Jewellery Case
-
బురఖాతో సొంత ఇంటిలోనే చోరీ!
ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఓ విచిత్ర దొంగతనం వెలుగు చూసింది. ఓ కుమార్తె తన తల్లికి చెందిన లక్షల నగదు, నగలు చోరీ చేసింది. వాటితో సహా అక్కడి నుంచి ఉడాయించింది. అయితే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన జిల్లా పోలీసుల యాంటీ బర్గ్లరీ సెల్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ద్వారక డీసీపీ అంకిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం జనవరి 30న ఉత్తమ్ నగర్లోని సేవక్ పార్క్లో నివసిస్తున్న కమలేష్ అనే మహిళ తన ఇంట్లో పట్టపగలు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష రూపాయలతో పాటు విలువైన బంగారం, వెండి నగలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొంది. నేరం చేయడానికి ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని ద్వారక జిల్లా యాంటీ బర్గ్లరీ సెల్ దర్యాప్తులో తేలింది. మెయిన్ డోర్ తాళం, అల్మారా పగలగొట్టి కూడా ఉండకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన బృందం నల్ల బురఖా ధరించిన ఓ మహిళ అనుమానాస్పదంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అనంతరం నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె మరెవరో కాదు పోలీసులకు ఈ చోరీపై ఫిర్యాదు చేసిన మహిళ పెద్ద కుమార్తె శ్వేత(31). తన తల్లి తన చెల్లెలిపై అమితమైన శ్రద్ధ వహిస్తుండటంతో శ్వేతలో అసూయ, ద్వేషం కలిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికితోడు ఆమె తిరిగి చెల్లించాల్సిన అప్పులు కూడా చాలానే ఉండటంతో సొంత ఇంటిలోనే చోరీకి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 30న శ్వేత తల్లి కమలేష్ ఇంటికి తాళం వేసి, కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్కు వెళ్లింది. ఇంతలోనే బయటి నుంచి బురఖాతో వచ్చిన శ్వేత తన దగ్గరున్న డూప్లికేట్ తాళంతో ఇంటి గేటు తీసి, లోనికి ప్రవేశించి తల్లి గదిలోని నగలు, నగదు చోరీ చేసింది. ఆ నగలను శ్వేత ఒక దుకాణంలో విక్రయించిందని పోలీసులు గుర్తించారు. ఆ నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మీనా జ్యువెలర్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి!
-
ఆభరణాల మోసం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
తిరువనంతపురం : ఆభరణాల పెట్టుబడి మోసం కేసులో ఐయుఎంఎల్ ఎమ్మెల్యే ఎంసి కమరుద్దీన్ను శనివారం కేరళ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. కాగా కమరుద్దీన్ కాసర్గోడ్ జిల్లాలోని మంజేశ్వర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కమరుద్దీన్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న ఫ్యాషన్ గోల్డ్ జ్యువెల్లరీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టాలంటూ చాలామందిని ప్రభావితం చేసినట్లుగా తేలింది. కమరుద్దీన్పై ఉన్న నమ్మకంతో వందలాది మంది ఫ్యాషన్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టారు. అయితే గత జూలైలో వ్యాపారంలో ఆర్థికంగా నష్టంరావడంతో ఫ్యాషన్ గోల్డ్ బోర్డు తిప్పేసింది. కాగా కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి కనీసం తమ వాటా కూడా రాలేదు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఎమ్మెల్యే కమరుద్దీన్తో పాటు సిబ్బందిపై కేసు నమోదు చేశారు. కాగా కమరుద్దీన్పై 115 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదులపై దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. దీనిలో భాగంగానే సెక్షన్ 420 కింద కమరుద్దీన్ అరెస్ట్ చేసిన సిట్ బృందం శనివారం దాదాపు 5గంటల పాటు విచారణ చేసింది. కాగా అరెస్టు తరువాత వైద్య పరీక్షల నిమిత్తం కమరుద్దీన్ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మీడియాతో మాట్లాడిన ఆయన తన అరెస్ట్ రాజకీయంగా ప్రేరేపించబడిందని అన్నారు. -
వృద్ధురాలి హత్య కేసులో వీడని మిస్టరీ
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: నగల కోసం వృద్ధురాలి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. రాజమహేంద్రవరం, నారాయణపురం ఎఫ్సీఐ గోడౌన్స్ పక్కవీధి, సైక్లోన్ కాలనీలో నివసిస్తున్న దేవాదుల శ్యామల(60) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ సంఘటనలో నిందితులు రక్త సంబంధీకులేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒంటరిగా నివసిస్తున్న శ్యామల ఒంటిపై బంగారు నగలు ఉండడం గమనించిన రక్త సంబంధీకులు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం ఆమెను హత్య చేసి నగలు చోరీ చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతురాలికి వరుసకు కుమారుడయ్యే ఇన్నీసుపేటకు చెందిన దేవాదుల నాగేశ్వరరావు అనే వ్యక్తిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు మృతురాలికి బావ గారి కుమారుడు. ఇతడికి వివాహం కాలేదు. ఈ నేపథ్యంలో చెడు వ్యసనాలకు బానిసైన నాగేశ్వరరావు అప్పుల పాలయ్యాడు. దీనితో పనిలేక జులాయిగా తిరుగుతూ ఉంటాడని, ఈ సంఘటనలో ఇతడి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు అదే కుటుంబంలో మృతురాలు ఒంటరిగా ఉంటుందని తెలిసిన రక్త సంబంధీకులెవరికైనా ఈ సంఘటనతో సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో బయటవారి వేలి ముద్రలు లభించలేదు. ఎక్కువగా కుటుంబ సభ్యులవి లభించాయి. ఈ నేపథ్యంలో తెలిసిన వారే ఈ హత్యకు కారణమై ఉంటారని భావిస్తున్నారు. మృతురాలి వద్ద కొన్ని నగలు మాత్రమే చోరీకి గురై, మిగిలిన నగలు ఒంటిపై ఉండడం బట్టి చూస్తే చోరీలకు పాల్పడే వ్యక్తులు కాదని భావిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో పెద్ద కుమారుడు రంగ కుమార్ (విజిలెన్స్ శాఖలో అసిస్టెంట్ జియాలజిస్ట్గా పని చేస్తున్నారు.)తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్యంగా ఉన్న మృతురాలు, అంతలోనే మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్థిక అవసరాలు తీర్చుకొనేందుకు ఎవరైనా హత్య చేశారా! లేక వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందితే కుటుంబ సభ్యులు బంగారం చోరీ చేశారా? అనేది పోస్టు మార్టం రిపోర్టులో, పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలు ఎవరైనా వస్తే కిటికీలో నుంచే సమాధానం చెబుతుందని స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా పరిచయం ఉన్న వారు వస్తే ఇంటి తలుపులు తీస్తుందని, అప్పటి వరకూ ఇంట్లో తలుపులు వేసుకొని ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హత్య జరగడానికి ముందు వృద్ధురాలికి తెలిసిన వారే వచ్చి ఉంటారని, దీంతో ఇంటి తలుపులు తీసి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో నగల కోసం వృద్ధురాలిని హత్య చేసి, నగలతో పరారై ఉంటారని భావిస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
స్వామివారికి ఇచ్చిన నగలు ఏమయ్యాయి?
-
అందుకే ప్రభుత్వం దిగి వచ్చింది: ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో రోజా మాట్లాడారు. నిత్యం స్వామివారికి సేవ చేసే రమణదీక్షితులను అవమానపరిచి తొలగించారని టీడీపీపై మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశత్వానికి ఇది నిదర్శనమన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించకపోతే నిరసన తెలియజేశామని.. దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ఆభరణాల వివరాలు ఆన్లైన్లో ఉంచాలని, గతంలో ఆన్లైన్లో ఉంచుతామని చెప్పిన జేఈఓ శ్రీనివాస రాజు ఇప్పటివరకు వాటిని పెట్టలేదని వివరించారు. తిరుమల శ్రీవారి ఆభరణాలు మాయం అయ్యాయని భక్తుల్లో అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వాటిని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విజయనగరంలో గిరిజన గర్భిణీ మహిళ 12 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి బిడ్డను పోగొట్టుకుంది.. కనీస వైద్య సదుపాయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు అంటే చంద్రబాబుకు పట్టదు.. అందుకే గిరిజన మంత్రిని కూడా నియమించలేదని వెల్లడించారు. -
రుణం పేరుతో మహిళలకు టోకరా
గుంటూరు : బాపట్ల బ్యాంకు ఉద్యోగినంటూ బ్యాంకులో కొద్ది సేపు హడావుడి చేసి ఇద్దరు మహిళల వద్ద ఆరు సవర్ల బంగారు ఆభరణాలతో ఓ నిందితుడు ఉడాయించిన ఘటన బాపట్లలో గురువారం తీవ్ర సంచలనం రేకేత్తించింది. బ్యాంకులో హడవుడి చేసిన నిందితుడు మహిళల ఇంటికి వెళ్లి అక్కడ వ్యాపారానికి సంబంధించిన ఫోటోలు తీసి సంతకాలు పెట్టించి మరీ బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. బాధిత మహిళలు కె.మరియమ్మ, అలిదిరాణి తెలిపిన వివరాలు మేరకు కొత్తకంకటపాలెంకు చెందిన కె.మరియమ్మ, అలిదిరాణి చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. స్టేట్బ్యాంకులో ముద్రరుణాలు ఇస్తున్నారని తెలుసుకుని గురువారం ఉదయం బ్యాంకుకు వచ్చి అక్కడ పీబీడీ మేనేజర్ను కలిశారు. బ్యాంకు ఇప్పుడు రుణాలు ఇవ్వటం లేదని అతను చెప్పటంతో వెనుదిరిగేందుకు యత్నించిన మహిళలను గమనించిన 30 ఏళ్లలోపు వయస్సు ఉన్న యువకుడు ఓ ఐడీ కార్డుతో వారిని పలకరించాడు. ముద్రరుణాలు కాకుండా మీకు ఒక్కొక్కరికి రూ.3.50లక్షలు వచ్చేవిధంగా వ్యాపారానికి సంబంధించిన రుణాలు ఇప్పిస్తానంటూ చెప్పాడు. మహిళలు ఇంటి వద్ద వారు చేస్తున్న చిరువ్యాపారాలను చూపించాలంటూ నిందితుడు కోరటంతో సరేనన్నారు. వెంటనే బ్యాంకు కిందకు దిగి అప్పటికే అక్కడ ఉన్న ఆటోలో కొత్తకంకటపాలెంకు బయలుదేరారు. ఇంటి వద్ద ఉన్న బొంకును ఫోటోలు తీయటంతోపాటు వారితో బ్యాంకు రుణాలకు సంబంధించిన పత్రాలుగా చెప్పి సంతకాలు చేయించుకున్నాడు. మళ్లీ అదే ఆటోలో తిరిగి బ్యాంకుకు వచ్చి రుణాలు తీసుకోవాలంటూ ముందు బ్యాంకులో ఏదో ఒక రుణం తీసుకోవాలని, బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకోవాలని నమ్మబలికాడు. సరేనని వారి వద్ద ఉన్న గొలుసులు, బంగారు గాజులు అతడికి ఇచ్చారు. అతను తూకం వేయించుకుని వస్తానంటూ చెప్పి ఇలోపు ఫోటోలు దిగి రావాల్సిందిగా చెప్పారు. మహిళలు ఫొటోలు దిగి వెళ్లి విచారించగా అతను కనిపించకుండా ఉడాయించారు. ఆటో డ్రైవర్పై కూడా అనుమానాలు.. మహిళలు వారి వ్యాపారాలు చూపించాలని చెప్పి కిందకు దిగిరాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఆటోలో మహిళలతోపాటు నిందితుడు ఎక్కాడు. అయితే ఆటో డ్రైవర్ కూడా సార్ మంచోడమ్మ అంటూ చెప్పటం...మీకు లోన్ వెంటనే ఇప్పిస్తాడంటూ చెప్పటంతో అతడి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును పట్టణ ఎస్ఐ అనిల్రెడ్డి నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్టేట్బ్యాంకులోని సీసీ కెమెరాలలో నిందితుడు గురించి ఆరా తీశారు. నిందితుడినికి సంబంధించిన చిత్రాలు కూడా దొరికినట్లు సమాచారం. అయితే స్టేట్బ్యాంకు ఉద్యోగులు, సెక్యూర్టీ విభాగం ఏమి చేస్తున్నారనేది ఖాతాదారులలో చర్చానీయాంశమైంది. అసలు బయట వ్యక్తి వద్ద ఐడీ కార్డు ఎందుకు ఉంది. ఐడీ బ్యాంకుదా? కాదా ఎవరికి సంబంధించిందనే కోణంలో విచారణ చేపట్టారు. -
జ్యువెలరీ కంపెనీని మోసం చేసిన నటి..?
‘బిగ్ బాస్ 11’ మాజీ కంటెస్టెంట్ హీనా ఖాన్ నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో హల్చల్ చేస్తుంటారు. ‘బిగ్ బాస్ హౌస్’లో ‘మిస్ రైట్’గా పిలుచుకునే హీనా ఖాన్ గురించి ఇప్పుడు ఒక తప్పుడు వార్త న్యూస్ చానళ్లలో ప్రచారం అవుతుందంట. ఒక బంగారు ఆభరణాల కంపెనీ ప్రకటనలో నటించిన హీనా ఖాన్, ప్రకటన షూటింగ్ అనంతరం బంగారు ఆభరణాలను కంపెనీకి తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుందంట. ఇందుకు గాను సదరు కంపెనీ హీనా ఖాన్కు లీగల్ నోటీసులు కూడా పంపారనేది ఆ వార్త సారాంశం. ఈ విషయం గురించి హీనాను అడగ్గా ఆమె దీన్ని ఖండించారు. అనంతరం తన ట్విటర్లో ‘లీగల్ నోటీస్లు ముందు నా ఇంటికి రాకుండా మీడియా హౌస్కు ఎలా వెళ్లాయనేది నాకు అర్ధం కావడం లేదంటూ’ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక ‘నా శత్రువులు నన్ను క్షమించాలి. మీ ఈ ఉపాయం పని చేయలేదు. మరి కాస్తా కొత్తగా ట్రై చెయ్యండి’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని తెలిపారు. కానీ న్యూస్ చానల్ వారు మాత్రం హీనా ఖాన్ అడ్రస్తో ఉన్న లీగల్ నోటీసులను ప్రచారం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా హీనా ఖాన్ మ్యూజిక్ వీడియో ‘భసూది’ సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. యూట్యూబ్లో విడుదలైన ఈ మ్యూజిక్ వీడియోను ఇప్పటికే 8 లక్షల మంది వీక్షించారు. -
ఓల్డ్ ఈజ్ గోల్డ్..
వడ్డాణం, బంగారు జడ... ఓస్ ఇవి తెలుసు కదా అంటారా? మరి కంకణాలు, కంటెలు..ఈ పేర్లెక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? కానీ కాసుల మాలలు, గుట్ట పూసలు? బాబోయ్ ఇవెక్కడి పేర్లు అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరింకా ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’కి దూరంగానే ఉన్నారన్న మాట. ఆనాటి ఆభరణాలు ఇప్పుడు ట్రెండ్గా మారాయి.మరోవైపు బరువైనా పరవాలేదంటూ సిటీ మహిళలు పాతకాలం జ్యువెలరీకి పచ్చజెండా ఊపుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో : ‘ఏమిటలా ఒంటినిండా ఆభరణాలు దిగేసుకున్నావ్? గుళ్లో అమ్మవారిలా?’ అంటూ ఆభరణ ప్రియులైన మహిళల్ని ఆటపట్టించే రోజులు గతించనున్నాయి. నడుముకి వడ్డాణాలు, బంగారపు పూల జడలు, కంఠాన్ని కప్పేసే నెక్లెస్లు తదితర ఒకప్పటి ఫ్యాషన్లే కావచ్చు. కానీ ఇవే ఇప్పుడు ట్రెండ్. పాతే వింత అంటున్న ఆధునికులు... మోటుగా ఉంటాయంటూ తీసిపారేసిన నగల్నే మోజుగా ఆదరిస్తున్నారు. అంతేకాదు... మరింతగా వెనక్కెళ్లి శోధించి, మరీ పురాతన ఆభరణ శైలుల్ని అందుకుంటున్నారు. మన అమ్మమ్మలు, అవ్వల కాలం నాటి స్టైల్స్కు ప్రాణం పోస్తున్నారు. కాసుల గలగల.. కాసుల పేర్లంటూ ఆనాటి ఆభరణం మరోసారి కొత్తగా సవ్వడి చేస్తోంది. ఆధునిక మహిళల మెడలో గలగలమంటోంది. మెడలో వేసుకునే లక్ష్మీకాసుల మాలలు ఇప్పుడు ట్రెండీ. మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా తయారు చేస్తున్నారు. వీటిని మ్యాంగో మాలలని పిలుస్తున్నారు. కనీసం 25 పైసలంత సైజ్లో ఉండే కాసులతో తయారయ్యే మాల కనీసం 30–300 గ్రాముల బరువు ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. కొత్తవాటి ‘కంటె’ మిన్న.. ఒకప్పటి సంప్రదాయ ఆభరణమైన కంటెలు మళ్లీ ట్రెండ్లోకి వచ్చాయి. వీటిని రాజుల కాలంలో ధరించేవారట. ఇటీవల మహానటి సినిమాలో కీర్తి సురేష్ «సైతం ధరించింది. కాళ్ల పట్టీల టైప్లో ఉండే వీటిని మెడలో ధరిస్తారు. ఇది చూడ్డానికి థిక్గా ఒక రాడ్లా ఉంటుంది. దీనికే పెండెంట్స్,పెరల్ డ్రాప్స్ జోడించడం, స్టోన్స్తో కార్వింగ్ చేయడం ద్వారా మరింత ఫ్యాషనబుల్గా మారుస్తున్నారు. రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వీటి ధరలు ఉంటున్నాయి. గుట్టలు గుట్టలుగా... అలనాటి తెలంగాణ సంప్రదాయ ఆభరణం గుట్ట పూసలు. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి. వీటిని షేప్లెస్ ముత్యాలతో చేస్తారు. ఏ వయసు వారైనా ధరించొచ్చు. రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వివిధ ధరల్లో లభిస్తున్నాయి. కంకణం కట్టుకుంటున్నారు.. మోచేతి అందాన్ని పెంచే గాజులకు ముందుగా బంగారు కంకణం ధరించడమనేది చాలా పాతకాలం నాటి ఆభరణాల శైలి. అయితే ఆధునికులు కూడా దీన్ని అనుసరిస్తున్నారు. రెండు చేతులకూ గాజులతో పాటు ఒక్కో కంకణం తొడుగుతున్నారు. ఇవి చూసేందుకు లావుగా ఉంటాయి. ఒక్కోటి 30 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఉంటాయి. ధర రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. వేడుకల్లో తప్పనిసరి... మోటుగా ఉండే ఆభరణాలు అంటూ ఇప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. ఓల్డ్ ట్రెండ్స్ని అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఇక పెళ్లి వేడుకల్లో అయితే పాతకాలం నాటి ఆభరణాలు తప్పనిసరిగా మారాయి. ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్నవే. అయితే గతంలో ఉన్నత స్థాయి వాళ్లు మాత్రమే ధరించేవారు. ఇప్పుడు మిడిల్క్లాస్ కూడా వీటినే ఎంచుకుంటున్నారు. – శ్వేతారెడ్డి, డిజైనర్, హియా–లాస్య జ్యువెలర్స్ -
గిన్నిస్ బుక్ రికార్డులో ఉంగరం
-
భారీ మోసం.. జ్యువెలరీ షాపు ఎండీ అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మీనా జ్యువెలరీ ఎండీ భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నగల దుకాణం ఎండీ ఉమేష్ జత్వాని ఎల్లారెడ్డిగూడాలోని ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ వద్ద రూ. 6 కోట్లు చిట్టీల రూపంలో తీసుకున్నారు. అతను చిట్టీ వాయిదాలు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో చిట్ ఫండ్ వారికి అనుమానం వచ్చింది. అంతేకాక ఆ ఎండీ అకౌంట్ క్లోజ్ చేసిన చెక్కులు ఇచ్చి మోసం చేశాడని చిట్ ఫండ్ కంపెనీ చైర్మన్ హనుమంతరావు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బంజరాహిల్స్లోని మీనా జ్యువెలరీ ఎండీ ఉమేష్ జత్వాని, అతని కొడుకు కరణ్ జత్వానిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
6,690 వజ్రాల ‘గిన్నిస్’ ఉంగరం
సూరత్ : గుజరాత్లోని సూరత్ వజ్రాల రాజధానిగా పేరు పొందిన విషయం తెలిసిందే. సూరత్కు చెందిన ఆభరణాలు తయారీ చేసేవారు తమ కళప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించారు. అంతేకాక ఉంగరంలో మొత్తం 6,690 వజ్రాలను తయారీదారులు పొందుపరిచారు. ప్రస్తుతం ఈ ఉంగరం గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. విశాల్ అగర్వాల్, ఖుష్బూ అగర్వాల్లు ఈ ఉంగరాన్ని 18 క్యారెట్ల గోల్డ్తో తామర పువ్వు ఆకారంలో తయారు చేశారు. గిన్నిస్ బుక్ రికార్డు ప్రకారం.. ఉంగరం విలువ రూ. 28 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ చేతి ఉంగరంపై దాదాపు 48 తామర పువ్వు రేకులు ఉన్నాయి. ఆ రేకులలో మొత్తం వజ్రాలను సెట్ చేశారు. ఈ లోటస్ డైమండ్ రింగ్ దాదాపు 58 గ్రాముల బరువు ఉందట. దీన్ని తయారు చేయటానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఉంగరం తయారీదారులు మాట్లాడుతూ.. ప్రజలలో నీటి పొదుపుపై అవగాహన తేవడానికి ఈ రింగ్ను రూపొందిచమన్నారు. ఈ లోటస్ మన జాతీయ పుష్పం. అంతేకాక నీటిలో పెరిగే అందమైన పువ్వు.. కాబట్టి ఈ పువ్వు ఆకారంలో ఉంగరం తయారీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఉంగరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాక ఈ రింగ్పై నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఉంగరం తయారీ వీడియోను గిన్నిస్ బుక్ తన ఫేస్బుక్లో పోస్టు చేసింది. పోస్టు చేసిన కొద్ది సమయంలో లక్షల మంది ఈ వీడియోను చూశారు. ‘ఈ ఉంగరం పెట్టుకున్న వారు భద్రతా కోసం చుట్టూ మనుషులను పెట్టుకోవాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరైతే ‘ఎందుకు డబ్బు వృద్ధా’ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఉంగరం తయారీ వీడియో చూసిన ఓ నెటిజన్ ‘వావ్ అమెజింగ్ వర్క్’ అని ప్రశంసలు కురిపించాడు. -
శ్రీవారి నగలపై హైకోర్టుకు సీఎం లేఖ!
-
ఫేస్బుక్ ప్రేమ కోసం..
చిత్తూరు, పాకాల: తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులను పక్కదారి పట్టించాలని యత్నించిన ఓ వివాహిత, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామలింగమయ్య తెలిపారు. ఆయన కథనం మేరకు.. పాకాల గాంధీనగర్కు చెందిన స్వాతిప్రియ మే 11న రైల్వే కాలనీలో ఉన్న రాములవారి ఆలయానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారంచల్లి 176 గ్రాముల బంగారు నగలు దోచుకెళ్లారని ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తు న్న పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు విచారణలో వెల్ల్లడయ్యాయి. వివాహిత స్వాతిప్రియకు ఫేస్బుక్లో తూర్పు గోదావరి జిల్లా కరప మండలం నడకుడూరుకు చెందిన పవన్కుమార్ అలియాస్ (అఖిల్)(25)తో పరిచయం ఏర్ప డి ప్రేమకు దారి తీసింది. దీంతో ఇరువురు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని పథకం ప్రకారం ఆమె వద్దనున్న నగలను పవన్కుమార్ని నేండ్రగుంట వద్దకు రమ్మని అతనికి అందజేసింది. తరువాత రైల్వే కాలనీకి చేరుకుని గుర్తు తెలియని వ్యక్తులు తన వద్ద నుంచి నగలు లాక్కెళ్లారని గగ్గోలు పెట్టింది. అయితే విచారణలో అసలు విషయం తెలియడంతో ప్రియుడు, ప్రియురాలిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పవన్ కుమార్ను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. -
తిరుమల: అరగంటలో ఆభరణాల పరిశీలన!
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి పలువురు భక్తులు సమర్పించిన వెలకట్టలేని ఆభరణాలు మాయమైనట్లు వచ్చిన ఆరోపణలపై స్పందించిన టీటీడీ పాలక మండలి సభ్యులు సోమవారం వీటిని పరిశీలించారు. అయితే అసలు ఏడుకొండలవాడికి ఎన్ని ఆభరణాలు ఉన్నాయనే వివరాలను తెలుసుకోకుండానే ఈ కార్యక్రమాన్ని ఆగమేఘాలపై అరగంటలో ముగించడం గమనార్హం. పాలకమండలి సభ్యులు మంగళవారం తిరుమలలో మరోసారి భేటీ కానున్నారు. రిజిస్టర్లో 1200కిపైగా ఆభరణాలు శ్రీవారికి భక్తులు సమర్పించిన అపురూపమైన పలు ఆభరణాలు మాయమయ్యాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలిస్తామంటూ సోమవారం ఆలయంలోకి వెళ్లిన టీటీడీ పాలకమండలి సభ్యులు మొక్కుబడిగా కార్యక్రమాన్ని ముగించారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. శ్రీవారి తిరువాభరణ రిజిస్టర్లో 1200కిపైగా ఆభరణాలున్నాయి. కనీసం రిజిస్టర్లో ఎన్ని ఆభరణాలు ఉన్నాయో కూడా తెలుసుకోకుండానే సభ్యులు పరిశీలన పూర్తి చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలైనవేనా...? తిరువాభరణ రిజిస్టర్లో నమోదు చేసిన ప్రకారం ఆభరణాలు అన్నీ ఉన్నాయా? వజ్రాలు, విలువైన రాళ్లతో పొదిగిన ఆభరణాలెన్ని? అవన్నీ అసలైన ఆభరణాలేనా? అనేది తేలాల్సి ఉంది. రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో ప్రధానమైనది డైమండ్ అదృశ్యం. శ్రీవారి హారంలో వజ్రం ఉండేదని, తరువాత దాన్ని మాయం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని రాములవారి ఆలయంలో అసలు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణం బయట పడటం గతంలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఆభరణాలు అసలైనవేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తెరదించాలంటే తూతూమంత్రంగా కాకుండా ప్రతి ఆభరణంపై నిశితంగా పరిశీలన జరగాలి. ఆభరణాలపై సభ్యుల సంతృప్తి శ్రీవారి ఆభరణాలన్నీ పక్కాగా ఉన్నాయని పరిశీలన అనంతరం పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. అయితే రిజిస్టర్ ప్రకారం అన్నిటినీ పరిశీలించటం సాధ్యం కాలేదని చెప్పారు. మచ్చుకు కొన్ని ఆభరణాలను మాత్రమే పరిశీలించామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని, ఇటీవల మరింత పటిష్టం చేశారని చెప్పారు. నాలుగో, ఐదో ఉన్నాయి.. శ్రీవారికి ఆరు బంగారు కిరీటాలు, ఆరు వజ్ర కిరీటాలతో పాటు చిన్న చిన్న ఆభరణాలు అధికంగా ఉన్నాయని బోర్డు సభ్యుల పరిశీలనలో తేలినట్లు సమాచారం. అయితే బోర్డు సభ్యులు మాత్రం నాలుగో, ఐదో కిరీటాలు ఉన్నాయని... చిన్నవి, పెద్దవి చాలా ఉన్నాయని చెప్పటంపై దేవస్థానం అధికారులు విస్తుపోతున్నారు. చిన్న చిన్న ఆభరణాల సంగతి ఎలా ఉన్నా కనీసం శ్రీవారికి కిరీటాలు ఎన్ని ఉన్నాయో కూడా బోర్డు సభ్యులు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదని దేవస్థాన సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
విషాదం: కొడుకు ఎదుటే తండ్రి కాల్చివేత
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో పట్టపగలే దోపిడీ చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలోకి చొరబడిన దుండగులు ఆభరణాలను దోచుకోవడంతో పాటు అక్కడే ఉన్న షాప్ యజమాని హేమంత్ కౌశల్ను కాల్చి చంపారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని ఆదర్శనగర్లో మంగళవారం జరిగింది. అయితే, ఈ ఘటనలో దొంగతనానికి, తండ్రి చావుకు కొడుకు ప్రత్యక్ష సాక్షిగా నిలవడం విషాదకరం. కౌశల్ కొడుకు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముగ్గురు దుండగులు హెల్మెట్ ధరించి షాప్లోకి చొరబడ్డారు. హెల్మెట్ తీయాలని దుకాణంలో పనిచేసే అశోక్ కుమార్ వారిని కోరగా.. తుపాకితో దుండగులు అతన్ని బెదిరించారు. మీ యజమానిని పిలవమని ఆదేశించారు. అశోక్ పిలుపుతో అక్కడే మరో గదిలో ఉన్న నాన్న అక్కడికి వచ్చారు. షాప్లో ఉన్న బంగారమంతా ఇవ్వాలనీ, లేదంటే నీ కొడుకును చంపేస్తామని దుండగులు నాన్నను బెదిరించార’ని ఎనిమిదో తరగతి చదువుతున్న కౌశల్ కొడుకు చెప్పుకొచ్చాడు. ‘వాళ్ల బెదిరింపులకు భయపడిన నాన్న.. బంగారం తీసుకుపొండి, నా కొడుకును మాత్రం ఏం చేయొద్దని వేడుకున్నాడు. దొంగలు ఉన్నదంతా దోచుకుని పరారవుతున్న క్రమంలో నాన్న వాళ్ల కాళ్లపై పడి.. నా కొడుకు భవిష్యత్ కోసం కొంచెం బంగారం మిగిల్చి వెళ్లాలని వేడుకున్నాడు. దాంతో ఒకడు నాన్నను సోఫాలో పడేసి కాలితో తన్నాడు. మరొకడు తుపాకితో నాన్నపై పలుమార్లు కాల్పులు జరిపాడ’ని తండ్రిని గుర్తు చేసుకుని కౌశల్ కొడుకు భోరున విలపించాడు. మరోవైపు ఘటన జరిగి రెండు రోజులు కావొస్తున్నా దోపిడీ ముఠాకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి సమాచారం లభించలేదు. కాగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామనీ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల్ని పట్టుకుటామని పోలీసు కమిషనర్ అస్లాం ఖాన్ తెలిపారు. -
ప్లాటినంపై యువత మోజు
కొరుక్కుపేట: ప్లాటినం నగలపై యువతకు మోజు పెరగుతుందని, దీంతో ప్లాటినం అమ్మకాలు పెరుగున్నాయని ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) మేనేజింగ్ డైరెక్టర్ వైశాలి బెనర్జీ అన్నారు. సోమవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఆమె మట్లాడారు. ప్లాటినం జ్యువెలరీ బిజినెస్ రివీవ్– 2017 ఇటీవల చేపట్టామన్నారు. అందులో ఇండిపెండెంట్ ప్లాటినం మార్కెట్ నిపుణులు, ఇండస్ట్రీ అనలిస్ట్ సంయుక్తంగా భారత్లో కన్సూమర్ రీటైల్ సేల్స్ గ్రోత్పై సర్వే నివేదికను అందించారన్నారు. భారత్లో ప్లాటినం మార్కెట్ గ్రోత్ పటిష్టంగా ఉందన్నారు. రీటైల్ సేల్స్ 21 శాతం ఏటా పెరుగుతున్నాయన్నారు. ఫ్యాబ్రికేషన్ డిమాండ్ గ్రోత్ ఏడాది ఏడాదికి 34 శాతం పెరుగుతున్నట్లు తెలిపారు. ప్రసుత్తం ప్యాషన్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో యువత సైతం ప్లాటినం జ్యువెలరీపై మోజు పెరుగుతుందన్నారు. బ్రైడల్ మార్కెట్ సైతం చైనా, జపాన్, యూఎస్తోపాటు భారత్లో పెరుగుతుందన్నారు. -
శ్రీవారి ఆభరణాలు భద్రమేనా?
తిరుమల శ్రీవారికి చెందిన వేల కోట్ల విలువజేసే ఆభరణాల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. చెన్నై మీడియా సమావేశంలో అప్పటి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు స్వామివారి ఆభరణాలపై సందేహాలను వ్యక్తం చేసినప్పటి నుంచీ భక్తుల్లో అనుమానాలు మరింత పెరిగాయి. శ్రీకృష్ణదేవరాయల ఆభరణాలను ప్రత్యక్షంగా చూసి వాటిపై కొద్దోగొప్పో అవగాహన ఉన్న రమణ దీక్షితులు వంటి ప్రముఖ వ్యక్తే సందేహాలను వెలిబుచ్చడం చర్చకు దారి తీసింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో తిరుమల శ్రీవారికి సమర్పించిన వేల కోట్ల ఖరీదుజేసే బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాల భద్రతపై టీటీడీ వర్గాలు నోరు మెదపడం లేదు. మూడు రోజులుగా వివిధ వర్గాల ప్రజలు, మీడియా ప్రశ్నిస్తున్నప్పటికీ కచ్చితమైన సమాధానం చెప్పడం లేదు. దీంతో రాయల వారి నగలపై స్పష్టమైన వివరణ ఇవ్వడంలో టీటీడీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత మంగళవారం చెన్నైలో అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీలో వంశపారంపర్యంగా వస్తున్న అర్చక వారసత్వాన్ని రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధ«మని రమణ దీక్షితులు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారి బంగారు ఆభరణాల భద్రతను ప్రశ్నించారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో స్వామి వారికి అందజేసిన వేల కోట్ల విలువజేసే ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి... ఎంత మేరకు భద్రంగా ఉన్నాయని టీటీడీ అధికారులను నిలదీశారు. ఆభరణాల లెక్కలను బహిరంగపరిచి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని రమణ దీక్షితులు టీటీడీ వర్గాలను కోరారు. కొత్తగా స్వామి వారికి కా నుకల రూపంలో అందిన ఆభరణాలను మాత్రమే ఉత్సవాల సమయంలో అలంకరిస్తున్నారనీ, పాత నగలను బయటకు తీయడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవలనే టీటీడీకి చెందిన రూ.1000 కోట్ల నగదును అధికారులు ఓ ప్రయివేటు బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీంతో భద్రతను ప్రశ్నిస్తూ శ్రీవారి భక్తుడు నవీన్కుమార్రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పట్లో డిపాజిట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. సరైన సమాధానం చెప్పలేక టీటీడీ అధికారులు సతమతమయ్యారు. ఈ నెల 16న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సదరు డిపాజిట్ల పర్యవేక్షణ కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ సుధాకర్యాదవ్ వెల్లడించారు. ఒకవైపు డిపాజిట్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో శ్రీవారి విలువైన ఆభరణాలపై సందేహాలు వెల్లువెత్తడం టీటీడీ వర్గాలను కుదిపేస్తోంది. కచ్చితమైన సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలే పరిస్థితి నెలకొంది. అయితే కొత్తగా విధుల్లో చేరిన నూతన ప్రధాన అర్చకులు మాత్రం ఆభరణాలకు చెందిన రికార్డులన్నీ ఉన్నాయని బదులిచ్చారు. లోగుట్టు పెరుమాళ్ల కెరుక.... 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలు తిరుమలాదేవి, చిన్నమదేవితో కలిసి 7 సార్లు తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. అప్పట్లో రాయలవారు దర్శనానికి వచ్చిన ప్రతిసారీ విలువైన బంగారు, వజ్ర, నవరత్నాలతో కూడిన వజ్ర కిరీటాలు, భుజకీర్తులు, కంఠహారాలు, స్వర్ణ ఖడ్గాలను స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించారు. 1513 ఫిబ్రవరి 10వ తేదీ తొలిసారి సందర్శించినపుడు నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని అందజేశారు. అదే సంవత్సరం మే 2వ తేదీ రెండోసారి రాయల వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అప్పట్లో మరో కిరీటం, పతకాలు, హారాలు, వెండి హారతి పళ్లాలు అందజేశారు. ఆ తరువాత పుత్రసంతానం కలిగాక భార్య తిరుమలాదేవితో కలిసి వచ్చి (1518 అక్టోబర్ 16) తిరుమల వెంకన్నను దర్శించి బంగారు పీతాంబరాలు, నవరత్నాలను సమర్పించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. మహంతుల కాలంలో కొన్నింటిని కరగబెట్టి కొత్త ఆభరణాలు చేయించే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. ఆ తరువాత 1996 వరకూ కొన్ని ఆభరణాలను అడపా దడపా స్వామి వారికి అలంకరిస్తూ వచ్చారు. ఆ తరువాత కొత్త ఆభరణాలు వచ్చి చేరుతుండటంతో పాత వాటి జోలికెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో అసలు రాయల వారి ఆభరణాల మాటేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికైనా టీటీడీ వర్గాలు భక్తుల సందేహాలకు సరైన సమాధానం చెప్పి భక్తుల్లో నమ్మకాన్ని, భరోసాను పెంచాల్సిన అవసరం ఉంది. అధికారులు సమాధానం చెప్పాలి శ్రీవారికి ఉన్న వేల కోట్ల విలువైన ఆభరణాలపై భక్తుల్లో అనుమానాలు తీవ్రతరంకాక ముందే టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలి. ఏఏ ఆభరణాలు ఎక్కడ, ఏ రకమైన భద్రతలో ఉన్నాయో వివరిం చాలి. సాక్షాత్తు ఆలయ ప్రధాన అర్చకులై, ఆగమ సలహాదారులుగా వ్యహరించిన రమణ దీక్షితుల వంటి పెద్దలు సందేహాలను వ్యక్తం చేయడం చూస్తే ఏదో జరుగుతోందన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నవీన్కుమార్రెడ్డి, ఆర్పీఎస్ కన్వీనర్, తిరుపతి ఆభరణాల నిర్వహణ లోపభూయిష్టం స్వామి వారి ఆభరణాల నిర్వహణ బాధ్యతలు సరిగా లేవు. అంతా లోపభూయిష్టంగా ఉంది. కోట్ల విలువైన ఆభరణాలపై కనీస జబాబుదారీతనం లేకుండా పోయింది. ఆభరణాలను భక్తుల సందర్శన కోసం ఉంచడం శ్రేయస్కరం. – పురుషోత్తమ రెడ్డి, రాయలసీమ మేథావుల ఫోరం -
అన్న బాటలోనే చెల్లెలు
హైదరాబాద్, నాగోలు: స్నేహితురాలి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఓ యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో యువకుడిని మీర్పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 17 తులాల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. హయత్నగర్ ఆర్టీసీకాలనీకి చెందిన ఆరాధనరెడ్డి అనే విద్యార్థిని. రామంతాపూర్ ఇందిరానగర్కు చెందిన ఉమేష్ (19) స్నేహితులు. ఆరాధన రెడ్డి సోదరుడు అమర్ రాజ్కుమార్రెడ్డి అలియాస్ డోల మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతనిపై పీడీయాక్ట్ నమోదు చేయగా ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అతని సోదరి ఆరాధనరెడ్డి అన్న చోరీ చేసిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి నగదు రూపంలోకి మార్చేది. అమర్ రాజ్కుమార్రెడ్డి జైలుకు వెళ్లడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె ఉమేష్తో కలిసి చోరీలకు పథకం పన్నింది. ఇందులో భాగంగా ఈ నెల 9న ఆర్ఎన్రెడ్డినగర్లో ఉంటున్న తన స్నేహితురాలైన భావిక ఇంటికి వెళ్లింది. ఉమేష్ బయటే ఉండగా ఆరాధనరెడ్డి భావికను మాటల్లో పెట్టి ఇంట్లో ఉన్న 17 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు భావిక ఇంట్లో దొరికిన రాజ్కుమార్రెడ్డి ఫోటో ఆధారంగా ఆరాధనరెడ్డి, ఉమేష్లను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తుతో పాటు బైక్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో రాచకొండ క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, మీర్పేట సీఐ మన్మోహన్, డీఐ మధుసూదన్, ఏడీఎస్ఐ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువతి కళ్లలో కారం చల్లి నగలు దోపిడీ
చిత్తూర్, పాకాల: మండల కేంద్రమైన పాకాలలో శుక్రవారం మధ్యాహ్నం దుండగులు యువతి కళ్లలో కారం చల్లి నగలు దోపిడీ చేశారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక గాంధీనగర్కు చెందిన దిలీప్ చక్రవర్తి భార్య స్వాతిప్రియ ద్విచక్ర వాహనంలో రైల్వే క్వార్టర్స్లో ఉన్న కోదండరామాలయానికి వెళ్లింది. పూజలు చేసుకుని ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో ఇద్దరు దుండగులు ఆమెను అడ్డగించి కళ్లలో కారం చల్లారు. ఆమె ఒంటిపై ఉన్న 208 గ్రాముల బంగారు నగలను లాక్కుని ఉడాయించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడ తనను అడ్డగించిన ఇద్దరితోపాటు మరో ఆరుగురు తెలియని వ్యక్తులు ఉన్నారని పేర్కొంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. -
తనిఖీలతో నీట్ విద్యార్థులకు ఇబ్బందులు
-
బంగారం చోరీ ఘటనలో మరొకరు బలి
తిమ్మాజిపేట: నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని కోడుపర్తి గ్రామంలో వివాహం రోజు జరిగిన చోరీ ఘటనలో మరొకరు బలయ్యారు. ఈ నెల 19న శ్రీనివాస్రెడ్డి కుమారుడు రాందేవ్రెడ్డి వివాహ వేడుక తర్వాత వారి బంధువులకు చెందిన సుమారు 24 తులాల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, శ్రీనివాస్రెడ్డిని వారి బంధువులను విచారించారు. దీంతో అవమానానికి గురైన శ్రీనివాస్రెడ్డి తన వ్యవసాయ పొలంలో ఈ నెల 20న రాత్రి ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున చోరీకి గురైన నగలు స్థానిక స్కూల్ సమీపంలో రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఇదే ఘటనకు సంబంధించి అనూహ్యంగా హైదరాబాద్ లోని రాజేందర్నగర్లో నివాసముంటున్న మృతుడు శ్రీనివాస్రెడ్డి అన్న మన్యపురెడ్డి కుమారుడు సురేశ్రెడ్డి (26) ఈ నెల 21న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చోరీకి గురైన బంగారు ఆభరణాలు సురేశ్రెడ్డి సోదరి కల్పనవి కావడం, అతడు ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. మృతుడికి తల్లి యాదమ్మ, సోదరుడు ఉన్నారు. కొడుకు పెళ్లికి వచ్చిన బంధువుల నగలు చోరీ -
కొడుకు పెళ్లికి వచ్చిన బంధువుల నగలు చోరీ
సాక్షి, నాగర్కర్నూల్: అది పెళ్లయిన ఇళ్లు.. పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా వెళ్లలేదు.. పచ్చని తోరణాలు తొలగించలేదు... అంతలోనే పెళ్లికొడుకు తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం కోడుపర్తి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రేషన్ డీలర్ శ్రీనివాస్రెడ్డి(45) పెద్దకుమారుడు రాందేవ్రెడ్డికి ఈనెల 19న గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్హాల్లో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి కోడుపర్తికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధువులతో సహా వచ్చారు. రాత్రి ఉక్కపోతగా ఉండటంతో భోజనాల తర్వాత బంధువుల వద్ద ఉన్న బంగారు నగలను సూట్కేసులో భద్రపర్చి అంతా కలసి మేడపై నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం తెల్లవారేసరికి సూట్కేసులోని సుమారు 24 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన శ్రీనివాస్రెడ్డి తిమ్మాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ సన్ప్రీత్సింగ్తో సహా పోలీసు అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. ఇది బయటి దొంగల పనికాదని, బంధువుల్లో ఎవరో దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని అనుమానించి బంధువులందరినీ వేర్వేరుగా ప్రశ్నించడంతో పాటు నిజం తేలకుంటే అందరినీ స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తామని హెచ్చరించారు. మనస్తాపంతో... ఇంట్లో శుక్రవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరగాల్సి ఉండగా పోలీసుల విచారణతో శ్రీనివాస్రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పెళ్లికి వచ్చిన బంధువులలో ఎవరిని తప్పు పట్టాలో, పోలీసులు ఎవరిని అవమానం పాలుచేస్తారో తెలియక మదనపడ్డారు. ఒకవేళ ఆభరణాలు దొరకకపోతే బంధువులకు తానే ఇవ్వాల్సి వస్తుందన్న ఆవేదనతో ఆయన శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లి పెళ్లికొడుకు రాందేవ్రెడ్డికి ఫోన్ చేసి అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని, గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ చెప్పి ఉరి వేసుకున్నాడు. కాగా, అంతకుముందు చోరీ అయిన బంగారు ఆభరణాలను దొంగలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని రోడ్డుపై పడేసి వెళ్లారు. కొందరు చేసిన పనికి తాము కుటుంబ పెద్దదిక్కును కోల్పోయామని శ్రీనివాస్రెడ్డి భార్య పద్మ, కొడుకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాందేవ్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బంగారం పోయిందన్న అవమానంతోనే శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇందులో పోలీసుల ఒత్తిడి ఏమీ లేదని ఎస్ఐ పేర్కొన్నారు. -
రూ.32వేలను దాటేసిన బంగారం
-
రూ.32వేలను దాటేసిన బంగారం
సాక్షి, ముంబై: అక్షయ తృతీయ మెరుపులు పసిడిని అపుడే భారీగానే తాకాయి. కొనుగోలు దారుల ఉత్సాహంతో బంగారం ధర మళ్లీ చుక్కలను తాకింది. అటు గ్లోబల్ సంకేతాలు, ఇటు దేశీయంగా నగల వ్యాపారస్థుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.32వేల మార్కును టచ్ చేసింది. గురువారం నాటి బులియన్ ట్రేడింగ్లో పది గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.32,150కి చేరింది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి భారీగా కూడా కొనుగోళ్లు పెరిగాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ .24,900 వద్ద ఉంది. అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం స్వల్ప వెనుకంజలో ఉంది. ఇక మరో విలువైన మెటల వెండికూడా ఇదే బాటలో ధర కూడా తిరిగి రూ.40వేల మార్కుకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.240 పెరిగి రూ.40వేలకు చేరింది. అంతర్జాతీయంగానూ పసిడి ధర పెరిగింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.02శాతం పెరిగి 132.80డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.60శాతం పెరిగి 16.65డాలర్లుగా ఉంది. మరోవైపు ఫ్యూచర్స్మార్కెట్ లో మాత్రం పసిడి స్వల్ప వెనుకంజలో ఉంది. కాగా ఏప్రిల్ 18న అక్షయ తృతీయ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు స్థానిక ఆభరణాల తయారీదారులు భారీ ఆఫర్ల వెల్లువ కురుస్తున్న సంగతి తెలిసిందే. వివిధ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
జగన్నాథుని రత్న భాండాగారం పరిశీలన
భువనేశ్వర్ : ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. నగల భాండాగార నిర్మాణాన్ని పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో 34 ఏళ్ల తర్వాత బుధవారం అధికారులు ఆలయ రత్న భాండాగార తలుపులు తెరిచారు. అయితే ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దని న్యాయస్థానం సూచనలు చేసింది. 10 మంది సభ్యులతో ప్రత్యేక బృందం నగల భాండాగారం పరిశీలన చేపట్టింది. కాగా చివరిసారిగా 1984వ సంవత్సరంలో రత్న భాండాగారం పరిశీలన నిర్వహించారు. ఇది అత్యంత గోప్య ప్రక్రియ. శ్రీ మందిరం సత్వ లిపి ప్రకారం ఈ ప్రక్రియ ఆద్యంతాలు నిర్వహిస్తారు. పరిశీలనలో భాగంగా రత్న భాండాగారం లోపలి గోడలు, పై–కప్పు ఇతరేతర నిర్మిత కట్టడాల స్థితిగతుల్ని నిపుణులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని శ్రీ మందిరం దేవస్థానం ప్రధాన పాలన అధికారి ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. రత్న భాండాగారం పరిశీలన వ్యవధిలో భక్తులకు దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తారు. పరిశీలన ముగియడంతో బృందం సభ్యులు సమగ్ర నివేదిక తక్షణమే సమర్పించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 36 నియోగుల సమావేశం తీర్మానం మేరకు ఈ బృందంలో పూరీ గజపతి మహా రాజా ప్రతినిధి, రాష్ట్ర హైకోర్టు ప్రతినిధి, భండార్ మేకప్, పట్టజోషి మహాపాత్రో, దెవులొ కొరొణొ, తొడొవు కొరొణొ సేవాయత్ వర్గాల ప్రతినిధులతో భారతీయ పురావస్తు శాఖ ఇద్దరు ప్రతినిధులు, కోర్ కమిటీ నుంచి ఇద్దరు ప్రతినిధుల్ని సభ్యులుగా ఎంపిక చేశారు. వీరందరికీ మూడు అంచెల్లో తనిఖీలు నిర్వహించి రత్న భాండాగారం లోనికి అనుమతిస్తారు. తొలుత మజొణా మండపం ఆవరణలో తనిఖీ చేస్తారు. రెండోసారి బెహొరొణొ ద్వారం ముంగిట తనిఖీలు చేసిన తర్వాత రత్న భాండాగారం ప్రాంగణంలో భండార్ మేకప్ సేవాయత్ ప్రముఖులు తనిఖీ చేసిన మేరకు లోనికి ప్రవేశించేందుకు అనుమతిస్తారని వివరించారు. రత్న భాండాగారంలో గోప్యమైన విషయాలు, వివరాలు, అంశాల్ని బహిరంగంగా చర్చించడం వంటి చర్యలకు పాల్పడకుండా స్థానిక లోకనాథుని దేవస్థానంలో పరిశీలన బృందం సభ్యులు అంతా ప్రమాణం చేయడం అనివార్యంగా పేర్కొన్నారు. గజపతి మహారాజా రావలిసిందే జగన్నాథుని రత్న భాండాగారం పరిశీలన బృందంలో పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్ ప్రత్యక్షంగా పాల్గొనాల్సిందేనని జగన్నాథ సేవాయత్ సమ్మేళన్ స్పష్టం చేసింది. తరతరాల ఆలయ సంప్రదాయాల ప్రకారం పూరీ గజపతి మహా రాజా జగన్నాథుని తొలి సేవకుడు. జగన్నాథ ఆలయ అధికారిక మండలి శాశ్వత అధ్యక్షునిగా ఆయన కొనసాగుతున్నారు. ఆయన ప్రతినిధిని సభ్యునిగా రత్న భాండాగారం పరిశీలనకు ప్రేరేపించడం విచారకరం. పూరీ గజపతి మహారాజా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జగన్నాథ సేవాయత్ సమ్మేళన్ తెలిపింది. ఆలయ పాలక మండలి, సేవా యత్, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలతో నిర్వహించిన త్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఎటువంటి ప్రతిపాదన లేనట్లు సమ్మేళన్ ప్రముఖుడు కాశీనాథ్ ఖుంటియా తెలిపారు. ఈ సమావేశానికి హాజరు అయిన పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్ ఈ నేపథ్యంలో ఎటువంటి అభ్యంతరాల్ని ప్రస్తావించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు బదులుగా ప్రతినిధిని ఖరారు చేసి రత్న భాండాగారం పరిశీలన బృందం ఖరారు చేయడంపట్ల జగన్నాథ సేవా యత్ సమ్మేళన్ సందేహం వ్యక్తం చేస్తోంది. -
కొలిక్కిరాని క్యాషియర్ వ్యవహారం
పోరుమామిళ్ల :పోరుమామిళ్ల స్టేట్బ్యాంక్లో బుధవారం కోటిరూపాయలకు పైగా డబ్బు, నగలు తీసుకుని పరారయిన మార్తాల గురుమోహన్రెడ్డి కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గురువారం బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి చెప్పిన రూ. 91.49 లక్షల నగదు, 24 మంది ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారు మాత్రమేనా? ఇంకా అధికంగా పోయిందా? అన్న విషయం స్పష్టం కాలేదు. శుక్రవారం గుడ్ఫ్రైడే సందర్భంగా బ్యాంకుకు సెలవు అయినా సిబ్బంది రికారŠుడ్స, లాకర్లు, ఇతర అంశాల పరిశీలన చేస్తున్నారు. రీజినల్ మేనేజర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కడప నుంచి వచ్చిన సిబ్బంది బ్యాంకులో తనిఖీలు చేపట్టారు. ఖాతాదారుల ఆందోళన బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. బ్యాంకులో తాము పెట్టిన డబ్బుకు, బంగారుకు భద్రత లేకపోవడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయనాయకులు రుణాల రూపంలో కోట్లు తీసుకుని ఎగవేత ద్వారా బ్యాంకులను ముంచుతుండగా, ఇప్పుడు ఏకంగా బ్యాంకు సిబ్బందే దోచుకోవడం అందరినీ కలవరపెడుతోందని ఖాతాదారులు వాపోయారు. ఇద్దరు మైనారిటీ మహిళలు తమ బంగారు ఉందా? లేదా? అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. పోయిన డబ్బు బ్యాంకు అధికారులు ఖాతాదారులకు చెల్లించినా, తమ ఆభరణాల విషయంలో ఏమి చేస్తారన్న ప్రశ్న వచ్చింది. ఒకరిద్దరు ఖాతాదారులు తమకు ఇచ్చిన రశీదులో బ్యాంక్ సీల్ ఉందని, క్యాషియర్ సంతకం చేయలేదని తెలిపారు. మోసం చేసే ఉద్దేశ్యంతోనే గురుమోహన్రెడ్డి సంతకం చేయలేదని భావిస్తున్నామన్నారు. ఎవ్వరికీ నష్టం జరగదు,భయం వద్దు: ఆర్ఎం బ్యాంకులో క్యాషియర్ చేసిన నిర్వాహకంపై విచారణ జరుగుతోందని, అతను ఎక్కడికీ తప్పించుకుపోలేడని ఆర్ఎం శ్రీనివాసులు చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టం బ్యాంకుకేగానీ, ఖాతాదారులకు జరగదన్నారు. అందరి డబ్బుకు, బంగారుకు బ్యాంకు జవాబుదారీగా ఉంటుందన్నారు. -
నటుడు ప్రశాంత్ మొదటి భార్య ఇంట్లో..
తిరువొత్తియూరు: చెన్నై, టీనగర్లో సినీ నటుడు ప్రశాంత్ మొదటి భార్య ఇంట్లో 170 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. చెన్నై టీ.నగర్ సౌత్ పార్కు రోడ్డులో సినీ నటుడు ప్రశాంత్ మొదటి భార్య గృహలక్ష్మి ఇల్లు ఉంది. ప్రస్తుతం ఈమె అడయారులో నివాసం ఉంటున్నారు. వారం వారం ఇక్కడికి వచ్చి బస చేసి వెళుతుంటారు. ఈ క్రమంలో బుధవారం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటి కిటికీలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా 170 సవర్ల నగలు, రూ.10వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది.దీనిపై ఫిర్యాదు అందుకున్న మాంబలం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. దొంగలకు దేహశుద్ధి: తాంబరం పడప్పై నీలమంగళంకు చెందిన శ్రీనివాసులు ఆడిటర్. శ్రీనివాసన్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇతని ఇంట్లోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఇది చూసిన స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో పట్టుబడిన వారు షోలింగనల్లూరుకు చెందిన రమేష్, ఆనంద్ అని తెలిసింది. దొంగను పట్టించిన ఇంజినీర్ చెన్నై కన్నగినగర్ కారపాక్కం భారతీయార్ వీధికి చెందిన అబుదాగిరి (23) ఇంజినీర్. మంగళవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి పక్క వీధిలో ఉన్న హోటల్కు వెళ్లాడు. తరువాత 1.30 గంటల సమయంలో ఇంటికి రాగా ఆసమయంలో ఇంట్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే బయట తలుపులకు తాళం పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని చోరీకి ప్రయత్నిస్తున్న మణికంఠన్ (26), కార్తికేయన్ (27)లను అరెస్టు చేశారు. -
వెయ్యికోట్లకు ముంచేసిన కనిష్క్ జ్యువెలరీ
సాక్షి, చెన్నై: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వరుస కుంభకోణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోటుచేసుకున్న మరో జ్యువెలరీ వ్యాపారం స్కాం వార్తల కెక్కింది. వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన చెన్నైకు చెందిన కనిష్క్ గోల్డ్ జ్యుయలరీ ప్రమోటర్లు విదేశాలకు చెక్కేసారు. దీంతో రాత్రికి రాత్రే దుకాణాలు మూసివేయడం, రికార్డులను మాయం చేయడం తదితర ఆరోపణలతో ఎస్బీఐ సీబీఐని ఆశ్రయించింది. ప్రస్తుతం నిందితులు మారిషస్కు పారిపోయివుంటారని బ్యాంకు భావిస్తోంది. రూ. 824 కోట్ల రూపాయల రుణాల మోసానికి సంబంధించి కనిష్క్ జ్యువెలరీ యజమాని, డైరెక్టర్లు భూపేష్ కుమార్ జైన్, అతని భార్య నీతా జైన్పై ఎస్బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. మొత్తం 14 బ్యాంకుల కన్సార్టియం ఆధ్వర్యంలో కనిష్క్ గోల్డ్ జ్యుయలరీ రుణాలను పొందింది. ఈ మొత్తం విలువ వెయ్యి కోట్లకు పైమాటే నని అంచనా. మరోవైపు గత ఏడాది నవంబరులో రుణఎగవేతదారుడుగా కనిష్క్ గోల్డ్ సంస్థను బ్యాంకులు ప్రకటించాయి. ఇది ఇలా ఉంటే 2017 సెప్టెంబరులో కనిష్క్ గోల్డ్ వ్యవస్థాపకుడు భూపేష్ కుమార్ జైన్ను రూ. 20 కోట్ల ఎక్సైజ్ పన్ను మోసం కేసులో అరెస్టు అయ్యాడు. బెయిల్ మీద విడుదలైన భూపేష్ అప్పటినుంచి భార్యతో సహా పరారీలో ఉన్నాడు. కాగా చెన్నైలోనే కాకుండా హైదరాబాద్, కొచ్చిన్, ముంబైలలో కూడా కనిష్క్ జువెలరీ తన షాపులను విస్తరించింది. -
కి‘లేడీ’లు
బద్వేలు అర్బన్: మహిళలను ఏమార్చి చాకచక్యంగా చోరీలకు పాల్పడే ఇద్దరు మహిళలను గురువారం బద్వేలు పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.50 లక్షలు విలువ చేసే 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.ఇందుకు సంబంధించి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బద్వేలు సీఐ రెడ్డప్ప నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 14 న అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం గ్రామానికి చెందిన అయ్యవారమ్మ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సరుకులు కొనుగోలు చేసిన అనంతరం తన బ్యాగులోని పర్సును తీసి డబ్బులు చెల్లించే క్రమంలో...అందులో నగలు ఉన్నట్లు గుర్తించిన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన గోగోల దానమ్మ, ఆత్మకూరు టౌన్ మేదర వీధికి చెందిన ఇరగాదిన్ల సరోజమ్మ లు అయ్యవారమ్మను అనుసరించారు. బస్టాండ్ సమీపంలోని పూల అంగళ్ల వద్ద పూలు కొనుగోలు చేసే సమయంలో ఆ ఇద్దరు మహిళలు తమ పైటను కట్టెల బ్యాగు పై వేసి ఎవరికీ అనుమానం రాకుండా అందులోని నగలతో ఉడాయించారు. ఇంతలో పూలకు డబ్బులు ఇచ్చేందుకు పర్సు చూసుకోగా పర్సు కనిపించక పోవడంతో వెంటనే అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పట్టించిన సీసీ కెమెరా మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పరిశీలించగా అందులో ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించి సిద్దవటం రోడ్డులోని మరికొన్ని సీసీ కెమెరాల ద్వారా వారి కదలికలను పరిశీలించారు. వారు పోరుమామిళ్ల వైపు వెళ్ళినట్లు నిర్ధారించుకుని అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు.ఈ సమయంలో పోరుమామిళ్లలోని కొమరోలు–మైదుకూరు ప్రధాన రహదారి పై ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్బన్ ఎస్ఐ చలపతిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ హేమాద్రి, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
చిక్కారు..
కాకినాడ రూరల్: హత్యలు, దొంగతనాలతో సంబంధం ఉన్న ఇద్దరు యువకులను కాకినాడ క్రైం పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ. 10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు కాకినాడ క్రైం డీఎస్పీ ఎ పల్లపురాజు బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. చోరీ చేసిన 330 గ్రాముల బంగారం వస్తువులు, 1150 గ్రాముల వెండి వస్తువులు, రూ.15వేలు నగదు సొత్తును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్టు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, మోటిపల్లివారి వీధి, తూర్పువీధికి చెందిన గొల్లపల్లి నాగమల్లేశ్వరరావు, ఏలూరు చాట్రపర్రు వాటర్ట్యాంక్ రోడ్డు, సరస్వతి స్కూల్ పక్కవీధికి చెందిన గోన్నాబత్తుల కార్తీక్కుమార్లు వివిధ నేరాలతో సంబంధం ఉందన్నారు. వీరు కాకినాడ రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని జ్యోతుల మార్కెట్ ఎదురుగా ఉన్న సంగీత లాడ్జీలో 107 నంబర్గల రూమ్లో ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు సీసీఎస్ ఎస్సై ఎం.పాపరాజు, సుధాకర్ల ఆధ్వర్యంలో క్రైమ్పార్టీ సిబ్బంది మంగళవారం రాత్రి దాడి చేసి అరెస్టు చేసినట్టు పల్లపురాజు వివరించారు. గొల్లపల్లి మల్లేశ్వరరావు పాత నేరస్తుడని, ఇతడికి ఏలూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉందన్నారు. వైజాగ్లో మూడు మర్డర్ ఫర్ గెయిన్స్ కేసులు, ఏలూరు, భీమడోలు, ఉండ్రాజవరంల్లో సుమారు 17 ఇళ్ల నేరాల కేసులు ఉన్నాయన్నారు. గొల్లపల్లి నాగమలేశ్వరరావు, గొన్నాబత్తుల కార్తీక్కుమార్లు రాత్రిసమయాల్లో ఇళ్ల తాళాలు బద్దలుగొట్టి దొంగతనాలు చేస్తారన్నారు. నాగమల్లేశ్వరరావు 2016 డిసెంబర్లో తణుకు సబ్జైల్ నుంచి బెయిల్పై బయటకు వచ్చి, 2016–18 మధ్య కాలంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కాకినాడ, ఏలూరు టౌన్, రూరల్, కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు ఏరియాలో రాత్రి వేళల్లో ఇంటి తాళాలు బద్దలు గొట్టి బంగారం, వెండి వస్తువులు, నగదు దొంగిలించారని డీఎస్పీ ఎ పల్లపురాజు వివరించారు. కాకినాడలో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 96 గ్రాముల బంగారు వస్తువు దొంగిలించారన్నారు. బంగారం, వెండి, నగదుతో పాటు ఎల్సీడీ టీవీ, 80 సర్జికల్ బ్లేడ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఈ దాడుల్లో పాల్గొని ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సైలు పాపరాజు, సుధాకర్, హెచ్సీ గోవిందు, పీసీలు చిన్న, శ్రీరాం, వర్మ, అజయ్, బాబులను డీఎస్పీ పల్లపురాజు అభినందించారు. -
నగ ధగలు... నయా వగలు
నగల.. వగలు మారుతున్నాయి. కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సిటీలో జ్యువెలరీ ప్రియులు ఇప్పుడు ‘లైట్’ ఆభరణాలను ఇష్టపడుతున్నారు. ఒంటి నిండా దిగేసుకునే నగలకు బదులుగా... హెవీగా కనపడుతూనే లైట్గా ఉండే జ్యువెలరీ ట్రెండ్గా మారింది. గ్రాండ్గా కనపడుతూనే శరీరానికి చిరాకు కలిగించని ఆభరణాలను ఎక్కువ మంది యువతులు కోరుకుంటున్నారు. వీరిఅభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. వేళ్లకు పెట్టుకునే ఉంగరాల నుంచి చెవి రింగులు, బుట్టాలు, మణికట్టు గొలుసులు, ముక్కు పుడకలు, వివిధ రకాలు హారాలు, వడ్డాణాలు కూడా ఇప్పుడు కొత్త రీతిలో తయారవుతున్నాయి. వేసవితోపాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో సిటీలో లైట్ జ్యువెలరీకి ఆదరణ బాగా పెరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్తో పాటు సమ్మర్ కూడా కలిసొచ్చింది. దీంతో వేడుకలు జరుపుకునే వారితో పాటు వాటికి హాజరయ్యే ఆభరణాల ప్రియులు సీజనల్ జ్యువెలరీ గురించిఅన్వేషిస్తున్నారు. గ్రాండ్గా కనపడుతూనే శరీరానికి చిరాకు కలిగించని, హెవీగాఅనిపించని ఆభరణాలను కోరుకుంటున్నారు. వీరి అభిరుచులకు అనుగుణంగా జ్యువెలరీ డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. భారీ ఆభరణాలకు బదులుగా రూపుదిద్దుకుంటున్న ఇవి... ఒకనాటి చిన్న సైజ్ ఆభరణాలను భారీగా మార్చేయడం విశేషం. సాక్షి, సిటీబ్యూరో: అందాన్ని మెరిపించేందుకు కావొచ్చు.. హుందాగా కనిపించేందుకు కావొచ్చు.. స్టేటస్ సింబల్ కావొచ్చు... విభిన్న రకాలుగా ఆభరణాన్ని తమ ఆహార్యంలో భాగం చేసుకోవడం సిటీజనులకు సర్వసాధారణంగా మారింది. ఇక వెడ్డింగ్ సీజన్లో ఈ సరదా శిఖరాలను తాకుతోందని చెప్పడానికి ప్రస్తుతం జ్యువెలరీ షోరూమ్స్ దగ్గర కనపడే రద్దీ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అయితే ఇదే సమయంలో ఒంటి నిండా దిగేసుకునే ఆభరణాలకు బదులుగా... హెవీగా కనపడుతూనే లైట్గా ఉండే జ్యువెలరీ ఇప్పుడు సిటీలో ట్రెండ్గా మారింది. మాంగ్ టీకా.. బంగారు పూల జడల గురించి మర్చిపోండి. ఇప్పుడు తలపై భాగంలో పెట్టుకునే మాంగ్ టీకా అనే ఆభరణం దాని స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. గోల్డ్, డైమండ్ ఫ్లాట్, డైమండ్ కుందన్... ఇది రూ.30వేల నుంచి రూ.2లక్షల దాకా ఉంటుంది. ఫ్యాన్సీగా కూడా వాడతారు. హెవీ నుంచి లైట్కి.. కొన్ని ఆభరణాలు భారీగా ఉండాల్సినవి నాజుకుగా మారుతున్నాయి. ఒకప్పుడు మెడ అంటే భారీగా ఉండే బంగారు గొలుసులకు కేరాఫ్. అయితే ఇప్పుడు మెడలో ధరించేందుకు బీడ్స్తో రూపొందుతున్న నెక్లెస్లు వచ్చాయి. పచ్చలు, కెంపులు, పగడాలు, ముత్యాలతో సైడ్ పెండెంట్స్, మిడిల్ పెండెంట్స్ పెట్టి త్రీలైన్, ఫోర్లైన్ బీడ్స్తో డిజైన్ చేస్తున్నారు. చూడడానికి పెద్దగా కనపడతాయి.. కానీ ధరిస్తే హెవీగా అనిపించవు. ఇన్స్టాంట్ రిచ్ లుక్ అందించే ఇవి రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. సైజ్ జీరో... ఒకప్పుడు వడ్డాణం ధరిస్తే.. దాని నుంచి ఇంకో ఆభరణం మీదకి దృష్టి మళ్లడానికి చాలా టైమ్ పట్టేది. అంత భారీగా ఉండేవి. అయితే ఇప్పుడు లైట్ వెయిట్ వడ్డాణం వచ్చేసింది. దీనిలో కండోలి స్టైల్ వడ్డాణం అనేదైతే.. ఒకవైపు మాత్రమే ఉంటుంది. అలాగే మెడలోకి, నడుముకి రెండు రకాలుగానూ ఉపయోగించుకునేంత నాజూకైన నెక్లెస్ కమ్ వడ్డాణం కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇది రూ.4లక్షల నుంచి ప్రారంభమై ఆపైన ఉంటుంది. మణికట్టు మెరిసె..మోచేయి మురిసె.. సన్నగా ఉన్నామా? లేమా అన్నట్టు ఉండే గాజులు, మణికట్టు గొలుసులు కూడా ఇప్పుడు హెవీగా మారిపోయాయి. వాటి స్థానంలో అందుబాటులోకి వచ్చిన బ్రాడ్ బ్రాస్లెట్ లేదా బ్రాడ్ బ్యాంగిల్.. చేతులకు సరికొత్త మెరుపుల్ని అందిస్తున్నాయి. మణికట్టు దగ్గర మొదలై మోచేయి దాకా వ్యాపిస్తూ అటు బ్రాస్లెట్ ఇటు గాజులు రెండింటిలాగా అమరిపోయే ఇవి రూ.లక్ష ఆపై ధరల్లో లభిస్తున్నాయి. వేళ్లకు వెలుగు... వేళ్లకు పెట్టుకునే రింగ్ అంటే బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో చక్కగా అమరిపోయేది అనుకుంటున్నారేమో... అయితే ఇవి కాక్టెయిల్ రోజులు. రూపాయి కాయిన్ కన్నా కాస్త పెద్దగా పెండెంట్ సైజ్లో ఉండే కాక్టెయిల్ రింగ్ ఇప్పుడు ట్రెండ్. ఈవెనింగ్ పార్టీస్కి, రిసెప్షన్స్... తదితర వేడుకులకు వెళ్లేటప్పుడు ధరిస్తారు. కాబట్టి.. దీనిని కాక్టెయిల్ రింగ్ అని పిలుస్తారు. ఇవి డైమండ్, కుందన్ గోల్డ్తో తయారవుతాయి. గోల్డ్ అయితే రూ.50వేల నుంచి డైమండ్ అయితే రూ.లక్ష నుంచి అందుబాటులో ఉన్నాయి. ‘చెవులూరించే’..చెవులూగించే.. ఒకప్పుడు చెవి రింగులు అంటే ఎంత ఉండేవో తెలియంది కాదు. అంగుళం, అరంగుళం సైజ్కు మించేవి కావు. అయితే అదే ప్లేస్లో చెవులకు పెద్ద సైజ్లో వేలాడుతుండే షాండ్లియర్స్... ఇప్పుడు అమ్మాయిల హాట్ ఫేవరేట్. చెవి రింగుల స్వరూపాన్ని అమాంతం మార్చేసింది షాండ్లియర్స్ ట్రెండ్. చెవికి ఆభరణం ధరించామా? లేకపోతే ఆభరణానికి చెవిని ధరించారా! అన్నట్టు అనిపిస్తుంది. వేసవిలో చికాకు కలిగించే హెవీ జ్యువెలరీకి బదులుగా ఇవి బాగా ఆదరణ పొందుతున్నాయి. కలర్ స్టోన్స్ రూబీ, ఎమరాల్డ్, కుందన్లతో కళ్లు మిరుమిట్లు గొలిపేలా ముఖం మొత్తానికి అందాన్ని అందించే ఈ షాండ్లియర్స్లో బోలెడన్ని వెరైటీలు ఉన్నాయి. కనీసం ఒక షాండ్లియర్ జత రూ.లక్ష నుంచి రూ.6 లక్షల దాకా అందుబాటులో ఉన్నాయి. ఇవి 30ఏళ్ల లోపు వయసు వారికి మాత్రమే నప్పుతాయి. కాబట్టి యువతులే ఎక్కువగా వినియోగిస్తున్నారు. మధ్య వయస్కుల కోసం రూపాయి కాయిన్ సైజ్లో ఉండే పెద్ద స్టడ్స్ అందుబాటులో ఉన్నాయి. నట్ ఫర్ నోస్.. నాసిక ఎంత నాజూగ్గా ఉంటుందో ముక్కుకు పెట్టుకునే నోస్పిక్ లేదా ముక్కెర కూడా అంతకన్నా నాజూగ్గా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం అలా కాదు. ఉంగరం తరహాలో ఉండే నట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అమ్మాయిల్లో విపరీతమైన ట్రెండీ ఆభరణం ఈ నట్. విభిన్న రకాల స్టోన్స్తో ముక్కును మెరిపించే ఈ నట్ రూ.10వేల నుంచి అందుబాటులో ఉంది. సౌకర్యమే ప్రధానం.. నగలు ధరించాలని కోరుకుంటూనే అదే సమయంలో సౌకర్యానికి కూడా సిటీజనులు ప్రాధాన్యమిస్తున్నారు. కొత్త కొత్త అభిరుచుల క్రమంలో డిజైనర్ల సత్తాకు నిత్యం పరీక్షలు ఎదురవుతున్నాయి. దీంతో ఆభరణాలు రకరకాల మార్పుచేర్పులకు లోనవుతున్నాయి. ఫంక్షన్లకు వెళ్లే సమయంలో హెవీగా కనిపిస్తూనే ఒంటికి మాత్రం లైట్గా అనిపించే ఆభరణాలను ధరించడానికి అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు. – శ్వేతారెడ్డి,జ్యువెలరీ డిజైనర్ -
స్నేహితుడిగా నటిస్తూ సొత్తు చోరీ
గుంటూరు ఈస్ట్: స్నేహితుడిగా నటిస్తూ సొత్తు చోరీ చేసిన వ్యక్తిని సంఘటన జరిగిన 48 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ డీఎస్పీ కండే శ్రీనివాసులు, లాలాపేట ఎస్హెచ్వో మురళీకృష్ణ ఆదివారం లాలాపేట పోలీస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాత గుంటూరు రెడ్ల బజారుకు చెందిన షేక్ రకీబుర్ రెహ్మాన్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ విభాగంలో కాంట్రాక్టు కార్మికుడుగా పని చేస్తుంటాడు. అడ్డదారిలో సంపాదించాలని పథకం వేశాడు . లాలాపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఉద్యోగి అయిన పీసపాటి శ్రీనివాసాచార్యులుని బైక్ మెకానిక్ షాపులో పరిచయం చేసుకున్నాడు. స్నేహంగా మెలుగుతూ ఆయన ఇంటికి వెళ్లేవాడు. ఇటీవల శ్రీనివాసాచార్యులు భార్య మృతి చెందినప్పుడు ఆత్మీయుడిలా అన్ని పనుల్లో అండగా నిలబడ్డాడు. ఈనెల 6న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో యాత్రలకు వెళ్లాడు. ఈ సమయంలో రెహ్మాన్ తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి రూ. 30వేలు, బీరువాలోని 3.5 సవర్ల బంగారు నాంతాడు చోరీ చేశాడు. శ్రీనివాసాచార్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీ జరిగిన రోజు శ్రీనివాసాచార్యులు ఇంటి సమీపంలో తిరుగాడిన విషయాన్ని నిర్ధారించుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ జరిగిన 48 గంటల్లో అరెస్టు చేసి నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేసవిలో ప్రత్యేక నిఘా వేసవి ప్రారంభమైన నేపథ్యంలో చోరీలు నివారించేందుకు ప్రత్యేక నిఘా పెడుతున్నామని డీఎస్పీ కండే శ్రీనివాసులు తెలిపారు. ఊరు వెళ్లే సమయంలో నగలు, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో పెట్టుకుని వెళ్లాలని సూచించారు. ఇంటికి ఆధునికమైన, బలమైన తాళాలు, గెడలు ఉపయోగించాలని తెలిపారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించుకోవాలని కోరారు. -
కేటుగాడు ఎక్కడ?
ఫైవ్ స్టార్ హోటళ్లలో దర్జాగా దొంగతనాలకు పాల్పడుతున్న ‘సూటు..బూటు’ దొంగ జయేష్ రావ్జీ భాయ్ సేజ్పాల్ కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 6న అర్ధరాత్రి బంజారాహిల్స్లోని పార్క్హయత్ హోటల్లోని ఓ రూమ్లోకి ప్రవేశించి చాకచక్యంగా రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటనపై పోలీసులు సీరియస్గా దృష్టిసారించారు. ముంబైతోపాటు ఇతర నగరాలకు ప్రత్యేక బృందాలను పంపించి ఆరా తీస్తున్నారు. బంజారాహిల్స్: అయిదు నక్షత్రాల హోటళ్లలో బస చేసే అతిథుల గదులను లక్ష్యంగా చేసుకొని వారు లేని సమయంలో దర్జాగా సూటు, బూటు వేసుకొని హోటల్లోకి ప్రవేశిస్తూ ఆభరణాలతో ఉడాయిస్తున్న జయేష్ రావ్జీ భాయ్ సేజ్పాల్(43) ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. ఈ నెల 6న అర్ధరాత్రి బంజారాహిల్స్లోని పార్క్హయత్ హోటల్లో హిమాయత్నగర్కు చెందిన వెంకట్ కోనారావు, రిషిక దంపతులు బస చేసిన రూమ్ నంబర్ 312లో వారు డిన్నర్కు వెళ్లిన సమయంలో నిందితుడు హోటల్ సిబ్బందిని మాటల్లోకి దింపి, లిఫ్ట్బాయ్ దృష్టిమరల్చి దర్జాగా గదిలోకి వెళ్లి రూ.12 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో అంతే దర్జాగా ఉడాయించి పోలీసులకు సవాల్ విసిరాడు. బంజారాíßల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. నవదంపతులే టార్గెట్ ముంబయిలోని అంధేరి ప్రాంతంలో నివసించే జయేష్ ఎంత దర్జాగా వస్తాడో అంతే దర్జాగా నగలతో ఉడాయిస్తూ కేవలం సీసీ కెమెరాల్లో మాత్రమే కనిపిస్తుంటాడు. పార్క్హయత్ హోటల్లో దొంగతనం చేసిన అనంతరం ఆకుపచ్చ రంగు ఆటోలో వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఇక్కడి నుంచి నేరుగా మాసబ్ట్యాంక్ వద్ద గోల్కొండ హోటల్వైపు ఆటో వెళ్లే విషయం స్పష్టమైంది. హైదరాబాద్కు వచ్చినప్పుడు ఒక చిన్నహోటల్లో బస చేస్తూ బోగస్ ధృవపత్రాలు సమర్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాను దొంగతనం చేసే హోటల్కు బ్రేక్ఫాస్ట్ సమయంలో వచ్చి కస్టమర్ల కదలికలను గుర్తిస్తుంటాడని కొత్తగా పెళ్లైన వారిని లక్ష్యంగా చేసుకుంటాడని విచారణలో తేలింది. రోజంతా వారి కదలికలపై నిఘా వేసి ఎక్కడెక్కడికి వెళ్తున్నారో తెలుసుకొని ఆ తర్వాతే హోటల్లోకి ప్రవేశిస్తారని కూడా పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడి జాడ కోసం పోలీసులు జల్లెడపడుతున్నా చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఎస్ఆర్నగర్ డిఐ కిషోర్, జూబ్లీహిల్స్ డీఎస్ఐ శ్రీను రెండు రోజులుగా ముంబయిని జల్లెడపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇక మూడు టాస్క్ఫోర్స్ బృందాలు న్యూఢిల్లీ, చండీఘడ్, కోల్కతా, బెంగళూరు నగరాల్లో గాలింపు చేపట్టాయి. నిందితుడి ఆచూకీ కోసం మొత్తం 42 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. ♦ 2016 డిసెంబర్ 6వ తేదీన అమీర్పేట్లోని మ్యారీగోల్డ్ హోటల్లోకి కూడా ఇదే తరహాలో ప్రవేశించి రూ. 15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. స్పూన్తో ఇక్కడ గదిని తెరిచినట్లు వెల్లడైంది. ♦ 2014లో ఆబిడ్స్లోని మెర్క్యూరీ హోటల్లో ప్రముఖ వ్యాపారి నారాయణదాస్ మారు నిర్మలాదేవి బస చేసిన గదిలోకి ప్రవేశించి రూ. 7 లక్షల విలువచేసే ఆభరణాలు తస్కరించగా ఆబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ♦ హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో రెండుసార్లు ప్రవేశించి ఆభరణాలతో ఉడాయించగా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. ♦ 2003లో ముంబయిలోని తాజ్హోటల్లో కూడా ఇదే తరహా దొంగతనానికి పాల్పడ్డాడు. ♦ 2017 అక్టోబర్లో విశాఖపట్నం వరుణ్ బీచ్ హోటల్లో ఆభరణాలు తస్కరించాడు. ♦ 2003లో కోలాబ తాజ్హోటల్లో జరిగిన చోరీ ఘటనలో జయేష్ను అక్కడి ´లలీసులు పోలీసులు అరెస్ట్ చేయగా అయిదు రోజుల జైలు శిక్ష కూడా పడింది. ♦ 2013లో ఛండీగడ్లోని హోటల్లో కూడా దొంగతనం చేశాడు. -
స్నేహితురాలే కాజేసింది...
గుడివాడటౌన్: ఇంట్లోని బంగారు ఆభరణాలు స్నేహితురాలే కాజేసిన సంఘటన పట్టణంలో జరిగింది. స్థానిక బేతవోలుకు చెందిన సమ్మెట మాధవరావు ఇంట్లో గత నెల 11వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి బంగారు నగలు అపహరించుకుపోయిన విషయం విదితమే. మాయమైన నగలు మాధవరావు భార్య నాగ లీలావతి స్నేహితురాలు బండి నాగ త్రివేణి అపహరించినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. స్థానిక వన్ టౌన్ పోలీస్స్టేషన్లో జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమక్షంలో నిందితురాలిని చూపారు. ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ నాగ త్రివేణి, నాగ లీలావతికి మంచి స్నేహితురాలు. దూరపు బంధువు కూడా. త్రివేణి భర్త నాగరాజుతో కలసి హైదరాబాద్ చింతల్లో నివాసం ఉంటుంది. గత నెల 10వ తేదీన నాగ లీలావతిని పరామర్శించేందుకు బేతవోలులోని ఆమె ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తాను కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు త్రివేణికి చూపింది. అక్కడే ఉన్న ఇంటి తాళాలను స్నేహితురాలికి అనుమానం రాకుండా తీసి బయటకు వెళ్లి అలాంటిదే మరో తాళం చేయించుకుని తిరిగి వాటిని యథాస్థితిలో పెట్టేసింది. 11వ తేదీ మాధవరావు దంపతులు విజయవాడలో చదువుచున్న తన కుమారుని వద్దకు వెళుతున్నట్లు చెప్పారు. మాధవరావు కుటుంబసభ్యులు విజయవాడ వెళ్లారని నిర్ధారించుకుని గత నెల 11వ తేదీన దొంగ తాళంతో ఇంట్లోకి వెళ్లి బీరువా తెరచి అందులోని రూ 20లక్షలు విలువగల 24 రకాల ఆభరణాలను అపహరించింది. అనంతరం కుటుంబ అవసరాల నిమిత్తం బంగారం కుదువపెట్టేందుకు మాధవరావు బీరువా తెరువగా అందులో నగలు కనిపించలేదు. దీనిపై మాధవరావు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వన్టౌన్ సీఐ డీవీ రమణ బృందం దర్యాప్తు చేపట్టింది. ఈనెల 8వ తేదీ సాయంత్రం గుడివాడలోని ఓ బంగారు నగల దుకాణంలో దొంగిలించిన వస్తువులు అమ్మడానికి త్రివేణి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్వాధీనపర్చుకున్నారు. మొత్తం బంగారం 448.88 గ్రాములుగా గుర్తించినట్లు ఎస్పీ త్రిపాఠి వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, స్టేషన్ ఆఫీసర్ డి.వి.రమణ, ఏఎస్సై స్వామిదాసు, సిబ్బంది శ్రీనివాసరావు, షణ్ముఖబాబు, నాయక్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పార్క్ హయత్’లో హైటెక్ చోరీ
హైదరాబాద్: నగరంలోని ఓ ప్రతిష్టాత్మక స్టార్ హోటల్లో హైటెక్ చోరీ జరిగింది. సూటుబూటు వేసుకొని వచ్చిన ఓ దొంగ దర్జాగా హోటల్లోకి ప్రవేశించి రూ.12 లక్షల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యా లు పొదిగిన ఆభరణాలను తస్కరించాడు. హిమ యత్నగర్కు చెందిన యువ వ్యాపారి వెంకట్ పెళ్లి ఈ నెల 4న జరిగింది. హనీమూన్ కోసం 5వ తేదీన దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని పార్క్హయత్ హోటల్కు వచ్చి 312వ గదిలో బస చేశారు. ఫలక్నుమా ప్యాలెస్ సందర్శన, తాజ్హోటల్లో డిన్నర్ కోసమని మరునాడు రాత్రి 7 గంటల ప్రాంతంలో దంపతులు బయటకు వెళ్లారు. కాసేపటికి సూటుబూటు వేసుకొన్న ఓ వ్యక్తి ఆటోలో పార్క్హయత్ హోటల్కు వచ్చాడు. తాను 312లో బస చేసిన వ్యక్తి తాలూకూ బంధువునని, రూమ్లో కార్డు మర్చిపోయానని, దానిని తీసుకోవడానికి వచ్చానని చెప్పడంతో హోటల్ సిబ్బంది యాక్సిస్ కార్డు ఇచ్చారు. ఆ కార్డు ఉంటేనే లిఫ్ట్ తెరుచుకుంటుంది. లిఫ్టులోంచి గది వద్దకు వెళ్లిన ఆగంతకుడు పాస్వర్డ్ మర్చిపోయానని రిసెప్షన్కు ఫోన్ చేశాడు. కంప్యూటర్లో నాలుగు డిజిట్లను సిబ్బంది నొక్కడంతో యాక్సెస్ కార్డు సహాయంతో గది తెరుచుకుంది. లోనికి వెళ్లిన ఆగంతకుడు సూట్కేస్లోని డైమండ్స్ పొదిగిన చెవి రింగు, నెక్లెస్, పాపిటబిళ్ల, బంగారు కాళ్ల పట్టీలు, జత గాజులు, రూ. 6 వేల నగదును బ్యాగులో సర్దుకొని ఉడాయించాడు. డిన్నర్ ముగించుకొని బుధవారం రాత్రి వెంకట్ దంపతులు హోటల్లోని తమ గదికి వచ్చారు. సూట్కేస్లోని ఆభరణాలు కనిపించలేదు. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే హోటల్ సిబ్బందికి, బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీలు పోలీసులు పరిశీలించగా ఓ ఆగంతకుడు గదిలోనికి వెళ్లి, బయటకు వచ్చిన దృశ్యాలు నమోదయ్యాయి. చోరీకి పాల్పడిన వ్యక్తి చండీగఢ్కు చెందిన జయేష్ రావ్జీ భాయ్ సేజ్పాల్(48)గా గుర్తించారు. స్టార్ హోటళ్లే లక్ష్యంగా అతడు ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరువంటి నగరాల్లో ఈ తరహా దొంగతనాలు 8 వరకు చేసినట్లు తేల్చారు. నిందితుని ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నగరంలోని అన్ని మార్గా ల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్క్హయత్ లాంటి స్టార్ హోటల్లో దొంగతనం చోటు చేసుకోవడం గమనార్హం. -
మత్తు మందు ఇచ్చి నగల అపహరణ
వేనాడు(తడ): రైలులో ప్రయాణిస్తున్న మహిళలను మాయ మాటల్లో దించి, వారితో కలసి ప్రయాణించి అదనుచూసి చాకచక్యంగా నగలను దోచుకెళ్లిన ఘటన గురువారం రాత్రి వేనాడులో చోటుచేసుకుంది. బాధితుల సమాచారం మేరకు తడ మండలం ఇరకం గ్రామానికి చెందిన నైనా విజయమ్మ, నైనా ధనలక్ష్మి, నైనా సెల్వి కుటుంబాలు చాలా కాలం క్రితం తమిళనాడులోని పొన్నేరికి కాపురం వెళ్లిపోయారు. అమావాస్య సందర్భంగా వేనాడులో ఉన్న షేక్ దావూద్ షావలీ అల్లా దర్గాను దర్శించుకుని రాత్రికి అక్కడ నిద్ర చేసేందుకు ముగ్గురూ గురువారం వేనాడు గ్రామానికి రైలులో వచ్చారు. వీరికి పొన్నేరి వద్ద బురకా వేసుకున్న మహిళ రైలులో కలిసి మాటలు కలిపింది. ఆమె మాటలకు వీరు ముగ్గురూ బాగా ఆకర్షితులయ్యారు. తన కుమారుడికి ఉద్యోగం రావడంతో దర్గా వద్ద అన్నదానం చేసి ముగ్గురు మహిళలకు చీరలు అందించాలని వెళుతున్నట్టు ఆమె వీరికి తెలిపారు. ఇంతలో సూళ్లూరుపేటకు చేరుకున్న మహిళలను మీరు నా కుటుంబ సభ్యుల్లా ఉన్నారంటూ మీకు చీరలు తీసిచ్చి మరో ఇద్దరు ఇతరులను చూసి మిగిలిన చీరలు ఇస్తానంటూ స్థానికంగా ఉన్న ఓ వస్త్ర దుకాణానికి తీసుకువెళ్లి చీరలు కొనిచ్చింది. అనంతరం అందరూ వేనాడుకి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు తమతోపాటు తెచ్చుకున్న భోజనం తమకు పరిచయమైయ మహిళతో కలిసి తిన్నారు. అనంతరం ఆ మహిళ కూల్డ్రింక్ తెచ్చి వీరికి అందించింది. కూల్డ్రింక్ తాగిన కొంతసేపటికి వారు ముగ్గురూ నిద్రలోకి జారుకోగా విజయమ్మ మెడలోని తాళిబొట్టు, కాసులతోటు మరో బంగారు గొలుసు తీసుకుని పారిపోయింది. మిగిలిన ఇద్దరు మహిళలు తమ వస్తువులను దాచుకోవడంతో అవి భద్రంగా మిగిలాయి. ఉదయం లేచి చూసిన బాధితులు తాము మోసపోయినట్లు గుర్తించి స్థానికులకు విషయం తెలిపారు. సమాచారం అందుకున్న తడ ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు గ్రామానికి చేరుకుని మత్తు ప్రభావం తొలగని మహిళలను సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతీరోజు లవ్ డే..అద్భుతమైన ఆఫర్లు
రిలయన్స్ జ్యుయలరీ ..డైమండ్, బంగారు నగల అద్భుత డిజైన్లను ప్రదిర్శిస్తోంది. ఈ సందర్భంగా వినియెగాదారులకు మునుపెన్నడూ లేని డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. ఫిబ్రవరి 25 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లకు వందశాతం తృప్తి కలిగేలా జీరో వేస్టేజ్పై నగలను విక్రయిస్తున్నామనీ రిలయన్స్ జ్యుయలరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఆభరణాలు శాశ్వతమైన క్లాసిక్, టైంలెస్ ఆభరణాల ఎంపిక.. ఏ సీజన్లోనైనా ఎవరికైనా ప్రియమైనవారి కోసం పరిపూర్ణ బహుమతి అందించేలా పోటీ ధరలలో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. అలాగే కస్టమర్ల సౌలభ్యంకోసం ప్రతీ షోరూంలోనూ క్వాలిటీ చెకింగ్ మెషీన్లు అందుబాటులో ఉంచామంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రాం, లక్నో , వారణాసి, కాన్పూర్, అహ్మదాబాద్ లాంటి ఎనిమిది నగరాల్లో ఫిబ్రవరి 25దాకా ఈ యూనిక్ ఆభరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. తాము ఉపయోగించిన ప్రతీ డైమండ్ ఇండిపెండెంట్ సర్టిఫికేషన్ లాబొరేటరీస్ అంతర్జాతీయ సర్టిఫికేట్ పొందిందని కంపెనీ చెబుతోంది. ఈ సందర్భంగా రిలయన్స్ జ్యుయలర్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ ప్రతీ రోజు ప్రేమపూర్వకమైనదే. అది సార్వత్రిమైంది. దీన్ని ఒక రోజుకు లేదా జంటలకు పరిమితం చేయకూడదని అభిప్రాయపడ్డారు. రిలయన్స్ అందిస్తున్న ఆకర్షణీయమైన నగలతో ప్రతిరోజూ వాలెంటైన్స్ డే అని చెప్పారు. అంతేకాదు ప్రియమైనవారి కోసం పరిపూర్ణ బహుమతి అందించేలా విస్తారమైన సాలిటైర్కు , ప్లాటినం లవ్ బ్యాండ్లను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. తమ షోరూంలలో నెక్లెస్, చెవిపోగులు, గాజులు, రింగులు .. ఇలా ప్రతీదీ ఎలిగెంట్గా , అద్భుతంగా దేనికదే ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 25 వరకు ఉత్తేజకరమైన ఆఫర్లు అందుబాటులోఉన్నాయని చెప్పారు. కాగా రిలయన్స్ జ్యుయలర్స్ 44 నగరాల్లో 65 షోరూంలను కలిగి ఉంది. వీటిని మరింతగా విస్తృతంగా విస్తరిస్తోంది. -
నోట్లో యాసిడ్ పోసి.. చోరీకి యత్నం
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): చోరీ కోసం ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడింది. వృద్ధురాలి మెడలోని బంగారం చోరీ చేసేందుకు విఫలయత్నం చేయగా... బాధితురాలు గట్టిగా అరవడంతో నోటిలో యాసిడ్ పోసి నిందితురాలు పరారయింది. ఈ దుర్ఘటన రిటైర్డ్ జడ్జి ఇంటిలో చోటు చేసుకుంది. ఎంవీపీ జోన్ ఎస్ఐ గోవింద్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీ సెక్టార్ – 2లో రిటైర్డ్ జడ్జి రామారావు, సత్యవతి దంపతులు నివాసం ఉంటున్నారు. సోమవా రం సాయంత్రం రామరావు వాకింగ్ కోసం వెళ్లారు. అదే సమయంలో వారి ఎదురింటిలో పనిచేస్తున్న రమణమ్మ అనే మహిళ సత్యవతి మెడలోని బంగారం చోరీ చేసేందుకు విఫలయత్నం చేసింది. సత్యవతి పెద్దగా అరవడంతో రమణమ్మ వెంటనే బాత్రూమ్లో ఉన్న యాసి డ్ తీసుకొచ్చి సత్యవతి నోటిలో పోసి పరారయింది. స్థానికులు సత్యవతిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె భర్త రిటైర్డ్ జడ్జి రామారావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోవింద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నగల కోసం మహిళపై యాసిడ్ దాడి
-
డైమండ్ కింగ్ మోదీకి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ని టాప్ డైమండ్ వ్యాపారి, అత్యంత ధనికవంతుల్లో ఒకరైన సెలబ్రిటీ జ్యుయర్ నిరావ్ మోదీకి సీబీఐ భారీ షాకిచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును కోట్ల రూపాయల మేర మోసం చేసిన చేసిన కేసులో కేసు నమోదు చేసింది. నిరావ్ మోదీ అనుమాన్సాద లావాదేవీల కేసులో సీబీఐ విచారణ జరుగుతోందని పీఎన్బీ వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో భాగంగా ఆయనపై సీబీఐ అభియోగాలు మోపినట్టు అధికారులు సోమవారం తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్య చేపట్టింది. డైమండ్ ఆర్ యు, సోలార్ ఎక్స్పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ కంపెనీ భాగస్వాములైన మోదీ, ఆయన సోదరుడు నిషాల్, భార్య అమీ, మెహల్ చినూభాయ్ చోక్సి బ్యాంకు అధికారులతో కుట్ర పన్నారని పీఎన్బీ ఫిర్యాదు చేసింది. తద్వారా తమకు భారీ నష్టం వాటిల్లిందని బ్యాంకు ఆరోపించింది.కాగా బిలియనీర్ నిరావ్ మోదీ ఆస్తులపై దృష్టిపెట్టిన ఐటీ అధికారులు ఢిల్లీ, సూరత్, జయపూర్లోని ఆఫీసులపై జనవరి 31న దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. లండన్, న్యూయార్క్, లాస్ వెగాస్, హవాయి, సింగపూర్, బీజింగ్, మకావ్లోనూ, ఇండియాలో ముంబై , ఢిల్లీ నగరాల్లో సెలబ్రిటీ డైమండ్ జ్యుయలరీ స్టోర్స్ ఉన్నాయి. ఫైర్స్టార్ డైమండ్ స్థాపకుడు, డిజైనర్ నిరావ్ మోదీ ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీ డైమండ్ డిజైన్లకు మంచి ప్రఖ్యాతి గాంచాడు. -
పెళ్లి పేరుతో మహిళ మోసం
చిత్తూరు,తిరుపతి కల్చరల్: పెళ్లి చేసుకొని ఇద్దురు పిల్లలు పుట్టిన తర్వాత భర్తను వదిలేసింది. మరో వ్యక్తిని మాయమాటలతో నమ్మించి ఇంట్లో చేరి నగలతో ఉడాయించింది. తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని బాధితులు ఇద్దరు ఆదివారం తిరుపతి ప్రెస్క్లబ్లో విలేకరుల ఎదుట వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన గురుప్రసాద్ మాట్లాడుతూ 2005లో చంద్రకళ అనే మహిళతో తనకు వివాహమైందని తెలిపాడు. ఏడేళ్లు సాగిన కాపురంలో తమకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారని పేర్కొన్నాడు. తర్వాత ఒక కుమారున్ని తీసుకొని ఆమె తన నుంచి వెళ్లిపోయి మోసం చేసిందని ఆరోపించాడు. తిరుపతి శివజ్యోతినగర్లో కాపురమున్న గిరిబాబు భార్య నాగమణి మాట్లాడుతూ తాము మదనపల్లెలో అంగడి నడుపుకుంటూ జీవనం సాగించే వారమని తెలిపింది. చంద్రకళ అనే మహిళ తనకు ఎవరూ లేరని, బతుకు దెరువు చూపాలని తమను ఆశ్రయించిందని పేర్కొంది. ఇంటిలో పని చేసుకుంటూ బతకమని తమ ఇంటిలోనే ఒక గది ఆమెకు ఇచ్చామని తెలిపింది. ఈ క్రమంలో తన భర్తను వలలో వేసుకుందని, తాము ఇంటిలో లేని సమయంలో ఇంటిలోనున్న రూ.7 లక్షల నగదును తీసుకొని ఉడాయించిందని ఆరోపించింది. తమ బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని బంగారు నగలు తీసుకొని వెళ్లిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం మూడో వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవకోన ప్రాంతంలో ఉందని తెలిపింది. తమ బంగారు నగలు, డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని పేర్కొంది. పోలీసు అధికారులు స్పందించి సదరు చంద్రకళపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. -
వజ్రాలంటూ భారీ మోసం.. ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వజ్రాల వ్యాపారం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదపులోకి తీసుకున్నారు. మహ్మద్ సలామ్, మహ్మద్ సిద్దిఖీ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటితో వజ్రాలను పరీక్షించే పరికరాలు, కొన్ని బంగారు ఆభరణాలను వారి వద్ద ఉన్నట్లు గుర్తించారు. నకిలీ వజ్రాలను అసలైనవిగా నమ్మించి మార్కెట్లో కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని ఇద్దరు నిందితులు ఇటీవల కలిశారు. తమ వద్ద దాదాపు 4 కోట్ల విలువచేసే అతి ఖరీదైన వజ్రం ఉందని నమ్మించారు. అయితే తమకు అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో తక్కువ ధరకే విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. బాధితుడు హాజీ రూ.1.15 కోట్లు చెల్లించి వజ్రాన్ని కొనుగోలు చేయగా అసలు విషయం బయటపడింది. నకిలీ వజ్రాన్ని తనకు అంటగట్టారంటూ హాజీ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
సంతానం కలిగిస్తామని బురిడీ
వైఎస్ఆర్ జిల్లా, వేంపల్లె: సంతానం కలిగిస్తామని ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి బంగారు, నగదుతో ఉడాయించిన సంఘటన ఆదివారం వేంపల్లెలోని రాజారెడ్డినగర్లో చోటుచేసుకుంది. బాధితులు ఎస్ఐ చలపతికి చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజారెడ్డినగర్లో జల్లా శంకర్రెడ్డి, భార్య శివమ్మ, తల్లి శివమ్మలు నివాసం ఉంటున్నారు. శంకర్రెడ్డికి వేముల మండలం దుగ్గన్నగారిపల్లె గ్రామానికి చెందిన శివమ్మతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇంత వరకు వారికి సంతానం లేదు. ఆయన పులివెందుల రోడ్డులో తోపుడు బండిపై బజ్జీలు వేసుకొని జీవనం సాగించేవాడు. భోగి పండుగ కావడంతో అతను ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చి మీకు ఆయుర్వేద మందు ద్వారా సంతానం కలిగిస్తామని నమ్మబలికారు. ఆ దంపతులు నమ్మడంతో ఆయుర్వేద మందు తయారు చేయాలంటే రెండు గ్రాముల స్వర్ణభస్మం కోసం రూ.20వేలు ఖర్చు అవుతుందని చెప్పారు. శంకర్రెడ్డి వెంటనే వారికి రూ.20 వేలు అందజేశాడు. తర్వాత ఏదో ఒక కంప్యూటర్ మిషన్ను శంకర్రెడ్డి వీపు భాగంలో, భార్య శివమ్మకు పొట్టపైన పెట్టి పరీక్షించారు. శివమ్మకు కడుపులో గడ్డ ఉందని, తామిచ్చిన మందుతో గడ్డ కరిగి సంతానం కలుగుతుందని చెప్పారు. అలాగే శంకర్రెడ్డికి వేడి ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించేందుకు మందులు ఇస్తామని తెలిపారు. ఈ మందు తయారు చేసేందుకు శంకర్రెడ్డిని మునగ ఆకు తీసుకురమ్మని, భార్య శివమ్మను తలస్నానం చేసి రమ్మని పంపారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సోదా చేసి ఒక తులం బంగారు ఉంగరాన్ని తీసుకొని పారిపోయారు. -
ఫైవ్స్టార్ హోటల్లో రూ.38 కోట్ల నగలు దోపిడి
పారిస్ : ఐదుగురు ముసుగు దొంగలు బుధవారం పారిస్ నగరంలో కలకలం సృష్టించారు. సెంట్రల్ పారిస్లో గల రిడ్జ్ ఫైవ్ స్టార్ హోటల్లోకి చొరబడిన దుండగులు రూ. 38,66,69,250/- విలువజేసే వజ్రాభరణాలను దోచుకెళ్లారు. దోపిడీపై హోటల్ చట్టుపక్కల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు సమాచారం అందుకుని ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కాగా, మిగిలిన ఇద్దరు దొంగలు నగలతో చాకచక్యంగా తప్పించుకున్నారు. పారిస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో దుండగులు హోటల్లోకి ప్రవేశించారు. కత్తులు, గొడ్డళ్లతో హోటల్ డిస్ప్లేలను పగులగొట్టి ఆభరణాలను దోచుకున్నారు. దోపిడి దొంగలు చొచ్చుకురావడంతో హోటల్లోని గెస్ట్స్ కిచెన్లో దాక్కున్నట్లు చెప్పారు. మరికొందరు వాళ్ల నుంచి తప్పించుకుని బయటకు వచ్చారని తెలిపారు. దీంతో దుండగులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. కాల్పుల్లో హోటల్ సిబ్బంది ఒకరు గాయపడ్డారని తెలిపారు. తప్పించుకు పారిపోయిన ఇద్దరు దుండగులను పట్టుకోవడానికి పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. -
'బంగారం'లాంటి చాన్స్..!
నరసాపురం : బంగారం ధరలు మళ్లీ నేల చూపులు చూస్తున్నాయి. చాలారోజుల తరువాత బంగారం ధరలు తగ్గుతున్నాయి. మూడు నెలల క్రితం రూ.30 వేలు మార్కు దాటిన బంగారం ధర తగ్గుతూ వస్తోంది. వెండిదీ అదే దారి. క్రిస్మస్, సంక్రాంతి పండగళ వేళ బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారం కొనుగోళ్లకు ఇదే అనువుగా జనం భావిస్తున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు జ్యూయలరీ షాపులకు క్యూ కడుతున్నారు. బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయి. అయితే ధరలు ఇంకా తగ్గొచ్చనే అంచనాలతో కొందరిలో ఇప్పుడే బంగారం కొనాలా? మరికొన్ని రోజులు ఆగాలా ? అనే సందిగ్ధం కూడా నెలకొని ఉంది. మరీ భారీగా ధరలు తగ్గవని, బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయమని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రూ.30 వేల దిగువకు బంగారం ధరలు చేరుకున్నాయి. కాసు రూ.21,760 సోమవారం నరసాపురం గోల్డ్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.29,110గా ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు రూ.27,220గా నమోదైంది. అంటే ఆభరణాల బంగారం కాసు (8 గ్రాములు) ధర రూ.21,760గా ట్రేడవుతోంది. గత రెండు, మూడు నెలలుగా కాస్త అటు, ఇటుగా ఇవే ధరలు ట్రేడవుతున్నాయి. అయితే గతవారం రోజుల నుంచి కాసు బంగారం ధరలో దాదాపు రూ.950 తగ్గుదల కనిపిస్తోంది. దీంతో కొన్ని నెలలుగా బంగారం వైపు చూడటానికి జంకిన పేద, మధ్య తరగతి వారు పండగవేళలు కూడా కావడంతో జ్యూయలరీ షాపుల మెట్లెక్కుతున్నారు. వెండి ధరల్లో అయితే ఒకరకంగా భారీ తగ్గుదల కనిపిస్తోంది. కిలో వెండి ధర రూ.36–37 వేల మధ్య ట్రేడవుతోంది. కిలో వెండి ధర దాదాపు 3 వేల వరకూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు మరికాస్త తగ్గుతాయని భావిస్తున్నారు. ఒడిదుడుకుల నుంచి గాడిలోకి.. ఐదేళ్ల క్రితం వరకూ బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. 2013లో అయితే ఏకంగా 10 గ్రాముల బంగారం రూ. 34 వేలకు చేరి ఆల్టైమ్ హై నమోదు చేసుకుంది. బంగారం దిగుమతి సుంకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చైనా, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా దేశాలు భారీగా బంగారం నిల్వలను అమ్మకాలకు పెట్టడంతో అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గి ధరలు దిగి వచ్చాయి. ఈ దశలో గత రెండేళ్ల నుంచి బంగారం ధరలు నిలకడగా ఉంటున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో ధరలు విపరీతంగా తగ్గుతాయని అంచనా కట్టారు. కానీ అలా జరగలేదు. ధరలు పెరగడంతో బులియన్ వ్యాపారం ఒడిదుడుకుల్లో సాగింది. కొనుగోలుదారుల్లో కూడా అయోమయం. ఎక్కువ ధరల్లో బంగారం కొన్న జిల్లావాసులు దారుణంగా నష్టపోయారు. ఇప్పుడూ అదేరకమైన అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. ధరల హెచ్చుతగ్గుల్లో స్వల్పమార్పులే ఉంటాయని బులియన్ వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. భారీగా పెరిగిన అమ్మకాలు ధరలు తగ్గడంతో జిల్లాలో రోజుకు రూ.2 కోట్ల వరకూ అమ్మకాలు పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఒక్క నరసాపురం మార్కెట్లోనే హోల్సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.3 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతాయి. జిల్లాలో ఇక్కడి నుంచి భారీగా హోల్సేల్ వ్యాపారం జరుగుతుంది. నరసాపురంతో పాటు ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్దెత్తున అమ్మకాలు జరుగుతాయి. ధరలు తగ్గడంతో జిల్లా మొత్తం మీద రోజుకు అదనంగా రూ.2 కోట్ల వరకు అమ్మకాలు పెరిగాయని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వరుస పండగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ముందు ఉండడంతో అమ్మకాలు మరింత పెరగవచ్చని అంచనా. మరోవైపు బంగారాన్ని అనువైన పెట్టుబడిగా భావించే ముదుపర్లు కూడా బిస్కెట్ కొనుగోళ్లపై దృష్టిపెడుతున్నట్టు నరసాపురం జ్యూయలరీ అసోసియేషన్ కార్యదర్శి వినోద్కుమార్జైన్ తెలిపారు. ఇప్పట్లో పెద్దగా ధరలు పెరగవు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితుల రీత్యా ధరలు పెరగవు. అలాగని ఇంకా భారీగా తగ్గే అవకాశాలు కనిపించడంలేదు. ప్రస్తుతం అమ్మకాలు బాగా పెరిగాయి. ధరలు ఇలాగే ఉంటే సంక్రాంతి నాటికి అమ్మకాలు మరింత పెరుగుతాయి. – అజిత్కుమార్ జైన్, జ్యూయలరీ వ్యాపారి -
చోర్ దోస్త్
మానుకోలేని విలాసాలు...వ్యాపారంలో నష్టాలు.. వెరసి ఆర్థిక సమస్యలు. చివరకు ఏమి చేయాలో పాలుపోక ఏకంగా స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. 51 తులాల బంగారం, రూ.50 వేల నగదు తస్కరించి.. సీసీ ఫుటేజీల్లో చిక్కి చివరకు కటకటాల పాలయ్యాడు. చిక్కడపల్లి పరిధిలో జరిగిన ఈ కేసును పోలీసులు ఛేదించి నిందితున్ని పట్టుకున్నారు. ముషీరాబాద్: బాకారం ప్రాంతంలో గత 2న సినీఫక్కీలో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు చేధించారు. చిన్ననాటి స్నేహితుడే అప్పుల బాధ భరించలేక స్నేహితుడి ఇంట్లోనే చోరీ చేసినట్లు గుర్తించారు. చిక్కడపల్లి ఏపీసీ ప్రదీప్కుమార్రెడ్డి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ రాంచంద్రారెడ్డి, డిఐ సంతోష్కుమార్ వివరాలు వెల్లడించారు. శ్రీనివాసాచారి, బాతుల విజయ్కుమార్ చిన్ననాటి స్నేహితులు. శ్రీనివాసాచారి బాకారం వెస్లీ చర్చి ఎదురుగా ఉన్న తన అమ్మమ్మ ఇంట్లో బంగారు ఆభరణాలు తయారీ, పాన్బ్రోకర్ వ్యాపారం చేస్తున్నాడు. రాత్రి షాపు మూసిన తర్వాత బంగారం, నగదును ఇంట్లోనే ఉన్న బీరువాలో దాచి ఎన్ఎఫ్సి కాలనీలోని తన ఇంటికి వెళ్లేవాడు. అదే ప్రాంతంలో ఉండే విజయ్కుమార్ ఎలక్ట్రిషన్గా పని చేసేవాడు. తన ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో మౌలాలి ఆంధ్రాబ్యాంక్లో రూ. 15లక్షలు రుణం తీసుకుని పాల వ్యాపారం ప్రారంభించాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వీటి నుంచి గట్టెక్కేందుకు బంగారం వ్యాపారం చేసి శ్రీనివాసచారిపై దృష్టి పెట్టాడు. తరచూ శ్రీనివాసచారి షాపునకు వెళ్లే అతను బంగారం, నగదు అధిక మొత్తంలో ఉండడాన్ని గుర్తించాడు. శ్రీనివాసచారి దుకాణం మూసిన తర్వాత బంగారు ఆభరణాలను ఎక్కడ పెట్టేది గమనించాడు. దీంతో ఇంటి గ్రిల్స్, ఇంటి డోర్కు డూప్లికేట్ తాళాలను తయారు చేయించాడు. ఈ నెల 4న శ్రీనివాసచారి వెళ్లిపోయిన తర్వాత డూప్లికేట్ కీలతో ఇంట్లోకి వెళ్లి బీరువా తాళం చెవులు తీసుకుని బంగారు ఆభరణాలు, నగదు తీసుకెళ్లాడు. అనుమానం రాకుండా కారంపొడి చల్లాడు. తీసుకెళ్లిన నగదుతో ఆంధ్రాబ్యాంకులో వాయిదాల రూ. 1.5 లక్షలు, బైక్ లోన్ రూ.6వేలు చెల్లించాడు. శ్రీనివాసచారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితుడు బాతుల విజయ్కుమార్ను గుర్తించారు. అతని అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించాడు. 31తులాలు పోయిందని ఫిర్యాదు..51తులాలు రికవరీ... మొదట బంగారం ఎంత దొంగతనానికి గురైనదనే దానిపై యజమానికి కూడా స్పష్టత లేదు. వినియోగదారుల రషీదులను పరిశీలించిన తర్వాత 31తులాలు చోరీకి గురైనట్లు ముషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న తర్వాత 51 తులాలుగా లెక్కతేలింది. కేసును చేధించిన డిఐ సంతోష్కుమార్, డిఎస్ఐ బాలరాజ్, క్రైం స్టాఫ్ జయరాజ్, విశ్వనాథ్, కృష్ణ, కళ్యాణ్, అవినాష్లకు రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. -
బాహుబలికి క్రేజ్ మరీ ఈ రేంజ్లోనా..?
బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన సినిమాల పేర్లతో చీరలు, డ్రెస్లు రావడం కొత్తేమి కాదు. హీరోయిన్, హీరోల పేర్లతో వస్త్ర వ్యాపారులు మార్కెట్ క్యాచ్ చేసుకునే వాళ్లు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ను జ్యూవెల్లరి వ్యాపారులు సైతం అనుసరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ సాధించిన బాహుబలి సినిమా పేరుతో ఆభరణాలను తయారు చేసి మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు. సినిమాలోని కీలక ఘట్టాలను తీసుకొని లాకెట్లు గా మార్చేస్తున్నారు. శివగామి, బాల బాహుబలిని చేతితో ఎత్తుకుని నీళ్లలో మునిగిపోతున్న సీన్, బాహుబలి 2లో అత్యంత పాపులర్ అయిన మహేంద్ర బాహుబలి ఏనుగును ఎక్కే సీన్. అలాగే సింహాసనంపై బాహుబలి కూర్చున్న దృశ్యాలను లాకెట్ లుగా మార్కెట్లో తీసుకొస్తున్నారు. టెంపుల్ జ్యూయలరీ అన్నది జ్యూయలరీలో ఓ డిజైనింగ్ కేటగిరీ. ఆ కేటగిరీ టైపులోనే కళాకారులు ఈ బాహుబలి డిజైన్లు రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. -
సారీ.. అసలు దొంగలు దొరికారు!
నెల్లూరు(క్రైమ్): నగల దొం గతనం కేసులో అనుమానంతో కారు డ్రైవర్ను ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు నిర్భందించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. చివరకు అసలు నిందితులు దొరకడంతో సారీ చెప్పి వదిలి పెట్టారు. దీంతో బాధితుడు నడవలేని స్థితిలో జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి వివరాల మేరకు.. నగరంలోని కాపువీధికి చెందిన రాహుల్జైన్ బంగారు వ్యాపారి. ఆయన లైన్బిజినెస్ చేస్తున్నాడు. ప్రకాశం జిల్లాలోని పలు జ్యుయలరీ దుకాణాలకు ఆర్డర్లపై బంగారు నగలు తయారీ చేసి సరఫరా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న రాహుల్జైన్ నెల్లూరు నుంచి కారులో కందుకూరు, సింగరాయకొండ, టంగుటూరుల్లోని బంగారు వ్యాపారస్తులకు ఆభరణాలు ఇచ్చి వారు గతంలో బాకీ ఉన్న నగదును వసూలు చేసుకుని ఒంగోలుకు వెళ్లాడు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఓ హోటల్ వద్ద కారును పార్క్ చేశారు. రాహుల్జైన్ అతని డ్రైవర్ వెంకటస్వామి భోజనం చేసేందుకు హోటల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తుతెలి యని దుండగులు కారును మారు తాళాలతో తెరచి అందులో ఉన్న రెండు కిలోల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును అపహరించుకుని వెళ్లారు. ఘటనపై ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్కు చిత్రహింసలు? కోవూరు రాళ్లదిబ్బకు చెందిన పి.వెంకటస్వామి కారుడ్రైవర్. ఆదివారం అతని స్నేహితుడు అశోక్ ఫోన్చేసి రాహుల్జైన్ను తీసుకుని ఒంగోలు వెళ్లి రావాలని చెప్పాడు. దీంతో వెంకటస్వామి బంగారు వ్యాపారితో కలిసి ఒంగోలు వెళ్లాడు. ఈ క్రమంలో నగలు, నగదు చోరీకి గురవడంతో పోలీసులు తొలుత వెంకటస్వామిని అదుపులోకి తీసుకున్నారు. తనకు ఎలాంటి సంబంధం లేదని వెంకటస్వామి చెబుతున్నప్పటికీ థర్డ్డిగ్రీ ప్రయోగించారు. మూడు రోజుల పాటు తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. అసలు దొంగ పాతడ్రైవరేనని తేలడంతో పోలీసులు సదరు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నడవలేని స్థితిలో ఉన్న డ్రైవర్ వెంకటస్వామికి సారీ చెప్పి మంగళవారం రాత్రి వదిలివేశారు. దీంతో బాధితుడు నెల్లూరు చేరుకుని బుధవారం చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చేరారు. ఈ విషయాలన్నింటిని బాధితుడు మీడియాకు వెల్లడించి కన్నీటి పర్యంతమయ్యారు. తాను నిర్దోషినని చెప్పినప్పటికీ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని వెంకటస్వామి భార్య వాపోయారు. 20 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం జొన్నవాడ (బుచ్చిరెడ్డిపాళెం) : ఒంగోలులో పట్టపగలు ఓ హోటల్ వద్ద జరిగిన బంగారు దొంగతనం కేసులో జొన్నవాడలో మరో 20 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు బంగారు నగల వ్యాపారి రాహుల్జైన్ కారులో చోరీ జరిగిన బంగారు నగల రికవరీలో భాగంగా ఒంగోలు వన్ టౌన్ ఎండీ షబ్బీర్ జొన్నవాడ సర్పంచ్ పిల్లెల్ల మురళీమోహన్ కృష్ణకు బుధవారం ఫోన్ చేశారు. వీడియో కాల్ ఆధారంగా నిందితులు ముసునూరు ఓంకార్, కందికట్టు రాజశేఖర్ బంగారు నగలు దాచి ఉంచిన ఇంటికి పంపారు. అక్కడ మట్టిలో దాచిన ఏడు ఆభరణాలు (దాదాపు 20 సవర్లు) వెలికి తీశారు. వాటిని నగల వ్యాపారి రాహుల్జైన్ స్వాధీనం చేసుకుని ఒంగోలుకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. -
పాత డ్రైవర్ పనే..!
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలో ఆదివారం మిట్ట మధ్యాహ్నం జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. నెల్లూరుకు చెందిన బంగారం వ్యాపారి రాహుల్ జైన్ కారులో నుంచి ఒంగోలులో రెండు కేజీల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు అపహరణకు గురవడం సంచలనం సృష్టించింది. రాహుల్ జైన్ నెల్లూరు నుంచి కందుకూరు, సింగరాయకొండ, టంగుటూరు వ్యాపారులను కలిసి పాత బకాయిల వసూలుతో పాటు కొత్తగా ఇచ్చిన ఆర్డర్ల మేరకు బంగారాన్ని సరఫరా చేసేందుకు జిల్లాలో పలు ప్రాంతాలు తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఒంగోలుకు చేరుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అజంతా హోటల్లో భోజనానికి వెళ్లి వచ్చే సరికి కారులోని బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగు, రూ.2 లక్షలు నగదు ఉన్న బ్యాగులు అపహరణకు గురయ్యాయి. దీంతో ఖంగుతిన్న వ్యాపారి ఒంగోలు వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవటంతో పాటు బాధితుడు రాహుల్ జైన్ని, అతని తాత్కాలిక డ్రైవర్ వెంకట స్వామిని డీఎస్పీ విచారించారు. రిమోట్ లాక్ ఉన్నా చోరీ కారుకు రిమోట్ ఆటో మేటిక్ లాక్ ఉంది. అయినా కారు అద్దాలు పగులగొట్టకుండా డోర్ తీసి చోరీకి పాల్పడటంపై పోలీసులు కారు నడిపిన డ్రైవర్ను తొలుత అనుమానించారు. గుర్తు తెలియని వ్యక్తులు కారు డోర్ లాక్ తీసేపనైతే రిమోట్ ఉన్నందున కారు శబ్దం చేయాలి. అయితే అంతకు ముందే కారు రిమోట్ సెన్సార్లు పని చేయకుండా ఉన్నట్లు స్వయంగా ఎస్పీకి డ్రైవర్తో పాటు రాహుల్ జైన్ వివరించారు. దీంతో సోమవారం వరకు డ్రైవర్ వెంకటస్వామిని అనుమానించిన పోలీసులు గతంలో పని చేసిన డ్రైవర్లు ఎవరన్న దానిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇది పాత డ్రైవర్ పన్నాగంగా అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు పాత డ్రైవర్ పనేనని నిగ్గుతేలింది. అయితే రెండు నెలల క్రితం పాత డ్రైవర్గా రాహుల్జైన్ దగ్గర పని చేసిన వ్యక్తి కారుకు సంబంధించిన రెండో తాళాన్ని ముందుగానే తయారు చేయించుకొని అతని వద్ద ఉంచుకున్నాడు. ఈ రెండు నెలల కాలంలో పలు దఫాలుగా కారు డోర్ తీసి అపహరణకు ప్రయత్నించాడు. అయితే డోర్ రాకపోవడంతో ఆ తాళాన్ని మరింత పదునుగా తయారు చేయించి ఆదివారం ఒంగోలులో భారీ చోరీకి పాల్పడినట్లు తేలింది. దీంతో నెల్లూరులో ఆ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం తెలిసింది. కారులో అపహరించిన బంగారు ఆభరణాలు, నగదును అతని పాత డ్రైవర్ బంధువుల ఇంట్లో పూడ్చిపెట్టాడు. దీంతో బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకొని చోరీకి పాల్పడిన పాత డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయానికల్లా సొత్తుతో సహా నిందితులను ఒంగోలు వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. -
105 కోట్ల రూపాయల కెంపుల సెట్
ధర వినగానే గుండె గుభిల్లుమనే ఉంటుంది. కళ్లు పెద్దవి చేసుకొని ఎందుకు ఇంత ధర అని వెతికే క్రమంలో పడే ఉంటారు. అంతర్జాతీయ మార్కెట్లో మన దేశఖ్యాతిని పెంచిన జాబితాలో తాజాగా ఈ కెంపుల సెట్ కూడా చేరింది. ఈ కెంపుల వెనుక కథేంటి, ఆ ఖరీదు విశేషమేంటో తెలుసుకుందామనే ఆసక్తీ మొదలైందంటే ఈ న్యూస్ మీ కోసమే! అంతర్జాతీయ వజ్రాభరణాల డిజైనర్గా పేరొందిన నీరవ్మోడి ఓ కెంపుల నెక్లెస్, చెవి పోగులు, బ్రేస్లెట్ రూపొందించాడు. వీటి ధర అక్షరాలా 105 కోట్ల రూపాయలు. ఈ సెట్లో మొత్తం 27 కెంపులు పొదిగారు. ఈ విలువైన కెంపులను మయన్మార్లోని మొగక్ మైన్స్ నుంచి సేకరించారట. కెంపుల చుట్టూ ఖరీదైన ఫైన్ కట్ వజ్రాలను పొదిగారు. ఈ సెట్లో వాడిన కెంపులను ఈ దశకు తీసుకు రావడానికి ఐదేళ్లు పట్టిందట. తర్వాత డిజైన్ గీసుకొని, ఆభరణంగా తయారు చేయడానికి ముంబైలోని మోడీ, అతని బృందానికి మరో రెండేళ్లు పట్టిందట. అన్ని కోట్ల విలువైన ఆభరణాన్ని చేజిక్కించుకునే అదృష్టం ఎవరికి దక్కనుందో! మూడేళ్ల క్రితం న్యూ ఢిల్లీలో సొంతంగా ఆభరణాల షాప్ను ప్రారంభించిన నీరవ్మోడీకి దేశవ్యాప్తంగా ఇప్పుడు 15 స్టోర్స్ ఉన్నాయి. మోడీ చేతిలో రూపుదిద్దుకున్న ప్రతీ ఒక్క ఆభరణం ఒక మోడల్ పీస్లా ఉంటుంది. ప్రారంభ ధర రెండు లక్షల రూపాయల నుంచి 105 కోట్లు పెట్టి కొనుగోలు చేసే ఆభరణాలూ ఇతని స్టోర్లో ఉన్నాయన్నమాట. -
వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసు?
బంజారాహిల్స్: వాళ్లింట్లో నగల గురించి నాకేం తెలుసంటూ చోరీ కేసులో నిందితురాలు పోలీసులకు సమాధానం చెబుతుంటే అర్థంకాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ నివాసంలో బంగారు ఆభరణాలు చోరీ అయిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసులు పనిమనిషి సుజాతను శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు ఆమె స్వగ్రామానికి వెళ్లి చోరీ చేసిన ఆభరణాల గురించి వాకబు చేయగా ఆమె పోలీసులకు సహకరించకుండా గంటకోమాట మాట్లాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండు రోజులుగా ఆమెను విచారిస్తుండగా చోరీ చేసిన ఆభరణాలు ఎక్కడ దాచిన విషయం సరిగ్గా చెప్పడం లేదు. రోజుకొక మాట మాట్లాడుతూ పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నట్లు సమాచారం. లక్ష్మినారాయణ నివాసంలో కేవలం నెల రోజులు మాత్రమే పనిచే నగలబాక్స్ను మాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దోచిన నగలను కొంత మందికి విక్రయించినట్లు తెలియగా వారి వద్దకు వెళ్తే తాము కొనుగోలు చేయలేదంటూ ఎదురు తిరుగుతున్నారు. ఒక వైపు నిందితురాలు సహకరించకపోగా మరోవైపు నగలు కొనుగోలు చేసిన వారుకూడా తలోమాట మాట్లాడుతుండటంతో ఈ కేసు ముందుకు సాగడం లేదు. దొంగను పట్టుకున్నామన్న ఆనందం పోలీసులకు లేకుండా పోయింది. -
ప్రియుడే కాలయముడు
తిరుత్తణి: ఆరు సవర్ల నగల కోసం మహిళను హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెలుగుచూసింది. తిరుత్తణి తాలూకా తిరువాలాంగాడు లక్ష్మీవిలాసపురం గ్రామం సమీపంలో తల నరికిన స్థితిలో మహిళ మొండెంను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అనంతరం గాలింపు చేపట్టి అదే ప్రాంతంలోని చెరువు కట్ట వద్ద తలను గుర్తించారు. కేసును ఛేదించేందుకు తిరుత్తణి డీఎస్పీ బాలచంద్రన్ ఆధ్వర్యంలో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. హత్యకు గురైన మహిళ చెన్నై అంబత్తూరు సమీపం పట్రవాక్కంకు చెందిన రేవతి(42)గా తెలిసింది. ఈమె పదేళ్ల కిందట భర్త రామచంద్రన్ విడిపోయి తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఇలాఉండగా తిరువళ్లూరు సమీపం వేపంపట్టుకు చెందిన మారియప్పన్(37) పట్రవాక్కంలో రేవతి ఇంటికి ఎదురుగా కిరాణా దుకాణం నడిపేవాడు. ఈ క్రమంలో రేవతి, మారియప్పన్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 10న రేవతి, మారి బైక్పై వాలాజాలోని ధన్వంతరి ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తా ను వ్యాపారంలో నష్టపోయానని ఆదుకోవాలని మారి రేవతిని కోరాడు. అతనికి సహాయపడేందుకు రేవతి సిద్ధంగా లేకపోవడంతో ఆగ్రహించిన మారి కత్తితో ఆమె తల నరికి మెడలో ఉన్న ఆరుసవర్ల నగలు తీసుకుని తలను అక్కడి సమీపంలోని చెరువుకట్ట ప్రాంతంలో వేసి పరారయ్యాడు. నగల కోసం హత్య చేసినట్టు మారి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. -
టాప్ జ్యుయల్లరీ షాపు ఘరానా మోసం...భారీ టోకరా
సాక్షి, చెన్నై: తమిళనాడు చెన్నైలోని ప్రముఖ బంగారునగల దుకాణం వినియోగదారులకు భారీ టోకరా ఇచ్చింది. వివిధ స్కీంలలో పెట్టుబడుల పేరుతో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించి కోట్లాది రూపాయలను దండుకుంది. ఇటీవలి దీపావళి ఆఫర్ చెల్లించడంలో విఫలం కావడంతో అసలు గుట్టు రట్టయింది. షాపుల మూతకుదారితీసింది. మరోవైపు వేలాదిమందిని కోట్లాది రూపాయల మేర చీటింగ్ చేసినట్టు స్వయంగా దుకాణ యజమానే అంగీకరించారు. వివరాల్లోకి వెళితే చెన్నైలోని నాతెల్లా సాంపత్తు చెట్టి( ఎన్ఎస్సీ)ఈ ఘరానా మోసానికి పాల్పడింది. స్కీముల పేరుతో 21వేలమంది కస్టమర్లకు రూ.75కోట్లకు కుచ్చు టోపీ పట్టింది. వివిధ నెలవారీ పథకాలలో డబ్బులు చెల్లించిన దాదాపు వెయ్యి మంది పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జ్యుయల్లరీ షాపు బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లపై ఆర్థిక నేరాల వింగ్ ( ఈఓడబ్ల్యు) అధికారులు కేసు నమోదు చేశారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రంగనాథ గుప్తా సహా, ఐదుగురు డైరెక్టర్లు(కుమారులు ప్రభన్నకుమార్, ప్రసన్న కుమార్, గుప్తా బంధువు కోటా సురేష్) ఇందులో ఉన్నారు. ఈ సందర్భంగా పలు తనిఖీలు నిర్వహించిన ఈఓడబ్ల్యు అధికారులు విలువైన ఆస్తి పత్రాలను, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ సంస్థకు చెందిన నగరంలో మెయిన్ సెంటర్లో షో రూంలు, రెండు ఇళ్లు, అంబత్తూర్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో కట్టించిన స్కూలు తదితర విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు దర్యాప్తు సంస్థ సిద్ధమవుతోంది. ఈ ఆస్తులను చట్ట ప్రకారం విక్రయించి.. ఇన్వెస్టర్లకు డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. -
హైదరబాద్ పోలీసులకు చేదు అనుభవం
అనంతపురం సెంట్రల్: హైదరాబాద్ సైబర్ పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ దొంగ చోరీ చేసిన బంగారును కొనుగోలు చేశారనే అభియోగంతో రికవరీ చేయడానికి గురువారం హైదరాబాద్ సైబర్ పోలీసులు జిల్లాకు వచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా వస్తారని స్వర్ణకారులంతా వారిని ప్రశ్నించారు. వన్టౌన్ పోలీసుస్టేషన్ను కూడా ముట్టడించారు. పలువురు స్వర్ణకారులు తెలిపిన వివరాల మేరకు... హైదరబాద్ సైబర్ పోలీసులు ఓ దొంగను వెంట పెట్టుకొని గురువారం జిల్లాకు వచ్చారు. నేరుగా పాతూరులో బంగారుగేరిలో వీరభద్ర జ్యువెలర్స్ షాపులోకి వెళ్ళారు. సదరు దొంగ నుంచి 28 తులాల బంగారు నగలు కొనుగోలు చేశారని అభియోగం మోపారు. దొంగ కూ డా సదరు వ్యక్తులకు విక్రయించి నట్లు తెలిపారు. దీనిని స్వర్ణకారులంతా వ్యతిరేకించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ చెప్పినట్లుగా తమపై అభియోగాలు మోపడం ఏంటని ప్రశ్నించారు. తాము దొంగల నుంచి ఎలాంటి బంగారు కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణా పోలీసులు వెనక్కు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో స్వర్ణకారులు వన్టౌన్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అనంతరం వన్టౌన్ సీఐ సాయిప్రసాద్ స్వర్ణకారుల సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఏమైనా ఇబ్బందులుంటే పరిష్కరించుకోవాలని, ఆందోళనలు చేయడం సరికాదన్నారు. దీంతో వెనక్కు తగ్గిన స్వర్ణకారులు ఆందోళన విరమించారు. పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా గురువారం రాత్రి బంగారుగేరిలో సమావేశమయ్యారు. మరోవైపు హైదరాబాద్ సైబర్ పోలీసులు మాత్రం వన్టౌన్ పోలీస్స్టేషన్లోనే ఉన్నారు. దొంగ నుంచి కొనుగోలు చేసిన బంగారును రికవరీ చేసుకొని వెళ్తామని స్పష్టం చేశారు. -
‘పసిడి లావాదేవీలకు నూతన పరిమితి’
సాక్షి,న్యూఢిల్లీ: బంగారం ఇతర ఖరీదైన మెటల్స్లో లావాదేవీలపై పరిమితులకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నూతన ఉత్తర్వులను జారీ చేయనుంది. బులియన్లో బ్లాక్మనీ పేరుకుపోవడాన్ని నియంత్రించే నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేస్తుందని రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ అథియా వెల్లడించారు. రూ 50వేలకు మించిన బంగారం కొనుగోళ్లపై పాన్ కార్డు తప్పనిసరి కాదని ఇటీవల ప్రభుత్వం పేర్కొన్న క్రమంలో నూతన నిబంధనలపై రెవెన్యూ శాఖ వివరణ ఇచ్చింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనలను జ్యూవెలరీ కొనుగోళ్లకూ వర్తింపచేస్తూ ఈ ఏడాది ఆగస్ట్లో జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు గందరగోళం సృష్టించడంతో పాటు ప్రతికూల సెంటిమెంట్ను వ్యాపింపచేస్తుడటంతో వాటిని నిలిపివేసినట్టు హస్ముక్ అథియా చెప్పారు. అయితే జ్యూవెలర్లు బంగారు ఆభరణాల కొనుగోలు వివరాలను ఎంత విలువ దాటితే అధికారులకు వెల్లడించాలనే దానిపై లోతుగా చర్చించిన మీదట నూతన పరిమితిని ప్రభుత్వం వెల్లడిస్తుందని తెలిపారు. -
దొంగలకే చుక్కలు చూపించిదెవరంటే...
పక్కా ప్లాన్తో వచ్చిన దొంగలకు అక్కడున్న గ్లాస్ కౌంటర్ చుక్కలు చూపించిన వైనం కెమెరాకు చిక్కింది. చోరాగ్రేసరుల రకరకాల చోళకళ గురించి మనం చాలానే విన్నాం. అయినా ఎక్కడో ఒక చోట ఒక చిన్న క్లూతో దొరికిపోవడం మామూలే. ముఖ్యంగా సీసీ టీవీలు వచ్చిన తరువాత పోలీసులకు ఈ పని మరింత సులువైంది. అయితే మలేసియాలోని ఓ జ్యుయలరీ షాపులో దొంగతనానికి వచ్చిన దొంగలకు అనుకోని చుక్కెదురైంది. ఎంత చోమటోడ్చినా ఫలితం దక్కకపోవడంతో తోకముడవక తప్పలేదు. ఈ దోపిడీ ప్రయత్నంచేసిన దొంగల ముఠాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నలుగురు దొంగల ముఠా సెక్యూరిటీని గన్తో బెదిరించి మరీ మలేషియాలోని ఒక ఆభరణాల దుకాణంలోకి ఎంటర్ అయింది. ముఖాలకు హెల్మెట్లు, సుత్తులు లాంటి సరుకు సరంజామాతో పనిలోకి దిగారు. తమ వెంట తెచ్చుకున్న సుత్తెలతో జ్యూయెలరీ షోరూమ్లోవున్న డిస్ ప్లే కౌంటర్ గ్లాసులను పగల కొట్టడానికి ట్రై చేశారు. ఒకరి తరువాత ఒకరు ఇద్దరు దొంగలు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అది చాలా మందంగా వుండడంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసినవికావడంతో ఆ గ్లాస్ పగల్లేదు. ఇక చేసేదేమీలేక అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. ఈ తతంగమంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కెడై ఇమాస్ శ్రీ ఆలం జ్యుయల్లరీ షోరూం లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫేస్బుక్ లో దాదాపు 6 మిలియన్లకు పైగా వ్యూస్ను, వేలాది షేర్లను సొంతం చేసుకుంది. -
రికవరీ : బంగారం ధరలు జంప్ చేశాయి
న్యూఢిల్లీ : బంగారం ధరలు రికవరీ అయ్యాయి. నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 300 రూపాయల మేర పెరిగి, 29,550గా నమోదైంది. అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలు, స్థానిక జువెల్లర్స్ భారీగా కొనుగోళ్లు చేపడటంతో బంగారం ధరలు 300 రూపాయల మేర పెరిగాయని తెలిసింది. ఇటు వెండికీ పరిశ్రమ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ తో దీని ధరలు కూడా కేజీకి రూ.1,170 పెరిగి రూ.40,470గా నమోమైంది. అమెరికా జాబ్స్ డేటా పేలవంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికవరీ అయ్యాయి. జాబ్స్ డేటా పేలవంగా రావడంతో ఫెడరల్ రిజర్వు కూడా వడ్డీరేట్ల పెంపును క్రమవిధానంలో పెంచాలని చూస్తోంది. అంతేకాక దేశీయ స్పాట్ మార్కెట్లో స్థానిక జువెల్లర్స్ ఎక్కువగా బంగారం కొనుగోళ్లను చేపడుతున్నారు. దీంతో విలువైన ఈ మెటల్స్ ధరలు పెరిగాయని బులియన్ విశ్లేషకులు చెప్పారు. గ్లోబల్ గా గోల్డ్ ధర 1.04 శాతం పెరిగి ఒక ఔన్సు 1,278 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ కూడా 1.48 శాతం లాభపడి ఔన్స్ కు 17.53డాలర్లుగా ఉంది. దేశీయ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ ధరలు 300 రూపాయల చొప్పున పెరిగాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధరలు రూ.29,550, రూ.29,400 రూపాయలుగా ఉన్నాయి. నిన్నటి మార్కెట్లో ఇవి 100 రూపాయల మేర పడిపోయాయి. -
పట్టపగలే హత్యలు.. సీఎం సీరియస్
ఉత్తరప్రదేశ్లోని మథురలో పట్టపగలే కొందరు సాయుధ దుండగులు ఒక నగల దుకాణంలోకి దూసుకెళ్లి అక్కడి వ్యాపారులను కాల్చి చంపారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన వెంటనే రాష్ట్ర డీజీపీని ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే ఈ కేసులో ఇంతవరకు ఎందుకు అరెస్టులు జరగలేదో చూడాలన్నారు. యూపీ అసెంబ్లీలో కూడా ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాష్ట్ర మంత్రి, మథుర ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని పూర్తిగా అదుపులోపకి తెస్తామని, రాష్ట్రంలో నేరగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ అన్నది లభించదని ముఖ్యమంత్రి సభలో అన్నారు. ముఖాలకు ముసుగులు, హెల్మెట్లు ధరించిన వ్యక్తులు నగలదుకాణంలోకి ప్రవేశించి, ముందుగా సిబ్బందితో గొడవపడ్డారు. షాపులోకి వాళ్లు రాకుండా అడ్డుకోవడంతో సిబ్బందిలో ముగ్గురిని కాల్చి... వాళ్ల మీదుగా లోపలకు ప్రవేశించారు. ఆ సిబ్బందిలో ఇద్దరు మరణించారు. మొత్తం ఆరుగురు సాయుధులు బైకుల మీద దోపిడీకి వచ్చారని, దాదాపు రూ. 4కోట్ల విలువైన బంగారంతో పారిపోయారని పోలీసులు చెప్పారు. జిల్లా సరిహద్దులన్నింటినీ మూసేసి దొంగల కోసం గాలింపు మొదలుపెట్టారు. -
టైర్ మారుస్తుండగా...రూ.కోటి నగలు మాయం
వ్యాపారి దృష్టి మరల్చి అపహరణ హైదరాబాద్: ఓ నగల వ్యాపారి దృష్టి మరల్చి 3.5 కిలోల బంగారు ఆభరణాల బ్యాగును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ పురుషోత్తం సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బషీర్బాగ్లో నివాసం ఉండే అభిషేక్ అగర్వాల్.. యషశ్రీ జువెల్లరీ పేరుతో నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వివిధ రకాల మోడళ్లను తయారు చేసి మలబార్ గోల్డ్ షోరూంలకు సరఫరా చేస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం స్కొడా కారులో రూ.కోటి విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలను తీసుకుని బయలుదేరి.. అమీర్పేట, కూకట్పల్లి, చందానగర్లోని మలబార్ గోల్డ్ షోరూంలలో నమూనాలను చూపించారు. తిరిగి వస్తుండగా కూకట్పల్లిలోని ఏఎస్రాజు నగర్ కమాన్ దాటిన తరువాత కారు వెనుక టైర్ పంక్చర్ అయింది. అభిషేక్, అతని వద్ద పనిచేసే ఆశిష్ టైర్ను మార్చి వచ్చి చూడగా.. నగల బ్యాగు కనిపించలేదు. దీంతో అభిషేక్ కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ పురుషోత్తం ఆధ్వర్యంలో కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అభిషేక్ టైర్ మారుస్తున్న సమయంలో కారు వద్ద ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. చందానగర్ నుంచి కారు వెంబడి ద్విచక్రవాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు అనుసరించినట్లు నగల వ్యాపారి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
విజిలెన్స్ అధికారులమంటూ నగలు చోరీ
లబోదిబోమన్న బాధితురాలు నాయుడుపేటటౌన్ (సూళ్లూరుపేట): విజిలెన్స్ అధికారులమని, బంగారు నగలకు ఖచ్చితంగా బిల్లులు ఉండాలని చెప్పి భయబ్రాంతులకు గురి చేసి ఓ మహిళ వద్ద నుంచి 38 గ్రాముల బంగారు నగలను తస్కరించారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం నాయుడుపేట పట్టణంలో జరిగింది. బాధితురాలి వివరాల మేరకు పట్టణంలోని అమరాగార్డెన్ వీధిలో నివాసముంటున్న చేని దాసరి మస్తానమ్మ ఓ టిఫిన్ అంగట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దుకాణం నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో మోటార్బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను రోడ్డుపై నిలిపారు. మేము విజిలెన్స్ అధికారులమని మోదీ కొత్తగా విడుదల చేసిన జీఓ ప్రకారం బంగారు నగలకు రసీదులు ఉండాలన్నారు. మహిళ వేసుకున్న బంగారు నగలకు రసీదులు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. దీంతో ఆమె కంగారుపడిపోయింది. అప్పుడే ఓ యువకుడు బ్యాగ్తో వస్తుండడంతో ఆతనిని కూడా ఆ ఇద్దరు వ్యక్తులు పిలిచారు. ఆ యువకుడు మెడలో వేసుకున్న చైన్, ఉంగరాలను చూసి వీటికి రశీదులు ఉన్నాయంటూ నిలదీశారు. దీంతో ఆ యువకుడు కొంత నగదు ముట్టచెప్పడంతో బంగారు నగలను తీసి భద్ర పరుచుకోవాలని ఓ కాగితంలో చుట్టు యువకుడికి ఇచ్చేశారు. ఆ మహిళ మెడలో ఉన్న మంగళసూత్రంతోపాటు బంగారు చైన్ను తీసి ఇచ్చింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఓ కాగితంలో చుట్టి ఆమెకు ఇచ్చారు. కొద్ది దూరం వెళ్లి చూసుకునే సరికి అందులో చిన్నపాటి రాళ్లు ఉండడంతో గగ్గోలు పెట్టింది. అయితే అప్పటికే ఆ ఇద్దరు వ్యక్తులు బ్యాగ్తో వచ్చిన యువకుడితో కలిసి మోటార్బైక్పై ఉడాయించారు. మహిళ ఈ సంఘటనతో అస్వస్థతకు గురైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బాధితురాలికి వైద్యశాలలో చికిత్సలు చేయించి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారిస్తున్నారు. -
జోయాలుక్కాస్ భారీ విస్తరణ
సెప్టెంబరుకల్లా కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంకల్లో షోరూమ్లు హైదరాబాద్: దేశంతో పాటు విదేశాల్లోనూ వేగంగా విస్తరిస్తున్న ఆభరణాల రిటైల్ చైన్ జోయాలుక్కాస్... ఈ ఏడాది సెప్టెంబరు నాటికి కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంకల్లో కూడా ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ‘‘దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికల్లా ఇవి పూర్తవుతాయి’’ అని గ్రూప్ సీఎండీ జోయాలుక్కాస్ చెప్పారు.1987లో యూఏఈలో షోరూమ్తో తమ ప్రస్థానాన్ని ప్రారంభించామని, 30 ఏళ్లలో 130 షోరూమ్లు ఏర్పాటు చేయగలిగామని చెప్పారాయన. ప్రస్తుతం సంస్థకు యూఏఈ, ఇండియా, యూకే, సింగపూర్, ఖతర్, అమెరికా, సౌదీ ఆరేబియా, బహ్రెయిన్ వంటి 14 దేశాల్లో కోటి మందికిపైగా కస్టమర్లున్నారు. ‘‘అత్యుత్తమ సేవలందించటమనే లక్ష్యమే మమ్మల్ని ఈ స్థాయికి చేర్చింది’’ అని ఆయన వివరించారు. -
నగలు కొట్టేద్దామని స్కెచ్వేసి..
హైదరాబాద్: ఓ నగల వ్యాపారికి తన దగ్గర పనిచేసే గుమాస్తా టోకరా వేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కు చెందిన రాజేందర్ జైన్ అనే నగల వ్యాపారి తన కస్టమర్ రూ. 17 లక్షల విలువ చేసే నగలు డెలివరీ చేయాల్సి ఉంది. దీంతో తన దగ్గర పనిచేసే గుమాస్తా చంద్రమౌళికి ఈ పని అప్పగించాడు. ఇదే మంచి సమయం అనుకుని భావించిన చంద్రమౌళి చాకచక్యంగా నగలు కొట్టేసేందుకు ప్లాన్ వేశాడు. నగలు తీసుకుని హైదరాబాద్ వచ్చిన గుమస్తా చంద్రమౌళి నగలు పోయాయని యజమానికి ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు..గుమస్తా చంద్రమౌళి నే నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 17 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మందుల పెట్టెల మాటున..
చత్తీస్గఢ్: పాతనోట్ల కట్టల పాములు ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి. చత్తీస్గడ్ లో ఒక మెడికల్ షాపులో భారీ ఎత్తున పాత నోట్లను, బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెమెతారలోని శ్రీరామ మెడికల్ స్టోర్ పై బుధవారం ఆదాయ పన్ను అధికారులు దాడిచేశారు. మందుల పెట్టెల్లో దాచిన రూ.70 లక్షలకుపైగా విలువైన పాతనోట్లను, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.. తాజా సమాచారం ప్రకారం అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా నవంబర్ 8న రద్దు చేసిన రూ.500, 1000 నోటలకు డిపాజిట్లకు గడువు దగ్గరపడుతోంది. మరోవైపు నల్లధనానికి చెక్ పెట్టే క్రమంలో కేంద్ర బుధవారం కొత్త ఆర్డినెన్స్ ను జారీ చేసింది. దీని ప్రకారం 2017 మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాతనోట్లు కలిగి ఉంటే నేరం. ఇలాంటి వారికి 4 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు. అలాగే మార్చి 31 తరువాత పాత నోట్లను మార్చుకునే వారికి, పాతనోట్ల లావాదేవీలలో పాలుపంచుకున్న వారికి రూ.5 వేలు జరిమానా విధించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రద్దయిన నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్ 30 మాత్రమే. ఈ గడువు తర్వాత మార్చి 31 వరకు కేవలం రిజర్వు బ్యాంకు వద్ద మాత్రమే పాతనోట్ల మార్పిడి చేసుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. -
నాలుగు గంటల్లో.. వందకోట్ల బంగారం!
పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రకటించారు. సరిగ్గా అదేరోజు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు.. అంటే కేవలం నాలుగంటే నాలుగే గంటల్లో ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి ఏకంగా 100 కోట్ల రూపాయల బంగారం అమ్మారట! ఈ విషయాన్ని ఆయన తన లెక్కల్లో చూపించారు. అంత అమ్మకాలు ఎలా సాధ్యమయ్యాయని ఈడీ అధికారులు అతడిని ప్రశ్నించారు. నోయిడా సెక్టార్ 51 లోని యాక్సిస్ బ్యాంకు బ్రాంచిలో జరిగిన అక్రమాలు, నకిలీ అకౌంట్ల బాగోతంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఢిల్లీ, ముంబైకి చెందిన ఇద్దరు నగల వ్యాపారుల లావాదేవీలపైనే స్పష్టత రాలేదు. దాంతో వారిని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరిలో ఒక వ్యాపారి ఏకంగా 800 కోట్ల మేర లావాదేవీలు చేశారు. వాటిలో 200 కోట్లు కొనుగోళ్లు కాగా, మరో 600 కోట్లు బంగారం అమ్మకాలు. కొనుగోలు చేసిన బంగారానికి, జరిగిన అమ్మకాలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదని ఈడీ వర్గాలు కనుగొన్నాయి. తాను 5 వేల మందికి బంగారం అమ్మానని ఓ నగల వ్యాపారి చూపించినా, వాటిలో ఏ ఒక్క లావాదేవీ మాత్రం 2 లక్షలు దాటలేదు. అంటే ఒక్కో కస్టమర్కు కేవలం 15 సెకండ్లలోనే బంగారం అమ్మేసినట్లవుతుంది. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే, అతడి వద్ద సమాధానం లేదు. దాంతో ఈ నగల వ్యాపారులు ఇద్దరూ నల్లధనాన్ని తెల్లగా చేసుకోడానికి అంతకుముందు జరిగిన అమ్మకాలను కూడా ఇప్పుడే జరిగినట్లు చూపిస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి. -
ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు
-
ఛాయ్ వాలా మొత్తం ఆస్తులు రూ.400కోట్లు
సూరత్: డిమానిటైజేషన్ తరువాత సూరత్ లో వడ్డీ వ్యాపారి , మనీ లాండరింగ్ కింగ్ కిషోర్ భాజీవాలా ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులే షాకయ్యారు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన అవినీతి తిమింగలం కూడబెట్టిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లకు చేరింది. వడ్డీవ్యాపారిగా అవతరించిన టీ బజ్జీలు అమ్ముకునే వ్యక్తి ఆదాయం ఇంత భారీగా ఉండడం ఆదాయ పన్ను అధికారులను సైతం విస్మయ పరిచింది. ఆదాయ పన్ను అధికారులు తాజాగా ఆయన ఇంటిపై చేసిన సోదాల్లో మరో రూ. 150 కోట్ల విలువైన ఆస్తులు పట్టుబడ్డాయి. సుమారు రూ. 1.33 కోట్లను నగదును రికవరీ చేసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. ఇందులో రూ.95 లక్షల విలువైన కొత్త రెండు వేల నోట్లు ఉన్నాయి. దీంతోపాటుగా రూ.7 కోట్ల విలువగల బంగారు ఆభరణాలు, రూ.72 లక్షల విలువైన వెండిని స్వాధీనం చేసుకున్నారు. (5కేజీల బంగారం బిస్కట్లు, 8 కేజీల బంగారు ఆభరణాలు, కేజీ డైమండ్ నగలు) రూ. 4.50 లక్షల కిసాన్ వికాస పత్రాలు, బంగ్లా, ఫ్లాట్స్, ఇళ్లు, షాపు లు సహా వ్యవసాయ భూమి సుమారు 70 ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం విలువ సుమారు నాలుగువందల కోట్లని అధికారులు అంచనావేశారు. పెద్దనోట్ల రద్దు ప్రకటించిన మరుసటి రోజు సూరత్ లోని ఉధానా బ్యాంకుకు భారీ సంచులతో రావడం సీసీటీవీలో రికార్డు అయింది. దీనిపై విచారణ సందర్భంగా సదరు వ్యక్తి సమాధానం చెప్పడంలో విఫలం కావడం ఐటి అధికారులు ఆయన ఇంటిపై సోదారు నిర్వహించారు. సూరత్ పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్, బరోడా, హెచ్ డీఎఫ్ సీ తదితర బ్యాంకుల్లో 30కి పైగా బ్యాంకు అకౌంట్లు, 16 లాకర్లు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సేర్లతో ఈ నకిలీ ఖాతాలు, లాకర్లను ఆపరేట్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం అక్రమ ఖాతాలను సీజ్ చేసినట్టు చెప్పారు. మరోవైపు రాష్ట్ర మంత్రి,బీజేపీ నేత పురుషోత్తం రూపాలను అభినందిస్తున్న ఫోటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఐటీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం 31 సం.రాల క్రితం సౌరాష్ట్ర నుంచి ఉద్నాగాంకి వలస వచ్చిన కిషోర్ భాజియావాలా ఓ చిన్న, టీస్టాల్ ద్వారా జీవనం మొదలు పెట్టారు. ఆతరువాత బజ్జీల అమ్మడం మొదలు పెట్టాడు. అలా మెల్లిగా వడ్డీ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. స్థానిక రాజకీయనాయకులు, పో్లీసు అధికారులతో సన్నిహిత సంబంధాలున్న ఈయన రుణం తిరిగి చెల్లించనివారిపై బెదరింపులకు పాల్పడేవారిని తెలిపారు. ఈ క్రమంలోరుణాలు చెల్లించలేని వారిదగ్గరనుండి ఆస్తులను లాక్కొనేవాడు. ఈక్రమంలోబ ఇతని నెలవారీ ఆదాయం 7.5కోట్లని విచారణలో తెలిపింది. వీటికితోడు 4.5 కోట్లు వడ్డీ రూపంలో వస్తుండగా, వివిధ ఆస్తుల మీద అ ద్దెరూపంలో మరో 3కోట్లు ఆదాయం. 150 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలతో కలిపి మొత్తం అక్రమ సంపద నాలుగువందల కోట్లకుచేరింది. మరోవైపు తమ సంవత్సర ఆదాయాన్నిరూ.1.5కోట్లుగా ఐటీ రికార్డులో చూపించడం విశేషం. డిసెంబర్ 13న మొదలైన ఈ ఐడీ దాడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
అప్పటి వరకు అమ్మ నగలు అక్కడే..
బెంగళూరు: జయలలిత వీలునామా రాయకపోవడంతో ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయనేది ప్రశ్నగా మారింది. చెన్నైలో పాటు హైదరాబాద్లో జయలలితకు విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇళ్లు, తోటలు ఉన్నాయి. ఈ విషయం అటుంచితే జయలలితకు చెంది బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కర్ణాటక ట్రెజరీలో ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు జయలలితపై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. 1996లో చెన్నైలోని జయలలిత నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 28 కిలోల బంగారం, 800 కిలోల వెండి, 10 వేల చీరలు, 91 వాచీలు, 44 ఎయిర్ కండీషనర్లు, 750 జతల చెప్పులు ఉన్నాయి. ఈ వస్తువుల విలువ 6 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అంచనా. ఆదాయపన్ను శాఖ అధికారులు అప్పట్లో ఈ వస్తువులను కర్ణాటక ట్రెజరీలో భద్రపరిచారు. ప్రస్తుతం అక్కడే ఉన్నాయి. జయలలితపై నమోదైన కేసును కర్ణాటకలో విచారించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కింది కోర్టు జయలలితను దోషిగా తీర్పు చెప్పగా, బెంగళూరు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు కారణంగా ఆమె ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. హైకోర్టులో విముక్తి లభించడంతో మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించే వరకు జయలలిత నగలు కర్ణాటక ట్రెజరీలోనే ఉంటాయి. -
బంగారం పై కన్ను!
-
బంగారం వర్తకులకు కేంద్రం షాక్!
-
బంగారం వర్తకులకు కేంద్రం షాక్!
పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్మనీకి భారీగా సహకరిస్తున్న ఆభరణ వర్తకులకు కేంద్రం షాకిచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. జువెల్లర్స్ రూ.500, రూ.1000 పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసే తుది గడువుగా నవంబర్ 15ను నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బ్లాక్మనీ వ్యాపారాలను నిర్మూలించేందుకు బంగారం వర్తకులకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలకు సిద్దమైనట్టు సమాచారం. బంగారం, జువెల్లరీ మార్గాలలో బ్లాక్మనీని మార్చుకుంటున్నారని, ఈ నేపథ్యంలో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగి కొన్ని ఆభరణ దుకాణాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.50వేలకు పలికినట్టు తెలిసింది. సాధారణంగా రూ.30వేలు ఉండాల్సిన ఈ ధర రూ.50వేలకు ఎగియడంపై, ఆభరణ వర్తకులపై ప్రభుత్వం సీరియస్ అయింది.బ్లాక్మనీ నిరోధానికి ఆభరణ వర్తకులు సహకరిస్తున్నట్టు తెలుసుకున్న ప్రభుత్వం, కఠిన ఆదేశాలు జారీచేసింది. ప్యాన్ నెంబర్ లేనిది, ఆభరణాలు విక్రయించవద్దని, కొనుగోలుదారుల అన్ని వివరాలను తమకు సమర్పించాల్సి ఉంటుందని ఆదేశించింది. ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన కొన్ని గంటల్లోనే ముంబాయి సిటీలో 250 కేజీల బంగారం అమ్ముడుపోయినట్టు తెలిసింది. పాత నోట్లతో ఈ విలువైన ఆభరణాలను కొనడానికి కొనుగోలుదారులు 20 నుంచి 65 శాతం ఎక్కువకైనా చెల్లించడానికి మొగ్గుచూపారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రద్దుచేసిన నోట్ల తరలింపును గుర్తించడానికి, జువెల్లర్స్, హవాలా ఆపరేటర్లకు చెక్ పెట్టడానికి ఇంటిలిజెన్స్ ఏజెన్సీలందరూ కలిసి పనిచేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇంటిలిజెన్స్ ప్రస్తుతం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తున్నాయి. 2017 మార్చి వరకు బంగారం దిగుమతులను కూడా నిషేధించినట్టు మార్కెట్లో రూమర్ వస్తోంది. డిసెంబర్ వరకు కొన్ని ఆంక్షలను ప్రభుత్వం విధిస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు. -
బ్లాక్మనీ యుద్ధం..జ్యువెలర్స్కు షాక్!
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ బ్లాక్ మనీ’ నల్లధనం కుబేరులగుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రకటనతో తమ నిధులను బంగారం కొనుగోళ్లపై మళ్ళిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్నివైపుల నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నవంబరు 8 రాత్రి 8 గం.టల నుంచి సీసీటీవీ ఫుటేజీ సమర్పించాలంటూ జ్యువెల్లరీ షాపు యజమానులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు చోటు చేసుకుంటున్నాయన్న ఫిర్యాదులతో ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీ (నవంబరు 8) ప్రకటన రోజు రాత్రి రాజధాని నగరంలోని మూరుమూల షాపులతో సహా అన్ని ప్రముఖ నగల దుకాణాలన్నీ ఎక్కువసేపు తెరిచే వున్నాయనీ, పెద్ద మొత్తంలో బంగారు కొనుగోళ్లు జరిగాయన్నవార్తలో ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది. ఒకే రోజు వివిధ నగల షాపులో ఒక వ్యక్తి ఎన్నిసార్లు షాపింగ్ చేశాడు. లేదా ఒకే కుటుంబంలోని పలువురు.. వివిధ నగల దుకాణాల్లో చేసిన షాపింగ్ తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇలాంటి సమాచారాన్ని అందించినట్టు తెలుస్తోంది. అలాగే కొన్ని నగల వ్యాపారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఐటీ అధికారులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. నల్లధనంతో బంగారం కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో, ఐటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీబీడీటీ ఆదేశాలపై ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో కరోల్ బాగ్, దారిబా కలాన్, చాందినీ చౌక్, ముంబై జవేరీ బజార్ సహా మూడు ప్రముఖ వ్యాపార కేంద్రాలలో ఈ దాడులు నిర్వహించారు. చండీగఢ్, లుధియానా, అమృత్సర్, జలంధర్, కోలకతా, అహ్మదాబాద్ తదితర నగరాల్లో కూడా తనిఖీ చేశారు. ఈ దాడులు ఇంకా కొనసాగనున్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ నగదు లావాదేవీలపై కఠిన చర్యలకు తమకు స్పష్టమైన ఆదేశాలందాయని స్పష్టం చేశారు. కాగా అక్రమ పసిడి అమ్మకాల్లో బుధవారం పది గ్రా. పుత్తడి ధర రూ..35 వేల నుంచి మొదలై రూ.49 వేల దగ్గర ముగిసింది. ఇది గురువారం నాటికి మరింత ఎగిసి రూ.40 వేల దగ్గర ప్రారంభమై సుమారు 55 వేల రూపాయలు పలకడం కలకలం రేపింది. మరోవైపు బంగారు కొనుగోళ్లపై కచ్చితంగా ప్యాన్ కార్డు నమోదును తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. -
నగల మాయంపై మరో కోణం!
విచారణకు రమ్మంటూ ఆలయ సిబ్బందికి పిలుపు అవుట్ సోర్సింగ్ అర్చకుల నుంచి వివరాలు సేకరణ హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలున్నట్లు ప్రచారం భద్రాచలం: రామాలయంలో నగల మాయంపై విచారణ మళ్లీ మొదటికొచ్చింది. నివేదిక సిద్ధమవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో ఆలయ సిబ్బందిని కూడా విచారణకు పిలవటంతో ఇది ఇప్పట్లో తేలేలాలేదని భక్తులు అంటున్నారు. ఆలయంలో పనిచేసే ఇద్దరు అవుట్ సోర్సింగ్ అర్చకులను తన చాంబర్లో విచారించారు. నగల మాయమై, తిరిగి ప్రత్యక్షమైన రోజు వరకూ అసలేం జరిగిందనే దానిపై అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఇద్దరు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు తెలిపిన వివరాలను రికార్డు చేయటంతో పాటు, వారి నుంచి రాతపూర్వకంగా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అదేవిధంగా ఆలయ సూపరింటెండెంట్ నర్సింహరాజు, మరో ఇద్దరు ఉద్యోగులు రామారావు, సాయిబాబాలను కూడా విచారణకు హాజరు కావాలని విచారణాధికారి రవీందర్ వారికి నోటీసులు అందజేశారు. ఇప్పటి వరకూ ఇద్దరు ప్రధానార్చకులతో పాటు, 11 మంది అర్చకుల నుంచి వివరాలను సేకరించిన డీఈ రవీందర్ వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నేడో, రేపో నివేదికను ఈవో రమేష్బాబుకు అందజేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ మరికొంత మంది ఉద్యోగులను కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించటంతో ఇది మరికొంతకాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగదీతలో ఆంతర్యమేమిటో.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నగల మాయంలో దోషులెవరో తెలుసుకునేందుకు భక్తులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సీతమ్మ వారి పుస్తెలతాడును మాయం చేసి పది రోజుల తరువాత అక్కడ పెట్టినప్పటికీ, అది వాస్తవమైనది కాదనే ప్రచారం ఉంది. మాయమైన రెండు బంగారు నగలు అమెరికాకు తరలించి వాటి స్థానంలో కొత్తవి చేయించి పెట్టారని అర్చకుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీసీతారాముల ఉత్సవమూర్తులను బేరం పెట్టింది మొదలు, నగల మాయం వరకూ జరిగిన మొత్తం ఎపిసోడ్లో ’ప్రధాన’ భూమిక పోషించిన అర్చకుడికి, హైదరాబాద్ స్థాయిలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీనిని ఏదో రీతిన మరుగనపరిచి, నగల మాయం వ్యవహారాన్ని భక్తులు మరిచిపోయేలా చేసేందుకే విచారణను సాగదీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్దఎత్తున దుమారం రేపిన నగల మాయంలో వాస్తవాలు బయటకు వచ్చేలా విచారణను ఏదో ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించకుండా, ఆలయంలో పనిచేసే అధికారితో మమ అనిపించేలా ఉన్నతాధికారులే తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా భక్తులు అంటున్నారు. -
నగల కోసం మహిళ దారుణహత్య
నెల్లూరు : ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న ఐదు సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరులోని ఏసీ నగర్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కె. విజయరత్నం(70) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతు కోసి దారుణంగా హతమర్చి ఆమె ఒంటిపై ఉన్న ఐదు సవర్ల బంగారంతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
37.31 కోట్ల బీమాకు టీవీ స్టార్ దరఖాస్తు
లాస్ ఏంజెలిస్: అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ 37.31 కోట్ల రూపాయల బీమా చెల్లించాలని కోరుతూ దరఖాస్తు చేసింది. ఇటీవల ఫ్రాన్స్ రాజధాని పారిస్లో కిమ్ బస చేసిన హోటల్ గదిలోకి ఇద్దరు దుండగులు చొరబడి.. ఆమెను తుపాకీతో బెదిరించి కోట్ల విలువైన నగలను దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. కిమ్ ఈ నగలకు ఇన్సూరెన్స్ చేయించింది. కిమ్ వద్ద నుంచి దొంగలు దోచుకెళ్లిన నగల విలువ మొత్తం దాదాపు 70 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని మొదట్లో వార్తలు వచ్చాయి. కాగా వీటి విలువ 37.31 కోట్ల రూపాయలుగా కిమ్ వెల్లడించింది. దొంగలు కిమ్ నుంచి ఎంగేజ్మెంట్ రింగ్ను దోచుకెళ్లారు. ఈ డైమండ్ రింగ్ను కిమ్ భర్త ఆమెకు కానుకగా ఇచ్చాడు. దీని విలువ దాదాపు 24 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. -
హోటల్లో రేప్ చేస్తారని భయపడ్డా: టీవీ స్టార్
పారిస్లో తాను బస చేసిన హోటల్లోకి దుండుగులు చొరబడినపుడు భయంతో వణికిపోయానని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ చెప్పింది. ఓ దుండగుడు తనను లాక్కెళ్లి బాత్టబ్లో బంధించాడని పోలీసులకు తెలిపింది. దీంతో దుండగులు తనపై లైంగికదాడి చేస్తారని బెదిరిపోయానని చెప్పింది. తనకు పిల్లలు ఉన్నారని, చంపవద్దని వారిని ప్రాధేయపడ్డానని, మీకు కావాల్సిన వస్తువులు తీసుకెళ్లి తనన వదిలేయమని వేడుకున్నానని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దుండగులు ఇంగ్లీష్లో మాట్లాడలేదని, ఫ్రెంచి భాషలో మాత్రమే మాట్లాడుకున్నారని కిమ్ తెలిపింది. తన భర్త ఇటీవల కానుకగా ఇచ్చిన ఉంగరం ఇవ్వాలని బెదిరించారని, తాను గట్టిగా ఏడ్చేసరికి నోటికి టేప్ అతికించారని చెప్పింది. ఆరు నిమిషాల్లో దొంగలు నగలు, డబ్బు దోచుకుని పారిపోయారని తెలిపింది. ఆ సమయంలో తన ఫ్రెండ్ సిమోనె కింది అంతస్తులో నిద్రిస్తోందని చెప్పింది. దొంగలు వెళ్లాక కేకలు వేయడంతో రెండు నిమిషాల తర్వాత తన అంగరక్షుడు వచ్చాడని వెల్లడించింది. కాగా దొంగలు తనకు ఎలాంటి హానీ చేయలేదని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె పారిస్ నుంచి వెళ్లిపోయింది. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున కిమ్ బస చేస్తున్న హోటల్ గదిలోకి ఇద్దరు దుండగులు చొరబడి.. ఆమెను తుపాకీతో బెదిరించి రూ.45 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లారు. -
45 కోట్ల నగల దోపిడీ
-
45 కోట్ల నగల దోపిడీ
పారిస్: రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్కు పారిస్లో చేదు అనుభవం ఎదురైంది. ఐదుగురు దుండగులు కిమ్ను తుపాకీతో బెదిరించి సుమారు రూ.45 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో (స్థానిక కాలమానం) కిమ్ బస చేస్తున్న హోటల్ గదిలోకి పోలీసు దుస్తుల్లో ఐదుగురు వ్యక్తులు చొరబడ్డారు. మొహానికి ముసుగులేసుకున్న ఆ దుండగులు.. కిమ్ను తుపాకీతో బెదిరించి రూ.45 కోట్ల (6.7 మిలియన్ డాలర్లు) విలువైన నగలతో ఉడాయించారు. ఘటనలో కిమ్కు ఎలాంటి హాని జరగలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. న్యూయార్క్లో ఓ కార్యక్రమానికి హాజరైన కిమ్ భర్త కాన్యే.. విషయం తెలియగానే పారిస్కు బయలుదేరారు. -
నగల షాపులో చోరీకి యత్నం
తనను చూశాడని గుమిస్తాపై దొంగ దాడి మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని సూర్య థియేటర్ సమీపంలో ఉన్న దివ్య జ్యుఝెల్లరీ షాపులో మంగళవారం రాత్రి ఓ దొంగ చోరీకి యత్నించాడు. షాపు యజమాని అప్రమత్తం కావడం తో అతడు పారిపోయాడు. షాపు యజ మాని కథనం ప్రకారం.. మానుకోటకు చెందిన పమ్మి ధనుంజయచారి పట్టణంలోని సూర్య థియేటర్ సమీపంలో తన నివాస గృహంలోనే దివ్య జ్యుఝెల్లరీ షాపును నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ దొంగ షాపునకు సంబంధించిన ప్రహరీ గోడ దూకి ఆ షాపు ఆవరణలోకి అడుగుపెట్టాడు. షాపు తాళం పగులగొట్టేందుకు యత్నించాడు. అదే సమయంలో ఆ షాపు వర్కర్ పరమేశ్వర్ నిద్ర లేచి మూత్రవిసర్జ నకు బయటికి రాగా దొంగ కనిపిం చాడు. అతడు నిద్ర మత్త నుంచి తేరుకునేలోపే అతడిపై దొంగ కర్ర తో దాడి చేశాడు. పరమేశ్వర్ అరుపులు, కేకలకు షాపు యజమాని ధనుంజయచారి లేవడంతో దొంగ పారిపోయాడు. షాపు యజమాని ఇచ్చిన సమాచారంతో టౌ¯న్ ఎస్సై తిరుపతి చేరుకుని దొంగ కోసం వెదికారు. గతంలోనూ ధనుంజయచారి షాపులో దొంగలు రెండుసార్లు చోరీకి పాల్పడ్డారు. -
పసందైన పూసలు
ఒకే రకమైన జ్యూవెలరీని వేసుకోవడం ఓల్డ్ ఫ్యాషన్గా భావిస్తోంది నేటి యువత. ఒక డ్రెస్ వేసుకుంటే.. దానికి తగ్గ జ్యూవెలరీని వేసుకోవడానికే మొగ్గు చూపుతోంది. అంతేకాదు, ఒకేరకమైన మేకింగ్... అంటే జ్యూవెలరీ తయారీకి కావలసిన వాటిలోనూ వెరైటీ కోరుకుంటోంది. అందుకే ఎంతో ఫ్యాషన్గా.. అందంగా కనిపించే జ్యూవెలరీని ‘పూస’లతో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వారం చూద్దాం.. కావలసినవి: రంగురంగుల పూసలు (చిన్నవి, పెద్దవి), ముత్యాలు, తీగలు, దారాలు, ఇయర్ రింగ్ హుక్స్, బ్రేస్లెట్ హుక్స్, చిన్న సైజు కటింగ్ ప్లయర్ తయారీ: ముందుగా ఏ రంగు జ్యూవెలరీ కావాలో.. ఆ రంగు పూసలను సిద్ధం చేసుకోవాలి. తర్వాత వాటితో ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, లెగ్ చెయిన్స్, నెక్లేస్ తయారు చేసుకోవాలి. ఎలా అంటే... గోల్డ్ లేదా సిల్వర్ కలర్ తీగకు పూసలు లేదా ముత్యాలను ఎక్కించి ఎలాంటి జ్యూవెలరీ కావాలంటే, దాన్ని తయారు చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ తయారీకైతే... తీగకు పూసలను ఎక్కించి, చివరకు హుక్స్ను తగిలిస్తే సరిపోతుంది (తీగను మెలికలు తిప్పడానికి కటింగ్ ప్లయర్ను వాడాలి). గాజుల తయారీకి దళసరి తీగలను ఉపయోగించాలి. కొన్నింటికి తీగకు బదులుగా దారాన్ని ఉపయోగిస్తేనే, జ్యుయెలరీ అందంగా కనిపిస్తుంది. నెక్లేస్, చెయిన్ల కోసం దళసరి దారాన్ని వాడాలి. ఒకే వరుస కాకుండా రెండు-మూడు వరుసలుగా పూసలను ఎక్కించి.. చివర్లకు హుక్ తగిలించొచ్చు లేదా రిబ్బన్ వాడినా బాగుంటుంది. అయినా.. పక్కనున్న ఫొటోలను చూస్తే, మీకో ఐడియా వస్తుంది. -
'భద్రాద్రిలో నగల మాయంపై విచారణ చేపట్టాలి'
హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి వారి ఆలయం లో సీతమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మణస్వామి మెడలోని బంగారు లాకెట్ మాయమయ్యాయి. ఈ నగల అదృశ్యంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలయాన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. తాను ఈ విషయం మీద తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. వెంటనే ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. -
భద్రాద్రి రామయ్య ఆభరణాలు మాయం ?
-
బటన్స్తో భలేగా...
ఇంటికి - ఒంటికి మనకు ఎన్ని రకాల జ్యుయెలరీ ఉన్నా.. వేరే కొత్తరకం జ్యుయెలరీ ఏదైనా కనిపిస్తే వద్దంటామా? చాన్సే లేదు.. అంతే కాదు, మారుతున్న ఫ్యాషన్ డ్రెస్సుల మీదకు రకరకాల జ్యుయెలరీ వేసుకుంటేనే కదా మనకు తృప్తి. అలాంటి వారి కోసమే ఈ బటన్ జ్యుయెలరీ మేకింగ్. అవును! మన డ్రెస్సులకు ఉండే బటన్సే. పాడైపోయిన డ్రెస్సుల బటన్స్తో లేదా షాపుల్లో విడిగా దొరికే బటన్స్తో ఎంతో అందంగా.. ఎంతో సులువుగా జ్యుయెలరీని తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం... కావలసినవి: రంగురంగుల బటన్స్ (చిన్నవి, పెద్దవి), రంగురంగుల ఎలాస్టిక్ దారాలు (బ్రేస్లెట్ తయారీకి), సన్నని జంప్రింగ్స్, ఇయర్ రింగ్ హుక్స్, బ్రేస్లెట్ హుక్స్ తయారీ: ముందుగా బ్రేస్లెట్ కోసం... ఎలాస్టిక్ దారానికి రంగురంగుల బటన్స్ను ఎక్కించాలి (వాటికి ఉండే రంధ్రాల ద్వారా). ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించి, చివర్లకు బ్రేస్లెట్ హుక్ తగిలించాలి. అలాగే దారానికి బదులుగా సన్నని జంప్రింగ్స్ను కూడా వాడొచ్చు. అలాగే పెద్ద లేదా చిన్న సైజు బటన్స్కు జంప్రింగ్స్, హుక్స్ తగిలించి ఎంతో అందమైన ఇయర్ రింగ్స్ను తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, బ్రేస్లెట్ తయారీలాగే నెక్లేస్, కాళ్ల పట్టీలనూ తయారు చేసుకోవచ్చు. ఉంగరాలకు రంగు రాళ్లు పెట్టుకున్నట్ల్లు.. ఈ బటన్స్ను జోడిస్తే అవీ రెడీ అయినట్టే. అలాగే చీర పిన్నులకు చిన్న బటన్స్ను జంప్రింగ్స్ సాయంతో తగిలిస్తే, మ్యాచింగ్ పిన్ తయారవుతుంది. ఈ జ్యుయెలరీ మేకింగ్లో బటన్స్తో పాటు రంగురంగుల పూసలు జోడిస్తే.. అవి మరింత అందంగా మారతాయి. -
‘పేట’లో పట్టపగలే చోరీ
ఇంటి తాళాలు పగులగొట్టి 14 తులాల బంగారు ఆభరణాల అపహరణ సూర్యాపేట : దుండగులు పట్టపగలే తెగబడ్డారు. సూర్యాపేటలో ఓ ఇంటి తాళాలు పగులగొట్టి 14 తులాల బం గారు ఆభరణాలు అపహరించుకుపోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చంద్రన్నకుంటకు చెందిన ఎండీ మోహినొద్దీన్ అలంకార్ రోడ్డులో వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మసీద్లో ప్రార్థన చేసేందుకు వెళ్లాలని భార్యను వస్త్ర దుకాణానికి రావాలని కోరాడు. దీంతో ఆమె ఇంటికి తాళాలు వేసుకుని దు కాణం వద్దకు చేరుకుంది. ప్రార్థన ముగి ంచుకుని మోహినొద్దీన్ దుకాణానికి చేరుకోగానే భార్య ఇంటికి వెళ్లింది. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఒక్కసారిగా అవాక్కయిం ది. అసలు ఏం జరిగిందో కూడా తెలి యకముందే ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. గుర్తుతెలియని దొంగలు ఇంటి వెనుక నుంచి వచ్చి లోనికి చొరబడ్డారు. తా ళాన్ని రంపంతో కోసి బీరువాలోని 14 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసు లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆలయంలో చోరీ.. అభరణాలు అపహరణ
నకిరికల్లు: ఆలయంలో దొంగలు పడి హుండీలోని సొత్తుతో సహా స్వామివారి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నకిరికల్లు మండలం నర్సింగపాడు గ్రామంలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించడానికి ఆలయానికి వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జంప్ జ్యుయెలరీ
ఒకే రకమైన జ్యుయెలరీని వేసుకోవడాన్ని ఓల్డ్ ఫ్యాషన్గా భావిస్తోంది నేటి యువత. ఏ డ్రెస్ వేసుకుంటే దానికి తగ్గ జ్యుయెలరీనే వేసుకోవడానికి ఇష్టపడుతోంది. అంతేకాదు.. ఒకేరకమైన మేకింగ్నూ అవాయిడ్ చేస్తున్నారు టీనేజర్స్. అందుకే భిన్నంగా కొత్తగా కనిపించే జంప్రింగ్స్ జ్యుయెలరీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఎలా అంటారా? అయితే తయారీకై ఓ లుక్కేద్దాం... కావలసినవి: స్టీల్, గోల్డ్, కాపర్ కలర్ జంప్రింగ్స్ (చిన్నవి, పెద్దవి), రింగ్స్ను అడ్జస్ట్ చేయగల పట్టకారు, రంగురంగుల పూసలు (సైజు మీ ఇష్టం), హుక్ ఉన్న చెయిన్ (నెక్లేస్ కోసం) తయారీ: ముందుగా గోల్డ్ కలర్ జంప్రింగ్ నెక్లేస్ మేకింగ్ చూద్దాం.. రెండు పెద్ద సైజు రింగ్స్ను తీసుకొని, రెండింటినీ చిన్న రింగ్తో కలపాలి. అలా మీకు కావలసిన పొడవులో ఒక లైను తయారు చేసుకోవాలి. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా రెండు చివర్లలో ఒక్కో రింగ్ను వదిలేసి రెండో లైన్ను పూర్తిచేయాలి. అలాగే ప్రతి వరుసలో రెండు చివర్లు వదిలేసుకుంటూ... ఆఖరికి ఒక్క రింగు మాత్రమే మిగిలేలా చూసుకోవాలి. ఆ చివరి రింగుకు ఏదైనా రంగు రాయి లేదా బీడ్ను తగిలించాలి. ఇప్పుడు పై వరుస చివరి రింగులకు హుక్ ఉన్న చెయిన్ను బిగిస్తే సరి.. ఎంతో అందమైన నెక్లేస్ రెడీ. అలాగే ఈ జంప్రింగ్స్తో ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, కాళ్ల పట్టీలు, ఉంగరాలను తయారు చేసుకోవచ్చు. -
కలర్ఫుల్ కుచ్చులు..
ఇప్పటివరకు ఎన్నో రకాల జ్యుయెలరీ మేకింగ్స్ను చూశాం. కానీ టాసెల్ జ్యుయెలరీని చూశారా? అదేనండీ దారాల కుచ్చు.. మీ డ్రెస్ కలర్కు మ్యాచ్ అయ్యే దారంతో సులువుగా జ్యుయెలరీ తయారు చేసుకోవచ్చు. రోజూ వేసుకునే జ్యుయెలరీనే కొత్తగా మార్చుకోవాలనుకుంటే.. రెండు మూడు కుచ్చులను వాటికి తగిలిస్తే సరి. ఈ జ్యుయెలరీ మేకింగ్కు ఒక్క టాసెల్స్ తయారీ తెలిస్తే చాలు. కావలసినవి: రంగురంగుల దారాలు, కత్తెర కుచ్చుల తయారీ: ముందుగా ఏ రంగు జ్యుయెలరీ కావాలనుకుంటే ఆ రంగు దారాన్ని తీసుకోండి. దాన్ని కావలసినంత పొడవులో 25-30 సార్లు చుట్టండి. ఇప్పుడు సరిగ్గా దాని మధ్యలో ఓ చిన్న దారంతో ముడి వేయాలి. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా మధ్యభాగంలోని సన్న దారాన్ని పట్టుకొని, ఇరువైపుల దారాలను మరోదారంతో ముడివేయాలి. ఆపైన చివర్లను కత్తెరతో కట్ చేస్తూ సమానంగా చేసుకోవాలి. అంతే అందమైన కలర్ఫుల్ కుచ్చు రెడీ. ఇప్పుడు ఈ కుచ్చుతో ఫొటోలోని జ్యుయెలరీని ఎంతో అందంగా.. ఈజీగా చేసుకోవచ్చు. చెయిన్స్కు, బ్రేస్లెట్స్కు లాకెట్లలా మార్చి, డ్రెస్కు మ్యాచ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇయర్రింగ్స్ కావాలంటే.. ఈ కుచ్చుకు ఒక హుక్ లేదా రింగ్ తగిలిస్తే చాలు. అలాగే కాళ్ల పట్టీలను కూడా రంగురంగుల కుచ్చులతో అలంకరించొచ్చు. -
అన్నిటికీ సూట్ అవుతాయ్..!
ఇంటికి - ఒంటికి ఇంట్లో చాలా వస్తువులను పాడైనప్పుడు, వాటి అవసరం తీరాక పడేస్తూ ఉంటాం. కానీ కొన్నిటిని రీసైకిల్ చేసుకుంటే... ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో సూట్కేస్, ట్రంకు పెట్టెలు ముందు వరుసలో ఉంటాయి. కొన్ని సూట్కేసులను చిరిగిపోయాయనో, రంగు పాడైందనో పడేస్తుంటాం. కానీ ఒకసారి పక్కనున్న ఫొటోలను చూస్తే ఇకపై మీరు అలా చేయరులేండి. పాతబడిన సూట్కేసులకు రంగురంగుల కవర్లు తొడిగితే చాలు అవి కొత్తవాటిలా తళతళా మెరిసిపోతాయి. అప్పుడు అందులో మీ జ్యుయెలరీ (ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్లేస్, చెయిన్స్, బ్రేస్లెట్స్...) పెట్టుకోవచ్చు. అలాగే వాటిలో మేకప్కు సంబంధించిన ప్రాడక్ట్స్ను కూడా దాచుకోవచ్చు. అంతేకాదు వైద్యానికి సంబంధించిన వస్తువులు (ఫస్ట్ ఎయిడ్ కిట్), చిన్న పిల్లల సామగ్రినీ అందులో పెట్టుకోవచ్చు. అలాగే పెట్ హౌజ్లా కూడా ఈ సూట్కేసులను ఉపయోగించుకోవచ్చు. మరీ పాడైపోయిన వాటినైతే పూలతొట్లలా మార్చి, అందులో మొక్కలు పెంచుకోవచ్చు. వాడుకున్న వాళ్లకు వాడుకున్నంత అన్నట్టు.. వాటిని టీ పాయ్, టేబుల్, చెయిర్, సోఫా.. ఇలా విరివిగా ఉపయోగించుకోవచ్చు. -
భర్తను చంపి నగలు, నగదుతో పరార్
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో దారుణం జరిగింది. భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి గొంతు పిసికి హత్య చేసిందో భార్య. అనంతరం లక్షల విలువ చేసే నగలు, డబ్బుతో ఉడాయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని ఉత్తరాఖండ్లోని నైనిటాల్కు చెందిన తారగా గుర్తించారు. మృతుడి కొడుకు భరత్ సింగ్ (14) ఇచ్చిన సమాచారంతో ఈ అమానుషం వెలుగు చూసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిర్మల్ సింగ్ (45) ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కొడుకు భరత్ వికలాంగుడని సమాచారం. అయితే మొదటి భార్యకు విడాకులిచ్చిన నిర్మల్ సింగ్ నాలుగేళ్ల క్రితం తారను రెండో వివాహం చేసుకున్నాడు. ఏమైందో ఏమో తెలియదుగానీ, సోమవారం రాత్రి సింగ్, ఆయన కుమారుడికి పథకం ప్రకారం నిద్రమాత్రలిచ్చింది. ఆ తర్వాత భర్తను గొంతునులిమి హత్యచేసి డబ్బు, నగలతో అక్కడినుంచి పరారయ్యింది. మంగళవారం మధ్యాహ్నానికి స్పృహలోకి వచ్చిన భరత్.. చుట్టుపక్కలవారికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే హత్య చేసిన అనంతరం తార.. భరత్ మొబైల్ఫోన్ ను కూడా తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితురాలి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కారు కోసం.. ఇంట్లో నగల చోరీ!
విలాసాలకు అలవాటు పడిన విద్యార్థులు.. ఎంతటి ఘోరాలకైనా పాల్పడుతున్నారు. తాజాగా చెన్నై పోలీసులు ఇలాంటి కేసును ఛేదించారు. కారు కొనుక్కోవాలన్న ఆశతో సొంత ఇంట్లోంచి రూ. 7.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన విద్యార్థితో పాటు అతడి ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మహేంద్రన్ (19) రామాపురం ప్రాంతంలోని నారాయణ్ లాల్ అనే వ్యాపారి చిన్నకొడుకు. ఆయనకు తన ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో హార్డ్వేర్ దుకాణం ఉంది. మహేంద్రన్ చెన్నైలోని ఓ ప్రైవేటు కాలేజిలో బీసీఏ చదువుతున్నాడు. అతడితో పాటు నారాయణ్ లాల్కు ఉత్తమ్చంద్ అనే మరో కొడుకు, ఇంకో కూతురు ఉన్నారు. ఇటీవల లాల్ తన భార్య, కుమార్తెలతో కలిసి రాజస్థాన్ వెళ్లారు. దుకాణం బాధ్యతలను తన పెద్దకొడుక్కి అప్పగించారు. ఆదివారం నాడు మహేంద్రన్, ఉత్తమ్చంద్, దుకాణంలో పనిచేసే మరో నలుగురు కలిసి కొలపాక్కం ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఈలోపు మహేంద్రన్ స్నేహితులు జీవా, రాజేష్ కుమార్ కలిసి డూప్లికేట్ తాళాలతో ఇంట్లోకి ప్రవేశించి, నగలన్నీ చోరీ చేశారు. నగలన్నీ తీసుకున్న తర్వాత.. తాళాన్ని డ్రిల్లింగ్ చేసి, ఎవరో బలవంతంగా లోపలకు వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. చోరీ విషయం తెలియగానే మహేంద్రన్ షాకైనట్లు నటించాడు. ఉత్తమ్చంద్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. విచారణలో పోలీసులకు.. తాళాన్ని లోపలి నుంచి డ్రిల్లింగ్ చేసినట్లు తెలిసింది. ఎవరో బాగా తెలిసినవాళ్లే చేసి ఉంటారని గట్టిగా విచారణ చేస్తే, మహేంద్రన్ విషయం తెలిసింది. తమదైన శైలిలో అడిగితే.. కారు కొనుక్కోడానికే ఈ దొంగతనం చేయించినట్లు మహేంద్రన్ వెల్లడించాడు. -
ఇక గోల్డ్ షాపులు కళకళ
ముంబై : కేంద్రం విధించిన ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్నును వ్యతిరేకిస్తూ దాదాపు ఆరు వారాలుగా బంగారం వర్తకులు చేస్తున్న బంద్ ఎట్టకేలకు ముగిసింది. దీంతో దేశంలో సగానికి పైగా బంగారు దుకాణాలు తెరుచుకున్నాయి. ఎక్సైజ్ శాఖ నుంచి బంగారు వర్తకులకు వేధింపులు లేకుండా చూస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో తమ బంద్ ను ఆపివేశామని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ డైరెక్టర్ బచ్ రాజ్ బమాల్వ తెలిపారు. ఆరు వారాల తర్వాత తెరుచుకున్నా షాపుల్లో బంగారు డిసౌంట్స్ పడిపోతున్నాయి. 40 డాలర్లుగా ఉన్న బంగారు డిసౌంట్స్ ను డీలర్లు 25 డాలర్లకు ఆఫర్ చేస్తున్నారు. మరోవైపు ఇది పెళ్లిళ్లు, పండుగల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ కూడా బాగా పెరుగుతోందని ఎంఎన్సీ బులియన్ డైరెక్టర్ దమన్ ప్రకాశ్ రాథోడ్ తెలిపారు. బంగారు దుకాణాల బంద్, ధరలు ఎక్కువగా ఉండటంతో మార్చి క్వార్టర్ లో గోల్డ్ కొనుగోలు తగ్గాయని, ఏడు ఏళ్ల కనిష్టానికి పడిపోయాయని పేర్కొన్నారు. ఈ వారాంతం వరకు అన్ని బంగారు దుకాణాలు తెరుచుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
బంగారం బంద్.. రూ.2000 కోట్లు లాస్
కోల్ కత్తా: కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలపై ఒక్క శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బంగారు వర్తకులు, బులియన్ ట్రేడర్స్ చేస్తున్న బంద్ వల్ల వారు శుక్రవారం ఒక్కరోజే రూ.2000 కోట్లు నష్టపోయారు. గుడిపాడ్వ(ఉగాది) కావడం వల్ల సాధారణ రోజుల కంటే బంగార కొనుగోలుకు 15 శాతం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే బంగారం వర్తకులు గత మార్చి 2 నుంచి చేస్తున్న నిరవధిక బంద్ వల్ల ఈ సారి ఉత్తర భారత్ లో బంగార దుకాణాలన్నీ మూతపడ్డాయి. నాన్ సిల్వర్ జ్యువెలర్స్పై ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లో తాము సుంకాన్ని చెల్లించేది లేదంటూ జ్యువెల్లరీ కంపెనీలు వాదిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తమకు సమ్మతంగా లేదంటున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ పెంపు అనేది కేవలం జ్యువెల్లర్లకు, ప్రభుత్వానికే కాకుండా, రాజకీయ సెగ కూడా తగిలింది. కాంగ్రెస్, శివసేన, ఆప్ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉత్తర భారత్ లో బంగారం దుకాణాలన్నీ మూతపడ్డాయని ఢిల్లీ జ్యువెల్లర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అశోక్ పొపాలియా తెలినారు. దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో కూడా బంగారు షాపులు తెరవడం లేదన్నారు. గుడిపాడ్వ ఒక్కరోజే బంగార కొనుగోలు ఎక్కువగా ఉండవని, రెండు రోజుల పాటూ ఈ డిమాండ్ అధికంగా ఉంటుందని గీతాంజలి గ్రూప్ చైర్మన్ మెహుల్ చోక్సీ తెలిపారు. ఈ రెండు రోజుల్లో బంగారు వ్యాపారులు చాలా నష్టపోయామని వాపోయారు. ఎక్సైజ్ డ్యూటీ పెంచడమనేది చాలా సంక్లిష్టమైన ధోరణి అని, ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తామన్న ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలన్నారు. అశోక్ లహరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేస్తానన్న కేంద్రం, ఇప్పటివరకూ దానిపై చర్యలు తీసుకోలేదన్నారు. ఇలానే ఎక్కువ రోజులు బంద్ కొనసాగితే, గోల్డ్ బిజినెస్ ఎక్కువగా నష్టపోతుందని వీహెచ్పీ జ్యువెల్లర్ల డైరెక్టర్ ఆదిత్య చెప్పారు. -
'ఏం చెప్పినా.. ఎక్సైజ్ డ్యూటీ మా వల్ల కాదు'
ముంబై :వెండియేతర ఆభరణాలపై ఎక్సైజ్ డ్యూటీని ఒక శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జ్యువెలర్లు, బులియన్ ట్రేడర్స్ చేస్తున్న బంద్ నిరవధింగా కొనసాగుతోంది. కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీని తాము చెల్లించలేమంటూ వారు మరోసారి స్పష్టం చేశారు. నాన్ సిల్వర్ జ్యువెలర్స్పై ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన బడ్జెట్లో లో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత మార్చి 2 నుంచి వారు బంద్ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ డ్యూటీని చెల్లించేది లేదంటూ జ్యువెల్లరీ కంపెనీలు వాదిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తమకు సమ్మతంగా లేదంటున్నాయి. అలాగే రూ.2 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు కల్గిన వ్యక్తులందరి దగ్గర పాన్ కార్డ్ కలిగి ఉండాలనే నిర్ణయాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. కాగా, వారు చేస్తున్న డిమాండ్ పై పరిశీలన జరిపేందుకు మాజీ చీఫ్ ఎకానమిక్ అడ్బయిజరీ అశోక్ లహరీ నేతృత్వంలో ప్రభుత్వం ఓ ప్యానెల్ ను ఏర్పాటుచేసింది. ఇది 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదక సమర్పిస్తుంది. -
సమ్మె విరమణపై జువెలర్స్ లో భిన్నస్వరాలు
♦ స్థానిక అసోసియేషన్స్ నుంచి వ్యతిరేకత ♦ చాలా ప్రాంతాల్లో కొనసాగుతోన్న సమ్మె న్యూఢిల్లీ/ముంబై: సమ్మె విరమణ ప్రక్రియపై జువెలర్స్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వపు హామీతో ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపును వ్యతిరేకిస్తూ జువెలర్స్ చేపట్టిన నిరవధిక సమ్మెను విరమించాలని శనివారం ఆల్ ఇండియా అండ్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజే ఎఫ్), ఆల్ ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ), జెమ్స్ జువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్యను ఢిల్లీ-ఎన్సీఆర్, రాజ స్తాన్, ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని కొన్ని స్థానిక అసోసియేషన్స్ వ్యతిరేకిస్తున్నాయి. ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురీంధర్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తన చర్యను వెనక్కు తీసుకునేంతవరకు దేశ రాజధానిలో సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 40 శాతం షాపుల్లో మాత్రమే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, మిగిలినవి సమ్మెలోనే ఉన్నాయని జీజేఎఫ్ మాజీ ప్రెసిడెంట్ బచ్రాజ్ బమల్వా తెలిపారు. జువెలర్స్ డిమాండ్స్ పరిశీలనకు కమిటీ న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపును నిరసిస్తూ సమ్మె చేస్తోన్న జువెలర్స్ డిమాండ్స్ పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అశోక్ లహ్రి అధ్యక్షత వహిస్తారు. ఇది 60 రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎక్సైజ్ సుంకం వర్తింపు సహా రికార్డుల నిర్వహణ వంటి తదితర సంబంధిత అంశాలను ఈ కమిటీ పరిశీలించనున్నది. అన్ని జువెలరీ అసోసియేషన్స్ వాటి సమస్యలను కమిటీకి విన్నవించుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
జువెలర్స్ కు పన్నుపై వెనక్కితగ్గని కేంద్రం
♦ పన్ను చెల్లింపునకు సరళ ప్రక్రియే ఉంటుందని వెల్లడి ♦ 14వ రోజుకు చేరిన సమ్మె సాక్షి, హైదరాబాద్: జువెలరీ వర్తకులపై 1 శాతం ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనను ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం దీనికి సంబంధించి కొంత వివరణ ఇచ్చింది. పన్ను చెల్లింపునకు ప్రత్యేక విధానమేమీ ఉండదని... ప్రక్రియ మొత్తం చాలా సరళంగా ఉంటుందని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ కమిషనర్-1 ఎం. శ్రీనివాస్, కమిషనర్-2 సునీల్జైన్ పేర్కొన్నారు. దీనిపై సరైన సమాచారం లేకపోవడంవల్లే జువెలర్లు ఆందోళన చెందుతున్నారని మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. రెండు రోజుల్లోనే జువెలర్లు రిజిస్టర్ చేసుకోవచ్చని. ఆన్లైన్లో పన్నును చెల్లించవచ్చని, రిటర్న్ ఫైల్ చేయొచ్చని వివరించారు. మరోపక్క, కేంద్రం వెనక్కితగ్గకపోవడంతో ఆభరణాల విక్రేతలు సమ్మెను కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా సమ్మె మంగళవారం 14వ రోజుకు చేరింది. కేవలం గడిచిన ఏడాదిలో రూ.12 కోట్లకు మించి టర్నోవర్ను నమోదుచేసిన ఆభరణాల తయారీదారులు మాత్రమే ఈ 1% ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించాల్సి వస్తుందని... అందరికీ వర్తించదని కమిషనర్లు పేర్కొన్నారు. వెండి ఆభరణాలపై పన్ను ఉండదని కూడా తేల్చిచెప్పారు. మరోపక్క, కేవలం జాబ్ వర్క్ ఆధారంగా ఆభరణాలను తయారు చేసే నగల తయారీదారులు సెంట్రల్ ఎక్సైజ్ విభాగం వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్వీయ మదింపు ఆధారంగా స్వచ్ఛందంగా జువెలర్లు ఈ పన్నును చెల్లించే విధంగా విధానం ఉంటుందని వెల్లడించారు. వర్తకులకు ఉన్న సందేహాలు తీర్చేందుకు వారితో త్వరలో ఓపెన్హౌస్ డిబేట్(చర్చాగోష్టి)ను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపుతో పాటు రూ. 2 లక్షల విలువైన కొనుగోళ్లకు కస్టమర్ల పాన్ నంబర్ను తప్పనిసరి చేయడాన్ని జువెలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ‘పాన్’ తప్పనిసరి చేసిననాటినుంచి ఆభరణాల విక్రయ వ్యాపారం 20 శాతం మేర పడిపోయిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురిందర్ కుమార్ జైన్ చెప్పారు. మరోపక్క, జువెలర్లకు మద్దతుగా ఢిల్లీలో ఈ నెల 17న బంద్ చేయనున్నట్లు కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. -
పోలీసాయన అరుదైన పెళ్లి కానుక
ఢిల్లీ: పోలీసులంటే సామాన్య జనంలో ఉన్న అభిప్రాయాన్ని తిరగరాశాడు ఢిల్లీలోని ఓ పోలీస్ అధికారి. త్వరలో పెళ్లిచేసుకోబోతున్న యువతికి అరుదైన పెళ్లి కానుకను అందించాడు. భారీ విలువైన నగలు , నగదుతో సహా పోయిందనుకున్న బ్యాగును తిరిగి ఆ కుటుంబానికి అందిజేశాడు. సుమారు 8 లక్షల రూపాయల కానుకను వారికి చేరవేశాడు. దీంతో నిజాయితీకి మారుపేరుగా నిలిచి, అటు ఉన్నతాధికారులు ఇటు ప్రజల ప్రశంసలందుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం సాయంత్రం తన విధుల్లో భాగంగా ఎస్ఐ మంగేజ్ సింగ్ (58) పెట్రోలింగ్కి వెళ్లాడు. అజ్మీర్ గేటు దగ్గర అనుమానాస్పద స్థితిలో ఒక బ్యాగు కనిపించింది. అసలే నగరంలో రెడ్ అలర్డ్ అమల్లో ఉండడంతో ఆ సంచిని క్షుణ్ణంగా పరిశీలించాడు. అనంతరం షాక్ అవ్వడం అతని వంతైంది. విలువై వజ్రాల ఆభరణాలు, నగదు దర్శనమిచ్చాయి. రూ .8 లక్షలు విలువైన ఈ బ్యాగ్ సెంట్రల్ ఢిల్లీలోని కమలా మార్కెట్ లో వస్త్ర దుకాణం యజమానికి చెందినదిగా గుర్తించారు. అనంతరం బ్యాగును అసలు యజమానికి అప్పగించి తననిజాయితీని చాటుకున్నారు. అలా కాబోయే పెళ్లి కూతురికి అరుదైన పెళ్లి కానుకను అందించడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఎస్ఐ మంగేజ్ సింగ్ ను అభినందనల్లో ముంచెత్తారు. ఢిల్లీకి చెందిన వస్త్ర వ్యాపారి త్వరలో జరగబోయే కుమార్తె వివాహం కోసం వజ్రాల ఆభరణాలు కొనుగోలు చేశాడు. తిరిగి వస్తుండగా కొంతమంది దుండగులు, సదరు వ్యాపారి దృష్టి మళ్లించి బ్యాగు ఎత్తుకెళ్లారు. దాంట్లో ఉన్న మూడున్నర లక్షల నగదును తీసుకొని అనంతరం ఆ బ్యాగును పక్కన పడేసి వెళ్లాపోయారు. కానీ బ్యాగులో వేరే వేరే అరల్లో ఉన్న నగలు, డబ్బులను గమనించలేదు. ఆ బ్యాగే ఎస్ఐ మంగేజ్ సింగ్ కంటబడి, చివరికి అసలు యజమానికి చెంతకు చేరింది. కాగా ఈ విషయాన్ని సెంట్రల్ డీసీపి పరమాదిత్య ధృవీకరించారు. ఎస్ఐ మంగేజ్ సింగ్ కు అవార్డుతో సత్కరించనున్నామని తెలిపారు. -
ఈ నెల 7 వరకూ ఆభరణాల వర్తకుల సమ్మె
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా గత 3 రోజులుగా సమ్మె చేస్తున్న ఆభరణాల వర్తకులు దీన్ని ఈ నెల ఏడవ తేదీ వరకూ పొడిగించారు. రత్నాలు, బంగారు ఆభరణాలపై 1% ఎక్సైజ్ సుంకం విధించడం పరిశ్రమ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) చైర్మన్ జి.వి. శ్రీధర్ చెప్పారు. ఎక్సైజ్ సుంకం విధింపుపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నామని చెప్పారు. తమ సమస్యలను పరిశీలిస్తానని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని, అయినప్పటికీ తమ సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు. గతంలో ఈ విధంగానే ఎక్సైజ్ సుంకం విధించారని, కానీ సానుకూల ఫలితాలు రానికారణంగా తొలగించారని జీజేఎఫ్ మాజీ చైర్మన్, డెరైక్టర్ బచ్చరాజ్ బమల్వ చెప్పారు. కాగా 12 కోట్ల టర్నోవర్ మించిన వర్తకులపై మాత్రమే వెండి-యేతర ఆభరణాలపై 1% ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తామని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. రూ. రెండు లక్షలు, అంతకు మించిన ఆభరణాల కొనుగోలు చేస్తే పాన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధనను కూడా ఆభరణాల వర్తకులు వ్యతిరేకిస్తున్నారు. పాన్ నంబర్ తప్పనిసరి నిబంధనను రెండు లక్షలకు కాక రూ. 10 లక్షలకు మించిన కొనుగోళ్లకు వర్తింపజేయాలని కోరుతున్నారు. 3 రోజుల సమ్మెతో పరిశ్రమకు రూ.21 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. -
బంగారు వర్తకుల నిరవధిక సమ్మె
ముంబై: బంగారం వ్యాపారులు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. 2016 ఆర్థిక బడ్జెట్ లో బంగారు ఆభరణాలపై అమ్మకం పన్ను విధించడానికి వ్యతిరేకంగా మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. బంగారు ఆభరణాలపై నాలుగు సంవత్సరాల తరువాత మళ్లీ అమ్మకపు పన్ను విధించడాన్ని వర్తక సంఘం వ్యతిరేకించింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్టు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగార వినియెగాదారుగా ఉన్న ఇండియాపై దీని ప్రభావం మరింతగా పడనుందని వాదిస్తున్నారు. ఇప్పటికే బంగారం ధరలు బాగా పెరగడంతో గత రెండు మూడు నెలలుగా డిమాండ్ బాగా తగ్గిందన్నారు. కొనుగోళ్లు పడిపోవడంతో నష్టాలను చవి చూస్తున్నామని, ఈ పరిస్థితుల్లో అమ్మకంపన్ను విధించడంతో తమపై మరింత ప్రభావం పడుతుందని వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారతదేశం బులియన్ మరియు జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి కేతన్ ష్రాఫ్ విజ్ఞప్తి చేశారు. కాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2016 లో బంగారం, వజ్రాల ఆభరణాల 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. -
ముందు తాగిస్తాడు.. తర్వాత దోచేస్తాడు
♦ జ్యువెలరీ దొంగను అరెస్టు చేసిన మార్కెట్ పోలీసులు ♦ గతంలో రైతులను కూడా మోసం చేసిన చిన్నారెడ్డి ♦ వివరాలు వెల్లడించిన సీపీ మహేందర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: చూసేందుకు జెంటిల్మన్ వేషధారణ.. చేతిలో నగదు కట్టలు ఉన్నట్టుగా భ్రమింపజేసే ఓ బ్యాగ్.. మార్కెట్కు వచ్చే జ్యువెలరీ షాప్ ఉద్యోగులు.. రైతులను లక్ష్యంగా చేసుకుని చోరీలు.. ఇదీ ఆ జ్యువెలరీ దొంగ తీరు. దర్జాగా డ్రెస్ చేసుకుని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వ్యక్తిలా హడావుడి చేస్తూ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నానని బాధితులతో పరిచయం పెంచుకుంటాడు. వారికున్న మద్యం తాగే అలవాటును ఆసరాగా చేసుకుని పీకలదాకా తాగిస్తాడు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాల సంచిని, డ బ్బుల్ని చోరీ చేసి ఉడాయిస్తాడు. ఈ రకమైన చోరీలు చేసిన నిజామాబాద్కు చెందిన అబ్దుల్లాపురం చిన్నారెడ్డిని మార్కెట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జంటనగరాల్లోని జ్యువెలరీ షాప్ల నుంచి కొనుగోలు చేసిన 2.3 కిలోల బంగారు ఆభరణాలను తీసుకొస్తున్న తన డ్రైవర్ ప్రశాంత్కు పీకలదాకా మద్యం తాగించి ఓ వ్యక్తి తస్కరించుకుని పోయాడని వరంగల్కు చెందిన నగల వ్యాపారి బొల్లామ్ సంపత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మార్కెట్ పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించారు. ఈ కేసు వివరాలను నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శనివారం విలేకర్లకు వెల్లడించారు. సీసీటీవీ ఆధారంగా... బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలిని సందర్శించిన విచారణ బృందం ఆయా మార్గాల్లోని కమ్యూనిటీ సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాలను సేకరించింది. నిందితుడిని గుర్తించిన పోలీసులు... జనగామ్, వరంగల్, అచ్చంపేట, తిరుపతి, ఆర్మూర్, నిజామాబాద్కు బృందాలను పంపించారు. చివరకు నిజామాబాద్ జిల్లాలోని ముబారక్నగర్లోని లక్ష్మీప్రియానగర్ నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టుకున్నాయి. నిందితుడి నుంచి మార్కెట్ ఠాణాలో చోరీకి గురైన 2.4 కిలోల బంగారం, తులం రింగ్, గోపాలపురం ఠాణా పరిధిలో దొంగలించిన 10 తులాల బంగారం, సెల్ఫోన్తో పాటు కరీంనగర్ గోదావరిఖనిలో చోరీ చేసిన 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలో నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్లలో 13 చోరీలు చేసినట్టు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. నార్త్జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి పర్యవేక్షణలో ఏసీపీ తిరుపతి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేసిన బృంద సభ్యులందరినీ రివార్డులతో సీపీ సన్మానించారు. -
ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డే దొంగ..
లక్కిరెడ్డిపల్లె : వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఎస్బిఐ ఏటీఎం సెంటర్ దగ్గర బంగారు నగల చోరీకి పాల్పడింది... అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డేనని తేలింది. ఎస్బీఐ స్థానిక శాఖ వద్ద గార్డ్గా పనిచేస్తున్న శ్రీరాములు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బ్యాంకు ఏటీఎం సెంటర్కు వెళ్లాడు. వాహనాన్ని నిలిపి లోపలికి వెళ్లి నగదు డ్రా చేసుకుని వచ్చాడు. ఈలోగా ఏటీఎం సెంటర్ బయట సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథ్.. శ్రీరాములు ద్విచక్రవాహనంలో ఉంచిన 30 తులాల బంగారు ఆభరణాల బ్యాగును కొట్టేశాడు. నగల బ్యాగు కనిపించకపోవడంతో కంగారుపడ్డ శ్రీరాములు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడింది సెక్యూరిటీ గార్డ్ విశ్వనాథ్గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. -
మహిళను తాళ్లతో కట్టేసి చోరీ..
ఏలూరు (పశ్చిమ గోదావరి) : ఒంటరిగా ఉన్న మహిళను తాళ్లతో నిర్బంధించి నగలు, నగదు దోచుకున్న ఘటన ఏలూరు మండలం వెంకటాపురంలో శనివారం చోటుచేసుకుంది. ఆళ్ల నాని కాలనీలో నివాసం ఉంటున్న మహిళను దుండగులు తాళ్లతో కట్టేసి 40 కాసుల బంగారు నగలు, 5 లక్షల రూపాయల నగదు చోరీ చేశారు. హేమలక్ష్మి(55) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. దొంగలు చొరబడి ఆమెను తాళ్లతో కట్టేసి ఇంట్లో ఉన్న నగలు, నగదు దోచుకున్నారు. సమాచారం అందుకున్న ఏలూరు సీఐ నాగమురళి, ఎస్ఐ కిషోర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జ్యుయెలరీ షాపులో భారీ చోరీ
-
జ్యుయెలరీ షాపులో భారీ చోరీ
రాజమహేంద్రవరం క్రైమ్ : జ్యుయెలరీ షాపులో బ్యాగుల్లో ఉంచిన వెండి వస్తువులు, నగదును చోరులు చాక చక్యంగా కొట్టేశారు. రాజమహేంద్రవరం పట్టణంలోని ఒన్టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో మెయిన్రోడ్డులోని సిద్ధి జ్యుయెలరీ షాపులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సయ్యర్ అన్నార్ అనే వ్యక్తి జ్యుయెలరీ షాపులకు వెండి ఆభరణాలు, వస్తువులను సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ సహాయకుడితో కలసి అన్వర్ శుక్రవారం రాత్రి సిద్ధి జ్యుయెలరీ షాపుకు వచ్చారు. రూ.40 వేల విలువైన వస్తువులను అందించారు. భోజనం కోసం రూ. 5 లక్షల నగదు, 2 కిలోల వెండి వస్తువులతో ఉన్న బ్యాగులను షాపులో పెట్టి బయటకు వెళ్లారు. అదే సమయంలో షాపులోకి వచ్చిన ఇద్దరు మహిళలు, ఓ యువకుడు ఆ బ్యాగులను కొట్టేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు షాపులోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
నగలు దొంగిలించిన బస్సు మెకానిక్ అరెస్ట్
మలక్పేట (హైదరాబాద్) : బస్సు ప్రయాణికుని బ్యాగులోని ఆభరణాలను అపహరించిన ఓ మోకానిక్ను మలక్పేట పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. డీఎస్పీ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన సయ్యద్ హఫీజుల్లాహ(39) నగరంలోని అత్తాపూర్లో నివాసం ఉంటూ కార్వాన్ మొగల్ఖాన్లో ధనుంజయ ట్రావెల్స్లో బస్సు మోకానిక్గా పనిచేస్తున్నాడు. ధనుంజయ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లింది. అక్కడ మరమ్మతులకు గురికావటంతో హఫీజుల్లాహను అక్కడికి పంపించారు. అతడు బస్సును రిపేర్ చేసి అదే బస్సులో తిరిగి హైదరాబాద్కు చేరుకున్నాడు. కాగా తిరుపతిలో హైదరాబాద్కు చెందిన రమేష్రెడ్డి ఆ బస్సు ఎక్కి తన బ్యాగును డ్రైవర్ వెనుక క్యాబిన్లో ఉంచాడు. అయితే, అక్కడే పడుకున్న మోకానిక్ హఫీజుల్లాహ ఆ బ్యాగులో ఉన్న 57 గ్రాముల బంగారు నగలు, 40 గ్రాముల వెండి పట్టీలను తస్కరించాడు. రమేష్రెడ్డి ఇంటికి చేరుకున్న తర్వాత బ్యాగులో నగలు కనిపించలేదు. ఈనెల 17వ తేదీన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం హఫీజుల్లాహ నుంచి నగలను స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. -
విజయవాడలో అతిలోక సుందరి
-
బంగారం... మరింత దిగొచ్చు: నిపుణులు
హైదరాబాద్: పుత్తడి మెరుపులు రానున్న నెలలో మసకబారతాయని నిపుణులంటున్నారు. బంగారం ధరలు వేర్వేరు కారణాల వల్ల ఇప్పుడున్న స్థాయిల నుంచి దిగొస్తాయని వారంటున్నారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ, డిమాండ్ పెరగలేదని, ఈ ఏడాది రెండో క్వార్టర్కు బంగారానికి ప్రపంచవ్యాప్తంగా ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని విశ్లేషకులంటున్నారు. ప్రపంచవ్యాప్త పోకడలకు అనుగుణంగానే ఈ ఏడాది సెప్టెంబర్లో మన దేశంలో బంగారం దిగుమతులు 52 శాతం తగ్గాయి. మరోవైపు ప్రపంచంలోనే రెందో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా బంగారంపై ఆసక్తిని తగ్గించుకుంటోంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను ఈ డిసెంబర్లోనే పెంచే అవకాశాలున్నాయనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ వడ్డీరేట్లు పెరిగితే బంగారం ధరలు మరింత పతనమవుతాయి. ఇక సాంకేతికంగా చూసినా, పుత్తడి ధరలకు కష్టకాలమేనని, దీర్ఘకాలిక చార్టులు పరంగా చూసినా ధరలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. రూపాయి బలపడడం కూడా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతోందని వారి అభిప్రాయం. 2 వారాల కనిష్టానికి పుత్తడి అంతర్జాతీయంగా పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం, రిటైలర్స్, జ్యువెల్లర్స్ నుంచి డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం వల్ల అక్టోబర్ 31తో ముగిసిన వారంలో బంగారం ధర రెండు వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యింది. అమెరికా ఫెడరల్ రిజర్వు డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లను పెంచుతుందనే ఊహగానాలు కూడా బంగారం ధర పతనానికి ఊతమిచ్చాయి. ముంబైలో అంతక్రితం వారంతో పోలిస్తే 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర వారాంతానికి వచ్చేసరికి రూ.280 పతనమై రూ.26,650కి తగ్గింది. ఒకేవారంలో ఇంత మొత్తం తగ్గుదల ఆగస్టు నెల తర్వాత ఇదే ప్రధమం. ముగిసిన వారంలో అంతర్జాతీయంగా బంగారం ధర 1.8 శాతం క్షీణించింది. -
జ్యువెలరీ షాపు యజమాని మృతి
హైదరాబాద్: దోపిడీ దొంగల దాడిలో గాయపడిన జ్యువెలరీ షాపు యజమాని మోహన్ ఆదివారం మృతిచెందాడు. ఈ నెల 2న దొంగలు మోహన్ నోట్లో యాసిడ్ పోసి అతని వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. గాయపడిన మోహన్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దురంతో ఎక్స్ప్రెస్లో ఆభరణాలు దోపిడీ
దురంతో ఎక్స్ప్రెస్లో ఓ ప్రయాణికుడి ఆభరణాలను దుండగులు దోచుకున్నారు. ప్రాథమిక సమచారం మేరకు... విశాఖ గీతం వర్సిటీలో మెడికల్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కేఎల్వీ రావు సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి దురంతో ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం బయల్దేరారు. మంగళవారం ఉదయం రైలు అనకాపల్లికి చేరుకున్న సమయంలో ప్రొఫెసర్ రావు తన బ్యాగు చూసుకోగా అందులోని బంగారు ఆభరణాల బాక్స్ కనిపించలేదు. దీంతో విశాఖలో రైలు దిగిన తర్వాత రావు ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 84 గ్రాముల బంగారు ఆభరణాలు ఉంచిన బాక్స్ చోరీ జరిగినట్టు పేర్కొన్నారు. -
రూ.10లక్షల విలువైన ఆభరణాలు చోరీ
ఖమ్మం (ఇల్లందు) : ఇల్లందు పట్టణం ఆమ్బజార్ వద్ద శ్యాంగోయల్ అనే రైస్ వ్యాపారి నుంచి ఆభరణాలను దొంగలు చాకచక్యంగా అపహరించారు. వివరాల్లోకి వెళ్తే .. ఆమ్బజార్కు చెందిన శ్యాంగోయల్ రైస్ వ్యాపారి. తన వద్ద నగలు తనఖా పెట్టుకుని డబ్బులు అప్పు ఇస్తూ ఉంటారు. తనఖా పెట్టుకున్న నగలను రోజూ సాయంత్రం ఇంటికి తీసుకెళ్లి మరుసటి రోజు షాపు వద్దకు తెస్తుంటాడు. ఇదే క్రమంలో ఆయనను గమనించిన దొంగలు.. సోమవారం షాపు తెరిచే సమయంలో తనతో పాటు తెచ్చిన నగల బ్యాగును గోయల్ కింద పెట్టగా .. అదే అదనుగా దొంగలు నగలు ఉన్న ఆ బ్యాగును ఎత్తుకెళ్లారు. అందులో రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళను కత్తులతో బెదిరించి దోపిడీ
కుషాయిగూడ: ముగ్గురు ఆగంతకులు పట్టపగలే దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన కుషాయిగూడ ఈశ్వరపురి కాలనీలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఇంటి ముందు ఎవరో వ్యక్తులు సంచరిస్తుండడంతో శైలజ అనే మహిళ తలుపు తెరచి చూసింది. అంతలోపే ముఖానికి గంతలు కట్టుకున్న ముగ్గురు వ్యక్తులు లోపలికి చొచ్చుకువచ్చి ఆమెను కత్తులతో చంపుతామని బెదిరించారు. లోపల బీరువాలో ఉన్న సుమారు 20 నుంచి 30 తులాల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
70 కాసుల బంగారం చోరీ
తూర్పుగోదావరి(రామచంద్రాపురం): రామచంద్రాపురంలోని దాక్షారామం రోడ్డులో గల ఓ ఇంట్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. పడాల వేణు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగినట్లు శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు. ఇంట్లో ఉన్న 70 కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వేణు సోదరుడు తెలిపాడు. వేణు పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం చూసి చుట్టు పక్కల ఉన్న బంధువులు ఆ సమాచారాన్ని పోలీసులకు, యజమాని వేణుకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు కొండతో స్పెషల్ చిట్ చాట్
-
బంగారం చోరీ ముఠా గుట్టు రట్టు
చిత్తూరు : చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాజుల మండెం 70 తులాల బంగారం చోరీ కేసు ఓ కొలిక్కి వచ్చింది. మంగళవారం రేణిగుంట పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించే క్రమంలో.. తీగ లాగితే డొంక కదిలినట్లు చోరీ వివరాలు బయటపడ్డాయి. దాంతో ఈ నెల 21వ తేదీ సాయంత్రం చోరీకి గురైన 70 తులాల బంగారు ఆభరణాలకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడైన బాదుషావలితోపాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గాజుల మండెం నక్కల కాలనీకి చెందిన బంగారు వ్యాపారి సరుకు తేవడానికి చెన్నై వెళ్లి వస్తాడనే విషయం తెలిసిన అదే షాపులో పనిచేస్తున్న బాదుషావలి ఎలాగైనా వాటిని కొట్టేయాలని పథకం వేశాడు. దీనికోసం పన్నెండు మందితో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. పథకం ప్రకారం వ్యాపారి ఉన్న ఆటోలో ఎక్కిన వీరు ఆటో డ్రైవర్ను చితకబాది వ్యాపారి వద్దనున్న నగలతో ఉడాయించారు. ఈ కేసు విషయమై నాలుగు రోజులుగా గాలింపు చేపడుతున్న పోలీసులు మంగళవారం కేసును ఛేదించారు. దొంగిలించిన బంగారాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. -
చేజ్ చేసి పట్టుకున్నాం...
బెస్ట్కేస్ అపాయంలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడినప్పుడు తన కళ్లలోని ఆనందం కంటే అతని తల్లి తెలిపే కృతజ్ఞత ఎలాంటివారి హృదయాన్నైనా కదిలిస్తుంది. 2004 లో విజయనగరం ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆ కేసు దర్యాప్తు సంగతి అలా ఉంచితే కన్నకొడుకుని ప్రాణాలతో ఆమెకు అప్పగించినపుడు ఆ తల్లికార్చిన ఆనందబాష్పాలు నా కళ్లను కూడా తడిపాయి. ఒకరోజు పొద్దున పదకొండు గంటలకు ఒరిస్సా పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. విజయనగరం -ఒరిస్సా సరిహద్దులో ఓ కిడ్నాప్ జరిగింది. కిడ్నాప్కి గురైంది ఒరిస్సాకి చెందిన ఓ నగలవ్యాపారి కుమారుడు. వయసు 22 ఉంటుంది. కిడ్నాపర్లు విజయనగరానికి చెందినవాళ్లు. బ్లాక్మెయిల్... ఒకపక్క వ్యాపారి కొడుకుని క్షేమంగా అప్పగించాలంటే మాకు పెద్దమొత్తంలో డబ్బు కావాలంటూ బ్లాక్మెయిల్ కాల్స్ వస్తున్నాయి. మరో పక్క మీ పరిధిలో జరిగిన సంఘటన దర్యాప్తు ముమ్మరం చేయండంటూ ఒరిస్సా పోలీసుల ఒత్తిడి. వ్యాపారి ఫొటో పంపించారు. అన్ని చెక్పోస్టులకు అనుమానితులను చెక్ చేయమంటూ మెసేజ్ పంపించాను. రోజు గడిచింది గానీ పాజిటివ్ మెసేజ్ రాలేదు. పసిబిడ్డ తండ్రి... కిడ్నాప్కి గురైన వ్యాపారికి ఏడాదిన్నరక్రితం పెళ్లయింది. మూడు నెలల పసి బిడ్డ ఉన్నాడు. బాధితుడు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. తల్లిదండ్రులు, భార్యా ఆవేదన గురించి చెబుతూ ఒరిస్సా పోలీసులు మమ్మల్ని చాలా టెన్షన్ పెడుతున్నారు. ఓ గుడిసెలో... మా గాలింపుల విషయం తెలుసుకున్న దుండగులు తప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒరిస్సా - విజయనగరం సరిహద్దులో హైవేకి ఆనుకుని ఉన్న వ్యవసాయ పొలంలోని గుడిసెలో దాక్కున్నట్టు సమాచారం అందింది. వెంటనే మా వాళ్లు మారువేషాల్లో దుండగులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఆ విషయాన్ని కూడా పసిగట్టిన దుండగులు అక్కడి నుంచి సుమోలో పారిపోయారు. ఎటువైపు వెళ్లారో తెలుసుకుని ఆ వైపు ఉన్న అన్ని చెక్పోస్టులకు వెహికల్స్ని స్ట్రిక్ట్గా చెక్ చేయమని చెప్పాను. హైవేలలో నిఘా పెట్టాం. 80 కిలోమీటర్లు.... దుండగుల వాహనాన్ని వెంబడిస్తూ దాదాపు ఎనైభై కిలోమీటర్ల దూరం మా టీమ్ వేట సాగింది. ‘రెండు రోజుల్లో మేం చెప్పిన చోటుకు అడిగిన సొమ్ము పంపించకపోతే అక్కడ మీ అబ్బాయి శవం దొరుకుతుంది’ అంటూ దుండగులు వ్యాపారి తండ్రికి చెప్పిన మాట నాకు పదే పదే గుర్తొస్తోంది. ఎట్టకేలకు వంద అడుగుల దూరంలో దుండగుల బండి ఉందనగా సుమోలో నుంచి ఒక దుండగుడు గన్ చూపించాడు. వెంటనే మా వాళ్లు బండి స్పీడు తగ్గించి నాకు ఫోన్ చేశారు. అంటే దానర్థం వెనక్కి వెళ్లిపొమ్మనా, వ్యాపారిని చంపేస్తారనా? అర్థంకాలేదు. వెంబడించాలా...వెనక్కి రావాలా? అంటూ మావాళ్లు నన్ను అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా నేను చెప్పిన సమాధానం... వెంబడించి దుండగుల్ని పట్టుకోమని. మావాళ్లు స్పీడు పెంచి దుండగుల బండిని ఓవర్టేక్ చేశారు. ఎలాంటి ఫైరింగ్ చేయకుండా వాళ్లను పట్టుకున్నారు. ఆ తల్లి కళ్లలో... సుమో వెనకసీట్లో ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్న వ్యాపారి సురక్షితంగా కనిపించడంతో మావాళ్ల ఆనందానికి అవధుల్లేవు. నేను వెళ్లి అతనికి షేక్హ్యాండ్ ఇచ్చినపుడు ‘బతుకుతాననుకోలేదు మేడమ్’ అంటూ చేతులు జోడించాడు. ఇంతలో అతని తల్లిదండ్రులు, భార్యాబిడ్డా అందరూ మా పోలీస్స్టేషన్కి చేరుకున్నారు. అప్పటికి అతను కిడ్నాప్కి గురయ్యి రెండురోజులైంది. ఆ రెండు రోజులూ కూడా తల్లిదండ్రులు, భార్య పచ్చి మంచినీళ్లు ముట్టలేదట. అందరూ ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ మొహాలతో ఉన్నారు. వ్యాపారి తల్లి నా చేతులు పట్టుకుని ‘నీ రుణం తీర్చుకోలేను తల్లీ....’ అంటూ ఒరిస్సా భాషలో తన పరిస్థితిని, సంతోషాన్ని పంచుకుంది. వ్యాపారి తన మూడు నెలల బిడ్డని చేతుల్లోకి తీసుకుని ముద్దాడాడు. ఏ భార్య అయినా ఏం చేస్తుంది? రెప్పార్పకుండా భర్తని కంటినిండా చూసుకుంది. ఇంతలో వెంట తెచ్చుకున్న ఆహారమేదో బిడ్డకు తినిపించిందా తల్లి. ప్రెజెంటేషన్: భువనేశ్వరి -
కాగితం నగషీ
మగువ అందానికి పొందికగా ఒదిగిపోతాయి ఈ నగలు. ఆ ఆభరణాలు ఎక్కువ డబ్బు ఖర్చు, బరువు లేకుండా... ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు అల్లాణి రాధిక. అదీ పర్యావరణహితంగా! ఖాళీ సమయాన్ని క్రియేటివ్గా మార్చుకుని పేపర్తో జ్యువెలరీ చేస్తున్నారు ఈమె. ‘పర్యావరణాన్ని కాపాడటమంటే సింపుల్గా ఉండటం కాదు. ఎకోఫ్రెండ్లీగా ఉంటూనే చక్కని అలంకరణతో అందంగా కనిపించవచ్చు. ఆసక్తి ఉంటే ఏ శిక్షణా అవసరం లేదు’ అంటున్న రాధిక... ఇంటర్నెట్ ముందు కూర్చునే ఈ పేపర్ ఆర్ట్ వర్క్ నేర్చుకున్నారు. దిల్సుఖ్నగర్లో ఉంటున్న ఈమె భర్త ప్రైవేటు ఉద్యోగి. కాలేజీ లైఫ్లో పిల్లలు బిజీ. ఇంట్లో పని అయిపోయాక ఖాళీగా ఉన్న రాధిక... ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచనతో నెట్టింట్లో సెర్చ్ మొదలు పెట్టారు. అప్పుడు తట్టిందే ఈ ఐడియా. నాలుగు నెలల్లోనే చేయి తిరిగిన ఆర్టిస్టుగా మారిపోయారు. ఫిల్లింగ్ పేపర్తో కమ్మలు, గొలుసుల వంటివి ఎంతో ఆకర్షణీయంగా, ముచ్చటగా రూపొందించారామె. చూడ్డానికి ఫ్యాన్సీ జ్యువెలరీలా ఉన్న ఈ ఐటెమ్స్ ఖరీదు కూడా తక్కువే. అన్నింటి కంటే ముఖ్యంగా పర్యావరణానికి హాని చేయని ప్రొడక్ట్స్. వీటన్నింటినీ లామకాన్లోని ‘ఆర్గానిక్ బజార్’లో ప్రదర్శనకు ఉంచారు ఆమె. వచ్చిన వారందరూ వీటిని అపురూపంగా చూస్తున్నారు. ‘మనమేం చేయగలమనే కంటే ఆలోచనను ఆసక్తి ఉన్న వైపు మళ్లిస్తే ఇలా పర్యావరణం కోసం అందరూ ఎంతో కొంత చేయవచ్చు’ అనేది రాధిక అభిప్రాయం. -
'నేను రెండు రకాలుగా అదృష్టవంతురాల్ని'
చెన్నై: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు నేటి తరం హీరోయిన్లు. ఓ వైపు హీరోయిన్గా రాణిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇపుడు వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అక్షయ తృతీయ సందర్భంగా డైమండ్ ఆభరణాల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు సోమవారం www.witengold.com అనే వెబ్సైట్ను ప్రారంభించింది. అభిమానుల కోసం, డైమండ్ చెవి రింగులు, ఉంగరాలు, పెండెంట్స్ లాంటివి తమన్నా స్వయంగా రూపొందించింది. నటిగా తనను ఎంతగానో అభిమానించిన ఫ్యాన్స్ కోసం డైమండ్ ఆభరణాలను డిజైన్ చేయడం సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. నటిగా తనను ఆదరించినట్టుగానే తన వ్యాపారాన్ని కూడా ఆదరించాలని తమన్నా అభిమానుల్ని కోరింది. తన తండ్రి ఎప్పటినుంచో బంగారు ఆభరణాల వ్యాపారంలో ఉన్నారనీ.. చిన్నప్పనుంచీ ఆయన గమనిస్తూ ఈ వృత్తి పట్ల ఆకర్షణ పెంచుకున్నట్లు తమన్నా తెలిపింది. బంగారు ఆభరణాల వ్యాపారంలోకి రావడం కలిసి వచ్చిన అదృష్టమని ఆమె పేర్కొంది . ఇష్టాన్ని వృత్తిగా ఎంచుకునే అవకాశాన్ని దక్కించుకుని, అక్కడ రాణించి... మరోరంగంలోకి టర్న్ అయిన వారు చాలా అదృష్టవంతులని తాను ఎపుడూ అనుకుంటానని తెలిపింది. అలాగే తాను రెండు రకాలుగా అదృష్టవంతురాలినని... మొదటిది నాకిష్టమైన నటన, ఇపుడు మళ్ళీ ఆభరణాల డిజైనింగ్ రూపంలో అదృష్టం నన్ను వరించిందంటూ తమన్నా మురిసిపోతోంది. అయితే సినిమాల్లో అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో .. అభిమానుల్లో ఉన్న క్రేజ్ను సొమ్ము చేసుకునేందుకేనని కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. -
కారులో వచ్చి...గుడుల్లో దొంగతనాలు..
శాలిగౌరారం(నల్లగొండ): నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని జలాశయం వద్ద ఉన్న మూడు ఆలయాల్లో చోరీలు జరిగాయి. దుండగులు దర్జాగా కారులో వచ్చి, పని ముగించుకుని వెళ్లారు. వివరాలివీ...ప్రాజెక్టు వద్ద శ్రీసీతారామచంద్రస్వామి, గౌరమ్మ, గంగ దేవమ్మ ఆలయాలున్నాయి. గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాళంవేసి ఉన్న దేవాలయాల ప్రధాన ద్వారాల బేడాలను విరగ్గొట్టి చోరీకి పాల్పడ్డారు. శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం ప్రధాన ద్వారానికి ఉన్న ఇనుప గ్రిల్స్ బేడాన్ని విరగగొట్టారు. విగ్రహానికి ఉన్న వెండి కళ్ళు, మీసాలు, కిరీటంలతో పాటు ఆభరణాలను దొంగిలించారు. సొత్తు విలువ రూ.30 వేలుంటుందని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, గౌరమ్మ, గంగ దేవమ్మ ఆలయాల్లో విగ్రహాల కళ్లు, కిరీటాలు, ఇతర ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ సొత్తు విలువ రూ.20 వేలుంటుందని నిర్వాహకులు తెలిపారు. అయితే, ఈ గుడుల వద్దకు కారు వచ్చిన ఆనవాళ్లున్నాయి. -
ఇద్దరు నగల దొంగల అరెస్ట్...
వరంగల్(కరీమాబాద్): సేమియాలో నిద్రగోలీలు కలిపి వృద్ధుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అపహరించిన ఇద్దరు దొంగలను శనివారం అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏఎస్సీ యాదయ్య తెలిపారు. ఈ నెల 12న రాత్రి 8 గంటలకు శివనగర్కు చెందిన దాసరి కొమరయ్య, కళావతిలకు చెందిన ఇంట్లో కిరాయికి ఉంటున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గంజి పద్మ(30), కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన బత్తుల బాబు(28)లు తమ పెళ్లి రోజని చెప్పి ఇంటి యజమానులైన కొంరయ్య, కళావతిలకు సేమియాలో నిద్రగోలీలు కలిపి అందించారు. వారు మత్తులోకి జారుకోగానే ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు, రెండుతులాల బంగారు గొలుసులు, తులం బంగారు మాటీలు, చెవిదిద్దులు, 20 తులాల వెండి పట్టగొలుసులతో పాటు పాటు టీవీ, డీవిడీ, సెల్ ఫోన్లు అపహరించారు. నిందితులు గంజిపద్మ, బత్తుల బాబు శనివారం సత్తెనపల్లికి వెళ్తుండగా ఖమ్మం ప్రధాన రహదారి గవిచర్ల క్రాస్ రోడ్లో పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ యాదయ్య వివరించారు. నిందితుల నుంచి రూ.1.20 లక్షల విలువైన వెండి, బంగారు నగలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు శ్రమపడ్డ మిల్స్కాలనీ సెకండ్ ఎస్సై రవీందర్తో పాటు పోలీస్ బృందాన్ని ఏఎస్పీ అభినందించి రివార్డు అందించారు. -
కల్లూరులో భారీ చోరి
ఖమ్మం : ఖమ్మం జిల్లా కల్లూరులోని కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో ఏకంగా ఐదు ఇళ్లలో భారీ చోరీలు జరిగాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సుమారు రూ. 20 లక్షల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. మొత్తం ఐదు ఇళ్లల్లో చొరబడిన దొంగలు బంగారంతో పాటు, నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని చోరీలు జరిగిన ఇళ్లను పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. (కల్లూరు) -
జువారిలో భారీ చోరీ
ఎర్రగుంట్ల మండల పరిధిలోని జువారి కర్మాగారంలోని కాలనీలో గురువారం రాత్రి ఏకంగా ఏడు ఇళ్లల్లో భారీ చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్గా చేసిన దొంగలు భారీ మొత్తంలో బంగారు, వెండిని అపహరించారు. కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ సుధాకర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎర్రగుంట్ల: మండల పరిధిలోని జువారి కర్మాగారంలోని కాలనీలో గురువారం రాత్రి ఏకంగా ఏడు ఇళ్లల్లో భారీ చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్గా చేసిన దొంగలు బంగారు, వెండి భారీ మొత్తలంలో అపరించారు. కాలనీలో డీబ్లాక్లోని 9/2, 10/2, 5/3, 8/3 గదులలో, ఈ బ్లాక్లోని 8/1, 10/2, 13/3 క్వార్టర్సులలోని గదులలో ఈ చోరీలు జరిగాయి. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన చోరీల మాదిరిగానే జువారిలో జరిగిందని పోలీసులు అధికారుల అభిప్రాయ పడుతున్నారు. లబోదిబోమంటున్న బాధితులు.. డీబ్లాక్లోని 8/3 గదిలో నివాసమంటున్న గంగాకృష్ణ గురువారం రాత్రి ప్రొద్దుటూరుకు పోయాడు.శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టబడి ఉంది. ఇంట్లోకి పోయి చూడగా సుమారు 40 తులాల బంగారు పోయిందని వాపోయాడు. తమ ఇంట్లో సుమారు 45 తులాల బంగారు పోయిందం టూ ఉమామహేశ్వరరెడ్డి లబోదిబోమంటున్నాడు. అలాగే తమ ఇంట్లో రూ.1.50లక్షలు విలువ గల బంగారు పోయిందని ఫణికుమార్ తెలిపాడు. సెక్యూరిటీల నివాసం వద్ద ఆగిన డాగ్ స్వ్కాడ్.. చోరీల సంఘటన స్థలం తెలుసుకోవడానికి కడప నుంచి ప్రత్యేక డాన్ అనే డాగ్ స్క్వాడ్ను పిలిపించారు. ఈ డాగ్ను మొదట లింగారెడ్డి ఇంట్లో జరిగిన స్థలంలోని కొన్ని వస్తువుల వాసన చూసింది. తర్వాత నేరుగా కాలనీలో కొన్ని ప్రాంతాలు తిరిగి కాలనీ చివర ఉన్న సెక్యురిటీల నివాసం వద్దకు పోయి గదిలో ఓ సెక్యురిటీ పడుకోని ఉన్న పరుపును చూసింది. అనంతరం ఉమామహేశ్వర రెడ్డి ఇంట్లో వస్తువులు వాసన చూసి నేరుగా డీబ్లాక్లోని క్వార్టర్స్లోనూ చూసింది. రెండోసారి కూడా డాగ్ స్క్వాడ్ సెక్యురిటీ నివాసం వద్దకు పోయి ఆగింది. కాగా భారీ సెక్యురిటీ కలిగిన కాలనీలోని క్వార్టర్స్లో చోరీలు జరగడం ఇదే తొలిసారి. పరిశీలించిన డీఎస్పీలు: కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ సుధాకర్లు, సీఐ పీటీ కేశవరెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డిలు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. చోరీ జరిగిన తీరును సీఐను అడిగి తెలుసుకున్నారు. ఇంటి తలుపులును ఏవిధంగా పగులగొట్టారో పరిశీలించారు. ప్రొద్దుటూరులో జరిగిన విధంగానే ఇక్కడ కూడా జరిగింది డీఎస్పీ నాగేశ్వరరెడ్డి అన్నారు. ఇది అనుభవం గల దొంగల పని అని అన్నారు. అన్ని కోణాలలో పరిశీలిస్తామని చెప్పారు. చోరీల జరిగిన సమీపంలోని బయట గడ్డి పొదలలో ఒక డైరీ కన్పించింది. దీనిని కూడా పరిశీలించారు. తర్వాత కడప నుంచి వచ్చిన క్లూస్టీం సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి 7 ఇళ్లల్లో వేలిముద్రలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సంజీవరెడ్డి అన్నారు. 80 తులాలు బంగారు, రెండు కిలోల వెండి అపహరణ ఎర్రగుంట్ల: జువారి కాలనీలో ఏడు ఇండ్లల్లో జరిగిన చోరీలో సుమారు 80 తులాల బంగారుతో పాటు 2 కిలోల వెండి అభరణాలు పోయినట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. ఎలాంటి నగదు పోలేదని అన్నారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రొద్దుటూరులో భారీ చోరీ
కడప: ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదును చూసి దొంగలు రెచ్చిపోయారు. అనారొగ్యంతో ఆస్పత్రికి తీసుకెళ్లి వచ్చేవరకు .. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు మాయం చేశారు. ఈ సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిథిలోని శ్రీరామయంపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గణచారీ సురేష్ మెడికల్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య అనారోగ్యం పాలవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఎవరు లేరని తెలుసుకున్నదుండగులు మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, కిలోన్నర వెండి దోచుకెళ్లారు. బుధవారం ఇంటికి వచ్చే సరికి వస్తువులన్నీ చిందర వందరగా ఉండటంతో సురేష్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (ప్రొద్దుటూరు) -
20 లక్షల బంగారం చోరీ
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు రెచ్చిపోయారు. బుధవారం రాత్రి రూ. 20 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన విజయవాడకు సమీపంలోని పెనమలూరు మండలం పోరంకి గ్రామపంచాయతి పరిధిలోని నారాయణపురం కాలనీలో జరిగింది. ఈ కాలనీలోని పెందుర్తి వరప్రసాద్ మూడు రోజుల క్రితం బ్యాంక్ పనిమీద ఊరికెళ్లారు. ఇంట్లో వరూ లేని సమయంలో దొంగలు ప్రసాద్ మేనల్లుడి పెళ్లికోసం తెచ్చిన 20 కాసుల బంగారంతో పాటు ఇంట్లో ఉన్న 50 కాసుల బంగారం, 12 కిలోల వెండి తోపాటు 90 వేల రూపాయల నగదు దోచేశారు. గురువారం ఉదయం పనిమనిషి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో యజమనికి సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తూర్పు డివిజన్ ఏసీపీ మహేశ్వర్ రాజు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి గురైన సొమ్ము సుమారు 20 లక్షలు ఉంటుందని పోలీసులకు తెలిపారు. -
ఉమెన్స్ హాస్టల్లో నగల దోపిడీ
టీనగర్: తిరువాన్మియూరులోని ఉమెన్స్ హాస్టల్లో ముగ్గురు మహిళల వద్ద నగల దోపిడీ జరిగింది. మత్తుమందు కలిపిన విబూది ఇచ్చి గుర్తు తెలియని యువతి తన చేతివాటం ప్రదర్శించింది. హాస్టల్ వాచ్మన్ సహా నలుగురు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరువాన్మియూరు 16వ తూర్పు వీధిలో వర్కిం గ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది. ఇక్కడ అనేక మంది మహిళలు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం సుమారు 20 ఏళ్ల యువతి ఒకరు హాస్టల్కు వచ్చారు. తన పేరు కాం చన అని, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం నిమిత్తం చెన్నైకు వచ్చినట్లు, ఇక్కడ తన కెవ్వరూ తెలియదంటూ పరిచయం చేసుకుంది. బస చేసేందుకు వీలు కల్పించాలని కోరింది. దీంతో నిర్వాహకురాలు యువతికి ఆశ్రయమిచ్చింది. అక్కడి మహిళలందరితో పరిచయం పెంచుకుంది. శనివారం సాయంత్రం ఆలయానికి వెళ్లి వస్తానని చెప్పి కాంచన రాత్రి తొమ్మిది గంటలకు హాస్టల్కు చేరుకుంది.అక్కడి వాచ్మెన్కు ఉడకబెట్టిన గుగ్గిళ్లు ఇచ్చింది. తర్వాత లోపలికి వెళ్లి గదిలో ఉన్న మహిళలు వలర్మతి, సోనా, శరణ్యలకు విబూది ఇచ్చి తినమంది. దీంతో మహిళలు ముగ్గురు విబూది కలిపిన నీటిని సేవించారు. దీంతో వారందరూ స్పృహ తప్పారు. వారు ధరించిన నగలను తీసుకుని ఉడారుుంచింది. అపస్మారక స్థితిలో ఉన్న మహిళలను, వాచ్మన్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. తిరువాన్మియూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో ఎనిమిది సవర్ల నగలు దోపిడీకి గురైనట్లు తెలిసింది. -
45 తులాల బంగారం పైనే ఎత్తుకెళ్లారు..
పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని నాగోలు: కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోని నగలు చోరీ చేసి.. ఆపై నిప్పుపెట్టిన ఘటనలో 45 తులాలకు పైనే బంగారం చోరీ అయినట్టు తేలింది. అబూదాబీ నుంచి ఆదివారం ఉదయం నగరానికి వచ్చిన ఇంటి యజమాని గొట్టేటి గంగయ్య ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం... ఎల్బీనగర్ నవోదయకాలనీకి చెందిన జి.గంగయ్య, సరళ భార్యాభర్తలు. గంగయ్య అబూదాబీలో కెమికల్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన పెద్ద కుమారుడు రఘువీర్ పాలెం బస్సు ప్రమాదంలో చనిపోయాడు. అమెరికాలో ఉంటున్న మరో కుమారుడు, కుమార్తె వద్దకు గంగయ్య భార్య గత సెప్టెంబర్లో వెళ్లింది. ఈ క్రమంలో ఆమె కొంత బంగారాన్ని లాకర్లో పెట్టి.. మిగతా 45 తులాల బంగారాన్ని ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించిన బీరువాలో భద్రపరిచి అమెరికా వెళ్లింది. ఇంటి బాధ్యతలను సమీపంలో ఉండే నల్లగొండ జిల్లా చందుభట్లకు చెందిన ఎల్లయ్యకు అప్పగించారు. ఇదే ఇంట్లో సరళ సోదరి గంగ కొన్ని రోజులు ఉండి టెట్ పరీక్షకు సిద్ధమై వెళ్లిపోయింది. శనివారం తెల్లవారుజామున గంగయ్య ఇంట్లో నుంచి పొగ రావడంతో స్థానికులు గమనించి ఫైరింజిన్, ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎల్లయ్య వచ్చి తాళం తీసి చూడగా ఇంట్లోని బీరువా పగులగొ ట్టి ఉంది. ఇంట్లోని చీరలు, కంప్యూటర్, ఏసీ, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతై ఉన్నాయి. ఈ విషయాన్ని అబుదాబీలో ఉండే గంగయ్యకు సమాచారం అందించాడు. ఆదివారం ఇంటికి చేరుకున్న గంగయ్య బీరువాలో దాచిన 45 తులాల బంగారు నగలు, మూడు ల్యాప్టాప్లు, అర కేజీ వెండి, మూడు కెమెరాలు చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఇంత పెద్ద చోరీ జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కాకినాడలో భారీ చోరీ
ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదును చూసి దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలోని కాకినాడ పబ్లిక్స్కూల్కు ఎదురుగా ఉన్న పొన్నపల్లి రుక్మిణీరావు ఇంట్లో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. రూ.3.5లక్షల నగదుతో పాటు 20 తులాల బంగారం, రెండున్నర కిలోల వెండి దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వస్తువులన్ని చిందర వందరగా ఉండటంతో రుక్మిణీరావు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక్కడే అమ్మాడటా!
పెద్దపల్లి : ఓ కానిస్టేబుల్ ఆయన భార్య టీచర్.. జ్యూవెల్లర్ దుకాణానికి వెళ్లి బంగారం విక్రయించారు. వచ్చిన డబ్బులు కుటుంబ అవసరాలకు వాడుకున్నాడు. ఆ కానిస్టేబులే దొంగ అవతారం ఎత్తాడని పోలీసు అధికారులకు తెలిసింది. కానీ.. చివరికి అది దొంగ బంగారంగా తేలడంతో షాపు యజమాని నుంచి బంగారం రికవరీ చేశారే తప్ప సదరు కానిస్టేబుల్ నుంచి డబ్బులిప్పించలేదు. మంచిర్యాలకు చెందిన ఓ యువకుని వద్ద గోదావరిఖని వ్యాపారి రెండు తులాల బంగారం కొనుగోలు చేశాడు. దొంగ బంగారంగా తేలడంతో మంచిర్యాల పోలీసులు బంగారం రికవరీ చేసుకున్నారు. ఇదే కేసులో బెల్లంపల్లి పోలీసులు సైతం అదే దుకాణానికి వెళ్లి బంగారం రికవరీ చేసుకెళ్లారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దొంగ చెప్పాడు, మీరూ అడగండి ‘ఇక్కడే అమ్మాడంట’ అదే విషయం చెబుతాడు. దొంగ చెప్పిన సాక్ష్యానికి పోలీసులు తీర్పునిస్తూ స్వర్ణకారులను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రోజు జిల్లాలో ఏదో ఒకమూలకు.. ఒక షాపులో జరుగుతున్నవే. దొంగతనం జరిగిన కొద్దిరోజులకు పోలీసులు ఓ ఇద్దరు యువ కులను పట్టుకొని షాపులవెంట తిరగడం సర్వసాధారణమైపోయింది. జిల్లాలో దాదాపు 30 వేల స్వర్ణకార కుటుంబాలు ఉండగా, 20 వేల కుటుంబాలు ఇదే వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్నాయి. పోలీసుల దెబ్బలకు వృత్తి మారింది.. తెలంగాణప్రాంతంలో చేస్తున్న పనినిబట్టి కులాన్ని దాదాపు అంచనా వేయొచ్చు. అందులో స్వర్ణకారవృత్తి చేస్తున్నవారిలో 95 శాతం మంది అదే కులస్తులు ఉంటుంటారు. ఇక్కడ కట్టెలు కొడుతూ కనిపిస్తున్న యువకుని పేరు కట్టా నర్సింహచారి. ఆయన తండ్రి బ్రహ్మయ్యచారిని 20 ఏళ్లక్రితం మంచిర్యాల పోలీసులు దొంగబంగారం కొనుగోలు చేశాడనే నెపంతో పట్టుకెళ్లి హింసించారు. అప్పుడే ఆయన తన పనిమాని వడ్రంగి వృత్తిని చేపట్టాడు. తనకొడుకులు ఇదే కులవృత్తిలో ఉంటే పోలీసుల నుంచి బాధలు తప్పవనే భయంతో కులవృత్తిని సైతం నేర్పించలేదు. దీంతో బ్ర హ్మయ్య పెద్దకొడుకు ఇక్క డే ప ట్టణంలో క ట్టెల వ్యా పారంచేసుకుంటున్నా డు.తనకుతాను స్వర్ణకారుడు అని చెప్పుకునేవారకు నర్సింహచారి కులం ఎవరికి అర్థంకాదు. దానివెనుక ఉన్న తన తండ్రి కథను చెబుతుంటాడు. నర్సింహచారిలాగే వృత్తి మారిన స్వర్ణకారులు జిల్లాలో చాలామంది ఉన్నారు. దొంగ దొరికితే.. సీసీఎస్ పోలీసులకు బంగారమే దొంగలు పట్టుబడితే వస్తువుకోల్పోయిన యజమానులకంటే పోలీసులకే పంట పండుతుంది. దొరికిన దొంగలను వెంట వేసుకొని సదరు చోరీ సంఘటనకు పాల్పడిన వారి ఇళ్లను గాలించి, సొమ్మును నగదును రికవరీ చేసుకున్న తర్వాత ఇక స్వర్ణకారుల జ్యూవెల్లర్ షాపులపై పడతారు. ముందే దొంగకు బంగారం విక్రయించిన పద్ధతిని, తాము అడిగితే జవాబు ఇచ్చే విధానం నే ర్పుతారు. అలా పోలీసుల ఆధీనంలో ఉన్న నిందితులు పోలీసులు నేర్పిన పద్ధతుల్లోనే జవాబు ఇస్తారు. అవును.. నీకే బంగారం అమ్మేశాను కదా, నీవు డబ్బులు కూడా ఇచ్చావ్. అవి జల్సాల కోసం ఖర్చు చేసుకున్నా అంతే. ఇంతకంటే ఎక్కువనాకు తెలియదు. ఇదీ పోలీస్స్టేషన్లో దొంగలు చెప్పే జవాబులు. లాండ్ఆర్డర్ పోలీసులకంటే సీసీఎస్ పోలీసులు ఇంకాస్త భిన్నంగా వ్యవహరిస్తారు. ఒక్కో దొంగతనం కేసులో నాలుగైదుచోట్ల రికవరీ చేసిన సందర్భాలూ ఉన్నాయని పలువురు స్వర్ణకారులు తెలిపారు. అయితే ఇదే మిటని ప్రశ్నించే అవకాశం లేకపోవడంతో సీసీఎస్ పోలీసులకు ఎదురే ఉండదు. లాండ్ఆర్డర్ పోలీసులు స్థానిక పరిస్థితులను దష్టిలో ఉంచుకొని స్వర్ణకారులతో మర్యాదగా ప్రవర్తిస్తుంటారు. దొంగలను విచారించే సమయంలో కూడా స్థానికంగాఉండే స్వర్ణకారులతో ఉండే సంబంధాలను దష్టిలో ఉంచుకొని రికవరీలో కాస్త మెతక వైఖరిని చూపుతుంటారు. కానీ సీసీఎస్ పోలీసులు మాత్రం దొంగ దొరికాడంటే ఇక తమ పంట పండింది అన్న రీతిలో వ్యవహరిస్తుంటారు. దొంగ ఇచ్చిన సమాచారంతో జ్యూవెల్లర్ దుకాణయజమానికి అదుపులోకితీసుకొని బేరసారాలు చేస్తుంటారు. చివరికి ఎంతోకొంత బంగారం ముట్టజెప్పనిది సీసీఎస్ గేటుదాటి బయటికి వచ్చే పరిస్థితే ఉండదు. -
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విస్తరణ
15 రోజుల్లో 5 కొత్త షోరూమ్లు హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ రిటైల్ చెయిన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ 15 రోజుల్లో ఐదు కొత్త షోరూమ్లను ప్రారంభిస్తోంది. 123వ షోరూమ్ను కడపలో ఏర్పాటు చేస్తున్నామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షోరూమ్ను ఈ నెల 21న(ఆదివారం) ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ ప్రారంభిస్తారని, ఈ షోరూమ్లో బంగారు, వజ్ర, వెండి ఆభరణాలతో పాటు ప్లాటినమ్ ఆభరణాలను కూడా విక్రయిస్తామని పేర్కొంది. తమ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫెస్టివల్లో వినియోగదారులు 50 కేజీల వరకూ బంగారాన్ని గెల్చుకోవచ్చని తెలిపింది. వచ్చే నెల 31 వరకూ ఈ ఆఫర్ ఉంటుందని, తమ అవుట్లెట్లలో రూ.30,000 కొనుగోలు చేసిన వారికి స్క్రాచ్ అండ్ విన్ కూపన్ ఇస్తామని, బంగారు నాణాన్ని కచ్చితంగా గెల్చుకునే అవకాశం ఉంటుందని వివరించింది. వీక్లీ డ్రాలు జరుగుతాయని, విజేతలు బహుమతులుగా బంగారు కడ్డీలు గెల్చుకోవచ్చని పేర్కొంది. బంపర్ డ్రాలో విజేతకు కిలో బంగారం బహుమతిగా ఇస్తామని వివరించింది. ఇక విస్తరణలో భాగంగా తమ 122వ షోరూమ్ను దుబాయ్లో ఏర్పాటు చేస్తున్నామని, దీనిని తమ బ్రాండ్ అంబాసిడర్ కరీనా కపూర్ నేడు(శనివారం) ప్రారంభిస్తారని పేర్కొంది. ఇది దుబాయ్లోనే అతి పెద్ద షోరూమ్ అని తెలిపింది. ఈ నెల 24న రియాద్లో 124వ షోరూమ్ను, ఈ నెల 26న సింగపూర్లో 125వ షోరూమ్ను, వచ్చే నెల 3న 126వ షోరూమ్ను గుల్బర్గాలో ఏర్పాటు చేస్తామని మలబార్ గోల్డ్ అండ్ ైడైమండ్స్ పేర్కొంది. -
ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు
బంగారు ఆభరణాలపై అతివలకే కాదు...పురుషులకూ మోజు పెరుగుతోంది. నగలు ధరించి ధగధగలాడి పోవాలనుకుంటున్న పురుష పుంగవులు పెరుగుతున్నారు. మన సాంప్రదాయాన్ని తీసుకుంటే వేద,ఇతిహాన కాలాల్లో కూడా స్త్రీ, పురుషులు వారి వారి హోదాను, అభిరుచిని బట్టి ఆభరణాలు ధరించేవారు. కాలక్రమేణా పురుషులు ఆభరణాలు ధరించటం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ టేస్టు మారుతోంది. మెడలో సింపుల్గా చైన్తో కాకుండా... ఒంటి నిండా బంగారం దిగేసుకుని మరీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన పంకజ్ పరాఖ్ అనే వ్యాపారి అలా ఇలా కాదు...ఏకంగా బంగారం పూతతో ఉన్న చొక్కాను ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఆ బంగారు చొక్కా బరువు నాలుగు కిలోలు. ముంబై సమీపంలోని యోలా వీధిలో ఇతగాడు పసిడి చొక్కాతో పాటు ఒంటిపై మూడు కిలోల నగలు ధరించి మహిళలకు పోటీ ఇవ్వటం విశేషం. తాజాగా మధ్యప్రదేశ్లోని రత్లా పట్టణానికి చెందిన మహేశ్ సోనీ చేతినిండా ఉంగరాలు.. ధగధగ మెరిసే బంగారు బ్రెస్లెట్తో ఉంగరాల బంగార్రాజుగా గుర్తింపు పొందారు. బంగారం వ్యాపారం చేసే మహేశ్ తన చేతివేళ్లు అన్నింటికీ కలిపి ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు. నవరత్నాలు, వజ్రాలు పొదిగిన ఈ ఉంగరాలతో పాటు ఒక పెద్ద బ్రేస్లెట్, బంగారు గొలుసును ఆయన గత పుష్కరకాలంగా ధరిస్తూ వస్తున్నారు. వాటి ఖరీదు అక్షరాల కోటి రూపాయలు. -
జ్యూటిఫుల్
హ్యాండ్ బ్యాగ్లు మొదలుకొని ఇయర్ రింగ్స్ వరకూ ప్రతిదీ కళాఖండమే. ఆకర్షించే అందమే. ఖైరతాబాద్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్లో బుధవారం ప్రారంభమైన ‘జ్యూట్ డెకరేటివ్ ప్రొడక్ట్స్’ ఎగ్జిబిషన్లో జనపనారతో రూపొందించిన కళాకృతులు, ఆభరణాలు అబ్బురపరుస్తున్నాయి. పర్యావరణానికి హాని కలిగించని ఈ ఉత్పత్తుల్లో ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు, డిజైనింగ్ బ్యాగ్లు, ఫుట్వేర్, ఫ్యాబ్రిక్స్, డోర్ మ్యాట్స్ వంటివెన్నో వెరైటీలున్నాయి. రాష్ట్రంతో పాటు పశ్చిమ బెంగాల్, యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ల్లో తయారు చేసిన జ్యూట్ ఉత్పత్తులు మనసు దోచుకుంటున్నాయి. ధరలు రూ.10 నుంచి రూ.1,600 వరకు ఉన్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్, నేషనల్ జ్యూట్ బోర్డ్ మార్కెటింగ్ ప్రమోషన్ ఆఫీసర్ నర్సింహులు ఇక్కడి స్టాల్స్లోని ఉత్పత్తులను పరిశీలించారు. ఈ నెల 22 వరకు ప్రదర్శన కొనసాగుతుంది. -
కుర్రకారును ఉర్రూతలూగించే సమంత !!
-
చందన బ్రదర్స్ చోరీ కేసు చేధించిన పోలీసులు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి చందనబ్రదర్స్ దొంగతనం కేసును పోలీసులు గురువారం చేధించారు. ఆ కేసుకు సంబంధించిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మరికాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ అర్థరాత్రి ... చందన బ్రదర్స్ షాపులోకి దొంగలు ప్రవేశించి భారీగా బంగారం, రూ. 15 లక్షల నగదు అపహరించుకుని పోయారు. దాంతో చందనా బ్రదర్స్ యాజమాన్యం కూకట్పల్లి పోలీసులకు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో నిందితులను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. -
రుద్రమదేవి నగలు చెన్నైకి?
రుద్రమదేవి చిత్రంలో ఆ పాత్ర పోషించిన అనుష్క ధరించిన కోట్లాది రూపాయల బంగారు నగలు చెన్నైకి చేరాయా? ఇలాంటి సందేహం రావడంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లో కెళితే...నటి అనుష్క నటిస్తున్న భారీ చరిత్రాత్మక కథా చిత్రం రుద్రమదేవి. తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క కాకతీయ రాజ్యపు పట్టపురాణిగా శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ఐదుకోట్ల విలువైన బంగారు నగలను ధరించి నటిస్తున్నారు. ఈ నగలను చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రముఖ నగల దుకాణంలో కొనుగోలు చేశారు. ఈ ఖరీదైన బంగారు నగలు అనూహ్యంగా దొంగతనానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర దర్శక నిర్మాత హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు తీవ్రం చేశారు. పోయిన నగలను చెన్నైలో కొనుగోలు చేసి విమానం ద్వారా హైదరాబాదుకు తీసుకెళ్లారు. కాబట్టి పోలీసులు హైదరాబాదు విమానాశ్రయంలో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చెన్నై నుంచి హైదరాబాదుకు నగలను తీసుకొస్తుండగా వెనుక సందేహించదగ్గ వారెవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. శనివారం హైదరాబాదు పోలీసులు చెన్నైకి వచ్చారు. చెన్నై విమానాశ్రయంలో గల కేంద్ర పోలీసు భద్రతాదళం సాయంతో నగలు తీసుకెళ్లిన రోజు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అనుమానించదగ్గ సన్నివేశాలను సీడీలలో లోడ్ చేసుకుని వెళ్లారు. దీంతో రుద్రమదేవి నగలు చెన్నైకి చేరాయా? అన్న సందేహం కలుగుతోంది. -
పసిడిపై ఆంక్షలు సడలిస్తేనే మంచిది
న్యూఢిల్లీ: అక్రమ రవాణాకు దారితీస్తున్న పసిడి దిగుమతులపై ఆంక్షలను సడలిస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వ్యక్తం చేశారు. బంగారంపై 10 శాతం ఉన్న దిగుమతుల సుంకం దేశీయ రత్నాలు, ఆభరణాల పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళనల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘వాణిజ్య మంత్రిగా బంగారంపై ఆంక్షలు తొలగాలనే నేను కోరుకుంటాను. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుండడమే దీనికి కారణం’ అని ఒక వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా దాదాపు 15 శాతం ఉన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశం మొత్తం ఎగుమతుల విలువ ఆ యేడాది 312 బిలియన్లుకాగా, ఇందులో రత్నాలు, ఆభరణాల రంగం వాటా 39.5 బిలియన్ డాలర్లని అన్నారు. పరిశ్రమకే కాకుండా, అక్రమ రవాణా పెరగడానికి సైతం ఆంక్షలు దారితీస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నింటినీ ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పరిశీలనకు తీసుకువెళుతున్నట్లు వెల్లడించారు. ఆంక్షల వల్ల కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడి లక్ష్యం నెరవేరుతున్నప్పటికీ, ఈ మెటల్ అక్రమ రవాణా పెరిగి ఆందోళనకరమైన పాతరోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. -
చందన బ్రదర్స్లో నగల చోరీ
400 గ్రాముల బంగారం, రూ.15 లక్షలు అపహరణ హైదరాబాద్: కూకట్పల్లి చందనబ్రదర్స్లో నగలు, నగదు దోచుకెళ్లారు. పక్కా పథకం ప్రకారమే ఈ దోపిడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. సుమారు 400 గ్రాముల బంగారం, రూ.15 లక్షల నగదు అపహరించుకుపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పక్క భవనం నుంచి నిచ్చెన సాయంతో టైపైకి చేరి అక్కడి నుంచి షాపింగ్మాల్లోకి వెళ్లే ఇనుపడోర్ను తొలగించి లోనికి ప్రవేశించారు. సైబరాబాద్ క్రైం అడిషనల్ డీసీపీ జానకీషర్మిల, కూకట్పల్లి ఏసీపీ సాయిమనోహర్ లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజు మాదిరిగానే గురువారం సిబ్బంది షాపింగ్మాల్ను తెరిచి లాకర్ రూంలోకి వెళ్లి చూడగా ఆ రూంలో 400 గ్రాముల నగలు ఉన్న బాక్స్తో పాటు 15 లక్షల నగదు కన్పించలేదు. దీంతో కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనంపై ప్రధానంగా ఉద్యోగులపైనే అనుమానాలు వస్తుండడంతో పోలీసులు ..వేలిముద్రల నిపుణులను రప్పించి ఆధారాలను ఫోరెనెక్స్ ల్యాబ్కు పంపించారు. షాపింగ్మాల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. షార్ట్ సర్య్కూట్ అవుతుందనే భయంతో రాత్రి కెమెరాలను ఆఫ్ చేస్తామని యజమానులు తెలిపారు. దీంతో దొంగలను గుర్తించడానికి ఆనవాలు లేకుండా పోయాయి. సీసీ కెమెరాలను ఆఫ్ చేస్తారన్న విషయాన్ని తెలుసుకుని పథకం ప్రకారం షాపింగ్మాల్లోని ఉద్యోగుల సహకారంతోనే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ధగధగలాడే నగలు.. నిగనిగలాడే భామలు
ధగధగలాడే నగలతో నిగనిగలాడే భామలు బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో సందడి చేశారు. జ్యువెల్స్ ఆఫ్ ఏషియా ప్రదర్శన శుక్రవారం ఇక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినీ తారలు మీనాక్షి దీక్షిత్, నేహాలుల్లా, మిసెస్ ప్లానెట్ మెహక్ మూర్తి ప్రత్యేకంగా రూపొందించిన నగలు ధరించి వేదికపై కనువిందు చేశారు. ఆభరణాల ప్రదర్శనలో దేశంలోనే అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందిన ‘క్రివిష్ విజన్’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆదివారం వరకు ప్రదర్శన ఉంటుంది. అలాగే ఆర్టీసీ క్రాస్రోడ్సలో నూతనంగా ఏర్పాటు చేసిన తబలా రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో కూడా మీనాక్షిదీక్షిత్ తళుక్కుమంది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నటుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. - ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
బంజారా మేళా
సరికొత్త వస్త్రాభరణ శ్రేణులు నగరవాసులకు కనువిందు చేస్తున్నాయి. రంగురంగుల చీరలు... వెరైటీ నగలు మగువ మనసు దోస్తున్నాయి. రామ్కోఠి కచ్చిభవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘బంజారా మేళా’లో ఇలాంటివెన్నో ఆకర్షణీయంగా ఉన్నాయి. శనివారం కూడా కొనసాగే ఈ మేళాలో వీటితోపాటు గృహోపరకరణ వస్తువులు, యాక్ససరీస్ కొలువుదీరాయి. అందాల తార ఇషికాసింగ్ (హృదయ కాలేయం) ప్రత్యేక ఆకర్షణ. ఈ సందర్భంగా ఇిషిక ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. ‘నాన్వెజ్ ఫుడ్ ముట్టను. ఓ ప్రాణిని చంపి తినడం నాకు ఇష్టం ఉండదు. మా ఫ్యామిలీ అంతా పక్కా శాకాహారులు. మాది రాజస్థాన్. అమ్మానాన్న ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. ఇక్కడే కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ చదివా. ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. మోడలింగ్పై ఆసక్తి. హృదయ కాలేయం సినిమాలో అవకాశం వచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా. ఇప్పుడు మహేశ్ కత్తి దర్శకత్వంలో పెసరట్టు సినిమాలో చాన్స్ వచ్చింది. తమిళంలో పెరుమాన్, పంజాబ్లో సెహద్, ఇంగ్లిష్లో వెయిటింగ్ ఇన్ వెల్డర్నెస్ మూవీస్ చేశా’ అంటూ చెప్పుకొచ్చింది ఇషిక. - వాంకె శ్రీనివాస్ -
రుద్రమదేవి నగల మాయంపై వీడని మిస్టరీ ?
రుద్రమదేవి చిత్రం షూటింగ్లో నగలు మాయంపై లభించని క్లూ? దొంగ ఎవరు? అసలు బంగారం ఎంత..? పోలీసులకు సవాల్గా మారిన దర్యాప్తు సాక్షి, సిటీబ్యూరో: రుద్రమదేవి సినిమా షూటింగ్లో నగలు మాయంపై మిస్టరీ వీడలేదు. కిలోన్నర బంగారు ఆభరణాలు పోయాయని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్గోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు రోజులవుతున్నా క్లూ లభించలేదు. పోయిన నగల్లో అసలు బంగారం ఎంత? రోల్డ్గోల్డ్ ఎంత అన్న విషయం సరఫరా చేసిన వారికే తెలియదనడం కొత్త అనుమానాలకు తెరలేపింది. అంత విలువైన నగలకు సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంచారు? వ్యానులో ఉన్న నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. పోయిన నగల్లో అత్యంత విలువైన రాళ్లు పొదిగినవి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్గా రుద్రమదేవి సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో పాత్రకు తగ్గట్టుగా అనుష్క ధరించే నగలను చెన్నైలోని ఆంజనేయ శెట్టి అండ్ సన్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. షూటింగ్ జరిగే రోజు సంస్థ సిబ్బంది చెన్నై నుంచి నగలను తీసుకు వస్తున్నారు. షూటింగ్ ముగిసిన వెంటనే వాటిని తిరిగి తీసుకువెళ్లిపోతున్నారు. ఇలా ఆరు షెడ్యూల్స్లో జరిగింది. ఈ నెల 19వ తేదీన గోపన్పల్లెలోని రామానాయుడుకు చెందిన స్థలంలో చిత్రం ఏడవ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. అదే రోజు ఉదయం 8 గంటలకు చెన్నై నుంచి విమానంలో రెండు ప్లాస్టింగ్ బాక్స్లున్న బ్యాగ్లో నగలను ఆ కంపెనీకి చెందిన ఉద్యోగి ఎస్. రవిసుబ్రమణ్యం షూటింగ్ స్పాట్కు తీసుకువచ్చాడు. ఈ బ్యాగ్ను ఏసీ మేకప్వ్యాన్ డ్రైవర్ సీటు వెనకాల పెట్టి సమీపంలో విశ్రాంతి తీసుకున్నాడు. భోజన విరామం తరువాత అనుష్కకు నగలు ధరింపజేసేందుకు బ్యాగ్ తెరిచారు. అందులో ఉన్న నగలు ఉన్న రెండు ప్లాస్టిక్ బాక్స్లు కనిపించలేదు. దీంతో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్గోపాల్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలు మాయమయ్యాయని, వాటిలో వడ్డాణం, చెవి కమ్మలు (రెండు జతలు), గాజులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తేలని బంగారం లెక్క.. పోయిన నగల్లో అసలు బంగారం ఎంత ఉంది. రోల్డ్గోల్డ్ ఎంత అనేది తెలియరాలేదు. నగలు పంపిన సంస్థకు చెందిన మార్కెటింగ్ అధికారి సుజిత్ను పోలీసులు సోమవారం విచారించారు. ఆయన కూడా సరిగ్గా సమాధానం చెప్పలేక పోయారు. దీంతో ముంబయి నుంచి జ్యువెలరీ ఎగ్జిబిషన్లో ఉన్న బద్రీని పోలీసులు పిలిపిస్తున్నారు. నగలు వాడుతున్న వారికి, పంపిన వారికి వివరాలు తెలియదనడం గమనార్హం. ఈ కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్గా మారింది. దొంగ ఎవరు... నగలు ఎవరు దొంగలించారనేది ప్రశ్నార్థకంగా మారింది. నగల బ్యాగ్ను వ్యాన్లో పెట్టిన రవి కాపలా ఉండకుండా ఎక్కడికి వెళ్లాడనేది అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు దృష్టి సారించారు. న గలు మాయమైన రోజు రవితో పాటు చెన్నై నుంచి ఎవరైనా వచ్చారా? అన్న విషయాన్ని నిర్ధారించుకుంనేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో పుటేజ్లను పరిశీలించనున్నారు. అసలు ఆ బ్యాగ్లో నగలు ఉన్న విషయం రవికి మాత్రమే తెలుసు. ఆ నగలను ఇంకా షూటింగ్ నిర్వాహకులకు అందించలేదు. అప్పటికే అవి మాయం కావడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. షూటింగ్లో అసలు బంగారం వాడరని పోలీసులు అంటుండగా తమ కంపెనీ పబ్లిసిటీ కోసం వాటిని నిజమైన బంగారంతో నగలను డిజైన్ చేశామని నగల కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిసారి షూటింగ్ ఉన్న సమయంలో విమనాంలో తేవడం తిరిగి విమానంలో తీసుకెళ్లడం జరిగిందంటే అవి నిజమైనే బంగారు నగలేననే అనుమానాలు కలుగుతున్నాయి. నగల్లో విలువైన రాళ్లు ఉన్నాయని సమాచారం. -
రుద్రమదేవి నగల కేసు ముమ్మర దర్యాప్తు
హైదరాబాద్ : 'రాణి రుద్రమదేవి' సినిమా షూటింగ్లో మాయమైన నగల కేసు దర్యాప్తును గచ్చిబౌలి పోలీసులు ముమ్మరం చేశారు. కిలోన్నర నగలు మాయమయ్యాయని ఆ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంగోపాల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నగలు అద్దెకు ఇచ్చిన చెన్నైకి చెందిన నాదెళ్ల ఆంజనేయశెట్టి కంపెనీ ప్రతినిధి రవి సుబ్రహ్మణ్యంతో పాటు మరొకరిని విచారిస్తున్నారు. శనివారం షూటింగ్కు హాజరైన యూనిట్ సభ్యులతో పాటు ఇతరులను విచారిస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు. రుద్రమదేవిగా నటిస్తున్న అనుష్క రెండు మూడు రోజులుగా ఈ నగలు ధరించి షూటింగ్లో పాల్గొన్నారు. పోలీసులు నగల వీడియో క్లిప్పింగ్స్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. -
'రుద్రమదేవి' షూటింగ్లో నగల చోరీ
-
'రుద్రమదేవి' అనుష్క నగలు చోరీ
హైదరాబాద్: 'రుద్రమదేవి' షూటింగ్లో చోరీ జరిగింది. ఈ చిత్రంలో అనుష్క ధరించే కిలోన్నర బంగారు ఆభరణాలు అపహరించారు. నానక్రామ్ గూడాలో షూటింగ్ జరుగుతుండగా ఈ చోరీ జరిగింది. యూనిట్ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టైటిల్ రోల్ అనుష్క పోషిస్తోంది. ఈ సినిమా కోసం 'రుద్రమదేవి' పాత్రదారి అనుష్క ధరించేందుకు ఒరిజినల్ నగలనే వాడుతున్నారు. ఆ ఆభరణాలు మాయమయ్యాయి. -
వెరైటీ మేళా
జ్యువెలరీ నుంచి హ్యాండీక్రాఫ్ట్స్ వరకు.. యాక్సెసరీస్ నుంచి కిడ్స్వేర్ వరకు.. అన్నీ ఒకేచోట కొలువుదీరారుు. వూదాపూర్ హైటెక్స్లో శుక్రవారం పేజ్ త్రీప్రవుుఖురాలు పింకిరెడ్డి ప్రారంభించిన ‘దీప్మేళా’లో ఫ్యాషన్ ప్రియుులకు కావల్సిన విభిన్న వస్త్రాభరణాలు, గృహాలంకరణ వస్తువులు అందుబాటులో ఉన్నారుు. కోల్కతా, మధ్యప్రదేశ్, ముంబై, బెంగళూర్, చెన్నై తదితర నగరాల నుంచే కాక చైనా, పాకిస్థాన్, ఇటలీ దేశాల ఉత్పత్తులు కూడా ఉన్నారుు. ప్రత్యేకించి డిజైనర్ టాప్స్, డ్రెస్సులు, చీరలు, గిఫ్ట్ ఆర్టికల్స్, స్కూల్ పిల్లలు తయారు చేసిన పేపర్ బ్యాగ్స్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆదివారం వరకు జరగనున్న ఈ మేళాలో ఫుడ్స్, ఐస్క్రీమ్స్, ఫాస్ట్ఫుడ్ వెరైటీస్ నోరూరిస్తున్నారుు. పాప్ గాయని స్మిత, సిటీ ప్రముఖురాలు అంజుపోద్దార్, అర్పిత తదితరులు మేళాను సందర్శించారు. - శిరీష చల్లపల్లి ఫొటోలు: రాజేష్రెడ్డి సింఫనీ ఆఫ్ లైఫ్ ‘సమస్త మేఘాలతో అనేక రంగుల్లో ఆకాశం వర్షించిన ఆనందమూ-విషాదమూ శ్రమజీవి జీవితం’ అనే రవీంద్రనాథ్ టాగోర్ కవితా పాదానికి కమనీయ దృశ్యరూపం ఈ చిత్రం. టి.ఎ.అబ్రహాం 1955లో బ్లాక్ అండ్ వైట్లో రూపొందించిన ఈ పది నిమిషాల డాక్యుమెంటరీ దేశంలోని వివిధ ప్రాంతాలకు.. వివిధ వృత్తులకు చెందిన స్త్రీ-పురుషుల శ్రమజీవనాన్ని దృశ్య కావ్యంగా మలచింది. ప్రముఖ మ్యుజీషియన్ విష్ణుదాస్ షిరాలి సంగీతం సమకూర్చారు. కేన్స్ పోటీ విభాగంలో సింఫనీ ఆఫ్ లైఫ్ ప్రదర్శితమైంది. 1920ల్లో మూకీ సినిమాల్లో నటించిన విఖ్యాత హిందీ దర్శకుడు శాంతారామ్ ఫిలిమ్స్ డివిజన్ చీఫ్ ప్రొడ్యూసర్ హోదాలో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం! చార్: ది నో మ్యాన్స్ ఐలాండ్ సౌరవ్ సారంగి దర్శకత్వంలో ఫిలిమ్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఇండియా-ఇటలీ దేశాలు 2012లో సంయుక్తంగా ఈ చిత్రం రూపొందించాయి. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పేదల జీవితానికి చిత్రం అద్దం పడుతుంది. 14 ఏళ్ల రూబెల్ గంగా నదిని దాటి భారత్ నుంచి బంగ్లాదేశ్కు బియ్యం స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఒకసారి నదిలో వరద తగ్గిన తరువాత ‘చార్’ అనే ద్వీపం ఏర్పడుతుంది. ‘చార్ ఎవరికీ చెందని స్థలం’ కాబట్టి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాపలా కాస్తుంది. చార్లో చిక్కుకుపోయిన రూబెల్ కుటుంబం.. వర్షంలో ఇండియాకు తప్పించుకు వచ్చేందుకు ప్రయత్నిస్తారు. ప్రకృతి వైవిధ్యాన్ని సారంగి వేర్వేరు కెమెరాలతో స్వయంగా చిత్రీకరించారు. ఈ చిత్రానికి బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో విమర్శకుల ప్రశంసలు లభించాయి! - పున్నా కృష్ణమూర్తి -
'నేను గోషామహల్ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా..'
హైదరాబాద్ : ఎమ్మెల్యే పేరుతో నగల వ్యాపారిని రూ.లక్ష డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టర్ సి.అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం...సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన ముండ్రాయి కృష్ణ(42) జల్సాలకు అలవాటుపడ్డాడు. సులభంగా డబ్బు సంపాదిం చేందుకు అక్రమమార్గం బాట పట్టాడు. ఈ క్రమంలోనే సిద్దిఅంబర్బజార్లోని రాము జ్యువెలర్స్ యజమాని రామచంద్రయ్య అలియాస్ రాముకు గురువారం రాత్రి 8.45కి ముండ్రాయి కృష్ణ ఫోన్ చేసి.. ‘‘నేను గోషామహల్ ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా.. పబ్లిక్ మీటింగ్ నిర్వహించాల్సి ఉంది. మీటింగ్ ఖర్చు కోసం లక్ష రూపాయలు కావాలి’...అని డిమాండ్ చేశాడు. కొద్ది నిమిషాలకే మళ్లీ జ్యువెలరీ యజమానికి ఫోన్ చేసి.. ‘నేను ఎమ్మెల్యే పీఏని మాట్లాడుతున్నా.. మీటింగ్ కోసం శుక్రవారంలోగా రూ. లక్ష ఇవ్వాలి. లేకపోతే ఎమ్మెల్యే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది’ అని బెదిరించాడు. ఎమ్మెల్యేది అని చెప్పి 8686183811 ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఫోన్ చేసిన వ్యక్తిపై అనుమానం కలిగిన జ్యువెలర్స్ యజమాని శుక్రవారం ఉ దయం అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీ సులు ఫోన్ నెంబర్ ఆధారంగా నింది తుడు ముండ్రాయి కృష్ణను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై గతంలో మొగల్పుర, షాయినాయత్గంజ్, ముషీరాబాద్, నాంపల్లి పోలీస్స్టేషన్లలో డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడిన కేసులు నమోదైనట్టు ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు. -
శ్రీనిధి కొల్లగొట్టారు
మండ్యలో గజ దొంగల హల్చల్ జ్యువెలరీ దుకాణానికి కన్నం కోటి విలువైన నగలు చోరీ మండ్య, న్యూస్లైన్ : కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న రీతిలో గజ దొంగలు చెలరేగిపోయారు. ఓ జ్యువెలరీ దుకాణానికి కన్నం వేసి కోటి విలువైన నగలు దోచుకెళ్లారు. ఈ ఘటన గురువారం రాత్రి మండ్య పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..మంగళూరుకు చెందిన జగన్నాథ్ శెటి మండ్య నగరసభ సమీపంలో పత్తి సిటీ కో ఆపరేటివ్ బ్యాంకు వెనుక శ్రీనిధి జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి దుండగులు కో ఆపరేటివ్ దుకాణంపైకి ఎక్కి తాడు సహాయంతో శ్రీ నిధి దుకాణం వెనుక ఉన్న సందులోకి దిగి గోడకు కన్నం వేసి లోపలకు చొరబడి సీసీ కెమారాలు తొలగించారు. షోకేస్లో ఉన్న నగలతోపాటు గ్యాస్ సిలిండర్ సహయంతో లాకర్ తెరచి అందులో ఉన్న సుమారు రూ. కోటి విలువైన బంగారు నగలు చోరీ చేసి ఉడాయించారు. శుక్రవారం ఉదయం యజమాని వచ్చి తాళం తీసి చూడగా చోరీ ఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ భూషణ్ జీబోరసే, అదనపు ఎస్పీ పుట్టమాదయ్య, డివైఎస్పీ శోభరాణి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రూ. కోటి విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. సెక్యూరిటీ గార్డును విచారించగా రాత్రి సమయంలో తాను దుకానం ముందు కాపలా ఉన్నానని, ఎలాంటి శబ్ధం రాలేదని పేర్కొన్నాడు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో అందులో ఎలాంటి వివరాలు నమోదు కాలేదని నిర్ధారించారు.దుండగులు వదలి వెళ్లిన గ్యాస్ కట్టర్, సిలిండర్, బ్యాగు, బెడ్షీట్ను స్వాధీనం చేసుకున్నారు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
హారాల కోసమే హత్య
పక్షం రోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లాలో కారులో శవమై కనిపించిన నగల వ్యా పారి హత్య కేసులో మిస్టరీని హుమాయున్నగర్ పోలీసులు ఛేదించారు. అతని వద్ద పనిచేస్తున్న ఇద్దరు కమీషన్ ఏజెంట్లు రూ.30 లక్షల విలువైన ముత్యాల హారాలను దోచుకునేందు కు ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చారు. పశ్చిమ మండలం డీసీపీ వి.సత్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్ర కారం...హుమాయున్నగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్మోయిన్ (35) ముంబై నుంచి బంగా రం, ముత్యాల హారాలను తీసుకొచ్చి నగరం లో విక్రయిస్తుంటాడు. ఇతని వద్ద మసాబ్ట్యాంక్కు చెంది న మహ్మద్ ఇర్ఫాన్ (22), సోమాజిగూడకు చెందిన సయ్యద్ జునైద్ అలీ (21)లు ఐదు నెలలుగా కమీషన్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. నగలను అమ్మిపెట్టే క్రమంలో ఇర్ఫాన్, జునైద్లు మోయిన్కు రూ.1.80 లక్షలు బాకీ పడ్డారు. ఈ డబ్బును చెల్లించాలని మోయిన్ ఒత్తిడి చేస్తుండటంతో అతడ్ని హత్య చేయాలని ఇర్ఫాన్, జునైద్లు పథకం వేశారు. నగలు ఖరీ దు చేసేందుకు ఓ వినియోగదారుడు తమ వద్ద ఉన్నాడని, నగలు తీసుకుని బంజారాహిల్స్ రోడ్డు నెం.12లోని ఓ అపార్ట్మెంట్కు రావాల ని గతనెల 25న మోయిన్ను పిలిచారు. మ ద్యాహ్నం 2.45కి మోయిన్ రూ.30 లక్షల విలువైన ముత్యాల హారాలను తీసుకుని ఇర్ఫాన్, జునైద్లు ఉన్న అపార్ట్మెంట్కు వెళ్లాడు. మోయిన్ చేతిలో ఉన్న ముత్యాల హారాలను జునైద్ లాక్కోగా... ముఖంపై ఇర్ఫాన్ దుప్పటి కప్పి, సుత్తెతో తలపై మోది హత్య చేశాడు. అదే రోజు రాత్రి హతుడు మోయిన్ కారులోనే శవాన్ని మహబూనగర్ జిల్లా రాయికల్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపైకి తరలించారు. శవంతో పాటు కారును అక్కడే వదిలి, బస్సులో నగరానికి చేరుకున్నారు. మరుసటి రోజు మహబూబ్నగర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేశారు. అప్పటికే కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మోయిన్ అదృశ్యమైనట్టు హుమాయున్నగర్ ఠాణాలో కేసు నమోదైంది. రాయకల్ గ్రామం వద్ద కారులో లభించిన శవం మోయిన్దేనని హుమాయున్నగర్ డీఐ జి.రాజు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. కారు ప్రయాణం చేసిన టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాల మేరకు ఇర్ఫాన్, జు నైద్లను అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేశామని వెల్లడించారు. వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడంతో మోయిన్ వద్ద కమీషన్ ఏజెంట్గా చేరామని, అయితే, ఆ శించినట్టు డబ్బు రాకపోవడంతో ఏకంగా మొత్తం నగలనే కాజేసేందుకు హత్య చేశామని అంగీకరించారు. విలేకరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ రామచంద్రన్ ఏసీపీ డి.శ్రీనివాస్, సీఐ ఎస్.రవీందర్ పాల్గొన్నారు. -
పెప్పర్ స్ప్రే చల్లి.. రూ.10 లక్షల ఆభరణాల చోరీ
తిరువూరు, న్యూస్లైన్: పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు అగంతకులు మహిళ కంట్లో పెప్పర్ స్ప్రే చల్లి రూ.10 లక్షల విలువైన ఆభరణాలు దోచుకున్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తిరువూరులోని కూరగాయల మార్కెట్ పక్కన నివసిస్తున్న వ్యాపారి రాయల ప్రభాకరరావు ఇంట్లోకి ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు యువకులు ప్రవేశించి ఆయన భార్య శకుంతలను మంచినీళ్లు అడిగారు. నీరిచ్చేలోపు ఆ ఇద్దరూ తమతో తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను ఆమె కళ్లల్లో చల్లి అరవకుండా నోట్లో దుస్తులు కుక్కారు. ఇంట్లోని బీరువాలో దాచిన బంగారు ఆభరణాలను అపహరించి క్షణాల్లో పరారయ్యారు. స్ప్రే ప్రభావంతో శకుంతలకు ఊపిరాడని పరిస్థితితో పాటు ముక్కునుంచి రక్తస్రావమైంది. ఈ ఘటనపై ప్రభాకరరావు ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన పోలీసులు మచిలీపట్నం నుంచి క్లూస్ టీంను రప్పించి నిందితుల ఆచూకీ కోసం గాలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ముత్తూట్ ఫైనాన్స్ లో2.25 కోట్లు చోరీ!
7 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.13 లక్షల నగదు అపహరణ మెదక్ జిల్లా జహీరాబాద్లో ఘటన.. హైదరాబాద్లో చిక్కిన దొంగ సాక్షి, హైదరాబాద్, జహీరాబాద్: రాజధానిలోని తనిష్క్ జ్యువెలరీలో జరిగిన భారీ దొంగతనం తరహాలో... మెదక్ జిల్లా జహీరాబాద్లోని ముత్తూట్ ఫైనాన్స్లో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఏకంగా దాదాపు ఏడు కిలోల బంగారంతో పాటు.. రూ. 13 లక్షల నగదు అపహరణకు గురైంది. కానీ, నిందితుడు హైదరాబాద్లో నాటకీయంగా పట్టుబడ్డాడు. మెటల్ డిటెక్టర్ భయంతో.. ‘దొంగ’ సొత్తును వదిలేసి పారిపోబోయాడు. సినిమాల్లో ఛేజింగ్ సీన్ల తరహాలో పోలీసులను పరుగులు పెట్టించి.. చివరికి చేతికి చిక్కాడు. నిందితుడిని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అశోక్ శర్మగా గుర్తించారు. అతని వద్ద బ్యాగ్లో ఉన్న దాదాపు ఏడు కేజీల బంగారం, సూట్కేసులోని రూ. 13.42 లక్షల నగదు.. మొత్తంగా రూ. 2.25 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, దినసరి కూలీ అయిన తనను పశ్చిమబెంగాల్కు చెందిన లేబర్ కాంట్రాక్టర్ కమ్రూ అక్కడికి తీసుకువచ్చాడని అశోక్ చెప్పాడు. కమ్రూ సోమవారం ఉదయం 8.30కు నాంపల్లి రైల్వేస్టేషన్కు రమ్మన్నాడని.. వెళ్లాక తనకు ఆ బ్యాగ్, సూట్కేస్ ఇచ్చి ఎంజీబీఎస్కు రావాలని, తాను అక్కడ కలుస్తానని చెప్పడంతో వచ్చానని వెల్లడించాడు. మరో ముగ్గురు కూడా..: నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్ టికెట్ కూడా ఉంది. దాని ప్రకారం దర్యాప్తు చేసిన అఫ్జల్గంజ్ పోలీసులు... శుక్రవారం ఎంజీబీఎస్ నుంచి అశోక్ శర్మతో పాటు విశాల్, వినోద్ అనే వ్యక్తులు కలిసి జహీరాబాద్కు వెళ్లినట్లు తేలింది. దీంతో కమ్రూ, విశాల్, వినోద్ కూడా ఈ చోరీలో పాలు పంచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కమ్రూ, విశాల్, వినోద్ల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. చోరీ చేసిందిలా: గుర్తు తెలియని దుండగులు ముత్తూట్ ఫైనాన్స్ ప్రాంగణం వెనుక తలుపు తెరిచి లోనికి చొరబడ్డారు. సీసీ కెమెరాల కనెక్షన్లు కత్తిరించారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్, కట్టర్ల సహాయంతో స్ట్రాంగ్ రూమ్ను తెరిచి.. బంగారు ఆభరణాలు, నగదును అపహరించుకుపోయారు. దొరికిందిలా..: హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది మెటల్ డిటెక్టర్లతో ప్రయాణికులను, లగేజీని పరిశీలిస్తుండగా.. ఒక బ్యాగు, సూట్కేసు పట్టుకుని వచ్చిన వ్యక్తి వాటిని వదిలి పారిపోవడం మొదలుపెట్టాడు.. బస్స్టాండ్ ఆవరణ నుంచి బయటకు పరుగెత్తి ఆటో ఎక్కేశాడు.. ఇది గమనించిన పోలీసులు మరో ఆటోలో వెంబడించి పట్టుకున్నారు. అనుమానితుడు వదిలేసిన బ్యాగులో.. 499 చిన్న కవర్లలో ప్యాక్ చేసి ఉన్న బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. వాటిపై జహీరాబాద్లోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ముద్ర, స్టిక్కర్లను గమనించి సమాచారం ఇవ్వగా.. భారీ చోరీ విషయం వెల్లడైంది. -
రూ.కోటి విలువ చేసే నగల చోరీ
టీ.నగర్, న్యూస్లైన్:నగల దుకాణం గోడకు కన్నం వేసి రూ.కోటి విలువచేసే నగలు చోరీ చేశారు. ఈ సంఘటన పెరంబూరు పేపర్మిల్స్ రోడ్డులో చోటుచేసుకుంది. చెన్నై పెరంబూరు పేపర్ మిల్స్ రోడ్డుకు చెందిన సంతోష్ (49). రాజస్థాన్కు చెందిన ఈయన అదే రోడ్డులో సంతోష్ జ్యువెలరీ నగల దుకాణం నడుపుతున్నాడు. సోమవారం రాత్రి దుకాణానికి తాళం వేసి సంతోష్, సిబ్బంది ఇళ్లకు వెళ్లారు. మంగళవారం దుకాణానికి సెలవు. దీంతో సంతోష్ బయట ఊరికి వెళ్లారు. బుధవారం ఉదయం దుకాణం తెరిచేందుకు సంతోష్ తమ్ముడు రాజేష్ వెళ్లాడు. దుకాణ ం తెరచి లోనికి వెళ్లి చూడగా షోరూంలోని నగలన్నీ చోరీకి గురైనట్లు గుర్తించి దిగ్భ్రాంతి చెందాడు. దుకాణం వెనుకవున్న గోడకు కన్నం వేసిన దుండగులు లోనికి ప్రవేశించి నగలను చోరీ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 400 సవర్లకు పైగా నగలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ.కోటి ఉంటుందని బాధితుడు తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ జరిపారు. పోలీసు జాగిలాలను రప్పించారు. వేలిముద్రల నిపుణులు దుకాణంలో లభ్యమైన ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వింటర్లో వైబ్రెంట్గా
చలిని తట్టుకోవడానికి స్వెటర్స్, శాలువా, స్కార్ఫ్ వంటివి వాడటం మామూలే! మరి కాస్తంత స్టైల్గా ఉండాలంటే ఏం చేయాలి?! చలికాలంలో బ్రైట్కలర్ దుస్తులు ధరిస్తే లుక్ బాగుంటుంది. ఫ్లోరల్ ప్ల్రింట్స్, ఎక్కువ లేయర్స్ ఉండేలా ఓవర్ కోట్స్, హెవీకాలర్స్, లాంగ్ కోట్స్, ఫ్యాబ్రిక్ డిజైన్స్ హెవీగా ఉన్నవి వాడితే బాగుంటుంది. నీ లెంగ్త్, లాంగ్ లెంగ్త్ బ్లేజర్స్ ధరిస్తే స్టైలిష్గా కనిపిస్తారు పాదాలను కవర్ చేసేలా షూస్, కొన్ని నీ లెంగ్స్, యాంకిల్ లెంగ్స్, మిడ్ లెగ్ లెంగ్త్ షూస్, బూట్లు ధరిస్తే చలికి తట్టుకోవచ్చు. స్టైల్గానూ ఉంటారు. ఈ కాలం ఏ లోహమైనా చర్మానికి పెద్దగా హాని కలిగించదు. అందుకని ఏ మెటల్స్తో తయారైన ఆభరణాలైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. మెటల్ జ్యూయలరీ ఏదైనా కాంతిమంతంగా ఉన్నవి ఎంచుకుంటే బాగుంటాయి. బ్యాగ్స్కు ఉపయోగించే ఏ మెటీరియల్ అయినా ఈ కాలం సౌకర్యవంతంగా ఉంటుంది. పెద్ద పెద్ద లెదర్ బ్యాగ్స్, ఎక్కువ డిజైన్ ఉన్నవి బాగుంటాయి. మేకప్ కూడా డార్క్ కలర్ లిపిస్టిక్స్, మంచి షిమ్మర్స్, ఐ షేడ్స్ నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. -
‘బుట్ట’బొమ్మలు
నాటి తరం అమ్మమ్మల కాలం నుంచి నేటి తరం అమ్మాయిల వరకు ఆల్టైమ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా ‘జూకాలు (బుట్టలు)’ ఛాన్స్ కొట్టేస్తాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ‘బుట్ట’ల సింగారం ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా నిలుస్తూనే ఉంది. వేడుక చిన్నదైనా పెద్దదైనా బుట్టబొమ్మల్లాంటి మగువల లుక్నే మార్చేసే ఘనత ‘బుట్ట’లకు ఉంది. ఆధునికం: సిల్క్ ప్యాంట్ పైకి ఎంబ్రాయిడరీ కోర్సెట్ వేసుకొని, చెవులకు పెద్ద పెద్ద బంగారు బుట్టలు ధరిస్తే చాలు అటు పెళ్లిలోనూ, ఇటు కాక్టెయిల్ పార్టీలోనూ అదుర్స్ అనిపిస్తారు. ఈ స్టైల్ కాస్త మోడ్రన్ కాస్త ట్రెడిషనల్గా ఉంటుంది. కాబట్టి రెండు విధాల మేలు. పెద్ద బుట్టలు పాశ్చాత్య దుస్తులను మరింత అందంగా చూపిస్తాయి. అయితే సంప్రదాయ తరహా బుట్టల్లోనే విభిన్నమైన షేప్స్ను ఎంచుకోవాలి. యాంటిక్ లుక్ ఉన్న బుట్టాలు మీ ఆభరణాల లిస్ట్లో ఉన్నాయంటే ఏ డ్రెస్ మీదకైనా సూపర్బ్ జ్యూయలరీగా అమరిపోతాయి. భిన్నత్వం: జూకాలు సంప్రదాయతను చాటుతాయి. అందుకని వేషధారణలో ఎంత భిన్నత్వం చూపిస్తే అంత ఆధునికంగా కనిపించవచ్చు. మీనాకారి జూకాలైతే ఏ కలర్ డ్రెస్ అయినా ధరించవచ్చు. తెల్లని డ్రెస్ ధరిస్తే: పెద్ద బంగారు బుట్టలను ధరించాలి. అయితే మెడలో మరేలాంటి ఆభరణం ధరించకపోవడం ఉత్తమం. మేకప్ కూడా చాలా తక్కువగా ఉండాలి. సిల్వర్ జూకాలు: క్యాజువల్ డ్రెస్సులు ఏవి ధరించినా వాటి మీదకు సిల్వర్ బుట్టలు చక్కగా నప్పుతాయి. -
రాంచీలో రూ. 12.25 కోట్ల బంగారు నగల దోపిడీ
జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ నగల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. 12.25 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలో శని, ఆదివారాలు దుకాణాలను బంద్ చేశారు. ఆ సమయంలో దొంగలు గ్రిల్స్ను కత్తరించి షాపులోకి ప్రవేశించి నగలు దోచుకెళ్లారు. మంగళవారం షాప్ తెరవగానే ఈ విషయాన్ని గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ఆభరణాల విలువను 12 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.