్వారా 2019లో 29 శాతంగా ఉన్న కన్విక్షన్ రేటు 2020లో 48 శాతానికి చేరుకుంది. ►2020లో నలుగురికి మరణశిక్ష ఖరారైంది. ఉమ్మడి ఏపీ, తెలంగాణలో ఇది ఒక రికార్డు. ►రూ.93 కోట్ల 73 లక్షల ప్రాపర్టీ లాస్ అయితే రూ.50 కోట్ల 47 లక్షలు రికవరీ ►మహిళలపై వేధింపులు గత ఏడాదితో పోలిస్తే 1.92% తగ్గింది ►హత్యలు 8.29%, దోపిడీలు 28.57%, రాబరీ 33.11%, చైన్ స్నాచింగ్ 46% తగ్గాయి. ►రోడ్డు ప్రమాదాలు 13.93% తగ్గాయి. మరణాలు 9% తగ్గాయి ►వరకట్న వేధింపులు 6,544 నమోదు కాగా, అందులో 144 మంది మృతి. ►ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ చట్టం కింద 2,096 కేసులు నమోదు. కేసుల పెరుగుదల 10.89%. ►రాష్ట్రవ్యాప్తంగా 9,568 ఆర్థిక నేరాలు నమోదు. 4,544 సైబర్ నేరాలు నమోదు. గతేడాదితో పోలిస్తే 103% పెరిగాయి. ►ఈ ఏడాది 16,866 రోడ్డు ప్రమాదాలు, 5,821 మంది మరణం. ►ట్రాఫిక్ ఉల్లంఘనలపై రూ.613 కోట్ల జరిమానాలు, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కోటీ 67 లక్షల కేసులు. ►రాష్ట్రంలో 4.5 లక్షల మందికి సంబంధించి పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేశాం. -
ఆ యాప్ల ద్వారా రుణాలొద్దు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: చట్టబద్దత లేని యాప్ల ద్వారా రుణాలు స్వీకరించవద్దని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్ల పై ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్, బ్యాంకు నుండి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని డీజీపీ తెలిపారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యాప్ల ద్వారా అనేక మందికి నగదు రుణాలు అందించి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో చేసిన వేధింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఒక ప్రకటన విడదల చేశారు. (చదవండి: తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత) ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45-1ఏ ప్రకారం ఏదైన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉందని తెలిపారు. ఆర్బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ ఆన్లైన్ యాప్లలో అధికశాతం ఆర్బీఐలో నమోదు కాలేదని, అందువల్ల వారికి రుణాలు అందించే అధికారం లేదని పేర్కొన్నారు. (చదవండి: జీహెచ్ఎంసీలో ఐఫోన్ల ‘బహుమతులు’!) ఈ యాప్లలో అధికంగా చైనీస్వే ఉన్నాయని, వాటికి రిజిస్టర్ అయిన చిరునామా గాని, సరైన మొబైల్ నంబర్ గాని ఇతర వివరాలు ఉండవని పేర్కొన్నారు. ఫోన్ ద్వారానే సమాచారాన్ని (డేటా) ను యాప్ ల నిర్వాహకులు తెలుసుకుంటారని, ఈ యాప్ల యూజర్లు లిఖిత పూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తారు. యాప్ల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించని బాధితులను వేధించేందుకు ఈ సమాచారాన్ని రుణాలు అందించే యాప్ల నిర్వాహకులు దుర్వినియోగం చేస్తారు. ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏవిధమైన షరతులకు అంగీకరించవద్దని సూచించారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని తెలిపారు. ఇంటర్ నెట్ లో లభించే అనేక రుణాలు అందించే యాప్లు మోసపూరితమైనవని, ఆర్బీఐ గుర్తింపులేని ఈ యాప్ల ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్ లోడ్ చేయకూడదని తెలిపారు. ఈ యాప్ల ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయి. ఇది సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సీ రిజిస్టర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీలకన్నా అత్యధికం. రుణ బాధితులు సకాలంలో చెల్లించని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడొంతులు అయి రుణ వలయంలో చిక్కుకుంటారు. దీంతో రుణాలు చెల్లించని రుణ గ్రహీతలను తిరిగి చెల్లించమని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆన్లైన్ వేధింపులకు ఈ యాప్లు పాల్పడతాయి. రుణాలను చెల్లించనట్లైతే మీ పై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని రుణం అందించే యాప్లు బెదిరించే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ తెలిపారు. ఆర్బీఐలో రిజిస్టర్ కాని, అక్రమ యాప్ల ద్వారా ఏవిధమైన రుణాలు స్వీకరించవద్దని డీజీపీ కార్యాలయం ప్రజలకు సూచించింది. ఈ విషయంలో ఎవరైన వేధింపులకు గురయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి చెప్పారు. -
సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న వారిపైన కేసులు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా ఉందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. గత ఆరేళ్లుగా ప్రజల సహకారంతో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకుని హైదరాబాద్లో మత ఘర్షణలు తీసుకురావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియా పైన పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిందన్నారు. జనాలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి అలాంటి వారిని గుర్తిస్తున్నామన్నారు. చదవండి: గ్రేటర్లో అందరికీ ఉచితంగా కరోనా టీకా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాటిని ఎవ్వరు ఫార్వర్డ్ చేయ్యొద్దని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. ప్రజలందరూ పోలీసులతో భాగస్వామ్యం కావాలని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందన్నారు. మూడు కమిషనరేట్ పరిధి లో 51,500 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ కోసం బ్లూ కోడ్స్ సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు. పోలీస్ శాఖ ఉన్నత సమావేశం ఏర్పాటు చేశామని, ముందస్తుగా ఉన్న సమాచారం మేరకు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసకున్నామన్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులు నమోదు చేశామని, క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్లో అల్లర్లకు బీజేపీ కుట్ర?
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటూ డీజీపీ మహేందర్రెడ్డిని టీఆర్ఎస్ నేతలు కోరారు. ఆదివారం సాయంత్రం డీజీపీని కలిసిన టీఆర్ఎస్ నేతలు... హైదరాబాద్లో విధ్వంసానికి బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, సైదిరెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు డీజీపీని కలిశారు. అనంతరం ఈసీ అదనపు సీఈఓ బుద్ధ ప్రకాష్ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతకు ముందునగరంలో అల్లర్లు సృష్టించి ద్వారా వచ్చే సానుభూతితో దుబ్బాక ఉపఎన్నికలో కొన్ని ఓట్లు సాధించాలని బీజేపీ అనుకుంటోందని, ఆ పార్టీ నాయకుల నుంచే తమకు విశ్వసనీయ సమాచారం ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. (రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్) -
తెలంగాణ పోలీస్పై కీరవాణి అదిరిపోయే పాట
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరచి, ఆలపించిన ‘పోలీస్, పోలీస్ ...తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్’ అనే పాటను డీజీపీ మహేందర్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. డీజీపీ కార్యాలయంలో శనివారం ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి కీరవాణి విచ్చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ ఫ్లాడ్ డే కార్యక్రమాల సందర్బంగా ఈ పాటను విడుదల చేయడం సందర్బోచితంగా ఉందన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులను వివరిస్తూనే పోలీసులు అందించే సేవలను స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారని మహేందర్ రెడ్డి ప్రశంసించారు. ‘మనం కష్టపడుతూ సేలందిస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి ఈ అద్భుతమైన పాటే నిదర్శనమని’ డీజీపీ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ, మాతృ దేవోభవ, పితృ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని, ఈ దిశగా పోలీసులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తన తొమ్మిదేళ్ల వయస్సులో తొలి కార్యక్రమం రాయచూరులో పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజున ఇచ్చానని తెలిపారు. ‘ఇస్తున్నా ప్రాణం మీ కోసం’ పోలీసు త్యాగాలను తెలియచేసే పాటను 1998 సంవత్సరంలోనే అప్పటి డీజీపీలు దొర, రాములు కోరిక మేరకు స్వరపరచి పాడానని గుర్తు చేసుకున్నారు. ఈ పాటను హిందీలో కూడా రూపొందిస్తానని కీరవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు ఉమేష్ ష్రాఫ్, జితేందర్, సందీప్ శాండిల్య, శివధర్ రెడ్డి, నాగిరెడ్డి, బాల నాగాదేవి, వెంకటేశ్వర్లు, ఈ పాట ఎడిటర్ హైమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 'ప్రాణం పంచే మనస్సున్న పోలీస్', the video-song is here to watch, Than Q @mmkeeravaani garu & Anantha Sriram for this thoughtful tribute to the #PoliceMartyrs, in observance of #PoliceFlagDayTelangana. https://t.co/F6dKU4TNUZ — DGP TELANGANA POLICE (@TelanganaDGP) October 31, 2020 -
21 వరకు అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ చేపడుతున్న సహాయక చర్యలపై ఆయన అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో శనివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసు సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు, ముందస్తు వ్యూహాలు సిద్ధం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పలు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నదులు, చెరువులు, రిజర్వాయర్లు తదితర జలవనరుల వద్ద అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. -
భారీ వర్షాలు: పోలీసు శాఖను అప్రమత్తం చేసిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో డీజీపీ మహేందర్రెడ్డి రాష్ట్ర పోలీసు శాఖను అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు డీజీపీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల నుంచి జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని సోమవారం ఆదేశించారు. పోలీసు అధికారులందరూ 24 గంటల పాటు విధుల్లో ఉండి ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా చూడాలని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్లు, విపత్తు నివారణ శాఖలతో పాట ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధానంగా డయల్ 100కు వచ్చే కాల్స్ అన్నింటీకి ప్రాధాన్యతతో చేపట్టి పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైన డయల్ 100కు ఫొన్ చేయాలని రాష్ట్ర ప్రజలను డీజీపీ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మేంట్ డైరెక్టర్ హైదరాబాద్లో హైఅలర్ట్ ప్రకటించారు. 12,13,14 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇస్తూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జీహేచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను రఃగంలోకి దింపింది. ముంపు ప్రాంతాలను గుర్తించి నిర్వాసితుల కోసం అన్నీ ఏర్పాట్లు చేయాలని జీహేచ్ఏంసీ ఆదేశించింది. వరదలు ఎక్కవగా ఉన్న ప్రాంతాల్లో పరికరాలు, మిషన్స్ తరలించాలని, నిర్వాసితులను తరలించేందుకు వాహనాలు సిద్ధం చేసుకోవాలని అన్నీ జోనల్ కమిషనర్లను జీహేచ్ఎంసీ ఆదేశించింది. -
తీన్మార్ మల్లన్న హద్దులు దాటాడు..
సాక్షి, హైదరాబాద్: తన యూట్యూబ్ చానల్లో సైకోలా ప్రవర్తిస్తూ.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న క్యూన్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది తూడి అరుణ కుమారి బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించిన అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. పంజాగుట్ట కేసులో ఓ మహిళను ఇంటర్వ్యూ చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అన్ని రకాల హద్దులు దాటాడని అరుణ కుమారి ఆరోపించారు.(చదవండి: 139 మంది అత్యాచారం: ‘భూమి’కి న్యాయం చేయండి) తన ఇంటర్వ్యూలో సభ్యసమాజం తలదించుకునే విధంగా బాధితురాలికి ప్రశ్నలు వేశాడని మండిపడ్డారు. 139 మంది నిందితుల కోసం 139 బుల్లెట్లు రెడీ చేసుకోవాలని సిటీ కమిషనర్కు ఆదేశాలివ్వడం ఏంటని, అతను సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా గతేడాది జరిగిన ‘దిశ’ ఎన్కౌంటర్ ఫేక్ అంటూ మల్లన్న వ్యాఖ్యానించడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో నవీన్ సుప్రీంకోర్టుతో పాటు ‘నిర్భయ’ చట్ట నిబంధనలను అతిక్రమించాడని, అతడిపై తగినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ కిడ్నాప్.. విడుదల! దుండిగల్: ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ అనుమానాస్పద స్థితిలో కిడ్నాప్ అయ్యాడు. దుండిగల్ సీఐ వెంకటేశం తెలిపిన మేరకు..న్యూషాపూర్నగర్కు చెందిన హజ్మత్ అలీ యూట్యూబ్ చానల్ రిపోర్టర్. మంగళవారం రాత్రి మరో యూట్యూబ్ చానల్ రిపోర్టర్ సలీం.. అలీకి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే అనుమానంతో కైసర్నగర్ చౌరస్తా లోని బాచుపల్లి రోడ్డు వరకు ఓ ఆటోను వెంబడించారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని డబ్బులు డిమాండ్ చేశారు. అయితే వారు అందుకు ఒప్పుకోకుండా ఆటోను మియాపూర్ వైపు పోనిచ్చారు. ఈ క్రమంలో సదరు ఆటోను బాచుపల్లి పోలీసులు కోకకోలా చౌరస్తాలో పట్టుకున్నారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న రేషన్ బియ్యం తరలింపు ముఠా సభ్యులు ఇన్నోవా కారులో వచ్చి సలీంను ఎత్తుకెళ్లడానికి యత్నించగా అతను తప్పించుకోవడంతో హజ్మత్ అలీని తమ వెంటకు తీసుకువెళ్లారు. దీంతో హజ్మత్ అలీ కుటుంబ సభ్యు బుధవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హజ్మత్ అలీ దుండిగల్ పోలీస్స్టేషన్కు చేరుకున్నాడు. తనను కిడ్నాపర్లు వదిలేశారని, బస్సులో ఇంటికి చేరుకున్నానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు కిడ్నాపర్లు ఉపయోగించిన ఇన్నోవా కారును స్వాధీనం చేసుకొని పోలీసులు రేషన్ బియ్యం ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
అధికారులకు దిశానిర్దేశం
సాక్షి, మంచిర్యాల: డీజీపీ మహేందర్రెడ్డి కుమురం భీం జిల్లా పర్యటన ఆదివారం ముగిసింది. ఈ నెల 2న మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో ఆసిఫాబాద్ చేరుకున్న డీజీపీ ఆదివారం వరకు అక్కడే గడిపారు. నెలన్నర వ్యవధిలో రెండుసార్లు ఆసిఫాబాద్ వచ్చిన డీజీపీ.. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులు, పోలీసుల పనితీరును నేరుగా తెలు సుకున్నట్లు తెలుస్తోంది. దళ సభ్యుల సం చారం నేపథ్యంలో అప్రమత్తతపై మరో మారు స్థానిక పోలీసులకు దిశానిర్దేశం చేసినట్లుగా పర్యటన సాగింది. ఉమ్మడి జిల్లాలో నక్సల్స్ సానుభూతిపరులు, కూంబింగ్లో బలగాలు వ్యవహరించాల్సిన తీరు, కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు వంటివి చర్చకు వచ్చి నట్లు సమాచారం. మావోయిస్టులను ఆదిలో నిలువరించేందుకు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. గత ఐదు రోజులుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ప్రాణహిత తీరం, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. అత్యంత గోప్యంగా పర్యటన డీజీపీ ఆసిఫాబాద్ పర్యటన గోప్యంగా సాగింది. ఈ ఐదు రోజుల్లో ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు. తొలి రోజు హెలికాఫ్టర్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మావోయిస్టు సంచారం ఉన్న అటవీ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రెండు రోజులపాటు జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీసులోనే రామగుండం పోలీసు కమిషనర్, ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ, ఓఎస్డీ ఉదయ్కుమార్ రెడ్డి, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణువారియర్తో సమీక్షలు నిర్వహించారు. ఈ నెల 4న రాత్రి పది గంటలకు మారుమూల తిర్యాణి పోలీస్స్టేషన్కు రోడ్డు మార్గాన వెళ్లి వచ్చారు. గత జూలైలో ఈ పోలీస్స్టేషన్ పరిధిలోని మంగీ అడవుల్లో మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఫైరింగ్ జరిగింది. రెండు సార్లు దళ సభ్యులు చిక్కినట్లే చిక్కి తృటిలో తప్పించుకున్నారు. అలాంటి మారు మూల ప్రాంతానికి డీజీపీ రాత్రి వెళ్లడంతో ఏదో జరుగుతోందని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అదే రాత్రి డీజీపీ ఆసిఫాబాద్ చేరుకున్నారు. ఈనెల 5న ఎస్పీ క్యాంపు ఆఫీ సులో ఉమ్మడి జిల్లాలోని మావోయిస్టు ప్ర భా వం ఉన్న ఎస్సై, సీఐ, డీఎస్పీలతో సుదీర్ఘంగా సమీక్షించారు. అదేరోజు చివరగా కుమురం భీం కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో ప్రత్యేకం గా సమావేశమయ్యారు. ఐదో రోజు మధ్యా హ్నం 3 గంటలకు రోడ్డు మార్గాన ఆసిఫాబా ద్ నుంచి హైదరాబాద్ బయలుదేరివెళ్లారు. -
సై అంటే సై
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులు తిరిగి పుంజుకోకుండా చూడాలని పోలీసులు.. ఎలాగైనా తిరిగి తెలంగాణలో విస్తరించా లన్న పట్టుదలతో మావోయిస్టులు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తుండటం ఏజెన్సీ ప్రాం తాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కొత్త రిక్రూట్మెంట్ కోసం మావోలు ప్రయత్నిస్తుండటం, ఆ ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని పోలీసులు అడవులను జల్లెడ పడుతుండటం మరింత వేడి రాజేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు బాస్ ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో పర్యటించి శాఖాపరంగా కీలక మార్పుచేర్పులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్డౌన్ కాలంలోనే మొదలు... 2005 తరువాత రాష్ట్రంలో దాదాపుగా ఉనికి కోల్పోయిన మావోయిస్టులు... లాక్డౌన్ కాలంలో అనూహ్యంగా పుంజుకున్నారు. జనవరి, ఫిబ్రవరిలలో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఛత్తీస్గఢ్ నుంచి మావోల యాక్షన్ టీమ్లు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ ప్రహార్ కారణంగా వారంతా తాత్కాలికంగా తెలంగాణలోకి వచ్చారని పోలీసులు తొలుత భావించారు. అయితే వారు చాపకింద నీరులా మావోయిస్టు పార్టీ విస్తరణకు వచ్చారన్న విషయం తెలియడం పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. అదే సమయంలో కరోనా విజృంభణతో లాక్డౌన్ విధించడం మావోలకు కలసి వచ్చింది. ఈ సమయంలో వారు పార్టీకి కావాల్సిన చందాలు, సామగ్రి సమకూర్చుకున్నారు. పలువురు ప్రజాసంఘాల నాయకులు కూడా పార్టీ రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరు మావో సానుభూతిపరులు చందాలు వసూలు చేస్తూ సిరిసిల్లలో పోలీసులకు దొరికారు. జూలై 15న ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఆటవీ ప్రాంతంలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడేళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని దళం స్పెషల్ పార్టీ పోలీసులకు తారసపడటం.. పరస్పరం కాల్పులు జరుపుకోవడం కలకలం రేపింది. ఆ సమయంలో స్థానిక అటవీ ప్రాంతంలోకి 15 మంది యువత అదృశ్యమయ్యారన్న వార్త కూడా పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఆ మర్నాడే డీజీపీ మహేందర్రెడ్డి హుటాహుటిన ఆసిఫాబాద్ వెళ్లారు. అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలోనూ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఆ రోజు నుంచి గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులంతా అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. రెండుసార్లు ఆసిఫాబాద్కు.. మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారంటూ ఈ నెల 1న జరిగిన ప్రచారంతో పోలీసులు, మావోయిస్టులు ఉలిక్కిపడ్డారు. ఆ మర్నాడే డీజీపీ మహేందర్రెడ్డి ఆకస్మికంగా ఆసిఫాబాద్ చేరుకున్నారు. 45 రోజుల్లో డీజీపీ రెండుసార్లు ఆసిఫాబాద్లో పర్యటించడంతో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆసిఫాబాద్లో మావోల కదలికలు పెరగడం, అదే సమయంలో గణపతి, మరికొందరు మావో అగ్రనేతలు లొంగిపోతారన్న వార్తలు తోడవడంతో రాష్ట్రంలో ఏదో జరుగుతోందన్న చర్చ తీవ్రమైంది. అయితే గణపతి లొంగుబాటు ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. అవన్నీ కట్టుకథలని, పోలీసుల మైండ్గేమ్ అని లేఖ విడుదల చేసింది. తమకు ప్రజల్లో పూర్వ ఆదరణ లభిస్తోందని, తప్పకుండా రాష్ట్రంలో పునర్వైభవం సాధిస్తామని మావోలు ప్రతినబూనారు. అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ గన్మన్, యాక్షన్ కమిటీ సభ్యుడు శంకర్ గుండాలలో పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందడంతో యాక్షన్ కమిటీ సభ్యుల సంచారం నిజమేనని తేలింది. దీంతో డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మావోలు బలపడేందుకు అవకాశమున్న అటవీ, గోదావరి పరీవాహక జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు ఠాణాల్లో సీఐలు, ఎస్సైలను ఆకస్మికంగా బదిలీ చేశారు. గతంలో మావోలను సమర్థంగా ఎదుర్కొన్న సీనియర్ పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే రెండు దశాబ్దాలనాటి ఇన్ఫార్మర్ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసుకోవాలని, అటవీ ప్రాంతాల్లో కొరియర్లు, సానుభూతిపరుల కదలికలపై నిఘా పెట్టాలంటూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తిరిగి కార్యాకలాపాలు ప్రారంభించిన మావోయిస్టులను సరిహద్దులోనే అడ్డుకోవాలని డీజీపీ వ్యూహాలు రచిస్తుండగా.. ప్రజామద్దతుతో తిరిగి బలపడతామని మావోలు చెబుతున్నారు. -
హై టెన్షన్.. 26 మంది కిడ్నాప్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టుల ప్రయత్నాలు.. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ముమ్మరంగా కూంబింగ్.. వెరసి మన్యం అట్టుడికిపోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవళ్లగూడెంలో ఇటీవలి ఎన్కౌంటర్, సరిహద్దున ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నలుగురు జవాన్లను శనివారం మావోలు హతమార్చిన తాజా ఘటనలతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు ఈ నెల 6వ తేదీన ఉత్తర తెలంగాణ బంద్కు పిలుపునివ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం నెలకొంది. మావోలు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్షన్ టీమ్లను ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి పంపారు. జూలై 20న మావోయిస్టు పార్టీ కొత్తగా రాష్ట్ర కమిటీని, మరో 12 డివిజన్, ఏరియా కమిటీలను, రాష్ట్రస్థాయి యాక్షన్ టీమ్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసు యంత్రాంగం మావోలను నిరోధించేందుకు నిరంతరం సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ నెల 3న గుండాల ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత హరిభూషణ్ గన్మన్, యాక్షన్ టీం కమిటీ సభ్యుడు దూది దేవాల్ అలియాస్ శంకర్ హతమయ్యాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ లేఖలను విడుదల చేసిన మావోయిస్టు ఏరియా, డివిజన్ కమిటీ కార్యదర్శులు ఉత్తర తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండటంతో అవాంఛనీయ, విధ్వంసక ఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. యాక్షన్ టీమ్లు సంచరిస్తున్న గోదావరి పరీవాహక జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కీలకమైన ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. డీజీపీ పర్యవేక్షణ డీజీపీ మహేందర్రెడ్డి నాలుగు రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలోనే మకాం వేసి సెర్చ్ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి పరీవాహక జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్లు జిల్లా ఎస్పీలు చూసుకుంటున్నారు. సబ్ డివిజినల్ పోలీసు అధికారులు ఏకంగా స్పెషల్ పార్టీ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. కొన్ని నెలల కిందట ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని సబ్ డివిజన్లలో ఎస్డీపీఓలుగా ప్రభుత్వం ఐపీఎస్ అధికారులనే నియమించింది. భద్రాచలంతోపాటు మణుగూరు, ఏటూరునాగారం సబ్ డివిజన్లకు ఐపీఎస్లను కేటాయించారు. మరోవైపు మూడు రోజుల కిందట భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫారసులతో సంబంధం లేకుండా పోలీస్బాస్ మార్క్తో ఓఎస్డీ, సీఐల బదిలీలు చేశారు. మావోయిస్టు ఆపరేషన్లు చేయడంలో అనుభవం ఉన్న వారిని కీలకమైన ఠాణాలకు కేటాయించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్), సీతారామ ఎత్తిపోతల పథకాలకు పోలీసులు భద్రత మరింత పెంచారు. ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తుండటంతో మావోలు వారిలో కలసిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 26 మంది కిడ్నాప్ నలుగురి హత్య మావోయిస్టులు భద్రాద్రి ఏజెన్సీకి సరిహద్దుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ అనే రెండు గ్రామాలకు చెందిన నలుగురు గిరిజనులను శనివారం పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో హతమార్చారు. ముందుగా ఈ రెండు గ్రామాలకు చెందిన 26 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు ఏర్పాటు చేసి ఈ నలుగురిని గొంతుకోసి దారుణంగా చంపారు. ఆరుగురిని విడిచిపెట్టి, మరో 16 మందిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. బలగాలు కూంబింగ్ ఆపరేషన్లను నిలిపేయకపోతే తమ అధీనంలో ఉన్న 16 మందిని హతమారుస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. -
మావోయిస్ట్ ఏరియాలో మరోసారి డీజీపీ పర్యటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆపరేషన్ మావోయిస్టు రెండో రోజు కొనసాగుతోంది. గురువారం డీజీపీ మహేందర్రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు. మావోయిస్టులసంచారం, పోలీసుల చర్యలపై గురువారం విస్తృతంగా సమీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం ఆసిఫాబాద్ మొదలుకొని కొమరంభీమ్, ఉట్నూర్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో గంటన్నర పాటు డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీసులో సుదీర్ఘంగా సమీక్షించారు. మావోయిస్టుల ఏరివేత, కట్టడి చర్యలపై డీజీపీ దిశా నిర్దేశం చేశారు. మరో రెండ్రోజులపాటు ఆసిఫాబాద్లోనే డీజీపీ మహేందర్రెడ్డి మకాం వేయనున్నారు. క్షేత్ర స్థాయిలో ఏరియల్ సర్వే, సమీక్షలతో స్వయంగా డీజీపీనే రంగంలోకి దిగారు. 45 రోజుల్లో ఆసిఫాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డి రెండోసారి పర్యటించారు. తిర్యాని మండలం మంగి అడవుల్లో మంచిర్యాల కమిటీ కార్యదర్శి భాస్కర్ అలియాస్ అడెల్లు, ఐదుగురు సభ్యులు రెండు సార్లు తప్పించుకున్నారు. పోలీసుల కూంబింగ్లో మావోయిస్టుల డైరీ లభ్యమయ్యింది. మావోయిస్టు రిక్రూట్మెంట్కు సంబంధించిన కీలక సమాచారం అందులో లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా కూంబింగ్ ఆపరేషన్పై కరోనా ఎఫెక్ట్ పడింది. పలువురు గ్రే హౌండ్స్ ఏ ఆర్ సివిల్ పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. చదవండి: మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే -
మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే
సాక్షి, అసిఫాబాద్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో మావోయిస్టుల కదలికలపై ఆరాతీస్తున్నారు. నెల రోజుల్లో రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడంతో స్థానికంగా ప్రాధాన్యత నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు విషయమై కూడా చర్చ కొనసాగుతోంది. (మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?) -
‘పులిగొండల సర్పంచ్ను విడుదల చేయాలి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి భద్రాచలం పులిగొండల సర్పంచ్ చలపతిని విడుదల చేయాలని లేఖ ఇచ్చారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గిరిజన సర్పంచ్ చలపతి అరెస్ట్ కండిస్తున్నామన్నారు. ‘మావోయిస్టులకు సహకరిస్తున్నారు-సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్ట్ చేయడం దారుణం. పోలీసులు చెప్పినట్లు మావోయిస్టు భావజాలం ఉంటే ఎన్నికల్లో చలపతి పోటీ చేసేవారు కాదు. భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి చలపతి. అర్థరాత్రి అన్నం కోసం ఎవరు వచ్చినా అన్నం పెడతాం. అడవిబిడ్డ బోయకులానికి చెందిన గిరిజన వ్యక్తి చలపతి. సర్పంచ్లను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా బెదిరిస్తే కాంగ్రెస్ అండగా ఉంటుంది’ అని భట్టి అన్నారు. వరదల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ముంపుకు గురైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అప్రమత్తంగా ఉండండి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలపై పోలీస్ శాఖ అప్రమత్తమైంది. వర్షాలు, వరదల వల్ల సాధ్యమైనంత వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులనూ సిద్ధం చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. సీఎస్తో కలసి కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూముల్లో పోలీస్ అధికారులను నియమించినట్లు చెప్పారు. (ఊళ్లన్నీ జలదిగ్బంధం) మరో రెండ్రోజులు వర్షాలు సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అలాగే కొనసాగుతుండటంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని 4, 5వ హెచ్చరికలను ఆదివారం జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రంలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే 24 గంటల్లో ఈ అల్పపీడనం బలహీనపడే అవకాశమున్నట్లు తెలిపింది. దీంతో వర్షాల తీవ్రత కొంచెం తగ్గినప్పటికీ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. 19న మరో అల్పపీడనం..: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతోనూ రాష్ట్రంలో మెస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అయితే 19న ఈ అల్పపీడనం ఏర్పడితే అది బలపడే పరిస్థితిని బట్టి వర్షపాతాన్ని అంచనా వేస్తారు. -
తెలంగాణలోనే అత్యున్నత పోలీసింగ్
సాక్షి, హైదరాబాద్: సమాజంలో శాంతి భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉంటేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రమని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు రాష్ట్రంలోని మహిళలు, యువతకు నిర్వహించిన వెబ్ ఆధారిత చైతన్య సదస్సు ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పోలీస్ శాఖ ఆధునీకరణకు అందిస్తున్న ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉందన్నారు. మహిళలు, పిల్లలు సైబర్ నేరాల బారిన పడకుండా నెలరోజులపాటు సైబ్–హర్ పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమం దేశంలోనే మొదటిదన్నారు. కార్యక్రమంలో రాష్ట్రంతోపాటు దేశ, విదేశాలకు చెందిన 50 లక్షల మంది పాల్గొనడం విశేషమని కొనియాడారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ.. సైబ్–హర్ కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారని వెల్లడించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన మై విలేజ్ షో గంగవ్వ మాట్లాడుతూ.. తనను కూడా పైసల్ గీకే కార్డు (ఏటీఎం) నంబర్ చెప్పాలని ఫోన్లో ఎవడో అడిగాడని, అయినా చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై చైతన్యం కలిగించే పలు ప్రచార కిట్లను మహేందర్రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో ఏడీజీ జితేందర్ కూడా పాల్గొన్నారు. 15 లక్షల మందికి అవగాహన..: జూలై 15న మొదలైన ఈ కార్యక్రమం ద్వారా నెలరోజులపాటు రాష్ట్రంలోని దాదాపు 15 లక్షలకుపైగా యువత, మహిళలకు ఆన్లైన్ నేరాలు, అప్రమత్తత, రక్షణ పొందే విధానం, ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి విషయాలపై అవగాహన కల్పించడం విశేషం. కాగా, ఈ కార్యక్రమం సైబర్ నేరాలపై ప్రత్యేక పుస్తకాలు వెలువరించింది. యువతలో ఆసక్తిని పెంచేలా పలు క్విజ్లు, వ్యాసరచన, పోస్టర్ ప్రజెంటేషన్, కవితలు తదితర పోటీలు కూడా నిర్వహించింది. పోస్టర్ ప్రజెంటేషన్ కోసం అత్యధికంగా 367 మంది చిత్రాలను పంపారు. వారిలో రితిక్, నమ్రతలు విజేతలుగా నిలిచారు. ఇక కవితల పోటీల విభాగంలో దాదాపు 100కు పైగా రాగా.. వాటిలో హైమా, అన్షు, సాయి నిక్షేప్, హరికాంత్, రమాదేవిల కవితలను ఉత్తమమైనవిగా ఎంపిక చేశారు -
అమీన్పూర్ కేసు స్వాతి లక్రాకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: అమీన్పూర్ కేసును ఉమెన్స్ సెక్యూరిటీ వింగ్ స్వాతి లక్రాకు అప్పగించారు. కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. కేసు,నమోదు, అరెస్ట్ వివరాలను స్వాతి లక్రా తెప్పించుకున్నారు.డీజీపీ ఆదేశాల మేరకు ఉమెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి ప్రత్యేక అధికారిని నియమించారు. నిందితుల అరెస్ట్, ట్రయల్స్, కేసు విచారణపై స్వాతి లక్రా దృష్టి పెట్టనున్నారు. (చిన్నారులను అందంగా అలంకరించి..) అమీన్పూర్లోని మియాపూర్ శివారులో మారుతి అనాథాశ్రమం ఉంది. అందులోని బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. (అమీన్పూర్లో మరో ‘ముజఫ్ఫర్పూర్’) -
సివిల్ వివాదాల్లో ఖాకీల జోక్యం!
సాక్షి, హైదరాబాద్ : సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చి ఫిర్యాదుదారులపై బెదిరింపులకు దిగుతున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ వారంలో ఈ విధమైన రెండు ఘటనల్లో రాష్ట్ర మానవహక్కుల సంఘం (ఎస్హెచ్ఆర్సీ) కలగజేసుకుందంటే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా నాగారం ఎస్సై ఓ భూవివాదంలో అకారణం గా దళితులపై దాడి చేశారని, చంపుతానని బెదిరించారనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర మానవ హక్కుల సంఘం దీన్ని సుమోటాగా స్వీకరించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఎస్పీ భాస్కరన్కు నోటీసులు జారీ చేసింది. ఈ విమర్శల నేపథ్యంలో స్పందించిన ఎస్పీ సదరు ఎస్సైని వీఆర్కు పంపారు. గతంలోనూ ఈ అధికారిపై ఇలాంటి ఆరోపణలున్నా యి. అదే జిల్లాలోని మునగాల పోలీస్స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. తన భూమిని ఆక్రమిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసుస్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినా ఎస్సై పట్టించుకోకపోగా దూషించి వెనక్కి పంపడంతో బాధితుడు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ విషయంపై విచారణ జరిపించాలని హెచ్చార్సీ సూర్యాపేట జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. భూపంచాయితీలంటే ఎంత ఇష్టమో! రాష్ట్రంలో పట్టాదారు పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులు ఎంతమందిని బలి తీసుకుంటున్నా యో చూస్తున్నాం. ఈ క్రమంలో తలెత్తుతున్న వివాదాల నేపథ్యంలో బాధితులు ముందుగా పోలీసులనే ఆశ్రయియిస్తున్నారు. దీన్ని కొందరు పోలీసులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వాస్తవానికి సివిల్ కేసులు పోలీసుల పరిధిలోనివి కావు. కానీ, ఇలాంటి వివాదాలపై పోలీసులు ఠాణాల్లోనే పంచాయితీలు పెట్టి రెండు వర్గాల నుంచి డబ్బులు దం డుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీంతో బాధితులు ఎస్పీలు, మానవ హక్కుల సం ఘాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ఎవరో ఒకరి పక్షం వహించడం వల్ల ఒకవర్గం మరోవర్గంపై దాడులు, బెదిరింపులకు దిగుతోంది. వీరంతా పేదలు, బలహీనులు కావడంతో భయపడి చాలామంది రాజీకే మొగ్గు చూపుతున్నారు. అందుకే, ఇలాంటి విషయాలు తక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. డీజీపీ ఆదేశాలు బేఖాతరేనా? సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని, స్టేషన్ల చుట్టూ పదే పదే బాధితులను తిప్పించుకోవద్దని డీజీపీ మహేందర్రెడ్డి పలుమార్లు హెచ్చరించారు. ఇలాంటి వైఖరి హత్యలు, అల్లర్లు, శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తుందని చెప్పినా చాలామంది గ్రామీణ పోలీసుల తీరు లో మార్పు రావట్లేదు. విచారణలో తప్పు రుజువై వేటు పడుతున్నా కొందరు కిందిస్థా యి పోలీసు అధికారుల తీరు మారడంలేదు. కొంతకాలం తరువాత పోస్టింగ్ వస్తుందన్న ధీమాతో బరితెగిస్తున్నారు. -
వివాదాస్పద పోస్టులు పెడితే కటకటాలే
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. ఓ నకిలీ వివాదాస్పద పోస్టు కారణంగా బెంగళూరులో అల్లర్లు చెలరేగి కాల్పులకు దారితీయడంతో డీజీపీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల విఘాతానికి కారణమయ్యే ఈ తరహా వివాదాస్పద, అసత్య పోస్టులు సమాజంలో ఆస్తి, ప్రాణనష్టాలకు దారితీస్తాయన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులపై తెలంగాణ పోలీసులు 24 గంటలపాటు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. అసభ్యకరంగా, అల్లర్లకు కారణమయ్యే పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేయాలని అన్ని పోలీసుస్టేషన్ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ విషయంలో పౌరులంతా పోలీసులకు సహకరించాలని మహేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
అలా చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయో తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటి వారిపై వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని స్టేషన్లకూ, సీనియర్ అధికారులకూ ఆదేశాలిచ్చామని తెలిపారు. (చదవండి: బెంగుళూరు అల్లర్లపై సీఎం సీరియస్) ప్రజలు పోలీసులతో సహకరించి భద్రత, రక్షణలో తెలంగాణ అత్యున్నతంగా నిలిచేలా సహకరించాలని కోరారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. కాగా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్టు షేర్ చేయడంతో బెంగుళూరులో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస) Public are requested not to post/circulate any inappropriate content in #SocialMedia. #TelanganaPolice is closely watching #SocialMedia for unsocial elements circulating malicious content. All the officers have been informed to initiate strict action against the miscreants. pic.twitter.com/wkLzOX7tmm — DGP TELANGANA POLICE (@TelanganaDGP) August 12, 2020 ఆలోచించి పోస్టు చేయండి: అంజనీకుమార్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఒక పోస్ట్ ఫలితంగా బెంగళూరులో ఘర్షణలు జరిగాయని గుర్తు చేశారు. బాధ్యత లేని, అభ్యంతరకరమైన సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విటర్లో పేర్కొన్నారు. Be very cautious before posting anything on Social Media. Last night there was violence in Banglore because of such social media post. We will take very firm legal action for any irresponsible post. We can not allow under any circumstances our city to get bad name. — Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) August 12, 2020 -
3 లక్షలు దాటిన డీజీపీ ఫాలోవర్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ ట్విట్టర్ హ్యాండిల్ అరుదైన ఘనత సాధించింది. ట్విట్టర్లో డీజీపీ ఫాలోవర్ల సంఖ్య గురువారంతో 3 లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని డీజీపీ మహేందర్రెడ్డి ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ మైలురాయి అధిరోహించడం తమ బాధ్యతలను మరింత పెంచిందని వ్యాఖ్యానించారు. కాగా, అతి తక్కువ కాలంలోనే డీజీపీ ట్విట్టర్ హ్యాండి ల్ ప్రజలకు చేరువైంది. శాంతి భద్రతలతోపాటు, పోలీసు శాఖకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా డీజీపీ హ్యాండిల్కు ట్వీట్ చేయగానే వేగంగా స్పందిస్తారని ప్రతీతి. ప్రస్తుతం తెలంగాణ డీజీపీ 3 లక్ష ల ఫాలోవర్లతో దక్షిణ భారతదేశంలోని డీజీపీల్లో మొదటిస్థానంలో ఉన్నారు. -
‘కొప్పుల ఈశ్వర్ తన స్థాయిని దిగజార్చుకోవద్దు’
సాక్షి, హైదరాబాద్: దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు శుక్రవారం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. నిన్న జరిగిన రెండు ఘటనలపై స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోతుంది. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. నర్సింహులుకు ఉన్న13 గుంటలను టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కోవడంతోనే అతడు మరణించాడు. సిద్దిపేట జిల్లా కలెక్టర్కు రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఉన్నట్లు అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. రైతు మరణించిన తరువాత ఒక ఎకరా భూమి ఇస్తున్నా అని హరీష్ రావు ప్రకటించడం దురదృష్టకరం’ అన్నారు ఉత్తమ్. (శవ రాజకీయాలు చేస్తున్న విపక్షాలు ) ‘13శాతం జనాభా ఉన్న దళితులకు కేసీఆర్ కేబినెట్లో స్థానం ఉండదు. ఒకటి, రెండు శాతం జనాభా ఉన్న వారికి 2,3 మంత్రి పదవులు కట్టబెట్టారు. మహబూబ్ నగర్లో ఇసుక లారితో తొక్కి చంపించడం కంటే దారుణం ఏదైనా ఉంటుందా? ఇవ్వాళ కేసీఆర్ సీఎం అయ్యారు అంటే దళితులు-గిరిజనుల వల్లే అనేది మర్చిపోవద్దు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు-గిరిజనులపై ప్రతిరోజు హింసాకాండ జరుగుతోంది. తెలంగాణలో పోలీసులు నిజాయితీగా ఉన్నా.. కొంతమంది ఉన్నతాధికారుల వల్ల దళితుల ఘటనల్లో న్యాయం జరగడం లేదు. దళితులపై జరుగుతున్న ఘటనలపై గవర్నర్ని, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలుస్తాం. దళితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కొప్పుల ఈశ్వర్ దళిత నాయకుడిగా ఎన్నోసార్లు ఎన్నికయ్యారు. తప్పుడు ప్రకటనలు చేసి తన స్థాయిని దిగజార్చుకోవద్దు. గజ్వేల్ ఘటనపై టీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. -
ఆపరేషన్ భాస్కర్..
సాక్షి, హైదరాబాద్ : వారం రోజులుగా తెలంగాణలో మావోల కదలికలతో పోలీసులు అప్రమత్త మయ్యారు. సుదీర్ఘ కాలం తరువాత రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడెళ్లు అలియాస్ భాస్కర్ నేతృ త్వంలోని దళం సంచరిస్తోందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్రేహౌండ్స్, టీఎస్ ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్డ్, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులతో భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆసిఫాబాద్లో దాదాపు 500 మంది, మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ దాదాపు 500 మంది వరకు పోలీసులు అడవిలో అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఆసిఫాబాద్లో రాష్ట్ర కమిటీ సభ్యుడి దళం సంచారం, 24 గంటల్లో రాష్ట్రంలో రెండుచోట్ల మావోయిస్టులతో పోలీసుల ఎదురు కాల్పులను హోం శాఖ తీవ్రంగా పరిగణించిందని సమాచారం. సుదీర్ఘకాలం తరువాత రాష్ట్రంలో మావోల రిక్రూట్మెంట్కు యత్నాలు మొదలుపెట్టడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆదిలోనే అణిచివేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. అందుకే భారీ ఆపరేషన్కు అప్పటి కపుడు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భాస్కర్ దళాన్ని పట్టుకోవడం, లేదా తెలంగాణ నుంచి తరిమికొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది పోలీసుశాఖ. డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం స్వయంగా ఆసిఫాబాద్కు వెళ్లి తాజా పరి స్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రకమిటీ సభ్యుడి రాకతో.. 2009 తరువాత రాష్ట్రంలో మావోయిస్టు సంచారం దాదాపుగా లేదు. ఇక్కడి గ్రేహౌండ్స్ దళాల దూకుడుకు మావో అగ్రనేతలంతా అంతా చత్తీస్ఘడ్, ఒడిశాలకు వలసవెళ్లారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా..చిన్నస్థాయి కొరియర్లు మాత్రమే వచ్చేవారు. కాని తాజాగా భాస్కర్తో పాటు బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ (వీరిద్దరి తలలపై రూ.20 లక్షల రివార్డు ఉంది), చత్తీస్ఘడ్కు చెందిన వర్గీస్ కోయ మగ్లు, కంతి లింగవ్వ అలియాస్ అనిత, పాండు అలియాస్ మంగులు, మీనా, రాములతో కూడిన దళం ఆసిఫాబాద్లోని తిర్యాణీ మండలం పరిధిలో సంచరించింది. వీరు 24 గంటల్లో రెండుసార్లు స్పెషల్ పార్టీకి తారసపడ్డాయి. రెండోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలోని మల్లెపల్లితోగు సమీపంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో భాస్కర్ దళం తృటిలో తప్పించుకుంది. ఈ క్రమంలో పలువురు స్థానిక యువత అదృశ్యమైనట్లు గుర్తించిన పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. మావోల రిక్రూట్మెంట్లు జరిగాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండించండి: జగన్ కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల నిర్మూలన కోసం అడవుల్లో భారీగా కూంబింగ్ చేపట్టడాన్ని ప్రజలు, ప్రజాసంఘాలు ఖండించాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో కోరాడు. ప్రజలు, దళాలపై దాడులు ఆపకపోతే టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. -
అసిఫాబాద్లో డీజీపీ పర్యటన
సాక్షి, అసిఫాబాద్: జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం అసిఫాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఏఆర్ హెడ్క్వార్టర్ట్స్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐజీ నాగిరెడ్డి, అదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్, ఏఎస్పీ సుధీంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో పోలీసు బలగాల నుంచి మావోయిస్టు దళ సభ్యులు తప్పించుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్ , మెడం భాస్కర్ , వర్గీస్ తెలంగాణలో ప్రవేశించినట్లు ఇంటలిజెన్స్ తేల్చిన క్రమంలో మూడు రోజులుగా గ్రే హౌండ్స్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. చత్తీస్గఢ్ వైపు నుంచి తెలంగాణలోని కొమురం భీమ్ అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి వస్తున్న మావోయిస్టుల కదలికలపై సమీక్షా సమావేశంలో లోతుగా చర్చించారు. మరోవైపు రెండు జిల్లాల అడవుల్లో గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.(తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్) -
‘సైబ్ హర్’తో సురక్షిత సైబర్ ప్రపంచం
సాక్షి, హైదరాబాద్ : మహిళలు–చిన్నారులు అధికంగా సైబర్ నేరాల బారిన పడుతున్న క్రమంలో సురక్షిత సైబర్ ప్రపంచంపై అవగాహన కోసం విమెన్సేఫ్టీ వింగ్ చేపట్టిన ‘సైబ్ హర్’కార్యక్రమం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం సైబ్ హర్ కార్యక్రమాన్ని ఆయన ఆన్లైన్లో ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఈ విపత్తు సమయంలో డేటా వినియోగం 70 శాతం వరకు పెరిగిందన్నారు. అదే సమయంలో మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాలు కూడా అధికమయ్యాయన్నారు. సైబర్ నేరాల నివారణ, సురక్షిత సైబర్ ప్రపంచం పై అవగాహన కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి యూనిసెఫ్లాంటితో పాటు జాతీయ సంస్థలు భాగస్వాములుగా నిలవడం గర్వకారణంగా ఉంద ని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన సంస్థలు, ఎన్జీవోలు, మీడియాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రచారం కల్పించిన సినీనటుడు నాని, యాంకర్ సుమ, షట్లర్ పీవీ సింధులకు కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజులపాటు కార్యక్రమం ఏడీజీ స్వాతీ లక్రా మాట్లాడు తూ.. నెలరోజుల పాటు నిర్విరామంగా జరిగే ఈ కార్యక్రమంలో క్విజ్, వ్యాసరచన, చర్చలు తదితర వినూత్న కార్యక్రమాలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అన్ని ప్రభుత్వ విభాగాల కు డీఐజీ సుమతి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డీజీపీ పోస్టర్ ఆవిష్కరించారు. సుమ, పీవీ సింధు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం
సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన డీజీపీలు మహేంద్ర రెడ్డి, లోకనాధ్ బెహ్రా, జేకే త్రిపాఠి, ప్రవీణ్ సుద్.. పోలీస్ శాఖలోని వివిధ భాగాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, కోవిడ్ నియంత్రణలో రాష్ట్రాల మధ్య సమన్వయం, తీరప్రాంత గస్తీ, మనుషుల అక్రమ రవాణాలపై చర్చించారు. చెన్నై, కోల్కత్తా కేంద్రంగా కృష్ణా, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాల మనుషుల అక్రమ రవాణా అరికట్టేందుకు సహకరించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర రాష్ట్రాల డీజీపీలను కోరారు. ఏపీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గురించి వివరించారు. ఎస్ఈబీ ఏర్పాటుతో ఏడువారాల్లో 20 వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ వెల్లడించారు. చదవండి: ‘మేలు మరిచిపోలేం..రుణపడి ఉంటాం’ -
నకిలీ విత్తన మాఫియాను వదలొద్దు
సాక్షి, హైదరాబాద్: రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్న మాఫియాను ఉపేక్షించవద్దని, వారిపై పీడీ యాక్ట్లాంటి కేసులతో ఉక్కుపాదం మోపాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. నకిలీ విత్తన మాఫియాను అరికట్టేందుకు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, నకిలీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లను ఆదేశించారు. నకిలీ విత్తనాల తయారీదారులు, అక్రమంగా రవాణా చేసేవారిని, విక్రయదారులను ఏమాత్రం ఉపేక్షించకూడదని, వారికి కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నకిలీ విత్తనాల కేసుల్లో 13 పీడీ యాక్ట్ కేసులు పెట్టామన్నారు. నకిలీ విత్తనాల ఉత్పత్తి, రవాణాను గుర్తించేందుకు క్షేత్రస్థాయి అధికారులు నిరంతర నిఘా ఉంచాలని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తన కార్యకలాపాల్లో పాలుపంచుకున్న నిందితులపై పోలీసు ఠాణాల వారీగా రౌడీషీట్ తెరవాలని ఆదేశించారు. అంతేకాకుండా ఇలాంటి కార్యకలాపాలకు ఊతమిస్తోన్న వ్యక్తులను, తయారీదారులను, రవాణా చేసేవారిని, డిస్ట్రిబ్యూటర్లను, విక్రయదారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిందితులందరి డేటాబేస్లను ప్రత్యేకంగా నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖతో కలిసి పోలీసులు చేస్తోన్న దాడులపై ఏరోజుకారోజు ఎస్పీలు/ కమిషనర్లు పంపిన నివేదికను తాను స్వయం గా సమీక్షిస్తానని డీజీపీ వెల్లడించారు. నకిలీ విత్తన మాఫియాపై జరుగుతున్న పోరులో వ్యవసాయశాఖ అధికారులంతా పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు. అసలైన, నకిలీ విత్తనాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం లో పోలీసులకు అవగాహన కల్పించామన్నా రు. కార్యక్రమంలో ఏడీజీ జితేందర్ (లాఅండ్ఆర్డర్), ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఎస్పీలు/కమిషనర్లు అన్ని ఠాణాల ఎస్హెచ్వోలు పాల్గొన్నారు. -
మీ సేవలకు సలామ్
కరోనా మీద ప్రస్తుతం ప్రపంచం పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో కరోనాను కట్టడి చేయడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ముందుండి పోరాడుతున్నారు. వాళ్ల సేవలకు సలామ్ చేస్తూ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ ఓ పాటను రూపొందించారు. రచయిత బాలాజీ రచించిన ఈ పాటను సుమారు పది మంది (మనో, టిప్పు, శ్రీకృష్ణ, సాయి చరణ్, నిహాల్, గీతా మాధురి, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణి, బేబి) గాయనీ గాయకులు ఆలపించారు. ఈ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేసి, ‘‘మనకోసం పోరాడుతున్న వాళ్ల సేవలను గుర్తిస్తూ ఓ పాటను చేయడం మంచి విషయం. టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘కరోనా నుంచి మనల్ని కాపాడుతున్న అందరికీ చేతులెత్తి మొక్కాలి. నాకు సహకారం అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు సంగీత దర్శకుడు మహిత్. -
కామెంట్లు వద్దు, కేసులపై దృష్టి సారించండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 కేసులపై డిపార్ట్మెంట్లో ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యంగా మీడియాతో అసలు చర్చించవద్దని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గత 50 రోజులుగా లాక్డౌన్ కారణంగా.. జనసంచారం లేకపోవడం, అంతా ఇళ్లకే పరిమితమవడంతో రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మర్కజ్ లింకులు, ఇక్కడి నుంచి వలస కూలీలను పంపడం, రాష్ట్రానికి వచ్చిన వలస కూలీల గుర్తింపు వరకు పోలీసులు అన్నీ తామై వ్యవహరించారు. కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్కు మెజారిటీ ప్రాంతాల్లో మినహాయింపులు ఇచ్చాయి. మరోవైపు నేరాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దొంగతనాల కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇకపై కరోనాతోపాటు సాధారణ నేరాల నియంత్రణకు కృషి చేయాలని డీజీపీ ఆదేశించారు. -
పరిశ్రమల సమస్యలపై డీజీపీకి టిఫ్ వినతి
సాక్షి, హైదరాబాద్: సుమారు 50 రోజుల తర్వాత పరిశ్రమలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) శుక్రవారం డీజీపీ మహేందర్రెడ్డికి విన్నవించింది. పరిశ్రమలు నడిచేందుకు వీలుగా అనుబంధ సంస్థలు, ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. అనుబంధ సంస్థలు, ఇతర దుకాణాలు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ వారికి హామీ ఇచ్చారు. జంట నగరాల పరిధిలోని పరిశ్రమలు రాణిగంజ్ మీద ఆధారపడిన నేపథ్యంలో జీహెచ్ఎంసీతో సంప్రదిస్తామన్నారు. లాక్డౌన్ మూలంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులు తిరిగి హైదరాబాద్కు వచ్చేందుకు పాస్లు జారీ చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. పారిశ్రామిక వాడలోని స్పేర్పార్టులు, రిపేరింగ్ షాపులు, ఇతరత్రా ట్రాన్స్పోర్టు ఏజెన్సీలకు కూడా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. పారిశ్రామికవాడల్లో కాకుండా ఇతర వాణిజ్య సముదాయాల్లో చిన్న చిన్న వ్యాపారాలు నడిచే శోభన కాలనీ, బాలానగర్, గీతానగర్, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు డీజీపీ అంగీకరించినట్లు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య వెల్లడించింది. డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షులు కొండవీటి సుధీర్రెడ్డి, కార్యదర్శి మిరుపాల గోపాల్రావు, పారిశ్రామికవేత్త షేక్ మదర్ సాహెబ్, బల్క్ డ్రగ్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జానీమియా, జీడిమెట్ల ఐలా చైర్మన్ సదాశివరెడ్డి తదితరులు ఉన్నారు. -
విశాఖ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని ఒక దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది భయానకంగా ఉంది: కేటీఆర్ ‘వైజాగ్ గ్యాస్ లీకేజీ దృశ్యాలు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అశ్రు నివాళి. ఆసుపత్రుల్లో చేరిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఈ ఏడాది ఎంతో భయానకంగా ఉంది’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. గ్యాస్ లీక్ ఘటన పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వేర్వేరు ప్రకటనల్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహా విషాదం: డీజీపీ మహేందర్రెడ్డి విష వాయువు లీకేజీ ఘటన మహా విషాదమని తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. విష వాయువు పలువురు అమాయకులను బలి తీసుకున్న ఉదంతం తనను ఎంతగానో కలచి వేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: రుణమాఫీకి రూ.1,200 కోట్లు విడుదల -
ఆకలితో ఉన్నవారిని ఆదుకుందాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ దెబ్బకు పలు వ్యాపారాలు, పనులు నిలిచిపోయాయి. రోజుకూలీలు డబ్బుల్లేక తినీతినక పస్తులుంటున్నారు. ఇలాంటి వారి ఆకలి తీర్చేందుకు ముందుకు రావాలని డీజీపీ మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఆకలితో ఉన్న వారిని ఆదుకునేందుకు పరిచయం అక్కర్లేదు. ఈ విపత్తు వేళ సాటి మనిషి కడుపు నింపే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం’ అని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. -
సూర్యాపేటలో మహమ్మారిని కట్టడి చేస్తాం: డీజీపీ
-
‘పక్కింటి వారితో కూడా కాంటాక్ట్లో ఉండకూడదు’
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హై లెవల్ టీమ్గా క్షేత్రస్థాయిలో సందర్శించామని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్ను ఇవ్వడానికి వచ్చామన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, సూర్యాపేట జిల్లాలో కూడా మహమ్మారీని కట్టడి చేస్తామని పేర్కొన్నారు. (సూర్యాపేటలో సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు) కంటైన్మెంట్ ఏరియాలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని మహేందర్ రెడ్డి తెలిపారు. పక్క పక్క ఇళ్ల వారు కూడా కాంటాక్ట్ లో ఉండకూడదని, కంటైన్మెంట్ ఏరియాలోకి బయటివారు రాకుండా.. లోపలి వారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్లో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేలా పలు సూచనలు చేశామన్నారు. అన్నీ శాఖలకు సహాయ సహకారం అందిస్తూ పోలీస్ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు.(సూర్యాపేటలో కరోనా కలకలం) అతి త్వరలోనే జిల్లాలో వైరస్ కట్టడి అవుతుందన్న విశ్వాసం మా బృందానికి ఉందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు లాక్ డౌన్ అమలుకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. కమిషన్ ఏజంట్కు కరోనా పాజిటివ్ రావడం.. అతను ఎన్నో దుకాణాదారులను కాంటాక్ట్ కావడం వల్లే జిల్లాలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందన్నారు. (సూర్యాపేట జిల్లా డీఎంహెచ్ఓపై వేటు) -
మీ ప్రాణాలు మీ చేతుల్లోనే: సీఎస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనురిస్తోంది. కరోనా నియంత్రణ చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలు అవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు బుధవారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వీరు స్యూరాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించి, స్వయంగా పరిశీలన చేయనున్నారు. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!) మార్కెట్ బజార్ లో సీఎస్, డీజీపీ పర్యటన ముందుగా ప్రత్యేక హెలికాప్టర్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సూర్యాపేట చేరుకున్నారు.ఇందులో భాగంగా సూర్యాపేటపట్టణంలోని కరోనా వ్యాప్తి చెందిన కంటోన్మెంట్ ప్రాంతాలైన కూరగాయల మార్కెట్ను సీఎస్ సోమేష్ కుమార్... డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి. జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందింది మ్యాప్ రూపంలో అధికారులకు మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ... ప్రజలు ఆందోళన చెందవద్దని, కొద్దిరోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని అన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో అధికార యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని, రెడ్ జోన్ ఏరియాలోని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దొని సీఎస్ సూచించారు. మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయని, కొద్దిరోజులు ఓపిక పడితే సమస్య సద్దుమణుగుతుందన్నారు. కాగా సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో 26 కేసులు నమోదు కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరింది. ఇప్పటికే జిల్లాలో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. (‘మార్కెట్ బజార్’ అంటే హడల్) -
పకడ్బందీగా కట్టడి
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ను మరింత పకడ్బందీగా, కట్టుదిట్టంగా అమలుచేస్తామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. అత్యవసర ప్రయాణాలకు వీలుగా ఇప్పటివరకు జారీచేసిన పాసులను రద్దుచేసి, వాటి స్థానంలో కొత్తవి జారీ చేస్తామన్నారు. లాక్డౌన్ నిబంధనల అమలులో మే 7 వరకు కఠినంగా వ్యవహరిస్తామని, ఉల్లంఘనలను ఉపేక్షించబోమని ఆయన స్పష్టంచేశారు. లాక్డౌన్ సమయాల్లో చోటుచేసుకుంటున్న ఉల్లంఘనలపై డీజీపీ మహేందర్రెడ్డి నేతృత్వంలో సోమవారం ఆయన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. లా అండ్ ఆర్డర్ ఏడీజీ జితేందర్, వెస్ట్జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్ భగవత్ పాల్గొన్నారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. గతంలో తాము జారీచేసిన పాసులున్న వారు, ప్రభుత్వోద్యోగులు, ఆసుపత్రికి, బయటికి వెళ్లేవారు లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 1.21 లక్షల వాహనాలు సీజ్..: కారణం లేకుండా బయటికొస్తున్న ఆకతాయిలకు చెందిన 1.21 లక్షల వాహనాలను సీజ్ చేశాం. లాక్డౌన్ ముగిశాక కోర్టు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని దుకాణాలు, సూపర్ మార్కెట్లను మూసివేస్తాం. కరోనా కేసులు ఎక్కువున్న గ్రేటర్లో లాక్డౌన్ పాటించడంలో వెనకబడింది. కాలనీ సంఘాలన్నీ దారులు మూసి, ఒకేదారి నుంచి రాకపోకలు సా గించాలి. అద్దెకోసం ఇబ్బంది పెడుతున్న యజమానులకు సంబంధించి డయల్ 100కు 36 ఫోన్కాల్స్ వచ్చాయి. యజమానులకు కౌన్సెలింగ్ ఇస్తాం.. తీరు మారకుంటే కేసులు నమోదు చేస్తాం. కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టిసారించాం. మర్కజ్కు వెళ్లొచ్చిన రోహింగ్యాల్లో నల్లగొండలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఐదుగురిలో ఎవరికీ పాజిటివ్ రాలేదు. సీఎంకు కృతజ్ఞతలు..: లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను గుర్తించి పది శాతం ప్రోత్సాహకం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. పోలీసుల పనితీరుకు అభినందనలు. ఇకపై కట్టుదిట్టంగా ఇలా.. ► గతంలో ఆహార, ఐటీ, నిత్యావసర సర్వీసులకు జారీచేసిన పాసులను రద్దుచేసి, కొత్తవి జారీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్పీ ఆఫీసులు, కమిషనరేట్లలో వీటి జారీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ► కొత్తగా జారీచేసే పాసులపై రూట్, సమయం, గమ్యస్థానం వంటివి ఉంటాయి. వాటిని పక్కాగా అమలు చేస్తారు. ఉల్లంఘనలకు పాల్పడితే వాహనం సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తారు. ► అనవసరంగా రోడ్లపై తిరిగే ప్రభుత్వోద్యోగుల కట్టడికి వారానికి ఆరు రంగుల చొప్పున ఒక్కోరోజుకు ఒక్కో రంగు ఐడీ కార్డు జారీ చేస్తారు. ► ఆస్పత్రుల పేరు చెప్పి ఇష్టానుసారం తిరిగితే కుదరదు. అత్యవసరమైతే తప్ప, చిన్నపాటి అనారోగ్యాలకు 3 కి.మీ.లోపల ఉన్న ఆస్పత్రికే వెళ్లాలి. 3కి.మీ. నిబంధన ఉల్లంఘించకుండా.. ఇంటి నుంచి బయటికి వెళ్లిన ప్రతీ వ్యక్తి పోలీసులకు నివాస ధ్రువీకరణ తనది లేదా ఇంటి యజమానిది చూపాల్సి ఉంటుంది. -
పోలీసులంటే జనాల్లో ఉండే జవాన్లు..
సాక్షి, హైదరాబాద్ : ‘ఈ ఫొటో చూశారా.. పోలీసులు విధుల్లో ఉన్నారు. మీరు ఇంటి వద్ద క్షేమంగానే ఉన్నారు కదా..’అంటూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ట్వీట్ చేశారు. దీనికి రోడ్డు మీదే విధుల్లో ఉండి, అక్కడే భోజనం చేస్తున్న పలువురి పోలీసుల చిత్రాలు జోడించారు. ఈ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు స్పందించారు. జనాల్లో ఉండే జవాన్లు పోలీసులు అంటూ కీర్తించారు. అలాగే మాట ఇవ్వు మిత్రమా అంటూ విడుదల చేసిన మరో వీడియో కూడా ఆలోచింప జేసేలా ఉంది. -
భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : ‘భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు. నిన్ను క్షేమంగా ఆశ్రమానికి చేరుస్తాడు’అంటూ డీజీపీ మహేందర్రెడ్డి చేసిన ట్వీట్ పలువురి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ విషయం ఏంటంటే బేగంపేటలో ఓ వృద్ధురాలు ఒంటరిగా నడవలేని స్థితిలో నిస్సహాయంగా కనిపించింది. తన వివరాలేమీ చెప్పలేకపోతోంది. దీంతో స్థానికులు డయల్ 100కు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన పెట్రోకారు సిబ్బందిలో ఓ కానిస్టేబుల్ ఆ వృద్ధురాలిని కన్నతల్లిని ఎత్తుకున్న విధంగా రెండు చేతులతో మోస్తూ తీసుకెళ్లాడు. ఆమె వివరాలు ఆరా తీసి చివరికి ఇంటికి చేర్చారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ బేగంపేట పోలీసులను అభినందించారు. ప్రజలు ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా కొడుకులా, సోదరుడిలా, తోబుట్టువులా, స్నేహితుడిలా పోలీసులు ఆపద్బాంధవుల్లా వస్తారని అభయమిచ్చారు. -
‘పోలీసు’ల ఆరోగ్య భరోసాకు కాల్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ 24 గంటలపాటు విరామం లేకుండా విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు తెలంగాణ డీజీపీ కార్యాలయం మరో వినూత్న సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. లాక్డౌన్ అమల్లో ఉన్న పో లీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సందేహా లు నివృత్తి చేసేందుకు ప్రత్యేక కాల్సెంటర్ను ఏ ర్పాటు చేసింది. ప్రస్తుతం లాక్డౌన్ కోసం పోలీసు లు 24 గంటలూ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ పోలీసుకు కూడా కరోనా పాజిటివ్ రావడం, అతని సహచరులు 12 మందిని క్వారంటైన్కు తరలించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు, వారి కుటుంబీకుల్లో ఒక విధమైన ఆందోళన మొదలైంది. అందుకే, ఎలాంటి అ నారోగ్య సమస్యలున్నా.. వెం టనే వాటి లక్షణా లు చెబితే.. తగిన సలహాలు ఇచ్చేందుకు ఉపయోగపడేలా ఈ కాల్ సెంటర్కు డీజీపీ మహేందర్రెడ్డి శ్రీకారం చుట్టా రు. గురువారం నుంచి దీని సేవలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల పరిధిలో పనిచేసే వారందరికీ అందుబాటులోకి రానున్నాయి. మానసిక ఆందోళన తగ్గించేందుకు.. ప్రతీ పోలీసు కుటుంబంలోనూ ఎవరో ఒకరికి వైద్యుడి అవసరం ఉండే ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే తల్లిదండ్రులు, గర్భిణులైన భార్యలు, వైద్య సదుపాయం అవసరమున్న పిల్లలు ఇలా కు టుంబీకుల్లో ఎవరో ఒకరికి ఏదో ఒక వైద్య అవస రం ఉంటుంది. ఇలాంటి వారిని ఇంట్లో పెట్టుకుని పోలీసులు సరిగా విధులు నిర్వహించలేరు. ఈ కాల్సెంటర్ అందుబాటులోకి వస్తే.. పోలీసులు నిశ్చింతగా డ్యూటీ చేసుకుంటారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇక పోలీసులు చాలామంది కరోనా అనుమానితులను, పాజిటివ్ వ్యక్తులను ఆసుపత్రులకు తరలించడం తదితర పనుల కారణంగా తమకూ వైరస్ వ్యాప్తి చెందిందేమో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చిన్న జలుబు వ చ్చినా తమకు కరోనా అంటుకుందేమోనని భయప డుతున్నారు. అందుకే, చిన్న ఆరోగ్య సమస్య నుం చి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఈ కాల్సెంటర్కు ఫో న్ చేసి చెబితే..ఆ కాల్స్ను సంబంధిత విభాగాల్లో నిపుణుడైన డాక్టర్కు బదిలీ చేస్తారు. ఇందుకోసమే గుండె, కిడ్నీ, బీపీ, గైనకాలజీ, పల్మనాలజీ, ఆప్తమాలజీ తదితర 20 విభాగాల నిపుణులైన వైద్యు ల బృందాలు వీరి కాల్స్కు సమాధానం ఇస్తాయి. -
మానవత్వపు పరిమళాలు
సాక్షి, హైదరాబాద్: ఇవీ.. డీజీపీ కార్యాలయంలో ‘గుడ్ సమారిటన్, పోలీస్ గ్రూప్’నకు వస్తున్న వినతులు. రాష్ట్రంలోని నిత్యావసరాల సరఫరాకు ఎక్కడా ఆటంకం కాకూడదని డీజీపీ మహేందర్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ‘కమోడిటీస్ కంట్రోల్ రూము’ను అధికారులు ఏర్పాటు చేశారు అందులో ‘గుడ్ సమారిటన్, పోలీస్’పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల శాఖ, మెప్మా, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పలు ఎన్జీవోలు, యువ వలంటీర్లు, వ్యాపారులు, అధికారులు ఈ విపత్కర సమ యంలో చిక్కుకున్న పలువురి ఆకలి తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ గ్రూపులో అనాథాశ్రమాలు, వృద్ధజనాశ్రమాల నిర్వాహకులను కూడా సభ్యులుగా చేర్చారు. ఫలితంగా ఎలాంటి వినతి వచ్చినా.. వెంటనే వారికి కావాల్సిన ఆహారం, ఇతర నిత్యావసరాలను అప్పటికప్పుడు దాతలతో మాట్లాడి వారికి చేరవేసేలా చూస్తున్నారు. సాధారణ వ్యాపారుల నుంచి బహుళజాతీయ కంపెనీల సీఈఓల వరకు అన్నార్తులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్న తీరును చూసి పోలీసులే ఆశ్చర్య పోతున్నారు. విపత్కర పరిస్థితుల్లో తోటి మానవుడిని ఆదుకునేందుకు ముందుకు వస్తోన్న వారినిచూసి గర్వంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విరాళాలను చూసి తాము పడుతున్న శ్రమను మర్చిపోతున్నామన్నారు. ► సార్.. నేను ఆసిఫాబాద్ నుంచి మాట్లాడుతున్నా.. నేనో చిరువ్యాపారిని. ఈరోజు మా ప్రాంతంలో కనీసం ఐదుగురికి భోజనం పంపాలనుకుంటున్నా. ► సార్..! నేనో బహుళజాతి కంపెనీకి సీఈఓను.. నిరాశ్రయులు, యాచకులకూ కడుపు నింపేందుకు రెండు క్వింటాళ్ల బియ్యం పంపాలనుకుంటున్నా. విరాళాల వెల్లువ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 230కి పైగా వృద్ధజనాశ్రమాలు, అనాథాశ్రమాలకు ఆహారం, బియ్యం, ఉప్పు, పప్పు, నూనె కావాలని ‘గుడ్ సమారిటన్ , పోలీస్’గ్రూపును ఆశ్రయిస్తున్నారు. ఈ సమాచారాన్ని వెంటనే విమెన్ అండ్ చైల్డ్ విభాగం, సివిల్ సప్లై విభాగం, ఇతర దాతలు, ఎన్జీవోలకు చేరవేసి కావాల్సిన నిత్యావసరాలు సరఫరా చేయిస్తున్నారు. అలాగే ఇటుక బట్టీ కార్మికులు, యాచకులు, ఇతర రాష్ట్రాల కూలీలు, నిరాశ్రయులకు చాలామంది క్వింటాళ్ల కొద్దీ బియ్యాన్ని, ఇతర పప్పులు, నూనె, మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు తదితర నిత్యావసరాలను విరాళంగా ఇస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చిన నిత్యావసరాలను ఆయా పోలీసుల ద్వారా సజావుగా పంపిణీ చేయిస్తున్నారు. కొందరు స్వచ్ఛంద సంస్థలు దూరమైనా శ్రమకోర్చి అన్నార్తులకు నిత్యావసరాలను చేరవేస్తున్నాయి. -
‘మా నాన్న పోలీసు..ఆయనకు సహకరించండి’
సాక్షి, హైదరాబాద్ : ‘‘మా నాన్న పోలీసు.. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు సహకరించండి’’అంటూ ఓ పసిపాప ప్లకార్డు పట్టుకున్న పోస్టు ఇపుడు వైరల్గా మారింది. కదిలించే లా ఉన్న ఈ తరహా ఫొటోలను చాలామంది డీజీపీ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేస్తున్నారు. ఇక డీజీపీ సైతం రోడ్లపైకి ప్రజలు రాకుండా పోలీసులకు సహకరించాలని విజ ్ఞప్తి చేస్తున్నారు. వివరాలు.. కోవిడ్ మహమ్మారిపై కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులకు ఒక్కసారిగా పని భారం పెరిగింది. ఆదివారం జనతా కర్ఫ్యూ దరిమిలా పోలీసులకు విరామం లేకుండా పోయింది. జనసంచారంపై సోమవారం మ ధ్యాహ్నం వరకు కాస్త చూసీచూడనట్లుగా ఉ న్నా.. తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారింది. అప్పటి నుంచి పోలీసులు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. మంగళవారం ప్రధాని 21 రోజులపాటు లాక్డౌన్ ఉంటుం దని ప్రకటించడంతో పోలీసుల పనిభారం రెట్టింపయింది. అత్యవసర పరిస్థితి కావడం తో సెలవులన్నీ రద్దయ్యాయి. కోవిడ్పై జరుగుతున్న యుద్ధంలో పోలీసులది కీలక భూమిక. ముఖ్యంగా కోవిడ్ బాధితుల గుర్తించడం, ప్రజలను చైతన్యం చేయడం, గ్రామపంచాయతీ, రెవెన్యూ, ప్రజాప్రతినిధులతో కలిసి గత మూడురోజులుగా నిర్విరామంగా పనిచేస్తున్నారు. పలువురు కోవిడ్ అనుమానితులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు ఏ అర్ధరాత్రో ఇంటికి వెళ్లి వస్తున్నారు కానీ.. కానిస్టేబుళ్లలో చాలామంది ఇంటికి వెళ్లి నాలుగురోజులయింది. చాలామంది స్నానం చేయకుండా, యూనిఫారం మార్చుకోకుండా రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్రాంతి లేకుండా పనిచేస్తోన్న పోలీసుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. జనసంచారం నియంత్రణలో పడి ఎక్కడ ముందు జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం వహిస్తారో అన్న ఆవేదనలో మునిగిపోయారు. ప్రజలు సహకరించాలి : డీజీపీ పోలీసు అధికారులంతా నిర్విరామంగా, నిరంతరాయంగా 24 గంటలు సమాజం కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు పూర్తిగా వారికి సహకరించాలి. అపుడే ఈ కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టగలం. అదే సమయంలో ఉన్నతాధికారుల నుంచి హోంగార్డు ఆఫీసర్ల వరకు అంతా మాస్కు లు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూనే సమాజాన్ని కాపాడాలి. -
హాస్టలర్స్ అందోళన: స్పందించిన కేటీఆర్, డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ నేపథ్యంలో నగరంలోని హాస్టళ్లు, పీజీ మెస్లు మూసివేయాల్సిన అవసరం లేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విస్పష్ట ప్రకటన చేశారు. బుధవారం సాయంత్రం నుంచి హస్టళ్లు మూసివేస్తున్నారని అసత్య ప్రచారం జరుగుతుండటంతో హాస్టలర్స్ అయోమయానికి గురైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమను తమ ఊళ్లకు పంపించాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. దీంతో హాస్టలర్స్ ఆందోళన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వారి సమస్యలపై స్పందించారు. హాస్టళ్ల యజమానులతో సంప్రదింపులు జరపాలని నగర కమిషనర్కు, మేయర్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన నగర మేయర్, పోలీస్ కమిషనర్ పరిస్థితిని సమీక్షించారు. అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. హాస్టళ్లు మూసివేస్తున్నారనేది తప్పుడు వార్త అని కొట్టి పారేశారు. లాక్డౌన్ సందర్భంగా ఒక్క హాస్టల్ కూడా మూసివేయలేదని తెలిపారు. అవసరమైతే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేస్తామని మేయర్ పేర్కొనడంతో హాస్టలర్స్కు కాస్త ఊరట లభించింది. దీంతో తిరిగి హాస్టల్స్కు, పీజీ మెస్లకు విద్యార్థులు, ఉద్యోగులు చేరుకుంటున్నారు. హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించొద్దు: తెలంగాణ డీజీపీ లాక్డౌన్ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. హాస్టల్లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్డౌన్ ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్రెడ్డి ఆదేశించారు. -
కర్ఫ్యూ పెడితేనే దారికొస్తారా?
మార్చి 22, ఆదివారం: జనతా కర్ఫ్యూ..హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో జనం ఇళ్లకే పరిమితం... వెతికితే కానీ రోడ్లపై కనిపించనంతగా జనం.. కోవిడ్ బాధితుల చికిత్సలో నిమగ్నమైన వైద్యులు, పోలీసులు, ఆపత్కాలంలో జనం కోసం కష్టపడుతున్నవారికి సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లతో సంఘీభావం..ఈ క్రమశిక్షణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా నుంచి తెలంగాణకు అభినందనలు. మార్చి 23, సోమవారం: లాక్డౌన్ అమలు.. సాధారణ రోజులను తలపిస్తూ గుంపులుగా రోడ్లపై జనం. ఆటోల పరుగులు, ఒక్కో బైక్పై ముగ్గురి ప్రయాణం.. పని లేకున్నా రోడ్లపైకి వచ్చి హల్చల్.. పాన్షాపులు, వైన్స్లో దొడ్డిదారి విక్రయాలు. ట్రాఫిక్ జామ్లు.. గుంపులుగా జనం ముచ్చట్లు... – సాక్షి, హైదరాబాద్ కోవిడ్ వ్యాప్తిని కట్టడిచేసే క్రమంలో ప్రభుత్వం వరుసగా రెండ్రోజుల్లో ఇచ్చిన ఆదేశాలివి. కానీ వాటి అమలులో మాత్రం పొంతన లేని ఫలితాలు కనిపించాయి. రెండింటి లక్ష్యం.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలనేది. కానీ, ఆదివారం జనం కనబరిచిన స్ఫూర్తిని సోమవారం గాలికొదిలేశారు. కారణం.. మొదటిది– ‘కర్ఫ్యూ’. రెండోది– స్వచ్ఛందం. అందుకే కర్ఫ్యూ పెడితే తప్ప జనం మారేలా కనిపించట్లేదు. ఇళ్లకు పరిమితం కావటం మినహా, కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మరో మార్గం లేని తరుణంలో ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు పట్టించుకోలేదు. లాక్డౌన్ అపహాస్యమైంది. కోవిడ్ ఎప్పుడెలా పంజా విసురుతుందోనన్న భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో వారం క్రితం పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్లో ఉండగా, ఇప్పుడు 33కి చేరింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి చర్యలకు ఉపక్రమించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూకు ఆదేశించగా, దాన్ని 24 గంటలపాటు నిర్వహించేలా సీఎం కేసీఆర్ ఆదేశించారు. సోమవారం నుంచి పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు మూసేసి రాష్ట్రంలో లాక్డౌన్ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల మూసివేత బాగానే అమలైనా, జనం ఇళ్లకే పరిమితం కావాలన్న ఆదేశం ఎక్కడా అమలు కాలేదు. ప్రభుత్వం మాటలను పెడచెవిన పెడుతూ ఉదయం నుంచే జనం పెద్దసంఖ్యలో రోడ్లపైకి చేరారు. కొన్ని దుకాణాలు మూతపడటం, ఆర్టీసీ బస్సులు, క్యాబ్లు తిరగకపోవడం మినహా మిగతా నిబంధనలన్నీ యథేచ్ఛగా ఉల్లంఘనకు గురయ్యాయి. అసలు అవగాహన ఉందా? కోవిడ్పై చాలామందిలో అవగాహన ఉన్నట్టే లేదు. ఇతర దేశాల నుంచి రాష్ట్రంలోకి గత వారంపది రోజుల్లో 20 వేల మంది వచ్చారు. వీరి నుంచే క్రమంగా కొందరు వైరస్ బారినపడి గాంధీలో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికే వైరస్ సోకుతోందంటూ ప్రచారం జరగటంతో జనం ఇప్పటికీ దాన్నే నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. తాము విదేశాలకు వెళ్లొచ్చిన వాళ్లం కాదనే ధీమాతో జనం రోడ్డెక్కుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి రెండో దశకి చేరుకుందన్నది నిపుణుల మాట. అయితే ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా స్థానికులకూ సోకటం మొదలైంది. దీనిపై జనానికి అవగాహన తక్కువగా ఉందని స్పష్టమవుతోంది. కోవిడ్ లక్షణాలు ఎవరికి ఉన్నాయో.. లేవో వెంటనే గుర్తించే వీలు లేదు. దీంతో వీలైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండాలని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దీన్ని కనీసం 20 శాతం మంది కూడా పాటించట్లేదు. సోమవారం షేర్ ఆటోల్లో పది మంది వరకు కూర్చుని ప్రయాణించిన దృశ్యాలు చాలాచోట్ల కనిపించాయి. షేక్హ్యాండ్లు, ఆలింగనాలు, సామూహిక ప్రార్థనలు షరా మామూలయ్యాయి. పోలీసులనూ పట్టించుకోలేదు.. లాక్డౌన్ను జనం సరిగా పట్టించుకోవటం లేదన్న ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం డీజీపీ మహేందర్రెడ్డి.. నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని, పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆ మేరకు స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్ వాహనాలు కనిపించాయి. కానీ పోలీసుల సూచనలను కూడా జనం పట్టించుకోలేదు. కర్ఫ్యూ తరహా నిర్బంధ అమలు లేకపోవటంతో పోలీసులు కూడా సూచనలు చేయటం తప్ప ఏమీ చేయలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఆటోలను సీజ్ చేయటంతో ప్రధాన రోడ్లపై జనసంచారం కాస్త తగ్గినా, బస్తీల్లో మాత్రం పరిస్థితి అదుపు తప్పింది. లాక్డౌన్ను అపహాస్యం చేసి జనం గుంపులుగా రోడ్లపైనే తిరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్కు బదులు కర్ఫ్యూను అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. లేదంటే ఇటలీ తరహా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందనీ అంటున్నారు. పాతబస్తీలో మరీ అధికం పాతబస్తీలోని చాలా ప్రాం తాల్లో సోమవారం లాక్డౌన్ నామమాత్రంగానే కనిపించింది. పాన్ దుకాణాల ముందు యువకులు పెద్దసంఖ్యలో గుమికూడి కనిపించారు. షేర్ఆటోలు యథేచ్ఛగా తిరిగాయి. అత్యవసర సరుకులు కొనే ఉద్దేశంతో ఎక్కువ మంది రోడ్లపైకి వచ్చారు. ద్విచక్రవాహనాలపై ముగ్గురేసి ప్రయాణించారు. ఆదివారం జనతాకర్ఫ్యూ సందర్భంలోనూ పాతబస్తీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఇవే దృశ్యాలు కనిపించాయి. ప్రార్థనలు ఇళ్లల్లోనే జరుపుకోవాలన్న ఆదేశాలనూ పట్టించుకోలేదు. లాక్డౌన్ కేసులు రెండు వేలు జనం సోమవారం లాక్డౌన్ను ఆషామాషీగా తీసుకున్న క్రమంలో, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం.. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారితో పాటు, క్వారంటైన్ నిబంధనలు పాటించని దాదాపు 2,000 మందిపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 950కి పైగా నమోదయ్యాయి. ఇలాగే ఉంటే పరిస్థితి చేజారే ప్రమాదం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించే అవకాశం లేకపోలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించవద్దని, కేసులు నమోదు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ మహేందర్రెడ్డి సోమవారం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. సోమవారం నిబంధనలు పాటించకుండా బయటికొచ్చిన ప్రజలకు నమస్కారాలు పెట్టి, గులాబీలు ఇచ్చి పోలీసులు వివిధ పద్ధతుల్లో నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారు. విననివారిపై కేసులు నమోదు చేశారు. చార్మినార్లో డీజీపీ పర్యటన లాక్డౌన్ నేపథ్యంలో పోలీసు బందోబస్తును పరిశీలించేందుకు డీజీపీ మహేందర్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం సాయంత్రం పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఆయన హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్తో కలిసి పర్యటించారు. చార్మినార్ ఠాణాలోని సిబ్బందితో సమావేశమయ్యారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సలహా, సూచనలు ఇచ్చారు. పౌరులు నిబంధనలు ఉల్లం ఘించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చార్మినార్ వద్ద డీజీపీ మహేందర్రెడ్డి,సీపీ అంజనీకుమార్ ఉల్లంఘిస్తే బుక్కవుతారు - కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటారు. - ప్రాణాంతక వ్యాధికి గురైన వారు ఇతరులకు ఆ వ్యాధిని వ్యాప్తి చేసినట్టు తేలితే, ఐపీసీ సెక్షన్ 269, 270 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. వీటి కింద 6 నెలల నుంచి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష పడుతుంది. - విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్ నిబంధనలను పాటించని వారిపై ఐపీసీ 271 ప్రకారం.. కేసు నమోదు చేసే వీలుంది. - కోవిడ్పై లేనిపోని దుష్ప్రచారాలు చేస్తే సెక్షన్ 54 ప్రకారం కేసులు నమోదు చేసి తక్షణమే రిమాండ్ చేస్తారు. -
రాత్రి 7 నుంచి ఉదయం 6 దాకా కర్ఫ్యూ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ లాక్డౌన్లో భాగంగా ఈ నెల 31 వరకు ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు 100 శాతం కర్ఫ్యూ అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా బయట కనిపిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. కోవిడ్–19 నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో సీఎస్, డీజీపీ మాట్లాడారు. కర్ఫ్యూ సమయంలో కిరాణా దుకాణాలు, కూరగాయల దుకాణాలు, పెట్రోల్ బంకులను సైతం మూసేయాలని ఆదేశించామని సీఎస్ వెల్లడించారు. అత్యవసర వైద్య సేవల కోసం మాత్రమే రాత్రి వేళల్లో బయటకు అనుమతిస్తామని, ఇళ్లకు వెళ్లేందుకు ఆలస్యమైందని చెప్పినా అనుమతించే ప్రసక్తే లేదన్నారు. నిత్యావసర సరుకులతో పాటు అత్యవసర వైద్య సేవల కోసం పగటివేళల్లో ఇంటికొకరిని మాత్రమే బయటకు అనుమతిస్తామన్నారు. అది కూడా ఇంటి నుంచి 3 కి.మీ. పరిధిలోని కిరాణా దుకాణాల నుంచే నిత్యావసరాలు కొనుక్కోవాలని, అంతకుమించి దూరం వెళ్లడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఒకేచోట ఐదుగురికి మించి గుమికూడటానికి అనుమతి లేదన్నారు. ఎవరైనా ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్ స్పష్టం చేశారు. ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటికీ సోమవారం ఉదయం ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపై వాహనాల్లో తిరుగుతూ ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించడంపై సీఎస్ సోమేశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లపై ఆటోలు కనిపిస్తే ఎక్కడికక్కడ జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని, అవసరమైతే ఆంక్షలను కఠినతరం చేస్తామని, ప్రజలు సిద్ధమై ఉండాలన్నారు. పరిస్థితులు అదుపులోకి వస్తే సడలింపు ఇస్తామని చెప్పారు. (కరోనాపై భయాందోళలు తొలగించాలి : మోదీ) వ్యవసాయ పనులకు మినహాయింపు... గ్రామాల్లో వ్యవసాయం, పండ్లు, కూరగాయాల సాగుతోపాటు ఉపాధి హామీ పనులకు మినహాయింపు కల్పించామని నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సైతం యథావిధిగా కొనసాగుతాయని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టతనిచ్చారు. లాక్డౌన్లో భాగంగా రాష్ట్ర సరిహద్దులు మూసేశామన్నారు. ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాల ప్రవేశం నిలిచిపోయిందన్నారు. రాష్ట్రానికి అత్యవసర సరుకులు రవాణా చేసే వాహనాలకు మాత్రమే మినహాయింపు కల్పించామన్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన వారు హోం క్వారెంటైన్లో ఉండకుండా బయట కనిపిస్తే తీవ్ర చర్యలుంటాయని సీఎస్ హెచ్చరించారు. తక్షణమే వారిని ప్రభుత్వ క్వారెంటైన్ కేంద్రానికి తరలించడంతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.అత్యవసర పనుల కోసమే ఐటీ కంపెనీలు తమ కార్యాలయాల్లో ఉద్యోగులతో పనిచేయించుకోవడానికి అనుమతించామన్నారు. ఇక కఠిన చర్యలు.. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ అమల్లో పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందని డీజీపీ మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలిచ్చామన్నారు. ఆంక్షలను కఠినంగా అమలు చేయకపోతే కవిడ్–19 వ్యాప్తిని అరికట్టలేమన్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్నా సోమవారం ఉదయం ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కఠిన నిర్ణయాలు అమలు చేయక తప్పదన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్డౌన్ ప్రకటించారని, కఠినంగా అమలు చేయడంలో విఫలమైన దేశాల్లో కోవిడ్–19 మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. (మహమ్మారిపై మహాపోరు) చెక్పోస్టుల ద్వారా రాకపోకల నియంత్రణ... ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో చెక్పోస్టులు పెట్టి పగటిపూట ప్రైవేటు వాహనాల రాకపోకలను నియంత్రిస్తామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. రోడ్డుపైకి వచ్చే ప్రతి వ్యక్తి అత్యవసర సరుకుల కోసమే వస్తున్నాడా? ఎంత దూరంలో అతని ఇల్లు ఉంది? అని పోలీసులు అడిగి తెలుసుకుంటారన్నారు. ఆంక్షలను ఉల్లంఘించినట్లు తేలితే వాహనాలను జప్తు చేసుకుంటామని, లాక్డౌన్ ముగిసిన తర్వాతే యజమానులకు తిరిగి అప్పగిస్తామన్నారు. టూవీలర్పై ఒకరే.. కార్లో ఇద్దరు ఒక ద్విచక్రవాహనంపై ఒకరే ప్రయాణించాలని, కారులో సైతం సెల్ఫ్ డ్రైవింగ్ అయితే ఒకరు, డ్రైవర్ ఉంటే ఇంకొకరిని మాత్రమే అనుమతిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. ఆటోలు రోడ్లపైకి రావొద్దని, ఈ విషయంలో సహకరించాలని ఆటో డ్రైవర్ల యూనియన్లను కోరామన్నారు. లేనిపక్షంలో జప్తు చేసుకుంటామన్నారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారితోపాటు సడలింపులుగల వ్యక్తులనే దూరప్రాంతాలకు అనుమతిస్తామన్నారు. అంటురోగాల నియంత్రణ చట్టం కింద అధికారులకు ప్రభుత్వం అన్ని రకాల అధికారాలు కట్టబెట్టిందని, ఎవరైనా ఉల్లంఘనలను పునరావృతం చేసినట్లు తేలితే వారిపై కేసులు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్లపైకి వచ్చే వ్యక్తులకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించామన్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయాల ధరలను పెంచి బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) జితేందర్ పాల్గొన్నారు. ‘కోవిడ్’పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు రాష్ట్రంలో కోవిడ్–19 వైరస్ నియంత్రణకు వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకుంటున్న చర్యలను సమన్వయపరచడానికి సీనియర్ ఐఏఎస్లు అనిల్ కుమార్, రాహుల్ బొజ్జాలతో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అనిల్ కుమార్, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాహుల్ బొజ్జా కంట్రోల్ రూమ్లో సేవలందించనున్నారు. 040–23450735/23450624 ఫోన్ నంబర్తో ఈ కంట్రోల్ రూమ్ పనిచేయనుంది. ఐఏఎస్లకు సహాయకులుగా వ్యవసాయశాఖ డిప్యూటీ సెక్రటరీ సీహెచ్ శివలింగయ్య, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి వ్యవహరించనున్నారు. పోలీసు శాఖ తరఫున ఐజీ బాలంగన దేవి, అదనపు ఏస్పీ కె.శ్రీనివాసరావు, వైద్యారోగ్య శాఖ నుంచి ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ జేడీలు మోతీలాల్ నాయక్, డాక్టర్ జాన్బాబులు కంట్రోల్ రూమ్లో సేవలందించనున్నారు. ఇటు లాక్డౌన్ను సమీక్షించేందుకు సచివా లయంలో వార్రూమ్ను ఏర్పాటు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు బయటకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా స్వచ్చందంగా బంద్ పాటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభణ నేపథ్యంలో మార్చి 31 వరకు లాక్డౌన్ పాటించాలని సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. అయితే సోమవారం ఉదయం ఎక్కడా లాక్డౌన్ ప్రభావం అంతగా కనిపించలేదు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సోమవారం ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ... ఈరోజు మధ్యాహ్నం నుంచి లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల షాపులన్నింటినీ అన్ని రాత్రి 7 గంటలకు మూసివేయాలన్నారు. ప్రతీ వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని... ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. జీవో 45 ద్వారా ప్రజలకు అన్ని విషయాలను తెలియజేశామన్నారు. ఇక మీడియాకు ఎక్కడైనా తిరిగే అనుమతి ఉంటుందని తెలిపారు.(లాక్డౌన్లోనూ అందుబాటులో ఉండే సేవలు) ► సోమవారం నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్డౌన్ అమలులో ఉంటుంది. ► ఒక కాలనీలో వాహనంలో ఒకటి- రెండు కిలోమీటర్లు మాత్రమే తిరగాలి. ► ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. ► ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు ► సీజ్ చేసిన వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తరువాత విడుదల చేస్తారు ► ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువులు క్యారీ మాత్రమే అనుమతి ► ప్రతి బైక్పై ఒక వ్యక్తి... ఫోర్ వీలర్పై ఇద్దరికి మాత్రమే అనుమతి ► చట్టం ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ► ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం ► చట్టం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం ► వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలి. ► సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలెవరూ రోడ్లపైకి రాకూడదు ► ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి ►తెలంగాణ సమాజం కోసం పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తారు. ► అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది పాస్పోర్టులు సీజ్ చేస్తాం: సోమేశ్ కుమార్ లాక్డౌన్ నేపథ్యంలో రోడ్ల మీద ఒక్క వాహనం కనిపించినా చర్యలు తప్పవని తెలంగాణ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 1897 చట్టం ప్రకారం లాక్డౌన్ ప్రవేశపెట్టామని.. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల సరిహద్దులను మూసివేశామని తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఐదుగురు వ్యక్తులకు మించి రోడ్లపై ఒకేచోట కనపడకూడదని.. జీవో ప్రకారం కొన్ని సేవలపై మినహాయింపు ఇచ్చామని తెలిపారు. గ్రామ స్థాయిలో కరోనా వ్యాప్తి తీవ్రత అంతగా లేదని పేర్కొన్నారు. అయితే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు తప్పకుండా క్వారంటైన్ సెంటర్కు వెళ్లాలని సూచించారు. ఎన్నారైలు చర్యలు అతిక్రమిస్తే పాస్పోర్టులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రకృతి విపత్తు సహాయక శాఖ అధికారులు ఎల్లప్పుడూ విధులను కొనసాగిస్తారని పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని సోమేశ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పోలీసుల వ్యూహం.. జనతా కర్ఫ్యూ జయప్రదం
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ అమలుకు పోలీసులు తమదైన వ్యూహంతో ముందుకు సాగారు. ఓవైపు కేంద్రం పధ్నాలుగు గంటలు, రాష్ట్రం 24 గంటల పరిధిలో కర్ఫ్యూ విధించడంతో రెండింటిని ఒకేసారి విజయవంతంగా అమలు చేశారు. శనివారం రాత్రి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ మహేందర్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ల నుంచి ఎలాంటి వాహనాలను రానీయకుండా చెక్పోస్టుల ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఈ కర్ఫ్యూను అమలు చేసేందుకు ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వ్యవహరించి విజయవంతమయ్యారు. పట్టణాల్లో, జిల్లాల్లో జనతా కర్ఫ్యూకు పెద్దఎత్తున ఆదరణ లభించింది. పోలీసుల పనితీరుపట్ల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. -
రామగుండంలో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటన
సాక్షి, గోదావరిఖని (రామగుండం): శాంతి భద్రతల పరిరక్షణలో రామగుండం కమిషనరేట్ పోలీసుల పనితీరు బాగుందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం రామగుండంకు వచ్చారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులతో సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్ల వారీగా అధికారుల పనితీరును తెలుసుకున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ కమిషనరేట్లో ప్రస్తుత స్థితిగతులను వివరించారు. రెండు జిల్లాల్లో పోలీసింగ్ పరంగా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి లేదన్నారు. తెలంగాణలో పోలీసులు అన్ని శాఖల మధ్య సమన్వయం చేస్తూ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్ష సమావేశంలో నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి, గ్రేహౌండ్స్ చీఫ్ శ్రీనివాస్రెడ్డి, ఐజీ ఎస్బీఐ ప్రభాకర్రావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, పెద్దపల్లి డీసీపీ పి.రవీందర్, అడిషనల్ డీసీపీలు అశోక్ కుమార్, రవికుమార్, రెండు జిల్లాల ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. (చిన్నమెసేజ్తో శ్రీరామ రక్ష) -
57 వేల మొక్కలు నాటిన పోలీస్ శాఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పోలీస్శాఖ లోని డీజీపీ స్థాయి నుండి హోం గార్డ్ లు, ఇటీవల నూతనంగా నియమితులైన ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల వరకు తప్పని సరిగా మొక్కలు నాటాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో నేడు అన్ని జిల్లాల్లో, పోలీస్ సంస్థల్లో నేడు ఒక్క రోజే 56,872 మొక్కలను నాటారు. పేట్లబుర్జ్ లో నిర్వహించిన హరితహారంలో హోంమంత్రి మహమూద్ ఆలీ, పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తాలు మొక్కలు నాటారు. డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ పోలీస్ అధికారులు మొక్కలు నాటారు. డీజీపీ, అడిషనల్ డీజీలు, ఐజీలతో సహా అన్ని జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీల నుండి ఎస్ఐ, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఈ హరిత హారం లో మొక్కలను తమ పరిధిలోని పోలీస్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల లో నాటారు. అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఇతర సంస్థలైన బెటాలియన్లు, పోలీస్ శిక్షణా సంస్థలు, ఇతర సంస్థల్లో హరితహారం నిర్వహించారు. సోమవారం నిర్వహించిన హరితహారం లో 13, 629 మొక్కలు నాటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ అగ్రస్థానం లో నిలువగా, 6, 278 మొక్కలు నాటి బెటాలియన్స్ ద్వితీయ స్థానం లో, 3500 మొక్కలు నాటి సైబారాబాద్ కమిషనరేట్ తృతీయ స్థానం లో నిలిచింది. -
సానుకూల ధోరణితో విధులను స్వీకరించాలి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగరీత్యా నిర్వర్తించే ప్రతీ పనిని సానుకూల ధోరణితో స్వీకరించినప్పుడే పోలీసుల విధి నిర్వహణకు సార్థకత చేకూరుతుందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో (టీఎస్పీఏ) బుధవారం జరిగిన ట్రైనీ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐల శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతినకుండా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టాలకు లోబడి ధనిక, పేద తేడా లేకుండా సేవలను అందించాలని పోలీసు అధికారులకు సూచించారు. మన అధికారాలు సామాన్య ప్రజల సేవలకు ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్, అకాడమీ జాయింట్ డైరెక్టర్ కె.రమేష్ నాయుడు, డిప్యూటీ డైరెక్టర్ బి.నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పుర పోరుకు పటిష్ట బందోబస్తు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రేపు(జనవరి 22) జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్చగా నిర్వహించేందుకు 50వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్పెషల్ పోలీస్తో పాటు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన వ్యూహాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల పరిస్థితులను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారిగా శాంతి బధ్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ వ్యవహరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలను ఖచ్చితంగా పాటించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని యూనిట్ అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్, అటవీ తదితర శాఖల నుంచి కూడా బలగాలను ఎన్నికల విధులకు నియమిస్తున్నట్లు తెలిపారు. (అవసరమైతే అభ్యర్థి ఎన్నిక రద్దు చేస్తాం: ఈసీ) పోలింగ్ సామాగ్రితో వెళ్లే ఎన్నికల సిబ్బందిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా వెళ్లేందుకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కూడా తగు బందోబస్తును ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన 131 మంది పై కేసులను నమోదు చేసినట్లు, ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోబానికి గురి చేసేవిధంగా డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.51,36,090 లక్షల రూపాయలను స్వాదీనం చేసుకోవడంతోపాటు రూ.21,22,933 విలువైన మద్యాన్నిస్వాధీన పరుచుకున్నామన్నారు. చట్టాన్ని అతిక్రమించిన 4,969 మందిపై 1122 కేసులను నమోదు చేశామని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 1745 లైసెన్స్ రివాల్వర్లను డిపాజిట్ చేయించడం జరిగిందని తెలిపారు. (తాగినంత మద్యం.. జేబునిండా డబ్బు) మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన అవాంచనీయ సంఘటనలు జరగలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టుల ఏర్పాటు, వాహనాల సోదాలు, సర్వేలన్స్ టీమ్ల ఏర్పాటు ద్వారా పోలీసులు అప్రమత్తతతో ఉండాలని సూచించారు. పోలింగ్ జరిగే ప్రాంతాలకు బయటి వ్యక్తులు రాకుండా చర్యలు చేపట్టినట్లు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్తూర్పిని కలిగించే విధంగా గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని సూచించారు. -
పాఠశాలల్లో ‘పబ్లిక్ సేఫ్టీ క్లబ్బులు’
సాక్షి, హైదరాబాద్: నేటి బాలలే రేపటి పౌరులు.. వారికి నేడు కల్పించే అవగాహన జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే, అన్ని రకాల భద్రతపై వారికి అవగాహన వచ్చేలా వినూత్న కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు శ్రీకారం చుట్టారు. అందుకే, పాఠశాల విద్యార్థులకు ‘భద్రత’పై అవగాహన కల్పించడం, ప్రతీ పాఠశాలలో విద్యార్థులతో కొన్ని క్లబ్బులు నిర్వహించడం, భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారిచేతే వివరింపజేయడం, వారి నుంచి వచ్చే వినూత్న సలహాలు, సూచనలు తీసుకోవడం.. ఇదీ తెలంగాణ పోలీసుల సరికొత్త కార్యాచరణ. చికిత్స కంటే నివారణ మేలు అన్న నినాదంతో తెలంగాణ పోలీసులు ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. రోజుకోరకం కొత్త కేసులు వెలుగు చూస్తోన్న నేపథ్యంలో నేరాలు, భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ విధానం అమలుకు సంకల్పించారు. తమిళనాడు స్ఫూర్తిగా.. వాస్తవానికి ఇలాంటి విధానం అమలు ఇదే తొలిసారి కాదు. తమిళనాడు పోలీసులు దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ‘నేరాలు– భద్రత’పై వారు చేపట్టిన ప్రతీ అవగాహన కార్యక్రమం అక్కడ సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో తెలంగాణ పోలీసులు గతేడాదే దీనిపై అధ్యయనం చేశారు. అందులో పలు అంశాలకు డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. అనంతరం కొత్త సంవత్సరం నుంచి మన రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులతో కూడిన గ్రూపులను ఏర్పాటు చేస్తారు. వీరికి రోడ్డుభద్రత (డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ వినియోగం, సీటుబెల్టు), మహిళా భద్రత, మానవ అక్రమరవాణా, చిన్నారుల భద్రత, వేధింపులు, డయల్ 100, షీటీమ్స్, హాక్ ఐ అంశాలలో వీరికి తొలుత శిక్షణ ఇస్తారు. తరువాత వీరు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తారు. వీరి నుంచి వచ్చే సృజనాత్మక ఆలోచనలనూ పోలీసులు స్వీకరించి ఇతరప్రాంతాల్లోనూ అమలుచేస్తారు. ఆపద ఎదురైతే.. ఎలా వ్యవహరించాలి? ఎవరిని సంప్రదించాలి? పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలి? అన్నది ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం. ప్రతీ ఠాణాలోనూ విధుల విభజన.. ఈ అవగాహన కార్యాక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి దాకా విధుల విభజన జరిగింది. రోడ్డుభద్రత, మహిళా భద్రత, మానవ అక్రమరవాణా, చిన్నారుల భద్రత, డయల్ 100, షీటీమ్స్, హాక్–ఐ అంశాలలో అవగాహన కార్యక్రమాలు ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో జరుగుతాయి. ప్రతీ పోలీస్స్టేషన్లోనూ సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ దాకా అందరికీ ఒక్కోఅంశాన్ని అప్పగించారు. వారు తమకు అప్పగించిన ప్రచార, అవగాహన కార్యక్రమాలను అమలు చేయాలి. వీటితోపాటు కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ‘ఈచ్వన్ –టీచ్వన్’కార్యక్రమం కూడా పోలీసులు స్వీకరించారు. వీరు స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థ, మహిళాసంఘాల సాయంతో భద్రత, ఈచ్వన్–టీచ్వన్పై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వీటి పురోగతిని ఠాణా పరిధిలో ఎప్పటికపుడు పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
దేశంలోనే ఉత్తమంగా తెలంగాణ పోలీస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీసు విభాగం ఉన్నత పోలీసు విభాగంగా రూపొందిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో స్పెషల్ పోలీస్ బెటాలియన్ కొత్తగా ఏర్పాటు చేసిన 4 బ్యాండ్ బృందాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, దీనిలో భాగంగా పోలీసు శాఖ ఆధునీకరణకు, మెరుగైన శిక్షణకు అధిక నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్లో మతాలు, వర్గాల ప్రజలు తమ పండుగలను కలిసికట్టుగా ప్రశాంతంగా నిర్వహించడం ద్వారా నగరం మొత్తం దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ పౌరులకు, పోలీసులకు మధ్య సుహృద్భావ వాతావరణం, సత్సంబంధాలు నెలకొల్పడానికి సాంస్కృతిక వారధిగా పోలీసు బ్యాండ్ బృందాలు కీలక పాత్ర వహిస్తాయన్నారు. పోలీసు శాఖలో ఉన్న బ్యాండ్ బృందాల ద్వారా ప్రదర్శనలను ఏర్పాటు చేసి పౌరులకు వినోద కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా, బెటాలియన్ డీజీ అభిలాష బిస్త్, అడిషనల్ డీజీలు జితేందర్, శ్రీనివాస్రెడ్డి, సంతోష్ మెహ్రా, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హాజరయ్యారు. -
‘ఈచ్ వన్–టీచ్ వన్’లో పోలీసు భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఈచ్ వన్–టీచ్ వన్’కార్యక్రమంలో పోలీసు శాఖ ఉత్సాహంగా పాల్గొంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో కొత్త ఏడాది వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈచ్ వన్–టీచ్ వన్ కార్యక్రమంలో పోలీసు శాఖ చిత్తశుద్ధితో పాల్గొంటుందని చెప్పారు. ఒక్కొక్క పోలీసు యూనిట్ కనీసం తమ పరిధిలోని 20 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులు గా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తమ రక్షణ కోసం పోలీసు శాఖ ఉందనే నమ్మకాన్ని పౌరులలో కల్పించాలని చెప్పారు. పోలీసు శాఖ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతని స్తోందని తెలిపారు. 2020 సంవత్సరాన్ని మహిళా రక్షణ–రోడ్డు భద్రత సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలు, పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతకు ఈ ఏడాది అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీజీపీలు, ఐజీలు, సీనియర్ పోలీసు అధికారు లు, డీజీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కానిస్టేబుల్ను అభినందించిన డీజీపీ.. పోలీసు ఉద్యోగం అంటే సామాజిక సేవ అని నిరూపించిన సిద్దిపేట పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలంను డీజీపీ అభినందించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సందర్భంగా ఒక గర్భిణికి అత్యవసరంగా ఏ–పాజిటివ్ రక్తం అవసరమైంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న శ్రీశైలం.. తన రక్తాన్ని దానం చేయడంతో ఆ మహిళకు ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న డీజీపీ.. శ్రీశైలంను అభినందించారు. -
అమరుల త్యాగాలే స్ఫూర్తి
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరుల త్యాగాలే స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామని, నేర రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చదిద్దేందుకు అహరి్నశలు కృషి చేస్తున్నామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పోలీసు అమరువీరుల దినోత్సవ వేడుకలు సోమవారం గోషామహల్ పోలీసు మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీ సులు విధి నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. వారి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్రంలో ఎలాంటి అలజడులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 1959లో చైనా–భారత్ సరిహద్దులో చైనా దురాక్రమ ణను అడ్డుకునేందుకు ప్రాణాలరి్పంచిన సీఆరీ్పఎఫ్ జవాన్ల అమరత్వానికి చిహ్నం గా ఏటా పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. పోలీసు అమరులకు సీఎం కేసీఆర్ నివాళి శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసుల నిబద్ధత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోనిదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ప్రాణాలు కూడా అరి్పస్తున్నారని, ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారు ఎప్పటికీ అమరులుగా ఉండిపోతారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. -
చిన్నమెసేజ్తో శ్రీరామ రక్ష
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం పోలీసులు మరో వినూత్న ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. క్యాబ్లలో ప్రయాణించే మహిళలు, పౌరుల భద్రతకు ఆ సర్వీసులను పోలీసు ప్యాట్రోల్ వాహనాల తో అనుసంధానించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టినట్లు సోమవారం జరిగిన మీడియా భేటీలో డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని నేర రహిత సమాజంగా మార్చే క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. నగరం విస్తరిస్తున్న దరిమిలా మ హిళా ఉద్యోగులు అన్ని వేళల్లోనూ విధులు నిర్వహిస్తున్నారని, వారికి భద్రత కలి్పంచడం మనందరి బాధ్యత అని అన్నారు. ఎలా పని చేస్తుందంటే..? ఆపద ఎదురైనా, ప్రమాదాల్లో చిక్కుకున్నా.. ఓలా, టోరా, రైడో, ఎం–వాలెట్, హాక్ ఐ యాప్ల్లో ఉన్న ఎస్ఓఎస్ (ఎమర్జెన్సీ) బటన్ను నొక్కితే చాలు సమీపంలోని ప్యాట్రోల్ వాహనాలు, బ్లూకోల్ట్స్, స్థానిక ఏసీపీ, డీసీపీ, స్టేషన్ ఎస్హెచ్ఓ, మహిళ బంధువులకు సమాచారం అందుతుంది. ఫలితంగా సదరు క్యాబ్ డ్రైవర్ వివరాలు ఫోన్ నంబర్, బయోడేటా మొత్తం పోలీసులకు వచ్చేస్తుంది. సమీపంలో ఉన్న గస్తీ వాహనాలు, పోలీసులు జీపీఎస్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఇందుకోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఓ ప్రత్యేకమైన బృందం 24 గంటలు పనిచేస్తుంది. ఈ ప్రక్రియంతా ముగిసిన తరువాత ఎవరు ఎలా పనిచేసారో తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ సర్వే ప్రతినిధులు బాధితులకు ఫోన్ చేస్తారు. ప్రస్తుతం ఈ సదుపాయం నగరానికే పరిమితమైనా, క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని డీజీపీ మహేందర్రెడ్డి తెలియజేశారు. మిగిలిన క్యాబ్ సంస్థలూ ముందుకువచ్చి ఈ విధానంలో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలు, పౌరుల్లో హాక్ ఐ మీద అవగాహన పెరుగుతోందన్నారు. ఇప్పటివరకూ 22 లక్షల మంది హాక్ ఐని డౌన్లోడ్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. -
ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టినప్పుడే: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రస్ఠాయి సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. సహయం చేస్తామని చెప్పి మభ్యపెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారని, బాధితులను రక్షించడంలో ఎన్జీఓలతో కలిసి ముందుకు వెళ్లాలని పోలీసులకు సూచించారు. మానవ అక్రమ రవాణా ఎలా చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు.. అనే అంశాన్ని పోలీసులు ముందుగానే గుర్తించి ఇలాంటివి జరగకుండా చూడాలని, అప్పుడే చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేసిన వారవుతామని డీజీపీ పేర్కొన్నారు. బాధితులను రక్షించడం, పునరావాసం కల్పించడం, ప్రాసిక్యూషన్ వంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని డీజీపీ సూచించారు. మానవ అక్రమ రవాణాలో బాధితులు ఖండాతరాలు దాటి వస్తున్నారని, నిందితులకు శిక్షపడేలా ప్రాసిక్యూషన్ జరగాలని అన్నారు. అక్రమ సంపాదన కోసమే వ్యభిచారానికి అలవాటు పడుతున్నారని, కాబట్టి అక్రమ సంపాదన, ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టినప్పుడే ఈ వ్యవస్థ ఆగుతోందని ఆయన తెలిపారు. ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, హ్యూమన్ ట్రాఫికింగ్పై సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టామని, నిందితులకు న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చూస్తున్నామని తెలిపారు. చిన్నారులను వెట్టి చాకరీ చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటూ, ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరుతో చాలా మంది చిన్నారులను రక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజ్వల ఫౌండేషన్ స్థాపకులు సునీత కృష్ణన్ మాట్లాడుతూ.. ముంబైలో అక్రమ రవాణా నుంచి 112 మంది అమ్మాయిలని రక్షిస్తే అందులో ఆరుగురు తెలుగు అమ్మాయిలు ఉన్నారని పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం ఈ స్వచ్ఛంద సంస్థను నగరంలో ప్రారంభించారని, దేశంలో ఎక్కడ అత్యాచార ఘటనలు జరిగినా భయమేసేదని అన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మానవ అక్రమ రవాణాను తగ్గిందని తెలిపారు. కొన్ని రోజుల క్రితం 16 ఏళ్ల బాలిక ఫేస్బుక్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్కు ట్రాఫికింగ్ అయిందని, ప్రస్తుతం టెక్నాలజీతో ట్రఫికింగ్ జరుగుతుందన్నారు. తెలంగాణలో జీరో ట్రాఫికింగ్ దిశగా మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పోలీసు ఉన్నతాధికారులు హాజరైయ్యారు. -
ఐసీజేఎస్తో న్యాయవిచారణ వేగిరం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)తో న్యాయవిచారణ మరింత వేగవంతమవుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఐసీజేఎస్ సర్వీసును ఆయన సోమవారం డీజీపీ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పోలీసులు, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్ల మధ్య సమాచారం ఆన్లైన్లో వేగంగా బదిలీ అవడం వల్ల నేరదర్యాప్తు, విచారణ, తీర్పులు మరింత వేగవంతమవుతాయని అన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఐసీజేఎస్ను అమలు చేయడం చారిత్రకఘట్టమని అభివర్ణించారు. ఐసీజేఎస్ సేవలు రాష్ట్రమంతా విస్తరించాలన్నారు. పోలీస్స్టేషన్లు, కోర్టుల మధ్య డేటా బదిలీకి సహకరించిన తెలంగాణ పోలీసులను, ఈ–కోర్టు బృందాలను అభినందించారు. సత్వర న్యాయం: డీజీపీ డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ కోర్టులు, దర్యాప్తు సంస్థల మధ్య డేటా బదిలీ వల్ల న్యాయ విచారణ త్వరగా పూర్తవుతుందని, సామాన్యుడికి సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. దర్యాప్తు అధికారుల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు ఈ–కమిటీ సభ్యుడు గోస్వామి, అడిషనల్ డీజీ (టెక్నికల్ సర్వీసెస్) రవిగుప్తా, కరీంనగర్ డిస్ట్రిక్స్ అండ్ సెషన్స్ జడ్జి అనుపమాచక్రవర్తి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యుషన్ వైజయంతి పాల్గొన్నారు. కరీంనగర్ నుంచి డెమో.. రాష్ట్ర పోలీసు శాఖ వరంగల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. 2018 డిసెంబర్ 15న జస్టిస్ మదన్ బి.లోకూర్ సుబేదారి పోలీస్స్టేషన్లో ఐసీజేఎస్ సేవలను ప్రారంభించారు. ఇది విజయవంతమయ్యాక కరీంనగర్ను ఎంచుకున్నారు. సోమవారం కరీంనగర్ త్రీటౌన్ నుంచి కమిషనర్ కమలాసన్రెడ్డి, హుజూరాబాద్ జేఎఫ్సీఎం రాధిక డెమోను వివరించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్లు కోర్టుల మధ్య ఎఫ్.ఐ.ఆర్, చార్జిషీటు ఇతర కేసుల వివరాలను రియల్టైమ్ ఎక్స్చేంజ్ డేటా ఎలా ట్రాన్స్ఫర్ ద్వారా పంపవచ్చో వివరించారు. అదే సమయంలో కోర్టు రిఫరెన్స్ నంబర్తోపాటు రసీదును కూడా కేటాయించడం గమనార్హం. ఈ విధానం వల్ల.. - ఈ విధానంలో 15,000 ఠాణాలు, 5,000 మంది సూపర్వైజరీ పోలీస్ అధికారులు, అనేక ప్రాసిక్యూషన్, లీగల్ ఏజెన్సీలు అనుసంధానమవుతాయి. - అధికారుల పారదర్శకత, జవాబుదా రీతనం పెంచుతుంది. - ఐదు వ్యవస్థల నడుమ రియల్టైమ్ విధానంలో డేటాబదిలీ జరుగుతుంది. - అధికారులు మరింత మెరుగ్గా కేసుల పర్యవేక్షణ చేయగలుగుతారు. - దీని ద్వారా పోలీసు– పౌరుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. తెలంగాణనే ఎందుకు? కేసుల దర్యాప్తులో సాంకేతికపరంగా తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారు. ప్రతికేసు దర్యాప్తు సీసీటీఎన్ఎస్తో అనుసంధానించి ఉంది. పోలీసుశాఖ ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్, కోర్టులు, ఫింగర్ప్రింట్ బ్యూరో దర్యాప్తు, జువనైల్ జస్టిస్ విభాగాల ను సమీకృతం చేసింది. అందుకే కేంద్ర హోంశాఖ ఐసీజేఎస్ అమలు కోసం తెలంగాణను ఎంపిక చేసింది. తొలుత వరంగల్లోని 45 పోలీస్ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతమయ్యారు. సోమవారం నుంచి కరీంనగర్ 3వ టౌన్లో ఐసీజేఎస్ సేవలను ప్రారంభించారు. -
నిఘా నీడన నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చర్యలు తీసుకున్నామని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. నిమజ్జనం సందర్భంగా బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిమజ్జనం నేపథ్యంలో 33 జిల్లాల్లో ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, మిగిలిన కమిషనరేట్ల పరిధిలోనే 35,000 మంది బలగాలు నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నాయన్నారు. సివిల్ పోలీసులతోపాటు, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), టీఎస్ఎస్పీ, ఎక్సైజ్, ఫారెస్ట్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతోపాటు జిల్లాల నుంచి వచ్చిన పోలీసు లు విధుల్లో ఉన్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్, ఎలక్ట్రిక్, నీటి సరఫరా, పారిశుధ్యం, రవాణా, ఆర్టీసీ ఇలా అన్ని శాఖలను భాగస్వామ్యం చేశామన్నారు. 50 వేల విగ్రహాలు నిమజ్జనం... రాష్ట్రంలో వినాయక చవితి మొదలు బుధవారం వరకు దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, గురువారం ఒక్కరోజే మరో 50 వేల ప్రతిమలు జలప్రవేశం చేస్తాయని వివరించారు. గ్రేటర్లో ట్యాంక్బండ్తో కలిపి మొత్తం 50 చెరువుల్లో నిమజ్జనం జరుగుతుందని, ప్రతీ నిమజ్జన కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో క్రేన్లు, లైటింగ్, తాగునీరు, తదితర సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈసారి మండప నిర్వాహకులు నిమజ్జనమయ్యాక పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్టు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పుకార్లు రేపితే చర్యలు.. నిమజ్జనానికి విఘాతం కలిగించేలా పుకార్లు రేపినా, సోషల్ మీడియాలో వదంతులు రేపినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద అలర్ట్ కొనసాగుతున్నప్పటికీ తెలంగాణకు ఇంతవరకూ కేంద్ర నిఘా సంస్థల నుంచి ఎలాంటి హెచ్చరికలు అందలేదని స్పష్టం చేశారు. అయినా.. తాము నిత్యం అప్రమత్తంగానే ఉంటున్నామని తెలిపారు. -
ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: నిమజ్జనంపై ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ముఖ్యఘట్టం అన్నారు. అన్ని శాఖలను కలుపుకుని కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం సాగిందని తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా గ్రేటర్తో కలుపుకుని 50 శివారు ప్రాంతాల్లో రేపు 50 వేల వినాయకుల నిమజ్జనం జరుగుతుందన్నారు. నిమజ్జనం జరిగే అన్ని చోట్లా సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందన్నారు. మూడు కమిషనరేట్లు, డీజీపీ ఆఫీసులతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామన్నారు. గణేష్ మండపానికి చెందిన వారితో కలిసి నిమజ్జనం కొనసాగిస్తామన్నారు. నిమజ్జనాన్ని చూసేందుకు తరలి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎమర్జెన్సీ అవసరం కోసం ఆయా ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించేందుకు ప్లాన్ చేశామన్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల 100 సీసీటీవీలను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలపాటు బ్రేక్ లేకుండా నిమజ్జనం కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. -
స్మార్ట్ పోలీసింగ్లో తెలంగాణకు పురస్కారం
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ పోలీసింగ్లో తెలంగాణ పోలీసు విభాగం ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుంది. డయల్ 100 ఫోన్కాల్స్ విభాగంలో అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించినందుకు ఫిక్కీ ఈ అవార్డు అందజేసింది. దేశంలో స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ప్రజల రక్షణ, భద్రతా విషయాల్లో మెరుగైన సేవలు అందించిన వారి కోసం ఈ అవార్డు అందిస్తారు. కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేతుల మీదుగా న్యూఢిలీలో శుక్రవారం అడిషనల్ డీజీ (టెక్నికల్ సర్వీసెస్) రవి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా డయల్100, టెక్నాలజీ టీమ్స్, పాట్రోల్ కార్స్, బ్లూకోల్ట్స్ అధికారులను డీజీపీ మహేందర్రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Sri M. Mahendar Reddy, IPS, DGP, TS congratulated the officers of Dial 100, Tech teams, Patrol cars & Blue colts for delivering effective services in emergencies. For achieving FICCI Special Jury Award 2019. pic.twitter.com/jZTBO7sNsd — DGP TELANGANA POLICE (@TelanganaDGP) August 23, 2019 Another feather added to TS police in the name of the FICCI presented Smart policing Awards, in which the TSP has received Special Jury award for ‘Dial-100’. Category –Emergency Response. Award received by Sri Ravi Gupta ADGP IT&C from Sri Jitendra Singh Minister of State in PMO. pic.twitter.com/OfoJdlYjqS — DGP TELANGANA POLICE (@TelanganaDGP) August 23, 2019 -
దొరికిపోతామనే భయం చాలు.. నేరాలు తగ్గడానికి!
సాక్షి, హైదరాబాద్: రక్షణ, స్త్రీల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, సాక్ష్యాలతో కూడిన పోలీసింగ్, ప్రామాణిక సేవలను రాష్ట్రమంతా ఒకేలా అందించడం.. పోలీసుల లక్ష్యమని, రానున్న ఐదేళ్లపాటు ఈ లక్ష్యాల పూర్తిస్థాయి సాధనకు కృషి చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. పార్క్ హయత్లో శనివారం ఫిక్కీ మహిళా సంస్థ ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఉమెన్ సేఫ్టీ విభాగం ఐజీ స్వాతి లక్రా, ఫిక్కీ చైర్పర్సన్ సోనా చత్వానిసహా వంద మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర రక్షణ, భద్రత విషయంలో పలు ప్రశ్నలకు డీజీపీ సమాధానాలిచ్చారు. భయపడితే చాలు... ‘ఉరిశిక్షలు వేస్తే నేరాలు తగ్గవు. కానీ నేరానికి కచ్చితంగా శిక్ష పడుతుంది.. తప్పించుకోలేం అనే భయం నేరస్తుల్లో గుబులు పుట్టిస్తుంది. 24 నుంచి 48 గంటల్లోపే చాలా కేసులను ఛేదించాం. వరంగల్లో 9 నెలల పాప అత్యాచారం కేసుతో పాటు అనేక సంచలన కేసుల్లో నిందితులకు శిక్షపడేలా చేయడంలో విజయం సాధించాం. అత్యవసర సేవల నిర్వహణలో భాగంగా సమాచారం అందితే నగరంలో 5 నిమిషాల్లో, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 10 నిమిషాల్లో, గ్రామాల్లో 15 నిమిషాల్లో స్పందిం చగలుగుతున్నాం. డిజిటల్ వేదికగా నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో, నేరస్తులను పట్టుకునేందుకు తగిన శిక్షణ పోలీసులకు అందిస్తున్నాం.’అని మహేందర్రెడ్డి చెప్పారు ప్రతి పౌరుడూ పోలీసే... ‘70 ఏళ్లలో సాధ్యం కానిది.. ఈ ఐదేళ్లలో సాధించాం. పోలీసు విభాగానికి 11,500 వాహనాలు కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం మనదే కావచ్చు. రెండు శాతం జనాభా మాత్రమే పోలీసు సేవలను వినియోగిస్తోంది. మిగిలిన 98 శాతం మంది కూడా పన్ను కడుతున్నవారే. వాళ్లు మా దగ్గరికి రారు. అందుకే మేమే వాళ్ల దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. చిన్న చిన్న సమావేశాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలను చేపడుతున్నాం. ప్రతి పౌరుడూ పోలీసే.. ప్రతి పోలీసూ పౌరుడే. ప్రజలతో కలసి పనిచేయకపోతే, వాళ్లకు ఉపయోగపడకపోతే మా సేవలకు అర్థం ఉండదు.’అని బదులిచ్చారు. బలప్రయోగం చివరియత్నం.. ‘నేరం జరిగిన తర్వాత కంటే ముందు దాన్ని నిలువరించడమే పోలీసుల సమర్థత. బలప్రయోగం అనేది ఏ ప్రయత్నాలు ఫలించనప్పుడు చివరగా చేసేది. సంతకాల వెరిఫికేషన్ ప్రక్రియలో ఇబ్బందులతో ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ప్రక్రియ సాధ్యం కావటం లేదు. అయితే మన దగ్గర ఫిర్యాదు ఆన్లైన్ ద్వారా తీసుకుని సంతకాలు మాత్రం స్వయంగా వెళ్లి ఇచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేసుకుంటారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను రెగ్యులరైజ్ చేస్తున్నాం. నగరంలో 4 వేల సెక్యూరిటీ ఏజెన్సీలు ఉండగా, అందులో 200 ఏజెన్సీలకే పీఏఎస్ఏఆర్ఏ లైసెన్స్ ఉన్నాయి. స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేది మూడవ పార్టీ మానిటర్ చేస్తుంటుంది. ఫీడ్ మెకానిజం ఏర్పాటు చేయటంతో సత్ఫలితాలు వస్తున్నాయి. లింగ వివక్ష లేకుండా, సున్నితంగా వ్యవహరించేలా సిబ్బందికి శిక్షణ అందిస్తున్నాం. – స్వాతి లక్రా ముఖాముఖి కార్యక్రమం 10 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. దేశ వ్యాప్తంగా 16 కేంద్రాల్లో ఏకకాలంలో ఫిక్కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రిపోర్ట్ను ఆయా ప్రభుత్వాలకు అందజేస్తాం. – సోనా చత్వాని -
‘వాహనాలకు జీపీఎస్,సీసీ కెమెరాలు తప్పనిసరి’
సాక్షి, హైదరాబాద్: త్వరలో హైదరాబాద్లోని అన్ని రవాణా వాహనాలకు జీపీఎస్ పరికరాలు తప్పనిసరి చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా మహిళల భద్రతపై డీజీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. డీజీపీ మహేందర్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసు అధికారులతోపాటు విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ (ఎల్ అండ్ వో) స్వాతి లక్రా, రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రత గురించి తీసుకోవాల్సిన అంశాలే కేంద్రంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో అనుమతి ఉన్న కార్లు, ఆటోలు తదితర రవాణా వాహనాలకు జీపీఎస్ సౌకర్యం ఉండాలని రవాణా అధికారులు సూచించారు. నగరంలో సీసీ కెమెరాల సంఖ్యను మరింత పెంచాలని, పలు ప్రజా రవాణా వాహనాల్లోనూ సీసీ కెమెరాలను అమర్చాలని సమావేశం అభిప్రాయపడింది. -
డీజీపీని కలిసిన న్యూ డెమోక్రసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ న్యూడెమోక్రసీ నేతలు మంగళవారం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. కొత్తగూడెం జిల్లా, గుండాల మండలంలో లింగన్న ఎన్కౌంటర్ సందర్భంగా గ్రామస్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లింగన్న ఎన్కౌంటర్ సందర్భంగా జరిగిన ఘర్షణలో దాదాపు 30మంది అమాయకులపై సెక్షన్ 307 ప్రకారం కేసలు నమోదు చేశారన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. ఎన్కౌంటర్లో చనిపోయిన లింగన్న సంతాప సభలకు అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరామన్నారు. తమ అభ్యర్థన పట్ల డీజీపీ మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని.. జిల్లా పోలీసు అధికారులతో నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తానని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. -
సభలు, ర్యాలీలకు అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మహేందర్రెడ్డి తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు. సభలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. -
ఐటీ జోన్ లో మేటి ఠాణా
సాక్షి, హైదరాబాద్: రండి.. రండి.. ఏదైనా ఫిర్యాదు చేయడానికి వచ్చారా?. ఇదిగోండి కాగితం.. పెన్ను.. అంటూ ఫిర్యాదు స్వీకరిస్తారు. అంతేనా.. అధికారులు, సందర్శకులు, మీడియా వేర్వేరుగా పార్కింగ్... విభాగాల వారీగా ప్రత్యేక గదులు... మహిళా సిబ్బంది కోసం రెస్ట్ రూమ్... అటాచ్డ్ బాత్రూమ్స్.. సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పడకలు.. భోజనం చేయడానికి వసతులు.. ఇలా ఎన్నో.. ఇదీ రాయదుర్గం పోలీసుస్టేషన్ ప్రత్యేకత. ఠాణాల ఆకస్మిక తనిఖీలో భాగంగా డీజీపీ ఎం.మహేందర్రెడ్డి శుక్రవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని ఈ స్టేషన్ ను సందర్శించారు. అక్కడి హంగులు, పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు చూసి మంత్రముగ్ధులెన ఆయన ఠాణాకు రూ.లక్ష రివార్డు ప్రకటించారు. రాజధానిలో ఉన్న మూడు కమిషనరేట్ల అధికారులకు ఆ పోలీసుస్టేషన్ ఓ రోల్మోడల్గా ప్రకటించారు. అంతా అక్కడ వచ్చి, చూసి, నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయంటూ కితాబిచ్చారు. ఏంటీ ప్రత్యేకత... నానక్రామ్గూడ చౌరస్తాకు సమీపంలో జీ+వన్ గా నిర్మితమైన ఠాణాలో అడుగుపెడుతూనే ఆహ్లాదకర వాతావరణం. ఇన్ స్పెక్టర్, సబ్–ఇన్ స్పెక్టర్ల చాంబర్స్తో సహా పోలీసుస్టేషన్ పరిపాలన విభాగం మొత్తం కింది అంతస్తులో ఉంటుంది. మొదటి అంతస్తులో టెక్ టీమ్, కోర్టు విధులు నిర్వర్తించే సిబ్బంది, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, వారంట్ స్టాఫ్, సమ¯Œ స్టాఫ్, క్రైమ్ రైటర్, కేస్ ప్రాపర్టీలకు ప్రత్యేకించి రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడే మహిళా సిబ్బంది కోసం ప్రత్యేకంగా రెస్ట్ రూమ్ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్స్, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పడకలు, భోజనం చేయడానికి వసతులు ఈ ఠాణా ప్రత్యేకతలు. అక్కడ, ఇస్పెక్టర్ చాంబర్కు సమీపంలో ప్రతి ఒక్క అధికారికీ ప్రత్యేకంగా కూర్చునే స్థలం, పరిపాలన పరమైన ఫైళ్ల కోసం భద్రమైన ఏర్పాట్లు ఉన్నాయి. సిబ్బంది కోసం మినీ వర్క్ స్టేషన్, మహిళల కోసం వేరుగా వెయిటింగ్ రూమ్, ఇంటర్వ్యూ రూమ్, సబ్–ఇన్స్పెక్టర్లకు విశ్రాంతి గదులు ఈ పోలీసుస్టేషన్ లో అందుబాటులో ఉన్నాయి. రాయదుర్గం పోలీసుస్టేషన్ టెర్రస్ పైన అధికారులు, సిబ్బంది కోసం ఉద్దేశించిన జిమ్, యోగా ఏరియాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వీటితో పాటు రిలాక్స్ ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది. ఈ స్టేషన్ కు ప్రత్యేక గుర్తింపు వెనుక సమిష్టి కృషి ఉంది. ప్రజా మిత్ర పోలీసింగ్ విధానాలు అమలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల మన్ననలు పొందేలా, వాళ్లు చట్టాలను తప్పనిసరిగా పాటించేలా చేయడంలో సఫలీకృతం కావాలి. ఇది జరగాలంటే ఠాణాలోని అన్ని స్థాయి పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలి. – ఎస్.రవీందర్, ఇన్న్స్పెక్టర్ రండి.. రండి.. సాయం కోరుతూ వచ్చిన వారిని అక్కడి సిబ్బంది సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక్కడ ‘హావ్ ఏ పేపర్’విధానం అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ప్రతి బాధితుడికీ వారే అడిగి మరీ కాగితం, పెన్ను అందించడంతో పాటు ఫిర్యాదు రాయడంలోనూ అవసరమైన పూర్తి సహకారం అందిస్తారు. అలాగే ఠాణా మొదటి అంతస్తులో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన బ్యారెక్స్, డైనింగ్ ఏరియా ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడే ఈ ఠాణాకు సంబంధించిన క్లోజ్డ్ ఫైల్స్ రూమ్ ఏర్పాటు చేశారు. కోర్టులు కోరినప్పుడు, ఉన్నతాధికారులు అడిగినప్పుడు వీటిని పక్కాగా తీసుకువెళ్లి సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఏ కేసుకు సంబంధించిన ఫైల్ అయినా కేవలం 30 సెకండ్లలోనే బయటకు తీసేందుకు ఆస్కారం ఏర్పడింది. వీటికితోడు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోలీసుస్టేషన్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్ను సైతం అందుబాటులో ఉంచారు. -
పోలీస్స్టేషన్లకు డిజిటల్ అడ్రస్
సాక్షి, మంచిర్యాల : రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న వ్యక్తి చేతిలోని బ్యాగును దుండగులు లాక్కెళ్లిపోవడం, రోడ్డుపై వెళ్తున్న ఒంటరి మహిళల మెడలోని చైన్స్నాచింగ్ పాల్పడి పారిపోవడం, వెంటనే అక్కడి పరిధిలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బాధితులు వెళితే సిబ్బంది అంత విన్న తర్వాత ఆ ప్రాంతం మా పరిధిలోకి రాదని, వేరే పోలీస్స్టేషన్ చిరునామా చెప్పి పంపిస్తుంటారు. అప్పటికే దుండగులు పోలీసులకు దొరకనంత దూరం పారిపోతారు. ఈ పరిస్థితి బాధితులకు కొంత అసంతృప్తికి, అసౌకర్యానికి గురి చేసింది. ఇలాంటి కొన్ని ఫిర్యాదులు రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ మహేందర్రెడ్డి దృష్టికి వచ్చాయి. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్లి పునరావృత్తం కాకుండా ఉండేందుకు రాష్ట్రంలోని పోలీస్స్టేషన్లకు డిజిటల్ అడ్రాస్ ఇవ్వడానికి పోలీస్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. త్వరలో పోలీస్ స్టేషన్లన్ని డిజిటల్ అడ్రాస్లోకి రానున్నాయి. స్మార్ట్ఫోన్లో పోలీస్ స్టేషన్లు.... పోలీస్స్టేషన్ల చిరునామా ఇక నుంచి స్మార్ట్ ఫోన్లో తెలుసుకునే విధంగా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లన్నింటికీ జియో పెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు వాటిని డైరెక్షన్స్తో సహా పోలీస్ అధికారిక యాప్ ‘హాక్–ఐ’తో అనుసంధానం చేయనున్నారు. దీని ఫలితంగా స్మార్ట్ఫోన్ ఉన్న ఎవరైనా తాము ఉన్న ప్రాంతం ఏ పోలీస్ పరిధిలోకి వస్తుందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా పోలీస్ స్టేషన్కు ఎలా చేరుకోవాలో కూడా యాప్ రూట్ చూపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని డీజీపీ యోచిస్తున్నారు. అనేక చోట్ల పరేషాన్... ఏదైనా ఓ ఉదంతం జరిగినప్పుడు కేసు నమోదు చేయాలన్నా, తదుపరి చర్యలు తీసుకోవాలన్నా జూరిస్ డిక్షన్గా పిలిచే పరిధి అత్యంత కీలకమైన అంశం. తమ పరిధిలోకి రాని కేసు విషయంలో ఓ పోలీస్స్టేషన్ అధికారులు కలుగజేసుకుంటే చట్టపరంగానే కాకుండా ఇతర అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరైనా సరే నేరం చోటుచేసుకున్న పరిధిలోని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిందే. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పోలీస్ స్టేషన్ల పరిధులు అనేవి పరేషాన్ చేస్తుంటాయి. మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధి మూడు వైపులుగా ఉంది. ఇటు శ్రీనివాస్ గార్డెన్, తోళ్లవాగు, వేంపల్లి వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఏరియా మొత్తం మంచిర్యాల పోలీస్ స్టేషన్ కిందికి వస్తుంది. ఈ ప్రాంతాలు దాటుతే ఒక పవైపు రామకృష్ణపూర్, మరో వైపు సీసీసీపోలీస్ స్టేషన్, ఇంకో వైపు హాజిపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తాయి. కానీ ఈ ప్రాంతాలకు మంచిర్యాల పోలీస్స్టేషన్ దగ్గరలో ఉంటాయి. ఇక్కడ ఏమైన సంఘటనలు జరిగితే సమీప పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు సర్వసాధారణంగా సమీపంలోని పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వస్తారు. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో అటు బాధితులే కాదు కొన్ని సార్లు పోలీసులు సైతం తికమక పడ్డ సందర్భాలు సైతం ఉన్నాయి. గూగుల్ మ్యాప్లో ఉన్నప్పటికీ.. ఓ ప్రాంతంలో ఉన్న వ్యక్తి తన సమీపంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్తో పాటు పోలీస్ స్టేషన్లను తెలుసుకునే అవకాశం గూగుల్ మ్యాప్స్ ద్వారా ఉంది. అయితే ఇది కేవలం సమీపంలోని వాటిని మాత్రమే చూపించగలుగుతోంది. దానికే మార్గాన్ని నావిగేట్ చేస్తుంది. వేంపల్లి వద్ద జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఇక్కడ ఉన్న ఓ వ్యక్తి ‘పోలీస్ స్టేషన్ నియర్ బై మీ’ అని గూగుల్ మ్యాప్లో టైప్ చేస్తే అది సమీపంలోని మంచిర్యాల పోలీస్ స్టేషన్ చూపించే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఈ ప్రాంతం హాజిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనికి వస్తుంది. పరిధులు అన్నవి గూగుల్ మ్యాప్స్లో అనుసందానించి లేక పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ల పరిధులు, వాటి ఆడ్రస్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ మహేందర్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హక్–ఐలో లింకు రూపంలో.... దీనికోసం పోలీస్ అధికారిక యాప్ హాక్–ఐలో ప్రత్యేక లింకు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రం లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధుల్నీ జియో ఫెన్సింగ్ చేస్తూ నావిగేషన్స్తో సహా ఇందులో నిక్షిప్తం చేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ఏ వ్యక్తి అయినా ఓ ప్రాంతంలో నిల్చుని ఆ ప్రాంతం ఏ పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకో వాలంటే ఈ లింకు ఓపేన్ చేస్తే చాలు. ఈ వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని జీపీఎస్ ఆధారంగా గుర్తించే యాప్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో వెంటనే చెబుతోంది. దీంతో కొన్న సార్లు నావిగేషన్, పోలీస్ స్టేషన్ పరిధుల్ని యాప్ తప్పుగా చూపించే అస్కారం సైతం ఉంది. -
అతి చేస్తే ఆన్లైన్కి ఎక్కుతారు..
ఆధునిక టెక్నాలజీని పోలీసు శాఖ వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేగవంత సేవలు అందిస్తూ..‘స్మార్ట్’ పోలీసులుగా మారుతున్నారు. 30 సంవత్సరాల క్రితం ఖాకీ నిక్కర్, తలపైన ఎర్రటోపీ చేతిలో లాఠీ పట్టుకొని కనిపించిన పోలీస్ వేరు. ఇప్పుడు..కంప్యూటర్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, స్మార్ట్ యాప్లు, ఆన్లైన్ కేసుల ఛేదనలతో..ఔరా అనిపించే వేగం వేరు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందుబాటులోకి వచ్చిన, అమలవుతున్న సరికొత్త పోలీసు విధానంతో శాంతిభద్రతల పరిరక్షణకు వేగవంతంగా అడుగులు పడుతున్నాయి. సరికొత్త మార్పులు..పోలీస్ కమిషనర్( సీపీ) పర్యవేక్షణలో చోటు చేసుకున్న పరిణామాల సమాహారమే ఈ–పోలీస్ అనుసంధాన కథనం. క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ( సీసీటీఎన్ఎస్).. దేశ వ్యాప్తంగా ఎక్కడ..ఎవరు, ఏ నేరంచేసినా వాటి వివరాలు, ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు అన్నీ సీసీటీఎన్ఎస్లో అందుబాటులో ఉండనున్నాయి. దీని ద్వారా మొత్తం 18 రకాల నివేదికలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎఫ్ఐఆర్, కేసు డైరీ, చార్జిషీట్, కోర్టుతీర్పులు, కోర్టుకొట్టివేత కేసులు, నిందితుల హిస్టరీ షీట్స్తో తదితర వివరాలు ఉంటాయి. దీని ద్వారా ఎక్కడ నేరం జరిగినా సంబంధిత ఆరోపణలు, ఎదుర్కొంటున్న నిందితుడి వివరాలు డేటా బేస్లో క్షణాల్లో దొరికిపోతాయి. అదే విధంగా ఆర్థిక, సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు సైతం డేటా బేస్లో నిక్షిప్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో అత్యాధునిక కంప్యూటర్ల ద్వారా ఎఫ్ఐఆర్ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. అతి చేస్తే ఆన్లైన్లోకి ఎక్కుతారు.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, ధూమపానం చేస్తే ఇకపై ఊరుకోరు. చిన్నచిన్న గొడవలు, డీజే సౌండ్లతో రచ్చ చేస్తే ఆన్లైన్లో కేసు నమోదవుతుంది. ఇంకా అర్ధరాత్రి వరకు తెరిచి ఉండే దుకాణాలు, ఆలస్యంగా మూతపడే బార్లు, రెస్టారెంట్లు, రహదారి, ఫుట్పాత్లపై ఆక్రమణలు, నేషేధిత ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం, పబ్లిక్ న్యూసెన్స్లకు పాల్పడే వారిపై ఈ–పెట్టీ కేస్ యాప్లో కేసులు నమోదు చేస్తారు. భవిష్యత్లో మళ్లీ వారు ఏదైనా ఘటనలో పాల్గొన్నప్పుడు ఆన్లైన్ కేసు వివరాలు ప్రత్యక్షమవుతాయి. తద్వారా పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మంలో ఇప్పటికే ఈ విధానాన్ని ప్రారంభించి తొలినాళ్లలో పలు కేసులను నమోదు చేశారు. ప్రజలు, విద్యార్థులు, యువకులకు స్మార్ట్ పోలీసింగ్ విధాన సేవలు అందేల, విస్తృత పరిచేలా అవగాహన కల్పిస్తున్నారు. మహిళల భద్రతకు ‘హాక్ ఐ’ మహిళల భద్రత, నేరాల నియంత్రణకు పోలీసులకు, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఒక యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ యాప్గా హాక్ ఐ అప్లికేషన్ను అందుబాటులోకి వచ్చింది. అత్యవసర సమయాల్లో సాయం కోసం ఉపయోగించొచ్చు. మహిళలు ప్రయాణం చేస్తుండగా వారికి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే యాప్లో ఉన్న ఎస్వోఎస్ (సేవ్ అవర్ సోల్స్) బటన్ నొక్కితే చాలు అత్యవసర సందేశం బాధితురాలి బంధవులకు, స్నేహితులకు , సంబంధిత పోలీస్ అధికారులకు, పోలీస్ పెట్రోలింగ్కు సమాచారం వెళుతుంది. ప్రధానంగా మహిళలు ఒకచోట నుంచి మరోచోటకు క్యాబ్, ఆటోలు, ట్యాక్సీలు, రైలు, బస్సుల్లో ప్రయాణ చేసే ముందు సంబంధిత వాహనం నంబర్ కన్పించేలా ఫొటో తీసుకొని అప్లోడ్ చేయాలి. టీఎస్ కాప్ అప్లికేషన్.. డీజీపీ మహేందర్రెడ్డి జనవరి1న హైదరాబాద్లో ప్రతిష్టాత్మక టీఎస్కాప్ యాప్ను ప్రారంభించారు. టీఎస్ కాప్ మొబైల్ యాప్ ద్వారా 54 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. టీఎస్ కాప్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బంది ఒక్క క్లిక్తో తమకు కావాల్సిన సమాచారన్నంతా తెలుసుకోవచ్చు. విచారణకు సంబంధించిన పూర్తి డాటాబేస్, డయల్ 100కు అనుసంధానం, పెట్రోలింగ్ మొబైల్ వాహనాలు, క్రైమ్ మ్యాపింగ్, దర్యాప్తునకు కావాల్సిన పూర్తి సమాచారం విచారణ అధికారి చేతిలోనే ఉండడం..తదితర సదుపాయాలెన్నో ఇందులో అందుబాటులో ఉన్నాయి. కాప్–కనెక్ట్.. సాంకేతిక అధారిత సేవలతో పోలీస్ శాఖను పరుగులు పెట్టిస్తున్న డీజీపీ ఎం.మహేందర్రెడ్డి కాప్–కనెక్ట్ పేరుతో తెంగాణ వాట్సాప్ను విష్కరించారు. ఇప్పటికే హైడ్ కాప్, టీఎస్కాప్, హవాక్, ఈ–సెట్టీ యాప్ వంటి పలు యాప్ ఆధారిత సేవలను శాఖలో అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్లో డీజీపీ ఫోన్ నెంబర్నుంచి కింది స్థాయి వరకు ఉన్న అందరి మొబైల్ నెంబర్లకు ఈవాట్సాప్ కనెక్ట్ అయి ఉంటుంది. ఒకే నెట్ వర్క్ కిందకు 63వేలమంది ఈయాప్లోకి వస్తారు. శాఖాపరమైన అంతర్గత సమాచారం ఇచ్చి పుచుకోవాలన్నా , చాలా సులభమవుతుంది. సాధారణ వాట్సాప్లో 256 నెంబర్లకు మాత్రమే పరిమితం అవుతంది. కానీ ఈ వాట్సాప్ లో 63వేలమమందిని చేర్చుకోనే విధంగా తయారు చేశారు. చాటింగ్, గ్రూప్ చాటింగ్, ఫొటోలు, టెక్స్ట్ మెసేజ్లు పంపించవచ్చు. ఏదైనా కేసులు, ఘటనల గురించి వేగవంతంగా సమాచార మార్పిడి జరుగుతుంది. ఈ–పిటీ కేసుతో చిన్న నేరాలకు చెక్.. నేరాల అదుపు, శాంతి భద్రతల పర్యవేక్షణకు ఈ–పెటీ కేసు యాప్ సత్ఫాలితాలనిస్తోంది. దళారుల ఆటలు సాగకుండా ఇది తోడ్పడుతోంది. రహదారి, ఫుట్పాత్ అక్రమణలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, డీజేల వినియోగం లాంటి చిన్న నేరాలకు పాల్పడే వారిని ఈ–యాప్లో కేసు నమోదు చేస్తారు. ఇందుకోసం ఐటీ కోర్టీమ్ పోలీసులకు శిక్షణ చ్చారు. పట్టణంలో ఫుట్పాత్ల ఆక్రమణల ద్వారానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు. ఏదైనా గొడవలు జరిగినా , ఆక్రమణలు జరిగినా వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు, సంఘటనాస్థలానికి చేరుకుంటారు. నిందితుల వివరాలతో కేసు నమోదు చేసిన వెంటనే కోర్టుకు హాజరయ్యే తేదీని తెలియజేస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను రికార్డుల్లో నిక్షిప్తం చేస్తారు. దీంతో నిందితులు తప్పించుకోనే అవకాశం ఉండదు. -
ఆధార్ వివరాలు ఇవ్వలేం!
సాక్షి, హైదరాబాద్: గుర్తుతెలియని వ్యక్తుల వివరాలు కనిపెట్టడం పోలీసులకు కఠినమైన పనే. సమస్యాత్మక కేసుల్లో మృతదేహం ఆచూకీ పట్టు కోవడం సవాలుగా మారుతుండటంతో చాలా కేసులు ముందుకుసాగక మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు పోలీసులు ఫలానా మృతదేహం వేలిముద్రల ఆధారంగా వివరాలు వెల్లడించేలా ఆధార్ ప్రాధికారక సంస్థ (యూఐడీఏఐ)ని ఆదేశించాలంటూ కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో ఈ తరహా కేసులు అధికం కావడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ–ఆధార్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇలాంటి వివరాలు వెల్లడించడం కుదరదని స్పష్టం చేస్తూ తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డికి 3 పేజీల లేఖ రాసింది. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసులకు తెలియజేయాలని కూడా లేఖలో సూచించింది. ఆ లేఖలో ఏముందంటే.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ–ఆధార్ మంత్రిత్వశాఖ తరఫున హైదరాబాద్లోని యూఐడీఏఐ రీజినల్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జి.వేణుగోపాల్రెడ్డి డీజీపీకి ఈ విషయమై ఓ లేఖ రాశారు. గుర్తు తెలియని మృతదేహాల విషయంలో వేలిముద్రల ఆధారంగా వివరాలు వెల్లడించాలంటూ పలువురు దర్యాప్తు అధికారులు హైకోర్టును ఆశ్రయించడం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో వ్యక్తుల బయోమెట్రిక్ లేదా ఐరిష్ వివరాలను వెల్లడించడం సాధ్యం కాదు. చనిపోయిన వ్యక్తులకు సంబంధించినవైనా సరే ఇవ్వడం కుదరదు. అది గోప్యతా చట్టానికి పూర్తిగా విరుద్ధం. ఆధార్ డేటా బేస్లోని ప్రతీ వ్యక్తి సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచేందుకు తాము తొలిప్రాధాన్యమిస్తామని, వాటిని వెల్లడించలేమని స్పష్టంచేశారు. -
పోలీసు శాఖలో బదిలీలకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో కిందిస్థాయి సిబ్బందిపై డీజీపీ కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించింది. దీర్ఘకాలికంగా ఒకే పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఒకే స్టేషన్లో ఐదేళ్లు దాటిన కానిస్టేబుల్, నాలుగేళ్లు దాటిన హెడ్కానిస్టేబుల్, మూ డేళ్లు దాటిన ఏఎస్సైల వివరాలను పంపాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. కిందిస్థాయి సిబ్బంది బదిలీలపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. సార్సాల ఘటన తర్వాత మారిన సీన్.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం సార్సాల గ్రామంలో ఫారెస్ట్ అధికారిపై దాడి జరిగిన తర్వాత డీజీపీ మహేందర్రెడ్డి సీరియస్ అయ్యారు. అది మొదలు రాష్ట్రంలో డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రతి అంశంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్పై విమ ర్శలు రావడంతో డీజీపీ తీవ్రంగా స్పందించారు. వెంటనే అన్ని జిల్లాల ఎస్పీ లు, కమిషనర్లకు సందే శాలు పంపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్పై ఎలాంటి విమర్శలు రావొద్దని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో పంజగుట్ట పోలీస్ ఠాణా ఎదుట ఇటీవల స్వల్ప వ్యవధిలో రెండు హత్యలు జరగడంతో డీజీపీ ఠాణాను అర్ధరాత్రి సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురిపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ పరిసరాలు మురికిగా ఉండటం, డ్యూటీ సమయంలో సిబ్బంది ఏమరుపాటుపై మండిపడ్డారు. గ్రేటర్ తర్వాత జిల్లాల్లో.. తొలుతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల సందర్శనకు డీజీపీ శ్రీకారం చుట్టారు. పలు జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. దీంతో బదిలీ కాకుండా మిగిలిపోయిన ప్రాంతాల్లో ఈ జాబితాను రూపొందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే పలు జిల్లాల్లోనూ డీజీపీ పర్యటన ఉంటుందని సమాచారం. -
‘85 శాతం మంది ఆచూకీ లభిస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : ‘ఏమైపోతున్నారు’ పేరిట ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక మంగళవారం ప్రచురించిన కథనంపై తెలంగాణ పోలీస్శాఖ స్పందించింది. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే వార్తలు సరికావని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా అన్నారు. అన్ని కేసుల మాదిరగిగానే కిడ్నాప్ కేసులపై కూడా సత్వర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను డీజీపీ మహెందర్రెడ్డి ట్విటర్లో పోస్ట్ చేశారు. కిడ్నాప్ అవుతున్న వారిలో దాదాపు 85 శాతం మంది ఆచూకీ దొరుకుతోందని స్వాతిలక్రా వెల్లడించారు. ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు అదృశ్యమవుతున్నారని చెప్పారు. పరీక్షా ఫలితాలు, ప్రేమ వ్యవహారాలు, వృద్ధులపట్ల పిల్లల నిరాదరణ వంటి కారణాలు కూడా ఉన్నాయని అన్నారు. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసుకుని, బాధిత కుంటుంబ సభ్యుల సహకారంతో వారి ఆచూకీ కనుగొనేందుకు శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. గస్తీ వాహనాలు, బ్లూకోల్ట్స్, దర్యాప్తు అధికారులకు కిడ్నాపైన వారి ఫొటోలు అందిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సి న పనిలేదని, అదృశ్యమైన ప్రతి ఒక్కరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసుశాఖ పనిచేస్తుందని ఆమె భరోసానిచ్చారు. -
కాబోయే పోలీసులకు కొత్త పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : ఏదైనా ఉదంతం జరిగినప్పుడు స్పందిస్తే అది రియాక్టివ్ పోలీసింగ్... అసలు ఎలాంటి ఉదంతం చోటు చేసుకోకుండా దాన్ని ముందే గుర్తించి నిరోధిస్తే అది ప్రొయాక్టివ్ పోలీసింగ్... రెండో తరహా విధానానికి ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసు విభాగంలో అడుగు పెట్టడానికి ముందే అభ్యర్థులకు దీంతో పాటు ఇతర విధానాలను బోధించాలని స్పష్టం చేశారు. దీనికోసం తెలంగాణ పోలీసు అకాడెమీ కేంద్రంగా సాగే పోలీసు శిక్షణ విధానంలో అవసరమైన మార్పుచేర్పులకు ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీసింగ్లో సమకాలీన అవసరాలకు తగ్గట్టు శిక్షణలో చేర్పులు చేయడానికి డీజీపీ కార్యాలయం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలో ప్రారంభంకానున్న 18 వేల మంది శిక్షణ మాడ్యుల్లో ఈ కొత్త పాఠాలు చేరనున్నాయి. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు చెందిన తుది ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఆపై గరిష్టంగా నెల రోజుల్లోనే వీరికి శిక్షణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు కొత్త పాఠాలకు తుది రూపు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ కసరత్తు చేస్తోంది. సమూల మార్పులతో... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసింగ్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. సంప్రదాయ పోలీసు విధానాలకు అదనంగా గడిచిన ఐదేళ్లలో ఎన్నో కొత్త అంశాలు వచ్చిచేరాయి. ప్రజలకు మెరుగైన సేవలందించటానికి ఉపకరించే ఓ కొత్త అంశాన్ని పోలీసు విభాగం ప్రవేశపెట్టిన ప్రతిసారీ సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇస్తోంది. దీనికోసం కమిషనరేట్లు, జిల్లాల వారీగా శిక్షణ ఇచ్చేందుకు కొందరిని ఎంచుకుంటోంది. ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ పేరుతో కార్యక్రమాలు చేపట్టి వీరికి డీజీపీ కార్యాలయం కేంద్రంగా తర్ఫీదు ఇస్తున్నారు. ఇది పూర్తి చేసుకుని వెళ్తున్న ఈ ట్రైనర్లు తమ పరిధిలో ఉన్న ఇతర సిబ్బంది, అధికారులకు విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి అవసరం లేకుండా ఇకపై పోలీసు విభాగంలో అడుగుపెట్టే వారికి ట్రైనింగ్లోనే సమకాలీనంగా అందుబాటులోకి వచ్చిన అంశాలు, విధానాలను బోధించనున్నారు. కొత్త పాఠాల్లో భాగంగా ప్రోయాక్టివ్ పోలీసింగ్తో పాటు యూనిఫామ్డ్ సర్వీస్ డెలివరీకి కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని ప్రకారం హైదరాబాద్లోని పోలీసుస్టేషన్లలో ఏ తరహా స్పందన, సేవలు ఉంటున్నాయో... ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండలంలో ఉన్న ఠాణాలోనూ అదే విధంగా ఉండాలి. ఈ అంశాన్ని శిక్షణ సమయం నుంచే బోధించనున్నారు. ప్రజలకు మరింత సన్నిహితం కావడానికి, పోలీసు విధులు, దర్యాప్తుల్లో సహకరించడానికి, నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి హాక్–ఐ, టీఎస్ కాప్ వంటి వివిధ రకాలైన అధికారిక యాప్స్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటికి చెందిన అంశాలతోనూ ఓ పాఠం రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో కమ్యూనిటీ పోలీసింగ్ అనేక అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. సాధారణ ప్రజలకూ పోలీసింగ్లో భాగస్వామ్యం కల్పించే ఈ విధానాన్ని ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగం అమలులోకి తీసువచ్చింది. దీని నిర్వహణా అంశాలను బోధించనున్నారు. 16 రకాలైన వర్టికల్స్ను రూపొందించి.. ఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు... పోలీసుస్టేషన్లో ఉండే వివిధ విభాగాలకు పని విభజన చేస్తూ 16 రకాలైన వర్టికల్స్ను రూపొందించి అమలు చేస్తున్నారు. దీంతో పాటు సీసీ కెమెరాల ప్రాధాన్యం, కమ్యూనిటీ కెమెరాలు, నేను సైతం ప్రాజెక్టు కింద ఏర్పాటు చేయించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ మరో పాఠ్యాంశం ఉండనుంది. రాష్ట్రంలోని పోలీసుస్టేషన్లలో రిసెప్షన్స్ ఏర్పాటు చేసిన తర్వాత గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి నేతృత్వం వహించేది కానిస్టేబుల్ స్థాయి అధికారులే. వీరి ప్రవర్తన, తీరుతెన్నులే ఫిర్యాదుదారులకు ఊరట, పోలీసు విభాగంపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. ఈ నేపథ్యంలోనే రిసెప్షన్ నిర్వహణలో మెళకువల్నీ ట్రైనింగ్లోనే నేర్పాలని నిర్ణయించారు. పోలీసు శిక్షణలో కొత్తగా చేరుస్తున్న అంశాలు కేవలం పాఠాలుగానే ఉండకుండా ప్రత్యేక కమిటీ చర్యలు తీసుకుంటోంది. ట్రైనింగ్ మాడ్యుల్లోకి చేరే కొత్త పాఠాల్లో ఆయా విధానాల వల్ల ఇప్పటికే వచ్చిన ఫలితాలను అభ్యర్థులకు వివరించనున్నారు. ఇందులో భాగంగా కొన్ని కేస్ స్టడీస్తో పాటు తగ్గిన నేరాల శాతం తదితరాలనూ ప్రత్యక్ష ఉదాహరణలుగా పాఠంలో చేరుస్తున్నారు. ఈ సిలబస్తో శిక్షణ పూర్తి చేసుకునే తొలి బ్యాచ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా తదుపరి మార్పుచేర్పులు చేయాలని డీజీపీ కార్యాలయం భావిస్తోంది. -
తప్పుడు ఆరోపణలపై లక్ష్మీ పార్వతి డీజీపీకి ఫిర్యాదు
-
‘కోటిని నా బిడ్డలాగా భావించాను’
సాక్షి, హైదరాబాద్ : తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నేత లక్ష్మీపార్వతి సోమవారం డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కోటి అనే వ్యక్తిని నా బిడ్డలాగా భావించాను. కానీ అతను నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాడు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న నన్ను కించపరుస్తూ విమర్శలు చేస్తున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక.. ‘ఈ నెల 4న కోటి టీవీ చానెల్స్, సోషల్ మీడియాలో నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిత్వాన్ని కించపరిచాడు. ఇందుకు గాను కోటీతో పాటు ఆరోపణలను ప్రచారం చేసిన మీడియా చానెల్, సదరు యాంకర్పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాను. దీని వెనక ఉన్న కుట్రను ఛేదించి నా పరువు మర్యాదలు కాపాడాలి’ అని డీజీపీని కోరినట్లు ఆమె తెలిపారు. -
ప్రశాంతంగా పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగిందని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీ (శాంతి భద్రతలు) జితేందర్తో కలసి మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి అలజడి లేకుండా 33 జిల్లాల్లో పోలింగ్ ఓటింగ్ జరిగిందని చెప్పారు. 9 కమిషనరేట్లు, అన్ని జిల్లాల్లో ఒక్క హింసాత్మక ఘటన కూడా నమోదు కాలేదని వెల్లడించారు. ఎన్నికల సంఘం అధికారులతో కలసి సమన్వయంతో పని చేశామని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసిందని, ఈవీఎం మెషన్లను తరలింపు, వాటిని భద్రపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పోలీసులు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలన్నింటినీ జిల్లా కేంద్రాల నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించినట్లు చెప్పారు. సమన్వయంతో పనిచేశాం.. రాష్ట్రవ్యాప్తంగా 18,526 ప్రాంతాల్లో 34,603 పోలింగ్స్టేషన్ల పరిధిలో 85 వేల మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొన్నారన్నారు. నిజామాబాద్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామని వివరించారు. పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా జరగడంలో పోలీసు శాఖ సఫలమైందని తెలిపారు. అన్ని లోక్సభ సెగ్మెంట్లలో ఐజీలు, డీఐజీ, ఎస్పీలు, కమిషనర్లు కీలకంగా వ్యవహరించారన్నారు. వీరంతా అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) జితేందర్ ఆధ్వర్యంలో సమన్వయంతో పనిచేశారని చెప్పారు. ప్రజలంతా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ పోలింగ్ సజావుగా ముగిసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి హింస జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కమాండ్ కంట్రోల్ నుంచి.. లోక్సభ ఎన్నికల ప్రక్రియను డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని జిల్లాల పరిస్థితిని డీజీపీ మహేందర్రెడ్డి పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్ సాగినంత సేపు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నికల సంఘం మీడియా మానిటరింగ్ విభాగం నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికçప్పుడు పరిష్కరించారు. పోలింగ్ అనంతరం ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్రూంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు కేంద్ర పోలీసు బలగాలతో స్ట్రాంగ్రూంల వద్ద పహారా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
సైబర్ ప్రపంచంలో అప్రమత్తతే శ్రీరామరక్ష
సాక్షి, హైదరాబాద్: సైబర్ ప్రపంచంలో అప్రమత్తతే శ్రీరామరక్ష అని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో సైబర్ రక్షక్ సైనికుల ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో అన్నీ డిజిటలైజ్ అయ్యాయని, ప్రస్తుతం మనమంతా ప్రతీ పనికి ఇంటర్నెట్పై ఆధారపడుతున్నామని అన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహిళలు చిన్నారుల రక్షణకు నగరంలో ప్రారంభించిన షీ టీమ్స్ మంచి ఫలితాలనివ్వడంతో రాష్ట్రమంతా విస్తరించామని గుర్తుచేశారు. సైబర్ నేరాలపై ఎండ్ నౌ స్వచ్ఛంద సంస్థ సైబర్ రక్షక్ల చేత సమాజాన్ని చైతన్య పరచడం అభినందనీయమన్నారు. యువత, తల్లిదండ్రుల్లో మార్పు కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎండ్ నౌ వ్యవస్థాపకులు అనిల్ రాచమల్ల, ఇతర సభ్యులను అభినందించారు. అంతకుముందు జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ జితేంద్ర, ఐజీ స్వాతీ లక్రా, ఎస్పీ (సీఐడీ) సుమతి తదితరులు సైబర్ నేరాల నియంత్రణ, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రసంగించారు. అనంతరం సైబర్ రక్షక్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. -
మహిళల కోసం ‘సైబర్ రక్షక్’
సాక్షి, హైదరాబాద్ : మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సైబర్ రక్షక్’ కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యింది. ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మహేందర్రెడ్డి సైబర్ రక్షక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరాల్లో మహిళల భద్రత కోసం సైబర్ రక్షక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. సైబర్ క్రైమ్ని అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురయ్యే మహిళలకు భరోసా ఇవ్వడం కోసం రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామ’ని తెలిపారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. ‘మహిళా రక్షణ కోసం 2014లో షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన ‘సైబర్ రక్షక్’.. సైబర్ మోసాల బారిన పడకుండా తోడ్పడతుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు, పాఠశాలల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తాం. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ రక్షక్ బృందాలుగా నియమిస్తాం. తెలంగాణను సైబర్ క్రైం ఫ్రీ స్టేట్గా చేయడమే మా టార్గెట్’ అని తెలిపారు. -
డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్ కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న డీజీపీ మహేందర్రెడ్డి, ఇద్దరు ఎస్పీలు రంగనాథ్, రెమా రాజేశ్వరిలకు హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందు జరుగుతున్న కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ రద్దు కావడంతో సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను ధర్మాసనం మూసివేసిందని, అయినప్పటికీ సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ముందుకెళుతున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ డీజీపీ, ఇద్దరు ఎస్పీలు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన ఇదే ధర్మాసనం, సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలిపేసిందని వివరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లకు భద్రతను పునరుద్ధరించాలన్న ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంతో అటు డీజీపీ, ఇటు ఇద్దరు ఎస్పీలను కోర్టు ధిక్కార కేసులో ప్రతివాదులుగా చేరుస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత కోర్టు ధిక్కారం కింద వీరికి నోటీసులు కూడా జారీ చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కేసులో మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఒక్కరే స్టే పొందాల్సి ఉంది. -
రేవంత్ నిర్బంధ వీడియో ఫుటేజీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిని నిర్బంధంలోకి తీసుకున్న రోజు చిత్రీకరించిన మొత్తం వీడియో ఫుటేజీని తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ వీడియోలోని మాటలను ఇంగ్లిష్లో సబ్టైటిల్స్లో ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్రెడ్డిని అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ రేవంత్రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై అప్పట్లో విచారణ జరిపిన జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం.. పోలీసులపై నిప్పులు చెరిగింది. డీజీపీ మహేందర్రెడ్డి వ్యక్తిగత హాజరుకు సైతం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, అక్రమ నిర్బంధానికి పరిహారం చెల్లించే విషయంపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని ఆదేశించింది. ఎవరో చెప్పిన దాని ఆధారంగా పిటిషన్.. ఈ వ్యాజ్యాన్ని నరేందర్రెడ్డి ఎవరో చెప్పిన విషయాల ఆధారంగా దాఖలు చేశారని, అందువల్ల దీనికి విచారణార్హత లేదని ప్రభుత్వం తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పారు. ఘటన జరిగిన రోజు ఘటనాస్థలిలో నరేందర్రెడ్డి లేరని చెప్పారు. రేవంత్ నిర్బంధంపై ఆయన కుటుంబసభ్యులకు లేని అభ్యంతరం పిటిషనర్కు ఎందుకో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. స్నేహితుడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని తాను చెప్పట్లేదని, అయితే కుటుంబసభ్యులు కోర్టుకు రాకుండా, ఎవరో చెప్పిన విషయాల ఆధారంగా నరేందర్రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంపైనే తమకు అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. రేవంత్ను కొద్ది గంటల పాటే నిర్బంధించారు. ఆ తర్వాత ఆయనను విడిచిపెట్టామని తెలిపారు. హెబియస్ కార్పస్ ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే పిటిషనర్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. రేవంత్ నిర్బంధం విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, నిర్బంధంలోకి తీసుకునే ముందు నోటీసు ఇచ్చినా రేవంత్ సతీమణి గీతారెడ్డి నోటీసు తీసుకునేందుకు నిరాకరించారని, అయితే అతని అనుచరుడు అంజి నోటీసు తీసుకున్నారని చెప్పారు. రేవంత్ బలమైన నాయకుడు.. ప్రభుత్వం దృష్టిలో రేవంత్రెడ్డి చాలా బలమైన నాయకుడని, ఆ విషయం అందరికీ తెలుసని, అందుకే ఆయన విషయంలో ముందస్తు చర్యలు తీసుకున్నారని రోహత్గీ పేర్కొన్నారు. రేవంత్రెడ్డి నిర్బంధం విషయాన్ని అప్పటి ఎస్పీ అన్నపూర్ణ పైఅధికారులతో పాటు రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారికి కూడా తెలియజేశారన్నారు. వారి ఆదేశాల మేరకే ఆమె రేవంత్ విషయంలో చర్యలు తీసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సభను బహిష్కరిస్తామంటూ రేవంత్ ప్రకటన చేశారని, దీని వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకుంటే అప్పుడు కూడా వారినే నిందించే వారని తెలిపారు. ఇలాంటి కేసుల్లో పరిహారం చెల్లించాల్సిన అవసరమే లేదన్నారు. మొత్తం ఫుటేజీ ఇవ్వండి.. ఈ సమయంలో వీడియోగ్రఫీ తాలూకు సీడీ గురించి చర్చకొచ్చింది. ఆ సీడీని కోర్టు ముందుంచుతామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ చెప్పారు. దీనిపై రేవంత్ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి అభ్యంతరం చెబుతూ.. పోలీసులు ఇచ్చే సీడీలను పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. వారు తమ వాదనలకు బలం చేకూర్చేలా ఎడిట్ చేసిన సీడీలు ఇస్తారని, దీనివల్ల తమకు నష్టం కలుగుతుందన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, తమకు మొత్తం వీడియో ఫుటేజీ సీడీ సమర్పించాలని, ఆ సీడీలోని మాటలను ఇంగ్లిష్ సబ్టైటిల్స్తో ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసులపైకి కుక్కలు వదిలారు.. పోలీసులు మర్యాద గా వ్యవహరించారని, రేవంత్రెడ్డి అనుచరులే దురుసుగా వ్యవహరించారన్నారు. పోలీసులపైకి కుక్కలను వదిలారన్నారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీయించామని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. పోలీసు అధికారి నగేశ్ ఇచ్చిన సమాచారం కారణంగా రేవంత్ను నిర్బంధంలోకి తీసుకున్నామని చెబుతున్నారు. మరి ఆయన ఇచ్చిన నివేదికపై తేదీ, సమయం, సీల్ లేవు. దాన్ని ఎలా విశ్వాసంలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఎవరైనా అలాంటిది ఇచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని విస్మరించరాదని, ఇలాంటి వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేసింది. రోహత్గీ స్పందిస్తూ.. మనమంతా ఏసీ రూముల్లో కూర్చొని చాలా చెబుతుంటామని, క్షేత్రస్థాయిలో పోలీసులు భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని రేవంత్ నిర్బంధానికి ఈ వాదన ఎంత మాత్రం సమర్థనీయం కాదంది. -
వన్ సిటీ–వన్ సర్వీస్
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సాంకేతికంగా వేరైనా ప్రజల దృష్టిలో మాత్రం ఒకటే. ఈ నేపథ్యంలోనే ఈ మూడింటిలో ఏకరూప పోలీసింగ్ ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయి అధికారుల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యమనే ఉద్దేశంతో గురువారం రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు. శంషాబాద్, సౌత్, ఎల్బీనగర్ జోన్లకు చెందిన దాదాపు 50 మంది అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్నాళ్ల క్రితం డీజీపీ మహేందర్రెడ్డి పిలుపు ఇచ్చిన ‘యూనిఫాం సర్వీస్ డెలివరీ... వన్ సిటీ–వన్ సర్వీస్–వన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది సిటిజన్’ అంశాన్ని సాకారం చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రజలు ప్రశాంత జీవనంతో పాటు నేర రహిత సమాజాన్ని, పోలీసుల నుంచి జవాబుదారీతనంతో కూడిన మెరుగైన సేవలను కోరుకుంటారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలంటే మూడు కమిషనరేట్ల అధికారుల మధ్య సమన్వయం అవసరమని భావిస్తున్నారు. ఈ మూడింట్లోనూ ఏ కమిషనరేట్కు చెందిన నేరగాళ్లు, అసాంఘికశక్తులపై వారే షీట్లు తెరిచి పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో వీరిపై నిఘా పక్కాగానే ఉంటున్నప్పటికీ మిగిలిన రెండు చోట్ల సాధ్యం కావట్లేదు. ఫలితంగా ఒక కమిషనరేట్కు చెందిన నేరగాడు మరోచోట నేరం చేసి తన స్వస్థలానికి చేరుకుంటున్నాడు. ఓ కమిషనరేట్కు చెందిన వ్యక్తి మరో ప్రాంతంలో సమస్యాత్మకంగా మారితే అతడికి సంబంధించిన సమాచారం అక్కడికే పరిమితం అవుతోంది. అలాగే ఓ కమిషనరేట్లో వాంటెడ్గా ఉన్న నేరగాడు మరో ప్రాంతంలో తలదాచుకున్నా పట్టుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్యలన్నింటికీ సమన్వయలేమి కారణమనే అభిప్రాయానికి వచ్చిన సైబరాబాద్ అధికారులు చక్కదిద్దే చర్యల్లో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించిన అధికారులు కీలక సమాచార మార్పిడి చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు సమన్వయం అంశంపై కసరత్తు చేయాలని, ఆపై మరోసారి సమావేశమై ఇబ్బందుల్ని అధిగమించి ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు. -
పోలీసుల్ని ప్రజలకు దగ్గర చేశాం
సాక్షి, హైదరాబాద్: దండనీతిని పక్కనబెట్టి, ప్రజలకు పోలీసులను చేరువ చేయగలిగామని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. హైదరాబాద్ నేరెడ్మెట్లో నూతనంగా నిర్మించిన రాచకొండ కమిషనరేట్ను డీజీపీ మహేందర్రెడ్డి, కమిషనర్ మహేశ్ భగవత్, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు పోలీసు ఠాణాకు రావాలంటే.. జనాలు జంకేవారు. నేడు పోలీసులను మిత్రులుగా భావించి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. ఇటు నేరాల్ని నియంత్రించడంలో తెలంగాణ పోలీసులు గణనీయమైన పురోగతి సాధించారు. రాచకొండ కమిషనరేట్ను రూ.5.1 కోట్లతో కేవలం 18 నెలల కాలంలో పూర్తి చేయడం గొప్ప విషయం. భవిష్యత్లో ప్రజలకు సేవలు మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు చేపడతాం. ఏ రాష్ట్రానికైనా శాంతి భద్రతలే కీలకం. అందుకే సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. రూ.700 కోట్లు కేటాయించి గస్తీకి పెద్దపీట వేశారు. దేశంలోనే తెలంగాణ పోలీసుల పనితీరు నంబర్ వన్గా ఉంది. ఇటీవల కేరళ సీఎం వచ్చి పంజగుట్ట పోలీస్ ఠాణాను సందర్శించి ప్రశంసించడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే 18 వేల ఖాళీలు భర్తీ చేస్తాం. రాచకొండ కమిషనరేట్ దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్. 13 నియోజకవర్గాలు, 3 జిల్లాల్లో విస్తరించి ఉన్న కమిషనరేట్లో మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, పోలీసులు సమన్వయం పనిచేసి మంచిపేరు తేవాలి..’అని ఆశాభావం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు.. పోలీసుల రికార్డులను భద్రపరిచేందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్ భవనంలో మొదటిసారిగా ఆటోమేటెడ్ రికార్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏఆర్ఎమ్ఎస్) సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చారు. పుణేలోని టెక్–మార్క్ ఆటోమేషన్ సంస్థ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది. కానిస్టేబుల్ నుంచి కమిషనర్‡ వరకు.. అందరి సర్వీసు బుక్లు, పాలనా రికార్డులన్నీ ఏఆర్ఎంఎస్లో భద్రపరుస్తారు. రికార్డుల పూర్తి వివరాలను పీడీఎఫ్ రూపంలో సాఫ్ట్ కాపీని ఏఆర్ఎమ్ఎస్లోని కంప్యూటర్లో, ఆటోమేటిక్గా పనిచేసే ర్యాక్లో మ్యాన్యువల్ రికార్డులను ఉంచుతారు. అగ్నిప్రమాదం సంభవించినా, నీళ్లు పడినా ఎలాంటి నష్టం సంభవించకపోవడం ఈ ఏఆర్ఎంఎస్ ప్రత్యేకత. ఏఆర్ఎమ్ఎస్లో రికార్డులను పరిశీలించేందుకు కమిషనరేట్ కార్యాలయంలో పరిపాలనా విభాగం ముఖ్య అధికారులకు ప్రత్యేక పాస్వర్డ్లు, యూజర్ ఐడీలను కేటాయించి, ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజల హృదయాలు గెలుచుకోవాలి: డీజీపీ పోలీసులు మెరుగైన పనితీరుతో ప్రజల మనసులు గెలుచుకోవాలని డీజీపీ మహేందర్ అన్నారు. ‘సీఎం కేసీఆర్ ఆశయాలను సాధించడంలో తెలంగాణ పోలీసులు సఫలీకృతులయ్యారు. నగరంలో శాంతి భద్రతలకు సీఎం పెద్దపీట వేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రవేశపెట్టి, 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇందుకోసం పేద, ధనిక వర్గాలు ముందుకు రావడం అభినందనీయం. కేవలం గస్తీకే రూ. 350 కోట్లతో 11 వేల వాహనాలను సీఎం పోలీసుశాఖకు కేటాయించారు. ఈ కమిషనరేట్ ఏర్పాటు వల్ల సైబరాబాద్పై భారం తగ్గుతుంది’ అని వ్యాఖ్యానించారు ఏఆర్ఎమ్ఎస్తో క్షణాల్లో రికార్డులు: సీపీ కేవలం 18 నెలల్లోనే కమిషనరేట్ను పూర్తి చేసినందుకు టీఎస్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ఎండీ మల్లారెడ్డికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘దేశంలో ఎక్కడాలేని విధంగా ఏఆర్ఎమ్ఎస్ను ఇక్కడ ప్రవేశపెట్టాం. దీని సాయంతో అన్ని రికార్డులను క్షణాల్లో చూడొచ్చు. మేడిపల్లి వద్ద ప్రభుత్వం కమిషనరేట్కు 50 ఎకరాలు, యాదగిరిగుట్ట వద్ద పోలీసు శిక్షణ కేంద్రానికి మరో 36 ఎకరాలు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు’ అని అన్నారు. -
‘అప్పుడేమో విరక్తితో.. ఇప్పుడు వేధింపులతో..’
సాక్షి, హైదరాబాద్ : నిర్మల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత సట్వాజి అలియాస్ సుధాకర్, అతని భార్య వైదుగుల అరుణ అలియాస్ నీలిమ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 1983 నుంచి 1985 వరకు సుధాకర్ ఆదిలాబాద్లో కొరియర్గా పనిచేసినట్లు తెలిపారు. అనంతరం డీసీఎస్ కనకం సుదర్శన్ సహకారంతో మావోయిస్టుల్లో చేరినట్లు పేర్కొన్నారు. ‘బెంగళూరు కేంద్రంగా సుధాకర్ ఆయుధాలు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో ఒకసారి జైలుకు వెళ్లాడు. అక్కడే సుధాకర్కు వరవరరావు పరిచయం అయ్యారు. 1990 నుంచి సుధాకర్ అఙ్ఞాతంలోకి వెళ్లి 1992-94 మధ్య మావోయిస్టు దళ సభ్యుడిగా పనిచేశాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవుల్లో పనిచేశాడు. 2003 నుంచి 2013 వరకు స్టేట్ మిలటరీ కమిషన్ సభ్యుడిగా... 2014 నుంచి 2019 వరకు కేంద్ర కమిటీ సభ్యుడిగా... మిలటరీ కమిషన్ సభ్యుడిగా బిహార్, జార్ఖండ్ కేంద్రంగా పనిచేశాడు’ అని సుధాకర్కు సంబంధించిన విషయాలు డీజీపీ వెల్లడించారు. (చదవండి : కొరియర్ నుంచి కేంద్ర కమిటీ దాకా) బాల్య వివాహం కారణంగా విరక్తితో.. సుధాకర్ భార్య అరుణ(43) వరంగల్ జిల్లాకు దుగ్గొండి చెందిన వారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బాల్య వివాహం కారణంగా విరక్తి చెందిన ఆమె.. దళ సభ్యుల పాటలకు ఆకర్షితురాలై దళంలో చేరినట్లు పేర్కొన్నారు. ‘మావోయిస్టులైన అనేక మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడి వేధింపుల కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్లు ఆమె చెప్పారు. సట్వాజీ మీద పేరు మీద రూ. 25 లక్షల రివార్డు ఉంది. అతడి భార్య పేరు మీద రూ. 10 లక్షల రివార్డు ఉంది. వారిద్దరి పేరుతో ఉన్న ఈ రివార్డును వారికి అందజేస్తాము’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని.. కాబట్టి మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం గడపాలని డీజీపీ పిలుపునిచ్చారు. (చదండి : లొంగుబాటలో) కాగా నిర్మల్లోని సారంగాపూర్ మండలానికి చెందిన సుధాకర్ ఇంటర్లోనే రాడికల్ స్టూడెంట్స్ నాయకుల ప్రభావంతో మావోయిస్టు కొరియర్గా చేరారు. పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర పోషించి కీలక నేతగా ఎదిగారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ, సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్- జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరించిన సుధాకర్పై కోటి రూపాయల రివార్డు(జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది) కూడా ఉంది. దళంలోనే పరిచయమైన నీలిమ అలియాస్ మాధవిని ఆయన పెళ్లిచేసుకున్నారు. కాగా తన తమ్ముడు నారాయణ రాంచీలో పోలీసులకు పట్టుబడటం, నిర్మల్ జిల్లా పోలీసులు తన తల్లి ద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్యతో సహా ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. -
మరికాసేపట్లో మీడియా ముందుకు సుధాకర్
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సట్వాజీ అలియాస్ సుధాకర్ను డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. జార్ఖండ్ మావోయిస్టు కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న సుధాకర్ భార్యతో సహా రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరికాసేపటల్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. (చదవండి : లొంగు‘బాట’లో..) కాగా నిర్మల్లోని సారంగాపూర్ మండలానికి చెందిన సుధాకర్ ఇంటర్లోనే రాడికల్ స్టూడెంట్స్ నాయకుల ప్రభావంతో మావోయిస్టు కొరియర్గా చేరారు. పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర పోషించి కీలక నేతగా ఎదిగారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ, సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్- జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరించిన సుధాకర్పై కోటి రూపాయల రివార్డు(జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది) కూడా ఉంది. దళంలోనే పరిచయమైన నీలిమ అలియాస్ మాధవిని ఆయన పెళ్లిచేసుకున్నారు. కాగా తన తమ్ముడు నారాయణ రాంచీలో పోలీసులకు పట్టుబడటం, నిర్మల్ జిల్లా పోలీసులు తన తల్లి ద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్యతో సహా ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇంటర్లోనే ఆకర్షితుడై.. సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన దేవుబాయి, కాశీరాం దంపతుల పెద్ద కుమారుడు ఒగ్గు సట్వాజీ పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివారు. 1981–83 మధ్య ఇంటర్మీడియెట్ నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ) నాయకులతో సంబంధాలు కొనసాగించారు. వారి మాటలు, పాటలతో పాటు విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడయ్యారు. అప్పటి నుంచే ఆర్ఎస్యూ(అండర్గ్రౌండ్) కొరియర్గా, రాడికల్స్ ఆర్గనైజర్గా వ్యవహరించారు. 1984లో పూర్తిస్థాయిలో అడవి బాట పట్టి పీపుల్స్వార్లో చేరి నక్సలైటుగా మారారు. జనంలోకి వచ్చి..మళ్లీ దళంలోకి.. పీపుల్స్వార్లో చేరిన రెండేళ్లకే కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో 1986లో కర్ణాటకలోని గుల్బర్గాలో సట్వాజీ పోలీసులకు చిక్కారు. 1989 చివరి వరకు జైలులోనే ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపుల్స్వార్పై నిషేధం ఎత్తివేయడంతో బయటకు వచ్చారు. అప్పుడు ఇంటి వద్దే ఉంటూ నిర్మల్లో భారీ స్తూపం నిర్మింపజేశారు. మళ్లీ ప్రభుత్వం నక్సల్స్పై నిషేధం విధించడంతో 1991నుంచి తిరిగి దళంలోకి వెళ్లారు. ఇక అప్పటి నుంచి ఆయన జనంలోకి రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ దళాల కమాండర్గా, జిల్లా కమాండర్గా కొనసాగారు. 2001 నుంచి రాష్ట్ర కమిటీలో చేరి దండకారణ్య మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అక్కడి నుంచి కేంద్ర కమిటీకి, జార్ఖండ్ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతలకు వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు సింగరేణిలో జరిగిన దాదాపు అన్ని హింసాత్మక ఘటనల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతుంటారు. చెన్నూరు, జైపూర్, నీల్వాయి, కోటపల్లి తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఈయనపై కేసు లు ఉన్నాయి. దళంలోనే మూడున్నర దశాబ్దాలు సట్వాజీ దాదాపు మూడున్నర దశాబ్దాల తన జీవితాన్ని అజ్ఞాతంలోనే గడిపారు. 1998లోనే తండ్రి కాశీరాం చనిపోయినా ఇంటికి రాలేదు. తమ్ముళ్లు నారాయణ, రామన్నలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్లు కాల్వ పోసవ్వ, దాసరి పోసవ్వలకు పెళ్లిళ్లయ్యాయి. తల్లి దేవుబాయి ఒక్కరే సారంగపూర్లో ఉంటున్నారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన ఆమెను నిర్మల్ ఎస్పీ శశిధర్రాజు, ఏఎస్పీ దక్షిణామూర్తి స్వయంగా ఆమె వద్దకు వెళ్లి పలకరించారు. తన అన్నను కలసి వస్తుండగా సట్వాజీ తమ్ముడు నారాయణ మరో వ్యక్తితో కలసి 2017 ఆగస్టులో రాంచీ రైల్వేస్టేషన్లో పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరగడం, పార్టీలో అంతర్గత సంక్షోభాల కారణంగా సుధాకర్ రాంచీలో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. కేంద్ర కమిటీ దాకా ఎదిగి.. పీపుల్స్వార్ (మావోయిస్టు పార్టీ)లో తెలంగాణ నుంచి ఎదిగిన కీలక నేతల్లో సట్వాజీ అలియాస్ సుధాకర్ కూడా ఉన్నారు. రాష్ట్ర కమిటీ కొరియర్గా పని ప్రారంభించిన సట్వాజీ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి దాకా ఎదిగారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం జిల్లా కమాండర్ (కార్యదర్శి)గా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ సభ్యుడయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ దండకారణ్యంలో మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం 2013 నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తూనే సెంట్రల్ మిలటరీ సభ్యుడిగా, బిహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. -
చైల్డ్ఫ్రెండ్లీ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: అఘాయిత్యాల బారినపడిన చిన్నారులకు సత్వర న్యాయం అందించడానికి దేశంలోనే తొలిసారిగా నగరంలో ఏర్పాటైన చైల్డ్ఫ్రెండ్లీ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తిని కేటాయించనున్నారు. ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తులు పోలీసు ఉన్నతాధికారులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. హాకా భవన్లో ఉన్న ఈ కోర్టును సందర్శించిన హైకోర్టు సీజే జస్టిస్ రాధాకృష్ణన్, ఇతర న్యాయమూర్తులు పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల విచారణ వేగంగా పూర్తి కావాలంటే ప్రత్యేక న్యాయమూర్తి అవసరమన్న పోలీసుల ప్రతిపాదనపై సీజే సానుకూలంగా స్పందించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బృందం చైల్డ్ఫ్రెండ్లీ కోర్టుతో పాటు భరోసా కేంద్రం, షీ–టీమ్స్ను సందర్శించింది. ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, కొత్వాల్ అంజనీకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
‘పీడీ’కిలి బిగిసింది
రాష్ట్రంలో క్రైమ్రేటు తగ్గుదలలో పీడీ యాక్ట్ బాగా ఉపకరించింది. సాధారణ దొంగలు, రౌడీషీటర్లు, పదే పదే లైంగిక వేధింపులకు గురిచేస్తున్నవారు తదితర నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనివల్ల వ్యవస్థీకృత నేరాల్లో తగ్గుదల కనిపించినట్టు డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. పీడీ యాక్ట్ కింద కేసులు మోపబడిన వారు చేసే నేరాల్లో గతేడాదికి ఇప్పటికీ 37% క్రైమ్ రేటు తగ్గుదల కనిపించిందని వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2018 డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,199 మంది నేరస్థులపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. – సాక్షి, హైదరాబాద్ ఒత్తిడి ఉన్నా తగ్గేది లేదు... ఈ మొత్తం నేరాల్లో కొంతమంది రాజకీయ నాయకుల అనుచరులు కూడా ఉండటంతో వారిపై పీడీ యాక్ట్ అమలు చేయకుండా పోలీస్శాఖపై మొదట్లో ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదేశాలతో పోలీస్ ఉన్నతాధికారులు కేసుల నమోదుకు వెనుకాడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరాల నియంత్రణలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదన్న వైఖరితో పీడీ యాక్ట్ అమలు చేశారు. పీడీ యాక్ట్ మోపబడినవారిలో ముగ్గురు లైంగిక వేధింపులకు గురిచేసిన వారుండటం సంచలనం రేపుతోంది. షీ టీమ్స్ ద్వారా ఈవ్టీజింగ్, లైంగిక వేధింపుల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్శాఖ చర్యలు చేపడుతోంది. మొదటిసారి పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇస్తుండగా, రెండోసారి పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. మూడోసారి పట్టుబడితే ఏకంగా కేసు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నారు. ఇన్ని చేసినా నాలుగోసారి పట్టుబడుతున్న వారిని పీడీ యాక్ట్కు సిఫారసు చేసినట్టు స్పష్టమవుతోంది. పదే పదే అదే నేరానికి పాల్పడితే ఉపేక్షించకుండా పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని ఐజీ స్వాతి లక్రా స్పష్టం చేశారు. నేరాలను బట్టి చూస్తే... రౌడీషీటర్లు–129, బూట్ లెగ్గర్– 18, అనైతిక కార్యకలాపాల నేరాలు–67, డ్రగ్ సరఫరా నేరస్థులు–42, మోసపూరిత వ్యక్తులు–62, పీడీఎస్ బియ్యం దొంగలు–17, మత ఘర్షణ, సంబంధిత నేరస్థులు– 2, డెకాయిటీస్–13, రాబరీ నేరస్థులు–55, దోపిడీ దొంగలు–202, చైన్స్నాచర్లు–122, దృష్టి మరల్చే దొంగలు–98, గూండాలు–34, లైంగిక వేధింపుల నిందితులు–3, ఆర్థిక నేరస్థులు–15, వాహనాల దొంగలు–2, ఇతర సాధారణ నేరస్థులు–57.. మొత్తం 1,199 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. అటవీ శాఖ కూడా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిపై అటవీశాఖ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్రమ కలప రవాణాతో ముడి పడిన వివిధ అంశాలపై జిల్లాల్లో పోలీసు అధికారు లతో కలిసి అటవీశాఖ సంయుక్తంగా అమలుచేస్తున్న కార్యా చరణ కారణంగా ఇప్పటికే 200 కేసులకు పైగా నమోదు చేశారు. వివిధ జిల్లాల్లో దాదాపు రూ. 40–50 లక్షల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా కలప స్మగ్లింగ్కు పాల్పడుతున్న 500మంది బడా స్మగ్లర్లను అటవీ అధి కారులు గుర్తించారు. కలప అక్రమ రవాణాపై సాగిస్తున్న ప్రత్యేక కార్యాచరణను ఈ నెలాఖరు వరకు కొనసాగించ నున్నట్లు ప్రభుత్వవర్గాల సమాచారం. ఆ తర్వాత కూడా నిరంతర నిఘా కొనసాగుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా వారిపై పీడీయాక్ట్ సహా కఠినమైన చట్టాల ప్రయోగానికి ఆ శాఖ సిద్ధమవుతోంది. కఠిన శిక్షలు అమలు..: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా ఆదిలాబాద్, నాగర్కర్నూలు తదితర జిల్లాల్లో దాదాపు 20 మంది స్మగ్లర్లపై పీడీయాక్ట్ ప్రయోగానికి అనువుగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు, మూడురోజుల వ్యవధిలోనే పలువురిపై పీడీయాక్ట్ కింద కేసు నమోదుచేసి, ఏడాదిపాటు బెయిల్ దొరకని విధంగా శిక్ష విధించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. స్మగ్లింగ్కు పాల్పడుతున్న వారిపైనే కాకుండా వారి వెనక ఉండి ప్రోత్సహించే వారిని కూడా పీడీ యాక్ట్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. కలప స్మగ్లింగ్ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు పీసీసీఎఫ్ (విజిలెన్స్) రఘువీర్ సాక్షికి తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా నిరంతర నిఘాతోపాటు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
సదా మీ సేవలో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసుశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ప్రజలకు మరింతగా అందించాల్సిన సేవలు, ప్రజలు కోరుకుంటున్న అంశాల ప్రాతిపదికగా ‘కమ్యూనిటీ ఫెల్ట్ నీడ్స్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యాచరణపై డీజీపీ మహేందర్రెడ్డి ఇప్పటికే కమిషనర్లు, ఎస్పీలు, జోన్ల డీసీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత పోలీసింగ్ సేవలు, సర్వీస్ డెలివరీ వేగవంతం, అంకితభావ సేవలపై సూచనలు చేశారు. దీంతో పోలీసుశాఖ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో ప్రజలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేపట్టింది. ప్రతిపాదనల రూపంలో... రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి స్వీకరించే సూచనలు, అంశాలు, ఫిర్యాదులపై పైస్థాయి అధికారులు నివేదిక అందించాలని పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతి గ్రామం నుంచి జిల్లా హెడ్క్వార్టర్స్ వరకు ఉన్న ప్రధాన సమస్యలు, కావాల్సిన సేవలపై రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ఆయా నివేదికలపై చర్చించనున్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలున్నాయో వాటి పరిష్కారానికి కావల్సిన చర్యలను తిరిగి కింది స్థాయి అధికారులు, సిబ్బందికి సూచించనున్నారు. దీనివల్ల ప్రజల్లో పోలీసుశాఖపై నమ్మకం పెరగడంతోపాటు సిబ్బంది సైతం అంకితభావ సేవలు అందించేందుకు ఇది ఫీడ్ బ్యాక్ విధానంగా కూడా ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత నుంచి 15 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఠాణాల నుంచి జిల్లాల వరకు మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుంచి సర్కిల్ లెవల్, అర్బన్ లెవల్, జిల్లా హెడ్క్వార్టర్స్ లెవల్లో ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతాల్లో కాలనీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, యూత్ వింగ్లతో 15 రోజులపాటు ‘కమ్యూనిటీ ఫెల్ట్ నీడ్స్’పై సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారంలో పోలీసుల నుంచి కావాల్సిన సహాయ సహకారాలపై ప్రజల నుంచి సూచనలు కోరనున్నారు. భద్రత, రక్షణ వ్యవహారంలో ఇంకా ఎలాంటి సేవలు, కార్యక్రమాలు కావాలనుకుంటున్నారో సలహాలు స్వీకరించబోతున్నారు. ఈ మేరకు గత మూడు రోజుల నుంచి అన్ని జిల్లాల్లో ఎస్పీలు, కమిషనర్లు కిందిస్థాయి సిబ్బందితో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీ/ఏసీపీలు ఈ కార్యక్రమాలపై సూచనలు అందిస్తున్నారు. -
కొత్త ఏడాదికి ప్రశాంతంగా స్వాగతం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ... ఈ ‘ముగ్గురు పోలీసులు’ఏర్పాటు చేసిన బందోబస్తు, విధించిన ఆంక్షలు ఫలితాలనిచ్చాయి. కొత్త సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి. మొత్తమ్మీద ఒక్క ప్రమాదం కూడా నమోదు కాకుండా జీరో యాక్సిడెంట్ నైట్గా చేయడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. స్థానిక పోలీసులతోపాటు అదనపు బలగాలూ సోమవారం రాత్రంతా విధుల్లోనే ఉన్నాయి. నగరంలోని కీలక ప్రాంతాలతోపాటు ఇన్నర్/ఔటర్ రింగ్ రోడ్లోనూ నిరంతరం ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం తదితర ఉల్లంఘనలపై ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించారు. మొత్తమ్మీద మూడు కమిషనరేట్లలోనూ కలిపి 2,074 కేసులు నమోదయ్యాయి. గతంలో జరిగిన ప్రమాదాలు, ఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసేశారు. ప్రత్యామ్నాయ మార్గంలేని కారణంగా బేగంపేట, డబీర్పుర వంటి కొన్ని ఫ్లైఓవర్లకు మాత్రం మినహాయింపునిచ్చారు. నెక్లెస్రోడ్, ఎన్టీఆర్ మార్గ్లతోపాటు హుస్సేన్సాగర్ చుట్టుపక్కల వాహనాలు అనుమతించలేదు. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వేలోనూ కొన్ని ఆంక్షలు కొనసాగాయి. కమిషనరేట్లలోని ప్రధాన రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటుచేసిన అధికారులు వాహనచోదకుల వేగాన్ని నియంత్రించారు. పోలీసులు, ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యల ఫలితంగా డిసెంబర్ 31 ప్రశాంతంగా పూర్తయింది. ఐటీ కారిడార్లోనూ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ పోలీసుస్టేషన్ల పరిధిలో తనిఖీలు చేయగా 263 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో 89 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, 53 కార్లను సీజ్ చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 20 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, 33 కార్లు సీజ్ చేశారు. మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో 38 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, 20 కార్లు, ఒక డీసీఎంను సీజ్ చేశారు. వాహనాలు నడిపిన వారందరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నారు. తాగేశారు... తోలేశారు! పోలీసు విభాగం ఎన్ని సూచనలు చేసినా, ఎంతగా హెచ్చరించినా మందుబాబులు మాత్రం మారలేదు. డిసెంబర్ 31 నేపథ్యంలో సోమవారం రాత్రి మద్యం తాగి అనేక మంది వాహనాలు నడిపేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కమిషనరేట్లు, ఓ జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 2,259 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,219 మంది చిక్కారు. సిటీ ట్రాఫిక్ పోలీసులు మొత్తం 22,543 వాహనాలను తనిఖీ చేశారు. వీరిలో ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువ మంది ఉన్నారు. డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు ‘న్యూ ఇయర్ డే’ను జీరో యాక్సిడెంట్ నైట్గా చేయడానికి పటిష్ట ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,259 మంది మందుబాబుల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి కుటుంబ సభ్యులు లేదా సంరక్షకుడి సమక్షంలో మంగళ–బుధవారాల్లో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆపై వీరిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. -
నేరాలపై సీసీటీవీ కన్ను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది నేరాలు తగ్గాయని, గతేడాది కంటే క్రైమ్ రేటు పరంగా 5% తగ్గిందని డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడించారు. ప్రభు త్వం ఇస్తున్న తోడ్పాటు, ప్రజలందిస్తున్న సహకారం తో 2018 పోలీస్ శాఖకు కలిసొచ్చిందని.. ఇదే పద్ధ తిలో భవిష్యత్లో అనేక విజయాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణలో కీలక ఆధారాలుగా మారుతున్న సీసీ కెమెరాల ఏర్పాటును వచ్చే మూడేళ్లలో జిల్లాల్లోనూ విస్తృతం చేస్తున్నట్టు డీజీపీ తెలిపారు. హైదరాబాద్లో ని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఈ ఏడాది పోలీసు శాఖ సాధించిన ఫలితాలు, 2019లో సాధించాల్సిన అంశాలపై డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడించారు. విజిబుల్ పోలీసింగ్లో విజయవంతం: రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖకు అందుబాటులోకి వచ్చిన నూతన పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోట్స్ బైక్ల ద్వారా ప్రజల్లో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం సక్సెస్ అయ్యిందన్నారు. ప్రతీ మారుమూల ప్రాంతంలోని పోలీస్స్టేషన్కు సైతం ఒక అత్యాధుని క పెట్రోలింగ్ వాహనం, రెండు బ్లూకోట్స్ వాహనా లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అర్బన్ పోలీస్స్టేషన్లలో రెండు పెట్రోలింగ్ వాహనాలు, 4–6 బ్లూకోట్స్ వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చి గల్లీల్లో గస్తీని విస్తృతపరిచామన్నారు. అదే విధంగా పాస్పోర్టు దరఖాస్తు చేసుకున్నవారి విచారణ కోసం 4లక్షల అప్లికేషన్లు వచ్చాయని.. వాటిని కేవలం 4 రోజుల్లో విచారించి ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి పంపించామన్నారు. ఇందుకుగానూ.. వరుసగా 4సార్లు ‘పాస్పోర్టు సేవా పురస్కార్’అవార్డు రాష్ట్ర పోలీస్ శాఖకు దక్కిందన్నారు. డయల్ 100కి కాల్ చేస్తే 8 నిమిషాల్లోనే.. పోలీస్ శాఖలో తీసుకొచ్చిన సాంకేతికత మార్పుల కారణంగా.. ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తున్నామని డీజీపీ స్పష్టంచేశారు. ఈ ఏడాది డయల్ 100 ద్వారా 8.5 లక్షల మంది వివిధ ఘటనలపై సమాచారం, ఫిర్యాదులిచ్చారన్నారు. ఇలా ఫిర్యాదులొచ్చిన ప్రాంతాలకు (పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో) సరాసరి 8 నిమిషాల్లో చేరుకుని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3–4నిమిషాల్లోపే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్నారని డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో టెక్నాలజీ యాప్స్ను వినియోగించినట్లు డీజీపీ తెలిపారు. టార్గెట్ 15లక్షల కెమెరాలు 15లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. 5లక్షల కెమెరాలను జిల్లాలు, ఇతర కమిషనరేట్లలో ఏర్పాటుచేయడంతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలోనూ మిగిలిన 10లక్షల సీసీకెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ సీసీటీవీలు అన్ని స్థాయిల్లోని పోలీసు అధికారులకు అందుబాటులో ఉండేలా ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అనుసంధానం చేస్తున్నామన్నారు. వీటి పర్యవేక్షణకు 4వేల మందికిపైగా శిక్షణ ఇచ్చినట్టు డీజీపీ తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు 3.91లక్షల కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాన నేరాల్లో తగ్గుదల రాష్ట్రంలో ఈ ఏడాది నేరాల్లో 5% తగ్గుదల కనిపించిందన్నారు. హత్యలు 4% తగ్గగా, ఆస్తులకోసం నేరాలు 8%, చైన్ స్నాచింగులు 43%, మహిళలపై నేరాలు 7%, సైబర్ నేరాలు 3%, ఆర్థిక నేరాలు 2% తగ్గాయన్నారు. చార్జిషీట్ నమోదైన కేసుల్లో శిక్ష శాతం సైతం పెరిగిందని మహేందర్ రెడ్డి వెల్లడించారు. జీవితఖైదు కేసుల్లో 11%, ప్రధాన నేరాల్లో 5%, ఇతర ఐపీసీ సెక్షన్ల కేసుల్లో 2% పెరుగుదల సాధించామన్నారు. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాల ద్వారా ఈ ఏడాది 6,019మంది చిన్నారులను కాపాడామని.. అందులో 3,390 మందిని తల్లిదండ్రులకు అప్పగించామని, 2,629 మందిని పునరావాస కేంద్రాలకు పంపించామన్నారు. సొత్తు చోరీ కేసుల్లో 69% రికవరీ చేశామన్నారు. 2018లో రూ. 149.56 కోట్ల సొత్తు చోరీ కాగా, రూ.102.69 కోట్ల సొత్తు రికవరీ చేశామని డీజీపీ తెలిపారు. కొత్త ఏడాది తొలి 15రోజులు ప్రజల్లోనే.. కొత్త సంవత్సరంలో పీపుల్స్ ఫ్రెండ్లీ సేవలను మరింత విస్తృతం చేస్తామని డీజీపీ తెలి పారు. గ్రామాలు, కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీలు, ఇలా అన్ని ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది పర్యటిస్తారని, ప్రజలతో సమావేశాలు ఏర్పాటుచేసి వారికి పోలీస్ శాఖా పరంగా కావాల్సిన సేవలేంటని తెలుసుకుంటా మని మహేందర్ రెడ్డి తెలిపారు. ఇలా మొదటి పదిహేను రోజుల్లో గుర్తించిన అవసరాలను సంవత్సరకాలంలో పరిష్కరిస్తామన్నారు. కొత్త సమస్యలు వస్తే వాటిని పరిష్కరించి ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై మరింత నమ్మకం పెరిగేలా చేసేందుకు ఈ కార్యాచరణ ఉపకరిస్తుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. -
తెలంగాణలో నేరాలు తగ్గాయి : డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేరాలు 5శాతం తగ్గాయని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరికి సేవలు అందిసుస్తున్నారని తెలిపారు. నేర రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హత్యలు 4శాతం, ఆస్తి తగాదాలు 8శాతం, మహిళలపై నేరాలు 7శాతం, సైబర్ నేరాలు 3శాతం తగ్గాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు అదుపుచేస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం జిల్లా కేంద్రాల్లో భరోసా సెంటర్లతో పాటు, రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 6012 మంది చిన్నారులను తెలంగాణ పోలీసులు కాపాడారని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 లక్షల సీసీ కెమెరాలు అమర్చేలా చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు. -
ఇకనేరుగా కోర్టులకు!
హైదరాబాద్: పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగానే క్షణాల్లో సంబంధిత కోర్టుకు ఆన్లైన్లో సమాచారం చేరనుంది. చార్జిషీట్ సైతం నిమిషాల్లో జడ్జి ముందు కన్పిస్తుంది. ఇలాంటి వ్యవస్థను న్యాయవ్యవస్థ దేశవ్యాప్తంగా ఇటీవల రూపొందించింది. ఇంటర్ ఆపరేటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్) పేరుతో నూతన ప్రాజెక్టును పోలీస్ శాఖ, న్యాయవ్యవస్థ మధ్య అనుసం«ధానంగా ప్రవేశపెట్టారు. ఈ ఐసీజేఎస్ను శనివారం ఈ వ్యవస్థ చైర్మన్ జస్టిస్ మదన్ బి.లోకూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్.. ఐసీజేఎస్ను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్న న్యాయవ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా రాష్ట్ర పోలీస్ను ఎంచుకుంది. ఇందులో భాగంగా వరంగల్ కమిషనరేట్లోని సుబేదారి పోలీస్స్టేషన్ను అనుసంధానం చేస్తూ జస్టిస్ మదన్ బి.లోకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోర్టు, పోలీసుల సమన్వయం ద్వారానే కేసులను త్వరితగతిన పరిష్కరించగలమని పేర్కొన్నారు. త్వరితగతిన కేసులను పరిష్కరించడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం కల్పించేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఐసీజేఎస్ రూపొందించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఎఫ్ఐఆర్ కాపీతో పాటు చార్జిషీట్లు కూడా పోలీస్ సిబ్బంది స్థానిక కోర్టుకు అందజేయడంతో పాటు సీసీ నంబర్లు, వారంట్లు, సమన్లను కూడా కోర్టు ద్వారా పోలీస్ సిబ్బంది పొందాలని సూచించారు. క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో తెలంగాణ ముందు నుంచీ మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకొచ్చిన టీఎస్కాప్ తదితర యాప్లు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. జవాబుదారీతనం పెరుగుతుంది: డీజీపీ ఐసీజేఎస్ వ్యవస్థతో పోలీస్స్టేషన్ల అనుసంధానం వల్ల పోలీసుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని డీజీపీ మహేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలో పైలట్ ప్రాజెక్టుగా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ను అనుసంధానించడం రాష్ట్ర పోలీస్ శాఖకు మరో మైలురాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జస్టిస్ మదన్ బి.లోకూర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టులో కీలకంగా పనిచేస్తున్న పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ అదనపు డీజీపీ రవిగుప్తా, వరంగల్ కమిషనర్, ఇతర అధికారులను డీజీపీ అభినందించారు.