hostels
-
హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
-
విద్యార్థులకు తగ్గట్టు టాయిలెట్లు ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సర్కార్ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న వారంతా పేద కుటుంబాలకు చెందిన చిన్నారులని, వారి కోసం మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. వసతి గృహాల్లో పరుపులు, బెడ్షీట్లు, టవల్స్ అందించాలని, పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్యకు తగినట్లు టాయిలెట్లు, బాత్రూమ్లు నిర్మించాలని సూచించింది. వీటన్నింటిపై జనవరి 22లోగా స్థాయీనివేదిక అందజేయాలంటూ విచారణను వాయిదా వేసింది.ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, ప్రైవేట్ బడుల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ 2023లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులు ఖైదీలుగా ఉంటున్నారన్నారు. వారికి అందించే సౌకర్యాల విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని చెప్పారు. విద్యార్థులకు కల్పించాల్సిన వసతులపై ఆయన ఓ చార్ట్ను ధర్మాసనానికి సమర్పించారు. దీనికి ధర్మాసనం న్యాయవాదిని అభినందిస్తూ, వీటిని వీలైనంత త్వరగా కల్పించేలా చూడాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్ఖాన్కు సూచించింది. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏఏజీ చెప్పారు. ధర్మాసనం పేర్కొన్న అంశాలివీ... » ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు పరుపులు, దుప్పట్లు, బెడ్షీట్లు, దిండు, దోమతెర, కాటన్ టవల్స్ అందించాలి. » విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీటిని మాత్రమే సరఫరా చేయాలి. » నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ గైడ్లైన్స్ ప్రకారం మెనూ ఇవ్వాలి. » విద్యార్థులకు సైకియాట్రిస్ట్/కౌన్సిలర్ అందుబాటులో ఉండాలి. -
ఆహార నాణ్యతపై టాస్క్ఫోర్స్!
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలు, హాస్టళ్లు, ఆస్పత్రుల్లో పంపిణీ చేస్తున్న ఆహారం నాణ్యత పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మొదలు... సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాల యాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభు త్వ వైద్య కళాశాలల్లో అందించే ఆహారం నాణ్య తపై నిఘా, పర్యవేక్షణ కోసం టాస్క్ఫోర్స్ కమి టీని ఏర్పాటు చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖతోపాటు గిరిజన, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలు, వైద్యారోగ్య శాఖ పరిధి లోకి వచ్చే అన్ని విద్యా సంస్థల్లో అందించే ఆహా రం నాణ్యతను పర్యవేక్షించే బాధ్యతను ఈ కమి టీకి అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సభ్యులుగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ లేదా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సంబంధిత విద్యా సంస్థ ఉన్నతాధికారి/ అదనపు సంచాలకుడు, విద్యా సంస్థ జిల్లా స్థాయి అధికారి (డీఎస్డబ్ల్యూఓ/ డీటీడబ్ల్యూఓ/డీబీసీడబ్ల్యూఓ/ డీఈఓ) తదితరులుంటారు. ఈ కమిటీ నిర్దేశించిన విద్యా సంస్థలను సందర్శించి ఆహార భద్రత చర్యల ను పరి శీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏదైనా సంస్థలో లోటుపాట్లను గుర్తిస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు బాధ్యులపై చర్యల కోసం సిఫార్సు చేయాలని సూచించింది.విద్యా సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు, పర్యవేక్షక అధికారిటాస్క్ఫోర్స్ మాత్రమేకాకుండా విద్యా సంస్థల స్థాయిలో ఫుడ్ సేఫ్టీ కమిటీలను, పర్యవేక్షక అధికారిని సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి సంబంధించిన మార్గదర్శ కాలను జారీ చేసింది. విద్యా సంస్థల్లో మెరుగైన, బలవర్థకమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. కలుషిత ఆహారంతో కలిగే అనా రోగ్య సమస్యలు, తదుపరి పరిణామాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిటీలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.» ఫుడ్ సేఫ్టీ కమిటీలో విద్యా సంస్థ ప్రధానోపా« ద్యాయుడు/ ప్రిన్సిపల్/ వార్డెన్తోపాటు మరో ఇద్దరు సిబ్బంది సభ్యులుగా ఉంటారు.» ఈ కమిటీ సభ్యులు ప్రతిరోజు భోజనం తయారు చేసే ముందు స్టోర్ రూమ్, వంట గదిని తనిఖీ చేయాలి. తర్వాత వంటగది నిబంధనలకు అనుగుణంగా నాణ్యత, ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధారించాలి.» వంట వండిన తర్వాత ఆహార నాణ్యతను కమిటీ సభ్యులు రుచి చూసి పరిశీలించిన తర్వాతే విద్యార్థు లకు అందించాలి. ప్రతిరోజు ఈ బాధ్యతలను విధిగా పూర్తి చేయాలి.» త్వరలో నోడల్ డిపార్టుమెంట్ యాప్ను తయారు చేస్తుంది. అప్పటి నుంచి తనిఖీలకు సంబంధించిన ఫోటోలను, ఇతర సమాచా రాన్ని యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.» ఇక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి విద్యాసంస్థకు ప్రత్యేకంగా ఒక పర్యవేక్షక అధికారికి నియమి స్తారు. ఈ పర్యవేక్షక అధికారి ప్రతిరోజు భోజనం వండే ముందు, తర్వాత తనిఖీ చేస్తారు. అక్కడి పరిస్థితిని చిత్రాలు తీసి జిల్లా కలెక్టర్/ సంబంధిత ఉన్నతాధికారికి సమర్పిస్తారు.» వీటన్నింటికి సంబంధించి తక్షణమే చర్యలు తీసు కోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనంమల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ మల్హర్ మండలం మల్లారం కస్తూర్భా గాంధీ పాఠశాలను గురువారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. బియ్యం, నిత్యావసర సరకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి అల్పాహారం, భోజన సదుపాయాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో ఆహార నాణ్యత పరిశీలనకు ప్రతీ శుక్రవారం తహసీల్దార్, ఎంపీడీవోలు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
తెలంగాణ వ్యాప్తంగా హాస్టళ్లలో అక్రమాలపై ఏసీబీ సోదాలు
-
చెల్లెలి హాస్టల్ కష్టాలు చూసి...‘జోలో’ స్నేహా చౌదరి సక్సెస్ స్టోరీ
టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, ప్రత్యామ్నాయాల అన్వేషణ, క్లిష్ట సమస్యల పరిష్కారం ఇలాంటి విషయాల్లో మహిళలు ముందుంటారు. రంగం ఏదైనా సరే.. బుర్రలో ఆలోచన వచ్చిందంటే.. దానివైపు దృష్టి పెట్టారంటే.. ‘తగ్గెదేలే’ అన్నట్టు దూసుకుపోతారు. అలాంటి వారిలో కోజికోడ్కు చెందిన స్నేహా చౌదరి ముందు వరసలో ఉంటారు. ఇంతకీ స్నేహ సక్సెస్ జర్నీ ఏంటి? తెలుసుకుందాం రండి! స్నేహ బెంగళూరులోని RV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఇంజనీరింగ్ పట్టాను, కోజికోడ్లో ఐఐఎం పూర్తి చేశారు. డెలాయిట్, ఒరాకిల్ వంటి ప్రముఖ గ్లోబల్ కంపెనీలలో స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ కన్సల్టెంట్గా 10 సంవత్సరాల అనుభవం ఉంది. కానీ వీటికి భిన్నంగా, ప్రత్యేకంగా నిలవాలని భావించారు. వృత్తి జీవితంలో ఎదురైన సవాళ్లతోపాటు, వ్యాపార కుటుంబం నుండి వచ్చిన స్నేహ తానే ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. జోలో స్టే (ZoloStay) అనే సంస్థను స్థాపించారు. అయితే దీని వెనుక పెద్ద కథేఉంది. స్నేహ సోదరి ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లినపుడు వర్కింగ్ విమెన్ హాస్టల్స్, పేయింగ్ గెస్ట్ వసతులు వెతుక్కోవడంలో కొన్ని సవాళ్లు ఎదురైనాయి. వాటి తీరుపై ఒక అవగాహన వచ్చింది. వీటితోపాటు ఆల్లైన్ ద్వారా ఆయా సేవలను చేరుకోవడం ఎలా అనే దానిపై ఎదురైన ఇబ్బందులే దీనికి నాంది పలికాయి. ‘‘నిజాయితీగా ఉండటం అనేది సాధికారతకు కీలకమైన అంశం. ప్రత్యేకించి మహిళా ఉద్యోగుల్లో తప్పులను ఎత్తి చూపడం కంటే వారితో మాట్లాడుతూ, దాన్నుంచి నేర్చుకోవాలి. సహోద్యోగులతో అభిప్రాయాలను పంచుకోవడం అంటే వృత్తిపరమైన అభివృద్ధిని మెరుగుపరచే మార్గాల అన్వేషణే’’- స్నేహ చౌదరి . అలా మహిళలకు ఫుడ్ అండ్ వసతికి సంబంధించిన ఆన్లైన్ ప్లాట్ఫారమ్ జో స్టేస్ను ప్రారంభించారు. రుచికరమైన , ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, సరసమైన ధరలో, సౌకర్యవంతైన సరసమైన వసతిని అందించే లక్ష్యంతో, ఇషా చౌల్క్దహరి, డా. నిఖిల్ సిక్రి, అఖిల్ సిక్రి భాగస్వామ్యంతో 2015లో జోలో స్టేకు శ్రీకారం చుట్టారు. 40 మంది మహిళల సమక్షంలో అధికారికంగా ప్రారంభమై, అంచెలంచెలుగా విస్తరించి కో-లివింగ్ స్పేస్ బ్రాండ్గా ఖ్యాతి గడించింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా గురుగ్రామ్, హైదరాబాద్, కోటా, చెన్నై, ముంబైతో సహా భారతదేశంలోని 10+ నగరాల్లో విశేష సేవలందిస్తోంది. రూ.800 కోట్లకు పైగా టర్నోవర్తో ప్రస్తుతం జోస్టేస్ అతిపెద్ద కో-లివింగ్ స్టార్టప్లలో ఒకటిగా నిలిచింది. అటు స్నేహ కూడా దేశంలోని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరిగా అవతరించారు. అలాగే డెవిల్ ఈజ్ ఇన్ డిటైల్ మాటకు నిలువెత్తు సాక్ష్యంగా edtech స్టార్టప్ను కూడా స్థాపించారు. దృఢ సంకల్పం , కృషి ఉంటే సాధించలేదని ఏమీలేదు అంటారు స్నేహ. అంతేకాదు కమ్యూనిటీ క్రియేషన్ ఆలోచనను ప్రోత్సహిస్తూ వీరి హాస్టల్స్లో ఉండే వారి మధ్య ,జోలో ప్రీమియర్ లీగ్ ద్వారా చెస్,క్యారమ్ ఛాంపియన్షిప్లు నిర్వహిస్తుంది. ఇంకా పుట్టినరోజులు, పండుగలు ,ఇంటిరీయర్ డెకరేషన్, హౌస్ కీపింగ్, రిపేర్లు, మెయింటెనెన్స్, ఫుడ్ సర్వీస్, వైఫై, DTH వంటి సర్వీసులు కూడా అందిస్తుంది. లాక్-ఇన్లు, డిపాజిట్లు, బ్రోకరేజీలు లాంటి సమస్యలేవీ జోలో ఉండవు. అంతా ఆన్లైనే. ‘జోలో దియా’ ఆవిష్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం 'మహిళల్లో పెట్టుబడి పెట్టండి: ప్రగతిని వేగవంతం చేయండి',థీమ్ ఆధారంగా పూర్తిగా మహిళలచే నిర్వహించే ఒక పీజీ జోలోదియాను స్టార్ట్ చేసింది. మహిళలు తమ కలలు , ఆకాంక్షలను నిర్భయంగా కొనసాగిస్తూ, సాధికారత సాగిస్తారనే తమ నమ్మకానికి జోలో దియా నిదర్శనంగా నిలుస్తోందని జోలోస్టేస్ సహ వ్యవస్థాపకురాలు స్నేహా చౌదరి పేర్కొన్నారు. 2015లో కేవలం నెలకు రూ. 5000 ప్రారంభమై బెంగళూరు, హైదరాబాద్, అత్యంత ఖరీదైన ఏరియాలో కార్ పార్కింగ్, రూఫ్టాప్ రెస్టారెంట్ ,జిమ్ లాంటి సౌకర్యాలతో ఉండే ప్రైవేట్ గదులు నెలకు రూ. 36వేలకు చార్జ్ చేసే స్థాయికి చేరింది. -
‘ఈనాడు’ అవాస్తవ ఆరోపణలు
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గర్భిణుల వసతి గృహాల నిర్వహణపై గురువారం ఈనాడు పత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వసతి గృహాలకు గర్భిణులు ప్రసవ సమయానికి 7 రోజుల ముందు చేరుకుంటారని.. వారికి రోజుకు రూ.300 ఖర్చుతో ఉచిత ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపింది. సాలూరు పరిసర ప్రాంతాల్లోని గర్భిణుల కోసం సాలూరులో వసతి గృహం ఏర్పాటు చేశారని, ఇందులో సేవలందించేందుకు ఏఎన్ఎంలను నియమించారని పేర్కొంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గుమ్మ లక్ష్మీపురంలోనూ ఓ వసతి గృహం ఉందన్నారు. ఈ రెండింటి నిర్వహణ కోసం 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,500 నిధులు అందించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.3,75,000 అందించామని తెలిపింది. రాష్ట్రంలో గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జనని శిశు సురక్షా కార్యక్రమం కింద గర్భిణులకు ఉచిత వైద్య సేవలు, మందులు, వైద్య పరీక్షలు, రక్త మార్పిడి, ఆహారం, రిఫరల్, రవాణా ఖర్చుల నిమిత్తం అన్ని ప్రభుత్వ వైద్యశాలలకు రూ.29.09 కోట్లు విడుదల చేశామని తెలిపింది. దీంతోపాటు గర్భిణులకు 108 అంబులెన్స్లు, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొంది. -
సంక్షేమ హాస్టళ్లు ఇక మరింత క్షేమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు(హాస్టల్స్)లో విద్యార్థులు మరింత క్షేమంగా ఉండేలా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సన్నాహక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో 3,783 హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. హాస్టళ్లలో ఐదు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ‘సమగ్ర ప్రామాణిక ఆపరేటివ్ విధానం (ఎస్ఓపీ)ని అమలులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల, జువైనల్ సంక్షేమ శాఖలకు చెందిన వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య, ఆహారం, ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించింది. అవసరమైన మార్గదర్శకాలను అన్ని సంక్షేమ శాఖలకు ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలోని సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా హాస్టళ్లను పర్యవేక్షించేలా క్యాలెండర్ (టైమ్ టేబుల్)ను నిర్దేశించింది. వసతి గృహాల్లో విద్యార్థులకు రక్షణ, భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలోను అప్రమత్తం చేసింది. సురక్షితమైన ఆహారం, నీరుతోపాటు ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. హాస్టళ్ల పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలున్న పక్షంలో వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మార్గదర్శకాలు ఇవీ.. ► వసతి గృహాలకు నిరంతరం అందుబాటులో ఉండేలా సిబ్బంది స్టాఫ్ క్వార్టర్స్లో ఉండాలి. ఒకవేళ క్వార్టర్స్ అందుబాటులో లేకపోతే సమీపంలోనే నివాసం ఉండాలి. ► అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి సంబంధిత ఉద్యోగులు పూర్తి చిరునామాలు, ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్లను హాస్టల్ రిజిస్టర్, నోటీస్ బోర్డుల్లో ఉంచాలి. ► జాబ్ చార్ట్లోని విధుల పట్ల అలక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ► క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కచ్చితంగా హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షించాలి. ► అధికారులు, ప్రజాప్రతినిధులు, నిపుణులు, వ్యవస్థాపకులు ఎవరైనా హాస్టళ్లను సందర్శించినప్పుడు వారి వివరాలు, చర్చించిన అంశాలను విజిటర్స్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ► విద్యార్థులకు భోజన మెనూ, సౌకర్యాలు, కిచెన్ గార్డెన్, మరుగుదొడ్ల నిర్వహణ, సురక్షితమైన మంచినీరు, మెస్ కమిటీ, పేరెంట్స్ కమిటీ వంటి కీలక విషయాల్లో ప్రత్యేక దృష్టి సారించాలి. ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను సక్రమంగా వినియోగించుకుని ప్రతి నెల రెండో శనివారం ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించాలి. ► వారానికి ఒకసారి వైద్య ఆరోగ్య సిబ్బంది స్వయంగా హాస్టల్ విద్యార్థులు ప్రతి ఒక్కరిని పరీక్షించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. -
భయాందోళనలో హాస్టళ్ల విద్యార్థులు
-
మైసమ్మగూడలో నీట మునిగిన హాస్టల్స్
-
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్రూమ్లు సైఫాబాద్లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
సామాన్యులకు మరో షాక్.. పీజీ హాస్టళ్లపై జీఎస్టీ, ఇక బాదుడు షురూ!
శివాజీనగర(బెంగళూరు): ఇప్పటికే పలు రకాల భారాలతో అయ్యో అంటున్న సామాన్య ప్రజలకు మరో భారం పొంచి ఉంది. ప్రైవేటు హాస్టళ్లు (పీజీ)ల బాడుగ ఫీజుకు జీఎస్టీ సెగ తగలనుంది. విద్యార్థులు, బ్యాచిలర్లు, ఒంటరి ఉద్యోగులకు ఆదరువుగా పీజీలు ఉండడం తెలిసిందే. నగరంలో వేలాది మంది పీజీల్లో వసతి పొందుతూ వృత్తి ఉద్యోగాలను, చదువులను కొనసాగిస్తున్నారు. కొత్త జీఎస్టీ నియమాల ప్రకారం రోజు బాడుగ రూ. వెయ్యి కంటే తక్కువ అయితే 12 శాతం జీఎస్టీ, వెయ్యి కంటే ఎక్కువైతే 18 శాతం జీఎస్టీ విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. బెంగళూరులోని జీఎస్టీ పీఠం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా బాడుగల్ని పెంచడం తప్పదని బెంగళూరు పీజీ యజమానుల క్షేమాభివృద్ధి సంఘం వెల్లడించింది. జీఎస్టీని వసతిదారుల నుంచే వసూలు చేస్తామని తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో పీజీల బాడుగ ఎక్కువగా ఉందని వసతిదారులు చెబుతున్నారు. చదవండి సైకో టెక్కీ.. ప్రియురాలిపై ఉన్మాదం.. -
ఎస్సీ హాస్టల్ ఉద్యోగుల వేతన సమస్యకు చెక్.. 411 మందికి గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు ఏళ్ల తరబడిగా ఎదుర్కొంటున్న వేతన సమస్యను రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున పరిష్కరించారు. ఇకపై వారు వేతనాలు సకాలంలో అందుకొనేలా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్(ఆప్కాస్)కు వారి సేవలను అనుసంధానం చేసారు. వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న 160 పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో వంటపని, పారిశుద్ధ్యం ఉద్యోగులుగా పని చేస్తున్న వారిలో 411 మందికి ప్రైవేటు సంస్థల ద్వారా వేతనాలను చెల్లించేవారు. అయితే, ఈ విధానంలో ఆ ఉద్యోగులకు వేతనాలు అందడం ఆలస్యం అవుతుండటంతో ఉద్యోగులు విధుల నుంచి తప్పుకుంటున్న కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అందుకే తమ వేతనాలు అందరితో పాటుగా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు తెలిపారు. కాగా, ఈ సమస్య మంత్రి మేరుగు నాగార్జున దృష్టికి రావడంతో వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం థర్డ్ పార్టీ విధానంలో పని చేస్తున్న ఈ ఉద్యోగుల సేవలను ప్రీ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఇదివరకే మంజూరైన పోస్టుల స్థానంలో ఉపయోగించుకోవాలన్నారు. అలాగే, వారి వేతనాలను ఆప్కాస్ ద్వారా ఆలస్యం లేకుండా ప్రతినెలా అందరితో పాటుగా చెల్లించాలిని అధికారులు ప్రతిపాదించగా మంత్రి.. ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డి దృష్టి తీసుకెళ్లారు. అనంతరం, ఈ ప్రతిపాదనపై సీఎం జగన్ ఆమోదముద్ర వేసారు. దీంతో, ఈ ఉద్యోగులు ఇప్పటి వరకూ వేతనాల కోసం పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. అదే విధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఉద్యోగులు లేని కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడే దుస్థితికి కూడా తెరపడింది. ప్రస్తుతం ఆప్కాస్కు అనుసంధానం చేసిన 411 మంది పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టల్ ఉద్యోగులలో 37 మందిని శ్రీకాకుళం, 52 మందిని విజయనగరం, 17 మందిని విశాఖపట్నం, 120 మందిని తూర్పుగోదావరి, 82 మందిని కృష్ణా,62 మందిని ప్రకాశం, 41 మందిని అనంతపురం జిల్లాలకు చెందిన హాస్టళ్లకు కేటాయిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తమ సమస్యను పరిష్కరించడంలో తమ కష్టాలు తీర్చిన సీఎం జగన్కు, చొరవ చూపిన మంత్రి మేరుగు నాగార్జునకు ఉద్యోగులు తమ ధన్యవాదాలు తెలిపారు. -
విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ మరో శుభవార్త
-
హైదరాబాద్లో విచ్చలవిడిగా హాస్టళ్లు, లాడ్జీలు.. పోలీసుల ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: ఎక్కడో నేరం చేసిన వాళ్లు నగరానికి వచ్చి తలదాచుకుంటున్నారు.. ఇక్కడ నేరం చేయడానికి వచ్చినవాళ్లూ కొన్నాళ్లు మకాం వేస్తున్నారు.. ఇలాంటి వారికి సిటీలో ఉన్న కొన్ని లాడ్జీలు, హాస్టళ్లు ఆశ్రయం కల్పిస్తున్నాయి. మరోపక్క ఏ హాస్టల్లో ఎవరు ఉంటున్నారు? వాళ్లు ఎక్కడి వాళ్లు, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు? ఇలా ఏ విషయమూ పోలీసులకు తెలియట్లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఎస్సార్నగర్ ఠాణా అధికారులు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కె.సైదులు ఆలోచన, కృషి ఫలితంగా కొన్ని రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుంది. గూగుల్ ద్వారా అందుబాటులోకి.. ప్రస్తుతం తుది మెరుగులు దిద్ది ఈ యాప్ను గూగుల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడానికి ఎస్సార్నగర్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. పోలీసు విభాగం అధీనంలో పని చేసే దీన్ని హాస్టళ్లు, లాడ్జీల నిర్వాహకులు తమ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఉన్న కేటగిరీల ఆధారంగా బాయ్స్, మెన్స్, ఉమెన్స్ హాస్టల్స్, లాడ్జీలను ఎంచుకుంటారు. బస చేస్తున్న వ్యక్తి పేరు, ఆధార్, ఫోన్ నంబర్లతో పాటు ఎక్కడ నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఏం చేస్తుంటాడు? గతంలో ఎక్కడ ఉండేవాడు? ప్రస్తుతం ఏ రూమ్లో ఉంటున్నాడు? తదితర వివరాలన్నీ నమోదు చేస్తారు. వీటితో పాటు అతడి ఫొటో, ఆధార్కార్డునూ క్యాప్చర్ చేసి అదే యాప్ ద్వారా సర్వర్లో నిక్షిప్తం చేస్తారు. ప్రతీ హాస్టల్, లాడ్జీ యజమాని ఈ వివరాలన్నీ యాప్తో సేకరించడం కచి్చతం చేస్తున్నారు. ఇది కేవలం ఒత్తిడి చేయడం ద్వారా కాకుండా యజమానులు, నిర్వాహకులకు వారంతట వారుగా వినియోగించేలా ఎస్సార్నగర్ పోలీసులు యోచించారు. ఓటీపీతో ఫోన్ నంబర్ వెరిఫికేషన్.. బస చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ యాప్లో ఎంటర్ చేసిన వెంటనే దానికి ఓటీపీ వెళ్తుంది. ఇది కూడా పొందుపరిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా యాప్ను డిజైన్ చేస్తున్నారు. ఫలితంగా నకిలీ ఫోన్ నంబర్లకు అడ్డుకట్ట వేయొచ్చు. ఈ యాప్నకు సంబంధించిన సర్వర్లో వాంటెడ్ వ్యక్తులు, పదేపదే నేరాలు చేసే వారి వివరాలతో కూడిన డేటాబేస్ను అనుసంధానించనున్నారు. ఎవరైనా బస చేయడానికి వస్తే... ఆ వివరాలు పొందుపరిచిన వెంటనే యాప్ దానంతట అదే అలర్ట్ ఇచ్చేలా సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నారు. విస్తరిస్తేనే పూర్తి స్థాయి ఫలితాలు... ఈ యాప్ ఎస్సార్నగర్ పోలీసుల చొరవతో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతానికి ఆ ఠాణా పరిధిలోని హాస్టళ్లు, లాడ్జీల్లో ఉంటున్న వారి వివరాలు తెలుసుకోవడానికి, బస చేసిన వ్యక్తి పూర్వాపరాలు గుర్తించడానికి, ఆ పరిధిలో వాంటెడ్ వ్యక్తులకు చెక్ చెప్పడానికి ఉపకరించనుంది. దీనివల్ల పూర్తి స్థాయి ఫలితాలు రావాలంటే మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా రాజధానిలోని మూడు కమిషనరేట్లకు ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ అమలును కచ్చితం చేయడంతో పాటు ప్రోత్సహించాల్సిన అవసరముంది. -
గంటసేపట్లో పునరుద్ధరించండి
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల కారణం చెప్పి ఉస్మానియా వర్సిటీలోని హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరాను ఆపడం సరికాదని.. గంటసేపట్లో పునరుద్ధ రించాలని అధికారులను హైకోర్టు ఆదే శించింది. అలా చేయని పక్షంలో రిజి స్ట్రార్ తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. వర్సిటీ అధికారులు దసరా సెలవులను తొలుత అక్టోబర్ 3 నుంచి 10 వరకు పేర్కొ న్నారు. తర్వాత 26 వరకు పొడిగిండంతో పాటు విద్యుత్, నీటి సరఫరా నిలి పేశారు. వీటిని పునరుద్ధరించేలా ఆదే శాలివ్వాలని కోరుతూ ఎల్ఎల్బీ విద్యా ర్థులు నెరెళ్ల మహేశ్గౌడ్తో పాటు మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించి లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచా రణ చేపట్టారు. పిటిషన్ తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్రెడ్డి వాదనలు వినిపించారు. ఎల్ఎల్బీ వి ద్యార్థులు, గ్రూప్–1 అభ్యర్థులు పరీక్ష లకు సిద్ధమవుతున్నారన్నారు. హాస్టళ్ల లో చదువుకుంటున్న విద్యార్థుల్లో చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థు లేనని వెల్లడించారు. వర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మరమ్మతులు చేయడం కోసం సరఫరా నిలిపినట్లు చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విద్యుత్, నీటి సరఫరా ను పునరుద్ధరించాలని ఆదేశించారు. -
హాస్టళ్లపై పోలీసుల ఫోకస్.. ఈ పది నిబంధనలు పాటించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల విడుదల ఒకవైపు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కార్యాలయాల పునఃప్రారంభం మరోవైపు.. దీంతో వసతి గృహాలకు పూర్వ వైభవం వచ్చింది. ఈ నేపథ్యంలో హాస్టళ్లలో నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సెప్టెంబర్ మొదటి వారంలో పెయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లు, వసతి గృహాలను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. భద్రతా నిబంధనలు పాటించని హాస్టళ్లకు నోటీసులు జారీ చేస్తారు. రెండు వారాల్లో ఆయా ఏర్పాట్లు చేయని వసతి గృహాలను సీజ్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్త్రీ, పురుష హాస్టళ్లకు కెమెరాలు ఒకటే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 1,200 వసతి గృహాలు ఉన్నాయని, వీటన్నింటినీ మహిళా భదత్రా విభాగం, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణా ఏదుల తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని ఎవరు నిర్వహిస్తున్నారనేది కూడా ముఖ్యమే అన్నారు. సైబరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో పురుషులు, మహిళల వసతి గృహాల యజమాని రెండు హాస్టళ్లలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, అయితే కానీ వాటి రికార్డ్ రూమ్ను మాత్రం జెంట్స్ హాస్టల్స్లోని పురుషులే నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామన్నారు. వెంటనే వాటిని సీజ్ చేసి, యజమానిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాచకొండలో 800 హాస్టల్స్.. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పరిధిలో 800 వసతి గృహాలు ఉన్నాయని మహిళా భద్రతా విభాగం పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెలలో ఆయా హాస్టళ్లను రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం లేకపోతే నోటీసులు జారీ చేస్తామన్నారు. 10 నిబంధనలు పాటించాల్సిందే... ►హాస్టల్ ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద యాక్సెస్ కంట్రోల్ ఫీచర్లుండాలి. ►కనీసం 5 అడుగుల ఎత్తు, అంతకంటే ఎత్తులో ప్రహరీ ఉండాలి. ►ప్రవేశం ద్వారం వద్ద 24/7 సెక్యూరిటీ గార్డు ఉండాలి. ►విజిటర్స్ రిజిస్టర్ మెయిన్టెన్ చేయాలి. ►ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరా ఉండాలి. ►అగ్నిప్రమాద నియంత్రణ ఉపకరణాలు ఉండాలి. ►నోటీసు బోర్డు, ప్రథమ చికిత్స కిట్, ఫిర్యాదులు, సూచనల బాక్స్ ఉండాలి. ►వసతి గృహంలో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు ఉండాలి. ►హాస్టల్లోని ప్రతి ఒక్కరికీ లాకర్ ఉండాలి. ►ధ్రువీకరించుకోకుండా ఎవరికీ వసతిని కల్పించకూడదు. -
ప్రత్యక్ష బోధన, హాస్టల్ వసతి కావాలి
కేయూ క్యాంపస్ (వరంగల్): కాకతీయ యూనివర్సిటీలో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన, హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, బీఎస్ఎఫ్, ఏబీఎస్ఎఫ్, ఏబీవీపీ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న వర్సిటీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హాస్టళ్ల మరమ్మతులు పూర్తికాగానే హాస్టల్ సౌకర్యంతోపాటు ప్రత్యక్ష విద్యాబోధన ఉంటుందని రిజిస్ట్రార్ విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. మరమ్మతులు తొలుత ఈ నెల 7నాటికి పూర్తి చేస్తామని, ఆ తర్వాత 16వరకు అని చెప్పారని, ఇంకా ఎన్నిరోజులు చేస్తారని రిజిస్ట్రార్తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ దశలో విద్యార్థులు పరిపాలనా భవనంలోనికి చొచ్చుకెళ్లేయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు ఆగ్రహంతో మొక్కల కుండీలను పగలగొట్టారు. రిజిస్ట్రార్ చాంబర్లోని కుర్చీలను ఎత్తిపడేశారు. చివరికి జూలై 4వతేదీ వరకు మరమ్మతులు పూర్తిచేసి హాస్టల్ వసతి కల్పిస్తామని, లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని రిజిస్ట్రార్ హామీనివ్వడంతో విద్యార్థులు అక్కడినుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకు ప్రయోగాత్మక పద్ధతిలో బయోమెట్రిక్ హాజరు ప్రక్రియను అమ లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షే మ శాఖల పరిధిలో 1,345 సంక్షేమ వసతిగృహాలున్నాయి. వీటి పరిధిలో 2.25 లక్షలమంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతిలో రికార్డు చేస్తున్నా రు. అయితే విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపు తూ బిల్లులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకుగాను ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తీసుకువస్తోంది. వారంలోగా క్షేత్రస్థాయి అవసరాలపై అంచనా హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు అమలు కోసం బయోమెట్రిక్ మెషీన్లు అవసరం. వీటిని ఆధార్ నంబర్ ఆధారంగా వేలిముద్రలు తీసుకునేలా తయారు చేశారు. ప్రతి హాస్టల్లో మెషీన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మెషీన్లను పరిశీలించి పనితీరును అంచనా వేయాలని, అవసరమైనచోట కొత్తవి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సర్వీసులు(టీఎస్టీఎస్) విభాగానికి ఇవ్వాలని నిర్ణయించి లేఖ రాసినట్లు తెలిసింది. -
కేయూ క్యాంపస్.. కామన్మెస్లో ఏం జరుగుతోంది?
సాక్షి, కేయూ క్యాంపస్(వరంగల్): కాకతీయ యూనివర్సిటీలోని కామన్మెస్లో క్యాజువల్ ఉద్యోగి (సూపర్వైజర్) నిరంజన్రెడ్డిపై హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ మంజుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనెల 16న కామన్మెస్కు వచ్చిన మంజుల ‘నిన్ను లా కళాశాల హాస్టల్కు ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ్నుంచి వెళ్లు గెటవుట్’ అంటూ నిరంజన్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నేను ఏం తప్పుచేశానో చెప్పాలి, నిరూపించాలి’ అని సూపర్వైజర్ నిరంజన్రెడ్డి హాస్టళ్ల డైరెక్టర్తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో క్యాజువల్ ఉద్యోగి కామన్మెస్ సూపర్వైజర్గా నిరంజన్రెడ్డి కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కామన్మెస్కు సంబంధించిన పలు విషయాలను హాస్టళ్ల సూపరింటెండెంట్, హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కేయూలోని ఓ నాన్బోర్డర్కు నిరంజన్రెడ్డికి మధ్య గతంలో కొన్ని విబేధాలున్నాయి. నాన్బోర్డర్లను కామన్ మెస్లోకి రాకుండా నిరంజన్రెడ్డి అడ్డుకుంటున్నట్లు, దీంతో ఓ నాన్బోర్డర్ కామన్మెస్ విధుల నుంచి నిరంజన్రెడ్డిని తొలగించాలని డైరెక్టర్తో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆ నాన్బోర్డర్ ఆగకుండా.. నీతో కామన్మెస్ విధుల నుంచి తొలగించి చిప్పలు కడిగిస్తానని అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే డైరెక్టర్ మంజుల కామన్ మెస్కు వచ్చి నిరంజన్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, లా కళాశాల హాస్టల్కు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పడం, ఆ తర్వాత నిరంజన్రెడ్డి విధులకు హాజరవకపోవడం ప్రస్తుతం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. -
8 నుంచి ఓయూ హాస్టళ్ల మూసివేత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్ వార్డెన్ శ్రీనివాస్రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత మెస్లను కూడా మూసివేస్తామని చెప్పారు. విద్యార్థులు హాస్టల్ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. పీజీఈసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ పీజీఈసెట్ ఈ నెల 6 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ పి.రమేష్బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ వరకూ ఆన్లైన్ రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చని, 9 నుంచి 11 వరకూ వెబ్ ఆప్షన్లు ఉంటాయని తెలిపారు. 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, 19వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువుంటుందని వెల్లడించారు. ‘డిగ్రీ వన్టైమ్ చాన్స్’ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గతేడాది అక్టోబర్లో జరిగిన డిగ్రీ కోర్సుల వన్టైమ్ చాన్స్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేశారు. బీఏ, బీబీఏ కోర్సుల బ్యాక్లాగ్, వన్టైమ్ చాన్స్ ఫలితాలు.. బీఎస్సీ, బీఏ ఒకేషనల్, బీకాం ఆనర్స్, వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించినట్లు కంట్రోలర్ శ్రీనగేశ్ తెలిపారు. (తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు) పీజీ ప్రవేశాల చివరి విడత వెబ్ కౌన్సెలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలును బుధవారం విడుదల చేశారు. సీపీజీఈటీ–2021లో భాగంగా ఈ నెల 6 నుంచి ఈ నెల 10వరకు చివరి విడత వెబ్కౌన్సెలింగ్ జరగనున్నట్లు కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఎన్సీసీ, దివ్యాంగులు, సీఏపీ అభ్య ర్థులు ఈ నెల 10న నేరుగా ఓయూ క్యాంపస్లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరి ఫికేషన్కు హాజరు కావాలన్నారు. ఈ నెల 12నుంచి 15వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని, 16న ఎడిటింగ్, 19న వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన అభ్యర్థుల చివరి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. సీట్లు లభించిన విద్యార్థులు 20 నుంచి 25 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. ఎస్టీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా సర్వేశ్వర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడ బ్ల్యూఆర్ఈఐఎస్) అదనపు కార్యదర్శిగా వి.సర్వేశ్వర్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వేశ్వర్రెడ్డి గిరిజన సంక్షేమ శాఖలో అదనపు సంచాలకుడిగా, టీసీఆర్టీఐ (గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ) సంచాలకుడిగా కొనసాగుతున్నారు. గిరిజన గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా పనిచేసిన నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్పై వెళ్లడంతో మంగళవారం రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అదనపు కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు సర్వేశ్వర్రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. -
సంక్షోభంలో ప్రైవేటు హాస్టళ్లు
సాక్షి, కరీంనగర్: కరోనా కారణంగా ప్రైవేటు వసతి గృహాలన్నీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. లక్షల్లో అప్పులు చేసిన నిర్వాహకులను మహమ్మారి ఘోరంగా దెబ్బతీసింది. ప్రవేశాలు నిలిచిపోయి, నిర్వహణ భారాన్ని మోయలేక, పరిస్థితి ఎప్పుడు కుదుటపడుతుందో తెలియక, ఇప్పటికే సగానికి పైగా ఈ వ్యాపారం నుంచి తప్పుకున్నారు. నాలుగు నెలలుగా అద్దె భారం భరించలేక, నష్టాలను తట్టుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన, పొందని వసతి గృహాలు దాదాపు 2వేలకు పైగా ఉన్నాయి. ఇందులో కరీంనగర్ పట్టణంలోని అధికంగా ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా శిక్షణ సంస్థలు మూతపడడంతో ఉద్యోగార్థులు, విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు చేసేదేమి లేక వ్యాపారాలు మూసివేస్తున్నారు. సామగ్రి విక్రయించాలన్నా కష్టమే వసతి గృహాలను ఏర్పాటు చేసినప్పుడు ఫర్నీచర్కు రూ.లక్షల్లో ఖర్చుపెట్టారు. వీటిని విక్రయించాలంటే కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒక మంచం, పరుపు కోసం కనీసం రూ.3500 నుంచి రూ. 5వేల వరకు వెచ్చించారు. విక్రయించడానికి ప్రయత్నిస్తే రూ.300–400 కూడా రావడం లేదు. మరోవైపు హాస్టళ్లపై ఆధారపడిన ఉద్యోగులు, వంట వారికీ ఉపాధి కరువైంది. కొన్ని వసతి గృహాల్లో రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు సరుకులు దెబ్బతిన్నాయి. వసతి గృహాలతో పాటు ప్రైవేటు స్టడీ కేంద్రాలను సిబ్బంది సీల్ చేయడంతో అందులో సామగ్రి, వస్తువుల నిర్వహణ లేకుండా పోయింది. -
హాస్టళ్లను ఖాళీ చేయాలని...
-
‘వసతి పాట్లు’పై నిశిత దృష్టి
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సత్వరమే స్పందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వసతిగృహాల వారీగా తక్షణ అవసరాలపై నివేదికలు కోరింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల మొదటి వారం నుంచి సంక్షేమ వసతిగృహాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థులు వచ్చేనాటికి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టడం, చిన్నపాటి నిర్మాణాలు పూర్తి చేయడం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తోంది. ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు... సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలపై జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు సమర్పించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సూచించాయి. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి.ప్రత్యేక ఫార్మాట్ను తయారు చేసిన అధికారులు...ఆమేరకు వివరాలు పంపాలని, వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశాయి. జిల్లాల వారీ ప్రతిపాదనలు ఈనెల 20వ తేదీలోగా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వసతి గృహాల్లో ప్రధానంగా విద్యుత్, నీటిసరఫరా, డ్రైనేజీ వ్యవస్థకు చెందిన సమస్యలున్నాయి. వీటితోపాటు దీర్ఘకాలికంగా పెయింటింగ్ వేయకపోవడంతో భవనాలు పాతవాటిలా కనిపిస్తున్నాయి. తాజా ప్రతిపాదనల్లో వీటికి సైతం ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. శాశ్వత భవనాల్లోని పనులకు రూ.25 కోట్లు అవసరమని అంచనా.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 1850 వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు 280 హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ముందుగా శాశ్వత భవనాలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అక్కడి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. అదేవిధంగా అద్దె భవనాల్లోని హాస్టళ్లకు మాత్రం యజమానితో సంప్రదింపులు జరిపి రంగులు, విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, నీటి సరఫరా, డ్రైనేజీ పనులకు మాత్రం ప్రభుత్వం నుంచి సాయం అందించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. శాశ్వత భవనాల్లో పనులకు దాదాపు రూ.25కోట్లు అవసరమవుతుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.ఈనెల 20లోపు జిల్లా స్థాయి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే వాటి ఆధారంగా రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యతా క్రమంలో తక్షణ అవసరాలకు తగినట్లు రాష్ట్ర కార్యాలయ అధికారులు ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. నెలాఖరులోగా దానికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే జూన్ రెండో వారం కల్లా పనులు పూర్తి చేయనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
సీజనల్ హాస్టల్స్ అవినీతి బట్టబయలు!
కోడూరు (అవనిగడ్డ): సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్స్లో జరుగుతున్న అవినీతి విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. ఎన్జీవోల పర్యవేక్షణలో సాగాల్సిన ఈ హాస్టల్స్ నిర్వహణ పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మండలంలోని విశ్వనాథపల్లి, కోడూరు, ఉల్లిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న హాస్టల్స్పై మంగళవారం విజిలెన్స్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది అకస్మిక దాడులు నిర్వహించారు. మూడు హాస్టల్స్లో విద్యార్థుల సంఖ్యకు రికార్డుల్లో ఉన్న సంఖ్యకు సంబంధం లేకపోవడంపై సీఐ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మెనూ ప్రకారం భోజనం వండకుండా ఇష్టమొచ్చినట్లుగా వంటలు సిద్ధం చేస్తున్నారని సీఐ గుర్తించారు. ప్రతి నెల ఇవ్వాల్సిన కాస్మెటిక్స్ చార్జీలను సైతం నిర్వాహకులు విద్యార్థినులకు ఇవ్వకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఇళ్ల వద్ద నుంచి వచ్చే డబ్బులతోనే కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నట్లు విద్యార్థులు అధికారులకు తెలిపారు. విద్యా వలంటీర్ల జీతాల్లోనూ చేతివాటం.. ప్రస్తుతం హాస్టల్స్లో ఉండే విద్యార్థుల సంరక్షణతో పాటు బోధన చేసేందుకు విద్యా వలంటీర్లను నియమించారు. వీరికి ప్రభుత్వం రూ.5 వేలు జీతం కూడా ఇస్తుంది. అయితే ఈ నగదును నిర్వాహకులు పూర్తిగా వాలంటీర్లకు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సీఐ తెలిపారు. వారికి నిర్వాహకులు కేవలం రూ.3 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన రూ.2 వేలను కాజేస్తున్నట్లు తమ దర్యాప్తులో తెలిందన్నారు. కొన్ని చోట్ల హాస్టల్స్ నిర్వహణ బాగానే ఉన్నా, మరికొన్ని చోట్ల అధికారుల పర్యవేక్షణ లోపంతో మరీ అధ్వానంగా ఉందన్నారు. డీఎస్పీ విజయపాల్ ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక దాడులు చేశామని, వీటిపై నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు వివరించారు. ఎఫ్ఆర్ఓ తిమోతి, డీఈ వెలుగొండయా, సీనియర్ అసిస్టెంట్ మణికుమార్, కానిస్టేబుల్ నాగభూషణం, ఎంఈవో టీవీఎం. రామదాసు తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. -
అలాంటి ఇళ్లలో మీరుంటారా..?
ఒంగోలు టూటౌన్ :‘బాత్ రూములు, టాయిలెట్స్ లేకుండా మీరు ఉంటున్నారా..? మనం ఉంటున్నామా చెప్పండి.. మరి అలాంటి భవనాన్ని ఎందుకు అద్దెకు తీసుకున్నారు. బయటకు వెళ్లాలంటే పిల్ల్లలు ఎంత భయపడతారు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా’ అంటూ గిద్దలూరు మండలంలోని క్రిష్టింశెట్టిపల్లె గిరిజన సంక్షేమశాఖ వసతి గృహ అధికారిపై జిల్లా డీటీడబ్ల్యూఓ మండిపడ్డారు. వెంటనే ఆ భవనాన్ని మార్చాలని ఆదేశించారు. వసతి గృహాల్లో పిల్లలను మన పిల్లలుగా చూడాలని హితవు పలికారు. స్థానిక ప్రగతి భవనంలోని గిరిజన సంక్షేమశాఖ, వెల్ఫేర్ కార్యాలయంలో వసతి గృహాల వార్డెన్లు, ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలతో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి వెంకట సుధాకర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహ వార్డెన్, గురుకుల పాఠశాలల హెచ్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వివరాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా వసతిగృహాల్లో ఎంత మంది పిల్లలు ఉంటున్నారనే విషయంపై చర్చించారు. తక్కువగా ఉంటే పిల్లలను ఎందుకు చేర్పించలేకపోయారంటూ ప్రశ్నించారు. ఎక్కువ మంది వార్డెన్లు వర్కర్స్ లేరని, గతంలో పనిచేసిన వర్కర్స్కు జీతాలు ఇవ్వాల్సి ఉందని డీటీడబ్ల్యూఓ దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న వసతి గృహాలు సరిపోవడం లేదని తెలిపారు. అదనపు రూములకు నిధులు మంజూరైనా చాలా ప్రాంతాల్లో ఇంత వరకు పనులు ప్రారంభించలేదని తెలిపారు. మార్కాపురం వసతి గృహంలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని, అయితే వర్కర్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నారని వసతిగృహం హెచ్డబ్ల్యూఓ తెలిపారు. గిద్దలూరు బాయ్స్ హాస్టల్ కట్టలేదని సమీక్ష దృష్టికి వార్డెన్ తీసుకువచ్చారు. వసతి గృహాల్లో పిల్లలను పెంచమని అడుగుతుంటే సౌకర్యాలు లేవని చెబుతారేంటని అసహనం వ్యక్తం చేశారు. ఒంగోలులో ఉన్న రెండు కళాశాల వసతి గృహాల్లో తక్కువ మంది పిల్లలు ఉండటంపై వార్డెన్లను నిలదీశారు. వందమంది పిల్లలకు అవకాశం కల్పిస్తుంటే 40 నుంచి 50 మంది పిల్లలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. ఈ సారి సమావేశానికి కల్లా ఒక్కో వసతి గృహంలో 80 మంది పిల్లలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరపత్రాలు ముద్రించి ప్రచారం చేయడంతో పాటు ప్రసార మాద్యమాల్లో ప్రచారం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండు రోజుల్లో వసతి గృహాలను తనిఖీ చేస్తామన్నారు. మంచి ఫలితాలు సాధించాలి.. పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థులను బాగా చదివించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోస్ట్మెట్రిక్ ఉపకార వేతనానికి 3,533 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ అవ్వగా, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు 900 రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిపారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్లలో ఇంకా 242 మంది పిల్లల దరఖాస్తులకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఉపకార వేతనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలన్నింటినీ నెల రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సారి సమీక్షా సమావేశం నాటికి ఉద్యోగులకు సంబంధించిన ఇంక్రిమెంట్లు ఏ ఒక్కటీ పెండింగ్లో ఉండకూడదని సంబంధిత సెక్షన్ ఉద్యోగిని హెచ్చరించారు. ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైబల్ అధికారి జోజయ్య, కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్సీ హాస్టళ్లకు సర్కారు కానుక
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులను వినియోగించుకుని వసతిగృహ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదనపు కోటాకింద ప్రత్యేక సరుకులు పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం చలికాలాన్ని దృష్టి లో పెట్టుకుని పిల్లలు ఇబ్బంది పడకుండా నాణ్యమైన దుప్పట్లు, పరుపులు ఎస్సీ అభివృద్ధి శాఖ పంపిణీ చేస్తోంది. అలాగే 2 రకాల బూట్లు, స్కూల్ బ్యాగులనూ అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 865 వసతి గృహాలున్నాయి. వీటిలో 677 ప్రీమెట్రిక్, 188 పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో దాదాపు 40వేల మంది పిల్లలు వసతి పొందుతున్నారు. తాజాగా ఈ విద్యార్థులకు 2 రకాల వస్తువులను ఆ శాఖ అందించింది. దాదాపు 12.5 కోట్లు ఖర్చు చేసి మెటీరియల్ను కొనుగోలు చేసి వసతి గృహాలకు అందజేసింది. ప్రస్తుతం వసతి గృహ సంక్షేమాధికారులు పంపిణీని మొదలుపెట్టారు. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. -
హాస్టళ్లపై ఏసీబీ మెరుపు దాడులు
జిల్లాలోని వింజమూరు, రాపూరువసతి గృహాలపై సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సంఖ్య కంటే హాజరు పుస్తకంలో సంఖ్య ఎక్కువగా ఉండడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని , బాత్రూములు సరిగా లేవని అధికారులను నిలదీశారు. విద్యార్థులఅవస్థలను చూసి వారు చలించారు. మెనూ ప్రకారం భోజనం అందడంలేదని తెలుసుకున్నారు. విద్యార్థులతో హాస్టల్లోనే ఉండాల్సిన వార్డెన్లు లేకపొవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతిగృహాల్లో ఉన్న పరిస్థితులపై అధికారులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వింజమూరు హాస్టల్లో 64 మంది విద్యార్థులు ఉండగా, రికార్డులో మాత్రం 174 ఉండడాన్ని గుర్తించారు. రాపూరులోనూ అదే పరిస్థితి. నెల్లూరు, వింజమూరు/రాపూరు: లంచాల కోసం వేధిస్తూ, అవినీతికి పాల్పడే అధికారులు, ఉద్యోగుల భరతం పట్టే ఏసీబీ అధికారులు వసతిగృహాలపై కన్నేశారు. సోమవారం రాత్రి జిల్లా ఏసీబీ అధికారులు బృందాలుగా వింజమూరు, రాపూరులోని వసతిగృహాలపై మెరుపుదాడులు చేశారు. వింజమూరులోని బీసీ బాలుర వసతి గృహంపై సోమవారం రాత్రి నెల్లూరు ఏసీబీ డీఎస్పీ సీహెచ్ దేవదానం ఆధ్వర్యంలో దాడులు జరిగాయి,. వసతి గృహానికి రాత్రి 7 గంటలకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యార్థులు చీకటిలో ఉండడంపై డీఎస్పీ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గదిలోని వంటగది, స్టాక్రూము, మరుగుదొడ్లను పరిశీలించారు. బియ్యపు గంజి అక్కడే నిల్వ ఉండి దుర్వాస రావడాన్ని గమనించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ దేవదానం విలేకరులతో మాట్లాడుతూ దాడులు జరిపిన సమయంలో సంక్షేమాధికారి వసతిగృహంలో లేరన్నారు. తాము సమాచారం ఇచ్చిన తర్వాత వసతిగృహానికి వచ్చారన్నారు. ప్రధానంగా ఆదివారం 174 మంది విద్యార్థులు వసతి గృహంలో ఉన్నట్లు హాజరు పుస్తకంలో ఉందన్నారు. ప్రస్తుతం 64 మంది మాత్రమే ఉన్నారన్నారు. బాత్రూములు సక్రమంగా లేవని, విద్యార్థులు బాత్రూముల్లో పెట్టెలు పెట్టుకుని ఆరుబయట పడుకునే దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదన్నారు. వంట మనిషి సైతం వసతి గృహంలో లేరన్నారు. వసతి గృహానికి సంబంధించిన పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఏసీబీ సీఐ రమేష్బాబు, సంక్షేమాధికారి జయరామయ్య, సిబ్బంది ఉన్నారు. రాపూరులోని సాంఘిక సంక్షేమ సమీకృత వసతి గృహంలో ఏసీబీ అధికారులు సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థులను, హాస్టల్ సిబ్బందిని విచారించారు. మెనూ సక్రమంగా అమలుకావడం లేదని, స్టాక్ నిల్వల్లో అవకతవకలు ఉన్నట్టు గుర్తించారు. విద్యార్థులు హజరులో 190 మంది ఉండగా ప్రస్తుతం 157 మంది ఉన్నట్టు గమనించారు. వసతి గృహంలో వార్డెన్ ఉండడం లేదని తెలుసుకున్నారు. సామగ్రి కొనుగోలుకు సంబంధించి బిల్లులు సక్రమంగా ఉన్నాయా?లేదా? అనే విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు శివకుమార్రెడ్డి, రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ఏఎస్డబ్ల్యూ హాస్టళ్లలో తనిఖీలు జరుపుతున్నారా? లేదా? అనే విషయాన్ని విచారిస్తామన్నారు. వసతి గృహంలో నెలకొన్న పరిస్థితులపై సాంఘిక సంక్షేమ అధికారులకు, కలెక్టర్కు నివేదిక అందజేస్తామన్నారు. -
వసతి గృహాలపై విజిలెన్స్ దాడులు
చిత్తూరు ఎడ్యుకేషన్ : జిల్లాలోని వసతి గృహాలపై విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 12 బృందాలుగా విడిపోయి ఉదయం ఆరు గంటల నుంచే ముమ్మర తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని 12 ఎస్సీ వసతి గృహాల్లో ఒకేసారి విజిలెన్స్ దాడులు నిర్వహిం చారు. చిత్తూరులోని సంజయ్గాంధీనగరలో ఉన్న బాలుర వసతి గృహం, పచ్చికాపల్లం బాలు ర వసతి గృహం, వెదురుకుప్పం (బాలురు), కార్వేటినగరం(బాలురు, బాలికలు), మదనపల్లెలో (బాలురు), బైరెడ్డిపల్లిలో (బాలురు), పలమనేరు వద్ద కొలమాసనపల్లి (బాలురు), వరదయ్యపాళెం మండలంలోని సంతవేలూరు (బాలురు),వరదయ్యపాళెం గంగాధరనెల్లూరు(బాలికల) వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని సంజయ్గాంధీనగర్ లో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో విజిలెన్స్ డీఈ శ్రీనివాసరెడ్డి తనిఖీలు చేపట్టారు. అక్కడి రికార్డులు, మరుగుదొడ్లు, వంటగది, స్టాక్రూం, బయోమెట్రిక్, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు చిత్తూరులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉదయం 6 గంటలకు వార్డెన్ లేకపోవడాన్ని గుర్తించారు. హాస్టల్కు సరఫరా చేసే నిత్యావసర వస్తువుల వివరాలను రోజువారి స్టాకు రిజిస్టర్లో నమోదు చేయడం లేదని తేలింది. స్టోర్ రూంలో ఎక్కువ బియ్యం బస్తాలు ఉన్నాయని, విద్యార్థులకు వైద్యులు మూడేళ్లుగా హాస్టల్కు వచ్చి చికిత్స చేయడం లేదని గుర్తించారు. అలాగే నాసిరకం కందిపప్పు వాడకం, ట్యూటర్లు లేకున్నా బిల్లులు పెట్టుకోవడం ఇలా పలు అక్రమాలు తనిఖీల్లో తేలాయి. ఇదే విధంగా జిల్లాలో మిగిలిన వసతి గృహాల్లో చాలా అక్రమాలను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అవకతవకలు, సౌకర్యాల లేమి వంటి వాటిపై సంబంధిత హాస్టల్ వార్డెన్ల నుంచి లిఖిత పూర్వకంగా నివేదికలు తీసుకున్నారు. వీటిని విజిలెన్స్ డీజీకి పంపి, అక్కడ నుంచి ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ముందుగానే నిఘా పెట్టాం సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలను తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గురువారం జిల్లాలోని 12 ఎస్సీ వసతి గృహా ల్లో తనిఖీలు చేశాం. గత రెండు నెలల్లో చిత్తూరు జిల్లాలోని 10 వసతి గృహాలను తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. అదే విధంగా గురువారం జరిగిన తనిఖీల్లో డైట్చార్టు అమలుచేయకపోవడం, ఎక్కువ సరుకులు పొందుతుండడం, బయోమెట్రిక్ పనిచేయకపోవడం వంటి అక్రమాలు బయటపడ్డాయి.– రాధాకృష్ణ, విజిలెన్స్ ఎస్పీ -
సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ తనిఖీలు
ఈపూరు: ఈపూరు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో గుంటూరు జిల్లా ఏసీబీ డీఎస్పీ సీహెచ్ దేవానంద్ శాంతో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ వార్డెన్లు అందుబాటులో లేకపోవడంతో జిల్లా సంక్షేమశాఖ అధికారికి సమాచారం అందించారు. విద్యార్థులు పడుతున్న అవస్థలను దగ్గర నుంచి గమనించారు. వసతి గృహాల పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించారు. వార్డెన్ల స్థానంలో ప్రవేటు వ్యక్తులు.. ఎస్టీ, బీసీ వసతి గృహాలను పరిశీలించిన అధికారులు అక్కడ పనిచేస్తున్న ప్రైవేట్ సిబ్బందిని చూసి నివ్వెరపోయారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వార్డెన్లు సక్రమంగా పనిచేయకుండా వారి స్థానంలో ప్రైవేట్ వ్యక్తులను రోజు కూలీగా నియమించి పని చేయిస్తున్నారు. ఇంత జరుగతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై ఏసీబీ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. అధ్వాన పరిస్థితి.. ఎస్టీ హాస్టల్ విద్యార్థులు భోజనం ముందు చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు లేక మరుగుదొడ్డిలో వచ్చే కుళాయిలను వాడుకుంటున్నామని, స్వచ్ఛమైన తాగునీరు లేక వాటినే తాగాల్సి వస్తోందని విద్యార్థులు వాపోయారు. బీసీ హాస్టల్స్లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని విన్నవించారు. అన్నం ముద్దగా చేస్తున్నారని, ఉడకని కూరలు పెడుతున్నారని, నీళ్ల మజ్జిగ పోస్తున్నారని విద్యార్థులు చెప్పగా.. అధికారులు వాటిని ప్రత్యక్షంగా చూశారు. తెల్లవారే వరకూ.. ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో విలేకర్లతో మాట్లాడుతూ వసతి గృహాల దుస్థితి అధ్వానంగా ఉందని, వార్డెన్లు అందుబాటులో లేరన్నారు. తెల్లవారే వరకు వసతి గృహంలోనే బస చేస్తామని, వార్డెన్లు రాని పక్షంలో మూడు వసతి గృహలను సీజ్ చేస్తామని తెలిపారు. -
సంక్షోభంలో సంక్షేమం
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పేద విద్యార్థులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో పలుచోట్ల హాస్టళ్లు సమస్యల లోగిళ్లుగానే ఉన్నాయి. అస్తవ్యస్త మరుగుదొడ్లు, తాగునీటి కరువు, దోమల బాధ, ఉక్కపోతతో విద్యార్థులు అల్లాడుతున్నారు. గత నెల 25న జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, బాలికల గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు సహా 20చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రేపల్లె, తెనాలి, అమరావతి, చేబ్రోలు, గురజాల, గుంటూరు నగరం, నిజాంపట్నంలోని హాస్టళ్లను ఐదు బృందాలుగా పరిశీలించారు. ఈ సందర్భంగా అనేక అక్రమాలు, సమస్యలు వెలుగు చూశాయి. 70 శాతానికి పైగా వసతి గృహాల్లో బోగస్ ఎన్రోల్మెంట్లు బయటపడ్డాయి. ఉన్న విద్యార్థుల కన్నా అధికంగా 20శాతం చూపించి వార్డెన్లు జేబులు నింపుకుంటున్నారు. బయోమెట్రిక్ విధానం ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించగా.. సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులకు పొంతనలేని సమాధానాలు చెప్పారు. భద్రత ప్రశ్నార్థకం బాలికల వసతి గృహాల వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో చాలా వరకూ ప్రభుత్వ బాలికల సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల వద్ద నైట్ డ్యూటీ వాచ్మెన్లు లేకుండానే నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థినులు రాత్రయితే చాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరుగుదొడ్లకు సరైన నీటి సరఫరా లేకపోవడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కొన్నిచోట్ల విద్యార్థినులు అరుబయట కాలకృత్యాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రేపల్లెలోని ఓ సంక్షేమ వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్లు ఉన్నప్పటికీ వాటికి కరెంటు సరఫరా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్ల వద్ద మురుగు నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు. పౌష్టికాహారం అందని ద్రాక్షే.. విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందని ద్రాక్షలానే మారింది. జిల్లాలోని చాలా వరకూ వసతి గృహాల్లో కొత్త డైట్ విధానం అమలు కావడం లేదు. వారానికి ఒక్కసారి కూడా కోడిగుడ్డు ఇవ్వడం లేదని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. పాలు కూడా విద్యార్థులకు అంతంత మాత్రంగానే ఇస్తున్నారు. హాస్టళ్లలో ఎక్కడా ఆర్వో వాటర్ సిస్టమ్ అమలు కావడం లేదు. నేటికీ కొన్ని హాస్టళ్లలో కట్టెల పొయ్యి మీదనే వంటలు వండుతూ పొగ చూరిన ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారు. గురుకులాల్లో టీచర్ల కొరత విజిలెన్స్ అధికారుల తనఖీల్లో గురుకులాల్లో సిబ్బంది కొరత బయటపడింది. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు బోధించే సిబ్బందే ఎనిమిది, తొమ్మిది, పది విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రిన్సిపాళ్ల గైర్హాజరు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ అక్రమాలు జరుగుతున్నాయి. వంటలు చేసే సిబ్బంది నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. నిధుల దుర్వినియోగం తనిఖీల సమయంలో జిల్లాలోని చాలా హాస్టళ్లలో పలు సమస్యల్ని గుర్తించాం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. అధికారులు ఎప్పటికప్పుడు హాస్టళ్లను పరిశీలించాలి. అప్పుడే వార్డెన్లు అక్రమాలకు పాల్పడకుండా నిధులు వినియోగిస్తారు. – శోభామంజరి, విజిలెన్స్ అండ్ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ -
సంక్షేమం పుచ్చు!
హిందూపురం అర్బన్/అనంతపురం సెంట్రల్: జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో సౌకర్యాలపై బుధవారం రీజనల్ విజిలెన్స్ అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు బృందాలుగా విడిపోయి అనంతపురం, తాడిపత్రి, హిందూపురం తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు. అయితే అన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయం వెలుగుచూసింది. పిల్లలకు నాసిరకం భోజనం వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బయోమెట్రిక్ మిషన్లు వినియోగించకుండా ఎక్కువ మంది విద్యార్థుల చూపిస్తూ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తేల్చారు. ఈ విషయాలన్నింటినీ గుర్తించి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు లేఖను పంపుతామని రీజనల్ విజిలెన్స్ అధికారి రామాంజనేయులు తెలిపారు. తెల్లవారుజామునుంచే.. విజిలెన్స్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి బుధవారం తెల్లవారుజామునే హిందూపురం, పరిగి ప్రాంతాల్లో ఎస్సీ వసతి గృహాల్లో తనిఖీలు చేశారు. వసతులు, నిత్యావసర సరుకుల కొనుగోలు, వస్తువుల వినియోగం, పారిశుద్ధ్యం, విద్యార్థుల సంఖ్య ఇలా అన్ని కోణాల్లో తనిఖీలు చేశారు. రికార్డుల ప్రకారం నమోదు చేస్తున్న వివరాలు కూడా పరిశీలించారు. హిందూపురం హాస్టల్లో 42 మంది దాకా విద్యార్థులుండగా హాజరుపట్టికలో మాత్రం 108 మంది ఉన్నట్లు చూపారు. హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు నాసిరకం వస్తువులు వినియోగించి విద్యార్థులకు భోజనం పెడుతూ నిధులు స్వాహా చేసినట్లు అధికారులు గుర్చించారు. హాస్టల్లో నిల్వ చేసిన వేరుశనగ విత్తనాలు, పప్పు దినుసులు పుచ్చిపోయి పురుగులు కనిపిస్తున్నా...వాటితో చెట్నీ చేసి విద్యార్థులకు వడ్డించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక అన్ని వంటల్లో వినియోగించే ఉప్పు, నూనెలు కాలం తీరినవే ఉన్నాయి. అన్నం పూర్తిగా ముద్దగా మారడమే కాకుండా ఉంటలుగా కట్టి ఉంది. ఉదయం వండిన పులిహోర రుచి చూడగా జిగటలాగా అతుక్కుపోతోంది. తాగునీరు..పారిశుద్ధ్యం అధ్వానం హాస్టల్లో తాగునీటిని బయటనుంచి కొనుగోలు చేస్తుండగా... మరుగుదొడ్ల, బాత్రూంలు చాలా దారుణంగా ఉన్నాయి. వాటిలో ఒకదానికి కూడా తలుపులు సరిగాలేవు. వీటిని శుభ్రం చేసే వారు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆరుబయటకు వెళాల్సి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం హిందూపురం హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులతో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించారు. నివేదికలు అందిస్తాం హాస్టళ్ల పరిస్థితి..సౌకర్యాలు..అధికారుల తీరుపై ఓ నివేదికను ఉన్నతాధికారులకు పంపి చర్యలకు సిఫారసు చేస్తామని రీజనల్ విజిలెన్స్ అధికారి రామాంజనేయులు తెలిపారు. తనిఖీల్లో సీఐలు రెడ్డప్ప, విశ్వనాథ చౌదరి, శ్రీనివాసరెడ్డి, డీఈ రవీంద్రకుమార్, డీసీటీఓ సుబ్బారెడ్డి, ఎస్ఐ రామకృష్టయ్య పాల్గొన్నారు. -
వీధి కుక్కలకు, ఆవులకు వసతి గృహాలు నిర్మించండి
న్యూఢిల్లీ : వీధి కుక్కలకు, ఆవులకు వసతి గృహాలు నిర్మించాలని ‘‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ)’’ రాష్ట్రాలను కోరింది. యవ్వనంలో ఉన్న జంతువులు కబేళాలకు బలికాకుండా ఆ కమిటీ చూసుకుంటుదని తెలిపింది. చలనచిత్రాలలో జంతువులు హింసకు గురికాకుండా చూసుకోవటానికి ప్రత్యేకంగా మరో కమిటీ వేస్తామని పేర్కొంది. ఒక వేళ జంతువులను చలనచిత్రాలలో ఉపయోగించినట్లయితే ఏడబ్ల్యూబీఐ నుంచి ‘నో అబ్జక్షన్ సర్టిఫికేట్’ తీసుకోవాలని తెలిపింది. ఇంకో నెలలోగా వీధి జంతువుల సమస్యను పరిష్కరించాలని కోరింది. జంతువులకు వసతిగా ఉండేలా గృహాలను నిర్మించాలని సూచించింది. ‘‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా’’ ఛైర్పర్సన్ ఎస్పీ గుప్తా మాట్లాడుతూ.. తామెవరినీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలనటం లేదని, మాంసం తినేవారు తినటానికి ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు. కాకపోతే అన్ని జంతు వధశాలలు నియమాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. జంతు వధశాలల్లో యవ్వనంలో ఉన్న జంతువులను చంపకుండా ఉండటానికి దుకాణాలను తనిఖీ చేయటం జరుగుతుందన్నారు. రహదారులపై జంతువులు తిరగటం కూడా క్రూరత్వం కిందకే వస్తుందన్నారు. వీధి జంతువులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవటానికి ఉత్తరప్రదేశ్తో పాటు మరో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించటమే కాకుండా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశామని పేర్కొంది. -
ఇక రోజూ విజిటింగ్ అవర్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు జూనియర్ కాలేజీ హాస్టళ్ల ఇష్టారాజ్యానికి ఇక చెల్లుచీటీ పడనుంది. హాస్టళ్లలో పాటించాల్సిన నిబంధనలపై ఇంటర్మీడియట్ బోర్డు పంపిన ప్రతిపాదనలను కొన్ని మార్పులతో మంగళవారం ప్రభుత్వం ఆమోదించింది. దీంతో వెంటనే నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. హాస్టళ్లలోని విద్యార్థులను తల్లిదండ్రులు/సంరక్షకులు రోజూ సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు కలిసేలా, అత్యవసరమైతే ఎప్పుడైనా కలిసేందుకు అనుమతిచ్చేలా నిబంధనలు సిద్ధం చేసింది. ప్రతి 50 మందికి 5 బాత్రూమ్లు, 8 టాయిలెట్లు ఉండేలా.. టిఫిన్ సహా 4 పూటల ఆహారం అందించేలా, విద్యార్థుల సంఖ్య ఆధారంగా హాస్టళ్ల గుర్తింపు ఫీజు చెల్లించేలా నిబంధనలు రూపొందించింది. ఏడాదికోసారి ఆడిట్ - హాస్టల్లో ప్రథమ చికిత్స కిట్, అగ్నిమాపక పరికరాలు, రిక్రియేషన్ రూమ్లు, రక్షిత తాగునీటి సదుపాయం లేదా ఆర్వో ప్లాంట్లు, సరిపడ వెంటిలేషన్ ఉండాలి. - ప్రతి విద్యార్థికి 50 చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ), ప్రతి 25 మందికి 1,000 ఎస్ఎఫ్టీ ఉండాలి. - ప్రైవేటుతోపాటు, ప్రభుత్వ హాస్టళ్లలోనూ చిన్న గదుల సదుపాయం లేనందున రూంకు ఇద్దరు నిబంధనను ప్రభుత్వం తొలగించింది. - కౌన్సెలింగ్, గైడెన్స్ రూం.. విద్యార్థులకు సరిపడ ఆట స్థలం ఉండాలి. ఉతికిన బట్టలు ఆరబెట్టేందుకు ఖాళీ స్థలం ఉండాలి. - హాస్టల్కు సొంత కిచెన్ ఉండాలి. కిచెన్, బాత్రూమ్, టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్ జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి. - హాస్టళ్లకు వేరుగా అకౌంట్ నిర్వహించాలి. ఏడాదికోసారి ఆడిటర్తో లెక్కలు చేయించి రెన్యువల్ సమయంలో అందజేయాలి. రోజుకు రెండు సార్లు విద్యార్థుల హాజరు - విద్యార్థులకు ప్రతి రోజు టిఫిన్ సహా 4 సార్లు ఆహారం అందించాలి. నిఫుణుల నేతృత్వంలో ఆహారం వండాలి. వార్డెన్ కూడా భోజనం నాణ్యత పరిశీలించాలి. - పోషకాహారం అందించాలి. నెలకోసారి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. హాస్టళ్లలో స్టాఫ్ నర్సు ఉండాలి. బాలికల హాస్టల్ అయితే మహిళా నర్సును నియమించాలి. - ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు టిఫిన్, మధాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు భోజనం పెట్టాలి. - హాస్టళ్లలో కచ్చితంగా రిజిస్టర్ సైకాలజిస్ట్/క్వాలిఫైడ్ కెరీర్ కౌన్సెలర్ ఉండాలి. హాస్టళ్లలో నియమించే సిబ్బందికి పోలీసు క్లియరెన్స్ తీసుకోవాలి. - ప్రతి రోజు రెండుసార్లు విద్యార్థుల హాజరు తీసుకోవాలి. సెలవు కోసం తల్లిదండ్రులు లేఖ రాసి తీసుకెళ్లాలి. - అడ్మిషన్ రిజిస్టర్, విజటర్ బుక్, మెడికల్ రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. - హాస్టల్ యాజమాన్యాలు ఇన్స్పెక్షన్ ఫీజు (కార్పొరేషన్లలో రూ. 80 వేలు, మున్సిపాలిటీలో రూ. 60 వేలు, గ్రామ పంచాయతీలో రూ. 50 వేలు) చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసకోవాలి. - హాస్టల్ నిర్వహణ ఫీజును కార్పొరేషన్లలో రూ. లక్ష, మున్సిపాలిటీ పరిధిలో రూ. 80 వేలు, గ్రామ పంచాయతీల్లో రూ.60 వేల చెల్లించాలి. - ఇవి కాకుండా 50 మంది విద్యార్థులకు రూ. 4 లక్షలు, 50 నుంచి 200 మంది వరకు రూ. 8 లక్షలు, 201 నుంచి 500 వరకు రూ. 12 లక్షలు, 500 మందికంటే ఎక్కువుంటే రూ. 16 లక్షలు డిపాజిట్ చేయాలి. -
వసతి..దుర్గతి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని బీసీ కళాశాల వసతిగృహాల్లో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేయాల్సిన బడ్జెట్ను ఏడాది పైగా పెండింగ్ పెట్టింది. దీంతో ఎక్కడి బిల్లులు అక్కడే ఆగిపోయాయి. బియ్యం మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మిగిలిన సరుకులన్నీ బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. భవనాలకు అద్దెలు చెల్లించాలని యజమానులు ఒకవైపు ఒత్తిడి చేస్తుండగా, వెంటనే బిల్లులు చెల్లించకుంటే కరెంటు కట్ చేస్తామని ఆ శాఖ అధికారులు మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కనీసం కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలకు కూడా డబ్బు చెల్లించలేక వసతి గృహ సంక్షేమాధికారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా బీసీ కళాశాల సంక్షేమ వసతిగృహాలకు నయాపైసా బడ్జెట్ విడుదల చేయలేదు. డైట్ బిల్లులే రూ.1,89,85,484 పెండింగ్ పడ్డాయి. విద్యుత్ బిల్లులకు రూ.10 లక్షలను విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల వసతి సౌకర్యాలు చూడడానికి సంబంధిత అధికారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేవలం బియ్యం ఇచ్చి సర్కారు సరిపెట్టుకుంటోంది. పలు సరుకుల సరఫరాకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో వారు కొన్ని సరుకులను నాణ్యత లేనివి సరఫరా చేస్తున్నారు. అలాగే అనేక మంది వసతిగృహ సంక్షేమాధికారులు బయటి మార్కెట్ నుంచి సరుకులు కొనుగోలు చేస్తున్నారు. నెలల తరబడి డైట్ చార్జీలు విడుదల కాకపోవడంతో సంబంధిత షాపుల యజమానులు కూడా సరుకులను అప్పుగా ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారని వార్డెన్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అధిక వడ్డీలకు అప్పు చేసి వసతిగృహాలను నిర్వహిస్తున్నట్లు వారు చెబుతున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి అద్దెలు విడుదల చేయకపోవడంతో యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. అలాగే విద్యుత్ బిల్లులు ప్రతి నెలా చెల్లించకపోవడంతో సంబంధిత శాఖ సిబ్బంది పలుమార్లు కనెక్షన్ కట్ చేస్తున్నారు. ఎన్ని వసతిగృహాలు, ఎంత పెండింగ్ ... జిల్లాలో 28 బీసీ కళాశాల వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 4,400 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీటికి డైట్ చార్జీలు రూ.1.89 కోట్లు, విద్యుత్ బిల్లులు రూ.10 లక్షలు, అద్దెలు రూ.1.20 కోట్లు, టెలిఫోన్ బిల్లులు రూ.2.85 లక్షలు, ఓఓఈ (అదర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్) రూ.4.30 లక్షలు, మెటీరియల్ సప్లయ్కు గాను రూ.2 లక్షలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నేటి (ఈ నెల 20)లోపు బడ్జెట్ విడుదల చేయకుంటే, ఇప్పటికే ట్రెజరీకి వెళ్లిన బిల్లులన్నీ వెనక్కి వచ్చే ప్రమాదముంది. బడ్జెట్ విడుదలయ్యే అవకాశాలున్నాయి నేటిలోగా బడ్జెట్ విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే అవసరమైన బిల్లులన్నీ ట్రెజరీకి పంపాం. ఏడాది కాలంగా బీసీ వసతిగృహాలకు బిల్లులు పెండింగ్ ఉన్న మాట వాస్తవమే. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీజింగ్ ఉన్న కారణంగా బిల్లులు మంజూరు కాలేదు. బిల్లులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ద్వారా తమ శాఖ డైరెక్టర్కు గత నెలలో నివేదికలు పంపాము. – కె.లాలాలజపతిరావు, ఇన్చార్జ్ డీబీసీడబ్ల్యూఓ కోర్టు నోటీసులు పంపించారు ఏడాదిగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని కోర్టు నోటీసు పంపారు. వెంటనే అద్దె చెల్లించాలని, లేని పక్షంలో ఖాళీ చేయాలని జిల్లా బీసీ సంక్షేమాధికారికి పంపిన నోటీసులో పేర్కొన్నారు. అద్దె దాదాపు రూ.6 లక్షలు, విద్యుత్ బిల్లులు రూ.లక్ష, డైట్ బిల్లులు రూ.10 లక్షల వరకు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల అప్పులు చేశాం. ఇంకా ఎక్కడి నుంచి తేవాలో తెలియడం లేదు. కూరగాయలు, గుడ్లు, అరటి పండ్లు తదితర వాటికి కూడా డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నాం. – కె.హారతీదేవి, బీసీ బాలికల వసతిగృహం సంక్షేమాధికారిణి, కర్నూలు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది 14 నెలలుగా అద్దె దాదాపు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది. భవన యజమాని ఒత్తిడి చేస్తున్నారు. 2017 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రూ.12 లక్షల డైట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. రూ.2లక్షలు విద్యుత్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆ శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఏడాది కాలంగా అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెట్టాం. పలుమార్లు సమస్యను జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లాం. – ఎన్.గిరిజాదేవి, పాణ్యం బీసీ బాలుర హెచ్డబ్ల్యూఓ -
వసతి గృహాల్లో ‘బ్రాండ్’ బాజా!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు కార్పొరేట్ హాస్టల్ స్థాయి సేవలందుకోబోతున్నారు. ఇప్పటివరకు అరకొర వసతులతో ఇబ్బందులు పడ్డ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఇకపై బ్రాండెడ్ వస్తువులివ్వాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరం ప్రారంభం నుంచి వసతి గృహాల్లో భోజన మెనూలో ప్రభుత్వం భారీ మార్పులు తీసుకొచ్చింది. చార్జీలు పెంచడంతో 3 పూటలా సంపూర్ణ పౌష్టికాహారం అందుతోంది. నెలలో 4 సార్లు చికెన్, రెండుసార్లు మటన్ భోజనంతోపాటు ప్రతి రోజూ కోడిగుడ్డును అందిస్తున్నారు. ఇదే తరహాలో రోజువారీ వినియోగించే వస్తువులను బ్రాండెడ్ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని ఎస్సీ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. రూ.69.52 కోట్ల ఖర్చు రాష్ట్రంలో 687 సంక్షేమ వసతి గృహాలున్నాయి. ఇందులో 568 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 119 పోస్టు మెట్రిక్ హాస్టళ్లున్నాయి. ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో 58,160 మంది, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో 22,623 మంది విద్యార్థులున్నారు. పదో తరగతి వరకు ప్రభుత్వమే యూనిఫాం ఇస్తోంది. కాలేజీ విద్యార్థులకు డ్రెస్ కోడ్ లేదు. దీంతో వారే వ్యక్తిగతంగా డ్రెస్లు కొనుగోలు చేసుకుంటున్నారు. వీరికి కాస్మొటిక్ చార్జీల కింద బ్రాండెడ్ సబ్బులు, సౌందర్య సాధనాలు ఇస్తోంది. మిగిలిన వాటిని కూడా బ్రాండెడ్ వస్తువులే ఇవ్వనుంది. కాలేజీ విద్యార్థులకు లాన్సర్ స్పోర్ట్స్ షూస్, స్కూల్ పిల్లలకు బాటా స్కూల్ షూస్ పంపిణీ చేయనుంది. ప్రతి వసతి గృహంలో బ్లూస్టార్ ఆర్వో ప్లాంట్ (నీటి శుద్ధి యంత్రం) ఏర్పాటు చేయనుంది. స్కూల్ బ్యాగులు, బంకర్ బెడ్లు ప్రముఖ కంపెనీలకే ఆర్డర్ ఇచ్చి తయారు చేయించనుంది. స్లీప్వెల్ బ్రాండ్కు చెందిన మాట్రిసెస్, పిల్లోస్ను పిల్లలకు ఇవ్వనున్నారు. నిఘా కట్టుదిట్టం చేసేందు కు ఒక్కో హాస్టల్లో ఆరు సీసీ కెమెరాలు, ఒక డీవీఆర్ యంత్రాలను అమరుస్తారు. వీటన్నిం టి కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ రూ.69.52 కోట్లు ఖర్చు చేస్తోంది. జిల్లా కమిటీలకు కొనుగోలు బాధ్యతలు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో కొత్తగా ఇవ్వనున్న బ్రాండెడ్ వస్తువుల కొనుగోలు బాధ్యతలను కలెక్టర్ చైర్మన్గా ఉన్న కొనుగోలు కమిటీలకు అప్పగించింది. రాష్ట్రస్థాయిలో కేటగిరీలు, ధరలు నిర్ణయించి.. ఆ మేరకు వస్తువులను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. కేవలం కొనుగోలే కాకుండా ప్రతి వస్తువుకు గ్యారంటీ ఉండాలనే నిబంధన విధించింది. ఈ ప్రక్రియలో భాగంగా రెండ్రోజుల క్రితం ఖమ్మం జిల్లా కమిటీ వస్తువులు కొనుగోలు చేసింది. మిగతా జిల్లాల్లోనూ కొనుగోలు ప్రక్రియ వీలైనంత వేగంగా పూర్తి చేస్తామని, అనంతరం విద్యార్థులకు పంపిణీ చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
అనాథ పిల్లలపై అమానుషం
హన్మకొండ చౌరస్తా: అమ్మా, నాన్న పిలుపునకు దూరమై.. నా అనేవారు లేని పిల్లల సంరక్షణ చూడాల్సినవారే అమానుషంగా ప్రవర్తించారు. సరైన భోజనం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించినందుకు హింసించారు. అంతటితో అహం చల్లారక గుండు గీయించారు. అమానుషమైన ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ లష్కర్ బజార్లోని ప్రభుత్వ పట్టణ వీధి బాలల వసతి గృహంలో సుమారు వంద మంది అనాథ విద్యార్థులు ఉన్నారు. పిల్లలందరూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వారం రోజులుగా వార్డెన్ అర్చన వ్యక్తిగత సెలవులో ఉండగా, వసతి గృహాన్ని ట్యూటర్ రాజు, వాచ్మన్ జవహర్లే నిర్వహిస్తున్నారు. అయితే నీళ్ల చారు, సరిగా ఉడకని అన్నాన్ని వడ్డించడంపై రెండు రోజుల క్రితం కల్యాణ్, దిలీప్, అక్షయ్వర్మ అనే విద్యార్థులు ట్యూటర్, వాచ్మన్లను నిలదీశారు. దీంతో ‘మమ్మల్నే అడుగుతార్రా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఆ ముగ్గురు విద్యార్థులను చితకబాదారు. అయినప్పటికీ శాంతించని వాచ్మన్, ట్యూటర్లు ఆ ముగ్గురికి గుండు చేయించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఏబీఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్బీ, డీఎస్యూ విద్యార్థి సంఘాలు బుధవారం సాయంత్రం వసతి గృహం ఎదుట ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ ట్యూటర్, వాచ్మన్లను విధుల నుంచి తొలగించాలని, మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన ఉధృతం కాకుండా బందోబస్తు చేపట్టారు. ఆ ఇద్దరిని తొలగించాం విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ట్యూటర్ రాజు, వాచ్మన్ జవహర్ను తొలగిస్తూ ఉదయమే తీర్మానం చేశాం. వారిద్దరిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. పిల్లలకు సరైన భోజనం పెట్టడం లేదనడం సరైంది కాదు. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం. – కేడల పద్మ, నిర్వాహకురాలు,పట్టణ వీధి బాలల వసతి గృహం, లష్కర్బజార్ -
‘వలస’ పిల్లలకు సీజనల్ హాస్టళ్లు
బొంరాస్పేట : డ్రాపౌట్స్ నివారణ కోసం గ్రామాల్లో వలస కుటుంబాల పిల్లలకు సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పీపుల్స్ సర్వీస్ సొసైటీ(పీఎస్ఎస్) స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పరమేశ్వర్ తెలిపారు. మండల పరిధిలోని చౌదర్పల్లి జెడ్పీహెచ్ఎస్, రేగడిమైలారం ఎంపీహెచ్ఎస్లో సీజనల్ హాస్టళ్లను జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతిరెడ్డి, ఎంఈఓ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పరమేశ్వర్ మాట్లాడారు. సర్వశిక్షా అభియాన్ సహకారంతో పీఎస్ఎస్ ఆధ్వర్యంలో సీజనల్ హాస్టళ్లను నిర్వహించనున్నట్లు చెప్పారు. వలస వెళ్లిన కుటుంబాల పిల్లలకు హాస్టల్ వసతి కల్పించి, సాయంత్రం పూట ట్యూషన్ చెప్పించే ఏర్పాటు చేశామని వివరించారు. తద్వారా వలస కుటుంబాల విద్యార్థులు బడి మానేయకుండా చదువు కొనసాగిస్తారనే లక్ష్యంతో సీజన్ హాస్టళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని ప్రధానంగా గిరిజన కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ, ఎంఈఓ సూచించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు రమేశ్బాబు, వెంకటేశ్, ఉపాధ్యాయులు ఆనంద్రావు, మల్లికార్జున్ ఉన్నారు. -
ఉత్తీర్ణత పదిలమేనా..!
ఒంగోలు సెంట్రల్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్య సరిగా అందడం లేదు. మరో 70 రోజుల్లో పరీక్షలు ప్రారంభమవుతున్నా అధికారుల్లో చలనం లేదు. వసతి గృహ విద్యార్థుల విద్యలో మార్పు లేదు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ పదో తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా స్టడీ అవర్స్ నిర్వహించాల్సి ఉన్నా వార్డెన్లు చదివించడం లేదు. వార్డెన్లు రెండు పూటలా వసతి గృహాలకు రావడం లేదు. కొంత మంది ఇతర దూర ప్రాంతాల్లో నివాసం ఉంటూ రైళ్లు, బస్సుల టైం టేబుల్ ప్రకారం వస్తున్నారు. వార్డన్లే వసతి గృహాలకు సరిగ్గా రాకపోతుండటంతో ట్యూటర్లు కూడా చుట్టపు చూపుగా వస్తున్నారు. పరీక్షలకు ఈ చివరి రోజుల్లో విద్యార్థులు చదువుతున్నారా, లేదా వార్డెన్లు పర్యవేక్షిస్తున్నారా అనే విషయం తెలుసుకోవడానికి టెలీ కాన్ఫరెన్సులు అధికారులు నిర్వహించడం లేదు. దీంతో వార్డెన్ల పని ఇష్టారాజ్యమైంది. గత ఏడాది అప్పటి కలెక్టర్ హాస్టళ్లలో విద్యార్థులు ఉత్తీర్ణత కాకపోతే వసతి గృహæ సంక్షేమ అధికారులను బాధ్యులను చేస్తామనడంతో కొంత వరకూ ఆశించిన ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితులు కనపడటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ట్యూటర్లకు రూ.1500 గౌరవ వేతనంగా అందిస్తున్నారు. ట్యూటర్లు లెక్కలు, ఇంగ్లిషు, హిందీ, సైన్స్ సబ్జెక్ట్లను విద్యార్థులకు బోధిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ సంక్షేమ శాఖలో పదో తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు 71 వసతి గృహాల్లో ఉన్నారు. వీటి పరిధిలో 1100 మంది చదువుతున్నారు. వీరిలో 870 మంది బాలురు, 230 మంది బాలికలు. ఈ శాఖలో ట్యూటర్లకు ఏడాదికి రూ.41 లక్షలు వెచ్చిస్తున్నారు. 140 మంది ట్యూటర్లు విద్యార్థులకు ట్యూషన్లు చెబుతున్నారు. అదే ఎస్టీ సంక్షేమ శాఖలో 14 వసతి గృహాల్లో 162 మంది పదో తరగతి చదువుతున్నారు. ట్యూటర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం కింద అందిస్తున్నారు. ఈ శాఖలో మొత్తం 43 మంది ట్యూటర్లు ఉన్నట్లు అధికా రులు అంటున్నారు. అదే వెనుకబడిన తరగతుల శాఖలో 76 వసతి గృహాల్లో 1100 మంది పదో తరగతి చదువుతున్నారు. వీరిలో 920 మంది బాలురు, 180 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. 150 మంది ట్యూటర్లను నియమించారు. ఇప్పటికీ అందని ఆల్ఇన్వన్ గైడ్లు, స్టడీ మెటీరియల్స్: ప్రభుత్వ వసతి గృహంలోని విద్యార్థులు పదో తరగతిలో మంచి మార్కులు సాధించేందుకు గతంలో అధికారులు ఆల్ఇన్వన్ గైడ్లు, స్టడీ మెటీరియల్స్ అందించేవారు. అయితే ప్రస్తుతం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థులు తమకు పాఠశాలలో చెప్పిన పాఠాలనే చదువుకుంటూ, సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఆల్ఇన్వన్లు, గైడ్ల సరఫరా టెండర్లు, కొటేషన్ల దశలోనే ఉంది. ఎస్సీ హాస్టళ్లకు కూడా ఇంకా ఇవ్వలేదు. బీసీ హాస్టళ్లలో కొందరికి మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన వారికి ప్రింటింగ్ అయిన తరువాత పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఏడాదిగా ట్యూటర్లకు ఏ సంక్షేమ శాఖలోనూ గౌరవ వేతనాలు విడుదల కాలేదు. దీంతో వారు కూడా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం లేదు. త్వరలో సమావేశం నిర్వహిస్తాం జిల్లాలోని వసతిగృహ అధికారులతో పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని త్వరలో నిర్వహిస్తాం. విద్యార్థులకు ఆల్ఇన్వన్ గైడ్లు, ప్రతి రోజు విద్యా ప్రణాళిక స్టడీ మెటీరియల్, విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు, చదువులో పూర్తిగా వెనుకబడిన విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. – మువ్వా లక్ష్మీ సుధ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరక్టర్ -
స్తంభించిన బయోమెట్రిక్ హాజరు!
సాక్షి, హైదరాబాద్: హాస్టళ్లలో బయో మెట్రిక్ హాజరు విధానం అటకెక్కింది. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ మెషిన్లు పనిచేయడంలేదు. సాఫ్ట్వేర్లో నెలకొన్న సాంకేతిక సమస్యలను సాకుగా చూపుతూ వసతిగృహ సంక్షేమాధికారులు హాజరు ప్రక్రియను పాతపద్ధతికి మార్చేశారు. వసతిగృహాల్లో విద్యార్థుల హాజరులో అక్రమాలకు చెక్ పెట్టడానికిగాను బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాయి. వసతిగృహ సంక్షేమాధికారితోపాటు సిబ్బంది సైతం వేలిముద్రలతో బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో దాదాపు వెయ్యికిపైగా సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ మెషిన్లను ఏర్పాటు చేశారు. సరికొత్తగా తీసుకొచ్చిన ఈ విధానంతో వసతి గృహాల్లో అవకతవకలు సైతం అదుపులోకి రాగా ప్రభుత్వానికి భారీగా ఖర్చులు తగ్గాయి. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ హాజరు విధానం స్తంభించి పోయింది. ఈ విధానంలో ఆధార్ నంబర్లే కీలకం. ఆధార్ నమోదు చేసుకున్నవారికే బయోమెట్రిక్ హాజరు తీసుకునే అవకాశం ఉండేలా ప్రభుత్వం సాఫ్ట్వేర్ను రూపొందించింది. దీంతో ఒక విద్యార్థి హాజరు మరొకరు వేసే అవకాశం ఉండదు. ఇటీవల ఆధార్ వివరాలతో ఉన్న టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం మెరుగుపరిచింది. వరుసగా రెండుసార్లు అప్డేట్ కావడంతో ఆ మెషిన్లు సరికొత్త సాఫ్ట్వేర్ను సపోర్ట్ చేయడం లేదు. ఈ క్రమంలో బయోమెట్రిక్ మెషిన్లలోనూ ఆధార్ సాఫ్ట్వేర్ను సపోర్ట్ చేసేలా కొత్త వెర్షన్ అప్డేట్ చేయాల్సి ఉంది. అయితే, కొత్త సాఫ్ట్వేర్పై సంక్షేమ శాఖలు శ్రద్ధ పెట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో హాజరు నమోదులో గందరగోళం నెలకొంది. మెషిన్లు పనిచేయడం లేదంటూ వసతిగృహ సంక్షేమాధికారులు దాదాపు ఐదు నెలలుగా మాన్యువల్ పద్ధతిలోనే హాజరు స్వీకరిస్తున్నారు. దీంతో అవకతవకలకు మళ్లీ ఆస్కారం ఏర్పడింది. అక్రమార్కులకు మళ్లీ కలసి వచ్చినట్లైంది. వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యకు, హాజరుపట్టికలోని వివరాలకు పొంతన లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ మెషిన్లలో కొత్త సాఫ్ట్వేర్ను మెరుగుపర్చే అంశంపై నిపుణులతో అధికారులు చర్చిస్తున్నారు. -
అర్ధాకలితోనే చదువులు
సాక్షి, అమరావతి: ప్లేట్ ఇడ్లీకి సరిపోయే డబ్బులిచ్చి దాంతో మూడు పూటలా తినమంటే ఏం చేస్తాం.. అర్ధాకలితోనే సరిపెట్టుకుంటాం. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులది ఇప్పుడు ఇదే పరిస్థితి. నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఇచ్చే మెస్ చార్జీలు సరిపోక విద్యార్థులు అర్ధాకలితోనే చదువులు కొనసాగిస్తున్నారు. ఎదిగే వయసులో ఉన్న విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారు. 2012 డిసెంబర్లో అప్పటి ప్రభుత్వం సవరించిన మెస్ చార్జీలనే ఇప్పుడూ ఇస్తున్నారు. ఆ ప్రకారం 3 నుంచి 7వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 750, 8 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి నెలకు రూ. 850 మెస్ చార్జీలుగా ప్రభుత్వం ఇస్తోంది. అంటే 3 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థికి రోజుకు రూ.25, 8 నుంచి 10 తరగతులు చదువుతున్న వారికి రోజుకు రూ. 28.33 ప్రభుత్వ కేటాయిస్తోంది. ప్రస్తుతం బయట మెస్ల్లో భోజనం చేసినా పూటకు కనీసం రూ. 60 చెల్లించాలి. ఈ నేపథ్యంలో రూ. 25తో హాస్టల్లో పెట్టే భోజనం విద్యార్థులకు ఎలా సరిపోతుందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మెనూ అమలు చేయలేక.. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం పెట్టాలి. కేవలం రూ. 25తో రెండు పూటల అల్పాహారం, రెండు పూటల భోజనం ఎలా వస్తోందో కూడా ఈ ప్రభుత్వానికి ఆలోచనే లేకుండా పోయిందని విద్యార్థులు విమర్శిస్తున్నారు. వారం రోజుల్లో.. రెండు రోజులు ఉదయం ఉప్మా, ఆదివారం ఇడ్లీ లేదా ఉగ్గాని, మిగిలిన నాలుగు రోజుల్లో పొంగల్, పులిహోరా, పులగం, కిచిడీ పెట్టాలి. భోజనం కూడా మూడు నుంచి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులకు 150 గ్రాములు, 8 నుంచి 10 తరగతి వరకు చదువుతున్న వారికి 200 గ్రాముల అందించాలి. వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు కూడా ఇవ్వాలి. ఈ మెస్ చార్జీల్లో నుంచే బియ్యంతో పాటు గ్యాస్, సరుకుల రవాణా చార్జీలు, ఇడ్లీ పిండి వాటి గ్రైండింగ్ చార్జీలతో పాటు విద్యుత్ బల్బ్ కాలిపోయినా ఖర్చుచేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో మెనూను అమలు చేయడం వార్డెన్లకు తలకు మించిన భారం అవుతోందని విద్యార్థి సంఘ నేతలు చెబుతున్నారు. పెంపు దస్త్రం సీఎం వద్ద పెండింగ్ మెస్చార్జీల పెంపు దస్త్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే పెండింగ్లో ఉందని అధికారులు చెబుతున్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రావెల కిశోర్బాబు ఉన్నపుడు మెస్ చార్జీల పెంపునకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించారు. ఇంతవరకు దానికి మోక్షం కలగలేదు. రద్దవుతున్న హాస్టళ్లు.. సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం రద్దు చేస్తున్నది. దీంతో నిరుపేదలకు చదువు దూరమైపోతోంది. రద్దయిన హాస్టల్స్ నుంచి విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లకు మారుస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. 50 శాతం మంది పిల్లలు డ్రాప్అవుట్స్గా మారుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో 1,259 హాస్టళ్లు ఉండగా 275 హాస్టళ్లను ఇప్పటి వరకు రద్దు చేశారు. ఈ సంవత్సరం మరో 300 హాస్టళ్లు రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు. గిరిజన సంక్షేమ శాఖలో 497 హాస్టల్స్ ఉండగా ఇప్పటి వరకు 358 హాస్టల్స్ రద్దయ్యాయి. రద్దయిన హాస్టల్స్లోని పిల్లలను రెసిడెన్సియల్స్లో చేర్పించినట్లు అధికారులు ప్రకటించారు. బీసీ హాస్టల్స్ 897 ఉండగా.. వాటిని ఏడాది రద్దు చేయడానికి బీసీ సంక్షేమ శాఖ చర్యలు మొదలు పెట్టింది. మూడు సంక్షేమ శాఖల కింద ఉన్న హాస్టళ్లలో పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 1,88,917 మంది ఉన్నారు. ఎస్సీ హాస్టళ్లలో 88,214 మంది, ఎస్టీలో 13,034మంది, బీసీ హాస్టళ్లలో 87,669 మంది చదువుకుంటున్నారు. -
కాలేజీ విద్యార్థులకు హాస్టళ్లు!
- ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు - దూర ప్రాంత విద్యార్థుల కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయం - ఎస్సీ విద్యార్థులకు ప్రాధాన్యం.. 70 శాతం సీట్లు వారికే.. సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. దూర ప్రాంతం నుంచి కాలేజీకి రాకపోకలు సాగించే వారి కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ త్వరలో ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం నియోజకవర్గానికో వసతిగృహం ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యకు తగి నట్టుగా వీటిని నెలకొల్పాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు సైతం హాస్టళ్ల ఆవశ్యకతపై లేఖలు పంపు తుండటంతో చర్యలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో పాఠశాల విద్యార్థుల వసతి గృహాలు కొనసాగుతున్నాయి. తాజాగా గురుకుల పాఠశాలలను ప్రారంభించడంతో పలు హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ తరుణంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉండి.. మౌలికవసతులు ఉన్న వాటిలో ఈ హాస్టళ్లను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారుల నుంచి వివరాలను సేకరిస్తోంది. వంద మందికి ఒక హాస్టల్ కొత్తగా హాస్టళ్లు ప్రారంభించడం ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా వాటిని పూర్తిచేసి అందుబాటులోకి తేవడానికి చాలా సమయం పడుతుంది. దీంతో విద్యార్థులు లేని, 40 కంటే తక్కువ విద్యార్థులున్న హాస్టళ్లను సమీప వసతి గృహాల్లో విలీనం చేయనున్నారు. అలా విలీనం చేసిన హాస్టల్ భవనంలోనే కొత్తగా కాలేజీ విద్యార్థుల కోసం వసతిగృహాన్ని ఏర్పాటు చేయాలని ఎస్సీ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో ఖర్చు తగ్గడంతో పాటే సిబ్బందికి స్థానచలనం కలిగించాల్సిన పని ఉండదని, వనరులు సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. పక్కా భవనం ఉండి కనీసం వంద మంది విద్యార్థులకు వసతి కలిగించే సామర్థ్యం ఉన్న భవనాలనే కాలేజీ హాస్టళ్లకు ఎంపిక చేయనున్నారు. వీటిని ఒకేసారి పెద్ద సంఖ్యలో కాకుండా ప్రాధాన్యత క్రమంలో ప్రారంభించనున్నారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జమ్మికుంట తదితర మండలాల్లో బాలికలు, బాలుర కోసం వసతిగృహాలు ఏర్పాటు చేయాలని ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. ఎస్సీ అభివృద్ధి శాఖకు లేఖ రాశారు. దాంతో అధికారులు ఆమేరకు చర్యలు చేపట్టి నివేదికను రూపొందించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని వసతి గృహాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ముగియగా.. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ప్రవేశాలు ముగిసిన తర్వాత విద్యార్థుల సంఖ్యను బట్టి వసతి గృహాల ఆవశ్యకతపై అంచనాకు వస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. ఉపకార నిధులతో నిర్వహణ కొత్తగా ఏర్పాటు చేసే వసతి గృహాల నిర్వహణ భారాన్ని విద్యార్థుల ఉపకార వేతనాల నుంచి సర్దుబాటు చేయాలని ఎస్సీ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టుమెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తోంది. వీటి మాదిరిగానే కొత్తగా ఏర్పాటు చేసే కాలేజీ హాస్టళ్లను నిర్వహించనుంది. ఒక హాస్టల్లో కనిష్టంగా వంద మంది విద్యార్థులుంటేనే నిర్వహణలో ఇబ్బందులుండవని అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్యను దృష్టిలో పెట్టుకుని బాలికలు, బాలుర హాస్టళ్ల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిలో ఎస్సీ విద్యార్థులకు 70 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగతా కోటాలో ప్రాధాన్యత క్రమంలో విద్యార్థులను చేర్చుకుంటారు. -
వసతి..ఇదేం దుస్థితి
- హాస్టళ్లలో కనిపించని సౌకర్యాలు - మరో 8 రోజుల్లో పునః ప్రారంభం - రూ.3.45 కోట్లతో ప్రతిపాదనలు - పట్టించుకోని ప్రభుత్వం - ఈ ఏడాదీ విద్యార్థులు అవే అవస్థలు మరమ్మతులు చేపట్టాల్సిన వసతి గృహాల సంఖ్య బీసీ సంక్షేమ శాఖ: 37 సాంఘిక సంక్షేమ శాఖ: 40 గిరిజన సంక్షేమం: 17 కర్నూలు(అర్బన్): తలుపులు లేని వాకిళ్లు .. రెక్కలు లేని కిటికీలు .. వెలగని విద్యుత్ బల్బులు.. గదుల నిండా చెత్తాచెదారం.. అరకొర తాగునీరు.. ఇలా అనేక సమస్యల మధ్య ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు వసతి గృహాల్లోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే పారదర్శకత పేరుతో పలు హాస్టళ్లను విలీనం చేసిన ప్రభుత్వం ఉన్న అరకొర వసతి గృహాల్లో కూడా విద్యార్థులకు అవసరమైన వసతలు కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఆయా వసతి గృహాల్లో కనీస వసతులు కల్పించేందుకు పంపిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. దీంతో అసౌకర్యాల నీడనే పేద బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువులు కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 50 వసతి గృహాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఒక్క హుసేనాపురం మినహా మిగిలిన 49 వసతి గృహాలు ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వసతి గృహాల్లో దాదాపు 8,400 మంది విద్యార్థులు వసతులు పొందుతున్నారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 54 వసతి గృహాలు ఉండగా, వీటిలో శ్రీశైలం మినహా మిగిలిన అన్ని వసతి గృహాలు సొంత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ వసతి గృహాల్లో దాదాపు 9 వేల పైచిలుకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 11 ఆశ్రమ పాఠశాలలు, ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒక ప్రీమెట్రిక్ హాస్టల్ సొంత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో 2,400 మంది విద్యార్థులు ఉన్నారు. సౌకర్యాలేవీ.. గృహాల్లో విద్యుత్ సౌకర్యం అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని వసతి గృహాలకు ప్రహరీలు లేవు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. గోడలకు వైట్ వాష్ చేయలేదు. ఫ్యాన్లు పనిచేయడం లేదు. బోర్లు, స్నానపుగదుల మరమ్మతులు చేయాల్సి ఉంది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 37 వసతి గృహాల్లో చేపట్టాల్సిన మరమ్మతులకు సంబంధించి గత ఏడాదే రూ. 72.98 లక్షలు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపారు. అలాగే 40 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని మరమ్మతులకు రూ.2.52 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పలు రిపేర్లు చేపట్టేందుకు రూ.21.50 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. నిధులు వస్తే మరమ్మతులు చేపడతాం వసతి గృహాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆదోని డివిజన్లోని ఇంగళ్దహాల్ వసతి గృహానికి మాత్రం రూ.25 లక్షలను విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే ఆయా వసతి గృహాల్లో మరమ్మతులు చేపడతాం. - బి.సంజీవరాజు, జిల్లా బీసీ సంక్షేమాధికారి -
హాస్టళ్లు మూసివేస్తే ఉద్యమిస్తాం: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ఉత్తర్వులు లేకుండా హాస్టళ్ల మూసి వేత ఆలోచనలను సహించేది లేదని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్య మిస్తామని బీసీ సంక్షేమ సంఘ నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ హాస్టళ్లను మూసివేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడంపై మండి పడ్డారు. పాఠశాలల్లోని 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి, విద్యా ప్రమాణాలను పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లను యథాతథంగా కొనసాగించాలని, దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, రాజేందర్, సాగర్, నీలం వెంకటేశ్, నంద గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ‘గురుకుల’ ప్రవేశాలకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న ఎంపీసీ విద్యార్థులకు, 23న బైపీసీ, ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. నాలుగు గురుకుల జూనియర్ కాలేజీల్లో 510 సీట్ల భర్తీకి 1:5 చొప్పున ఇంటర్వూ్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్వూ్యకు ఎంపికైన వారి వివరాలను తమ వెబ్సైట్లో (tsrjdc.cgg.gov.in) విద్యార్థులు తమ హాల్టికెట్ సహాయంతో పొందవచ్చని సూచించారు. బాలురకు సర్వేల్లోని గురుకుల జూనియర్ కాలేజీ, బాలికలకు హసన్పర్తిలోని గురుకుల జూనియర్ కాలేజీలో కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. -
అనుమతి లేని కాలేజీ హాస్టళ్లకు షోకాజ్ నోటీస్లు
– సాక్షి కథనానిక స్పందన కర్నూలు సిటీ: జిల్లాలో అనుమతి లేకుండా ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలతో పాటు హస్టళ్లను సైతం నిర్వహిస్తున్న కాలేజీలపై గత నెల 29న ‘వసతి కిరికిరి’ అనే కథనానికి ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులు స్పందించారు. ఈ మేరకు బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి వై.పరమేశ్వరరెడ్డి నారాయణ కాలేజీలకు చెందిన మూడు, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 4 కాలేజీలకు, మరో 13 సాధారణ కాలేజీలకు షోకాజ్ నోటీస్లు జారీ చేశారు. జిల్లాలో రావూస్ కాలేజీకి హాస్టల్ అనుమతి ఉందన్నారు. ఏడాదికి రెండు సార్లు ప్రైవేటు కాలేజీలను తనిఖీలు చేస్తామన్నారు. ఈ నెల 5వ తేదిలోపు నిర్దిష్టమైన సమాధానం ఇవ్వాలని.. లేని పక్షంలో ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని పరమేశ్వరరెడ్డి తెలిపారు. -
బిల్లులేవీ..
► భారంగా సీజనల్ హాస్టళ్ల నిర్వహణ ► జిల్లాలోని 14 మండలాల్లో 65 ఏర్పాటు ► జనవరి నుంచి విడుదల కాని బిల్లులు ► హాస్టళ్ల నిర్వహణకు అష్టకష్టాలు ► గౌరవ వేతనానికీ నోచుకోని సిబ్బంది బేస్తవారిపేట: ప్రభుత్వం వలస కూలీల పిల్లలకు విద్యలో ఎటువంటి ఆటంకం కలుగకూడదని సీజనల్ హాస్టల్స్ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరిలో సీజనల్ హాస్టల్స్ ప్రారంభించారు. మూడు నెలలు దాటినా ఒక్క రూపాయి బిల్లు మంజూరు చేయకపోవడంతో నిర్వాహకులు హాస్టల్స్ నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కోసం దూరప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు ఎక్కువగా ఉండే జిల్లాలోని బేస్తవారిపేట, చీమకుర్తి, దొనకొండ, దోర్నాల, గిద్దలూరు, కొమరోలు, కొత్తపట్నం, మార్కాపురం, పర్చూరు, పుల్లలచెరువు, పెద్దారవీడు, తర్లుపాడు, త్రిపురాంతకం, వై.పాలెం మండలాల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో హాస్టల్స్ ప్రారంభించారు. 14 మండలాల్లో 27 ఎన్జీవోలు హాస్టల్స్ నిర్వహణ చేపట్టారు. జిల్లాలోని 65 హాస్టల్స్లో 3153 మంది విద్యార్థులకు వసతి కల్పించారు. జనవరి నుంచి హాస్టల్ బిల్లులు విడుదల చేయలేదు. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.650 చెల్లించాల్సి ఉంది. 50 మంది విద్యార్థులున్న సెంటర్కు నెలకు రూ.32,500 ప్రకారం మూడు నెలలకు రూ.97,500 చెల్లించాల్సి ఉంది. ఒక్కో స్వచ్ఛంద సంస్థ రెండు నుంచి ఐదు హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. లక్షల్లో అప్పులు పేరుకుపోవడంతో హాస్టల్స్ నిర్వహణపై నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోతే హాస్టల్స్ నిర్వహించలేక మూతపడే పరిస్థితి నెలకొందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో హాస్టల్కు ఒక ఉపాధ్యాయుడు, ఒక కేర్ టేకర్, ఇద్దరు వంట మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఉపాధ్యాయుడికి, కేర్ టేకర్కు రూ.3 వేల గౌరవ వేతనం, వంట చేసేవాళ్లకు ఇద్దరికి రూ.3 వేలు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. మూడు నెలలుగా గౌరవ వేతనం మంజూరు చేయలేదు. కష్టపడి పనిచేసినా వచ్చే అరకొర వేతనం సకాలంలో మంజూరు చేయకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదు బేస్తవారిపేట మండలంలోని గంటాపురం, ఎంపీ చెరువు గ్రామాల్లో సీజనల్ హాస్టల్స్ నిర్వహిస్తున్నాం. రెండు హాస్టల్స్కు రూ.1.70 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో హాస్టల్స్ నిర్వహణ ఎలా చేయాలి. రేషన్ షాపుల్లో అప్పులు పేరుకుపోతున్నాయి. – కె.నిర్మలాబాయి, హోత్స్ స్వచ్ఛంద సంస్థ, బేస్తవారిపేట మూడు నెలల నుంచి వేతనం లేదు జనవరి నెల నుంచి హాస్టల్లో వంట చేస్తున్నాను. ప్రభుత్వం ఒక్క నెలకు కూడా గౌరవ వేతనం విడుదల చేయలేదు. ఇచ్చే అరకొర వేతనం కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. – తిరుపతమ్మ, వంట మనిషి -
ఆగని మృత్యుగీతం
ఏజెన్సీ ఆశ్రమ వసతిగృహాల్లో గిరిజన విద్యార్థుల మరణాలు ఆగటం లేదు. ఆదివాసీ చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏడాదిలో 23 మంది రక్తహీనత, పచ్చకామెర్లు, మలేరియా, డయేరియా లక్షణాలతో చనిపోయారు. ఒక్క మార్చి నెలలో రెండు వారాల వ్యవధిలో ఏకంగా ఎనిమిది మంది మరణించారు. పరిస్థితి చేయిదాటిపోతున్నా..ఐటీడీఏ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్ట లేదు. వ్యాధుల కాలం కార్యాచరణను అమలు చేయకపోవడం, ఆశ్రమాలు, గురుకులాల్లో పిన్పాయింట్ ప్రోగ్రాం లేకపోవడం ఇందుకు కారణమన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ► ఆశ్రమాలు, హాస్టళ్లలో అనారోగ్యంతో రాలిపోతున్న చిన్నారులు ► తాజాగా రక్తహీనతతో ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి ► నియంత్రణ చర్యలు చేపట్టని ఐటీడీఏ, వైద్య, ఆరోగ్యశాఖ పాడేరు/డుంబ్రిగుడ: మరో పసిమొగ్గ రాలిపోయింది. డుంబ్రిగుడ ఆశ్రమ పాఠశాలలో గురువారం ఓ విద్యార్థి అనారోగ్యంతో చనిపోయిన సంఘటనను మరిచిపోక ముందే ఇదే మండలం జాముగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శెట్టిఅశ్విని రక్తహీనతతో బాధపడుతూ అరకులోయ ఏరియా ఆసుపత్రిలో గురువారం రాత్రి చనిపోయింది. ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో సంభవిస్తున్న గిరిజన విద్యార్థుల ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 15 ఏళ్లలోపు వీరు ఏటా మృత్యువాత పడుతున్నారు. చదువు కోసం పిన్నవయస్సులో తల్లిదండ్రుల ఆలనా, పాలనలకు దూరంగా ఆశ్రమాల్లో చేరుతున్న వీరికి సరైన పోషణ, సంరక్షణ కల్పించడంలో అలక్ష్యం చోటుచేసుకుంటోంది. తమ అనారోగ్య సమస్యలను వారు వ్యక్తపరచలేకపోతున్నారు. అది విషమంగా పరిణమిస్తోంది. గుర్తించి ఆస్పత్రిలో చేర్చేసరికి కాలాతీతమై పరిస్థితి చేయిదాటుతోంది. విద్యార్థుల ప్రాణాలు నిలవడం లేదు.15 రోజుల వ్యవధిలో 8 మంది విద్యార్థులు అనారోగ్య పరిస్థితుల వల్ల మృతి చెందారు. ఇలా ఏటా ఆశ్రమాల్లో విద్యార్థుల మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఇందుకు తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల బందవీధి ఆశ్రమ విద్యార్థిని జవ్వాది శైలజ, సూకూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థిని రేగం జానకి, అరడకోట ఆశ్రమ విద్యార్థి నాయుడు శివాజీ మృతి చెందారు. ఇదే నెలలలో పెదబయలు గురుకుల విద్యార్థి హరిశ్చంద్ర ప్రసాద్, రింతాడ పాఠశాల విద్యార్థిని తలుపులమ్మ, చింతపల్లి పాఠశాలలో ఎన్.గీత, డుంబ్రిగుడ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న మాదెల విష్ణువర్ధన్, జాముగూడ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని మృతి చెందారు. పచ్చకామెర్లు, రక్తహీనత, జ్వరం వంటి అనారోగ్య పరిస్థితుల వల్ల వీరంతా చనిపోతున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి: డీఎం హెచ్వో సరోజిని డుంబ్రిగుడ: హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య సమస్యల పట్ల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఎంహెచ్వో సరోజిని ఆదేశించారు. డుంబ్రిగుడ బాలుర వసతిగృహంలో గురువారం విద్యార్థి మాదల విష్ణువర్ధన్, శుక్రవారం జాముగుడ పాఠశాల విద్యార్థిని శెట్టి అశ్విని మృతి చెందడంతో ఆమె శుక్రవారం డుంబ్రిగుడ వచ్చారు. విష్ణువర్ధన్ మృతికి కారణాలకు హెచ్ఎం విజయరావుతో పాటు ఆరోగ్యకార్యకర్త చిట్టిబాబును అడిగి తెలుసుకున్నారు. జాముగుడ బాలికల పాఠశాలకు వెళ్లి విద్యార్థిని అశ్విని మృతికి కారణాలను హెచ్ఎం మంగమ్మను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు చిన్నపాటి అనారోగ్యానికి గురైనా సమీప ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం స్థానిక పీహెచ్సీకి వెళ్లి విద్యార్థులకు వైద్యసేవలపై ఆరా తీశారు. ఆమె వెంట వైద్యాధికారి శాంతికిరణ్ ఉన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే రవిబాబు పాడేరు: ఏజెన్సీ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి విద్యార్థులందరికీ ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించాలని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు నెలల్లో 11 మంది విద్యార్థులు మృతి చెందారన్నారు. పౌష్టికాహారం, వైద్య, ఆరోగ్య సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. హాస్టళ్లలోని గిరిజన విద్యార్థులకు అనుబంధ పోషకాహారం సరఫరా చేయాలన్నారు. రోజుకొకరు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు. దీనికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. గిరిజన విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందడం లేదన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ ఎస్వీ రమణ, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జంపరంగి ప్రసాద్ పాల్గొన్నారు. -
హాస్టళ్లలో సమస్యలు తీర్చకుంటే ఉద్యమం
వైఎస్సార్ సీపీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కొరిటెపాడు(గుంటూరు) ఎస్సీ సోషల్ వెల్ఫేర్, స్టూడెంట్స్ మేనేజ్మెంట్స్ హాస్టళ్లలో వసతులు దయనీయంగా ఉన్నాయని, వసతులు మెరుగుపర్చడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు తదితరులు సోమవారం జెడ్పీ గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేకు వినతిపత్రం ఇచ్చారు. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న గుంటూరులోని మహిమా గార్డెన్స్ వెనుక వైపున సోషల్ వెల్ఫేర్ నిర్వహిస్తున్న హాస్టల్ బిల్డింగ్ కూలిపోవడానికి సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని తెలిపారు. ఫ్లోరింగ్ లేదని, కిటికీలు లేవని, బాత్రూమ్లు టాయిలెట్లకు కనీసం తలుపులు కూడా లేవని, ఇటువంటి భవనంలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తినే భోజనంలో రాళ్లు, పురుగులను ఏరుకుని తినాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దళితుల బాగోగులు పట్టని ముఖ్యమంత్రి, మంత్రులు పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో నోడల్ ఏజన్సీ పెట్టి దళిత, గిరిజనులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళిత, గిరిజనుల చట్టాలకు తూట్లు పొడుస్తూ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద మంజూరైన నిధులను దారిమళ్లిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సూచించిన చట్టాలు, సూత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని, అవినీతి హెచ్చుమీరిపోయిందని విమర్శించారు. ఫిబ్రవరి 10వ తేదీ లోపు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో వసతులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే 10వ తేదీన జిల్లా సోషల్ వెల్ఫేర్ కార్యాలయాన్ని పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. సమాజంలో అసమానతలు తొలగాలన్నా, పేదరికం పోవాలన్నా ధనిక వర్గాలతో సమానంగా పేద వర్గాలు ఉన్నత చదువులు చదువుకోవాలని అంబేద్కర్ చెప్పారన్నారు. అసమానతలు తొలగి, అన్ని వర్గాలు ఉన్నత స్థితికి చేరుకోవాలన్నదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశ, థ్యేయమని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ దళిత, గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ లేదు అనడానికి సోషల్ వేల్ఫేర్ హాస్టల్స్ దుస్థితే నిదర్శనమన్నారు. హాస్టళ్లలో మౌలిక వసతులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్–2 ముంగా వెంకటేశ్వరరావును హాస్టల్కు పంపి, విద్యార్థులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చిస్తామని కలెక్టర్ కాంతీలాల్ దండే వారికి హామీ ఇచ్చారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో వైఎస్సార్ సీపీ నేతలు ఏలికా శ్రీకాంత్యాదవ్, గనిక ఝాన్సీరాణి, మద్దుల రాజాయాదవ్, దాసరి కిరణ్, పల్లపు మహేష్, సోమికమల్, పానుగంటి చైతన్య, షేక్ రబ్బాని, వినోద్, విఠల్, వలి, పేటేటి బాజి, యాదాల రామ్, దాసరి గోపి, సాయిగోపి, నాని తదితరులున్నారు. -
సం‘క్షామ’ హాస్టళ్లు
ఇల్లెందు : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు సకల సౌకర్యాలు, మెరుగైన ఆహారం అందించాలి. ఇందుకోసం మార్కెట్లో సరుకుల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలి. కానీ గత మూడేళ్లుగా ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచకపోగా విద్యార్థులకు అందించే ఆహార పరిమాణం తగ్గిస్తోంది. మెస్ చార్జీలకు, మెనూ అమలుకు పొంతన లేకపోవడంతో హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల నిర్వహణ తలకు మించిన భారంగా మారిందని సంక్షేమాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌష్టికాహారం సక్రమంగా అందక విద్యార్థులు రక్తహీనతతో వ్యాధుల బారిన పడుతున్నారు. 3 నుంచి ఏడో తరగతి విద్యార్థులకు రోజుకు రూ.25, 8, 9, 10 తరగతుల వారికి రూ.28.33 చొప్పున అందించాలి. ఇందులో రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ డబ్బు సరిపోక టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాసిరకమైన సరుకులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎదిగే పిల్లలకు మజ్జిగ, పెరుగు అందని ద్రాక్షలా మారింది. కనీసం ఆదివారం కూడా వీరికి పిండి వంటల రుచి తెలియదు. మాంసాహారం ఊసే లేదు. అరటి పండు మినహా మిగితా ఏ పండూ వీరి దరి చేరదు. ఇక హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం ఉప్మా, పులిహోర, కిచిడి, జీరా రైస్, ఎగ్ బిర్యానీ, ఆలుగడ్డ కూర, మధ్యాహ్నం భోజనం, పప్పు, కూరగాయలు, కోడిగుడ్లు అందించాల్సి ఉంది. సాయంత్రం స్నాక్స్లో మూడు పీస్లు పల్లిపట్టీ, శనగలు 20 గ్రాములు, గ్రీన్ పీస్ 20 గ్రాములు, బొబ్బర్లు, శనివారం స్వీటు అందజేయాలి. రాత్రి పూట భోజనంలో అన్నం, కూరగాయలు, సాంబారు అందించాలి. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి కొరవడకుండా ఉండేందుకు విటమిన్లు కలిగిన ఆహారం ఇవ్వాలి. ‘ప్రత్యేక’ పాలనలో పెరగని చార్జీలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు విద్యాసంవత్సరాల్లో మెస్ చార్జీలు ఏమాత్రం పెంచలేదు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి మెస్ చార్జీలు పెంచగా తదనంతరం అధికారం చేపట్టిన కిరణ్కుమార్రెడ్డి మరోమారు చార్జీలు పెంచారు. ఆ తర్వాత నూతన రాష్ట్రం ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం సన్న బియ్యం అందజేస్తున్నప్పటికీ మెస్ చార్జీలు పెంచటం విస్మరించింది. నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు.. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను అంటుతుండగా విద్యార్థులకు అందించే మెస్ చార్జీలు మాత్రం యథాతథంగానే ఉంచారు. దీంతో హాస్టల్, ఆశ్రమ పాఠశాలల సంక్షేమాధికారులు(హెచ్డబ్ల్యూఓ) మూస పద్ధతిలో తక్కువ ధరకు లభించే కూరగాయలతో కాలం గడుపుతున్నారు. ఇక కాస్మొటిక్స్ చార్జీల కింద బాలురకు నెలకు రూ.50, బాలికలకు నెలకు రూ.75 చెల్లిస్తున్నారు. ఏళ్లు గడిచినా ఈ చార్జీలు మాత్రం పెంచటం లేదు. బాలురకు కనీసం రూ.100, బాలికలకు రూ.150 చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు. బాలుర క్షౌ రానికి పైసా కూడా విడుదల చేయటం లేదు. జిల్లాలో 24 బాలుర, 22 బాలికల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలురు 7, 721 మంది, బాలికలు 8,958 మంది ఉన్నారు. ఇక గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 12 బాలుర హాస్టళ్లలో 1215 మంది, ఆరు బాలికల హాస్టళ్లలో 1305 మంది ఉన్నారు. హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసించే వారికి 3 నుంచి 7వ తరగతి వరకు రోజుకు 475 గ్రాములు, 8, 9, 10 తరగతుల వారికి 525 గ్రాముల బియ్యం కేటాయించారు. 2015–16లో కిలో పప్పు ధర రూ.103 ఉండగా, నేడు అదే పప్పు ధర కిలో రూ.145కు సరఫరా చేస్తున్నారు. అయితే అప్పుడు ఒక్కో విద్యార్ధికి పప్పు 25 గ్రామలు ఇవ్వగా నేడు 35 గ్రాములు ఇస్తున్నారు. నాడు 25 గ్రాములకు రూ. 2.58 ఉండగా ప్రస్తుతం రూ. 5.08కి పెంచారు. ఒక్కో విద్యార్ధికి పప్పు 10 గ్రాములు పెంచగా రూ. 2.58 పైసల నుంచి రూ. 5.08 పైసలకు భారం పెంచారు. నూనె 15 గ్రాముల నుంచి 10 గ్రాములకు తగ్గించారు. చింతపండు 18 గ్రాముల నుంచి 10 గ్రాములకు తగ్గించారు. కారం పొడి 8 గ్రాముల నుంచి 6 గ్రాములకు తగ్గించారు. ఉప్మా రవ్వ ఒక విద్యార్థికి 40 గ్రాములు కేటాయించగా, నేడు 30కి తగ్గించారు. ఇలా ఒకటి, రెండు వస్తువులు పెంచినా మిగితా అన్నింటి పరిమాణం తగ్గించడం గమనార్హం. -
కాలేజీ హాస్టళ్ల నిధుల సమస్యకు స్వస్తి
• అవసరమైనప్పుడల్లా నిధులు విడుదల • 160 హాస్టళ్లకు రూ.100 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతిగృహాలకు నిధుల సమస్య నుంచి విముక్తి లభించింది. గతంలో పాఠశాల వసతి గృహాలకు నిధులిచ్చిన సమయంలోనే వీటికీ నిధులు విడుదల య్యేవి. కొన్నిసార్లు నిధులకు నెలల తరబడి జాప్యం జరిగిన సందర్భాలున్నారుు. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులు తలెత్తే అవకా శం లేదు. ఇకపై అవసరమైనప్పుడు నిధులు పొందేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పిం చింది. ఇందుకు ప్రత్యేకంగా రూ.100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల నిర్వహణ, ఖర్చులకు సంబంధించి మార్గ దర్శకాలను కూడా విడుదల చేసింది. ప్రత్యేక బడ్జెట్ ద్వారా వసతిగృహాల్లో లైబ్రరీలు సైతం ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో భవిష్య త్తులో ఈ హాస్టళ్లు మరింత అభివృద్ధి చెందు తాయని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో రాష్ట్రంలో 160 కాలేజీ హాస్టళ్లున్నారుు. ఇందులో 77 బాలుర, 83 బాలికల వసతి గృహా లుండగా.. 20వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ప్రతిరోజూ మూడు పూటలా భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటివరకూ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులకు భోజన సౌకర్యంలో ఇబ్బందులు తలెత్తేవి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఊరటనిచ్చినటై్లంది. -
ఐఐటీ-బీ హాస్టళ్లలో కోతుల బీభత్సం
ముంబై: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి(ఐఐటీ-బీ) విద్యార్ధులు ఇప్పుడు చదువుకు భయపడటం లేదు. రోజూ తమ హస్టళ్లపై దాడి చేసి విధ్వసం సృష్టిస్తున్న కోతులను చూస్తే బెంబేలెత్తిపోతున్నారు. క్యాంపస్ లోని నాలుగు హస్టళ్ల పరిస్థితి అయోమయంగా ఉంది. తలుపు తీస్తే ఎప్పుడు ఏ కోతి గదిలోకి వచ్చి దాడి చేస్తుందో తెలీక విద్యార్ధులు బిక్కుబిక్కుమంటున్నారు. విద్యార్థుల చేతుల్లోని తినుబండారాలను లాక్కోవడమే కాకుండా, తాళం వేయని గదుల్లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ వస్తువులను నాశనం చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా గదిలోని మంచాలపై పడుకుని నిద్రపోతున్నాయి. దాదాపు 10 నుంచి 15కోతులు ఎప్పటినుంచో క్యాంపస్ లో ఉంటున్నాయి. వాటి వల్ల చాలా మంది విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చివరి సంవత్సర విద్యార్ధి ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను క్యాంపస్ మేగజీన్ లో విద్యార్ధులు ప్రచురించారు. దీంతో విద్యార్ధులు హాస్టళ్లకు నడిచివెళ్లేటప్పుడు చేతిలో చిన్న కర్రను ఉంచుకోవాలని, హాస్టల్ ప్రాంగణంలో టపాకాయలు కాల్చుతుండాలని క్యాంపస్ కోరింది. క్యాంపస్ అడవికి దగ్గరగా ఉండటం వల్లే కోతుల బెడద ఎక్కువగా ఉందని ఓ ప్రొఫెసర్ అన్నారు. తరచూ క్యాంపస్ లో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటాయని పేర్కొన్నారు. కేవలం హాస్టళ్ల మీదే కాక, గతంలో ఆఫీసుల మీద కూడా కోతులు దాడి చేసిన ఘటనలు ఉన్నాయని వివరించారు. జంతురక్షణ సంస్థలు తరచూ కోతులను సురక్షిత ప్రాంతాలకు పంపుతున్నా అవి మళ్లీ మళ్లీ తిరగి వస్తూనే ఉన్నాయని విద్యార్ధుల డీన్ తెలిపారు. విద్యార్ధులు వారి వస్తువులను జాగ్రత్త చూసుకోవాలని సూచించారు. -
సీఎం ఒక్కరోజు హాస్టల్లో గడపాలి
దోమలగూడ : పెరిగిన ధరలకనుగుణంగా రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల మెస్చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద హాస్టళ్ల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతు తెలిపిన కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థుల మెస్ చార్జీలను పెంచక పోవడం శోచనీయమన్నారు. నాలుగేళ్ల క్రితం నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారన్నారు. దీంతో హాస్టళ్ల విద్యార్థులకు నాసిరకం భోజనం అందుతోందన్నారు. మనసున్న ముఖ్యమంత్రిగా ఒక రోజు హాస్టల్లో గడిపితే వారి బాధలు తెలుస్తాయని, ఆతర్వాత వారి సంక్షేమానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆయన విజ్ఞతకే వదిలి వేస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, 530 కళాశాల విధ్యార్థుల హాస్టళ్లు ఉన్నాయని, వాటికి సొంత భవనాలు, కనీస వసతులు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. సచివాలయంలో 9 భవనాలలో ఏడు కొత్తవే అయినా.. వాటిని కూలగొట్టి కొత్తవి నిర్మించాలని ప్రభుత్వం భావి స్తోందని, వాటికి బదులుగా హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజకృష్ణ, ర్యాగరమేష్, కుల్కచర్ల శ్రీనివాస్, నీల వెంకటేష్, విక్రంగౌడ్, కృష్ణయాదవ్, రాంబాబు, విష్ణు, నవనీత్, అంజియాదవ్, గజేంద ర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి, హాస్టళ్లు, ఫిర్యాదు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రత్తిపాడు (గుంటూరు) : పసి పిల్లలకు పురుగుల బియ్యంతో కూడు పెడతారా.. ఇదే మీ ఇంట్లోని పిల్లలకైతే ఇలానే వండి పెడతారా.. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన మీరు బీసీ పిల్లల నోట్లో మట్టి కొడతారా.. అంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అంగిరేకుల ఆదిశేషు ప్రభుత్వంతో పాటు సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు తీరుపై ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్తిపాడులోని బీసీ వసతి గృహాలను శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులతో పాటు స్థానిక సిబ్బందితో మాట్లాడారు. స్థితిగతులు, పరిస్థితులను పరిశీలించారు. తదనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అంగిరేకుల ఆదిశేషు మాట్లాడుతూ సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు సొంత నియోజకవర్గంలో వసతి గృహాల పనితీరు అధ్వానంగా ఉందన్నారు. బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో పరిస్థితి దారుణంగా ఉందని, మరుగుదొడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. హాస్టల్ వార్డెన్ మస్తాన్వలి విద్యార్థులతో అనుచితంగా వ్యవహరిస్తూ వారిపై దౌర్జన్యాలకు పాల్పడటం హేయమైన చర్యని తెలిపారు. బీసీ బాలికల వసతి గృహంలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు. 70 మంది విద్యార్థినులకు ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉండటం దుర్మార్గమన్నారు. పురుగులు పట్టిన అన్నం పిల్లలకు పెట్టడంతో పాటు మిగిలిన వ్యర్థాలను పిల్లలకు పెడుతూ అనుచితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే సంబంధిత వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణంగా వసతి గృహాల నిర్వహణ జరుగుతుంటే మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే ఎంతవరకైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు. డీడీకి ఫిర్యాదు.. హాస్టల్లో దుస్థితిపై బీసీ సంక్షేమ శాఖ డీడీ సూర్యనారాయణకు సంఘ నేతలు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. వసతిగృహాల్లో విద్యార్థులు ఆహారం బాగోలేక అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు టి.శ్రీనివాస యాదవ్, బిట్ర వెంకట శివన్నారాయణ, వై.భాస్కర్, బి.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
సొంత భవనం లేక!
సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కరువు ఇబ్బంది పడుతున్న విద్యార్థులు పట్టించుకోని అధికారులు హాస్టళ్లలో ఉండలేమంటున్న విద్యార్థులు ఝరాసంగం రూరల్: విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం తనవంతుగా ప్రచారం కూడా చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెబుతున్నారు. వాస్తవానికి విరుద్దంగా ఉంటోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో ఆశలతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్నారు పేద మధ్యతరగతి కుటుంబాలు. అయితే వసతి గృహాలు మాత్రం వారికి సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. హాస్టళ్లలో ఉండలేమని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెగేసి చెబుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వసతి గృహాల్లో సమస్యల తిష్ట ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దూరప్రాంత విద్యార్థులకు వసతి గృహాలే దిక్కు. అయితే వాటిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్న వారి ఆశలు అడియాసలవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యాభివృద్ధికోసం కృషి చేస్తున్నామని చెబుతున్న వారి మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి. కనీస సౌకర్యాలైన తాగునీరు. విద్యుత్, మరుగుదొడ్లు లేకపోవడంతో చదువుపై దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారు. ఇరకు గదులతో ఇబ్బందులు ఝరాసంగం ఎస్సీ బాలికల వసతి గృహానికి స్వంత భవనం లేక గత ఎనిమిది సంవత్సరాల నుంచి అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ భవనంలో గదులు ఇరుకుగా ఉండడంతో బాలికలు నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు తమ దుస్తులు, పుస్తకాలు పెట్టుకునేందుకు చాలినంత స్థలం లేదు. ఇరుకు గదుల్లోనే సమస్యలతో సహవాసంచేస్తున్నారు. అయినా అధికారులు సౌకర్యాలపై దృష్టిసారించకపోవడం విచారకరం. వసతి గృహంలో ఆరు నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 90 మంది విద్యార్థులున్నారు. ఇంత మందికి రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. స్నానం చేయడానికి కూడా రెండు గదులతోనే సరిపెట్టుకుంటున్నారు. బీసీ వసతి గహంలో మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేక నిరూపయోగంగా మారాయి. దీంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటకు వెళుతున్నారు. కాగా ఇటీవల ఎస్సీ బాలికల వసతి గృహం నిర్మాణానికి రూ.65 లక్షలు మంజూరయ్యాయి. అయితే సదురు కాంట్రాక్టర్ పిల్లర స్థాయిలో పనులను నిలిపివేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. సొంత భవనం సమకూరుతుందనుకున్న వారి ఆశలపై నీళ్లు కుమ్మరించినట్లయింది. అధికారులు చర్యలు తీసుకుని వెంటనే నిర్మాణం పూర్తి అయ్యే చూడాలని కోరుతున్నారు. త్వరగా భవనం పూర్తి చేయాలి గత కొన్నేళ్ల నుంచి సొంత భవనం ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. సొంత భవనం లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. నూతన నిర్మాణం త్వరగా పూర్తి చేసి మా కష్టాలు తీర్చాలి. హాస్టల్లో ఉండలేకపోతున్నాం. - స్వరూప, 10వ తరగతి విద్యార్థిని, ఝరాసంగం ఇరుకైన గదులతో ఇబ్బందులు ప్రస్తుతం ఉన్న భవనంలో మాకు సరిపడా గదులు లేవు. ఉన్న గదులు ఇరుకుగా ఉన్నాయి. మా అందరికి కలిపి రెండు మరుగుదొడ్లే ఉన్నాయి. కొత్త భవనం కడుతూ మధ్యలోనే ఆపేశారు. భవనం పూర్తిచేసి వెంటనే వినియోగంలోకి వచ్చేలా చూడాలి. - సుజాత, 9వ తరగతి విద్యార్థి, ఝరాసంగం జిల్లా అధికారులకు నివేదించాం సొంత భవనం లేక విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా అధికారులకు నివేదించాం. అలాగే భవనం ఏర్పాటు చేయాలని పలుమార్లు నాయకులు, అధికారుల దృష్టికి తీసుళ్లాం. భవనం పూర్తి చేసి వెంటనే వినియోగం వస్తే విద్యార్థులకు ఇబ్బందిలేకుండా ఉంటుంది. - చంద్రమ్మ, వార్డెన్ -
బడుగులు చదువులపై పిడుగుపాటు
నూజివీడు : పేదవర్గాల పిల్లలకు విద్యను అందించేందుకు దశాబ్దాల క్రితం సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వసతిగృహాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చాక ఇష్టారాజ్యంగా మూసేస్తోంది. పేదపిల్లలు చదువుకోవడమే పాపమన్నట్లుగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందంటూ వసతిగృహాలను అడ్డగోలుగా ఎత్తేస్తోంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 30 వసతిగృహాలను మూసేసిన ప్రభుత్వం, మరల ఈ ఏడాది మరో 32 గృహాలను ముసేసింది. మూసేసిన వసతిగృహాలు పోగా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఇంకా 80 వసతిగృహాలున్నాయి. వీటిలో మరో 50 వసతి గృహాలను వచ్చే ఏడాది ఎత్తేయనున్నట్లు ఆయావర్గాలు చెబుతున్నాయి. తాము చిన్నప్పుడు వసతిగృహాలలోనే ఉండి చదువుకుని నేడు ఈ స్థాయికి చేరుకున్నామని ఉన్నతస్థానాలలో ఉన్న పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటుండగా, ప్రభుత్వం మాత్రం వసతిగృహాలను మూసేసి పేదవర్గాల పిల్లలకు విద్యను దూరం చేస్తోంది. పారిశ్రామిక వర్గాలకు వేలాది కోట్ల ప్రజాధనాన్ని రాయితీల కింద ఇవ్వడమే కాకుండా, వందలాది ఎకరాలను తక్కువ ధరకు కట్టబెడుతూన్న ప్రభుత్వం, పేద వర్గాల పిల్లలు తలదాచుకుని చదువుకునే సంక్షేమ హాస్టళ్లపై కక్షగట్టడం అటు దళిత, ఇటు బీసీ వర్గాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమ పిల్లల భవిష్యత్తుపై ఆ వర్గాలు బెంగపెట్టుకున్నాయి. 30 మంది ఉన్నప్పటికీ మూతే నూజివీడు మండలంలోని గొల్లపల్లి, ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి, ముసునూరు మండలం రమణక్కపేట, ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి, రెడ్డిగూడెం మండలంలోని రెడ్డిగూడెంలలోని సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని వసతిగృహాలను ఈ విద్యాసంవత్సరం నుంచి మూసేశారు. ఈ వసతిగృహాలలో 25నుంచి 30మంది విద్యార్థులున్నప్పటికీ మూసేయడం గమనార్హం. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే గ్రామాలలోకి వెళ్ళి పేద వర్గాలకు చెందిన విద్యార్థులను తీసుకొచ్చి జాయిన్ చేసుకోవాలే గాని, ఇలా మూసేయడమేమిటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మెస్ఛార్జీలు, అలంకరణ ఛార్జీలు పెంచాలని, వసతిగృహాలకు కూడా సన్నబియ్యం సరఫరా చేయాలని ఒకవైపు విద్యార్థి సంఘాలు డిమాండు చేస్తుంటే అవేమీ పట్టించుకోకుండా ఏకంగా వసతిగృహాలకు మంగళం పలకడం పట్ల పేదవర్గాలలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి
– ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకష్ణ మహబూబ్నగర్ విద్యావిభాగం: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు దుర్భరమైన పరిస్థితుల్లో గడుపుతున్నారని వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టళ్లను ఏఐఎస్ఎఫ్ ఆ«ధ్వర్యంలో సందర్శించారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ హాస్టళ్లను అభివద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు అమలుచేయడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారని, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ హాస్టళ్లలో మాత్రం దొడ్డుబియ్యం పాలిష్చేసి వడ్డిస్తున్నారని ఆరోపించారు. ఇరుకుగదుల్లో, అద్దె భవనాల్లో హాస్టళ్లు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేతూరి ధర్మతేజ, డి.రాము, జిల్లా నాయకులు కష్ణ, ప్రత్యూష్, నాగరాజు, యువజన సంఘం నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోని ప్రభుత్వం
హుజూర్నగర్ : సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్ అన్నారు. సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన సమర భేరీ సైకిల్ యాత్ర ఆదివారం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా సైకిల్ యాత్రకు స్థానిక ఎస్ఎఫ్ఐ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎంసెట్ –2 నిర్వహణలో విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆకారపు నరేష్, కొమరాజు నరేష్, సైదా, ఆత్కూరి వెంకటేష్, సాయి, గణేష్, భాను, రాజు, మహేష్, పవన్, వెంకటేష్, శ్రీకాంత్, రవి పాల్గొన్నారు. -
వసతిగృహల్లో విద్యార్థుల పరిస్థితి దారుణం
⇒ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ⇒ కందుకూరులో ఎస్ఎఫ్ఐ సైకిల్యాత్ర ప్రారంభం కందుకూరు : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, విద్యారంగ సమస్యల పరిరక్షణ కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. అంతకుముందు స్థానిక ముదిరాజ్ భవన్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వనతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సరైన భోజనం అందక పౌష్టికాహార లోపంతో అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారన్నారు. కనీస సౌకర్యాలు కరువవడంతో బాలికలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటి వరకు పోరాటాల ద్వారానే హాస్టళ్లలోని సమస్యలను పరిష్కరించుకున్నామే తప్ప.. ఎవరి దయాదాక్షిణ్యాలతో కాదన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడంతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, ఉద్యమాలు తప్పవన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎస్ఎఫ్ఐ సంస్థను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డీ జగదీష్, రాజేంద్రనగర్ జోన్ కార్యదర్శి ఆనంద్, అధ్యక్షుడు కేవై ప్రణయ్, నాయకులు హరి, ప్రభావతి, మల్లేష్, భాను, వాజిద్, సాయి, మహేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
కాస్మోటిక్ చార్జీలు కరువు!
బడులు ప్రారంభమైనా విద్యార్థులకు అందని రూ.62లు యూనిఫాంలకు దిక్కులేదు.. ఇబ్బంది పడుతున్న చిన్నారులు మెదక్: వసతిగృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఇప్పటి వరకు కాస్మొటిక్ చార్జీలు అందలేదు. బడులు తెరచి రెండు నెలలు కావొస్తున్నా ‘సొమ్ము’ అందకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు దాదాపు 150 ఉన్నాయి. వీటిలో వేలాది మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి నెలకు ప్రభుత్వం అందించే రూ.62లతో సబ్బులు, నూనెలు, హెయిర్ కట్ చేయించుకుంటారు. ఈ నేపథ్యంలో రెండు నెలలుగా విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు అందించడంతో మాసిన దుస్తులు, పెరిగిన జుట్టుతో పాఠశాలలకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడు పాఠశాలలు ప్రారంభమై రెండు మాసాలు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వలేదు. ఫలితంగా చిరిగిన దుస్తులతో తరగతులకు హాజరవుతున్నారు. ఏటా పాఠశాలలు ప్రారంభమైన 10 రోజుల్లోనే అధికారులు యూనిఫామ్స్ అందించేవారు. వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. పాలకులు, అధికారులు వసతిగృహాల్లో నిద్రలు చేసిన పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
హాస్టళ్ల విద్యార్థులకు అందని యూనిఫాం
నయీంనగర్ : జిల్లాలోని గిరిజన సంక్షేమ హస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇంత వరకు యూనిఫాం అందలేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలన్నర దాటుతున్నా దుస్తులు ఇవ్వకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు వార్డెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన వారం రోజుల్లోనే మొత్తం నాలుగు జతల దుస్తులకు రెండు జతలైనా ఇస్తారు. అయితే, ఈసారి జిల్లాలోని 39 గిరిజన హస్టళ్లు, 39 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని మొత్తం 14వేల మంది విద్యార్థినీ, విద్యార్థులకు దుస్తుల మాటేమో కానీ ఇంత వరకు కొలతలు తీసుకోకపోవడం గమనార్హం. ఇంకా జిల్లాలోని 90 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని పది వేల మంది, 47 బీసీ సంక్షేమ హాస్టళ్లలోని ఏడు వేల మంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సుమారు 20వేల మంది విద్యార్థులకు సైతం ఇంత వరకు యూనిఫాంలు అందలేదు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీల ద్వారా బట్టలు కుట్టించాలని జిల్లా దళిత అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరక్టర్ అంకం శంకర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బీసీ సంక్షేమ శాఖ అధికారులు మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు బట్ట ఇచ్చి విద్యార్థుల దుస్తులు కుట్టిస్తారు. కానీ ఈసారి బట్ట కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ఇప్పటికప్పుడు బట్ట కొనుగోలు చేసినా విద్యార్థుల కొలతలు తీసుకుని దుస్తులు కుట్టించి పంపిణీ చేసే వరకు రెండు నెలలైనా పడుతుంది. అంటే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక నాలుగు నెలల తర్వాతే విద్యార్థులకు యూనిఫాం అందే అవకాశముందని చెప్పొచ్చు. -
హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి
చెన్నూర్ : వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అరిగెల మహేశ్ అన్నారు. సంక్షేమ హాస్టల్ సమస్యలపై చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం చెన్నూర్కు చేరుకుంది. పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా జనరల్ హాస్టల్ విద్యార్థులకు రూ. 2000, కళాశాల విద్యార్థులకు రూ. 2500తో పాటు కాస్మొటిక్స్కు రూ. 400 పెంచాలన్నారు. మధ్యాహ్న భోజనానికి ప్రతి విద్యార్థికి రూ. 40 వరకు ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ప్రతి నెల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్, అనిల్, నాయకులు పవన్కల్యాణ్, మహేశ్, సంధ్య పాల్గొన్నారు. -
విద్యార్థులపై కేసులు సరికాదు
ఎస్ఎఫ్ఐ నగర సమితి ఉపాధ్యక్షుడు సుమంత్ గాంధీనగర్ : వసతి గృహాల మూసివేతను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టడం సరికాదని ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షుడు సీహెచ్. సుమంత్ అన్నారు. ఈనెల 25న అలంకార్ సెంటర్లో ధర్నా చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేసి అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన బుధవారం జరిగింది. సుమంత్ మాట్లాడుతూ హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. నిరసన ప్రదర్శనలో నగర నాయకులు దుర్గాప్రసాద్, ఏ మణికంఠ, బాబి, రాజు పాల్గొన్నారు. -
బయోమెట్రిక్ హాజరుతోనే మెస్ బిల్లులు
– డీడీ యు.ప్రసాదరావు కర్నూలు(అర్బన్): సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల బయోమెట్రిక్ హాజరుతోనే ఇక నుంచి మెస్ బిల్లులు విడుదలవుతాయని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు అన్నారు. బుధవారం ఆయన తన చాంబర్లో సహాయ సంక్షేమాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 1వ తేదీ నుంచి అన్ని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల హాజరుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. బయోమెట్రిక్ మిషన్లలో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలను దృష్టిలో ఉంచుకొని ఐరిస్ను కూడా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ‘వనం–మనం’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీన హాస్టళ్లలో మొక్కలు నాటాలన్నారు. విద్యార్థుల యూనిఫాంను.. ఆయా హాస్టల్ పాయింట్లలోనే కుట్టించేందుకు అవసరమైన క్లాత్ను సహాయ సంక్షేమాధికారులు తీసుకువెళ్లాలన్నారు. ట్యూటర్లు, ప్లేట్లు, గ్లాసులు.. ఇతర అవసరమైన వస్తువుల కోసం ప్రతిపాదనలను అందించాలన్నారు. వసతి గృహాలు విలీనం అయిన దృష్ట్యా టీసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న హెచ్ఎంల వివరాలను తనకు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ప్రకాష్రాజు, సహాయ సంక్షేమాధికారులు రవీంద్రనాథ్రెడ్డి, నాగభూషణం, లక్ష్మయ్య, శ్రీరామచంద్రుడు, గోవిందప్ప, జాకీర్హుసేన్ పాల్గొన్నారు. -
హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలి
గిరిజన జేఏసీ ఆ«ధ్వర్యంలోధర్నా కరీంనగర్ఎడ్యుకేషన్ : ఎస్టీ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని కోరుతూ గిరిజన రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఎస్టీ ఎస్ఎంహెచ్ హాస్టళ్లకు చెందిన విద్యార్థినులు సర్కస్గ్రౌండ్ ర్యాలీగా కలెక్టరేట్ వరకు వచ్చి బైఠాయించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేయగా.. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. విద్యార్థినులు పోలీసుల వాహనాలను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు బలవంతంగా గిరిజన జేఏసీ నాయకులు భీమాసాహెబ్, తిరుపతినాయక్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ప్రతిమామల్టీప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కో ఆర్డినేటర్ జి.భీమాసాహెబ్ మాట్లాడుతూ ఎస్టీ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లు 2005 నుంచి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు. ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో అబ్బాయిలకు, ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో అమ్మాయిలకు హాస్టల్ వసతి కల్పించాలని కోరారు. గిరిజన జేఏసీ నాయకులు శివరాజ్, మోహన్, వెంకటేశ్, భాస్కర్, మౌనిక, సూర్య, రేణుక, కవిత, గౌతమి, కరుణ, రజిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
సం‘క్షామ’ వసతిగృహాలు
చింతూరు : నిర్వహణ సరిగా లేకపోవడం, తమను సరిగా పట్టించుకోవడం లేదంటూ స్థానిక ఎస్సీ వసతిగృహం విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హాస్టల్లో చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాలకు చెందిన విద్యార్థులు ఆశ్రయం పొందుతూ పక్కనే ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ ఏడాది 60 మంది విద్యార్థులు వసతిగృహంలో ఉంటున్నట్టు సిబ్బంది తెలిపారు. వార్డెన్ సరిగా ఉండటం లేదని, తమకు జ్వరాలు వచ్చినా పట్టించుకోవడం లేదని, ఇలాగైతే తాము ఇక్కడ ఉండలేమంటూ ఎటపాక మండలం సీతాపురం గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయినట్టు వారు తెలిపారు. విలేకరులు ఆదివారం వసతిగృహాన్ని సందర్శించగా వెళ్లిపోయిన విద్యార్థులు మినహా, 55 మంది ఉండాల్సి ఉండగా కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. జ్వరాలు రావడంతో 40 మంది వరకు విద్యార్థులు ఇళ్లకు వెళ్లినట్టు మిగతా విద్యార్థులు తెలిపారు. నాలుగు రోజులుగా వార్డెన్ రావడం లేదని సిబ్బందితో పాటు విద్యార్థులు తెలిపారు. హాస్టల్లో మిగిలిన 15 మందిలో చింతూరు మండలం తుమ్మల గ్రామానికి చెందిన విజయ్ అనే విద్యార్థి జ్వరంతో బాధపడుతూ ఇంటికి వెళ్లేందుకు పయనమయ్యాడు. ఆదివారం ఉదయమే కూనవరం మండలం పెదార్కూరుకు చెందిన శివాజీ అనే విద్యార్థి కూడా జ్వరంతో బాధపడుతూ ఇంటికి వెళ్లిపోయినట్లు విద్యార్థులు తెలిపారు. వార్డెన్ లేకపోవడంతో వాచ్మెన్, వంటమనిషి మిగతా విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. జ్వరం తగ్గడం లేదు రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. వార్డెన్ లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోతున్నాను. -విజయ్, 8వ తరగతి, తుమ్మల పరిశీలించి వివరాలు సేకరిస్తా విద్యార్థులు హాస్టల్ వీడుతున్న వైనంపై సిబ్బందిని అడిగి తెలుసుకుంటా. వివరాలు సేకరించి ఏంచేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటా. – డేవిడ్రాజు, ఏఎస్డబ్లు్యవో -
హాస్టళ్ల విలీనానికి నిరసనగా విద్యార్థుల ధర్నా
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పలు రకాల కారణాలతో విలీనం చేస్తే చూస్తు ఊరుకోబోమని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాసఆచారి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో వందలాదిగా విద్యార్థులు సంక్షేమభవన్లో ధర్నా చేపట్టారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, మహేష్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస ఆచారి మాట్లాడుతూ.. జిల్లాలో 18 బీసీ, 23 ఎస్సీ వసతి గృహాలను విలీనం పేరుతో ప్రభుత్వం మూసివేసిందన్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో సంక్షేమ వసతి గృహాల్లో సీట్లు లభించక అనేక మంది విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. పలు వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కూడా భోజనాలు పెట్టడం లేదని, నంద్యాల బొమ్మల సత్రం సమీపంలో ఉన్న బాలికల వసతి గృహాల్లో ఈ దుస్థితి నెలకొందన్నారు. ధర్నాలో ఏబీవీపీ జిల్లా నాయకులు సూర్య, ప్రశాంత్, శ్రీరామ్నాయక్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ముట్టడి
కడప ఎడ్యుకేషన్: సంక్షేమ హాస్టల్స్ మూసివేతను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ను ముట్టడించారు. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పేద విద్యార్థులకు చదువును దూరం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రెండేళ్ల పాలనలో బడా కార్పొరేట్ శక్తులకు ఉడిగం చేయడం తప్ప పేద విద్యార్థులకు చేసిందేమీ లేదన్నారు. హాస్టల్స్ని మూసివేసి విద్యార్థులను గురుకులాలకు తరలిస్తున్నారని, అక్కడ పరిస్థితులు హాస్టల్స్ కంటే దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. బి.మఠం, సగిలేరు, ముక్కవారిపల్లె, రామాపురం, సరస్వతీపురాలలో ఉండే గురుకుల భవనాల పరిస్థితి భయానకరమన్నారు. జిల్లాలో 55 హాస్టల్స్ మూతపడటంతో 1500 మంది విద్యార్థులు రోడ్డునపడ్డారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హాస్టల్స్ మూసివేత ఆలోచనను విరమించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జగదీష్, నగర అధ్యక్ష, కార్యదర్శులు కుమార్, ఓబులేసు, జిల్లా ఉపాధ్యక్షుడు డెవిడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నేతల అరెస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను బలవంతంగా ఆరెస్టు చేసి వాహనంలో స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, జిల్లా అధ్యక్షుడు జగదీష్, నగర అధ్యక్షుడు ఓబులేసు తదితరులను ఈడ్చుకెళ్లి వాహనంలో ఎక్కించి స్టేషన్కు తరలించారు. -
హాస్టళ్లలో అన్నీ సమస్యలే
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ధర్నా గుంటూరు ఎడ్యుకేషన్ : సాంఘిక సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు హాస్టల్ యాత్రలో పాల్గొన్న విద్యార్థులు అనేక సమస్యలను వెలుగులోకి తెచ్చారని, అవే హాస్టళ్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి రావెల కిషోర్బాబు హాస్టళ్లను ఫైవ్ స్టార్ హోటళ్లుగా అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వం గురుకులాల్లో ఏ రకంగా కల్పిస్తారని ప్రశ్నించారు. హాస్టళ్లను మూసివేసి పేద విద్యార్థులకు నష్టం కలిగించే చర్యలు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ బీసీ హాస్టళ్లను బలోపేతం చేసి మరింత మంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రభుత్వం ఉన్న వాటినే మూసివేసే విధంగా వ్యవహరించడం దుర్మార్గ చర్యని అభిప్రాయపడ్డారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో హాస్టళ్లను మూసివేస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. గురుకులాల ఏర్పాటు పేరుతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు అసత్య ప్రచారం సాగిస్తున్నారని, హాస్టళ్ల విలీనం చేయడం ద్వారా వేలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవో సాయి ప్రసాద్ విద్యార్థుల వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. ధర్నాలో డీబీఎఫ్ రాష్ట్ర నాయకుడు కొరివి వినయ్కుమార్, చేతివృత్తిదారుల సంఘ నాయకుడు బైరగాని శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.మనోజ్, కార్యదర్శి వి.భగవాన్ దాస్, నాయకులు వి.జ్యోతి, కె.పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ హాస్టళ్లలో 4650 మందికి వసతి
చిగురుమామిడి : జిల్లాలోని 98 ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఈ విద్యాసంవత్సరం 4650 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పెరిక యాదయ్య తెలిపారు. హరితహారంలో భాగంగా మంగళవారం మండలంలోని ఇందుర్తి ఎస్సీ బాలుర హాస్టల్లో మెుక్కలు నాటారు. జిల్లాలోని అన్ని హాస్టళ్లలో విద్యార్థుల చేత మెుక్కలు నాటించి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాస్మోటిక్స్ చార్జీలను ప్రభుత్వం విడుదల చేసిందని, వాటిని విద్యార్థులకు అందించాల్సి ఉందన్నారు. వసతిగృహాల్లో ప్రథమ చికిత్స మందులు పీహెచ్సీల నుంచే సరఫరా అవుతున్నాయన్నారు. బెడ్షీట్లు, దోమతెరలు రావాల్సి ఉందన్నారు. ప్రతి విద్యార్థికి రూ.500 నుంచి రూ.800 వరకు నోట్బుక్ల కింద అందిస్తున్నట్లు తెలిపారు. వసతిగృహాల నిర్వహణ చార్జీల బడ్జెట్ వచ్చినప్పటికీ ఇంకా విడుదల చేయలేదన్నారు. ఆయన వెంట ఏఎస్డబ్ల్యూవోలు వినోద్కుమార్, బాలసుందర్, ఎంపీటీసీ మొగిలి, ఉపసర్పంచ్ చింతపూల నరేందర్, హాస్టల్ వార్డెన్ వెంకట్రమణారెడ్డి పాల్గొన్నారు. -
భగ్గుమన్న విద్యార్థిలోకం
– హాస్టళ్ల విలీనానికి నిరసనగా సంక్షేమభవన్ ముట్టడి, బైఠాయింపు – జీఓ ప్రతుల కాల్చివేత కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలను విలీనం చేయడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. మంగళవారం మాల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కె. వెంకటేష్, బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రామకష్ణ, అంబేడ్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రాజీవ్కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా వచ్చి సంక్షేమభవన్ను ముట్టడించారు. హాస్టళ్లను ఎత్తివేయరాదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ పారదర్శకత, నాణ్యత పేరుతో ప్రభుత్వం సంక్షేమ వసతి గహాలను రద్దు చేయడంతో అనేక మంది గ్రామీణ∙విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. హాస్టళ్లలోని విద్యార్థులను రెసిడెన్సియల్ పాఠశాలల్లోకి ప్రవేశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతుందని,అయితే వాటిల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు లేవని ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు లేఖ రాశారని ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై ప్రేమ ఉంటే, ముందుగా రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మించి, తర్వాత హాస్టళ్లను ఎత్తివేయాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో 18 బీసీ వసతి గహాలను విలీనం చేసిన ప్రభుత్వం తాజాగా 23 ఎస్సీ వసతి గహాలను విలీనం చేసేందుకు చర్యలు చేపట్టడం దురదష్టకరమన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సంక్షేమ వసతి గహాల్లోని విద్యార్థులు పదోతరగతిలో ఫలితాలు సాధిస్తున్నారని, తప్పుడు నిర్ణయాలతో బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరారు.వసతిగహాల ఎత్తివేత విషయంలో మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో విద్యార్థి నాయకులు సుధాకర్, చిన్న, రాధాకష్ణ, శివ, పవన్, చెన్న కేశవ్, రంగన్న తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరంగం ట్రిపుల్ ఐటీ మూసివేత.. ఉద్రిక్తత
చెన్నై: తమిళనాడు తిరుచ్చిలోని శ్రీరంగం ఐఐఐటీ నిరవధికంగా మూతపడింది. ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం నిన్న ప్రకటించింది. దీంతోపాటు విద్యార్థులు తక్షణమే హాస్టల్స్ ను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఐఐఐటీ స్థాయిలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయల కల్పనలో యాజమాన్య వైఖరికి నిరసనగా విద్యార్థుల పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఫలితంగా హాస్టళ్లలో ఉంటున్న వందలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ జిల్లాల విద్యార్థులు ఉన్నారు. కాగా విద్యార్ధులు నిర్వహిస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడంతో తిరుచ్చిలోని బిట్ క్యాంపస్ లో తాత్కాలికంగా నిర్వహిస్తున్న శ్రీరంగం ట్రిపుల్ ఐటీని నిరవధికంగా మూసివేస్తున్నట్లు డైరెక్టర్ డా.టి.సెంథిల్ కుమార్ ప్రకటించారు. కాలేజీ ప్రతిష్టకు భంగకరంగా విద్యార్థుల ప్రవర్తన ఉందని.. ఇంతరకుమించి తమకు వేరేదారి లేదని వాదిస్తున్నారు. ఒకవైపు శాంతి చర్చలంటూ ఆహ్వానించి, మరోవైపు యాజమాన్యం గైర్హాజరవ్వడంతోపాటుగా ఆందోళన విరమించాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారని విద్యార్థులు ఆరోపించారు. ఇప్పటికిప్పుడు హాస్టళ్లను ఖాళీ చేయమని ఆదేశించడం అప్రజాస్వామికమని, తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ విషయంలో మానవవనరుల శాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2013లో శ్రీరంగం ఎంటెక్ కోర్సుతో ఐఐఐటీని ప్రారంభించింది. అప్పటి నుంచి తిరుచ్చి-పుదుక్కోట రోడ్లోని అన్నా వర్సిటీ బిట్ క్యాంపస్ లో అరకొర వసతులతో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. ఆ తరువాత ఏడాది బీటెక్ లో 70 మంది విద్యార్ధులు అడ్మిషన్ పొందారు. త్వరలో శ్రీరంగంలో సంస్ధ నిర్మాణం చేపడతామని ప్రకటించింది. అయితే తొలి సెమిస్టర్ పరీక్షలు పూర్తైనా , భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పనలో యాజమాన్యం విఫలమైందని ఆరోపిస్తూ గత వారం రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు సంస్థను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించడం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. -
నిర్మించి నిరుపయోగం చేశారు..!
వివిధ డిగ్రీ కళాశాలల్లో వసతిగృహాలకు భవనాల నిర్మాణం మూడేళ్లయినా హాస్టల్స్ ఏర్పాటు చేయని అధికారులు నిరుపయోగంగా భవనాలు.. ప్రైవేట్ కార్యకలాపాలకు వినియోగం నిడదవోలు :జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాలుగేళ్ల క్రితం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం నిర్మించిన వసతిగృహాల భవనాలు నిరుపయోగంగా మారాయి. లక్షల రూపాయలతో భవనాలను నిర్మించినా వాటిలో హాస్టల్స్ నిర్వహించకపోవడంతో అవి విద్యార్థులకు అక్కరకు రాకుండా పోయాయి. దీంతో ఆ భవనాలు ప్రైవేట్ వ్యక్తుల కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయి. వాటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2012లో నిధులు మంజూరు జిల్లాలో నిడదవోలు, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సంక్షేమ వసతి గృహాల నిర్వహించేందుకు భవనాల నిర్మాణానికి యూసీజీ నిధులు మంజూరు చేసింది. నిడదవోలు పట్టణంలో వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో రూ. 58.75 లక్షలతో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. కింద నాలుగు విశాలమైన గదులు, పై అంతస్తులో రెండు గదులతో పాటు డైనింగ్ హాలును నిర్మించారు. 2013లో అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ కళాశాలలో 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పట్టణ చుట్టుపక్కల 48 గ్రామాల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు ఈ కళాశాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి హాస్టల్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావించారు. అయితే అప్పటి నుంచి భవనంలో హాస్టల్ ఏర్పాటు చేయలేదు. నిడదవోలు పట్టణ శివారున ఉన్న ఎస్వీఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా 2010లో యూజీసీ నిధులు రూ.20 లక్షల వ్యయంతో వసతిగృహం నిర్మించారు. కానీ ఇప్పటికి కూడా హాస్టల్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో.. ఇదే విధంగా జిల్లాలోని పాలకొల్లు దాసరి నారాయణరావు మహిళా డిగ్రీ కళాశాలలో రూ.60 లక్షలతో వసతి గృహ భవనం నిర్మించారు. ఇదే పట్టణంలోని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.60 లక్షలతో నిర్మించిన వసతి గృహ భవనం కూడా నిరుపయోగంగా మారింది. తణుకు చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, తాడేపల్లిగూడెం డీఆర్జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా నిర్మించిన హాస్టల్ భవనాలు నిరుపయోగంగానే మారాయి. దాదాపుగా ఈ భవనాలన్నింటిలో ప్రస్తుతం ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. భవనాలు ఖాళీగా ఉండడంతో యోగా, వ్యాయామం క్లాసులు, ఇతర కార్యక్రమాలకు వివిధ సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. కనీసం తాళాలు కూడా వేయకపోవడంతో రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. భవనాల కిటికీలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. అద్దె భవనాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్స్మరోవైపు ఇవే పట్టణాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండడం గమనార్హం. నిడదవోలు పట్టణంలో చాలా కాలం నుంచి ఎస్సీ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఇంటర్ విద్యార్థుల వసతి గృహలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. పట్టణంలోని రాయిపేటలోని బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ను 2008 నుంచి అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంటర్, డిగ్రీ, బీఈడీ విద్యార్థులు కూడా ఉంటున్నారు. నెలకు రూ.20 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. కనీసం ఆ హాస్టల్ను డిగ్రీ కళాశాలలో నిర్మించిన భవనానికి తరలిస్తే ప్రభుత్వానికి అద్దె మిగలడంతో పాటు కళాశాల విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందని పట్టణ ప్రజలు సూచిస్తున్నారు. హాస్టల్ ప్రారంభించేందుకు చర్యలు కళాశాలలో మూడేళ్ల క్రితం యూజీసీ నిధులతో హాస్టల్ భవనం నిర్మించారు. ఏడాది క్రితం కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదాకు యూజీసీ అధికారులకు నివేదిక పంపించాం. అనుమతులు రాగానే హాస్టల్ ప్రారంభించేందుకు కృషి చేస్తాం. - డాక్టర్ ఎస్కే ఇమాంఖాసీం, ప్రిన్సిపల్, ఎస్వీడీ డిగ్రీ కళాశాల, నిడదవోలు -
ఆశ్రమ పాఠశాలల్లో అభద్రత !
అదృశ్యవువుతున్న విద్యార్థినులు వరుస సంఘటనలతో తల్లిదండ్రుల ఆందోళన నర్సంపేట : జిల్లాలోని హాస్టళ్లలో విద్యార్థినుల అదృశ్యం పరంపర కొనసాగుతోంది. మూడుచెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రవు పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు అదృశ్యమైన నెల రోజులకు అనువూనాస్పద స్థితిలో శవాలుగా కనిపించిన ఘటనను వురవకవుుందే గూడూరు గిరిజన బాలికల ఆశ్రవు పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బోడ కవిత అదృశ్యమైన సంఘటన వెలుగులోకి రావడంతో హాస్టళ్లలో బాలికల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. 10 రోజుల క్రితం నర్సంపేటకు చెందిన ఎస్ఎంఎస్ హాస్టల్కు చెందిన ముగ్గురు విద్యార్థినులు గూడూరు వుండలంలోని చిన్నఎల్లాపురం శివారులోని బిషకోబల్తండాలో కొంతవుంది యుువకులతో రాత్రి సవుయుంలో అనువూనాస్పదంగా తిరుగుతుండగా తండావాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వరుస సంఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వివుర్శలు వెల్లువెత్తుతున్నారుు. గతంలో ఎన్నడూ లేనంత అధ్వానంగా గిరిజన సంక్షేవు ఆశ్రవు పాఠశాలలు తయూరవుతున్నారుు. ఇందుకు సంబంధిత హాస్టల్ అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. విద్యార్థులు ఎవరు ఎప్పుడు హాస్టల్లో ఉంటా రో... ఎప్పుడు బయటికి వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వారిపై ఎలాంటి నిఘా లేకపోవడంతో ఇలాంటి అదృశ్యం సంఘటనలు పరిపాటిగా మారుతున్నాయి. ఫలి తంగా విజ్ఞానవంతులుగా పాఠశాలల నుంచి ఇంటికి చేరతారనుకున్న పిల్లల భవిష్యత్ అంధకారంగా మారుతోంది. కొందరు మృత్యు ఒడికి చేరుతుండగా, వురికొందరు ఇంటికి చేరక.. బడిలో ఉండక ఎక్కడ ఉన్నారో తెలియుని దుస్థితి నెలకొంటోంది. ఆదివారమొస్తే హాస్టళ్లు ఖాళీ.. ప్రతి శని, ఆదివారం కొందరు విద్యార్థులను వార్డెన్లు ఇళ్లకు పంపిస్తున్నారు. వీరికి హాజరు వూత్రం క్రవుం తప్పకుండా వేస్తున్నారు. వీరి పేరుతో భోజనం ఖర్చులు మిగుల్చుకుంటూ దందా కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ఏదో ఒక విధంగా విద్యార్థులు ఇళ్లకు వెళ్లడాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రవుం లోనే విద్యార్థులు స్వగ్రావూలకు వెళ్లిపోతున్నారు. హాస్టళ్ల నుంచి ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రావడం సులువుగా మారడంతోనే అదృశ్యం ఘటనలు తరచూ జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టళ్లలో వ రుస సంఘటనలు... నెల రోజుల వ్యవధిలో నర్సంపేట డివిజన్లోని హాస్టళ్లలో పర్యవేక్షణ లోపంతో పలు సంఘటనలు చోటుచేసుకున్నారుు.డిసెంబర్ 27న వుూడుచెక్కలపల్లి ఆశ్ర వు పాఠశాలకు చెందిన ప్రియూంక, భూమిక హాస్టల్ నుంచి అదృశ్యమై వుృత్యువాతపడ్డారు. నర్సంపేట ఎస్ఎంహెచ్ హాస్టల్ విద్యార్థినులు బిషకోబల్తండావాసులకు పట్టుబడగా పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ఓ విద్యార్థిపై కిడ్నాప్ కేసు నమోదైంది.ఈ నెల 4న బిషకోబల్తండాకు చెందిన బోడ సరిత నర్సంపేటలో ఇంటర్ సెకండియర్ ఇయుర్ చదువుతూ అదృశ్యమైంది. మిస్సింగ్ కేసు కూడా పోలీస్స్టేషన్లో నమోదు కాగా నేటికి ఆచూకీ లభించలేదు.డిసెంబర్ 29న పట్టణంలోని టీజీటీడబ్లూఆర్ఎస్కు చెందిన విద్యార్థి పోలెపాక చింటూ అనే విద్యార్థిని గుర్తుతెలియుని వ్యక్తులు కిడ్నాప్ చేయుగా విద్యార్థి తప్పించుకుని హాస్టల్కు చేరుకున్నాడు. ఈ నెల 3న కొత్తగూడ వుండల కేంద్రంలోని టీజీటిడబ్లూఆర్ఎస్లో 6వ తరగతి చదువుతున్న అనూష అనే విద్యార్థిని సారుుదివ్య అనే విద్యార్థిని అన్నంలో విషం కలిపిందనే ఆరోపణలు వచ్చారుు. ఈ నెల 11న గూడూరులోని గిరిజన ఆశ్రవు బాలికల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బోడ కవిత అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నరకానికి నకళ్లు హాస్టళ్లు
-
నీళ్ల చారే గతి..
పప్పన్నమే కాదు..పప్పు చారు కూడా లేదు అంగన్వాడీలకు కందిపప్పు సరఫరా నిలిపేసిన సర్కార్ పాఠశాలలు, హాస్టళ్లకు ఇవ్వలేమంటున్న కాంట్రాక్టర్లు కందిపప్పు నిజంగానే బె‘ధర’గొడుతోంది. సామాన్యులు..మధ్యతరగతి ప్రజలనే కాదు..పప్పంటే లొట్టలేసే చిన్నారులకు కూడా దూరమైంది. చుక్కలనంటిన ధరల పుణ్యమాని ఒక వైపు సర్కార్, మరో వైపు కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో చిన్నారులు పప్పన్నం కాదుకదా..పప్పుచారన్నానికి దూరమవుతున్నారు. ధరల దెబ్బకు నీళ్ల చారే వీరికి దిక్కవుతోంది. విశాఖపట్నం: బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర డబుల్ సెంచరీ దాటడంతో పప్పు కొనాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం అంగన్వాడీ, పాఠశాల చిన్నారులపై పడింది. అధిక మాంసకృత్తులు, పోషకాలు ఉన్న కంది పప్పు సరఫరాను కాంట్రాక్టు సంస్థలతో పాటు సర్కార్ కూడా నిలిపి వేయడంతో జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్ల మెనూలో పప్పున్నం మాయమై పోయింది. జిల్లాలో 4140 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలుండగా మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులు 2,59,047 మంది ఉన్నారు. గతేడాదిగా కందిపప్పు ధరలు పెరుగుతున్నప్పటికీ మూడు నెలలుగా కనివినీ ఎరుగని రీతిలో ధర లు అమాంతంగా పెరగడంతో మధ్యా హ్న భోజన నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లులతో కందిపప్పు కొనే పరిస్థితి లేదని చేతులెత్తేస్తున్నారు. కూరగాయల ధరలు కూడా రోజుకో రీతిలో ఉండడంతో వా రంలో నాలుగు రోజులు ఆకుకూరలు, రసంతోనే కాలం నెట్టుకొస్తున్నారు. రెండ్రోజులు మాత్రమే తక్కువధరకు లభించే కూరగాయలతో కానిచ్చేస్తు న్నారు. ఎక్కడా పప్పు వాసన కూడా తగలనీయడంలేదు. ఈపరిస్థితి ఇలాగే కొనసాగితే మాంసకృత్తులు, ప్రొటీన్లు అందక విద్యార్థులు బలహీనంగా తయారయ్యే ప్రమాదం ఉంది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 65 వసతి గృహాల్లో 5,661మంది విద్యార్థులున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 64 హాస్టళ్లలో 6,600 మంది విద్యార్థులున్నారు. వసతిగృహాలకు కిలో రూ.110కే కందిపప్పు సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.200లు దాటడం తో కంది పప్పు సరఫరా చేయడంలేదు. దీంతో హాస్టల్ మెనూలో కూడా పప్పన్నం మాయమైపోయింది. ఇక జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3587 మెయిన్, 1365 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో మూడునెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 65,317 మంది, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 87,353, బాలింతలు 28,106, గర్భిణులు27,285మంది ఉన్నారు. వీరికి ఆయా కేంద్రాల్లో అమృత హస్తం, బాలామృతం కింద పోషక విలువలతో కూడిన భోజనం అందించాలి. ఇందుకోసం బియ్యం, కందిప్పు ప్రతీ నెలా ప్రభుత్వమే సరఫరా చేస్తుంటుంది. మూడు నెలల క్రితం నుంచి వీటికి కందిపప్పు సరఫరా నిలిపివేయడంతో అంగన్వాడీల్లో చిన్నారులకే కాదు...గర్భిణులు.. బాలింతలకు సైతం పోషకవిలువలను ఇచ్చే పప్నన్నం పెట్టడం మానేశారు. దీంతో విద్యార్థులు, చిన్నారులకు పౌష్టికాహారం లోపానికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ధరలను అదుపుచేయడంతోపాటు హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్వాడీల్లో కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు. -
విద్యార్థినుల ఆకలి కేకలు
వెంకటగిరి(నెల్లూరు): నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో రెండు రోజుల నుంచి అన్నం పెట్టకపోవడంతో.. విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. గురువారం రాత్రి నుంచి బాలికలకు భోజనం పెట్టకపోవడంతో.. పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వసతి గృహ వార్డెన్ బదిలి కావడంతో.. ఆయన స్థానంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారు వసతి గృహానికి రాకపోవడంతోనే విద్యార్థినులకు ఈ పరిస్థితి ఎదురవుతోందని.. వార్డెన్ రేషన్ ఇవ్వకపోవడంతోనే తాము వంట చేయడం లేదని వంటవాళ్లు అంటున్నారు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారనే విషయం తెలిసిన స్థానిక వ్యక్తి ఐదు కేజీల బియ్యం పంపడంతో.. ఇప్పుడే భోజనం వండారు.. కానీ వసతి గృహంలో 120 మంది బాలికలు ఉండటంతో ఐదుకిలోల బియ్యం ఎవరికి సరిపోలేదు.. ఆకలికి తట్టుకోలేని పసి హృద యాలు కడుపుమంటతో క ళ్లు తరిగి పడిపోతుండటంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
‘సంక్షేమం’ మూత!
మూతపడనున్న 26 హాస్టళ్లు ఆగస్టు 7 డెడ్లైన్ జిల్లాలో బాలబాలికలకు తప్పని ఇబ్బందులు గురుకులంలో ఖాళీ లేని సీట్లు ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవితవ్యం తల్లిదండ్రుల్లో ఆందోళన మచిలీపట్నం : జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతిగృహాలను కుదించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాలతో 26 హాస్టళ్లను మూసివేసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గురువారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో ఆగస్టు ఏడో తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 50 మందిలోపు పిల్లలు ఉన్న, అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలన్నింటినీ వెంటనే మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 10వ తేదీనే దీనికి సంబంధించి జీవో నంబరు 45ను ప్రభుత్వం జారీ చేయగా, తాజా ఆదేశాలతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 146 హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 81 బాలురు, 65 బాలికల వసతి గృహాలు. మొత్తంగా 10,376 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ుదించేందుకు రంగం సిద్ధం చేయటంతో జిల్లాలో 15 బాలుర, 11 బాలికల వసతి గృహాలను మూసివేస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 134 మంది బాలురు, 221 మంది బాలికలను ప్రభుత్వ వసతి గృహాల నుంచి బయటకు పంపే ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గురుకులాల్లో సీట్లు ఏవీ? ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏదైనా ప్రాంతంలోని వసతి గృహాన్ని మూసివేస్తే సమీపంలోని గురుకుల పాఠశాలలో ఆ విద్యార్థులను చేర్చాల్సి ఉంది. పాఠశాలలు జూన్ 15న ప్రారంభం కాగా ఇప్పటికే దాదాపు 45 రోజులు గడిచాయి. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను చేర్చాలంటే ముందస్తుగా ప్రవేశ పరీక్ష నిర్వహించి అనంతరమే చేర్చుకుంటారు. ఇవేమీ పట్టించుకోకుండా గుడ్డిగా నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 14 గురుకుల పాఠశాలలు ఉండగా వాటిలో నాలుగు బాలుర, 10 బాలికల పాఠశాలలు. తిరువూరు, నూజివీడు ప్రాంతాల్లో పది గురుకుల పాఠశాలలు ఉన్నాయి. గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను గురుకుల పాఠశాలల్లో చేర్చడానికి వీలు లేకుండా పోయిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటి, రెండు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించినా ఎంతమంది అక్కడ ఉంటారనే అంశంపై అనుమానాలు ఉన్నాయి. మూతబడే హాస్టళ్లు ఇవే... జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాలకు సంబంధించి పెడన, మచిలీపట్నం నంబర్-8, 10, చల్లపల్లి-3, మానికొండ, పామర్రు, అడ్డాడ, ఆరుతెగలపాడు, పమిడిముక్కల, సింగ్నగర్, గుడివాడ-10, తాడంకి, తెన్నేరు, పెనమలూరు, వేలేరులలోని వసతి గృహాలను ఇప్పటికే మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా విద్యార్థులను దగ్గరలోని రుద్రవరం, పామర్రు, తిరువూరు, కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాలల్లో చేరాలని కోరుతున్నారు. ఈ గురుకులాల్లో సీట్లు లేకపోవటంతో 134 మంది బాలురలో అధిక శాతం మంది పాఠశాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బాలికల విభాగంలో ప్రకాష్నగర్, క్రీస్తురాజుపురం, గొల్లనపల్లి, మోటూరు, గుడివాడ-3, 11, నందిగామ జనరల్, వెలగలేరు, నందివాడ, చెన్నూరు, పునాదిపాడు వసతిగృహాలను మూసివేస్తున్నామని, దగ్గరలోని గురుకులాలు, ప్రత్యేక హాస్టళ్లలో చేర్చుతామని చెప్పటమే తప్ప కార్యాచరణకు నోచుకోలేదు. దీంతో వసతి గృహాల్లో ఉన్న 231 మంది బాలికల విద్య ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రభుత్వం వసతి గృహాలను మూసివేయాలని నిర్ణయం తీసుకోవటం, ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థులను గురుకులాల్లో చేర్చేందుకు అవకాశం లేకపోవటం తదితర కారణాలతో అధికారులు సతమతమవుతున్నారు. ఉన్న వసతి గృహాలను తొలగిస్తే పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వసతి గృహాలకు.. విద్యార్థులు కావలెను
స్థానికంగా ఉండని వార్డెన్లు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ఒకప్పుడు సాంఘిక సంక్షేమ వసతిగృహా (హాస్టళ్లు) ల్లో చేరాలంటే విద్యార్థులకు సిఫార్సులు అవసరమయ్యేవి.. నేడు వాటిలో చేరడానికి విద్యార్థులెవరూ ముందుకు రావడంలేదు.. ఖాళీలున్నాయి చేర్పించండంటూ వార్డెన్లు వేడుకునే దుస్ధితి దాపురించింది.. చేవెళ్ల : డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ సాంఘిక సంక్షేమాధికారి (ఏఎస్డబ్ల్యూఓ) పరిధిలో 14 ఎస్సీ హాస్టళ్లున్నాయి. వీటిలో సుమారు 40శాతానికిపైగా ఖాళీలున్నాయి. 2015-16 విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు దాటినా ఇంకా పూర్తిగా భర్తీ కాలేదు. మొత్తం 1,400 మంది విద్యార్థులకుగాను కేవలం 991 మంది మాత్రమే ఉన్నారు. 409 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రతి హాస్టల్లో కనీసం వంద మందిని చేర్చుకునే అవకాశముంది. ఇంతవరకు 35 నుంచి 40 శాతం వరకు ఖాళీలున్నాయి. చేవెళ్ల బాలుర హాస్టల్లో 52 మంది విద్యార్థులు, బాలికల హాస్టల్లో 64, ఆలూరు బాలుర హాస్టల్లో 40, పెద్దమంగళారం హాస్టల్లో 29, శంకర్పల్లి బాలుర హాస్టల్లో 102, బాలికల హాస్టల్లో 63, షాబాద్ బాలుర హాస్టల్లో 92, హైతాబాద్ బాలికల హాస్టల్లో 82, దర్గా బాలుర హాస్టల్లో 68, నార్సింగి బాలికల హాస్టల్లో 60, రాజేంద్రనగర్ బాలుర హాస్టల్లో 95 మంది, బాలికల హాస్టల్లో 172, శం షాబాద్ బాలుర హాస్టల్లో 35, బాలికల హాస్టల్లో 37 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. ఎందువల్ల? ఆయా హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం వండుతున్నా నాసిరకమైన కూరగాయలు, నీళ్లచారు వండి వడ్డిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పాఠశాలల నుంచి సాయంత్రం వచ్చినప్పటినుంచి వార్డెన్ దగ్గరుండి పిల్లలను చదివించాలి. చేరిన విద్యార్థుల్లో స్థానికులైతే చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారు. చాలా మంది వార్డెన్లు స్థానికంగా అందుబాటులో ఉండటంలేదు. దీంతో కామాటీలు, వాచ్మెన్లు, పనిమనుషులు విద్యార్థుల పట్ల ఇష్టారాాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ట్యూషన్లు కూడా చెప్పేవారే కరువయ్యారు. వార్డెన్లు ముట్టజెప్పే అమ్యామ్యాలకు ఉన్నతాధికారులు ఆశపడి కనీసం వారం, పదిహేను రోజులకోసారైనా హాస్టళ్లను పర్యవేక్షించిన పాపానపోవడంలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు చేవెళ్లలోని బీసీ హాస్టల్లో ఇటీవల తాగునీటి కొరతతో మధ్యాహ్నం వరకు కూడా విద్యార్థులు ముఖం కడుక్కోకుండా, స్నానం చేయకుండా ఉన్నారంటే నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. విద్యార్థుల సంఖ్యపై కాకిలెక్కలు ఇప్పటికే హాస్టళ్లలో అతితక్కువ సంఖ్యలో విద్యార్థులున్నా ఉన్నవారి విషయంలోనూ కాకిలెక్కలు చెబుతున్నారు. మా హాస్టల్లో ఇంతమంది విద్యార్థులున్నారని రిజిస్టర్లో చూపిస్తున్న వార్డెన్లు ఎప్పుడైనా ఆకస్మికంగా ఎవరైనా అధికారులు వెళితే ఆ సంఖ్య కనిపించని సందర్భాలున్నాయి. ఎక్కడికి వెళ్లారని నిలదీస్తే ఇప్పుడే వెళ్లారనో, స్థానికులైందున ఇళ్లకు వెళ్లారనో అస్పష్ట సమాధానాలు చెబుతున్నారు. ఏ రోజుకారోజు విద్యార్థుల సంఖ్యను బట్టిమెనూ చార్జీలు క్లెయిమ్ చేయాల్సి ఉన్నా రిజిస్టర్లో నమోదైన సంఖ్య ప్రకారమే పేద విద్యార్థుల బిల్లులు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ హాస్టళ్లలో చేరడానికి విద్యార్థులు, చేర్పించడానికి వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపించడంలేదు. ఖాళీలున్నమాట నిజమే చాలా హాస్టళ్లలో ఖాళీలున్నమాట నిజమే.ఆదర్శపాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాల యాలు (కేజీబీవీ) వసతి గృహాలు ఏర్పాటుచేయడంవల్ల సంక్షేమ హాస్టళ్లలో చేరేవారి సంఖ్య ప్రతియేటా తగ్గుతోంది. హాస్టళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నాం. తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. - శ్వేతాప్రియదర్శిని, ఏఎస్డబ్ల్యూఓ -
సంక్షేమ హాస్టళ్ల మూసివేత
50 మంది విద్యార్థుల లోపున్న హాస్టళ్లను సమీప వసతిగృహంలో విలీనం ఎస్సీ, బీసీ, ఎస్టీ శాఖల పరిధిలో 29 హాస్టళ్లకు పొంచిఉన్న ముప్పు దుబారా వ్యయం తగ్గించేందుకు ప్రభుత్వ నిర్ణయం ఆధార్ కార్డు లింకుతో నిగ్గుతేలిన ఎస్సీ విద్యార్థుల సంఖ్య ఎస్టీ, బీసీ హాస్టళ్లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశాలు నల్లగొండ : సంక్షేమ వసతి గృహాలను ప్రక్షాళన చే సే దిశగా చర్యలు ఆరంభమయ్యాయి. మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య కంటే వసతి గృహాల్లో ప్రవేశాలు సగానికి పడిపోయాయి. అయినా గానీ పలు చోట్ల విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపెట్టి వార్డెన్లు నిధుల దుర్వినియోగానికి పాల్పపడుతున్నారు. గతంలో సంక్షేమ వసతి గృహాలపై అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బోగస్ హాజరును అరికట్టేందుకు ఎస్సీ సం క్షేమ హాస్టళ్లలో ఈ విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఈ విధానం ఇంకా అమల్లోకి రాలే దు. దీంతో హాస్టళ్లలో నిర్దేశించిన దాని కంటే విద్యార్థులు తక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వం అనవసర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. మరోవైపు బోగస్ హాజరు నమోదుతో ప్రతి నెలా లక్షల రూపాయల నిధులు దుర్వినియో గం అవుతున్నాయి. హాస్టల్స్లో చోటుచేసుకుం టున్న అక్రమాలు నిరోధించి.. వ్యయం దుబా రా కాకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 మంది విద్యార్థులోపు ఉన్న హాస్టళ్లను మూసేసి వాటిన్నింటినీ సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే జిల్లా యం త్రాంగం కసరత్తు ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం మేర కు జిల్లా వ్యాప్తంగా 50 మంది విద్యార్థులోపు ఉన్నహాస్టళ్లు 29 ఉన్నాయి. ఈ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులను సమీప హాస్టళ్లలో చేర్పించడం ద్వారా హాస్టళ్ల నిర్వహణ పేరిట ఖర్చువుతున్న లక్షల రూపాయలు ప్రభుత్వానికి మిగులు బడ్జెట్గా మారుతుంది. నిగ్గుతేలిన నిజాలు.. ఎస్సీ హాస్టళ్లలో ప్రవేశపెట్టిన బయెమెట్రిక్ విధానం సత్ఫలితాలు సాధించిందని చెప్పొ చ్చు. బయెమెట్రిక్ విధానం ప్రవేశపెట్టే క్రమంలోనే 50 మంది విద్యార్థులలోపు ఉన్న హాస్టళ్లు కాకుండా మిగిలిన హాస్టళ్లలో అమలు చేస్తున్నారు. బయెమెట్రిక్ హాజరుకు విద్యార్థి ఆధార్ కార్డు వివరాలే కీలకం. దీంతో ఆధార్ కార్డులో విద్యార్థుల స్థానికతకు సంబంధించిన వివరాలు బహిర్గతమవుతున్నాయి. నిబంధనల ప్రకారం గ్రామానికి 5 కి.మీ దాటిన విద్యార్థులకు మాత్రమే హాస్టళ్లలో ప్రవేశం కల్పిస్తారు. అయితే ఆధార్ లేనప్పుడు ఇవేమీ పట్టించుకోకుండా విద్యార్థులను చేర్పించుకున్నారు. గతంలో ఏదేని ప్రభుత్వ అధికారి ధ్రువీకరించిన కుల, ఆదాయ సర్టిఫికెట్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం దొరికేది. కానీ ప్రస్తుతం తహసీల్దార్ ధ్రువీకరణ, మీ సేవ కేంద్రాల ద్వారా పొందిన సర్టిఫికెట్లు మాత్రమే హాస్టళ్లలో ప్రవేశానికి అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డు వల్ల విద్యార్థుల స్థానికత తెలుస్తోంది. దీం తో ఆధార్ కార్డు వివరాలను బయెమెట్రిక్ అనుసంధానం చేసినప్పుడు ఆటోమెటిక్గా విద్యార్థుల అడ్మిషన్ను తీసుకోవడమా..? తిరస్కరించడం..? జరుగుతుంది. దీంతో హాస్టల్స్ లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోయాయి. హాస్టళ్లలో 30నుంచి 40 మందిమాత్రమే.. తుంగతుర్తి మండల కేంద్రంలోనే 9 వసతి గృహాలు ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. ఎస్సీ బాలుర హాస్టల్స్, ఎస్సీ బాలికల హాస్టల్, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, బాలుర రెసిడెన్షియల్ స్కూల్ (జనరల్), గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, ఎస్టీ బాలుర హాస్టల్, బీసీ బాలుర హాస్టల్, కస్తూర్బాగాంధీ బాలిక ల విద్యాలయం, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్లో వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటే హాస్టళ్లలో 30 నుంచి 40 మందికి మించి విద్యార్థులు చేరడం లేదు. నిన్న మొన్నటి వరకు ఇక్కడ బీసీ కాలేజీ విద్యార్థులకు హాస్టల్ను కొనసాగించారు. ఈ ఏడాది విద్యార్థులు ఎవరూ చేరకపోవడంతో ఇటీవల దానిని మూసేశారు. రూ. లక్షల్లో దుబారా ఒక్కో హాస్టల్లో పనిచేసే వార్డెన్, కుక్, కామాటి, వాచ్మన్, పార్టీ టైం వర్కర్ల వేతనాలు, అద్దె భవనాలకు చెల్లిస్తున్న వాటితో కలిపి నెలకు సుమారు రూ. రెండు లక్షల వరకు ఖర్చు అవుతోంది. 50 మంది విద్యార్థులోపుఉన్న హాస్టల్కు ఎంతైతే ఖర్చువుతుందో అంతే వ్యయం వంద మంది విద్యార్థులు ఉన్న హాస్టల్కు వెచ్చించాల్సి వస్తోంది. అనవసరంగా భరించే ఆర్థిక భారం నుంచి తప్పుకునేందుకే ప్రభుత్వం ‘విలీన’ అస్త్రాన్ని ప్రయోగించింది. శాఖల వారీగా ఇదీ పరిస్థితి.... ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 121 వసతి గృహాలు ఉన్నాయి. ఈ హాస్టళ్లకు మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య మొత్తం 12,100. కాగా విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోవడంతో గతంలోనే ఐదు హాస్టళ్లను మూసేశారు. ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన 116 హాస్టళ్లలో 9,739 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. దీంట్లో 50 మంది విద్యార్థుల్లోపు ఉన్న హాస్టళ్లు 26 ఉన్నాయి. భువనగిరి ఏఎస్డబ్ల్యూఓ పరిధిలోనే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఉదాహరణకు అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి, తుంగతుర్తి హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య 40 నుంచి 54 లోపు ఉన్నారు. ఎస్టీ సంక్షేమ శాఖలో 36 హాస్టళ్లు ఉంటే కేవలం నెమ్మికల్ హాస్టల్లో మాత్రమే 50 లోపు విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం హాస్టళ్లలో మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య 14,810 కాగా.. ఇప్పటి వరకు 13,810 మంది ప్రవేశాలు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాలో బోగస్ విద్యార్థుల హాజరు ఎక్కువగా ఎస్టీ సంక్షేమ శాఖలోనే నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఏసీబీ అధికారులు సైతం ఎస్టీ, ఎస్సీ హాస్టళ్ల పైనే మెరుపు దాడులు చేయడం ఇందుకు నిదర్శనం. బీసీ సంక్షేమ శాఖలో 68 హాస్టళ్లకు గాను మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య 7,715. దీంట్లో ఈ విద్యాసంవత్సరానికి ప్రవేశం పొందిన విద్యార్థులు 7,200 మంది ఉన్నారు. 50లోపు విద్యార్థులు ఉన్న హాస్టళ్లలో కోదాడ మండలం దొండపాడు, అడవిదేవులపల్లి హాస్టళ్లు ఉన్నాయి. దొండపాడు హాస్టల్ను కోదాడకు, అడవిదేవులపల్లి హాస్టల్ను దామరచర్లకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఇదిలాఉంటే బీసీ, ఎస్టీ హాస్టళ్లను జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి.. నియోజకవర్గంలో సంక్షేమ వసతిగృహాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా స్థానిక ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి. హాస్టళ్లకు అడ్వయిజరీ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఆమోదంతోనే విలీనం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎమ్మెల్యేలు ఏవిధంగా వ్యవహారిస్తారన్నది వేచిచూడాలి. -
బీసీ హాస్టళ్లలో ఖాళీల మోత..!
మొత్తం 549 పోస్టులు ఖాళీ హైదరాబాద్: రాష్ర్టంలోని చాలామటుకు బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో వార్డెన్లతో సహా వాచ్మెన్, కామాటీ, వంటవాళ్ల ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యాసంవత్సరం మొదలయ్యేనాటికే అన్ని వసతులను కల్పిస్తామని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో లోటు లేకుండా చేస్తామన్న మంత్రి ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ అనే తేడా లేకుండా ఆయా హాస్టళ్లలో ఖాళీల భర్తీకి ప్రభుత్వపరంగా చర్యలు కరువవుతున్నాయి. స్కూల్, కాలేజీ హాస్టళ్లలో విద్యార్థుల బాగోగులు చూసే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 239 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీ రాష్ర్టంలోని మొత్తం 490 ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో వార్డెన్, వంటవాళ్లు, వాచ్మెన్, కామాటీలు కలుపుకుని 549 పోస్టులు ఖాళీగా ఉండటం హాస్టళ్లలో ఉన్న స్థితికి అద్దం పడుతోంది. ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో 239 హేచ్డబ్ల్యూఓ పోస్టులు ఖాళీగా ఉండగా.. ప్రీమెట్రిక్కు సంబంధించి 177 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, పోస్ట్మెట్రిక్ హాస్టళ్లలో 62 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హేచ్డబ్ల్యూఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్థికశాఖ వద్ద ఫైల్ వార్డెన్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖ ద్వారా పంపిన ఫైలు ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. అంతేకాకుండా హాస్టళ్లకు కామాటీలు, వంటవాళ్లు, వాచ్మెన్ను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకునేందుకు అనుమతినివ్వాలని ఆర్థికశాఖను బీసీశాఖ కోరింది. వార్డెన్ పోస్టుల భర్తీకి సమయం పట్టినా, వంటవాళ్లు, కామాటీ, వాచ్మెన్ పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడవచ్చునని ఈ శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
అనుమతి లేని కళాశాలల్లో చేరొద్దు
22 జూనియర్ కాలేజీలు మనుగడలో లేవు ఇంటర్మీడియట్ ఆర్ఐవో వెంకటేశ్వరరావు ఖమ్మం : జిల్లాలో అనుమతిలేని, ప్రభుత్వ గుర్తింపు లేని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు చేరకూడదని ఇంటర్మీడియట్ జిల్లా పర్యవేక్షణాధికారి వెంకటేశ్వరరావు సూచించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం నిర్వహించే వసతిగృహాలు స్థానిక అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలలు నిర్వహిస్తున్న భవనాల్లో కోచింగ్సెంటర్లు, ఇతర అకాడమిలు నిర్వహించరాదని, నిర్వహిస్తే ఏ నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారో తెలుపాలన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనల మేరకే తరగతులు నిర్వహించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోర్డు ఆదేశాల మేరకే బోధన, ఇతర రుసుములు తీసుకోవాలని, ఎక్కువ తీసుకుంటే శిక్షార్హులన్నారు. పనిచేయని కళాశాలలు ఇవే.. జిల్లాలో 22 జూనియర్ కళాశాలలు మనుగడలో లేవని ఆర్ఐవో తెలిపారు. మూడు సంవత్సరాలుగా ఎటువంటి ప్రవేశాలు లేకుండా క్లాసులు నిర్వహించకుండా ఉన్నందున ఈ కళాశాలలను నాట్ ఫంక్షనింగ్లో పెట్టామన్నారు. వీటిలో మ్యాట్రిక్స్ (ఖమ్మం), వాణి జూనియర్ కాలేజీ (ఖమ్మం), ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజీ (ఖమ్మం), కిన్నెర ఒకేషనల్ జూనియర్ కాలేజీ (ఖమ్మం), నిర్మల ఒకేషనల్ జూనియర్ కళాశాల (ఖమ్మం), భారత్ జూనియర్ కాలేజీ (కొత్తగూడెం), కేఎల్ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల (కొత్తగూడెం), ఎస్ఆర్ జూనియర్ కళాశాల (కొత్తగూడెం), ఎస్వీ ఒకేషనల్జూనియర్ కళాశాల (ఖమ్మం), కృషి జూనియర్ కాలేజీ (వేంసూరు), గౌతమి జూనియర్ కాలేజీ (పాల్వంచ), ఎస్వీజీఎస్ జూనియర్ కాలేజీ (కొణిజర్ల), పులిపాటి ప్రసాద్జూనియర్ కాలేజీ (అమ్మపాలెం), భారతి ఒకేషనల్ జూనియర్కాలేజీ (వైరా),మదర్ థెరిసా జూనియర్ కాలేజీ (మణుగూరు), అటమిక్ ఎనర్జీ జూనియర్ కాలేజీ (అశ్వాపురం), శ్రీచైతన్య జూనియర్ కాలేజీ (తిరుమలాయపాలెం), శ్రీచైతన్య జూనియర్కాలేజీ (నేలకొండపల్లి), న్యూవిజన్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ (నేలకొండపల్లి), పీబీసీఎస్ఈఎల్ జూనియర్ కాలేజీ (సారపాక), శ్రీవాణి జూనియర్కాలేజీ (సారపాక), ఎస్వీజీఎస్ జూనియర్కాలేజీ (బోనకల్) ఉన్నాయని తెలిపారు. -
వసతి లేనట్టే
ఆదర్శంలో కరువైన వసతి - నాలుగేళ్లుగా అతీగతీ లేదు - 47 పాఠశాలలకు 25 హాస్టళ్లే పూర్తి - విద్యార్థులపై రవాణా భారం కరీంనగర్ ఎడ్యుకేషన్ : గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ‘ఆదర్శ’ విద్య వ్యవహారం ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన మోడల్స్కూళ్లు నేటికీ హాస్టల్ వసతికి నోచుకోవడం లేదు. ఈ ఏడాది సైతం ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి ఉండడంతో విద్యార్థులకు రవాణాభారం తప్పేలా లేదు. నిరుపేద విద్యార్థులకు సీబీఎస్ఈ తరహా విద్య అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం మోడల్స్కూళ్లను ప్రారంభించింది. 6 నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ బోధన అందించనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లా 47 పాఠశాలలు మంజూరయ్యాయి. స్థల సేకరణ, భవన నిర్మాణంలో నిర్లక్ష్యంతో మేడిపల్లి, కొడిమ్యాల మండలాల్లో తరగతులు ఇప్పటికీ ప్రారంభం కాకపోగా మిగతా 45 మండలాల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటినుంచే బాలబాలికలకు వేర్వేగా వసతిగృహ సదుపాయం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విస్మరించింది. పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఇప్పటివరకు 25 పాఠశాలల్లో మాత్రమే వసతిగృహాల నిర్మాణం పూర్తయింది. 8 పాఠశాలల్లో భవన నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. మరో రెండు భవనాలు రూఫ్ స్థాయిలో, మూడు భవనాలు బేస్మెంట్ స్థాయిలో ఉండగా, ఎనిమిది టెండర్ దశలోనే మగ్గుతున్నాయి. ఆదినుంచి ఇబ్బందులే... మోడల్స్కూళ్లు ప్రారంభించినప్పటినుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి. బోధన సిబ్బంది ఉన్నా బోధనేతర సిబ్బంది లేక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతీ మండలంలో ఎక్కడో ఊరు చివరన ఈ పాఠశాలలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్లనైతే బస్సులు కాదు కదా... కనీసం ఆటోలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. పాఠశాలకు వెళ్లి మళ్లీ ఇంటికి రావాలంటే సాహసమే. ఊరికి దగ్గరగా ఉన్నవారు నడిచివెళ్లడమో... మిగతా వారు ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని వెళ్లిరావడమో చేస్తున్నారు. దీంతో విద్యార్థులపై రవాణాభారం అధికంగా పడుతోంది. సమయమంతా ప్రయాణానికే సరిపోతోంది. ఈసారి కూడా హాస్టల్ సదుపాయంపై ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశాలే కనిపిస్తుండడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాల మధ్య చదువు సాగించేకంటే సమీపంలోని పాఠశాలల్లో చేర్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రతీ పాఠశాలకు రూ.3 కోట్లు మోడల్స్కూళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ పథకం కింద ప్రభుత్వం ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 75 శాతం కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం. దీనికితోడు పాఠశాల నిర్వహణ కోసం రూ.75 లక్షలు ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని నిర్ణయించింది. ఒక్కో పాఠశాలలో ప్రయోగశాల, లైబ్రరీ, క్రీడా మైదానం, స్టాఫ్ రూంలు, బాలబాలికల వసతిగృహాలు, సిబ్బంది ఉండేందుకు వీలుగా నివాస గృహాలు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. కానీ, కేవలం పాఠశాల నిర్మాణం మినహా మిగతావన్నీ అటకెక్కాయి. -
'హాస్టల్స్ను రెసిడెన్షియల్స్గా మార్చుతాం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతి గృహాలను రెసిడెన్షియల్ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. ఈ మేరకు వార్షిక బడ్జెట్ లో ఏటా రూ. 1000 నుంచి రూ. 1200 కోట్లు కేటాయిస్తామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం, గుంటూరు జిల్లా పత్తిపాడు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంతోపాటు మరో చోట హాస్టళ్ల స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయినట్లు వివరించారు. ఆదివారం విజయవాడలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, జేడీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల రాష్ట్ర స్థాయి వర్క్షాపులో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో రూ. 25 కోట్లతో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
సంక్షేమ హాస్టళ్లలో.. సమస్యల ముళ్లు
హాస్టళ్ల విద్యార్థులను పీడించిన పాత సమస్యలు విరగడ కాకుండానే కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఊడిన మరుగుదొడ్ల తలుపులు అలాగే ఉన్నారుు. దుస్తులు, వస్తువులను తుప్పురేకుల పెట్టెల్లోనో, నేలపైనో ఉంచాల్సిన దుస్థితి కొనసాగుతూనే ఉంది. కష్టాలు తిష్ట వేసిన అద్దె భవనాల నుంచి విముక్తీ సుదూరమే. మరో వైపు హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టు నిధులు పెంచడానికి సిద్ధంగా లేదు. పిఠాపురం : జిల్లాలో పదవతరగతి లోపు ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు ఉండే వసతి గృహాలు (హాస్టళ్లు) 61 ఉండగా ఆ వర్గాల కాలేజీ విద్యార్థులుండే వసతిగృహాలు 38. వీటిలో సుమారు 9,400 మంది వసతి పొందుతున్నారు. 80 శాతానికి పైగా వసతిగృహాలలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బాలికల వసతిగృహాలలో మరుగుదొడ్లు లేక వారు పడుతున్న తిప్పలు.. గొప్పలు చెప్పుకొనే సర్కారు తలదించుకోవలసినవేనని చెప్పక తప్పదు. ఇక ఇచ్చే ఆహారంలో పోషక విలువలు లేక పలువురు విద్యార్థులు రక్తహీనత వంటి రోగాల బారిన పడుతున్నారు. ఒక్కో విద్యార్థికీ రోజూ 2,600 కిలో కేలరీల శక్తి గల ఆహారపదార్థాలు అందించాల్సి ఉండగా ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం కేవలం 1,500 కిలో కేలరీల శక్తినిచ్చే పదార్థాలు మాత్రమే అందుతున్నారుు. ఏరీ ఏఎన్ఎంలు? ప్రతి వసతిగృహంలో ఒక ఏఎన్ఎంను నియమించాల్సి ఉండగా ఏ ఒక్క దానిలో నూ వారు అందుబాటులో లేరు. దాంతో ఆ రోగ్య పరీక్షలు జరగక విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆరోగ్య ప రీక్షల నిమిత్తం ఒక్కో హాస్టల్కు నెలకు రూ. 1,000 కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వం వాటి ఊసెత్తడం లేదు. అనేక వసతిగృహా ల్లో ట్యూటర్ లేక పాఠ్యాంశాల్లోని సందేహాల్ని నివృత్తి చేసుకోలేకపోతున్నారు. పలు హాస్టళ్ల ప్రాంగణాల్లో లైట్లు వెలగక విద్యార్థులు చీకటిలోనే సంచరిస్తున్నారు. పలుచోట్ల హ్యేండ్ పంపులు రిపేరు వచ్చి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు జరగడం లేదు. ఇక మన్యంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. ఐరన్ లోపంతో పలువురు విద్యార్థులు మృత్యువాత పడుతున్నట్లు చెబుతున్నారు. నీటిశుద్ధి యంత్రాలు దాదాపు అన్నీ మూలనపడ్డారుు. చెప్పులూ అందలేదు.. సుమారు ఆరేళ్లుగా విద్యార్థులకు పెట్టెలు ఇవ్వక పోవడంతో తుప్పు పట్టిన పెట్టెల్లోనో, నేలపైనో ఉంచుకోవాల్సి వస్తోంది. కాస్మోటిక్స్ చార్జీలు సకాలంలో అందవు. పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకోకుండా తక్కువ ధరలున్నప్పటి చార్జీలనే ఇవ్వడం వల్ల విద్యార్థులు చాలీచాలని సరుకులతో కాలం గడపాల్సి వస్తోంది. ఏడాదికోసారి పంపిణీ చేయాల్సిన చెప్పులు, బ్యాగులు, దుప్పట్లు, నోట్ పుస్తకాలు, కార్పెట్లు గత ఏడాది పూర్తిస్థాయిలో అందలేదు. జిల్లాలో 45 వరకు వసతిగృహాలు అద్దె భవనాలలోనే ఉన్నాయి, ఇవి కూడా శిథిలావస్థలో సమస్యలకు నెలవులుగా ఉన్నాయి. చాలీచాలని ఇరుకు గదులో మగ్గుతూనే విద్యార్థులు ఏడాదంతా గడుపుతున్నారు. సౌకర్యాల మెరుగుకు చర్యలు : డీడీ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగు పర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు చెప్పారు. రామచంద్రపురం, కాకినాడ, రంపచోడవరంలలో సొంత భవనాలను నిర్మించామని, మిగిలిన చోట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్టెలు గత ఆరేళ్ల నుంచి ఇవ్వలేదని, ప్రస్తుతం ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. -
ఈ ఏడాది నుంచి హాస్టళ్లలో బయోమెట్రిక్
మంత్రి జోగు రామన్న వెల్లడి సాక్షి , హైదరాబాద్: హాస్టళ్లల్లో బోగస్ అడ్మిషన్లను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బయోమెట్రిక్ హాజరు పద్ధతిని ఈ ఏడాది నుంచి పాఠశాలలు, క ళాశాల హాస్టళ్లలోనూ తప్పనిసరి చేస్తోంది. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా అడ్మిషన్లలో అవకతవకలను నివారించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ర్ట మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు, డీడీలు, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. స్కూళ్ల హాస్టల్ విద్యార్థుల మాదిరిగానే కళాశాల హాస్టళ్లలోనూ ఆన్లైన్ ద్వారా రిజస్ట్రేషన్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. -
అరచేతిలో హాస్టల్ దునియా!
►12 నగరాల్లో.. 1,800 హాస్టళ్ల వివరాలు నమోదు ►రూ. 50 లక్షల నిధులు సమీకరించిన హాస్టల్ దునియా.కామ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా హైదరాబాద్కొస్తే ఎక్కడుండాలి! బంధువులో.. స్నేహితులో ఉంటే సరి. లేకపోతే హాస్టలే గతి. మరి ‘ఎక్కడ.. ఏ హాస్టల్ అయితే బాగుంటుంది? ఈ విషయం ఎవరైతే కరెక్ట్గా చెబుతారు!!’ ఇప్పుడివన్నీ సిల్లీ క్వశ్చన్స్. ఎందుకంటే హాస్టల్దునియా.కామ్లోకి వెళితే చాలంటున్నాడు దీని వ్యవస్థాపకుడు రాజు అంబరగొండ. హైదరాబాద్లోనే కాదు దేశవ్యాప్తంగా 12 నగరాల్లోని హాస్టల్ వివరాలను ఆన్లైన్లో పొందుపరిచాడు కూడా. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. కళాశాలలో చదువుకునేందుకు నగరానికొచ్చిన కొత్తలో సరైన హాస్టల్ సదుపాయం లేక చాలా ఇబ్బంది పడ్డాను. జస్ట్ డయల్ ద్వారా వెదికితే.. అడ్రస్ ఉంటుందే తప్ప ఆ హాస్టల్లోని సదుపాయాల గురించి ఉండదు. అప్పుడే అనిపించింది ఓ యూజర్ఫ్రెండ్లీ వెబ్సైట్లో నగరంలోని హాస్టల్ వివరాలను పెడితే బాగుంటుందని. అయితే వెబ్సైట్ డిజైనింగ్కు కొంత మొత్తం కావాలి. అందుకే చదువు పూర్తయ్యాక ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాను. నెలవారీ జీతంలో కొంత మొత్తం పోగు చేసి 2013 మార్చిలో హాస్టల్దునియా.కామ్ వెబ్సైట్ను డిజైన్ చేశాను. రోజుకు 300 మంది యూజర్లు.. హాస్టల్దునియా.కామ్ను రోజుకు 300 మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు 12 లక్షల మంది యూజర్లు చూశారు. ఇందులో సగానికి పైగా వినియోగదారులు మహిళలే. హైదరాబాద్లో మొత్తం 900 హాస్టల్స్ వివరాలున్నాయి. ఎక్కువగా అమీర్పేట, మాదాపూర్ ప్రాంతాల హాస్టల్స్ వివరాల కోసమే వెతుకున్నారు. హాస్టల్దునియాను వినియోగించుకోవటమూ సులువే. వెబ్సైట్కి వెళ్లి మనకు కావాల్సిన సదుపాయాలను ఆప్షన్స్లో టైప్ చేస్తే చాలు. మన రిక్వెస్ట్కు తగిన హాస్టల్ అడ్రస్, ఫోన్ నంబర్తో సహా మన ముందుంటాయి. ఏడాదికి రూ.6,000 ప్రస్తుతానికైతే హాస్టల్ దునియాలో నమోదు చేసిన హాస్టల్స్ నిర్వాహకుల నుంచి ఎలాంటి రుసుము తీసుకోవట్లేదు. ఉచితంగానే సేవలనందిస్తున్నాం. సంస్థ విస్తరణ, ఉద్యోగుల నియామకాల నేపథ్యంలో రెండు నెలల తర్వాత నుంచి ఏడాదికి రూ.6,000 ఫీజు వసూలు చేస్తాం. రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. 12 నగరాలు.. 1,800 హాస్టళ్లు.. సంస్థ పెట్టిన కొత్తలో హాస్టల్స్ వివరాలు కావాలని నిర్వాహకుల వద్దకు వెళితే చాలామంది తిరస్కరించారు. ఏ ఐటీ అధికారో పంపించి ఉంటారని భయపడ్డారు కూడా. చాలా ఓపికతో విషయం చెప్పి, వారి నుంచి వివరాలు తీసుకున్నాను. వెబ్సైట్ను ప్రారంభించాక కొన్ని రోజులకే కస్టమర్ల సంఖ్య పెరిగింది. దీంతో మా హాస్టల్ వివరాలూ వెబ్సైట్లో పెట్టండని నిర్వాహకులే ఫోన్ చే సే స్థాయికి ఎదిగాం. హాస్టల్దునియాలో అడ్రస్, ఫోన్ నంబర్ మాత్రమే పెట్టి ఊరుకోలేదు. హాస్టల్లో ఉన్న సదుపాయాలు, సింగిల్ రూమ్కు ఫీజెంత? డబుల్ షేరింగ్ ఎంత? ఏసీ ఉంటే ఎంత.. లేకపోతే ఎంత? ఇలా అన్ని వివరాలూ ఉంటాయి. ఆ హాస్టల్కు ఎంత దూరంలో ఏమేం సదుపాయాలుంటాయో కూడా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోటా, నాగ్పూర్, కోయంబత్తూరు, భోపాల్, ఇండోర్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కాకినాడ నగరాల్లో మొత్తం 1,800 హాస్టల్స్ వివరాలు హాస్టల్దునియాలో ఉన్నాయి. అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
జిల్లాకో మైనార్టీ గురుకులం, వసతి గృహం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున 10 మైనార్టీ గురుకుల పాఠశాలలు, 10 పోస్టు మెట్రిక్ వసతి గృహాలు మంజూరు చేసినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనార్టీ విద్యార్థుల విదేశీ చదువు కోసం ఓవర్సీస్ స్టడీ స్కీం కింద రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉపకార వేతనం అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఈ పథకం కింద ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఉర్దూను మొదటి భాషగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని గుర్తు చేశారు. మైనార్టీ విద్యార్థులు, నిరుద్యోగుల కోసం కెరీర్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముస్లిం కుటుంబాల కోసం మ్యారేజ్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పాతబస్తీలోని చిరు వ్యాపారులకు స్వల్ప కాలిక రుణాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. -
గిరిజన పిల్లల బడిబాటకు కసరత్తు
* జూన్లో కొమురం భీం ఎడ్యుకేషనల్ ఫెస్టివల్ * నేడు బడి వయసు పిల్లల గుర్తింపునకు సర్వే సాక్షి, హైదరాబాద్: బడి మానేస్తున్న, చదువుకు దూరమవుతున్న గిరిజన పిల్లల పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వివిధ రూపాల్లో చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో కొత్త విద్యార్థులను చేర్చుకునేందుకు జూన్ 15-20 తేదీల్లో ‘కొమురం భీం ఎడ్యుకేషన్ ఫెస్టివల్’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం కింద గిరిజన తల్లితండ్రులతో టీచర్ల సమావేశాలు, టీచర్లు, పిల్లలతో ర్యాలీలు, టీచర్లు, ఎన్జీవోలు ఇంటింటికీ వెళ్లి కొత్త విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం, బాలికల విద్యా దినోత్సవం వంటి వాటిని నిర్వహించాలని నిర్ణయించింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచాక గిరిజన పిల్లలను చేర్చుకునేందుకు, ఇందుకు సంబంధించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిం చేందుకు ఆయా కార్యక్రమాలు చేపట్టనుంది. అర్హులైన గిరిజన బాలబాలికల వంద శాతం ఎన్రోల్మెంట్ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా గిరిజన ఆవాసాల్లో ఐదేళ్లకు పైబడిన బడిఈడు పిల్లలను గుర్తించేందుకు బుధవారం సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో ప్రైమరీ స్కూల్ టీచర్లంతా పాల్గొనేలా ఆదేశాలు జారీచేశారు. గిరిజన పిల్లలు స్కూళ్లలో చేరి చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టేందుకు 6-14 ఏళ్ల వయసు వారి జాబితాను అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, గ్రామపెద్దల నుంచి తీసుకోనున్నారు. ముందుగా ఆయా పిల్లల వివరాలు, సమాచారాన్ని తీసుకుని వారిని స్కూళ్లలో చేర్పించేందుకు ఉపయోగించుకోవాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. పిల్లల తల్లితండ్రులకు విద్యావశ్యకతను వివరించి, వారిని పాఠశాలల్లో చేర్పించేలా టీచర్లు చొరవ తీసుకోవాలని నిర్దేశించింది. జూన్లో గిరిజన విద్యార్థులందరికీ టెక్ట్స్బుక్స్, నోట్బుక్స్ అందించాలని, స్కూల్ యూనిఫారాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. బాలికలపై ప్రత్యేక శ్రద్ధ... బడులకు దూరమైన విద్యార్థులను ముఖ్యంగా బాలికలను అన్ని కసూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), మినీ గురుకులాల్లో చేర్చుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను గిరిజన సంక్షేమశాఖ ఆదేశించింది. ముఖ్యంగా అమ్మాయిలను 10వ తరగతి వరకు చదివించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం గ్రామాల్లోని గిరిజన యువత, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో ర్యాలీలను నిర్వహించి గిరిజన పిల్లలను స్కూళ్లలో చేర్పించే విషయంలో తల్లితండ్రులను చైతన్యవంతం చేయాలని నిర్ణయించారు. విద్యా హక్కు చట్టంపై గిరిజనుల్లో అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక బృందాలతో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. -
ఫంక్షన్లలో మిగిలింది..హాస్టల్ పిల్లలకు!
విద్యార్థుల యోగక్షేమాలను గాలికి వదిలేయడం సంక్షేమ హాస్లళ్లలో మామూలైపోయింది. వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అధికారులు వారి జీవితంతో చెలగాటమాడుతున్నారు. తమకు కలిసి వస్తుందనుకుంటే.. ఆ పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టేందుకు, వారికి కలుషితాహారం పెట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. రాజమండ్రిలోని కొన్ని హాస్టళ్లలో వెచ్చాలు మిగుల్చుకునేందుకు కొంతమంది వార్డెన్లు నీచమైన పనులకు ఒడిగడుతున్నారు. వివిధ ఫంక్షన్లలో మిగిలిపోయిన భోజనాన్ని హాస్లళ్లకు తరలించి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. కొంతకాలంగా రాజమండ్రి నగరంలో ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇది తెలిసి కూడా సంక్షేమ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రిపాలయ్యారు. ఆ రోజు అక్కడి విద్యార్థినులకు సమీపంలోని ఒక ఫంక్షన్ హాలు నుంచి తెచ్చిన మిగులు ఆహార పదార్థాలను పెట్టారు. ఇది చూసి చుట్టుపక్కలవారంతా ముక్కున వేలేసుకున్నారు. హాస్టల్ నిర్వాహకులు మాత్రం కాస్తంత కూడా భయపడలేదు. అదే రోజు రాత్రి విద్యార్థినులు అస్వస్థతకు గురైనా సిబ్బంది చేసిన తప్పులు బయట పడతాయని హాస్టల్లోనే ప్రథమ చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థినులు ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ప్రతి రోజూ మరికొందరు ఆస్పత్రిపాలవుతూనే ఉన్నారు. పదో తరగతి విద్యార్థిని గౌతమి శుక్రవారం రాత్రి ప్రభుత్వాస్పత్రి ఐసీయూలో చేర్చారు. కాగా నగరంలోని పలు హాస్టళ్లలో విద్యార్థులకు ఇదేవిధంగా బయట ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలు తరలించి పెడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానరాని పర్యవేక్షణ : సంక్షేమ హాస్టళ్లను తరచూ తనిఖీ చేయాల్సిన అధికారులు కనీసం నెలకోసారి కూడా పట్టించుకోకపోవడంతో వార్డెన్లు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. గత ఏడాది సీటీఆర్ఐ ప్రాంతంలోని ఒక హాస్టల్లో విద్యార్థులచేత సిగరెట్లు, ఇతర నిషేధిత వస్తువులు తెప్పించుకుంటూ ఉద్యోగులు దొరికిపోయారు. ఆ సంఘటనలో విద్యార్థులను సిబ్బంది తీవ్రంగా కొడుతున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అధికారులు వరుస సందర్శనలు చేసి పరిస్థితి చక్కదిద్దుతామని హామీలు ఇచ్చి వెళ్లిపోయారు. కానీ నెలలు గడవకుండానే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఎంచక్కా లెక్కలు రాసేస్తున్నారు : బయటి ప్రాంతాల నుంచి తెచ్చిన ఆహారాన్ని రాత్రిళ్లు వడ్డించడం ద్వారా కొన్ని హాస్టళ్లలో మెనూకు మంగళం పాడేస్తున్నారు. కానీ చక్కగా వండి వడ్డించామని లెక్కలు రాసుకుని వెచ్చాలు మిగుల్చుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రొటీన్ మెనూకు బదులు బయటినుంచి మంచి వంట కాలు, బిర్యానీ వగైరాలు తెప్పించి పెడుతున్నామని విద్యార్థుల ముందు చెప్పుకుంటూ ఫంక్షన్ హాళ్లల్లో, ఇతర పరిచయస్తుల పార్టీల్లో మిగిలిపోతున్న ఆహారం తెచ్చి పెడుతున్నారని సమాచారం. ఇందుకోసం పలువురు క్యాటరింగ్ నిర్వాహకులతో కూడా కొంతమంది సిబ్బంది సంబంధాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈసారైనా పరిస్థితి మారుతుందా! : రాజమండ్రి ఘటనపై సబ్ కలెక్టర్ వి.విజయరామరాజును విచారణాధికారిగా కలెక్టర్ నియమించారు. గతంలో పలు సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇటువంటి విచారణలు జరిగినా వసతిగృహాల తీరుతెన్నులు మాత్రం ఎక్కడా మారలేదు. ఈసారైనా హాస్టళ్ల తీరులో మార్పు రావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు ఈ నెల 14వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఈ ఉద్యమ బాధ్యతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అమెరికాలో 20 రోజులు పర్యటించి తిరిగి వచ్చిన ఆయనకు.. మధురపూడి విమానాశ్రయంలో జిల్లా నలుమూలల నుంచీ తరలి వచ్చిన నాయకులు, పార్టీ కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో మధురపూడి విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఎయిర్పోర్టుకు సాయంత్రం 5 గంటలకు చేరుకున్న నెహ్రూను గజమాలలతో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించాయి. అక్కడ నుంచి భారీ కాన్వాయ్తో మురారి, కృష్ణవరం, సోమవరం, జగ్గంపేట మీదుగా స్వగ్రామం ఇర్రిపాకకు ఆయన చేరుకున్నారు. జిల్లాలో 20 రోజులుగా నెలకొన్న పరిస్థితులపై పీఏసీ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు నెహ్రూకు వివరించారు. గోదావరి జిల్లాలను ఎడారిగా చేసే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలువరించాలని, జిల్లాలోని పలు ఇసుక రీచ్లను నిలువునా దోచుకుంటున్న తెలుగు తమ్ముళ్ల తీరుపై ఉద్యమం చేపట్టాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఎత్తిపోతల పథకం భూమి పూజకు వస్తున్న ముఖ్యమంత్రిని అడ్డుకోవాలని, ఇందుకోసం రైతులతో కలిసి పార్టీ శ్రేణులు భారీగా సిద్ధం కావాలని బోస్, విశ్వరూప్, ఎమ్మెల్యేలు సూచించారు. దీనిపై నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. పోలవరాన్ని నిర్వీర్యం చేస్తూ, గోదావరి రైతులను అధోగతి పాలుజేసే ఎత్తిపోతల పథకానికి తనమీద నుంచి నడుచుకుంటూ వెళ్లి శంకుస్థాపన చేయాలని, దీనిని అడ్డుకునేందుకు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా నెహ్రూ అన్నారు. ఆయన చేసిన ఈ ప్రకటన పార్టీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని నింపింది. గోదావరి జిల్లాల్లో పార్టీ కేడర్ను ఉద్యమం దిశగా సిద్ధం చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉదయం నెహ్రూకు సూచించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతలు నిలుపుచేయాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతూ ఈ నెల 14న హోమం ద్వారా ఉద్యమ పథంలో తొలి అడుగు వేయాలని నిర్ణయించారు. అనంతరం జిల్లా నుంచి పట్టిసీమ వరకూ పాదయాత్ర కూడా చేయాలని, తద్వారా రైతులకు ఎత్తిపోతలువల్ల కలిగే నష్టాన్ని తెలియజేయాలని నేతలు సంకల్పించారు. దీంతోపాటు సామాన్యులకు జిల్లాలో ఇసుక అందకుండా చేస్తున్న టీడీపీ నేతల తీరుపై కూడా పోరు సాగించేందుకు తాను ముందుంటానని నెహ్రూ ప్రకటించారు. -
స్కూళ్లలో బయోమెట్రిక్
- రాష్ట్ర సర్కార్ నిర్ణయం - సన్నబియ్యం పక్కదారి పట్టకుండా.. - ‘మధ్యాహ్న భోజనం’ బియ్యంపై నిఘా - సన్నబియ్యం కొన్నా.. అమ్మినా నేరం - త్వరలోనే పాఠశాలల్లో అమలు - జిల్లాకు 500లకు పైగా మిషన్లు సాక్షి, మంచిర్యాల : ప్రభుత్వ.. ఎయిడెడ్ పాఠశాలలు.. వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనానికి సంబంధించిన సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. మొన్నటి వరకు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, హాస్టళ్లలో రెండు పూటలు విద్యార్థులకు దొడ్డు బియ్యంతో అన్నం వడ్డించిన ప్రభుత్వం జనవరి నుంచి సన్నబియ్యం సరఫరా చేస్తున్న విష యం తెలిసిందే. ఇప్పటి వరకు చాలా పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు స్కూళ్లకు గైర్హాజరైనా.. వసతి గృహాల్లో విద్యార్థులు లేకున్నా హాజరుతో సంబంధం లేకుండా పలువురు హెచ్ఎంలు, వార్డెన్లు తప్పు డు నివేదిక తయారు చేసి బియ్యం బుక్కేశారు. బయటి వ్యక్తులు సైతం ఈ భోజనాలు తింటున్న విషయా లు ప్రభుత్వం దృష్టికి రావడంతో వాటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో స్కూళ్లు, హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి సన్నబియ్యంతో అన్నం తినే విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని భావిస్తోంది. ఇటీవల హైదరాబాద్లో జిల్లా విద్యాశాఖాధికారులు, ఉప విద్యాధికారులతో సమావేశం నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ పథకానికి సంబంధించిన సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కూళ్లు, హాస్టళ్లకు సరఫరా అవుతున్న సన్నబియ్యం ఎవరైనా కొన్నా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు. జిల్లాలో 3,850 పాఠశాలలు.. 52 కేజీబీవీలు, 112 వసతి గృహాలు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో 4.90 లక్షల మంది విద్యార్థులకు 1,800 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తోంది. పాఠశాలల్లో 3.60 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటుంటే.. హాస్టళ్లలో సుమారు 1.30 లక్షల మంది విద్యార్థులు రెండు పూటలు భోజనం చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు 100 గ్రాముల బియ్యం, 6-10 విద్యార్థులకు 150 గ్రాములు, వసతి గృహాల విద్యార్థులకు రోజుకు 425 గ్రాముల చొప్పున బియ్యం అందిస్తోంది. పర్యవేక్షణ సంగతేంటి.. మధ్యాహ్న భోజన పథక పర్యవేక్షణకు సంబంధించి ప్రభుత్వం మార్చి 10, 2011లో జీవో 21 విడుదల చేసింది. ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు రోజూ కనీసం ఒక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం రుచి చూడడంతోపాటు పాఠశాల, పరిసర ప్రాంతాల పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించింది. ప్రతీ 15 రోజులకోసారి నివేదిక తెప్పించుకుని తమకు పంపాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోకు సూచించింది. పథక పర్యవేక్షణ బాధ్యత ఎంఈవోలపైనే ఎక్కువ ఉందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నెలకోసారి మండల స్థాయిలో జరిగే స్టీరింగ్, మానిటరింగ్ కమిటీలో మద్యాహ్న భోజనంపైనా చర్చించాలని సూచించింది. కానీ అధికారుల అలసత్వం, ప్రభుత్వ ఉదాసీన వైఖరితో అది అమలుకు నోచుకోవడం లేదు. భోజనం తినే విద్యార్థుల వివరాలు, హాజరు శాతం, బియ్యం నిల్వలు, బిల్లులు, విజిట్ చేసి రాసిన రిమార్క్స్ అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయా..? లేదా..? చూడాల్సిన బాధ్యత ఎంఈవోలదే. అయినా చాలా చోట్ల ఎంఈవోలు బోగస్ వివరాలు సమర్పిస్తున్నారు. సందర్శనకు వెళ్లినప్పుడు పాఠశాలల్లో పారిశుధ్యం.. ఆహార ధాన్యాలు, పప్పు, ఇతర పదార్థాల నిల్వ, నాణ్యత ను పరిశీలించాల్సిన అధికారులు వాటిపై దృష్టి పెట్టడం లేదు. పాఠశాలల్లో ఓవర్హెడ్ వాటర్ ట్యాంకును బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేయించడం.. వంట వండే ముందు, తర్వాత వంట పాత్రలు శుభ్రంగా కడుగుతున్నారా...? లేదా..? అని చూడాల్సిన హెచ్ఎంలు తమ బాధ్యతను విస్మరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నేనూ హాస్టల్లో ఉండే చదువుకున్న..
⇒ చాలామంది మంత్రులు వసతిగృహాల్లో చదువుకుని వచ్చినవారే.. ⇒ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వికారాబాద్: ‘నేనూ హాస్టల్లో ఉండి చదువుకున్న వాడినే.. ఉడికీ ఉడకని అన్నం భోంచేసిన వాడినే..’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కేబినెట్ మంత్రుల్లో చాలామంది వసతిగృహాల్లో ఉండి చదువుకుని వచ్చిన వారేనన్నారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు, వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం జరిగిన కళాశాల 14 వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. వికారాబాద్ హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నప్పటికీ అన్నిరంగాల్లో వె నకబడి ఉందన్నారు. భూగర్భజలాలు ఎక్కడ చూసినా కనుమరుగయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో చదివే విద్యార్థులు మంచి జియలజిస్టులుగా తయారు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మేథావులుగా తయారై, రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. మార్కులు విద్యలో ప్రామాణికమని అనుకోవడం లేదన్నారు. లక్ష్యం లేకుండా ఏ గమ్యస్థానం చేరుకోలేమన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివి సివిల్స్ రాసి, ఐఏఎస్, ఐపీఎస్ అయిన వారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అనుగుణంగా విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకొని సివిల్స్ రాసి ఐపీఎస్, ఐఏఎస్ అయినవారు గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతారన్నారు. అనంతరం రవాణ శాఖ మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో చె ల్లించాల్సిన పెండింగ్ ఫీజ్ రియింబర్స్మెంట్ నిధులను తమ ప్రభుత్వం ఇటీవలే రూ.800 కోట్లు విడుదల చేసి, విద్యార్థులను ఆదుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విద్యార్థులు చదివింది ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవాలన్నారు. చదివు లేకుంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే వారే కాదన్నారు. కార్పొరేట్ కళాశాల యజామాన్యాలు విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. చదువుతోపాటు ఆటపాటలు, విశ్రాంతి కల్పించాలన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఎంత చదివినా తక్కువేనన్నారు. భవిష్యత్లో నిరుద్యోగులకు అనేక ఉపాధి అవకాశాలురానున్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్, ప్రజాప్రతినిధులు ఎంపీపీ సామల బాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు ముత్తార్ షరీఫ్, నాయకులు ఎల్లారెడ్డి, దేవకీదేవి, కడియాల శేఖర్, విఠల్, ప్రైవేట్ జూనియర్ కళాశాల రాష్ట్ర అధ్యక్షుడు సతీష్, కళాశాల డైరక్టర్ సత్యనారాయణరెడ్డి, నాయకులు రాంరెడ్డి, బి.కృష్ణయ్య, లక్ష్మారెడ్డి, రాంచంద్రరెడ్డి, పి వెంకటయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా ‘సంక్షేమం’..!
ఇందూరు: ‘నీళ్లుంటే, బాత్రూంలుండవు.. బాత్రూంలుంటే నీళ్లుండవు. సన్నబియ్యం వండుతున్నరు.. కానీ కూరలు, పప్పులు నాణ్యంగా ఉండవు. పప్పును చూస్తే నీళ్లలో పసుపు కలిపినట్లుగా ఉంటుంది. కొన్ని హాస్టళ్లను చూస్తే పశువులా కొట్టాల్లా ఉన్నారుు.. ఇదేనా... పిల్లలకు ఇచ్చే సంక్షేమం..’ అని సాంఘిక సంక్షేమ స్థాయీసంఘం సంబంధిత శాఖాధికారులపై మండిపడింది. జిల్లా పరిషత్లో సాంఘిక సంక్షేమం స్థాయి సంఘం సమావేశం ఆ కమిటీ చైర్మన్ కున్యోత్ లత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు సంక్షేమాధికారుల పనితీరును ఎండగట్టారు. చదివించే స్థోమత లేని పేద తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకంతో వసతిగృహాలకు పంపుతున్నారు. అలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులనూ ఇస్తోంది. కానీ.. బాధ్యతలను నెరవేర్చాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వార్డెన్లు స్థానికకంగా ఉండాలని నిబంధనలు ఉన్నా.. పాటించడం లేదని ఆరోపించారు. సహాయ సంక్షేమాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే వార్డెన్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కొన్ని వసతిగృహాల్లో విద్యార్థులకు పెట్టే భోజన మెనూ లేదని, హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయని జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అసహనం వ్యక్తం చేశారు. తాగునీటి, టాయిలెట్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తాను విజిట్ చేసినప్పుడు నిజాలు బయటపడినట్లు తెలిపారు. తమ మండలంలో ఉన్న ఓ వసతిగృహం పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉందని, పశువుల కొట్టాన్ని తలపిస్తోందని స్థాయిసంఘం చైర్మన్ కున్యోత్ లత ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్గల్, కుద్వాన్పూర్ వసతిగృహాల వార్డెన్ల పనితీరు బాగోలేదని, వారికి మెమోలు జారీ చేయాలని స్థాయీ సంఘం సభ్యులు తీర్మానించారు. కల్యాణలక్ష్మి పథకం కార్యక్రమాల్లో జడ్పీటీసీలను పిలువడం లేదని, ఇక ముందు తప్పనిసరిగా పిలువాలని నిర్ణయించారు. సాక్షి కథనంతో ఆరా.. డిసెంబర్లో ఎస్సీ వసతిగృహాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన వాటిలో గోల్మాల్ జరిగిందని, నాణ్యత లేని దుప్పట్లు పంపిణీ చేశారని పక్షం రోజుల కిత్రం సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో ‘దుప్పట్ల కొనుగోల్మాల్’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై జడ్పీ ఇన్చార్జి సీఈఓ, ఏజేసీ రాజారాం ఆరా తీశారు. స్థాయి సంఘ సమావేశానికి వచ్చిన ఏఎస్డబ్ల్యుఓ జగదీశ్వర్ రెడ్డిని ప్రశ్నించారు. దుప్పట్ల కొనుగోలు టెండర్లు పిలువడం మట్టుకే పరిశీలన కమిటీని సద్వినియోగం చేసుకున్నారని, పంపిణీ చేసే సమయంలో కమిటీ ముందు పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యతను చూడకుండా ఎలా పంపిణీ చేశారన్నారు. దీని విషయంలో తనకు వివరణ ఇవ్వాలని దేశించారు. అలాగే సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఇంజినీరింగ్ శాఖ చేపడుతున్న భవనాల నిర్మాణాల నివేదిక పాతది ఇవ్వడంపై సంబంధిత అధికారిపై మండిపడ్డారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న బీసీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చే విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్నాం మూడు గంటలకు పనుల స్థాయి సంఘ సమావేశం జరిగింది. భవనాలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. -
సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత సమీక్షా కమిటీలు
హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న మెస్చార్జీలు, ఇతర కేటాయింపులు 2012 నాటివే నేటికీ కొనసాగుతున్నాయి. వీటిని పెరిగిన ధరలకు అను గుణంగా పెంచాలనే డిమాండు ముందుకొస్తూనే ఉన్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా హాస్టళ్లకు జరిపే కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు ఉండ టం లేదు. ప్రస్తుతం ఉన్న ధరలకు అవి ఏమాత్రం సరిపోక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వార్డెన్లు/మేట్రెన్లు అనేక అవస్థలు పడు తున్నారు. ప్రభుత్వ చట్టం ప్రకారమే విద్యార్థుల కేటాయింపుల్లో ప్రతి ఏటా 10 శాతం పెరుగుదల ఉండాలి. అది ఎక్కడా అమలుకు నోచుకో వటం లేదు. ఒక యంత్రాంగమంటూ లేనందున ప్రభుత్వం పావలా పెంచి, ముప్పావలా ప్రచారం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఆ పెంపుదల కూడా ఏదో భిక్షం వేస్తున్నట్లుగా ఉంటున్నది. అసెంబ్లీలో, పార్లమెంట్లో సభ్యుల జీత, భత్యాలను వారే పెంచుకుంటారు. ఉద్యోగు ల వేతనాల పెరుగుదలకు పి.ఆర్.సి లాంటి శాశ్వత యంత్రాంగాలు ఉన్నాయి. కానీ రాష్ర్టంలో దాదాపు 2,217 హాస్టళ్లలో చదువుతున్న దళిత, బలహీన, గిరిజన విద్యార్థుల అవసరాలు గుర్తించటానికి మా త్రం ఏ యంత్రాంగమూ లేదు. భోజనవసతి కల్పించటం ద్వారా అక్షరా స్యతా శాతాన్ని పెంచటానికి, డ్రాపవుట్ రేటు తగ్గించటానికి, మళ్లీ బడికి, మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు పరుస్తున్నారు. కాని ఇప్పటికే వసతి గృహాల్లో చదువుకుంటామని వ స్తున్న విద్యార్థులను అర్ధాకలితో చంపటం భావ్యం కాదు. హాస్టల్ విద్యార్థులకు కేవలం మెస్ చార్జీలే కాదు. జి.ఓ-126 ప్రకారం రావలసిన అన్ని సౌకర్యాలు వాటికి కేటా యింపులు కూడా సరిపోయే విధంగా పెంచాల్సివుంది. కాస్మో టిక్స్, బట్టల కట్టుకూలీ, గుడ్డ కొనుగోలు, హాస్టల్ నిర్వహణ, ట్యూషన్ ఫీజు లను మారిన, పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలి. ప్రభుత్వం నిర్దేశించే వస్తువుల కొనుగోలుకి రాష్ర్ట స్థాయిలో, జిల్లా స్థాయిలో కొనుగోలు కమిటీలు ఉన్నట్లే వార్షిక సమీక్షా కమి టీలను కూడా జిల్లా స్థాయిలో, రాష్ర్టస్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇం దులో కొనుగోలు కమిటీ చైర్మన్, పౌర సరఫరాల అధికారి, ఏఎస్డబ్ల్యూఓ, వార్డెన్, మేట్రన్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఇది ప్రతి ఏటా హాస్టల్కు విడుదల అవుతున్న నిధులు, విద్యార్థులకు అందవలసిన సౌకర్యాలు సరిగా అం దుతున్నాయా? లేదా? ధరలు ఎంత శాతం పెరిగాయి, వాటికను గుణంగా మెస్, కాస్మోటిక్స్ ఛార్జీలు, ఇతర సౌకర్యాలకు కేటాయిం పులు ఎంత శాతం పెంచాలో నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించాలి. ఎం.శోభన్ నాయక్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు కార్టూన్ సూపర్ స్టార్ ఐదు దశాబ్దాలపాటు జాతి అంతర్వాణిగా, సామాన్యుల మనస్సాక్షిగా కోట్లమంది హృదయాల్లో నిలిచిన మహోన్నత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్. భారతీయ ప్రజాస్వామ్యం, రాజకీయాలు నడుస్తూ వచ్చిన బాధామ యమైన ప్రక్రియలో హాస్యాన్ని, చమత్కారాన్ని ఇంత గొప్పగా చిత్రిం చిన కార్టూనిస్టు మరొకరు లేరు. కార్టూన్లలో ఆయన పొందుపర్చిన హాస్య చమత్కార వ్యాఖ్యలు జీవితానికి సంబంధించిన అత్యద్భుత కొటేషన్లుగా రూపొందాయి. సామాన్యుల వాణిని తన రేఖలో ఇముడ్చుకుని అట్టడుగు ప్రజల వేదనను రాజ కీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వద్దకు ప్రతిరోజూ కార్టూన్ రూపంలో తీసుకునిపోయి తన కాలపు కలలను, వాటి వెనుక వాస్తవ జీవిత వేద నను జాతిముందు పరిచిన మాన్యుడు ఆయన. కార్టూన్ అంటేనే ఒక ధిక్కార కళ అని, పరిహాస కళ అని నిర్వచించిన వాడు.. సామాన్యుల తరపున నిలిచి ఆ పరిహాసాన్నే, తిరస్కారాన్నే వ్యంగ్యరేఖగా మలచి పాలకులను హెచ్చరించాడు. మారుమూల ప్రాంతాల్లో ఉండే సామా న్యుల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టిన వక్రరేఖే కామన్ మేన్. తన మనోగతాన్నే సామాన్యుల మనోగతంగా మార్చి చూపిన ఈ అపర కార్టూన్ బ్రహ్మకు నివాళి. ప్రత్యూష బంజారా హిల్స్, హైదరాబాద్ -
సన్న బియ్యం తరుగు
- పాఠశాలలు, వసతి గృహాలకు సన్నబియ్యం - క్వింటాలుకు ఐదు కిలోలు తక్కువస్తోంది - ఆందోళన చెందుతున్న హెచ్ఎంలు - కొట్టిపారెస్తున్న సివిల్ సప్లయ్ అధికారులు - డివిజన్కు 250 టన్నుల సన్నబియ్యం సరఫరా బోధన్ : సన్నబియ్యం భోజన పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటున్న ప్ర భుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పథకాన్ని ప్రారంభిం చారు. ప్రారంభంలోనే లుకలుకలు బయటపడుతున్నాయి. సివిల్ సప్లయ్ సరఫరా చేస్తున్న సన్నబియ్యం 50 కిలోల బస్తాకు 5 కిలోల వరకు తరుగు వస్తోందని ప్రధాన ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. తరుగు బియ్యం వల్ల తనిఖీకి వచ్చే అధికారుల నుంచి తాము ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు బియ్యం తరుగుదల పై చర్యలు తీసుకోవాలంటున్నారు. లేకపోతే తాము బలైపోయే అవకాశం ఉందని హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం బోధన్ మండలంలో ని ఎరాజ్పల్లి జడ్పీహెచ్ఎస్లో సన్నబియ్యం భోజనం ప్రారంభించేందుకు వచ్చిన స్థానిక సర్పం చ్ ప్రమీల సంజీవ్రెడ్డి, ఎంపీటీసీ గోపాల్లకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్కుమార్ సన్నబియ్యం బస్తాను తూకం వేయించి, తరుగు సమస్యను వివరించారు.అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. డివిజన్కు 250 టన్నుల బియ్యం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సన్నబియ్యం భోజన పథకానికి సంబంధించి 250 టన్నుల సన్నబియ్యం వచ్చాయని బోధన్ సివిల్ సప్లయ్ ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు వెల్లడించారు. డివిజన్లోని బోధన్తో పాటు బాన్సువాడ, బిచ్కుంద, వర్ని, పిట్లం ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా అయ్యాయని అంటున్నారు. బోధన్ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలోని బోధన్ టౌన్, బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్ మండలంలోని పాఠశాల లు, సంక్షేమ వసతి గృహాలకు 41 టన్నుల బియ్యం వచ్చాయని అధికారులంటున్నారు. ఇప్పటి వరకు పాఠశాలలకు బియ్యం సరఫరా పూర్తి చేయగా, కొన్ని సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేశామంటున్నారు. తూకంపై అనుమానాలు.. ఎంఎల్ఎస్ పాయింట్ల వద్దనే బియ్యం తూకంలో లోపాలు చోటు చేసుకుంటున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ బస్తాల తూకం సరిగ్గా ఉంటే, 50 కిలోల బస్తాకు ఐదు కిలోల వరకు తరు గు ఎలా వస్తుందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నా యి. బస్తాకు 50 నుంచి 100 గ్రాముల వరకు తరు గు రావచ్చుకాని 4 నుంచి 5 కిలోల వరకు తరుగు రాదని అధికారులంటున్నారు.ఉన్నత స్థాయి అధికారులు పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం బస్తాల ను తూకం వేస్తే తరుగు వివరాలు బహిర్గమవుతుం దని హెచ్ఎంలు అంటున్నారు. -
1 నుంచి ఆరు కేజీల బియ్యం
కుటుంబంలో అందరికీ పంపిణీ: మంత్రి ఈటెల హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం కూడా పేదలకు గులాబీ రంగులో రేషన్ కార్డులు.. పాత గులాబీ కార్డుల స్థానంలో తెల్ల కార్డులు కార్డుల జారీ ఆలస్యమైనా సరుకులు అందిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పేదలకు వచ్చే జనవరి 1నుంచి ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున బియ్యం పంపిణీని ప్రారంభిస్తామని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కేజీల చొప్పున బియ్యం ఇస్తామని, అలాగే హాస్టళ్లకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యాన్ని కూ డా 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మంత్రి ఈటెల శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త కార్డులు సరుకులకే పరిమితం: అల్పాదాయ వర్గాలకు గతంలో ఉన్న తెల్ల రేషన్కార్డు ల స్థానంలో కొత్తగా గులాబీ రంగు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ఈటెల తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న గులాబీ కార్డుల స్థానంలో తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. కొత్తగా జారీ చేసే గులాబీ రంగు కార్డులు బియ్యం, కిరోసిన్, గోధుమలు, పంచదార, కందిపప్పు వంటి రేషన్ సరుకులకు మాత్రమే పరిమితమని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర పథకాలకు ఈ కార్డులను పరిగణనలోకి తీసుకోబోరని చెప్పారు. జనవరి నెలాఖరులోగా 99 శాతం రేషన్ కార్డుల పంపిణీని పూర్తి చేస్తామని... కొత్త కార్డులు అందడం ఆలస్యమైనా జనవరి 1వ తేదీ నుంచే బియ్యం పంపిణీ కొనసాగుతుందని ఈటెల వెల్లడించారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్న రేషన్కార్డుల కన్నా ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. పాఠశాలలు, హాస్టళ్లలో: ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని వసతి గృహాలకు సన్న రకం(బీపీటీ) బియ్యాన్ని జనవరి 1నుంచి పంపిణీ చేయనున్నట్లు ఈటెల తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజ న కార్యక్రమానికి కూడా సన్న బియ్యాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి (1న సెలవు మేరకు) పం పిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. గ్రా మాల్లో సర్పంచులు, మండలాల్లో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో కా ర్పొరేటర్లు, చైర్మన్లు, నగరాల్లో మేయర్లు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కేంద్రాల్లో మంత్రులందరూ ఈ బియ్యం పంపి ణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సంక్షే మ పథకాలను పూర్తి పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి ఈటెల చెప్పారు. గతంలో కన్నా ఎక్కువ బియ్యం, ఎక్కువ రేషన్కార్డులు ఇస్తున్నామని... ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రేషన్కార్డుల సంఖ్యకు అనుగుణంగా గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల వారీగా రేషన్ షాపులను పెంచుతామని తెలిపా రు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఉన్నారు. -
గ్రౌండ్ రిపోర్ట్ : సంక్షేమ హాస్టళ్ళ పరిస్థితిదీ!
-
హాస్టళ్లకు సన్నబియ్యం ధరపై త్వరలో నిర్ణయం
కిలో రూ. 32కు పెంచాలని కోరుతున్న మిల్లర్లు సాక్షి, హైదరాబాద్: జనవరి నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు సరఫరా చేయనున్న సన్నబియ్యం ధర విషయంలో ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల మధ్యాహ్న భోజన అవసరాల నిమిత్తం 1.20 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ రకం బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. లెవీ కింద సేకరిస్తున్న ఈ బియ్యానికి ప్రభుత్వం కిలో రూ.22.60 వంతున మిల్లర్లకు చెల్లిస్తుండగా కేంద్రం కిలోకు రూ.5.65 మాత్రమే భరిస్తోంది. దీంతో మిగతా భారం రాష్ట్రంపైనే పడుతోంది. కేంద్రం సబ్సిడీపై ఇస్తున్న బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4.65 సబ్సిడీని భరిస్త్తూ కేవలం రూ.1కే సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తోంది. అయితే, ప్రస్తుతం సన్నబియ్యం సరఫరా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏ మేరకు అవసరాలు ఉంటాయి, ఎలాంటి ధర నిర్ణయించాలన్న అంశాలపై పరిశీలన జరుపుతోంది. సాధారణ రకం (దొడ్డు రకం) ధాన్యం క్వింటాల్ ధర రూ.2,186.20 కాగా, గ్రేడ్-ఏ రకం ధాన్యం ధర రూ.2,244.46గా ఉంది. అలాగే దొడ్డు బియ్యం, సన్నం బియ్యం ధరల్లోనూ చాలా వ్యత్యాసం ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకొని తమకు ధరను నిర్ణయించాలని మిల్లర్లు ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
నాసిరకం అన్నమే పెడుతున్నాం..: రావెల
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ హాస్టళ్లలో నాసిరకం బియ్యం తో వండిన అన్నాన్నే పిల్లలకు పెడుతున్నట్లు ఏపీ మంత్రి రావెల కిషోర్బాబు అంగీకరించారు. హాస్టళ్లకు నాణ్యమైన బియ్యం, వంట నూనెలను అందజేయాలని ఆదేశించినట్టు చెప్పారు. మంత్రి రావెల మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు సమస్యలను నేరుగా తెలియచేసేందుకు ఏర్పాటైన టోల్ఫ్రీ నంబరు 1800 425 1352ని ఆయన ప్రారంభించారు. బాలికల సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి రావెల చెప్పారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లకు చీకట్లు
కరీంనగర్ సిటీ : సమస్యల నిలయాలుగా మారిన సంక్షేమ వసతిగృహాలకు కరెంటు కష్టాలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల బకాయిలను రాబట్టుకునేందుకు ట్రాన్స్కో అధికారులు కరెంటు కనెక్షన్లు తొలగించే పని ప్రారంభించారు. దీనికి జిల్లా కేంద్రం నుంచే శ్రీకారం చుట్టారు. బకాయిల నెపంతో నగరంలోని మంకమ్మతోటలో ఉన్న బీసీ కళాశాల స్థాయి వసతిగృహానికి ట్రాన్స్కో సిబ్బంది విద్యుత్ కనెక్షన్ తొలగించారు. మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో రూ.47 వేల బకాయిలు పేరుకుపోయాయి. ట్రాన్స్కో సిబ్బంది హాస్టల్కు కరంట్ కట్ చే యడంతో విద్యార్థులు వారం రోజుల పాటు చీకట్లోనే మగ్గిపోయారు. రూ.37 లక్షల బకాయిలు జిల్లావ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 53 ప్రీమెట్రిక్, 25 కళాశాల స్థాయి వసతిగృహాలు ఉన్నాయి. ఈ హాస్టళ్లకు సంబంధించి విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి సర్కారు విద్యుత్ బిల్లులు చెల్లింపునకు బడ్జెట్ విడుదల చేస్తే, బీసీ సంక్షేమ శాఖ నుంచి ఆయా హాస్టళ్లకు ఈ నిధులు పంపిస్తారు. వచ్చిన నిధులను సంబంధిత హాస్టల్ వార్డెన్ ట్రాన్స్కోకు చెల్లించాల్సి ఉంటుంది. కొంతకాలంగా సర్కారు సరిగా బడ్జెట్ను విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కళాశాల స్థాయి వసతిగృహాలు సుమారు రూ.16 లక్షలు, పాఠశాల స్థాయి వసతిగృహాలు రూ.21 లక్షలు... మొత్తం రూ.37 లక్షల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. కేటాయింపులు అంతంతే.. లక్షల్లో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం ముందునుంచి కేటాయింపులు అంతంత మాత్రంగానే చేస్తోంది. సంక్షేమ హాస్టళ్లలో మోటార్లు, లైట్లు, ఫ్యాన్ల వినియోగం అధికంగా ఉండడంతో ఒక్కో హాస్టల్కు ప్రతి నెలా రూ.10 నుంచి రూ.15 వేల విద్యుత్ బిల్లులు వస్తుంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న హాస్టల్ అయితే రూ.20 నుంచి రూ.25 వేలు కూడా వచ్చిన సందర్భాలున్నాయి. వీటి కోసం ప్రతి నెలా కాలేజ్ హాస్టళ్లకు రూ.3లక్షలు, పాఠశాల హాస్టళ్లకు రూ.5లక్షలు.. మొత్తం కలిపి కనీసం రూ.8 లక్షలు విడుదల చేస్తే విద్యుత్ బిల్లులు మొత్తం చెల్లించడానికి వీలవుతుంది. కానీ ప్రభుత్వం ఆ స్థాయిలో కాకుండా, ప్రతిసారి నెల బిల్లులో 25 శాతం విడుదల చేస్తోంది. దీంతో విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. చివరగా గత ఆగస్టులో కాలేజ్ హాస్టళ్లకు రూ.4 లక్షలు, పాఠశాల హాస్టళ్లకు రూ.3.50 లక్షలు విడుదల అయ్యాయి. నెల నుంచి మొత్తానికే కేటాయింపులు చేయడం లేదు. పొంచి ఉన్న ప్రమాదం హాస్టళ్లకు విద్యుత్ కనెక్షన్ తొలగింపు సమస్యకు తాత్కాలిక ఉపశమనం కలిగినా, హాస్టళ్ల మెడపై ట్రాన్స్కో కత్తి ఇంకా వే లాడుతోంది. మంకమ్మతోటలోని కాలేజ్ హాస్టల్కు విద్యుత్ కనెక్షన్ తొలగించి, పునరుద్ధరించినా, బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు సమస్య పరిష్కారం కనిపించడం లేదు. విద్యుత్ బకాయిల వసూళ్లపై ట్రాన్స్కో సీరియస్గా దృష్టిసారించడం తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన బకాయిల వసూళ్లలోనూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల పలు గ్రామపంచాయతీలకు కరెంట్ కనెక్షన్ తొలగించడం జిల్లావ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఇదే క్రమంలో హాస్టళ్ల వైపు ట్రాన్స్కో దృష్టి మళ్లించడంతో, ఇక్కడా అలాంటి సమస్యే తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో బడ్జెట్ వస్తేనే హాస్టళ్ల బకాయిలు తీరే అవకాశం ఉండడం, ట్రాన్స్కో సైతం తమ బకాయిల వసూళ్లపై లక్ష్యం నిర్ధేశించుకొని ఉండడంతో హాస్టళ్లకు కరెంటు కష్టాలు తప్పేలా లేవు. మరో నాలుగు నెలల్లో వార్షిక పరీక్షలు ఉన్న సమయంలో, హాస్టళ్లలో విద్యుత్ కనెక్షన్ తొలగిస్తే విద్యార్థులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికైనా బిల్లుల చెల్లింపుపై ట్రాన్స్కో అధికారులతో చర్చించి, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత సంక్షేమ శాఖ అధికారులపై ఉంది. అదేం లేదంటూనే.. విద్యుత్ పునరుద్ధరణ కాలేజ్ హాస్టల్కు విద్యుత్ కనెక్షన్ తొలగించడంపై ‘సాక్షి’ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ నారాయణను సంప్రదించగా, అలాంటిదేమీ లేదని చెప్పారు. అయితే ఆ వెంటనే పదినిమిషాల్లో హాస్టల్కు కరెంటు సరఫరా పునరుద్ధరించడం కొసమెరుపు. -
హాస్టళ్లలో బోగస్ దందా!
కరీంనగర్ సిటీ : సంక్షేమ వసతిగృహాల్లో బోగస్ దందా శ్రుతిమించిపోతోంది. లేని విద్యార్థులను ఉన్నట్లు చూపిస్తూ పలువురు వార్డెన్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆయా హాస్టళ్లకు డ్రాయింగ్ అధికారులు సంబంధిత వార్డెన్లే కావడంతో వారి ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వాస్తవ సంఖ్యకు నాలుగు, ఐదు రెట్లు ఎక్కువగా హాజరుపట్టికలో చూపిస్తూ, ప్రతి నెలా రూ.లక్షల్లో బిల్లులు కాజేస్తున్నారు. జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాలు కలిపి మొత్తం 200 వరకు ఉన్నాయి. ఈ హాస్టళ్లలో కొంతమంది వార్డెన్లు నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నా, చాలా మంది వార్డెన్లు అక్రమాలకు తెరలేపుతున్నారు. లేని విద్యార్థులను ఉన్నట్లు చూపుతూ ఖజానాకు గండికొడుతున్నారు. హాస్టళ్లకు పౌరసరఫరాల శాఖ ద్వారా బియ్యం పంపిణీ చేయడంతోపాటు, ఉన్న విద్యార్థులకు ఒక్కొక్కరికి సుమారుగా ప్రతి నెల కు రూ.800 చెల్లిస్తుంది. ఈ డబ్బులతోనే సదరు వార్డెన్ హాస్టల్ నిర్వహణ చేపడుతుంటారు. ఏ రోజుకారోజు విద్యార్థుల హాజరు ఆధారంగా సంబంధిత వార్డెన్ ప్రతినెలా బిల్లు చేసి ఆన్లైన్లో ఆయాశాఖలకు పంపించి డ్రా చేస్తుంటా రు. అయితే తమకున్న డ్రాయింగ్పవర్ను అడ్డుపెట్టుకుంటున్న చాలా మంది వార్డెన్లు విద్యార్థుల సంఖ్యలో భారీ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక హాస్టల్లో ఒక రోజు వాస్తవానికి 25 మంది ఉంటే, ఆ రోజు 100 మంది హాస్టల్లో ఉన్నట్లు హాజరుపట్టికలో పేర్కొంటారు. అంటే 75 మంది విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు చూపించి, వారి పేరిట వచ్చే డబ్బులు వార్డెనే కాజేస్తుంటారు. ఇటీవల విజిలెన్స్ సోదాలు నిర్వహించిన కోహెడ మండలం శనిగరం బీసీ హాస్టల్ ఉదంతమే తీసుకొంటే... హాస్టల్లో అక్రమాలు జరుగుతున్నాయని బీసీ సంఘం నాయకులు 2012, మార్చిలో చేసిన ఫిర్యాదుతో బీసీ సంక్షేమశాఖ అధికారులు విచారణ చేపట్టారు. 120 మంది ఉన్నట్లు హాజరు పట్టికలో ఉండగా, వాస్తవానికి పదికి మించి కూడా విద్యార్థులు లేరని తేలడంతో అధికారులు అవాక్కయ్యారు. అక్రమాలకు పాల్పడిన వార్డెన్ను సస్పెండ్ చేయాలంటూ సంఘాలు ఆందోళనకు దిగగా, అప్పటి ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆర్సీ నెం. ఏ/675/2012 ద్వారా విచారణ అధికారిగా నియమించారు. ఈడీ విచారణలోనూ బోగస్ విద్యార్థులున్నట్లు తేలింది. దీనితో సదరు వార్డెన్ను సస్పెండ్ చేస్తూ, రెండు ఇంక్రిమెంట్లు కోత విధించారు. సంబంధిత వార్డెన్ స్వల్ప శిక్షతో బయటపడడానికి జిల్లా కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది సంపూర్ణ సహకారాలు అందించినట్లు సమాచారం. కాగా, శిక్ష పూర్తయిందనే సాకుతో సదరు వార్డెన్ మళ్లీ 2013 ఏప్రిల్ వరకు 120 మంది విద్యార్థులున్నట్లు బిల్లులు సృష్టించి స్వాహా చేసినట్లు తెలిసింది. ఈ సంఘటనలతోనే ముగిసిందనుకున్న వ్యవహారాన్ని విజిలెన్స్ విభాగం గత నెలలో తిరగదోడినట్లు అధికార వర్గాల కథనం. శనిగరంతోపాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. పెద్దపల్లిలోని ఓ హాస్టల్లో ప్రతి రోజు 70 నుంచి 90 వరకు విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా వేస్తూ సదరు వార్డెన్ రూ.లక్షలు కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొన్ని హాస్టళ్లకు ఇన్చార్జీగా ఉన్న ఆ వార్డెన్ హాజరు పట్టికను కంటపడనీయకుండా దాచేయడం, ఎవరొచ్చినా తాను లేనంటూ తప్పించుకోవడంతో అక్రమాలు ఇప్పటివరకు బయటపడడం లేదు. వీటితోపాటు గతంలో ఏసీబీ దాడుల్లోనూ బోగస్ విద్యార్థుల సంఖ్య వెలుగు చూసినా, తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని హాస్టళ్లలో కొనసాగుతున్న బోగస్ దందాపై దృష్టి సారిస్తే తప్ప అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం లేదు. -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు : మంత్రి రవీంద్ర
మచిలీపట్నం టౌన్ : వసతి గృహాల్లో అధికారులు, సిబ్బంది లేని తీరు, నీళ్ల చారు.. కూర వండి వడ్డించని వైనం.. పురుగులతో కూడిన సుద్దన్నం.. మరుగుదొడ్లలో లైట్లు వెలగని స్థితి.. కాలం చెల్లిన మందులు.. అస్తవ్యస్తంగా హాజరు పట్టీల నిర్వహణ.. పిచ్చిమొక్కలు, గడ్డి దట్టంగా పెరిగిన ఆవరణలతో కూడిన వసతి గృహాలు సాక్షాత్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు దర్శనమిచ్చిన దృశ్యాలు. మంత్రి రవీంద్ర ఆదివారం స్ధానిక పోతేపల్లి రోడ్లో ఉన్న బీసీ, ఎస్టీ సంక్షేమ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో కన్పించిన సం ఘటనలు. స్వయంగా తానే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని వసతి గృహాల పరిస్థితి చూసి మంత్రి ఆశ్చర్యపోయారు. తొలుత ఆయన బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సమయంలో వసతిగృహంలో వార్డెన్తో పాటు మరో ముగ్గురు సిబ్బంది లేరు. విద్యార్థులకు వడ్డించేందుకు అన్నం, నీళ్లచారును అక్కడి సిబ్బంది సిద్ధం చేశారు. కూర మాత్రం వండలేదు. బాలికల వసతి గృహంలో ఉద్యోగులు బాధ్యతగా ఉండకుండా వసతి గృహానికే రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఆయన పరి శీలిస్తుండగా బీసీ వసతి గృహ వార్డెన్ టీ అనితకుమారి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వసతి గృహ బాలికలతో కొద్దిసేపు మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వార్డెన్ గదిలోకాలం చెల్లిన మందులు ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారుతోందన్నారు. ఎస్టీ బాలికల వసతి గృహంలో ఉన్న 19మంది విద్యార్థినులకు కూర లేకుండా నీళ్లచారు.. పురుగులతో కూడిన అన్నాన్ని వడ్డించిన వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలోని మరుగుదొడ్లకు లైట్లు వెలగకున్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హాజరుపట్టీల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉం దని, విద్యార్థినుల మూమెంట్ రిజిస్టర్ను నిర్వహించకపోవడాన్ని మంత్రి పశ్నించారు. త్వరలో బయోమెట్రిక్ విధానం విధుల నిర్వహణలో వసతిగృహాల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బందరులోని వసతి గృహాలలో సిబ్బంది నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారితీరును ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి నెలా పేరెంట్స్ మీటింగ్లు పెట్టాలని సూచించారు. త్వరలో అన్ని వసతి గృహాలలో విద్యార్థులు, సిబ్బందికి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు వేసే పద్ధతిని అమలు చేస్తామన్నారు. మునిసిపల్ చైర్మన్ మోట మర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాళీవిశ్వనాథం, బీసీ సంక్షేమశాఖ డీడీ సీహెచ్ చినబాబు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలకు నిధుల కొరత
నిజామాబాద్ అర్బన్ : మెడికల్ కళాశాలకు నిధుల కొరత వేధిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా కళాశాల కోసం అనుమ తి కోసం తంటాలు పడిన అధికారులు ప్రస్తుతం నిధుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్వహణ కోసం కావల్సిన నిధులు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కళాశాల అవసరాల మేరకు తక్షణమే రూ. 91 కోట్లు మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ జిజియాబాయి గత జూన్లో ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినా, నేటికీ స్పందన లేదు. అందుబాటులో లేని భవనాలు కళాశాలలో రెండవ సంతవ్సరం మొదలు కావడంతో నిధుల అవసరం ఏర్పడింది. ముఖ్యంగా రెండవ సంవత్సరం విద్యార్థులకు వసతి గృహాలు, ప్రొఫెసర్ల నివాసాల నిర్మాణానికి నిధుల లేమి అడ్డంకిగా మారింది. మ్యూజియం ఏర్పాటు కోసం సుమారు రూ. 20 లక్షలు కావాలి. అంతేకాకుండా, ఫార్మ కాలేజీ ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయి. వచ్చే ఏడాది మూడవ సంవత్సరం విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, ప్రస్తుతం భవన నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలి. అలాగే ఆసుపత్రి, కళాశాలకు పరికరాలను కొనుగోలు చేయాలి. ప్రయోగశాలల సౌకర్యం కల్పించాలి. వీటి కోసం ఉన్నతాధికారులకు విన్నవించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. అప్పుడు కళాశాల నిర్వహణ కోసం రూ. 100 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతోనే కళశాల ఏర్పాటు జరిగింది. అనంతరం మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి హయాంలో మరో రూ. 60 కోట్లు మంజూరయ్యాయి. వీటితోనే నేటికీ కళాశాల కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవలే అటవీశాఖ, ఆర్అండ్బీ స్థలాన్ని మెడికల్ కళాశాలకు స్వాధీనం చేశారు. ఇందులో రెండవ సంవత్సరం విద్యార్థులకు భవనాలు, గెస్ట్హౌస్లు నిర్మించే అవకాశం ఉంది. గత ఆగస్టు నెలలో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినపుడు. రూ. 60 కోట్ల రూపాయలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నిధుల విడుదల మాత్రం జరుగడం లేదు. -
అక్రమాలకు చెక్ !
సత్తెనపల్లి : వసతి గృహాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందులోభాగంగా వసతి గృహాల సంక్షేమాధికారులకు బయోమెట్రిక్ యంత్రాలు, ల్యాప్టాప్లు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థుల వేలిముద్రలు, ఆధార్ నంబర్లు సేకరిస్తున్నారు. ఇదీ సంగతి.. వసతి గృహాల్లో విద్యార్థులు తక్కువగా ఉంటున్నప్పటికీ ఎక్కువమంది ఉన్నట్లు చూపిస్తూ పలువురు సంక్షేమాధికారులు ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారు. ఈ దందాలో కొందరు అధికారులకూ భాగస్వామ్యం ఉంటోంది. వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు, జిల్లా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమాల గుట్టు రట్టరుున సంగతి తెలిసిందే. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులోభాగంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకొస్తోంది. ఇదీ జరిగేది... * వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల హాజరును ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయూల్లో బయోమెట్రిక్ యంత్రాల్లో నమోదు చేస్తారు. ఈ వివరాలు ఇంటర్నెట్ ద్వారా రాజధానిలోని సీజీజీకి వెళతారుు. దీంతో ఏ రోజు ఎంతమంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉన్నారో తెలిసిపోతుంది. * విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపేందుకు తప్పుడు వేలిముద్రలు వేసే అవకాశం ఉన్నందున ఆధార్ నంబర్లను అనుసంధానం చేస్తారు. బయోమోట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకుకు వసతి గృహాల సంక్షేమాధికారులకు ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం సమకూరుస్తారు. * జిల్లాలోని 94 ఎస్సీ సంక్షేమ వసతి గృహాల సంక్షేమాధికారులకు ల్యాప్టాప్లు, బయోమెట్రిక్ యంత్రాలను అందజేశారు. ల్యాప్ టాప్ల్లో నిక్షిప్తం చేసిన ప్రత్యేక సాప్ట్వేర్ ఆధారంగా విద్యార్థి పేరు, తల్లిదండ్రుల వివరాలతోపాటు, ఏ పాఠశాలల్లో చదువుతున్నారనే వివరాలను పొందుపరుస్తున్నారు. ఇప్పటికే వసతి గృహాల్లోని విద్యార్థుల ఆధార్ నంబర్లను సేకరించారు. వేలిముద్రలు సేకరించాల్సి ఉంది. బయోమెట్రిక్ విధానం అమలుపై సంక్షేమ అధికారులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.. బయోమెట్రిక్ విధానం అమలుతో వసతి గృహాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయూల్లోనే వేలిముద్రల సేకరణ ఉంటుంది. అనంతరం వేలిముద్రలు వేయాలన్నా యంత్రం తీసుకోదు. ఈ సమాచారం ఆధారంగానే వసతి గృహాలకు సరుకులు, నగదు అందుతారుు. ఈ విధానంపై సంక్షేమ అధికారులకు త్వరలోనే శిక్షణ ఇస్తాం. - ఆర్.అన్నపూర్ణ, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి -
పనితీరును మెరుగుపర్చుకోండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. మూడు కేటగిరీలుగా విభజించుకుని పనితీరుపై స్వయం మదింపు చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు, ప్రాథమిక వైద్య, ఆరోగ్యకేంద్రాలు, హాస్టళ్లను తరచూ తనిఖీ చేయడం ద్వారా విధినిర్వహణలో నిబద్ధతను అలవర్చుకోవాలన్నారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారుల పనితీరును ఆయన సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని, యంత్రాంగమంతా సమష్టిగా పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా కీలకమని, అందుకనుగుణంగా అధికారులు వ్యవహరించాలన్నారు. ప్రతి అధికారీ క్షేత్రస్థాయిలో పర్యటించి లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పీహెచ్సీల తనిఖీ గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను మండల ప్రత్యేకాధికారులు ఆకస్మిక తనిఖీ చేశారని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రులకు హాజరుకాని సిబ్బంది, ఆస్పత్రుల నిర్వహణపై తనకు నివేదికలు పంపాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత మీదే శివారు మండలాల్లో విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. గురువారం ఆయా మండలాల తహసీల్దార్లు, ఆర్డీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం వివిధ సంస్థలకు బదలాయించిన భూమిలో ప్రైవేటు సంస్థలకు ఏ మేర కేటాయించారు? నిరుపయోగంగా ఉన్న స్థలమెంత? అనే అంశంపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి ఇచ్చేందుకు క్లియర్ టైటిల్ భూములను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత ఆర్డీవో, తహసీల్దార్లదేనని స్పష్టం చేశారు. రేపు జిల్లాకు సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడి రాక ఈ నెల 28న కేంద్ర సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు విజయ్కుమార్ జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 11:30 గంటలకు సఫాయి కర్మచారుల సంక్షేమంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని ఆయన వివరించారు. -
ఈ రోజులు మాకొద్దు..
రేపటి పౌరులు ఈనాటి పాట్లు..! గొంతు దిగని అన్నం. గుడ్డు ఇస్తే పరమాన్నం. చిరిగిన యూనిఫాంలు. అరిగిన పాదరక్షలు. పెండింగ్లో కాస్మొటిక్ చార్జీలు. పేరుకైనా ఇవ్వని సెలూన్ చార్జీలు. పెచ్చులూడే పైకప్పులు. వీపుకు గుచ్చుకునేలా గచ్చులు. నీళ్లు లేని ట్యాంకులు. నీళ్లున్నా పనిచేయని బోర్లు. నొక్కులు పడ్డ ట్రంకు పెట్టెలు. బొక్కలు పడ్డ బకెట్లు. తలుపులు లేని కిటికీలు. మరుగు లేని మురికిదొడ్లు. దుర్గంధం వెదజల్లే కాల్వలు. దురదపెట్టేలా కుట్టే దోమలు. ఎప్పుడూ రోగాలు. అప్పుడప్పుడూ విషపురుగుల కాట్లు. చలికాలంలో కనిపించని దుప్పట్లు. ఎండాకాలంలో పనిచేయని ఫ్యాన్లు. అధికశాతం అద్దె భవనాలు. అగ్గిపెట్టెల్లాంటి గదులు... ఇవేనా వసతి గృహాలు? అని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు! ఈ రోజులు మాకొద్దు అంటున్నారు.. నవసమాజాన్ని కాంక్షిస్తున్న రేపటిపౌరులు!! -
పిల్లలు తక్కువ .. హాజరు ఎక్కువ
కలువాయి, న్యూస్లైన్: వరుస దాడులతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఏసీబీ అధికారులు ఈ సారి తమ దృష్టి సంక్షేమ వసతిగృహాలపై పెట్టారు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి నిధులు కాజేస్తున్నారని, మెనూ అమలు సక్రమంగా లేదని ఆరోపణలు రావడంతో కలువాయిలోని ఎస్సీ బాలుర వసతిగృహంపై సోమవారం రాత్రి దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్రావు, ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, ఎం.కృపానందం తన సిబ్బందితో హాస్టల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. రాత్రి విద్యార్థులకు వడ్డించిన ఆహారాన్ని పరిశీలించారు. పలు అంశాలపై విద్యార్థులతో పాటు ట్యూటర్ను విచారించారు. ఆ సమయంలో హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య, తదితర వివరాలను నమోదు చేసుకున్నారు. స్టాక్ రూంలోని సరుకుల నిల్వపై ఆరా తీశారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీల సమయంలో హాస్టల్ వార్డెన్ నాయక్ లేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా హాస్టల్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. 69 మంది విద్యార్థులే ఉన్నారు: జె.భాస్కర్రావు, డీఎస్పీ తనిఖీల అనంతరం డీఎస్పీ భాస్కర్రావు విలేకరులతో మాట్లాడారు. కలువాయితో పాటు ప్రకాశం జిల్లా గుడ్లూరులోని వసతి గృహాలను తనిఖీ చేశామన్నారు. ఈ హాస్టల్లో 123 మంది విద్యార్థులు ఉంటున్నట్లు రికార్డుల్లో పేర్కొనగా 69 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. శుక్రవారం వరకు మాత్రమే విద్యార్థులకు హాజరువేసి ఉన్నారని, 123 మందికి 120 మంది హాజరైనట్లు చూపారన్నారు. శని, ఆది, సోమవారాల్లో అసలు హాజరువేయలేదని చెప్పారు. హాస్టల్లో కనీస వసతులు లేవని, ఇక్కడి పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని వెల్లడించారు. నేనే ఫిర్యాదు చేశా: గూడూరు పుల్లారెడ్డి, హాస్టల్ వాచ్మన్ వార్డెన్ నాయక్పై కలెక్టర్, ఎస్పీ, ఏసీబీ అధికారులకు తానే ఫిర్యాదు చేసినట్టు హాస్టల్ వాచ్మన్ గూడూరు పుల్లారెడ్డి విలేకర్లకు చెప్పారు. ఆయన తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, భోజన మెనూ సక్రమంగా అమలు చేయకపోవడంపై ప్రశ్నించినందుకు తనపై పిల్లలతో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టిస్తానని బెదిరించారని తెలిపారు. రూ.54 వేలు జీతం కూడా నిలిపివేయించారని వివరించారు. -
సమస్యలపై.. దొంగ నిద్ర!
నిద్రపోయేవారిని లేపగలం గాని, దొంగనిద్ర నటిస్టున్న వారిని లేపడం ఎవరి తరమూ కాదు. సంక్షేమ హాస్టళ్లలో పేరుకుపోయిన సమస్యల విషయంలో సర్కార్ దొంగనిద్ర నటిస్తూ విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. సంక్షేమ బాట కార్యక్రమంలో భాగంగా అధికారులు హాస్టళ్లలో రాత్రులు నిద్రపోయి, అక్కడి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలి. మొదటి మూడేళ్లు బాగా నడిచిన ఈ పథకాన్ని తరువాత పట్టించుకోవడం మానేశారు. దీంతో సమస్యలు పరిష్కారం కాక విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. నెల్లిమర్ల, న్యూస్లైన్: వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం ప్రారంభమైన సంక్షేమబాట కార్యక్రమానికి ప్రస్తుత సర్కారు తిలోదకాలిచ్చింది. ఏటా అధికారులు వసతిగృహాలను సందర్శించి, అక్కడి సమస్యలను గుర్తించాలన్న ఉద్దేశంతో 2008లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత సర్కారు నీరుగార్చుతోంది. రెండేళ్లుగా అధికారులు వసతిగృహాలను సందర్శించకపోవడం, సమస్యల పరిష్కారానికి సంబంధించి నిధులు విడుదల చేకపోవడమే దీనికి నిదర్శనం. వివరాల్లోకి వెళితే..జిల్లా వ్యాప్తంగా మొత్తం 163 సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో 58 వెనుకబడిన తరగతులకు చెందినవి కాగా, 62 సాంఘిక సంక్షేమ వసతి గృహాలున్నాయి. అలాగే మరో 43 గిరిజన సంక్షేమ వసతిగృహాలున్నాయి. ఈ వసతిగృహాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు 2008లో ప్రభుత్వం సంక్షేమబాట కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన వెంటనే జిల్లావ్యాప్తంగానున్న అన్ని వసతి గృహాలను అధికారులు సందర్శించాలి. విద్యార్థులతో పాటు వసతిగృహాల్లోనే నిద్రపోవాలి. వారితో మమేకమై ఆయా వసతి గృహాల్లోని సమస్యలు గుర్తించాలి. గుర్తించిన సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలి. అధికారులు నివేదిక ప్రకారం సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం అవసరమయ్యే నిధులు విడుదల చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదటి మూడేళ్లూ సక్రమంగానే నిర్వహించింది. అయితే గత రెండేళ్లుగా కార్యక్రమం ఊసే ఎత్తలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు ఏడు నెలలైనా ఇప్పటిదాకా సంక్షేమబాట చేపట్టలేదు. దీంతో అన్ని హాస్టళ్లలో ప్రతి ఏటా సమస్యలు పెరిగిపోతున్నాయి. నెల్లిమర్ల మండలంలోని అలుగోలు బీసీ బాలుర వసతి గృహంలో సుమారు 250 మంది విద్యార్థులుండగా కేవలం నాలుగు గదులే ఉన్నాయి. రెండేళ్ల క్రితం నిర్వహించిన సంక్షేమబాటలో ఈ వసతి గృహానికి ప్రభుత్వం అదనపు భవనాన్ని మంజూరుచేసింది. అయితే నిధులు చాలకపోవడంతో ఆ భవనం ఇప్పటికీ పూర్తికాలేదు. అదే సంక్షేమబాట కార్యక్రమం చేపట్టి ఉంటే భవన నిర్మాణం పూర్తయ్యేది. అలాగే ఇక్కడి విద్యార్థుల కోసం నూతన మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ నీటి సదుపాయం లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. రామతీర్థం ఎస్సీ బాలుర వసతిగృహం భవనం శిథిలమై మూడేళ్ల క్రితమే కూలిపోయింది. అయితే సంక్షేమబాట కార్యక్రమం చేపట్టకపోవడంతో మొన్నటిదాకా నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరుకాలేదు. సంక్షేమబాట కార్యక్రమం చేపట్టకపోవడంతో ఇదే పరిస్థితి దాదాపు జిల్లాలోని అన్ని వసతిగృహాల్లోనూ నెలకొంది. చాలా వసతిగృహాల్లో విద్యార్థులు నిద్రించేందుకు గదులు సైతం లేవు. అలాగే పలు వసతి గృహాల్లో మరుగుదొడ్లు నిర్మించలేదు. కొన్ని హాస్టళ్లలో నీటి సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సక్రమంగా సంక్షేమబాట కార్యక్రమాన్ని చేపట్టి ఉంటే సమస్యలు ప్రతి ఏటా పేరుకుపోయి ఉండేవి కాదని వసతిగృహాల సంక్షేమాధికారులు సైతం అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్షేమబాట కార్యక్రమం చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సంక్షామం
=హాస్టళ్లలో కొరవడిన మౌలిక సదుపాయాలు =అద్దెభవనాల్లో అవస్థలు =కటిక నేలపై నిద్ర =తాగునీటికి, మరుగుదొడ్లకు ఇబ్బందులు =తలుపులు, కిటికీల్లేక చలికి వణుకుతున్న విద్యార్థులు సంక్షేమం అర్థతాత్పర్యాలు మారిపోతున్నాయి. సర్కారు మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. అభాగ్య విద్యార్థులకు అమ్మప్రేమ పంచాల్సిన హాస్టళ్లు ఈసురోమంటున్నాయి. పోషకాహార నిబంధనలు తుంగలో తొక్కి నీళ్ల చారు, పురుగుల అన్నం, నాసిరకం పప్పుతో సరిపెట్టే వార్డెన్లు లాభాలు మేస్తున్న చోట రక్తహీనత, ఆరోగ్య సమస్యలతో విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. కిటికీలు తలుపులు లేనిఇరుకిరుకు అద్దె భవనాల్లో చలికి గజగజ వణుకుతున్నారు. చోడవరం,న్యూస్లైన్ : సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కొరవడుతున్నాయి. హాస్టళ్లలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలు పలు ఇబ్బందులతో కాలం వెళ్లదీస్తున్నారు. మరో మూడు నెలల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతుండగా కొన్నింట ట్యూటర్ల కొరతతో విద్యాబోధన నామమాత్రంగా ఉంటోంది. జిల్లాలో 64 బీసీ,79 ఎస్సీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి పక్కా భవనాలులేవు. ఏళ్ల తరబడి గోవాడ బీసీ బాలిక వసతి గృహం, బీసీ బాలుర హాస్టల్, వడ్డాది, చోడవరం, అప్పలరాజుపురం, తురువోలు బీసీ బాలురు, చీడికాడ, రావికమతం బీసీ బాలికల వసతి గృహాలు అద్దె కొంపల్లోనే కొనసాగుతున్నాయి. వీటిల్లో అరకొరగా మరుగుదొడ్లతో ఇబ్బందులకు సొంత భవనాలు ఉన్న చోటే అరకొర వసతి ఉండగా ఇక అద్దెభవనాల్లో నడుస్తున్న హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకటి రెండు మరుగుదొడ్లు ఉండడం, వాడుక నీరుపోయే సౌకర్యం లేక విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. అసలే చలికాలం కావడంతో ప్రస్తుతం ఉన్న దుప్పట్లు వీరికి సరిపోవడం లేదు. చాపలు, దుప్పట్లు పరుచుకుని కటిక నేలపై నిద్రపోతున్నారు. మరో దుప్పటితో కప్పుకుంటున్నప్పటికీ కొన్ని హాస్టళ్లలో కిటికీలకు తలుపులు లేక చలి గాలి లోపలికి వచ్చి గజగజ వణికిపోతున్నారు. అద్దె భవనంలో కొనసాగుతున్న చోడవరం బీసీ బాలురు హాస్టల్లో ఉన్న రెండు మరుగుదొడ్లు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో విద్యార్థులు పొలాల్లోకి పరుగులు తీస్తున్నారు. రావికమతం బీసీ బాలిక వసతి గృహంలో బోరు పనిచేయకపోవడంతో సమీపంలోని పబ్లిక్ కుళాయి నుంచి విద్యార్థులే నీటిని తెచ్చుకుంటున్నారు. కొరివాడ బీసీ హాస్టల్లో ఇక్కడ ఏడు గదులు ఉన్నాయి. వీటిలో ఐదింటికి తలుపులే లేవు. కాగడా పెట్టి వెదికినా ఇక్కడ మరుగుదొడ్లు కానరావు. చాలా హాస్టళ్లలో వార్డెన్లు స్థానికంగా ఉండకపోవడంతో నిర్వహణంతా సిబ్బందే చేపడుతున్నారు. దీనివల్ల బాధ్యత కొరవడి మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. నీళ్ల చారు, పురుగుల అన్నం, నాసిరకం పప్పుతో సరిపెట్టే పరిస్థితి ఉంది. ఎస్సీ హాస్టళ్లలో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఉండటంతోపాటు హాస్టళ్లలో తగిన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు పెద్దగా చేరడం లేదు. కాగా ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు సబ్జెక్టులకు ప్రత్యేక ట్యూటర్లను నియమించి టెన్త్ విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలి. కొన్నింట అర్హులైన ట్యూటర్లు లేక పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా బీసీ హాస్టళ్లల్లో వసతి సమస్యలు ఎక్కువగా ఉంది. -
ఆకలి కేకలు..
వరంగల్, న్యూస్లైన్: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలోని గిరిజన బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు సరుకులు సరఫరా కావడం లేదు. ఉప్పు, సబ్బులు కూడా ఇవ్వడం లేదు. నిత్యావసర వస్తువులను సరఫరా చేసే గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు ప్రభుత్వం బాకీ పడింది. దీంతో గిరిజన విద్యార్థులకు భోజనం కష్టంగా మారుతోంది. వీటితో పాటు కాస్మొటిక్స్ కూడా అందించడం లేదు. ఇక ఎప్పుడో నెలకు రెండుసార్లు కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఒకసారి సరఫరా చేసి మళ్లీ ముఖం చాటేస్తున్నారు. వచ్చినప్పుడే గుడ్లను పెడుతున్నారు. విద్యార్థులకు ప్రతీ రోజూ కోడిగుడ్లను పెట్టాల్సినప్పటికీ వారంలో ఒక్కరోజు కూడా ఇవ్వడం లేదు. ఇక అరటి పండ్లు ఇవ్వడమే మరిచిపోయారు. అరటిపండ్లను తీసుకువచ్చే కాంట్రాక్టర్లు నెలకు నాలుగుసార్లు ఇచ్చి పోతున్నారు. అధికారులకు, కాంట్రాక్టర్లకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రోజూ విద్యార్థులకిస్తున్నట్లుగానే లెక్కలేసుకుంటున్నారు. వీటన్నింటిపైనా విద్యార్థులు మాట్లాడితే చాలు... వార్డెన్ల దెబ్బల తినాల్సిందే. దీంతో సరుకులు రావడం లేదని చాటుమాటుగా చెబుతున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 70, ఇతర వసతి గృహా లు 42 ఉన్నాయి. వీటిల్లో సుమారు 23వేల మంది గిరిజన విద్యార్థులు ఉంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో నిత్యావసర సరుకులు, కాస్మోటిక్స్ కోసం ఆలస్యంగా టెండర్లు నిర్వహించారు. గిరిజన సహకార సంస్థ(జీసీసీ), ఇతర కాంట్రాక్టర్ల ద్వారా కాస్మొటిక్స్, బ్యియ్యం, పప్పులు, నూనెతో సహా 23 రకాల వస్తువులు సరఫరా చేయాల్సి ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి హాస్టల్ నిర్వాహణకు సరిపడా సరుకులు నిల్వ చేయాల్సి ఉండగా... అధికారుల నిర్లక్ష్యం కారణంగా మూడు నెలల్లో ఒక్క నెలకు కూడా సరుకులు అందించడం లేదు. హాస్టళ్ళలో అవసరమున్న సరుకుల కోసం హెచ్ఎంలు గిరిజన సహకార సంస్థకు ఇండెంట్ పెడతారు. కావలసిన సరుకులను వెంటనే సరఫరా చేయాల్సిన జీసీసీ... వారికి ఇష్టంవచ్చినప్పుడు సరఫరా చేస్తుండటంతో విద్యార్థులకు మెనూ ప్రకారంగా పౌస్టికాహారం అందడం లేదు. మంగపేట మండలం కోమటిపల్లి హాస్టల్లో వారం రోజుల కిందట కోడిగుడ్లు అయిపోయాయి. అప్పటి నుంచి విద్యార్థులకు గుడ్లు ఇవ్వడం లేదు. ఇదే హాస్టల్కు గత నెల మొదటి వారంలో సరఫరా చేయాల్సిన సరుకులను మంగళవారం సరఫరా చేశారు. అంతేకాకుండా హాస్టళ్ళకు గిరిజన సహకార సంస్థ సరఫరా చేస్తున్న సరుకులు కూడా నాణ్యతలేని నాసిరకం సరుకులను సరఫరా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జీసీసీకి రూ 1.90 కోట్లు పెండింగ్ ఇదే సమయంలో సర్కారు నిధులు విడుదల చేయడంలో కూడా నిర్లక్ష్యమే చేస్తోంది. మూడు నెలల నుంచి సరఫరా చేసిన సరుకుల బిల్లులను పెండింగ్లో పెడుతున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలు, వసతి గృహాలకు సరఫరా చేసిన సరుకులకు రూ 1.90 కోట్లు జీసీసీకి బాకీ పడ్డారు. అదే విధంగా అరటి పండ్లు, పాలు, కాస్మొటిక్స్ విద్యా సంవత్సరం మొదట్లో సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు కూడా ఇంకా బిల్లులు పెండింగ్ పడ్డారు. ఈ బిల్లు కూడా మరో రూ 60 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. బిల్లులు పెండింగ్ ఉండటంతో మళ్లీ సరుకులు సరఫరా కావడం లేదు. వార్డెన్లు కూడా విద్యార్థులకు పెట్టడం లేదు. కానీ, లెక్కల బుక్కుల్లో మాత్రం గిరిజన విద్యార్థులు పౌష్టికాహారం దండిగా తింటున్నారు. గతంలో వార్డెన్లు అత్యవసర వస్తువులను సొంతంగా కొనుగోలు చేసి విద్యార్థులకు అందించే అవకాశాలుండేవి. ఇప్పుడు వాటన్నింటినీ టెండర్లపరం చేయడంతో అధికారాలు లేకుండా పోయాయి. ఏవైనా సరుకులను అత్యవసరంగా కొనుగోలు చేద్దామంటే తమకు బిల్లులివ్వడం లేదని, దీంతో తామేం చేయలేకపోతున్నామని వార్డెన్లు బహిరంగంగానే చెబుతున్నారు. -
వసతి.. దుర్గతి
కర్నూలు(అర్బన్), న్యూస్లైన్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సంక్షోభం నెలకొంది. చాలా చోట్ల సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. మెనూ సంగతి పక్కనపెడితే.. ఇరుకు గదుల్లో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. జిల్లా కేంద్రమైన కర్నూలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని రెండు బాలుర వసతి గృహాలకు అద్దె భవనాలే దిక్కవగా.. తగినన్ని మరుగుదొడ్లు లేక విద్యార్థులు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. మంగళవారం అధికార యంత్రాంగం ప్రభుత్వ వసతిగృహాల్లో రాత్రి బస చేయనున్న దృష్ట్యా జిల్లాలో వీటి స్థితిగతులను పరిశీలిస్తే.. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 102 వసతి గృహాలు ఉండగా, 34 అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 73 వసతి గృహాల్లో 25 అద్దె భవనాలే దిక్కయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయ్టెట్లు, బాత్రూంలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా నంద్యాల, ఆదోని డివిజన్ కేంద్రాల్లోని బీసీ బాలురు వసతి గృహాలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. కనీసం గదులకు డోర్లు, కిటికీలకు తలుపులు కూడా లేకపోవడంతో దోమల వల్ల విద్యార్థులు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వ భవనాల్లోని వసతిగృహాల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని పాణ్యం, కొట్టాలచెరువు, పాలెంచెరువు ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడంతో నిత్య నరకం అనుభవిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఫ్లోరింగ్ దెబ్బతినింది. ఇక జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పెద్దపాడు, కోడుమూరు, ఎర్రగుంట్ల, మద్దికెర, ఉయ్యాలవాడ, డోన్, ఎమ్మిగనూరు(బాలికలు), ఎమ్మిగనూరు(బాలురు) ఎమ్మిగనూరు(అనంద నిలయం)తో పాటు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని కోవెలకుంట్ల, ఆత్మకూరు వసతి గృహాలు ఎప్పుడు కూలుతాయో చెప్పలేని పరిస్థితి. అందని నాలుగు జతల యూనిఫాం: జిల్లాలోని పలు ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఇప్పటికీ ప్రభుత్వం సరఫరా చేయాల్సిన నాలుగు జతల యూనిఫాం అందకపోవడం గమనార్హం. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో 10,802 మంది, 73 బీసీ వసతి గృహాల్లో 10,662 మంది, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 10 వసతి గృహాలు, 10 ఆశ్రమ పాఠశాలల్లో 2215 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన నాలుగు జతల యూనిఫాం అందగా, బీసీ విద్యార్థులకు మెప్మా ద్వారా కుట్టించి అందజేశారు. అయితే క్లాత్ సరఫరా కాకపోవడంతో చాలా మంది విద్యార్థులు నేటికీ యూనిఫాం అందని పరిస్థితి నెలకొంది. ప్రహరీ లేకపోవడంతో దినదిన గండం: ఇప్పటికీ జిల్లాలోని చాలా హాస్టళ్లకు ప్రహరీలు కరువయ్యాయి. ఆలూరు పరిధిలోని ఆలూరు సమీకృత వసతి గృహం, ఆస్పరి, తెర్నేకల్, మద్దికెర, జొహరాపురం, ఆదోని పరిధిలోని ఆదోని నెంబర్-3, ఎమ్మిగనూరు ఆనందనిలయంతో పాటు నంద్యాల, కర్నూలు డివిజన్లోని పలు వసతి గృహాల విద్యార్థులు ప్రహరీ లేని కారణంగా రాత్రి వేళ భయాందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం లద్దగిరి బీసీ వసతి గృహంలో ఓ విద్యార్థి పాముకాటుకు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. -
వసతి గృహాల్లో విద్యార్థుల రక్షణ ఎక్కడ?
ఇందూరు, న్యూస్లైన్ : జిల్లాలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు కలిపి మొత్తం 126 వసతి గృహాలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల వసతి గృహాలు 88 ఉండగా 90 శాతం వరకు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. కళాశాల విద్యార్థులకు సంబంధించిన హాస్టళ్లలో ఎక్కువగా అద్దె భవనాలలోనే నడుస్తున్నాయి. బీసీ కళాశాల విద్యార్థుల వసతి గృ హాలు 20 ఉండగా 17 అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయి. ఎస్సీ వసతి గృహాలు 15 ఉండగా 14, ఎస్టీ వసతి గృహాలు మూడు ఉండగా రెండు అద్దె భవనాలలోనే నడుస్తున్నాయి. అన్ని హాస్టళ్లకు అనువైన స్థలం ఉన్నప్పటికీ, భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో అద్దె భవనాలలో వాటిని కొనసాగించాల్సి వస్తోంది. అక్కడ సరైన వసతులులేవు. కొన్ని హాస్టళ్లు ఇరుకు గదుల్లో, ఎతె్తైన భవనాల్లో ఉన్నాయి. దీంతో విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెండు నెలల క్రితం జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లో రెండో అంతస్తులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల విద్యార్థుల వసతి గృహంలోంచి ఓ విద్యార్థి కిందపడిపోయాడు. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈనెల ఐదున వర్ని చౌరస్తాలో రెండో అంతస్తులో ఉన్న బీసీ కళాశాల విద్యార్థుల హాస్టల్పైనుంచి పడి జయచంద్రకాంత్ అనే డిగ్రీ విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనల ప్రకారం వసతి గృహాలు గ్రౌండ్ ఫ్లోర్లో, మొదటి అంతస్తులోనే ఉండాలి. కానీ రెండు, మూడు, నాలుగు అంతస్తుల్లోనూ గదులను అద్దెకు తీసుకుంటున్నారు. అలాగే ప్రమాదాలను నివారించేందుకు చివరి అంతస్తులో సరైన ఎత్తులో ప్రహరీ నిర్మించాల్సి ఉంటుంది. కానీ అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఏ హాస్టల్లోనూ ఇలాంటి నిర్మాణం లేదు. దీంతో విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలుస్తోంది. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మిస్తే ప్రమాదాలు జరగవని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నిఘా కరువు వార్డెన్లు హాస్టళ్లలో ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో విద్యార్థులపై పర్యవేక్షణ కరువవుతోంది. విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. గత ఏడాది మల్లారం సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహానికి చెందిన డిగ్రీ విద్యార్థులు ముగ్గురు మల్లారం చెరువుకు ఈతకు వెళ్లారు. అందులో ఒకరు నీట మునిగి చనిపోయారు. వార్డెన్ స్థానికంగా లేకపోవడం, విద్యార్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిండంతో ప్రమాదం చోటు చేసుకుంది. వార్డెన్తోపాటు నైట్ వాచ్మన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఎటు వెళుతున్నారన్న సమాచారాన్ని హాస్టల్లోని రిజిస్టర్లో నమోదు చేసేలా చూడాలని సూచిస్తున్నారు. నిబంధనలు అమలు చేస్తాం వసతిగృహాల్లో ఉంటున్న కళాశాల విద్యార్థులు బయటకు వెళ్లకుండా, సెల్ఫోన్ వాడకుండా చర్యలు తీసుకోవాలని గతంలో వార్డెన్లకు సూచించాం. వాటిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించాం. వార్డెన్ అనుమతి తీసుకోకుండా విద్యార్థులు బయటికి వెళ్లరాదు. విద్యార్థులు సెల్ఫోన్ వినియోగించినట్లు తెలిస్తే వార్డెన్ను బాధ్యులను చేస్తాం. -విమలాదేవి, బీసీ సంక్షేమ శాఖాధికారి -
అంతా ఆన్లైన్
సాక్షి, నల్లగొండ/తుర్కపల్లి, న్యూస్లైన్: హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడనుంది. విద్యార్థుల హాజరుశాతం ఎక్కువగా చూపిస్తూ అవకతవకలకు పాల్పడుతున్న వార్డెన్ల ఆటలు ఇకపై సాగవు. చాలామంది వార్డెన్లు చుట్టపుచూపుగా హాస్టళ్లకు వెళ్తున్నారు. ఇకనుంచి నిత్యం స్థానికంగా ఉంటూ హాస్టళ్లను పర్యవేక్షించక తప్పదు. హాస్టళ్లు, విద్యార్థుల వివరాలు పూర్తిగా ఆన్లైన్ చేస్తున్నారు. అంతేగాక వార్డెన్లు, సిబ్బంది వివరాలు పొందుపర్చుతున్నారు. వసతి గృహాలకు అవసరమైన వస్తువులు, సరుకులకు చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారానే జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రక్రియ ఎస్టీ, ఎస్సీ సంక్షేమ శాఖల పరిధిలో దాదాపు పూర్తయ్యింది. తాజాగా బీసీ సంక్షేమ శాఖలో కూడా మొదలు పెట్టారు. త్వరలో అమలులోకి రానుంది. పారదర్శకతకు పెద్దపీట.. జిల్లాలోని 69 బీసీ హాస్టళ్లలో 6138 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. 54 మంది రెగ్యులర్ వార్డెన్లు ఉండగా, మరో 15 మంది మొదటి పేజీ తరువాయి ఇన్చార్జ్లుగా కొనసాగుతున్నా రు. హాస్టళ్ల నిర్వహణలో పూర్తిగా పారదర్శకత తేవడానికి అందుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చుతున్నారు. విద్యార్థి పేరు మొదలుకొని సదరు హాస్టల్లో ఉన్న మౌలిక వసతుల వరకు సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్ చేస్తున్నారు. తద్వారా విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, వార్డెన్ల పర్యవేక్షణ తదితర వాటిలో స్పష్టత రానుంది. చాలా హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతాన్ని అధికంగా చూపెడుతూ నిధులు దండుకుం టున్నారు. ఇకపై ఈ సమస్య ఉండదు. విద్యార్థుల హాజరు శాతాన్ని బయోమెట్రిక్ పద్ధతి ద్వారా తీసుకుంటారు. తద్వారా విద్యార్థుల హాజరు శాతాన్ని బట్టి నిధుల ఖర్చు ఉంటుంది. చెల్లింపులూ ఆన్లైన్ ద్వారానే.... వెబ్సైట్ వల్ల వసతి గృహాల నిర్వహణ తీరు ఉన్నతాధికారులు వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు చెల్లింపులు మాన్యువల్గా (చేతిరాత బిల్లులు) జరుగుతున్నా యి. త్వరలో ఈ చెల్లింపులన్నీ ఆన్లైన్ ద్వారా సాగుతాయి. హాస్టళ్లకు అవసరమైన సరుకులు, వస్తువులకు సంబంధించి చెల్లిం పులు కాంట్రాక్టర్ ఖాతాలో నేరు గా జమచేస్తారు. సరఫరా సక్రమంగా లేకుంటే బిల్లులు తక్షణమే నిలిపివేసే వెసులుబాటు ఉంది. తద్వా రా అక్రమాలకు చెక్ పడనుంది. బయోమెట్రిక్ విధానం... విద్యార్థులకు అందుబాటులో ఉం టున్న వార్డెన్ల సంఖ్య తక్కువ. నాలుగు రోజులకో, వారానికోసారి చుట్టపుచూపుగా హాస్టళ్లకు వెళుతున్నారు. అంతేగాక సిబ్బం ది కూడా సమయానికి వెళ్లడం లేదు. ఫలితంగా హాస్టళ్లలో విద్యార్థులు తింటున్నారా? లేదా? తిం టే ఎన్ని పూటలు? వీటిపై అధికారులకే స్పష్టత లేదు. వీటిని అడ్డుకట్ట వేయడానికి మొదటగా సిబ్బంది కోసం బయోమెట్రిక్ మిషన్లను హాస్టళ్లలో ఏర్పాటు చే యనున్నారు. అంతేగాక మూడు పూటలా వేలిముద్రలు సేకరిం చేలా చర్యలు తీసుకోనున్నారు. తద్వారా పర్యవేక్షణ గాడిలో పడనుంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మౌలిక వసతుల కల్పన మెరుగుపడనుంది. పారదర్శకత కోసమే బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలకు మేరకు ఆన్లైన్ విధానాన్ని చేపట్టాం. ఈ పద్ధతి ద్వారా ప్రతి హాస్టల్ నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలెంటో ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. అంతేగాక వార్డెన్లు, సిబ్బంది పనితీరు అంచనా వేయవచ్చు. ఫలితంగా విద్యార్థులకు 100 శాతం న్యాయం చేకూరుతుం ది. ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లవుతుంది. ఇప్పటివరకు అన్ని హాస్టళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాం. విద్యార్థుల వివరాలు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. నాలుగైదు రోజుల్లో ఇది పూర్తవుతుంది. - రాజశేఖర్, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ -
ఇక ప్రతి వారం తనిఖీలు: కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, అస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలను ప్రతి వారం తనిఖీ చేసి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ బి.శ్రీధర్ టాస్క్ఫోర్స్ అధికారులను ఆదేశించారు. వివిధ మండలాల్లో నిర్దేశిత కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను తనిఖీ చేసేందుకుగాను శుక్రవారం తనిఖీ బృందాలను నియమించారు. అనంతరం కలెక్టరేట్లో వారితో సమావేశం నిర్వహించారు. టాస్క్ఫోర్స్ బృందాలకు కేటాయించిన మండలాల్లోని అధికారుల వివరాలు సేకరించి తనిఖీల ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. టాస్క్ఫోర్స్ అధికారుల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవీందర్ రెడ్డి, డీఎంహెచ్ఓ సుభాష్చంద్రబోస్, డీఆర్డీఏ పీడీ వరప్రసాద్రెడ్డి, మెప్మా పీడీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. అక్రమ మైనింగ్కు పాల్పడితే కేసులు జిల్లాలో అక్రమ మైనింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి మైనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కీసర, శామీర్పేట్, హయత్నగర్, తాండూరు మండలాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయనీ, ఈ ప్రాంతాల్లో వెంటనే తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. అక్రమ మైనింగ్తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని, దీన్ని నిరోధించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ-1 చంపాలాల్, డీఆర్వో రాములు తదితరులు పాల్గొన్నారు. పట్టణ భూములపై ప్రత్యేక జిల్లాలోని పట్టణ మండలాల్లోని ప్రభుత్వ భూములపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. పట్టణ మండలాల్లోని తహసీల్దార్లు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు భూములు తనిఖీ చేయాలని, ఇందుకు సంబంధిత సర్వేయర్లతో సర్వే చేయించి తనకు నివేదిక అందించాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో యూఎల్సీ ప్రత్యేకాధికారి ఆనందరావు, జేసీలు చంపాలాల్, ఎంవీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆశలపై నీళ్లు..?
కుక్కునూరు, న్యూస్లైన్: వసతిగృహాలు ఆశ్రమ పాఠశాలలుగా మారితే తమ కష్టాలు తొలగిపోతాయని భావించిన విద్యార్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. దీంతో జిల్లాలో ఆశ్రమ పాఠశాలలుగా మారాల్సిన 13 వసతిగృహాలకు చెందిన మూడు వేల మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని 45 గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో పదమూడింటిని ఆశ్రమపాఠశాలలుగా ఆధునికీకరిస్తున్నట్లు గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన 32 వసతి గృహాలకు మొండిచేయి చూపింది. అయితే ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వసతిగృహాల ఆధునికీకరణ ప్రశ్నార్థకంగా మారింది. తొమ్మిది సూత్రాల పథకంలో భాగంగా.... గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తొమ్మిది సూత్రాల పథకంలో భాగంగా జిల్లాలోని వసతి గృహాలను ఆశ్రమపాఠశాలలుగా ఆధునికీకరిస్తున్నట్లు గత నెలలో ప్రకటించిన సంగతి విదితమే. ఈ ఆశ్రమపాఠశాలల్లో 2013 - 14 విద్యాసంవత్సరంలో 3 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో తరగతిలో 40 మంది పిల్లలకు మాత్రమే అవకాశం కల్పిసామంటున్న ప్రభుత్వం నాలుగు ఎస్జీటీ పోస్టులను కూడా మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ ప్రభుత్వం ఎంపిక చేసిన వసతిగృహాల్లో భద్రాచలంలోని గిరిజన బాలికల వసతిగృహంలో 300 మంది, బాలుర వసతిగృహంలో 200 మంది, బూర్గంపాడులో 300 మంది, మణుగూరులో 250 మంది, కుక్కునూరులో 170 మంది విద్యార్థులు ఉన్నారు. ఖమ్మం, సత్తుపల్లి, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేటలోని బాలికల వసతిగృహాలతో పాటు ఖమ్మంలోని రెండు బాలుర వసతిగృహాల్లో మొత్తం మూడువేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. సౌకర్యాలు కరువు.. జిల్లాలోని 13 వసతిగృహాల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న మూడువేల మంది విద్యార్థులు చదువుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కునూరు గిరిజన బాలికల వసతి గృహంలో ఉన్న 170 మంది విద్యార్థుల్లో వంద మంది వరకు కిలో మీటర్ దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ప్రతీరోజు వీరు పాఠశాలకు వెళ్లి వచ్చేందుకు నాలుగు కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. ఇంత దూరం నడవలేక పలువురు విద్యార్థినులు సాయంత్రం ఆశ్రమ పాఠశాలకు వచ్చిన తర్వాత కళ్లు తిరిగి పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వసతిగృహాన్ని ఆశ్రమ పాఠశాలగా మారుస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు ఎంతో ఆనందపడ్డారు. కానీ వారి ఆశలపై తెలంగాణ ప్రకటన నీళ్లు చల్లినట్లయింది. ఆశ్రమపాఠశాలలో వసతులు కరువు : ఇప్పటికే జిల్లాలో ఉన్న 74 ఆశ్రమపాఠశాలల్లో కరువైన వసతులపై పలుమార్లు విద్యార్థి సంఘాలు ఆంధోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి ఆ పాఠశాలల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం ప్రకటన ‘ఉట్టికెక్కలేనమ్మ, ఆకాశానికి నిచ్చెనేసినట్లు ఉంది’అన్న చందంగా తయారైందని గిరిజన విద్యార్థి సంఘాలు ఎద్దేవా చేస్తున్నారు.