EMI
-
హోమ్ లోన్ ఈఎంఐలు తగ్గుతాయ్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6.50 శాతంగా ఉన్న రెపో రేటును 6.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా ప్రకటించారు. దీని వలన వడ్డీ రేట్లు, ఈఎంఐలు తగ్గేందుకు ఆస్కారం కలిగింది.2019 అక్టోబర్ 1 తర్వాత మంజూరైన అన్ని రిటైల్ ఫ్లోటింగ్-రేట్ రుణాలు ఎక్స్టర్నల్ బెంచ్మార్క్తో అనుసంధానమై ఉంటాయి. చాలా సందర్భాలలో ఇదే రెపో రేటుగా ఉంటుంది. కాబట్టి రేటు తగ్గింపు గృహ రుణగ్రహీతలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలోని గృహ రుణాలలో ఎక్కువ భాగం ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. ఫలితంగా, వడ్డీ భారం, వాటి ఈఎంఐలు తగ్గుతాయి. దీంతో ఇంటి యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది.దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఆర్బీఐ రెపో రేటును తగ్గించింది. ఆర్బీఐ చివరిసారిగా 2020 మేలో రేట్లను తగ్గించింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అప్పట్లో రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. 2022 మే నుండి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలు, ప్రపంచ ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును ఏడు సార్లు 6.5 శాతానికి పెంచింది.హోమ్ లోన్ కస్టమర్లకు భారీ ప్రయోజనాలుప్రస్తుత రేట్ల తగ్గింపు వల్ల హోమ్ లోన్ కస్టమర్లకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో ఒక ఉదాహరణ ద్వారా ఇప్పుడు చూద్దాం.. ఒక సంవత్సరం క్రితం 9 శాతం వడ్డీ రేటు, 20 సంవత్సరాల కాలపరిమితి (240 నెలలు) తో రూ. 50 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నట్లయితే.. నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 44,986 ఉంటుంది. రుణ కాలంలో చెల్లించే అసలు, వడ్డీ మొత్తం కలిపి రూ. 58 లక్షలు అవుతుంది.ఇప్పుడు 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపుతో గృహ రుణ వడ్డీ రేటు 9 శాతం నుండి 8.75 శాతానికి తగ్గుతుంది. ఫలితంగా అసలు, వడ్డీ మొత్తం చెల్లింపు సుమారు రూ. 53.6 లక్షలకు తగ్గుతుంది. దీని వలన రూ. 4.4 లక్షలు ఆదా అవుతుంది. అలాగే రుణ కాలపరిమితి 230 నెలలకు తగ్గుతుంది. దీని వలన రుణాన్ని 10 నెలల ముందుగానే తిరిగి చెల్లించవచ్చు. -
లోన్ ఈఎంఐలు తగ్గనున్నాయా?.. శుభవార్త సిద్ధం!
రుణగ్రహీతలకు శుభవార్త సిద్ధంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా వడ్డీ రేట్లను కదిలించకుండా స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్న ఆర్బీఐ ఈసారి వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.గృహ రుణాలు, వ్యక్తిగత, కారు లోన్లు వంటి వాటికి ఈఎంఐలు (EMI) కడుతున్నవారు ఈసారి తమకు కాస్త ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కొత్తగా నియమితులైన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మొదటి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు చర్చించిన తర్వాత వడ్డీ రేటు నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించనున్నారు.మార్కెట్ లిక్విడిటీని మెరుగుపరచడంతో పాటు, వినియోగం ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర బడ్జెట్ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ కూడా రేట్ల కోత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే అంటే ఆర్బీఐ కంఫర్ట్ జోన్ 6 శాతంలోపే ఉంది. దీనివల్ల ధరల గురించి ఆందోళన చెందకుండా ఆర్బీఐ నిర్ణయం తీసుకునే వీలు ఏర్పడింది.ఆర్బీఐ రెపో రేటు (స్వల్పకాలిక రుణ రేటు)ను ఎటువంటి మార్పు లేకుండా 2023 ఫిబ్రవరి నుండి 6.5 శాతంగా కొనసాగిస్తోంది. కోవిడ్ కాలంలో (2020 మే) ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును తగ్గించింది. ఆ తర్వాత దానిని క్రమంగా 6.5 శాతానికి పెంచింది. ఇప్పుడు వినియోగం ఇంకా మందగించడంతో రుణాలు చౌకగా చేయడం ద్వారా వృద్ధిని పెంచాలని ఆర్బీఐ చూస్తోంది. తద్వారా రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం తగ్గుతుంది. -
ఎయిర్టెల్ యాప్లో బజాజ్ ఫైనాన్స్.. కొత్త క్రెడిట్ కార్డు
ఆర్థిక సేవల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించడానికి ఎన్బీఎఫ్సీ కంపెనీ బజాజ్ ఫైనాన్స్, టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగా బజాజ్ ఫైనాన్స్ రుణ సంబంధ ఉత్పత్తులను తొలుత ఎయిర్టెల్ థాంక్స్ యాప్లో అందజేస్తారు. ఆ తరువాత ఎయిర్టెల్ స్టోర్ల ద్వారా ఈ సేవలను విస్తరిస్తారు.ఆర్థిక సేవలు దేశవ్యాప్తంగా విస్తృతం అయ్యేందుకు తమకున్న బలం దోహదం చేస్తుందని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. ‘10 లక్షల మందికిపైగా వినియోగదార్లు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. కస్టమర్ల అన్ని ఆర్థిక అవసరాల కోసం ఎయిర్టెల్ ఫైనాన్స్ను వన్–స్టాప్ షాప్గా మార్చడమే లక్ష్యం’ అని భారతీ ఎయిర్టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. డేటా ఆధారిత రుణ పూచీకత్తు, అందరికీ ఆర్థిక సేవలు చేరేందుకు భారత డిజిటల్ పర్యావరణ వ్యవస్థ గుండెకాయగా ఉందని బజాజ్ ఫైనాన్స్ ఎండీ రాజీవ్ జైన్ చెప్పారు.కంపెనీ ప్రకటన ప్రకారం.. ఎయిర్టెల్ కస్టమర్లు ఎయిర్టెల్-బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టా ఈఎంఐ కార్డును (Airtel-Bajaj Finserv EMI) ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ స్టోర్ల నెట్వర్క్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.“ఎయిర్టెల్-బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టా ఈఎంఐ కార్డు బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఆఫర్ల శ్రేణికి యాక్సెస్ను అందిస్తుంది. 4,000 కంటే ఎక్కువ నగరాల్లోని 1.5 లక్షల పార్టనర్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా సామాగ్రితో సహా వివిధ వస్తువులను కొనుగోలు చేయడానికి సౌకర్యవంతమైన ఈఎంఐ ఎంపికలు, చెల్లింపు ప్లాన్ల నుండి వినియోగదారులు ప్రయోజనం పొందుతారు. అదనంగా కో-బ్రాండెడ్ కార్డ్ బహుళ ప్లాట్ఫారమ్లలో ఈ-కామర్స్ లావాదేవీలకు వర్తిస్తుంది" అని పేర్కొంది. -
ఈఎంఐ ఇక మారదు! ఆర్బీఐ కీలక ఆదేశాలు
నెలవారీ సమాన వాయిదాలపై (EMI) మంజూరు చేసే అన్ని వ్యక్తిగత రుణాల్లో బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తప్పనిసరిగా స్థిర వడ్డీ రేటు ఉత్పత్తిని అందించాల్సిందేనని ఆర్బీఐ (RBI) ప్రకటించింది. వడ్డీ రేటు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ విధానంతో లేక ఇంటర్నల్ బెంచ్మార్క్ విధానంతో అనుసంధానమైనదా? అన్న దానితో సంబంధం లేకుండా అన్ని ఈఎంఐ ఆధారిత వ్యక్తిగత రుణాలకు ఇది అమలవుతుందని స్పష్టం చేసింది.రుణాన్ని మంజూరు చేసే సమయంలోనే వర్తించే వార్షిక వడ్డీ రేటు (ఏపీఆర్)ను కీలక సమాచార నివేదిక (కేఎఫ్ఎస్), రుణ ఒప్పంద పత్రాల్లో బ్యాంక్లు, ఇతర నియంత్రిత సంస్థలు (ఎన్బీఎఫ్సీలు)వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. రుణ కాల వ్యవధిలో ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేటు కారణంగా ఈఎంఐ/లేదా కాల వ్యవధిని పెంచేట్టు అయితే ఆ విషయాన్ని తప్పకుండా రుణగ్రహీతకు తెలియజేయాలని తెలిపింది.ప్రతి త్రైమాసికానికి ఒకసారి లోన్ అకౌంట్ స్టేట్మెంట్ను జారీ చేయాలని, అందులో అప్పటి వరకు చెల్లించిన వడ్డీ, అసలు ఎంత?, ఇంకా ఎన్ని ఈఎంఐలు మిగిలి ఉన్నాయనే సమాచారం ఉండాలని పేర్కొంది. ఈఎంఐ ద్వారా రుణాన్ని చెల్లించే వారికి స్థిర వడ్డీ రేటును లేదా కాల వ్యవధిని పెంచుకునే అవకాశం కల్పించానలి 2023 ఆగస్ట్లోనే బ్యాంక్లను ఆర్బీఐ ఆదేశించడం గమనార్హం. దీనికి సంబంధించి సందేహాలపై తాజా స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరిలో ఆర్బీఐ ఎంపీసీ సమావేశంరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశం ఫిబ్రవరి 5-7 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(US Fed) యూఎస్లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: ఈ క్రెడిట్ కార్డులు కనిపించవు! కానీ ఖర్చు చేయొచ్చు..ఆర్బీఐ వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది. -
తగ్గనున్న ఈఎంఐ.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గుడ్న్యూస్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన లోన్ కాలపరిమితి కోసం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు తగ్గింపును ప్రకటించింది. జనవరి 7 నుండి అమలులోకి వచ్చిన సవరించిన రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటాయి.ఎంసీఎల్ఆర్ తగ్గింపు ద్వారా రుణగ్రహీతలకు వారి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన వ్యక్తిగత, వ్యాపార రుణాల వంటి ఫ్లోటింగ్ రేటు రుణాలపై సమానమైన నెలవారీ వాయిదాలు (EMI) కూడా తగ్గుతాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ని 9.20 శాతం నుండి 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.15 శాతానికి సవరించింది. ఇక ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 9.20 శాతం, 9.30 శాతంగా ఉన్నాయి.అదే విధంగా ఆరు నెలలు, ఏడాది, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ రేట్లు ఒక్కొక్కటి 5 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గి 9.45 శాతంగా ఉన్నాయి. అయితే రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.45 శాతం వద్ద యథాతథంగా ఉంది.ఎంసీఎల్ఆర్ అంటే?"ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణానికి ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటు. ఇది రుణంపై వడ్డీ రేటు కనీస పరిమితిని నిర్ణయిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెప్తే తప్ప తప్ప ఇందులో మార్పు ఉండదు" అని ఎంసీఎల్ఆర్ భావనను వివరిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది.పీఎల్ఆర్ ఇలా..ఎంసీఎల్ఆర్తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (PLR) సంవత్సరానికి 17.95 శాతం ఉంది. ఇది 2024 సెప్టెంబర్ 9 నుండి అమలులోకి వచ్చింది. నిర్దిష్ట రుణాలకు వర్తించే బేస్ రేటును అదే తేదీ నాటికి 9.45 శాతంగా నిర్ణయించారు.ఈబీఎల్ఆర్ గృహ రుణాల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ (EBLR)ని అనుసరిస్తుంది. ఇది పాలసీ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. ప్రస్తుత రెపో రేటు 6.50 శాతంగా ఉంది. ఇక అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్ (ARHL) వడ్డీ రేట్లు లోన్ వ్యవధిలో మారుతూ ఉంటాయి.హోమ్ లోన్ రేట్లుఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే రుణగ్రహీతలు తీసుకునే ప్రత్యేక గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.75 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంటాయి. రెపో రేటుతో పాటు 2.25 శాతం నుండి 3.15 శాతం అదనపు మార్జిన్ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ఇక ఇదే కేటగిరీకి చెందిన రుణగ్రహీతలకు ప్రామాణిక గృహ రుణ రేట్లు 9.40 శాతం నుండి 9.95 శాతం వరకు ఉంటాయి. వీటిలో రెపో రేటుతో పాటు 2.90 శాతం నుండి 3.45 శాతం మార్జిన్ కలిసి ఉంటాయి. -
ఈ టిప్స్ పాటిస్తే.. EMI ఆలస్యమైనా పర్లేదు!
ఎంత సంపాదించేవారికైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. లోన్ తీసుకున్న తరువాత పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఈఎంఐ చెల్లించడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. అలాంటి సమయంలో కొంతమంది రికవరీ ఏజంట్లు మీతో దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అప్పుడు మీరు కొంత ఒత్తిడికి గురవ్వొచ్చు. ఇలాంటి ఒత్తిడి నుంచి బయటపడటానికి ఈ ఐదు మార్గాలను పాటిస్తే సరిపోతుంది.బ్యాంక్తో కమ్యూనికేట్ చేయడంఆర్ధిక ఇబ్బందుల కారణంగా మీరు సరైన సమయానికి లోన్ చెల్లించకపోతే, ముందుగా మీరు ఎక్కడైనా లోన్ తీసుకున్నారో.. బ్యాంక్ లేదా ఫైనాన్సియల్ కంపెనీలను సంప్రదించండి. ఒకవేళా మీరు బజాజ్ ఫిన్సర్వ్, టాటా క్యాపిటల్, క్రెడిట్బీ లేదా నవీ ఫిన్సర్వ్ వంటి(నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(NBFC) నుంచి లోన్ తీసుకున్నట్లైతే కస్టమర్ కేర్కు కాల్ చేసి మీ పరిస్థితిని వివరించండి. మీ రీపేమెంట్ షెడ్యూల్ను పొడిగించడం లేదా సవరించడం కోసం మీరు చేసిన అభ్యర్థనకు సంబంధించిన రికార్డు కోసం ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం మంచిది.లోన్ రీస్ట్రక్చరింగ్ (Loan Restructuring)లోన్ చెల్లించడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు బ్యాంక్ లేదా సంస్థతో చర్చలు జరిపి.. ఈఎంఐ తగ్గించుకోవడం, చెల్లింపు వ్యవధిని పొడిగించుకోవడం వంటివి చేసుకోవాలి. అయితే ఈ మార్గం కేవలం తక్షణ ఉపశమనం మాత్రమే అందిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.పెనాల్టీ మినహాయింపులులోన్ ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే.. బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలు భారీగా జరిమానా(ఫెనాల్టీ) విధించే అవకాశం ఉంది. అలాంటి సందర్భం మీకు ఎదురైతే.. ఫెనాల్టీ మాఫీ చేయమని అడగవచ్చు. కొన్ని బ్యాంకులు ఇలాంటి జరిమానాలు మాఫీ చేయడానికి అంగీకరించవచ్చు.బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ఈఎంఐ చెల్లించే వారికి 'బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్' అనేది ఓ మంచి ఆప్షన్. ఎందుకంటే ఒక బ్యాంక్.. మరో బ్యాంకుకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు వడ్డీ రేటు వంటివి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈఎంఐ పెరిగే అవకాశం ఉంటుంది.ఉదాహరణకు: మీరు ఒక బ్యాంకు నుంచి రూ.2 లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి. అక్కడ కొన్ని రోజులు ఈఎంఐ చెల్లిస్తూ ఉంటే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అలాంటి సమయంలో మీకు మరో బ్యాంకు కూడా లోన్ ఇవ్వడానికి సిద్దమవుతుంది. అక్కడ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు కొంత తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. అప్పుడు ఆ బ్యాంక్ ఇచ్చే లోన్ మొత్తాన్ని, మీరు మొదట లోన్ తీసుకుని చెల్లిస్తున్న బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసి, అక్కడ లోన్ కంప్లీట్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు.ఇదీ చదవండి: చాన్నాళ్లకు తగ్గిన బంగారం ధర!.. తులం ఎంతంటే?లోన్ సెటిల్మెంట్మీరు పూర్తిగా లోన్ తిరిగి చెల్లించని సమయంలో.. బ్యాంక్తో సెటిల్మెంట్ గురించి చర్చించండి. అయితే లోన్ సెటిల్ చేయడం మీ సిబిల్ స్కోర్పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు వస్తే?లోన్ చెల్లించని సమయంలో రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి.. భయపెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు కచ్చితంగా మీ హక్కులను గురించి తెలుసుకోవాలి. ఏజెంట్స్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే మిమ్మల్ని సంప్రదించాలి. మిమ్మల్ని భయపెట్టినా.. బెదిరించినా, సంబంధిత బ్యాంక్ లేదా పోలీసులకు నివేదించాలి. -
డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం..
నెల్లూరు నగరానికి చెందిన కిశోర్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వివిధ వస్తువుల కొనుగోలు కోసం అతను ఆన్లైన్ యాప్లో రూ.20 వేలు రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేకపోయాడు. యాప్ నిర్వాహకులు చాలా వడ్డీ వేశారు. దీనికితోడు సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయింది.నెల్లూరులో నివాసం ఉంటున్న సంతోష్ ఓ షోరూంలో ఏడునెలల క్రితం ఏసీ కొన్నాడు. ఐదునెలలపాటు ఈఎంఐలు సమయానికి చెల్లించాడు. వివిధ కారణాలతో ఆ తర్వాత కట్టలేకపోయాడు. దీంతో రూ.750 అపరాధ రుసుము చెల్లించాలని బ్యాంక్ వారు పేర్కొన్నారు. అదనపు చెల్లింపుల భారంతోపాటు సిబిల్ స్కోర్ సైతం తగ్గిపోయింది.నెల్లూరు సిటీ: కాలం మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతోంది. దీంతో జీవనశైలిలో అనేక మార్పులొచ్చాయి. నాడు ఎంతో నెమ్మదిగా జరిగిన పనులు నేడు నిమిషాల్లోనే అయిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు బ్యాంక్ రుణం కావాలంటే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. పొలం, ఇళ్ల డాక్యుమెంట్లు ఉన్నా డబ్బు ఇచ్చేందుకు బ్యాంక్లు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవి. నేడు స్మార్ట్ ఫోన్లోని యాప్ నుంచి రూ.5వేల నుంచి రూ.లక్షల్లో రుణాలు పొందొచ్చు. ఇక్కడే ఒక మెలిక ఉంది. అదే సిబిల్ క్రెడిట్ స్కోర్. డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం. దీని ఆధారంగా ఇప్పుడు బ్యాంక్లు, ఆన్లైన్ యాప్లు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్కోర్ను 750 కంటే తగ్గకుండా చూసుకోవాల్సి బాధ్యత ఏర్పడింది. ఈఎంఐల్లోనే.. నేడు బ్యాంక్లు ఈఎంఐల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించాయి. చేతికి పెట్టుకునే వాచ్ నుంచి సెల్ఫోన్, కారు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఇళ్లు కొనుగోలుకు నెల వాయిదాల విధానంలో రుణాలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న వస్తువుల కోసం ఈ–కామర్స్ యాప్లో క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈఎంఐలు పెడుతున్నారు. అయితే కొందరు నిర్దేశిత తేదీల్లోగా ఈఎంఐ చెల్లించకపోతున్నారు. దీంతో భారీగా ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తోంది. లోన్ యాప్లు, ఒక్కోసారి కొన్ని బ్యాంక్ల ప్రతినిధుల బెదిరింపులూ తప్పడం లేదు. సులువుగా.. యాప్లు వచ్చిన నాటి నుంచి రుణం తీసుకోవడం సులభంగా మారిపోయింది. కేవలం పాన్కార్డు నంబర్ ఉంటే చాలు. సంబంధిత వెబ్సైట్ లేదా యాప్లో నమోదు చేయగానే కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేది, రానిదీ తెలిసిపోతుంది. అలాగే వివిధ ఎలక్ట్రానిక్ దుకాణాలు, షాపుల్లోనూ పాన్కార్డు నంబర్ను నమోదు చేసి వెంటనే ఎంతవరకు రుణం వస్తుందో చెబుతున్నారు. దీంతో తమకు అవసరమున్నా, లేకున్నా చాలామంది ఎల్రక్టానిక్స్ వస్తువులపై ఆసక్తి చూపుతున్నారు. జీరో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు లేదంటూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు చెప్పే మాటలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఆయా సంస్థలు ఎందుకు ఇలా చేస్తాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. కనీస అవగాహన కూడా లేకుండా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వస్తువులు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో సిబిల్ స్కోర్ గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల భవిష్యత్లో అత్యవసరమైనప్పుడు రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతోంది.ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ.. కొత్త కొత్త లోన్ యాప్లు పుట్టుకుని రావడంతో యువత, విద్యార్థులు ఆ ఉచ్చులో ఇరుక్కుని పోతున్నారు. సరదాల కోసం రుణం తీసుకోవడం మొదలుపెట్టి, చివరికి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యాప్లలో ఇష్టారాజ్యంగా లోన్లు తీసుకుని బెట్టింగ్లు, మద్యంకు బానిసవుతున్నారు. రుణాలు సమయానికి చెల్లించకపోవడంతో నిర్వాహకులు వారిని బ్లాక్మెయిల్ చేయడం, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాగా ఉన్నత చదువులకు రుణాలు తీసుకునే సమయంలో సమస్యలు త లెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సిబిల్ను కాపాడుకుంటేనే.. రానున్న రోజుల్లో సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఇప్పటికే బ్యాంక్ రుణాలు తీసుకోవాలంటే ఇది కచ్చితంగా బాగుండాలి. రుణ చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే చెక్»ౌన్స్తోపాటు సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. భవిష్యత్లో తీసుకునే రుణాలపై కూడా ప్రభావం పడుతుంది. బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. – సీహెచ్ వెంకటసందీప్, సీఏ తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. బ్యాంక్ స్టేట్మెంట్లు, రుణాలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా వారి అలవాట్లను నిత్యం గమనిస్తుండాలి. చెడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – వేణు, సీఐ, నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్ -
ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు ఇకపై మరింత భారమయ్యాయి. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాల రేట్లను సవరించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 0.05 శాతాన్ని (5 బేసిస్ పాయింట్లు) పెంచడంతో 9 శాతానికి చేరింది. గృహ రుణం వంటి దీర్ఘకాల రుణాలకు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటే ప్రామాణికంగా ఉంటుంది.మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను సైతం ఇంతే మేర పెంచింది. ఓవర్నైట్, ఒక నెల, రెండేళ్లు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేట్లను మాత్రం సవరించలేదు. పెరిగిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎంసీఎల్ఆర్ రేట్లను ఎస్బీఐ రెండుసార్లు పెంచడం గమనార్హం. డిపాజిట్లపై వ్యయాల పెరుగుదలతో బ్యాంక్లు రుణ రేట్లను సవరించాల్సి వస్తోంది. -
సామాన్యులపై ఈఎంఐల మోత: వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారా? అయితే ఈఎమ్ఐ చెల్లిస్తున్న వారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన.. హెచ్డీఎఫ్సీ తాజాగా కొన్ని పీరియడ్ లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐను ప్రభావితం చేస్తుంది.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు పెరగడం వల్ల వడ్డీ రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు ఈ రోజు నుంచే (నవంబర్ 7) అమలులోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, లోన్ వడ్డీ పెరుగుతుంది. దీంతో లోన్ కడుతున్న కస్టమర్ల ఈఎంఐ కూడా పెరుగుతుంది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..ఓవర్ నైట్: 9.15 శాతంఒక నెల: 9.20 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.45 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.50 శాతంఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
కిస్తీ కోసం కుస్తీ!
‘ భార్యా భర్తలతో పాటు ఇంటిల్లిపాదీ కాయకష్టం చేసుకుని, సంవత్సరాల తరబడి కిస్తీలు కట్టుకుంటూ ఇంటిలో ఒక్కొక్కటిగా సమకూర్చుకున్న వస్తువులన్నీ వరద పాలయ్యాయి. నష్టపరిహారం ఇస్తామంటూ రెండుసార్లు వచ్చి రాసుకుని వెళ్లినా.. ఇంతవరకు సాయమందలేదు. అందుకోసం ఇప్పుడు నేను కూలి వదిలేసుకుని ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా. కిస్తీ కట్టలేదని ఫైనాన్స్ వాళ్లు నా బైక్ తీసుకెళ్లిపోయారు. మా అకౌంట్లో ఉన్న కాస్త డబ్బులను కూడా ఫైనాన్స్ వాళ్లు లాగేసుకుంటున్నారు. ఇక మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వగలం’ అంటూ వాంబే కాలనీకి చెందిన తాపీ కార్మికుడు ఆకుల గణేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘వరదల్లో మునిగిన ఆటోకు రూ.10వేలు సాయం చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే వరకు ఫైనాన్స్ కంపెనీలు ఊరుకోవు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఫోన్లు చేసి డబ్బులు కట్టమని వేదిస్తున్నారు. కిస్తీ కట్టకుంటే బండి తీసుకెళ్లిపోతారు. అలా జరిగితే నేను ఇప్పటి వరకు కట్టిన 22 కిస్తీలు, డౌన్ పేమెంట్ మొత్తం పోయినట్టే. ఇన్నాళ్లూ బండి నడవకున్నా అప్పు చేసి కిస్తీ కట్టాను. మరో రూ.15వేలు అప్పులు తీసుకుని రిపేర్ చేయించాను. మా ఇళ్లు నీట మునిగిపోయినా.. నా ఆటో పాడైనా ప్రభుత్వ జాబితాలో పేరు లేదంటున్నారు. ఎక్కడికి వెళ్లి ఎవరిని అడగాలో తెలియడం లేదు’ అంటూ వాంబే కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కె.రమేష్ వాపోయాడు. సాక్షి, అమరావతి: విజయవాడను బుడమేరు వరద విడిచిపెట్టినా.. ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రం పట్టిపీడుస్తోంది. వరదల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడిన జీవితాలకు భరోసా కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ‘తాంబూళాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి’ అన్న చందాన వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించి.. దానిని పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైంది. సోమవారం విజయవాడలోని వాంబేకాలనీ, వడ్డెర కాలనీ, శాంతిప్రశాంతి నగర్లో సాక్షి క్షేత్ర స్థాయిలో పర్యటించగా.. వరద బాధితులు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉక్కిరిబిక్కిరవుతూ కనిపించారు. నెలవారీ కిస్తీలు కట్టలేక దిక్కులు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మారటోరియం ఇస్తారంటూ చేసిన ప్రకటనలు ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడంలేదు. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకర్లతో సమావేశం పెట్టి ఈఎంఐలు కట్టుకోవడానికి సమయం ఇచ్చేలా ఒప్పించామంటూ చేసిన హడావుడితో ఒనగూరిందేమీ లేదని తేలిపోయింది. రోజు ఉదయాన్నే ఫైనాన్స్ కంపెనీలు బాధితులకు ఫోన్లు చేసి వాయిదాలు కట్టాల్సిందేనని వేదిస్తుండం పరిపాటిగా మారింది. నష్ట పరిహారం అందకపోవడంతో బంధువులు, స్నేహితుల నుంచి అప్పులు చేస్తున్నారు. తీరా ఆ మొత్తం బ్యాంకు ఖాతాల్లో పడిన వెంటనే కిస్తీల రూపంలో సదరు ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు లాగేసుకుంటున్నాయి. జీరో అకౌంట్కు 15 రోజులా? సాధారణంగా బ్యాంకులో కొత్తగా ఖాతా తీసుకోవాలంటే ఒక్క రోజులోనే పూర్తవుతుంది. కానీ, వరద ముంపు నుంచి బయటపడిన ప్రాంతాల్లో సుమారు 15 రోజులు పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాలు ఏదో ఒక ఈఎంఐకు లింక్ పెట్టి ఉండడంతో.. ఒకవేళ ప్రభుత్వ సాయం అందితే.. ఆ మొత్తం పాత ఖాతాలో పడితే ఎక్కడ బ్యాంకర్లు, ఫైనాన్స్ కంపెనీలు లాగేసుకుంటాయోనని బాధితులు నానా అగచాట్లు పడుతున్నారు. జీరో అకౌంట్ల కోసం బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్కు, బ్యాంకు ఖాతాలకు, ఫోన్ నంబర్లు ఒకదానికొకటి లింక్ కాపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎన్యుమరేషన్లో బైక్లు వదిలేసి.. వరద బాధితులకు నష్ట పరిహారం అందించే క్రమంలో వీలైనంత వరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఎన్యుమరేషన్ ప్రక్రియలో చాలా కుటుంబాలకు చెందిన ద్విచక్ర వాహనాలు, ఆటోలను కావాలనే విస్మరించింది. దీంతో వాహనాలు దెబ్బతిన్న బాధితులు నష్టపోయారు. తీరా అకౌంట్లలో నగదు జమవుతుందని తెలిసి సచివాలయాలకు వెళ్లడంతోఎన్యుమరేషన్లో తమ వాహనాలు నమోదు చేయలేదని తెలుసుకున్నారు. మళ్లీ కొత్తగా దరఖాస్తులు పట్టుకుని సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు బైక్లకు రూ.3వేలు, ఆటోలకు రూ.10 వేలు సాయం ఎంత మందికి ఇచ్చారన్నదే ప్రశ్నార్థకం. -
మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!
సొంతిల్లు సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలామంది తమ జీవితాంతం కష్టపడుతారు. ఏళ్ల తరబడి నెలవారీ సంపాదన పోగుచేస్తుంటారు. అయినా ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకు ఇల్లు కొనాలంటే చాలా వరకు హోంలోన్ తీసుకోవాల్సిందే. ఇదే అదనుగా హోమ్లోన్కు సంబంధించి చాలా బ్యాంకులు కనీసం 20 ఏళ్ల కాలపరిమితి ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. దాంతో కస్టమర్ల నుంచి అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుంది. కానీ లోన్ తీసుకునే వారికి అది భారంగా మారుతుంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటించి ఈ హోమ్లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఉదాహరణకు..విజయ్ ఏటా తొమ్మిది శాతం వడ్డీ చొప్పున 20 ఏళ్ల కాలానికిగాను రూ.25,00,000 హోంలోన్ తీసుకున్నాడని అనుకుందాం. లోన్ మొత్తానికి నెలవారీ ఈఎంఐ రూ.22,493. ఇరవై ఏళ్ల కాలానికి వడ్డీ రూ.29 లక్షలు అవుతుంది. అయితే చిన్న చిట్కాతో ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఏడాది ప్రాతిపదికన 12 నెలలకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా కేవలం మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే ఏకంగా రూ.13 లక్షలు వడ్డీ ఆదా చేసుకోవచ్చు. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి ఏటా 15 ఈఎంఐలు..అంటే మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే సరిపోతుంది. అందుకు కొన్ని బ్యాంకులు ఒప్పుకోవు. ఎందుకంటే బ్యాంకు వడ్డీ కోల్పోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోన్ తీసుకునేవారికి మేలు జరుగుతుంది. నిబంధనల ప్రకారం ఏడాదిలో 15 ఈఎంఐలు చెల్లించేందుకు ప్రతి బ్యాంకు అనుమతించాల్సిందే.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..నెలవారీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని ఈఎంఐలు 20-30 శాతం దాటకుండా జాగ్రత్తపడాలి. సొంతిల్లు లేకపోతే సమాజం ఏమనుకుంటుందోననే భావనతో సరైన ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి ఇల్లుకొని ఇబ్బంది పడకూడదని నిపుణులు చెబుతున్నారు. -
పెరుగుతున్న ఈఎంఐ కల్చర్!
రాజు నెల వేతనం రూ.20 వేలు. ఇంటిఅద్దె రూ.తొమ్మిది వేలు చెల్లిస్తాడు. పిల్లల స్కూల్ ఫీజు ఏటా రూ.40 వేలు అంచనా వేసినా నెలకు రూ.3,500 అవుతుంది. కరెంటు బిల్లు, వైద్యం, రెస్టారెంట్, సినిమా, పార్టీలు, ఫంక్షన్లు, ప్రయాణాలు, సేవింగ్స్ కోసం రూ.నాలుగు వేలు ఖర్చు చేశాడని అనుకుందాం. ఈక్రమంలో నెలవారీ ఇంటి ఖర్చులు రూ.3,500 దాటాయంటే ఈఎంఐ తప్పదు. దీని ప్రభావం వచ్చేనెల ఖర్చులపై ఉంటుంది.దేశంలోని చాలామంది తమ ఆర్థిక స్థోమతకు తగినట్లుగా ఖర్చు చేస్తుంటారు. కొందరు అవసరాలకు మాత్రమే అప్పు చేస్తుంటే.. ఇంకొందరు వివిధ కారణాల వల్ల అప్పు వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో సరిపడా ఆదాయంలేని వారు ఏ చిన్న వస్తువు కొన్నాలన్నా ఈఎంఐ తప్పడంలేదు. ఇండియాలో ఈఎంఐ కల్చర్ ఎలా ఉందనే అంశాలను తెలియజేస్తూ ఇటీవల కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అందులో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.దేశంలో దాదాపు 70 శాతం మంది ఐఫోన్ వినియోగదారులు ఈఎంఐ ద్వారానే వాటిని కొనుగోలు చేస్తున్నారని తేలింది. 80 శాతం కారు విక్రయదారులు ఈఎంఐలోనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. 60 శాతానికిపైగా ఇళ్లు హోంలోన్ ద్వారానే కొంటున్నారు. అయితే నెలవారీ సంపాదనలో మొత్తం ఈఎంఐలు 30 శాతం లోపే ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసి ఈఎంఐ పెట్టాలనుకుంటే మాత్రం సంపాదన పెంచుకోవాలని చెబుతున్నారు. నైపుణ్యాలు పెంచుకుని ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని, సంపాదన పెరిగితే ఈఎంఐ అవసరం లేకుండానే వస్తువులు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ 13 రూ.11కే..?దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొబైళ్లు, దుస్తులు, గ్యాడ్జెట్లు, ఇతర వస్తువులు అత్యవసరం అయితే తప్పా కొనుగోలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. సమాజం మన్ననలు పొందేందుకు ఆర్బాటాలకు పోయి అప్పు చేసి ఈఎంఐ ద్వారా వస్తువులు కొంటే చివరకు వాటిని చెల్లించడంలో ఇబ్బందులు పడుతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆర్థిక స్థోమతకు తగినట్లుగా, ప్రణాళికబద్దంగా అత్యవసరమైతేనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. -
CIBIL Score: సిబిల్ గుబులు!
నేడు ప్రతి చిన్న వస్తువు కొనుగోలూ ఈఎంఐ విధానంలోనే చెల్లింపుల్లో జాప్యంతో సిబిల్ స్కోర్కు దెబ్బ భవిష్యత్లో ఇతర రుణాలు తీసుకోలేని పరిస్థితి ఆలస్య రుసుములు, వాటిపైన పన్నుల బాదుడు సరేసరి ఆయా కంపెనీల ప్రకటనల వలలో చిక్కుకుంటున్న ప్రజలునియంత్రణ అవసరమంటున్న నిపుణులు విజయవాడకు చెందిన గౌస్ మొహియుద్దీన్ ఐదు నెలల క్రితం టీవీ కొన్నారు. గత నెలలో ఈఎంఐ కట్టాల్సిన సొమ్ము కంటే రూ.10 బ్యాంకులో తక్కువగా ఉండటంతో రూ.580 ఆలస్య రుసుము పడటమే కాకుండా సిబిల్ స్కోర్ భారీగా తగ్గింది.రమేశ్ నాయుడు అనే డిగ్రీ విద్యార్థి ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి శాంసంగ్ మొబైల్ కొన్నాడు. నాలుగో నెలలో ఈఎంఐ చెల్లించకపోవడంతో మొబైల్ను బ్లాక్ చేశారు. తిరిగి దీన్ని పనిచేయించేందుకు ఈఎంఐ కట్టడంతో పాటు రూ.600 ఆలస్య రుసుం చెల్లించాడు. అతడు ఇప్పుడు ద్విచక్రవాహనం కొనడానికి వెళ్తే.. ‘సిబిల్ స్కోర్ పడిపోయింది.. రుణం ఇవ్వలేం’ అని చెప్పారు... ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది సిబిల్ స్కోర్ సరిగా లేక వాహన, వ్యక్తిగత, గృహ రుణాలను పొందలేకపోతున్నారు. చెక్ బౌన్స్ అయితే భారీగా సిబిల్ స్కోర్ పడిపోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏ రుణం తీసుకున్నా సకాలంలో చెల్లించాలంటున్నారు. ఆయా రుణ సంస్థలు, బ్యాంకులు నిర్దేశించిన తేదీల్లోగా చెల్లింపులు చేయాలంటున్నారు. ఇలా చేస్తేనే చక్కటి సిబిల్ స్కోర్ సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. సిబిల్ సరిగా లేకపోతే ఏ రుణం కూడా మంజూరు కాదని చెబుతున్నారు. సిబిల్ లెక్కలివి.. సగటున ఉండాల్సిన కనీస స్కోర్ 650ఏదైనా రుణం రావాలంటే కనీసం ఉండాల్సిన స్కోర్ 600గృహరుణం కావాలంటే ఉండాల్సిన స్కోర్ 700కు పైనఈఎంఐల్లోనే ఎక్కువ..ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ నెలసరి వాయిదా చెల్లింపు (ఈఎంఐ) విధానంలో వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వివిధ బ్యాంకులతోపాటు ప్రైవేటు ఆర్థిక సంస్థలు సైతం క్రెడిట్ (సిబిల్) స్కోర్ ఆధారంగా రుణాలు ఇస్తుండటంతో చాలా మంది ఈఎంఐ విధానంలో వస్తువులను కొంటున్నారు. అయితే నిర్దేశిత తేదీల్లోగా ఈఎంఐ చెల్లించకపోవడం, అందుకు తగ్గట్టుగా బ్యాంకులో నగదు నిల్వ ఉంచకపోవడంతో బౌన్సుల బారినపడుతున్నారు. దీంతో భారీగా ఆలస్య రుసుం, దానిపైన ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తోంది. అంతేకాకుండా ఫోన్లలో ఆయా రుణ సంస్థలు, బ్యాంకుల ప్రతినిధుల బెదిరింపులూ తప్పడం లేదు. నియంత్రించుకోకుంటే కష్టం.. ఇప్పుడు చాలా సులువుగా ఆన్లైన్లోనూ, వివిధ యాప్స్ ద్వారా రుణాలు లభిస్తున్నాయి. కేవలం పాన్ కార్డు నంబర్ను సంబంధిత వెబ్సైట్ లేదా యాప్లో నమోదు చేయగానే కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేది, రానిదీ తెలిసిపోతుంది. అలాగే వివిధ ఎలక్ట్రానిక్ మాల్స్, షాపుల్లోనూ పాన్ కార్డు నంబర్ను నమోదు చేసి వెంటనే ఎంతవరకు రుణం వస్తుందో చెబుతున్నారు. దీంతో తమకు అవసరమున్నా, లేకున్నా చాలామంది ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆసక్తితో రుణాల ద్వారా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ‘జీరో వడ్డీ’, ‘ప్రాసెసింగ్ ఫీజు లేదు’ అంటూ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే ప్రకటనల వలలో పడుతున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఆయా సంస్థలు ఎందుకు ఇలా చేస్తాయనే కనీస అవగాహన కూడా లేకుండా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇలా ఆయా ప్రకటనలకు ఆకర్షితులై రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో భారీగా ఆలస్య రుసుం, ఇతర జరిమానాలు తప్పడం లేదు. అంతేకాకుండా సిబిల్ స్కోర్ కూడా గణనీయంగా పడిపోతోంది. తద్వారా భవిష్యత్తులో రుణాలు పొందలేని పరిస్థితి తలెత్తుతోంది.పదిశాతం మందికి పైగా డిఫాల్టర్లే..రాష్ట్రంలో ప్రైవేటు సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సకాలంలో చెల్లింపులు చేయక డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నవారిలో మొబైల్ ఫోన్లు తీసుకుంటున్నవారు ఎక్కువ మంది ఉన్నట్టు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు చెబుతున్నాయి. సాధారణంగా సిబిల్ స్కోర్ 650 దాటితేనే ఏ రుణమైనా లభిస్తుంది. అయితే రుణాలు తీసుకున్న వారు నిర్దేశిత తేదీల్లోగా చెల్లించకపోవడంతో ప్రతి పదిమందిలో ఇద్దరు డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేస్తున్న వారిలో రుణాల రికవరీ అత్యంత తక్కువగా ఉన్నట్టు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు గుర్తించాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం నగరాల్లో డిఫాల్టర్లు 14 శాతంగా ఉన్నారని ఆయా సంస్థలు చెబుతున్నాయి. జరిమానాలు ఎక్కువగా పడటం, చెక్ బౌన్స్ కేసులు నమోదు కావడం, ఈఎంఐల చెల్లింపుల్లో జాప్యం వంటివన్నీ అత్యధికంగా ఈ మూడు ప్రాంతాల్లోనే నమోదవుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ మూడు చోట్లా సిబిల్ స్కోర్ కూడా గణనీయంగా తగ్గినట్టు తేలింది. ఈ మూడు నగరాలు కాకుండా మిగతా జిల్లాల్లో సగటున 10 శాతం డిఫాల్టర్లు ఉంటున్నారు.సకాలంలో చెల్లిస్తేనే సిబిల్ బాగుంటుంది.. ప్రస్తుతం సిబిల్ స్కోర్ చాలా కీలకమైంది. సిబిల్కు ఆయా ఫైనాన్స్ సంస్థలు చిన్న చిన్న అప్పుల సమాచారాన్ని కూడా ఇస్తాయి. చెల్లింపుల్లో జాప్యం లేదా మొండి బకాయిలు కారణంగా మా దగ్గరకు వచ్చే చాలామందికి సిబిల్ స్కోర్ లేక రుణాలు ఇవ్వడం లేదు. వస్తువు తీసుకున్నాక సకాలంలో చెల్లిస్తేనే సిబిల్ స్కోర్ బాగుంటుంది. లేదంటే భవిష్యత్తులో పరపతి లభించడం చాలా కష్టం. – సునీల్ కుమార్, మేనేజర్, ఎస్బీఐ -
వెహికల్ కొంటున్నారా?.. దీన్ని ఓ లుక్ వేయండి!
ఒక వాహనం కొనుగోలు చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించి తీసుకోవడం. రెండు 'ఈఎమ్ఐ' రూపంలో తీసుకోవడం. ఇంతకీ ఏ విధంగా కొనుగోలు చేస్తే ఉత్తమం? మొత్తం డబ్బు చెల్లించడం (ఫుల్ క్యాష్) ద్వారా లాభాలేంటి? ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేస్తే వచ్చే లాభ, నష్టాల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బంధువులు కొన్నారు, పక్కింటి వాళ్ళు కొన్నారు, ఎదురింటి వాళ్ళు కొన్నారు అని, ఆవేశంతో ఆలోచించకుండా వాహనాలు కొనుగోలు చేస్తే.. ఆ తరువాత ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక వడ్డీలు ఆర్థిక ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి ఒక వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకోవడం మాత్రమే.. సంపాదనను కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.మొత్తం డబ్బు చెల్లించి (ఫుల్ క్యాష్)ఏదైనా వాహనం (కారు / బైక్) కొనాలంటే మొత్తం డబ్బు చెల్లించడం అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఒకేసారి వాహన ఖరీదును చెల్లించాలమంటే.. ప్రతి నెలా ఈఎమ్ఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్టేషన్స్, యాక్ససరీస్ వంటివన్నీ ఒకేసారి పొందవచ్చు. వడ్డీ చార్జీలు నుంచి తప్పించుకోవచ్చు. అంతే కాకుండా వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా కొన్ని సార్లు ఆఫర్స్ కూడా లభిస్తాయి. తక్షణమే మీరు వాహనానికి ఓనర్ కూడా అవ్వొచ్చు.లోన్ మీద కారు కొనుగోలునిజానికి ప్రతి ఒక్కరూ మొత్తం డబ్బు చెల్లించే విధానం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కారు కొనాలంటే కనీసం రూ. 10 లక్షల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకేసారి అంత మొత్తం చెల్లించడం కొందరికి కష్టమే. కానీ వారు ప్రతి నెలా కొంత మొత్తంగా చెల్లిస్తూ కారును కొనుగోలు చేసే స్థోమత ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా లోన్ మీద కారును తీసుకోవచ్చు.లోన్ ద్వారా కారు కొనుగోలు చేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు👉లోన్ తీసుకుని కారు కొనేయాలనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఒక బ్యాంకు మీకు వెహికల్ లోన్ ఇవ్వాలంటే ముందుగా మీ సంపాదన, సిబిల్ స్కోర్ వంటి వాటిని చూస్తుంది. ఇవన్నీ బేరీజు వేసుకుని మీరు లోన్ తీసుకోవడానికి అర్హులేనా? అర్హులైతే ఎంత వరకు లోన్ మంజూరవుతుంది, అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది.👉వెహికల్ లోన్ తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించే సమయం (డ్యూరేషన్) ఎంచుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమును ఏమిటంటే? మీరు ఎంచుకున్న సమయం లేదా సంవత్సరాలను బట్టి వడ్డీ అనేది నిర్ణయిస్తారు. డ్యూరేషన్ అనేది వీలైనంత తక్కువ సెలక్ట్ చేసుకుంటే వడ్డీ తగ్గుతుంది.👉కొన్ని సందర్భాల్లో కొన్ని డీలర్షిప్లు కొంత కాలానికి 0% ఫైనాన్సింగ్తో సహా ప్రమోషనల్ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఇది మీరు తీసుకునే లోన్కు సంబందించిన ఖర్చులను కొంత తగ్గించడానికి ఉపయోగపడుతుంది.👉లోన్ తీసుకునే వ్యక్తి వడ్డీ రేట్లను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో తొందరపడితే నష్టపోయేది మీరే. కాబట్టి తక్కువ వడ్డీ రేటుకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోకండి. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ విషయంలో భారీ వడ్డీలను వసూలు చేసి అమాయక ప్రజలను దోచుకునే అవకాశం ఉంది.లోన్ తీసుకుని వాహనాలను కొనుగోలు చేయడంలో పెద్దగా లాభాలు కనిపించవు, కానీ ఆదమరిస్తే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.👉రుణ గ్రహీత లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ చార్జీలను తీసుకోకుండా ముందడుగు వేస్తే.. అసలు ధర కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.👉వడ్డీ అనేది కూడా చివరి వరకు ఒకేలా ఉండదు. ఇందులో కొన్ని సార్లు పెరుగుదలలు కూడా ఉంటాయి. రేపో రేటు పెరిగితే కొన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వడ్డీలను అమాంతం పెంచేస్తాయి. ఇది రుణ గ్రహీత మీద భారం పడేలా చేస్తాయి.👉ముందుగానే మీ సంపాదన, ఈఎమ్ఐ వంటి వాటిని లెక్కించుకోవాలి. ఒకసారి ఈఎమ్ఐ మొదలు పెట్టిన తరువాత.. ఇతరత్రా ఖర్చులు తగ్గించుకోవాలి. లేకుండా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుపోవాల్సి ఉంటుంది. నెలవారీ ఖర్చులు కూడా లెక్కించుకోవడం ఉత్తమం. పొరపాటున ఈఎమ్ఐ కట్టడం ఆలస్యమైతే.. కట్టాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇది సిబిల్ స్కోర్ మీద కూడా ప్రభావం చూపుతుంది.10 లక్షల కారును 7 సంవత్సరాల వ్యవధితో లోన్ ద్వారా తీసుకుంటే?👉ఒక వ్యక్తి రూ. 10 లక్షల కారును కొనాలనుకుంటే.. దానికి కావాల్సిన లోన్ను బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుంచి తీసుకుంటారు. డ్యూరేషన్ 7 సంవత్సరాలు ఎంచుకున్నట్లయితే.. నెలకు సుమారు రూ. 15వేలు కంటే ఎక్కువ ఈఎమ్ఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు లోన్ ఇచ్చే బ్యాంక్ ఫిక్స్ చేసే వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది.ఉదాహరణకు.. ఒక బ్యాంక్ 8.65 శాతం వడ్డీతో రూ. 10 లక్షలు లోన్ ఇస్తే (7 సంవత్సరాల కాల వ్యవధి) నెలకు రూ. 15912 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు 7 సంవత్సరాల్లో మొత్తం రూ. 13,36,608 చెల్లించాల్సి ఉంటుంది. అంటే తీసుకున్నదానికంటే సుమారు రూ. 3.36 లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.అదే వడ్డీ రేటు 11 శాతం అనుకుంటే (10 లక్షలు 7 సంవత్సరాల డ్యూరేషన్) అప్పుడు నెలకు రూ. 17122 చొప్పున మొత్తం రూ. 14,38,248 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఎంత వడ్డీకి ఎంత చెల్లించాల్సి ఉంటుందనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
ఈఎంఐలు కట్టేవారికి షాక్!! ఈ బ్యాంక్లో ఇకపై..
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు షాక్ తగిలింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొన్ని పీరియడ్ లోన్లపై ఎంసీఎల్ఆర్ని సవరించింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐని ప్రభావితం చేస్తుంది.ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, రుణ వడ్డీ పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్ల ఈఎంఐ పెరుగుతుంది. ఈ కొత్త రేట్లు ఈరోజు జూలై 8 నుంచి అమలులోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) బెంచ్మార్క్ 9.05% నుంచి 9.40% మధ్య ఉండగా బ్యాంక్ దీన్ని 0.10 శాతం వరకు పెంచింది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..» హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 8.95 నుంచి 9.05 శాతానికి పెరిగింది.» ఒక నెల ఎంసీఎల్ఆర్ 9 శాతం నుంచి 9.10 శాతానికి పెరిగింది.» మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 9.15 శాతం నుంచి 9.20 శాతానికి పెరిగింది.» ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.35 శాతానికి పెరిగింది.» ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. (ఇది అనేక రకాల రుణాలకు అనుసంధానమై ఉంటుంది)» 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.30 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది.» 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.35 శాతం నుంచి 9.40 శాతానికి పెరిగింది. -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్: పెరగనున్న ఈఎంఐలు
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఈఎంఐల భారం పెరగనుంది. ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఫ్రేమ్వర్క్తో ముడిపడి ఉన్న రుణాలకు సంబంధించిన ఈఎంఐలు పెరగనున్నాయి.ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం.. జూన్ 15 నుంచి అన్ని కాలపరిమితులలో ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు (0.1%) పెరిగింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 8.00 శాతం నుంచి 8.10 శాతానికి, నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.20 శాతం నుంచి 8.30 శాతానికి పెరుగుతాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.75 శాతం నుంచి 8.85 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది.గృహ, వాహన రుణాలతో సహా చాలా రిటైల్ రుణాలు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటుతో ముడిపడి ఉంటాయి. ఆర్బీఐ రెపో రేటు లేదా ట్రెజరీ బిల్ ఈల్డ్ వంటి ఎక్స్టర్నల్ బెంచ్మార్క్లతో ముడిపడి ఉన్న రుణాలపై ఎంసీఎల్ఆర్ పెంపు ఎలాంటి ప్రభావం చూపదు. -
ఈఎంఐలు తగ్గుతాయా? రేపటి నుంచే ఆర్బీఐ మీటింగ్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం (ఫిబ్రవరి 6) జరగబోతోంది. మధ్యంతర బడ్జెట్ ముగిసిన వెంటనే ఈ మీటింగ్ జరగుతోంది. ఇందులో ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది.. ప్రతి నెలా తాము చెల్లిస్తున్న లోన్ ఈఎంఐ (EMI)లు ఏమైనా తగ్గుతాయా అని దేశవ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు ఈ మీటింగ్ జరుగుతుంది. ఇందులో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. మళ్లీ యథాతథమే! ఆర్బీఐ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, గత రేటు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. రెపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. గత డిసెంబర్లో జరిగిన సమావేశంలో ఆర్బీఐ పాలసీ రెపో రేటును 6.5 శాతం యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. తగ్గింపు అప్పుడే.. రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్లో ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ చివరిసారిగా రెపో రేటును మార్చి వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగినా రెపో రేట్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. -
ఎస్బీఐ వినూత్న ఐడియా! ఈఎంఐలు కట్టనివారి కోసం..
బ్యాంకులో లోన్లు తీసుకుని ఈఎంఐలు సక్రమంగా కట్టనివారి నుంచి బకాయిలు రాబట్టేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినూత్న ఐడియా వేసింది. ఈఎంఐలు చెల్లించనివారికి ఇక నోటీసులు, ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా ఇంటికే వెళ్లి చేతిలో చాక్లెట్లు పెట్టి శుభాకాంక్షలు చెప్పి వాయిదా కట్టేలా చేస్తోంది. (ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు) ఈఎంఐ చెల్లించకుండా తప్పించుకోవాలనుకుంటున్న కస్టమర్లు.. సాధారణంగా బ్యాంక్ చేసే రిమైండర్ కాల్కు స్పందించరు. కాబట్టి ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా కస్టమర్లకు ఇంటికే వెళ్లి గుర్తు చేయడం ఉత్తమ మార్గమని ఎస్బీఐ భావిస్తోంది. వడ్డీ రేట్లలో కదలికల నేపథ్యంలో ఈఎంఐలు చెల్లింపుల్లో జాప్యాలు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన వసూళ్లను సాధించడానికి ఎస్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) ఎస్బీఐ రిటైల్ లోన్ బుక్ 2023 జూన్ త్రైమాసికంలో గతేడాది రూ.10,34,111 కోట్ల నుంచి 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు చేరుకుంది. ఇక మొత్తం రిటైల్ రుణాలు 13.9 శాతం వృద్ధి చెంది రూ. 33,03,731 కోట్లకు చేరుకున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించే రెండు ఫిన్టెక్ కంపెనీలతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్బీఐలో రిస్క్ విభాగానికి ఇన్చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారీ తెలిపారు. ఈ ఫిన్టెక్ ప్రతినిధులు ఈఎంఐ చెల్లించని కస్టమర్ల ఇళ్లకు వెళ్లి చాక్లెట్ల ప్యాక్ ఇచ్చి ఈఎంఐ బకాయిని గుర్తుచేస్తారని పేర్కన్నారు. అయితే ఆ ఫిన్టెక్ల పేరు చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఈ చర్య కేవలం పైలట్ దశలో ఉందని, కేవలం 15 రోజుల క్రితమే దీనిని అమలులోకి తెచ్చామని, విజయవంతమైతే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వివరించారు. (కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..) -
ఈఎంఐలు కట్టేవారికి అలర్ట్! షాకిచ్చిన టాప్ ప్రైవేట్ బ్యాంక్
HDFC Bank hikes loans interest rates: విలీనం తర్వాత అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్గా అవతరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంక్ రుణ రేట్ల పెంపు ఆగస్ట్ 7 నుంచి అమలులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంపిక చేసిన టెన్యూర్లపై ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. టెన్యూర్ ఆధారంగా ఎంసీఎల్ఆర్ రేటు పెంపు ఇలా ఉంది.. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.25 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు ఎగిసి 8.3 శాతం నుంచి 8.45 శాతానికి చేరింది. మూడు నెలలకుగానూ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.6 శాతం నుంచి 8.7 శాతాన్ని తాకింది. ఇక ఆరు నెలలకయితే 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.9 శాతం నుంచి 8.95 శాతానికి ఎగసింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 9.05 శాతం నుంచి 9.1 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల టెన్యూర్ రేట్ను 9.15 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.2 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ అంటే.. ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. -
ఎస్బీఐ రుణ రేటు పెంపు.. పెరగనున్న ఈఎంఐ భారం
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటును అన్ని కాలపరిమితులపై స్వల్పంగా 5 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర పెంచింది. పెరిగిన రేటు జూలై 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం, ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్లు 8 శాతం నుంచి 8.75 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఎంసీఎల్ఆర్ అనేది ఒక బ్యాంకు వినియోగదారులకు ఇచ్చే రుణాల ప్రాథమిక కనీస రేటు. తాజా ఎస్బీఐ రుణ రేటు పెంపు రుణ గ్రహీతలపై ఆ మేరకు ఈఎంఐ భారం (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన) పెరగనుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఏడాది రేటు 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరుగుతుంది. ఓవర్నైట్ రేటు 8 శాతంగా ఉంటుంది. నెల, మూడు నెలల రేటు 8.15 శాతం చొప్పున అమలవుతాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.45 శాతంగా ఉంటుంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.65%కి చేరుతుంది. మూడేళ్ల రేటు 8.75 శాతంగా ఉంటుంది. -
సెల్ఫోన్ ఈఎంఐ కట్టే విషయంలో గొడవ.. స్నేహితుడి హత్య
తూర్పు గోదావరి: సెల్ఫోన్కు ఈఎంఐ కట్టే విషయంలో తలెత్తిన వివాదంలో స్నేహితుడిని హత్య చేసి మృతదేహాన్ని తన ఇంటిలోనే పూడ్చి పెట్టిన కేసులో లాకవరపు పవన్కుమార్ను అరెస్ట్ చేసినట్టు సీఐ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితుడిని మంగళవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. పెరవలి మండలం నడుపల్లికోట గ్రామానికి చెందిన మృతుడు కొడమంచిలి సురేంద్ర (25), లాకవరపు పవనన్కుమార్ స్నేహితులు. సురేంద్ర స్నేహితుడికి ఈఎంఐలో సెల్ఫోన్ ఇప్పించాడు. రెండు వాయిదాలు కట్టిన తర్వాత సొమ్ము కట్టడం మానేశాడు. సురేంద్ర ఈ నెల 3వ తేదీన పవన్కుమార్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగటంతో ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటిలోనే గొయ్యితీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. మూడు రోజులకు దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 6వ తేదీన పోలీసులు, తహసీల్దార్ సమక్షంలో తవ్వకాలు జరిపి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సురేంద్ర మృతికి కారణమైన పవన్కుమార్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. వేగంగా కేసు దర్యాప్తు చేసిన ఎస్ఐ ఎం.సూర్య భగవాన్ను, సిబ్బందిని సీఐ వెంకటేశ్వరరావు అభినందించారు. -
ఇన్స్టాల్మెంట్లో మామిడి పండ్లు కొనుక్కోవచ్చని మీకు తెలుసా!
ఇంతవరకు ఈఎంఐలో కేవలం ప్రిజ్లు, వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కోవడమే తెలుసు. కానీ ఇక నుంచి పండ్లు కూడా ఈఎంఐలో కొనుక్కునే వెసులు బాటు వచ్చేస్తోంది. దీంతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కావాల్సిన పండ్లు కొనేయొచ్చు, తినేయొచ్చు. వివరాల్లోకెళ్తే.. మామిడి పళ్లలో రారాజుగా అల్ఫోన్సో మామిడి పళ్లను పిలుస్తారు. వీటి ధర కూడా చాలా ఎక్కువ. రిటైల్ మార్కెట్లోనే వీటి ధర డజను రూ. 800 నుంచి రూ. 1300 వరకు పలుకుతుంది. దీంతో బాగా ధనవంతులు తప్ప కామన్మెన్ దీని జోలికే పోనేపోడు. అందుకని అందరు కొనేలా సులభమైన రీతిలో వెసులుబాటు కల్పించాలని ఈ సరికొత్త ఆలోచనకు నాంది పలికాడు పూణెకి చెందిన గౌరవ్సనస్. తన పళ్ల ఉత్పత్తులకు సంబంధించిన గురుకృపా ట్రేడర్స్తో ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల మాదిరిగానే ఈఎంఐలో కొనేయొచ్చు అని చెబుతున్నాడు గౌరవ్. అందుకోసం కస్టమర్ క్రెడిట్ కార్డు ఉపయోగించాలి. ఈ ఈఎంఐని మూడు, ఆరు లేదా 12 నెలల్లో కట్టేయాలి. ఇప్పటి వరకు ఈ విధానంలో నలుగురు వినయోగదారులు ఆ మామిడిపళ్లను కొనుగోలు చేసినట్లు గౌరవ్ తెలిపారు. (చదవండి: సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
ఎస్బీఐకి రూ.50వేలు జరిమానా
విశాఖ లీగల్: రుణం ఇవ్వకుండానే ఓ వ్యక్తి నుంచి 10 నెలలు ఈఎంఐ వసూలు చేసిన విశాఖలోని ఎన్ఏడీ కొత్త రోడ్లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖకు జిల్లా వినియోగదారుల ఫోరం–2 రూ.లక్ష జరిమానా విధించింది. దీనిపై బ్యాంక్ అధికారులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో అప్పీలు చేయగా, జరిమానాను రూ.50వేలకు తగ్గించింది. విశాఖలోని మురళీనగర్కు చెందిన మాథా ఉదయభాస్కర్ భారత సైన్యంలో పనిచేస్తున్నారు. ప్రతి నెలా ఆయన జీతం ఎన్ఏడీ కొత్త రోడ్లోని ఎస్బీఐ శాఖలో ఉన్న తన ఖాతాలో జమ అవుతుంది. ఉదయభాస్కర్ మధురవాడలో సొంత ఇంటి నిర్మాణం కోసం రూ.25లక్షలు రుణం కావాలని 2017లో ఎస్బీఐ ఎన్ఏడీ కొత్త రోడ్ శాఖ అధికారులను సంప్రదించారు. రుణం ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు అంగీకరించి, ఆయనతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. ఇంటికి కొన్ని అనుమతులు రాకపోవడం వల్ల రుణం మంజూరు చేయలేదు. కానీ, రుణం ఇచ్చి నట్లుగానే ఉదయభాస్కర్ బ్యాంక్ ఖాతా నుంచి నెలకు రూ.21,538 చొప్పున 10నెలలు రూ.2,15,380లు, సరైన సమాచారం ఇవ్వలేదని మరో రూ.10వేలు కట్ చేసుకున్నారు. బీమా సొమ్ము కింద పీఎన్బీ మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు రూ.2,701 తీసుకున్నారు. తన ఖాతా నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంక్, బీమా కంపెనీవారిని ఉదయభాస్కర్ కోరినా పట్టించుకోలేదు. దీంతో ఆయన 2019లో విశాఖలోని వినియోగదారుల ఫోరం–2లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేసిన ఫోరం–2 న్యాయమూర్తి జి.వేంకటేశ్వరి, సభ్యులు డాక్టర్ రమణబాబు, పి.విజయదుర్గ.. వినియోగదారుడికి సేవాలోపం కలిగించినందుకు ఎస్బీఐ ఎన్ఏడీ కొత్త రోడ్ శాఖకు రూ.లక్ష జరిమానా విధిస్తూ 2022, మేలో తీర్పు చెప్పారు. ఈఎంఐ, జరిమానా, బీమా రూపంలో తీసుకున్న రూ.2,15,380లను12% వడ్డీతో చెల్లించాలని, ఖర్చుల కింద మరో రూ.20వేలను కలిపి 45 రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై బ్యాంక్ అధికారులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా విచారణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి ఫోరం తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఆదేశిస్తూ జరిమానాను తగ్గించారు. -
ఇక బ్యాంకుల బాదుడు షురూ?.. భారం కానున్న లోన్ ఈఎంఐలు
ఇదిలాఉండగా, ఏప్రిల్తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల రుణ సమీకరణ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్) మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ ఆధారిత రేటును బ్యాంకులు వ్యవస్థపై 100 నుంచి 150 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) బదలాయించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ఇదే జరిగితే వాహన, వ్యక్తిగత, ఆటో, వాణిజ్య రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. గత నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపది విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. వచ్చే నెల్లో జరిగే సమావేశాల్లోనూ పావుశాతం రేటు పెంపు ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022 నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం ఎగువనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రుణ రేట్ల పెరుగుదల నేపథ్యంలో గడచిన ఏడాది కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తంగా డిపాజిట్ రేట్లు కూడా 1.5 శాతం నుంచి 2 శాతం పెరిగాయి. వ్యవస్థలో డిపాజిట్లు కూడా 75 బేసిస్ పాయింట్లు పెరిగాయి. -
కారు ఈఎమ్ఐ చెల్లించే సులభమైన టిప్స్, ఇవే!
చాలామంది కార్లను ఈఎమ్ఐ పద్దతిలో కొనుగోలు చేస్తూ ఉంటారు, మొదట్లో బాగున్నప్పటికీ క్రమంగా కార్ ఈఎమ్ఐ భారంగా మారుతుంది. అయితే కారు లోన్ చెల్లించడానికి కొన్ని సులమైన మార్గాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. కారుని సెలక్ట్ చేసుకోవడం: కొనుగోలుదారుడు ముందుగా తాను ఎలాంటి కారు కొనాలనేది డిసైడ్ చేసుకోవాలి. కారు కొనడానికి మీ ఆర్థిక పరిస్థితిని కూడా బేరీజు వేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. తక్కువ డబ్బుతో కారు కొనాలనుకున్నప్పుడు హ్యాచ్బ్యాక్ ఎంచుకోవడం మంచిది. ప్రీమియం SUV ఎంచుకుంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. డౌన్ పేమెంట్ పెంచుకోవడం: నిజానికి మీరు మొదట్లో చెల్లించే డౌన్ పేమెంట్ మీద కూడా ఈఎమ్ఐ ఆధారపడుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడం వల్ల చెల్లించాల్సిన ఈఎమ్ఐ తగ్గుతుంది. మొత్తం వడ్డీ మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. అడిషినల్ ఈఎమ్ఐ చెల్లించడం: మీరు ఎంచుకునే ఈ అడిషినల్ ఈఎమ్ఐ వల్ల లోన్ భారం కొంత తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లోన్ కాలపరిమితి, వడ్డీ రేటు రెండూ కూడా తగ్గుతాయి. ఉదాహరణకు నెలకు రూ. 19,500 చెల్లిస్తున్నారనుకుంటే, అదనంగా ప్రతి నెల రూ. 500 చెల్లించాలి. అప్పుడు మీరు నెలకు రూ. 20,000 చెల్లించవచ్చు. ఇది ఈఎమ్ఐ చివరలో కొంత ఉపశమనం కలిగిస్తుంది. లోన్ ముందస్తుగా చెల్లించడం: మీరు తీసుకున్న లోన్ లేదా ఎంచుకున్న ఈఎమ్ఐ ముందస్తుగా చెల్లించడం వల్ల అది మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. ముందుగానే ఈ ఎంపిక గురించి తెలుసుకోవాలి, అప్పుడు మీకు వడ్డీ ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం: మీరు ప్రతి నెల లోన్ చెల్లిస్తున్నట్లయితే తప్పకుండా అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు మీకు ఆర్ధిక భారాన్ని పెంచుతాయి. అయితే మీరు కారు కొనేటప్పుడే నిత్యావసరాల ఖర్చులను కూడా అంచనా వేసుకోవాలి. ఇవన్నీ ఈఎమ్ఐ తొందరగా క్లియర్ సహాయపడతాయి. -
RBI repo rate hike షాకింగ్ న్యూస్: ఇక ఈఎంఐల బాదుడే బాదుడు!
సాక్షి,ముంబై: ఈఎంఐలు కట్టే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 6.25 శాతం ఉన్న కీలకమైన రెపోరేటును 6.50 శాతానికి పెంచింది. దీని ప్రభావం అన్నిరకాల లోన్లపైనా పడనుంది. కార్లు, వివిధ రకాల వాహనాల లోన్లు, వ్యక్తిగత, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయి. తాజా రెపో రేటు పెంపుతో అన్ని రకాల లోన్లపై రుణ భారం సుమారు 2-4 శాతం వరకు పెరగనుంది. దీంతో ఖాతాదారులపై ఈఎంఐల భారం మరింత పెరగనుంది. అయితే ఈ భారం నుంచి కాస్త ఊరట కలగాలంటే.. అవకాశం ఉన్న రుణగ్రహీతలు లేదా వారి రుణాలను తిరిగి చెల్లించడానికి అదనపు నగదు చెల్లింపును లేదా ఈఎంఐ భారాన్ని భరించలేని వారు రుణకాలాన్ని పొడిగించుకోవడమో చేయాల్సి ఉంటుంది. కొత్తగా లోన్లు తీసుకునే వారితో పాటు ఇప్పటికే ఈఎంఐలు చెల్లిస్తున్నవారు కూడా పెరిగిన వడ్డీ రేట్లకు అనుగుణంగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ తీసుకునే వడ్డీ శాతాన్నే రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. అదుపులో ఉన్నప్పుడు తగ్గిస్తుంది లేదా అదే రేటును కొనసాగిస్తుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. బ్యాంకులకు వడ్డీ భారంగా మారుతుంది. దీంతో బ్యాంకులు ఆ భారాన్ని నేరుగా ఖాతాదారుల మీదకు మళ్లించి ఆ మేరకు వడ్డీలను వసూలు చేస్తాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాల వడ్డీ రేట్ల బాదుడుకు సిద్ధపడతాయి. అయితే ఈ మేరకు ఖాతాదారుల డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు కూడా పెరగ నుంది (ఇదీ చదవండి: సామాన్యులపై ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ) -
స్వరా ఫైనాన్స్ కస్టమర్లకు నివాబూపా కవరేజీ
న్యూఢిల్లీ: స్వరా ఫైనాన్స్తో నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఒప్పందం చేసుకుంది. దీనికింద స్వరా ఫైనాన్స్ నుంచి రుణాలు తీసుకునే వారికి ‘ఎక్స్ప్రెస్ హెల్త్ – సీరియస్ ఇల్నెస్ ప్లాన్ బెనిఫిట్’ను ఆఫర్ చేయనుంది. ఈ ప్లాన్ ఏడాది, రెండేళ్ల కాలానికి లభిస్తుంది. స్వర ఫైనాన్స్ రుణ గ్రహీతలు ఈ ప్లాన్ తీసుకుని, ఏదైనా అనారోగ్యంతో ఐదు రోజులు, అంతకుమించి ఎక్కువ కాలానికి హాస్పిటల్లో చేరినప్పుడు.. మూడు ఈఎంఐలను నివా బూపా చెల్లిస్తుంది. నేడు గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం మందికి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదని.. ఈ అంతరం పూడ్చేందుకు స్వరా ఫైనాన్స్తో కలసి ఈ పాŠల్న్తో ముందుకు వచ్చామని నివాబూపా తెలిపింది. బ్యాంకుల పరిధిలో లేని కస్టమర్లకు స్వరా ఫైనాన్స్ రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తుంటుంది. చదవండి: ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు.. ఆదాయం, లాభాలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా? -
న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ!
ముంబై: గృహ రుణాలకు సంబంధించి దిగ్గజ సంస్థ హెచ్డీఎఫ్సీ రుణ రేటు భారీగా 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 8.65 శాతానికి ఎగసింది. పెరిగిన రేటు మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన తెలిపింది. మే నెల నుంచి హెచ్డీఎఫ్సీ రుణ రేటు 225 బేసిస్ పాయింట్లు పెరిగింది. కాగా, 800 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే 8.65 శాతం కొత్త రేటు అందుబాటులో ఉంటుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే అత్యల్ప రేటు అని కూడా వివరించింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా బ్యాంక్ లోన్ వస్తుందా!
బ్యాంక్ నుంచి పొందే లోన్ ఎటువంటిదైనా సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ బాగుంటేనే మనం బ్యాంక్ నుంచి అవసరమైన రుణం పొందవచ్చు. కానీ క్రెడిట్ పేమెంట్ చేయక పోవడం వల్ల బ్యాంక్లు రుణాల్ని ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. కానీ సిబిల్ స్కోర్ బాగాలేకపోయినా కేవలం ఒక్క పద్దతిలోనే పర్సనల్ లోన్ పొందవచ్చు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యమనేది బ్యాంక్ అధికారుల నిర్ణయంపై ఆదారపడి ఉంది. వడ్డీ రేటు ఎక్కువే పర్సనల్ లోన్కి సిబిల్ స్కోర్ చాలా అవసరం. కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గకుండా టైం టూ టైం పేమెంట్ చేసేలా చూసుకోవాలి. మనలో చాలామంది క్రెడిట్ కార్డ్ స్కోర్ తక్కువగా ఉన్నా బ్యాంక్ లోన్ల కోసం ట్రై చేస్తుంటారు. అయతే బ్యాంక్ లు లోన్లను రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే ఒక్క పద్దతిలో మాత్రమే సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోయినా లోన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సిబిల్ స్కోర్ సరిగ్గా లేకుండా మన లోన్ మొత్తం రూ.10లక్షలు అవసరం ఉంటే బ్యాంకులు రూ.5లక్షలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతాయి. అంతకంటే ఎక్కువ రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిపోతుంది ►క్రెడిట్ కార్డ్ విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు క్రెడిట్ కార్డ్ స్కోర్ పై ప్రభావితం చూపిస్తాయి. వాటిలో సమయానికి లోన్, ఈఎంఐ చెల్లించకపోవడం ►నాలుగైదు నెలల ఈఎంఐని ఒకేసారి కట్టడం ►తక్కువ సమయంలో ఎక్కువ క్రెడిట్ కార్డ్ల కోసం అప్లయి చేయడం ►క్రెడిట్ కార్డ్ ను లిమిట్గా వాడుకోకపోవడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ కనీసం 750లు అంతకంటే ఎక్కువ ఉండేలా చూసువాలి. -
నెలవారీ చెల్లింపులు మరింత భారం
ముంబై: వరుసగా ఐదో విడత ఆర్బీఐ కీలక రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 0.35 శాతం పెరిగి 6.25 శాతానికి చేరింది. ఇది విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉంది. దీంతో గృహ రుణాలు సహా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు ఈ మేరకు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే గృహ రుణాలపై ఈఎంఐలు 23 శాతం వరకు పెరిగినట్టయింది. ఈ భారం ఎలా ఉంటుందంటే 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్న వారిపై ఈఎంఐ 17 శాతం, 30 ఏళ్ల కాలానికి తీసుకున్న వారిపై 23 శాతం మేర (8 నెలల్లో) ఈఎంఐ పెరిగినట్టయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందన్న గత అంచనాను ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 6.8 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఎంపీసీ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. వృద్ధిని దృష్టిలో పెట్టుకుని తమ చర్యలు వేగంగా ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చారు. వృద్ధి అంచనాలకు కోత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర ఉండొచ్చని తాజాగా ఆర్బీఐ అంచనా వేసింది. గత అంచనా 7 శాతంతో పోలిస్తే కొంత తగ్గించింది. అంతేకాదు ఇలా వృద్ధి అంచనాలను తగ్గించడం ఇది మూడోసారి. పలు అంతర్జాతీయ ఏజెన్సీలు, రేటింగ్ సంస్థలు సైతం భారత్ వృద్ధి అంచనాలను దిగువకు సవరించడం తెలిసిందే. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మాంద్యం, కఠినంగా మారుతున్న ద్రవ్య పరిస్థితులను వృద్ధికి ప్రతికూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపైనా వీటి రిస్క్ ఉంటుందన్నారు. అయినప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును చూపిస్తోందంటూ, ప్రపంచంలో భారత్ చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మరోసారి గుర్తు చేశారు. డిసెంబర్తో (క్యూ3) ముగిసే త్రైమాసికంలో 4.4 శాతం, 2023 జనవరి–మార్చి (క్యూ4)లో 4.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో 7.1 శాతం, క్యూ2లో 5.9 శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. రబీ సాగు బాగుండడం, అర్బన్ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా కొనసాగడం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ మెరుగుపడడం, తయారీ, సేవల రంగాల్లో పునరుద్ధానం సానుకూలతలుగా శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుంది.. మార్చి త్రైమాసికంలో నిర్దేశిత 6 శాతం లోపునకు ద్రవ్యోల్బణం దిగొస్తుంది. ద్రవ్యోల్బణానికి సంబంధించి గడ్డు పరిస్థితులు ఇక ముగిసినట్టే. రేటు పెంపు తక్కువగా ఉండడం అన్నది ధరలపై పోరాటం విషయంలో మేము సంతృప్తి చెందినట్టు కాదు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుంది. ఇక ఆర్బీఐ ఇటీవలే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) లావాదేవీలను రిటైల్, హోల్సేల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ప్రయోగాత్మక పరీక్షల్లో ఫలితాల పట్ల సంతృప్తిగా ఉన్నాయి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ పాలసీలోని ఇతర అంశాలు ►ఆరుగురు సభ్యుల ఎంపీసీలో 0.35 శాతం రేటు పెంపునకు ఐదుగురు ఆమోదం తెలిపారు. ►సర్దుబాటు విధాన ఉపసంహరణను ఆర్బీఐ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ►ఆర్బీఐ రెండేళ్ల విరామం తర్వాత రేట్లను ఈ ఏడాది మే నెలలో తొలిసారి సవరించింది. మేలో 0.40 శాతం పెంచగా, జూన్ సమీక్షలో అర శాతం, ఆగస్ట్లో అర శాతం, సెప్టెంబర్ సమీక్షలోనూ అర శాతం చొప్పున పెంచుతూ వచ్చింది. ►యూపీఐ ప్లాట్ఫామ్పై ‘సింగిల్ బ్లాక్, మల్టీ డెబిట్స్’ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో ఈ కామర్స్, సెక్యూరిటీల్లో పెట్టుబడుల చెల్లింపులు సులభతరం అవు తాయని పేర్కొంది. అంటే కస్టమర్ ఒక ఆర్డర్కు సంబంధించిన మొత్తాన్ని తన ఖాతాలో బ్లాక్ చేసుకుని, డెలివరీ తర్వాత చెల్లింపులు చేయడం. ►భారత నియంత్రణ సంస్థల విశ్వసనీయతను అభివృద్ధి చెందిన దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. రేట్ల పెంపు స్పీడ్ తగ్గినట్టే ఆర్బీఐ పాలసీ ప్రకటన మా అంచనాలకు తగ్గట్టే ఉంది. విధానంలోనూ మార్పులేదు. ప్రకటన కొంచెం హాకిష్గా (కఠినంగా) ఉంది. రేట్ల పెంపు సైకిల్ ముగిసిందనే సంకేతాన్ని ఇవ్వలేదు. – సాక్షి గుప్తా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2022–23 సంవత్సరానికి 6.7 శాతం వద్ద కొనసాగించడం, సీక్వెన్షియల్గా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న అంశాలు తెరముందుకు వచ్చాయి. ఇదే ధోరణి స్థిరంగా ఉంటూ, ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకునేందుకు దారితీస్తుందా అన్నది చూడాలి. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ రెపో రేటు ఏ మాత్రం పెంచినా ఆ ప్రభావం అంతిమంగా వినియోగదారుడిపై, గృహ కొనుగోలుదారులపై పడుతుంది. బ్యాంకులు రేట్ల పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తాయి. దీంతో స్వల్పకాలంలో ఇది కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తుంది. – హర్షవర్ధన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ -
జోరుగా సెకండ్ హ్యాండ్ బైక్లు, కార్ల అమ్మకాలు.. కారణాలు ఇవే!
కర్నూలు(సెంట్రల్): అవసరాలకు అనుగుణంగా ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో గతేడాది సెకండ్ హ్యాండ్ షోరూముల్లో దాదాపు 5 వేల కార్లు, 10 వేల బైక్ల వరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. ఏ కంపెనీ బైక్ తీసుకున్నా దాదాపు రూ.లక్షకు అటు ఇటుగా ధరలు ఉన్నాయి. ఈఎంఐల రూపంలో తీసుకుంటే వడ్డీ, ఇతర చార్జీలు కలుపుకొని రెండేళ్ల వ్యవధిలో రూ. 1.40 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సగం ధరకే సెకండ్ హ్యాండ్ బైక్లు లభిస్తుండడంతో చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రైతులు, కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకొని బతికేవారు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెకండ్స్లో రూ.50 వేల నుంచి రూ. 70 వేల మధ్య రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న బైక్లు అందుబాటులో ఉన్నాయి. విలాసవంతమైన జీవితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవన విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో అన్ని వర్గాల ప్రజల జీవన గమనంలో వృద్ధి కనిపిస్తోంది. ఇదే క్రమంలో సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో మంచి పంటలు పండుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటికి గిట్టుబాటు ధరలు ఇస్తుండడంతో రైతన్నల ఇంటా ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు విలాసవంతమైన జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో అవసరాలకు తగ్గట్లుగా కార్లు, బైక్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. వెలుస్తున్న షోరూంలు.. సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుపై ప్రజలు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుండడంతో వ్యాపారులు అందుకు తగ్గట్లుగా షోరూంలను తెరుస్తున్నారు. కర్నూలులో 15 కారు, 20 బైక్ షోరూంలు ఉన్నాయి. ఆదోనిలో 5 కారు, 10 బైక్, నంద్యాలలో 5 కారు, 13 బైక్ షోరూంలు వెలిశాయి. వీటిని ఆయా పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సెకండ్ హ్యాండ్ షోరూముల్లో గతేడాది 5 వేల వరకు కార్లు, 10 వేల వరకు బైక్లు అమ్మకాలు జరిగాయి. ఈఎంఐ సదుపాయం సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్లకు కూడా కొన్ని ఫైనాన్స్ కంపెనీలు లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. తక్కువ వడ్డీ, తక్కువ డౌన్పేమెంట్స్తో ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ వసతి కూడా ఉంది. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కొనుగోలు చేసే వాహనాన్ని మొదట మెకానిక్కు చూపించి, దాని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రేటును నిర్ణయించుకోవాలి. తక్కువ దూరం తిరిగినవి మేలైన మన్నిక ఇస్తాయి. షోరూంలకు చిన్నపాటి మరమ్మతులకు గురైనవి అధికంగా వస్తుంటాయి. కొందరు అచ్చుబాటుకాక, మరికొందరు తక్షణ రుణావసరాల కోసం అమ్మి ఉంటారు. రికార్డులను పరిశీలించి, కొనుగోలు చేయడం ఉత్తమం. కార్లపై పెరిగిన ఆసక్తి... మార్కెట్లో పలు కంపెనీల కార్లు వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంది. సెకండ్స్లో రూ.లక్ష నుంచి సరసమైన ధరకు కార్లు లభిస్తున్నాయి. నాలుగైదు లక్షలు వెచ్చిస్తే మంచి కంపెనీ..రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న కార్లను కొనుగోలు చేయవచ్చు. దీంతో సామాన్యులు సైతం కార్ల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సెకండ్స్లో కార్లు కొనుగోలు చేస్తున్న వారిలో ఉద్యోగులు, రైతులు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారు ఎక్కువగా ఉంటున్నారు. కార్లు ఎక్కువగా కొంటున్నారు కర్నూలులోని నంద్యాల చెక్పోస్టు సమీపంలో మా షోరూం ఉంది. ఇటీవల కాలంలో ప్రజలు ఎక్కువగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. మా దగ్గర అన్ని రికార్డులు సక్రమంగా ఉంటాయి. కొనుగోలుదారులకు భవిష్యత్లో ఏమీ ఇబ్బందులు ఉండవు. నెలలో కనీసం 10 కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. – శ్రీనివాసులు సౌకర్యవంతంగా ఉంది మేం ఇటీవల సెకండ్ హ్యాండ్లో కారును కొనుగోలు చేశాం. దాని స్థితిగతి చాలా బాగుంది. మేము కొనుగోలు చేసిన వాహనం కొత్తదైతే రూ.10 లక్షల విలువ ఉంటుంది. సెకండ్స్లో దానిని రూ.4 లక్షలకే కొనుగోలు చేశాం. మా కుటుంబ అవసరాలకు చాలా సౌకర్యవంతంగా ఉంది. – రజనీకాంత్రెడ్డి, కర్నూలు సగం ధరకే కొనుగోలు చేశా నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. స్కూలుకు సమయానికి వెళ్లేందుకు కారును కొనుగోలు చేయాలని నిర్ణయించాను. అయితే మార్కెట్లో ఫస్టు హ్యాండ్ వాహనాలకు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనిపించింది. సెకండ్స్లో చూస్తే మేము అనుకున్న ధరకే లభించింది. దాదాపు సగం ధరకే కారును కొనుగోలు చేశా. – శ్రీనివాసరెడ్డి, కర్నూలు -
సర్వీస్ ఛార్జీల మోత : ‘ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్’
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్బీఐ భారీ షాకిచ్చింది. ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ ఫీజుపై అదనంగా రూ.100, అలాగే కొత్తగా రెంట్ పేమెంట్పై ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 15 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు కార్డు వినియోగదారులకు సమాచారం అందించింది. కస్టమర్లకు ఎస్బీఐ పంపిన మెసేజ్ ప్రకారం.. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా రెంటు పే చేస్తే.. ఆ రెంటుపై రూ.99+ జీఎస్టీ 18శాతం వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ నెలనుంచి అమల్లోకి రానున్నట్లు అందులో పేర్కొంది. ఉదాహరణకు.. సురేష్ తన ఇంటిరెంట్ రూ.12వేలను ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లించేవారు. బ్యాంకు సైతం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేసేవి కావు. కానీ తాజాగా ఎస్బీఐ తెచ్చిన నిబంధన మేరకు..సురేష్ తన ఇంటి రెంటును రూ.12వేలు చెల్లించడంతో పాటు అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.99, జీఎస్టీ 17.82 శాతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ప్రాసెసింగ్ ఫీజును పెంచింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డును వినియోగించి ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే .. ఆ వస్తువు ధర ప్రాసెసింగ్ ఫీజు రూ.199 (అంతకు ముందు రూ.99 ఉంది), 18శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంది. -
కస్టమర్లకు భారీ షాక్.. ఆ రెండు బ్యాంకులు కీలక నిర్ణయం!
కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు డీలా పడిన సంగతి తెలిసిందే. భారత్లో చూస్తే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం కట్టడికై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు సవరిస్తోంది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారంగా మారుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మరో రెండు బ్యాంకులు జత చేరాయి. ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్, ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ రుణ రేట్లు పెంచి తమ కస్టమర్లకు షాకిచ్చాయి. బాదుడే బాదడు! బ్యాంకులు వరుసపెట్టి వారి రుణ రేట్లు పెంచుతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ కూడా రుణ రేట్లు పెంచింది. తాజాగా ఇండియన్ బ్యాంకు తమ రుణ రేటును (MCLR) 35 బేసిస్ పాయింట్ల, ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటును (MCLR) 20 పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో లోన్ ఈఎంఐలు పెరగడంతో పాటు రుణాలపై వడ్డీ రేట్లు కూడా పైకి ఎగబాకుతాయి. పెంచిన వడ్డీ రేటు ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 7.4 శాతానికి చేరగా, ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.3 శాతానికి చేరింది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ పెంపు నిర్ణయం నవంబర్ 1 నుంచే అమలులోకి రాగా, ఇండియన్ బ్యాంక్ రుణ రేటు పెంపు నవంబర్ 3 నుంచి అమలులోకి రానుంది. చదవండి: యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి! -
హైదరాబాద్ లగ్జరీ జోష్.. దేశంలో రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: అందుబాటు ధరల రియల్టీ మార్కెట్గా ఉన్న హైదరాబాద్ లగ్జరీ విపణిగా అభివృద్ధి చెందింది. కరోనా కంటే ముందు వరకూ దేశంలో అఫర్డబులిటీ మార్కెట్లో హైదరాబాద్ ముందు వరుసలో నిలిచేది. కానీ, ఇప్పుడు దేశంలోని అత్యంత లగ్జరీ స్థిరాస్తి విపణిలో ముంబై తర్వాత భాగ్యనగరం రెండో స్థానానికి ఎదిగింది. దక్షిణాది రాష్ట్రాలలో అయితే మనదే తొలిస్థానం. ∙ గృహ కొనుగోలుదారుల సగటు ఆదాయం, నెలవారీ ఈఎంఐ చెల్లింపు నిష్పత్తి ఆధారంగా నైట్ఫ్రాంక్ కొనుగోలు సూచీని అంచనా వేసింది. దీని ప్రకారం.. 2010లో హైదరాబాద్లో ఆదాయంలో 53% ఈఎంఐ కోసం వెచ్చించేవారు. ఆ తర్వాత 2014లో 42%, 2019లో 33%, 2020లో 28%గా క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ, కరోనా తర్వాత వడ్డీ రేట్ల పెరుగుదలతో ఈఎంఐ భారం కూడా పెరిగింది. ఫలితంగా 2021లో ఆదాయంలో ఈఎంఐ వాటా 29%, 2022 నాటికి 31 శాతానికి వెచ్చించాల్సి వస్తోంది. ముంబైలో 2010లో ఆదాయంలో 93 శాతంగా ఈఎంఐగా చెల్లిస్తే సరిపోయేది. 2022 నాటికి 53 శాతానికి తగ్గింది. 22 % ఈఐఎం నిష్పత్తితో అహ్మదాబాద్ అత్యంత సరసమైన గృహ మార్కెట్గా నిలవగా.. 26%తో పుణే రెండో స్థానంలో, 27%తో చెన్నై మూడో స్థానంలో నిలిచింది. తగ్గిన కొనుగోలు శక్తి.: ఏడాది క్రితం 7.30 శాతంగా ఉన్న గృహ రుణ వడ్డీ రేట్లు ఏడాది కాలంలోనే 0.95% మేర పెరిగి 8.25కి చేరింది. దీంతో గృహ కొనుగోలు నిర్ణయాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నైట్ఫ్రాంక్ ఇండియా ‘అఫర్డబులిటీ ఇండెక్స్ క్యూ3–2022’ నివేదిక వెల్లడించింది. వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా స్థిరాస్తి కొనుగోళ్ల శక్తి సగటున 2% క్షీణించడంతో పాటూ ఈఎంఐలపై 7.4% అదనపు భారం పడుతుందని వివరించింది. చదవండి: ఎంబీబీఎస్ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా.. -
క్రెడిట్ కార్డ్ పేమెంట్ కష్టంగా మారిందా, అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
క్రెడిట్ కార్డ్... దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కార్డు ఉంది కదా అని ఇష్టానుసారంగా ఉపయోగిస్తే మాత్రం చివరకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీని గురించి పూర్తిగా తెలియక కొందరు కార్డ్లో లిమిట్ ఉందని వాడుతూ తిరిగి చెల్లించే సమయంలో నానాఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కరోనా మహమ్మారి దెబ్బతో ఉద్యోగాల కోత, చెల్లించని బిల్లులు, క్లియర్ కాని ఈఎంఐ(EMI)ల ఫలితంగా లక్షలాది మంది వ్యక్తులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చెల్లించని క్రెడిట్ కార్డ్ బిల్లుల కారణంగా.. ఆలస్యంగా కట్టడంతో ఫైన్లు, వడ్డీ రేట్లు పెరగడం వంటివి ఆర్థికంగా నష్టపరచడమే గాక మీ క్రెడిట్ స్కోర్కు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఆ సమయంలో వీటిని పాటించడం ద్వారా మీ భారం నుంచి కాస్త రిలీఫ్ పొందచ్చని నిపుణుల చెబుతున్నారు. 1. మినిమం బ్యాలెన్స్ చెల్లించడం క్రెడిట్ కార్డులోని మొత్తం రుణాన్ని చెల్లించకపోయినా, మినిమం బ్యాలెన్స్ నగదుని చెల్లించండి. దీని ద్వారా మీ క్రెడిట్ కార్డ్ని ఆపరేట్ చేసుకోవడంతో పాటు మీపై పడే వడ్డీ భారం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోర్ పడిపోకుండా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దాని వల్ల భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టంగా మారడంతో పాటు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీస చెల్లింపును కూడా చేయకుంటే, అదనంగా లేట్ ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. 2. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా రుణ భారం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ అమౌంట్ ఎక్కువగా ఉంటే.. దాన్ని చెల్లించేందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు బిల్లు డేంజరస్ లెవెల్కు చేరే ప్రమాదం కూడా ఉంది. అటువంటి పరిస్ధితులు రాకముందే దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతో అదే బ్యాలెన్స్తో కొత్త క్రెడిట్ కార్డ్ పొందుతారు, అది కూడా తక్కువ వడ్డీ రేటు. కొత్త కార్డ్ కావడంతో సంస్థలు ఇచ్చే బెనిఫిట్స్తో పాటు చెల్లించేందుకు కాస్త సమయం దొరుకుతుంది. 3. పర్సనల్ లోన్గా మార్చుకోండి మీ క్రెడిట్ కార్డ్ బిల్లుల భారంగా మారి వాటిని సకాలంలో చెల్లించడం కుదరుని పక్షంలో పర్సనల్ లోన్ తీసుకుని వాటిని చెల్లించే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్లతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీ రేటుతో మనకు లభిస్తాయి. పైగా క్రెడిట్ కార్డ్లా అధిక వడ్డీల భారం ఇందులో ఉండదు. వీటితో పాటు ఈఎంఐ( EMI) ఆఫ్షన్ కూడా ఉంటుంది. 4 మీ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించకపోవడం మంచిది రుణభారాన్ని మోస్తున్న కస్టమర్లు, ఆ బిల్లులు చెల్లించకుండానే మరిన్ని కొనుగోళ్లు చేయడం వల్ల మీ క్రెడిట్ కార్డ్లో బిల్లు కొండంత అవుతుంది. దాంతో అది మీ మొత్తం బకాయిపై వడ్డీ పడుతుంది, అది భారీ మొత్తంలో ఉంటుందని గుర్తించుకోవాలి. అందుకే క్రెడిట్ కార్డ్ని ఇష్టానుసారంగా కాకుండా క్రమపద్ధతిలో ఉపయోగించడం, అన్ని బకాయిలను క్లియర్ చేసుకుని, మళ్లీ ఉపయోగించడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: సామాన్యుడికి బిగ్ రిలీఫ్.. హమ్మయ్యా, రెండేళ్ల తర్వాత వాటి ధరలు తగ్గాయ్! -
బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే!
రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కేంద్రం నిర్దేశిస్తున్న 6% రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా 4 సార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎస్బీఐ, బీవోఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ రుణ రేట్ల పెంపు మొదలైంది. ఇటు ఆర్బీఐ అరశాతం రెపో పెంపు నిర్ణయం వెంటనే, అటు బ్యాంకింగ్ కూడా ఈ భారాన్ని కస్టమర్లపైకి మళ్లించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ హౌసింగ్ తమ రుణ రేట్లను 0.5% పెంచుతున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని బ్యాంకులూ రేటు పెంపు బాటలో పయనించే అవకాశం ఉంది. ► ఎస్బీఐ ఈబీఎల్ఆర్ (ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు) 50 బేసిస్ పాయింట్లు పెరిగి 8.55 శాతానికి చేరింది. రెపో ఆధారిత ఆర్ఎల్ఎల్ఆర్ కూడా ఇదే స్థాయిలో ఎగసి 8.15 శాతానికి ఎగసింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రెపో ఆధారిత రేటును అరశాతం పెంచింది. దీనితో ఈ రేటు 8.75 శాతానికి ఎగసింది. ► ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు అరశాతం పెరిగి 9.60కి చేరింది. కొన్ని స్థిర డిపాజిట్ల రేట్లను కూడా మార్చుతున్నట్లు బ్యాంక్ తెలిపింది. ► హెచ్డీఎఫ్సీ తన రుణ రేటును అరశాతం పెంచింది. అక్టోబర్ 1 నుంచి పెంపు అమ ల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. చదవండి: పండుగ బోనస్: భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్! -
మరో బాదుడు.. కెనరా బ్యాంక్ రుణ రేటు పెంపు
ఇప్పటికే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నెలలో ద్రవ్యోల్బణం కట్టడిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుని పెంచిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారమనే చెప్పాలి. తాజాగా ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం వరకూ పెంచింది. పెంచిన రేట్లు బుధవారం(సెప్టంబర్ 7) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ పేర్కొంది. తాజా పెంపుతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు భారం కానున్నాయి. తాజా పెంపుతో ఏడాది రుణ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగింది. ఓవర్నైట్, నెల వ్యవధుల ఎంసీఎల్ఆర్ 0.10% మేర పెరిగింది. -
ఆ లోన్ తీసుకున్నవారికి భారీ షాక్.. .. ప్చ్, ఈఎంఐ మళ్లీ పెరిగింది!
దేశంలో ద్రవ్యోల్పణాన్ని కట్టడి చేసేందుకు ఇటీవల ఆర్బీఐ రెపో రేటుని పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పలు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచే పనిలో పడ్డాయి. తాజాగా ప్రముఖ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. హోమ్ లోన్స్పై ఉన్న రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ రుణాల బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. కాగా పెంచిన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు ఆగస్టు 9 నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ నెలలో ఇది రెండవ పెంపు కావడం గమనార్హం. మూడు నెలల్లో హెచ్డిఎఫ్సి చేపట్టడం ఇది ఆరోసారి. మే 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం రేటు 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో గృహ రుణాలు తీసుకున్న కస్టమర్ల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. మే నుంచి ఆర్బీఐ ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్ల పెంపుదలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరోసారి సెప్టెంబరుతో పాటు డిసెంబర్లో కూడా ఆర్బీఐ సమావేశం కానుంది. ఏది ఏమైనా భారం మాత్రం తప్పట్లేదని సామన్య ప్రజలు వాపోతున్నారు. మూడు నెలల కాలంలోనే ఆర్పీఎల్ఆర్ (RPLR) చాలా అధికంగా పెరగడంతో హోం లోన్స్ తీసుకున్న వారు అధిక ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోంది. చదవండి: Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు? -
పెరుగుతున్న వడ్డీ రేట్లు.. భారం తగ్గించుకోవాలంటే ఇలా చేయండి!
సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే ప్రక్రియలో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.40 శాతాని చేరింది. మే నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడో సారి రెపో రేటును పెంచింది. మే నుంచి ఆగస్టు మధ్య కాలంలో రెపో రేటు 140 బేసిస్ పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం పెంచిన రెపో రేట్ల ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది. ఆగస్టు 5న ఆర్బీఐ రెపో రేటు పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా ఇతర బ్యాంకులు రుణ రేట్లను పెంచాయి. అయితే కొన్ని నిబంధనలను పాటించడం ద్వారా కస్టమర్లపై పడే వడ్డీ భారాన్నీ తగ్గించుకోవచ్చు. ఈఎంఐ( EMI) లేదా లోన్ కాలపరిమితిని పెంచాలా? పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. ప్రస్తుతం హోమ్ లోన్ తీసుకొని కస్టమర్లు వారి ఈఎంఐ కాలాన్ని పెంచుకోవడం, లేదా మీ లోన్ కాలపరిమితిని పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే లోన్ టెన్యూర్ పెంచుకుంటే మీ ఈఎంఐ పెంపు ఆప్షన్ కంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్ ప్రీపేమెంట్ వడ్డీ భారాన్ని తగ్గింపు కోసం కస్టమర్లు ముందస్తు చెల్లింపు చేయవచ్చు. అనగా తమ హోమ్లోన్లను ముందస్తుగా చెల్లించాలి. వడ్డీ వ్యయం తగ్గించుకునేందుకు లోన్ కాలపరిమిత తగ్గింపు ఆప్షన్ ఎంచుకోవాలి. అంతేకాకుండా రెగ్యులర్ ప్రీపేమెంట్ వల్ల బకాయి ఉన్న లోన్ మొత్తం గణనీయంగా తగ్గుతుంది. అకౌంట్ ట్రాన్స్ఫర్ తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం మరో ఆప్షన్. అర్హత ఉన్న రుణగ్రహీతలు తమ హోమ్ లోన్లను ప్రస్తుతం ఉన్న బ్యాంక్ కంటే తక్కువ వడ్డీ రేట్లు అందించే ఇతర బ్యాంకుకు మార్చుకునే వెసలుబాటు ఉంది. అయితే ఈ ప్రక్రియకు అదనపు ఖర్చులు అవుతాయని గుర్తుంచుకోండి. లోన్ తీసుకున్న కస్టమర్లు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకునే ముందే వారికి ఎదురయ్యే లాభనష్టాలను చెక్ చేసుకోవడం మంచిది. చదవండి: అధ్యక్షా.. బాస్ అంటే ఇట్టా ఉండాలా.. అదిరిపోయే జీతం, బోలెడు బెనిఫిట్స్ కూడా.. -
ఆర్బీఐ షాక్: ఇక ఈఎంఐలు భారమే!
సాక్షి,ముంబై: కేంద్ర బ్యాంకు ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో 50 బీపీఎస్ పాయింట్లు మేర రెపోరేటును నిర్ణయాన్ని ఏకగగ్రీవంగా తీసుకున్నారు. దీంతో రెపో రేటు 5.40 శాతాని చేరింది. ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది. రెపో రేట్ పెరిగితే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు పెంచకుండా ఉండవు. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ముఖ్యంగా రెపో రేట్కు అనుసంధానమైన హోమ్ లోన్లు తీసుకున్న వారికి తాజా సవరణతో సమస్య తప్పదు. దాదాపు 40 శాతం రుణాల రేట్లు ఇలానే ఉంటాయి. అలాగే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూలంగా ఉండనుంది. (చదవండి: Adani Road Transport: అదానీ హవా, 3 వేల కోట్ల భారీ డీల్ హోం లోన్ తీసుకున్నవారికి మరో భారీ షాక్ తప్పదా? ఏం చేయాలి? -
అడ్డగోలు ఈఎంఐలు.. భర్తపై కోపంతో బలవన్మరణం
కృష్ణా (మచిలీపట్నం): ఇంట్లో వాయిదాల పద్ధతిపై కొనుగోలు చేసిన వస్తువుల కారణంగా ఏర్పడిన వివాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అనవసరమైన ఖర్చులు పెడుతూ పిల్లల భవిష్యత్తును గాలికి వదిలేస్తున్నాడంటూ భర్తపై కోపం తెచ్చుకున్న భార్య ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ నాగకళ్యాణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మచిలీపట్నం అరుణోదయకాలనీకి చెందిన రాగోలు సత్యవతి (25) అదే కాలనీకి చెందిన అశోక్బాబును ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం నారాయణపురంలో నివాసం ఉంటున్నారు. సజావుగా సాగిపోతున్న వీరి కాపురంలో ఈఎంఐలు కలతలు రేపాయి. భర్త ఇంట్లోకి అవసరమైన ఫ్రిజ్, వాషింగ్ మిషన్ తదితర వస్తువులను వాయిదాల పద్ధతిలో ఇటీవల కొనుగోలు చేశాడు. ప్రతి నెల వాయిదాలు చెల్లించటం కష్టంగా మారటంతో సత్యవతి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా అప్పులు చేసి వస్తువులు కొనుగోలు చేయటం మనకు అవసరమా అంటూ మందలించటం మొదలుపెట్టింది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుండగా బుధవారం తీవ్ర మనస్తాపానికి చెందిన సత్యవతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి తండ్రి రాజేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
హోం లోన్ తీసుకున్నవారికి మరో భారీ షాక్ తప్పదా? ఏం చేయాలి?
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం (ఎంపీసీ) ఆగస్టు 3 బుధవారం ప్రారంభం కానుంది. అయితే రెపో రేటు బాదుడు తప్పదనే అంచనాల మధ్య హోం లోన్ రేట్లు ఎంత పెరుగుతాయోననే ఆందోళన వినియోగదారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ద్రవ్యోల్బణానికి చెక్ చెప్పేలా ఆర్బీఐ వరుసగా మూడోసారి రెపో రేటును పెంచే అవకాశం ఉందని మార్కెట్వర్గాలు, ఇటు నిపుణులు భావిస్తున్నారు. (నిర్మలా సీతారామన్పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ) ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ తాజా రివ్యూలో రెపో రేట్లను పెంచే అవకాశాలపైనే ఎక్కువ అంచనాలు కనిపిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని, దాదాపు 35-50 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. అంచనాలకనుగుణంగా రెపో రేటు పెరిగితే, అనివ్యారంగా బ్యాంకులు కూడా మొత్తం రేటు పెంపును కస్టమర్లకు బదిలీ చేస్తాయి. రెపో రేటు పెరిగితే ఆర్బీఐకి బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్ల మీదే వేస్తాయి. ఈ నేపథ్యంలో ఇంటిలోన్లపై భారం తప్పదు. ఉదా: రూ. 50 లక్షల రుణం, 7.65 శాతం వడ్డీతో 20 సంవత్సరాల కాలవ్యవధితో ఉన్న లోన్పై వడ్డీ రేటు 0.50 శాతం పెంచితే, వడ్డీ రేటు 8.15కి పెరుగుతుంది అనుకుంటే, రుణ వ్యవధిని రెండేళ్లు పొడిగింపు ఆప్షన్ ఎంచుకోవచ్చు. అయితే లోన్ కాలం రెండేళ్లు పొడిగించడంతో ఖచ్చితంగా రూ. 10.14 లక్షలు అదనపుభారం తప్పదు. ఒకవేళ చెల్లించాల్సిన కాలం కాకుండా, ఈఎంఐ భారాన్ని పెంచుకుంటే.. ఉదా: 20 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 50 లక్షల రుణంపై, వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని భావిస్తే.. మునుపటి ఈఎంఐ రూ. 40,739తో పోలిస్తే రూ. 42,289 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంటి రుణం తీసుకున్న వారు ఏ సిస్టంలో ఉన్నారో చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం ఈఎంఐ పెంచుకోవడమా, కాల వ్యవధిని పెంచుకోవడమా అనేది రుణగ్రహీత జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇప్పటికే లోబడ్జెట్లో ఉండి ఉంటే పొదుపు, ఖర్చులపై దెబ్బపడకుండా లోన్ టెన్యూర్ను లేదా ఈఎంఐని పెంచుకోవడంమంచిది. అలాగే ఏ ఆప్షన్ ఎంచుకన్నా, దీర్ఘకాలిక రాబడి, భవిష్యత్తు అవసరాలకోసం ఎంతో కొంత పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) కాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని పాలసీ కమిటీ మూడు రోజుల పాటు సమావేశం కానుంది. పాలసీ విధానాన్ని శుక్రవారం (ఆగస్టు 5న) ప్రకటించనుంది. అయితే ఈ సారి రివ్యూలో కూడా రేటు పెంపు తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఐ మే 4, 2022 నుండి రెపో రేటును 0.9 శాతం పెంచింది. ఫలితంగా 6.72 శాతం వద్ద గృహ రుణం తీసుకున్న వారు ఇప్పుడు 7.62 శాతం చెల్లించాల్సి వస్తోంది. గత రెండు మానిటరీ పాలసీ సమావేశాల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇటీవల అమెరికా ఫెడ్ రికార్డు స్థాయిలో 75 బేసిస్ పాయింట్లు రేట్లు పెంచింది. అలాగే ఆ తరువాత కూడా పెంపు ఉంటుందనే సంకేతాలు అందించింది. -
వినియోగదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకు షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం పెంచింది. అన్ని రకాల టెన్యూర్స్పై ఈపెంపు వర్తిస్తుందని బుధవారం ప్రకటించింది. దీంతో రుణాల ఈఎంఐలపై భారం పడనుంది. సవరించిన కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఏడాదికాల రుణాలపై ఎంసీఎల్ ఆర్ 7.25 - 7.40 శాతానికి పెరిగింది. అలాగే ఓవర్నైట్, ఒక నెల, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 6.7, 6.80, 6.90 శాతానికి చేరుకోగా, ఆరు నెలల వడ్డీరేటు 7.10 శాతానికి పెరిగింది. గత నెల మేలో ఆర్బీఐ రేటును పెంచిన తర్వాత ఈ మార్పు చోటు చేసుకొంది. -
హోమ్లోన్.. భారంగా మారుతోంది!
నాలుగేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును ఆర్బీఐ 0.40 శాతం పెంచడం ఆలస్యం.. వరుసగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణ రేట్ల పెంపును అమల్లోకి తెస్తున్నాయి. ముఖ్యంగా 2020 నుంచి వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగాయి. మంచి క్రెడిట్ స్కోరుతో మూడు నెలల క్రితం బ్యాంకును సంప్రదించి ఉంటే 6.5 శాతానికే గృహరుణం లభించేది. కానీ, ఇప్పుడు వెళ్లి అడిగితే 6.9–7 శాతం కంటే చౌక ఆఫర్ వినిపించకపోవచ్చు. ప్రముఖ గృహ రుణ సంస్థ హెచ్డీఎఫ్సీ సైతం రుణ రేట్లను 7–7.45 శాతానికి పెంచింది. ఎస్బీఐ సహా ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా రేట్లను సవరించాయి. రుణాల రేట్లే కాదు డిపాజిట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో గృహ రుణం తీసుకోవాలని భావించే వారు ఇప్పుడు అప్రమ్తతం కావాలి. ఎందుకంటే గత ఏడాది కాలంలో మంజూరు చేసిన రుణాల్లో సగానికి సగం రెపో రేటు ఆధారితమే. కనుక రెపోతో పాటు రెపో రుణ రేట్లు కూడా వెనువెంటనే సవరణకు లోనవుతాయి. ఇది రుణ గ్రహీతలకు భారంగా మారుతుంది. కనుక గృహ రుణ గ్రహీతలు ఈ తరుణంలో ఏది చేస్తే బావుంటుంది..? నిపుణుల సూచనలు ఎలా ఉన్నాయి..? వేచి చూస్తే లాభం లేదు.. వడ్డీ రేటు తక్కువకు లభిస్తుందేమో..? అని వేచి చూడడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటున్న వేళ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం అసాధ్యం. రానున్న ఏడాది కాలంలో పలు విడతలుగా ఆర్బీఐ కీలక రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఒకవేళ రెండు, మూడో ఇల్లు కొనుగోలు చేస్తుంటే కనుక వేచి చూస్తానంటే అది వేరే విషయం. కానీ, మొదటి ఇల్లు సమకూర్చుకోవాలన్నది మీ ప్రాధాన్య జాబితాలో ఉంటే వెంటనే గృహ రుణంతో ఇల్లు సమకూర్చుకోవడమే రైట్. ఇక్కడ గృహ రుణ రేటే కాదు.. ప్రాపర్టీ రేటు కూడా చూడాలి. కరోనా సంక్షోభానంతరం రియల్టీ మార్కెట్లో ధరలు పడిపోయి అక్కడి నుంచి కోలుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. కనుక ప్రాపర్టీ ధరలతో ముడిపెట్టి గృహ రుణ రేటును చూడాలి. వేచి చూస్తే ప్రాపర్టీ ధరలు దిగొస్తాయా..? లేక రెక్కలు విప్పుకుంటాయా..? ఎవరు చెప్పగలరు. ఆలస్యం చేస్తే ముందు ముందు మరింత అధిక రేటుపై రుణం తీసుకోవాల్సి రావచ్చు. ప్రతి 10 బేసిస్ పాయింట్లు (అంటే 0.1 శాతం) రుణ రేటు పెరిగితే రూ.లక్షపై ఒక ఏడాదికి పడే అదనపు భారం రూ.100. రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే అప్పుడు రూ.5000 భారం అవుతుంది. కనుక మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారు రుణదాతలతో సంప్రదింపులు చేయడం వల్ల కనిష్ట రేటుపై గృహ రుణం లభించే అవకాశం లేకపోలేదు. రుణ రేట్లను తగ్గించే అధికారం అందరికీ ఉండదు. బ్యాంకు హోంశాఖ లేదంటే ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ను ఈ విషయమై సంప్రదించొచ్చు. ఫోన్ కాల్స్తో రుణ రేట్ల గురించి బేరమాడడం ఫలితాలనివ్వదు. మరోవైపు కమోడిటీల మంటలతో నిర్మాణ వ్యయాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ భారాన్ని ఇళ్ల విక్రయధరలతో డెవలపర్లు సర్దుబాటు చేసుకోవాల్సిందే. అందుకే ఆలస్యం చేస్తే రెండు విధాలుగా భారం పడొచ్చు. రుణ కాలవ్యవధి గృహ రుణం తీసుకునే సమయంలో సాధారణంగా ఈఎంఐ(ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్) ఎంతన్నది చూసి చెల్లించగలిగే సామర్థ్యం ఆధారంగా కాలవ్యవధిని నిర్ణయించుకుంటూ ఉంటారు. తక్కువ టర్మ్ పెట్టుకుంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించాలి. అప్పుడు వడ్డీ భారం తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ కాల వ్యవధిని నిర్ణయించుకోవడం వల్ల ఈఎంఐ భారం తగ్గినట్టు అనిపించొచ్చు. కానీ, దీర్ఘకాలంలో వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం పెరిగిపోతుంది. అయితే, ఎంత గృహ రుణం తీసుకోవాలి, ఈఎంఐ ఎంత నిర్ణయించుకోవాలన్నది అంత సులభంగా తేలే అంశం కాదు. కచ్చితంగా నిపుణుల సాయం తీసుకోవడం మంచిది. ఇక్కడ పన్ను ఆదా ప్రయోజనాన్ని కూడా చూడాలి. రిటైర్మెంట్కు ఎన్నేళ్ల కాలం మిగిలి ఉంది? చెల్లింపుల సామర్థ్యం, ఇతర జీవిత లక్ష్యాలు, వాటికి సంబంధించి చేయాల్సిన కేటాయింపులు అన్నీ చూసుకున్న తర్వాత గృహ రుణాన్ని అనుకూలమైన కాలవ్యవధికి తీసుకోవాలి. నిపుణుల అవసరం వద్దనుకుంటే మధ్యే మార్గంగా మీడియం టర్మ్ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 6.99 శాతం వడ్డీ రేటుపై తీసుకుంటే పదేళ్ల టర్మ్లో చెల్లించే వడ్డీ రూ.19 లక్షలుగా ఉంటుంది. రుణ కాలాన్ని 20 ఏళ్లకు పెంచుకుంటే చెల్లించే వడ్డీ మొత్తం రూ.43 లక్షలు. కనుక వెసులుబాటు ఉంటే అధిక ఈఎంఐను నిర్ణయించుకోవడమే సరైనది. ఒకవేళ టర్మ్ ఎక్కువ పెట్టుకున్నా.. వెసులుబాటు ఉన్నప్పుడల్లా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం మంచి ఐడియా. లోన్ టు వ్యాల్యూ ప్రాపర్టీ విలువలో బ్యాంకు మంజూరు చేసే రుణాన్ని లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ)గా చెబుతారు. సాధారణంగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 60–65 శాతం వరకు రుణంగా మంజూరు చేస్తుంటాయి. అదే ఎన్బీఎఫ్సీలు అయితే ఇంకొంచెం రిస్క్ చేసి 75 శాతం వరకు రుణంగా ఇస్తాయి. మిగిలిన మేర రుణ గ్రహీత స్వయంగా సమకూర్చుకోవాలి. ఉదాహరణకు రూ.1.50 కోట్ల విలువ చేసే ఫ్లాట్ను కొనుగోలు చేస్తున్నారనుకుంటే.. బ్యాంకులు రుణదాత వంతుగా రూ.60 లక్షలు సమకూర్చుకోవాలని కోరొచ్చు. బ్యాంకులు కొంచెం అధికంగా ఇచ్చినా.. రుణదాత తనవైపు నుంచి వీలైనంత అధిక భాగాన్ని సమకూర్చుకుని, మిగిలిన మేరే బ్యాంకు నుంచి తీసుకోవడం మంచిది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ముఖ్యంగా రుణ రేట్లు పెరిగే కాలంలో రుణ గ్రహీతలు తమ భాగం ఎక్కువ ఉండేలా చూసుకోవడం ఒక మార్గం. లేదంటే అధిక పన్ను శ్లాబు (30 శాతం) పరిధిలోకి వచ్చి.. భారీగా ఆదాయపన్ను కడుతూ ఎక్కువ ఆదా చేసుకోవాలని అనుకునే వారు బ్యాంకులు ఇచ్చే గరిష్ట ఎల్టీవీవైపే మొగ్గు చూపించడం మంచిది. దీనివల్ల వడ్డీకి చేసే చెల్లింపులు, అసలుపై క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫిక్స్డ్ టెన్యూర్ దాదాపు చాలా బ్యాంకులు గృహ రుణాలను రెపో రేట్లతో అనుసంధానించాయి. రెపోను ఆర్బీఐ 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన తర్వాత పలు బ్యాంకులు రెపో ఆధారిత రుణ రేటును పెంచాయి. రెపో రేటు మార్పునకు లోనైతే త్రైమాసికం వారీగా గృహ రుణ రేటు కూడా సవరణకు లోను కావచ్చు. బ్యాంకులు రెపో రేటు సవరణను వెంటనే ఆచరణలో పెట్టే విధంగా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కనుక ఇక మీదట వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో గృహ రుణ రేట్లు కూడా ఆ మేరకు సవరణకు లోనవుతాయి. ఇది రుణాలు తీసుకున్న వారి నగదు ప్రవాహాలపై ప్రభావం చూపిస్తుంది. ఫ్లోటింగ్ రుణంలో సహజం గానే ఈ రిస్క్ ఉంటుంది. ఫిక్స్డ్ రేటు రుణాలను ఇప్పుడు బ్యాంకులు దాదాపుగా ఆఫర్ చేయడం లేదు. చేస్తే కనుక ఫిక్స్డ్ రేటుపై రుణం తీసుకోవడమే లాభదాయకం. ఫ్లోటింగ్ రేటుకు వెళ్లాలా? కొన్ని బ్యాంకులు 2–3 ఏళ్లపాటు ఫిక్స్డ్ రేటును, ఆ తర్వాత నుంచి ఫ్లోటింగ్ రేటును అమలు చేస్తున్నాయి. రుణ గ్రహీతపై ఒకేసారి భారం పెరగకుండా ఈ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఉదాహరణకు 15 ఏళ్ల గృహ రుణ కాలంలో మొదటి ఐదేళ్లు చేసే చెల్లింపుల్లో అధిక భాగం వడ్డీకే వెళుతుంది. కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని టైమ్బౌండ్ ఫిక్స్డ్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక ఫ్లోటింగ్ రేటు రుణానికే వెళ్లాలా? అన్నది నిర్ణయించుకోవాలి. ఎన్బీఎఫ్సీలు టైమ్బౌండ్ ఫిక్స్డ్ రేటు విధానంపై రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఒకవేళ కొనుగోలు చేసే ప్రాపర్టీ ధర రూ.2–3 కోట్లు అంతకుమించి ఉండి, లోన్ వ్యాల్యూ రూ.1.5 కోట్లకు పైన ఉంటే బ్యాంకులు సైతం టైమ్బౌండ్ ఫిక్స్డ్ రేటుపై ఆఫర్ చేయవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు, గృహ రుణ సంస్థల రుణ రేట్లు 25–35 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటాయి. బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల రూపంలో తక్కువకే నిధుల లభ్యత ఉంటుంది. కనుక అవి కొంచెం తక్కువ రేటుకు రుణాలను ఇస్తుంటాయి. ఇది అటు బ్యాంకులు, ఇటు రుణ గ్రహీతలకూ మంచిదే. . భారం దింపుకోవాలంటే..? కొత్తగా రుణాలు తీసుకునే వారే కాకుండా.. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా బ్యాంకులు కొత్త రేట్లను అమలు చేస్తున్నాయి. మరి ఈ తరుణంలో గృహ రుణంపై పడే అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఈఎంఐ పెరగకూడదని అనుకుంటే ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకోవాలి. ఈఎంఐ పెరిగినా ఫర్వాలేదు కట్టగలిగే స్వేచ్ఛ ఉందంటే అది కూడా నయమే. అదనంగా చెల్లించే వెసులుబాటు ఉందంటే.. అటువంటి వారు ఈఎంఐకి అదనంగా కొంత మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నిర్ణీత కాలవ్యవధికి ముందే గృహ రుణాన్ని ముగించేయవచ్చు. ఫలితంగా వడ్డీ రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. లేదంటే ప్రతి నెలా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం వల్ల.. భవిష్యత్తులో ఏవైనా కారణాల వల్ల ఆదాయం తగ్గినా.. కొంతకాలం పాటు ఉపాధి కోల్పోయినా పరిమిత కాలం పాటు తక్కువ ఈఎంఐ చెల్లించుకోవచ్చు. ఏటా సంస్థ ఇచ్చే బోనస్లు, ఇతరత్రా వచ్చే అదనపు ఆదాయాన్ని రుణ చెల్లింపులకు వినియోగించుకోవాలి. టాపప్ రెండో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారు లేదంటే అప్పటికే సమకూర్చుకున్న ప్రాపర్టీ విస్తరణ కోరుకునే వారు ప్రస్తుత గృహ రుణానికి టాపప్ లోన్ తీసుకోవచ్చు. అది కూడా తక్కువ రేటుకే. సాధారణంగా ఇంటి నవీకరణ కోసం పొదుపు చేసుకున్న మొత్తాలను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. లేదంటే వ్యక్తిగత రుణానికి వెళ్లేవారు కూడా ఉన్నారు. వాటికి బదులు గృహ రుణానికి అనుబంధంగా వచ్చే టాపప్లోన్ తీసుకోవచ్చు. టాపప్పై గృహ రుణం మాదిరే తక్కువ వడ్డీ రేటు అమలవుతుంది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఎక్కువగా హోమ్లోన్ టాపప్లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు టాపప్ రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ, వీటిపై అప్పటికే తీసుకున్న గృహ రుణంతో పోలిస్తే 10–15 బేసిస్ పాయింట్లు అధిక రేటును అమలు చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ప్రత్యేక రుణంగా పరిగణించి అధిక రేట్లను చార్జ్ చేస్తున్నాయి. అయినా, వ్యక్తిగత రుణ రేట్ల కంటే తక్కువే ఉన్నాయి. కనుక అవసరమైతేనే ఈ మార్గాన్ని పరిశీలించాలి. గృహ రుణం తీసుకున్న సమయంలోనే ఈ యాడాన్ లోన్ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే యాడాన్ రుణం తీసుకోకుండా ఫ్రీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో కావాల్సినప్పుడు వినియోగించుకునేందుకు రుణదాతలు అనుమతిస్తారు. ఒక్క ప్రాసెసింగ్ ఫీజు మినహా అదనంగా చెల్లించే పని ఉండదు. 10–15 బేసిస్ పాయింట్లు అధికంగా ఉన్నా సరే గృహ రుణం సమయంలోనే యాడాన్ను కూడా ఓకే చేసుకుని ఉంచుకోవాలి. -
ఎస్బీఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల భారం.. నెల రోజుల్లో రెండవ‘సారి’
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) పది బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగింది. అన్ని కాలపరిమితులకు తాజా పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాలకు సంబంధించి నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) భారం వినియోగదారులపై పెరగనుంది. నెలరోజుల వ్యవధిలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెరగడం ఇది రెండవసారి . ఇప్పటికే బ్యాంక్ 10 బేసిస్ పాయింట్ల ఎంసీఎల్ఆర్ను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఈ నెల ప్రారంభంలో అనూహ్యంగా 40 బేసిస్ పాయింట్లు (4 శాతం నుంచి 4.4%కి) పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ, స్థిర డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ తాజా రెండవ దఫా రేటు పెంపుతో ఇదే బాటలో పలు బ్యాంకులు రెండవ రౌండ్ రేట్ల పెంపు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్బీఐ తాజా నిర్ణయం, ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం, తాజా రేటు పెంపు మే 15 నుంచి అమల్లోకి వస్తుంది. ► దీని ప్రకారం, ఏడాది ఎంసీఎల్ఆర్ 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. పలు రుణాలు ఈ కాల పరిమితికి అనుసంధానమై ఉంటాయి. ► ఓవర్నైట్, నెల, 3 నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85%కి చేరింది. ► రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 0.1 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది. ► మూడేళ్ల రేటు 7.50 శాతానికి ఎగసింది. ► కాగా, ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతంగా ఉంది. ► గృహ, ఆటో లోన్లతో సహా ఏ లోన్ను మంజూరు సమయంలోనైనా బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్కు క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ)ను కలుపుతాయి. ఆగస్టు నాటికి రెపో 0.75 శాతం పెరగొచ్చు ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనా ఇదిలావుండగా, తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్ల నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటు ఆగస్టు నాటికి మరో 75 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. వారి అధ్యయనం ప్రకారం తీవ్రంగా పెరిగిన ద్రవ్యోల్బణంలో కనీసం 59 శాతం ఉక్రెయిన్పై రష్యా దాడి వల్ల తలెత్తిన భౌగోళిక రాజకీయ సంఘర్షణే కారణం. కరోనా మహమ్మారికి ముందు రెపో రేటు 5.15 శాతంగా ఉండేది. ఆగస్టు నాటికి తిరిగి ఈ స్థాయికి కీలక రేటు చేరుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిని బేస్ ఇయర్గా తీసుకుంటే అటు తర్వాత మొత్తం ద్రవ్యోల్బణంలో 52 శాతం యుద్ధమే కారణం. ఆహారం, పానీయాలు, ఇంధనం, విద్యుత్, రవాణా రంగాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీసీ) రంగానికి ఇన్పుట్ ధరల పెరుగుదల ప్రభావం మరో 7% ఉంది. ద్రవ్యోల్బణం సమీపకాలంలో తగ్గే అవకాశం లేదు. ధరల పెరుగుదల విషయంలో గ్రామీణ–పట్టణ ప్రాం తాల మధ్య వ్యత్యాసం ఉంది. అధిక ఆహార ధరల ఒత్తిడితో గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటే, పట్టణ ప్రాంతాల విషయంలో ఇంధన ధరల పెంపుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జూన్, ఆగస్టు నెలల్లో జరిగే పాలసీ సమీక్షలో ఆర్బీఐ విధాన కమిటీ రేట్లు 0.75 బేసిస్ పాయింట్లు పెంచినా, యుద్ధ–సంబంధిత అంతరాయాలు త్వరగా తగ్గకపోతే ‘రేట్ల పెంపుదల కారణంగా ద్రవ్యోల్బణం అర్థవంతంగా తగ్గిపోతుందా లేదా’ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆలోచించవలసిన అతిపెద్ద ప్రశ్న. ద్రవ్యోల్బణం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, స్థిరమైన రేటు పెరుగుదల వల్ల వృద్ధిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలించాలి. -
రెపో రేటు పెంపు.. ఎవరికి మేలు.. ఎవరికి భారం ?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యవసరంగా పెంచిన రెపోరేటు కొందరికి వరంగా మారంగా మరికొందరికి భారంగా మారనుంది. బ్యాంకులకు ఆర్బీఐ విధించే వడ్డీరేటును రెపోరేటుగా పేర్కొంటారు. సాధారణంగా నిధుల కొరత ఏర్పడినప్పుడు బ్యాంకులు ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకుంటాయి. వీటికి విధించే వడ్డీని రెపోరేటుగా చెప్పుకోవచ్చు. ఆర్బీఐ కనుక రెపోరేటును పెంచితే బ్యాంకులు సైతం తాము ఇచ్చే రుణాలపై ఈ వడ్డీ రేటును వర్తింప చేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ రెపోరేటు పెంచడంతో హోంలోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోను వడ్డీరేట్లె పెరగనున్నాయి. ఇప్పటికే పాత వడ్డీరేటుతో తీసుకున్న వారిపై కూడా ఈ పెంపు భారం పడనుంది. ఆర్బీఐ వడ్డీరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రేపోరేటు 4 శాతం నుంచి 4.40 శాతానికి పెరిగింది. దీని ప్రకారం పాత వడ్డీ రేటు 0.40 శాతం పెరుగుతుంది. కొత్తగా రుణం తీసుకునే వారు అధికంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకుని ఈఎంఐలు చెల్లిస్తున్న వారిపై నేరుగా వడ్డీ భారం పెరగకపోయినా.. పెరిగిన వడ్డీ రేటు సర్థుబాటులో భాగంగా అదనపు ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. గత కొంత కాలంగా డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గించాయి. దీంతో చాలా మంది నగదు దాచుకునేందుకు బ్యాంకులకు ప్రత్యామ్నాయం చూస్తున్నారు. చిట్టీలు, రియల్టీ, స్టాక్మార్కెట్ వైపు మళ్లుతున్నారు. తాజాగా వడ్డీ రేట్ల పెంపుతో ఫిక్స్డ్, టర్మ్ డిపాజిట్లపై అధిక వడ్డీ లభించనుంది. ఆర్బీఐ తాజా నిర్ణయం వల్ల కమర్షియల్ బ్యాంకుల్లోకి నిధులు ప్రవహించే అవకాశం ఉంది. చదవండి: మూకుమ్మడిగా షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..? -
షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..?
న్యూఢిల్లీ: గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఈఎంఐల భారం పెరిగే దిశగా బ్యాంకులు దాదాపు మూడేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను (ఎంసీఎల్ఆర్) 0.10 శాతం వరకు పెంచాయి. మిగతా బ్యాంకులు కూడా అదే బాట పట్టనున్నాయి. దీంతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాలు తీసుకున్న వివిధ రకాల రుణగ్రహీతలకు .. నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాలు (ఈఎంఐ) మరింత భారం కానున్నాయి. వివరాల్లోకి వెడితే.. ఎస్బీఐ తమ ఎంసీఎల్ఆర్ వివిధ కాలావధులకు సంబంధించి 0.10 శాతం పెంచింది. దీంతో ఏడాది వ్యవధికి ఈ రేటు 7 శాతం నుంచి 7.10 శాతానికి చేరింది. అలాగే, రెండు.. మూడేళ్ల వ్యవధికి సంబంధించిన ఎంసీఎల్ఆర్ వరుసగా 7.30 శాతం, 7.40 శాతానికి చేరింది. కొత్త ఎంసీఎల్ఆర్ ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ తమ వెబ్సైట్లో పేర్కొంది. అటు ప్రభుత్వ రంగానికే చెందిన మరో బ్యాంకు బీవోబీ కూడా ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ను 0.05 శాతం పెంచడంతో ఇది 7.35 శాతానికి చేరింది. ఏప్రిల్ 12 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా (కేఎంబీ) బ్యాంకులు కూడా ఏడాది కాలావధి ఎంసీఎల్ఆర్ను సవరించడంతో ఇది 7.40 శాతానికి చేరింది. యాక్సిస్ బ్యాంక్ కొత్త రేటు ఏప్రిల్ 18 నుంచి, కేఎంబీ రేటు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకివచ్చాయి. ఈబీఎల్ఆర్ రేట్లు యథాతథం ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై ఈఎంఐలు స్వల్పంగా పెరగనున్నప్పటికీ .. ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ ఆధారిత రుణాల నెలసరి వాయిదాలు యథాతథంగానే కొనసాగనున్నాయి. ఎస్బీఐకి సంబంధించి ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఈబీఎల్ఆర్) ఏప్రిల్ 1 నుంచి 6.65 శాతంగాను, రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతం స్థాయిలో ఉన్నాయి. హౌసింగ్, ఆటో లోన్స్ సహా రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్పై కొంత క్రెడిట్ రిస్క్ ప్రీమియం అధికంగా వసూలు చేస్తున్నాయి. ద్రవ్య పరపతి విధానంలో మార్పుల ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ అయ్యేలా చూసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని పాటించాలంటూ బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. దీని ప్రకారం 2019 అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు.. రుణ మంజూరీలో ఈబీఎల్ఆర్ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..! -
గృహ రుణం కోసం అప్లై చేసే ముందు.. ఇవీ తప్పక తెలుసుకోండి!
మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడం కోసం ఎంతో ఆరాట పడుతుంటారు. తమ దగ్గర ఉన్న కొంత సొమ్ముతో పాటు గృహ రుణం కోసం చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు. గృహ రుణం అనేది ఒక అతిపెద్ద రుణం. గృహ రుణం తీసుకొనే ముందు ఒకసారి భవిష్యత్ గురుంచి ఆలోచించాలి. ఎందుకంటే, ఈ రుణం తీసుకున్న తర్వాత ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే కష్టాల్లోకి కూరుకొని పోవాల్సి వస్తుంది. అందుకే, గృహ రుణం తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ దరఖాస్తుదారులు గృహ రుణం కోసం అప్లై చేసే ముందు ఈ విషయాలు తప్పక గుర్తు పెట్టుకోండి. డౌన్ పేమెంట్: గృహ రుణం అనేది ఆ ఇంటి ఆస్తి విలువలో 60 శాతం కంటే ఎక్కువ మించకూడదు. వాస్తవానికి దరఖాస్తుదారులకు 70-80 శాతం ఆర్థిక సహాయం చేయడానికి బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. కానీ, గృహ కొనుగోలుదారాలు 60 శాతం లోపు రుణం తీసుకుంటే మంచిది. మిగతా 40 శాతం మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా గృహ రుణం రావడంతో పాటు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అలాగే, భవిష్యత్లో ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే, తట్టుకునే సామర్ధ్యం మన దగ్గర ఉంటుంది. క్రెడిట్ స్కోరు: ఏదైనా బ్యాంక్ ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయాలి అనుకున్నప్పుడు, మొదటగా రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు చెక్ చేస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి(ఉదా:750 పైన) సాధారణంగా రుణ ఆమోదానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉన్న వ్యక్తులకు బ్యాంకులు తక్కువ వడ్డీకె రుణాలను ఇచ్చిన సందర్భాలు ఎక్కువ. ఇల్లు కొనడానికి ముందు మన క్రెడిట్ స్కోరు మెరుగు పరుచుకోవడం మంచిది. (చదవండి: ఎలన్ మస్క్పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..) ఈఎమ్ఐ: రుణగ్రహీత నెలవారీ ఆదాయంలో కొత్త గృహ రుణం కోసం తీసుకునే ఈఎమ్ఐ 50-60 శాతం లోపు గల దరఖాస్తుదారులకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఒకవేల మీకు ఇతర రుణాలు ఉంటే అవి పూర్తిగా చెల్లించిన తర్వాత లేదా కొంత మేరకు(50 శాతం వరకు) చెల్లించి గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. అలాగే, మీకు ఇతర ఖర్చులు గనుక ఉంటే సుదీర్ఘ రుణ కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. అత్యవసర నిధి: గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఒక ఆర్ధిక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, భవిష్యత్లో ఎలాంటి ఊహించని కరోనా మహమ్మారి ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎదురైనా కావచ్చు. అందుకే, ఈ నిదిలో ఎల్లపుడూ 6-12 నెలల ఈఎమ్ఐలకు సరిసమానమైన నగదు ఉంటే మంచిది. మీరు గనుక ఒక ఈఎమ్ఐను చెల్లించకపోయిన అది మిమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ అత్యవసర నిధి వల్ల అటువంటి తీవ్రమైన పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది. (చదవండి: ఆహా ఏమి అదృష్టం!.. లక్షకు రూ.55 లక్షలు లాభం) -
ఈ జాగ్రత్తలు పాటిస్తే హోం లోన్ చెల్లింపులు ఎంతో ఈజీ !
గృహ రుణం తీసుకుంటున్నామంటే దీర్ఘకాలం పాటు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నట్టు అర్థం చేసుకోవాలి. ఆ రుణాన్ని 10–20 ఏళ్లపాటు చెల్లించేందుకు ఆర్థికంగా, భౌతికంగా, భావోద్వేగ పరంగా సన్నద్ధులై ఉండాలి. ఇలా దీర్ఘకాలం పాటు రుణ చెల్లింపుల ఒప్పందంలోకి ప్రవేశించిన తర్వాత.. దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగి రుణ గ్రహీత మరణిస్తే.. లేదా రుణ గ్రహీత ఆదాయం నిలిచిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. రుణం తీసుకునే వ్యక్తి తనకు ఏదైనా జరిగితే తన కుటుంబంపై రుణం తీర్చాల్సిన ఆర్థిక భారం పడుతుందన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి భిన్న పరిస్థితుల్లో గృహ రుణం చెల్లింపులు ఆగిపోకుండా సజావుగా చెల్లించేలా చూసుకునేందుకు మార్గాలున్నాయి. రుణంపై బీమా కవరేజీ గృహ రుణం ఇచ్చే సమయంలోనే కొన్ని సంస్థలు ఇన్సూరెన్స్ కవరేజీ కూడా తీసుకోవాలని కోరుతున్నాయి. ఈ కవరేజీతో చెల్లింపులకు రక్షణ ఏర్పడుతుంది. సాధారణంగా హోమ్లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ (హెచ్ఎల్పీపీ) అన్నది మీరు తీసుకునే గృహ రుణం విలువకు సమానంగా ఉంటుంది. ఇలా కాకుండా వ్యక్తిగతంగానూ రుణ గ్రహీత టర్మ్ కవరేజీ ప్లాన్ను తీసుకోవచ్చు. రూ.25 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారనుకోండి. అప్పుడు హెచ్ఎల్పీపీ కూడా రూ.25 లక్షల కవరేజీతో వస్తుంది. ఇందుకు ప్రీమియం కింద సుమారు రూ.86,335 చెల్లించాల్సి వస్తుంది. ఒక ఏడాది తర్వాత చెల్లించాల్సిన గృహ రుణం రూ.20.5 లక్షలకు తగ్గిందనుకుందాం. ఆ సమయంలో రుణ గ్రహీత మరణిస్తే బీమా సంస్థే పాలసీదారు తరఫున మిగిలిన గృహ రుణ బకాయిని పూర్తిగా తీర్చేస్తుంది. టర్మ్ కవరేజీ టర్మ్ కవరేజీని విడిగా తీసుకోవడం వల్ల పాలసీదారుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పైన చెప్పుకున్నట్టుగానే రూ.25 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకున్న ఏడాది తర్వాత రుణ గ్రహీత మరణించించినట్టయితే.. రూ.25 లక్షల టర్మ్ ప్లాన్ పూర్తి మొత్తాన్ని పొందొచ్చు. అంటే మిగిలిన రుణ బకాయి రూ.20.5 లక్షలుపోను రూ.4.5 లక్షలను రుణ గ్రహీత కుటుంబం అందుకోవచ్చు. ప్రీమియం చెల్లింపుల పరంగా హెచ్ఎల్పీపీతో పోలిస్తే టర్మ్ ప్లాన్ సౌకర్యంగా ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని రుణం తీసుకునే సమయంలోనే చెల్లించాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్ బీమా ప్లాన్ మాదిరే క్రమానుగతంగా ప్రీమియం చెల్లించుకునే ఆప్షన్ ఉంటుంది. కనుక హెచ్ఎల్పీపీ, టర్మ్ప్లాన్లో అనుకూలమైన దానిని రుణ గ్రహీత ఎంపిక చేసుకోవచ్చు. అత్యవసర నిధి బీమా కవరేజీ తీసుకుని హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుంటే సరిపోదు. ప్రతీ నెలా ఈఎంఐ చెల్లించాల్సిన బాధ్యత నేపథ్యంలో అత్యవసర పరిస్థితులకు సన్నద్ధమై ఉండాలి. గృహ రుణం మాదిరి పెద్ద మొత్తంలో రుణ బాధ్యతను మోస్తున్నప్పుడు.. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా, గృహ రుణం ఈఎంఐలకు చెల్లింపులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరం. కనుక లిక్విడ్ ఫండ్స్లో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. దీనివల్ల పెట్టుబడులపై రాబడులకుతోడు.. నిర్ణీత కాలంలో ఒక నిధి ఏర్పడుతుంది. ఈ చిన్న అడుగులతో గృహ రుణ బాధ్యత విషయంలో భద్రతను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థతులు తలెత్తినా అప్పుడు మీరు కంగారు పడిపోవక్కర్లేదు. మీ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లకుండా కాపాడినట్టు అవుతుంది. గృహ రుణం ఈఎంఐను క్రమం తప్పకుండా చెల్లించినట్టయితే మంచి క్రెడిట్ స్కోర్ కూడా ఏర్పడుతుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ అన్నది భవిష్యత్తులో రుణ అవసరాల్లో ఎంతో సాయపడుతుంది. - అరవింద్ హాలి, మోతీలాల్ ఓస్వాల్ హోమ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో చదవండి: ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు.. తెలియకుండానే బోలెడంత లాస్!! -
కొత్త ఇల్లు కొనే ముందు.. ఈ 3/20/30/40 ఫార్ములా గురించి తప్పక తెలుసుకోండి?
మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదవారు చాలా మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడానికి ఎంతో ఆరాట పడుతుంటారు. ఇలాంటి కలల గృహం కోసం కూడా చాలా కష్ట పడుతారు. అయితే, సరిగ్గా ఇల్లు కొనే సమయం ముందు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారి కలల గృహం కట్టడం కోసం హోమ్ లోన్ తీసుకోవడం అనేది అత్యంత కీలక నిర్ణయం. దీనిపై ఎంతో హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనం చేసే చిన్న, చిన్న పొరపాట్లకు ఎంతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకోసమే, ఇల్లు కొనేముందు ఈ 3/20/30/40 ఫార్ములా గురుంచి తెలుసుకుంటే చాలా మంచిది. దీని వల్ల రాబోయే కాలంలో వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. 3 అంటే మీ ఇంటి మొత్తం ఖర్చు.. ఈ 3/20/30/40 ఫార్ములాలో "3" దేనిని సూచిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నియమంలో “3” అంటే మీరు ఇంటి కోసం చేసే మొత్తం ఖర్చు మీ ఆదాయానికి 3 రేట్లు మించకూడదు అని అర్ధం. అయితే, ఇది తక్కువ వార్షిక ఆదాయం గల వారికి వర్తిస్తుంది. మీ ఆదాయం బట్టి కొన్ని కొన్ని సార్లు "5" రేట్ల మొత్తాన్ని ఇంటి కోసం ఖర్చు చేయవచ్చు. ఉదాహరణ: ఒక వ్యక్తి వార్షిక సంపాదన అనేది రూ.2 లక్షలు అయితే, ఆ వ్యక్తి ఇంటి కోసం చేసే ఖర్చు రూ.6 లక్షలకు మించరాదు. ఇంత తక్కువ ధరతో పట్టణాలు, నగరాల్లో ఇల్లు కట్టడం లేదా కొనుగోలు చేయడం అసాధ్యమే. అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్తులు, షేర్లు వంటి వాటిని విక్రయించి డబ్బు సమకూర్చుకోవడం మేలు. అయితే, ఒక ఆస్తిని అమ్మే ముందు అంత విలువ చేసే ఇల్లు మీ సొంతమవుతుందా లేదా అంచనా వేసుకోవాలి. 20 అంటే రుణ కాల వ్యవది ఈ 3/20/30/40 ఫార్ములాలో "20" దేనిని సూచిస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంటి కోసం తీసుకునే రుణ కాల వ్యవదిని “20” అనేది సూచిస్తుంది. సులభంగా చెప్పాలంటే, మీ గరిష్ట గృహ రుణ కాల వ్యవది "20" ఏళ్లకు మించరాదు. మీ వార్షిక ఆదాయం గనుక ఎక్కువగా ఉంటే, రుణ కాల వ్యవది "20" ఏళ్ల కంటే తక్కువ ఉంటే మంచిది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. ఛార్జింగ్ కష్టాలకు చెక్!) 30 అంటే ఈఎంఐ మొత్తం ఈ 3/20/30/40 ఫార్ములలో “30” అనేది, మీరు అన్నీ రకాలుగా చెల్లించే ఈఎమ్ఐ((కారు, వ్యక్తిగత రుణం, గృహ రుణం వంటి అన్ని ఇతర ఈఎమ్ఐలతో సహా) మొత్తం కలిపి మీ వార్షిక ఆదాయంలో 30 శాతానికి మించరాదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షలు అనుకుంటే, ఆ మొత్తంలో అన్నీ ఈఎమ్ఐ మొత్తాలకు కలిపి రూ.2 లక్షలకు మించరాదు అని అర్ధం. 40 - కనీస డౌన్ పేమెంట్ ఈ 3/20/30/40 ఫార్ములలో “40” అనేది మీరు ఇంటి కోసం చెల్లించే డౌన్ పేమెంట్ గురుంచి తెలియజేస్తుంది. అంటే, మీరు కొనే ఇంటి మొత్తం విలువలో 40 శాతం డౌన్ పేమెంట్ రూపంలో చెల్లిస్తే మంచిది. మిగతా మొత్తం కోసం రుణం తీసుకోవచ్చు. మీరు తీసుకునే గృహ రుణం మాత్రం మీ కొత్త ఇంటి విలువలో 60 శాతం కంటే తక్కువగా ఉంటే చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఈ దోసకాయ ఇంత ఖరీదు ఎందుకో తెలుసా..?) -
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్!
SBI Credit Card Users to Pay Rs 99 Plus Tax on All EMI Transactions: క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అన్ని ఈఎంఐ లావాదేవీలు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పన్నుకు లోబడి ఉంటాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రకటించింది. ఎస్బీఐ కార్డులు & పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్బీఐసీపీఎస్ఎల్) ఇటీవల రూ.99 ప్రాసెసింగ్ ఫీజువసూలు చేసి దానిపై పన్నులు వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. రిటైల్ లొకేషన్లు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ఈ-కామర్స్ సైట్స్ నిర్వహించే అన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్ స్టాల్ మెంట్(ఈఎమ్ఐ) కొనుగోళ్లకు ఈ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. ఈ విషయం గురించి తన క్రెడిట్ కార్డు ఖాతాదారులకు తెలియజేస్తూ ఒక ఈ-మెయిల్ పంపింది. "01 డిసెంబర్ 2021 నుంచి మర్చంట్ అవుట్ లెట్/వెబ్ సైట్/యాప్ వద్ద చేసిన అన్ని మర్చంట్ ఈఎమ్ఐ లావాదేవీలపై రూ.99 (+ పన్నులు) ప్రాసెసింగ్ ఫీజు విధించనున్నట్లు మేము మీకు తెలియజేస్తున్నాము" అని ఎస్బీఐసీపీఎస్ఎల్ తెలిపింది. ఈ నోటీసును ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఖాతాదారులందరికీ పంపారు. అంటే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో వస్తువులను కొని ఈఎంఐగా మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిర్ణయంతో ఈఎంఐ ఆప్షన్ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు మరింత భారం పడనుంది. అలాగే, ఈఎమ్ఐ లావాదేవీ విఫలమైనా లేదా క్యాన్సిల్ చేసిన ప్రాసెసింగ్ ఖర్చు తిరిగి చెల్లిస్తారు. (చదవండి: 'సింగిల్స్ డే' అమ్మకాల్లో రికార్డ్.. రూ.10 లక్షల కోట్ల వ్యాపారం) -
స్పైస్జెట్ బంపర్ ఆఫర్, డబ్బులు లేవా.. తర్వాతే ఇవ్వండి
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకింగ్, రీటైల్, ఈ కామర్స్తో పాటు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈఎంఐ సదుపాయాన్ని స్పైస్ జెట్ ఇప్పుడు విమాన ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణికులు ఈఎంఐ సౌకర్యంతో స్పైస్ జెట్ ఫ్లైట్ టికెట్లను కొనుగోలు చేయొచ్చు. 3,6,12 నెలల పాటు వాయిదా పద్దతుల్లో వడ్డీ లేకుండా, కొనుగోలు చేసిన టికెట్ల ధర మొత్తాన్ని ఈఎంఐలో చెల్లించుకోవచ్చు. ప్రయాణికులు చేయాల్సిందల్లా ఒక్కటే స్పైస్ జెట్ విమాన టికెట్లకు ఈఎంఐ సదుపాయం కావాలంటే ప్రయాణికులు పాన్ నెంబర్, ఆధార్ కార్డ్, వీఐడీ వివరాల్ని నమోదు చేయాలి. వన్టైమ్ పాస్వర్డ్ తో యాక్టీవ్ చేసుకోవాలి. వినియోగదారులు యూపీఐ ఐడీ ద్వారా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ స్కీమ్ను పొందేందుకు ప్రయాణికులు ఎలాంటి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను అందించాల్సిన అవసరం లేదని స్పైస్ జెట్ పేర్కొంది. చదవండి:ఇకపై ఎంచక్కా..ఫ్లైట్ జర్నీలోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు -
ఇంటి ఈఎమ్ఐ సరైన సమయానికి చెల్లించకపోతే ఏమవుతుంది..?
ప్రజలు సాధారణంగా తమ కలల గృహాన్ని కొనుగోలు చేయడం కోసం గృహ రుణం(Home Loan) తీసుకుంటారు. గృహ రుణాలు ఎక్కువగా దీర్ఘకాలం వరకు ఉంటాయి. అయితే గృహరుణం తీసుకున్న తర్వాత కొందరు ఉపాధి కోల్పోవడం, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల రుణ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలా వాయిదాలు.. వాటిపై వడ్డీ, రుసుములు పెరిగి ఓ పెద్ద గుదిబండగా మారతాయి. ఒక్కోసారి తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మనం గృహ రుణాల ఈఎమ్ఐ చెల్లించకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురు అవుతాయి. అవేంటో తెలుసుకుందాం.. క్రెడిట్ స్కోరుపై ప్రభావం మీరు గనుక హోమ్ లోన్ ఈఎమ్ఐ కట్టకపోతే ఆలస్య ఫీజులు కింద జరిమానాలు విధిస్తారు. ఈ పెనాల్టీ ఛార్జ్ సాధారణంగా ఈఎమ్ఐలో 1-2% వరకు ఉంటుంది. అయితే, పరిస్థితిని బట్టి, కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ కాలానికి మొత్తం బకాయి మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణదాత వసూలు చేసే ఆలస్య ఫీజులకు ఇది అదనంగా ఉంటుంది. ఒక్క ఈఎమ్ఐ పేమెంట్ కట్టకపోయిన అది మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపిస్తుంది. మీ ఇంటి రుణంపై సింగిల్ డిఫాల్ట్ వల్ల మీ క్రెడిట్ స్కోరు 50-70 పాయింట్ల వరకు తగ్గవచ్చు. అటువంటి పరిస్థితి వల్ల తర్వాత ఏదైనా లోన్ పొందే అవకాశం కోల్పోతారు.(చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి దూసుకొస్తున్న కొత్త కంపెనీలు) నిరర్ధక ఆస్తిగా లోన్ అయితే, ఒకవేళ మీరు ఈఎమ్ఐని మిస్ అయినట్లయితే చివరి పేమెంట్ చేసిన 90 రోజుల్లోగా కట్టాల్సి ఉంటుంది. ఇది చిన్న డిఫాల్ట్ గా వర్గీకరిస్తారు. మీరు సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లయితే దాని ప్రభావం నుంచి మీరు కోలుకోవచ్చు. మిస్ అయిన ఈఎమ్ఐని తర్వాత గడువు తేదీనాటి నుంచి చెల్లించండి. అలాగే, మిగతా ఈఎమ్ఐలను మిస్ కాకుండా చూసుకోండి. ఉద్యోగ నష్టం/ ఆరోగ్య పరిస్థితుల వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే రుణదాతను సంప్రదించండి. వారిని ఏదైనా పరిష్కారం చెప్పమనండి. మీ రుణం నిరర్ధక ఆస్తి(ఎన్పిఎ)గా మారడానికి ముందు మీ బకాయిలను చెల్లించడానికి మీకు 90 రోజుల గడువు ఉంది. ఒకవేళ మీరు 90 రోజుల తర్వాత కూడా మీ ఈఎమ్ఐ బకాయిలను తిరిగి చెల్లించలేకపోతే SARFAESI 2002 చట్టం ప్రకారం.. మీ ఆస్తిని వేలం వేసే హక్కు రుణదాతకు లభిస్తుంది. కాబట్టి, అలా౦టి పరిస్థితుల నుంచి తప్పి౦చుకోవడానికి ము౦దుగానే చర్యలు తీసుకో౦డి. గృహ రుణ ఎగవేత నుంచి తప్పించుకోవడం కోసం మీరు మీ రుణదాతను తక్కువ ఈఎమ్ఐ కోసం అభ్యర్థించవచ్చు.ఒకవేళ మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయిన/మీ వ్యాపార కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లయితే ఈఎమ్ఐ చెల్లింపులపై బ్యాంకులు మీకు మూడు నుంచి ఆరు నెలల మాఫీని ఇవ్వవచ్చు. అయితే, రుణదాత తర్వాత ఈ కాలానికి బకాయి రుణ మొత్తంపై వడ్డీని వసూలు చేయవచ్చు. (చదవండి: రిలయన్స్ జియో సరికొత్త రికార్డు..!) ఆస్తిపై హక్కులు చేజారిపోతాయి మీరు ఇక రుణం చెల్లించని పక్షంలో మీకు రుణం ఇచ్చిన బ్యాంకులు, ఇతర సంస్థలు గానీ ఇంటి వాస్తవ విలువను అంచనా వేసి తర్వాత వేలం ప్రక్రియను ప్రారంభిస్తాయి. వేలానికి సంబంధించిన వివరాలను దినపత్రికలో ప్రచురిస్తాయి. ఒకవేళ వేలంలో పేర్కొన్న విలువ వాస్తవ విలువ కంటే తక్కువ అని యజమాని భావిస్తే ఆ సంస్థలను సంప్రదించవచ్చు. ఒకసారి ఇలా ఆస్తిని స్వాధీనం చేసుకున్న సంస్థలు దాన్ని విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం లేదా ఆ ఆస్తిపై హక్కులను వేరే సంస్థకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంత వేలం ద్వారా జరుగుతుంది. సంబంధిత ఇంటిని వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి బ్యాంకు ముందుగా తన రుణ బకాయిలను సర్దుబాటు చేసుకున్న తర్వాత అదనంగా ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని మీకు పంపిస్తుంది. మరో మార్గం ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడటానికి మీకు మరో మార్గం ఉంటుంది. బ్యాంక్/రుణం తీసుకున్న సంస్థ వేలం వేయడానికి ముందే మీరు ఆ ఇంటిని విక్రయించండి. ఎందుకంటే, రుణదాతలు ఎక్కువ సార్లు మార్కెట్ విలువ కంటే తక్కువకు ఆ ఇంటిని విక్రయిస్తాయి. దీని వల్ల మీరు మరింత నష్టపోయే అవకాశం ఉంది. అందుకని మీరు ఆ ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఈఎమ్ఐని ఒకేసారి క్లియర్ చేయండి. దీని వల్ల మీరు కొంత లాభపడే అవకాశం ఉంది. మీకు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి గృహ రుణం తీసుకునే ముందు మీ ఆదాయంలో 40% ఈఎమ్ఐ చెల్లింపులు ఉండే విధంగా చూసుకోండి. (చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో వారి దశ తిరిగింది) -
నో కాస్ట్ ఈఎమ్ఐ వల్ల కలిగే లాభమేంటి?
ఇంకొద్ది రోజుల ఆగితే దసరా, దీపావళి సీజన్ మొదలు కాబోతుంది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ప్రత్యేక సేల్ పేరుతో ఆఫర్లు భారీగా ప్రకటిస్తున్నాయి. త్వరలో రాబోయే సేల్లో ఏమైనా కొనాలని అనుకుంటున్నారా?. అయితే, మీకు ఒక శుభవార్త డబ్బులు లేకపోయినా మీకు ఇష్టమైనవస్తువును కొనే అవకాశాన్ని ఈ-కామర్స్ సంస్థలు కల్పిస్తున్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ పేరుతో దిగ్గజ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే, మనలో చాలా మందికి ఒక ప్రశ్న మదిలో మెదులుతుంది. అసలు నిజంగానే మనకు నో-కాస్ట్ ఈఎంఐ వల్ల లాభం ఉందా అని. దీని గురుంచి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. దాదాపు అన్ని ప్రొడక్ట్స్ని నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనే వెసులుబాటు కల్పిస్తున్నాయి. డబ్బులు లేకపోయినా ఏమి కావాలన్నా కొనే ఛాన్స్ రావడంతో కస్టమర్లు ఎగిరిగంతేస్తున్నారు. అది కూడా వడ్డీ లేకుండా నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా లభిస్తుండటంతో షాపింగ్ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. (చదవండి: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఒక్కసారి చార్జ్ చేస్తే 480 కి.మీ వెళ్లొచ్చు తెలుసా?) నో కాస్ట్ ఈఎమ్ఐ అంటే ఏమిటి? సాధారణ ఈఎమ్ఐతో పోలిస్తే నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకుంటే? మీరు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు రూ.19 వేలు విలువైన మొబైల్ కొన్నప్పుడు మీరు 5 నెలల కాలానికి ఒక రూ.1000 వడ్డీ అవుతుందనుకుందాం. ఇప్పుడు మొత్తం రూ.20,000 చెల్లించాలి. 10 నెలలకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.2,000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. అదే మీరు నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకుంటే? ఎంత అయితే వస్తువు ధర ఉంటుందో అంతే మొత్తాన్ని సమాన వాయిదా పద్దతుల్లో చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఇక్కడే ఓకే చిన్న కిటుకు ఉంది. మీరు ఏదైనా వస్తువును కొంటె ఈఎమ్ఐ కింద ఎంచుకున్నప్పుడు కొంత మొత్తం డిస్కౌంట్ లభిస్తుంది. కానీ, అదే నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంచుకుంటే మీకు ఎలాంటి డిస్కౌంట్ వర్తించదు. కాబట్టి, ఆ మేరకు డిస్కౌంట్ కోల్పోయినట్టే. అంటే మీరు పేమెంట్ చేస్తే వచ్చే సాధారణ ఈఎమ్ఐ లభించే డిస్కౌంట్ను మీరు ముందే చెల్లిస్తారు కాబట్టి వస్తువు అమ్మినవారితో పాటు బ్యాంకుకు కూడా లాభమే. నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా వస్తువులు కొంటారు కాబట్టి ముందుగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల వినియోగదారుడికి బ్యాంకుకు ఇద్దరికీ లాభమే. అందుకే ఈ-కామర్స్ సంస్థలు నో కాస్ట్ ఈఎమ్ఐను ఎక్కువగా ఆఫర్ చేస్తాయి. -
ఎస్బీఐ డెబిట్ కార్డు ఉంటే? రూ.1,00,000 వరకు బెనిఫిట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కస్టమర్లకు గుడ్ న్యూస్. మీ దగ్గర ఎస్బీఐ డెబిట్ కార్డు ఉంటే సులభంగా రూ.1,00,000 మీరు లోన్ తీసుకోవచ్చు. ఈఎమ్ఐ కూడా ప్రతి నెల చెల్లించవచ్చు. మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి స్టోర్ కి వెళ్లినప్పుడు మీ దగ్గర లేని సమయంలో ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా లోన్ అక్కడే తీసుకోవచ్చు. అలాగే, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టల్స్ ద్వారా ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఎస్బీఐ కస్టమర్లు ఈఎమ్ఐ సదుపాయాన్ని వాడుకోవచ్చు. వడ్డీ రేటు మీ బ్యాంక్ ఖాతాలో ఎంత ఉందన్న టెన్షన్ లేకుండా మీకు అవసరమైన వస్తువుల్ని కొనుకోవచ్చు. ఈఎంఐ ద్వారా చెల్లించొచ్చు. ఆన్లైన్ షాపింగ్ మాత్రమే కాదు.. ఆఫ్లైన్లో కూడా అంటే ఎక్కడైనా స్టోర్లలో కూడా మీరు షాపింగ్ చేసి మీ పేమెంట్ను ఈఎమ్ఐగా మార్చేయొచ్చు. ఈ ఈఎమ్ఐ తీసుకునేటప్పుడు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ ఖాతాదారులు రూ.8,000 నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని పొందవచ్చు. రెండేళ్ల ఎంసీఎల్ఆర్(7.20%) + 7.50% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం వడ్డీరేటు అనేది 14.70%గా ఉంటుంది.(చదవండి: పలు కార్లపై బంపర్ ఆఫర్ను ప్రకటించిన హోండా..!) మీరు ఈ మొత్తాన్ని తీసుకున్నప్పుడు ఆరు, తొమ్మిది, పన్నెండు, పద్దెనిమిది నెలల రుణ కాలపరిమితిని ఎంచుకోవచ్చు. అయితే, ఈ సౌకర్యం మీకు అందుబాటులో ఉందో/లేదో తెలుసుకోవడానికి కస్టమర్లు మీ బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి DCEMI అని టైపు చేసి 567676కు పంపాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ అత్యవసర సమయాల్లో చాలా భాగ ఉపయోగపడుతుంది. డెబిట్ కార్డు ఈఎమ్ఐ సదుపాయం మర్చంట్ స్టోర్ వద్ద పివోఎస్ మెషిన్ పై ఎస్బీఐ డెబిట్ కార్డును స్వైప్ చేయండి ఇప్పుడు బ్రాండ్ ఈఎమ్ఐ - బ్యాంక్ ఈఎమ్ఐ అనే ఆప్షన్ ఎంచుకోండి. మీకు కావాల్సిన మొత్తం, రుణ కాలపరిమితి రెండు ఎంచుకోండి. మీ అర్హత చెక్ చేసిన తర్వాత పిన్ ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది, రుణ నిబంధనలు, షరతులు ఉన్న ఛార్జ్ స్లిప్ ప్రింట్ వస్తుంది. దాని మీద కస్టమర్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఈఎమ్ఐ సదుపాయం బ్యాంకులో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబరు సహాయంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో లాగిన్ అవ్వండి. మీకు నచ్చిన వస్తువు కొనుక్కొని పేమెంట్ మీద క్లిక్ చేయండి. మీకు కనిపించే పేమెంట్ ఆప్షన్ల నుంచి ఈజీ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకొని, ఆ తర్వాత ఎస్బీఐ ఎంచుకోండి. రుణ కాలవ్యవది ఎంచుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఎస్బీఐ లాగిన్ పేజీలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు క్రెడెన్షియల్స్ నమోదు చేయండి. ఒకవేళ లోన్ ఆమోదీస్తే ఆర్డర్ బుక్ చేయబడుతుంది. అప్పుడు నిబంధనలు & షరతులు(టీసీ) కనిపిస్తాయి. -
ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్ను సొంతం చేసుకోవచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ తాజాగా వీల్స్ ఈఎంఐతో చేతులు కలిపింది. సులభ వాయిదాల్లో వాహనం కొనుగోలుకు హీరో కస్టమర్లకు వీల్స్ ఈఎంఐ రుణం అందిస్తుంది. అలాగే తక్కువ పత్రాలతో ఆకర్శణీయ వడ్డీ రేటు, సౌకర్యవంతమైన, అందుబాటు ధరలో నెల వాయిదాలు ఆఫర్ చేస్తుందని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. 13 రాష్ట్రాల్లో 100కుపైగా నగరాల్లో వీల్స్ ఈఎంఐ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రతి నెల 10 వేలకుపైగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను హీరో ఎలక్ట్రిక్ విక్రయిస్తోంది. ఇందులో 40 శాతం వాటా గ్రామీణ ప్రాంతాలు కైవసం చేసుకున్నాయి. చదవండి : ‘రూ.50,000 కోట్ల లోన్ గ్యారంటీ స్కీమ్’టార్గెట్ అదే! -
ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే వడ్డీ కట్టక్కర్లేదు
ప్రముఖ ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీ యూని కొత్త రకం సేవలను ప్రారంభించింది. కొత్తగా 'పే 1/3' పేలేటర్ కార్డును తీసుకొనివచ్చింది. ఈ కార్డు ద్వారా మీరు ఏమైనా కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని మూడు భాగాలుగా ఆటోమేటిక్ గా విభజిస్తుంది. వినియోగదారులు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మూడు నెలల వ్యవధిలో మూడు భాగాలను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాలంలో డబ్బులు కోసం ఎదురుచూసే వినియోగదారుల కోసం ఈ కార్డును తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. అలా కాకుండా 30 రోజులు తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తే కస్టమర్లకు క్యాష్ బ్యాక్ రూపంలో 1 శాతం రివార్డును అందిస్తున్నట్లు పేర్కొంది.(చదవండి: క్రిప్టోకరెన్సీలో భారత్ స్థానం ఎంతో తెలుసా...!) ఎలాంటి ఛార్జీలు లేవు 'పే 1/3' పేలేటర్ కార్డును తేదీ జూన్ 2021లో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన రెండు నెలల కాలంలోనే ఇప్పటికే 10,000 మంది కస్టమర్లు ఈ కార్డును తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాదిలోగా 1 మిలియన్ వినియోగదారులను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. పేలేటర్ కార్డును లాంఛ్ చేయడంపై యూని వ్యవస్థాపకుడు సీఈఓ నితిన్ గుప్తా మాట్లాడుతూ.. "వినియోగదారులను త్వరగా చేరుకోవడం కోసం చెల్లింపు వ్యవదిని మూడు నెలలకు పెంచడం ఉత్తమం అని భావించాము. ఈ కార్డు మా వినియోగదారుల జీవనశైలి ఎంపికగా మార్చాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో ఎలాంటి రహస్య ఛార్జీలు లేకుండా పారదర్శకంగా అందించాలనుకుంటున్నాము. కస్టమర్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటున్నాము" అని అన్నారు. ప్రస్తుతం, జాయినింగ్ ఫీజు లేదా వార్షిక ఛార్జీలు లేవు. పే 1/3ర్డ్ యాప్ ద్వారా రియల్ టైమ్ లో వారి ఖర్చులను ట్రాక్ చేయవచ్చు, కేటగిరీల వారీగా చేసిన ఖర్చులను తెలుసుకోవచ్చు. అలాగే తిరిగి చెల్లించే సమయానికి ముందే అలర్ట్ లు వస్తాయి. ఈ కార్డును ‘వీసా కార్డు’ మద్దతుతో తీసుకొస్తున్నారు. దీంతో ఈ కార్డును వీసా కార్డులకు అనుమతి ఉండే ప్రతిచోటా వినియోగించుకోవచ్చు. ఫుడ్, గ్రోసరీస్, ఈ-కామర్స్ సహా పీఓఎస్ అందుబాటులో ఉన్న ప్రతిచోటా దీన్ని వినియోగించవచ్చు. అలాగే కస్టమర్లు 6, 9, 12 నుండి 18+ నెలల వరకు ఈఎమ్ఐ ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. -
ఈ బ్యాంక్ డెబిట్ కార్డ్తో షాపింగ్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ పొందొచ్చు
సాధారణంగా మనకు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. కానీ కొటాక్ మహీంద్రా బ్యాంక్ మాత్రం డెబిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మనల్ని అత్యవసర సమయాల్లో ఆర్ధికంగా ఆదుకునేది క్రెడిట్ కార్డ్లే. ఆ కార్డ్లపై అవగాహన ఉండి సరైన పద్దతిలో మితంగా వాడుకుంటే మంచిది. పరిధి దాటితే చివరికి అప్పులు పాలు కావాల్సి వస్తుంది. అయితే కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో అవసరం లేకుండా 'కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్' స్కీమ్ లో భాగంగా డెబిట్ కార్డ్తో షాపింగ్ చేస్తే క్రెడిట్ కార్డు ప్రయోజనాలు అందిస్తోంది. అంటే డెబిట్ కార్డుతో చేసిన బిల్లును ఈఎంఐలుగా మార్చుకుని మన బడ్జెట్కి అనువుగా వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తోంది. 'కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్' స్కీమ్లో వినియోగదారులు ఫ్యాషన్ యాక్ససరీస్,ఎలక్ట్రానిక్ వస్తువులు, కిరాణా సామాగ్రిని కొనుగోలు చేవవచ్చు. అనంతరం షాపింగ్కి సంబంధించిన బిల్లును డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తూ వాటిని ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఆ అవకాశం వినియోగించుకోవాలంటే తప్పని సరిగా రూ.5,000లకు పైగా షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయాన్ని కల్పించినందుకు ప్రాసెసింగ్ ఫీజ్ తీసుకోవడం లేదని కొటక్ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ♦ వినియోగదారులు ఆఫ్ లైన్ లో లేదంటే ఆన్ లైన్ లో డెబిట్ కార్డ్తో రూ.5వేల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. ♦ మీరు డెబిట్ కార్డ్ ఈఎంఐకి అర్హులా? కాదా అనేది బ్యాంక్ అధికారుల్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ♦ మీరు డెబిట్ కార్డ్ ఈఎంఐకి అర్హులైతే బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. ♦ అనంతరం మీ ట్రాన్సాక్షన్ ను రివ్వ్యూ చేసి మీకు ఈఎంఐ సదుపాయాన్ని ఎన్ని నెలలు ఇవ్వాలనేది బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుంది. ♦ మీకు బ్యాంక్ కల్పించిన ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే రిక్వెస్ట్ చేయాలి. అపై మీకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి ఈఎంఐగా మార్చుకోవచ్చు. ♦ వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఈఎంఐలో భాగంగా ఆటో మెటిగ్గా మీ అకౌంట్ నుంచి మీరు ఎంత ఈఎంఐ చెల్లిస్తారో అంతే కట్ అవుతుంది. -
డెబిట్ కార్డ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్, ఫ్రూప్ లేకుండానే
ముంబై: అర్హత కలిగిన డెబిట్ కార్డుహోల్డర్లందరికీ ప్రత్యేకమైన నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) ఆఫర్ అందిస్తున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీఎల్) వెల్లడించింది. దీని ప్రకారం మధ్య స్థాయి, అధిక విలువ చేసే కొనుగోళ్లు అన్నింటికీ డెబిట్ కార్డుపై ఈఎంఐల ద్వారా చెల్లించే సదుపాయం ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్స్లో దీన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇప్పటిదాకా ఇది కేవలం ఎంపిక చేసిన కొన్ని స్టోర్స్కి మాత్రమే పరిమితమై ఉండేదని కేఎంబీఎల్ తెలిపింది. రూ. 5,000 అంతకు పైబడిన లావాదేవీలన్నింటినీ ఎలాంటి పేపర్వర్క్ లేదా పత్రాల అవసరం లేకుండానే ఈఎంఐల కింద మార్చుకోవచ్చని వివరించింది. చదవండి : ఏంటీ..ఈ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో తెసుకోవచ్చా! -
వీటికి కూడా ఈఎంఐ ఉందా?
-
ఏంటీ.. వీటికి కూడా ఈఎంఐ ఉందా?
సాక్షి, వెబ్డెస్క్: ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్.. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈఎంఐ అంటే అందరికీ ఇట్టే అర్థమవుతుంది. మనం పెద్ద వస్తువులు ఏం కొనాలన్నా ఇప్పుడు ఈఎంఐ అందుబాటులో ఉంది. ఇంట్లో వినియోగించే టీవీ, వాషింగ్ మిషన్ నుంచి ప్రయాణానికి వాడే వాహనాల వరకు ఈఎంఐతో కొనుక్కోవచ్చు. అంతేకాదు చదువులు, పెళ్లిళ్లు వంటి కుటుంబ అవసరాలకు కూడా ఈఎంఐ అక్కరకొస్తోంది. తాజాగా ఐవీఎఫ్, సరోగసీకి కూడా ఈఎంఐ రుణాలు దొరుకుతున్నాయి. సంతానలేమితో బాధ పడుతున్న దంపతులకు ఈఎంఐ ఎలా వరంగా మారుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి. -
Debit Card EMI: మీకు అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోండి..?
సాధారణంగా మన చేతిలో డబ్బు లేకుంటే క్రెడిట్ కార్డ్ పై ఆధారపడుతూ ఉంటాం. మనకు నచ్చిన వస్తువులను క్రెడిట్ కార్డుతో తీసుకొని సులభ వాయిదాల చొప్పున కొన్ని నెలల్లో క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లిస్తాం. ఇది కేవలం క్రెడిట్ కార్డుతోనే అప్పు తీసుకోవడం సాధ్యమవుతోంది అనుకుంటే మీరు పొరపడినట్లే..! డెబిట్ కార్డునుపయోగించి కూడా మీకు నచ్చిన వస్తువులను తీసుకోని సులభ వాయిదాల చోప్పున మొత్తాన్ని చెల్లించవచ్చును. ముందుగా మీరు వాడే డెబిట్ కార్డుపై ఈఎంఐ వచ్చే సౌకర్యం ఉందో లేదో సింపుల్గా తెలుసుకోండి. డెబిట్ కార్డ్ ఈఎంఐపై ముందుగా తెలుసుకోవలసిన విషయాలు ముందుగా మీ డెబిట్కార్డ్పై ఈఎంఐ తీసుకొనే అర్హత డెబిట్ కార్డ్ నంబర్, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్పై ఆధారపడి ఉంటుంది . చెల్లింపులు చేసేటప్పుడు వినియోగదారులు కచ్చితంగా బ్యాంకులో రిజిస్టర్ ఐనా ఫోన్ నంబర్ను వాడాలి. ఏదైనా వస్తువును ఆర్డర్ చేయడానికి వినియోగదారులు వారి ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ కలిగి ఉండవలసిన అవసరం లేదు. కానీ ఈఎంఐను చెల్లించే సమయంలో కచ్చితంగా తగినంత నిధులను మెయిన్టెన్ చేయాలి. డెబిట్ కార్డులపై ఈఎంఐ పొందే మొత్తాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. గరిష్ట లావాదేవీ విలువ ఖాతాదారునికి ముందుగానే ఆమోదించిన పరిమితి ద్వారా నిర్ణయించబడుతుంది. మీరు బ్యాంక్ కస్టమర్ సర్వీస్ లైన్కు ఫోన్ చేయవచ్చు లేదా మీ EMI అర్హతను తనిఖీ చేయడానికి SMS పంపవచ్చు. ఆయా బ్యాంకుల ఈ-కామర్స్ వెబ్సైట్లో చెక్ చేసుకొవచ్చును. ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులు డెబిట్ కార్డుపై ఈఎంఐ పొందే సౌకర్యాన్ని తెలుసుకోవడానికి వినియోగదారుల ఖాతాకు రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ను పంపాలి. ఎస్ఎంఎంస్ పంపిన కొద్ది సేపటికే బ్యాంకు నుంచి అర్హత ఉందో లేదో అనే మెసేజ్ను పంపిస్తుంది 1. యాక్సిస్ బ్యాంక్ : రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 56161600 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. 2.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 567676 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. 3. బ్యాంక్ ఆఫ్ బరోడా: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 8422009988 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. 4.హెచ్డిఎఫ్సి బ్యాంక్: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి MYHDFC అని టైప్ చేసి 5676712 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. 5. ఐసీఐసీఐ బ్యాంక్: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 5676766 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. 6. ఫెడరల్ బ్యాంక్: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 5676762 ఎస్ఎంఎస్ చేయాలి. లేదా 7812900900 నంబర్కు మిస్ కాల్ ఇవ్వచ్చును. 7. కోటక్ మహీంద్రా బ్యాంకు: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 5676788 కు ఎస్ఎంఎస్ చేయాలి. చదవండి: ఈ బ్యాంకుల్లో అపరిమిత ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్..! -
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ శుభవార్త అందించింది. ఇక నుంచి జీతాలు, పెన్షన్ చెల్లింపుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. బ్యాంకు సెలవులతో సంబంధం లేకుండా ఒకటవ తేదీన అన్నీ సెటిల్ అయిపోతాయి. ఇప్పటివరకు ఈ పద్ధతి లేదు. ఒకటవ తేదీన బ్యాంకులకు సెలవు ఉంటే జీతాలు, పెన్షన్ కోసం తర్వాత రోజు వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఆగస్ట్ 1 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇకపై జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది. ఇక వీటికి బ్యాంకు సెలవులతో ఎటువంటి సంబంధం లేదు. ఆగస్ట్ 1 నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ సేవలు బ్యాంకు సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఖాతాదారుల ఖాతాలో జమకావాల్సిన జీతాలు, పెన్షన్, డివిడెండ్, వడ్డీ లాంటివన్నీ సెలవులతో సంబంధం లేకుండా ప్రాసెస్ జరుగుతాయి. అలాగే ఖాతాదారులు చెల్లించాల్సిన లోన్ ఈఎంఐ, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ ప్రీమియం లాంటివి కూడా సెలవుల రోజుతో సంబంధం లేకుండా కట్ అవుతాయి. అలాగే, కరోనా మహమ్మారి విలయం కారణంగా రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచింది. దీని ప్రకారం రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండనుంది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ ఖాతాకు లింక్ చేశారో తెలుసుకోండిలా? -
ప్రతి నెల పదివేలు చెల్లిస్తే మారుతి స్విఫ్ట్ కారు మీదే
దేశంలో అత్యంత అధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్లలో మారుతి స్విఫ్ట్ ప్రధానంగా చెప్పవచ్చు. ఈ కారు మోడల్ మార్కెట్లోకి విడుదలై 15 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా సేల్స్ లో టాప్ గేర్ లో కొనసాగుతోంది. మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఫేస్లిఫ్ట్ను ఫిబ్రవరి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.73 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ రూ.8.41 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తుంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త నెక్స్ట్-జెన్ కె-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్-వివిటి పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్లిఫ్ట్ మధ్యలో బోల్డ్ హారిజాంటల్ క్రోమ్ తో సరికొత్త మెష్ గ్రిల్ను పొందుతుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్లు, ఎల్ఈడీ టెయిల్ లాంప్స్, 15-అంగుళాల ప్రెసిషన్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్న ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు అవుట్గోయింగ్ మోడల్ నుంచి ముందుకు తీసుకెళ్లబడ్డాయి. 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్లను కొత్త స్విఫ్ట్లోనూ వాడారు. మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఎంటి 23.20 కిలోమీటర్లు, 2021 స్విఫ్ట్ ఎఎమ్టి 23.76 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని పేర్కొంది. భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 కార్లలో ఒకటిగా స్విఫ్ట్ నిలిచింది. మార్కెట్ షేర్లో 35 శాతం వాటా దీనిదే కావడం విశేషం. ఇక ఈ కారు ఫైనాన్స్ విషయానికి వస్తే కనిస్టంగా రూ.1,28,759 డౌన్ పేమెంట్ చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు మార్కెట్లో బ్యాంకులు అత్యల్పంగా 7 నుంచి 9 శాతం మధ్యలో కార్ల వడ్డీ రేట్లతో లోన్లను అందిస్తున్నారు. ఈ లెక్కన 5 సంవత్సరాల కాల వ్యవధికి సుమారు రూ.10 వేల వరకూ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: డేంజర్ జోన్లో వాట్సప్ యూజర్లు! -
స్కూల్ ఫీజులూ.. సులభ వాయిదాల్లో...
న్యూఢిల్లీ: భారీ విలువ చేసే లావాదేవీలకు చెల్లించే మొత్తాన్ని నేరుగా కస్టమర్లే ఆన్లైన్లో ఈఎంఐల (నెలవారీ వాయిదాలు) కింద మార్చుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. ఎంపిక చేసిన సేవింగ్స్ అకౌంట్స్ ఖాతాదారులు .. తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫాం ద్వారా బీమా ప్రీమియంలు మొదలుకుని స్కూలు ఫీజుల దాకా వివిధ రకాల చెల్లింపులను ఈఎంఐల కింద చెల్లించవచ్చని తెలిపింది. దీనితో భారీ మొత్తాన్ని సులభ వాయి దాల్లో చెల్లించుకునేందుకు వీలవు తుందని పేర్కొంది. రూ. 50,000కు పైబడి రూ. 5 లక్షల దాకా విలువ చేసే లావాదేవీలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వీటిని 3,6,9,12 నెలల కాల వ్యవధికి ఈఎంఐల కింద మార్చుకోవచ్చని, ఇందుకోసం అదనపు చార్జీలేమీ ఉండవని బ్యాంకు తెలిపింది. ’ఈఎంఐ @ ఇంటర్నెట్ బ్యాంకింగ్’ పేరిట ఈ సదుపాయం అందు బాటులో ఉంటుందని వివరించింది. ఇందు కోసం బిల్డెస్క్, రేజర్పే అనే ఆన్లైన్ పేమెంట్ గేట్వేలతో పాటు 1,000కి పైగా వ్యాపార సంస్థలతో జట్టు కట్టినట్లు బ్యాంక్ వివరించింది. -
కరోనా వైరస్ కలిసొచ్చింది...
సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్ అమ్మకాలకు కరోనా వైరస్ కలిసొచ్చింది. గతేడాది పండుగ సీజన్తో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో జోరుగా సాగాయి. 2019తో పోలిస్తే 2020 పండుగ అమ్మకాల్లో 77 శాతం వృద్ధి నమోదైందని క్రెడిట్, పేమెంట్ స్టార్టప్ స్లైస్ తెలిపింది. 74 శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో, 26 శాతం ఆఫ్లైన్లో జరిగాయని పేర్కొంది. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో 71 శాతం మంది నెలవారి వాయిదా (ఈఎంఐ) వినియోగించారు. గతేడాది ఈఎంఐ వాటా 58 శాతంగా ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్కు యువతరం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, సగటున నాలుగు నెలల ఈఎంఐ వ్యవధి కాలాన్ని ఎంచుకున్నారని సర్వే తెలిపింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 2 లక్షల మంది యంగ్ ఇండియన్స్ వ్యయ సరళిని విశ్లేషించింది. సెప్టెంబర్ నెలలో యంగ్స్టర్స్ ఖర్చు ఎక్కువగా చేశారని, ఇది కోవిడ్ ముందు కంటే ఎక్కువగా జరిగాయని స్లైస్ ఫౌండర్ అండ్ సీఈఓ రాజన్ బజాజ్ తెలిపారు. ప్రతి కస్టమర్ లావాదేవీలో 150 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. స్లైస్ మొత్తం లావాదేవీల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ కలిపి 21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎన్నాడు లేనంతగా ఈ ఏడాది పండుగ సీజన్లో స్లైస్లో అత్యధిక లావాదేవీ పరిమాణాన్ని చూశామని ఆయన చెప్పారు. అమెజాన్లో 60 శాతం మంది వినియోగదారులు, 40 శాతం మంది ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేశారని తెలిపారు. మింత్ర, జబాంగ్ వంటి ఫ్లిప్కార్ట్ గ్రూప్తో కలిపి చూస్తే మాత్రం అమెజాన్, ఫ్లిప్కార్ట్ మధ్య వరుసగా 45, 55 శాతం వినియోగదారులు షాపింగ్ చేశారు. -
పేటీఎం యూజర్లకు శుభవార్త
భారత్ లోని లీడింగ్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ గా రాణిస్తున్న పేటీఎం సంస్థ తన పోస్ట్పెయిడ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పోస్ట్పెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీఎం పోస్ట్పెయిడ్ యూజర్లు ఇప్పుడు తమ బకాయిలను ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (ఇఎంఐ)లో తిరిగి చెల్లించవచ్చని కంపెనీ ప్రకటించింది. దింతో వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఆప్షన్ ద్వారా మీరు కొన్న వస్తువుకు అయిన ఖర్చును సులభమైన వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించవచ్చు. అందుకోసం పేటీఎం మీ నుండి తక్కువ వడ్డీని వసూలు చేయనుంది. పేటీఎం ద్వారా ఇప్పుడే కొనండి మరియు తరువాత చెల్లించండి (బీ ఎన్ పీ ఏల్) అనే సౌకర్యం ఐదు లక్షలకు పైగా ఉత్పత్తులతో మరియు సేవలకు ఐదు లక్షలకు పైగా ప్లస్ షాపులు మరియు వెబ్సైట్లలో పొందవచ్చు అని తెలిపింది. (చదవండి: ఈ యాప్ను వెంటనే డిలీట్ చేయండి) కోవిడ్–19 మహమ్మారితో వినియోగదారుల ఆర్థిక లోటు పెరగడంతో ఈ సౌకర్యవంతమైన ఇఎంఐ చెల్లింపు విధానం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని పేటీఎం పేర్కొంది. కాగా, పేటీఎం ప్రస్తుతం రూ .1 లక్ష వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తుంది. తీసుకున్న మొత్తాన్ని ఈఎంఐ రూపంలో సకాలంలో తిరిగి చెల్లిస్తే ఈ లిమిట్ ను మరింత పెంచుతామని పేటీఎం తెలిపింది. పోస్ట్ పెయిడ్ సేవలు లైట్, డిలైట్ మరియు ఎలైట్ అనే మూడు వేర్వేరు విభాగాలలో లభిస్తుంది. పోస్ట్పెయిడ్ లైట్ రూ. 20,000 వరకు డెలైట్, ఎలైట్ క్రెడిట్ పరిమితులను రూ. 1,00,000 నెలవారీ ఖర్చు విధించింది. వినియోగదారులు వారి ఖర్చులను తెలుసుకోవడానికి ప్రతి నెలా ఒకే బిల్లును అందిస్తారు. బిల్లు ఉత్పత్తి చేసిన మొదటి ఏడు రోజుల్లో వినియోగదారులు పోస్ట్పెయిడ్ బిల్లును సౌకర్యవంతమైన ఈఎంఐలుగా మార్చుకోవచ్చని డిజిటల్ చెల్లింపు సంస్థ పేటీఎం తెలిపింది. పోస్ట్పెయిడ్ బిల్లును యుపిఐ, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్తో సహాయంతో తిరిగి చెల్లించవచ్చు . -
లోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ : రుణ కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. మారటోరియం కాలంలో అన్ని రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీయే వసూలు చేస్తామని, వడ్డీపై వడ్డీని వెనక్కు ఇస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అవిడఫిట్లో పేర్కొన్న దిశగా చర్యలు చేపట్టింది. మారటోరియం అమలైన ఆరు నెలల కాలంలో ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమచేయనున్నారు. బ్యాంకులు రుణగ్రహీతల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనుండగా, తర్వాత ప్రభుత్వం బ్యాంకులకు రీఎంబర్స్ చేస్తుంది. మారటోరియం సమయంలో ఈఎంఐలపై చక్రవడ్డీ కాకుండా సాధారణ వడ్డీనే వసూలు చేయాలని ఈ వ్యత్యాసాన్ని అర్హులైన రుణగ్రహీతల ఖాతాల్లో వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఈనెల 21న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గృహ, విద్యా, ఆటో, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు బకాయిలు, సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల రుణాలకుగాను మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఈఎంఐల చెల్లింపులపై ఆర్బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించింది. ఆ తర్వాత జూన్లో మరో మూడు నెలల పాటు మారటోరియం వ్యవధిని పొడిగించింది. ఈ వ్యవధిలో ఈఎంఐలపై చక్రవడ్డీ వసూలు చేయరాదని పలువురు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశాలతో వడ్డీపై వడ్డీని వెనక్కితీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. కాగా ఈ పిటషన్లపై నవంబర్ 2న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. కాగా, మారటోరియం పధకాన్ని ఉపయోగించుకోకుండా ఈఎంఐలను యథావిథిగా చెల్లిస్తున్న వారికీ చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. చదవండి : లోన్లపై వడ్డీ మాఫీ : పండుగ కానుక -
ఈఎంఐలు కట్టిన వారికి కేంద్రం శుభవార్త?
న్యూఢిల్లీ : మారటోరియంలో వెసులుబాటు కల్పించిన కాలంలోనూ నెలవారీ వాయిదాలు (ఈఎంఐ)లు కట్టిన వారికి కేంద్రం శుభవార్త చెప్పనుంది. వారు తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీపై వడ్డీని మాఫీ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీపావళి వరకల్లా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కరోనా లౌక్డౌన్ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్లన్నటిపైనా మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. (రుణాలపై చక్రవడ్డీ మాఫీకి ఓకే) మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఇది అమల్లో ఉండగా చాలామంది తమ ఈఎంఐలను సమయానికి చెల్లించలేదు. మరికొందరు ఎప్పటిలాగానే చెల్లింపులు చేశారు. ఈ క్రమంలో రూ.2 కోట్ల లోపు పర్సనల్, హోమ్ లోన్లు వంటివి తీసుకుని, ఈఎంఐలు సమయానికి చెల్లించిన రుణగ్రహీతల వడ్డీపై వడ్డీ మాఫీ చేసే దిశగా కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సూచనల మేరకు కేంద్రం దీనిని ఆరు నెలల కాలానికి అమలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. -
ఈఎంఐ... మారటోరియం వడ్డీపై... 3 రోజుల్లో ‘కేంద్రం’ నిర్ణయం..!
న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో నెలవారీ రుణ (ఈఎంఐ) చెల్లింపులపై ఆగస్టు వరకూ విధించిన ఆరు నెలల మారటోరియం సమయంలో వడ్డీ వసూలు అంశంపై కేంద్రం రెండు, మూడు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. అక్టోబర్ 1న ఈమేరకు అఫిడవిట్ను దాఖలు చేస్తామని కూడా కేంద్రం తరఫున ఆయన న్యాయస్థానానికి తెలిపారు. దీనితో జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఆర్ సుభాషన్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు, వ్యక్తులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై కూడా అక్టోబర్ 5న విచారణ జరుపుతామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అక్టోబర్ 5వ తేదీన ఆయా వర్గాల వాదనలకు వీలుగా కేంద్రం అక్టోబర్ 1న సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న అఫిడవిట్ను ఈ కేసులో ఇతర పార్టీలకూ ముందుగానే అందజేయాలన్న బెంచ్ సూచనను పాటిస్తామని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. అక్టోబర్ 5వ తేదీనే ఈ కేసులో తుది తీర్పు ఇస్తామని కూడా సుప్రీంకోర్టు సూచించింది. మారటోరియం సమయంలో వడ్డీని అసలుకు కలిపి, అటుపై ఈఎంఐలను లెక్కిస్తే, అది వడ్డీపై వడ్డీగానే భావించాల్సి ఉంటుందని ఇప్పటికే సుప్రీకోర్టు వ్యాఖ్యానించింది. -
మొబైల్ ఫోన్ల ఈఎమ్ఐ పేరిట భారీ మోసం
న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్ల ఈఎమ్ఐ పేరిట 2500 మందిని మోసగించాడో వ్యక్తి. ఫేక్ వెబ్సైట్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న అతడి గుట్టు రట్టయి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన న్యూఢిల్లీలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్కు చెందిన జితేంద్ర సింగ్ అనే వ్యక్తి ఫేక్ వెబ్సైట్ల ద్వారా తక్కువ మొత్తం ఈఎమ్ఐలకు ఖరీదైన మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసగించసాగాడు. పోలీసుల నిఘానుంచి తప్పించుకోవటానికి వీపీఏ ద్వారా పేమెంట్లు చేయమనే వాడు. గత సంవత్సరం డిసెంబర్లో జితేంద్ర చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ( దారుణం: కస్తూర్భ టీచర్పై భర్త కత్తి దాడి ) తాజాగా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలో 2500 మందిని ఇప్పటివరకు తాను మోసం చేసినట్లు చెప్పాడు. జితేంద్రతో పాటు మరో వ్యక్తి ఈ మోసాలలో భాగంగా ఉన్నాడని పోలీసులు తేల్చారు. గడిచిన రెండేళ్లలో వివిధ నకిలీ వెబ్సైట్ల పేరుతో వీరు మోసాలు చేసినట్లు గుర్తించారు. వీపీఏ ద్వారా 1,999నుంచి 7,999 రూపాయలు వరకు చిన్న చిన్న మొత్తాలను మాత్రమే తీసుకునే వారని విచారణలో వెల్లడైంది. ( రైనా బంధువులపై దాడి కేసు: ముఠా అరెస్ట్ ) -
ఈఎంఐలపై మారటోరియం : 2 వారాల్లోగా తేల్చండి
సాక్షి, న్యూఢిల్లీ : మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకులకు రెండు వారాల సమయం ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపుపై ఆర్బీఐ ఆరు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించాయి. వడ్డీపై వడ్డీ వసూలు సరైంది కాదని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక రుణగ్రహీతలపై భారం పడకుండా రెండు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ఈ కేసును మరోసారి వాయిదా వేసేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఇదే చివరి అవకాశమని రెండు వారాల్లోగా రుణగ్రహీతలకు భారం పడనివిధంగా పరిష్కారంతో అఫిడవిట్ సమర్పించాలని కోరింది. రుణగ్రహీతలకు ఊరట ఇచ్చేలా బ్యాంకులతో ఉన్నతస్ధాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది. మరోవైపు సెప్టెంబర్ చివరివారంలో కేసు విచారణ తిరిగి ప్రారంభమయ్యేవరకూ ఆయా ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ మాఫీ చేస్తే అది బ్యాంకింగ్ వ్యవస్ధను బలహీనపరుస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్బీఐ రుణాల చెల్లింపుపై ఈ ఏడాది మార్చిలో మూడు నెలల మారటోరియం ప్రకటించి ఆపై ఆగస్ట్ 31 వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. చదవండి : ఉద్యోగాలు, అడ్మిషన్లలో కోటాపై కీలక నిర్ణయం -
‘రుణగ్రహీతలను వడ్డీపై వడ్డీతో వేధించకండి’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మారటోరియం వ్యవధిలో వాయిదాపడిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తూ రుణగ్రహీతలను బ్యాంకులు శిక్షించరాదని సుప్రీంకోర్టు కు పిటిషనర్ బుధవారం నివేదించారు. బ్యాంకులు రుణాల పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నిస్తున్న క్రమంలో మారటోరియం వ్యవధిలో వాయిదా పడిన ఈఎంఐలపై వడ్డీ వసూళ్లతో రుణగ్రహీతలను ఇబ్బంది పెట్టరాదని ఆయన సర్వోన్నత న్యాయస్ధానం దృష్టికి తీసుకువచ్చారు. కరోనా వైరస్తో అందరి ఆదాయాలు పడిపోయిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 27న అన్ని రుణ వాయిదాల(ఈఎంఐ)పై మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా ప్రభావం కొనసాగడంతో మారటోరియంను ఆగస్ట్ 31 వరకూ ఆర్బీఐ పొడిగించింది. మారటోరియం వ్యవధిలో వాయిదా పడిన ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ తుదివిచారణ సందర్భంగా పిటిషనర్ కీలక వాదనలు వినిపించారు. వడ్డీపై వడ్డీ చెల్లించడం రుణగ్రహీతలకు తలకుమించిన భారమవుతుందని పేర్కొన్నారు. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీలు పెరిగిపోయాయని, ఇవి రుణగ్రహీతలకు భారమవుతాయని పిటిషనర్ గజేంద్ర శర్మ న్యాయవాది రాజీవ్ దత్తా కోర్టుకు నివేదించారు. చదవండి : మారటోరియం రెండేళ్ల పాటు పొడిగింపు! ఇక మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ వసూలు, వడ్డీపై వడ్డీ వసూలు నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సమీక్షించాలని కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా, కోవిడ్-19 ప్రభావం నేపథ్యంలో రుణాల చెల్లింపుపై మారటోరియం వ్యవధిని రెండేళ్లు పెంచవచ్చని, ఆయా రంగాలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కోర్టుకు వివరించాయి. ఇక వాయిదాపడిన ఈఎంఐలపై వడ్డీ మాఫీ మౌలిక ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని, షెడ్యూల్ ప్రకారం రుణాలను తిరిగిచెల్లిస్తున్న వారికి అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. -
‘ఈఎమ్ఐలు నేనే చెల్లిస్తున్నా.. ఇదిగో సాక్ష్యాలు’
ముంబై : తాను నివసిస్తున్న ప్లాట్కు సంబంధించిన ఈఎమ్ఐలను తనే చెల్లిస్తన్నట్లు సుశాంత్ మాజీ ప్రేమికురాలు అంకితా లోఖండే పేర్కొన్నారు. తన ఫ్లాట్ కోసం సుశాంత్ ఏ రోజు ఈఎమ్ఐలు చెల్లించలేదని ఆమె స్పష్టం చేశారు. సుశాంత్ వివిధ బ్యాంక్ అకౌంట్ల నుంచి 15 కోట్ల రూపాయలు మాయమైయినట్లు తన తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. సుశాంత్ 4.5 కోట్ల రూపాయలు ఓ ప్లాట్ ఈఎమ్ఐ చెల్లిస్తున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. (మాజీ ప్రేమికురాలి ప్లాట్ ఈఎమ్ఐలు చెల్లించిన సుశాంత్) ముంబైలోని మలాడ్లో ఉన్న ఈ ప్లాటులో ప్రస్తుతం అంకితా లోఖండే నివసిస్తున్నారు. అయితే సుశాంత్ నుంచి ఈ ఫ్లాట్ను అంకితా అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక ఇదే విషయంపై రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించినప్పుడు.. సుశాంత్ అంకిత కోసం ఈఎమ్ఐలు చెల్లించాడని.. వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా అతడు అంకితను ప్లాట్ ఖాళీ చేయమని కోరలేదని రియా తెలిపింది. (సుశాంత్ అన్ని విషయాల్లో రియాదే నిర్ణయం) ఈ విషయంపై అంకితా శనివారం ట్విటర్ ద్వారా స్పందించారు. తన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాగితాలతోపాటు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్లను పంచుకున్నారు. ‘నాపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెడుతున్నాను. ఇవి నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలు. నా బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు. నా ఫ్లాట్ ఈఎమ్ఐలను నేనే చెల్లిస్తున్నాను. ఇంతకంటే ఇంకేం చెప్పలేను’. అని ట్వీట్ చేశారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్, అంకితా లోఖండే ఫ్లాట్ల విషయంలో కొంత గందరగోళం నెలకొన్నట్లు కన్పిస్తోంది. సుశాంత్ ఫ్లాట్ నెం 403ను కొనుగోలు చేశాడు. అలాగే అంకితా లోఖండే 404 ఫ్లాట్ కొన్నారు. సుశాంత్ తన ఫ్లాట్ ఈఎమ్ఐ చెల్లిస్తున్నట్లు, అంకిత తన ఇంటి ఈఎమ్ఐ చెల్లిస్తున్నట్లు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా తెలుస్తోంది. (‘సుశాంత్ మా కొడుకు లాంటివాడు’) Here i cease all the https://t.co/Hijb7p0Gy6 transparent as I could https://t.co/YUZm1qmB3L Flat's Registration as well as my Bank Statement's(01/01/19 to 01/03/20)highlighting the emi's being deducted from my account on monthly basis.There is nothing more I have to say🙏 pic.twitter.com/qpGQsIaOGw — Ankita lokhande (@anky1912) August 14, 2020 -
ఫైనాన్స్ వారు బైక్ తీసుకెళ్లారని..
ఓర్వకల్లు: సకాలంలో కంతులు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ వారు బైక్ తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని సోమయాజులపల్లెలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పి.మద్దిలేటి (40) వ్యవసాయ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం బేతంచెర్ల పట్టణంలోని హీరో కంపెనీ షోరూంలో ఫైనాన్స్లో బైక్ను కొనుగోలు చేశాడు. ప్రతి నెలా రూ.3 వేల చొప్పున కంతులు చెల్లించాల్సివుంది. కరోనా సమయంలో లాక్డౌన్ విధించడంతో వ్యవసాయ పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యాడు. ఈ క్రమంలో రెండు నెలల కంతులు చెల్లించలేకపోయాడు. ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ వారం క్రితం కంతులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో కుటుంబ సభ్యులు రూ.6 వేలు మద్దిలేటికి ఇచ్చారు. ఆ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. మూడు రోజుల క్రితం కంపెనీ ఏజెంట్ బైక్ను తీసుకెళ్లాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన మద్దిలేటి ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
ఈఎంఐ కట్టనందుకు ఏడు రెట్ల జరిమానా
కర్ణాటక ,హుబ్లీ: ప్రభుత్వ ఆదేశాలకు తిలోదకాలు ఇచ్చి కర్ణాటక బ్యాంక్ వినియోగదారుని నుంచి పరోక్షంగా దోపిడీకి పాల్పడుతోందని విమర్శలు సర్వత్రా వెల్లువెత్తాయి. ఆ బ్యాంక్ ఈఎంఐ చెల్లింపులో జాప్యం జరిగినందుకు ఒకే నెలలో ఏడు రెట్ల జరిమానా విధించి సదరు బ్యాంకు వినియోదారున్ని నిలువునా వేధించింది. బాధితుడు సంగమేష్ హడపద తెలిపిన వివరాల మేరకు తమ సెలూన్ షాపు బంద్ అయినందు వల్ల ఈఎంఐ చెల్లించలేకపోయానన్నాడు.(మారిటోరియం పొడిగింపుతో మరిన్ని డిఫాల్ట్స్!) ఒక్క నెల ఈఎంఐ జాప్యం చేయడంతో రూ.590లు చొప్పున బ్యాంక్ మొత్తం ఏడు రెట్లు రూ.4150లను వసూలు చేసిందని వాపోయాడు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ అడిగితే ఉదాసీనంగా జవాబు చెప్పారన్నారు. బజాజ్ ఫైనాన్స్లో రూ.30 వేలు రుణం తీసుకొన్న సంగమేష్ ప్రతి నెల రూ.3 వేలు ఈఎంఐ చెల్లించేవారు. ఈఎంఐ చెల్లింపులను వాయిదా వేస్తూ కేంద్రం ఆదేశాలు ఉన్నా బ్యాంకులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దీంతో బతుకుబండిని సాగించడమే కష్టమైందని బ్యాంక్ మేనేజర్కు వివరించగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని బాధితుడు పేర్కొన్నాడు. -
క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి: హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్స్ను ప్రభుత్వం ఆదుకోవాలని మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. క్యాబ్ డ్రైవర్ల తరుపున న్యాయవాది రాపోలు భాస్కర్ పిల్ను వేశారు. పిటిషనర్ తరుపు వాదనలను సీనియర్ అడ్వకేట్ మాచర్ల రంగయ్య వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 లక్షల క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని పిటిషనర్ కోరారు. లాక్డౌన్ కారణంగా గత మూడు నెలలుగా ఉపాధి లేక క్యాబ్ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు తెలిపారు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికి ఈఎంఐ కట్టాలని బ్యాంక్లు ఒత్తిడి తెస్తున్నాయని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈఎంఐలు కట్టలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ కేసును పరిశీలించిన కోర్టు జూన్ 5న క్యాబ్ డ్రైవర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్5కు కోర్టు వాయిదా వేసింది. (‘అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు’) -
మారిటోరియం పొడిగింపుతో మరిన్ని డిఫాల్ట్స్!
కరోనా కారక సంక్షోభంలో రుణగ్రహీతలు ఇక్కట్లు పడకుండా ఉండేందుకు రుణాల ఈఎంఐ చెల్లింపులపై విధించిన మారిటోరియాన్ని మరో మూడునెలలు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. దీంతో కస్టమర్లకు మొత్తం ఆరునెలల పాటు ఈఎంఐలపై మారిటోరియం విధించినట్లు కానుంది. ఇది కస్టమర్లకు కొంతమేర సంతోషం కలిగించే అంశమైనా, బ్యాంకులకు ఇబ్బందికలిగించే విషయమని, దీని కారణంగా డిఫాల్టులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకులు రిటైల్ కస్టమర్లకు ఆప్ట్అవుట పద్ధతిపై హోల్సేల్ కస్టమర్లకు ఆప్ట్ ఇన్ పద్దతిపై మారిటోరియం సదుపాయం కల్పిస్తున్నాయి. ఎంత ఉన్నాయి? బ్యాంకులవారీగా చూస్తే ప్రస్తుతం బంధన్బ్యాంకు ఇచ్చిన రుణాల విలువలో 71 శాతం మారిటోరియం కింద ఉన్నాయి. ఆర్బీఎల్ రుణాల విలువలో 35 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, కోటక్బ్యాంకుల్లాంటి దిగ్గజాల రుణాల విలువలో 26-30 శాతం మేర మారిటోరియం కిందకు వస్తున్నాయి. 2008 సమయంలో ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో సాగు రంగంలో ఎన్పీఏలు 2012నాటికి 18 శాతానికి పెరిగాయి. నోట్లరద్దువేళ ఇచ్చిన మారిటోరియంతో ఎంఎఫ్ఐల ఆస్తుల నాణ్యత దెబ్బతిన్నది. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని, ప్రస్తుతం ఎకానమీ పూర్తిగా స్తంభించిందని, అన్ని రంగాలు ఒత్తిడిలో ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల రుణాల చెల్లింపు మరింత ఆలస్యం కావచ్చంటున్నారు. ఎందుకు కష్టం? ఆరునెలల మారిటోరియం అనంతరం ఏడో నెల ఆరంభంలో రుణగ్రహీత ఆరునెలల వడ్డీని కలిపి చెల్లించాల్సిఉంటుందని, దీంతో చాలామంది కట్టకుండా ఎగ్గొట్టవచ్చని ప్రభుదాస్లీలాధర నిపుణుడు అజయ్ హెచ్చరించారు. వేతనాలు లేని ఈ వేళ అంతమొత్తం ఒకేసారి కట్టాలంటే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందని, ఇది బ్యాంకుల పద్దులపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈఎంఐల మారిటోరియం కన్నా రుణ పునర్వ్యవస్థీకరణకు ఆర్బీఐ అనుమతించిఉండాల్సిందన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రధాన ఆదాయ వనరు జీతమేనని, ఇప్పుడున్న సందర్భంలో సరైన వేతనాల్లేక పెద్ద మొత్తాలు కట్టడం ఇబ్బందిగామారి రిటైలర్లు ఎక్కువగా డిఫాల్ట్ కావచ్చని కొందరి అంచనా. ఇందుకే రిటైల్ రుణాలెక్కువున్న బ్యాంకు షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లాక్డౌన్ పూర్తయి ఎకానమీలో అన్ని కార్యకలాపాలు పుంజుకుంటేనే బ్యాంకులకు తగిలిన ఎదురుదెబ్బలపై స్పష్టత వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలేంటీ మారిటోరియం? మార్చి ప్రకటన అనంతరం చాలామంది కస్టమర్లు ఈ సదుపాయం వినియోగించుకున్నట్లు బ్యాంకులు తెలిపాయి. ముఖ్యంగా అగ్రి, మైక్రో, కమర్షియల్ వాహనాలు, క్రెడిట్ కార్డుల బకాయిలకు మారిటోరియం విజ్ఞప్తులు అధికంగా వచ్చాయి. లాక్డౌన్ కారణంగా ఆదాయాలు నిలిచిపోవడంతో కస్టమర్లు రుణ వాయిదాలు కట్టేందుకు ఇబ్బంది పడకూడదని ఆర్బీఐ ఈ వెసులుబాటు ఇచ్చింది. మారిటోరియం సదుపాయం వినియోగించుకున్న వాళ్లు ఈ వాయిదాలను తర్వాత కాలంలో చెల్లించాల్సిఉంటుంది. ఈ సదుపాయం వినియోగించుకొని వాయిదాలు చెల్లించలేకపోతే క్రెడిట్ స్కోర్పై ఎలాంటి నెగిటివ్ ప్రభావం ఉండదు. ఈ సదుపాయాన్ని ఈఎంఐ హాలిడే అని కూడా అంటారు. లాక్డౌన్ పూర్తయిన తర్వాత కస్టమర్లు తిరిగి ఈఎంఐలు చెల్లించేందుకు సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
మెడపై వేలాడుతున్నహోమ్లోన్స్, రుణాలు
సాక్షి, సిటీబ్యూరో: హోమ్లోన్స్ సహా ఇతర రుణాలపై మూడు నెలల మారిటోరియం.. అద్దెదారుల నుంచి మూడు మాసాలు వరకు కిరాయి వసూలు చేయవద్దంటూ ఆదేశాలు.. పేదలకు అవసరమైన నిత్యావసరాలు, కొంత నగదు పంపిణీ.. కరోనా నిరోధానికి అమలులోకి వచ్చిన లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలివీ. ఆచరణలో మాత్రం ఇవేవీ అమలుకు నోచుకోవడంలేదు. నగరంలో లక్షలాది మంది మెడలపై వడ్డీ మాఫియా మిత్తి కత్తి వేలాడుతోంది. ఫలితంగా చిరు వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలతో పాటు కొందరు ‘పెద్దలూ’ ఇబ్బందుల పాలవుతున్నారు. అక్రమ దందానే అధికం.. నగరంలో సాగుతున్న వడ్డీ వ్యాపారంలో 70 శాతం వరకు అక్రమ దందానే. ఈ వ్యాపారులు ఎలాంటి అనుమతులు తీసుకోరు. తాము చేసే టర్నోవర్ పైన, తీసుకుంటున్న వడ్డీపై ఎలాంటి పన్నులు చెల్లించరు. చిన్న స్థాయిలో జరిగే మిత్తి దందానే కాదు.. ప్రతి నెలారూ.లక్షలు, రూ.కోట్లలో లావాదేవీలు నెరిపే కొందరు పెద్ద వ్యాపారులదీ అదే తీరు. వీరిలో అత్యధికులు తమకు పరిచయస్తులకో, వారి ద్వారా పరిచయమైన వారికో మాత్రమే అప్పులు ఇస్తూ ఉంటారు. ష్యూరిటీగా ఖాళీ ప్రామిసరీ నోట్లు, స్టాంపు పేపర్లు, చెక్కులతో పాటు ఆస్తి పత్రాలను తమ అధీనంలో ఉంచుకుంటారు. ఇలాంటి దందా చేయడం అక్రమమైనా ఎవరూ పట్టించుకోకపోవడంతో వీరి వ్యవహరం యథేచ్ఛగా సాగుతోంది. ఊహకు అందని వడ్డీ రేట్లు.. వడ్డీ వ్యాపారం నగరంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణ మండలంలోనే అధికంగా ఉంది. దీంతో పాటు మధ్య, తూర్పు మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ జోరుగా సాగుతోంది. రూ.లక్షలు, రూ.కోట్లు అప్పుగా ఇచ్చే వారిలో పశ్చిమ మండలానికి చెందిన ఫైనాన్సియర్లు ఎక్కువగా ఉన్నారు. పెద్ద మొత్తాలు ఇచ్చే వారు నూటికి రూ.3 నుంచి రూ.6 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇక చిరు వ్యాపారులు, మధ్య తరగతి వారికి అప్పులు ఇచ్చేవారిది మరో వ్యవహారం. వీళ్లు రోజు, వారం, నెల లెక్కన తిరిగి చెల్లించే పద్ధతుల్లో అప్పులు ఇస్తుంటారు. ఎవరైనా రూ.50 వేలు అప్పు అడిగితే రూ.39 వేలు మాత్రమే ఇస్తారు. ఈ మొత్తాన్ని వారానికి రూ.1250 చొప్పున 40 వారాలు చెల్లించాల్సి ఉంటుంది. రోజు, నెల చెల్లింపుల వద్దకు వస్తే ఈ చెల్లించే మొత్తంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. గరిష్టంగా 10 శాతం వరకు వడ్డీగా వసూలు చేస్తుంటారు. కుప్పకూలిన వ్యాపారాలతో.. అప్పు తీసుకునే వారికి ఉండే అవసరం.. ఇచ్చే వారి లాభాపేక్ష.. ఈ రెండూ వెరసీ ఇన్నాళ్లూ వడ్డీ దందా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయింది. దాదాపు 50 రోజులుగా నగర వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు స్తంభించిపోయాయి. నిత్యావసర సరుకులు మినహా మరే ఇతర బిజినెస్ సాగట్లేదు. ఫలితంగా చేతిలో చిల్లిగవ్వ లేని చిరు వ్యాపారులు, దందాలు ఆగిపోయి పెద్ద వ్యాపారులు సైతం వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కి విలవిల్లాడుతున్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి బెదిరింపులు, వేధింపులపై ఫిర్యాదు చేయడానికి బాధితులు వెనుకాడుతున్నారు. లాభాల్లో సగానికి పైగా.. నా వ్యాపారం కోసం ఏ రోజుకా రోజు మిత్తికి డబ్బు తీసుకుంటూ ఉంటాను. ఆ అప్పు కట్టడానికి, వడ్డీతో సహా చెల్లించడానికి సాయంత్రం వరకే గడువు ఉంటుంది. అనివార్య కారణాల వల్ల అలా ఇవ్వలేకపోతే మరుసటి రోజు ఇవ్వాల్సిందే. ఆలస్యం అయితే వడ్డీ పెరుగుతుంది. వ్యాపారం కోసం తీసుకునే అప్పు తీర్చగా.. ఆ వడ్డీ చెల్లించడానికి సగానికి పైగా లాభం ఇచ్చేయాల్సి వçస్తోంది. ఇప్పుడు వ్యాపారాలు లేక తినడానికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు పెరుగుతున్నాయి. తక్షణం అసలు, వడ్డీ చెల్లించకపోతే మళ్లీ అప్పు ఇవ్వబోమని, ఇంకెక్కడా పుట్టకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. – దిల్సుఖ్నగర్కుచెందిన చిరు వ్యాపారి రెట్టింపు కంటే ఎక్కువే ష్యూరిటీ పెట్టా.. ఆంధ్రప్రదేశ్ నుంచి నిత్యం వ్యాపారం కోసం హైదరాబాద్కు వచ్చిపోతూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్కు చెందిన ఓ ఫైనాన్సియర్తో పరిచయం ఏర్పడింది. నాలుగు నెలల క్రితం వ్యాపార అవసరాల కోసం రూ.25 లక్షలు నెలకు నూటికి రూ.8 వడ్డీకి అప్పు తీసుకున్నా. ఆ సమయంలో రూ.70 లక్షల విలువైన కారు, ఆస్తి పత్రాలు ష్యూరిటీగా పెట్టా. లాక్డౌన్ నేపథ్యంలో రెండు నెలలుగా వడ్డీ ఇవ్వలేకపోతున్నా. దీంతో ఆ ఫైనాన్షియర్ ప్రతి రోజూ ఫోన్ చేసి బెదిరించడంతో పాటు వేధిస్తున్నాడు. ఎవరికి చెప్పాలో అర్థం కావడంలేదు. – విజయవాడకు చెందినఓ బడా వ్యాపారి -
మారటోరియం పక్కాగా అమలయ్యేలా చూడండి
న్యూఢిల్లీ: రుణాల వాయిదా చెల్లింపునకు సంబంధించి విధించిన మారటోరియం పక్కాగా అమలయ్యేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్కు సుప్రీం కోర్టు సూచించింది. ఈఎంఐలను కొంతకాలం వాయిదా వేసుకునే వెసులుబాటును ఆర్బీఐ ఇచ్చినప్పటికీ.. రుణగ్రహీతలకు బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని పూర్తిగా అందిస్తున్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే మారటోరియంనకు సంబంధించిన మార్చి 27నాటి ఆదేశాలు సరిగ్గా అమలయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా వైరస్పరమైన కష్టకాలంలో వాయిదాలు చెల్లించేందుకు ఆర్బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.