Liquor shops
-
‘కల్లు గీత కులాల’ మద్యం షాపులపై టీడీపీ సిండికేట్ పడగ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలను గుప్పిట పట్టిన టీడీపీ లిక్కర్ సిండికేట్.. ఇప్పుడు కల్లుగీత కులాలకు కేటాయించిన దుకాణాలనూ చేజిక్కించుకొంటోంది. కల్లు గీత కులాల కుటుంబాలకు 10 శాతం మద్యం దుకాణాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాటని కూడా సొంత సిండికేట్కే అప్పగిస్తోంది. అధికార సిండికేట్ బహిరంగంగా సాగిస్తున్న ఈ దందా ఇదిగో ఇలా ఉంది... వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి మద్యం దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రాచబాట వేసింది. రాష్ట్రంలో అనుమతించిన 3,396 ప్రైవేటు మద్యం దుకాణాల్లో ఒక్కటి కూడా సామాన్యులకు దక్కకుండా బెదిరింపులకు దిగి, టీడీపీ సిండికేటే మొత్తం చేజిక్కించుకుంది. ఇక కల్లు గీత కులాలకు కేటాయించిన 335 దుకాణాలను కులాలవారీగా రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. వీటిని కూడా టీడీపీ సిండికేట్కే అప్పజెప్పాలని ప్రభుత్వ పెద్దలు పరోక్షంగా జిల్లా ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. అంటే కల్లు గీత కులాల దుకాణాలు టీడీపీ సిండికేట్ అదనపు దోపిడీకి సాధనంగా చేశారు. టీడీపీ సిండికేట్ వీటికి కూడా బినామీ పేర్లతో దరఖాస్తు చేసింది. కల్లు గీత కులాలకు చెందిన సామాన్య వ్యాపారులు, రాజకీయ నేపథ్యంలేని వారు దరఖాస్తు చేసేందుకు యత్నిస్తే వారిని బెదిరించి బెంబేలెత్తించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, సాంకేతిక సమస్యలు సృష్టించి ఆ విధానం పనిచేయకుండా చేసింది. ఎక్సైజ్ కార్యాలయాల వద్ద టీడీపీ సిండికేట్ ముఠాలు మకాం వేసి, దరఖాస్తు చేసేందుకు వచ్చేవారిని బహిరంగంగానే బెదిరించి వెనక్కి పంపేశాయి. ఇదిగో మచ్చుతునక.. టీడీపీ సిండికేట్దందాకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఉదంతం ఓ మచ్చుతునక. ఒక దుకాణానికి దరఖాస్తు చేసేందుకు బ్రహ్మం గౌడ్ యత్నిoచారు. కానీ టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి అనుచరుడైన టీడీపీ నేత శ్రీనివాస రెడ్డి అతనికి ఫోన్ చేసి తీవ్రంగా దూషించారు. దరఖాస్తు చేస్తే చంపేస్తానని బెదిరించారు. దాంతో బ్రహ్మం గౌడ్ భయపడిపోయారు. టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి బెదిరింపుల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయినా పోలీసులు, టెండర్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఏమాత్రం పట్టించుకోలేదు.దుకాణానికి 3 దరఖాస్తులు కూడా రాలేదు టీడీపీ సిండికేట్కు భయపడి కల్లు గీత కులాలకు చెందిన వ్యాపారులు దరఖాస్తు చేసేందుకు కూడా సాహసించడం లేదు. టీడీపీ నేతలే బినామీల పేర్లతో ఈ దుకాణాలకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుల తొలి గడువు బుధవారంతో ముగిసింది. వచ్చిoది కేవలం 768 దరఖాస్తులే. అంటే ఒక్కో దుకాణానికి సగటున మూడు దరఖాస్తులు కూడా రాకుండా టీడీపీ సిండికేట్ అడ్డుకుందన్నది సుస్పష్టం. ఇప్పుడు లాటరీ వేసినా సిండికేట్కే దుకాణాలు వస్తాయి. వాస్తవానికి సాధారణ దుకాణాలకు లైసెన్సు ఫీజు రూ.6 లక్షలు. కల్లు గీత కులాలకు కేటాయించిన దుకాణాలకు లైసెన్సు ఫీజు 50 శాతం తగ్గించి రూ.3 లక్షలే చేశారు. అయినా అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కల్లు గీత కులాల ముసుగులో టీడీపీ సిండికేట్కు ప్రయోజనం కలిగించేందుకే లైసెన్సు ఫీజును ప్రభుత్వం 50 శాతం తగ్గించిందని కూడా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.పొడిగింపు పేరిట డ్రామా.. కల్లు గీత కులాల దుకాణాల కోసం టీడీపీ సిండికేట్ సాగిస్తు న్న దందాపై విమర్శలు రావడంతో ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని బుకాయిoచేందుకు ప్రభు త్వం కొత్త ఎత్తుగడ వేసింది. దరాఖాస్తుల గడువు తేదీని ఈ నెల 8 వరకు పొడిగిస్తున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ మూడు రోజుల్లోనూ టీడీపీ సిండికేట్ ఎవరినీ దరఖాస్తు చేయనివ్వబోదన్నది అందరికీ తెలిసిన విషయమే. -
సీఐడీ కుట్ర విఫలం.. ఇక సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగ వేధింపులు రోజు రోజుకూ వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానంపై అవాస్తవ ఆరోపణలతో, అక్రమ కేసులతో వేధించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ అక్రమ కేసుతో పన్నిన పన్నాగం బెడిసి కొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అవినీతిపై ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. దాంతో బాబు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. తాము చెప్పింది చెప్పినట్టు చేసే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తెర వెనుక ఉంటూ పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ద్వారా ఈ కుట్రను అమలు చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. కాగా సిట్కు నేతృత్వం వహించనున్న రాజశేఖర్ బాబుపైనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండటం గమనార్హం.కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టలేని సీఐడీవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో సీఐడీ అక్రమ కేసు కుట్ర బెడిసికొట్టింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై సీఐడీ ద్వారా కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అవాస్తవ ఆధారాలను సృష్టించాలని, అక్రమ కేసులు బిగుసుకునేలా చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అక్రమ కేసుల బనాయింపులో తాము చెప్పిన లక్ష్యాలు సాధిస్తే ఆయనకు డీజీపీ పోస్టు ఇస్తామని కూడా ప్రలోభ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఐడీ ఆరు నెలలుగా చేయని హడావుడి లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డితోసహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వాసుదేవరెడ్డిని పలుసార్లు విచారణ పేరిట వేధించారు. ఆయన్ను అక్రమంగా రోజుల తరబడి నిర్బంధించి తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని, లేకపోతే అంతు చూస్తామన్న హెచ్చరికలతో సీఐడీ అధికారులు బరితెగించారు. డిస్టిలరీల్లో తనిఖీల పేరిట హడావుడి చేశారు. ఇంత చేసినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించ లేకపోయారు. అవాస్తవ ఆధారాలతో కనికట్టు చేసేందుకు చేసిన యత్నాలు ఫలించ లేదు.సీఐడీ చీఫ్పై చినబాబు ఆగ్రహం రెడ్బుక్ రాజ్యాంగ వేధింపుల కేసులను తాము చెప్పినట్టు చేయడం లేదని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్పై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. చినబాబే అందరి ముందు ఆయనపై పరుష పద జాలంతో విరుచుకు పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకానొక దశలో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను బదిలీ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. కుట్రకు పదునుపెట్టేందుకే సిట్మద్యం అక్రమ కేసు పేరిట వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తకుట్రకు తెరతీసింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యాన్నార్ విఫలమయ్యారని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయ అధికారి రాజశేఖర్ బాబును తెరపైకి తెచ్చారు. ఆయన నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి సిట్ వంటి ప్రత్యేక దర్యాప్తు బృందానికి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారి నేతృత్వం వహిస్తారు. అంటే డీజీపీ, సీఐడీ, ఏసీబీ తదితర విభాగాల్లోని ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ జిల్లా పోలీసు యంత్రాంగాల బాధ్యతలు నిర్వర్తించే పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు సిట్ బాధ్యతలు అప్పగించరు. ఎందుకంటే వారికి వారి జిల్లా శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలు చాలా ముఖ్యం. అయితే అందుకు విరుద్ధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా ఉన్న రాజశేఖర్బాబును సిట్ చీఫ్గా నియమించడం గమనార్హం. అంటే తాము చెప్పినట్టు చేసే అధికారి, ఎంతటి అక్రమ కేసునైనా పెట్టి వేధించే అధికారికే బాధ్యతలు అప్పగించాలన్నదే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని స్పష్టమవుతోంది. రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ సిట్ తెరవెనుక పాత్ర పోషించనున్నారు. ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్బాబు దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడుతారన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే అసలు రాజశేఖర్బాబు ట్రాక్ రికార్డు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న విషయాన్ని పోలీసు వర్గాలే ప్రస్తావిస్తున్నాయి. మద్యం దందాతోపాటు పలు వ్యవహారాల్లో ఆయన అవినీతి బాగోతాన్ని కేస్ స్టడీలతోసహా ఉటంకిస్తున్నాయి. అసలు మద్యం వ్యవహారంపై సిట్ సంగతి తర్వాత.. అసలు సిట్కు నేతృత్వం వహిస్తున్న పోలీస్ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలవుతోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. సిట్ సభ్యులు వీరే.. సిట్ చీఫ్: ఎస్వీ రాజశేఖర బాబు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్సభ్యులు: ఎల్. సుబ్బారాయుడు, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ఫోర్స్ ఎస్పీ (చంద్రబాబుకు వీర విధేయ అధికారి. అందుకే తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి తిరుపతి ఎస్పీగా నియమించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రభుత్వ వైఫల్యం.. భక్తుల తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు. అయినా సరే ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ప్రస్తుతం సిట్లో సభ్యునిగా నియమించింది.)– కొల్లి శ్రీనివాస్, అదనపు ఎస్పీ, విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగం– ఆర్.శ్రీహరి బాబు, అదనపు ఎస్పీ, సీఐడీ– పి.శ్రీనివాస్, డీఎస్పీ, డోన్– కె.శివాజీ, సీఐ– సీహెచ్.నాగ శ్రీనివాస్, సీఐ -
మద్యం దుకాణంలో కమీషన్ల కోసం టీడీపీ నాయకుల వేధింపులు
-
కూటమి ప్రభుత్వంలో జోరుగా కాలం చెల్లిన లిక్కర్ విక్రయం
-
‘చుక్క’ తెచ్చిన చిక్కు
కూటమి ప్రభుత్వం మద్యం విధానంతో ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు, అడుగడుగునా బెల్ట్ షాపులు, దీంతో తాగడానకి నీళ్లు దొరకవేమో కానీ రాష్ట్రంలో మద్యానికి మాత్రం కొరత లేకుండా పోయింది. ఇక బాబుగారు సూపర్ సిక్స్లో భాగంగా రూ. 99కి ఇస్తున్న క్వార్టర్ మద్యం నాణ్యతకి ఎక్కడ తాగినవాళ్లు అక్కడే పడిపోతున్నారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో మద్యం తాగి స్పృహలేని స్థితిలో ఓ మహిళ, అదే స్థితిలో మరోవ్యక్తి ట్రాలీ రిక్షాలో పడి ఉండగా, కాస్త మెరుగ్గా ఉన్న మరో వ్యక్తి ఆ ట్రాలీని లాక్కుంటూ వెళ్తున్నాడు. రోడ్డుపై ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు అవాక్కయ్యారు. -
బాలయ్య ఇలాకాలో మామా ఏక్ పెగ్గులా..
-
3 క్వార్టర్లు, 6 ఫుల్లుల్లా కూటమి మద్యం దందా
-
కేరళ లిక్కర్ వ్యాపారులకు టీడీపీ నేతల వార్నింగ్
సాక్షి,విశాఖపట్నం:కేరళ మద్యం వ్యాపారులకు టీడీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. నూతన మద్యం పాలసీలో భాగంగా విశాఖపట్నంలో లాటరీ ద్వారా ఇటీవల 9 మద్యం షాపులను కేరళ మద్యం వ్యాపారులు దక్కించుకున్నారు. కేరళ,టీడీపీ నేతల మద్యం షాపులు పక్కపక్కనే ఏర్పాటయ్యాయి. దీంతో ఆ షాపులతో తమ మద్యం షాపులకు నష్టం వస్తుందని టీడీపీ నేతలు ఆగ్రహించారు.విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న కేరళ వ్యాపారుల షాపులను మూసివేయాలని హెచ్చరించారు. షాపులను మూసివేయాలంటూ ఎక్సైజ్ అధికారుల ద్వారా ఒత్తిడి చేశారు.వేరే ప్రాంతంలో షాపులు పెట్టుకోవాలని కేరళ వ్యాపారులకు ఎక్సైజ్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.కేరళ వ్యాపారులకు అద్దెకు ఇచ్చిన భవన యజమానులను కూడా టీడీపీ నేతలు బెదిరించారు.భవనాలు వెనక్కి తీసుకోకపోతే కూలగొట్టిస్తామని బెదిరిస్తామనే వరకు టీడీపీ నేతలు వెళ్లినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇసుక,మద్యంలో కూటమి నేతల అవినీతి: కాకాణి -
దౌర్జన్యంగా అగ్రిమెంట్లు!
సాక్షి నెట్వర్క్: మద్యం దుకాణాల లాటరీ తంతు ముగియడంతో అక్కడక్కడా స్వల్పంగా షాపులు దక్కించుకున్న ఇతరులకు టీడీపీ సిండికేట్ చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకుగానూ లాటరీ ముసుగులో 80 శాతం షాపులను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్ మిగిలిన 20 శాతం షాపుల లైసెన్సులు పొందిన వారిని నయాన భయాన దారికి తెచ్చుకుంటోంది. తమను ధిక్కరించి వ్యాపారం చేయలేరని.. వాటాలు చెల్లిస్తారో, దుకాణాలు అప్పగిస్తారో తేల్చుకోవాలని లేదంటే ఎక్సైజ్, పోలీసు దాడులు తప్పవని తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా ముగిసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ కొనసాగింది. మంత్రి జనార్ధన్రెడ్డి వర్గం బెదిరింపులు..⇒ బనగానపల్లె నియోజకవర్గంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న ఇతరులు గుడ్విల్ తీసుకుని తమకు అప్పగించాలని లేదంటే 25 శాతం వాటా ఇవ్వాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమ మాట వినకుంటే అద్దెకు గదులు కూడా దక్కకుండా చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి వర్గం హెచ్చరిస్తోంది. ⇒ డోన్లో 16 దుకాణాలు ఉండగా ధర్మవరం సుబ్బారెడ్డికి 3, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ వర్గానికి 2, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వర్గానికి రెండు, ఎస్సీవై రెడ్డి కుమారైకు ఒకటి, మిగతా 8 దుకాణాలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి వర్గం దక్కించుకుంది. ⇒ కోడుమూరులో టీడీపీ ఇన్చార్జీ విష్ణువర్దన్రెడ్డి ఆధ్వర్యంలో సిండికేట్గా ఏర్పడి తమ వర్గంలో చేరాలని ఇతరులను ఒత్తిడి చేస్తున్నారు. ⇒ నంద్యాలలో 30 శాతం కమీషన్ ఇవ్వాలని మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ బెదిరిస్తున్నారు. దీంతో ఇద్దరు వ్యక్తులు దుకాణాలను టీడీపీకే గుడ్విల్కు ఇచ్చేశారు. ఒక్కో షాపు రూ.20 లక్షల చొప్పున విక్రయించినట్లు సమాచారం. ⇒ శ్రీశైలంలో 25 శాతం వాటా లేదంటే గుడ్విల్కు దుకాణాలు తమకు ఇవ్వాలని ఎమ్మెల్యే బుడ్డా వర్గీయులు చెబుతున్నారు. ⇒ పత్తికొండలో దుకాణాలు దక్కించుకున్న వారికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు వర్గీయులు ఫోన్ చేసి వాటిని తమకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే తమతో ఉండాలని చెబుతున్నారు. కప్పం కట్టలేక షాపు వదిలేసి..చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీకి చెందిన కల్లు బాల, కృష్ణారెడ్డి, కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్కు లక్కీడిప్లో మద్యం దుకాణాలు దక్కాయి. అయితే ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డి సోదరుడు విష్ణువర్థన్రెడ్డి బెదిరించి వారి నుంచి వాటిని లాక్కున్నారు. కల్లు బాల సతీమణి ఎస్ భారతి పేరున బైరెడ్డిపల్లి మద్యం దుకాణం లాటరీ ద్వారా వచ్చింది. షాపును దక్కించుకున్న కల్లు బాలను ఎమ్మెల్యే సోదరుడు ఇంటికి పిలిపించుకుని అనుచరులతో దాడి చేశాడు. తమను కాదని మరెవరూ షాపు నడపటానికి వీల్లేదని, స్థలం ఎవరు ఇస్తారో చూస్తామంటూ హెచ్చరించాడు. రూ.కోటి కప్పం కట్టాలని ఆదేశించడంతో లాటరీ ద్వారా వచ్చిన దుకాణాన్ని కల్లు బాల వదులుకున్నారు. కృష్ణారెడ్డి తనకు లాటరీలో వచ్చిన మద్యం దుకాణాన్ని వదిలేసుకున్నారు. వారిని బెదిరించి మద్యం దుకాణం పర్మిట్ అమ్ముకున్నట్లు బలవంతంగా అగ్రిమెంట్ రాయించుకున్నారు. కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్ ఆచూకీ తెలియరాలేదు. ⇒ పూతలపట్టులో ఎమ్మెల్యే మురళీమోహన్ వర్గీయులు స్థానిక సీఐ ద్వారా టెండర్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులతో మంతనాలు నెరిపారు. దుకాణాలను వదులు కోవాలని లేదంటే వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు లక్కీ డిప్ తీసే రోజు నేరుగా కలెక్టర్కే ఫోన్ చేసి తమ వారికే దుకాణాలు దక్కేలా చూడాలని కోరినట్లు తెలిసింది. కలెక్టర్ స్పందించకపోవటంతో టెండర్లు దక్కించుకున్న వారిని ఎక్సైజ్ పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు. ⇒ తిరుపతిలో 32 దుకాణాలకు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బినామీ పేర్లతో 350 దరఖాస్తులు చేయగా ఆరు షాపులు దక్కాయి. దుకాణాలు నడవాలంటే తమకు వాటా ఇవ్వాల్సిందేనని ఇతరులను బెదిరిస్తున్నారు. శ్రీకాళహస్తి, గూడూరులో దరఖాస్తు దారులను ముందే పిలిచి ఎమ్మెల్యేలు అడిగినంత వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కడపలో నేరుగా బేరసారాలు..⇒ వైఎస్సార్ కడప జిల్లాలో మద్యం షాపు సవ్యంగా నిర్వహించుకోవాలంటే 50 శాతం భాగస్వామ్యం ఇవ్వాలని కొందరు హెచ్చరిస్తుండగా పూర్తిగా తమకే అప్పగించాలని మరికొందరు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కడపలో టీడీపీయేతర వర్గీయులకు చెందిన మద్యం షాపులల్లో 50 శాతం వాటా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి బేరసారాలకు దిగారు. జనసేన వర్గీయులకు మూడు మద్యం దుకాణాలు లభించగా ఒక్కొక్కటి రూ.15 లక్షలు చొప్పున గుడ్విల్కు అప్పగించారని సమాచారం. జమ్మలమడుగులో ప్రతి షాపులో 30 శాతం వాటా ఇవ్వాలంటూ టీడీపీ ఇన్చార్జీ దేవగుడి భూపేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ముద్దనూరు షాపు పూర్తిగా తమకే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. కమలాపురంలో పునీత్ బార్ అండ్ రెస్టారెంట్ను ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మూసివేయించారు. తాము వారించినా వినకుండా చెన్నూరు మద్యం షాపు కోసం దరఖాస్తు చేశారంటూ దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. ధర్మవరంలో పరిటాల వర్గం పర్యవేక్షణ.. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న తటస్థులు కూటమి నాయకుల బెదిరింపులతో షాపులను అప్పగించినట్లు సమాచారం. ఈ సిండికేట్ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరాం ఆధ్వర్యంలో జరుగుతోంది. సోమందేపల్లిలో లైసెన్స్దారు దీక్షితను బెదిరించి గుడ్విల్కు షాపు దక్కించుకున్నారు. సీకే పల్లి స్టేషన్, కదిరి పరిధిలో దుకాణాలకు సంబంధించి పంచాయితీ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో షాపు దక్కించుకుని ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన రంగనాథ్ నుంచి దుకాణం లాక్కునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 127వ మద్యం షాపును దక్కించుకున్న హోటల్ నిర్వాహకుడు దినేష్ కుమార్ నాయుడు లొంగకపోవడంతో టీడీపీ నేతలు మునిసిపల్ అధికారులను ఉసిగొల్పి హోటల్లో తనిఖీలు జరిపి నోటీసులు ఇప్పించారు. చేయి కలిపితేనే సహకారం..⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం కొత్తపేట, ముమ్మిడివరం పరిధిలో సిండికేట్ ప్రాబల్యం అధికంగా ఉంది. దుకాణాలు దక్కించుకున్నవారు ఇతరులు తమతో చేయి కలపాలని ఒత్తిడి చేస్తున్నారు. రావులపాలెం మండలం ఈతకోటలో మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ఇతరులను సిండికేట్ ఒత్తిడితో స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. ముమ్మిడివరంలో దుకాణాలు పొందిన మిగిలినవారిని తమ సిండికేట్లోకి తెచ్చుకునేందుకు టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రదర్శిస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాలకు గాను ఒక్కో చోట నాలుగు నుంచి తొమ్మిది వరకు షాపులు ఏర్పాటు అవుతున్నాయి. కొత్త పాలసీ ప్రకారం షాపులు దక్కినవారు మండలంలో ఎక్కడైనా షాపు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అమ్మకాలు ఎక్కువగా జరిగే మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో షాపుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ⇒ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వర్గానికి 11 దుకాణాలు దక్కాయి. మిగిలిన షాపులు పొందిన వారు 25 శాతం కమీషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్ వర్గం ఇతరుల నుంచి 25 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ⇒ కాకినాడ జిల్లాలో కొత్తగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన వారిని సిండికేట్ నయానా భయానా దారిలోకి తెచ్చుకుంటోంది. తొండంగి, కోటనందూరు, తునిలో ఏడు షాపులు దక్కించుకున్న వారు కౌన్సెలింగ్లో మాట వినకపోవడంతో వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎక్సైజ్ పోలీసులు మీకు ఎలా సహకరిస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఒక్కో షాపులో 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. వెనిగండ్ల వర్గం వార్నింగ్లు⇒ కృష్ణా జిల్లా పామర్రులో 75 శాతం షాపులను దక్కించుకున్న టీడీపీ నేతలు మిగిలిన వారిని వాటాలు ఇవ్వాలని ఫోన్లు చేస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోదరుడు షాపులు దక్కించుకున్న వారిని తన అనుచరులతో కలసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. వంగవీటి రాధా, కాజ రాజ్కుమార్ వర్గీయులు గుడివాడలో ఐదు షాపులు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే వర్గానికి వారు ఎదురు తిరిగినట్లు సమాచారం. ఉదయభాను వర్గం ఒప్పందాలు.. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిండికేట్ 11 షాపులను దక్కించుకుంది. మిగిలిన 12 దుకాణాలను టీడీపీ నేతలు, గతంలో మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులు దక్కించుకున్నారు. పెనుగంచిప్రోలులో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దుకాణాన్ని దక్కించుకోగా గుడ్ విల్ కింద జనసేన నేత ఉదయభాను వర్గం రూ.90 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. జగ్గయ్యపేటలో దుకాణం పొందిన తెలంగాణ వాసితో ఎమ్మెల్యే సోదరుడు గుడ్విల్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తిరువూరులో తెలంగాణ వ్యాపారులే ఎక్కువ షాపులు దక్కించుకున్నారు. మైలవరంలో 15 షాపులకుగానూ టీడీపీ సిండికేట్కే 14 దక్కాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు కనుసన్నల్లో టీడీపీ నాయకులు సిండికేట్గా ఏర్పడ్డారు. నందిగామలో షాపులన్నీ ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులకే దక్కాయి. పల్నాడులో డబ్బులు కడితేనే..⇒ పల్నాడు జిల్లాలో తాము చెప్పిన మొత్తం తీసుకొని దుకాణాలు అప్పగించాలని లేదంటే 50 శాతం వాటా ఇవ్వాలని సిండికేట్ బెదిరిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గంలో మద్యం పంచాయితీ ఇంకా తేలలేదు. సత్తెనపల్లిలో రూ.30 లక్షలు కట్టిన తరువాతే దుకాణాలు తెరుచుకోవాలని ఓ టీడీపీ నేత అల్టిమేటం జారీ చేశారు. పెదకూరపాడులో ప్రతి దుకాణంలో 20 వాటా ఇవ్వాలని లెక్క తేల్చారు. ⇒ బాపట్ల జిల్లాలో టెండర్లకు ముందే రేపల్లె, వేమూరు, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో సిండికేట్ ఏర్పాటైంది. తమతో కలవకుంటే షాపులు నిర్వహించలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టెక్కలిలో ఏకఛత్రాధిపత్యం⇒ టెక్కలి నియోజకవర్గంలో ప్రత్యర్థులే లేకుండా పోవడంతో కీలక నేత సోదరుడి కనుసన్నల్లోనే షాపులన్నీ నడుస్తున్నాయి. ⇒ నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో నాలుగు షాపులు దక్కించుకున్న ఇతరులకు ఫోన్ చేసిన ఓ ఎమ్మెల్యే ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చొప్పున ఇస్తానంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ⇒ నరసన్నపేటలో 76వ నెంబర్ షాపు అప్పగించినందుకు ఏడాదికి రూ.20 లక్షలు చెల్లిస్తామన్న టీడీపీ ప్రజాప్రతినిధి ఆఫర్కు అంగీకరించినట్లు తెలుస్తోంది. ⇒ పాతపట్నంలో పలు దుకాణాలు ఒడిశాకు చెందిన వ్యాపారులకు దక్కడంతో వారికి ఎమ్మెల్యే అనుచరులు ఫోన్ చేసి గుడ్విల్కు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. -
మద్యంపై పన్నుల మోత
సాక్షి, అమరావతి: టీడీపీ సిండికేట్కు మద్యం దుకాణాలను ఏకపక్షంగా కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం ఇదే అదునుగా మద్యం మాఫియా దోపిడీకి అధికారికంగా తెరతీసింది. మద్యంపై భారీగా పన్నుల బాదుడుతోపాటు టీడీపీ నేతల డిస్టిలరీలు, మద్యం సిండికేట్లకు అడ్డగోలుగా భారీ లాభాలొచ్చేలా పన్నుల విధానాన్ని పునర్వ్యవస్థీకరించింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం డిస్టిలరీలు, దుకాణదారులకు కలిపి 10 శాతం లాభాన్ని మార్జిన్గా విధించారు. తాజాగా ప్రభుత్వం డిస్టిలరీలు, మద్యం సిండికేట్లతో కుమ్మక్కై అధికారిక లాభాల మార్జిన్ను రెట్టింపు చేస్తూ 20 శాతానికి పెంచింది. ఆ మేరకు మద్యం ఉత్పత్తుల గరిష్ట ధర(ఎంఆర్పీ)ని నిర్ణయించనుంది. దాంతో ఓ వైపు మద్యం ధరల మోత మోగనుంది. మరోవైపు టీడీపీ సిండికేట్లకు కాసుల పంట పండనుంది. ఈ మేరకు అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను(ఏఆర్టీ)ను సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యసనాన్ని మాన్పించేందుకు డీ–అడిక్షన్ కేంద్రాల నిర్వహణ కోసం మద్యం ఉత్పత్తులపై 2 శాతం సెస్ను విధించింది. మత్తు వదిలించేందుకంటూ మద్యం ఉత్పత్తులపై పన్ను విధించి ఆదాయం ఆర్జించే ఎత్తుగడ వేయడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏకంగా 155 లిక్కర్ షాపులకు ఢిల్లీ వ్యాపారి దరఖాస్తులు.. ఇంతకీ లక్ తగిలిందా?
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వైన్షాపుల కోసం ఒకవైపు కూటమి ప్రజాప్రతినిధులు, సిండికేట్లు పెద్ద ఎత్తున పోటీ పడగా.. మరో వైపు ఢిల్లీకి చెందిన లిక్కర్ వ్యాపారి కూడా విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఇక్కడి సిండికేట్లను మించి 155 వైన్షాపులకు దరఖాస్తులు చేశాడు. అమిత్ అగర్వాల్, నందినీ గోయల్, సారికా గోయల్, సౌరభ్ గోయల్ పేర్లతో దరఖాస్తులు సమర్పించాడు.ఒక్కో దుకాణ లాటరీకి దరఖాస్తు చేసిన 24 నుంచి 30 మంది మారుతున్నప్పటికీ ఆయన మాత్రం అక్కడి నుంచి కదలలేదు. వరుసగా అన్ని షాపుల లాటరీ నిర్వహణలోను పాల్గొనడంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎక్సైజ్ సిబ్బంది ద్వారా ఆరా తీశారు. అతడిని ప్రశ్నించిన ఎక్సై జ్ అధికారులతో పాటు కలెక్టర్, జేసీ కూడా విస్తుపోయారు.155 షాపులకు దరఖాస్తు చేసినట్లు సదరు వ్యక్తి చెప్పడంతో షాక్కు గురయ్యారు. అన్ని షాపులకు కలిపి దరఖాస్తు రుసుమే రూ.3 కోట్లు అవుతుంది. అంత స్థాయిలో దరఖాస్తు ఫీజు చెల్లించి సదరు వ్యాపారికి లాటరీలో 6 షాపులు దక్కాయి. ఒడిశా నుంచి కూడా ఒక లిక్కర్ కింగ్ భారీగా దరఖాస్తులు సమర్పించినప్పటికీ.. కేవలం 2 షాపులు మాత్రమే లభించాయి.ఇదీ చదవండి: ‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం -
కర్నూలులో కొనసాగుతున్న మద్యం షాపుల లాటరీ
-
ఏపీలో కాసేపట్లో మద్యం షాపుల లైసెన్సులకు లాటరీ
-
సర్కారు వారి కమీషన్ 30%
సర్కారు వారి కమీషన్ 30 శాతం.. ప్రస్తుతం ఇది ఏపీలో ట్రెండింగ్లో ఉన్న మాట.. ‘సర్కారు వారి పాట’ అంటే తెలుసు కానీ ‘సర్కారు వారి కమీషన్’ అంటే ఏంటనేది మీ సందేహమా? రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రతి మద్యం షాపు నుంచి అధికార పార్టీ నేతలకు అందే మామూళ్లన్న మాట.. నేడు నిర్వహించే మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియలో టీడీపీ సిండికేట్ కుట్ర ఇది.. ఇది తమను కాదని షాపులు దక్కించుకున్న వారు చెల్లించాల్సిన సొమ్ము గురించి హెచ్చరిక.. కమీషన్ ఇస్తారో.. లేక దుకాణాలు వదలుకుంటారో తేల్చుకోండని ఎమ్మెల్యే, ఎంపీల హుకుం..సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు దిగుతున్నారు. చాలా చోట్ల టీడీపీ సిండికేట్ సభ్యులు కానివారు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసినట్టు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గుర్తించారు. వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేసేందుకు తమ మనుషులను వారి ఇళ్లపైకి పంపించారు. అప్పటికీ చాలా మంది దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో లాటరీ ప్రక్రియకు రెండు రోజుల ముందు నుంచి కొత్త ఎత్తుగడ వేశారు. లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్ దక్కినా సరే.. వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు తమకు కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ‘అలా అయితేనే మద్యం దుకాణం నిర్వహించుకోగలరు.. లేదంటే మీ దుకాణం ఉండదు.. మీరూ ఉండరు’ అనే రీతిలో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మొత్తం మద్యం దుకాణాల లైసెన్సులన్నీ తమకే దక్కేలా దరఖాస్తుల ప్రక్రియను టీడీపీ సిండికేట్ హైజాక్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారు మినహా ఇతరులను దరఖాస్తులు వేయనివ్వకుండా అడ్డుకుంది. అక్కడక్కడా ఎవరైనా దరఖాస్తులు వేసి ఉంటే.. వారినీ బెదిరించి తప్పుకునేలా చేసేందుకే తాజాగా కమీషన్ల పేరుతో బెదిరింపులకు బరి తెగించింది. తద్వారా భయపడి లాటరీ ప్రక్రియకు ముందే పోటీ నుంచి తప్పుకునేలా చేయడమే టీడీపీ సిండికేట్ ఎత్తుగడ. ఒక వేళ లాటరీలో లైసెన్స్ వస్తే.. ఆ లైసెన్స్ ఫీజు చెల్లించకుండా పోటీ నుంచి తప్పుకునేలా చేయాలన్నది లక్ష్యం. దాంతో సహజంగానే ఆ మద్యం దుకాణం లైసెన్స్ టీడీపీ సిండికేట్కే కేటాయిస్తారు. అలా లాటరీ ద్వారా గానీ, ఇతరత్రాగానీ మొత్తం 3,396 మద్యం దుకాణాలన్నీ తమ గుప్పిట్లోనే ఉండేట్టు సిండికేట్ కుట్రను అమలు చేస్తోంది. నా కొ..ల్లారా.. కమీషన్ ఇవ్వాల్సిందే: జేసీ బూతుపురాణం ⇒ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో టీడీపీ మద్యం సిండికేట్ తరఫున టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తనదైన శైలిలో మరోసారి పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలన్నీ తామే నిర్వహిస్తామన్నారు. అలా కాకుండా ఇతరులు ఎవరైనా సరే మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలు చేయాలంటే తమకు 15 శాతం కమీషన్ చెల్లించాలని, దాంతోపాటు తమకు 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ⇒ అసలు తమ నియోజకవర్గంలో మద్యం, ఇసుక దుకాణాల కోసం దరఖాస్తులు చేయడం ఏమిటని జేసీ ప్రభాకర్రెడ్డి ఆగ్రహంతో చిందులు తొక్కారు. అలా దరఖాస్తు చేసిన వారి పేర్లను ప్రస్తావిస్తూ.. ‘నా కొ..ల్లారా.. అందర్నీ కాల్చి పార..’ అంటూ’ పచ్చి బూతులు తిట్టారు. ⇒ రామకృష్ణారెడ్డి.. దాచేపల్లి రామచంద్రారెడ్డి.. వేములపల్లి ప్రకాశ్రెడ్డి.. ఇలా పేర్లు చదువుతూ.. ముందు మీకు అవుతుంది. మిమ్మల్ని అసలు ఊర్లోకి రానివ్వను. అసలు ఎవడు సారా అంగడికి అప్లికేషన్ వేసిన నా కొ.. ఎవడు వాడు.. అని వీరంగం వేశారు. ‘ఎవరు సారా అంగడి పెట్టాలన్నా మండలానికి 15 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే. దాంతోపాటు తనకు (ప్రభాకర్ రెడ్డికి) 20 శాతం వాటా ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. తాడిపత్రి నియోజకవర్గంలో తాము చెప్పిందే జరుగుతుందన్నారు. అంతటా అవే బెదిరింపులు ⇒ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వర్గం మద్యం దుకాణాల ఆదాయంలో 30 శాతం కమీషన్ చెల్లించాలని హుకుం జారీ చేసింది. సమ్మతించకుంటే అసలు మద్యం దుకాణమే నిర్వహించలేరని హెచ్చరించింది. ⇒ నంద్యాల జిల్లా శ్రీశైలంలో టీడీపీ మద్యం సిండికేట్ తమ కమీషన్ రేటు 25 శాతం అని ప్రకటించింది. అందుకు సమ్మతిస్తేనే సోమవారం లాటరీ ప్రక్రియలో పాల్గొనాలని టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు హుకుం జారీ చేశారు. ⇒ ఉమ్మడి విశాఖలో మద్యం సిండికేట్ కింగ్గా గుర్తింపు పొందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మరోసారి తన దాదాగిరీ చూపిస్తున్నారు. విశాఖపట్నం– భీమిలి బీచ్రోడ్డుతోపాటు నగరంలోని ప్రధాన జంక్షన్లలో అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు తామే దక్కించుకునేలా బెదిరింపులకు దిగుతున్నారు. విశాఖలోని ఇతర ప్రాంతాలతో పాటు, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు తమ సిండికేట్ సభ్యులకేనని స్పష్టం చేస్తున్నారు. కాదని ఎవరైనా లైసెన్స్ దక్కించుకుంటే 30 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని సిండికేట్ స్పష్టం చేసింది. ⇒ శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్న వర్గం నేతృత్వంలోని టీడీపీ.. సిండికేట్కు నేతృత్వం వహిస్తోంది. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు మద్యం దుకాణాలన్నీ తమ సిండికేట్ గుత్తాధిపత్యంలో ఉండాల్సిందేనంది. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాఫురం నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఇతర వ్యాపారులను బెదిరించి బెంబేలెత్తించారు. ఇతరులకు లైసెన్స్ దక్కితే 25 శాతం కమీషన్ చెల్లించాలని రేటు ఫిక్స్ చేశారు. ⇒ విజయవాడలో ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కనుసన్నల్లోనే టీడీపీ మద్యం సిండికేట్ దందా సాగిస్తోంది. ఇతరులకు లైసెన్స్ దక్కితే 30 శాతం కమీషన్గా నిర్ణయించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు లాటరీ ప్రక్రియలో పాల్గొనేందుకే బెంబేలెత్తాల్సిన అగత్యం కల్పించారు. ⇒ దెందులూరు, ఉండి నియోజకవర్గాలు మినహా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఏక మొత్తంగా 25 శాతం కమీషన్ ఖరారు చేశారు. ఆ మేరకు చెల్లిస్తేనే మద్యం దుకాణాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వర్గం మాత్రం తమకు 30 శాతం చెల్లించాలని చెప్పింది. దెందులూరు నియోజకవర్గంలో అన్ని మద్యం దుకాణాలు తమ సిండికేట్కు దక్కాల్సిందేనని, ఇతరులకు లాటరీలో లైసెన్సులు దక్కినా దుకాణం ఏర్పాటు చేయనివ్వమని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం తేల్చి చెప్పింది. ⇒ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దరఖాస్తు చేసేందుకు వచ్చిన వారిపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జా సు«దీర్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దరఖాస్తుదారులు డిపాజిట్ చేసేందుకు తెచ్చిన డీడీలనూ చింపి వారిని వెనక్కి పంపేశారు. ఇక లాటరీ ద్వారా ఇతరులకు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కితే.. నెలకు రూ.20 లక్షలు కమీషన్గా చెల్లించాలని ఎమ్మెల్యే వర్గం రేటు నిర్ణయించింది. అదీ రోజు వారీగా వసూలు చేస్తామంది. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్వర్గం మరో ఎత్తుగడ వేసింది. దరఖాస్తు చేసిన వారందరూ తమతోపాటు తమ వాహనాల్లోనే లాటరీ నిర్వహించే తిరుపతిలోని శిల్పారామం ప్రాంగణానికి రావాలని ఆదేశించింది. దుకాణానికి 26 దరఖాస్తులే..రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు మొత్తం 89,832 దరఖాస్తులొచ్చాయి. గడువు 11 సాయంత్రం 7 గంటలతో ముగిసింది. కానీ అప్పటికి క్యూలో ఉన్న వారికి కూడా అనుమతించామని చెబుతూ మొత్తం దరఖాస్తుల తాజా గణాంకాలను ఎక్సైజ్ శాఖ ఆదివారం విడుదల చేసింది. 11న మొత్తం దరఖాస్తులు 87,116గా పేర్కొనగా.. ఆదివారం మొత్తం దరఖాస్తులు 89,832 అని ప్రకటించింది. అయినా దుకాణానికి సగటున కేవలం 26.45 దరఖాస్తులే రావడం గమనార్హం. దరఖాస్తుల ద్వారా∙రూ.1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది.‘లాటరీ’ అంతా వారి కనుసన్నల్లోనే..మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు సోమవారం లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ లాటరీ ప్రక్రియ కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లాటరీ తతంగం అంతా తమకు అనుకూలంగా నిర్వహించేలా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. లాటరీ ప్రక్రియ నిర్వహించే కేంద్రం పూర్తిగా టీడీపీ సిండికేట్ సభ్యులతో కిక్కిరిసిపోయేట్టుగా చేయాలని ఆదేశించారు. ఇతరులు ఎవరొచ్చినా బెదిరించి వెనక్కి పంపాలని, అప్పటికీ ఎవరైనా వస్తే ఘర్షణకు దిగేందుకూ వెనుకాడొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే అధికారులపైనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేయాలని, ఇతరులపై దాడులు చేయాలని చెప్పడం గమనార్హం. తమకు లైసెన్స్ రానప్పుడు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి లాటరీ ప్రక్రియను అడ్డుకోవాలని టీడీపీ సిండికేట్ కుట్ర. రెండు జిల్లాల్లో మంత్రి కొల్లు వర్గం వీరంగం ⇒ ఎక్సైజ్ శాఖ మంత్రిగా టీడీపీ మద్యం సిండికేట్లో తమదే సింహభాగం అని మంత్రి కొల్లు రవీంద్రవర్గం వీరంగం సృష్టిస్తోంది. అందుకే ఏకంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాల్లో మద్యం దుకాణాలను ఏక మొత్తంగా దక్కించుకునేందుకు రంగంలోకి దిగింది. దరఖాస్తు చేసిన వారికి మంత్రి వర్గీయులు రెండు రోజులుగా ఫోన్లు చేసి మరీ తమదైన శైలిలో బెదిరిస్తుండటం గమనార్హం.⇒ మద్యం దుకాణాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలి.. లేదా మద్యం ఆదాయంలో 25 శాతం కమీషన్ అయినా ఇవ్వాలని తేల్చి చెబుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 100 శాతం మద్యం దుకాణాలను మంత్రి వర్గీయులే ఏకపక్షంగా దక్కించుకోవడం ఇప్పటికే ఖాయమైంది. కాగా విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రుతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో దరఖాస్తులు చేసిన వారికి ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు. ⇒ తాడేపల్లిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా మంత్రి కొల్లు రవ్రీంద వర్గీయులు ఫోన్లు చేసి బెదిరించడం గమనార్హం. మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వారిని కూడా బెదిరించడం ప్రాధాన్యం సంతరించుకుంంది. అంటే మంత్రి లోకేశ్ అండతోనే కొల్లు వర్గం రెచ్చిపోతోందని స్పష్టమవుతోంది.భారీ దోపిడీకి పక్కా డీల్భారీ దోపిడీకి ప్రభుత్వ ముఖ్య నేతతో పక్కాగా డీల్ కుదరడం వల్లే టీడీపీ మద్యం సిండికేట్ బరితెగిస్తోంది. ప్రైవేటు మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరతో విక్రయించేందుకు ముఖ్య నేత ఇప్పటికే పచ్చ జెండా ఊపారు. ఒక్కో బాటిల్పై మద్యం దుకాణంలో రూ.15 అధికంగా.. బెల్ట్ షాపుల్లో అయితే రూ.25 అధికంగా విక్రయించేందుకు అనుమతించారు. అందులో ఒక్కో బాటిల్పై కరకట్ట బంగ్లాకు రూ.3 చొప్పున కప్పం కట్టాలన్నది డీల్లో ప్రధాన అంశం. మిగిలింది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి ఆధ్వర్యంలోని సిండికేట్ సభ్యులకు దక్కుతుంది. పక్కాగా డీల్ కుదరడంతో టీడీపీ సిండికేట్ రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకునేందుకు అక్రమాలు, బెదిరింపులకు తెగించింది. -
సిండికేట్ కైవశం!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేటే పైచేయి సాధించింది. ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఆ ‘పచ్చ’ముఠా పూర్తిగా హైజాక్ చేసేసింది. ప్రభుత్వ ముఖ్య నేత పన్నాగం.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెండర్ల వైపు ఇతరులెవ్వరూ కన్నెత్తి చూడకుండా ఎప్పటికప్పుడు వారిని అడుగడుగునా అడ్డుకుంటూ హడలెత్తించారు. తద్వారా.. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ద్వారా భారీ దోపిడీకి మొదటి అంకాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 87,116 దరఖాస్తులు రాగా.. వాటిలో దాదాపు 99 శాతం టీడీపీ మద్యం సిండికేట్వే. సాధారణ వ్యాపారులు దరఖాస్తులు దాఖలు చేయకుండా.. అదే సమయంలో తమలో తామే పోటీపడినట్లు బిల్డప్ ఇస్తూ మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియను ఏకపక్షంగా పూర్తిచేశారు. ఇక లాటరీ ద్వారా టీడీపీ సిండికేట్ ఏకపక్షంగా మొత్తం 3,396 దుకాణాలను దక్కించుకోవడం.. ఆ తర్వాత యథేచ్ఛగా మద్యం ఏరులను పారిస్తూ భారీ దోపిడీకి తెగబడటమే తరువాయి.టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దందా..2014–19 కంటే రెట్టింపు స్థాయిలో మద్యం వ్యాపారం ద్వారా దోపిడీయే లక్ష్యంగా అధికార టీడీపీ కూటమి మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియను శాసించింది. ఎందుకంటే ఏకంగా ముఖ్యనేతే ఇందుకు పచ్చజెండా ఊపడంతో ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డూ అదుపులేకుండా చెలరేగిపోయారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ మద్యం సిండికేట్ను ఏర్పాటుచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినవారు తప్ప ఇతరులెవరూ దరఖాస్తులు చేయడానికి వీల్లేదని హెచ్చరికలు జారీచేశారు. కాదని ఎవరైనా దరఖాస్తు చేసినా వారికి మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎవరూ షాపులు అద్దెకు ఇవ్వకూడదని బహిరంగంగానే ప్రకటించారు. ఇక ఇతరులు తమ సొంత దుకాణాల్లో ఏర్పాటుచేసుకుంటే ఎక్సైజ్ శాఖ అధికారులతో తరచూ తనిఖీలు, దాడులతో వేధిస్తామని అల్టిమేటం జారీచేశారు. అయినా కొందరు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడి బెదరగొట్టారు. దీంతో అసలు టెండర్లు దాఖలు చేసేందుకు సాధారణ వ్యాపారులెవరూ సాహసించలేదు. నిజానికి.. టెండర్ల ప్రక్రియలో మొదటి వారం రోజులు ఒక్కో దుకాణానికి సగటున 10 కూడా దరఖాస్తులు రాలేదు. దీంతో టీడీపీ సిండికేట్ వ్యవహారం బహిరంగ దందాగా మారింది. ఆ తర్వాత ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వ ముఖ్యనేత కొత్త ఎత్తుగడ వేశారు. దరఖాస్తుల సంఖ్య కొంత పెంచాలని.. కానీ, అవి కూడా టీడీపీ సిండికేట్ సభ్యులవే ఉండేలా చూడాలన్నారు. తద్వారా ఒక్కో మద్యం దరఖాస్తుకు రూ.2 లక్షల వరకు నాన్ రిఫండబుల్ డిపాజిట్ భరించాలన్నారు. ఎలాగూ మద్యం దందా ద్వారా విచ్చలవిడి దోపిడీకి పచ్చజెండా ఊపాం కదా అని అసలు లోగుట్టు చెప్పారు. ఫలితంగా.. టీడీపీ సిండకేట్ సభ్యులే ఒక్కొక్కరు వేర్వేరు పేర్లతో దరఖాస్తులు దాఖలు చేశారు.దాచినా దాగని దందా..ఇక టీడీపీ మద్యం సిండికేట్ దందాకు ఎంతగా కనికట్టు చేయాలని చూసినా కుదరలేదు. తెలంగాణతో పోల్చిచూస్తే రాష్ట్రంలో ఈ దరఖాస్తుల ప్రక్రియ ఎంత ఏకపక్షంగా సాగిందన్నది స్పష్టమవుతోంది. విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నదైన తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య కూడా తక్కువే. తెలంగాణలో గత ఏడాది మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు పిలవగాఏకంగా 1.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే.. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 57 దరఖాస్తులు దాఖలయ్యాయి. కానీ, ఆంధ్రప్రదేశ్లో అంతేకంటే అధికంగా 3,396 మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు పిలిచారు. కానీ, దరఖాస్తులు మాత్రం కేవలం 87,116 మాత్రమే రావడం గమనార్హం.అంటే సగటున ఒక మద్యం దుకాణానికి 25 మాత్రమే వచ్చాయి. చివరికి..ఆ దరఖాస్తులుకూడా టీడీపీ సిండికేట్వే. ‘బెల్టు’లూ బార్లా..ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పంచాయతీలో రెండు నుంచి ఆరు వరకు బెల్టుషాపులను ఏర్పాటుచేసేందుకు కసరత్తు జరుగుతోంది. పట్టణాల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటికే గత టీడీపీ హయాంలోని బెల్టు షాపుల నిర్వాహకులతో సిండికేట్ సభ్యులు మంతనాలు మొదలుపెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బలంగా ఉన్న మద్యం సిండికేట్లే ఇప్పుడూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఈ సిండికేట్లను వెనకుండి నడిపిస్తున్నారు. ఒకవేళ లాటరీలో బయటివారికి షాపులు దక్కినా వారి వ్యాపారం సజావుగా సాగాలంటే తమ సిండికేట్లలో కలవాల్సిందేనని సంకేతాలిస్తున్నారు. ఇక ఒక్కో బెల్టుషాపు ఏర్పాటుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్టు చెల్లించాలని చెబుతున్నట్లు తెలిసింది. డిపాజిట్ చేసిన వారికే తమ షాపుల పరిధిలో బెల్టుషాపు ఏర్పాటుకు అనుమతించి అందుకు అవసరమైన సరుకు ఇస్తామంటున్నారు. లేనిపక్షంలో దాడులు చేయించి కేసులు పెట్టిస్తామని హెచ్చరిస్తున్నట్టు సమాచారం. కాగా.. షాపుల నిర్వహణ తగ్గించుకునేందుకే సిండికేట్లు బెల్టుషాపుల ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో మద్యం షాపు నిర్వహణకు నెలనెలా అన్ని రకాల ఖర్చులకు లక్షకు పైగానే వ్యయమవుతుందని వారి అంచనా. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే వారు ‘బెల్టు’ వైపు మొగ్గుచూపుతున్నారు.చివరిరోజూ అరాచకమే..టెండర్ల చివరిరోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. టెండరు కేంద్రాల వద్ద సినీఫక్కీ మాదిరిగా ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరులు మాటువేశారు. ఉదయం నుంచి సాయంత్రం గడువు ముగిసే వరకూ అడుగడుగునా నిఘా ఏర్పాటుచేశారు. వేరే వ్యక్తి ఎవరైనా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లినా.. టెండరు వేసేందుకు దరఖాస్తు తీసుకున్నా.. క్షణాల్లో వారిపై బెదిరింపులకు పాల్పడేలా మందీమార్బలాన్ని మోహరించారు. ‘ఏం మిస్టర్.. ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్లావట. దరఖాస్తు చేద్దామనా? అప్లై చేసి చూడు.. మా వాళ్లను కాదని టెండరు వేస్తే తాటతీస్తా’.. అంటూ కృష్ణాజిల్లాలోని ఓ ఎమ్మెల్యే మద్యం షాపు దరఖాస్తు కోసం వెళ్లిన వ్యక్తిని బెదిరించారంటే అధికార పార్టీ సిండికేట్ల అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. అలాగే.. ఇదే జిల్లా గన్నవరం, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో గతంలో షాపులు నిర్వహించుకున్న వారు లేదా స్థానికులు లేదా ఇతర పార్టీల వారు దరఖాస్తుకు వెళ్తే స్థానిక ఎమ్మెల్యేల అనుచరులు వార్నింగ్లు ఇచ్చి వెనక్కి పంపేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఒకవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు.. సామ, దాన, భేద దండోపాయాలనూ పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రయోగించింది. చివరికి.. అధికార పార్టీ నేతలకూ ఈ హెచ్చరికలు తప్పలేదని భోగట్టా. -
బెదిరింపులు.. దౌర్జన్యాలు.. సర్కారు వారి సిండికేట్ పాలసీ
సాక్షి, విజయవాడ: మద్యాన్ని కూటమి సర్కార్ ఆదాయ వనరుగా మార్చుకుంది. రాష్ట్రంలో ఈ రోజు(శుక్రవారం) రాత్రి 7 గంటలతో మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు ముగియగా.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. 3,396 మద్యం దుకాణాలకు 87,508 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దరఖాస్తుల ద్వారా రూ.1700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు రాగా, ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపులకు 5,704 దరఖాస్తులు వచ్చాయి.నెల్లూరులో తమ అనుచరులకే మద్యం దుకాణాలు ఇప్పిస్తున్నట్లు మంత్రి నారాయణ ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల దందాతో మద్యం వ్యాపారులు భయపడుపోతున్నారు. దీంతో దరఖాస్తులు వేసేందుకు ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. మద్యం షాపులకు ఇతరులు దరఖాస్తులు చేయకుండా కూటమి నేతలు బెదిరింపులకు దిగారు. టీడీపీ నేతలు పేర్లు మీదే మంత్రులు, ఎమ్మెల్యేలు దరఖాస్తులు వేయించారు. టీడీపీ నేతలకు ఎక్సైజ్ అధికారులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతల డైరెక్షన్లో మద్యం మాఫియా చెలరేగిపోయింది. మద్యం షాపులు దక్కించుకునేందుకు బెదిరింపులకు దిగింది.కాగా, ఒకపక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు పోలీసుల ద్వారా సామ, దాన, దండోపాయాలను కూటమి ప్రభుత్వం ప్రయోగిచింది. ‘‘అసలు మీరు ఈ టెండర్లు ఎందుకు వేస్తున్నట్లు? సరే టెండర్లు దక్కించుకున్నారే అనుకోండి. టీడీపీ నేతలను కాదని అసలు మద్యం దుకాణాలను మీరు నిర్వహించగలరా? అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు మీపై కేసులు నమోదవుతాయి. ఎక్సైజ్ దాడులూ జరుగుతాయి. ఏదో ఒక కేసు బుక్ చేసి మిమ్మల్ని మూసి వేయడం ఖాయం. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ? మద్యం టెండర్ల నుంచి మీకు మీరే మర్యాదగా తప్పుకోండి..!’’ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఇతర పార్టీల నేతలకు స్థానిక ఎస్సై, సీఐల ద్వారా బెదిరింపులకు దిగినట్లు సమాచారం.ఇదీ చదవండి: మద్యం షాపులన్నీ నాకే కావాలి..!తాడిపత్రిలో 9 మద్యం షాపులు, రూరల్ పరిధిలో 3, యాడికిలో 4, పెద్దవడుగూరులో 3, పెద్దపప్పూరులో ఒక షాపు కలిసి మొత్తం 20 మద్యం దుకాణాలు తమ ఆదీనంలో ఉండాలని జేసీ ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన ఓ నేత 20 దుకాణాలకు దరఖాస్తు వేసేందుకు ప్రయత్నించగా ఆయన్ను విరమించుకునేలా చేసినట్లు తెలుస్తోంది. టెండర్లు వేసిన ఇతర నేతలపై జేసీ వర్గం దౌర్జన్యాలకు తెగబడింది.వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ రామ్మోహన్ను స్కార్పియోలో కిడ్నాప్ చేసి తరలించారు. ఎంపీపీ ఉమాదేవి ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తేవడంతో యాడికి సీఐ ఈరన్న టీడీపీ శ్రేణుల నుంచి రామ్మోహన్ను విడిపించి తీసుకొచ్చారు. యాడికిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వైఎస్సార్ సీపీ నాయకుడు, యాడికి ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ ఇంటి తాళాలను టీడీపీ మూకలు గురువారం పగులగొట్టి బెదిరింపులకు దిగాయి. వైఎస్సార్ సీపీకి చెందిన మరో నాయకుడు బాల్రెడ్డి ఇంటికి వెళ్లి దరఖాస్తు చేయవద్దని బెదిరించారు. -
ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి,అమరావతి: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే టీడీపీ నేతలు,లిక్కర్ సిండికేట్ల కోసం ప్రభుత్వం గడువు పెంచినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు అవుతున్నాయి. వాటాలు ఇస్తునే మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తామని లేదంటే అంతు చూస్తామంటూ సిండికేట్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వ్యాపారులు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే సాహసం చేయడం లేదు.రాష్ట్రంలో పలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారు లేకపోవడం, అవి ఖాళీ ఉన్నాయి. ఈ తరుణంలో ఖజానా నింపుకునేందుకు మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. -
నాకేం తక్కువ..? నాకూ మద్యం షాపు కావాలి
బొబ్బిలి: ఆకలిగొన్న పులుల్లా మద్యం షాపు దక్కించుకోవడానికి అర్రులు చాస్తున్న సిండికేట్ వ్యాపారుల మధ్యలోని ఓ బామ్మ వచ్చి తనకూ మద్యం షాపు కావాలంటూ దరఖాస్తు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. మద్యం షాపు కోసం దరఖాస్తు చేయడానికి కార్యాలయానికి వచ్చిన ఓ వృద్ధురాలిని చూసిన ఎక్సైజ్ అధికారులు ముసిముసి నవ్వులు నవ్వుతూ ముక్కున వేలేసుకున్నారు. బొబ్బిలి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో టెండర్ బాక్స్లో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఓ బామ్మ వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దత్తిరాజేరు మండలం పి.లింగాలవలసకు చెందిన పప్పల అచ్చయ్యమ్మ(85) ఎకై ్సజ్ అధికారులు నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరవుతూ అందరినీ ఆలోచనలో పడేస్తోంది. బొబ్బిలి కార్యాలయానికి సోమవారం సాయంత్రం వచ్చిన ఆ బామ్మకు ఓ బల్ల ఇచ్చి స్నాక్స్ ఇచ్చి ఎక్సైజ్ అధికారులు కూడా మర్యాద చేయడం విశేషం. -
టీడీపీ మద్యం కేటుగాళ్లకు ఎక్సైజ్ సహకారం
-
తప్పతాగండిక!.. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక
గ్రామీణాభివృద్ధికి ఊతమిస్తూ ప్రజలకు ఉపయోగపడేలా గాంధీ జయంతి సందర్భంగా ఏదో ఒక కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టాల్సిందిపోయి.. తద్భిన్నంగా రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడలా బార్లు.. వెల్లివిరిసేలా చర్యలకు నడుం బిగించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్ర ప్రజలకు ‘సరికొత్త మద్యం’ కానుకను అందించనుంది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు ‘పచ్చ’ జెండా ఊపుతూ సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రత్యేక ఆర్డినెన్స్, ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. టీడీపీ కూటమి సిండికేట్కు అనుకూలంగా పక్కాగా కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఈ పరంపరలో ఈ నెల 12 నుంచి అంటే దసరా రోజున ప్రైవేటు మద్యం దుకాణాల ద్వారా దోపిడీకి ‘పచ్చ’ ముఠా కొబ్బరి కాయ కొట్టనుంది.సాక్షి, అమరావతి : ‘తప్పతాగండి.. సమస్యలు మరచిపోండి.. ప్రశ్నించడం మానేయండి..’ అంటూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకోసం రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దశల వారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేయడంలో భాగంగా ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించి ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా దశల వారీగా వాటిని 2,934కు తగ్గించింది. మద్యం దుకాణాల వేళలు కుదిస్తూ ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకే విక్రయాలకు అనుమతించింది. 4,380 పర్మిట్ రూమ్లు రద్దు చేయడంతో పాటు ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగించింది. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వడం ఆపేసింది. వీటన్నింటినీ కొనసాగించాల్సింది పోయి.. అందుకు పూర్తి విరుద్ధంగా రాష్ట్రంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం.. మద్యం ప్రవాహానికి గేట్లు ఎత్తేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాలు 2,934 ఉండగా.. వీటిని ప్రభుత్వ పరిధి నుంచి తగ్గించి.. మొదటి దశలోనే వాటి సంఖ్యను 3,396 దుకాణాలకు పెంచింది. వాటికి అదనంగా 12 స్మార్ట్ స్టోర్స్ ఏర్పాటు చేయనుంది. ఏడాదికి రూ.కోటి లైసెన్స్ ఫీజుగా ఈ స్మార్ట్ స్టోర్స్ కాల పరిమితి ఏకంగా ఐదేళ్లుగా నిర్ణయించింది. తర్వాతి దశల్లో మరిన్ని మద్యం దుకాణాలు, స్మార్ట్ స్టోర్స్ను అనుమతించాలని భావిస్తోంది. ఇక మద్యం దుకాణాల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అధికారికంగా అనుమతించనుంది. అనధికారికంగా అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరపాలని నిర్ణయించింది. పచ్చ సిండికేట్దే మద్యం దందా» ప్రైవేటు మద్యం దుకాణాల కేటాయింపు అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగనుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు పచ్చ సిండికేట్ ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే. ఈసారి అంతకు మించి అన్న రీతిలో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేసింది. అందుకోసం ఆర్డినెన్స్ జారీ నుంచి లైసెన్సుల కేటాయింపు వరకు రాష్ట్ర ప్రభుత్వమే టీడీపీ కూటమి సిండికేట్కు అనుకూలంగా పక్కా పన్నాగంతో పావులు కదిపింది. » సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతినిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి.. దాంతోపాటే ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచే మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ నెల 11న లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తామని, 12 నుంచే అంటే దసరా రోజునే ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని వెల్లడించింది.» అంటే టీడీపీ మద్యం సిండికేట్కు అనుకూలంగా ప్రభుత్వం ఎంత పక్కా పన్నాగంతో వ్యవహరించిందన్నది స్పష్టమవుతోంది. పేరుకి లాటరీ విధానంలో కేటాయింపు అని ప్రకటించినప్పటికీ.. టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులే బినామీ పేర్లతో మద్యం దుకాణాలను గుప్పిట పట్టేందుకు ఇప్పటికే సిండికేట్ను రూపొందించారు. » రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన జాబితా ప్రకారమే మద్యం దుకాణాల లైసెన్సులు కేటాయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇప్పటికే మౌఖికంగా ఆదేశించారు. అందుకు తగ్గట్గునే శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ ప్రజాప్రతినిధులు సిండికేట్లుగా ఏర్పడ్డారు. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకోవాలని.. ఎవరు టెండర్లు దాఖలు చేసినా సరే వారికి ఎవరూ దుకాణం అద్దెకు ఇవ్వడానికి వీల్లేదని, ఇచ్చినా ఎక్సైజ్ శాఖ అధికారుల ద్వారా దాడులు చేసి వేధిస్తామని బెదిరించాలని హుకుం జారీ చేశారు. టెండర్ల ప్రక్రియ మొదలు కావడమే తరువాయి టీడీపీ సిండికేట్ రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలను హస్తగతం చేసుకోవడం ఖాయం.ఉద్యోగుల నిరసన.. తెరచుకోని దుకాణాలుప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసనతో రాష్ట్రంలో మంగళవారం మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. తమ ఉద్యోగాలను అర్ధంతరంగా తొలగించిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల మంది తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ మద్యం దుకాణాలను తెరవలేదు. మరోవైపు టీడీపీ అనుకూల సిండికేట్కు మద్యం దుకాణాలను కట్టబెట్టాలన్న ఆతృతలో ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి హడావుడిగా తీసుకువచ్చిన జీవోతో మరింత గందరగోళం నెలకొంది. మరోవైపు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను తెరవకూడదు. అంటే వరుసగా రెండు రోజులు మద్యం అమ్మకాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందింది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మంగళవారం సాయంత్రానికి దుకాణాలు తెరిపించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు, ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని మద్యం నిల్వలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. కానీ మంగళవారం (అక్టోబరు 1) నుంచి ఈ నెల 11 వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాల విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆర్డినెన్స్ ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇక ఉనికిలో లేనట్టే. కాబట్టి వాటిని తెరవకూడదు.. మద్యం అమ్మకూడదు. దాంతో రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ అధికారులు మద్యం దుకాణాలను తెరవలేరు. ఈ విషయాన్ని మంగళవారం మధ్యాహ్నం గుర్తించిన ప్రభుత్వం కంగారు పడింది. ప్రైవేటు మద్యం దుకాణాలు వచ్చేంత వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలను కొనసాగించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. దీంతో వారు ఆందోళన చేస్తున్న ఉద్యోగుల వద్దకు వెళ్లి అతి కష్టంగా కొంత మందికి నచ్చజెప్పి దుకాణాలు తెరిపించారు. చాలా మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఈ బెదిరింపులేంటి?శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మంగళవారం ఎక్సైజ్ పోలీసుల బెదిరింపుల నడుమ సూపర్వైజర్లు, సేల్స్మెన్లు మద్యం అమ్మకాలు సాగించారు. తమ ఉద్యోగానికి భద్రత చూపించని కూటమి ప్రభుత్వం.. కేసులు పెడతామంటూ బెదిరిస్తూ విక్రయాలు చేయించడంపై వారు ఎదురుతిరిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నాటికి పూర్తయిన లావా దేవీలన్నింటి గురించి లెక్కలు చెప్పి, ప్రభుత్వం కేటాయించిన కానిస్టేబుల్కు మంగళవారం తాళాలు, షాపు హ్యాండోవర్ చేశారు. అయితే తాము సూచించే తేదీ వరకు అమ్మకాలు జరపాలని ఎక్సైజ్ పోలీసు అధికారులు ఆదేశించడం పట్ల నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ ఉద్యోగాలు తీసేయడమే కాకుండా, ఇలా బెదిరించడం తగదని జిల్లా సేల్స్మెన్, సూపర్వైజర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కీర్తి ధర్మారావు, సంతోష్కుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఉదయం నుంచి షాపులు మూత పడటంతో మద్యం విక్రయాలు దాదాపు రెట్టింపు ధరతో సాగాయి.నోటిఫికేషన్లో ప్రధానాంశాలు» మంగళవారం నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తుల స్వీకరణ » ఈ నెల 11వ తేదీ లాటరీ ద్వారా లైసెన్సుదారుల ఎంపిక » ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభంలైసెన్స్ ఫీజు వివరాలు» 10 వేల లోపు జనాభా ఉంటే: రూ.50 లక్షలు» 10 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.55 లక్షలు» 50,001 నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.65 లక్షలు» 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.85 లక్షలు -
పెద్దల పండుగకు.. ‘గాంధీ’ గండం
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ఓ విచిత్రమైన సమస్య వచ్చి పడింది. ప్రతి ఏటా మహాలయ అమవాస్య రోజున పెద్దల పండుగ చేసుకుని శక్తికొద్దీ మాంసాహారాన్ని భుజించడం తరతరాల సంప్రదాయం. ఈసారి గాంధీ జయంతి అయిన అక్టోబరు 2వ తేదీన ఈ పర్వదినం రావడంతో ఆటంకం ఏర్పడింది. పెద్దల పండుగ అంటేనే మద్యం, మాంసం ఉంటాయి. స్వర్గస్తులైన పెద్దలకు అవి రెండూ నైవేద్యంగా సమరి్పంచి ఆపై తాము పుచ్చుకొంటారు. కానీ గాంధీ జయంతి రోజున మద్యం షాపులు, మాంసాహార విక్రయాలు నిషేధిస్తారు. అనుమతికి డిమాండ్ ఈ నేపథ్యంలో గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ మనవి చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అనాదికాలంగా వస్తున్న సంప్రదాయానికి భంగపరచడం సబబు కాదని కొందరు పేర్కొన్నారు. ప్రజల డిమాండ్ల నేపథ్యంలో ఏం చేయాలా? అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. -
ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన మద్యం విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే..నూతన లిక్కర్ పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయనుంది. నూతన మద్యం పాలసీపై మహిళలు భగ్గుమంటున్నారు. గాంధీ జయంతి రోజున రోడ్లపై ధర్నాలు చేస్తామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.అయితే, 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా మద్యంపై పెత్తనం ప్రైవేట్ వ్యక్తులదే ఉండేది. పేరుకు టెండర్లయినా.. కొంతమంది చేతుల్లోనే వైన్షాపులుండేవి. బార్లు, వైన్షాపులన్న తేడా లేకుండా.. అంతా సిండికేట్గా మారిపోయేవారు. వారు నిర్ణయించిందే ధరకే అధికంగా వసూలు చేసేవారు. దాడులు చేసి, అక్రమ దందాను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. మామ్మూళ్లకు అలవాటుపడి, చోద్యం చూసేవారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే.. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి సిండికేటుగాళ్లకు చెక్ పెట్టింది. ప్రైవేట్ వ్యక్తులకే మద్యం దుకాణాలను కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పుడు మళ్లీ పాత విధానమే అమలులోకి రానుంది.ఇదీ చదవండి: సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!! -
మద్యాన్ని ప్రైవేట్ పరం చేయనున్న సీఎం చంద్రబాబు
-
మద్యం అమ్మకాల్లో తగ్గేదే లే!
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా ఉండేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ఇక నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెడతామని తెలిపింది. కొత్త మద్యం విధానాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్లు మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. తమ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి ఆయనతో చర్చించారు. కొత్త మద్యం విధానంలో చేర్చాల్సిన పలు అంశాలను సీఎం వారికి సూచించారు. కొత్త మద్యం విధానంపై రూపొందించిన నివేదికను బుధవారం నిర్వహించనున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం ఈ నెల 30తో ముగుస్తుందన్నారు. దాంతోపాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని ఉద్యోగుల కాల పరిమితి కూడా ముగుస్తుందని పరోక్షంగా వెల్లడించారు. నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలు ప్రైవేటు మద్యం దుకాణాలను జిల్లా కమిటీలు లాటరీ విధానంలో కేటాయిస్తాయని మంత్రి రవీంద్ర చెప్పారు. మద్యం దుకాణాల టెండర్లలో సిండికేట్ కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కమిటీలదేనని స్పష్టం చేశారు. గీత కారి్మకులకు 10 శాతం మద్యం దుకాణలను కేటాయిస్తామన్నారు. జనాభా ఎక్కువగా ఉండే నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం ధరలను ఓ కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. సామాన్యులకు అందుబాటు ధరలో ఒక బ్రాండును ప్రవేశపెడతామని వెల్లడించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో వివిధ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మద్యం విధానాన్ని రూపొందించామన్నారు. మద్యం విక్రయాల ద్వారా వ చ్చిన ఆదాయం నుంచే మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకు డి అడిక్షన్ సెంటర్లు, కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేలా కొత్త మద్యం విధానం ఉంటుందన్నారు. నాణ్యమైన మద్యాన్ని అందిస్తూనే ఆదాయ సముపార్జనలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఆరు రాష్ట్రాల్లో విధానాలను పరిశీలించిన అనంతరమే కొత్త మద్యం విధానాన్ని రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి
సాక్షి, అమరావతి : మద్యం పాలసీని రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఏమిటని మహిళా సంఘాల ఐక్య వేదిక (జేఏసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేదిక నేతలు సుంకర పద్మశ్రీ, డి. రమాదేవి, పి.దుర్గాభవాని, పి. పద్మ, ఎన్. విష్ణు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సర్కారుకు 11 సూచనలు చేశారు. ప్రభుత్వం అక్టోబరు నుంచి అమలులోకి తెచ్చే మద్యం పాలసీని కేబినెట్ ఆమోదంతో త్వరలో ప్రకటించనున్నట్లు.. లైసెన్సింగ్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులను ఇవ్వనున్నట్లు, లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రానున్నట్లు వార్తలు వస్తున్నాయని వారు తెలిపారు.అయితే, మద్యాన్ని నియంత్రించడం, నేరాలను అరికట్టడం, ప్రజల ఆరోగ్యం మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలపై హింసను అరికట్టడం ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని చెప్పారు. అక్రమ అమ్మకాలు లేకుండా చేయడమా? లేక ఆదాయాన్ని పొందడమా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు మరీ ముఖ్యంగా టీడీపీ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా?.. మహిళలపై హింసకు కారణం కాదా?.. నేరాలు పెరగకుండా నిరోధిస్తుందా?.. అని వారు ప్రశ్నించారు. అధ్యయనంలో ఏం తేల్చారు..ఇక వివిధ రాష్ట్రాల్లోని మద్యం విధానాలపై అధ్యయనానికి వెళ్లిన బృందాలు తెలంగాణ విధానం బాగుందని రిపోర్టు ఇచ్చినట్లు మీడియాకు లీకేజీలిచ్చారని,.. కానీ, ఆ బృందాలు ఏం అధ్యయనం చేసి వచ్చాయో ఆ నివేదికను విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు, ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోవాలని, సాధారణ జనానికి నష్టంలేని విధానాన్ని రూపొందించాలని జేఏసీ నేతలు కోరారు. ఇక రాష్ట్రంలో వేళలతో నిమిత్తం లేకుండా మద్యం అక్రమ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. -
ఏపీలో లిక్కర్ సిండికేట్లకే మద్యం షాపులు
-
ప్రైవేట్ చేతుల్లోకే ‘లిక్కర్’.. చంద్రబాబు సర్కార్ స్కెచ్ రెడీ
సాక్షి, గుంటూరు: మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో కూటమి సర్కార్ బండారం బట్టబయలైంది. లిక్కర్ సిండికేట్లకే మద్యం షాపులు కేటాయింపునకు చంద్రబాబు ముందే నిర్ణయించినట్లు తేటతెల్లమైంది. ప్రైవేటు వ్యక్తులకే షాపులంటూ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.ప్రైవేటు షాపులే వస్తాయి..ప్రైవేటు వాళ్లకే ఇస్తామంటూ మద్యం షాపుల సిబ్బందితో కొల్లు రవీంద్ర చెప్పారు. నిర్ణయం తీసేసుకుని సబ్ కమిటీ ఏర్పాటు అంటూ చంద్రబాబు ప్రభుత్వం డ్రామాకు తెరతీస్తూ.. ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్ , సత్యకుమార్, గొట్టిపాటి రవితో కమిటీ ఏర్పాటైంది.ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేలా ఉప సంఘం నివేదిక ఇవ్వనుంది. మళ్లీ పాత పద్దతిలో ఇష్టా రీతిన అమ్ముకునేందుకు చంద్రబాబు సర్కార్ రెడ్ కార్పెట్ సిద్ధం చేసింది. టీడీపీ నేతలకు, లిక్కర్ సిండికేట్లకు షాపులు ఇచ్చేందుకు స్కెచ్ రెడీ వేసింది. -
పుణే ఘటన: లంచాల మోజు.. పోలీసుల అక్రమాలు వెలుగులోకి!
రెండు నిండు ప్రాణాల్ని బలిగొన్న పుణే పోర్షే హిట్ అండ్ రన్ కేసు.. రకరకాల కోణాల్లో చర్చకు దారి తీసింది. వాహనం నడిపింది ఓ మైనర్ కావడంతో పేరెంటింగ్ కోణంలో ప్రధాన చర్చ నడిచింది. మైనర్ బాలుడి తండ్రి తన పలుకుబడి ఉపయోగించి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం.. ఆ ప్రయత్నంలో నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు, రక్త నమూనాలు తారుమారు చేయటంతో డాక్టర్ల అరెస్టు.. తండ్రి, తాతల అరెస్ట్.. పోర్షే కథలు రోజుకొకటి వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ కేసు కారణంగానే.. నగరంలో అర్ధరాత్రుల దాకా అనుమతులు లేకుండా బార్లు, పబ్ల నిర్వహణ, వాటిల్లో డ్రగ్స్ వాడకం.. ఆ మొత్తం వెనుక అధికారుల అవినీతి బాగోతం బయటపడింది ఇప్పుడు.. పుణేలో అర్ధరాత్రి దాకా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహించే పబ్లు, బార్లు.. పైగా డ్రగ్స్ కోణాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు ఓ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్.. ఈ హిట్ అండ్ రన్ కేసుపై ఇదివరకే నిరసన వ్యక్తం చేశారు. పబ్లు, బార్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన యెరవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆయన ఇప్పుడు మరో సంచలన చర్చకు దారితీశారు.చదవండి: Pune Porsche Case: రీల్ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!లంచాల మోజుతో పోలీసులు అక్రమంగా నిర్వహిస్తున్న పబ్ యజమానులు, డ్రగ్స్ ట్రేడర్ల వద్ద నెలకు లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారని రవీంద్ర ధంగేకర్ ఆరోపణులు చేశారు. పుణె ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రతినెలా లంచాలు తీసుకుంటున్నారని, లంచాల సేకరణకు కానిస్టేబుళ్లు, ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించుకున్నారని తెలిపారు.#Pune #Porsche Case: Ravindra Dhangekar Discloses Names Of Persons Involved In ' HAFTA 'From Pubs, Clubs and Liquor Shops In a major crackdown, the Kasba Peth MLA Ravindra Dhangekar revealed that police are collecting monthly bribes amounting to lakhs of rupees from the owners… pic.twitter.com/5ehtFFSuW8— Pune Pulse (@pulse_pune) May 27, 2024 విమాన్ నగర్, కోరేగావ్ పార్క్, కళ్యాణి నగర్, భుగావ్ భూకుమ్, బానేర్, హింజవాడి, పింప్రి చించ్వాడ్, లోనావాలా ప్రాంతాల్లో ఉండే అర్ధరాత్రి, రూఫ్టాప్లో నిర్వహించినే హోటళ్ల వద్ద లంచాలు తీసుకొని చూసిచూడనట్లు వ్యవహరిస్తారని అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పోలీసు నెలకు వసూలు చేసే మొత్తం దాదాపు రూ. 78 లక్షలు ఉంటుందని లెక్కలతో సహా మీడియాకు తెలిపారు. లంచాలు తీసుకునే ప్రాంతాలు, వాటిని వసూలు చేసే పోలీసు కానిస్టేబుల్స్ పేర్లను ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టారు.కస్బా పేట్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టిన ఈ వివరాలు ప్రస్తుతం మహారాష్ట్రలో సంచలనంగా మారాయి. అదేవిధంగా పుణె పోలీసు డిపార్టుమెంట్లో ఎప్పటి నుంచో ఉన్న అవినీతి వ్యవహారం తాజాగా బట్టబయలు అయింది. పుణె సిటీ కల్చర్, చట్టాల అమలుపై తీవ్ర చర్చ జరుగుతోంది. -
నేటి అర్ధరాత్రి వరకు మద్యం
హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31వ తేదీ అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చూసి ఉంటాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక బార్లు, క్లబ్బులు, పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నూతన సంవత్సరానికి వీడుకోలు పలికే డిసెంబర్ 31 వేడుకలను పురస్కరించుకొని పలు ఆంక్షలు, మార్గదర్శకాలను జారీచేశారు. పోలీసులు నేటి రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులకు సిద్దం కాగా.. తాగి వాహనాలు నడిపితే బండిని సీజ్ చేయటంతో పాటు రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. -
గ్రామాల్లోని బెల్టు దుకాణల మూసివేతకు ఆదేశాలు వెలువడేనా?!
మహబూబ్నగర్ క్రైం: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో బెల్టు దుకాణాలను మూసివేస్తామని ప్రకటించింది. సీఎం రేవంత్రెడ్డి సైతం దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించి పల్లెల్లో ఉన్న బెల్టు దుకాణాలను మూసి వేయించాలని సంబంధిత ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో 230 మద్యం దుకాణాలు, 38 బార్లు ఉండగా.. వీటి ద్వారా ఏటా రూ.2 వేల కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ నెల 1 నుంచి కొత్తగా లైసెన్స్లు పొందినవారు దుకాణాలను ప్రారంభించారు. గ్రామాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉండటం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే నిత్యం పార్టీ కార్యకర్తలకు, ఇతరులకు మద్యం పంచడంతో గత రెండు నెలల నుంచి బెల్టు దుకాణాలను ఎక్సైజ్ అధికారులు మూసివేయించారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్ల బెల్టు దుకాణాలు బహిరంగంగా తెరవకపోయినా రాత్రివేళలో రహస్యంగా విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందు ఒక్కో గ్రామంలో తక్కువగా మూడు వరకు బెల్టు దుకాణాలు ఉండేవి. అధికారుల పాత్ర.. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే మద్యం విక్రయించాలి. అంటే బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మడం చట్టరీత్యా నేరం. ఉమ్మడి జిల్లాలో గతంలో ఏకంగా వేల సంఖ్యలో బెల్టు దుకాణాల్లో విక్రయాలు సాగించారు. ఆ స్థాయిలో బెల్టు దుకాణాలు ఉన్నాయంటే సంబంధిత అధికారుల పాత్ర ఎంత ఉంటుందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న 230 మద్యం దుకాణాల నుంచి బెల్టు షాపుల యజమానులు మద్యం పరిమాణం, బ్రాండ్ను బట్టి రూ.10– 20 వరకు ఎక్కువగా అమ్ముతుండగా.. పల్లెల్లో బెల్టు దుకాణాల నిర్వాహకులు దానిని రూ.70– 100 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో ఒక్కో మద్యం దుకాణానికి వీటి ద్వారా నెలకు రూ.1.50 లక్షల వరకు అదనంగా ఆదాయం వస్తోందని అనధికార అంచనా. ఇలా సుమారు 3 వేలకుపైగా బెల్టు దుకాణాల్లో విక్రయించే మద్యం విలువ నెలకు రూ.350 కోట్లపైమాటే. మరోవైపు దాబాల్లోనూ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాబాలు మూతపడినా.. కొన్నిచోట్ల రాత్రివేళలో నడుపుతున్నారు. కొత్త ప్రభుత్వ నిర్ణయంతో ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి దాబాలతోపాటు పల్లెల్లో మద్యం పారిస్తున్న బెల్టు దుకాణాలను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది. చర్యలు తీసుకుంటాం.. ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా దృష్టిపెడతాం. – దత్తురాజ్గౌడ్,డీసీ ఎక్సైజ్శాఖ, మహబూబ్నగర్ -
ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్: ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండీల్య ఉత్తర్తులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నిషేధిత కర్రలు, లాఠీలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో సంచరించడం నిషేధమని, సంఖ్యలో గుంపులుగా ఐదుగురి కంటే ఎక్కువగా తిరగకూడదని, మైక్లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫొటోలు, సింబల్స్, ప్లకార్డులు, కులమత ద్వేషాలను రెచ్చగొడుతూ రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రసంగాలు చేయడంపై నిషేధా/æ్ఞలు విధించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలిటరీ, ఎన్నికల అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. -
కిక్కే కిక్కు.. తెలంగాణ అబ్కారీ శాఖకు కాసుల పంట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మద్యం టెండర్ల ప్రక్రియకు గడువు ముగిసింది. చివరి రోజు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, వరంగల్, మహబూబ్ నగర్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి.. అత్యల్పంగా నిర్మల్ నుంచి దాఖలయ్యాయి. మొత్తం లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా.. రూ.2వేల కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. తద్వారా అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం సమకూరినట్లయ్యింది రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు టెండర్లు నిర్వహించగా, ఎక్సైజ్ శాఖ అంచనాలను మించి దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ రాత్రి 12 లేదా రాత్రి ఒంటి గంట వరకు పూర్తి స్థాయి లెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,03,489 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. గత ఏడాది 79 వేల దరఖాస్తులు రాగా, గత ఏడాదితో పోలిస్తే 40 శాతం దరఖాస్తులు పెరిగాయి. చదవండి: కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే! ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉండటంతో మద్యం టెండర్ ప్రక్రియతో అబ్కారీ శాఖకు కాసుల పంట పడుతోంది. ఈ నెల 21న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అదే రోజు లైసెన్సులు జారీ చేయనున్నారు. డిసెంబర్ 1నుంచి కొత్త షాపులు ప్రారంభం కానున్నాయి. టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ తెలంగాణ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రద్దు చేయాలంటూ లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు భూక్యా దేవా నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీసా చట్టానికి అనుగుణంగా వైన్స్ టెండర్స్ నోటిఫికేషన్ జారీ చేయలేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. షెడ్యూల్ ఏరియాలో పీసా చట్టానికి అనుగుణంగా తీర్మాణాలు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీసుకోకుండా టెండర్ల ప్రక్రియ జారీ చేసిందని, వెంటనే టెండర్లు నిలిపి వేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది మంగీలాల్ నాయక్ కోరారు. రేపటి వరకు ప్రభుత్వం సమయం కోరగా, తదుపరి విచారణను హైకోర్టు.. రేపటికి వాయిదా వేసింది. -
రామోజీ ‘రక్త’ కన్నీరు!
రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేయాలో రామోజీ కంటిచూపుతో డిసైడ్ చేస్తాడు.. కాంట్రాక్టులు ఎవరికి కట్టబెట్టాలో ఆయనే శాసిస్తాడు.. విధానపరమైన నిర్ణయాలనూ రామోజీరావే నిర్దేశిస్తాడు.. ఇదంతా 2019 చంద్రబాబు హయాం వరకు ఉన్న పరిస్థితి. అప్పటి వరకు ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది.. చెల్లింది కూడా. ఆ తర్వాత సీన్ మారింది.. ఇప్పుడు నాలుగేళ్లుగా రాష్ట్రంలో రామోజీ ఆటలు సాగడంలేదు.. తన సమీప బంధువు నుంచి పోలవరం కాంట్రాక్టు మొదలుకుని నిన్నమొన్నటి మార్గదర్శి చిట్ఫండ్స్ వరకూ ఆయనకు తరచూ నోట్లో పచ్చివెలక్కాయలు పడుతున్నాయి. గొంతులో ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నది జీ హుజూరంటూ తలూపే చంద్రబాబు సర్కారు కాదు కదా.. పుష్కలంగా ప్రజామద్దతు ఉన్న వైఎస్ జగన్ సర్కార్ ఇది. పైగా తన జేబులో మనిషి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు వైభవం మరోవైపు మిణుకుమిణుకుమంటోంది. దీంతో రామోజీకి దిక్కుతోచడంలేదు..సరికదా పిచ్చెక్కినట్లు ఉంటోంది. అంతే.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు వైఎస్ జగన్ సర్కారుపై అడ్డగోలుగా.. తన పాఠకులు విసుగెత్తిపోయారనే కనీస స్పృహ కూడా లేకుండా నిత్యం కలంకూట విషం చిమ్ముతున్నాడు. అందులో భాగంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ మద్య విధానంపై వాస్తవాలను వక్రీకరిస్తూ ‘రక్త మాంసాలతో వ్యాపారం’ అంటూ ఎప్పటిలాగే మరోసారి విషం కక్కాడు. ఈ విషబీజాలు మీకు కిక్కు ఇస్తాయేమోకానీ మీరనుకున్న లక్కు నెరవేరదు రామోజీ..! నిత్యం అబద్ధాలు అల్లుతూ రాసే విషపు రాతలోని పచ్చినిజం ‘ఏది నిజం’.. ఇదిగో... సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మద్య విధానంపై వాస్తవాలను వక్రీకరిస్తూ ‘రక్త మాంసాలతో వ్యాపారం’ అంటూ ఈనాడు మరోసారి విషం చిమ్మింది. చంద్రబాబు అధికారంలో లేడన్న బాధ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా విజయవంతంగా కొనసాగుతున్నారన్న అక్కసు అంతా కలగలిపి మరీ అక్షరాల్లో కూర్చి తన కరపత్రికలో కడుపుమంట తీర్చుకున్నాడు రామోజీ. కానీ, వాస్తవం ఏమిటంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న మద్యం విధానం అందిస్తున్న ఫలాలు ఏమిటో ప్రజలకు తెలుసు.. బెల్ట్ దుకాణాల్లేని పల్లెలకు తెలుసు.. పర్మిట్రూమ్లు లేని ఊర్లకు తెలుసు.. మద్యం రేట్లు అమాంతంగా పెరగడంతో ఆ వ్యసనానికి తమ భర్తలు, పిల్లలు క్రమంగా దూరమవుతుండటంతో ఊరట చెందుతున్న అక్కాచెల్లెమ్మలకు తెలుసు.. దశాబ్దాలుగా నాటుసారా తయారీ తప్ప మరో దిక్కులేని అగత్యం నుంచి బయటపడి, ప్రస్తుతం దర్జాగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో సామాజిక గౌరవం పొందుతున్న కుటుంబాలకు తెలుసు.. సంక్షేమ పథకాలతో ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద కుటుంబాలకూ తెలుసు. ప్రజలు అందరికీ వాస్తవాలు తెలుసు అన్నదే ఈనాడు రామోజీరావు దుగ్థ. ప్రజలు చంద్రబాబును ఏమాత్రం నమ్మడం లేదనే ఆయన ఆక్రోశం. వైఎస్ జగన్మోహన్రెడ్డిపట్ల జనాదరణ రోజురోజుకు మరింతగా పెరుగుతుండడమే ఆయన ఆందోళన. అందుకే తనకు అలవాటైన రీతిలో విష ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రామోజీ, చంద్రబాబు ద్వయానికి కష్టంగా ఉన్నా సరే వారు ఇప్పటికైనా గుర్తించాల్సిన వాస్తవం ఏమిటంటే.. మీ టైమ్ అయిపోతోంది.. మీ కట్టుకథలకు కాలం చెల్లింది. తెలుస్తోందా రామోజీ.. అప్పట్లో మూడు పర్మిట్ రూమ్లు..ఆరు బెల్ట్ దుకాణాలు.. మద్యం విక్రయాలను దశల వారీగా నియంత్రిస్తామన్న మేనిఫెస్టోలోని హామీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోటీడీపీ నేతల మద్యం సిండికేట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు పర్మిట్ రూమ్లు.. ఆరు బెల్ట్ దుకాణాలుగా మద్యం ఏరులై పారిందన్న నిజం పాపం రామోజీరావుకు గుర్తుండి ఉండదు. అప్పట్లో మద్యం మాఫియా యథేచ్ఛగా ప్రజలను దోపిడీ చేసింది. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతల గుప్పెట్లోనే ఉండేవి. వేళాపాళా లేకుండా 24గంటలూ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగేవి. ఎమ్మార్పీ ధరల కంటే 25శాతం వరకు అధిక ధరలకు అమ్ముతున్నా సరే నాడు ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తూ ఉండాల్సి వచ్చేది. సీఎంగా జగన్ వచ్చాక.. కానీ, ఈ మద్యం మాఫియా అరాచకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ఆయన రద్దుచేశారు. 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేసేశారు. దాంతో రాష్ట్రంలో మద్యం మాఫియాను తుదముట్టించారు. అందుకోసం.. మద్యం దుకాణాల వేళలు కుదింపు ప్రైవేటు వ్యక్తులు అయితే ఎంతగా మద్యం విక్రయాలు పెంచితే తమకు అంతటి లాభం వస్తుందని అనుకుంటారు. ప్రస్తుతం మద్యం దుకాణాలు ప్రభుత్వానివే కాబట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహించాల్సిన అవసరమేలేదు. ఇక మద్యం విక్రయాల సమయాలను బాగా కుదించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉ. 10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అధికారంగా విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24గంటలూ విక్రయిస్తూ ఉండేవి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం మద్యం దుకాణాల సమయాన్ని కుదించి కచ్చితంగా అమలుచేస్తున్నారు. ఉ.10గంటల నుంచి రాత్రి 9గంటల వరకే విక్రయాలను అనుమతించారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ల రద్దు అంతేకాదు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో 43వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. టీడీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లకు అనుమతించారు. అంటే మద్యం దుకాణాలే అనధికారికంగా బార్లుగా కూడా చలామణి అయ్యేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఇవీ రద్దయ్యాయి. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వ పరం చేసింది. అంతేకాదు.. మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కాదనగలరా రామోజీరావుగారూ.. బార్ల సంఖ్య పెంచలేదు టీడీపీ ప్రభుత్వం ఏటా బార్ల సంఖ్యను పెంచేది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు ఇక దశలవారీగా మద్య నియంత్రణ విధానం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలను సగానికి పడిపోయాయి. అందుకు ఈ గణాంకాలే తార్కాణం.. మేనిఫెస్టోలో హామీ మేరకే షాక్ కొట్టేలా మద్యం ధరలు.. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లోనూ మేనిఫెస్టోలోనూ స్పష్టంగా చెప్పారు. తద్వారా పేదలను మద్యం వ్యసనానికి దూరం చేయాలన్నది తమ విధానమన్నారు. అంతేగానీ, మద్యం విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని ఆయన స్పష్టంచేశారు. అదేమాటకు కట్టుబడుతూ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కిందామీదా పడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. పేదలు మద్యం వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. పేదలు మద్యానికి దూరమవుతుండటం కూడా రామోజీరావుకు ఆవేదన కలిగిస్తుందంటే నిజంగా ఆయనకు మామూలు చికిత్స కాదు మానసిక చికిత్స అవసరమనిపిస్తోంది. డిస్టిలరీలన్నీ బాబు హయాంలోనివే.. ఇక రాష్ట్రంలో ఉన్న మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చినవే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒక్క కొత్త డిస్టిలరీకీ అనుమతివ్వలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో స్లైడ్లు ప్రదర్శించి మరీ వివరించారు. అయినా సరే.. కళ్లున్న కబోదిగా వ్యవహరిస్తున్న రామోజీని ఏమనాలి.. ఏం చేయాలి? సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ తప్పా రామోజీ.. రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఎన్సీడీలు జారీచేసి ప్రభుత్వం నిధులు సమీకరించింది. వీటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నామని కూడా స్పష్టంచేసింది. పేదల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం తగినన్ని నిధులు సమీకరించడం కూడా రామోజీరావుకు కంటగింపుగా మారుతోంది. తాను, తన చంద్రబాబు తప్ప పేదలు బాగుపడకూడదని ఆయన భావన కావచ్చు. ఆ రోజులకు కాలం చెల్లింది. మీకు అర్ధమవుతోందా రామోజీ.. అక్రమ మద్యంపై ఎస్ఈబీ ఉక్కుపాదం అలాగే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన అక్రమ మద్యం, నాటుసారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటుచేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఎస్ఈబీ మూడు విధాలుగా అక్రమ మద్యం, నాటుసారాను అరికడుతోంది. ఎలాగంటే.. ► అక్రమ మద్యం, నాటుసారా తయారీ దశాబ్దాలుగా సాగుతున్న 147 గ్రామాలను గుర్తించి దాడులు నిర్వహిస్తోంది. ► గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని తెప్పించుకుని అక్రమ మద్యం దందాను అడ్డుకుంటోంది. ► ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం స్మగ్లింగ్ను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ.. పొరుగు రాష్ట్రాలతో కలిసి దాడులు నిర్వహిస్తోంది. సారా సిండికేట్కు గుండెల్లో రైళ్లు 2019 నుంచి 2023 మార్చి వరకు పోలీసు, ఎస్ఈబీ విభాగాలు నాటు సారా తయారీదారులపై 1,44,254 కేసులు నమోదు చేశాయి. మొత్తం 1,12,604 మందిని అరెస్టుచేశారు. 18.41లక్షల లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడంతోపాటు 5.34కోట్ల లీటర్ల సారా ఊటలను ధ్వంసం చేయడం ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలకు నిదర్శనం. మొత్తం 14,556 వాహనాలను జప్తుచేశారు. బైండోవర్ కేసులు, పీడీ యాక్ట్లు.. రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం, అక్రమంగా నల్లబెల్లం తయారీదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. వారిపై బైండోవర్ కేసులు నమోదుచేస్తోంది. 2020 జూన్ నుంచి 2023 మార్చి 14 వరకు మొత్తం 74,674 బైండోవర్ కేసులు నమోదు చేసింది. అలాగే, రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారా దందాకు అలవాటుగా మారిన నేరస్తులను గుర్తించి పీడీ యాక్ట్లను ప్రయోగిస్తున్నారు. 2020, మే 16 నుంచి 2023, మార్చి 16 వరకు రాష్ట్రంలో ఏకంగా 206 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలకు నిదర్శనం. అక్రమ మద్యం దందాకు చెక్ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అక్రమ మద్యం దందా యథేచ్ఛగా సాగింది. టీడీపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని మద్యాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ఆనాటి ప్రభుత్వం కూడా ఆ దందాపై ఉదాసీనంగా ఉండేది. రామోజీ కూడా ఏనాడు పెన్నెత్తి మాట్లాడలేదు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ మద్యం దందాకు సమర్థంగా చెక్పెట్టింది. ఎస్ఈబీ విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ మద్యం స్మగ్లింగ్ను కట్టడి చేస్తోంది. దీనిని కాదనగలరా రామోజీ.. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో ‘నవోదయం’ దశాబ్దాలుగా నాటుసారా తయారీయే జీవనోపాధిగా చేసుకున్న కుటుంబాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తెచ్చింది. నవోదయం పేరుతో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చింది. ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థికంగా దన్నును అందించడంతోపాటు సామాజికంగా గౌరవాన్ని పెంచింది. అందుకోసం ఎస్ఈబీ ప్రత్యేకంగా సర్వే నిర్వహించి అటువంటి గ్రామాలను గుర్తించి ఆయా జిల్లాల యంత్రాంగాల సహకారంతో పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి అందిస్తోంది. 2022 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 1,891 గ్రామాలను గుర్తించారు. ఆ గ్రామాల్లో ఇప్పటికే 1,552 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం రూ.11.46 కోట్ల మేర సహాయం చేసింది. మిగిలిన కుటుంబాలకు కూడా కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది రామోజీ.. చంద్రబాబు, రామోజీ మధ్య ఉన్నది మద్యం బంధమే రక్తమాంసాలతో వ్యాపారం వారిద్దరిదే వ్యాపార ప్రయోజనాల కోసం ఎంతటి కుట్రపూరిత రాజకీయాలు చేయాలో.. ప్రభుత్వ పాలనా వ్యవస్థను ఎంతగా దుర్వినియోగం చేయాలో ఈ ప్రపంచంలో చంద్రబాబు, రామోజీరావులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ఆ విషయంలో పేటెంట్ వారిద్దరిదే. 1989–94లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం.. అప్పట్లో తమ పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఎన్టీరామారావు అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. వెంటనే రామోజీరావు ఏమాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా ప్లేటు ఫిరాయించి సంపూర్ణ మద్య నిషేధం విధానానికి టాటా చెప్పారు. అంతే.. నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారు. ఎందుకంటే అప్పుడే రామోజీ ఫిల్మ్సిటీ నిర్మాణం చేపట్టారు. అందులోని స్టార్హోటళ్లలో మద్యం విక్రయాల కోసం రామోజీరావు నిజంగా ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేశారు. ఇప్పుడు ఈయన శ్రీరంగ నీతులు చెబుతున్నాడు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు! జిల్లాల వారీగా పీడీ యాక్ట్ కేసులు.. జిల్లా కేసులు శ్రీకాకుళం 3 విజయనగరం 1 అల్లూరి సీతారామరాజు 5 పార్వతీపురం మన్యం 4 అనకాపల్లి 2 కాకినాడ 12 అంబేడ్కర్ కోనసీమ 6 తూర్పు గోదావరి 36 పశ్చిమ గోదావరి 8 ఏలూరు 12 కృష్ణా 6 ఎన్టీఆర్ 8 బాపట్ల 14 పల్నాడు 15 ప్రకాశం 7 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 3 చిత్తూరు 22 తిరుపతి 1 వైఎస్సార్ 5 కర్నూలు 6 నంద్యాల 19 అనంతపురం 6 శ్రీసత్యసాయి 4 అన్నమయ్య 1 మొత్తం 206 -
బీజేపీ ఉమాభారతి సంచలన ప్రకటన
బోఫాల్: బీజేపీ ఫైర్బ్రాండ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్లో లిక్కర్ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారామె. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లిక్కర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆమె శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే గడువు ముగిసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. ఇకపై గో శాలల కింద మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టానంటూ ప్రకటించారామె. మధ్యప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యం కారణమని బలంగా నమ్ముతున్నారామె. ఈ క్రమంలో బోఫాల్ అయోధ్య నగర్లోని ఓ ఆలయం వద్దకు చేరుకుని(సమీపంలోని లిక్కర్ షాప్ ఉంది) నాలుగు రోజుల దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించాలన్న డిమాండ్తో ఆమె దీక్ష కొనసాగించారు. మంగళవారం ఆ దీక్ష ముగిసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఆమె మధుశాలా మే గోశాల(లిక్కర్ దుకాణాల్లో గో శాల) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారామె. రాముడి పేరు చెప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, అదే రాముడి గుడి దగ్గర్లో లిక్కర్ దుకాణాలు(ఓర్చా ప్రాంతంలో పరిస్థితిని ఉదాహరిస్తూ..) పెట్టడం ఎంత వరకు సమంజసం అని ఆమె మధ్యప్రదేశ్ సర్కార్ను నిలదీశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం, మహిళలకు.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పించడం నిజమైన అభివృద్ధి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక.. పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వర్గంపైనా ఆమె అసహనం వ్యక్తం చేశారు. మద్యం నిషేధంపై ఉద్యమించినంత మాత్రానా నాకు ప్రధాని పదవి దక్కుతుందా?.. ఇది చాలా విడ్డూరంగా ఉంది.. ఒక వర్గం ఇలా ప్రచారం చేయడం సరికాదు అని ఆమె వ్యాఖ్యానించారు. లిక్కర్ పాలసీ కోసం ఎదురు చూపులు ఉండబోవని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న లిక్కర్ షాపులను దగ్గరుండి తానే గోశాలలుగా మారుస్తానని ఆమె ప్రకటించారు. అలాంటి దుకాణాల బయట 11 ఆవుల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే తన బృందానికి ఆదేశాలు జారీ చేశానని.. తనను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారామె. ఈమధ్యే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన ఉమాభారతి.. లిక్కర్ పాలసీలో కొన్ని సవరణలు సూచిస్తూ.. కొత్త విధానం తేవాలని కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు కూడా. అయితే.. ఆచరణలోనే అది కనిపించలేదు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
మూడు రోజులు వైన్ షాప్లు బంద్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కోడ్ నేపథ్యంలో నవంబర్ 1న సాయంత్రం 6గంటల నుంచి 3న సాయంత్రం 6గంటల వరకు వైన్ షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు మునుగోడు నియోజకవర్గంలోని వైన్షాపులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మునుగోడు పరిధిలో మద్యం అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వారంతా వైన్షాపుల్లో మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్లను సీజ్ చేసి.. 48మందిని అరెస్టు చేసి మొత్తం 118 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.5,59,000 ఉన్నట్లు తెలిపారు. -
2,216 కాదు.. 2,620
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని వైన్ (ఏ4) షాపుల పరిధిని నిర్ధారిస్తూ జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న వైన్షాపుల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెరగనుంది. కాగా, ఈసారి మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు ఇచ్చిన 30 శాతం రిజర్వేషన్ మేరకు ఆయా వర్గాలకు జిల్లాల వారీగా కేటాయించాల్సిన షాపులను ఎంపిక చేశారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ డ్రాలను పూర్తి చేసి రిజర్వ్డ్ దుకాణాలను నోటిఫై చేశారు. మొత్తం 2,620 షాపులకుగాను గౌడవర్గానికి 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాల ను కేటాయించారు. మిగి లిన 1,834 షాపులకు ఓపెన్ కేటగిరీలో దరఖా స్తులు స్వీకరించనున్నారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 18వ తేదీ వరకు అన్ని జిల్లాల్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. 20న డ్రా పద్ధతిలో విజేతలను ఎంపిక చేసి ప్రొవిజనల్ లైసెన్సులు ఇవ్వనున్నారు. అయితే, మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో దాఖలయిన కేసు తీర్పు మంగళవారం వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అన్ని కులాలు ఆత్మగౌరవంతో బతకాలి.. జడ్పీ సెంటర్, మహబూబ్నగర్: ప్రతి కులం వారు ఆత్మగౌరవంతో బతికేలా చూడటమే తమ లక్ష్య మని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల గౌడ, ఎస్సీ, ఎస్టీల మద్యం దుకాణాలను మంత్రి లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. -
మద్యం షాపులు పెరగవ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైన్షాపుల గడువు మరో మూడు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కొత్త విధానంపై ఎక్సైజ్ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. షాపుల సంఖ్యను పెంచాలా? ప్రస్తుతమున్న ఆయా షాపుల పరిధిని మార్చాలా? దరఖాస్తు ధర ఎలా ఉండాలి? శ్లాబుల్లో మార్పులు చేయాలా? ఇప్పటికే మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా రాబడి ఎలా రాబట్టాలి అనే దానిపై ఎక్సైజ్ శాఖ అధికారుల్లో తర్జనభర్జనలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు (ఏ4 షాపులు) ఉన్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీపై ప్రాథమిక చర్చల అనంతరం ఈసారి కూడా పాత సంఖ్యలోనే దుకాణాలను కొనసాగించాలని అధికారులు సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దరఖాస్తు ఫీజు, లైసెన్సు ఫీజు, ఏ4 షాపుల పరిధుల్లో మార్పులు చేసినా, షాపుల సంఖ్యను మాత్రం పెంచవద్దని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. 2019–21 ఎక్సైజ్ పాలసీ ఈ ఏడాది అక్టోబర్ 31తో ముగియనుంది. పరిశీలనలో రెండు అంశాలు ఈ నేపథ్యంలో ఎక్సైజ్ వర్గాలు రెండు అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతమున్న లైసెన్సు ఫీజును కట్టించుకుని మరో ఏడాది పాటు లైసెన్సుల గడువు పొడిగించాలని, లేదంటే కనీసం రెండు లేదా మూడు నెలల పాటు ఎలాంటి ఫీజు లేకుండా పొడిగించాలనే ప్రతిపాదనలపై ఆ శాఖ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. లేదంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయనే అంశాన్ని కూడా ఆ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31 తర్వాత రానున్న రెండేళ్ల పాటు రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ వస్తుందా? వాయిదా పడుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. మాకూ న్యాయం చేయండి... ప్రస్తుతం కరోనా వైరస్ గుబులు ఎక్సైజ్ శాఖను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి తేవాలా లేక పాత షాపులనే మరికొన్నాళ్లు పొడగించాలా అనే చర్చ జరుగుతోంది. ఐదు నెలల క్రితం రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో 159 కొత్త బార్ షాపులను ప్రభుత్వం నోటిఫై చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 59 బార్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే బార్లను ఏర్పాటు చేశారని, మిగిలిన వారంతా లైసెన్సులు తీసుకుని ఎప్పుడు బార్లు పెట్టాలన్న దానిపై మీమాంసలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు కరోనా వైరస్ కారణంగా జరగని వ్యాపారమే కారణమని ఎౖMð్సజ్ వర్గాలంటున్నాయి. మరోవైపు కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని బార్లు, వైన్షాపులు, బీర్, లిక్కర్ తయారీ పరిశ్రమలు 2–3 నెలలు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో బార్లు, బీర్ తయారీ పరిశ్రమలకు లైసెన్స్ ఫీజు, తయారీ గంటల విషయంలో మినహాయింపునిచ్చింది. తద్వారా బార్ల యజమానులు, డిస్టలరీలకు కొంత ఉపశమనం కలిగింది. కానీ 47 రోజుల సంపూర్ణ లాక్ డౌన్, కొన్ని రోజుల పాటు మధ్యాహ్నం నుంచి షాపులు మూసేయాల్సి రావడంతో తాము కూడా నష్టపోయామని వైన్షాపుల యజమానులంటున్నారు. తమకు కూడా ఈ విషయంలో న్యాయం చేయాలని, శాశ్వత లైసెన్సుదారులకు మినహాయింపు ఇచ్చినట్టే రెండేళ్ల వరకే ఉండే తమకు కూడా ఏదో ఒక రూపంలో ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. -
Lockdown ఎఫెక్ట్: రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా తాగేశారు
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి కోసం తెలంగాణలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రకటనతో మందు బాబులు బెంబెలేత్తారు. మద్యం దుకాణాల వద్దకు పరుగు తీశారు. పది రోజులకు సరిపడా మద్యాన్ని ఒక్కసారే కొనుగోలు చేశారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశారంటే.. పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఇక నేటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రాగా.. ఉదయం 6-10 గంటల వరకే అన్ని కార్యకలపాలకు అనుమతిచ్చారు. ఇక ఇవాళ ఒక్కరోజు అది కూడా 4 గంటల వ్యవధిలో తెలంగాణలో 94 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈనెల 1 నుంచి 12 వరకు అన్ని డిపోలలో 770 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగ్గా.. కేవలం నిన్న, ఈ రోజు(మే 11,12) ఏకంగా 219 కోట్ల రూపాయల అమ్మకాలు జరగడం గమనార్హం. ఇక తెలంగాణలో మొత్తం 2,200 మద్యం దుకాణాలు ఉన్నాయి. చదవండి: లాక్డౌన్: వైన్స్, మార్ట్ల్లో మద్యం ఖాళీ -
Telangana Lockdown: లిక్కర్ దొరుకుతుంది
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కాలంలోనూ రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతినిచ్చిన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే వైన్ షాపులు, బార్, రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయించే సమయంలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అన్ని దుకాణాల ముందు భౌతికదూరం పాటించేలా రింగులు ఏర్పాటు చేసి వినియోగదారులు వాటిలో నిలబడి మద్యం కొనుగోలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. పర్మిట్ రూమ్స్ తెరిచేందుకు వీల్లేదని, కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలను అదుపు చేసే బాధ్యత కూడా షాపు యజమాన్యమే తీసుకోవాలని తెలిపారు. చదవండి: (Telangana: బస్సులు, మెట్రో రైళ్లు తిరిగే సమయాలివే..) పొద్దున్నే ఎవరొస్తారు? ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఉదయాన్నే బార్లు ఎలా తెరవాలన్న దానిపై యజమానుల్లో సందిగ్ధత నెలకొంది. పొద్దున్నే బార్లలో కూర్చొని మద్యం తాగేందుకు ఎవరొస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటలకే రెస్టారెంట్లు మూసివేయడం ఎలా అని వాపోతున్నారు. గత లాక్డౌ సమయంలోనే తాము తీవ్రంగా నష్టపోయామని, లైసెన్సు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లామని, మళ్లీ ఇప్పుడు లాక్డౌన్కు వెళితే అసలు బార్లు నడిపే పరిస్థితి కూడా ఉండదంటున్నారు. దీంతో బార్ల నుంచి కూడా మద్యాన్ని రిటైల్గా అమ్ముకునే అవకాశం ఇవ్వాలని, లేదంటే వైన్ షాపులు బంద్ చేసిన తర్వాత బార్ల నుంచి డోర్ డెలివరీకి అనుమతివ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు. ‘మందు’చూపు ఒకపక్క రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుండగానే, లాక్డౌన్ విధిస్తున్నట్టుగా వార్తలు వెలువడడంతో మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూలు కట్టారు. మిగతా షాపుల మాట ఎలా ఉన్నా మద్యం దుకాణాలు మాత్రం కిక్కిరిసిపోయి కన్పించాయి. కరోనా నిబంధనలు మరిచిపోయి మద్యం కోసం ఎగబడ్డారు. కొన్నిచోట్ల పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి కర్ఫ్యూ సమయం వరకు ఇదే పరిస్థితి ఉంది. లాక్డౌన్ సమయంలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో అన్న సందేహంతో చాలామంది 10 రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేయడం కన్పించింది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.120 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ నెలలో 11 రోజులకు రూ.670 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, మంగళవారం ఒక్క రోజే సగటుకు రెండింతలు ఎక్కువగా అమ్ముడయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: (నేటి నుంచి 10 రోజుల లాక్డౌన్.. మినహాయింపు వాటికే!) రాజధాని వాటా రూ.50 కోట్లు! హైదరాబాద్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. చిన్నా..పెద్ద..మహిళలు..పురుషులు అన్న తేడా లేకుండా షాపుల ముందు బారులు తీరారు. నగర పరిధిలోని సుమారు 300 మద్యం దుకాణాల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. రద్దీని క్రమమద్ధీకరించేందుకు పలు చోట్ల పోలీసులు, పెట్రోలింగ్ సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. కాసేపటికే పలు దుకాణాల వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి. నగరంలో రోజూ రూ.10 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. మంగళవారం ఒక్కరోజే అంతకు 5 రెట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగినట్లు ఆబ్కారీ అధికారులు అంచనా వేశారు. -
హైదరాబాద్: వైన్షాపుల వద్ద బారులు
-
లాక్డౌన్ ప్రకటనతో కిక్కిరిసిన మద్యం దుకాణాలు
సాక్షి, హైదరాబాద్: రేపటి నుంచి తెలంగాణలో లాక్డౌన్ అమల్లోకి రానున్న నేపథ్యంలో హైదరాబాద్లో మందు బాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. లాక్డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. మద్యం కోసం పలు వైన్షాపుల వద్ద తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే వైన్ షాపులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. టోలిచౌకి, గోల్కొండ, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో లిక్కర్ షాపుల ముందు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుమికూడారు. కోవిడ్ రూల్స్ పాటించకుండా మద్యం కోసం ఎగబడుతున్నారు. ముందస్తుగానే మద్యం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొందరు పది రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తున్నారు. కాగా, లాక్డౌన్ అమల్లోకి వస్తే మద్యం హోం డెలివరీకి అనుమతి ఇవ్వాల్సిందిగా లిక్కర్, బీర్ సప్లయర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. లిక్కర్ ఉత్పత్తిని కూడా ఆపకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. చదవండి: తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ తెలంగాణలో లాక్డౌన్: హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
మహిళ వైరల్ వీడియో.. ‘పెగ్గు పడితే కరోనా పరారే’
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ భారత్ను అతలాకుతలం చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, మందుబాబులు మాత్రం కరోనా గిరోనా జాన్తా నై.. అంటున్నారు. లాక్డౌన్, కర్ఫ్యూలతో వైన్ షాప్లు మూసేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. పెగ్గు పడితే కరోనా పారిపోవాల్సిందే అంటూ మందు షాపులు తెరవాలని కోరుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన డాలీ అనే మహిళ వైన్ షాపులు తెరవాలని ఏకంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్కే మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఆరు రోజుల లాక్డౌన్ విధించిన ఢిల్లీ సర్కార్ కేసుల్లో తగ్గుదల లేకపోవడంతో ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. నిత్యావసర, అత్యవసర దుకాణాలు మినహా మిగతా అన్నీ మూతపడ్డాయి. దీంతో మందుబాబులు అల్లాడిపోయారు. అధిక ధర చెల్లించి బ్లాక్లో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఎక్కడా మందు దొరకలేదు. ఆ సమయంలో ఢిల్లీ శివపురి కాలనీకి చెందిన ఓ వైన్ షాప్ వద్దకు మద్యం కొనుగోలు చేసేందుకు డాలీ అనే మహిళ అక్కడికి వచ్చారు. ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ టీకా కూడా ఆల్కహాల్తో సరితూగలేదు. ఎందుకంటే ఆల్కహాల్ మాత్రమే నిజమైన మెడిసిన్. 35 ఏళ్లుగా మద్యం తాగడం వల్ల తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని అన్నారు. 'ఒక్క పెగ్గు పడితే కరోనా పారిపోతుంది. లాక్ డౌన్ ఎత్తేసి, మద్యం దుకాణాలకు అనుమతులివ్వాలి. అలా చేస్తే కరోనా పేషెంట్లతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులన్నీ ఖాళీ అవుతాయి. ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ సమస్య నుంచి భయటపడుతుంది' అంటూ జోస్యం చెప్పారు. సదరు మహిళ మాట్లాడే సమయంలో వీడియో తీస్తున్న వ్యక్తి.. మీకు లాక్ డౌన్ లో కూడా మందు ఎలా లభించింది? అని ప్రశ్నించగా.. ‘నేను స్టోర్ చేసుకున్న మందు అయిపోయింది. అందుకే మద్యం దుకాణాల్ని ఓపెన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’అని జవాబిచ్చారు. Delhi wali Dolly aunty is back 🤣 pic.twitter.com/GsHNXNDaaf — varun goyal (@varunmaddy) April 25, 2021 -
కూలీ డబ్బులన్నీ ఇప్పుడు ఇంటికే
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ హయాంలో 535 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 425కి పరిమితమయ్యాయి. ఈ నెలాఖరు కల్లా మరో 60 షాపులు తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక 3,000కిపైగా ఉన్న బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించారు. బార్లలో అమ్మకాలు నిలిపివేయడంతో మద్యం అమ్మకాలు 50 శాతం, బీరు విక్రయాలు 90 శాతం తగ్గాయి. విక్రయాల్లో సమయ పాలన పకడ్బందీగా అమలు చేయడం, పరిమితి విధించడంతో మద్యం రక్కసిని నియంత్రించగలిగారు. గడ్డు కాలం నుంచి గట్టెక్కాం.. ఇంటి యజమాని తాగుడుకు బానిస కావడంతో ఛిద్రమైన ఎన్నో కుటుంబాలను చూశా. ఆ గడ్డు పరిస్థితుల నుంచి ఇప్పుడు మేం పూర్తిగా కోలుకున్నాం. మా ఆయన సత్యన్నారాయణ తాగుడుకు స్వస్తి చెప్పడం తో కూలీ డబ్బులన్నీ ఇంటికి చేరుతున్నాయి. చేతి ఖర్చులకు రూ.10, 20 తీసుకొని మిగతావి మాకే ఇవ్వడంతో సంసారం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోంది. – పొత్తూరి వెంకటలక్ష్మి (బూరుగపల్లి, రాజవొమ్మంగి మండలం) కొనలేక మానేశా.. ‘25 ఏళ్లుగా మందు తాగుతున్నా. గతంలో క్వార్టర్ బాటిల్ రూ.110కే దొరకడంతో కూలీ డబ్బుల్లో సగం ఖర్చు పెట్టి మద్యం తాగేవాడిని. బెల్టుషాపుల ద్వారా 24 గంటలు దొరికేది. ఇప్పుడు ధరలు భారీగా పెరగడంతో క్వార్టర్ బాటిల్ రూ.350 పెట్టి కొనలేక మద్యం మానేశా. నా కుమార్తె రాణికి గ్రామ వలంటీర్గా ఉద్యోగం కూడా వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలతో మా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది’– అండ్రు నాగేంద్రుడు (గోకవరం మండలం సంజీవయ్యనగర్) దూరం వెళ్లలేక మానుకుంటున్నాం.. మా ఊళ్లో మద్యం షాపు లేదు. మద్యం దుకాణానికి వెళ్లాలంటే 4 కిలోమీటర్ల దూరంలోని వెల్ల గ్రామానికి వెళ్లాలి. గత ప్రభుత్వంలో బెల్టు షాపుల వల్ల మద్యం దొరికేది. వీలున్నప్పుడల్లా మద్యం తీసుకునే వాళ్లం. ప్రస్తుతం ప్రభుత్వం బెల్టు షాపులు కూడా లేకుండా చేయడంతో ఊర్లో చాలా మందిమి మద్యం అలవాటు మానుకున్నాం. నేను కల్లు గీత వృత్తి ద్వారా వచ్చిన ఆదాయంతో ఇద్దరు పిల్లలను చక్కగా పోషించుకుంటున్నాను. – వాసంశెట్టి నాగ ఆంజనేయులు,తాడిపల్లి, రామచంద్రపురం మండలం) -
తగ్గిన మద్యం షాపులు
-
తెలంగాణలో మందుబాబులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. అదనంగా మరో 2 గంటల పాటు మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఇటీవల తెలంగాణలో మద్యం షాపులు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా ఆంక్షల కారణంగా ఇప్పటివరకు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పరిమితమైన మద్యం దుకాణాలను రాత్రి ఎనిమిది వరకు తెరిచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నం 72 ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో విక్రయాలు జరపొచ్చని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి : రాకపోకలకు గ్రీన్ సిగ్నల్) ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కూడా రాత్రి 8 గంటల వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచనున్నారు. దీంతో అదనంగా మరో 2 గంటల పాటు మద్యం కొనుగోలుకు అవకాశం లభించడంతో.. మందుబాబులు సంబరపడుతున్నారు. ఈ నిర్ణయంతో మద్యం కొనుగోళ్లు కొద్దిమేర పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా.. అన్ని దుకాణాలు, వ్యాపార సదుపాయాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. -
కేరళలో రేపట్నుంచే.. బుకింగ్స్ ప్రారంభం
తిరువనంతపురం : దేశంలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి మూతబడ్డ మద్యం దుకాణాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతేకాకుండా దుకాణాలకు వచ్చే వారు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రకటనలో పేర్కొంది. (మహమ్మారి కాలంలో రైల్వేస్ అరాచకం: కేరళ ) అంతేకాకుండా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దుకాణాల ముందు క్యూలైన్లను కట్టడి చేసే దిశగా ఆన్లైన్లో అమ్మకాలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి టిపి రామకృష్ణన్ పేర్కొన్నారు. దీని ద్వారా క్యై లైన్ల వద్ద రద్దీ తగ్గుతుందని తెలిపారు. 'బెవ్య్కూ' అనే మొబైల్ యాప్ ద్వారా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఆన్లైన్లోనే బుకింగ్స్ చేసుకోవచ్చని వెల్లడించారు. బుకింగ్ చేసుకోగానే మీకు ఓ టోకెన్ నెంబర్ కేటాయిస్తారు. ఆ నెంబర్ ద్వారానే మద్యం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ప్రతీ నాలుగు రోజులుకు ఒకసారి మాత్రమే ఒక వ్యక్తి మద్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టోకెన్ ఆధారంగా మాత్రమే వారికి కేటాయించిన సమయాల్లోనే మద్యం కొనుగోలు చేయాలని అన్నారు. అంతేకాకుండా ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువమందిని దుకాణాల ముందు అనుమతించరని రామకృష్ణన్ తెలిపారు. (ఆ వదంతులను తోసిపుచ్చిన హోంమంత్రి ) -
ఢిల్లీలో కళకళలాడుతున్న మద్యం షాపులు
-
మద్యంపై కీలక నిర్ణయం: రోజూ 500 టోకెన్లే..!
సాక్షి, చెన్నై: తమిళనాడులో మద్యం షాపులు నిర్వహించుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షాపులు తెరవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మే 17 దాకా లిక్కర్ షాపులు మూసివేయాలని గతంలో మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో తెల్లవారు జామునుంచే మద్యం షాపులు ముందు పాదరక్షలు, హెల్మెట్లు, గొడుగులు దర్శన మిచ్చాయి. భౌతిక దూరం పాటిస్తూ.. టోకన్ సిస్టమ్ అమలు చేయాలని సుప్రీం కోర్టు సూచించడంతో మద్యం దుకాణాల ముందు రద్దీ నెలకొంది. కాగా.. రోజుకు ఒక్కో షాపు కేవలం 500 టోకెన్లు జారీ చేసి వాటికి మాత్రమే మద్యం అమ్మేలా చూడాలని ఆదేశించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టస్మాక్) ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడవనున్నాయి. వీటిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా.. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న చెన్నై, తిరువళ్లూర్, ఇతర కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగలిన ప్రాంతాల్లో మాత్రమే మద్యం షాపులు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. చదవండి: కరోనా నుంచి కోలుకున్న డాక్టర్కు బెదిరింపులు మద్యం షాపులుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ.. షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 10,108కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ 2,599 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 71 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 7,435 యాక్టివ్ కేసులున్నాయి. అటు చెన్నైలో శుక్రవారం 309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 5,947కి చేరింది. చదవండి: మద్యం అమ్మకాలు.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే -
మద్యం దుకాణాలపై పిటిషన్.. రూ.లక్ష ఫైన్
ఢిల్లీ : కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మద్యం షాపులు తెరవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా పిటిషనర్పై లక్ష రూపాయల జరిమానా విధించింది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం, మస్కులు ధరించడం లాంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున లిక్కర్ షాపులు తక్షణం మూసి వేయాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. గౌతమ్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను జస్టిస్ ఎల్ఎన్ రావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయని, ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం షాపుల ముందు ప్రజలు బారులు తీరుతున్నందున ఆన్లైన్ ద్వారా మద్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఈ-టోకెన్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు కేజ్రివాల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం..టోకెన్ నెంబర్ ఆధారంగా వారిచ్చిన సమయంలోనే మద్యం కొనాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ముందుగానే వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా టోకెన్ నెంబర్ ఇస్తారు. (మందుబాబుల కోసం సరికొత్త వ్యూహం ) -
బార్లు, హోటళ్లలో మద్యం అమ్మకాలు!
తిరువనంతపురం: లాక్డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో తమ రాష్ట్రంలో త్వరలోనే మద్యం అమ్మకాలు ప్రారంభమవుతాయని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖా మంత్రి టీపీ రామకృష్ణన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘బేవరేజ్ కార్పొరేషన్, కేరళ రాష్ట్ర వినియోగదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలోని 301 లిక్కర్ షాపులు త్వరలోనే తిరిగి ప్రారంభమవుతాయి. ఇందుకు సంబంధించిన తేదీలు, విధివిధానాలు వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు. మద్యం అమ్మకాల సమయంలో సామాజిక ఎడబాటు నిబంధనకు విఘాతం కలిగే అవకాశం ఉన్న తరుణంలో... వెబ్పోర్టల్స్ ద్వారా బుకింగ్లు చేపట్టి.. టేక్ అవే ద్వారా మద్యం సరఫరా చేస్తామని వెల్లడించారు. (మద్యం హోం డెలివరీకి అనుమతినిచ్చిన ‘మహా’ సర్కారు) అదే విధంగా బార్లు, హోటళ్లలో కూడా మద్యం అమ్మకాలకు అనుమతినిస్తున్నామని.. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మాల్సి ఉంటుందని రామకృష్ణన్ స్పష్టం చేశారు. కేవలం పార్శిల్ కౌంటర్ల వద్దనే వినియోగదారులు చెల్లింపులు జరిపి.. మద్యం తీసుకువెళ్లాలని సూచించారు. కాగా మద్యం అమ్మకాలపై పన్ను పెంచుతూ కేరళ కేబినెట్ బుధవారం తీర్మానాన్ని ఆమోదించింది. బీర్, వైన్ అమ్మకాలపై 10 శాతం, ఇతర మద్యం ఉత్పత్తులపై 35 శాతం టాక్స్ పెంచింది. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిన నేపథ్యంలో.. ఆదాయ మార్గాన్వేషణలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. (ఆన్లైన్లో మద్యం విక్రయంపై ఆలోచించండి) -
ఆ బిల్లుల శాసన ప్రక్రియ ముగింపు కోసం వేచి చూస్తున్నాం
సాక్షి, అమరావతి: కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు తరలించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల ఉపసంహరణ బిల్లులకు సంబంధించిన శాసనపరమైన ప్రక్రియ ముగింపు కోసం వేచి చూస్తున్నామని హైకోర్టుకు నివేదించింది. ఆ తరువాత తగిన సమయంలో చట్ట నిబంధనలకు లోబడి తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించింది. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, వీటిని అడ్డుకోవాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ఆందోళన ఆధారంగా దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. దశలవారీ అమలుకు కట్టుబడి ఉన్నాం హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో దశల వారీగా మద్య నియంత్రణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. లాక్డౌన్ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలను నిషేధించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ధర్మాసనం ఎదుట ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపించారు. మద్య నిషేధం దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆదాయం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. తమిళనాడులో మద్యం షాపుల వద్ద అదుపు చేయలేని స్థాయిలో జనాలు ఉండటంతో మద్యం విక్రయాలను ఆపాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చిందని, అయితే రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఏపీలో తగ్గుతున్న మద్యం వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచడంతో మందు బాబులు తాగుడు తగ్గించేశారు. గత రెండు రోజుల నుంచి మద్యం వినియోగం బాగా తగ్గింది. సాధారణంగా వారాంతంలో మద్యం వినియోగం అధికంగా ఉంటుంది. రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతుంటాయి. అలాంటిది శనివారం మద్యం షాపులు మూసే సమయానికి కేవలం రూ.40.77 కోట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మద్యం ధరల పెరుగుదల ప్రభావం మందు బాబులపై ఊహించిన దానికంటే ఎక్కువ పడింది. మద్యం కొనాలంటేనే మందు బాబులు భయపడుతున్నారు. మరోవైపు అక్రమ మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. నాటు సారా, సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్) అమ్మకాలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పేరిట శనివారం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మద్యం షాపుల్ని ఈ నెలాఖరు నాటికి 13 శాతం తగ్గిస్తే మద్యం వినియోగం ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో తగ్గే 566 మద్యం షాపుల వివరాలపై ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఒక్క రోజులోనే రూ.2 కోట్లకు పైగా తగ్గిన అమ్మకాలు ► రాష్ట్రంలో ఈ నెల 8 (శుక్రవారం)న మద్యం, బీరు కలిపి 15.55 లక్షల బాటిళ్లు విక్రయించారు. అమ్మకాల విలువ రూ.42.72 కోట్ల వరకు ఉంది. ► శనివారం 15.40 లక్షల బాటిళ్లను మాత్రమే మద్యం ప్రియులు కొనుగోలు చేయగా, విక్రయాల విలువ రూ.40.77 కోట్లకు తగ్గిపోయింది. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2020 జనవరి నుంచి ఏప్రిల్ వరకు మద్యం అక్రమాలకు పాల్పడుతున్న వారిపై 7,812 కేసులు నమోదు చేసింది. 5,870 మందిని అరెస్టు చేసి, 97,482 లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
సత్ఫలితాలు ఇస్తున్న సీఎం జగన్ నిర్ణయం
సాక్షి, అమరావతి: మద్య నియంత్రణ దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో గణనీయంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాక ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండటంతో నిర్ణీత సమయానికే వాటిని మూసివేస్తున్నారు. పర్మిట్ రూమ్లను రద్దు చేయడంతో గతానికి భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. చదవండి: 'ఆయనను ఇక గొలుసులతో కట్టేయాల్సిందే' తాజాగా ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు 75శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో మద్యం అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. మే 4న రూ.70 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా.. మే 9 నాటికి రూ. 40.77 కోట్లకు చేరుకున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో రూ. 30 కోట్లకు పైగా మద్యం విక్రయాలు తగ్గిపోయాయి. తాజాగా మరో 13 శాతం మద్యం షాపుల తొలగింపు నిర్ణయంతో మద్యం విక్రయాలు భారీగా తగ్గుముఖం పట్టనున్నాయి. చదవండి: వారి ప్రయోజనాలు కాపాడండి: సీఎం జగన్ -
మద్యం అమ్మకాలపై రజనీ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : ఓవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతులను ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల వద్ద కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా మందుబాబులు ఎగబడుతున్నారు. దీని ద్వారా వైరస్ వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మద్యం అమ్మకాలపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తమిళనాడులో మద్యం అమ్మకాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా క్లిష్ట కాలంలోనూ సామాన్యుల నుంచి సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వాలు చూడటం సరికాదన్నారు. ఇకపై మద్యం అమ్మకాలను ఇలానే కొనసాగితే తిరిగి మరోసారి అధికారంలోకి రారన్న విషయం మర్చిపోవద్దని అన్నాడీఎంకే ప్రభుత్వానికి రజనీ చురకలు అంటించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్ వేదికగా విమర్శించారు. (మద్యం అమ్మకాలకు నో.. సుప్రీంకు సర్కార్) ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా.. మద్యం అమ్మకాలను మాత్రం జోరుగా సాగుతున్నాయి. దీనిపై మద్రాస్ హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ న్యాయపోరాటం చేస్తోంది. కాగా మద్యం షాపులు తెరిచిన తొలిరోజే రూ.170 కోట్ల లిక్కర్ అమ్మకాలను జరిగిని విషయం తెలిసిందే. (ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్) -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: మద్య నియంత్రణ, నిషేధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దశలవారీగా మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 4380 మద్యం షాపులను 2934కి తగ్గించింది. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం దుకాణాలను తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 13 శాతం మద్యం షాపులను తొలగించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నాటికి షాపులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 43వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం ఇప్పటికే 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్షాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం, ముందుగా బెల్ట్షాపులు ఎత్తివేస్తానంటూ పాదయాత్రలో హామీనిచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను ఏటా కొంతమేర తగ్గించేలా కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చారు. ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో నూటికి నూరుశాతం మద్యం దుకాణాలు ఎత్తివేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
హైకోర్టు ఉత్తర్వులు : మద్యం షాపులు మూసివేత
చెన్నై : తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. మద్యాన్ని కేవలం ఆన్లైన్లోనే విక్రయించాలని స్పష్టం చేసింది. మే 17 వరకే ఆన్లైన్లో లిక్కర్ విక్రయాలను అనుమతిస్తారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తమిళనాడులో తొలిరోజు మద్యం విక్రయాలు రికార్డు స్దాయిలో రూ 170 కోట్ల మేర సాగాయి. కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇక తమిళనాడులో శుక్రవారం ఒక్కరోజే 600 కోవిడ్-19 తాజా కేసులు వెలుగుచూశాయి. వీరిలో 399 మంది చెన్నై నగరానికి చెందిన వారేనని అధికారులు వెల్లడించారు. చదవండి : వైన్ షాపులో రకుల్: ఇందులో నిజమెంత? -
‘మద్యే మద్యే’ న్యాయం సమర్పయామి
కోవిడ్ 19 అంటురోగపు రోజుల్లో నిత్యావసరాలంటే తిండి, వైద్యం. మరి మందు (ఔషధం కాదండోయ్) సంగతేమిటి? ఉద్యోగం లేకపోయినా ఉపద్రవకాలంలో మద్యం అత్యవసర ద్రవమని అర్థం కాలేదా? జనం తాగకుండా 45 రోజులు బతికి ఉండగలరని నిరూపించుకుంటే ప్రభుత్వాలు 45 రోజు లకన్నా అమ్మకుండా ఉండలేమని చాటుకున్నాయి. పాఠాలు లేని పంతుళ్లకు బ్రాందీ షాపుల కాపలా డ్యూటీ. మగా, ఆడా, చిన్నా పెద్ద తేడా లేకుండా జనం బారులు తీరి ఎంతో ఓపికగా భౌతిక దూరాలలో నిలబడి ఉవ్విళ్లూరుతూ కొనడం మహోన్నత భారతీయ జనతా నాగరికత. దేశాన్ని ఆర్థికమాంద్యం నుంచి కాపాడే దేశభక్తులు ఒక్కరోజులోనే ఒక్కో చోట వందల కోట్ల రూపాయల మద్యం తాగేశారు. లాక్ డవున్ కాలంలో వేరే రోగాలు రాకపోవడానికి కారణాలు అమ్మచేతి వంట తినడం, మందు కొట్టకుండా ఉండడం అని కొందరు అమాయకులు సూత్రీకరించారు. కానీ వెంటనే మద్యప్రవాహం మొదలైంది. సరిగ్గా సాగని చదువులను వానాకాలపు చదువులు అనేవారు. ఇప్పుడు కరోనా కాలపు చదువులనాలి. విమానాలు, రైళ్లు, బస్సులు, హోటళ్లు, సినిమాలు తెరిచే రోజులు వచ్చిన తరువాత చివరకు, విద్యాలయాలు తెరవడం గురించి ఆలోచిస్తారు. ముందు తెరిచింది మద్యం సీసామూతలు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే డబ్బు దక్కదు. వలస కూలీలను సొంతూర్లకు పంపడానికి రైళ్లు నడపాలనే చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని కేవలం 45 రోజుల ఆలస్యంగా తీసుకున్నారు. వందలాది మైళ్లు వేలాది జతల కాళ్లు నడిచిన తరువాత, కొన్ని ప్రాణాలు పోయిన తరువాత, అది అత్యవసర సేవ అని, ప్రజల చావుబతుకులకు సంబంధించిన సమస్య అనీ తెలుసుకున్నారు. మద్యం కన్నా అత్యవసర వస్తువు న్యాయం అని గుర్తురాకపోవడం ఒక విషాదం. మద్యం బార్ తెరిచినా న్యాయం బార్ మూసే ఉంది. తాలూకా, మండలం, జిల్లా స్థాయిల్లో న్యాయ వితరణ, న్యాయ విచారణ, వివాద పరిష్కారాలు లాక్ డవునైనాయి. హైకోర్టులు, సుప్రీంకోర్టు చాలా సీరియస్ అంశాలను పరిశీలించడానికి వీడియో సమావేశాల ద్వారా న్యాయాన్యాయ విచారణ సాగిస్తున్నాయి. హైకోర్టు మనసు గెలుచుకున్నవారికీ, సుప్రీంకోర్టు కంటికి కనపడిన వారికి న్యాయం అందుబాటులో ఉంటుంది. మిగతావారికి న్యాయం అరుదైన సరుకు, అందని ద్రాక్ష. మద్యం ముందు న్యాయం చివరకు. ఎంత సామాజిక న్యాయం ఇది? లాయర్లు ఈ విషయం ఆలోచించరు. వేసవికి వచ్చే సెలవులు కరోనా పుణ్యాన రావడంతో సంతోషించేవారు కొందరైతే, రెక్కాడితే తప్ప డొక్కాడదన్న రీతిలో బెయిల్ కోసం ఎవడైనా వస్తే తప్ప రెయిల్ నడవని లాయర్కే చాలా కష్టం. 40 కోట్ల మంది కూలీలు వలసవచ్చిన చోట పనిలేక, మరో రాష్ట్రంలో ఉన్న సొంతూరికి పోలేక, బతక లేక చావలేక ఉంటే వారికి న్యాయం అడిగే అవకాశం లేదు. సుప్రీంకోర్టులో పిల్ వేస్తే, ధర్మాత్ములు ఆశావిశ్వాస సిద్ధాంతమనే ఒక వినూత్న విధానాన్ని కనిపెట్టారు. ఇదేమిటని అడిగాడో మిత్రుడు. హోప్ అండ్ ట్రస్ట్ ఫిలాసఫీ అని ఇంగ్లిష్ మీడియంలో చెప్పాను. వెంటనే ఆ మిత్రుడు అర్థం అయిందన్నాడు. దాని అర్థం ఏమంటే ప్రభుత్వం వారు చేస్తానన్న పని చేస్తారని ఆశించడం, చేశారని విశ్వసించడం అని సుప్రీంకోర్టు న్యాయవాది వివరించారు. వలస కార్మికులకు ప్రభుత్వం ఆహారం ఇస్తున్నామని చెప్పితే నమ్మాలి. ఉన్నచోట ఉండక నడవడమెందుకు అని న్యాయం చెప్పారు. పిల్ కొట్టేశారు. పోలీసులు తన్నినా, లాకప్లో వేసినా, రాజద్రోహం కేసులతో విమర్శల గొంతు నులిమినా, తప్పుడు కేసులుపెట్టినా అడుక్కోవడానికి మన ఊళ్లో న్యాయస్థానం గేట్లు తెరవరు. అక్కడ సర్వోన్నత న్యాయస్థానాధీశులు కరోనా సంక్షోభ కాలంలో పాలక, శాసన, న్యాయవ్యవస్థలు సమన్వయంతో దేశసేవ చేయాలని సెలవిచ్చారు. పాలకుల ఘోర నిర్ణయాలు తీసుకున్నా న్యాయవ్యవస్థ సమన్వయంతో సర్దుకు పోవాలని రాజ్యాంగంలో అంతర్లీనంగా వారికి కనిపించింది. కరోనా అత్యయిక పరిస్థితుల కాలంలో ప్రాథమిక హక్కుల గురించి తపన పడడం ముఖ్యం కాదనీ సర్వోన్నతులు ప్రవచించారు. పాపం జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నాకు ఈ టెక్నిక్ తెలియక, ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులు ముఖ్యమని, వాటిని సస్పెండ్ చేయడానికి వీల్లేదనీ తీర్పుచెప్పి తను ప్రధాన న్యాయమూర్తి కాకుండా పోయారు. మొదట్లో ఈ న్యాయాన్ని అన్యాయంగా భావించినా ఇప్పుడు ఖన్నాదే న్యాయమని చాలామంది ఆమోదించారు. హోప్ అండ్ ట్రస్ట్ సిద్ధాంతం ఏమిటని బుర్ర బద్దలు కొట్టుకోకుండా వీధిలో ప్రభుత్వమే బ్లాక్ రేట్లో దగ్గరుండి మద్యాన్ని అమ్మిస్తుంటే మందుకొట్టి మత్తుగా పడిపో, లేకపోతే ఇప్పటికిదే న్యాయం అనే ప్రవచనాలు మాత్రమే మననం చేసుకో. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మద్యం కోసం బారులు తీరిన జనం..
-
ఇంతలా.. గెంతాలా..?
సాక్షి, సిటీబ్యూరో: పొద్దున్నే 7 గంటలకు ఓ వ్యక్తి ఇందిరానగర్లోని సాయి వైన్స్ వద్దకు చేరుకున్నాడు.. వైన్స్ తెరవగానే తొలి కస్టమర్ కావడంతో అతడికి దండేసి మరీ మద్యం అందించారు.. సీన్ కట్చేస్తే.. సాయంత్రం ఆ వ్యక్తి ఇందిరానగర్లోనే ఫుల్లుగా మందేసి ఇలా అర్ధనగ్నంగా కనిపించాడు. ఫోటోలు -దయాకర్ తూనుగుంట్ల అబిడ్స్: బర్కత్పురకు చెందిన మహేష్(30) బుధవారం సాయంత్రం గౌలిగూడలోని ఓ వైన్షాప్లో మందు కొనుగోలు చేసి సమీపంలోనే సేవించాడు. తాగిన మైకంలో ట్రాన్స్ఫార్మర్ను పట్టుకొని అక్కడిక్కడే విద్యుదాఘాతంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న అఫ్జల్గంజ్ పోలీసులు మహేష్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నారు. యాక్సాబ్లేడ్తో దాడి చాంద్రాయణగుట్ట: తాగిన మైకంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛత్రినాక పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పుగూడ రాజీవ్గాంధీనగర్కు చెందిన పర్వతాలు అలియాస్ రాజు (58) మద్యం మత్తులో యాక్సాబ్లేడ్తో బుధవారం రాత్రి రాయుడు (48) అనే వ్యక్తిపై దాడికి దిగి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గేట్లెత్తిన గ్రేటర్.. ఫస్ట్ డే.. ఫెస్ట్
సాక్షి, సిటీబ్యూరో: మద్యంప్రియుల నలభై ఐదు రోజుల ఎదురుచూపులు ఫలించాయి. మహానగరంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. మహానగరంలోని మద్యం దుకాణాల వద్ద బుధవారం మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది మద్యం ప్రియులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. కట్టుదిట్టమైన పోలీసు పహారా, బారికేడ్ల ఏర్పాటు మధ్య కొన్నిచోట్ల మాస్కులు, హెల్మెట్లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ మరీ మద్యం కొనుగోలు కోసం నిరీక్షించారు. మరికొన్ని చోట్ల మాస్కులు, భౌతిక దూరం పాటించకుండానే కిక్కు కోసం పడిగాపులు పడ్డారు. మహిళల కోసం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయడం గమనార్హం. మొత్తంగా మహానగరం పరిధిలోని సుమారు 300 మద్యం దుకాణాల వద్ద ఒక్కరోజు కిక్కు సేల్స్ రూ.50 కోట్లకు పైమాటేనని ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తుండటం విశేషం. సాధారణ రోజుల్లో నగరంలో సుమారు రూ.20 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతాయి. దసరా, సంక్రాంతి ఇతర పర్వదినాల్లో దీనికి రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరగడం పరిపాటి. కానీ దీనికి అదనంగా రికార్డు స్థాయిలో సేల్స్ జరగడం గమనార్హం. ఒక్కో మందుబాబు.. ఆరు బీర్లు.. మూడు ఫుల్ బాటిళ్లు అన్నచందంగా మద్యం కొనుగోలు చేశారు. రాజధాని రెడ్ జోన్లో ఉన్నప్పటికీ మందుబాబులజోష్.. ఛీర్స్ జోన్లను తలపించింది.(తెలంగాణలో మద్యం జాతర) అందినకాడికి దండుకున్న వ్యాపారులు.. మందుబాబుల బలహీనతను ఆసరా చేసుకొని పలుచోట్ల మద్యం వ్యాపారులు అందినకాడికి దండుకున్నారు. ప్రీమియం బ్రాండ్లపై 16 శాతం.. సాధారణ మద్యంపై 11 శాతం పెరుగుదలను సాకుగా చూపుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేశారు. ప్రీమియం బ్రాండ్లకు చెందిన ఫుల్ బాటిల్పై రూ.200 నుంచి రూ.300.. సాధారణ మద్యంపై రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేయడం గమనార్హం. పలు దుకాణాల వద్ద సవరించిన మద్యం ధరల బోర్డులను ప్రదర్శించకపోవడంతో మందుబాబులు చేసేది లేక వ్యాపారులు డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించి జేబులు గుల్లచేసుకున్నారు. (కేసీఆర్ చిత్రపటానికి మందుబాబుల పాలాభిషేకం) పలు హై ఎండ్ బ్రాండ్ల కొరత.. మద్యం దుకాణాల్లో పలు హై ఎండ్ బ్రాండ్లకు చెందిన మద్యం కొరత స్పష్టంగా కనిపించింది. పలు మద్యం దుకాణాల్లో జానీవాకర్ రెడ్లేబుల్, బ్లాక్ లేబుల్, డబుల్ బ్లాక్, చివాస్ రీగల్, టీచర్స్ 50, టీచర్స్ ఆరిజిన్ వంటి హై ఎండ్ మద్యం దొరకలేదని మందుబాబులు వాపోయారు. మరో రెండురోజుల్లో డిపోల నుంచి సరుకు వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. నగరంలోని మద్యం దుకాణాలకు లిక్కర్ సరఫరా చేసే డిపోల్లో నెలరోజులకు సరిపడా స్టాకు నిల్వ ఉందని ఆబ్కారీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. సాక్షి, నెట్వర్క్: నగరంలో వైన్స్కు ‘లాక్’ తెరిచారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విక్రయాలు కొనసాగుతాయని ప్రకటించారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. మాస్కులు తప్పని సరి అన్నారు. కానీ ఆ నిబంధనలను చాలామంది పట్టించుకోలేదు. ఉదయం 7 గంటల నుంచే వైన్ షాపుల వద్ద బారులు తీరారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఎగబడ్డారు. మరికొందరు అక్కడ.. ఇక్కడ అంటూ మందు కోసం ఊరంతా తిరిగారు. కొన్నిచోట్ల మహిళలు వైన్స్ షాపుల వద్ద కనిపించారు. మహిళల కోసం ప్రత్యేక క్యూ ఉండటంతో ఇళ్లలో పనిచేసే మహిళలను కొంతమంది బడాబాబులు కార్లో తీసుకొచ్చి వారితో మద్యం కొనుగోలు చేయించారు. చాలా ప్రాంతాల్లో పోలీసులు మద్యం ప్రియులను అదుపు చేసేందుకు సాయంత్రం వరకు కష్టపడ్డారు. మద్యం షాపులు తెరవడంతో నగరంలో లాక్డౌన్ ఉందా.. అనే సందేహం కలిగింది. భార్యతో గొడవపడి.. బ్లేడుతో కోసుకొని.. బాలానగర్: బాలానగర్లోని పార్దీ బస్తీ(పిట్టల బస్తీ)కి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి భార్యతో గొడవపడి కోపంతో బ్లేడుతో తన శరీరంపై గాట్లు పెట్టుకున్నాడు. మద్యం అంతా నేలపాలు.. లంగర్హౌస్: లంగర్హౌస్లోని ఓ వైన్ షాపులో స్టాక్ లేదని.. బస్టాప్ వద్ద ఉన్న వైన్షాపు వద్ద దాదాపు గంటన్నర పాటు ఓ యువకుడు క్యూలో ఉండి బీర్లు, విస్కీ బాటిళ్లు కొనుగోలు చేసి ఆనందంతో రోడ్డు దాటేందుకు వెళ్తుండగా రాయి తగిలి కిందపడ్డాడు. 9 బీరు బాటిళ్లు, 6 విస్కీ బాటిళ్లు పగిలి నేలపాలయ్యాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణలో మద్యం జాతర
సాక్షి, హైదరాబాద్: మందుబాబులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన 45 రోజుల తర్వాత బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇంకేముంది... మందుబాబులు పండుగ చేసుకున్నారు. మండే ఎండను, భారీ క్యూలను సైతం లెక్క చేయకుండా మద్యం కోసం ఆరాటపడ్డారు. చేతిలో బాటిల్ పడగానే పట్టరాని సంతోషంతో ఇంటికి వెళ్లిపోయి ఎంచక్కా లాగించేసి దూప తీర్చుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం విక్రయాలే. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం... ఆ జిల్లా... ఈ జిల్లా... ఆ ఊరు... ఈ ఊరు అనే తేడా లేకుండా ఎక్కడ వైన్షాపు ఉన్నా ఆ షాపు ముందు భారీ క్యూలే దర్శనమిచ్చాయి. మద్యం ప్రియులు కొన్నిచోట్ల మీటర్ల దూరం బారులు తీరి భౌతిక దూరం పాటిస్తూ మరీ కొనుక్కున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.90 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోందంటే ఏ స్థాయిలో మందు బాబులు జేబులు ఖాళీ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చదవండి: వైద్యానికి డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి ఉదయం నుంచే బారులు... కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతపడ్డ వైన్షాపుల షట్టర్లు తెరుచుకున్నాయి. ఉదయం 10 గంటల నుంచి షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో 8 గంటల నుంచే మందుబాబులు వైన్షాపుల దగ్గర చక్కర్లు ప్రారంభించారు. 9 గంటల సమయంలో ఎక్సైజ్, పోలీస్ సహకారంతో క్యూ కట్టడం ప్రారంభమయింది. యువకులు, మధ్య వయస్కులు, వయసు మీద పడ్డవారు, మహిళలు, యువతులు... అంతా లైన్లలోకి వచ్చేశారు. 10 గంటలు కాగానే షాపుల షట్టర్లు లేశాయి. మందుబాబులు తమకు ఇష్టమైన బ్రాండ్ లిక్కర్ను కొనుక్కుని తీసుకెళ్లారు. తొలిరోజు కావడంతో మద్యాన్ని భారీగా కొనుగోలు చేశారు రాష్ట్ర ప్రజలు. మళ్లీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో బుధవారమే చేతిలో ఉన్న డబ్బులకు తగినంత మందు కొనుక్కెళ్లారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో భౌతిక దూరం లేకుండా.. ధరలు పెరిగినా పట్టించుకోలేదు... మద్యం దుకాణాలు తెరిచారన్న ఆనందంతో మందు బాబులు మద్యం ధరలు పెరిగాయన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. చీప్ లిక్కర్పై 11 శాతం, ఇతర మద్యంపై 16 శాతం ప్రత్యేక సెస్ విధించడంతో బుధవారం రాష్ట్రంలోని అన్ని రకాల మద్యం ధరలూ పెరిగాయి. ఫుల్బాటిల్ చీప్ లిక్కర్పై రూ.40, మీడియం బ్రాండ్లపై రూ.80, ప్రీమియం బ్రాండ్లపై రూ.120 చొప్పున పెంచగా.. స్కాచ్, ఫారిన్ బ్రాండ్పై రూ.160, బీర్లపై రూ.30 అదనపు భారాన్ని ప్రభుత్వం మోపింది. అయితే పెరిగిన మద్యం ధరలు కొంత గందరగోళానికి కారణమయ్యాయి. బుధవారం ఉదయం షాపులు తెరిచే సమయానికి బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి పెరిగిన ధరలపై స్పష్టత రాకపోవడంతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో బ్రాండ్ను ఒక్కో రేటుకు అమ్మాల్సి వచ్చింది. చదవండి: ఆసుపత్రుల్లో ఓపీ షురూ మధ్యాహ్నానికి కొంత స్పష్టత వచ్చినా ధరల గందరగోళం మాత్రం సాయంత్రం వరకు సాగింది. ప్రీమియం, మీడియం బ్రాండ్లపై రూ.100 నుంచి రూ.300 వరకు పెంచి అమ్మారు. ఎక్సైజ్ శాఖ అంచనా ప్రకారం.. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో రూ.90 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. వాస్తవానికి, సాధారణ రోజుల్లో రోజుకు మద్యం విక్రయాలు రూ.35 కోట్ల మేర జరుగుతాయి. అయితే, బుధవారం మద్యం ప్రియులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడంతో ఈ విలువ రెండింతల కన్నా ఎక్కువ పెరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్లోనే రూ.50 కోట్ల వరకు విక్రయాలు జరిగి ఉంటాయని అంటున్నారు. ఆదిలాబాద్ పట్టణం వినాయక్చౌక్లోని ఓ వైన్ షాప్ వద్ద.. డిపోలకు భారీగా ఇండెంట్లు... ఇటీవల సేకరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మార్చి 22 నాటికి రూ.110 కోట్ల విలువైన మద్యం స్టాక్ అందుబాటులో ఉండగా, బుధవారం రూ.90 కోట్ల స్టాక్ అయిపోవడంతో డిపోల నుంచి సరుకు షాపులకు చేరుస్తున్నారు. వైన్స్ యాజమాన్యాలు కూడా తొలిరోజు నుంచే డిపోలకు భారీ ఇండెంట్లు పెట్టడంతో డిపోలకు కూడా సరుకును వేగవంతంగా చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిపోల నుంచి షాపులకు రాత్రి 7 గంటల తర్వాత సరుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని డిపోల సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, వైన్స్ యజమానులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పెరిగిన రేట్ల ప్రకారం ప్రభుత్వానికి వైన్షాపు యజమానులు చెల్లించాల్సిన వ్యాట్ను నేడు కట్టించుకోనున్నారు. ఈ మేరకు గురువారం చలాన్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలని వైన్షాప్ యజమానులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. దూరం దూరం.. సాయంత్రానికి మాయం... భౌతిక దూరం పాటించాలని, ఎక్కడైనా తేడా వస్తే మళ్లీ మద్యం దుకాణాలు మూసేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దుకాణాలు ఎక్కడ మూసేస్తారో అనే ఆలోచనతో ఉదయం నుంచి మందుబాబులు భౌతిక దూరం నిబంధనను పాటించారు. మాస్క్ లేకపోతే మద్యం ఇవ్వరేమో అనే జాగ్రత్త కూడా తీసుకుని ఏదో రకమైన మాస్కు కట్టుకుని క్యూలో నిలబడ్డారు. అయితే సాయంత్రం 6 గంటలకు షాపులు మూసేస్తారన్న సమయంలో అప్పటి వరకు క్యూలో ఉన్న మందుబాబులు మందు దొరుకుతుందో.. లేదో అనే ఆదుర్దాతో భౌతిక దూరాన్ని మర్చిపోయారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కూడా ఆ సమయంలో చాలా చోట్ల ఏమీ చేయలేకపోయారు. -
ఇకపై మద్యం హోం డెలివరీ..ఇవిగో టైమింగ్స్
ఛండీగర్ : కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో అనేక రాష్ర్టాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సామాజిక దూరం పాటించాలన్న నిబందనలు గాలికొదిలేసి మద్యం ప్రియులు అత్యుత్సాహం చూపిస్తున్న ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని నిబంధనల మధ్య మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే హామ్ డెలివరీకి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలి. అదే విధంగా మధ్యాహ్నం 1 నుంచి 6 గంటల వరకు డోర్ డెలివరీకి అనుమతిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. (మద్యంబాబులకు షాక్.. షాప్స్ క్లోజ్ ) నిబంధనలు పాటించకపోతే మద్యం షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని తెలిపారు. చాలా ప్రాంతాల్లో అధిక రద్దీ కారణంగా, సామాజిక దూరం పాటించడం లేదని దీని ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున లిక్కర్ డోర్ డెలివరీకి అనుమతిస్తున్నమని వివరించారు. ఇక ఛత్తీస్ఘడ్లోనూ గ్రీన్జోన్లలో ఆన్లైన్ ద్వారా మద్యం పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఛత్తీస్గడ్ స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ (సీఎస్ఎంసీఎల్ ) అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వొచ్చు. (మద్యం డోర్ డెలివరీ : అందుబాటులో యాప్ ) -
తెలంగాణ: మద్యం దుకాణాల వద్ద మందుబాబులు
-
హైదరాబాద్లో వైన్స్ ముందు మహిళల క్యూ..
సాక్షి, హైదరాబాద్ : దాదాపు 45 రోజుల తర్వాత రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోవడంతో.. మందుబాబుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మద్యం కోసం చాలా మంది ఉదయం నుంచే వైన్స్ ముందు క్యూ కట్టారు. పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, పంజాగుట్ట, మాదాపూర్, ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్సిటీలో మద్యం కోసం మహిళలు, సాఫ్ట్వేర్ యువతులు క్యూ కట్టారు. ఐటీ సెక్టార్లోని పలు షాపుల దగ్గర సైతం భారీ క్యూలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల వృద్ధ మహిళలు మద్యం కోసం వైన్ షాపుల వద్దకు వచ్చారు. (చదవండి : తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు ఇవే..) మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరుచుకున్నాయి. వినియోగదారులు భౌతికదూరం పాటిస్తూ.. క్యూ లైన్లలో ఉన్నారు. మరోవైపు పోలీసులు, అధికారులు వైన్ షాపుల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వడగళ్ల వాన.. అయితేంటి మందు ముఖ్యం
డెహ్రడూన్ : లాక్డౌన్ను మే 17వరకు పొడిగించిన నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతివ్వడంతో చాలా రాష్ట్రాల్లో లిక్కర్ షాపులు పునః ప్రారంభమయ్యాయి. దీంతో వైన్ షాపుల మందుబాబులు క్యూ కట్టారు. దాదాపు 40 రోజుల తర్వాత మద్యం విక్రయాలు జరగడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఎండ, వానకు భరిస్తూ క్యూలైన్లలో వేచి ఉన్నారు. (మందుబాబులకు షాక్.. ఒక్కొక్కరికి రెండు బాటిళ్లు మాత్రమే) తాజాగా ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో భారీ వడగళ్ల వర్షం పడుతున్నా లెక్కచేయకుండా, భౌతిక దూరాన్ని పాటిస్తూ కిలోమీటర్ల మేర జనం మద్యం షాపు ముందు క్యూ కట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి షేర్ చేస్తూ.. వీళ్లు నిజంగానే యోధులు. ఎంతో ఓపికగా కిలోమీటర్ల మేర నిల్చున్నారు అంటూ ట్వీట్ చేశారు. ఇది అచ్చం అమితాబ్ బచ్చన్ నటించిన ఓ సినిమా సన్నివేశంలా ఉంది. అందులో తండ్రి చనిపోతే ఆయన్ను చూడటానికి వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఊరంతా కదిలింది అంటూ ఓ క్యాప్షన్ను జోడించారు. ఈ వీడియా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. Agnipath.. Agnipath.. Agnipath. Outside a liquor shop. Today. Via Whatsapp. pic.twitter.com/sul4F5uIBt — Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 5, 2020 -
పెన్షన్ డబ్బులు.. పెగ్గు కోసం
సాక్షి, నల్లగొండ: లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం అమ్మకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ఉదయం నుంచే దుకాణాల వద్ద మద్యంప్రియులు బారులు తీరారు. భౌతిక దూరం, మాస్క్లు తప్పకుండా పాటించాలనే నిబంధనలను అనేక చోట్ల పాటిస్తున్నారు. ఈ సందర్భంగా తమ బాధ అర్థం చేసుకుని మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలోని ఓ మద్యం దుకాణం వద్ద లైన్లో నిల్చొని ఉన్న ఓ ముసాలావిడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘నాకు మందు తాగడం ఎప్పట్నుంచో అలవాటు ఉంది. లాక్డౌన్తో మందు దొరక్క కల్లు తాగడంతో కడుపు ఉబ్బుతోంది. ఈ రోజు నుంచి మందు అమ్ముతున్నారని తెలిసి పొద్దున్నే వచ్చాను. మొన్ననే బియ్యం, రూ.1500 అధికారులు ఇచ్చారు. వీటితో పాటు నా పెన్షన్ డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బుతోనే మందు కొనుకుందామని వచ్చాను. (పెన్షన్ డబ్బులతో మందు కొనుక్కొవడం కరెక్టేనా? అని అడగ్గా) మరేం చేస్తాం బిడ్డ. మందు కావాలి పైసలు లేవు’అని ఆ ముసలావిడ చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఇక ముసలావిడ రూ.530తో ఓసీ ఫుల్బాటిల్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిపోయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు ఇవే.. ఆ ప్రాంతాలు మినహా అన్నిజోన్లలో మద్యం విక్రయాలు -
వాటిలో మినహా అన్నిజోన్లలో మద్యం విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచినందున ఇక్కడ తెరవకుంటే స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘గుడుంబాను రూపుమాపి సాంఘిక దురాచారాలు లేకుండా చేయాలని చూశాం. ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రూ.800 కోట్లు ఖర్చు చేశాం. కరోనా మూలంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులు తదితరాలు బంద్ చేశాం. కేంద్రం మార్గదర్శకాలతో మన చుట్టూ ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరిచాయి. మన దగ్గర మద్యం దుకాణాలు మూసివేయడంతో గుడుంబా, సెకండ్స్ మద్యం విక్రయం ప్రారంభమైంది. మద్యం దుకాణాలు తెరవకుంటే స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు డిస్టిలరీ కంపెనీలు కూడా గొడవ చేస్తున్నాయి. రాష్ట్రంలో 2,200 మద్యం దుకాణాలకు గానూ కంటైన్మెంట్ జోన్లలోని 15 దుకాణాలు మినహాయించి మిగిలిన అన్నింటినీ తెరుస్తాం. రెడ్జోన్ సహా అన్నిచోట్లా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బుధవారం నుంచి తెరుస్తాం. బార్లు, పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదు. చీప్ లిక్కర్పై 11 శాతం, మద్యంపై 16శాతం ధర అదనంగా పెంచుతున్నాం. లాక్డౌన్ తొలగించిన తర్వాత కూడా ఈ ధరలను తగ్గించేది లేదు. అమ్మేవారు, కొనుగోలు చేసేవారు భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించాలి. నిబంధనలు పాటించకున్నా, మాస్క్లు లేకుండా కొనుగోలు చేసినా లైసెన్సులు రద్దు చేస్తాం. నో మాస్క్ నో లిక్కర్.. నో మాస్క్ నో గూడ్స్’నినాదం అమలు చేస్తాం’అని సీఎం తెలిపారు. చదవండి: తెలంగాణలో 29 దాకా లాక్డౌన్ -
‘బాబు డబ్బులు ఇచ్చి మరీ లైన్లోకి పంపుతున్నారు’
సాక్షి, తాడేపల్లి : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని మంత్రి పేర్ని నాని అన్నారు. దేశ వ్యాప్తంగా లిక్కర్ షాపులకు ప్రధాని మోదీ మినహాయింపు ఇస్తే.. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అసూయతో ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ప్రజలను ఆందోళనలకు గురిచేసేలా బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి వైన్ షాపులకు పంపించి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. (చదవండి: ద్రోహం చేసింది చంద్రబాబే..!) లైన్లోకి టీడీపీ కార్యకర్తలను పంపి ఎల్లో మీడియా ద్వారా క్షుద్ర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చర్యలను లోకేష్ ఖండించకోవడం విచారకరమని అన్నారు. బ్రాందీ షాపులు తీయమన్నది మోదీ అయితే.. చంద్రబాబు ఏమో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు మోదీని చెప్పరాని మాటలతో తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు జైలులో వేస్తారనే భయంతో ప్రేమ సందేశాలు పంపిస్తున్నాని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు, ఈడీ కేసులతో చంద్రబాబు వణికిపోతున్నారని, అందుకే మోదీపై విమర్శలు చేయలేకపోతున్నారని పేర్ని నాని అన్నారు. -
ద్రోహం చేసింది చంద్రబాబే..!
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతల విమర్శలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మండిపడ్డారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలు చేసే ముందు స్థాయిని చూసి మాట్లాడాలని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలో అత్యధికంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. మద్యం షాపులు తెరవడం కేంద్ర నిర్ణయం అని తెలుసుకోకుండా ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడంతో మీ బుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిందని టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. ద్రోహం చేసింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోకుండా విమర్శలు చేయడంపై మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే బాబురావు హితవు పలికారు. (ఏపీలో పెరిగిన మద్యం ధరలు ఇవే..) -
మందుబాబులు ఎగబడ్డారు!
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఇప్పటి వరకు క్రమశిక్షణతో గడిపిన జనం.. ఒక్కసారిగా కట్టు తప్పారు. భౌతిక దూరం నిబంధనలను పక్కనబెట్టారు. గుంపులుగా చేరి గొడవలకు దిగారు. వారిని దారిలోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దేశవ్యాప్త లాక్డౌన్తో మూతపడిన మద్యం దుకాణాలు 40 రోజుల తర్వాత తిరిగి సోమవారం తెరుచు కోవడంతో చాలా రాష్ట్రాల్లో కనిపించిన దృశ్యాలివీ..! మూడో విడత లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగించిన కేంద్రం మద్యం దుకాణాలు తదితరాలకు వెసులుబాటునిచ్చింది. షాపుల వద్ద కొనుగోలు దారులు ఆరడుగుల భౌతిక దూరం పాటించాలనీ, ఐదుగురికి మించి ఉండరాదని నిబంధనలు పెట్టింది. ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల వద్ద ఉదయం నుంచే జనం కిలోమీటర్ల కొద్దీ క్యూలు కట్టారు. మద్యం కొనుగోలుకు ఎగబడ్డారు. భౌతిక దూరం పాటించకపోవడంతో నిర్వాహకులు దుకాణాలను మూసివేశారు. పోలీసులు లాఠీచార్జీ చేసి మందుబాబులను అదుపు చేయాల్సి వచ్చింది. ఢిల్లీలోని సుమారు 150 మద్యం దుకాణాలు సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేశాయి. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 26 వేల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం ప్రియులు లిక్కర్ కోసం బాహాబాహీకి దిగారు. మొదటి రోజు విక్రయాలతో రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని యూపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్రెడ్డి తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాలుకాని చోట్ల మద్యం దుకాణాలను తెరుస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో సోమవారం ముంబై, పుణేల్లోని షాపుల వద్ద కొనుగోలు దారులు క్యూ కట్టారు. కానీ, దుకాణాలను తెరవకపోవడంతో నిరాశచెందారు. షాపులను మూసి ఉంచాలంటూ తాము ఉత్తర్వులు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో జనం భారీగా చేరడంతో నిర్వాహకులు దుకాణాలను మూసివేయాల్సి వచ్చింది. రెడ్ జోన్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం మద్యం విక్రయాలకు తొందరపడి అనుమతివ్వడంపై కేంద్ర మంత్రి హర్షవర్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాప్తికి ఊతమిచ్చేలా జనం గుమికూడుతున్నందున ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సమీక్షించాలని కోరారు. ఢిల్లీలో మద్యం దుకాణం వద్ద గుమికూడిన జనంపైకి లాఠీ ఝళిపిస్తున్న పోలీస్ -
మందు బాబులపై పేలుతున్న జోకులు
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల సోమవారం ఉదయం మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. దీంతో దాదాపు 40 రోజులుగా నోట్లో చుక్క పడక ఆగమాగం అవుతున్న మందు బాబులు ఉదయాన్నే మద్యం దుకాణాల ముందు బారులు తీశారు. ఈ రోజు ఎలాగైనా నోట్లో చుక్క పడాల్సిందేనంటూ గంటల తరబడి లిక్కర్ షాపుల ముందు పడిగాపులు కాశారు. ఇక చాలా రోజుల తర్వాత లిక్కర్ షాపులు తెరచుకోవడంతో మందుబాబు పండగ చేసుకున్నారు.(చదవండి : మద్యం షాపులు ఇలా తెరిచారు.. అలా మూశారు!) కొన్ని చోట్ల వైన్ షాపులకు పూల దండలు వేసి పూజ చేసి చేశారు. మరికొందరు బ్యాండ్ బాజాతో మద్యం దుకాణాలకు తరలి వచ్చారు. కొన్ని చోట్ల భౌతిక దూరం పాటించక పోవడంతో మధ్యాహ్నమే వైన్ షాపులు మూసేశారు. ఢిల్లీలోని ఓ లిక్కర్ షాప్ వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో లిక్కర్ స్టోర్ను అధికారులు క్లోజ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పలు చోట్ల ముఖానికి మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను పట్టించుకోకుండా మందు కోసం పోటీ పడ్డారు. దీంతో అక్కడక్కడ పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక మందు బాబుల విన్యాసాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మందుబాబుల తీరును నెటిజన్లు మీమ్స్ రూపంలో పంచుకుంటూ నవ్వులు పూయిస్తున్నారు. #LiquorShops People after hijacking the wine shop 😂 #LiquorShops pic.twitter.com/2X3ee5qNAR — ŤÃBÌŠH ÏBŘÃHÍM (@Ibhm_tabish) May 4, 2020 మద్యం దుకాణం తెరచిన తర్వాత మందు బాబులు పరిస్థితి Today situation..🍾#Covid_19india#LiquorShops pic.twitter.com/LIv7NWz4G2 — PALAKURI SHANKER (@PalakuriShanker) May 4, 2020 After standing for 4 hours in line and then asking for a Breezer.#LiquorShops pic.twitter.com/X6cvvwjIHS — Akkshay (@akkshayjain1995) May 4, 2020 Corona?? What Corona?? Its Marriage type celebration with Band Bajaa as #LiquorShops open 🎷🎺😂🍻 pic.twitter.com/45hoFLZPqB — Rosy (@rose_k01) May 4, 2020 Government after seeing long queues outside wine shops today#QuarantineLife #Memes #dailymemes #LiquorShops pic.twitter.com/gKevvsiMAg — Hrishikesh (@IndianBrownKid) May 4, 2020 #LiquorShops owners waiting for their customers be like: (Aa aa aaa aa aaa sound plays in background) pic.twitter.com/rDzpsa1D8W — The Steno Boi (@Thestenoboi) May 4, 2020 People after seeing liquor shop:#LiquorShops pic.twitter.com/HJeoV6vGpe — Oyeee_Sunnn♥️ (@Salehasiddique3) May 4, 2020 -
అందుకే మద్యం ధరలు పెంచారు: రోజా
సాక్షి, విజయవాడ: మద్యపాన నిషేదంలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం ధరలు పెంచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ధరలు పెంచితే పేదవాడు మద్యానికి దూరం అవుతారని అమె అభిప్రాయపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మద్యం ధరలు పెంచితే టీడీపీ నేతలు ఎందుదకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మద్యాన్ని ఏరులై పారిస్తే.. సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధానికి శ్రీకారం చుట్టారని రోజా చెప్పారు. రాష్ట్రంలో 40 వేల బెల్టుషాపులు, 20 శాతం వైన్ షాపులు, 40 శాతం బార్లను తొలగించారని గుర్తు చేశారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తుంటే.. చంద్రబాబు,టీడీపీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. -
ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలు..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మూడో దశ లాక్డౌన్లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే సమయంలో మద్యం షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరి చేసింది. ఒకేసారి ఐదుగురికి మాత్రమే మద్యం షాపుల వద్ద అనుమతి ఇవ్వనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే కాసేపు షాపుల మూసివేయనున్నారు. మరోవైపు ఏపీలో నేటి నుంచి పెంచిన మద్యం ధరలు అమల్లోకి రానున్నాయి. మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.అయితే మాల్స్, బార్లు, క్లబ్లు తెరుచుకోవని స్పష్టం చేశారు. (చదవండి : మద్యం ధరలు మార్గదర్శకాలు) -
ఏపీలో రేపటి నుంచి తెరుచుకోనున్న మద్యం షాపులు
సాక్షి, అమరావతి: ఏపీలో రేపటి నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతించామని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలను పంపించామని పేర్కొన్నారు. మద్యం షాపుల వద్ద తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలన్నారు. కేవలం ఐదుగురినే అనుమతిస్తామని పేర్కొన్నారు.షాపుల ముందు సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తామని.. మాస్క్ లేనిదే మద్యం దుకాణాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. రద్దీ ఎక్కువగా ఉంటే ఆ షాపులను కొంత సమయం మూసేస్తామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్ల బయట మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలను తగ్గించేందుకే ధరలు పెంచామని రాజత్ భార్గవ్ వెల్లడించారు. -
మద్యం నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మద్యం నియంత్రణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని అడుగులు ముందుకేసింది. మద్యం ధరలను 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. (చదవండి : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ ) కాగా, కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 4 నుంచి మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. కోవిడ్ కంటైన్మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం(ఆరడుగుల ఎడం) పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు. మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు, రెడ్ జోన్లలోని మాల్స్లో ఉన్న వాటికి ఈ వెసులుబాటు వర్తించదు. -
మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోవడంతో మే 4 నుంచి మే 17 వరకు దేశంలో లాక్డౌన్ 3.0 (మూడవ దశ)కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్ జోన్లలో సడలింపులు, నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్ , గ్రీన్ జోన్లుగా విభజించింది. రెడ్ జోన్లు (అత్యధిక సంఖ్యలో కేసులు, రేటు) ఆరెంజ్ జోన్ (తక్కువ కేసులు) గ్రీన్ జోన్ ( గత 21 రోజులలో కేసులు లేకపోవడం) గా వర్గీకరించింది. తాజా సడలింపులు, మద్యం దుకాణాలు లేదా ఇ-కామర్స్ సేవలపై గందరగోళం నెలకొనడంతో కేంద్రం స్పష్టతనిచ్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాలు అందించిన వివరాల ప్రకారం ఆంక్షలు, సడలింపులు ఈ విధంగా ఉండనున్నాయి. (ప్రధాని కీలక భేటీ : రెండో ప్యాకేజీ సిద్దం!) ఆరెంజ్ , గ్రీన్ జోన్లు రెండింటిలోనూ మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతి వుంటుంది. అన్ని వస్తువులకు ఇ-కామర్స్ అనుమతి. ఇప్పటివరకూ నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతి వుండగా, తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇంటి పనిమనుషులను అనుమతించాలా లేదా అనేది ఆయా రాష్ట్ర, లేదా యూటీ (కేంద్రపాలిత ప్రాంతాలు)ల నిర్ణయంపై ఆధారపడి వుంటుంది. రెడ్ జోన్లు నాన్ కంటైన్ మెంట్ జోన్లలో మార్కెట్ కాంప్లెక్స్ లేదా మాల్లో భాగం కాని స్వతంత్ర మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతి. అత్యవసరమైన వస్తువులకు మాత్రమే ఇ-కామర్స్ అనుమతి. అత్యవసరం కాని వస్తువుల విక్రయానికి అనుమతి లేదు. మాల్స్, అందులో ఉండే షాపులకు అనుమతి లేదు. అయితే సింగల్ విండో షాపులు, కాలనీల్లోని షాపులకు, గృహ సముదాయాల్లో ఉండే షాపులకు అనుమతి ఉంది. ఇక ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి. అత్యవసర సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మెడికల్ ఉత్పత్తులు, ఐటీ హార్డ్వేర్, జూట్ మిల్లులకు అనుమతి ఉంది. అయితే ఇక్కడ పనిచేసే వారందరూ తప్పకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ ధరించాల్సి ఉంటుంది. పల్లె ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు వర్తిస్తాయి. పట్టణాల్లో భవన నిర్మాణ పనులు స్థానికంగా ఉన్న కూలీలతో కొనసాగుతాయి. అంతేకాక అక్కడ పని చేసేందుకు వచ్చే కూలీలను బయట ప్రాంతాలకు తరలించకూడదు. ప్రైవేట్ ఆఫీసులు 33శాతం స్టాఫ్తో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. డిప్యూటీ సెక్రటరీ, ఆపైస్థాయి ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో.. అలాగే మిగిలిన ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా 33 శాతం సిబ్బందితో పని చేయాల్సి ఉంటుంది. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సడలింపులు, పరిమితులు రెడ్, ఆరెంజ్ జోన్లలో స్థానిక అధికారులు గుర్తించిన కంటైన్ మెంట్ ప్రాంతాలకు వర్తించవు. అనుమతించిన నిత్యావసరాల సరఫరాకు మించి కంటైన్ మెంట్ జోన్ ప్రాంతాలు తీవ్రమైన పరిమితులకు లోబడి వుంటాయి . (హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట) ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, లాక్డౌన్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం జారీ చేసిన ఆంక్షలను సడలించడానికి వీల్లేదు. ఉదాహరణకు రెడ్ (స్వతంత్ర దుకాణాలు మాత్రమే), ఆరెంజ్, గ్రీన్ జోన్స్, జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి అవకాశం వుంది. కానీ కావాలనుకుంటే రాష్ట్రాలు, యూటీలు మద్యం షాపులను మూసి వుంచడానికి కేంద్రం అనుమతినిచ్చింది. అదే సందర్భంలో రెడ్ జోన్లలో నాన్ ఎసెన్షియల్ వస్తువుల అమ్మకానికి ఇ-కామర్స్ సంస్థలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి వుండదు. ఈ నెల 3వ తేదీతో ముగియనున్నరెండవ దశ లాక్ డౌన్ ను పొడిగించి, అనేక ప్రాంతాల్లో విధించిన ఆంక్షలను ప్రభుత్వం గణనీయంగా సడలించింది. మార్చి చివరిలో అమల్లోకి వచ్చిన దేశవ్యాప్త లాక్డౌన్ విస్తరించడం ఇది రెండోసారి. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) -
కరోనా: ‘చుక్క పడితే.. వైరస్ చచ్చుడే’
జైపూర్: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మద్యం షాపులను తెరవాలని రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్పూర్ స్పష్టం చేశారు. వైరస్ క్రిములను నిర్మూలించేందుకు ఆల్కహాల్తో చేతులు శుభ్రం చేసుకుంటున్నప్పుడు గొంతులో తిష్టవేసే.. వైరస్ క్రిముల్ని చంపేందుకు మద్య వాడొచ్చుకదా అని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు లేఖ రాసి మద్యం దుకాణాలను ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే, మద్యం షాపులను మూసేయడంతో.. మందు బాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే భరత్సింగ్ తన లేఖలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. (చదవండి: 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు) ‘మద్యం అమ్ముతూ స్వయం ఉపాధి పొందే వారికి, ప్రభుత్వానికి ఇదొక ఒక మంచి అవకాశం. మార్కెట్లో మద్యానికి చాలా డిమాండ్ ఉంది. లాక్డౌన్ నిషేధ సమయంలో ప్రభుత్వ ఆదాయం తీవ్రంగా దెబ్బతింటోంది. మద్యానికి బానిసైనవారి ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతోంది. మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతించదు. అందువల్ల దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది’అని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్పూర్ కోట జిల్లాలోని సంగోడ్ అసెంబ్లీ సీటు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. (చదవండి: 75 బస్సుల్లో స్వస్థలాలకు విద్యార్థులు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
14 వరకు మద్యం దుకాణాలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 14 వరకు అన్ని మద్యం దుకా ణాలను మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 14 వరకు రాష్ట్రంలోని అన్ని వైన్షాపులు, బార్లు మూసి ఉంచాలని, ఈ విషయం లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి, గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా మ ద్యం దుకాణాల మూసివేత గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మళ్లీ మద్యం దుకాణాలు తెరుస్తారని, అమ్మకాలకు కొం త వెసులుబాటు కల్పిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈనెల 14 వరకు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసే ఉంచాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో తొలిసారి మద్యం అమ్మకాలు 48 గంటల కన్నా ఎక్కువ సమయం నిలిచిపోయాయి. 1995–97లో మద్యనిషేధం అమల్లో ఉన్నప్పుడు మినహా రాష్ట్రంలో ఎప్పుడూ ఇన్ని రోజులు లిక్కర్ అమ్మకాలు జరగ కుండా ఉన్న సందర్భాల్లేవని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సందర్భాల్లో పోలింగ్కు 48 గంటల ముందు వైన్ షాపులు, బార్లు బందయ్యేవి. కానీ, ఇప్పుడు ఆరోగ్య అత్యయిక పరిస్థితుల నేపథ్యంలో గత 8 రోజులుగా బార్లు, మూడు రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మందుబాబులకు కరోనా ‘చుక్కలు’కనిపిస్తున్నాయి. వెసులుబాట్లు కూడా లేవు... అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పుడు కల్లు, అనధికారికంగా గుడుంబా అందుబాటులో ఉండేవి. సరిహద్దు రాష్ట్రాల్లో నిషేధం లేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రానికి అరకొరగా మద్యం వచ్చేది. ఇప్పుడు అలాంటి వెసులుబాట్లు కూడా లేకుండాపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబాను దాదాపు నిర్మూలించగా, కల్లు దుకాణాలు కూడా కరోనా దెబ్బకు మూతపడ్డాయి. గ్రామాల్లో చెట్ల నుంచి తీసిన కల్లు మాత్రమే లభిస్తోంది. రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం వచ్చే అవకాశం లేకుండా పోయింది. పొరుగు రాష్ట్రాలు కూడా లాక్డౌన్ విధించడంతో అక్కడ కూడా మద్యం లభించడం లేదు. దీంతో రాష్ట్రంలో త్వరలోనే పూర్తిస్థాయిలో మద్యం కొరత ఏర్పడనుందని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పట్లో లాక్డౌన్ ఎత్తేసే అవకాశం లేదని, కనీసం మరో నెలైనా ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్లో ధర ‘చుక్కలే’... బార్లు, వైన్ షాపులు మూతపడటంతో బ్లాక్ మార్కెట్లో మద్యం అమ్మకాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. బ్లాక్లో కొని తాగాలనుకునే మందుబాబులకు వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ బ్రాండ్ మద్యం కూడా క్వార్టర్కు రూ.350 వరకు అమ్ముతున్నారు. ప్రీమియం బ్రాండ్ల మద్యమైతే ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. అంత ధర పెట్టి తాగేకన్నా మందు మానడమే ఉత్తమమని కొందరు సర్దుకుంటుండగా, మరికొందరు బేరాలాడి కొనుక్కొంటున్నారు. మద్యానికి బానిసలైన వారు మాత్రం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అయితే, ఈ పరిస్థితి కొంత మేలు చేస్తుందని, అనధికార మద్యనిషేధం వ్యసనపరులకు ఉపయోగపడుతుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను వ్యసనపరులు సద్వినియోగం చేసుకుని మద్యానికి దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలని, లేదంటే మద్యం నుంచి పూర్తిగా విముక్తి పొందేందుకు సువర్ణావకాశమని అంటున్నారు. ఏదేమైనా తాగి అందరికీ చుక్కలు చూపించే మందుబాబులకు ‘కరోనా’నిజంగానే చుక్కలు చూపిస్తోంది. -
మందు.. మేమే అందిస్తాం..!
సాక్షి, ములుగు: జిల్లాలో మద్యం వాప్యారం యధేచ్ఛగా కొనసాగుతోంది. ఉన్నత అధికారులతో సంబంధం లేకుండా ప్రతి రోజూ విచ్ఛలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు నియమాలను అమలు చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిద్రమత్తులో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా ఏర్పాటైన వైన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. స్పందించాలి్సన అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులతో పోలిస్తే పోలీసు శాఖ జరిపే దాడుల్లోనే అధికంగా కేసులు నమోదు అవుతుండడం విశేషం. ప్రత్యేక వాహనాల్లో బెల్టు షాపులకు మద్యం..! గతంలో జిల్లాలోని వివిధ గ్రామాల బెల్టు షాపుల వ్యాపారులు మండల కేంద్రాల్లోని వైన్స్ నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో అమ్మకాలు జరిపేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారయింది. ఉన్నత అధికారుల నిఘా లోపించడంతో వ్యాపారులు ఒకడుగు ముందుకు వేసి ఆయా మండలాల వారీగా సిండికేట్గా మారి ప్రత్యేక వాహనంలో గ్రామాలకు మద్యం తరలిస్తూ బహిరంగంగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారని తెలుస్తుంది. ఈ దందాను నిలవరించే వారే లేకపోవడంతో వైన్స్ వ్యాపారులు రోజు వారీగా బహిరంగ వ్యాపారాలు జరుపుకుంటూ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన దందాను విస్తరిస్తున్నారు. ములుగు, వెంకటాపురం(ఎం), ఏటూరునాగారం, వెంకటాపురం(కే), వాజేడు, మంగపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లోని వైన్స్ వ్యాపారులు నిత్యం బెల్టు షాపుల నిర్వాహకులకు ఏదో ఒక సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. మంగపేటలో ఇతర ప్రాంతాల నుంచి.. మంగపేట మండలంలోని రాజుపేట, చుంచుపల్లిలో 1/70 చట్టంలో భాగంగా వైన్స్ నిర్వహణ లేదు. ఈ పరిణామాన్ని ఆసరాగా తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం జానంపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కాటాపురం, ఏటూరునాగారం మండలకేంద్రం నుంచి ఆటోల ద్వారా బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది. కొంత మంది నేరుగా ద్విచక్ర వాహనాల ద్వారా బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో బాటిల్పై రూ.30 అధికం గ్రామాల్లోని »బెల్టు షాపులకు వైన్స్ వ్యాపారులు ఒక్కో బీరు, క్వార్టర్ బాటిల్ను రూ. 10 చొప్పున ఎక్కువకు సరఫరా చేస్తున్నారు. దీంతో బెల్టు షాపుల వ్యాపారులు అదే బాటిల్పై రూ. 30 అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం ప్రియులు తమ జేబులను గుళ్ల చేసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో పలుమార్లు ఫిర్యాదులు అందినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఉంది.