Health cards
-
30 రోజుల్లో డిజిటల్ హెల్త్కార్డులు
నల్లకుంట: రాష్ట్రంలోని తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మరో 30 రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (ఎఫ్డీహెచ్పీ) కార్డులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నల్లకుంట ఓయూ రోడ్డులోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రి ఆవరణలో కొత్తగా నిర్మించిన రెనోవా కేన్సర్ సెంటర్ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ గురువారం ప్రారంభించారు. అనంతరం అక్కడి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్ను డిజిటైజ్ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్ కార్డులో రోగి గత చికిత్సల వివరాలన్నీ ఉంటాయని.. తద్వారా భవిష్యత్తులో ఆ వ్యక్తి ఏదైనా జబ్బు బారినపడితే పూర్వ చికిత్సలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల వివరాలను వైద్యులు కేవలం ఒక క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుందని వివరించారు. పేదలకు అతితక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చును రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. సమర్థుడైన వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని.. ప్రజలకు సేవ చేసేందుకు గుర్తింపు పొందిన ఎన్జీవోలతో త్వరలో మంత్రి దామోదర సమావేశం ఏర్పాటు చేస్తారన్నా రు. పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేయడం అభినందనీయమని కొనియాడారు. కేన్సర్ వ్యాధికి వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని.. రెనోవా గ్రూప్ ఆఫ్ ఆసుపత్రులు ప్రజాసేవ చేసేందుకు ముందడుగు వేయడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని సీఎం కోరారు. డీడీఎంఎస్ స్పోర్ట్స్ స్కూల్కు అనుమతి ఇస్తాం.. దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. అలాగే ఓయూ ఆవరణలోని డీడీఎంఎస్ విద్యాసంస్థ స్థలంలో కొంతభాగం రోడ్డు విస్తరణలో పోయిందని ట్రస్ట్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని.. ఆ పక్కనే ఓయూ స్థలం ఉంటే డీడీఎంఎస్కు ఇవ్వడానికి వీలవుతోందో లేదో అధికారులతో మాట్లాడతానని చెప్పారు. గతంలో కాసు బ్రహా్మనందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డీడీఎంఎస్కు నాటి ఎంసీహెచ్ ద్వారా ఇచి్చన పన్ను మినహాయింపులను తిరిగి కొనసాగించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. జిల్లాల్లో త్వరలో కేన్సర్ సెంటర్లు: దామోదర రాష్ట్రంలో కేన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని.. కానీ చివరి దశలోనే కేసులు బయటపడుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. తొలి దశలోనే కేన్సర్ వ్యాధిని నిర్ధారించి చికిత్సలు అందించేందుకు వీలుగా త్వరలో జిల్లా స్థాయిలో దశలవారీగా కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ శ్రీధర్రెడ్డి పెద్దిరెడ్డి, డీడీఎంఎస్ చైర్మన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. -
రేషన్.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్కార్డుల అంశం ప్రజల్లో పరేషాన్ రేపుతోంది. లక్షలాది మంది కొత్త రేషన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన అంశాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. రేషన్కార్డులకు కోత పెడతారా? పెళ్లిళ్లు అయి కొత్తగా ఏర్పడిన కుటుంబాలన్నింటికీ కొత్తకార్డులు జారీ చేస్తారా? పాతవాటిలో మార్పు చేర్పులపై ఏం చేస్తారు? రేషన్కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు అందడం ఎలా? అర్హతల పునః సమీక్ష అంటే ఎలాంటి నిబంధనలు పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త రేషన్కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు వెల్లడించారు. రేషన్కార్డులను విభజించి, స్మార్ట్ రేషన్కార్డులు, స్మార్ట్ హెల్త్కార్డులు ఇస్తామని.. రేషన్కార్డులకు అర్హతలపై పునః సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు.. ప్రస్తుతం మంత్రులు వెల్లడించిన అంశాలు.. ఇటీవలి పరిణామాలను బేరీజు వేసుకుంటూ.. రేషన్కార్డుల అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. రేషన్ కార్డుల్లో కోత పడుతుందా? అర్హులైన వారందరికీ కొత్త రేషన్కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే అర్హు లను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. కొత్తగా కార్డుల కోసం ఏడెనిమిది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల డేటాపై స్పష్టత లేదు. దీంతో మరోసారి ప్రజాపాలన నిర్వహించి రేషన్కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త రేషన్కార్డుల జారీకి విధి విధానాలేమిటనే విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంది. వార్షికాదాయం ప్రాతిపదికన జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్కార్డులకే పరిమితి అమలు చేస్తారా? పాతకార్డులకూ వర్తింపజేస్తూ.. అధికాదాయం ఉన్నవారికి రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో అడ్డగోలుగా రేషన్కార్డులు జారీ చేశారని, అధికాదాయం ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్నవారికి కూడా రేషన్కార్డులు ఉన్నాయని సీఎం రేవంత్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్డులకు కోతపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందేది ఎలా? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రేషన్కార్డులే ప్రామాణికమని సీఎం రేవంత్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే రేషన్కార్డు సమస్యలతో చాలా మంది రైతులకు ‘రుణమాఫీ’ అందలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందనివారూ ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకూ రేషన్కార్డుల లింకు ఉండనుంది. దీనివల్ల ఉన్న రేషన్కార్డులు రద్దయినా, కొత్త రేషన్కార్డులు మంజూరుకాకున్నా.. తమకు పథకాలు అందేది ఎలాగని పేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని.. అర్హతకోసం పరిగణించే వార్షికాదాయ పరిమితిని దానికి అనుగుణంగా పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక రేషన్కార్డులను విభజించి బియ్యం వద్దనుకునే వారికి స్మార్ట్ హెల్త్కార్డులు జారీ చేస్తామన్న మంత్రుల ప్రకటనతోనూ సందేహాలు మొదలయ్యాయి. అలా స్మార్ట్ హెల్త్కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ నెల 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం రేషన్కార్డుల అంశంపై స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
డిజిటల్ హెల్త్ ఖాతాల్లో రెండో స్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి: ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలందేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. ఓ పక్క గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతూనే, రాష్ట్ర వ్యాప్తంగా నూతన వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నారు. మరోపక్క ప్రజలకు డిజిటల్ వైద్య సేవలందించే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ఆభా)ల సృష్టిలోనూ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. దీంతో డిజిటల్ హెల్త్ అకౌంట్ల సృష్టిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 43.01 కోట్ల మందికి ఆభా రిజి్రస్టేషన్లు చేశారు. రాష్ట్రాలవారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ 4.29 కోట్ల అకౌంట్లతో మొదటి స్థానంలో ఉంది. 4,10,49,333 ఖాతాలతో ఏపీ రెండో స్థానంలోఉంది. 4.04 కోట్లతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. దక్షిణాదికి చెందిన మరే రాష్ట్రం టాప్–5లో లేదు. కర్ణాటక 2.35 కోట్ల ఖాతాలతో 8వ స్థానంలో, 98 లక్షల ఖాతాలతో తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి. ఇదీ డిజిటల్ ఖాతా ఆభా అకౌంట్లో ప్రతి పౌరుడికి 14 అంకెల డిజిటల్ ఆరోగ్య ఐడీ ఇస్తారు. వ్యక్తి ఆరోగ్య చరిత్ర మొత్తం ఇందులో నమోదు చేస్తారు. ఎప్పటికప్పు డు ఇది అప్డేట్ అవుతుంటుంది. ఓపీ, ఐపీ స్లి ప్పులు, వైద్య పరీక్షల ఫలితాలు, పాత చికిత్స తా లూకూ ఫైళ్లు వంటి మోతబరువు లేకుండా దేశంలో ఎక్కడి నుంచి అయినా ఒక్క క్లిక్తో ఆరోగ్య చరిత్ర అందుబాటులోకి తేవడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం)ను కేంద్రం ప్రవేశపెట్టింది. పేపర్ రహిత సేవలు అందించడానికి వీలుగా ఈ–హాస్పిటల్ విధానాన్ని అమలు చేస్తోంది. చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా.. ఏబీడీఎం అమలులో ఏపీ తొలి నుంచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 4.81 కోట్ల మందికి ఆభాలు రిజిస్టర్ చేయడం లక్ష్యం కాగా, ఇప్పటికి 85% మందికి రిజి్రస్టేషన్ పూర్తి చేశారు. మొత్తం జనాభాలో ఆభా రిజిస్టర్ కవరేజ్ పరంగా దేశంలోనే తొలిస్థానంలో ఏపీ నిలుస్తోంది. రాష్ట్రంలోని 14,368 ఆసుపత్రులు, 20,467 మంది వై ద్యులు, వైద్య సిబ్బంది ఏబీడీఎంలో రిజిస్టర్ అ య్యారు. పీహెచ్సీ నుంచి బోధనాస్పత్రి వరకు అ న్ని స్థాయిల్లో ఈ–హెచ్ఆర్ విధానాన్ని ప్రశేపెట్టి ప్ర జలకు డిజిటల్ వైద్య సేవలను వైద్య శాఖ అంది స్తోంది. ఏపీ విధానాలను అవలంబించాలని నేషన ల్ హెల్త్ అథారిటీ అన్ని రాష్ట్రాలకు సూచించింది. మహారాష్ట్ర, తమిళనాడు అధికారులు ఏపీకి వచ్చి ఇక్కడి విధానాలను తెలుసుకుని వెళ్లారు. ఆరోగ్య రికార్డులు పదిలం డిజిటల్ హెల్త్ అకౌంట్ ద్వారా ప్రతి వ్యక్తి ఆ రోగ్య రికార్డులు ఆన్లైన్లో పదిలంగా ఉంటా యి. వంద శాతం పౌరులందరికీ ఆభా రిజిస్ట్రేషన్ త్వరలోనే పూర్తి అవుతుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఈ–హెచ్ఆర్ అమలు చేస్తున్నాం. ఈ విధానంపై ఆస్పత్రుల్లో అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
రష్మిక చేతుల మీదుగా జర్నలిస్ట్ లకు ఐ.డి, హెల్త్ కార్డ్ ల పంపిణీ
‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీఎఫ్జేఏ)’ జర్నలిస్టుల అందరి క్షేమం కోసం ఆలోచించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమాకు సంబంధించి ఎలాంటి ఫంక్షన్ జరిగినా మీరంతా(ఫిల్మ్ జర్నలిస్టులు)వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు పిలవగానే నేను రావడం హ్యాపీగా ఉంది. మీరంతా బాగుండాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి’ అని ప్రముఖ నటి రష్మిక మందన్నా అన్నారు. సోమవారం హైదరాబాద్లో ‘టీఎఫ్జే’ నూతన ఐడీ కార్డ్స్, హెల్త్ కార్డ్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా హాజరు కాగా.. గౌరవ అతిథులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి తో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ గారు హాజరయ్యారు. టిఎఫ్జేఏ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు మాట్లాడుతూ.. జర్నలిస్టుల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఎంతో సహాయం చేస్తున్నారు. మరి మనం వారికి ఏం చేస్తున్నాం అనిపించినప్పుడు రీసెంట్ గా దిల్ రాజు, చిరంజీవిగారితో అసోసియేషన్ తరఫున సినిమా కోసం ఏం చేయాలి అని మాట్లాడటం జరిగింది. మన జర్నలిస్ట్ లకు వాళ్లు అంత సాయం చేస్తున్నప్పుడు.. వారికి సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్ట్ లుగా మనం సహాయం చేయాలని అని చర్చించడం జరిగింది. కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా చూసుకుని ఈ కమిట్ స్టార్ట్ చేయబోతున్నాం ఇక టిఎఫ్జేఏ అసోసియేషన్ కోసం మూడు రకాల ఇన్సూరెన్స్ లు చేశాం. ఒకటి నలుగురు కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీకి 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. మిగతావి టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీ. వీటిలో మొదటిది ఎవరికైనా జరిగితే.. ఆ కుటుంబానికి ఈ మొత్తం అందించడం జరుగుతుంది. యాక్సిడెంటల్ పాలసీలో ఎవరైనా ప్రమాదం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉంటే.. వారానికి పదివేల చొప్పున.. అసవరమైతే ఐదేళ్ల వరకూ ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ మూడు ఇన్సూరెన్స్ ల కోసం చాలా పెద్ద కంపెనీలను సంప్రదించాం. వారిలో మనకు నచ్చేలా యతిక ఇన్సూరెన్స్ వాళ్లు ముందుకు వచ్చారు. వారి తరఫున, మన తరఫున ఇద్దరు ప్రతినిధులను పెట్టాం. వీరిలో ఎవరిని సంప్రదించినా.. 24 గంటలూ అందుబాటులో ఉండబోతున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించబోతోన్న మన టిఎఫ్జేఏ కు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. టిఎఫ్జేఏ ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. టిఎఫ్జేఏ నుంచి ఇప్పటి వరకూ ఈ ఐదేళ్లలో మనం ఇన్సూరెన్స్ సంస్థకు కట్టిన డబ్బులు 1 కోటి 10 లక్షలు 84వేల 626 రూపాయలు. ఈ మొత్తంలో మనం చేసుకున్న క్లెయిమ్ చేసుకున్న అమౌంట్ 90 లక్షల 76 వేల 614 రూపాయలు. ఈ మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి 60లక్షల 26 వేల 614 రూపాయలు క్లెయిమ్ చేశాం. టర్మ్ ఇన్సూరెన్స్ 30 లక్షలు క్లెయిమ్ చేశాం. ఎవరికీ ఏ ప్రాబ్లమ్ రాకూడదు. సంతోషంగా ఉండాలనే కోరుకుందాం. కానీ ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు 24 గంటలూ ఎంతో మద్ధతుగా నిలుస్తున్నాం’ అన్నారు. ‘మేం సినిమాలు తీసిన తర్వాత వాటిని జనాల్లోకి తీసుకువెళ్లేది జర్నలిస్ట్ లే. ఆ విషయంలో మీరెప్పుడూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. మా వైపు నుంచి వారికి ఏ సహాయం కావాలన్నా ఉంటాం’అని అన్నారు నిర్మాత నవీన్ యొర్నేని. ‘టిఎఫ్జేఏ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సపోర్ట్ గా ఉంటుందని నిర్మాత టిజి విశ్వప్రసాద్ అన్నారు. -
మత్స్యకారులకు హెల్త్కార్డులు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: తమకు రూ.10 లక్షల కవరేజీతో హెల్త్కార్డులు ఇవ్వాలని మత్స్యకారులు చేపట్టిన ఆందోళన అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తతకు దారి తీసింది. మత్స్యకారులను ఆదుకోవాలంటూ టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు ముందుగా అంచనా వేయలేకపోయారని చెపుతున్నారు. అనూహ్యంగా ఆటోలో అసెంబ్లీ ముందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, మత్స్యకారులు ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, రూ.10 లక్షల కవరేజీతో హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
Andhra Pradesh: ఆరోగ్యానికి భరోసా ‘కార్డు’
2023 జూలై 1.. సుబ్బారావుకు జ్వరమొచ్చింది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్కు వెళ్లి హెల్త్ కార్డు ఇచ్చాడు. అందులో ఉన్న నంబరును హెల్త్ ప్రొవైడర్ కంప్యూటర్లో ఎంటర్ చేశాడు. ‘ప్రతి ఏటా ఇదే సీజన్లో మీకు జ్వరం వస్తోంది. మీకు కొన్ని మందులు బాగా పనిచేస్తున్నాయి. యాంటీబయాటిక్స్ మీ ఒంటికి పడటంలేదు. అందువల్ల ఇతర మందులు వాడాలి. మీ వయసు పెరుగుతున్నందున ఆహారంలో మార్పులు చేసుకోవాలి’ అంటూ హెల్త్ ప్రొవైడర్ చెబుతున్న వివరాలతో సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాలన్నీ కొత్తగా వచ్చిన ఈయనకు ఎలా తెలిశాయబ్బా అనుకుని అదేమాట అడిగేశాడు. మీ హెల్త్ అకౌంటులో మీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. మీరు గతంలో ఏ జబ్బులకు గురయ్యారు, వాటికి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? మీకు ఏ మందులు బాగా పనిచేస్తాయి? ఇలాంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేయటం వల్ల సకాలంలో సరైన చికిత్స చేసేందుకు వీలవుతోంది అని ఆయన వివరించాడు. – సాక్షి ప్రతినిధి, అమరావతి ఆరోగ్య రంగంలో వినూత్న పథకాలతో దూసుకుపోతున్న మన రాష్ట్రం డిజిటల్ హెల్త్ మిషన్ అమలుకు చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్ళి నిర్దిష్ట ఫార్మాట్లో వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఈ నమోదు ప్రక్రియ 66.8 శాతం పూర్తయింది. హెల్త్ మిషన్కు ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేయడంలోనూ ఏపీ ముందంజలో ఉంది. రాష్ట్రం నుంచి 69,683 హెల్త్ రికార్డులను డిజిటల్ హెల్త్ అకౌంట్స్తో అనుసంధానం చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మిషన్ ద్వారా ప్రోగ్రామ్ మేనేజర్లు, నియంత్రణాధికారులు, అసొసియేషన్లు, ఎన్జీవోలు, వైద్యులు, మందుల, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీలు, ల్యాబ్లు, మందుల దుకాణాలు, థెరపీ సెంటర్లు, హాస్పిటల్స్, క్లినిక్స్.. అన్నింటినీ అనుసంధానం చేయటం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించటం ముఖ్య ఉద్దేశం. డిజిటల్ హెల్త్ కార్డు ఆధార్ కార్డులానే ప్రతి ఒక్కరికీ 14 అంకెలతో ఉన్న డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఇది రెఫరల్ సిస్టంలో బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు పీహెచ్సీలో ఒక డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు టెస్టులు చేసి కొన్ని లక్షణాలు కనుక్కుంటారు. దీన్ని సాధారణంగా ప్రిస్క్రిప్షన్లో రాస్తారు. అదే హెల్త్ అకౌంటు ఉంటే.. అందులో వివరాలన్నీ పొందుపరుస్తారు. మరో డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు రక్త పరీక్షలు, స్కానింగ్, ఇతరత్రా పరీక్షలు మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. రోగి ఐడీ నంబర్ కంప్యూటర్లో నమోదు చేయగానే వివరాలన్నీ వస్తాయి. టెలి–కన్సల్టేషన్ ద్వారా ఆరోగ్య సేవలను పొందేందుకు సైతం ఇది అనుకూలం. ఇతర వైద్య నిపుణుల సలహా సంప్రదింపులకు, బీమా క్లియరెన్సు, క్లెయిముల పరిష్కారం, అత్యవసర సమయాల్లో పేషెంటును ఆధునిక వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులకు తక్షణమే తరలించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఆరోగ్య డేటా, ల్యాబ్ రిపోర్టులు, చికిత్స వివరాలు, అందించిన ఆరోగ్య సదుపాయాలు, డిశ్చార్జి సమ్మరీలను అకౌంటులో ఎప్పటికప్పుడు జత చేస్తుంటారు. రోగి తన ఆరోగ్య సమాచారం రహస్యంగా ఉంచాలని భావిస్తే.. అకౌంటును బ్లాక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అవసరమైనప్పుడు మళ్లీ ఓపెన్ చేసుకోవచ్చు. ఆస్పత్రుల అనుసంధానమూ ముఖ్యమే ప్రజలందరికీ హెల్త్ ఐడీలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను, అక్కడ పనిచేసే డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ నర్సులను కూడా డిజిటల్ మిషన్ పరిధిలోకి తేవాలి. ప్రతి డాక్టరుకూ ప్రత్యేక లాగిన్ ఐడీ ఉంటుంది. ఆ ఐడీ ద్వారా పేషెంట్ ఐడీని కంప్యూటర్లో నమోదు చేస్తే అతని ఆరోగ్య వివరాలు వస్తాయి. మన రాష్ట్రంలో 13,346 ఆసుపత్రులు, నర్సింగ్హోంలు డిజిటల్ హెల్త్ మిషన్లో చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ఉత్తరప్రదేశ్ తర్వాత మన రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఆసుపత్రులు ఈ పథకంతో అనుసంధానమైనట్లు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను పూర్తిస్థాయిలో దీని పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రంలో లేదా దేశంలో ఎక్కడికి వెళ్లినా రోగికి అత్యంత మెరుగైన, కచ్చితమైన వైద్యం సత్వరమే అందుతుంది. మన ఆరోగ్య విధానం ఇలా.. మన రాష్ట్రంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్.. అంటే ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రాథమిక వైద్యం లభిస్తుంది. అక్కడి నుంచి పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కు రెఫర్ చేస్తారు. పీహెచ్సీ నుంచి సీహెచ్సీ (సామాజిక ఆరోగ్య కేంద్రం)కు, అక్కడి నుంచి ఏరియా ఆస్పత్రికి, జిల్లా ఆస్పత్రికి.. చివరగా బోధనాసుపత్రికి రెఫరల్ సిస్టం పనిచేస్తుంది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్లో మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్, పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, సీహెచ్సీలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా బృందం, ఏరియా ఆస్పత్రిలో వీటికి అదనంగా ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ వంటివి, జిల్లా ఆస్పత్రిలో సుమారు 16 రకాల స్పెషాలిటీ డాక్టర్లు, బోధనాసుపత్రిలో 32 విభాగాల స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు. రాష్ట్రంలో దాదాపు 95 శాతం మందికి ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉంది. హెల్త్ డేటాలో మనమే నం.1 ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించటం, వాటిని డిజిటలైజ్ చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉంది. ఇదంతా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతోనే సాధ్యమైంది. ప్రజల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటం వల్ల వారికి వైద్యం అందించే విషయంలో ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే మన ముఖ్యమంత్రి గ్రామగ్రామానికి హెల్త్ క్లినిక్లు తీసుకొచ్చారు. కొత్తగా పీహెచ్సీలు, యూపీహెచ్సీలూ నిర్మిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే వైద్యానికి సంబంధించిన అన్ని దశలనూ పటిష్టపరుస్తున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ హెల్త్ ఐడీలు, రికార్డులు భద్రపరిచేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల ద్వారానూ క్షేత్రస్థాయిలో అందరి హెల్త్ డేటా సేకరిస్తున్నారు. మనకు సరిపడా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఉన్నారు. వీరందరి సహకారంతో మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయగలుగుతున్నాం. ఈ విభాగంలో మనమే ముందున్నామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అభినందనలు తెలిపింది. ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఈ విషయంలో మన ప్రభుత్వానికి అవార్డులు కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఎకనమిక్స్ టైమ్స్ ప్రకటించిన అవార్డు కూడా ఇలాంటిదే. – విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి -
కదం తొక్కిన కార్మికులు
హిమాయత్నగర్: ఔట్ సోర్సింగ్ కార్మికుల ధర్నాతో గురువారం బల్దియా ప్రధాన కార్యాలయం దద్దరిల్లింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఔట్సోర్సింగ్ కార్మికులను ఎన్ఎంఆర్లుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని, ఆరోగ్య భద్రతకు హెల్త్ కార్డు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, బయోమెట్రిక్ మిషన్లను జీహెచ్ఎంసీనే నేరుగా కొనాలనే తదితర డిమాండ్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (బీజేపీ) మజ్దూర్ సెల్ పిలుపు మేరకు ఉద్యోగ, పారిశుద్ధ్య, ఎంటమాలజీ, వెటర్నరీ, పార్క్ సెక్షన్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్ విభాగాల కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు గంటల పాటు కార్యాలయం లోపల కార్మికులు బైఠాయించారు. అవుట్ సోర్సింగ్ కమిషనర్ లోకేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నుంచి తీసేసిన 700 మందిని విచారణ జరిపి వారిని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ కారణంగా కట్ అయిన డబ్బులు తిరిగి ఇస్తామన్నారు. ఎంటమాలజీ విభాగంలో ఉన్న ఖాళీలను నియమించేందుకు, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఉదిరి గోపాల్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, ఔట్ సోర్సింగ్ విభాగం అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు. (చదవండి: హైదరాబాద్కు పాడ్ కార్స్, రోప్వేస్) -
ఇండస్ట్రీకి పెద్దగా ఉండను, నాకిష్టం లేదు: చిరంజీవి
యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. సినీ పరిశ్రమలోని అందరికి 50 శాతం రాయితీతో టెస్టులు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో కార్డుల పంపిణీ జరగ్గా.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కరోనా ఎంతో మందిని బలి తీసుకుంది. ఎంతో మంది ఆప్తుల్ని, మిత్రుల్ని కోల్పోయాము. ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందర్నీ కాపాడాలని ఆలోచన చేశాను. రోగం వచ్చాక బాధపడేకంటే రోగ నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. హెల్త్ కార్డుల కోసం అడిగితే యోధ లైఫ్ లైన్ చైర్మన్ సుధాకర్ సానుకూలంగా స్పందించారు. కేవలం మెంబర్స్కు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు సైతం అవకాశం కల్పించారు. మేమిచ్చే హెల్త్ కార్డ్, దీని క్యూఆర్ కోడ్లో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ఇప్పటివరకు 7,699 కార్డులు రెడీ అయ్యాయి. మిగతావన్నీ ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. ఒమిక్రాన్ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. షూటింగ్లో ఉన్నవాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్లో పాల్గొనాలి. ఆరోగ్య పరంగా అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండను.. ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రాను. కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటా..' అని చెప్పుకొచ్చారు. అలాగే సినీ పరిశ్రమలోని వివాదాలపై స్పందిస్తూ.. 'పెద్దరికం చేయడం నాకిష్టం లేదు, నేను పెద్దగా ఉండను.. కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు నేనున్నాంటూ ముందుకు వస్తాను. కానీ అనవసరంగా తగుదునమ్మా అంటూ ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఇద్దరు వ్యక్తులో, రెండు యూనియన్లో కొట్టుకుంటుంటే మాత్రం ఆ పంచాయితీలు నేను చేయను. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు ఇబ్బంది. ఆ పెద్దరికమే నాకు వద్దు' అని చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. -
డిజిటల్ హెల్త్ కార్డులకు 60% మంది ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్(ఎన్డీహెచ్ఎం) కింద కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘డిజిటల్ హెల్త్ ఐడీ’కి సుమారు 60 శాతం మంది ప్రజలు సానుకూలంగా స్పందించారు. కానీ, వైద్య, ఆరోగ్య రికార్డులు కాకుండా సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతపరిచేందుకు నిరాకరించారు. లోకల్సర్కిల్స్ అనే సోషల్ మీడియా వేదిక ఇటీవల దేశవ్యాప్తంగా 9 వేల మంది నుంచి హెల్త్ ఐడీకి సంబంధించిన 4 ప్రశ్నలపై చేపట్టిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఈ సర్వే వివరాలను డిజిటల్ హెల్త్ ఐడీలో పాలు పంచుకునే విభాగాలకు అందజేయనున్నట్లు లోకల్సర్కిల్స్ జనరల్ మేనేజర్ అక్షయ్ గుప్తా వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎన్డీహెచ్ఎం పథకాన్ని ప్రకటించారు. చదవండి:కంగనా క్షమాపణ చెప్పాలి: శివసేన -
ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన!
సాక్షి, న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఎర్రకోట వేదికగా కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు ఈ పధకాన్ని చేపడుతున్నారు. ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకంలో భాగంగా వ్యక్తికి జరిగిన చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్ర అంతటినీ డిజిటలీకరించి ఈ కార్డులో భద్రపరుస్తారు. ఆస్పత్రులు, క్లినిక్లు, వైద్యులను కేంద్ర సర్వర్తో అనుసంధానిస్తారు. అయితే ఈ పధకాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని పూర్తిగా ఆస్పత్రులు, పౌరులకే వదిలివేస్తారు. ఈ కార్డును కోరుకున్న వారికి ఓ యూనిక్ ఐడీని కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా వారు సిస్టమ్లోకి లాగిన్ అవుతారు. దశలవారీగా అమలు చేసే ఈ పధకానికి రూ 300 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఈ పథకం ప్రయోజనాల్లో కీలకమైనది ఏంటంటే దేశంలో ఏ వైద్యుడు, ఆస్పత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిక్ ఐడీ ద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను వైద్యులు పరిశీలిస్తారు. ఆధార్ కార్డు తరహాలో హెల్త్ కార్డును జారీ చేస్తారు. దేశంలో వైద్యారోగ్య పరిస్ధితిని పూర్తిగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ పధకంలో పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా చర్యలు చేపడతారు. ఈ పధకాన్ని ఆపై మందుల షాపులు, వైద్య బీమా కంపెనీలకూ సర్వర్లో అనుసంధానిస్తారు. రోగి అనుమతితోనే వైద్యులు, ఆస్పత్రి వర్గాలు వ్యక్తి రికార్డులను పరిశీలించేందుకు అనుమతిస్తారు. చదవండి : మరో మైలురాయి అధిగమించిన మోదీ -
మూగ జీవాలకు హెల్త్ కార్డులు
పాలకొండ రూరల్: మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు, యజమానులు, కాపలాదారులకు ఆసరాగా నిలిచేందుకు ‘వైఎస్సార్ పశుసంరక్షణ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. మూగజీవాలకు ఆరోగ్య రక్షణ కార్డులు మంజూరు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా... వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాలో పాడి పెంపకం ఆ తర్వాతి స్థానంలో ఉంటూ రైతులకు ఆసరాగా నిలుస్తుంది. ఈ క్రమంలో యానిమల్ కార్డుల ద్వారా దాదాపు లక్ష మంది పశు సంపద కలిగిన రైతులకు, పాడి పరిశ్రమల యజమానులకు, కాపరులకు ప్రయోజనం చేకూరనుంది. గ్రా మ సచివాలయాలకు అనుసంధానం చేసిన పశువైద్య సహాయకులు ఈ కార్డుల మంజూరుకు అర్హులైన రైతులకు సహకరిస్తారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో గల ( 085–00–00–1962, 1907) వంటి టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఈ పథకాన్ని పొందేందుకు అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా దాదాపు లక్షకు పైబడి మూగప్రాణులకు ఈ కార్డులు మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా పశువు ఆరోగ్య సంరక్షణకు చర్యలు, కృత్రిమ గర్భధారణ, సూడి పశువులు, దూడలు, పోషకాలు, పశుసంపద వివరాలు నమోదు చేస్తారు. ఆర్బీకే కేంద్రాల వద్ద పశువుల బోనులు ఏర్పాటుచేసి వాటి ఆరోగ్య తాజా స్థితిగతులు గుర్తిస్తారు. ఈ నేప థ్యంలో ఆవులు, మేకలు, గొర్రెలు, బర్రెలు కలిపి జిల్లావ్యాప్తంగా సుమారు 16 లక్షల 96వేల పైబడి ఉన్నట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీరంతా ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచిస్తున్నారు. పథకం తీరుతెన్నులు.. ఎలాంటి ముందస్తు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాన్ని అర్హులకు అందిస్తారు. జీవాల పునరుత్పాదక దశలో 2 నుంచి 10 ఏళ్ల వయసున్న ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసున్న బర్రెలకు వర్తింపజేస్తారు. పశువు మరణిస్తే మేలుజాతి స్వదేశీ ఆవు ఒక్కింటికి రూ.30 వేలు, దేశవాళీ బర్రె మరణిస్తే రూ.15వేలు పరిహారం అందిస్తారు. ఏడాదికి ఒక పాడి రైతు కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం ఉంది. ఆరు నెలల నుంచి ఆపై వయసున్న మేకలు, గొర్రెలకు ఈ పథకం వర్తింపజేస్తారు. ఒకేసారి మూడు నుంచి అంతకన్నా ఎక్కువ జీవాలు మరణిస్తే పథకం వర్తిస్తుంది. ఒక్కో జీవానికి రూ.6వేల వంతున ఏడాదిలో ఒక్కో కుటుంబం గరిష్టంగా రూ.1.20 లక్షలు పరిహారం పొందవచ్చు. ఏడాది కాలంలో రూ.1.35 కోట్లు గడిచిన ఏడాది కాలంలో పథకం ద్వారా రూ.1.35 కోట్ల నష్టపరిహారం పశువులు, జీవాలను నష్టపోయి న అర్హులకు అందించాం. మరో రెండు కోట్ల పరిహారానికి సంబంధించి నగదు త్వరలో లబ్ధిదారులకు అందించనున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా పా డి రైతులు, యజమానులు, కాపర్లు తమ వివరాలు నమోదు చేసుకుంటే సరి పోతుంది. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులకు కార్డులను ఆర్బీకేల ద్వారా అందిస్తాం. ఈ కార్డులు నాలుగేళ్లు పనిచేస్తాయి. లబ్ధి పొందేందుకు ఈ పథకాన్ని సది్వనియోగపర్చుకోవాలి. మా సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. – డాక్టర్ ఆరిక ఈశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ -
మూగప్రాణులకు హెల్త్కార్డులు
సాక్షి, కడప : మూగప్రాణులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల యజమానులు, పెంపకం దారులకు ఆసరాగా నిలిచేందుకు వైఎస్సార్ పశుసంరక్షణ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య సంరక్షణ కార్డులు అందించి పశువులు, గొర్రెలు, మేకల ఆరోగ్యాన్ని సంరక్షించనుంది. జిల్లా వ్యాప్తంగా యానిమెల్ హెల్త్కార్డుల ద్వారా లక్షమంది పశుసంద కలిగిన రైతులకు, గొర్రెల యజమానులకు, కాపరులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో 75 వేల పెద్దపశువులు, 25 వేల మంది గొర్రెలు, మేకల యజమానులకు, కాపరులకు దీని ద్వారా కార్డులందించనున్నారు. గ్రామ సచివాలయానికి అనుసందానంగా పశువైద్య సహాయకులు ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పశుసవర్ధకశాఖ 085–00–00–1962, రైతుభరోసా కేంద్రాల టోల్ఫ్రీ నంబరు 1907కు కాల్ చేయవచ్చు. 75వేల పెద్దపశువులకు.. 25వేల జీవాలకు కార్డులు జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష పశువులకు హెల్త్ కార్డులు అందించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ నిర్ణయించింది. కార్డుల్లో ప్రధానంగా పశువుల ఆరోగ్య సంరక్షణ కు చర్యలు, కృత్రిమ గర్భధారణ, సూడి పశువులు, దూడలు, టీకాలు, పశుపోషకాలు, పశుసంపద వివరాలను నమోదు చేస్తారు. రైతుభరసా కేంద్రాల వద్ద పశువుల బోనులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 620 కేంద్రాల వద్ద వీటిని ఈ బోన్లు నిర్మించారు. పశునష్ట పరిహార పథకం ఇలా.. వైఎస్సార్ పశు నష్టపరిహార పధకాన్ని పునరుత్పాదక దశలో 2 నుంచి 10 ఏళ్ల వయసున్న ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసున్న బర్రెలకు వర్తింప చేస్తారు. పశువు మరణిస్తే మేలుజాతి స్వదేశీ ఆవు ఒక్కింటికి రూ.30 వేలు, దేశవాళీ బర్రె మరణిస్తే రూ.15వేల పరిహారం అందిస్తారు. ఏడాదికి ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.1.50లక్షల వరకు పరిహారం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆరునెలల నుంచి ఆపై వయసున్న గొర్రెలు, మేకలకు పధకం వర్తింపచేశారు. ఒకేసారి మూడు నుంచి అంతకన్నా ఎక్కువ జీవాలు మరణించినప్పుడు పధకాన్ని అందిస్తారు. ప్రతి జీవానికి రూ.6వేలతో ఏడాది కుటుంబానికి గరిష్టంగా రూ.1.20లక్షల వరకు పరిహారం అందుతుంది. కార్డుల పంపిణీ చేపట్టాం పశువులకు, జీవాలకు హెల్త్కార్డులను రైతులకు పంపిణీ చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వీటిని అందిస్తున్నాం. పశువుకు సంబంధించిన ప్రతి విషయం కార్డులో అసిస్టెంట్లు రాస్తారు. ఈ కార్డులు నాలుగేళ్లు పనిచేస్తాయి. జిల్లా వ్యాప్తంగా పాడిరైతులు, గొర్రెలు, మేకల పెంపకందార్లకు కార్డులు అందించేలా చర్యలు తీసుకున్నాం. ఒక కుటుంబానికి ఒక కార్డు చొప్పున అందిస్తారు. –వీఎల్ఎస్ సత్యప్రకాష్, సంయుక్త సంచాలకులు, జిల్లా పశుసంవర్ధకశాఖ, కడప -
1.42 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇక డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేని దుస్థితి ఉండదు. రాష్ట్రంలోని 1.42 కోట్ల కుటుంబాలకు పైగా అంటే 95 శాతం కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య భరోసా కల్పించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తూ ఈ ఏడాది జనవరి 3వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుతో పాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే రోజు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.50 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అర్హులైన మిగతా 1.41 కోట్లకు పైగా కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింపచేసే కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నుంచి ప్రారంభించనున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లను లబ్ధిదారుల ఇళ్లకే పంపించి కార్డులు పంపిణీ చేసి, అవి అందినట్లు రశీదులను స్వీకరించనున్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే వలంటీర్ల ద్వారా లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి కార్డును మంజూరు చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. కార్డుల పంపిణీ, ప్రత్యేకతలు ఇలా.. – తొలి దశలో శనివారం నుంచి కర్నూలు, వైఎస్సార్, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో అర్హులైన 39 లక్షల కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నారు. – రెండో దశలో వచ్చే నెల 3వ తేదీ నుంచి అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అర్హులైన 59 లక్షల కుటుంబాలకు హెల్త్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తారు. – మూడో దశలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో అర్హులైన 43 లక్షల మంది కుటుంబాలకు వచ్చే నెల 25వ తేదీ నుంచి కార్డుల పంపిణీ ప్రారంభించి మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. – క్యూఆర్ కోడ్ బార్ కలిగిన కొత్త వైఎస్సార్ ఆరోగ్య శ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులపై రేషన్ కార్డు నంబర్కు బదులు యునిక్ హెల్త్ గుర్తింపు నంబర్ ఉంటుంది. తద్వారా వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు నమోదవుతుంది. కుటుంబ యజమాని పేరు తెలుగు, ఇంగ్లిష్ బాషల్లో ఉంటుంది. ఆ చిరునామాలో ఉంటున్న కుటుంబంలోని వారి పేర్లు కూడా ఉంటాయి. ఇంటి చిరునామా గుర్తింపు నంబర్ను కూడా ఇస్తున్నారు. – కొత్త ఆరోగ్య శ్రీ కార్డులపై గ్రామ, వార్డు సచివాలయ కోడ్లను ముద్రిస్తారు. – వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న కుటుంబాలకూ వర్తింపు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగించినా, ప్రాధాన్యతను తగ్గించేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చింది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందక పడుతున్న బాధలను వైఎస్ జగన్.. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో కళ్లారా చూశారు. యూనివర్సల్ ఆరోగ్య బీమా తీసుకువస్తానని, చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే వార్షిక ఆదాయాన్ని రూ.5 లక్షలకు పెంచడంతో మధ్య తరగతి వారికి సైతం లబ్ధి కలిగేలా ఈ పథకంలో విప్లవాత్మక మార్పులు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో సైతం వైద్య సేవలు పొందేలా వీలు కల్పించారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. లబ్ధిదారులను అత్యంత పారదర్శకంగా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి గుర్తించారు. -
అందరికీ ఆరోగ్య కార్డులు
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రం లోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన కార్డియాలజీ, యూరాలజీ విభాగాలను బుధవారం ఆయన ప్రారంభిం చారు. సంబంధిత విభాగాలను పరిశీలించి ఆస్పత్రి సూపరింటెండెంట్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు అందించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. త్వరలో ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుందని తెలిపారు. ప్రపంచంలోని ఒక్క అమెరికాలోనే ఈ తరహా హెల్త్ కార్డుల విధానం అమలులో ఉందని, తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నారని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలోనే కార్డియాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటుతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ల ప్రజలను హైదరాబాద్కు తరలించకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించ్చవచ్చన్నారు. మరణాలు తగ్గి ప్రసవాలు పెరిగాయి.. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మాతా శిశు మరణాలు తగ్గాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. గతంలో సాధారణ ప్రసవాలు 30 నుంచి 35% మాత్రమే జరిగేవని, ప్రస్తుతం అవి 65 నుంచి 70 శాతానికి పెరిగాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య భాగ్యం
బొబ్బిలి: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించింది. కొత్త మార్గ దర్శకాలతో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ జిల్లాలో ప్రారంభమయింది. జిల్లా వ్యాప్తంగా 7,14.389 కుటుంబాలకు విడతల వారీగా ఆరోగ్యశ్రీ కార్డులను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 28లోగా ఈ పంపిణీ పూర్తి చేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథకం గత ప్రభుత్వ హయాంలోనూ ఉన్నప్పటికీనిధుల విడుదలలో కొర్రీలు వేసేది. వందల కోట్ల రూపాయలను పెండింగ్లో పెట్టి రోగుల సహనానికి పరీక్ష పెట్టేది. కొన్ని వ్యాధులను జాబితా నుంచి తొలగించింది. దీనివల్ల ఎంతోమంది నిరుపేదలకు ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అదనంగా వెయ్యి వ్యాధులకు వైద్యం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఉన్న వారికి గతంలోలా కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే వైద్యం కాకుండా దాదాపు అన్ని రకాల వ్యాధులూ ఉచితంగా నయం చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది గతంలో 1059 రకాల వ్యాధులకు మాత్రమే పరిమితమయిన ఈ పథకాన్ని ఇప్పుడు 2059 రకాల వ్యాధులు, రోగాలకు వర్తింపజేస్తున్నారు. ఈ పథకం ద్వారా రూ.5 లక్షల వరకూ అయ్యే శస్త్రచికిత్సను ఉచితంగా చేస్తారు. మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో రూ.10లక్షల వరకూ అవకాశం కల్పిస్తున్నారు. గతంలో ఈ చెల్లింపులు రూ.3లక్షల వరకూ ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులకు నిధులు చెల్లించకపోవడంతో రోగ గ్రస్తులు ఆస్పత్రుల మెట్లు ఎక్కి దిగడం తప్ప మరే విధమైన ప్రయోజనం పొందలేదు. ఇప్పుడు రూ. 5 లక్షల వరకూ ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చు. కోలుకునేవరకూ ఆర్థిక సాయం.. రోగులకు ఉచితంగా వైద్యం, శస్త్రచికిత్సలు చేయడంతో పాటు వారు డిశ్చార్జి అయిన తరువాత కోలుకునే వరకూ విశ్రాంతి సమయంలో అయ్యే ఖర్చులను భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోగికి డాక్టర్ సూచించే అవసరమయిన విశ్రాంతి దినాలను బట్టి రోజుకు రూ.250లు లేదా నెలకు గరిష్టంగా రూ.5వేలను రాష్ట్ర ప్రభుత్వం రోగి అకౌంట్లో నేరుగా జమ చేస్తుంది. అర్హతకు వెసులు బాటు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తించేందుకు కుటుంబానికి 12 ఎకరాల సాగు భూమి లేదా 35 ఎకరాలలోపు పంట భూములు, బీడు భూములు కలపి ఉన్నా అర్హత పొందుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే కారున్నా ఈ పథకం వర్తిస్తుంది. వార్షికాదాయం రూ.5 లక్షలున్నా, 3వేల చదరపు అడుగుల స్థలానికి మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను కడుతున్నా అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ఆపరేషన్లూ ఇక ఉచితం గతంలో ప్యాకేజీలు ఉండేవి. ఎక్కువ మొత్తం ఖర్చయ్యే వాటికే వర్తించేవి. ఇప్పుడు వెయ్యి రూపాయల దగ్గర నుంచీ ఉచితంగా చేస్తారు. కోలుకునేందుకు కూడా డబ్బులు ఇస్తారు. – ఎస్.వి.రమణ కుమారి, డీఎంహెచ్ఓ ఆరోగ్యశ్రీ లేక మా అమ్మ చనిపోయింది మా అమ్మ రమణమ్మకు క్యాన్సర్ సోకడంతో వివిధ ఆస్పత్రులకు తిప్పాం. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని గతేడాది వైజాగ్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాం. పథకం వర్తించాలంటే వేచి చూడాలని అక్కడి వైద్యులు చెప్పారు. సెల్కు మెసేజ్ వస్తుందనీ, ఆ తరువాత ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఈ లోగా రూ.లక్ష వరకూ ఖర్చు చేయించారు. రెండున్నర నెలల పాటు ఆస్పత్రిలో మెసేజ్ కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. చివరకు నా తల్లి చనిపోయింది. – లెంక అప్పారావు, ఇట్లామామిడిపల్లి, రామభద్రపురం మండలం -
గజ్వేల్ నుంచే హెల్త్ కార్డుల ప్రక్రియ
-
ఒక రోజంతా మీతోనే ఉంటా: కేసీఆర్
సాక్షి, గజ్వేల్ : గజ్వేల్ నియోజకవర్గం నుంచే హెల్త్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కంటి వెలుగు పథకం మాదిరే గజ్వేల్ నుంచే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేది తన కోరిక అని ఆయన అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం మహితి ఆడిటోరియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ప్రొఫెల్ తయారు చేయిస్తాం. త్వరలోనే గజ్వేల్ నియోజకవర్గ ఆరోగ్య సూచిక వెంటనే రూపొందించాలి. హెల్త్ ప్రొఫైల్ ప్రజలందరికీ చాలా ఉపయోగకరం. ప్రజల వైద్య పరీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. 15-20 రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. త్వరలో ఒకరోజంతా మీతోనే ఉంటా. గజ్వేల్ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకుందాం. స్వయం సమృద్ధే లక్ష్యంగా పనిచేద్దాం. హరితహారంలో దేశానికే ఆదర్శంగా గజ్వేల్ ఉండాలి. అలాగే గజ్వేల్లో ఇల్లులేని నిరు పేదలు ఉండకూడదు. నియోజకవర్గంలో పార్టీలు, పైరవీలు లేకుండా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందిస్తాం. ప్రతి కుటుంబానికి ఏదో ఒక పని కల్పించేలా చర్యలు’ చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. అంతకు ముందు ముఖ్యమంత్రి ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. -
మత్స్యకారులు కోరిన చోట జెట్టీలు
సాక్షి, అమరావతి: మత్స్యకారులు కోరుకున్న ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జెట్టీల నిర్మాణాలకు ఏ ప్రాంతాలు అనువుగా ఉన్నాయో తొలుత పరిశీలన చేయాలని సూచించారు. మరపడవల లంగరు కోసం అనువైన జెట్టీలు లేకపోవడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మత్స్యకారులు చెన్నై, గుజరాత్కు తరలి వెళ్లిపోతున్నారని, వారంతా సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మత్స్య, పశు సంవర్ధక శాఖలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా వాడరేవుల్లో రెండు పెద్ద జెట్టీల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భీమిలి సమీపంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై అధికారులతో సీఎం సమీక్షించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా మరపడవలు కూడా చేరుకోవడంతో విశాఖ హార్బర్పై భారం పెరుగుతోందని, దీన్ని నివారించేందుకు తీరంలో అనువైన జట్టీలను నిరి్మంచాలని సూచించారు. బందరు పోర్టును మేజర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. నిజాంపట్నం హార్బర్ రెండోదశ విస్తరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్.. చేపలు, రొయ్యలు అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చేపలు, రొయ్య పిల్లలు, మేతను పరీక్షించడానికి అనువుగా ల్యాబ్లు ఏర్పాటు చేయాలన్నారు. సీడ్, ఫీడ్ కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో మత్స్యశాఖ అసిస్టెంట్ల సహాయంతో రైతులు ప్రభుత్వ పథకాలను సది్వనియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో హేచరీజోన్గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వడంతో కాలుష్యం అంతా సముద్రంలోకి చేరుతోందన్నారు. ఇదే ప్రాంతం నుంచి తాను పాదయాత్ర చేసినట్టు సీఎం గుర్తు చేశారు. ఒక ప్రాంతాన్ని నిర్దిష్ట జోన్గా ప్రకటించిన తర్వాత అక్కడ ఇతర పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం, పర్యావరణాన్ని కలుíÙతం చేయడం సరికాదన్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా పంట చేతికి వచ్చిన సమయంలో గిట్టుబాటు ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీన్ని సవాల్గా తీసుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారి బ్రాండ్ వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతిభావంతుల సహకారం తీసుకుంటే మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగై రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ప్రతి గ్రామానికి పశు వైద్యశాల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. పశుపోషణ రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉండేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలన్నారు. పశువులకు కూడా హెల్త్కార్డులను జారీ చేసి చెవులకు ట్యాగ్, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర నిధులను ఇందుకు వినియోగించాలని సూచించారు. పశువుల ఔషధాల కొనుగోలులో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలన్నారు. పులివెందులలోని ‘ఏపీకార్ల్’కు నేరుగా నీటిని సరఫరా చేసేలా నీటిపారుదలశాఖతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల పరిశోధనలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. అక్కడ ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరువు బాధిత ప్రాంతాల్లో పశువుల మేతకు కొరత లేకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు రూ.50 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. పశువుల వైద్యం కోసం వచ్చే ఏడాది నుంచి 102 వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పశు సంవర్ధకశాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలన్నారు. సీఎం సమీక్షలో మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ రామ్శంకర్ నాయక్, పశు సంవర్థకశాఖ డైరెక్టర్ సోమశేఖరం తదితరులు పాల్గొన్నారు. ►రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండేళ్లలో పశు వైద్యశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. రెండు వేల పశువులున్న చోట చికిత్స, దాణా నిల్వకు అనువైన ప్రాంతాలను గుర్తించాలి. గిరిజన ప్రాంతాల్లో వెయ్యి పశువులున్న గ్రామాల్లో వైద్యశాల ఏర్పాటు చేయాలి. – అధికారులకు సీఎం ఆదేశం -
పశువులకూ ‘ఆధార్’!
మొయినాబాద్(చేవెళ్ల): ఇకనుంచి పశువుల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని.. ప్రతి పశువుకు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య(ఆధార్ వంటిది), హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ జి.మంజులవాణి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో పశుగణన తీరు, వేసవిలో పశువుల పరిస్థితి , గొర్రెల పంపిణీ పథకం అమలు ఎలా ఉందనే విషయాలను మండల పశువైద్యాధికారి శ్రీలతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న పశువుల సమగ్ర వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని అన్నారు. ప్రతి పశువుకు ఆధార్ నంబర్ మాదిరిగా 12 అంకెల గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నామని.. గుర్తింపు సంఖ్య ఉన్న పోగును పశువుల చెవులకు వేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్యతోపాటు రైతు వివరాలు కూడా ఫీడ్ చేస్తామన్నారు. పశువు వివరాలతోపాటు దాని ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తున్నామని తెలిపారు. వాటికి హెల్త్కార్డులు సైతం ఇవ్వనున్నట్లు చెప్పారు. పశు సంపదను పెంచే చర్యలు ముమ్మరం చేసినట్లు తద్వారా పాలఉత్పత్తి పెంచి రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. గొర్రెల పంపిణీ పథకం కింద అందజేసిన జీవాల ద్వారా రాష్ట్రంలో 50 లక్షల గొర్రెపిల్లలు ఉత్పత్తి అయ్యాయన్నారు. రెండో విడత పంపిణీ త్వరలోనే మొదలవుతుందని చెప్పారు. అనంతరం శ్రీరాంనగర్ గ్రామాన్ని సందర్శించి దూడలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్డీఓ ఈఓ కె.సింహరావు, పశువైద్యులు దేవేందర్రెడ్డి, శ్రీలత, గోపాలమిత్రలు శ్రీనివాస్, బాలకిష్టయ్య తదితరులు ఉన్నారు. -
కార్పొరేట్ వైద్యం కలేనా..?
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఆసుపత్రులకు వెళ్లితే ఉచితంగా నగదు రహిత విధానంలో వైద్యం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014 లో హైదరాబాదు రవీంద్రభారతిలో అట్టహాసంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి హెల్త్ కార్డులను కూడా జారీ చేశారు. అవన్నీ ఇచ్చి ఐదు సంవత్సరాలు కావస్తున్నా నేటికి పూర్తిస్థాయిలో కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్యానికి అమలుకు నోచుకోవడం లేదు. 2014కు ముందు రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు మెడికల్ రియింబర్స్మెంట్ విధానం కొనసాగుతుండేది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండా ముందుగా నగదు చెల్లించి వైద్యం చేయించుకున్న తరువాత ఆయా శాఖలకు బిల్లులు సమర్పించి గ రిష్టంగా రెండు లక్షల వరకూ బిల్లులను పొందేవా రు. అయితే ఈ విధానం కాదని ఆసుపత్రులకు వెళ్లి న వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత చికిత్సా వి«ధానంలో వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హెల్త్కార్డులను జారీ చేశారు. ఉద్యోగులు వేతనాల నుంచి రూ.350 కోట్లు జమ 2014 నవంబర్ నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతనాల నుంచి ప్రతి నెలా నాన్ గజిటెడ్ ఉద్యోగులకు రూ. 90, గజిటెడ్ స్థాయి ఉద్యోగులకు 120 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ రకంగా వసూలు చేసిన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి దాదాపు రూ. 350 కోట్లు ప్రభుత్వానికి జమ అవుతున్నట్లు సమాచారం. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా నేటికి కార్పొరేట్, సూపర్ప్సెషాలిటీ వైద్యశాలల్లో హెల్త్కార్డుల ద్వారా వైద్యం అందించడానికి ఆయా యాజమాన్యాలు నిరాకరిస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. చిన్న చిన్న ఆసుపత్రుల్లో అమలు జిల్లా కేంద్రాల్లోని చిన్న చిన్న ఆసుపత్రుల్లో దంత, కంటి సమస్యలతోపాటు చిన్నచిన్న శస్త్ర చికిత్సిలకు మాత్రమే వైద్యం చేస్తున్నారు తప్ప పెద్దవాటికి చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. క్యానర్స్, గుండె జబ్బు, కిడ్నీ మార్పిడి, కాలేయ సంబంధిత వ్యాధులకు రూ.5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ వ్యాధులకు హైదరాబాదు, చెన్నైలోని కార్పొరేట్, సూపర్స్పెషాలిటీ వైద్యశాలలల్లో హెల్త్కార్డులు చెల్లు బాటు కాకపోవడంతో ఉద్యోగులు ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ విధంగా ఖర్చు చేసుకున్న వారు మెడికల్ రియింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు బిల్లుల మంజూరుకు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఆర్థికంగా చితికిపోయే çపరిస్థితి నెలకుంటోందని వారు వాపోతున్నారు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు జిల్లా వ్యాప్తంగా దాదాపు 35 వేల మంది దాగా ఉన్నారు. వీరందరూ నెలకు ఒకొక్కరు రూ. 90, 120 మేర ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలా ఐదేళ్ల ఏళ్ల నుంచి ప్రభుత్వానికి డబ్బులు చేస్తున్నా సరైన వైద్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల వ్యాధులకు.. అన్ని రకాల వ్యాధులకు నగదు లేకుండా వైద్య అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. క్యానర్స్, కిడ్ని, కాలేయ మార్పిడి వంటి పెద్ద పెద్ద వ్యాధులకు కూడా వైద్యం నిరాకరించకుండా ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా వెంటనే వైద్యం చేసేలా ఆదేశాలు ఇవ్వాలి. – ఎ. శ్యాసుందర్రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
రేషన్ డీలర్లకూ.. కుచ్చుటోపీ
రేషన్ డీలర్లకు ప్రభుత్వం కుచ్చుటోపీ పెట్టింది. నిరంతరం సేవలందిస్తోన్న రేషన్ డీలర్లను ఆదుకుంటామని ఇప్పటి వరకూ 5 జీవోలు జారీ చేసింది. అయితే ఇందులో కేవలం ఒక్క జీఓను మాత్రమే అమలు చేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా డీలర్లు 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు గత ఏడాది డిసెంబరు 16న వాటిలో ఐదు డిమాండ్లను సంబంధిత పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆమోదించి, ఆందోళనలు, నిరసనలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో డీలర్లు ఆందోళనల్ని విరమించారు. అయితే ఆమోదించిన డిమాండ్ల అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని డీలర్లు మండిపడుతున్నారు. డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు డీలర్ల అసోసియేషన్లు ఒకే వేదికపైకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. ఆయా సమస్యల్ని పరిష్కరించేందుకు జీఓను జారీ చేస్తామని మంత్రి ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కేశారని వాపోతున్నారు. ఐదు హామీలకూ ఐదు జీఓలు జారీ చేయాల్సి ఉండగా ఒక్క జీఓను మాత్రమే ప్రభుత్వం జారీ చేసింది. రేషన్ షాపుల ద్వారా విక్రయించే బియ్యానికి క్వింటాలుకు రూ.100 కమీషన్ చెల్లించే విధంగా జారీ చేసిన జీఓ ఎట్టకేలకు అమలు జరిపినప్పటికీ మిగిలిన నాలుగు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. రాష్ట్రంలో 28,935 మంది డీలర్లున్నారు. సుమారు 1.16 లక్షల కుటుంబాల వారు రేషన్ షాపులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. కనీస వేతనాలు కూడా దక్కని విధంగా రేషన్ షాపులలో పనిచేస్తున్న డీలర్లకు వేధింపులు కూడా ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయకీయ రొచ్చులోకి డీలర్లు ప్రజా పంపిణీలో విశిష్ట సేవలందించే డీలర్లను రాజకీయ రొచ్చులోకి ఆపద్ధర్మ టీడీపీ ప్రభుత్వం లాగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు, ఎన్నికల్లో డీలర్లు ప్రత్యక్షంగా పాల్గొనకూడదని చట్టం ఉన్నప్పటికీ డీలర్ల సంఘ రాష్ట్ర నాయకుల్ని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని రాష్ట్ర సంఘ నాయకుడికి ఎర వేయడంతో అతను తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు. రాష్ట్రస్థాయి డీలర్ల సంఘాలు నాలుగు ఉండగా వీటిలో ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ అధ్యక్షుడుగా కొనసాగుతున్న లీలా మాధవరావు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల డీలర్ల అవగాహన సదస్సులు నిర్వహించిన ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలనే సందేశాల్ని ఇవ్వడంపై çపలువురు డీలర్లు తీవ్రంగా మథనపడుతున్నారు. సదస్సుకు ‘పశ్చిమ’ వ్యతిరేకం రాష్ట్రస్థాయిలో డీలర్ల సంఘ అధ్యక్షుడు మాధవరావు నిర్వహిస్తున్న సదస్సులకు జిల్లా డీలర్లు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలిసింది. ఒక పార్టీకి కొమ్ము కాయడం వల్ల వచ్చే ఎన్నికల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, తదనంతరం ఏఏ ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందోనని జిల్లా డీలర్లు ఆందోళన చెందుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం రాష్ట్రవ్యాప్తంగా డీలర్లను ఒక పార్టీకి తాకట్టు పెట్టడం దారుణమని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు డిమాండ్లు ఆమోదించిన ఐదు డిమాండ్లు ఆర్థికంగా ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదని డీలర్లు పేర్కొంటున్నారు. ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించినా వాటిని అమలు చేయడంలేదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా బియ్యానికి కమీషన్ రూ.70 నుంచి 100కు పెంచాలి. సరుకుల దిగుమతి చార్జీలను ప్రభుత్వమే భరించాలి. డీలర్లకు ఆరేళ్లుగా రావలసిన బకాయిలు రూ.100 కోట్లను వెంటనే చెల్లించాలి. డీలర్ చనిపోతే మట్టి ఖర్చులకు గాను రూ.20 వేలు చెల్లించాలి. డీలర్లకు హెల్త్కార్డులు మంజూరు చేయాలి. ఆదేశాలిచ్చాం రేషన్ డీలర్లు రాజకీయ కార్యక్రమాల్లోనూ, ఓటు ప్రభావిత కార్యక్రమాల్లోనూ, పార్టీల ప్రచారంలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేశాం. సభలు, సమావేశాలు డీలర్లు నిర్వహిస్తే కోడ్ ఉల్లంఘన అవుతుంది. కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు. –జి.మోహనబాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏలూరు -
వాళ్లకు వేళకు తిండి, నిద్ర ఉండవు..
సాక్షి, జమ్మికుంట : రాజకీయ నాయకులకు, జర్నలిస్టులకు సమయానికి తిండి, నిద్ర ఉండవని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చామని, జర్నలిస్టులకు కనీస వేతనం ఇచ్చేలా మా తరపున తప్పక కృషి చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆదివారం రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు. మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న నిరుపేద జర్నలిస్టులకు తప్పక ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తాం. హెల్త్ కార్డుల విషయంలో జరిగిన పొరపాట్లను తప్పక సవరిస్తాం. జర్నలిస్టుల కుటుంబాలలో ఎన్ని బాధలు, కష్టాలుంటాయో నాకు తెలుసు. అలాంటి కుటుంబాలకు వాళ్ల ఇంట్లో సభ్యుడిగా ఉండి ఆదుకుంటాం. ఎవ్వరికైనా ఎక్కడైనా ఏం ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి. వాటి పరిష్కారానికి తప్పకుండా కృషిచేస్తా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాలను ఆదుకుంటున్నాం. తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతిబిడ్డకి ఏదో ఓ రూపంలో సమాయం అందుతుంది. రానున్న రోజుల్లో కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయబోతున్నామని’ ఆయన వివరించారు. -
‘ప్రత్యేక రాష్ట్రంలో 17 వేల అక్రిడేషన్లు’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో 12 వేల అక్రిడేషన్లు ఉండేవని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 17 వేల అక్రిడేషన్లు ఇచ్చామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు అంతస్తుల్లో 15 కోట్లతో మీడియా అకాడమీ నిర్మిస్తున్నామన్నారు. పైసా కట్టకుండా జర్నలిస్టులకు హెల్త్కార్డులు ఇచ్చామని.. అక్రిడేషన్ లేని వాళ్లకు కూడా కమిటీ వేసి హెల్త్ కార్డులు అందేలా చేశామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని హర్షం వ్యక్తం చేశారు. అందులో 34 కోట్ల రూపాయలను మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అందజేసినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు మరణించిన 150 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల నిధులను జర్నలిస్టుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్త్ కార్డులు చెల్లడం లేదని చెప్పాడాన్నిఆయన ఖండించారు. హెల్త్ కార్డులు తీసుకోకపోవడం ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఆలోచనలో ఉందని.. ఆటంకాల కారణంగా ఆలస్యం జరుగుతోందని తెలిపారు. సీఎం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారనే నమ్మకం ఉందన్నారు. జర్నలిస్టులకు పెన్షన్పై కూడా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. -
రైల్వే ఉద్యోగులకు హెల్త్ కార్డులు
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రస్తుతం ఇస్తున్న మెడికల్ కార్డులకు బదులుగా హెల్త్కార్డులను జారీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విశిష్ట గుర్తింపు సంఖ్యతో దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా క్రెడిట్ కార్డు తరహాలో అందజేయనుంది. రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం.. యూనిక్ ఐడీ నంబర్ ఉన్న హెల్త్ కార్డులను ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ‘ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులకు హెల్త్ కార్డులను అందజేయాలని నిర్ణయించాం. ఇవి డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో ఉంటాయి. కేటగిరీని బట్టి కలర్ ఉంటుంది. వీటి కాల పరిమితి ఐదేళ్లు’అని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
రైల్వేల్లో క్రెడిట్ కార్డుల తరహాలో మెడికల్ కార్డులు..
సాక్షి, న్యూఢిల్లీ : విశిష్ట గుర్తింపు సంఖ్యతో దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా క్రెడిట్ కార్డు తరహా మెడికల్ కార్డులను ఉద్యోగులు, పెన్షనర్లకు జారీ చేయాలని రైల్వేలు నిర్ణయించాయి. ప్రస్తుతం జోనల్ రైల్వేలు రేషన్ కార్డులను తలపించేలా బుక్లెట్స్ రూపంలో మెడికల్ కార్డులను ఉద్యోగులకు అందచేస్తున్నాయి. వీటి స్ధానంలో ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు విశిష్ట గుర్తింపు సంఖ్యతో వైద్య గుర్తింపు కార్డును జారీ చేయాలని రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే సిబ్బంది, ఉద్యోగులందరికీ వైద్య గుర్తింపు కార్డులను ఒకే గొడుగుకిందకు తీసకువచ్చేలా ఉద్యోగులు, వారిపై ఆధారపడినవారందరికీ మెడికల్ కార్డులు జారీ చేయాలని ఈ ఉత్తర్వుల్లో రైల్వే బోర్డు పేర్కొంది. ప్లాస్టిక్తో రూపొందించే ఈ కార్డులు బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో ఉంటాయని ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రతి కార్డుపైనా కలర్ స్ర్టిప్ ఉంటుంది. దీనిపై కార్డుదారుని ప్రస్తుత స్టేటస్ ప్రస్తావిస్తూ సర్వీస్లో ఉన్నారా, పదవీవిరమణ చేశారా అనే వివరాలు పొందుపరుస్తారు. 15 ఏళ్ల పైబడిన లబ్ధిదారులకు జారీ అయ్యే ఈ కార్డులు ఐదేళ్ల గడువు వరకూ వర్తిస్తాయని ఆ తర్వాత రెన్యూవల్ చేయించుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నాయి.ప్రస్తుతం రైల్వేల్లో 13 లక్షల మంది ఉద్యోగులుండగా, దాదాపు అదే సంఖ్యలో పెన్షనర్లు వారిపై ఆధారపడిన వారు ఈ మెడికల్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. -
పేరుకు బడిపంతులు చేతల్లో బానిస
దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వేల పాఠశాలలు, కళాశాలలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలు. అందులో ఎవరు చదువు చెబుతున్నారు. వారి అర్హతలు ఏమిటి, వారికి ఇస్తున్న వేతనాలు ఏమిటి, వారి జీవన ప్రమాణాలు ఏమిటని ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడం విషాదకరం. ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. విద్యా సంవత్సరం ముగిసిం దంటే చాలు ఉన్న ఉపాధ్యాయులు వచ్చే సంవత్సరం కొనసాగుతారో లేదో తెలియని దుస్థితి. కొత్త విద్యాసంవత్సరం ఉద్యోగంలో కొనసాగాలంటే విధిగా 50 మంది విద్యార్థులను తాను పని చేస్తున్న పాఠశాలల్లో అడ్మిషన్లు చేయించాలి. అలా చేయకపోతే ఉద్యోగం ఊడినట్లే లెక్క. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల కంటే ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల జీవితాలు దుర్భరమైన పరిస్ధితుల్లో ఉన్నాయి. విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి 12 నెలల ఫీజులు యాజమాన్యం వసూలు చేస్తున్నారు. కానీ అక్కడే పని చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం 10 నెలలే వేతనాలు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో వేలాది పాఠశాలలు, వందలాది ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో లక్షలాదిమంది అధ్యాపక, అధ్యాపకేతర పనిలో ఉన్నారు. వీరిని సరుకుగా మార్చి వేల కోట్లు లాభాలు చేకూర్చే వ్యాపారంగా మార్చారు. భావి భవిష్యత్ నిర్మాతలను తయారు చేసే గురువులకు కడుపులు పస్తు పెడితే ఏ అలోచనతో వారు విద్యార్థులకు చదువు చెబుతారో కూడా అర్ధం చేసుకోని స్థాయికి వ్యవస్థ దిగజారింది.ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న లక్షల మంది బోధన, భోధనేతర సిబ్బందిని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వీరిలో 70 శాతానికి పైగా ఈఎస్ఐ, పీఎఫ్ విధానం అమలు కావటం లేదు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు హెల్త్ కార్డులను ఇవ్వాలి. అప్పుడే సమస్యలకు పరిష్కారం ఉంటుంది. – ఎస్. నూర్మహమ్మద్ మొబైల్ : 94900 98057 -
కార్డు పని చేయదు..వైద్యం అందదు
ఉద్యోగులకు నగదురహిత వైద్యంప్రకటనలకే పరిమితమైంది.వారికిచ్చిన హెల్త్కార్డులు నిరుపయోగంగా మారాయి.నెలనెలా ప్రీమియం వసూలుచేస్తున్నా వైద్యం అందించే విషయంలోసర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులు నగదు రహితవైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి.దీంతో తప్పని పరిస్థితిలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ చేతిలో నుంచి డబ్బులు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. కడప ఎడ్యుకేషన్: నగదు రహిత వైద్యం అమలుకు నోచుకోవడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, òపెన్షనర్లకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత వి«ధానంలో వైద్యం అందుతుందని సీఎం చంద్రబాబునాయుడు 2014 నవంబర్లో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో అట్టహాసంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉద్యోగులకు, పెన్షనర్లకు కార్డులను కూడా జారీచేశారు. ఇవన్నీ ఇచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ హెల్త్కార్డుల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. 2014కు ముందు రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల నుంచి ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా ముందుగా నగదు చెల్లించి ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న తర్వాత ఆయా శాఖలకు బిల్లులు సమర్పించి గరిష్టంగా రూ.2లక్షల వరకూ పొందేవారు. అయితే ఈ విధానం కాదని ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత విధానంలో వైద్యం అందించడానికి హెల్త్కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నెలనెలా ప్రీమియం వసూలు 2014 నవంబర్ నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల వేతనాల నుంచి ప్రతి నెల రూ.90 రూ.120లను వారి వేతన శ్రేణిని బట్టి ప్రీమియం రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి వసూలు చేసిన మొత్తం ద్వారా దాదాపు రూ.350 కోట్లు ప్రభుత్వానికి జమవుతున్నట్లు తెలిసింది. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయబట్టి మూడేళ్లైనా కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు హెల్త్కార్డుల ద్వారా వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లోని చిన్న చిన్న ఆసుపత్రుల్లో కొన్ని చిన్న వ్యాధులకు మాత్రమే వైద్యం అందుతుంది. దంత, కంటి సమస్యలతోపాటు చిన్నచిన్న శస్త్రచికిత్సలు చేస్తున్నారు తప్ప పెద్దవ్యాధులకు వైద్యం చేయడం లేదు. క్యాన్సర్, గుండె, కిడ్నీ మార్పిడి, కాలేయ సంబంధిత వ్యాధులకు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకూ ఉద్యోగులకు ఖర్చవుతుంది. హైదరాబాద్లోని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల్లో హెల్త్కార్డులు చెల్లుబాటు కాకపోవడంతో పెన్షనర్లు ఉద్యోగులు ముందుగా డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురై అప్పులపాలవుతున్నారు. జిల్లాలో ఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్లుఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు జిల్లావ్యాప్తంగా 35వేలమంది దాకా ఉన్నారు. వీరందరూ నెలకు ఒకొక్కరు రూ.90, 120 ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలా గత మూడేళ్ల నుంచి తాము ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నామని, అయినా నగదు రహిత వైద్యం అందడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు కట్టి వైద్యం చేయించుకున్నా.. ప్రస్తుతం హెల్త్కార్డులు అమలుకాకపోవడంతో చాలామంది డబ్బులు కట్టి వైద్యం చేయించుకుంటున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత మెడికల్ రీయింబర్స్ విధానం ద్వారా బిల్లులను సమర్పిస్తే ఒక్కో బిల్లుకు గరిష్టంగా రూ.2లక్షలను చెల్లిస్తున్నారు. ఆ మొత్తాలు కూడా ఏ ఆరునెలలకో ఏడాదికో మంజూరవుతున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మెడికల్ రీయింబర్స్మెంట్ గడువును కూడా రాష్ట్రప్రభుత్వం ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తూ ఉంది. ఆ గడువు కూడా మార్చి 31కి ముగియనుంది. -
టీచర్ల భాగస్వామ్యం అవసరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధిలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం అవసరమని నీటి పారుదల మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో (టీయూటీఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు – విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘పాఠశాల విద్య – సంస్కరణ’లు అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగులు వేసింది తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) అని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో టీయూటీఎఫ్ వీరోచితంగా పాల్గొందని అందుకే ఆ సంఘం మీద ప్రభుత్వానికి ఎనలేని గౌరవమన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ హెల్త్కార్డులు అందజేశామన్నారు. ఉపాధ్యాయ నియామకాలు – బదిలీలు జూన్ లోపల పూర్తి చేసేలా విద్యామంత్రి చర్యలు చేపడుతున్నారన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంపై సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అది పార్లమెంట్లో చట్టం కావాల్సి ఉందన్నారు. 60 ఏళ్ల పరిష్కారం కానీ తాగు, సాగునీరు, విద్యుత్ వంటి సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా 18 శాతం వృద్ధి రేటును ఒక తెలంగాణ సాధించిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతాయి: ఈటల రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లు ఎన్ని పెట్టినా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతాయని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినా అవి మూతపడకుండా ఉండేందుకు టీయూటీఎఫ్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ఈ సదస్సు ద్వారా వచ్చిన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వి. శ్రీనివాస్ గౌడ్, ఎ.రవీందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, టీయూటీఎఫ్ అధ్యక్ష – ప్రధాన కార్యదర్శులు సి. స్వామిరెడ్డి, డి. మల్లారెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ కారం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య రక్ష..ఏమిటీ పరీక్ష?
ఆళ్లగడ్డ : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధ కొరవడింది. వారు కనీసం వైద్యపరీక్షలకు నోచుకోవడం లేదు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నా.. సకాలంలో గుర్తించలేని పరిస్థితి. ఒకవేళ తల్లిదండ్రులు గుర్తించి వైద్యం చేయిస్తే సరి. లేదంటే అలాగే తరగతులకు హాజరై.. చదువుపై ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2010 నవంబర్ 14న జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘బాల్యానికి భరోసా..బాల ఆరోగ్య రక్ష’ నినాదంతో అమల్లోకి తెచ్చింది. ఇందులో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), పాఠశాల విద్యాశాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం)లను భాగస్వాములుగా చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల నిర్వహణలోని అన్ని పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలి. జిల్లాలో ఇలాంటి పాఠశాలలు 4,113 ఉన్నాయి. వీటిలో ఒకటి నుంచి పదోతరగతి వరకు 6,41,530 మంది చదువుతున్నారు. వీరికి చెవి, ముక్కు, కన్ను, దంత, గుండె, ఊపిరితిత్తులు, ఉదరం తదితర 30 రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యత సంబంధిత వైద్యాధికారి తీసుకోవాలి. ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లు తేలితే తగిన చికిత్స అందజేయాలి. మెరుగైన వైద్యం అవసరమైతే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఈ పథకంపై మొదట్లో హడావుడి చేసిన అధికారులు తర్వాత చేతులెత్తేశారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడా వైద్య పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. విద్యాసంవత్సరం కూడా పూర్తి కావస్తోంది. అయినా ఎవరూ దృష్టి పెట్టడం లేదు. కొన్ని పాఠశాలలకు ఏఎన్ఎంలు వెళ్లి అరకొర మందులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఆయా పీహెచ్సీల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ప్రతి గురువారం ఆరోగ్య దినోత్సవం నిర్వహించాల్సి ఉండగా..దీన్ని కూడా అటకెక్కించారు. మూడేళ్లుగా కార్డులివ్వలేదు! ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ఆరోగ్య కార్డులు అందజేయాలి. వారికి ఏయే వైద్య పరీక్షలు చేశారు.. ఏ మందులు అందజేశారు.. వ్యాధి ఎన్ని రోజుల నుంచి ఉంది.. పాఠశాలకు ఎన్ని రోజులు రాలేదు.. గతంలో వారి కుటుంబ సభ్యులకు ఇలాంటి వ్యాధులు ఉన్నాయా...తదితర వివరాలను ఆ కార్డుల్లో నమోదు చేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత, క్రమం తప్పకుండా ఇచ్చే మందులు, ట్రీట్మెంట్, టీకాల వివరాలనూ పొందుపర్చాలి. దీర్ఘకాలిక/తీవ్ర అనారోగ్య సమస్య ఉన్న వారు ఈ కార్డు తీసుకుని కర్నూలు సర్వజన వైద్యశాలకు వెళితే అక్కడ ప్రత్యేకంగా నియమించిన అధికారి.. సంబంధిత వైద్యుల వద్దకు తీసుకెళ్లి చికిత్స ఇప్పిస్తారు. అయితే.. మూడేళ్ల నుంచి విద్యార్థులకు ఈ కార్డులు ఇవ్వడం లేదు. దీంతో పాటే వైద్యపరీక్షలూ ఆగిపోయాయి. విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. గడిచిన వర్షాకాలం, చలికాలాల్లో సీజనల్ వ్యాధులకు గురై చాలా ఇబ్బంది పడ్డారు. వారివైపు కన్నెత్తి చూసిన వైద్యులు గానీ, అధికారులు గానీ లేరు. ప్రస్తుతం ఎండలు ముదురుతున్నాయి. వార్షిక పరీక్షలు కూడా దగ్గర పడ్డాయి. ఈ తరుణంలో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో వ్యవహరించి.. వైద్య సేవలను పునరుద్ధరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఏఎన్ఎంలు వచ్చి వెళ్తుంటారు స్థానికంగా ఉండే ఏఎన్ఎంలు మాత్రమే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. వైద్యాధికారులు వచ్చి వైద్యపరీక్షలు గాని, చికిత్స గాని చేయడం లేదు. కనీసం మూడేళ్లుగా ఆరోగ్య కార్డులు కూడా పంపిణీ చేయలేదు. దీంతో ఆరునెలలకోసారి నిర్వహించాల్సిన ప్రత్యేక వైద్య పరీక్షలు, చికిత్సలు ఆగిపోయాయి. – వెంకటేశ్వర్లు, హెచ్ఎం, అహోబిలం కార్డులు ప్రింటవుతున్నాయి కార్డుల పంపిణీ ఆగిన మాట వాస్తవమే. కార్డులు లేవని వైద్యం ఆపవద్దని సూచించాం. అవసరమైతే జిరాక్స్ తీసి నమోదు చేయాలని ఆదేశాలిచ్చాం. పాత కార్డులు ఎక్కువ పేజీలు ఉన్నాయి. దీంతో కొత్తగా తక్కువ పేజీలతో కార్డులు ప్రింట్ చేయిస్తున్నాం. త్వరలోనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – హేమలత, జవహర్ బాల ఆరోగ్య రక్ష జిల్లా కో–ఆర్డినేటర్ మాకు సంబంధం లేదు బాల ఆరోగ్య రక్ష పథకం అమలుతో మాకు ఎలాంటి సంబంధమూ లేదు. అంతా వైద్య,ఆరోగ్య శాఖ వారే చూసుకోవాలి. – తిలక్ విద్యాసాగర్ , సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ -
‘పుర’ కార్మికులకు హెల్త్ కార్డులు
► ఇళ్లు లేనివారికి డబుల్బెడ్రూం ఇళ్లు ► పారిశుధ్య కార్మికులకు మంత్రి కేటీఆర్ హామీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు హెల్త్ కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇళ్లు లేని అర్హులైన పారిశుధ్య కార్మికులకు డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్లు ఇస్తామని, అవసరమైతే ప్రత్యేక కోటాను సృష్టించే అంశాన్ని పరిశీలి స్తామని చెప్పారు. రాష్ట్రంలోని పురపాలికల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ మంగళవారం ఇక్కడ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ వేతనాలు పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని, డబుల్ బెడ్ రూంఇళ్లు మంజూరు చేయాలని, సమాన పనికి సమాన వేతనమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, రక్షణ పరికరాలు అందించాలని కార్మికులు తమ డిమాండ్లను మంత్రి ముందుంచారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ఆర్థిక పరిపుష్టి గల పురపాలికల్లో పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచితే ఎలాంటి ఇబ్బందీ లేదని, అయితే సరిపడా ఆదాయం లేని చిన్న మున్సిపాలిటీలు, నగర పంచాయ తీల్లో తీసుకోవాల్సిన శాఖాపరమైన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈఎస్ఐ, పీఎఫ్ను కార్మికులకు అందజేస్తామ ని హామీ ఇచ్చారు. సమాన పనికి సమాన వేతనం అమలుకు కొంత సమయం కావాలని కోరారు. కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలి వ్వని మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమా వేశం నిర్వహిస్తామని, వేతన బకాయిలు చెల్లిం చేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని శ్రామిక వర్గాలు, ఉద్యోగులందరీ జీతాలు ప్రభుత్వం పెంచిందని, పురపాలికల్లో పారిశుధ్యాన్ని పరిరక్షిస్తున్న కార్మికులను సీఎం కేసీఆర్ దేవుళ్లతో సమానమని పోల్చారని గుర్తుచేశారు. సీఎంకు కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన, సానుభూతి ఉందని, కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇళ్లలో పని చేయించుకుంటే సస్పెన్షన్ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అధికారులు, ప్రజాప్రతినిధులు కార్మికులతో తమ ఇళ్లల్లో పనిచేయించుకుంటే సంబంధిత మున్సిపల్ కమిషనర్పై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనల గురించి నేరుగా తనకు, తన కార్యాలయానికి సమాచారమిస్తే తక్షణమే సంబంధిత మున్సిపల్ కమిషనర్లను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికుల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని, వారు నగరాలు, పట్టణాల కోసమే పని చేయాలని, ప్రజాప్రతినిధుల కోసం కాదన్నారు. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు ఇచ్చామని, ఇంకా అవసరమైతే సరఫరా చేస్తామని, వీటిని వినియోగించేలా కార్మికుల ను చైతన్యపరచాలని చెప్పారు. సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకులు, పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు. -
హెల్త్కార్డు..ఎప్పుడొస్తదో!
♦ ఎదురుచూస్తున్న ‘సెర్ప్’ ఉద్యోగులు ♦ రాష్ట్రంలో సెర్ప్ ఉద్యోగులు4,200 ♦ హెల్త్ కార్డులు లేకున్నా వైద్యం చేయించుకున్న వారు 209 ♦ వైద్యానికి అయిన ఖర్చు రూ.89.82.లక్షలు సెర్ప్లో 4,200 మంది పని చేస్తు న్నారు. వీరు ఒక్కొ క్కరు తమ వాటా ధనంగా రూ.4,000 చెల్లిస్తే ప్రభుత్వం రూ.4,000 చెల్లి స్తుంది. దీంతో ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు, తల్లిదం డ్రులకు రూ.2 లక్షల వరకు వైద్యం అందుతుంది. యాదాద్రి భువనగిరి నుంచి యంబ నర్సింహులు: రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ)లో పని చేస్తున్న ఉద్యోగులకు హెల్త్కార్డులను ప్రభుత్వం రెన్యువల్ చేయ కపోవడంతో వారంతా ఇబ్బందుల్లో పడ్డారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో సరైన వైద్యం చేయించుకోలేక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ఉద్యోగులు చనిపోయారు. ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించాల్సిన వాటాధనం చెల్లించకపోవడంతో హెల్త్ ఇన్సూ రెన్స్ పథకం నిలిచిపోయింది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 209 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సలు పొంది రూ.89,82,839 లక్షలు సొం తంగా చెల్లించారు. గత ఏడాది కాలంగా సెర్ప్లో పనిచేస్తున్న హెచ్ఆర్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించాల్సి ఉంది. అప్పుల పాలవుతున్న ఉద్యోగులు.. ఫిబ్రవరి 8 నుంచి ప్రభుత్వం చెల్లింపులు ఆపేయడంతో ఎక్కడికక్కడ వైద్యసేవలు నిలిచిపోయా యి. అయితే తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు ఉద్యోగులు సొంత డబ్బులతో వైద్యం చేయిం చుకుంటున్నారు. ఆర్థిక స్థోమతలేని మరికొందరు తాత్కాలిక వైద్య సేవలు పొందుతూ హెల్త్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వనపర్తి జిల్లాలో ఒక ఉద్యోగి రూ.1,19,933 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకుని అప్పుల పాలయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 19 మంది, సంగారెడ్డిలో 19, రంగారెడ్డిలో 18, సిద్దిపేటలో 18, నిజామాబాద్లో 18, కరీంనగర్లో 10, ఎస్పీఎంయూ (హైదరాబాద్ కేంద్ర కార్యాలయం) 11మంది హెల్త్కార్డులు లేకుండానే సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్నారు. -
అక్రిడిటేషన్ లేకుండానే హెల్త్ కార్డులు
► విద్యార్హతలు లేకుండా అక్రిడిటేషన్ ► రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ► జోగిపేటలో జిల్లా జర్నలిస్టుల సమావేశం జోగిపేట(అందోలు): త్వరలో రాష్ట్రంలో అక్రిడిటేషన్ కార్డులు లేని జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ అన్నారు. గురువారం జోగిపేటలోని శ్రీరామా ఫంక్షన్ హాలులో జరిగిన జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రంగాచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ గత నెల 22న జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన సీఎం మూడు రోజుల్లో జర్నలిస్టు సంఘాల నాయకులు, ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారన్నారు. అక్రిడిటేషన్ కార్డులు లేకున్నా హెల్త్ కార్డులు, విద్యార్హతతో సంబంధం లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేసి కమిటీని కూడా వేశారన్నారు. రాష్ట్రంలో 430 మంది వరకు జర్నలిస్టులు చనిపోతే ఇప్పటి వరకు కేవలం 130 మందికి మాత్రమే ఆర్థికంగా సహకారం అందిందన్నారు. జిల్లా అధ్యక్షుడు రంగాచారి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర నాయకుడు కాల్వ మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. జర్నలిస్టుల ర్యాలీ: జోగిపేటలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా మీదుగా శ్రీ రామ ఫంక్షన్ హాలు వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఫైజల్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, జిల్లా నాయకులు దుర్గారెడ్డి , రవిచంద్ర, మన్మథరావు, పానుగంటి కృష్ణ, జగన్మోహన్రెడ్డి, సిద్దన్నపాటిల్, హైమద్, శివగౌడ్, మురళి, ఖయ్యూం, ఆరీఫ్, అందోలు తాలుకా ప్రెస్క్లబ్ అధ్యక్షుడు భూమయ్య, నాయకులు పాల్గొన్నారు. -
ఉచితంగా హెల్త్ కార్డులు
– టీఎఫ్సీసీ అధ్యక్షుడు ప్రతాని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ) తృతీయ వార్షికోత్సవాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రతాని రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షుడిగా జేవీఆర్, సెక్రటరీగా సాయి వెంకట్తో పాటు 23 మంది జనరల్ బాడీ మెంబర్స్ను ఎన్నుకుని, ప్రమాణస్వీకారం చేయించారు. అదే విధంగా తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సీనియర్ నటి కవితను, సెక్రటరీగా జెవీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా 100 మంది సినీ, టీవీ నటీనటులు, కార్మికులకు ఐదు లక్షల బీమాతో కూడిన కేంద్ర ప్రభుత్వ హెల్త్ కార్డులు అందించారు. అనంతరం ప్రతాని మాట్లాడుతూ– ‘‘సినీ, టీవీ నటీనటులు, టెక్నీషియన్స్లో హెల్త్ కార్డుల కోసం తెలంగాణ ఫిల్మ్ చాంబర్లో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా హెల్త్ కార్డులు, చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్స్ ఇప్పిస్తాం. సభ్యులందరికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి రెండు పడక గదుల ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తాం’’ అన్నారు. -
హెల్త్ కార్డులతో ‘కార్పొరేట్’ చికిత్స
అందించాలని వైద్యారోగ్య మంత్రిని కోరిన పీఆర్టీయూ, ఎమ్మెల్సీలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, రవీందర్ కోరారు. ఔట్ పేషెంట్ సదుపాయం కూడా కల్పించేలా చర్యలు చేపట్టాలని, ఉపాధ్యాయులంతా నెలవారీ ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మూడుసార్లు మాట్లాడామని, చికిత్సలకు ఇచ్చే ప్యాకేజీల రేట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారని వారు పేర్కొన్నారు. -
సగం ధరకే కార్పొరేట్ వైద్యం
► ఉద్యోగులు, జర్నలిస్టుల వైద్యసేవలపై ప్రభుత్వం కొత్త ప్రతిపాదన ► అంగీకరించిన కార్పొరేట్ ఆసుపత్రులు! ► వచ్చే నెలలో జర్నలిస్టులందరికీ ఆరోగ్య కార్డులు: మంత్రి లక్ష్మారెడ్డి ► హైదరాబాద్లో 6 చోట్ల, పాత జిల్లా కేంద్రాల్లో రిఫరల్ ఆసుపత్రులు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడనుంది. రాష్ట్రంలోని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన్నింట్లోనూ ఉద్యోగులు, జర్నలిస్టులకు సగం ధరకే వైద్య చికిత్సలు అందుబాటులోకి తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సాధారణంగా వివిధ వైద్య చికిత్సలకు ఆయా ఆసుపత్రులు వసూలు చేసే సొమ్ములో సగం చెల్లించేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రస్తుత ప్యాకేజీ సరిపోవడం లేదని, దాన్ని 60 శాతం వరకు పెంచాలని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరాయి. ప్యాకేజీ పెంపు, ఉచిత ఓపీ సేవల విషయంలోనే ఏడాదిన్నరగా సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రులు వివిధ వైద్య సేవలకు వసూలు చేసే సొమ్ములో సగమే చెల్లిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇలా చేసినా ప్రస్తుత ప్యాకేజీని 30 నుంచి 40 శాతం వరకు పెంచినట్లే అవుతుందని అంచనా. సరికొత్త ప్రతిపాదనను కార్పొరేట్ యాజమాన్యాలు కూడా అంగీకరించాయని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి శనివారం సాయంత్రం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం(ఈజేహెచ్ఎస్) సీఈవో డాక్టర్ పద్మ తదితర ఉన్నతాధికారులతో సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల రెండో తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మతో ప్రత్యేకంగా సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఐదారు తేదీల నుంచి ఈ పథకాన్ని సమగ్రంగా అమలు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు కూడా అన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే నెలాఖరులోగా అందరికీ నగదు రహిత ఆరోగ్య కార్డులు అందజేస్తామన్నారు. హైదరాబాద్లో ఆరు చోట్ల, పాత జిల్లా కేంద్రాలన్నింటా రిఫరల్ ఆసుపత్రులు ఇక నుంచి ఉద్యోగులు, జర్నలిస్టులు నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లే అవకాశం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే రిఫరల్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకున్నాక అవసరమని డాక్టర్లు రిఫర్ చేస్తేనే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతాయి. హైదరాబాద్లో ఖైరతాబాద్, కూకట్పల్లి, వనస్థలిపురం ప్రాంతాల్లో... గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల్లో ఉద్యోగుల రిఫరల్ కేంద్రాలు నెలకొల్పుతారు. పాత జిల్లా కేంద్రాలన్నింటిలోనూ ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తారు. వీటిలో అత్యాధునిక డయాగ్నస్టిక్ పరికరాలను అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అత్యవసర వైద్యం చేయించుకోవాల్సి వస్తే నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి అవకాశమిస్తారు. ఏ సమయంలోనైనా గుండెపోటు వంటివి వస్తే కూడా కార్పొరేట్ లేదా ఇతర నెట్వర్క్ ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా వెళ్లవచ్చు. రిఫరల్ ఆసుపత్రుల్లో బ్రాండెడ్ మందులనే సరఫరా చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబీకులకు ఏడాదికోసారి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎగ్జిక్యూటివ్ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని విడతల వారీగా అమలు చేస్తామని ైవె ద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
పారిశుద్ధ్య నిధులు సక్రమంగా వినియోగించాలి
ఒంగోలు: గ్రామ పంచాయతీలకు కేటాయించిన పారిశుద్ధ్య నిధులు సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అ«ధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 9వ తేదీ సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. పారిశుధ్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని దండోరా వేయించి ప్రజలకు తెలిసే విధంగా చూడాలన్నారు. రక్షిత మంచినీటి పథకాలు, ఇతర మంచినీటి పథకాలను పరిశుభ్రపరచి క్లోరినేషన్ చేసి ఆ వివరాలను బోర్డులో నమోదు చేయాలన్నారు. ప్రతినెలా మొదటి, మూడో శనివారాలు తప్పనిసరిగా ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రపరచి క్లోరినేషన్ చేపట్టాలన్నారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న అసెంబ్లీ కార్యక్రమాల్లో స్వచ్ఛభారత్, పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి అక్కడ మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల హెల్త్ కార్డులు చెక్ చేయాలి పాఠశాలలను అధికారులు తనిఖీ చేసే సమయంలో విద్యార్థులకు సంబంధించిన హెల్త్ కార్డులను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యాధికారులు మూడు నెలలకు ఒకసారి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన వివరాలను హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలన్నారు. మేజర్ పంచాయతీల్లో ప్రతి షాపు ముందు తప్పనిసరిగా డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకోవాలని, డస్ట్ బిన్లు లేకుంటే పెనాల్టీ విధించాలని ఆదేశించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకునేలా వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్–2 ఐ.ప్రకాష్కుమార్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ సుదర్శనం, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, డీపీఓ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, డ్వామా పీడీ పోలప్ప, మెప్మా పీడీ అన్నపూర్ణ, డీఈఓ సుప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కాంతనాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ బి.రవి, డీఎంహెచ్ఓ యాస్మిన్, ఒంగోలు ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ప్రమీల పాల్గొన్నారు. -
హెల్త్ కార్డుల అమలులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
10 నుంచి ప్యాకేజి రేట్ల నిర్ణయంపై సమావేశాలు మేనేజింగ్ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు వెల్లడి హైదరాబాద్: హెల్త్కార్డుల అమలుకు సంబంధి పలు విషయాలను చర్చించిన అంశాలను ప్రభుత్వానికి ప్రతిపాదనల రూపంలో అందించనున్నామని మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు ఐ.వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవో డా. ఎ. రవిశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలను ప్రతిపాదించామన్నారు. ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్లకు, గురుకులాలు, ప్రభుత్వరంగ, గ్రంధాలయ ఉద్యోగులకు హెల్త్కార్డులు ఇవ్వాలి. హెల్త్కార్డులున్న అందరికీ మాస్టర్ హెల్త్చెకప్ అన్ని ప్రైవేట్ నెట్వర్కు ఆసుపత్రులలో అనుమతించడంతో పాటు భార్య,భర్త, పెన్షనర్లకు వర్తింపచేయాలి. 40 సంవత్సరాలు దాటిన వారికి సంవత్సరానికి ఒక సారి మాస్టర్ హెల్త్చెకప్,క్రానిక్ వ్యాధులకు ప్రైవేట్ నెట్వర్కు 382 ఆసుపత్రులన్నింటిలో వైద్యం అందించాలి. 1885 ప్రోసీజర్స్ కాకుండా అన్ని వ్యాధులకు హెల్త్కార్డులపై వైద్యం చేయాలి. హెల్త్ కార్డులు అమలుచేయని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంతాన సాఫల్యానికి హెల్త్కార్డు ద్వారా అందించాలని, ఇక మీదట మెడికల్ బిల్లులు డీడీఓల ద్వారా రప్పించుకొని ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ప్యాకేజి రేట్లు నిర్ణయించేందుకు ఈ నెల 10,11,12 తేదీలలో నెట్వర్కు ఆసుపత్రుల యాజమాన్యం, ఎన్టీఆర్ వైద్యసేవ డాక్టర్లు సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మేనేజింగ్ కమిటీ సభ్యులను కూడా ఆహ్వానించిన్నట్లు చెప్పారు. -
వైద్య సిబ్బందికే ఆరోగ్య కార్డుల్లేవ్...
- వైద్య విధాన పరిషత్లో డాక్టర్లు, నర్సులు, ఇతర ఉద్యోగుల గగ్గోలు - జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో పనిచేసే 6,500 మంది అవస్థ - ట్రెజరీ ద్వారా వేతనాలు పొందకపోవడమే వారికి శాపం - ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదంటోన్న ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్ వారంతా జిల్లా, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే వైద్య సిబ్బంది. వేలాది మంది రోగులకు నిత్యం సేవలు అందిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఆరోగ్యకార్డులు ఇచ్చినా... వైద్య ఆరోగ్యశాఖలో పరిధిలో పనిచేసే ఈ వైద్య సిబ్బందికి మాత్రం ఆరోగ్యకార్డులు ఇప్పటికీ ఇవ్వలేదు. వారు వైద్య సేవలు చేసే చోటే... తమకు జబ్బు చేస్తే మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇదీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల దుస్థితి. వీరంతా ప్రభుత్వ ఉద్యోగులే అయినా వారికి ఆరోగ్యకార్డులు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒకటో తేదీన వేతనాలు అందుకుంటే... వీరు మాత్రం నెలాఖరు వరకు ఆగాల్సిన పరిస్థితి దాపురించింది. గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకోలేని దుస్థితి కూడా నెలకొంది. అంతేగాక మూడేళ్లుగా పదోన్నతులు లేవు. శాశ్వత ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే... అందులో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ ఘోరం. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపించడంలేదన్న ఆరోపణలున్నాయి. 105 వైద్య విధాన ఆసుపత్రులు... రాష్ట్రంలో 105 వైద్య విధాన పరిషత్ పరిధిలో ఆసుపత్రులున్నాయి. జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లన్నీ వైద్య విధాన పరిషత్ పరిధిలోనే పనిచేస్తున్నాయి. జిల్లాల్లో కీలకమైన వైద్య సేవలు అందించేది ఈ ఆసుపత్రులేననేది తెలిసిందే. ఆయా ఆసుపత్రుల్లో 6,500 మంది శాశ్వత ఉద్యోగులు, 1,500 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో దాదాపు 4 వేల మంది వరకు డాక్టర్లు ఉన్నారు. ఆ ఆసుపత్రుల్లో ప్రసూతి నుంచి మొదలు పెద్దస్థాయి శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాద కేసులు, సిటీ స్కానింగ్, ఎక్స్రే, ఆల్ట్రాసౌండ్, ల్యాబ్ టెస్టింగ్ జరుగుతుంటాయి. ఎయిడ్స్, టీబీ, స్వైన్ఫ్లూ వంటి రోగులకూ వీరు సేవలందిస్తున్నారు. జిల్లాల్లో ఇంతటి కీలకమైన ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బందిపై సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. 1996లో వైద్య విధాన పరిషత్ను అటానమస్ సంస్థగా దీన్ని నెలకొల్పారు. అయితే అది తన కాళ్ల మీద నిలబడే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వమే వైద్య విధాన పరిషత్ను తన స్వాధీనంలోకి తీసుకుంది. అయితే ఇందులో పనిచేసే ఉద్యోగులను 010 పద్దు కింద ట్రెజరీ పరిధిలోకి తీసుకురాకపోవడంతో వీరి వేతనాల కోసం ప్రభుత్వం రెండు మూడు నెలలకోసారి విడుదల చేస్తుంది. దీంతో వారికి సకాలంలో వేతనాలు రావడంలేదు. ట్రెజరీ పరిధిలో లేరన్న కారణం... ఇతరత్రా సాంకేతిక కారణాలు చూపించి ప్రభుత్వ ఉద్యోగులైనా వీరికి ఆరోగ్యకార్డులు ఇవ్వలేదు. ఆందోళనలో కాంట్రాక్టు ఉద్యోగులు... మరోవైపు వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న 158 మంది కాంట్రాక్టు ఉద్యోగులు కలెక్టర్ల అధ్యక్షతన డీఎస్సీ, రోస్టర్ విధానం అనుసరించి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే నియమితులయ్యారు. డీఏ, హెచ్ఆర్ఏ పొందుతున్నారు. కానీ వీరు క్రమబద్దీకరణకు నోచుకోవడంలేదు. దీంతో ఏడేళ్లుగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులు నిరాశలో ఉన్నారు. ఇక ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐలను ఏజెన్సీలు వారి ఖాతాల్లో వేయడంలేదని ఉద్యోగులు చెబుతున్నారు. సర్కారుకు ఎన్నిసార్లు చెప్పినా: జూపల్లి రాజేందర్, వైద్య ఉద్యోగుల నేత వైద్య విధాన పరిషత్లో పనిచేసే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఆరోగ్య కార్డులు ఇవ్వాలని... వీరిని ట్రెజరీ పరిధిలోకి తీసుకురావాలని ఎన్నిసార్లు కోరినా సర్కారు పట్టించుకోవడంలేదు. -
దేవస్థాన రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి
యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉద్యోగాలు నిర్వర్తించి విరమణ పొందిన వారందరికీ ప్రభుత్వం హెల్త్కార్డులు ఇవ్వాలని ఆ సంఘం అధ్యక్షుడు కె.శేషాచార్యులు కోరారు. పట్టణంలో గురువారం రిటైర్డ్ ఉద్యోగ సంఘం 18వ పెన్షనర్స్డే సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేవస్థాన ఫించన్దారులకు ఇంక్రుమెంట్లు కల్పించాలన్నారు. అంతే కాకుండా స్థానికంగా ఉన్న దేవస్థానం రిటైర్డ్ ఉద్యోగులకు వైటీడీఏ ద్వారా ని«ధులు కేటాయించి భవనం ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం 75 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న విశ్రాంత ఉద్యోగులకు అమృతోత్సవ సన్మానం చేశారు. అలాగే సమావేశానికి వచ్చిన పెన్షనర్లకు భోజన ఏర్పాటు చేసిన రాములు, జయమ్మకు సన్మానం చేశారు. సమావేశంలో కలకుంట్ల బాలనర్సయ్యగౌడ్, కోల ఆంజనేయులుగౌడ్, శ్రీనివాసరావు, యాదగిరిచారి, నాగభూషణం, నర్సింహ, డి.యాదగిరిరెడ్డి, నరేశ్, స్వామి పాల్గొన్నారు. -
పెన్షనర్లంటే ప్రభుత్వాలకు చిన్నచూపేల?
- ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్పీఎఫ్) డిమాండ్ - ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ఘనంగా ఆవిర్భావ సమావేశం - రిటైర్డ్ ఉద్యోగులు సమాజ సేవకు ఉపక్రమించాలి: జస్టిస్ నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల పాటు ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా వ్యవహరించి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల (పెన్షనర్ల) పట్ల చిన్నచూపు చూడటం తగదని ఆలిం డియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్పీఎఫ్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఆదివారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో జరిగిన ఏఐఎస్పీఎఫ్ ఆవిర్భావ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఆయా ప్రభుత్వాలు పెన్షనర్లను క్రమేపీ వది లించుకోవాలని చూస్తున్నాయని, 2004 తర్వా త ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్(సీపీఎస్) విధానాన్ని అమలు చేయడం ఇందులో భాగమేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఆరు లక్షల మంది, దేశవ్యాప్తంగా 1.58 కోట్లమంది పెన్షనర్లు ఉన్నారని.. వారు తలచుకుంటే తమ ఓటు ద్వారా ఆయా ప్రభుత్వాలను ప్రభావితం చేయగలరన్న విషయాన్ని పాలకులు గుర్తెరగాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల పెన్షనర్స్ అసోసియేషన్ల కార్యవర్గ సభ్యులు, తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి పెద్దసంఖ్యలో పెన్షనర్లు ఆవిర్భావ సమావేశంలో పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వంలో ఒకరిగా సేవలందించిన రిటైర్డు ఉద్యోగులు తమ పెన్షన్ సమస్యలతో పాటు సమాజం ముందున్న సవాళ్లను పరిష్కరించే బాధ్యతను తీసుకోవాలని పట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి పెన్షనర్లకు విజ్ఞప్తి చేశారు. ఎవరికి అవకాశం ఉన్న రీతిలో వారు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. పెన్షనర్లను గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. తెలంగాణలో పెన్షనర్ల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసికెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హెల్త్కార్డులను అమలు చేయని ఆసుపత్రులపై కఠిన వైఖరి అవలం భించాలని ప్రభుత్వం భావిస్తోందని, నెలరోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సమావేశంలో ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ నేతలు స్వామినాథన్, పూర్ణచంద్రరావు, లక్ష్మయ్య, దూబే, రామ్మూర్తి, సుధాకర్ పాల్గొన్నారు. హెల్త్కార్డులు అమలు కాకపోవడం సిగ్గుచేటు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటై రెండేళ్లు దాటినా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హెల్త్కార్డులు అమలుకు నోచుకోకపోవడం సిగ్గుచేటని ఏపీఎన్జీవో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి అన్నారు. ఏఐఆర్ఎఫ్ సెక్రటరీ జనరల్ శివగోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కుగా ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఏపీఎన్జీవో ప్రస్తుత అధ్యక్షుడు అశోక్బాబు మాట్లాడుతూ.. ఏపీలో ఉద్యోగులకు లభిస్తున్న ప్రయోజనాలన్నీ, పెన్షనర్లకూ వర్తించేలా చేసేందుకు ఏపీ సీఎంను ఒప్పించామన్నారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాదరావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లను ఐక్యం చేసేందుకు ఏఐఎస్పీఎఫ్ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. -
అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం
ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్రెడ్డి కడప రూరల్: రాష్ర్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని పశ్చిమ రాయలసీమ 2017 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి, ఎన్జీఓ అసోసియేషన్ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్రెడ్డి ఆరోపించారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. పది నెలల పీఆర్సీ అరియర్స్ ఇంతవరకు మంజూరు కాలేదన్నారు. రెండు డీఏల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. హెల్త్కార్డుల అమలు జరగలేదన్నారు. సీబీఎస్ విధానం రద్దు పరచడంతోపాటు నిరుద్యోగులకు రూ. 2 వేల భృతిని ప్రతినెల చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం తాను వైఎస్సార్ సీపీ తరపున పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ పి.అశోక్కుమార్రెడ్డి, రాష్ర్ట నాయకుడు యల్లారెడ్డి, అనంతపురం జిల్లా కన్వీనర్ ఓబుల్రావులు మాట్లాడుతూ రాజగోపాల్రెడ్డికి తమ ఐక్యవేదిక సంపూర్ణ మద్దతును తెలుపుతున్నమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీఎఫ్ జిల్లా కన్వీనర్ పి.రెడ్డెప్పరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణారెడ్డి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నాయకుడు ప్రభాకర్, ఏపీపీ టీఏ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ కార్డులపై ఉద్యోగులకు అరకొర వైద్యం
♦ పూర్తిస్థాయి వైద్యం అందించడానికి చర్యలు తీసుకోండి ♦ ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓకు ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్కార్డులపై వైద్యం అంతంతమాత్రంగానే అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అరకొర సేవలు మాత్రమే అందుతుంటే.. హైదరాబాద్లోని పలు ప్రముఖ ఆస్పత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు. హెల్త్కార్డుల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉద్యోగ సంఘాల జేఏసీ శుక్రవారం ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లింది. సీఈవో అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్న సంజీవని, తపాలా అధికారులతో పాటు జేఏసీ నేతలు అశోక్బాబు, ఐ.వెంకటేశ్వరరావు, చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, రఘురామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వీరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. హెల్త్కార్డుల పథకం అమలవుతున్న తీరును సమీక్షించారు. వర్క్చార్జ్డ్ ఉద్యోగులు, పలు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సిబ్బంది, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు.. దాదాపు 40 వేల మందికి వివిధ సాంకేతిక కారణాల వల్ల హెల్త్కార్డులు మంజూరు కాలేదని జేఏసీ నేతలు చెప్పారు. వారందరికీ కార్డులు మంజూరు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలను సరిచేయాలని కోరారు. కార్పొరేట్ ఆసుపత్రులు ఈనెల 10న ప్యాకేజీ ధరల జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నాయని, ధరలు ఖరారైన తర్వాత హైదరాబాద్లోని అన్ని ఆసుపత్రుల్లో నగదు ప్రమేయం లేని వైద్యం అందుబాటులోకి వస్తుందని సీఈవో చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా దీర్ఘకాలిక రోగాలకు ఓపీ సేవలు పొందే అవకాశాన్ని పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. హైల్త్కార్డుల మీద వైద్యం అందించడానికి నిరాకరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు మరోసారి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులను ఎన్టీఆర్ వైద్యసేవకు ఫోన్ ద్వారా లేదా ఆన్లైన్లో చేసేందుకు అవకాశం ఉందన్నారు. -
జర్నలిస్టులందరికీ హెల్త్కార్డులు
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నిజామాబాద్ సిటీ: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్వాగార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ (టీఈఎంజేయూ) జిల్లా మహాసభలో ఆయన ప్రసంగించారు. జర్నలిస్టులందరికీ హెల్త్కార్డులు వస్తాయన్నారు. రాను న్న రోజుల్లో యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి తాను తప్పుకుంటానని, అప్పటివరకు మీ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. ఎమ్మెల్సీలు వి.గంగాధర్గౌడ్, డాక్టర్ భూపతిరెడ్డి, టీఈఎం జేయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి, ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్, జమల్పూర్ గణేశ్, మధుసూదన్రావు, కోశాధికారి సాగర్, రాష్ట్ర నాయకులు శివాజీ, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బాలార్జున్గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. టీఈఎంజేయూ జిల్లా నూతన కమిటీ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియ న్ జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధా న కార్యదర్శిగా రవీందర్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా భాస్కర్, కోశాధికారిగా కిషోర్, ఉపాధ్యక్షులుగా ఆంజనేయులు, రాము, హరీశ్, రామకృష్ణ, ఆనంద్పాల్, నవీన్, యూనస్, సతీశ్, అనిల్, వజి య్, తారాచంద్, సహాయ కార్యదర్శులుగా నాందేవ్, మురళి, కృష్ణాచారి, సతీష్గౌడ్, తారాచాంద్, బస్వారాజు, సదానంద్, శ్రీనివాస్, సయ్యద్ జకీర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మధుసూదన్రెడ్డి, గోపాల్, సాయి, రమేశ్, నవీన్, అర్షద్, రాము, శ్రీనివాస్రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా వేణు, ప్రమోద్, నవీన్, విజయ్, అఫ్సర్, శ్రీనివాస్, నవీన్, కిషోర్ నియమితులయ్యారు. -
మీ యూనియన్ సంగతి తేలుస్తా
పాత్రికేయులపై విరుచుకుపడ్డ సీఎం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘మీకు ఎంతధైర్యం. ప్లకార్డుల పట్టుకుంటే భయపడిపోతానా? వర్కింగ్ జర్నలిస్టులైతే మీకు బాధ్యత లేదా? మీరు చేసిన తప్పులను గుర్తుంచుకోవాలి. మీకు ఎక్కువ గౌరవమే ఇచ్చాం. మీ యూనియన్ సంగతి తేలుస్తా. ఆ యూనియన్ మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల చేతుల్లో నడుస్తోంది. ఇకపై మీకు సంబంధించిన ఏ కార్యక్రమానికీ నేను రాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రికేయులను తీవ్రంగా హెచ్చరించారు. డెస్క్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, హెల్త్కార్డు ప్రీమియం చెల్లించాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలన్న డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) సభ్యులు సీఎం పాల్గొన్న సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం రాయవరంలో సోమవారం ‘జన్మభూమి-మా ఊరు’ సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో ముఖ్యమంత్రి వారిపై చిందులు తొక్కారు. ‘‘న్యాయమైన సమస్య అయితే వచ్చి ఒక పక్కన నిలబడి వినతిపత్రం ఇవ్వండి. సమస్య సరైనది అయితే న్యాయం చేస్తాను. ఒకరిద్దరు వచ్చి గొడవ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. కఠిన చర్యలుంటాయి. పది మంది వచ్చి అల్లరి చేస్తే చూస్తూ ఊరుకోం’’ అంటూ హెచ్చరించారు. -
హెల్త్కార్డుల భారంపై ‘కార్పొరేట్’ బేరం
* వైద్య చికిత్సల ప్యాకేజీపై 40 శాతం అదనంగా పెంచాలని డిమాండ్ * మొదట్లో 25 శాతమే కోరిన ఆసుపత్రులు... ఓకే చెప్పిన సర్కారు * తాజా డిమాండ్లపై ఉన్నతస్థాయి సమావేశానికి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: హెల్త్కార్డులపై కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకో మాట మారుస్తున్నాయి. కొత్త మెలికలు పెడుతున్నాయి. ప్యాకేజీలపై బేరమాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల హెల్త్కార్డులపై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇంతకుముందు చేసిన డిమాండ్కు సర్కారు ఓకే అని చెప్పింది. గతంలో ఆరోగ్యకార్డుల శస్త్రచికిత్స ప్యాకేజీని 25 శాతం పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. మొదట్లో ప్రభుత్వం ఆ డిమాండ్కు ససేమిరా అంది. 10 లేదా 15 శాతానికి మించి పెంచబోమని స్పష్టం చేసింది. కానీ చర్చోపచర్చల అనంతరం చివరకు ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల డిమాండ్కు తలొగ్గింది. తాజాగా 25 శాతం సరిపోదని, 40 శాతం ప్యాకేజీ పెంచాలని ప్రైవేట్ ఆసుపత్రులు కోరుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆరోగ్యకార్డుల అమలుకు మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విషయంపై తేల్చేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని యోచిస్తోంది. ఓపీకి ఉచిత సేవలపై ప్రతిష్టంభన ఉద్యోగులకు ఓపీ సేవలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే ప్రతిపాదించగా... ఎంతోకొంత ఫీజు వసూలు చేయాల్సిందేనని కార్పొరేట్ యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. దీనిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఔట్ పేషెం ట్లుగా వస్తే ఉచితసేవలు అందించడం చాలా కష్టమని, అవసరమున్నా, లేకున్నా ఉద్యోగులు ఆసుపత్రులకు విరివిగా వస్తే తమకు ఇబ్బంది ఏర్పడుతుందని, అందువల్ల అందుకు ఫీజు వసూలు చేస్తామని, దానికి అంగీకరించాలని యాజమాన్యాలు అంటున్నాయి. ఓపీ సేవలు, వైద్య పరీక్షలకు సంబంధించి అవసరమైతే ఉద్యోగులు ఎంతోకొంత ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ అడు గు ముందుకు పడలేదు. మెడికల్ ప్యాకేజీని నిమ్స్, సీజీహెచ్ఎస్ ధరలకు అనుగుణంగా పెంచాలని యాజమాన్యా ల ప్రతినిధులు కోరుతున్నారు. మందులకు సంబంధించి సేకరణ ధర కాకుండా ఎంఆర్పీపై కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కోరుతున్నట్లుగా నిమ్స్ మాదిరి మెడికల్ ప్యాకేజీ, ఓపీకి చెల్లిస్తే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల అంచనా. శస్త్రచికిత్సల ప్యాకేజీ పెంచినా పెద్దగా భారం ఉండదని, మహా అయితే రూ. 200 కోట్లకు మించి ఖర్చు కాదని అంటున్నారు. ఉచిత ఓపీ, మెడికల్ ప్యాకేజీలపైనే అధిక భారం ఉంటుందని సమాచారం. ‘దసరాకి కార్పొరేట్ చికిత్స అందించాలి’ ఉద్యోగులకు దసరా పండగలోపు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్ధన్రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్రెడ్డి వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిని సోమవారం కలసి కోరారు. ఉపాధ్యాయుల నుంచి ప్రీమియం గెజిటెడ్ స్కేలు వారు రూ. 200, మిగతావారు రూ. 150 చొప్పున చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు: సీఎం
హైదరాబాద్: తెలంగాణ లోని వర్కింగ్ జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డుల మంజూరుకు సంబంధించిన ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. హెల్త్ కార్డులు అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఆదేశించారు. అక్రెడిటేషన్ లేకున్నా హెల్త్ కార్డు: అల్లం అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకూ ఈ హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం హర్షించ దగ్గ విషయమని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. హెల్త్ కార్డుల మంజూరు ఫైల్పై సీఎం సంతకం చేసినందుకు జర్నలిస్టుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో పనిచేస్తున్న విలేకరులకు కూడా త్వరలో ఖర్చులేని వైద్యం అందనుందన్నారు. ఈ కార్డులు లేక ఇటీవల 40 మంది విలేకరులు చనిపోయారని గుర్తు చేశారు. రూ.10 కోట్లు ఉన్న వెల్ఫేర్ ఫండ్ను రూ.100 కోట్లకు పెంచేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. సచివాలయ జర్నలిస్టుల చొరవ ఇందులో ఎక్కువగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ సలహదారు రమణాచారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల హెల్త్ కార్డుల ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం చేయడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) పేర్కొంది. దీంతో పాటు ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యపై సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ సీనియర్ నాయకులు శ్రీనివాస్రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
పాత్రికేయులందరికీ హెల్త్ కార్డులు: అల్లం నారాయణ
గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో అక్రిడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంత జర్నలిస్టులందరికీ హెల్త్కార్డులు ఇచ్చేందుకు కషి చేస్తున్నామని ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన తెలంగాణ ఉత్తేజ సభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రస్తుతం హెల్త్కార్డులకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉందని, పది రోజుల్లోగా ఈ ఫైల్ క్లియరయ్యే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 15వ తేదీ వరకు అక్రిడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్ట్లందరికి బస్పాస్ రెన్యూవల్ చేయనున్నారని ఆయన చెప్పారు. -
'సీఎం ఆదేశించినా పనుల్లో జాప్యం'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశించినా హెల్త్కార్డుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, జాప్యం జరుగుతుందని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నేతలు తెలిపారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, పలువురు అధికారులతో శనివారం మధ్యాహ్నం లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. హెల్త్కార్డులు, నగదు రహిత వైద్యంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత ఓపీ సౌకర్యాన్నికల్పించాలని ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి లక్ష్మారెడ్డికి విన్నవించారు. -
వైద్య రహిత హెల్త్కార్డులు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగులకు ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదురహిత వైద్యం కలగానే మిగిలిపోయింది. హెల్త్కార్డులు ఇచ్చినప్పటికీ వాటితో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందే అవకాశం కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైంది. హెల్త్కార్డుల ప్రీమియంను ఉద్యోగుల నుంచి ఆరు నెలలుగా వసూలు చేస్తున్నా.. కార్పొరేట్ ఆసుపత్రులతో పూర్తిస్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీలు తమకు గిట్టుబాటు కావడం లేదని కార్పొరేట్ ఆసుపత్రులు తేల్చిచెబుతున్నాయి. ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసుపత్రుల ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమైనా.. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. నగదు రహిత వైద్య పథకాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొస్తామంటూ మంత్రి చేసిన ప్రకటనలు వాస్తవరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం లో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి రోడ్మ్యాప్ రూపొం దించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం జరగాల్సిన ఈ భేటీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. పెన్షనర్ల ఆవేదన: పెన్షనర్లు వైద్యం చేయించుకోవడానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీయింబర్స్మెంట్ సౌకర్యం ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న చాలా కాలానికి, పెట్టిన ఖర్చులో గరిష్టంగా 80 శాతం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. హెల్త్కార్డులతో సమస్యలు తీరుతాయని ఆశించినపెన్షనర్లకు నిరాశే ఎదురైంది. పెన్షన్లో ప్రీమియం కోత విధిస్తున్నా.. హెల్త్కార్డులపై ప్రభుత్వం వైద్యం అందించలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్త్కార్డుల పథకం అమలుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. -
జర్నలిస్టులకు త్వరలో హెల్త్కార్డులు
దానవాయిపేట (రాజమండ్రి): ఆంధ్రప్రదేశ్లోని వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలోనే హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని, ఎన్నికల కోడ్ ఉన్నందున కాస్త ఆలస్యమైందని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మండెల శ్రీరామమూర్తి గురువారం రాజమండ్రిలో ఉపముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్చార్జి, జలవన రుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులను కలిసి హెల్త్ కార్డులు మంజూరు చేయకపోవడం వల్ల జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై స్పందించిన మంత్రులు హెల్త్ కార్డుల ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని, అక్రిడిటేషన్ల కమిటీ ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేసిన వెంటనే ఆగస్టు ఒకటి నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెలాఖరుకు ముగియనున్న అక్రిడిటేషన్ల గడువును జూలై నెలాఖరు వరకూ పొడిగించి ఆగస్టు ఒకటి నుంచి కొత్త కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పల్లె వివరించారు. అదే విధంగా కొత్తగా అర్హులైన వారికి తాత్కాలిక అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని మంత్రులు డీపీఆర్వోను ఆదేశించారు. -
తెలంగాణ కళాకారులకు హెల్త్ కార్డులు
-
హెల్త్ కార్డులకు కార్పొ‘రేటు’ పోటు
నగదు రహిత చికిత్సకు నో అంటున్న ప్రధాన ఆసుపత్రులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత చికిత్స ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడడం లేదు. హెల్త్ కార్డులు జారీచేసినా పాత పద్ధతిలోనే ముందుగా డబ్బులు చెల్లిస్తూ చికిత్స చేయించుకుంటున్నారు. ఆ తర్వాత మెడికల్ బిల్లులు సమర్పించి రీయింబర్స్మెంట్ పొందేందుకు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో 12 ప్రధాన ఆసుపత్రులు ఈ నగదు రహిత ఆరోగ్య కార్డుల ఉద్యోగుల చికిత్సకు అంగీకరించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ ఆసుపత్రులకే చాలా మంది ఉద్యోగులు ఎగబడుతున్నారు. అయితే ప్యాకేజీలు తమకు సరిపోవని... కనీసం 25 శాతం పెంచాలని ఆ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. దీన్ని ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకార్డుల ద్వారా,పాత పద్ధతిలోనూ చికిత్సకు ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని ఈ నెలాఖరు వరకు కొనసాగించిన ప్రభుత్వం... ఇదే విధానాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య కార్డులను ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చింది. దాదాపు 230 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగుల నగదు రహిత చికిత్సకు ఒప్పుకున్నాయి. అయితే 12 ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులు దీనికి అంగీకరించడంలేదు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు చికిత్స కాబట్టి సామాజిక బాధ్యతగా ప్యాకేజీలు తక్కువగా ఉన్పప్పటికీ తాము అంగీకరించామని... భారీగా వేతనాలున్న ఉద్యోగులకూ ఈ ప్యాకేజీనే అమలు చేయడం సాధ్యంకాదంటున్నాయి. అందువల్ల వీటికి 25 శాతం పైగా పెంచాలని కోరుతున్నాయి. ఒకవేళ ప్యాకేజీ సొమ్మును పెంచితే అన్ని ఆసుపత్రులకూ అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భయపడుతుంది. సమస్యకు ఉద్యోగ సంఘాల మూడు పరిష్కారాలు 1. కేంద్ర ఉద్యోగులకు ఇచ్చే ప్యాకేజీని అమలు పరచడం 2. నిమ్స్ ఆసుపత్రుల్లో మిలీనియం బ్లాక్ ప్యాకేజీని అమలు చేయడం 3. బీమా సంస్థల ప్యాకేజీని అమలు చేయడం -
జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు..
-
జర్నలిస్టులకు మంచి రోజులు
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి సంగారెడ్డి క్రైం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంచి రోజులు వచ్చాయని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు ఎ.విష్ణువర్దన్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ అకాడమీతో శనివారం జరిపిన సమావేశంలో జర్నలిస్టులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్లు ఇచ్చేందుకు సీఎం ఆమోదం తెలుపడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతినెల 3వ తేదీ లోగా రూ.5వేల భృతిని అందజేస్తామని సీఎం ప్రకటించడం నిజంగా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపడమేనన్నారు. జర్నలిస్టులకు నియోజవకర్గ కేంద్రాల్లో 200 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడం కోసం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పిన సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. జర్నలిస్టులందరికీ వారం రోజుల్లోగా హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్లు మంజూరు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని సీఎం చేసిన ప్రకటన మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలనుటీయూడబ్ల్యూజే సేకరిస్తుందని విష్ణువర్దన్రెడ్డి తెలిపారు. విధి విధానాల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తాము జాబితాను వెంటనే అందజేస్తామన్నారు. కాగాముఖ్యమంత్రి నిర్ణయాన్ని హర్షిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆదివారం జర్నలిస్టులు సంబరాలు జరుపుకోవాలని విష్ణువర్ధన్రెడ్డి కోరారు. -
'తెలంగాణలో జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం ప్రెస్ అకాడమీలో జర్నలిస్టులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. దీంతో పాటు జర్నలిస్ట్ అక్రిడేషన్ మార్గదర్శకాలకు 9 మందితో కమిటీని నియమించారు. ఇదిలా ఉండగా సెక్రటరీయేట్ లో మీడియాపై విధించిన ఆంక్షలపై మాత్రం కేసీఆర్ స్పందించలేదు. -
జర్నలిస్టులకు మార్చి నుంచి హెల్త్ కార్డులు
-
పీఆర్సీ సాధ్యం కాదు: బాబు
-
తప్పుల తడక
కడప: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన హెల్త్కార్డుల పథకం తప్పుల తడకగా మారింది. ఉద్యోగులకు ఉచితంగా కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించేందుకు సంబంధించి చాలారోజులుగా ప్రభుత్వం నాన బెడుతూ 2014 చివరిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే హెల్త్కార్డులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే హెల్త్కార్డుల వ్యవహారంలో మొత్తం అంతా తప్పులు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. పథకానికి సంబంధించిన కార్డులతోపాటు ఇతరత్రా తప్పులు దొర్లడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నేరుగా పెన్షనర్స్, ఇతరులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆర్థికశాఖ పరిధిలో వెబ్సైట్ నడుస్తుండడం, హెల్త్కార్డులకు ప్రత్యేకంగా సైట్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏపీ వారికి తెలంగాణ ప్రభుత్వం పేరుతో కార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి చాలామందికి తెలంగాణ ప్రభుత్వం పేరుతో హెల్త్కార్డులు రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని కడపలో పనిచేస్తున్న తమకు తెలంగాణ ముద్ర ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చాలామందికి తెలంగాణ ప్రభుత్వం పేరుతోనే కార్డులు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కార్డు ఒకరి పేరుతో ఉంటే ఫోటో మరొకరిది ఉండడం లాంటి తప్పులున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయో చెప్పేవారు లేకపోగా, ఏదైనా విపత్కరపరిస్థితులు ఎదురైనప్పుడు ఆస్ప్రత్రికి వెళితే తెలంగాణ ప్రభుత్వం పేరుతో ఉన్న కార్డులు చెల్లకుంటే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వెబ్సైట్లో ఆప్షన్లు లేక ఇబ్బందులు హెల్త్కార్డులకు సంబంధించి ప్రత్యేకంగా వెబ్సైట్ లేకపోవడంతో ఆప్షన్ల విషయంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన వెబ్సైట్లలో ఎడిట్, డిలీట్ లాంటి ఆప్షన్లు లేకపోవడంతో ఏదైనా ఒక అక్షరం తప్పు జరిగినా సరిదిద్దుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు ఉద్యోగి పేరు వెంకట రమణ అయితే ఒక అక్షరం తేడా వచ్చినా నిలిచిపోతున్నాయి. తేడాలున్న కార్డులను నిలిపేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. పైగా నో రికార్డు ఫౌండ్ అని చూపిస్తుండటంతో ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి ఎగనామం రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగస్తుల వివరాలను అప్పట్లో ప్రభుత్వం సేకరించింది. దాని ఆధారంగానే ప్రభుత్వం హెల్త్కార్డులను మంజూరు చేస్తోంది. అయితే, విభజన అనంతరం కొద్దిరోజుల తర్వాత ఉద్యోగంలో కొత్తగా చేరిన వారి వివరాలను ప్రభుత్వం తీసుకోలేదు. ఎంటర్ చేయడానికి అవకాశం లేకపోవడంతో కొత్తగా చేరిన ఉద్యోగులకు హెల్త్కార్డులు మంజూరు దాదాపు లేనట్లేనని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికీ కూడా చాలా శాఖల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలామందికి హెల్త్కార్డులు రాకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. ఎవరిని అడగాలో తెలీక అవస్థలు జిల్లాలో వేలాది మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే హెల్త్కార్డులకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఇప్పటికే ట్రెజరీ అధికారులను, ఆరోగ్యశ్రీ, 108, కలెక్టరేట్, ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. చివరికి హెల్త్కార్డులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరిని అడిగి తెలుసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. అలాగే టోల్ఫ్రీ నెంబరు కూడా లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఉద్యోగుల హెల్త్కార్డులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి విచారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు విన్నవిస్తున్నారు. -
పీఆర్సీ సాధ్యం కాదు: బాబు
సాక్షి, హైదరాబాద్: అనుమానమే నిజమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఉద్యోగులకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫాసరసుల అమలు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన పంథాలోనే స్పందించారు. జీతాలకే డబ్బుల్లేవంటూ పాత బీద పాటే మళ్లీ పాడారు. పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యం, నిరుపయోగంగా ఉన్న హెల్త్ కార్డులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ప్రతినిధి బృందం మంగళవారం ముఖ్యమంత్రితో సమావేశమైంది. జేఏసీ నాయకత్వం మెతక వైఖరి వల్లే పీఆర్సీ అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. నేరుగా సీఎంనే కలసి సాధించుకోవాలనే ఉద్దేశంతో జేఏసీ బృందం సీఎంతో భేటీ అయింది. అయితే.. రోజువారీ ఖర్చులకే కటకటగా ఉందందని, జీతాలు చెల్లించడానికే డబ్బుల్లేని పరిస్థితుల్లో పీఆర్సీ అమలు సాధ్యం కాదని సీఎం తెగేసి చెప్పడంతో ఉద్యోగ సంఘాల నేతలు నిర్ఘాంతపోయారు. గతంలో 9 పీఆర్సీలు అమలు చేసినప్పుడు ఏ సీఎం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, వెంటనే పీఆర్సీ అమలు చేస్తామని చెప్పలేదని చంద్రబాబుకు గుర్తుచేశారు. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటై రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఉద్యోగులతో చర్చించలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ‘మీతో మాట్లాడాలమని ఉపసంఘానికి చెబుతా’ అని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు ఇంకా పీఆర్సీ గురించే అడుగుతుంటే.. ‘ఉపసంఘం నివేదిక వచ్చిన తర్వాత అమలు సంగతి చూస్తా’ అని సీఎం సమాధానం ఇచ్చి.. పీఆర్సీ మీద చర్చను ముగించారు. హెల్త్కార్డుల పథకంలో లోపాలు సవరించకుంటే, మార్చి నుంచి ప్రీమియం చెల్లించబోమని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. గత రెండు నెలల్లో ఉద్యోగులు రూ. 12 కోట్ల ప్రీమియం చెల్లించిన విషయాన్ని గుర్తుచేశాయి. లోపాలను వారంలోగా సవరించి తాజా ఉత్తర్వులు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. జేఏసీ ప్రతినిధి బృందంలో చైర్మన్ అశోక్బాబు, సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరావు, కోచైర్మన్లు కత్తి నరసింహారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, నేతలు చంద్రశేఖరరెడ్డి, కమలాకరరావు, రఘురామిరెడ్డి, రవికుమార్, భాస్కర్, కుళ్లాయప్ప తదితరులు ఉన్నారు. అధికారులు సాయిప్రసాద్, లవ్ అగర్వాల్, ధనుంజయరెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో సీఎం ఏమన్నారంటే.. హా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు సాధ్యం కాదు. కొన్ని సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. లాభాలు సంపాదించుకొని ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచుకున్నా అభ్యంతరం లేదు. హా ఉద్యోగులు కొత్త రాజధానికి పోవాల్సిందే. ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో లేదనే భావన నాలో ఉంది. హైదరాబాద్లో ఉండి పాలించినా, అమెరికాలో కూర్చొని పాలించినా.. తేడా ఏమీ లేదు. క్రమంగా పాలన మొత్తం కొత్త రాజధానికి మారాల్సిందే. (‘కొత్త రాజధాని ప్రాంతంలో ఇంటి అద్దెలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడ్డా.. ఇళ్లు దొరికే పరిస్థితి లేదు. పిల్లల చదువులకు ఇబ్బంది వస్తుంది. మౌలిక వసతుల్లేవు. అన్నీ కల్పించిన తర్వాత వెళ్లడానికి మేం సిద్ధం. అత్యవసరంగా తరలించాల్సిన విభాగాలకే తొలుత ప్రాధాన్యత ఇవ్వాలి’ అని ఉద్యోగులన్నారు.) అక్కడ అన్ని వసతులు కల్పిస్తాం. ఏ శాఖలను మొదట తరలించాలనే విషయాన్ని నిర్ణయించడానికి సీఎస్ ఆధ్వర్యంలో భేటీ పెడతాం. హా కారుణ్య నియామకాలకు కనీస విద్యార్హత డిగ్రీ ఉండాల ంటూ ఇచ్చిన జీవోను సవరిస్తాం. జీవో ఇచ్చిన తేదీ వరకు పెండింగ్లో ఉన్న కేసుల్లో కనీస విద్యార్హతను ఇంటర్గా పరిగణించి ఉద్యోగాలిస్తాం. 80 రోజుల సమైక్య సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరించడానికి ఉత్తర్వులు ఇస్తాం. విజయవాడ, విశాఖ కార్పొరేషన్లలో 010 పద్దు నుంచి జీతాలు తీసుకోని సిబ్బందికీ పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచుతాం. కఠిన వైఖరే: సీఎంతో భేటీకి ముందు ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగిన జేఏసీ కార్యవర్గ భేటీలో పీఆర్సీ అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఉద్యోగులు నిర్ణయించారు. పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇవ్వాలని తీర్మానం చేశారు. మంత్రివర్గ ఉపసంఘంతో ప్రయోజనం ఉండదని, సీఎంకే విన్నవించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎంతో ఉద్యోగుల జేఏసీ ఏమంది? పీఆర్సీ అమలులో విపరీతమైన జాప్యం జరుగుతోంది గతంలో 9 పీఆర్సీలు అమలు చేసినప్పుడు ఏ సీఎం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని, అమలు చేస్తామని చెప్పలేదు ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటే ఎక్కువ జీతాలు ఇస్తారా? ఉపసంఘం ఏర్పాటై 2 నెలలైనా ఉద్యోగులతో చర్చించలేదు ‘హెల్త్ కార్డు’ సవరించకుంటే మార్చి నుంచి ప్రీమియం చెల్లించం ‘కొత్త రాజధాని’లో వసతులన్నీ కల్పించాక వెళ్లేందుకు మేం సిద్ధం జేఏసీతో చంద్రబాబు ఏమన్నారు? జీతాలకే డబ్బుల్లేని పరిస్థితి.. పీఆర్సీ అమలు సాధ్యం కాదు ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చించాలని ఉపసంఘానికి చెప్తా హెల్త్ కార్డుల పథకంలో లోపాలను వారంలో సవరిస్తాం 80 రోజుల సమైక్య సమ్మె కాలం క్రమబద్ధీకరణకు చర్యలు పీఎస్యూల సిబ్బంది పదవీ విరమణ వయసు పెంచలేం ఉద్యోగులు కొత్త రాజధానికి వెళ్లాల్సిందే.. వసతులు కల్పిస్తాం నివేదిక వచ్చాక ‘కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పరిశీలిస్తా పొరుగు రాష్ట్రం సీఎంనా అనిపించింది ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సందర్భంగా సీఎం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ట్లు సమాచారం. ‘‘హైదరాబాద్లో ఉండి పరిపాలన చేస్తుంటే ఇతర దేశాల్లో ఉండి పరిపాలన చేసినట్లుంది. సోమవారం విజయవాడకు వెళితే ఏపీ సీఎంకు స్వాగతం అని బ్యానర్లు దర్శనమిచ్చాయి. సొంత రాష్ట్రానికి సీఎం హోదాలో నేను వెళితే పొరుగు రాష్ట్రం సీఎం వచ్చిన పుడు స్వాగతం పలుకుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారన్న భావన కలిగింది. ఏపీలో త్వరలో చిన్న అసెంబ్లీని కట్టుకొని శాసనసభ నిర్వహించుకుందాం’’ అని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. -
'కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను'
వరంగల్: తెలంగాణ సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్లో కడియం శ్రీహరి మాట్లాడుతూ... రాజకీయ విలువలు పాటిస్తు అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటానని తెలిపారు. సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు కడియం శ్రీహరి వెల్లడించారు. -
తెగిన ఆ‘దారం’
మగ్గాలపై నేసే వస్త్రాలు బాగుంటాయి. వాటిని వాడడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ వాటిని మగ్గంపై నేసే క్రమంలో వచ్చే దుమ్ము, ధూళి కార్మికుల టీబీ, దగ్గు, దమ్ము, జ్వరం వంటి అనేక రోగాలు తెచ్చి పెడుతోంది. చేనేత కార్మికులకు హెల్త్కార్డులు ఇవ్వాలి. కార్మికుల పిల్లలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేయాలి. అప్పుడే చేనేత రంగానికి చేయూతనిచ్చిన ప్రభుత్వంగా పాలకులకు పేరుంటుంది. మాకు బతుకుపై ధీమా ఉంటుంది. - కల్యాణపు కనుక శ్రీను సంఘం ప్రత్యేకతలు కరీంనగర్ మండలం కొత్తపల్లి చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్ను 1949లో స్థాపించారు. సభ్యులు గతంలో 700మంది ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 215కి పడిపోయింది. అందులో 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తువ్వాలలు, లుంగీలు, చెద్దర్లు, డోర్ కర్టన్స్, పాలిస్టర్ షర్టింగ్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉత్పత్తి చేస్తారు. సంఘానికి బ్యాంకు అప్పు రూ.15 లక్షలు ఉండగా ఆప్కోనుంచి రూ.30 లక్షలు రావాల్సి ఉంది. వస్త్రాల నిల్వ రూ.45 లక్షలు, నూలు స్టాకు నిల్వ రూ.25 లక్షలు, రంగు రసాయనాల నిల్వ రూ.2 లక్షలు ఉన్నట్లు సమాచారం. రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని మగ్గం నేసినా కడుపు నిండని దైన్యం వారిది. బట్టలు నేసి నాగరికతకు రూపం తెచ్చిన నేతన్నల ఒంటిపై చిరుగు బట్టలే దర్శనమిస్తూ వారి దుస్థితికి అద్దం పడుతున్నాయి. పనిచేస్తే డబ్బులతోపాటు బోనస్గా వచ్చే రోగాలు ఆ డబ్బునంతా హరిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలేవీ వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. స్వరాష్ట్రం సిద్ధించినా వారసత్వంగా వచ్చిన వృత్తిపై మమకారం చంపుకోలేక ఇప్పటికీ ఉపాధి కోసం ముంబయి, భీవండి బాటపడుతూ బతుకుబండి లాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. నేత కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్గా మారి వారి సమస్యలను తెలుసుకున్నారు. కరీంనగర్ మండలం కొత్తపల్లి చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్లో కార్మికులతో మాట్లాడారు. -
ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల విలీనం
తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘంగా ఆవిర్భావం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంఘాలుగా చీలిపోయిన ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాలు తాజాగా మళ్లీ విలీనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఆప్టా) మాజీ అధ్యక్షులు టి.సాయిబాబ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్లో జరిగిన జరిగిన సమావేశంలో రెండు సంఘాలు ఏకమై ‘తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీఎస్ పీటీఏ)గా ఆవిర్భవించాయి. ఇకపై తెలంగాణలో టీఎస్ పీటీఏగా, ఆంధ్రప్రదేశ్లో ఆప్టాగా వ్యవహరించాలని ఈ సమావేశంలో రెండు సంఘాల నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సమావేశంలోనే టీఎస్పీటీఏ గౌరవ అధ్యక్షులుగా వైఎస్ శర్మ, అధ్యక్షుడిగా కోట్ల నరసింహరావు, ప్రధాన కార్యదర్శిగా పిట్ల రాజయ్యను ఎన్నుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్తలుగా వైఎస్ శర్మ, షౌకత్ అలీలను ఎంపిక చేశారు. జనవరి 3 నుంచి అర్ధవార్షిక పరీక్షలుండాలి : పీఆర్టీయూ టీఎస్ అర్ధ వార్షిక పరీక్షలను జనవరి 3 నుంచి 9 వరకు నిర్వహించాలని పీఆర్టీయూ టీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.సరోత్తం రెడ్డి, ఇతర నేతలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఎస్సీఆర్టీ డెరైక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ, హెల్త్ కార్డులపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టీఎస్యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, చావా రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
అమలు చేస్తారా.. అటకెక్కిస్తారా?
ఉద్యోగులకు నగదు రహిత వైద్యంపై ఏపీ సర్కారు నిర్లిప్తం హెల్త్ కార్డుల ప్యాకేజీల ధరలకు వైద్యానికి కార్పొరేట్ ఆస్పత్రుల నో సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేందుకు పథకం అమలు చేస్తున్నామంటూ.. హెల్త్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేసే విషయంలో మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. నవంబర్ 1 నుంచే ఈ పథకం అమలులోకి తెస్తున్నామని ప్రకటించిన టీడీపీ సర్కారు.. ఆ మాటను నిలబెట్టుకోలేదు. అనేక రకాల ఆంక్షలు, అలవిమాలిన నిబంధనలు పెట్టటంతో.. ఇలాగైతే నగదు రహిత వైద్యం తాము అమలు చేయలేమని కార్పొరేట్ ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఒకవైపు నగదు రహిత వైద్యం అమలు కాని పరిస్థితులు ఉంటే.. మరోవైపు.. డిసెంబర్ 1 నుంచి మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం రద్దవుతుందని ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే పేర్కొంది. ఇటు నగదు రహిత వైద్యం లేక.. అటు రీయింబర్స్మెంటూ లేక ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు. చేతులెత్తేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ 1వ తేదీ నుంచి నగదు ప్రమేయం లేని వైద్యం అందిస్తామంటూ హెల్త్ కార్డులు ఇచ్చారు. హెల్త్ కార్డుల పథకం కింద ప్రభుత్వం నిర్ధారించిన ప్యాకేజీల ధరలకు తాము వైద్యం అందించలేమని కార్పొరేట్ ఆస్పత్రులు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలకే ఉద్యోగులకూ వైద్యం అందించాలని, ఆరు నెలల తర్వాత సమీక్షించి కొత్త ధరలు నిర్ణయిస్తామని ప్రభుత్వం చెప్తోంది. అందుకు కార్పొరేట్ ఆస్పత్రులు ససేమిరా అంటున్నాయి. ఓపీ సేవలు ఎండమావే... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఔట్ పేషెంట్ సేవలను ప్రభుత్వాసుపత్రుల్లోనే పొందాలని తాజాగా జీవో జారీచేశారు. దీనికోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ స్పెషలిస్టులతో ప్రత్యేక క్లినిక్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.ప్రభుత్వ ఆస్పత్రుల్లో అసలే స్పెషలిస్టులు లేరు. ఉన్న కొద్దిమంది రూ. 50 కీ, రూ. 100 కూ ఓపీ సేవలకు రారనేది వైద్యవిద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి.సూపర్ స్పెషలిస్టులు అసలే లేరు. ప్రభుత్వాస్పత్రులకు వస్తున్న రోగుల్లో 20 శాతం మందికి కూడా రక్తపరీక్షలు చేయడానికి సదుపాయాలు లేవు. ఉద్యోగులకు పరీక్షలు చేయడం సాధ్యం కాదని అధికారులు నివేదించారు. వైద్యం అందక ఉద్యోగులు, పెన్షనర్లు అల్లాడిపోతున్నారు. సంతకాలే జరగలేదు ‘‘రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకూ అవగాహనా ఒప్పందాలపై ఎలాంటి సంతకమూ జరగలేదు. నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులేవీ ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించలేదు. ఓపీలు ఫ్రీ అంటే ఎలా కుదురుతుంది? ఎంప్లాయిస్ హెల్త్ స్కీం చెయ్యలేకపోతే ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోవాలని అంటున్నారు. దానిక్కూడా మేము సిద్ధమే.’’ - డాక్టర్ గురవారెడ్డి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షులు, తెలంగాణ ఆశించిన స్థాయిలో పథకం లేదు ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన స్థాయిలో హెల్త్ కార్డుల పథకం లేదు. తిరుపతి స్విమ్స్, హైదరాబాద్లోని నిమ్స్లో కూడా ట్రీట్మెంటు ఇవ్వబోమని చెప్తున్నారు. అలాగే.. చిత్తూరు, అనంతపురం ఉద్యోగులు అటు చెన్నై, ఇటు బెంగుళూరులలో వైద్యం చేయించుకుంటారు. ఢిల్లీలో ఉన్న ఏపీ ఉద్యోగుల విషయంలో స్పష్టత లేదు. మేం ఆర్థికశాఖ, వైద్యశాఖ కార్యదర్శులను కలిసి సమస్యలు వివరించాం. ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ను మరో రెండు నెలలు పొడిగించాలని కోరాం. ఇందుకు వైద్య శాఖ కార్యదర్శి అంగీకరించారు.’’ - అశోక్బాబు, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఈహెచ్ఎస్పై కుదరని ఏకాభిప్రాయం విజయవాడ: ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్.. ఆశ ప్రతినిధులు, ఎన్జీఓ అసోసియేషన్ నేతలతో మూడు గంటల పాటు చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం తాము వైద్యం అందించలేమని ఆషా తేల్చిచెప్పింది. దీంతో ఈ నెలాఖరుతో ముగియనున్న రీయింబర్స్మెంట్ వైద్య సేవలను ఈహెచ్ఎస్ సమస్య పరిష్కారం అయ్యేవరకూ కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి కామినేని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈహెచ్ఎస్ కార్డులున్న వారందరికీ ఉచిత కన్సల్టేషన్తో పాటు ఇన్వెస్టిగేషన్స్ (రక్తపరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్ వంటివి) కూడా ఉచితంగా చేయాలని పేర్కొంది. ఈ విషయంలో ఆశ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇన్వెస్టిగేషన్స్ను స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ (ఎస్ఎస్ఆర్) ప్రకారం చేస్తాం కానీ.. ఉచితంగా చేయలేమని మంత్రికి తేల్చి చెప్పారు. -
వారం రోజుల్లో జర్నలిస్టులకు హెల్త్కార్డులు
సూర్యాపేటరూరల్ : జర్నలిస్టులకు హెల్త్కార్డుల జారీ ప్రక్రియ వారం రోజు ల్లో ప్రారంభం కానుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలి పారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలోని సెవెన్ఆర్ హోటల్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులతో పాటు వారి తల్లిదండ్రులకు సైతం ప్రయోజనం చేకూరేలా హెల్త్కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. ఈ సందర్బంగా టీయూజేఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి వజ్జే వీరయ్య ఆధ్వర్యంలో అల్లం నారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, మల్లిఖార్జున్, చారి, చెంచల లక్ష్మణ్, పాష, సయ్యద్ మోహినుద్దీన్, భూపతి నారాయణ, ఎడ్వర్డ్, పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ కార్డుల విధివిధానాలు విడుదల
హైదరాబాద్: ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించిన విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేలా పథకం రూపొందించినట్టు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రుల్లో ఉద్యోగులకు వైద్య సేవలు అందించనుంది. 60 శాతం వైద్య సేవలు ప్రభుత్వాసుపత్రుల్లోనే అందిస్తామని నిబంధన విధించింది. ఆరు నెలల తర్వాత హెల్త్ కార్డుల పథకాన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వం గుర్తించిన ఏ ఆసుపత్రిలోనైనా హెల్త్ కార్డు చూపించి పూర్తిస్థాయి వైద్య సేవలు పొందవచ్చు. సర్కారు గుర్తించిన 1,885 రోగాలకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్.. ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చు. -
ఏపీ ప్రభుత్వోద్యోగులకు 30న హెల్త్ కార్డులు
-
ఏపీ ప్రభుత్వోద్యోగులకు 30న హెల్త్ కార్డుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు ఈనెల 30న హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వెయ్యి జెనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిసెంబర్ నుంచి ప్రభుత్వాస్పత్రులలో పీపీపీ విధానాన్ని అమలుచేస్తామని అన్నారు. ప్రయోగాత్మకంగా గుంటూరులో కార్డియో థొరాసిక్ యూనిట్ను పీపీపీ విధానంలో ఏర్పాటుచేస్తామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రులలో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తామని, ఇకమీదట అందరూ సమయానికి హాజరు కావాల్సిందేనని కామినేని తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలలో మార్పులు చేస్తామని, అనంతపురం, విజయవాడలకు కేంద్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మంజూరు చేసిందని వివరించారు. ఈనెల 30వ తేదీన ఉద్యోగులకు హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని, డిసెంబర్ నుంచి జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు ఇస్తామని ఆయన అన్నారు. -
జర్నలిస్టులందరికీ హెల్కార్డులకు మంత్రి హామీ
హైదరాబాద్ : జర్నలిస్టుల హెల్త్కార్డులపై మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారమిక్కడ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అక్రిడేషన్తో సంబంధం లేకున్నా జర్నలిస్టులందరకీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. నవంబర్ నెలాఖరు నాటికి హెల్త్కార్డుల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రీమియం వెయ్యి నుంచి 2వేల వరకూ ఉంటుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఉద్యోగులకు దీపావళి ధమాకా
హెల్త్కార్డులపై డిప్యూటీ సీఎం రాజయ్య వ్యాఖ్య కార్డుల పంపిణీ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: హెల్త్కార్డు ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అందించిన దీపావళి ధమాకా అని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య అన్నారు. బుధవారం సచివాలయం డి బ్లాక్ కాన్ఫరెన్స హాలులో ఉద్యోగులకు ఆయన హెల్త్కార్డులను అందజేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్కు తొలికార్డును అందించారు. టీజీఓ, టీఎన్జీవో నాయకులు కె.రవీందర్రెడ్డి, వి.మమత, విఠల్, బండారు రేచల్, కె.లక్ష్మణ్, కాసం విజయలక్ష్మితో సహా మొత్తం 59 మందికి ఈ కార్డులను ఇచ్చారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ అడగకుండానే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు వరాలు ప్రకటించారన్నారు. హెల్త్కార్డులను సీఎం సోమవారమే లాంఛనంగా ప్రారంభించారని, వాటిని తాను పంపిణీ చేస్తున్నానని చెప్పారు. నవంబర్ 1నుంచి ఈ కార్డులు అమల్లోకి వస్తాయని, ఏ ఆస్పత్రిలోనైనా, ఏ వ్యాధికైనా దీనిద్వారా చికిత్స పొందవచ్చని తెలిపారు. ఎయిడెడ్ స్కూళ్లు, ఎక్సైజ్, పోలీసు శాఖల ఉద్యోగులకు దీనిని వర్తింపజేసే విషయంపై ముఖ్యమంత్రి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు. తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని మరోసారి రుజువు చేసుకున్నామన్నారు. సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు పాటుపడాలని, బంగారు తెలంగాణను సాధించే దిశలో కృషిచేయాలన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ర్టంలో 5 ఏళ్ల వ్యవధిలో 42,43 సమావేశాలు జరిగినా హెల్త్కార్డులపై స్పష్టత రాలేదన్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం స్వల్ప వ్యవధిలోనే కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను క్షేమంగా చూసుకోవడం తమ బాధ్యత అని చెప్పిన సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. సీఎం సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు, పథకాలు ప్రజలకు చేరాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యోగులు కృషిచేయాలన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వంలో పూర్తి భాగస్వామ్యంతో ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రూ.వంద కోట్ల చొప్పున కేటాయించి, నిమ్స్స్థాయికి తీసుకొచ్చేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగుల వైద్య చికిత్స కోసం రెండు లక్షల లిమిట్ ఎందుకని, రూ.10 అయినా లేదా రూ.20 లక్షలు అయినా ఇచ్చేందుకు సీఎం ముం దుకు వచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ధనుంజయరెడ్డి మాట్లాడుతూ మొత్తం 1,885 జబ్బులకు, ఉద్యోగులు కోరుకున్న ఏ ఆసుపత్రిలోనైనా హెల్త్కార్డుతో సేవలు అందుతాయని చెప్పారు. కుటుంబ కార్డు మాదిరిగా కాకుండా ఎవరికి వారికి వ్యక్తిగతంగా కార్డులుంటాయన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి ఉద్యోగికి లాగిన్ ఐడిని ఇస్తామని, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామన్నారు. తదనుగుణంగా తమ కార్డులను డౌన్లోడ్ చేసుకుని లామినేట్ చేసుకుంటే హెల్త్కార్డు వచ్చేసినట్లేన ని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఇంకా ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ పూలరవీందర్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని ఉద్యోగులు ఊరేగించి, క్షీరాభిషేకం చేశారు. హెల్త్కార్డుల జారీలో, విలువైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కార్యాలయం వైపు వస్తున్న ఈ ఊరేగింపును పోలీసులు అడ్డుకోవడంతో స్పల్పంగా తోపులాట జరిగింది. అనంతరం మీడియా పాయింట్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కేసీఆర్ ఫ్లెక్సీని ఉంచి పాలతో అభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ నాయకులు ఈ.నాగరాజు, జాకబ్, నర్సింగరావు, ఇంకా ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, పలువురు ఎన్టీఓ, టీఎన్జీవో నాయకులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యోగులకు ప్రయోజనం దక్కేలా ఆరోగ్య కార్డులు ఇచ్చి సీఎం కేసీఆర్ తన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఇదేరీతిలో ఉద్యోగులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రతిశాఖ ఉద్యోగులు 'మనశాఖ- మన ప్రణాళిక' పెట్టుకుని ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. ఆరోగ్య కార్డుల విషయంలో మాట నిలబెట్టుకున్నందుకు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘం నాయకుడు దేవిప్రసాద్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. -
'మాకూ హెల్త్ కార్డులు ఇవ్వాలి'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం ఇచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ సర్కారు తమకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ డిమాండ్ చేశారు. హుదూద్ తుపాను కారణంగానే ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వడంలో జాప్యం జరిగినట్టు భావిస్తున్నట్టు చెప్పారు. తమ ఉద్యోగులకు ఎలాంటి ప్రీమియం లేకుండా ఆరోగ్య కార్డులు ఇవ్వనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. వారికి పూర్తిగా ఉచిత వైద్యం అందించేందుకు వీలుగా హెల్త్ కార్డులు జారీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. -
ఉద్యోగుల, పెన్షనర్లకు దీపావళి కానుక
-
జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ హెల్త్కార్డులు
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీహెచ్ఎంసీలోని రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్కార్డులు జారీ చేయనున్నారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్కు ఈ విషయాన్ని తెలిపారు. హెల్త్కార్డులతోపాటు అర్హులైన వారికి పదోన్నతులు, బదిలీలు కూడా జరిపేందుకు కమిషనర్ హామీ ఇచ్చారని గోపాల్ విలేకరులతో అన్నారు. త్వరలోనే పీఆర్సీ అమలు కూడా జరుగనున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ సర్కారు ఉద్యోగుల పక్షపాతిగా వ్యవహరిస్తోందని అన్నారు. హెల్త్కార్డులతో నగదు లేకుండానే ఏ ఆస్పత్రిలోనైనా వైద్యచికిత్సలు చేయించుకోవచ్చునన్నారు. -
సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హెల్త్కార్డుల జారీతోపాటు 15 రోజుల్లో 10వ పీఆర్సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సీఎం కేసీఆర్కు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశాయి. పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షులు పి.వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.నరోత్తంరెడ్డి, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జునశర్మ, ఆల్ ఇండియా టీచర్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ బి.మోహన్రెడ్డి, తెలంగాణ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ చైర్మన్ ఇ.వెంకటేశం, కో చైర్మన్ డి.సర్వయ్య, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు నవ్వ ధమనేశ్వరరావులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆరోగ్య భాగ్యం, ఆంక్షల్లేని వైద్యం
టీ ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుక ఉద్యోగ సంఘాలతో భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వ్యయ పరిమితి లేకుండా నగదు రహిత వైద్యం {పీమియం కూడా చెల్లించనక్కర్లేదు నేడు సీఎం చేతుల మీదుగా హెల్త్కార్డుల జారీ షురూ దశలవారీగా అన్ని శాఖల వారికీ వర్తింపు వచ్చే నెల 1 నుంచే వైద్య సేవలు మొదలు సర్కారుపై ఏటా రూ. 400 కోట్ల మేర భారం కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు సమగ్ర వివరాలు మొత్తం ఉద్యోగులు: 3.19 లక్షలు హెల్త్ కార్డులకు ఎన్రోల్ చేసుకున్నది: 2.41 లక్షలు ఇంకా నమోదు చేసుకోవాల్సింది: 78 వేలు మొత్తం పెన్షనర్లు: 2.56 లక్షలు ఇప్పటివరకు నమోదైన వారు: 1.19 లక్షలు ఇంకా మిగిలిన వారు: 1.37 లక్షలు వైద్య సేవలు అందించే ఆసుపత్రులు: 460 ప్రభుత్వం గుర్తించిన రోగాల సంఖ్య: 1,885 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న ఆంక్షల్లేని వైద్య సేవల కల నెరవేరింది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు మంగళవారం ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన భేటీలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎలాంటి పరిమితి లేకుండా, వైద్యానికి ఎంత ఖర్చయినా, ఆ మొత్తాన్ని భరించేందుకు ఆయన అంగీకరించారు. దీంతో దాదాపు 5.75 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇకపై ఆంక్షల్లేని వైద్యం అందనుంది. గత ప్రభుత్వాల హయాంలో అనేకసార్లు సమావేశాలు జరిగినా ఈ విషయం కొలిక్కిరాలేదు. వైద్య సౌకర్యాలు, నగదు పరిమితి తదితర అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో హెల్త్కార్డుల జారీపై తాజాగా సమావేశం నిర్వహించిన కేసీఆర్.. ఉద్యోగవర్గాలను సంతృప్తిపరిచేలా నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డుతో వచ్చే నెల 1 నుంచి అన్ని రిఫరల్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా బుధవారమే కొంత మంది ఉద్యోగులకు(100 మంది వరకు) కేసీఆర్ స్వయంగా హెల్త్ కార్డులను జారీ చేసి ప్రక్రియను ప్రారంభించనున్నారు. క్రమంగా మిగతా ఉద్యోగులు, పెన్షనర్లందరికీ హెల్త్ కార్డులు అందుతాయి. మొదట ఉద్యోగులకు ఈ పథకం అమలుకానుంది. ప్రభుత్వరంగ సంస్థలు, మున్సిపల్, ఎయిడెడ్, గ్రంథాలయ తదితర శాఖల ఉద్యోగులకు దశలవారీగా వర్తింపజేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధ, గురువారాల్లో ప్రభుత్వం జారీ చేయనుంది. ఉద్యోగుల సర్వీసు రూల్స్ సరళీకరణ వంటి అంశాలపై దీపావళి తర్వాత.. అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలతో వస్తే చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ దేవీప్రసాద్ వెల్లడించారు. ప్రీమియం, పరిమితి నిబంధనలన్నీ రద్దు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వం గుర్తించిన ఏ ఆసుపత్రిలోనైనా హెల్త్ కార్డు చూపించి పూర్తిస్థాయి వైద్య సేవలు పొందవచ్చు. రెండు లక్షల రూపాయల వరకే వైద్య ఖర్చుల పరిమితి నిబంధనన తాజాగా తొలగిపోయింది. సర్కారు గుర్తించిన 1,885 రోగాలకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్.. ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చు. గతంలో 345 రోగాలకు వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే పొందాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం దీన్ని కూడా తొలగించారు. అలాగే గత ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు నెలకు రూ. 90 చొప్పున, అధికారులు రూ. 120 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఏటా రూ. 86.27 కోట్లవుతుంది. దీనికితోడు ప్రభుత్వం తన వాటాగా రూ. 129 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. అయితే కేసీఆర్ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఉద్యోగులు, పెన్షనర్లు పైసా చెల్లించాల్సిన అవసరముండదు. స్టంట్లకు ఇంత మొత్తమే చెల్లించాలని విధించిన ప్యాకేజీలు రద్దయినట్లే. ప్రీమియం విధానంపై కొంతమంది అధికారులు సూచనలు చేసినా సీఎం పట్టించుకోలేదు. ఉద్యోగుల నుంచి పైసా తీసుకోవద్దని, ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఉచిత వైద్యం కారణంగా ప్రభుత్వంపై ఏటా దాదాపు 400 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా. ఆరు నెలల తర్వాత సమీక్ష! ఈ పరిమితి లేని నగదు రహిత వైద్య విధానం ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని సమీక్షించనుంది. ఆలోగా ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను రూ. 100 కోట్ల చొప్పున వెచ్చించి అభివృద్ధి చేయనుంది. నిలోఫర్ ఆసుపత్రిని రూ. 30 కోట్లతో, మిగతా ఆసుపత్రులకు రూ. 25 కోట్ల చొప్పున వెచ్చించి అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఉద్యోగ నేతలకు సీఎం కేసీఆర్ తెలియజేసినట్లు సమాచారం. ఆరు నెలల తర్వాత ఉద్యోగులు, పెన్షనర్లంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడాన్ని తగ్గించాలని, తద్వారా 60 శాతం వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందేలా చర్యలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక ్టర్ రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతోపాటు ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, వెంకట్రెడ్డి, విఠల్, చంద్రశేఖర్గౌడ్, మధుసూదన్రెడ్డి, మమత, హర్షవర్ధన్రెడ్డి, రాజిరెడ్డి, మణిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలన్నీ హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నాయి. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తనది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వంగా కేసీఆర్ నిరూపించారు. ఏ రాష్ట్రంలో లేని ఆరోగ్య విధానాన్ని తెచ్చారు. ఉద్యోగులపై సీఎంకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజా సేవలో సర్కారుకు అండగా ఉంటాం. ఆరు నెలల్లో రాష్ర్టంలో పాలనను దేశానికే ఆదర్శమయ్యేలా చేస్తాం. పీఆర్సీ కూడా ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. సర్వీసు రూల్స్పై ఉద్యోగ సంఘాల తరఫున ప్రతిపాదనలు అందజేస్తాం. గత ప్రభుత్వాలు తేల్చనేలేదు: టీజీవోల సంఘం చైర్మన్ శ్రీనివాస్గౌడ్ హైల్త్ కార్డులపై గత ప్రభుత్వాలు 42 సార్లు సమావేశాలు పెట్టినా తేల్చలేదు. ఉద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోలేదు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ స్పందించి.. నగదు రహిత, పరిమితి లేని వైద్యం అందించేందుకు అంగీకరించారు. ఉద్యోగుల ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. ఏ జబ్బుకైనా వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. సర్కారు ఆదాయం పెంచడంలో ఉద్యోగులంతా భాగస్వాములవుతారు. ఎయిడెడ్ టీచర్లకూ సీఎం హామీ: పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఎయిడెడ్ టీచర్లకు కూడా హెల్త్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సీఎం ఆకాంక్షల మేరకు విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులంతా కృషి చేస్తారు. ఇందుకు రాష్ర్టంలోని లక్షన్నర మంది టీచర్లు పాటుపడతారు. సర్వీసు రూల్స్లో మార్పులు: టీ-ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ ఉద్యోగులకు అమలు చేస్తున్న బ్రిటీష్కాలం నాటి సర్వీసు రూల్స్ మార్పునకు చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ప్రతిపాదనలతో రమ్మని చెప్పారు. నిబంధనలన్నీ తొలగించి ఉద్యోగులు, పెన్షనర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన ఘనత కేసీఆర్దే. -
టీచర్ల సమస్యలపై రాజీలేని పోరు
ఒంగోలు వన్టౌన్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాజీలేని పోరాటం చేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమమే ధ్యేయంగా ఫెడరేషన్ పనిచేస్తోందన్నారు. ఆదివారం స్థానిక మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో జాలిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, డైట్ అధ్యాపకుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే డీఎస్పీ ప్రకటించాలని జాలిరెడ్డి కోరారు. పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానానికి బదులుగా పాఠశాలల పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఓబుళపతి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 60 శాతం ఫిట్మెంట్తో వెంటనే పీఆర్ సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్కార్డులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 398 రూపాయల నిర్ణీత వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి కే ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూడా రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలని కోరారు. వైఎస్సార్ టీఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అశోక్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్-2 భాషా పండితులు, వ్యాయామోపాధ్యాయుల పోస్టులను స్కూలు అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. హుదూద్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజానీకాన్ని ఆదుకునేందుకు వైఎస్సార్ టీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు విరివిగా విరాళాలు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. సంఘ జిల్లా కన్వీనర్ డీసీహెచ్ మాలకొండయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్ టీఎఫ్ గౌరవ సలహాదారు ఎస్ రామచంద్రారెడ్డి, గాయం లక్ష్మీరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మాలకొండారెడ్డి, ప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
మొద్దు నిద్ర వదిలిస్తా
కనీస అవసరాలు తీర్చని ప్రభుత్వం ఎవరూ పట్టించుకోకపోయినా నేనున్నా తుపాను బాధితులకు వైఎస్ జగన్ భరోసా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటన సాక్షి, విశాఖపట్నం:‘సూరీడమ్మా..పోలమ్మా.. జోగమ్మా..పరసన్న.. అంతా కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. తుపాను వచ్చి నాలుగు రోజులైంది. ఇప్పటికీ బాధితులకు ప్రభుత్వం తిండి, గుడ్డ, నీరు ఇవ్వలేకపోతోంది. ఎవరు పట్టించుకున్నా. పట్టించుకోకపోయినా మీకు నేనున్నాను. మీ కు న్యాయం జరిగేలా చూస్తాను’ అని బాధితులకు వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్, పెదజాలరిపేట, పెద్దగదిలి, చిన్నగదిలి ప్రాంతాల్లో గడపగడపకు వెళ్లి బాధితుల గోడు విన్నారు. జగన్ రాకతో ప్రజలు ధైర్యం తెచ్చుకున్నారు. ఇల్లు కూలిపోయి, వాహనాలు పాడైపోయి, బోట్లు మునిగిపోయి ఉపాధి కోల్పోయామని, పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు, రేషన్కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా గంగలో కలిసిపోయాయని కన్నీరుమున్నీరయ్యారు. బాబు అయిదు నిమిషాలైనా లేడు ఉదయం ఫిషింగ్ హార్బర్కు చేరుకున్న జగన్ పోర్టులో ఎండు చేపలు అమ్ముకుంటూ బతుకుతున్న పుక్కళ్ల సత్యవతి, కొమరు అప్పాయమ్మ, పైడిపల్లి కాసులమ్మలను పరామర్శించారు. తుపానుకు బోట్లు కొట్టుకుపోయాయని, చేపలు పాడైపోయాయని వారు జగన్కు తెలిపారు. ‘చేపలు పోయాయి కదమ్మా ఎవరైనా వచ్చి చూశారా, ఏమైనా ఇచ్చారా’ అని జగన్ వారిని అడిగారు. ఎవరూ మీ ఇవ్వలేదని, చంద్రబాబు వచ్చి ఐదు నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయారని విలపించారు. అక్కడి నుంచి ముందుకెళ్లిన జగన్ సముద్రంలో మునిగిపోయిన బోట్లను పరిశీలించారు. నష్టపరిహారం కోసం ఒత్తిడి తెస్తా ప్రతి సారీ తుఫాన్లు వచ్చి ‘వెసల్స్’ మునిగిపోతున్నా తొలగించడం లేదని, వాటివల్లే తమ బోట్లు దెబ్బతింటున్నాయని మత్స్యకార సంక్షేమ నేతలు, సోనాబోటు యూనియన్ అధ్యక్షుడు పీసు అప్పారావు జగన్ వివరించారు. తమ బోట్లకు బీమా చేయించాలంటే ఏటా రూ.60 వేలు కట్టాల్సి వస్తుందని, అంత వ్యాపారం లేకపోవడంతో ఎవరూ బీమా చేయించడం లేదని వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా సోనా బోటుకు రూ.25లక్షలు, ఫైబర్బోటుకు రూ.2.5 లక్షలు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తానని జగన్ వారికి ధైర్యం చెప్పారు. దెబ్బతిన్న బోటు మరమ్మతులకు రూ.50 వేలు, వలలకు రూ.20 వేలతో పాటు ప్రతి కుటుంబానికి తక్షణమే రూ.5 వేలు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. బోట్లే ఆధారంగా జీవిస్తున్న 20వేల మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వారి వృత్తిని కాపాడాలన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మీ అందరితో కలిసి రోడ్డుమీద కూర్చొని ధర్నాలు చేస్తానని, అధైర్య పడొద్దని చెప్పారు. కొవిరి నాయుడు అనే యువకుడు తాను బోటు కోల్పోయానని వివరించాడు. అక్కడి నుంచి జగన్ వెనుదిరిగి వెళ్తూ మార్గమధ్యంలో కరుకు ఎర్రమ్మ అనే వికలాంగ వృద్ధురాలి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెదజాలరిపేట (వాల్తేరు డిపో) చేరుకున్న జగన్ అక్కడ ప్రజల నరకాన్ని కళ్లారా చూశారు. కానూరి సరస్వతి ఇంట్లోకి వెళ్లి కూలిపోయిన పైకప్పును చూశారు. భర్త, ముగ్గురు పిల్లలు, అత్త ఆడపడుచుతో ఒకే ఇంట్లో ఉంటున్నానని, ఇప్పుడు అది కూడా పోయిందని ఆమె కన్నీటి పర్యంతమైంది. తమ వందలాది బోట్లు, వలలు పోయాయని, జనం ఆకలితో అలమటిస్తున్నారని కులపెద్ద తెడ్డు పరసన్న జగన్కు వివరించారు. ‘బాబూ నాకు రేషన్ కార్డులేదు, ఇల్లులేదు, ముగ్గురు పిల్లలను చదివించాలనుకుంటే ముందు ఫీజు లేదని ఇప్పుడు కట్టమంటున్నారు. ఎంతమంది కాళ్లు పట్టుకున్నా ఫలితం లేదు’ అని తాటిపూడి పైడిరాజ్ అనే మహిళ తన వెతలను వివరించింది. మా జీవితాలే పోయాయంటూ ఇంటర్మీడియేట్ విద్యార్ధిని వెగలపు భార్గవి జగన్ వద్ద వాపోయింది. గెలిచినోళ్లు పట్టించుకోలేదు ‘మేం ఓట్లేసి గెలిపించినోళ్లు మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు వచ్చారు నాయనా’ అని సొల్లు పోలమ్మ కృతజ్ఞతను వ్యక్తం చేసింది. మొబైల్ బండిలో మెషీన్ పెట్టుకుని పాత బట్టలు కుట్టుకుని జీవించే తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఇల్లు లేదని చోపేటి సూరీడమ్మ విలపించింది. జోగులు అనే వృద్ధుడు బోట్లు పోయాయని చెప్పడంతో ‘జోగులు తాతా..మనం ఇద్దరం ప్రతిపక్షంలోనే ఉన్నాం..పోరాటం చేస్తేనే ఏమైనా సాధించుకోగలం. కనీసం జగన్ వస్తున్నాడని తెలిసి మిమ్మల్ని ప్రభుత్వం పట్టించుకుంటుందనే నేను వచ్చాను. మన ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక ఒక్క నెలలో మీ సమస్యల్ని పరిష్కరిద్దాం’ అని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ తరపున ఆదుకుంటా మధ్యాహ్నం పెద్దగదిలి, చిన్నగదిలి ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. సింహగిరికాలనీలో ప్రతి ఇంటికి వెళ్లారు. తొంభై ఏళ్ల రెడ్డిపైడితల్లమ్మ తన పింఛన్ తీసేశారని జగన్కు చెప్పుకుంది. తనకు తండ్రి లేడని, ముగ్గురు పిల్లలతో మా అమ్మ కష్టాలు పడుతోందని తొమ్మిదో తరగతి చదువుతున్న ఎం.సుధ జగన్కు తెలిపింది. కర్రి భవాని అనే పద్నాలుగేళ్ల బాలిక, కండేల లక్ష్మి అనే మహిళ చెవిటి, మూగ బాధితులని తెలిసి జగన్ చలించిపోయారు. వారిని పార్టీ తనపున అన్ని విధాలా అదుకుంటామని భరోసా ఇచ్చారు. పెదగదిలి సాయిబాబా గుడి వద్ద ఇంటి గోడకూలి చనిపోయిన కుమారి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. కొండలపైకి ఇరుకు సందుల గుండా కాలినడకన వెళ్లి అందరితో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని చూసి వారి కష్టాలు తెలుసుకున్నారు. రాత్రి అంధకారంలోనూ జగన్ పర్యటించి నగరానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శు లు ధర్మాన ప్రసాదరావు, గొల్లబాబూరావు, తలశిల రఘురాం, నియోజక వర్గ సమన్వయకర్తలు కోలా గు రువులు, వంశీకష్ణ, చొక్కాకుల వెంకట్రావు, కర్రి సీతారాం, తిప్పల నాగిరెడ్డి, మళ్ల విజయప్రసాద్, ఉమాశంకర్ గణేష్, పార్టీ నేతలు తైనాల విజయకుమార్, హ నోక్, సత్తి రామకష్ణారెడ్డి, కోరాడ రాజబాబు,కొయ్యా ప్రసాదరెడ్డి, రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు హెల్త్కార్డులు మరింత జాప్యం
అమలుకాని ఏపీ సీఎం హామీ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్కార్డుల వ్యవహారం ‘అప్పు రేపు’లా తయారైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే హెల్త్కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశంపార్టీ మాటమార్చింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇస్తామని చెప్పినా వాయిదా పడింది. ఆ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... సెప్టెంబర్ 1 నుంచి హెల్త్కార్డుల పథకాన్ని అమలు లుచేస్తామని ప్రకటించారు. అదీ దాటి ఇప్పుడు దసరాకు అంటున్నారు. దసరాకైనా వస్తాయనే నమ్మకం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ ధరలకు అంగీకరించని ఆసుపత్రులు ఉద్యోగులకు చికిత్స గరిష్ట పరిమితిని రూ. 2 లక్షలుగా ప్రభుత్వం నిర్ధారించింది. పరిమితి దాటినా చికిత్స ఆగదని, అవసరమైన పక్షంలో కేసును బట్టి పరిమితి పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనికి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మార్చడానికి రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఈ పథకం కింద గరిష్ట చికిత్స వ్యయా న్ని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది.ఉద్యోగులకు గరిష్ట పరిమితిని రూ. 2 లక్షలకు మించి పెంచడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. వారికీ ఆరోగ్యశ్రీ ధరల్లోనే చికిత్స అందించాలనే ప్రభు త్వ ప్రతిపాదనకు కార్పోరేట్ ఆసుపత్రులు అంగీకరించలేదని సమాచారం. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడితే.. సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపట్ల విస్మయం వ్యక్తమవుతోంది. -
అక్టోబర్ 2 నుంచి 9 గంటల విద్యుత్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో 7 గంటలపాటే విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం శాసనమండలిలో ప్రకటించిన 24 గంటలు గడవకముందే అక్టోబర్ 2 నుంచి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ ఇస్తామని శుక్రవారం శాసనసభలో వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. వ్యవసాయ పద్దుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇకపై భూములకూ హెల్త్కార్డులు ఇస్తామని, పేదలకు ఉచితంగా వైద్యం అందించినట్టే భూములకు ఇచ్చే హెల్త్కార్డుల ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు.. : కేఈ ఇకపై.. భూములను ఎక్కడి నుంచైనా రిజిస్టర్ చేయించుకునేలా చర్యలు చేపట్టినట్టు రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. దీనికోసం వెబ్ల్యాండ్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖకు, రెవెన్యూ శాఖకు మధ్య అనుసంధానం చేసి, రిజిస్ట్రేషన్ చేసిన 10 నిముషాల్లో రెవెన్యూ శాఖకు వివరాలు తెలిపే విధంగా చేస్తామన్నారు. రెవెన్యూ శాఖ పద్దుపై ఆయన సభ్యుల ప్రశ్నలకు సభలో సమాధానమిచ్చారు. -
15 నుంచి ఉద్యోగులకు హెల్త్కార్డులు
ఉద్యోగ సంఘాల జేఏసీకి ఏపీ సీఎం చంద్రబాబు హామీ మిగతా డిమాండ్ల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్ కార్డుల పథకాన్ని ఈ నెల 15 నుంచి అమల్లోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తనను కలసిన ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. మిగతా డిమాండ్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. హెల్త్కార్డులు మినహా మిగతా వాటి పరిష్కారానికి వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తానని, సమస్యలన్నీ ఉపసంఘానికి చెప్పుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి బృందం శనివారం ముఖ్యమంత్రితో భేటీ అయింది. జేఏసీ చైర్మన్ అశోక్బాబు, సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ చంద్రశేఖరరెడ్డి, కో-చైర్మన్లు కత్తి నరసింహారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, రఘురామిరెడ్డి, కమలాకరరావు, ఉపాధ్యక్షులు రాయుడు అప్పారావు, బండి శ్రీనివాసరావు, మహిళా నేతలు రత్న, తులసీరత్నం తదితరులు ప్రతినిధి బృందంలో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని సమావేశానికి హాజరయ్యారు