list
-
ఆస్కార్ నామినేషన్స్.. ఎంపికైన చిత్రాలివే.. ఫుల్ లిస్ట్ చూసేయండి
ఈ ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక 97వ ఆస్కార్ నామినేషన్స్ జాబితా ఇవాళ విడుదలైంది. పలు విభాగాల్లో పోటీపడుతున్న చిత్రాల లిస్ట్ను లాస్ ఎంజిల్స్లో ప్రకటించారు. గతంలోనే విడుదల కావాల్సిన నామినేషన్స్ చిత్రాల జాబితా.. కార్చిచ్చు ఘటన ఆలస్యమైంది. వాయిదా పడడంతో గురువారం అకాడమీ అవార్డుల నామినేషన్ల చిత్రాల జాబితాను అకాడమీ సభ్యులు బోవెన్ యాంగ్, రాచెల్ సెన్నోట్ ప్రకటించారు.ఈ సారి ఇండియన్ చిత్రాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కంగువా, ది గోట్ లైఫ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, సంతోష్, స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రాలు నామినేషన్స్లో చోటు దక్కించుకోలేకపోయాయి. కాగా.. గతంలో రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించిన షార్ట్ ఫిల్మ్ అనూజకు నామినేషన్స్లో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్లో నిలిచింది. ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 2న లాస్ ఎంజిల్స్లో జరగనున్నట్లు అకాడమీ నిర్వాహకులు ప్రకటించారు. ఆస్కార్- 2025 ఎంపికైన చిత్రాల జాబితా మీరు చూసేయండి.బెస్ట్ పిక్చర్ కేటగిరీ.. అనోరా ది బ్రూటలిస్ట్ ఎ కంప్లీట్ అన్నోన్ కాన్క్లేవ్ డ్యూన్: పార్ట్2 ఎమిలియా పెరెజ్ ఐయామ్ స్టిల్ హియర్ నికెల్ బాయ్స్ ది సబ్స్టాన్స్ విక్డ్బెస్ట్ డైరెక్టర్ విభాగం.. సీన్ బేకర్ -(అనోరా) బ్రాడీ కార్బెట్ -(ది బ్రూటలిస్ట్) జేమ్స్ మ్యాన్గోల్డ్- (ది కంప్లీట్ అన్నోన్) జాక్వెస్ ఆడియార్డ్- (ఎమిలియా పెరెజ్) కోరలీ ఫార్గేట్- (ది సబ్స్టాన్స్)బెస్ట్ యాక్ట్రెస్.. సింథియా ఎరివో -(విక్డ్) కార్లా సోఫియా గాస్కన్ -(ఎమిలియా పెరెజ్) మికే మాడిసన్ -(అనోరా) డెమి మూర్ - (ది సబ్స్టాన్స్) ఫెర్నాండా టోర్రెస్- (ఐ యామ్ స్టిల్ హియర్)బెస్ట్ యాక్టర్.. అడ్రియాన్ బ్రాడీ- (ది బ్రూటలిస్ట్) తిమోతీ చాలమెట్ -(ది కంప్లీట్ అన్నోన్) కోల్మెన్ డొమినింగో- (సింగ్సింగ్) రే ఫియన్నెస్- (కాన్క్లేవ్) సెబస్టియన్ స్టాన్ -(ది అప్రెంటిస్)బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్.. మోనికా బార్బరో- (ఏ కంప్లీట్ అన్నౌన్) అరియానా గ్రాండే -(విక్డ్) జామీ లీ కుర్తీస్- (ది లాస్ట్ షో గర్ల్) ఇసబెల్లా రోస్సెల్లిని -(కాన్క్లేవ్) జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్.. యురా బోరిసోవ్ -(అనోరా) కిరెన్ కల్కిన్ -(ది రియల్ పెయిన్) జెరీమీ స్ట్రాంగ్- (అప్రెంటిస్) ఎడ్వర్డ్ నార్తన్ -(ఏ కంప్లీట్ అన్నోన్) గాయ్ పియర్స్- (ది బ్రూటలిస్ట్)బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే..ది సబ్స్టాన్స్అనోరా-(సీన్ బేకర్)ది బ్రూటలిస్ట్-(బ్రాడీ కార్బెట్, మోనా ఫాస్ట్ వోల్డ్)ది రియల్ పెయిన్(జెస్సీ ఐసన్బర్గ్)సెప్టెంబర్ 5బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే..ఏ కంప్లీట్ అన్నౌన్కాన్క్లేవ్ఎమిలియా పేరేజ్సింగ్ సింగ్విక్డ్బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్..ఎమిలియా పేరేజ్ఫ్లోఐయామ్ స్టిల్ హియర్నీ క్యాప్వర్మింగ్లియోబెస్ట్ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ఫ్లోఇన్సైడ్ అవుట్-2మెమోర్ ఆఫ్ ఏ స్నేయిల్వాలెస్ అండ్ గ్రామిట్ వెంగేన్స్ ఆఫ్ మోస్ట్ ఫౌల్ది వైల్డ్ రోబోట్బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్డాటర్స్నో అదర్ ల్యాండ్పార్సీలైన్ వార్సౌండ్ ట్రాక్ టూ ఏ కౌప్ డిటాట్సుగర్కేన్బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం..డెత్ బై నంబర్స్ఐ యామ్ రెడీ, వార్డెన్ఇన్సిడెంట్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఉక్రెయిన్ఏ స్విమ్ లెస్సన్బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం..అనూజ(ప్రియాంక చోప్రా చిత్రం)డోవేకోట్ది లాస్ట్ రేంజర్ఏ లైయన్ది మ్యాన్ వు కుడ్ నాట్ రిమైన సైలెంట్ -
మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన మహావికాస్ అఘాడి, మహాయుతి పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మొత్తం మూడు జాబితాలతో కలిపి కాంగ్రెస్ ఇప్పటివరకు 87 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.కాంగ్రెస్ మూడో జాబితాలో డిగ్రాస్ నుంచి మాణిక్రావ్ ఠాక్రేను పార్టీ బరిలోకి దించింది. బాంద్రా వెస్ట్ నుంచి ఆసిఫ్ జకారియా, అంధేరీ వెస్ట్ నుంచి సచిన్ సావంత్లకు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. మాలెగావ్ సెంట్రల్ నుండి కాంగ్రెస్ ఎజాజ్ బేగ్కు అవకాశం కల్పించింది. అయితే సమాజ్ వాదీ పార్టీ ఈ సీటు కోసం పట్టుపడుతున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ తన రెండో జాబితాలో 23 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, తొలి జాబితాలో 48 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.మరోవైపు మహా వికాస్ అఘాడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకానికి సంబంధించిన ఫార్ములాను ప్రకటించింది. దీని ప్రకారం శివసేన (యూబీటీ), కాంగ్రెస్- ఎన్సీపీ (ఎస్పీ) చెరో 85 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కొన్ని సీట్ల విషయంలో ఇంకా ప్రతిష్టంభన నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20న జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది.ఇది కూడా చదవండి: వంట నూనె ధరలకు రెక్కలు -
యూపీ ఉపఎన్నికల బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
లక్నో: ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కర్హల్ సీటులో లాలూ యాదవ్ అల్లుడు, అఖిలేష్ మేనల్లుడు అయిన తేజ్ ప్రతాప్ యాదవ్(ఎస్పీ)పై పోటీకి బీజేపీ అనుజేష్ యాదవ్ను నిలబెట్టింది. కాన్పూర్లోని సిస్మౌ, మిర్జాపూర్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.బీజేపీ ప్రకటించి అభ్యర్థుల జాబితా ప్రకారం కుందర్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియాబాద్ నుంచి సంజీవ్ శర్మ, ఖైర్ (ఎస్సీ) నుండి సురేంద్ర దిలేర్, కర్హల్ నుంచి అనుజేష్ యాదవ్, ఫుల్పూర్ నుంచి దీపక్ పటేల్, కాటేహరి నుండి ధర్మరాజ్ నిషాద్, మజ్వాన్ నుండి సుచిస్మిత మౌర్య పోటీ చేస్తున్నారు.నవంబర్ 13న ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. యూపీలోని 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మిల్కీపూర్ ఉప ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఇది కూడా చదవండి: అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా -
దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు
కోల్కతా: దేశంలో దేవీ నవరాత్రుల వైభవం కొనసాగుతోంది. ఈ నవరాత్రులలో ఏడవ రోజున కాళికాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గాదేవి రూపం మహిళా సాధికారతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాళికా రూపాన్ని పూజించడం ద్వారా శత్రుబాధ నివారణ అవుతుందని, దుఃఖాలు నశించిపోతాయని చెబుతుంటారు.దేశంలో పలు కాళీమాత ఆలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆసక్తికర చరిత్రలు ఉన్నాయి. వీటిలో ఐదు దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కాలిబడి(ఆగ్రా)ఆగ్రాలోని కాలిబడి కాళికా ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఉన్న అద్భుత ఘాట్లోని నీరు ఎప్పటికీ ఎండిపోదని, అందులో క్రిమికీటకాలు పెరగవని స్థానికులు చెబుతుంటారు.జై మా శ్యామసుందరి(కోల్కతా)మరో కాళీ దేవాలయం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. దాని పేరు జై మా శ్యామసుందరి కాళీ మందిరం. ఈ ఆలయంలో కాళీదేవి సంచరిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ప్రతీరోజూ ఉదయం ఆలయ తలుపు తెరిచినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయని అంటారు.కాళీఘాట్(పశ్చిమ బెంగాల్)మూడవ కాళీ దేవాలయం కూడా పశ్చిమ బెంగాల్లో ఉంది. కాళీఘాట్లోని ఈ కాళీ దేవాలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో కాళీదేవి నాలుక బంగారంతో తయారు చేశారు.కాళీ ఖో(ఉత్తరప్రదేశ్)నాల్గవ ఆలయం ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో వింధ్య పర్వతంపై కాళీ ఖో పేరిట ఉంది. ఈ ఆలయం ధ్యాన సాధనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారికి సమర్పించే ప్రసాదం మాయమవుతుండటం వెనక కారణం ఏమిటో నేటికీ వెల్లడి కాలేదని భక్తులు చెబుతుంటారు.మాతా బసయ్య(మొరెనా) ఐదవది ఉత్తరప్రదేశ్లోని మొరెనాలో ఉన్న మాతా బసయ్య ఆలయం. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం నాటిది. నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ద్వారా భక్తుల తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇది కూడా చదవండి: కైలాస్నాథ్... చరణాద్రి శిఖరం -
మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమా.. ఆ లిస్ట్లో ఏకంగా రెండో స్థానం!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'భ్రమయుగం'. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్వైట్లోనే రూపొందించడం మరో విశేషం. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను దక్కించుకుంది.ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హారర్ ఫిల్మ్స్లో ఈ మూవీకి చోటు దక్కింది. ప్రముఖ మూవీ రివ్యూ రేటింగ్స్ ఇచ్చే లెటర్ బాక్స్ డీ సంస్థ తాజాగా జాబితాను రిలీజ్ చేసింది. 2024లో వచ్చిన బెస్ట్ 25 హారర్ ఫిల్మ్స్ లిస్ట్ను వెల్లడించింది. ఈ లిస్ట్లో మొదటిస్థానంలో ది సబ్స్టాన్స్ నిలవగా.. జపనీస్ మూవీ చిమే మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా డెడ్ టాలెంట్స్ సొసైటీ, యువర్ మాన్స్టర్, ఏలియన్ రొమ్యూలస్, ది గర్ల్ విత్ ది నీడిల్, స్ట్రేంజ్ డార్లింగ్, ఎక్స్హ్యుమా, ఐ సా ది టీవీ గ్లో చిత్రాలు టాప్-10లో నిలిచాయి. ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ధాకపూర్ హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2 23వ స్థానం దక్కించుకుంది. (ఇది చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ)‘భ్రమయుగం’ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు.అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే భ్రమయుగం చూడాల్సిందే. ప్రస్తుతం భ్రమయుగం సోనిలీవ్లో అందుబాటులో ఉంది.Letterboxd’s Top 10 Horror Films of 2024 (so far) 👻See the full list of The Official Top 25 Horror Films of 2024 here: https://t.co/x95L2cdqNZ pic.twitter.com/uL0wziJIMB— Letterboxd (@letterboxd) October 1, 2024 -
ఆ రెండు స్కూళ్లలో వాళ్లని కాల్చి చంపేస్తా!
ఫ్లోరిడా: రెండు స్కూళ్లలో కాల్పులు జరిపి, చంపాల్సిన ‘కిల్ లిస్ట్ను తయారు చేసుకున్నాడు. అందుకు రకరకాల రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు, కత్తులను సైతం సిద్ధం చేసుకున్నాడు. కిల్ లిస్ట్తోపాటు ఆయుధ సామగ్రి ఫొటోలను ఆన్లైన్లో తన క్లాస్మేట్లకు గొప్పగా చూపించుకున్నాడు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బాలుడి ఘన కార్యమిది. .! అసలే స్కూళ్లలో కాల్పుల ఘటనలతో జనం గగ్గోలు పెడుతున్న సమయం. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో, వారు ‘కార్లో కింగ్స్టన్’ డొరెల్లి’ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు. అతడు పోగేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ‘క్రీక్ సైడ్ మిడిల్ స్కూల్లో చదువుకుంటున్న కార్లో అనే బాలుడు క్రీక్ సైడ్, సిల్వర్ శాండ్ మిడిల్ స్కూళ్లలో వాళ్లను కాల్చి చంపేందుకు పథకం వేశాడు. పేర్లు, లక్ష్యాలతో జాబితాను సైతం సిద్ధం చేసుకున్నాడు. వీటిని ఆన్లైన్లో పెట్టాడు. ఇదేమని అడిగితే ఒట్టి జోక్ మాత్రమే అంటున్నాడు’ అని ఒలూసియా కౌంటీ షరీఫ్ మైక్ చిట్వూడ్ తెలిపారు. అధికారులు బాలుడికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తున్న వీడియోను ఆయన ‘థ్రెడ్’లో షేర్ చేశారు. అతడిపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘ఉత్తుత్తిగా లేదా నిజంగానే బెదిరింపులకు గురిచేసే పిల్లల ఫొటోలతో వివరాలను బహిర్గతం చేస్తాం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’అని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
ధనవంతుల జాబితాలో వెనక్కి తగ్గిన అంబానీ (ఫోటోలు)
-
మన దేశంలో అత్యంత చెత్త వంటకాలు ఇవే..! అందులో ఉప్మా..!
అంతర్జాతీయ సంస్థ టేస్ట్ అట్లాస్ మన దేశంలో చెత్త వంటకాల జాబితాను విడుదల చేసింది. అలాగే మనదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను విడుదల చేసింది. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారాలు, ఇష్టంలేని ఆహారాలు అనేవి కచ్చితంగా ఉంటాయి. వాటి గురించి వివరాలు సేకరించి... ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల జాబితాను, ఎక్కువ మంది తినడానికి ఇష్టపడని వంటకాల జాబితాను సిద్ధం చేస్తుంది ‘టేస్ట్ అట్లాస్’ సంస్థ. టేస్ట్ అట్లాస్ అనేది ఆన్లైన్ ఫుడ్ పోర్టల్. ఇది ప్రపంచంలోని బెస్ట్ వంటకాలు, బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ప్రకటిస్తుంటుంది. అలానే తాజాగా మనదేశంలో ఎక్కువశాతం ప్రజలు ఇష్టపడే వంటకాలు, ఇష్టపడని వంటకాల గురించి టేస్ట్ అట్లాస్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్ పదిలో ఉన్న చెత్త , ఉత్తమ రేటింగ్ పొందిన భారతీయ వంటకాల వివరాలను వెల్లడించింది. చెత్త వంటకాలు ఇవే…టేస్ట్ అట్లాస్ జాబితా ప్రకారం చెత్త రేటెడ్ ఫుడ్స్ ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వేసవిలో ఎంతో మంది ఆరోగ్యాన్ని కాపాడే జల్జీరా… ఈసారి చెత్త వంటకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తర భారతదేశంలో ఈ పానీయాన్ని విపరీతంగా తాగుతారు. అలాంటిది మనదేశంలోని చెత్త వంటకాల జాబితాలో మొదటి స్థానంలో నిలవడం షాక్కి గురిచేస్తుంది. చెత్త వంటకాల్లో రెండో స్థానంలో శీతాకాలంలో అతిగా తినే గజ్జక్ ఉంది. మూడో స్థానంలో దక్షిణ భారత వంటకం తెంగై సదం, నాలుగో స్థానంలో ఒడిశాకు చెందిన ప్రసిద్ధ పంతా బాత్, ఐదో స్థానంలో ఆలూ వంకాయ కర్రీ, ఆరో స్థానంలో తండాయ్ ఉన్నాయి. దీని తరువాత, కేరళ వంటకం అచ్చప్పం ఏడవ స్థానంలో, ప్రసిద్ధ హైదరాబాదీ మిర్చి కా సలాన్ ఎనిమిదో స్థానంలో, తీపి వంటకం మల్పువా తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక దక్షిణ భారతదేశంలో అల్పాహారంలో అధికంగా తినే ఉప్మా పదో స్థానంలో నిలిచింది. ఉప్మాను అధికంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తింటారు.బెస్ట్ ఫుడ్ ఇవే..మనదేశంలో బెస్ట్ ఫుడ్ జాబితాలో ఏ ఆహారాలు నిలిచాయో టేస్ట్ అట్లాస్ వివరించింది. ఆ ఫుడ్ లిస్ట్లో ఉన్న రుచికరమైన మామిడి లస్సీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మసాలా చాయ్ రెండో స్థానంలో, బటర్ గార్లిక్ నాన్ మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగో స్థానంలో అమృత్ సర్ కుల్చా, ఐదో స్థానంలో బటర్ చికెన్, ఆరో స్థానంలో హైదరాబాదీ బిర్యానీ, ఏడో తేదీన షాహి పనీర్, ఎనిమిదో స్థానంలో అందరికీ ఇష్టమైన చోలే భటురే నిలిచాయి. ఆ తర్వాత తందూరీ చికెన్ తొమ్మిదో స్థానంలో, కోర్మా పదో స్థానంలో నిలిచాయి. సాధారణంగా హైదరాబాదీ బిర్యానీ మొదటి స్థానంలో ఉంటుంది. కానీ ఈసారి బిర్యానీ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.టేస్టీ అట్లాస్ నిర్వాహకులు తమ పోర్టల్లో ఎవరికి ఏ ఆహారం అధికంగా నచ్చుతుందో, ఏ ఆహారం నచ్చదో చెప్పమని అడుగుతారు. మనదేశంలోని ఎవరైనా ఆ పోర్టల్ రెస్పాండ్ కావచ్చు. ఈ సర్వేలో పాల్గొన వచ్చు. ఆ విధంగా ఎక్కువ ఓట్లు పడిన వంటకాల జాబితాను సిద్ధం చేసి విడుదల చేస్తారు.(చదవండి: ఎలాంటి ఆహారం తీసుకుంటే హెల్తీగా ఉంటారు? నిపుణులు ఏమంటున్నారంటే..) -
కుంభమేళా నుంచి హత్రాస్ వరకు.. మహా విషాదాలు
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన సత్సంగ్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 116 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దేశంలో ఇలాంటి విషాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2005లో మహారాష్ట్రలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు. 2008లో రాజస్థాన్లోని చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృత్యువాత పడ్డారు. 2008లో హిమాచల్ ప్రదేశ్లోని నైనా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటుచేసుకున్న ఈ తరహా విషాదాలు..2023, మార్చి 31: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శ్రీరామ నవమి వేళ ఒక ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతి చెందారు.2022, జనవరి 1 : జమ్ముకశ్మీర్లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది కన్నుమూశారు.2015, జూలై 14: ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో పుష్కరాల మొదటి రోజున గోదావరి నది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు.2014, అక్టోబర్ 3: బీహార్లోని పట్నాలో దసరా వేడుకల సందర్భంగా గాంధీ మైదాన్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు.2013, అక్టోబరు 13: మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలోని రతన్ఘర్ దేవాలయం సమీపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మృతి చెందారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు.2012, నవంబర్ 19: బీహార్లోని పట్నాలో గంగా నది ఒడ్డున అదాలత్ ఘాట్ వద్ద ఛత్ పూజలు నిర్వహిస్తుండగా తాత్కాలిక వంతెన కూలిపోవడంతో తొక్కిసలాట జరిగి 20 మంది మరణించారు.2011, నవంబర్ 8: హరిద్వార్లోని గంగా నది ఒడ్డున హర్కీ పైడి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు.2011, జనవరి 14 : కేరళలోని ఇడుక్కి జిల్లాలోని పులమేడు వద్ద విషాదం చోటుచేసుకుంది. శబరిమల ఆలయాన్ని సందర్శించి వస్తున్న భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 104 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు.2010, మార్చి 4: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో కృపాలు మహారాజ్ రామ్ జానకి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 63 మంది మరణించారు.2008, సెప్టెంబరు 30 : రాజస్థాన్లోని జోధ్పూర్లో గల చాముండా దేవి ఆలయంలో బాంబు పేలుడు వదంతుల కారణంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 250 మంది కన్నుమూశారు. 60 మందికి పైగా జనం గాయపడ్డారు.2008, ఆగస్ట్ 3: హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలోని నైనా దేవి ఆలయంలో కొండ చరియలు విరిగి పడ్డాయనే వదంతులు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు.2005, జనవరి 25: మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు.2003, ఆగష్టు 27: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సింహస్థ కుంభమేళా పవిత్ర స్నానాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు. 140 మంది గాయపడ్డారు. -
2024 ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితా
ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా తొమ్మిదవ ఎడిషన్ను ప్రకటించింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 300 మంది యువ పారిశ్రామికవేత్తలు, లీడర్స్, ట్రయల్బ్లేజర్లు ఉన్నారు. వీరి వయసు 30 ఏళ్లకంటే తక్కువ.అండర్ 30 ఆసియా క్లాస్ ఆఫ్ 2024లో ది ఆర్ట్స్, ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్, మీడియా మొదలైన 10 విభాగాల్లో 300 మంది ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్నవారిలో కే-పాప్ గర్ల్, సింగపూర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ వెరోనికా శాంతి పెరీరా, అషియా సిటీకి చెందిన జపాన్ యొక్క అతి పిన్న వయస్కుడైన మేయర్ రియోసుకే తకాషిమా మొదలైనవారు ఉన్నారు."30 అండర్ 30 ఆసియా" జాబితాసియాన్ డాసన్ - ఆస్ట్రేలియా: ది ఆర్ట్స్మెటల్ బ్యాండ్ - ఇండోనేషియా: ఎంటర్టైన్మెంట్ & స్పోర్ట్స్అలీనా నదీమ్ - పాకిస్తాన్ : ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్ఎరికా ఎంగ్ - మలేషియా: మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్యూమీ హ్వాంగ్ - సౌత్ కొరియా: రిటైల్ & ఇకామర్స్జు యుయాంగ్ - చైనా: ఎంటర్ప్రైజ్ టెక్నాలజీఅక్షిత్ బన్సల్ & రాఘవ్ అరోరా - ఇండియా: ఇండస్ట్రీ, మాన్యుఫ్యాక్టరింగ్ & ఎనర్జీజాంగ్ జికియాన్ - చైనా: హెల్త్కేర్ & సైన్స్భాగ్య శ్రీ జైన్ - ఇండియా: సోషల్ ఇంపాక్ట్జాన్సన్ లిమ్ - సింగపూర్: కన్స్యూమర్ టెక్నాలజీ -
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆమ్ఆద్మీపార్టీ శనివారం(మే4)విడుదల చేసింది. ఈ లిస్టులో 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లను చేర్చింది.ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా జైలులో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్జైన్ పేర్లను లిస్టులో చేర్చడం గమనార్హం. వీరితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్ ఎంపీలు రాఘవ్చద్దా, సందీప్పాఠక్ ఢిల్లీ మంత్రులు, అతిశీ, సౌరభ్ భరద్వాజ్, గోపాల్రాయ్ తదితరులను స్టార్ క్యాంపెయినర్లుగా ఆప్ ప్రకటించింది. -
ఎన్నికల గుర్తుల్లో బుల్డోజర్ను ఎందుకు తొలగించారు?
దేశంలో లోక్సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఇదిలావుండగా ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ఎన్నికల గుర్తుల జాబితా నుంచి బుల్డోజర్ చిహ్నాన్ని తొలగించింది. అయితే దీని వెనుక గల నిర్దిష్ట కారణాన్ని ఎన్నికల సంఘం వెల్లడించలేదు. గత కొన్ని సంవత్సరాలుగా బుల్డోజర్ ఒక ప్రత్యేక వర్గానికి గుర్తింపుగా మారిందనే భావన అందరిలో ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే దానిని తొలగించాల్సి వచ్చిందని తెలుస్తోంది. కాస్మోటిక్స్, పిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో సహా పలు వస్తువులను ఎన్నికల గుర్తుల జాబితాలో చేర్చారు. ఈ జాబితాను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇందులో 190 ఎన్నికల గుర్తులు ఉన్నాయి. వీటిలో బూట్లు, చెప్పులు, సాక్స్లు కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్, ముత్యాల హారం, చెవిపోగులు, ఉంగరం మొదలైనవాటిని జోడించారు. ఎన్నికల చిహ్నాల జాబితాలో ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఆపిల్, ఫ్రూట్ బాస్కెట్, బిస్కెట్లు, బ్రెడ్, కేక్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, కొబ్బరి, అల్లం, ద్రాక్ష, పచ్చిమిర్చి, ఐస్క్రీం, జాక్ఫ్రూట్, లేడీఫింగర్, నూడుల్స్, వేరుశెనగ, బఠానీలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో వాల్నట్, పుచ్చకాయను కూడా చేర్చారు. అలాగే బేబీ వాకర్, క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్, కలర్ ట్రే బ్రష్, హ్యాండ్ కార్ట్, స్కూల్ బ్యాగ్, టోఫీలు, లూడో, లంచ్ బాక్స్, పెన్ స్టాండ్, పెన్సిల్ బాక్స్, షార్పనర్లు కూడా ఎన్నికల గుర్తుల జాబితాలో ఉన్నాయి. హార్మోనియం, సితార్, ఫ్లూట్, వయోలిన్ కూడా ఈ జాబితాలో కనిపిస్తాయి. కొన్ని ఎన్నికల చిహ్నాలు వాడుకలో లేకుండా పోయాయి. వీటిలో హ్యాండ్ మిల్లు, డోలీ, టైప్రైటర్, మంచం, బావి, టార్చ్, స్లేట్, టెలిఫోన్, రోకలి, బ్లాక్ బోర్డు, చిమ్నీ, పెన్ నిబ్, గ్రామోఫోన్, లెటర్ బాక్స్ మొదలైనవి ఉన్నాయి. ఎన్నికల గుర్తులకు సంబంధించిన ఆధునిక పరికరాల జాబితాలో ఎయిర్ కండీషనర్, ల్యాప్టాప్, కంప్యూటర్, మౌస్, కాలిక్యులేటర్, సీసీ కెమెరా, డ్రిల్ మెషిన్, వాక్యూమ్ క్లీనర్, పెన్ డ్రైవ్, బ్రెడ్ టోస్టర్, రిమోట్, స్పానర్, స్టెప్లర్, స్టెతస్కోప్, ఎక్స్టెన్షన్ బోర్డ్, మైక్ , మిక్సర్, స్విచ్ బోర్డ్, సిరంజి, ఫ్రైయింగ్ పాన్, హెడ్ఫోన్లు, హెల్మెట్, రోబోట్, రూమ్ కూలర్, హీటర్ మొదలైనవి ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల చిహ్నాలలో అల్మారా, ఆటో రిక్షా, బెలూన్, బ్యాట్, బ్యాట్, బెల్ట్, బెంచ్, సైకిల్ పంప్, బైనాక్యులర్స్, సెయిలింగ్ బోట్, బాక్స్, ఇటుకలు, బ్రీఫ్కేస్, బ్రష్, బకెట్, డీజిల్ పంప్, డిష్ యాంటెన్నా, గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ , ప్రెస్, కెటిల్, కిచెన్ సింక్, పాన్, పెట్రోల్ పంప్, ఫోన్ ఛార్జర్, ప్రెజర్ కుక్కర్, పంచింగ్ మెషిన్, కత్తెర, కుట్టు మిషన్, నీటి పాత్ర, సబ్బు డిష్, సోఫా, ఊయల, టేబుల్, టెలివిజన్, ట్యూబ్ లైట్ మొదలైనవి కూడా ఉన్నాయి. -
Forbes: డబ్బున్నోళ్ల లిస్ట్.. అందరికంటే రిచ్ ఈ పెద్దాయనే..
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్ (LVMH) బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబం 233 బిలియన్ డాలర్లు (రూ. 19.43 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో రికార్డు స్థాయిలో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్ట్లోని బిలియనీర్ల మొత్తం సంపద 14.2 ట్రిలియన్ డాలర్లు (11.8 కోట్ల కోట్లు) అని పేర్కొంది. ఆర్నాల్ట్, ఆయన కుటుంబం తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 195 బిలియన్ డాలర్ల (రూ. 16.26 లక్షల కోట్లు) నికర సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ 194 బిలియన్ డాలర్ల (రూ. 16.17 లక్షల కోట్లు) నెట్వర్త్తో మూడవ స్థానంలో ఉన్నారు. ఇక భారత్కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల (రూ. 9.67 లక్షల కోట్లు) సంపదతో టాప్ టెన్లో 9వ స్థానంలో నిలిచారు. ఈకాగా ఈసారి ఫోర్బ్స్ లిస్ట్లో కొత్తగా పలువురు సెలబ్రిటీలు చేరారు. పాప్ సంచనం టేలర్ స్విఫ్ట్ ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో అడుగు పెట్టింది. అక్టోబర్లో బిలియనీర్ హోదాకు చేరుకున్న ఈ పాప్ సూపర్ స్టార్, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిహన్న, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకాస్లతో కలిసి చేరారు. 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,169 కోట్లు) భారీ నెట్వర్త్తో స్విఫ్ట్ 14వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్ ఇదే.. -
జేడీయూ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్
పాట్నా: లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను బిహార్లో అధికార పార్టీ జేడీయూ ఆదివారం(మార్చ్ 24) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 16 సీట్లలో జేడీయూ పోటీ చేస్తోంది. పార్టీ మాజీ చీఫ్ రాజీవ్ రంజన్(లలన్) సింగ్కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈయన ముంగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్లు నిరాకరించారు. ఇద్దరు కొత్తవారికి పోటీ చేసే అవకాశం కల్పించారు. పార్టీలో చేరిన మరుసటిరోజే విజయ లక్ష్మి కుషావహాకు టికెట్ కేటాయించారు. ఆర్జేడీ నుంచి ఇటీవలే జేడీయూలోకి వచ్చిన లవ్లీ ఆనంద్ కూడా ఈసారి పార్టీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఇటీవలే ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీతో కలిసి బిహార్లో మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె -
బీజేపీ: వరుణ్ గాంధీకి టికెట్ దక్కేనా?
లోక్సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సమావేశమైంది. బీహార్, రాజస్థాన్తో పాటు యూపీలోని మిగిలిన 24 స్థానాలతో సహా ఇతర రాష్ట్రాల అభ్యర్థుల విషయమై చర్చించారు. అలాగే వరుణ్ గాంధీకి పిలిభిత్ స్థానం కేటాయించాలా వద్దా? అనేదానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది. అన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని, అయితే వీటిని దశలవారీగా విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం యూపీలో మొదటి దశలో మిగిలిన మూడు స్థానాలైన పిలిభిత్, మొరాదాబాద్, సహరన్పూర్ స్థానాల అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేయవచ్చని తెలుస్తోంది. యూపీలో మొదటి దశలో మొత్తం ఎనిమిది లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో సహారన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. పిలిభిత్, సహరన్పూర్, మొరాదాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పిలిభిత్ స్థానానికి అభ్యర్థిని నిర్ణయించడంపై సీఈసీ సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వరుణ్ గాంధీ ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అయితే ఈ సారి ఆయనకు టిక్కెట్ కేటాయించకుండా, కొత్తవారిని రంగంలోకి దింపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో సొంత పార్టీపై చేసిన విమర్శలే ఇందుకు కారణమని చెబుతున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు పాల్గొన్నారు. యూపీకి సంబంధించిన మిగిలిన 24 సీట్ల జాబితాను ఒకేసారి విడుదల చేయకుండా దశలవారీగా విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. -
ఒకే ఓటీటీలో 15 సినిమాలు.. పూర్తి జాబితా ఇదిగో! (ఫోటోలు)
-
నంద్యాలలో YSRCP జెండా ఎగరేస్తాం
-
పశ్చిమగోదావరి YSRCP MLA అభ్యర్థుల జాబితా
-
YSRCP ప్రకాశం జిల్లా అభ్యర్థులు వీళ్లే
ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
పంజాబ్ లోక్సభ ‘ఆప్’ అభ్యర్థుల జాబితా విడుదల
పంజాబ్ లోక్సభ ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితా లోని వివరాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ అమృత్సర్ నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖండూర్ సాహిబ్ నుంచి లాల్జీత్ సింగ్ భుల్లర్, జలంధర్ నుంచి సుశీల్ కుమార్ రింకు, ఫతేగఢ్ సాహిబ్ నుంచి గురుప్రీత్ సింగ్ జీపీ, ఫరీద్కోట్ నుంచి కరమ్జీత్ అన్మోల్, బటింఠా నుంచి గుర్మీత్ సింగ్ ఖాడియన్, సంగరూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీత్, పటియాల నుంచి డా. బల్బీర్ సింగ్లను లోక్ సభ ఎన్నికల అభ్యర్థులుగా ప్రకటించింది. -
బెస్ట్ శాండ్విచ్గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్కి చోటు!
ప్రపంచంలోనే అత్యుత్తమ శాండ్విచ్గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్కి చోటు దక్కింది. టాప్ 20 బెస్ట్ శాండ్విచ్లో ఈ భారతీయ వంటకం ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని అత్యుత్తమ శాండ్విచ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతీయ స్ట్రీట్ ఫుడ్ అయిన వడ పావ్క చోటు దక్కింది. ఆ జాబితాలో ఈ రెసిపీ 19వ స్థానంలో నిలవడం విశేషం. టేస్ట్ అట్లాస్ ప్రకారం..ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్ తయారీ ముంబైలోని ఓ వీధి వ్యాపారి నుంచి మొదలయ్యిందని పేర్కొంది. 1960-1970లలో దాదర్ రైలు స్టేషన్ సమీపంలో పనిచేసిన ఆశోక్ వైద్య అనే వీధి వ్యాపారీ ఈ వంటకాన్ని తయారు చేసినట్లు వెల్లడించింది. ఆయన అక్కడ పనిచేసే కార్మికుల ఆకలి తీర్చేలా మంచి వంటకాన్ని తయరు చేయాలని, అలాగే అది సులభంగా త్వరిగతిన చేయగలిగేలా ఉండాలని అనుకున్నారట. అప్పుడే ఈ రుచికరమైన వడాపావ్ని తయారు చేసినట్లు తెలిపింది. అలాఅలా ఇది వీధి స్టాల్స్ నుంచి ప్రుమఖ రెస్టారెంట్ల వరకు ప్రతి చోటా తయారయ్యే మంచి రుచికరమైన చిరుతిండిగా పేరుగాంచింది. ఈ జాబితాలో థంబిక్ డోనర్, బన్హమీ, షోర్మా వంటి చిరుతిండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకు సంబంధించిన పూర్తి జాబితాను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది టేస్టీ అట్లాస్. అలాగే ఇటీవల టేస్టీ అట్లాస్ విడుదల చేసి అత్యుతమ కాఫీ జాబితాలో భారతీయ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: మన దేశంలోని టాప్ మహిళా చెఫ్లు వీరే!) -
ఉగ్రవాదిగా ఆ దిగ్గజం! ఇది పుతిన్ ఆడే చదరంగం
ప్రత్యర్థుల అణచివేతకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎందాక అయినా వెళ్తారని కళ్లారా చూస్తున్నదే!. నావల్నీ మరణం.. అందుకు ఒక ఉదాహరణ. తాజాగా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్Garry Kasparovను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే అందుకు ప్రధాన కారణమని ఇక్కడ చెప్పనక్కర్లేదు. అసలు 'ఉగ్రవాదులు, తీవ్రవాదులు' లిస్టులో చేరడానికి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఎలాంటి విధానాలు పాటిస్తోంది?.. ఉగ్రవాదులు-అతివాదుల జాబితాలో చేరడానికి ప్రత్యేకించి అర్హతలేమీ అక్కర్లేదు. పుతిన్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే చాలూ. ఇలాగే ఇప్పుడు కాస్పరోవ్ పేరును తీవ్రవాదులు-ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను సైతం ఈ చెస్ మాజీ ఛాంపియన్ బహిరంగంగానూ ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రోస్ఫిన్మానిటరింగ్ (రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ) విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలోకి గ్యారీ కాస్పరోవ్ పేరు చేరింది. గ్యారీ కాస్పరోవ్ ప్రభుత్వ అణచివేత విధానాలకు భయపడి 2014లోనే ఆయన రష్యా నుంచి వెళ్లిపోయారు. పదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. 2022లో రష్యా న్యాయశాఖ ఆయనపై విదేశీ ఏజెంట్ అనే ముద్ర కూడా వేసింది. తాజాగా.. ఈ జాబితాలో ఆయన పేరును చేర్చడం వల్ల ఆయన ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆంక్షల్ని విధించేందుకు రష్యాకు అవకాశం ఉంటుంది. కాగా, గ్యారీ కాస్పరోవ్పై పుతిన్ సర్కార్ తీసుకున్న చర్యలను హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. అణచివేతకు ఈ ఆంక్షలను రష్యా ప్రభుత్వం ఆయుధంగా ఉపయోగిస్తుందని మండిపడుతున్నాయి. -
శ్రీవల్లి అరుదైన ఘనత.. ఆ జాబితాలో అగ్రస్థానం!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తాజాగా ఈ కన్నడ భామ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా- 30- అండర్- 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది. కాగా.. ప్రతి సంవత్సరం పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇవాళ విడుదల చేసిన జాబితా 30 ఏళ్లలోపు ఉన్నవారిలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసింది. ఈ లిస్ట్లో రష్మిక నంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. కాగా.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ సరసన పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Gratitude.. 🤍#Forbes30under30 pic.twitter.com/u0YliOF0g9 — Rashmika Mandanna (@iamRashmika) February 15, 2024 -
YSRCP 4th లిస్ట్ పై మంత్రి బొత్స క్లారిటీ
-
10 ఒళ్లు గగుర్పొడిచే దారుణాలు.. 2023 మిగిల్చిన చేదు గురుతులు!
కొంతమందికి 2023వ సంవత్సరం ఆనందంగా గడిస్తే, మరికొందరికి వారి జీవితంలో అత్యంత భయంకరమైన అనుభవాలను మిగిల్చింది. 2023వ సంవత్సరంలో దేశంలో చోటుచేసుకున్న 10 అత్యంత దారుణాల గురించి ఇప్పుడు చూద్దాం. 1. ఉమేష్ పాల్ హత్య దేశంలో అత్యంత చర్చనీయాంశమైన హత్య కేసుల్లో ఉమేష్ పాల్ హత్య ఒకటి. యూపీలోని ప్రయాగ్రాజ్ పరిధిలోని ధుమన్గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ తుపాకీ తూటాలకు హతమయ్యాడు. ఇది యూపీలో గ్యాంగ్ వార్ను మరోమారు గుర్తుచేసింది. ఉమేష్ పాల్పై బుల్లెట్లు, బాంబులతో దాడి చేసినట్లు సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది. 2. అతిక్, అష్రాఫ్ హత్యలు పూర్వాంచల్ మాఫియా లీడర్లుగా పేరొందిన అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్లు ప్రయాగ్రాజ్ మెడికల్ కాలేజీ సమీపంలో హత్యకు గురయ్యారు. పోలీసుల సంరక్షణలో ఉన్న అతిక్, అష్రఫ్ అహ్మద్లపై దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపి హత్యచేశారు. పోలీసు కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్తో ఒక జర్నలిస్టు మాట్లాడుతుండగా నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు పోలీసులకు పట్టబడ్డారు. 3. నిక్కీ యాదవ్ దారుణ హత్య ఢిల్లీలో నిక్కీ యాదవ్ హత్య.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి 10న నిక్కీ యాదవ్ను ఆమె ప్రియుడు సాహిల్ గొంతుకోసి హత్య చేశాడు. సాహిల్ ఫిబ్రవరి 10న ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న నిక్కీ అతనితో గొడవ పడింది. సాహిల్ కోపంతో నిక్కీని గొంతుకోసి హత్య చేశాడు. తరువాత నిక్కీ మృతదేహాన్ని తన దాబాలోని ఫ్రిజ్లో దాచిపెట్టాడు. అనంతరం రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో ఉంది. 4. రాజ్పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుని హత్య రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. సుఖ్దేవ్ సింగ్ను అంతమొందించే ప్లాన్తో వచ్చిన ఇద్దరు ముష్కరులు అతని ఇంటిలో కాసేపు కూర్చుని మాట్లాడారు. తరువాత వారిద్దరూ తమ తుపాకీలను తీసి సుఖ్దేవ్ సింగ్పై కాల్పులు జరిపారు. దీంతో సుఖ్దేవ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతలో నిందితులు అక్కడి నుండి పారిపోయారు. అయితే నిందితులను చండీగఢ్లోని సెక్టార్ -22లో ఉన్న హోటల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. 5. మైనర్ బాలిక దారుణ హత్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఓ మైనర్ బాలిక దారుణ హత్య దేశాన్ని కుదిపేసింది. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్గా మారింది. దానిలో నిందితుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేస్తున్నా అక్కడున్న ఎవరూ పట్టించుకోకపోవడం కనిపిస్తుంది. నిందితుడు సాహిల్ ఈ 16 ఏళ్ల మైనర్పై 20 సార్లు కత్తులతో దాడి చేశాడు. తరువాత ఆ బాలికను రాయితో మోది హత్య చేశాడు. 6. డియోరియా ఊచకోత యూపీలోని డియోరియా జిల్లా రుద్రాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా మొత్తం ఆరుగురి హత్య దేశాన్ని కుదిపేసింది. భూ వివాదాల కారణంగానే ఈ హత్య జరిగింది. ఇందులో ఒక పార్టీకి చెందిన సత్య ప్రకాష్ దూబే, ఆయన భార్య కిరణ్, కుమార్తె సలోని, నందిని, కుమారుడు గాంధీ హత్యకు గురయ్యారు. జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు ప్రేమ్ యాదవ్ కూడా హత్యకు గురయ్యారు. 7. కానిస్టేబుల్ కాల్పులు జైపూర్-ముంబై ఎక్స్ప్రెస్ రైలులో ఆర్పిఎఫ్ జవాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటన ఈ సంవత్సరం కలకలం రేపింది. జూలై 31 ఉదయం, జైపూర్-ముంబై రైలులో ఒక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన సీనియర్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన వాపి, బోరివాలి మీరా రోడ్ స్టేషన్ల మధ్య జరిగింది. 8. లక్నో కోర్టులో బుల్లెట్ల శబ్దం యూపీలోని లక్నోలోని కోర్టులో గ్యాంగ్స్టర్ సంజీవ్ జీవాను కాల్చి చంపారు. జూన్ 7న విచారణ కోసం గ్యాంగ్స్టర్ సంజీవ్ జీవాను లక్నో కోర్టుకు తీసుకువచ్చారు. ఇంతలో లాయర్ల వేషంలో వచ్చిన దుండగులు కోర్టు ఆవరణలోనే సంజీవ్ జీవాపై కాల్పులు జరిపారు. సంజీవ్ జీవా అక్కడికక్కడే మృతిచెందాడు. సంజీవ్ జీవా ముజఫర్నగర్ నివాసి. లక్నో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 9. రూ.350 కోసం దారుణ హత్య కేవలం రూ.350 కోసం 16 ఏళ్ల యువకుడు మరో టీనేజర్ను అత్యంత దారుణంగా అంతమొందించాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యింది. టీనేజర్ తల, మెడపై నిందితుడు 60 సార్లు కత్తితో పొడిచాడు. ప్రాణాలు కోల్పోయిన టీనేజర్ను చూసి ఆ యువకుడు డ్యాన్స్ చేయటం సీసీటీవీ వీడియోలో కనపడింది. ఈ దారుణ హత్యకు పాల్పడిన 16 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10. పట్టపగలు దుకాణదారుని హత్య పంజాబ్లోని భటిండాలో పట్టపగలు ఓ దుకాణదారుని కాల్చి చంపిన ఉదంతం దేశాన్ని కుదిపేసింది. ఈ హత్య ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్గా మారింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో దుకాణదారుడు హర్జిందర్ సింగ్ అలియాస్ మేలా తన దుకాణం ముందు కుర్చీలో కూర్చున్నట్లు ఈ సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తుంది. ఇంతలో బైక్పై వెళ్తున్న ఇద్దరు దుండగులు వచ్చి పిస్టల్స్తో హర్జిందర్పై కాల్పులు జరిపారు. దుండగులిద్దరూ ముఖాలకు మాస్క్లు కప్పుకున్నారు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం దుండగులిద్దరూ బైక్పై పారిపోయారు. బాధితుడు హర్జిందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇది కూడా చదవండి: 2023 సామాన్యునికి ఏమిచ్చింది? -
ఆ లిస్ట్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్ ప్లేస్లో ఎవరంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. (ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్చరణ్ దంపతులు..!) ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మన యంగ్ టైగర్ మరో ఘనత సాధించారు. 2023లో ఆసియాలో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో తారక్ 25వ స్థానలో నిలిచారు. ఈ జాబితాను ఈస్టర్న్ ఐ 2023 వెల్లడించింది. ఈ లిస్ట్లో టాలీవుడ్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఏకైక హీరో జూనియర్ కావడం విశేషం. అయితే ఈ లిస్ట్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. మరికొందరు బాలీవుడ్ తారలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రణ్బీర్ కపూర్ 6వ, దళపతి విజయ్ 8వ స్థానంలో సాధించారు. కాగా.. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర పార్ట్-1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!) -
ఉత్తమ ఆహార నగరాల జాబితాలో ఐదు భారత నగరాలకు చోటు!
పర్యాటకులు ఏ నగరం వెళ్లినా.. ముందుగా తెలుసుకునేది ఆహారం గురించే. ఎలాంటి ఆహారం దొరుకుతుందని తెలుసుకుని అప్పుడూ స్టే చేయగలమా లేదా నిర్ణయించుకుంటారు. అలా అత్యుత్తమ ఆహారం అందించే నగరాల జాబితా తెలిస్తే పర్యాటకలుకు మరితం ఈజీ అవుతుంది. అలాంటి ఉత్తమ ఆహార నగరాల జాబితా ఒకటి ఇటీవలే విడుదలైంది. దీన్నిఆ నగర సంస్కృతిక, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్థానిక ఆహారాన్ని రుచిగా అందించే... గల్లీలోని స్టాల్స్ నుంచి ఐకానిక్ రెస్టారెంట్ల వరకు ఏం ఉన్నాయి, ఆహార ప్రియులు ఇష్టపడే నగరాలు, ఆ రెస్టారెంట్లకు ఉన్న రేట్లు తదితరాలను పరిగణలోనికి తీసుకుని మరీ ఈ ఉత్తమ ఆహార నగరాల జాబితాను ఇచ్చారు. ఈ ఉత్తమ ఆహారాల జాబితాను ట్రావెల్ ఆన్లైన్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఇటీవలే విడుదల చేసింది. ఆ జాబితాలో ఐదు భారతీయ మహానగరాలు చోటు దక్కించుకోవడం విశేషం. ఆ నగరాలు ఏంటంటే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, లక్నో టాప్ 100 జాబితాలో స్థానం దక్కించుకోగా, టాప్ 50లో ముంబై 35వ స్థానం, హైదరాబాద్ 39వ స్థానం నిలాచాయి. ఇక ఢిల్లీ 56వ స్థానానికి, చెన్నై(65), లక్నో(92) స్థానాలను దక్కించుకున్నాయి. ఇక ఈ జాబితాలో తాజా పదార్థాలతో రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధిగా రోమ్(ఇటలీ) నిలిచింది. బోలోగ్నా, నేపుల్స్, రెండు ఇటాలియన్ నగరాలు రెండు, మూడు ర్యాంక్లు దక్కించుకున్నాయి. కాగా, టాప్ 10 జాబితాలో స్థానం దక్కించుకున్న ఇతర నగరాలు వియన్నా(ఆస్ట్రియా), టోక్యో(జపాన్), హాంకాంగ్(చైనా), టురిన్ (ఇటలీ), గాజియాంటెప్ (టర్కీ) , బాండుంగ్ (ఇండోనేషియా) తదితరాలు. (చదవండి: అత్యంత తక్కువ పగటి కాలం ఉండేది ఈ రోజే! ఎందుకలా జరుగుతుందంటే..?) -
నేరస్తుల చేతికి ప్రభుత్వ డేటా? మెక్సికోలో ఏం జరుగుతోంది?
నేరాలకు, హత్యలకు, దోపిడీలకు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మెక్సికో దేశం కేంద్రంగా మారింది. ఇప్పుడు ఇక్కడి నేరస్తులు ప్రభుత్వం ఉపయోగించే డేటాబేస్ను వినియోగించి మరీ నేరాల్లో మరో ముందడుగు వేశారని వైస్ న్యూస్ నివేదిక వెల్లడించింది. మెక్సికన్ నేరస్తులు తాము టార్గెట్ చేసుకున్న వారి వివరాలను, చివరికి వారి లైవ్ లొకేషన్ను తెలుసుకునేందుకు ప్రభుత్వ సంస్థలు ఉపయోగించే ఇంటెలిజెన్స్ , సెక్యూరిటీ డేటాబేస్ను యాక్సెస్ చేస్తున్నాయని నిఘా వర్గాలు తమకు తెలియజేశామని వైస్ న్యూస్ పేర్కొంది. నేరస్తులు తాము టార్గెట్ చేసుకున్న వారి వివరాలను జియోలొకేట్ ద్వారా తెలుసుకునేందుకు వారు టైటాన్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు. తద్వారా తాము టార్గెట్ చేసిన వారి ప్రైవేట్ సమాచారంతోపాటు వారికి సంబంధించిన పత్రాలను పొందుతూ అక్రమాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. 10 వేల మెక్సికన్ పెసోలు (రూ. 600) నుండి 1,80 వేల పెసోలు (రూ. 9,000) చెల్లించి నేరస్తులు వివిధ టైటాన్ సేవలను పొందుతున్నారని వైస్ న్యూస్ తెలియజేసింది. ఈ విధంగా నేరస్తులు అధికారికంగా టైటాన్ సేవల సొంత లాగిన్ పొందుతూ, ఆధునిక మార్గాల్లో తమ నేరాలను కొనసాగిస్తున్నారు. నిజానిక్ టైటాన్ సేవలను ఉపయోగించేందుకు పోలీసు బలగాలు సంబంధిత లైసెన్స్లను కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఆ లైసెన్స్ అక్రమమార్గంలో తిరిగి బ్లాక్ మార్కెట్లోనూ అందుబాటులోకి వస్తున్నదని నిఘా వర్గాలు కనుగొన్నాయి. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. మెక్సికన్ ఓటర్ ఐడీ డేటాబేస్, క్రెడిట్ బ్యూరోలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఫోన్ యాప్ల లాగ్లు, ఇమెయిల్లు, ఇలాంటి సమాచారాల ఆధారంగా టైటాన్ సాఫ్ట్వేర్ను రూపొందించారు. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు సులభంగా నేరస్తులను గుర్తించడానికి ఈ సాఫ్ట్వేర్ రూపొందించినట్లు కంపెనీ ప్రచారం చేస్తుంది. అయినప్పటికీ మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్తో సహా అనేక ప్రభుత్వాలు, రిపోర్టర్లు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష సమూహాలపై గూఢచర్యం చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పరిశోధనలో తేలింది. అయితే ఈ టైటాన్ సాఫ్ట్వేర్ అక్రమ వినియోగం వెనుక ఎవరు ఉన్నారనేది స్పష్టంగా వెల్లడికాలేదని వైస్ న్యూస్ తెలిపింది. ఈ సాఫ్ట్వేర్ ప్లాట్ఫారమ్ లాగిన్ పేజీలోని ఎబౌట్లో ఎటువంటి సమాచారం ఉండదు. అలాగే ఈ సంస్థ సర్వర్లను తరచూ మారుస్తూ ఉంటుంది. బహుశా ఎవరూ ట్రాక్ చేయకుండా ఉండేందుకే ఇటువంటి విధానం అనుసరిస్తుంటుందని తేలింది. నేరస్తులు ఎక్కడ దాక్కున్నారో తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడే ఈ టైటాన్ సాఫ్ట్వేర్ సేవలను చట్టాన్ని అమలు చేసే వారి కన్నా.. నేరస్తులే అధికంగా ఉపయోగిస్తున్నారని నిఘా వర్గాల పరిశోధనలో తేలింది. కాగా ఈ వివరాలపై మెక్సికన్ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. ఇది కూడా చదవండి: దావూద్ ఇబ్రహీంకు సీరియస్? -
కొడంగల్లో ‘బంటు’ సిద్దిపేటలో శ్రీకాంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నాలుగో జాబితాను బీజేపీ అధిష్టానం మంగళవారం విడుదల చేసింది. కసరత్తు పూర్తి చేసిన తర్వాత 12 మంది అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్సింగ్ ప్రకటన జారీ చేశారు. బీజేపీ ఇప్పటివరకు నాలుగు జాబితాల్లో కలిపి 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన పార్టీతో పొత్తు, సీట్ల అంశంపై జరుగుతున్న చర్చల్లో స్పష్టత వచ్చాక మిగిలిన అభ్యర్థులను ప్రకటించనుంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వి.సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి స్థానాన్ని, చల్లమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు, తుల ఉమకు వేములవాడ, బొమ్మ శ్రీరామ్చక్రవర్తికి హుస్నాబాద్ స్థానాన్ని కేటాయించింది. బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా.. చెన్నూరు(ఎస్సీ) – దుర్గం అశోక్, ఎల్లారెడ్డి– వి.సుభాష్రెడ్డి, వేములవాడ– తుల ఉమ, హుస్నాబాద్–బొమ్మ శ్రీరామ్చక్రవర్తి, సిద్దిపేట– దూది శ్రీకాంత్రెడ్డి, వికారాబాద్ (ఎస్సీ) – పెద్దింటి నవీన్కుమార్, కొడంగల్– బంటు రమేశ్కుమార్, గద్వాల్– బోయ శివ, మిర్యాలగూడ– సాదినేని శివ, మునుగోడు– చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్ (ఎస్సీ)– నకిరకంటి మొగులయ్య, ములుగు(ఎస్టీ)– అజ్మీరా ప్రహ్లాద్ నాయక్. -
బీజేపీ నాలుగో జాబితాపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికి మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ నాయకత్వం మిగిలిన 31 సీట్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, జాతీయ నేతలు ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ భేటీ అయ్యారు. జనసేన పొత్తు ప్రకటన దరిమిలా పార్టీలో వస్తున్న వ్యతిరేకతపై చర్చించినట్టు సమాచారం. జనసేనకు కూకట్పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు సీట్లు, వేములవాడ, హుస్నాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారులో ఏర్పడిన చిక్కుముడిని విప్పడం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా శనివారం సాయంత్రం కిషన్రెడ్డి, ముఖ్యనేతలు బండిసంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లనున్నట్టు చెబుతున్నారు. జనసేనకు కేటాయించే సీట్లతో పాటు మిగిలిన సీట్లపై అక్కడ పెద్దలతో చర్చించనున్నారని అంటున్నారు. ఏదేమైనా రెండు రోజుల్లో నాలుగో జాబితా వెలువడవచ్చునని తెలుస్తోంది. ఆరేడు సీట్లలో పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చునని చెబుతున్నారు. మరో మూడు, నాలుగు రోజుల తర్వాత వీటిని ప్రకటించవచ్చునని అంటున్నారు. నేడు మేడిగడ్డకు కిషన్రెడ్డి, ఈటల బృందం.... కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా.. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీలోనూ సమస్యలు ఏర్పడటం వంటి పరిణామాల నేపథ్యంలో శనివారం పార్టీ నేతలు జి.కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, డా.కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్రావు అక్కడకు వెళ్లనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు అంబట్పల్లికి చేరుకుంటారు. 11.15 నుంచి గంట పాటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సందర్శిస్తారు. అక్కడి పరిస్థితులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 నిముషాలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. -
ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్లో...
రామ్ చరణ్కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఆస్కార్ కమిటీ) తాజాగా వెల్లడించిన ‘మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్’ జాబితాలో రామ్చరణ్కి సభ్యత్వం దక్కింది. ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకుగాను చరణ్కి ఈ స్థానం లభించింది. కాగా ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ఆ మధ్య విడుదల చేసిన యాక్టర్స్ బ్రాంచ్లో తెలుగు నుంచి ఎన్టీఆర్కి చోటు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా రామ్చరణ్తో పాటు మరికొందరు హాలీవుడ్ నటీనటులకు ఈ కమిటీలో చోటు దక్కింది. ‘‘ఈ నటులు వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. వారి కళతో సాధారణ సినిమాతో ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. అలాంటి వారిని ‘యాక్టర్స్ బ్రాంచ్’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా ఆస్కార్ అకాడమీ ప్రతినిధులు షేర్ చేశారు. కాగా 96వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. -
నేడు కాంగ్రెస్ రెండో జాబితాకు ‘సీఈసీ ఆమోదం’!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ తుది జాబితాపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో బుధ వారం జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిద్ధం చేసిన జాబితాకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. ఇప్పటికే పొత్తులు సహా తుది జాబితాపై ఏఐసీసీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. సీఈసీ సమావేశంలో వామపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఒక స్పష్టత రానుంది. ఇప్పటివరకు కొన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరిద్దరి పేర్ల ను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల తర్వాత మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ శని, ఆది వారాల్లో ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ నివాసంతోపాటు కాంగ్రెస్ వార్ రూంలో తెలంగాణ నేతల సమావేశమైనా పోటీ ఎక్కువగా ఉన్న స్థానాలపై ఏకాభిప్రాయం రాలేదు. సీనియర్ నాయకులు పోటీకి సిద్ధమైన చోట అంతర్గత పోటీ ఉన్నందున స్క్రీనింగ్ కమిటీలో మరోసారి ఈ స్థానాల్లో పోటీకి సంబంధించి సమీక్ష జరిగింది. కమ్యూనిస్టు పార్టీలు అడుగుతున్న స్థానాల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థులు సిద్ధంగా ఉండటంతో ఏ స్థానాలు కేటాయించాలన్న అంశంపై కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమ య్యాయని సమాచారం. కాగా, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరుగ నున్న సీఈసీ సమావేశం కీలకంగా మారింది. -
తీవ్ర ఉత్కంఠ.. బీజేపీ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరపడుతున్నా బీజేపీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఖరారు చేశారని, మరికొందరి విషయంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైందని పార్టీ నేతలు చెప్తున్నా.. అధికారికంగా జాబితా విడుదల కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే పక్కాగా ఖరారైన సుమారు 35–40 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్టు తెలిసింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ శుక్రవారం అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసింది. ఈ క్రమంలో నేతలు.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు కోసం ఢిల్లీ వెళ్లిన కిషన్రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు శనివారం సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. అయితే జాబితా విడుదల కాని నేపథ్యంలో.. కచ్చితంగా ఖరారైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఎంపిక విషయాన్ని తెలియజేసిట్టు సమాచారం. సదరు అభ్యర్థులు వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, పకడ్బందీ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ తీసుకున్న బీసీ అజెండా, ఇతర అంశాలను ప్రజలకు వివరించాలని.. ఇతర పార్టీల కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైనదో స్పష్టంగా తెలియజేయాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. -
టీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
-
కొందరికే ‘గృహలక్ష్మి’!
సాక్షి, హైదరాబాద్: గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితా తయారీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాలుగు లక్షల మందితో జాబితా రూపొందించాల్సి ఉండగా, సోమవారం వరకు కేవలం 1.75 లక్షల మందికి మాత్రమే మంజూరు పత్రాలు జారీ చేయగలిగారు. దీంతో అంతే సంఖ్యతో లబ్ధిదారుల జాబితా రూపొందింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో జాబితా రూపొందించే పని నిలిచిపోయింది. ఎమ్మెల్యేల జాబితాలతో జాప్యం.. గృహలక్ష్మి పథకానికి గత బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. సొంత జాగా ఉన్న ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు అందించాల్సి ఉంటుంది. కానీ, దరఖాస్తుల ప్రక్రియను మాత్రం చాలా ఆలస్యంగా ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ప్రారంభించగా, 15 లక్షల వరకు అందాయి. వాటి నుంచి 4 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. నియోజకవర్గంలో ఏయే ఊళ్లు, ఒక్కో ఊరు నుంచి ఎంతమంది లబ్ధిదారులు.. అన్న విషయంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలకు బాధ్యతను అప్పగించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే, లబ్ధిదారుల జాబితా రూపొందించాల్సి ఉన్నా.. వివరాలు మాత్రం ఎమ్మెల్యేలు అందించాల్సి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు వేగంగా స్పందించగా, కొందరు జాప్యం చేశారు. ఫలితంగా జాబితా రూపొందించే ప్రక్రియ నత్తనడకన సాగింది. పూర్తి జాబితా కోసం ఈసీని అనుమతి అడుగుతామంటున్న అధికారులు ఈనెల ఆరో తేదీ తర్వాత ఏ క్షణాన్నయినా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో, ఐదో తేదీ రాత్రి వరకు జాబితాను సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా సచివాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలందాయి. కానీ, ఎమ్మెల్యేల నుంచి వివరాలు సకాలంలో అందకపోవటంతో.. సోమవారం నాటికి 1.75 లక్షల మందితో కూడిన లబ్ధిదారుల జాబితా సిద్ధమైనట్టు తెలిసింది. కొన్ని జిల్లాల నుంచి వివరాలు అందాల్సి ఉందని, దీంతో ఆ సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉందని అధికారులంటున్నారు. కోడ్ అమలులోకి వచ్చినందున, మిగతా లబ్ధిదారుల ఎంపిక ఇప్పట్లో ఉండదని, కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతనే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయినా, పూర్తి జాబితా సిద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఏదైనా ఇక ఎన్నికల తర్వాతనే.. ఎన్నికలు ముగిసి కోడ్ అడ్డంకి తొలగిపోయిన తర్వాతనే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ఆలోచనలకు వీలుగా ఈ పథకం భవిష్యత్తు ఆధారపడి ఉంది. కోడ్ అమలులోకి వచ్చే లోపు మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులకు మాత్రం రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయి. వారు పనులు మొదలుపెట్టుకోవచ్చు. మిగతా లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ మాత్రం ఎన్నికల తర్వాతనే జరుగుతుందని అధికారులంటున్నారు. కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటేనే ఆ ప్రక్రియ ముందుకు సాగుతుందని, లేనిపక్షంలో తదనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. -
భర్తకు కూరగాయల ఎంపిక పరీక్ష.. పాసవుతాడా?
ప్రతీ ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలనేవి సాధారణంగా వస్తూనే ఉంటాయి. దంపతుల మధ్య గొడవలనేవి లేకపోతే మాధుర్యమే ఉండదని అనేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా దంపతుల మధ్య ఇంటిలోని వస్తువులను కొనుగోలు చేసే విషయంలో గొడవలు వస్తుంటాయి. భార్యాభర్తలు మార్కెట్కు వెళ్లి, వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు వారి మధ్య వాదనలు చోటుచేసుకుంటాయి. అలాగే భార్య.. భర్తకు లిస్టు ఇచ్చి, ఏమైనా సరుకులు తీసుకురమ్మని చెప్పినప్పుడు, భర్త ఏదైనా మరచిపోతే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. తాజాగా ఇలాంటి ఒక ఉదంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక భార్య.. మార్కెట్కు వెళ్లి, తీసుకురావాల్సిన కూరగాయల లిస్టును భర్తకు ఇచ్చింది. దానిలో తీసుకురావాల్సిన కూరగాయల గురించి రాసింది. అవి ఏ రీతిలో ఉండాలో క్షుణ్ణంగా రాసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లిస్టును చూసినవారికి తల తిరిగిపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ కూరగాయల లిస్టులో ముందుగా టమాటాలు ఎలా ఉండాలో తెలిపింది. టొమాటాలు పసుపు, ఎరుపు రంగులోనే ఉండాలని, వాటికి పగుళ్లు ఉండకూడదని రాసింది. తరువాత ఉల్లిపాయల విషయానికొస్తే.. ఈ జాబితాను రూపొందించిన భార్య ఉల్లిపాయ బొమ్మ గీసి, ఎలాంటి ఉల్లిపాయలను ఎంచి తీసుకురావాలో వివరించింది. అదేవిధంగా బంగాళాదుంపల ఎంపిక వివరాలు కూడా ఉన్నాయి. అలాగే మిరపకాయలు, పాలకూర, లేడీ ఫింగర్.. ఇలా వీటి కొనుగోలుకు సంబంధించిన వివరణాత్మక సమాచారం ఆ చీటీలో ఉంది. జాబితా చివరలో ఇవి కూరగాయల వ్యాపారి దగ్గరి నుంచి తీసుకురావాలని ఆ భార్య గుర్తుచేసింది. ఈ పోస్ట్ @trolls_official అనే పేజీ ద్వారా Instagramలో షేర్ చేశారు. ఈ జాబితాను చూసిన నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక యూజర్ ఇలా రాశాడు ‘ఆ మహిళకు అవార్డు ఇవ్వాల్సిందే’ అనగా, మరో యూజర్ ఈ మహిళ ఆమె పనిచేస్తున్న కార్యాలయంలో మంచి ఎక్స్ప్లైనర్ అయివుంటుందని రాశారు. ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది? -
ముగిసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటి సమావేశం
ఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటి సమావేశం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితాను పూర్తి చేశారు. దాదాపు 60 శాతానికిపైగా ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రకటించారు. అభ్యర్థుల జాబితా ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ నిన్న, ఇవాళ సుధీర్ఘంగా 5 గంటలపాటు చర్చించింది. త్వరలోనే సీఈసీ సమావేశం తర్వాత జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. టికెట్ కేటాయింపులపై వార్రూంలో రేవంత్, ఉత్తమ్ మధ్య వాడీవేడీ వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరోసారి సమావేశం కానున్నట్లు స్క్రీనింగ్ కమిటీ స్పష్టం చేసింది. సర్వేల్లో అభ్యర్థుల ఫలితాలు, ఆయా స్థానాల్లో పార్టీ బలబలాలు, ప్రత్యర్థి అభ్యర్థులను బట్టి కాంగ్రెస్ పార్టీ తమ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల బృందానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభ్యర్థుల జాబితాపై పూర్తిగా కసరత్తు చేసినట్లు స్క్రీనింగ్ కమిటీ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: తెలంగాణ: షర్మిల పార్టీకి ఝలక్.. బీఆర్ఎస్లోకి ఏపూరి సోమన్న -
Telangana: నెలాఖరుకు కాంగ్రెస్ జాబితా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ కానుంది. ఢిల్లీ వేదికగా బుధ, గురువారాల్లో ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జర గనుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు లను ఖరారు చేయడంలో భాగంగా దరఖాస్తులను వడపోసి షార్ట్ లిస్ట్ తయారు చేయడమే ఎజెండాగా ఈ సమావేశాలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పీసీసీ నుంచి రేవంత్రెడ్డి, భట్టి విక్ర మార్క, ఉత్తమ్కుమార్రెడ్డి హాజరు కానున్నారు. ఇందులో ఉత్తమ్, రేవంత్లు పార్లమెంటు సమావే శాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలోనే ఉండగా, భట్టి మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. వీరితో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు విష్ణునాథ్, రోహిత్చౌదరి, మన్సూర్ అలీ ఖాన్ కూడా స్క్రీనింగ్ కమిటీ భేటికి హాజరవుతారు. ఇటీవలే హైదరాబాద్ వేదికగా సమావేశ మైన స్క్రీనింగ్ కమిటీ ఏమీ తేల్చకుండానే సమా వేశాన్ని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో జరిగే మలిదశ భేటీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన షార్ట్లిస్ట్ రెడీ కానుంది. అనంతరం ఈ జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపుతారని, ఈ కమిటీ భేటీ అనంతరం ఈ నెలాఖరున లేదంటే అక్టోబర్ మొదటి వారంలో తొలి జాబితాను విడుదల చేస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
30న సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులతో ఈ నెల 30వ తేదీన మొదటి జాబితా విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పొత్తులకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం సమావేశమైంది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల తరఫున చెరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు 30న సీపీఐ, సీపీఎం సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశ ముంది. వామపక్షాలతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ పార్టీ తేల్చిచెప్పడంతో ఈ రెండుపార్టీలు ఈ నిర్ణయానికి వచ్చాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రేతో సీపీఐ నేతలు ఆదివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఠాక్రే సీపీఎంతో కూడా సోమవారం సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్తో పొత్తు కుదిరితే సరే సరే, లేకుంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరఫున రెండో జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎవరితో పొత్తు లేకపోతే రెండు పార్టీలు కలిసి దాదాపు 20 నుంచి 24 మధ్య అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా, సీపీఎం రాష్ట్ర కమిటీలో బీఆర్ఎస్ తీరుపై వాడీవేడి చర్చ జరిగినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్తో పార్టీ వ్యవహరించినతీరుపై కూడా కొందరు నాయకులు విమర్శించినట్లు సమాచారం. బీఆర్ఎస్ తీరును ముందే ఎందుకు అర్థం చేసుకోలేకపోయామని నిలదీసినట్టు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాతంత్ర లౌకిక పార్టీలతో ముందుకు సాగాలని పార్టీ నిర్ణయించింది. -
‘అత్యంత క్రూరుడైన సోదరుడు!’.. బెంబెలెత్తిస్తున్న కుర్రాడి రాఖీ ఖర్చుల లిస్టు!
రక్షాబంధన్.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తమ ఆత్మీయతను వ్యక్తపరిచేరోజు. ఆ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు జీవితాంతం రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అయితే సోదరులు ఈ వాగ్దానంతో పాటు తమ సోదరీమణులకు ఏదైనా కానుక ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ విషయంలో సోదరులు మల్లగుల్లాలు పడుతుంటారు. కాగా ఒక కుర్రాడు రాఖీ రోజున తనకు అయ్యే ఖర్చుకు సంబంధించి ఒక లిస్టు తయారు చేశాడు. దానిని సోషల్ మీడయాలో షేర్ చేయగా, అది వెంటనే వైరల్గా మారింది. అతను తనకు వరుసకు సోదరీమణులయ్యేవారికి రాఖీ రోజున ఎంత మొత్తంలో డబ్బులు ఇవ్వాలో ఆ పోస్టులో రాశాడు. పిన్ని కూతురికి 11 రూపాయలు. ఎదురింటిలోని చెల్లెలికి 10 రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ స్కూల్లోని చెల్లెలికి 21 రూపాయలు. ట్యూషన్లోని చెల్లెలికి 11 రూపాయలు. డైరీ మిల్క్ చాక్లెట్. ఇంకా ఎక్కువ మంది సోదరీమణులు వస్తే వారికి 5 రూపాయల పర్క్ చాక్లెట్ నా సొంత సోదరికి ఒక రూపాయికి లభించే 2 ఎక్లెయిర్స్ టోఫీలు ఈ కుర్రాడు రాఖీకి తనకు అయ్యే మొత్తం ఖర్చును 80 రూపాయలలో అడ్జెస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. @indian.official.memes అనే పేజీలో దీనిని షేర్ చేశారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్లోనూ షేర్ చేశారు. ఈ పోస్టును చూసిన యూజర్లు దీనిని లైక్ చేస్తున్నారు. వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్ను ఇప్పటివరకూ 2000 మందికి పైగా లైక్ చేశారు. ఒక యూజర్ ఇలా రాశాడు.. ‘ఈ కుర్రాడు తన సొంత సోదరికి కేవలం ఒక రూపాయి విలువ చేసే 2 చాక్లెట్లు మాత్రమే ఇస్తున్నాడు. ఎంత క్రూరమైన సోదరుడు’ అని రాయగా మరొక యూజర్ ‘వావ్ బ్రదర్, వాట్ యాన్ ఐడియా’ అని రాశాడు. ఇంకొక యూజర్ ‘ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి’ అని రాశాడు. ఇది కూడా చదవండి: యాంకర్ సల్మా సుల్తానా హంతకుడెవరు? మూలన పడిన కేసు ఎలా బయటకు వచ్చింది? -
సీఎం కేసీఆర్ దూకుడు.. ఆగస్టులో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. అభ్యర్థులపై గులాబీ బాస్ కసరత్తు ప్రారంభించారు. ఆగస్టులో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలక నేతల చేరిక తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశముంది. మొదటి విడతలో గెలుపు గుర్రాల మొదటి జాబితా బీఆర్ఎస్ అధినేత సిద్ధం చేస్తున్నారు. ఆగస్టులో మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. సర్వే సంస్థల నివేదికలు, వివిధ నిఘా సంస్థల రిపోర్టుల ఆధారంగా, నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్, విపక్షాల బలాలు, బలహీనతలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. చదవండి: కేసీఆర్కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు విఫలమైన చోట ఇతరులకు టికెట్ కేటాయించే అంశంపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. సర్వేలు, పనితీరు ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కేసీఆర్.. మొదటి జాబితాలో అత్యధిక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. -
ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?
Best Airlines In 2023: ఆధునిక ప్రపంచంలో విమాన ప్రయాణం సర్వ సాధారణమైపోయింది. అందులో కూడా చాలా మంది ప్రయాణికులు ఉత్తమ సేవలను అందించే బెస్ట్ ఎయిర్ లైన్స్ని ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ ఏడాది టాప్ 20 అత్యుత్తమ విమానయాన సంస్థలు ఏవి? ఇందులో మొదటి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్.. చివరి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్ ఏది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో బెస్ట్ ఎయిర్ లైన్స్ జాబితాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత ఖతార్, ఆల్ నిప్పన్, ఎమిరేట్స్ వంటివి ఉన్నాయి. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డ్ 2023 ఎయిర్ లైన్స్కు ఈ ర్యాంకింగ్స్ అందిస్తుంది. ఇందులో ఖతార్ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ బెస్ట్ బిజినెస్ క్లాస్ ఎయిర్ లైన్, సీట్ అండ్ లాంజ్ కేటగిరీల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక బడ్జెస్ట్ ఎయిర్ లైన్స్ కేటగిరీలో ఎయిర్ఆసియా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాత లో కాస్ట్ లాంగ్ హాల్ కేటగిరిలో డెల్టా ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచింది. అత్యంత క్లీనెస్ట్ ఎయిర్లైన్ అవార్డు ఏఎన్ఏ (ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్)కు దక్కింది. 2022 సెప్టెంబర్ 2022 నుంచి మే 2023 వరకు 100 కు పైగా దేశాలకు చెందిన విమాన ప్రయాణికుల నుంచి మొత్తం 335 ఎయిర్ లైన్స్ సంస్థల పనితీరుపై సమాచారం సేకరించి ఈ లిస్ట్ రూపొందించారు. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) టాప్ 20 బెస్ట్ ఎయిర్ లైన్స్ సింగపూర్ ఎయిర్ లైన్స్ ఖతార్ ఎయిర్ వేస్ ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ) ఎమిరేట్స్ జపాన్ ఎయిర్ లైన్స్ టర్కిష్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఫ్రాన్స్ కాథే ఫసిఫిక్ ఎయిర్ లైన్స్ ఇవా ఎయిర్ కొరియన్ ఎయిర్ హైనన్ ఎయిర్ లైన్స్ స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఎతిహాద్ ఎయిర్ వేస్ ఐబేరియా ఫిజి ఎయిర్ వేస్ విస్తారా క్వాంటాస్ ఎయిర్ వేస్ బ్రిటిష్ ఎయిర్ వేస్ ఎయిర్ న్యూజిలాండ్ డెల్టా ఎయిర్ లైన్స్ -
శ్రావణ మాసంలోనే కారు సీట్లు ఖరారు!
ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా ప్రకటించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం బీఆర్ఎస్లో తీవ్రపోటీ నెలకొనడం, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పనిమంతులకే తిరిగి టికెట్ దక్కుతుందని ఇప్పటికే స్పష్టతనిచ్చిన నేపథ్యంలో.. ముందుగానే జాబితాను ప్రకటించడం ద్వారా పారీ్టలో సందిగ్ధతకు తెరదించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. ప్రభుత్వ రద్దు ప్రకటనతోపాటే ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేశారు. అప్పుడు ఎన్నికలకు సుమారు మూడు నెలల ముందే ఒకేసారి 105 మంది జాబితాను విడుదల చేయడం సంచలనం సృష్టించింది. అదే తరహాలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు సుమారు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మంచి ముహూర్తం చూసుకుని.. మరో రెండు రోజుల్లో ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది. అది ముగిశాక అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. అంటే జూలై మూడో వారం నుంచి నెలాఖరు మధ్యలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ తొలి జాబితాలో సుమారు 90 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉందని.. గణనీయంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల కోత పడొచ్చని ప్రచారం జరుగుతోంది. సుమారు 15శాతం మందికి మళ్లీ పోటీచేసే అవకాశం దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టికెట్ల కోసం పారీ్టలో తీవ్ర పోటీ ఉన్న సీట్లు, విపక్షాల ఎత్తుగడలు, ఇతర పారీ్టల నుంచి బలమైన నేతల చేరికకు అవకాశం ఉన్నచోట్ల ఎంపికను చివరి నిమిషం వరకు ఆపే అవకాశం ఉందని అంటున్నాయి. సంస్థాగతంగా చక్కదిద్దేందుకే ముందస్తు జాబితా! సుమారు 40కిపైగా అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రపోటీ నెలకొంది. ఆయా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకా, మరెవరికైనా సీటు దక్కుతుందా అన్న ఆసక్తి కనిపిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు ఇతర ఆశావహులు కలుపుకొని సుమారు 70 మంది బలమైన నేతలు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు బీఆర్ఎస్ ఇప్పటికే లెక్కలు వేసుకుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరూ టికెట్పై స్పష్టత కోసం ప్రయతి్నంచే క్రమంలోనే బీఆర్ఎస్ను వీడారు. తాజాగా కూచాడి శ్రీహరిరావు (నిర్మల్) కాంగ్రెస్లో చేరగా.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి (నాగర్కర్నూల్) కూడా హస్తం పారీ్టలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజా ప్రతినిధి కూడా పార్టీ మారేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో అభ్యర్థుల జాబితాను ముందస్తుగా ప్రకటించడం ద్వారా నష్ట నివారణ చర్యలు చేపట్డడం సులభం అమవుతుందని సీఎం భావిస్తున్నారు. బుజ్జగింపులు.. సాగనంపడాలు.. నియోజకవర్గాలు, గ్రామస్థాయి వరకు పార్టీల బలాబలాలు, ప్రభావం చూపే నేతలు, వారి గుణగణాలపై పూర్తిస్థాయి నివేదికలను బీఆర్ఎస్ సిద్ధ్దం చేసుకుంది. ముందస్తుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా అసంతృప్త నేతలను బుజ్జగించడం, సాధ్యంకాని పక్షంలో సాగనంపడ ం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక బీఆర్ఎస్ నుంచి ఇతర పారీ్టల్లోకి వెళ్లే అవకాశమున్న నేతల జాబితాను నిఘా సంస్థల నివేదికల ఆధారంగా కేసీఆర్ సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ‘‘ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు అన్ని పారీ్టల నుంచి పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలకు సంబంధించి కేసీఆర్కు సంపూర్ణ అవగాహన ఉంది. విపక్షాల ఎత్తుగడలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నచోట వారిని మార్చి ఇతరులకు అవకాశం ఇచ్చే అంశంలో కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారు’’ అని బీఆర్ఎస్ కీలక నేత ఒకరు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలకూ సన్నద్ధమయ్యేలా.. ఈసారి లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారమున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన వ్యూహానికి పదును పెడుతున్నారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లను కూడా కలుపుకొని కనీసం 50 లోక్సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బీఆర్ఎస్ తరఫున బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
కోరమాండల్ ఎక్స్ ప్రెస్... ఏపీ ప్రయాణికుల వివరాలు ఇవే..!
-
నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!
న్యూఢిల్లీ: ఇండియాలో పెయిడ్ ఇంటర్న్షిప్లు అంతగా పాపులర్ కాలేదు. చాలావరకు నామమాత్రపు చెల్లింపులే ఉంటాయి. చెప్పాలంటే ఒక్కోసారి ఇంటర్న్లే కంపెనీకి తిరిగి చెల్లించాల్సి అవసరం కూడా ఉంది. కానీ అదృష్టవశాత్తూ ప్రతీచోటా ఇలాంటి పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక సాంకేతిక సంస్థలు ఇంటర్న్కి ఒక సగటు భారతీయ ఉద్యోగి జీతం కంటే మంచి వేతనాన్ని అందిస్తాయి. ముఖ్యంగా దేశీయ టెక్ దిగ్గజాల సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లకు లభించే వేతనం కంటే ఎక్కువ చెల్లించే కంపెనీలున్నాయి. కంపెనీలను సమీక్షించే ప్లాట్ఫారమ్ గ్లాస్డోర్ అత్యధిక చెల్లింపు ఇంటర్న్షిప్స్ ఇచ్చే టాప్ 25 సంస్థల జాబితాను సిద్ధం చేసింది. విద్యార్థులు, కొత్త గ్రాడ్యుయేట్లకు, ఇంటర్న్లకు టాప్ డాలర్ను చెల్లించే కంపెనీలను గుర్తించడంలో సహాయపడటానికి అత్యధికంగా చెల్లించే 25 కంపెనీలకు గ్లాస్డోర్ ఈ ర్యాంకులు ఇచ్చింది. ముఖ్యంగా గ్లోబల్గా అనేక టెక్, ఇతర కంపెనీల్లో లేఆఫ్లు ఆందోళన రేపుతున్న తరుణంలో ఇంటర్న్షిప్ ద్వారా అడుగుపెట్టాలని ఆశించే వారికిఇది ఊరటనిస్తుందని కంపెనీ తెలిపింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) గ్లాస్డోర్ నివేదిక ప్రకారం, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ స్ట్రైప్ ఈ జాబితాలో టాప్లో నిలిచింది. ఇంటర్న్కు నెలవారీ రూ. 7.40 లక్షల (9,064 డాలర్లు ) స్టైఫండ్ను ఆఫర్ చేసింది. అంటే ఒక ఇంటర్న్ ఏడాదికి రూ. 81 లక్షల కంటే ఎక్కువ సంపాదించగలడు. మెటా, స్నాప్, టిక్టాక్ వంటి సామాజిక దిగ్గజాల నుండి స్ట్రైప్, కాయిన్బేస్ వంటి ఫిన్టెక్ కంపెనీల వరకు, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాల దాకా ఈ జాబితాలో 16 టెక్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇంకా సిటీ, క్యాపిటల్ వన్ వంటి ఐదు ఫైనాన్స్ కంపెనీలు, బెయిన్ అండ్ కంపెనీ, మెకిన్సే సహా మూడు కన్సల్టింగ్ సంస్థలు, ఏకైక సంస్థ ఆటో కంపెనీ రివియన్ ఉండటం విశేషం. (వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్!) -
టైమ్ 100 అగ్రస్థానంలో బాలీవుడ్ బాద్షా
న్యూఢిల్లీ: ‘పఠాన్’సినిమాతో మాంచి ఊపుమీదున్న బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(57)కు ఓ అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజీన్ 2023 సంవత్సరానికి నిర్వహించిన ప్రభావశీల వ్యక్తుల జాబితా 100లో అత్యధిక ఓట్లతో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ, ప్రిన్స్ హ్యారీ–మేఘన్ దంపతులు, ఆస్కార్ విజేత మిచెల్ యియోహ్, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్లకు మించి ఆయనకు ఓట్లు పడ్డాయని టైమ్ మ్యాగజీన్ తెలిపింది. ఈ ఏడాది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో అర్హులుగా ఎవరుండాలని అను కుంటున్నారన్న ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్పందించారని పేర్కొంది. మొత్తం 12 లక్షల ఓట్లలో ‘పఠాన్’స్టార్కు 4%పైగా ఓట్లు పోలయ్యాయని వెల్లడించింది. ఈ నెల 13న తమ ఎడిటర్స్ టాప్100 జాబితాపై అభిప్రాయాలను వెల్లడించాక అంతిమ ఫలితాన్ని ప్రకటిస్తామని తెలిపింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత లీడ్ రోల్లో షారుఖ్ నటించిన పఠాన్ సినిమా జనవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్ద హిట్టయ్యింది. ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. టాప్ 100 రెండో స్థానంలో కఠిన ఇస్లామిక్ పాలన నుంచి స్వే చ్ఛ కావాలని ఉద్యమిస్తున్న ఇరాన్ మహిళలకు 3 శాతం ఓట్లు పోలయ్యాయి. టైమ్ 2022 జాబితాలోనూ హీరోస్ ఆఫ్ ది ఇయర్ను ఇరాన్ మహిళలే గెలుచుకోవడం గమనార్హం. ఆ తర్వాత బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు 1.9% ఓట్లతో వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. గత ఏడాది ఖతార్లో జరిగిన ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్లో ఫ్రాన్స్పై అర్జెంటీనాకు చారిత్రక విజయం సాధించి పెట్టిన లియోనల్ మెస్సీ 1.8% ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ప్రముఖుల్లో ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ నటి విజేత యియోహ్, టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్, జుకర్బర్గ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా ఉన్నారని టైమ్ మేగజీన్ తెలిపింది. -
కరోనా తరహా కొత్త మహమ్మారుల జాబితా తయారీ!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో కరోనా తరహా మహమ్మారులకు కారణం కాగల వైరస్లను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రంగంలోకి దిగింది. మనకింకా ఆనుపానులు తెలియని డిసీజ్ ఎక్స్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. ప్రస్తుత జాబితాలో దానితో పాటు కొవిడ్–19, ఎబోలా, మార్బర్గ్, లాసా ఫీవర్, మిడిలీస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్ఎస్), నిఫా, సార్స్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, జికా వైరస్ తదితరాలున్నాయి. పరిశోధనలో తెరపైకి వచ్చే కొత్త వైరస్లతో జాబితాను సవరించనున్నారు. ‘‘ఇందుకోసం పలు బ్యాక్టీరియా కారకాలపై నిశితంగా దృష్టి పెట్టాం. వీటిలో డిసీజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ అంటువ్యాధిగా మారే ఆస్కారముంది’’ అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. 300 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తలమునకలుగా ఉన్నారు. 25కు పైగా వైరస్, బ్యాక్టీరియా కుటుంబాలపై పరిశోధనలు చేయనున్నారు. ఇలాంటి జాబితాను తొలిసారిగా 2017లో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది. దాన్ని 2018లో సవరించారు. భావి మహమ్మారిని ముందుగానే గుర్తించి దీటుగా ఎదుర్కొనేందుకు రాబోయే జాబితా కరదీపిక కాగలదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ఈ జాబితాను 2023 మార్చిలోగా విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: China Sheep Walking Video: చైనాలో గొర్రెల వింత ప్రవర్తన.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ! -
టాప్ 10 పాస్వర్డ్స్: మీరు ఇలాంటి పాస్వర్డ్లు వాడటం లేదు కదా?
ఈ నంబర్లేంటి అని సందేహిస్తున్నారా? ఇవి 2022లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించిన పాస్వర్డ్స్. ఆ టాప్టెన్ జాబితాను నార్డ్పాస్ సంస్థ ప్రచురించింది. ఈజీగా గుర్తుండటం కోసం బలహీనమైన పాస్వర్డ్స్ వాడుతున్నారని నిర్వాహక సంస్థ తెలిపింది. ఇందులో తొలిస్థానంలో ఉన్న Passwordను పాస్వర్డ్గా 34లక్షల సార్లు ఉపయోగించారు. ఈ జాబితాలో ఉన్న బిగ్బాస్కెట్ అనే పాస్వర్డ్ను కేవలం 5 నిమిషాల్లోనే క్రాక్ చేశారు. దీన్ని జనం 75 వేల సార్లు ఉపయోగించడం విశేషం. అందుకే కఠినమైన పాస్వర్డ్ను వాడాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ మీరు ఇలాంటి ఈజీ పాస్వర్డ్లు వాడటం లేదు కదా? ♦Password ♦123456 ♦12345678 ♦bigbasket ♦123456789 ♦pass@123 ♦1234567890 ♦anmol123 ♦abcd1234 ♦googledummy -
నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్కు బిగ్ రిలీఫ్.. 'గ్రే లిస్ట్' నుంచి తొలగింపు
పారిస్: పాకిస్తాన్కు భారీ ఊరట లభించింది. ఉగ్రవాదుల ఆర్థిక విషయాలపై నిఘా వహించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్).. ఆ దేశాన్ని నాలుగేళ్ల తర్వాత 'గ్రే లిస్ట్' నుంచి తొలగించింది. ఉగ్రవాదుల కార్యకలాపాల విషయంలో పాక్ పురోగతి సాధించిందని, తీవ్రవాద సంస్థలకు నిధుల చేరవేతలో దిగొచ్చిందని ఈమేరకు నిర్ణయం తీసుకుంది. పారిస్లో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే అనూహ్యంగా మరో ఆసియా దేశం మయన్మార్ను బ్లాక్ లిస్టులో చేర్చింది ఎఫ్ఏటీఎఫ్. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, మొజాంబిక్ దేశాలను కొత్తగా గ్రే లిస్టులో చేర్చింది. పాకిస్తాన్, నికరాగ్వా దేశాలను ఈ జాబితా నుంచి తొలగించింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లించడమే గాక, తీవ్రవాదుల పట్ల సానుభూతిగా ఉండే పాకిస్థాన్ను వరుసగా నాలుగేళ్ల పాటు గ్రే లిస్టలో ఉంచింది ఎఫ్ఏటీఎఫ్. తాము తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని, అనేక మంది టెర్రరిస్టులను అరెస్టు చేస్తున్నామని పాకిస్తాన్ కొద్ది సంవత్సరాలుగా చెబుతున్నా ఎఫ్ఐటీఎఫ్ దాన్ని సమర్థించలేదు. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు తగ్గినందున ఆ దేశానికి ఊరటనిచ్చింది. చదవండి: ఉక్రెయిన్తో యుద్ధంలో 66,000 మంది రష్యా సైనికులు మృతి! -
‘టైమ్100’లో ఆకాశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన టైమ్100 నెక్ట్స్ జాబితాలో దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు, జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ (30) చోటు దక్కించుకున్నారు. బిజినెస్, వినోదం, క్రీడలు, రాజకీయాలు, ఆరోగ్యం, సైన్స్ తదితర రంగాల రూపురేఖలను మార్చగలిగే సామర్థ్యాలున్న 100 మంది వర్ధమాన నాయకులతో టైమ్ మ్యాగజైన్ దీన్ని రూపొందించింది. ఇందులో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక వ్యక్తి ఆకాశ్ అంబానీయే. ఆయన కాకుండా భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త ఆమ్రపాలి గాన్ కూడా జాబితాలో ఉన్నారు. జూనియర్ అంబానీ 22 ఏళ్లకే కంపెనీ బోర్డు సభ్యుడిగా చేరారు. 42.6 కోట్ల మంది పైగా యూజర్లున్న జియోకి చైర్మన్గా ఇటీవల జూన్లోనే నియమితులయ్యారు. పారిశ్రామిక నేపథ్యం గల కుటుంబ వారసుడైన అంబానీ .. వ్యాపార పగ్గాలు చేపడతారన్న అంచనాలు సహజంగానే ఉన్నాయని, ఆయన కూడా కష్టించి పనిచేస్తున్నారని టైమ్ పేర్కొంది. ‘గూగుల్, ఫేస్బుక్ నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించడంలో ఆకాశ్ కీలకపాత్ర పోషించారు‘ అని వివరించింది. మరోవైపు, అడల్ట్ కంటెంట్ క్రియేటర్ల సైట్ అయిన ’ఓన్లీఫ్యాన్స్’కి ఆమ్రపాలి గాన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2020 సెప్టెంబర్లో చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్గా చేరిన ఆమ్రపాలి ఆ తర్వాత పదోన్నతి పొందారు. అమెరికన్ సింగర్ ఎస్జెడ్ఏ, నటి సిడ్నీ స్వీనీ, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు యా మోరాంట్, టెన్నిస్ ప్లేయర్ కార్లోక్ అల్కెరాజ్ తదితరులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. -
పండక్కి కొత్త బండి కష్టమే!
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే కష్టమే. నచ్చిన బండి కోసం మరి కొద్ది నెలల పాటు నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాయాల్సిందే. గ్రేటర్లో కొత్త వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది. కానీ అందుకు తగినవిధంగా వాహనాల లభ్యత లేకపోవడంతో వేలాది మంది కొనుగోలుదార్లు ఇప్పటికే తమకు కావలసిన కార్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దసరా సందర్భంగా ఇప్పటికిప్పుడు కొత్త కారు కొనుగోలు చేయడం కష్టమేనని ఆటోమొబైల్ షోరూమ్ డీలర్లు చెబుతున్నారు. సాధారణంగా దసరా, దీపావళి వంటి పర్వదినాల్లో మధ్యతరగతి వేతన జీవులు కొత్త వాహనాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగానూ, ఒక సంప్రదాయంగాను భావిస్తారు. ఈసారి కూడా అలాగే కొత్త వాహనాల కోసం ఆసక్తి చూపే వాళ్లకు నిరాశే ఎదురుకానుంది. ఇప్పటికిప్పుడు బుక్ చేసుకున్నా కనీసం ఐదారు నెలల పాటు ఆగాల్సిందేనని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లుగా వ్యక్తిగత వాహనాలకు గణనీయమైన డిమాండ్ నెలకొన్నది. కోవిడ్ దృష్ట్యా చిరుద్యోగులు మొదలుకొని మధ్యతరగతి వర్గాల వరకు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు, కార్లకు భారీగా డిమాండ్ పెరిగింది. అందుకు తగిన విధంగా వాహనాలు మాత్రం దిగుమతి కావడం లేదు. దీంతో కొరత ఏర్పడింది. ఆగాల్సిందే... గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్లలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. రవాణాశాఖలో ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. కొత్త వాహనాలకు డిమాండ్కు పెరగడంతో నమోదయ్యే వాహనాల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వ్యక్తిగత వాహనాల కేటగిరీలో అన్ని రకాల వాహనాలకు వెయిటింగ్ తప్పడం లేదు. హ్యూందాయ్, కియా, టయోటా, నెక్సాన్, మారుతి తదితర కంపెనీలకు చెందిన కార్ల కోసం 4 నుంచి 5 నెలల పాటు వెయిటింగ్ ఉంది. బాగా డిమాండ్ ఉన్న కొన్ని ప్రీమియం వాహనాలకు 6 నెలల వరకు కూడా డిమాండ్ నెలకొంది. ద్విచక్ర వాహనాలలో యూనికార్న్, హోండా యాక్టివా 125కి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాహనాలకు 3 నెలల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చునని ఆటోమొబైల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీపావళికి కూడా డిమాండ్ భారీగానే ఉండే అవకాశం ఉంది. చిప్స్ కొరతే కారణం... వాహనాల తయారీలో కీలకమైన సాఫ్ట్వేర్ చిప్స్ దిగుమతి తగ్గడం వల్లనే ఈ కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు. మలేసియా, తైవాన్, చైనాల నుంచి మన దేశానికి వాహనాల చిప్స్ దిగుమతి అవుతాయి. రెండేళ్లుగా కోవిడ్ వల్ల చైనా నుంచి చిప్స్ దిగుమతి తగ్గిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల డిమాండ్ పెరగడంతో మలేసియా, తైవాన్ల నుంచి సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుంది. దీంతో వాహనాల తయారీ కూడా మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ‘గత నెలతో పోలి్చతే ఈ నెలలో చిప్స్ కొరత కొంత వరకు తగ్గింది. దిగుమతి పెరిగింది. గతంలో 80 శాతం వరకు కొరత ఉండేది. ఇప్పుడు 40 శాతానికి తగ్గింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కావచ్చు’. అని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ తెలిపారు. (చదవండి: తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి) -
తెలుగు ప్రొఫెసర్కు అరుదైన ఘనత
వెవీయూ: వైఎస్సార్ జిల్లా కడప నగరం ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్రెడ్డి ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో చేరారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో ఉత్తమ పరిశోధనలను పరిశీలించి ర్యాంకింగ్ కేటాయించే ఏడీ (అల్ఫర్–డోగర్) సైంటిఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో ప్రపంచ పరిశోధకుల జాబితాలో ఆచార్య బుసిరెడ్డికి చోటు దక్కింది. తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో ఆయన అంతర్జాతీయ స్థాయిలో 19,034వ ర్యాంకు, ఆసియా స్థాయిలో 4,302వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 972వ ర్యాంకు, కళాశాల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఎస్సీఐ పరిశోధనా పత్రాలు, స్కోపస్ హెచ్–ఇండెక్స్, ఐ–10 ఇండెక్స్, సైటేషన్స్, ఓఆర్సీఐడీ, వెబ్ ఆఫ్ సైన్స్, విద్యాస్, గూగుల్ స్కారల్ డేటాబేస్ ఆధారంగా ఈ ర్యాంకులను సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్, అధ్యాపక బృందం ఆయనకు అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్రెడ్డికి ఇప్పటికే పలు పురస్కారాలు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాయి. గతంలో సౌత్కొరియా, స్వీడన్, ఫిన్ల్యాండ్, హాంకాంగ్, సౌత్ ఆఫ్రికా తదితర దేశాల్లో విజిటింగ్ సైంటిస్ట్గా సేవలందించారు. 70కి పైగా జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో పరిశోధక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. (క్లిక్: పాఠాలకు పక్కా క్యాలెండర్) -
ఉన్నతి హుడాకు చోటు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లలో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ‘బాయ్’ ప్రకటించింది. ఏప్రిల్ 15నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో షట్లర్ల ప్రదర్శనను బట్టి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ట్రయల్స్కు ముందే నేరుగా అర్హత సాధించిన ప్లేయర్లతో పాటు ట్రయల్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన ఆటగాళ్లతో కూడిన జాబితాను సెలక్టర్లు వెల్లడించారు. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు థామస్, ఉబెర్ కప్లలో వీరు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్లో టీనేజ్ సంచలనం ఉన్నతి హుడాకు తొలి సారి చోటు లభించింది. హరియాణాలోని రోహ్టక్కు చెందిన 14 ఏళ్ల ఉన్నతి సెలక్షన్ ట్రయల్స్లో మూడో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల జట్టులో స్థానం దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఉన్నతి నిలిచింది. ట్రయల్స్ ద్వారా పారదర్శకంగా ఆటగాళ్ల ఎంపిక జరిగిందని, ప్రతిభ గలవారే అవకాశం దక్కించుకున్నారని ‘బాయ్’ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. మూడు మెగా ఈవెంట్ల కోసం కాకుండా ఓవరాల్గా 40 మందిని సీనియర్ కోచింగ్ క్యాంప్ కోసం కూడా ఎంపిక చేశారు. ఎంపికైన ఆటగాళ్ల జాబితా: కామన్వెల్త్ క్రీడలు: పురుషుల విభాగం – లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, అశ్విని పొన్నప్ప ఆసియా క్రీడలు, థామస్–ఉబెర్ కప్ పురుషుల విభాగం – లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, విష్ణువర్ధన్ గౌడ్, జి.కృష్ణప్రసాద్ మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, అస్మిత చాలిహా, ఉన్నతి హుడా, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ఎన్.సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, శ్రుతి మిశ్రా -
‘సీఎం జగన్కు రుణపడి ఉంటాం’
సాక్షి,అమరావతి: తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తానని, జిల్లా అభివృద్ధితో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శ్రమిస్తానని తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవిని అందించిన సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు గెలిపించి తనని మంత్రిని చేశారని, వారందరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే డా.సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. తనను కేబినెట్లో కొనసాగిస్తూ అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మంత్రిగా తన పనితీరును గుర్తించి ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. తనతో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావుకు కేబినెట్లో స్థానం కల్పించారు. తమ ప్రాంత ప్రజలపై సీఎంకు ఉన్న ప్రత్యేకమైన అభిమానం, ప్రేమకు ఇదే నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. మంత్రి పదవి రావడం చాలా ఆనందంగా ఉందని, వైఎస్సార్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ప్రొఫెసర్గా చేస్తున్న తనకి ఆనాడు దివంగత సీఎం వైఎస్సార్ అవకాశమివ్వగా, ఈ రోజు ఆయన తనయుడు తనని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా అవకాశమిచ్చారన్నారు. ఎమ్మెల్యే అంజాద్ బాషా మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి దయ వల్లే మళ్ళీ మంత్రి పదవి వస్తోంది.. ఆయనకు తాను ఎప్పుడూ విధేయుడినేనని తెలిపారు. నాటి ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయింపు నుంచి మంత్రి పదవులు కేటాయింపు వరకు సీఎం జగన్కు ఋణపడి ఉంటానన్నారు. కాగా రెండవసారి మంత్రి పదవి అంజాద్ బాషాకు వరించడంతో ఆయన ఇంటి వద్ద సంబరాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.. కేబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానని అన్నారు. గతంలో బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు గానే చూశారని, సీఎం జగన్ బీసీలను బ్యాక్ బోన్ క్లాస్గా గుర్తించారని కొనియాడారు. -
మరింత చిక్కుల్లో పాక్.. మరోసారి ఆ జాబితాలోకి
పారిస్: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) మరోసారి పాకిస్తాన్ను గ్రే లిస్ట్లో పెట్టింది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సహా అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహాయాన్ని, పెట్టుబడులను పొందడానికి పాకిస్తాన్కు అవకాశాలు ఉండవు. ఈ జాబితా నుంచి బయటపడటం కోసం ఆ దేశం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధులపై ఎఫ్ఏటీఎఫ్ నిఘా పెడుతుంది. ఈ సంస్థ ప్రకటించే గ్రే లిస్ట్లో పాకిస్థాన్ మూడేళ్ళ నుంచి ఉంది. ఎఫ్ఏటీఎఫ్ చర్యల ప్రణాళికను అమలు చేయడం, అదే సమయంలో, ఉగ్రవాదులకు రక్షణ కల్పించడం పాకిస్తాన్కు ఇబ్బందికరంగా మారింది. ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు పారిస్లో జూన్ 21 నుంచి 25 వరకు జరిగాయి. చదవండి: ‘గ్రీన్’కి అందని పాజిటివ్ సిగ్నల్స్ -
అత్యంత కలుషిత నగరాల్లో 22 భారత్లోనే!
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల జాబితా విడుదలైంది. దీనిప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 30 నగరాలు అత్యంత కలుషితమైనవిగా గుర్తించారు. దీనిలో 22 నగరాలు భారత్లోనే ఉండటం గమనార్హం. కాగా, స్విస్ అనే సంస్థ వరల్డ్ ఎయిర్ క్వాలీటీ ఇండెక్స్ రిపోర్ట్ - 2020ను విడుదలచేసింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా చైనాలోని జిన్జియాంగ్ తొలి స్థానంలో నిలిచింది. కాగా, దీని తర్వాత మిగతా 9 నగరాలు మనదేశానికి చెందినవే. ఇక..రెండో స్థానంలో ఘజియాబాద్, మూడో స్థానంలో బులంద్షహర్ ఉంది. ఈ ర్యాంకింగ్స్లో ఢిల్లీ పదవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కలుషిత రాజధాని నగరాలలో ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. వీటి తర్వాత బిస్రఖ్ జలాల్పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, కాన్పూర్, లక్నో, మీరట్, ఆగ్రా మరియు ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్, రాజస్థాన్లోని భీవారీ, జింద్ , హిసార్, ఫతేహాబాద్, బాంధ్వరి, గురుగ్రామ్, యమునా నగర్, హర్యానాలోని రోహ్తక్ మరియు ధారుహేరా, మరియు బీహార్లోని ముజఫర్పూర్ లు నిలిచాయి. అయితే కరోనా నేపథ్యంలో ఢిల్లీలో 2019 నుంచి 2020ల మధ్య వాయునాణ్యత 15 శాతంమెరుగుపడింది. ఈ రిపోర్ట్ 106 దేశాల నుంచి వచ్చిన పీయమ్ 2.5 డేటా ఆధారంగా తీసుకున్నారు. వీటిని ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహిస్తాయి. భారత్లో ప్రధానంగా వంటచెరకు, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, వ్యర్థాల దహనం, వాహనాల నుంచి వచ్చేపోగ కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. అయితే..దీనిపై గ్రీన్ ఇండియా క్యాంపెయినర్ అవినాష చంచల్ మాట్లాడుతూ..లాక్డౌన్ కాలంలో వాయునాణ్యత స్వల్పంగా పెరిగిందని అన్నారు. కాగా, ప్రభుత్వాలు ఎలక్టిక్ వాహనాలను , సైక్లింగ్, వాకింగ్, ప్రజారవాణాను ప్రొత్సహించాలని అన్నారు. అయితే, పరిశుభ్రమైన గాలిని పీల్చడంతో, ఆరోగ్యసమస్యలు దూరమవుతాయని చంచల్ అన్నారు. ప్రజలు పర్యావరణాన్ని, కాపాడుకొంటు, కాలుష్యాన్ని తగ్గించుకొవాల్సిన అవసరం ఉందని ఐక్యూ ఎయిర్సీఈవో ఫ్రాంక్ హమ్స్ తెలిపారు. చదవండి: దారుణం: రోడ్డుపైనే.. చచ్చిపోయేంత వరకు.. -
అత్యంత చెత్త పాస్వర్డ్ల జాబితా ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్న తరుణంలో యూజర్నేమ్స్, పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవడం అనేది నిజంగా పెద్ద టాస్కే. బ్యాంకు ఖాతాలు, పేమెంట్ బ్యాంకులు, ఈ-మెయిల్, స్మార్ట్ఫోన్ స్క్రీన్ లాక్ పాస్వర్డ్ ఇలా ఒకటా రెండా.. ఎన్ని గుర్తు పెట్టుకోవాలి. వీటికి తోడు సోషల్ మీడియా అకౌంట్లు ఉండనే ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన యూజర్నేమ్స్, పాస్వర్డ్లను గుర్తుపెట్టుకోవడమంటే కత్తిమీద సామే. అందుకే సులభంగా ఉండేలా 12345 లాంటివి, లేదంటే పుట్టిన రోజు తేదీలను పాస్వర్డ్లుగా తమ అకౌంట్లకు పెట్టుకుంటుంటారు. అయితే ఇక్కడే హ్యాకర్లకు దొరికిపోతామని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం, ప్రజలు ఇప్పటికీ "123456789," ఐలవ్ యూ" లాంటి హ్యాక్-టు-హ్యాక్ పాస్వర్డ్లనే వాడుతున్నారట. నార్డ్పాస్ సంస్థ 2020 సంవత్సరానికిగాను అత్యంత చెత్త పాస్వర్డ్ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం "123456" టాప్లోఉంది. ఈ ఏడాది 2,543,285 మంది ఇదే పాస్వర్డ్ వాడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆ సంస్థ విడుదల చేస్తున్న అత్యంత చెత్త పాస్వర్డ్ల జాబితాలో ఇదే మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. 2015లో 123456 పాస్ వర్డ్ సదరు జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. తరువాత పాస్వర్డ్ అనే పదం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మధ్యకాలంలో 123456 అనే పాస్వర్డ్ చెత్త పాస్వర్డ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది. ఇంకా పొకేమాన్, చాకొలెట్ లాంటి పాస్వర్డ్లు కూడా ఇంకా వాడుతున్నారు. అయితే ఏడాది ఈ జాబితాలో పిక్చర్1, సెన్హా (పోర్చుగీసులో పాస్వర్డ్ అని అర్థం) అనే రెండు కొత్త పదాలు కొత్తగా చేరాయని తెలిపింది. 10 మోస్ట్ కామన్ పాస్వర్డ్లు 1. 123456 2. 123456789 3. పిక్చర్ 1 4. పాస్వర్డ్ 5. 12345678 6. 111111 7. 123123 8. 12345 9. 1234567890 10. సెన్హా మీ పాస్వర్డ్ జాబితాలో ఉంటే, తక్షణమే మార్పు చేయాలని సూచిస్తోంది. ప్రతి 90 రోజులకు క్యాప్స్, స్మాల్ లెటర్స్ మిశ్రమంతో పాస్వర్డ్లను మార్చుకోవాలని, అలాగే ప్రతి ఖాతాకు వేరే వేరే పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోవాలని నార్డ్పాస్ సూచిస్తుంది. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, పెళ్లి డేటు, లేదా పేరు వంటి వ్యక్తిగత వివరాల ఆధారంగా పాస్వర్డ్ ఉపయోగించకూడదని హెచ్చరించింది. హ్యాకర్లు మన ఖాతాలపై ఎటాక్ చేయకుండా ఉండేలా కఠినమైన పాస్వర్డ్లను తమ అకౌంట్లకు సెట్ చేసుకోవాలని, లేదంటే వ్యక్తిగత డేటాతోపాటు, నగదును కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. -
మార్కులు రాకపోయినా ఉద్యోగం!
అనంతపురం విద్య: ఐఈడీఎస్ఎస్ (ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది డిసేబుల్డ్ ఆఫ్ సెకండరీ స్టేజ్)– ప్రత్యేక డీఎస్సీ–2019ని తొలిసారిగా విడుదల చేశారు. రాత పరీక్ష నిర్వహించి 2019 నవంబర్లో ఫలితాలు విడుదల చేశారు. 100 మార్కుల రాత పరీక్షలో ఓపెన్ కేటగిరీ వారికి 60 మార్కులు, బీసీ కేటగిరీ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 40 మార్కులు కట్ ఆఫ్గా నిర్ణయించారు. మొత్తం 55 పోస్టులకు 2019 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. 2019 జూన్ 30న రాత పరీక్ష నిర్వహించి 45 పోస్టులను భర్తీ చేశారు. అర్హత మార్కులు రాకపోయినా ఉద్యోగాలు ఓసీ కేటగిరీకి మొత్తం 26 పోస్టులు ఉన్నాయి. అర్హతగా నిర్ణయించిన 60 మార్కులు వచ్చిన వారు కేవలం 6గురే ఉన్నారు. తక్కిన 20 పోస్టులు ఓపెన్ కేటగిరి పోస్టుల్లో అర్హులు లేకపోతే వచ్చే డీఎస్సీలో భర్తీ చేయాలి. కానీ అధికారులు మాత్రం అర్హత మార్కులు తక్కువగా వచ్చినప్పటికీ మొత్తం 26 పోస్టులను భర్తీ చేశారు. ఇతర కేటగిరీ వారికి ఓపెన్ కేటగిరీ వారీగా పరిగణించి నియామకాలు చేసేశారు. అంతా ఇష్టానుసారం ♦నవంబర్, 2019లో తొలుత ప్రకటించిన ఫలితాల్లో ‘టెట్’లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇస్తామని పేర్కొన్నారు. వెయిటేజీతో కలిపి డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు. ♦తాజాగా ‘టెట్’ మార్కులు తొలగించి డీఎస్సీ మార్కులను ప్రామాణికంగా తీసుకున్నారు. ♦సమగ్రశిక్ష సహిత విభాగం కింద పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు స్పెషల్ డీఎస్సీలో 5 మార్కులు వెయిటేజీ ప్రకటించారు. అయితే డీఎస్సీలో అర్హత మార్కులు వచ్చినప్పుడే వెయిటేజీ మార్కులు కలపాలి. ♦డీఎస్సీలో అర్హత మార్కులు రాకున్నప్పటికీ వెయిటేజీ మార్కులు కలిపి 5గురు అభ్యర్థులకు పోస్టింగ్ కల్పించారు. దీంతో రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులు ఐదుగురికి ఉద్యోగాలు దక్కని పరిస్థితి నెలకొంది. ♦ఏ కేటగిరీలో మిగిలిపోయిన పోస్టులను ఆ కేటగిరీ వారితోనే భర్తీ చేయాలి. సదరు కేటగిరీలో అర్హులు లేకపోతే.. వచ్చే డీఎస్సీలో అదే కేటగిరీలో బ్యాక్లాగ్ పోస్టుల కింద భర్తీ చేయాలి. ♦ నిర్దేశించిన అర్హత మార్కులను నోటిఫికేషన్లో పేర్కొనకుండా రాత పరీక్ష నిర్వహించి ఉంటే డీఎస్సీలో ఒక మార్కు వచ్చినా.. 5 మార్కుల వెయిటేజీ కల్పించవచ్చు. కానీ డీఎస్సీ నోటిఫికేషన్లో కేటగిరి వారీగా అర్హత మార్కులు పేర్కొన్నారు. ♦అయినా నియామకాల్లో ఇష్టానురీతిగా నిబంధనలు విస్మరించి వెయిటేజీ కల్పించి అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నోటిఫికేషన్లో నిబంధనలకు నీళ్లొదిలారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కు పాతర వేశారు. రోస్టర్ పాయింట్లు పక్కన పెట్టేశారు. ఒక కేటగిరి వారిని మరో కేటగిరీలో కలిపారు. మెరిట్ టు మెరిట్ను పూర్తిగా విస్మరించి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. వెరసి స్పెషల్ డీఎస్సీ నియామకాలన్నీ గందరగోళంగా సాగాయి. ఉన్నతాధికారుల అడ్డగోలు నిర్ణయాలతో 25 మంది ఉద్యోగాలకు దూరమయ్యారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తా రోస్టర్ పాయింట్ల నిర్ధారణ, అభ్యర్థుల ఎంపిక మా పరిధిలో లేని అంశం. తప్పిదాలు జరిగి ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. అర్హులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం. – కె.శామ్యూల్, డీఈఓ, అనంతపురం -
కేసుల కొరడా!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసుల కొరడా ఝుళిపిస్తున్నారు. గత ఆదివారం జనతా కర్ఫ్యూ తర్వాత ఎపిడమిక్ డిసీసెస్ యాక్ట్ 1897ను ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసు పెడతామని హెచ్చరించింది. ప్రాణాలు తీసే మహమ్మారి పొంచి ఉందన్న ప్రచారాన్ని కొంతమంది పట్టించుకోవడం లేదు. నిత్యావసరాలు, అత్యవసరాల పేరిట అకారణంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో పోలీసులు కేసుల కొరడా బయటికి తీశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కేసులు నమోదు చేస్తున్నారు. సీసీ కెమెరాల సాయంతోనూ పలు కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. కేసుల వివరాలు ఇవీ.. సోమవారం నుంచి మంగళవారం వరకు తొమ్మిది రోజుల్లో అకారణంగా బయటికి వచ్చిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా వ్యాధి ఉన్న విషయాన్ని బయటికి వెల్లడించకుండా, విదేశాల నుంచి వచ్చి హోంక్వారంటైన్లో ఉండని వారు కూడా ఉన్నారు. ఇటీవల క్వారంటైన్ నిబంధనలు పాటించకుండా పలు వేడుకలు, విందులకు హాజరై కొత్తగూడెంకు చెందిన పోలీసు ఉన్నతాధికారి, అతని కుమారుడు కూడా ఉండటం గమనార్హం. ఈ కేసుల్లో ఎక్కువగా ఐపీసీ సెక్షన్ 188, 269, 270 లే ఉండటం గమనార్హం. అకారణంగా బయటికి వస్తూ..లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పలు వాహనాలను ఆటోమేటిక్ నంబర్ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ ముందంజలో ఉంది. గత సోమవారం నుంచి ఈ వివరాలను పరిశీలించగా.. సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఫైన్ వేసే వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రారంభంలో రోజుకు ఆరువేల నుంచి మొదలు కాగా, 30వ తేదీ వరకు ప్రతీరోజు ఈ సంఖ్య 10 వేలను అధిగమించడం విశేషం. ఈ లెక్కన రాజధానిలోనే దాదాపు లక్ష వరకు చలానాలు వేయగా..మిగిలిన జిల్లాలు, కమిషనరేట్లలో ఈ సంఖ్య రెట్టింపు సంఖ్యలో ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. కేసుల నమోదు ఇలా.. నమోదు చేసిన కేసులు: 3,359 పోలీసులు సీజ్ చేసిన వాహనాలు: 16,360 నమోదైన ఎఫ్.ఐ.ఆర్లు: 1,572 అరెస్టయినవారు: 1,790 విధించిన చలానాలు: రూ.75 లక్షలు అధికంగా హైదరాబాద్లోనే.. -
సచివాలయాలకు అమ్మఒడి జాబితాలు
విజయనగరం అర్బన్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘అమ్మ ఒడి’ పథకం చివరి అంకానికి చేరింది. అర్హులు, అనర్హులు, అభ్యంతరాల జాబితాలు సిద్ధమయ్యాయి. మరోసారి పరిశీలనకు సచివాలయాలకు చేరాయి. సాధికార సర్వే అనుసంధానంలో జరిగిన తప్పిదాలను నిరూపించే ధ్రువపత్రాలను రెండురోజుల్లోక్షేత్రస్థాయిలోని సచివాలయాలకు అందజేసి పథకం లబ్ధి పొందాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. తొలిజాబితా అర్హులు 3.1 లక్షల మంది.. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘అమ్మ ఒడి’ పథకం తొలి జాబితాలో జిల్లా నుంచి 3,17,294 మంది విద్యార్థులు, వారి తల్లులను అర్హులుగా ప్రకటించారు. జిల్లాలోని పథకం కోసం ఒకటి నుంచి 10వ తరగతి పాఠశాల, రెండు సంవత్సరాల ఇంటరీ్మడియట్ విద్యార్థులు 3,70,565 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటి నుంచి క్షేత్రస్థాయి సచివాలయాలకు వెళ్లిన మూడు జాబితాలను పంపారు. అన్ని అర్హతలను నిర్ధారించుకొని అనుమతి పొందిన తల్లులు 3,17,294 మంది ఉన్నారు. మరోసారి విచారణ చేయాల్సిన జాబితాలో 21,886 మంది ఉండగా, సాధికార సర్వే అనుసంధానంతో సరిచేసిన కారణంగా అర్హతను కోల్పోయిన వారు 31,385 మంది విద్యార్థులు ఉన్నారు. సవరించాల్సినవి అర్బన్ ప్రాంతాల్లోనే అధికం సాధికార సర్వే అనుసంధానంతో అనర్హులుగా మిగిలిన సంఖ్యలో అధికులు జిల్లాలోని పట్టణ ప్రాంతీయులే ఉన్నారు. సాధికార సర్వే అనుసంధానంతో అనర్హులుగా చూపిన జాబితాలో అత్యధికంగా జిల్లాలోని విజయనగరం అర్బన్ ప్రాంతంలో 9,051 మంది ఉండగా అత్యల్పంగా నెల్లిమర్ల నగర పంచాయతీలో 287 మంది ఉన్నారు. రీ ఎంక్వైరీ జాబితాలో కూడా విజయనగరం అర్బన్లో అధికంగా 3,892 మంది ఉండగా అత్యల్పంగా నెల్లిమర్ల నగర పంచాయతీలో 134 మంది ఉన్నారు. విజయనగరం అర్బన్లో నమోదు చేసిన విద్యార్థుల తల్లులు 41,600 ఉండగా వారిలో 28,657 మంది మాత్రమే తొలి విడత అర్హులయ్యారు. అలాగే, జిల్లాలోని 34 మండలాల్లో అత్యధికంగా 13,478 మందిలో తొలి జాబితాల్లో 12,242 మంది అర్హులై పూసపాటిరేగ మండలం మొదటి స్థానంలో ఉంది. తరువాత వరుసలో ఎస్.కోట మండలం 11,245 మంది నమోదులో 9,578 మంది అర్హులయ్యారు. రెండురోజుల్లో సవరించుకోవచ్చు జిల్లాలోని ‘అమ్మ ఒడి’ తొలి జాబితా విడుదలైంది. అర్హులెవరూ నష్టపోరాదనే ఉద్దేశంతో మూడు విభాగాలుగా జాబితాను విడుదల చేశాం. అర్హుత పొందిన జాబితాతో పాటు రీ ఎంక్వైరీ జేయాల్సిన జాబితా ప్రకటించాం. సాధికార సర్వే అనుసంధానంలో ఇబ్బందుల వల్ల అనర్హులుగా ప్రకటించిన మరో జాబితా కూడా విడుదల చేశాం. అనర్హతగా నమోదయన అంశాలపై తాజాగా ఎలాంటి ధ్రువపత్రాలున్నా క్షేత్రస్థాయిలో సవరించే అవకాశం ఉంది. రెండురోజుల్లో సవరించిన, రీ ఎంక్వైరీ చేసిన జాబితాను ఉన్నతాధికారులకు పంపాలి. – జి.నాగమణి, డీఈఓ -
టైమ్స్ టాప్ 100లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’
సాక్షి : ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్ ఏటా రూపొందించే ‘వరల్డ్ టాప్ 100 జాబితా 2019’లో మనదేశం నుంచి రెండింటికి చోటు దక్కింది. అందులో ఒకటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ కాగా మరొకటి ముంబైలోని ‘సోహో హౌస్’. 182 మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించిన ఉక్కుమనిషి విగ్రహం గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా బాగా వృద్ధి చెందింది. కొన్ని రోజుల క్రితం ఒకే రోజు 34000 మంది టూరిస్టులు ఈ విగ్రహాన్ని సందర్శించడం విశేషం. ఈ రెండు అంశాలను పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న సోహో హౌస్ ఐరోపా, అమెరికా ఖండాల బయట, ఆసియాలోనే మొదటిది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అరేబియా సముద్ర తీరంలో పదకొండు అంతస్థులతో నిర్మితమైంది. ఇందులో లైబ్రరీ, ఓపెన్ రూఫ్ టాప్ బార్తో పాటు 34 మందికి సరిపోయే సినిమా థియేటర్ కూడా ఉంది. దీని నిర్మాణంలో వాడిన ఫర్నిచర్, నిర్మాణ శైలి, భవనంలోని కళాకృతులతో ఈ భవనం ప్రత్యేకత కలిగి ఉంది. వాస్తవికత, ఆవిష్కరణ, కొత్తదనం, ప్రభావం వంటి అంశాల ఆధారంగా టైమ్ మేగజీన్ ఏటా ప్రపంచవ్యాప్తంగా తగిన ప్రదేశాలను ఎంపిక చేస్తుంది. -
మహిళలే నిర్ణయాత్మక శక్తి
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఎంపీ స్థానంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో మహిళల జనాభానే అధికంగా ఉంది. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడంతో వారి ఓట్లే గెలుపోటములను నిర్ణయించనున్నాయి. మోర్తాడ్(బాల్కొండ): త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి మహిళా లోకానికే ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న ఓటర్లలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. పురుషుల కంటే మహిళా ఓట్లు అధికంగా ఉండడంతో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయడంలో మహిళ ఓటర్లే కీలకం అని వెల్లడవుతుంది. ఇటీవల ఆయా నియోజకవర్గాలలో జారీ అయిన ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే అన్ని శాసనసభ నియోజకవర్గాలలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. నిజామాబాద్ ఎంపీ స్థానం పరిధిలో మొత్తం 15,53,301 ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లు 8,14,689 ఉండగా, పురుష ఓటర్లు 7,38,577గా నమోదైంది. ఇతర ఓటర్లు 35 మంది ఉన్నారు. అంటే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 76,112 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అంతేకాక గతంలో జరిగిన వివిధ ఎన్నికల పోలింగ్ శాతాన్ని గమనిస్తే ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో మహిళా ఓటర్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడమే కాకుండా పోలింగ్లోను వారిదే పైచేయిగా నిలవడం గమనార్హం. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,06,383 ఉండగా, మహిళా ఓటర్లు 1,11,458 మంది ఉన్నారు. పురుషులకు సంబంధించి 94,921 మంది ఓటర్లు ఉండగా, ఇతరులు నలుగురు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 16,537 మంది ఎక్కువ ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 1,92,706 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,02,704, పురుషులు 89,997 మంది ఓటర్లు ఉన్నారు. ఇతర ఓటర్లు ఐదుగురు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 12,707 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. బోధన్ నియోజకవర్గంలో 2,07,379 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,07,463 మంది ఉండగా, పురుష ఓటర్లు 99,913 మంది ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. 7,550 మంది మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2,69,028 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,37,738 మంది ఉండగా, 1,31,272 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 18 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. 6,466 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2,36,620 మంది ఓటర్లు ఉండగా, 1,26,511 మంది మహిళా ఓటర్లు ఉండగా, 1,10,107 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 16,404 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 2,27,284 మంది ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 1,18,653 మంది ఉండగా, పురుష ఓటర్లు 1,08,631 మంది ఉన్నారు. 10,022 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జగిత్యాల్ నియోజకవర్గంలో 2,13,901 మంది ఓటర్లు ఉండగా, 1,10,162 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,03,736 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు ముగ్గురు ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో 6,426 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యనే ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. -
ఫోర్బ్స్ ఇండియా జాబితాలో ‘అర్జున్రెడ్డి’
2019 సంవత్సరానికి వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన 30 ఏళ్ల లోపు వారి జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ‘ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ' పేరుతో ఆరవ జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకున్నాడని తెలిపింది. ముఖ్యంగా 2017లో అర్జున్రెడ్డి ద్వారా సంచలనం సృష్టించారని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. వయస్సు 25 అయినా 52 ఏళ్లు అయినా సక్సెస్లను అభినందించడంతోపాటు, తక్కువ వయస్సులోనే విజయాలను అందుకున్నవారి ప్రతిభ, ధైర్యాన్ని గుర్తించడమే తమ లక్ష్యమని ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. విజయాలు, కెరీర్లో దూసుకెళ్లే తత్వం, తమ వ్యాపారాన్ని నిర్వహించే సత్తా, దీర్ఘకాలం ప్రతిభను కొనసాగించే సామర్థ్యం ఆధారంగా ఈ జాబితాను రూపొందించామనీ, దీనికి సంబంధించిన కథనాన్ని ఫిబ్రవరి 15, ఫోర్బ్స్ ఇండియా మ్యాగజీన్లో చూడొచ్చని తెలిపింది. 16 కేటగిరీల్లో 300 పేర్లను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను రూపొంచింది. మీడియా, క్రీడలు, మార్కెటింగ్, పరిశ్రమ, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లోని వారిని ఎంపిక చేసింది. మహిళా క్రికెట్ సంచలనం స్మృతి మంధాన, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్ ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, వీరితోపాటు యూట్యూబ్ పర్సనాలిటీ ప్రజక్త కోలీ, సింగర్ మేఘన మిశ్రా, ఆయుష్ అగర్వాల్ లాంటివారి పేర్లున్నాయి. ఇంకా పైనాన్స్ సంస్థను నడుపుతున్న ఐఐటీయన్లు వసంత్ కాంత్, అనురాగ్ శ్రీవాస్తవ, రోహన్గుప్త, ఇంకా నింజా కార్ట్ ద్వారా రైతులకు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్న కార్తీశ్వరన్, శరత్ లోగనాథన్, అశుతోష్ విక్రం తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
ఎఫ్ఏటీఎఫ్ ‘గ్రే లిస్ట్’లో పాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు అంతర్జాతీయంగా ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) పాక్ను గ్రే లిస్ట్లో పెట్టింది. దీని ఫలితంగా ప్రపంచ దేశాల్లో ఆ దేశ ప్రతిష్ట దెబ్బతినడంతోపాటు విదేశీ ఆర్థిక సాయం నిలిచిపోనుంది. బుధవారం పారిస్లో జరిగిన ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి హాజరైన పాక్ ఆర్థిక మంత్రి షంషాద్ అక్తర్.. తమ దేశం నుంచి ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్న జమాత్–ఉద్– దవా సంస్థ అధినేత, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సహా ఉగ్రమూకలకు నిధులు అందకుండా చేయటానికి వచ్చే 15 నెలల్లో అమలు చేయనున్న 26 అంశాల కార్యాచరణ ప్రణాళికను వివరించారు. దీనిపై చర్చించిన ఎఫ్ఏటీఎఫ్..పాక్ పేరును గ్రే జాబితాలో ఉంచనున్నట్లు బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ నిర్ణయం ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. దీనిపై పాక్ స్పందిస్తూ.. ‘ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం మాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఇది రాజకీయ పరమైన నిర్ణయం. ఉగ్రవాదంపై పోరులో పాక్పై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదు. త్వరలోనే గ్రే జాబితా నుంచి బయటపడతాం. గతంలోనూ ఇలా జరిగింది’ అని పేర్కొంది. 1989లో ఏర్పాటైన ఎఫ్ఏటీఎఫ్ గ్రూపులో 37 దేశాలున్నాయి. మనీ లాండరింగ్ నిరోధానికి, ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయటానికి ఇది కృషి చేస్తుంది. కాగా, గ్రే లిస్ట్లో ఇప్పటికే ఇథియోపియా, ఇరాక్, యెమెన్, సెర్బియా, సిరియా, శ్రీలంక, ట్రినిడాడ్ టొబాగో, ట్యునీసియా, వనౌటు దేశాలున్నాయి. గ్రే లిస్ట్లో ఉంటే ఏమవుతుంది? ఇప్పటికే పాక్ పలుకుబడి అంతర్జాతీయంగా మసకబారింది. ఉగ్రవాదులతో సంబంధ మున్న దేశంగా ముద్రపడితే ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది. అక్కడ పెట్టుబ డులు పెట్టడానికి, కంపెనీలు నెలకొల్పేందుకు విదేశీ సంస్థలు సంశయిస్తాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు పుట్టడం కష్టం. స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్ వంటి విదేశీ బ్యాంకులు దేశం నుంచి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. అదే బ్లాక్లిస్ట్లో ఉంటే ప్రభుత్వాలు, సంస్థలు, కంపెనీలు ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వవు. -
నల్లకుబేరుల జాబితా ఇస్తే బంపర్ ఆఫర్
-
అందమైన కథ బకెట్ లిస్ట్
మన కోరికలు మనమే తీర్చుకోవడంలో థ్రిల్లేముంది? ఎదుటి వారి కోరికలు తీర్చడంలో ఉన్న తృప్తిని ఎప్పుడైనా అనుభవించామా? ‘బకెట్ లిస్ట్’ అనేది పాశ్చాత్య సమాజం నుంచి మనకు వచ్చిన ఒక భావన. ‘జీవితంలో మనం నెరవేర్చుకోవాలనుకునే కోరికల పట్టిక’ను బకెట్ లిస్ట్ అంటారు. ఇప్పుడు ఆ పేరుతో ఒక మరాఠి సినిమా వస్తోంది. మాధురి దీక్షిత్ మొదటిసారి మరాఠిలో నటించింది. మే 25న విడుదల. ఏమిటి దాని విశేషం?ఇందులో మాధురి దీక్షిత్కు గుండెజబ్బు. ఎవరో ఒక దాత గుండెను దానం చేస్తే తప్ప బతకదు. చివరకు దాత దొరుకుతుంది. మాధురి కొత్త గుండెతో కొత్త ఊపిరి పొందుతుంది. ‘అవయవ దానం’ ద్వారా ఒక అమ్మాయి తన శరీరంలోని ముఖ్య అవయవాలను దానం చేసి ఎనిమిది మందికి కొత్త జీవితం ఇచ్చి మరణించిందని మాధురి తెలుసుకుంటుంది. అంతమందిని బతికించిన ఆ అమ్మాయి ఆశలూ ఆశయాలూ తీరాయా? ఆమె కోసం ఏం చేయగలం అని మాధురి అనుకుంటుంది. ఆ అమ్మాయికి ఒక ‘బకెట్ లిస్ట్’ ఉందని తెలుసుకుంటుంది. – బైక్ మీద ఒంటిరిగా దేశం తిరగాలి. – పబ్కు వెళ్లాలి– ఎవరిదైనా పెళ్లిలో బాగా అల్లరి చేయాలి– రణధీర్ కపూర్తో సెల్ఫీ దిగాలి ఇలాంటి కోరికలు ఉన్న ఒక టీనేజ్ అమ్మాయి ఆ అమ్మాయి. ఈ చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండా తనలాంటి వారిని బతికించి మరణించిందా అని దుఃఖపడుతుంది మాధురి దీక్షిత్. మరి దానికి కాంపెన్సేషన్? వాటిని తాను తీర్చడానికి అంటే ఆ అమ్మాయిలా కొన్నాళ్లు జీవించడానికి బయలుదేరడమే. కాని ఆ ప్రయత్నంలో మాధురి ఏం తెలుసుకుంటుంది? తన జీవితాన్ని తాను తెలుసుకుంటుంది, తన కోరికలు తెలుసుకుంటుంది. ట్రైలర్లో మాధురి ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్లో పాల్గొంటోంది. ఈ అందమైన కథను కరణ్ జొహర్ నిర్మాతగా మార్చి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఈ కథ అన్ని భాషల్లోకి రీమేక్ అవ్వొచ్చని మనకు అనిపించడం లేదూ? -
మా గ్రామాలను తొలగించడం అన్యాయం...
సాక్షి, హైదరాబాద్ : నల్లగొండ జిల్లా, పెద్దవూర మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ పంచాయతీల జాబితా నుంచి రామన్నగూడెం తండా, ఎనిమిది తండాలను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రెండు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలన్న పంచాయతీరాజ్ కమిషనర్ లేఖ ఆధారంగా జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారని, అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆ ప్రతిపాదనను కలెక్టరే ఉపసహరించుకున్నారని, దీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ టీపీసీసీ ఎస్టీ విభాగం వైస్ చైర్మన్ రమావత్ ప్రదాస్ నాయక్, రమావత్ నాగేశ్వరనాయక్లు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ, రామన్నగూడెం ప్రస్తుత జనాభా 1000, ఎనిమిది తాండా జనాభా 1800పైన ఉందన్నారు. ఈ రెండు తాండాల మధ్య దూరం అరకిలోమీటరని,ప్రస్తుతం ఇవి తుంగతుర్తి గ్రామ పంచాయతీలో భాగంగా ఉన్నాయని వివరించారు. రామన్నగూడెం, ఎనిమిది తండాల గ్రామాలకు, తుంగతుర్తికి మధ్య దూరం 4 కిలోమీటర్ల ఉందని, అక్కడి వెళ్లేందుకు సైతం సరైన రవాణా సదుపాయాలు కూడా లేవని ఆయన కోర్టుకు నివేదించారు. ఇదిలా ఉంటే 500 జనాభా, ప్రస్తుతం ఉన్న పంచాయతీకి రెండు కిలోమీటర్ల మించి దూరం ఉన్న గ్రామాలను పంచాయతీలుగా చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు తమ గ్రామాలను సైతం కొత్త పంచాయతీలుగా చేయాలని జిల్లా కలెక్టర్కు పంచాయతీరాజ్ కమిషనర్ లేఖ రాశారని, ఆ లేఖ ఆధారంగా కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ తమ గ్రామాలను కొత్త పంచాయతీల జాబితా నుంచి తొలగించారని, కేవలం స్థానిక రాజకీయ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ కారణంతోనే ఆయన ఇలా వ్యవహరించారని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామ పంచాయతీలయ్యేందుకు తమ గ్రామాలకు పూర్తి అర్హత ఉందని ఆయన వివరించారు. ఈ వాదనలను పరిగణలనోకి తీసుకున్న న్యాయమూర్తి, ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తన ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
ఉగ్ర ప్రోత్సాహ జాబితాలో ఉ.కొరియా: ట్రంప్
వాషింగ్టన్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తర కొరియాను చేరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోమవారం వైట్హౌస్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తర కొరియాను ఎప్పుడో ఉగ్రవాద ప్రోత్సాహ దేశంగా గుర్తించాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షల్ని అమెరికా ఆర్థిక శాఖ నేడు వెల్లడిస్తుందని ఆయన చెప్పారు. చట్ట వ్యతిరేక అణ్వాయుధ కార్యకమాల్ని ఉత్తర కొరియా తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. -
ఆ ఫోన్లలోనౌగట్ 7.0తో అప్డేట్..త్వరలో
ముంబై: షియోమి స్మార్మ్ఫోన్ లవర్స్కి శుభవార్త. చైనా మొబైల్ తయారీ దారు షియోమి మరిన్ని ఫోన్లను అప్డేట్ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. జూన్ నెలలో ఎంఐ మ్యాక్స్ను ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టంతో ఎంఐయూఐ అప్డేట్ను అందించిన షియోమి.. త్వరలో మరికొన్ని ఫోన్లకు నౌగట్ ఓఎస్తో అప్డేట్ను ఇవ్వనుంది. త్వరలో ఎంపిక చేసిన 14 ఫోన్లకు ఈ అప్డేట్ అందుతుందని సమాచారం. అయితే జాబితాలో రెడ్మి 4 లేదని తెలుస్తోంది. గిజ్మో చైనా అదించిన సమాచారం ప్రకారం రెడ్మి ఎంఐ 4 ఎక్స్, షియోమి ఎంఐ మ్యాక్స్, ఎంఐ నోట్ 2, రెడ్మి నోట్ 4 ఎక్స్, ఎంఐ మిక్స్, ఎంఐ 5, ఎంఐ 5ఎస్, ఎంఐ 5ఎస్ ప్లస్, షియోమి ఎంఐ 6, ఎంఐ మ్యాక్స్ 2, ఎంఐ 5సి, రెడ్మి 4 ఎక్స్ తదితర ఫోన్లు అప్డేట్ అందుకోనున్న జాబితాలో ఉన్నాయి. అయితే ఆశ్యర్యకరంగా రెడ్ 4ను దీన్నుంచి మినహాయింపునిచ్చింది. కాగా ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 7.1 శాతం డివైస్లు అప్డేట్కాగా, 7.1 ఓ ఎస్తో 0.5 శాతం డివైస్ అప్డేట్ అయ్యాయి.ముఖ్యంగా మొబైల్ ఆపరేటింగ్ స్టేషన్ గూగుల్ పిక్సెల్ , పిక్సెల్ ఎక్స్ఎల్ లతో ప్రారంభించబడింది. అలాగే నెక్సస్ స్మార్ట్ఫోన్లలోనూ, పిక్సెల్ టాబ్లెట్, నెక్సెస్ ప్లేయర్ సహా ఇతర ఆండ్రాయిడ్ డివైస్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. -
నేడు సీడీఎస్ఎల్ లిస్టింగ్
న్యూఢిల్లీ: ఇటీవల విజ యవంతంగా తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను పూర్తిచేసిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) షేర్లు శుక్రవారం లిస్ట్కానున్నాయి. జూన్ 19–21 మధ్య జారీఅయిన ఈ ఐపీఓ భారీగా 170 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఆఫర్ రూ. 145–149 ప్రైస్బ్యాండ్తో జారీఅయ్యింది. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో
♦ గురుకుల మెయిన్స్ అభ్యర్థుల జాబితా సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ, పీడీ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఎంపికైన అభ్యర్థుల హాల్టికెట్ వివరాలు మాత్రమే జాబితాలో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలు గత నెల 31న టీఎస్పీఎస్సీ నిర్వహించగా ఫలితాలను ఈ నెల 21న విడుదల చేసింది. టీజీటీ, పీజీటీ, పీడీ విభాగాల్లో మొత్తం 2,859 ఉద్యోగాలున్నాయి. ఇందులో టీజీటీ 2,340 పోస్టులు, పీజీటీ 513 పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ విభాగంలో 6 పోస్టులున్నాయి. ఒక్కో పోస్టుకు సగటున 15 మంది అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఎంపిక జాబితా ప్రకటించింది. మొత్తం 2,859 పోస్టులకుగాను 42,885 మందిని మెయిన్ పరీక్షలకు పిలవాల్సి ఉంది. అయితే, కొన్ని కేటగిరీ ల్లో కులాలవారీగా 1:15 సంఖ్యకు సరిపోయేలా అభ్యర్థులు లేరు. దీంతో అందుబాటులో ఉన్న వారినే పరిగణిస్తూ ఎంపిక జాబితా ప్రకటించింది. గురుకుల మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా... టీజీటీ పీజీటీ సబ్జెక్టు ఎంపికైన అభ్యర్థులు సబ్జెక్టు ఎంపికైన అభ్యర్థులు బయో సైన్స్ 5,087 బయో సైన్స్ 317 మ్యాథ్స్ 11,093 మ్యాథ్స్ 1,550 ఫిజికల్ సైన్స్ 3, ఫిజికల్ సైన్స్ 2,368 జనరల్ సైన్స్ 3,006 సోషల్ స్టడీస్ 2,410 సోషల్ స్టడీస్ 6,404 పీడీ 45 -
స్థానిక’ ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదల
– మొత్తం ఓటర్లు 1476 మంది కాకినాడ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఓటర్ల తుది జాబితాను అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, నగర పంచాయతీ వార్డు సభ్యులతోపాటు స్థానిక సంస్థల్లో ఎక్స్అఫిషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు 1476 మంది ఓటర్లుగా ఉన్నారు. వీరిలో పురుషులు 632 మంది, మహిళలు 844 మంది ఉన్నారు. జిల్లాలోని ఏడు డివిజన్ కేంద్రాలలోని పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లు ఈ విధంగా ఉన్నారు. రంపచోడవరంలో 66 మంది, పెద్దాపురంలో 317, రాజమండ్రిలో 185, రామచంద్రపురంలో 221, అమలాపురంలో 385, కాకినాడలో 261, ఎటపాక డివిజన్లో 41 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా స్థానిక సంస్థల వారీగా ఓటర్లను పరిశీలిస్తే రాజమహేంద్రవరం కార్పొరేటర్లు 50 మంది, మున్సిపల్ కౌన్సిలర్లు పిఠాపురం 30, సామర్లకోట 30, పెద్దాపురం 28, తుని 30, అమలాపురం 29, రామచంద్రపురం 24, మండపేట 29, నగర పంచాయతీల వార్డు సభ్యులు గొల్లప్రోలు 20, ఏలేశ్వరం 20, ముమ్మిడివరం 20 మంది, జెడ్పీటీసీలు 60, ఎంపీటీసీలు 1091 మంది ఉన్నారు. ఎక్స్అఫీషియో మెంబర్లు 15 మంది మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిరాజు, తోట త్రిమూర్తులు, వేగుళ్ళ జోగేశ్వరరావు ఓటర్లుగా ఉన్నారు. ఈ ఓటర్ల జాబితాలను కలెక్టరేట్, జిల్లాపరిషత్ సీఈఓ కార్యాలయం, మున్సిపాల్టీలతో పాటు డివిజన్ కేంద్రాల్లోని ఏడు పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంచారు. -
మరోసారి టాప్లో ఆమె
ముంబై: ప్రభుత్వంరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య మరోసారి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. దేశీయ వ్యాపారరంగంలో అత్యంత శక్తిమంతమైన మహిళగా గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాదికిగాను ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 'టాప్ 50 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ ఇన్ బిజినెస్ 2016' జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ లిస్ట్లో భట్టాచార్య మరోసారి అగ్రస్థానంలో నిలిచారని ఎస్బీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. -
ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల
15న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన డిసెంబర్ 14 వరకు కొత్తవి నమోదు కాకినాడ సిటీ : ఓటర్ల జాబితా 2017 సవరణ ప్రక్రియకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈమేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని 19 నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ఈనెల 15న జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం ప్రకటించనుంది. ఓటర్ల జాబితా ప్రకటన సమయం నుంచి డిసెంబర్ 14 వరకు జిల్లా వ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు జరుగుతుంది. ఈ జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 19 నియోజకవర్గాల్లోని 4,266 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 38,05,354 మంది ఓటర్లు ఉన్నారు. జాబితాలో డూప్లికేషన్లు, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు ఇప్పటి వరకు నమోదైన క్లెయిమ్లను పరిశీలించి మార్పులు, చేర్పులతో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. సవరణ ప్రక్రియలో 2017 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు నమోదుతో పాటు ఓటు హక్కులేనివారు కూడా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిష¯ŒS అవకాశం కల్పించింది. ఈనెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియను జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. నవంబర్ 23, డిసెంబర్ 7వ తేదీల్లో ఓటర్ల జాబితా పరిశీలన నిమిత్తం గ్రామసభలు నిర్వహించి బూత్లెవెల్ అధికారులు ప్రదర్శిస్తారు. అదేవిధంగా నవంబర్ 20, డిసెంబర్ 11వ తేదీల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా బూత్లెవెల్ ఏజంట్స్, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. డిసెంబర్ 28వ తేదీలోపు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తారు. అలాగే జనవరి 5వ తేదీలోపు పరిశీలించిన దరఖాస్తులను ఆ¯ŒSలై¯ŒSలో డేటా ఎంట్రీ పూర్తిచేసి సప్లమెంటరీ జాబితాలను సిద్ధం చేస్తారు. అనంతరం 2017 జనవరి 16వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. -
నేడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లిస్టింగ్
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేడు(గురువారం) మార్కెట్లో లిస్ట్ కానున్నది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న తొలి బీమా కంపెనీ ఇదే. ఈ నెల 19-21 మధ్య వచ్చిన రూ.6,057 కోట్ల ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీఓ 10 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.300-334గా కంపెనీ నిర్ణయించింది. 2010లో వచ్చిన కోల్ ఇండియా ఐపీఓ (రూ.15,000 కోట్లు) తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. -
ఇక రంగంలోకి రిలయన్స్ హోం ఫైనాన్స్
రిలయన్స్ క్యాపిటల్ అధినేత అనిల్ అంబానీ వ్యాపార విస్తరణలో జోరు పెంచినట్టు కనిపిస్తోంది. ఒకవైపు కీలకమైన ఎయిర్ సెల్ తో ఒప్పందాన్ని ఖాయం చేసుకుంటూనే మరోవైపు మరో సరికొత్త కంపెనీతో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 49 శాతం ఈక్విటీ తో 'రిలయన్స్ హోం ఫైనాన్స్' అనే సంస్థను మార్కెట్ లో లిస్ట్ చేయనున్నారు. రిలయన్స్ కేపిటల్ కి సంబంధించిన హౌసింగ్ ఫైనాన్స్ ను విడిగా స్టాక్ ఎక్స్ఛేంజ్ లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు రిలయన్స్ ప్రకటించింది. ఇందులో 49శాతం షేర్లు హోమ్ లోన్ కంపెనీకి చెందిన సుమారు పదిలక్షల షేర్ హోల్డర్లకే ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. అంటే రిలయన్స్ క్యాపిటల్ షేరున్న ప్రతీ ఖాతాదారుడికి ఒక హౌసింగ్ ఫైనాన్స్ షేరును ఎలాట్ చేయనుంది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అంగీకారం తెలిపినట్లు కంపెనీ తెలిపింది. రిలయన్స్ క్యాపిటల్ లో 100 శాతం అనుబంధ సంస్థగా రిలయన్స్ హోం ఫైనాన్స్ హోం లోన్, ప్రాపర్టీలోన్, కనస్ట్రక్షన్ ఫైనాన్స్ , చవకైన గృహ రుణాలు లాంటిరుణ సేవల్లో విస్తృత పరిధిలో తన సేవలను అందించనుంది. 2016 జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో రూ.8,259 కోట్ల ఎస్సెట్ మ్యానేజ్ మెంట్, రూ. 7,750 కోట్ల అవుట్ స్టాండింగ్ లోన్ బుక్, ఒక శాతం ఎన్పీఏ రేషియోను రిపోర్ట్ చేసింది కాగా మాతృ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ జీవిత, సాధారణ బీమా, ఆస్తుల నిర్వహణ, మ్యూచువల్ ఫండ్, కన్స్యూమర్ ఫైనాన్స్ తదితర వివిధ ఆర్థిక సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలతో . రిలయన్స్ క్యాపిటల్ షేర్లు పదిశాతానికిపై ఎగిసి 52 వారాల కనిష్టాన్ని తాకింది. చివరికి రూ 8.68 శాతం లాభపడి 580 దగ్గర ముగిసింది. -
‘డ్రిప్’ అర్హత జాబితా సిద్ధం చేయండి
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా 51 వేల హెక్టార్లకు డ్రిప్ కావాలని రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయని, నెలలోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత జాబితా సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి ఆదేశించారు. ఆదివారం ఏపీఎంఐపీ కార్యాలయంలో ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఇరిగేషన్ కంపెనీ జిల్లా ప్రతినిధులు (డీసీవో), ఎంఐ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2016–17లో జిల్లాకు కేటాయించిన 35 వేల హెక్టార్లలో 4,100 హెక్టార్లకు సరిపడా యూనిట్లు మంజూరు చేశామన్నారు. ఇంకా లక్ష్యం ఎక్కువగా ఉండటం, అందుకు అనుగుణంగా రైతుల నుంచి రిజిషే్ట్రషన్లు కూడా భారీగా ఉండటంతో మొదట వాటిని పూర్తీస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వాటితో జాబితా తయారు చేస్తే మంజూరు చేయడానికి సులభంగా ఉంటుందని తెలిపారు. అలాగే వేరుశనగ పంటకు రక్షకతడి ఇచ్చేందుకు వీలుగా కేటాయింపుల మేరకు కంపెనీల ద్వారా వెంటనే రెయిన్గన్లు, స్ప్రింక్లర్సెట్లు, పైపులు మండలాల్లో నిల్వ చేయాలని ఆదేశించారు. -
ఎస్ఏ పదోన్నతుల జాబితా సిద్ధం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రభుత్వ, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సెకండరీ గ్రేడు టీచర్లుగా పనిచేస్తూ స్కూల్ అసిసెంట్ల పదోన్నతులకు అర్హత సాధించిన ఉపాధ్యాయుల తాత్కాలిక జాబితాను డీఈఓ బ్లాగ్లో ఉంచినట్లు డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలోని టీచర్ల సీనియారిటీపై అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈనెల 5వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. డీసీఈబీ కాంట్రిబ్యూషన్ చెల్లింపు గడువు పొడిగింపు అన్ని యాజమాన్యాల హైస్కూల్స్ విద్యార్థులకు సంబంధించి 2016–17 విద్యాసంవత్సరంలో పరీక్షల కాంట్రిబ్యూషన్ ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు డీసీఈబీ కార్యదర్శి ఓంకార్యాదవ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు డీసీఈబీ ఆన్లైన్ అకౌంట్లో ఫీజును చెల్లించవచ్చన్నారు. -
వైద్యాధికారి పోస్టుల జాబితా విడుదల
నిజêమాబాద్ అర్బన్: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిన నియమించే వైద్యాధికారి పోస్టుల జాబితాను విడుదల చేసినట్లు డీఎంహెచ్వో వెంకట్ తెలిపారు. www.nizamabad.nicలో జాబితాను పొందుపరిచినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాబితాలో పేర్లు గల అభ్యర్థులు ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
బాలికల విద్యలో చివరిస్థానం!
అహ్మదాబాద్ః గుజరాత్ ప్రభుత్వం బాలికల విద్యావికాసంకోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'కన్యా కెలవనీ' ప్రభావం ఆ రాష్ట్రంలో పెద్దగా కనిపించడం లేదు. డ్రాపవుట్స్ ను స్కూల్లో చేర్చుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్గే ఆ రాష్ట్రం విఫలమైనట్లు కనిపిస్తోంది. బాలికల విద్య విషయంలో చివరిస్థానానికే పరిమితమౌతోంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా నిర్వహించిన 2014 సర్వే లెక్కలను బట్టి గుజరాత్ పాఠశాలల్లో బాలికల శాతం అత్యంత తక్కువగా కనిపిస్తోంది. 15-17 ఏళ్ళ మధ్య వసుగల సుమారు 26.6 శాతంమంది బాలికలు డ్రాపవుట్స్ గా మారుతున్నట్లు సర్వేలను బట్టి తెలుస్తోంది. అంటే రాష్ట్రంలోని 26.6 శాతంమంది బాలికలు కేవలం నాలుగైదు తరగతులకు మించి చదువు కొనసాగించటల్లేనట్లు సర్వేలు చెప్తున్నాయి. భారతదేశంలో సగటున 83.8 శాతం బాలికలు పాఠశాలలకు హాజరౌతుంటే.. కేవలం గుజరాత్ లో 10 శాతం మంది మాత్రమే ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. దీంతో పదేళ్ళ క్రితంనుంచే రాష్ట్రంలో బాలికలను చదువుకు ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రామలతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 'కన్యా కెలవని', 'శాల ప్రవేశోత్సవ్' పేరిట మంత్రులు, ప్రభుత్వాధికారులు గ్రామీణ ప్రాంతాల్లో బాలికలను పాఠశాలల్లో చేర్చుకునేందుకు ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ వెనుకబడే ఉండటంతో ఆందోళన వ్యక్తమౌతోంది. అమ్మాయిలు 5వ తరగతిలోపు చదువతున్నవారు 14.8 శాతం ఉండగా.. వారిలో కేవలం 7.3 శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారని గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్రసింహ్ ఛుడస్మా తెలిపారు. అందుకే తాము అమ్మాయిలను పాఠశాల్లో చేర్పించేందుకు, చదువు కొనసాగేట్లు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని చెప్తున్నారు. అయితే 8వ తరగతి తరువాత చదివినవారు డ్రాపవుట్స్ కావడం లేదని, దీంతో 20 శాతం కంటే నిష్పత్తి ఎక్కువగా ఉండటం లేదని ఆయనన్నారు. అందుకే తాము బాలికల చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ప్రభుత్వం బాలికల అక్షరాస్యత 100 శాతానికి చేర్చేందుకు అంకితమై పనిచేస్తోందని తెలిపారు. -
బది‘లీల’లు
ఆన్లైన్ ఫార్స్.. అంతా సిఫార్సు మైదాన ప్రాంతాలకు డిప్యుటేషన్ సిబ్బంది ముగిసిన గడువు.. 1872 మంది దరఖాస్తు నేటి నుంచి శాఖల వారీ కౌన్సెలింగ్ పారదర్శకంగా బదిలీలకు సర్కార్ ఆదేశాలిచ్చింది. ఇందుకు తొలిసారిగా ఆన్ లైన్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ సిస్టమ్(ఓఏటీఎస్)ను అమలులోకి తెచ్చింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం గతంలో మాదిరి సిఫార్సులకే అధికారులు పెద్దపీట వేస్తున్నారు. ఉద్యోగ సంఘాల్లో కీలక పదవుల్లో ఉన్నవారు, డెప్యుటేషన్లపై పనిచేస్తున్న వారంతా నిబంధనల మాటున కోరుకున్న చోట పోస్టింగ్లకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు బదిలీల కౌన్సెలింగ్కు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విశాఖపట్నం: బది‘లీల’లు కొనసాగుతున్నాయి.పైరవీలు ఊపందుకుంటున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెల20వ తేదీలోగా దీనిని ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఐదేళ్లు దాటిన వారిని విధిగా బదిలీ చేయాల్సిందే. మూడేళ్లు దాటిన వారెవరైనా ఉండే రిక్వస్ట్ ట్రాన్సఫర్ పెట్టుకోవచ్చు. ఏజెన్సీ లో అయితే రెండేళ్లు దాటితే బదిలీకి అర్హులు. తొలుత 14వ తేదీలోగా జాబితాలను తయారు చేసి 17వ తేదీలోగా బదిలీల తంతు ముగించాలని భావించారు. కానీ ఇంతలో ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన ఓఎటీఎస్ వల్ల బదిలీల ప్రక్రియలో కొంత జాప్యం చోటుచేసుకుంది. అందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిఉంది. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో 35,200 మంది పనిచేస్తున్నారు. 17వతేదీ రాత్రి ఏడు గంటలతో గడువు ముగిసేటప్పటికి ఆన్లైన్లో కేవలం 1872మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవంగా ఐదేళ్లుదాటిన వారు రెవెన్యూతో సహా వివిధశాఖల్లో 3వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. ఐదేళ్లు దాటినా బదిలీలకు ఇష్టపడక దరఖాస్తు చేయలేని వారి తరపున దరఖాస్తు చేసే బాధ్యతను ఆయా డ్రాయింగ్ ఆఫీసర్లకు అప్పగించారు. వారు అప్లోడ్ చేస్తే ఆటోమెటిక్గా వారంతా జాబితాలో చేరతారు. పెర్ఫార్మెన్స్ ఆధారంగా బదిలీలు చేపట్టేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరి సెల్ఫ్అప్రైజర్ను అప్లోడ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఆరోగ్య పరమైన కారణాలతో బదిలీలు కోరుకునే వారి విషయంలో కూడా నిబంధనలు విధించారు. ఇలా ఐదుశాతానికి మించి ఉండడానికి వీల్లేదని పేర్కొన్నారు. నిబంధనలను ఆసరాగా చేసుకొని ఏజెన్సీలో పనిచేస్తూ డెప్యుటేషన్పై మైదానంలో పనిచేస్తున్న వారు హేపీగా తాజా బదిలీల్లో మైదాన ప్రాంతాల్లో కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు పైరవీలు సాగిస్తున్నారు. ఇలా రెవెన్యూ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. వీరిలో పలువురు ఏజెన్సీలో జీతాలు..మైదాన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా కలెక్టరేట్తో సహా విశాఖ, అనకాపల్లి ఆర్డీవో కార్యాలయాలు, విశాఖ పరిసర ప్రాంతాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో పని చేస్తున్న వారు సైతం చాలా మంది డెప్యుటేషన్పైనే కొనసాగుతున్నట్టు గుర్తించారు. వీరిలో ఐదేళ్లు దాటిన వారు చాలా తక్కువగానే ఉన్నప్ప టికీ మూడేళ్లు దాటిన వారు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. వీరంతా రిక్వస్టు ట్రాన్సఫర్స్ ఆప్షన్తో మైదాన ప్రాంతంలో పోస్టింగ్లకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆన్లైన్ పేరుతో పైకి పారదర్శకత అంటున్నప్పటికీ.. అంతా సిఫార్సులకే పెద్ద పీట వేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలకు ఇబ్బంది లేకుండానే బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలొచ్చినట్టు స్వయంగా జిల్లా అధికారులే చెబుతున్నారు. దీంతో పచ్చనేతల చుట్టూ పచ్చ కాగితాలతో ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. పేరుకు ఫెర్ఫార్మెన్స్ ఆధారంగా బదిలీ లంటూనే ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలే ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని స్పష్టమవుతోంది. శనివారం నుంచి మూడ్రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
బ్రిటన్ సంపన్నుల్లో రూబెన్ సోదరులు టాప్
బ్రిటన్ సంపన్నుల్లో భారత సంతతికి చెందినవారు టాప్ ర్యాంక్ లో నిలిచారు. సండేటైమ్స్ సంపన్నుల జాబితాలో రూబెన్, హిందూజా సోదరులు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ముంబైలో పుట్టిన వ్యాపార దిగ్గజాలు 77 ఏళ్ల డేవిడ్ రూబెన్, 74 ఏళ్ల సైమన్ రూబెన్ సోదరులు ఈసారి సండేటైమ్స్ శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 13.1 బిలియన్ పౌండ్ల సంపదతో యూకే సంపన్నుల జాబితాలో అగ్రభాగాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది ఐదో స్థానంలో ఉన్న రూబెన్ సోదరుల సంపద విలువ ఈసారి 3.4 బిలియన్ పౌండ్లు పెరిగింది. దాంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచారు. ఈ సోదరుల తర్వాతి స్థానంలో 13 బిలియన్ పౌండ్ల సంపదతో హిందూజా గ్రూప్నకు చెందిన శ్రీచంద్ హిందూజా, గోపీచంద్ హిందూజా బ్రదర్స్ ఉన్నారు. ఇక 11.59 బిలియన్ పౌండ్లతో లెన్ బ్లవట్నిక్ మూడో స్థానాన్ని సంపాదించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 50 మంది కుబేరుల జాబితాలో ముఖేశ్, అనిల్ అంబానీ కలసి 17.90 బిలియన్ పౌండ్ల సంపదతో 30వ స్థానానికి పరిమితమయ్యారు. స్టీల్ పరిశ్రమల సంక్షోభం, యూకే ధనవంతుల సంపద ర్యాంకింగ్ పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది. 2008 లో 27.7 బిలియన్ పౌండ్లతో టాప్ లో నిలిచిన ఆర్సిలర్ మిట్టల్ ఛైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ సంపద ఈ సంవత్సరం 7.12 బిలియన్ పౌండ్లకు పడిపోయింది. ఇండియాలో జన్మించిన రూబెన్ బ్రదర్స్ 1950 సమయంలో బ్రిటన్ వెళ్ళి అక్కడ మెటల్స్, ప్రాపర్టీ రంగాల్లో భారీగా సంపదను ఆర్జించారు. సంపన్న ఇరాకీ జోయెషీ కుటుంబంలో పుట్టిన ప్రవాస భారతీయులైన ఈ హిందూజా సోదరులకు ఇండియాలో కూడ అశోక్ లేలాండ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి మొదటి తరగతి కంపెనీలు ఉన్నాయి. -
చెత్త పాస్వర్డ్స్ లో వాళ్లే ముందు!
కంప్యూటర్ల కాలం వచ్చాక పాస్ వర్డ్స్ ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. ఆన్ లైన్లో తమ స్వంత వివరాలను భద్రపరచుకొనేందుకు, బ్యాంకులు వగైరా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎవ్వరూ కనిపెట్టలేని పాస్ వర్డ్స్ పెట్టుకోవాలంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. అయితే అలా పాస్ వర్డ్స్ ను మెయింటెన్ చేయడంలో సింగపూర్ వాసులు పరమ వీక్ అని రుజువైంది. ఒకే పాస్ వర్డ్ ను.. అదీ అందరికీ తెలిసే పాస్ వర్డ్స్ ను పదే పదే అన్ని సైట్లకూ వాడుతూ ఇప్పుడు ప్రపంచంలోనే వరస్ట్ పాస్ వర్డ్ వినియోగదారులుగా వారు ముందున్నరని తాజా నివేదికలు చెప్తున్నాయి. వివిధ వెబ్ సైట్లలో ఒకే పాస్ వర్డ్స్ వాడటం మంచిది కాదన్న విషయం తెలిసినా పట్టించుకోనివారు ఎక్కువమందే ఉంటారు. 2015 లో సింగపూర్ వాసులు అదే తప్పును చేసి.. భారీగా సైబర్ క్రిమినల్స్ వల్లో చిక్కుకుపోయారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. ప్రైవేటు సమాచారం దొంగిలించాలని చూసే అటువంటి సైబర్ నేరగాళ్ళకు... సింగపూర్ వాసులు లక్ష్యం కావచ్చునని భద్రతాధికారులు హెచ్చరిస్తున్నారు. గతవారం 300 మంది ఖాతాదారుల పాస్ వర్డ్స్ ను చోరీచేసి, సింగపూర్ వీసా అప్లికేషన్లు ఉత్పత్తి చేసే చైనా ఆధారిత సిండికేట్ కు అమ్మకం పెట్టిన ఓ మాజీ నిర్వహణాధికారి పట్టుబడ్డంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనేక మంది తమ ఎన్ ఆర్ ఐసీ నెంబర్ నే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ గా వాడుతున్నారని... అంచనా వేసిన 39 ఏళ్ళ జేమ్స్ సిమ్ గాన్ లియాంగ్... తన ప్రయత్నం ఫలించడంతో వేలాది పాస్ వర్డస్ ను సునాయాసంగా తెలుసుకోగలిగాడు. ముఖ్యంగా తమ వ్యక్తిగత సమాచారంలోని పదాలను పాస్ వర్డ్స్ గా పెట్టుకోవడంతో సామాజిక మాధ్యమాల ఆధారంగా వాటిని చోరాసురులు టార్గెట్ చేస్తారు. రీసెట్ పాస్ వర్డ్స్ లో కూడ కొన్నిసార్లు ప్రశ్నలకు సులభమైన సమాధానాలు ఇవ్వడంద్వారా కూడా వ్యక్తిగత డేటాను చోరీ చేయగల్గుతారని.. పాలో ఆల్టో నెట్వర్క్స్ భద్రతా సంస్థ నిఘా విశ్లేషకుడు విక్కీ రే చెప్తున్నారు. పాఠశాల పేరు, స్వంత ఊరిపేరు వంటి సమాధానాలను లింక్డ్ ఇన్, ఫేస్ బుక్ వంటి వాటినుంచీ పొందే అవకాశం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. పాస్వర్డ్స్ ను హ్యాక్ చేయడంలో ఇదో పద్ధతి అని, అలాగే అతి సులభమైన పదాలను, నెంబర్లను పాస్ వర్డ్స్ గా పెట్టుకోవడం వల్ల కూడ హాక్ చేయగల్గుతారని చెప్తున్నారు. అతి తేలికైన పదాలు, అందరికీ అలవాటుగా ఉండే పదాలు వాడే వారిపైనే ధ్యాసపెట్టే హాకర్లు ఇటువంటి పాస్ వర్డ్స్ ను సులభంగా హ్యాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అటువంటి 20 మిలియన్ల అతి చెత్త పాస్ వర్డ్స్ లిస్టును పాస్ వర్డ్స్ మేనేజ్ మెంట్ సంస్థ స్ల్పాష్ డేటా తాజాగా విడుదల చేసింది. ఈ లిస్టులో కీబోర్డుపై మొదటి అక్షరాలు (123456) qwerty వంటి పదాలు.. వరుసగా ఐదో సంవత్సరం కూడ అగ్రస్థానంలో ఉండగా.. పాప్ సంస్కృతికి సూచనగా తాజాగా విడుదలైన చిత్రాల పేర్లు... స్టార్ వార్స్, సోలో, యువరాణి వంటి పాస్ వర్డ్స్ కూడ ఈ లిస్టులో ఉండటం విశేషం. బ్రూట్ ఫోర్స్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఇటువంటి బలహీనమైన, రహస్య పదాలను హ్యాకర్లు ఊహిస్తుంటారు. సాధారణంగా అన్నీ చిన్న అక్షరాలు కలిగి ఉన్న ఆరు నుంచి పది అక్షరాలు ఉండే పాస్ వర్డ్స్ ట్రాక్ చేసేందుకు సైబర్ సెక్యూరిటీ టూల్స్ కు పది నిమిషాలు పడుతుందని సింగపూర్ సెక్యూరిటీ ట్రెండ్ మైక్రో జనరల్ మేనేజర్ డేవిడ్ షా చెప్తున్నారు. అయితే వాటిలో ఓ పెద్ద అక్షరం కలపడం, సింబల్స్ వంటివి కలపడం వల్ల హ్యాక్ చేసేందుకు కనీసం రెండున్నర రోజులు పడుతుందంటున్నారు. అలాగే ఆయా సంస్థలు బలమైన డేటాబేస్ వ్యవస్థను కలిగి ఉండటం కూడ చోరీ కాకుండే ఉండేందుకు సహకరిస్తుందంటున్నారు మరో నిపుణుడు ఛార్లెస్ లిమ్. ముఖ్యంగా పాస్ వర్డ్స్ కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండి, లోయర్, క్యాపిటల్ లెటర్లతోపాటు నెంబర్లను, సింబల్స్ ను కలిపి క్రియేట్ చేసుకోవడం ఎంతో అవసరం అని ఆయన యూజర్లకు సలహా ఇస్తున్నారు. అలాగే తరచుగా పాస్ వర్డ్స్ మార్చుకుంటూ ఉండటం వల్ల కూడ హ్యాక్ చేసే అవకాశం ఉండదని, ఒకే పాస్ వర్డ్ ను అన్ని వెబ్ సైట్లలో వాడటం కూడ మానుకోవాలని సూచిస్తున్నారు. -
గ్రేటర్లో దూకుడుగా 'టీఆర్ఎస్'
-
'ఆస్కార్' బరిలో 12 నామినేషన్లతో
-
'ఆస్కార్' బరిలో 12 నామినేషన్లతో 'ది రెవనాంట్'
న్యూయార్క్: ఆస్కార్ అవార్డుల సీజన్ మొదలైంది. 88వ ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్ పొందిన చిత్రాల జాబితా విడుదలైంది. గురువారం ఈ జాబితాను విడుదల చేశారు. ఈసారి ఆస్కార్ అవార్డుల్లో సింహభాగం టైటానిక్ చిత్ర హీరో లియోనార్డో డికాప్రియో నటించిన ది రెవనాంట్ తన్నుకుపోయే అవకాశం ఉంది. ఈ చిత్రం మొత్తం 12 కేటగిరిల్లో ఆస్కార్ నామినేషన్ సాధించింది. 19వ శతాబ్దానికి చెందిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడువంటి 12 విభాగాల్లో నామినేషన్ పొందింది. ఇంకా నామినేషన్ పొందిన ఉత్తమ చిత్రాలను పరిశీలిస్తే.. ది రెవనాంట్ స్పాట్ లైట్ ది బిగ్ షార్ట్ మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ ది మార్టీయన్ బ్రూక్లిన్ బ్రిడ్జి ఆఫ్ స్పైస్ రూమ్ ఉత్తర దర్వకత్వ విభాగంలో.. అలెజాండ్రో జీ ఇనార్రిటు- ది రెవనాంట్ టామ్ మెక్ కార్తి-స్పాట్ లైట్ జార్జ్ మిల్లర్-మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ లెన్నీ అబ్రహాంసన్-రూమ్ అడామ్ మెక్ కే-ది బిగ్ షార్ట్ ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాంకెట్-కెరోల్ బ్రియే లార్సన్-రూమ్ చార్లోటి ర్యాంప్లింగ్-45 ఇయర్స్ సావోయిర్స్ రోనాన్-బ్రూక్లిన్ జెన్నిఫర్ లారెన్స్-జాయ్ లీడింగ్ యాక్టర్ విభాగంలో.. బ్రియాన్ క్రాంస్టన్ మట్ డామన్ లియోనార్డో డికాప్రియో మైఖెల్ ఫాస్ బెండర్ ఎడ్డీ రెడ్ మైనే -
వాళ్లు చనిపోయినా...
లాస్ ఏంజిల్స్ : ఏనుగు చచ్చినా...బతికినా ఒకటే విలువ అని తెలుగులో ఓ నానుడి. తాజా ఫోర్బ్స్ చనిపోయిన సెల్రబిటీ ధనవంతుల లిస్టు చూస్తే ఈ సామెత గుర్తు రాక మానదు. చనిపోయి తర్వాత కూడా కొంతమంది సెలబ్రిటీలు ఫోర్బ్స్ ధనవంతుల లిస్టులో చేరారు. తాజాగా ఆ జాబితాలో ఇపుడు హాలీవుడ్ స్టార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హీరో పాల్ వాకర్ చేరాడు. ఫోర్బ్స్ డెడ్ సెలబ్రిటీల లిస్ట్లో కొత్తగా చోటు సంపాదించి తొమ్మిదో స్థానంలో ఆక్రమించాడు. ఇప్పుడతను గడిచిన ఏడాది పాల్ వాకర్ పది మిలియన్ డాలర్లు ఆర్జించాడు. అటు పాప్ సంగీత రారాజు, మైఖేల్ జాక్సన్ వరుసగా మూడోసారి టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో ఎల్విస్ ప్రెస్లీ, ఛార్లెస్ ష్కల్జ్, బాబ్ మార్లే, ఎలిజబెత్ టేలర్ 5వ స్థానంలో కొనసాగుతుండగా, మార్లిన్ మాన్రో, జాన్ లెన్నాన్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ తదితరులు తరువాతి స్థానాలను ఆక్రమించారు. కాగా రెండేళ్ల క్రితం అంటే 2013లో హై స్పీడ్ కారు ప్రమాదంలో పాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ అనూహ్య పరిణామంతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. -
కరువు జాబితాలో 39 మండలాలే
చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా కరువు తాండవిస్తున్నా 39 మండలాలను మాత్రమే కరువు జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రకటించింది. జిల్లాలో 66 మండలాలుండగా రెండు నెలల క్రితం అధికారులు అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చాలంటూ నివేదికలు పంపించారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. కరువు మండలాలివే.. కలకడ, ఎర్రావారిపాళెం, కేవీపల్లె, పీటీ యం, వాల్మీకిపురం, పులిచెర్ల, గంగాధరనెల్లూరు, సోమల, సీజీ గల్లు, బెరైడ్డిపల్లె, వి.కోట, బంగారుపాళెం, గుడుపల్లె, తంబళ్లపల్లె, శాంతిపురం, కురబలకోట, కలికిరి, యాదమరి, రొంపిచెర్ల, పూతలపట్టు, ఐరాల, కుప్పం, తవణంపల్లె, మదనపల్లె, చౌడేపల్లె, సదుం, నిమ్మనపల్లె, రేణిగుంట, ఏర్పేడు, పాకాల, పుత్తూరు, వడమాలపేట, రామచంద్రాపురం, తొట్టంబేడు, గంగవరం, పీలేరు, పుంగనూరు, పెద్దమండ్యం, గుర్రంకొండ. -
జాబితా సిద్ధం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తొలి అంకం పూర్తయింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల జాబితా కొలిక్కి వచ్చింది. వారం రోజులుగా ఆశావహుల జాబితాను వడపోసిన జిల్లా మంత్రి మహేందర్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించిన జాబితాను ప్రభుత్వానికి పంపారు. దసరా కానుకగా నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి విడత మార్కెట్, దేవాదాయ కమిటీలకు పాలకవర్గాలను నియమించాలని సీఎం ఆదేశించారు. దీంతో స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్సీల సిఫార్సుల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల కూర్పును పూర్తి చేశారు. కొన్నిచోట్ల ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో వాటిని పెండింగ్లో పెట్టారు. ఏకాభిప్రాయం సాధించిన కమిటీలను మాత్రం తొలివిడతలో ప్రకటించేందుకు అనువుగా ప్రభుత్వానికి నివేదించారు. నామినేటెడ్ పదవుల్లో కూడా తొలిసారి రిజర్వేషన్లను వ ర్తింపజేస్తుండడంతో కొన్ని చోట్ల పోటీ తీవ్రంగా ఉండగా, మరికొన్ని చోట్ల రేసుగుర్రాల సంఖ్య నామమాత్రంగానే ఉంది. ఈ పరిణామం అధికారపార్టీ నేతలకు కొంత ఇష్టంగాను.. కొంతకష్టంగాను పరిణమించింది. పాత, కొత్తలతో తలనొప్పి! నామినేటెడ్ పదవుల పంపకం ప్రజాప్రతినిధులకు తలనొప్పి కలిగించింది. టీఆర్ఎస్ పార్టీ తొలిసారి అధికారంలోకి రావడంతో ఈ పదవులపై ఆశలుపెట్టుకున్న వారి సంఖ్య గణ నీయంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలకు ఈ పదవులపై కన్నేశారు. అదేసమయంలో ఎన్నికల వేళ.. ఆ తర్వాత కారెక్కిన నాయకులు కూడా పోస్టులను తన్నుకుపోయేందుకు తమవంతు పైరవీలు మొదలు పెట్టారు. ఈ పరిణామం పార్టీ నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారింది. ఇబ్రహీంపట్నం, వికారాబాద్, మర్పల్లి, నార్సింగి తదితర మార్కెట్ కమిటీల నియామకాల్లో ఈ సమస్య తలెత్తింది. పాత, కొత్త నాయకులు పట్టుసాధించేందుకు ఎవరికివారు ప్రయత్నాలు సాగిస్తుండడంతో పదవుల పంపకం సవాల్గా మారింది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని పోస్టులను భర్తీ చేశారు. నార్సింగి, గడ్డిఅన్నారం పెండింగ్ నార్సింగి, గడ్డి అన్నారం మినహా అన్ని వ్యవ సాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాల జాబితాను ప్రభుత్వానికి పంపారు. ఈ రెండింటి విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో పెండింగ్లో పెట్టినట్లు తెలిసింది. ఇదిలావుండగా, కొత్తగా ఏర్పడిన మహేశ్వరం మార్కెట్కు కొత్త పాలకవ ర్గానికి సంబంధించిన సాంకేతిక సమస్య తలెత్తడంతో పక్కనపెటినట్లు సమాచారం. కాగా, మార్కెట్ కమిటీల జాబితాను ప్రభుత్వానికి పంపామని, లాంఛనాలు పూర్తయిన తర్వాత కమిటీలను ఏ క్షణాన్నైనా అధికారికంగా ప్రక టించే అవకాశముందని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
నెలాఖరులోగా 100 స్మార్ట్ సిటీల జాబితా
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్మార్ట్ సిటీల జాబితా ప్రకటన ఖరారయింది. సెప్టెంబర్ ఒకటి లోగా అన్నిరకాల కమ్యూనికేషన్ వ్యవస్థలను అనుసంధానించిన 100 స్మార్ట్ సిటీల జాబితాను ప్రకటిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. స్మార్ట్ సిటీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. స్మార్ట్ సిటీల జాబితా ప్రకటనకు సంబంధించిన విషయాలను మీడియాకు వివరించారు. 'ప్రాథమికంగా 20 నగరాలను ఎంచుకుని అన్నిరకాల కమ్యూనికేషన్లను ఒక తాటిపైకి తెచ్చాం.. ఆ తరువాత 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా మలిచాం. ఇక మిగిలింది అధికారిక ప్రకటనే. భవిష్యత్తో మరిన్ని పట్టణాలను స్మార్ట్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది' అని వెంకయ్య పేర్కొన్నారు. -
వెలగని దీపం
లబ్దిదారుల ఎంపికలో జాప్యం 23 మండలాల నుంచే లబ్దిదారుల జాబితాలు అధికార పార్టీ నేతల సిఫారసులతో ఆలస్యం అధికారుల నిర్లక్ష్యంతో మరింత జాప్యం కరీంనగర్ (ముకరంపుర) : పొగ పొయ్యితో ఆడపడుచులు అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో నిరుపేద కుటుంబాలకు దీపం పథకం ద్వారా ఉచి తంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించాలన్న సర్కారు లక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. గ్యాస్ కనెక్షన్లు మంజూరై, మండలాల వారీగా లక్ష్యా లు కేటాయించి మూడు నెలలవుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ గ్యాస్ అందకపోవడం గమనార్హం. మార్చిలో నియోజకవర్గానికి 5 వేల చొప్పున జిల్లాలోని 13 నియోజకవర్గాలకు 65 వేల కనెక్షన్లను ప్రభుత్వం మంజూరీ చేసింది. దరఖాస్తులు స్వీకరించి మూడు నెలలు గడిచినా అర్హులైన వారి తుదిజాబితాను ఇంతవరకు ఖరారు చేయలేదు. తుది జాబితాను ఆమోదించి గ్యాస్ ఏజెన్సీలకు పంపిన అనంతరం జిల్లా మంత్రి సై అనే వరకు లబ్దిదారులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీపం కనెక్షన్లు మంజూరు చేసేందుకు ప్రత్యేక కమిటీ లబ్దిదారులను ఎంపిక చేస్తుంది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. మండల స్థాయిలో ఎంపిక బాధ్యతను ఎంపీడీవోలకు కట్టబెట్టారు. గ్రామ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్న నిబంధనలకు స్వస్తి పలికారు. స్థానిక అధికార పార్టీ నాయకుల సిఫారసులు, సర్పంచ్ నివేదించిన జాబితాల మేరకు ఎంపీడీవోలు లబ్దిదారుల తుదిజాబితా రూపకల్పనలో జాప్యం చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా యంత్రాంగానికి 23 మండలాలకు సంబంధించిన తుదిజాబితా మాత్రమే చేరింది. గ్రామాల నుంచి వచ్చిన జాబితాను ఆధార్ ప్రామాణికంగా డేటా ఎంట్రీ పూర్తి చేసి జిల్లా పౌరసఫరాల శాఖ కార్యాలయానికి పంపించాల్సి ఉంది. మిగిలిన మండలాల్లో తుదిజాబితా రూపకల్పన మొదలు పెట్టకపోగా, గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన జాబితా కూడా చేరలేదని తెలుస్తోంది. జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 12,35,838 కుటుంబాలున్నాయి. అందులో 7,80,499 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 4,55,339 కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేవని తేలింది. ప్రభుత్వం మంజూరు చేసిన 65 వేల కనెక్షన్లకు జిల్లాలో 1.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మహిళా సంఘాలకు ప్రాధాన్యమిస్తూ 25 శాతం ఎస్సీలు, 16 శాతం ఎస్టీలు, మైనారిటీలకు గ్యాస్ కనెక్షన్ అందించాలని నిర్ణయిం చారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము ఒక్కో కనెక్షన్కు రూ.1600 చొప్పున మొత్తం 65వేల కనెక్షన్లకు రూ.10.40 కోట్లు అందజేసింది. ఏప్రిల్ 17 నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నిర్ణీత గడువు దాటినా దీపం కనెక్షన్ల పంపిణీ కొలిక్కి రాలేదు. దీపం పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు జారీ చేసి ఖాళీ సిలిండర్, రెగ్యులేటర్ అందజేస్తారు. లబ్దిదారులు కనెక్షన్ డాక్యుమెంట్, పాస్బుక్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ. మైనారిటీలు గతంలో ప్రభుత్వం నుంచి దీపం పథకం ద్వారా లబ్దిపొందనివారు, గ్యాస్ కనెక్షన్ తీసుకునేందుకు డబ్బు వెచ్చించలేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులు. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితా ఎంపీడీలకు చేరుతుంది. అక్కడ ఖరారు చేసిన తుదిజాబితా జిల్లా పౌరసరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీలకు చేరాల్సి ఉంటుంది. అరుుతే కమిటీ చైర్మన్ ఉన్న కలెక్టర్ నుంచి లబ్దిదారుల జాబితాకు జిల్లా మంత్రికి నివేదించి, ఆయన ఆమోదించిన తర్వాతనే కనెక్షన్లు అందించే అవకాశముంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మేల్కోవాల్సి ఉంది. మంజూరైన కనెక్షన్లు-65,000 ఒక్కో నియోజకవర్గానికి-5,000 వచ్చిన దరఖాస్తులు-1,54,000 -
అలా... వద్దండోయ్!
స్టడీ మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అనేది వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా ఉంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా మరచిపోవడం అనేది జరుగుతుంటుంది. జ్ఞాపకశక్తి లోపించడానికి చెప్పుకునే ‘నిర్దిష్టమైన కారణాలు’ జాబితాలో కొత్తవి కూడా చేరుతున్నాయి. తాజా విషయం ఏమిటంటే, జంక్ ఫుడ్ తినడం అనేది జ్ఞాపకశక్తిపై ప్రతికూలమైన ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనం తెలియజేస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ‘‘ప్రతి రోజు జంక్ఫుడ్ తినడం వల్ల... జస్ట్ ఒక వారం వ్యవధిలోనే దాని ప్రభావం జ్ఞాపకశక్తిపై ప్రతికూలంగా ఉంటుంది’’ అంటున్నారు పరిశోధకులు. కొన్ని ఎలుకలపై తమ ప్రయోగాన్ని నిర్వహించారు. కొసరు చైన్ స్మోకర్లు మాత్రమే కాదు... అప్పుడప్పుడూ సిగరెట్లు తాగే వారి జ్ఞాపకశక్తిపై కూడా పొగతాగడం అనేది ప్రతికూల ప్రభావం చూపుతుందని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధన చెబుతుంది. మెదడుకు చేరే ఆక్సిజన్ పరిమాణాన్ని ధూమపానం తగ్గించడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందంటున్నారు పరిశోధకులు. -
దగాపడ్డ అన్నదాత
జిల్లాలో రుణమాఫీ మాయ 8,70,321 మందికి గాను 3,57,457 మందికే వర్తింపు రెండో విడతలో 50,913 మందికే చిత్తూరు: రుణమాఫీ పేరుతో సొంత జిల్లాలోని రైతులను సీఎం చంద్రబాబునాయుడు వంచించారు. 90 శాతం మందికి మాఫీ వర్తింపచేశామని గొప్పలు చెబుతున్న సీఎం 40 శాతం మంది రైతులకు కూడా వర్తింపచేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత డిసెంబర్ 31నాటికి జిల్లాలో 8,70,321 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రూ.11,180.25కోట్ల వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం కేవలం 3,57,457 మంది మాత్రమే రుణమాఫీకి అర్హులని తేల్చింది. మొదటి విడతలో 3,06,544 మంది, రెండో విడతలో 50,913 మంది అర్హులంటూ జాబితాను విడుదల చేసింది. రెండో విడతలో 1,42,229 మందికి రుణమాఫీ ఉంటుందని ప్రభుత్వం తొలుత ప్రకటించినా కేవలం 50,913 మందికి మాత్రమే వర్తింపచేసింది. జిల్లాలో 11,180.25 కోట్ల రుణా లు తీసుకోగా ప్రభుత్వం కేవలం 1,383.73 కోట్లు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు లెక్కలు తేల్చింది. ఇందులో ఇప్పటివరకు కేవలం 456.44 కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన మొత్తం ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదు. రుణాలు పొందిన వారిలో 40 శాతం మందికి కూడా రుణమాఫీ వర్తించలేదు. తొలుత ఒక్కొక్క కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఆ తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ రైతన్నలను చావుదెబ్బకొట్టారు. తొలుత 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్ కార్డులు, రేషన్కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి ఆ మేరకు రైతులందరూ మాఫీకి అర్హులుగా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. చివరకు కేవలం 3,57,457 మందికి మాత్రమే రుణమాఫీ వర్తింపజేసింది. ఇదిలావుండగా రుణమాఫీలో నెలకొన్న జాప్యం కారణంగా జిల్లా రైతులపై రూ.9.39 కోట్ల మేర అపరాధ వడ్డీభారం పడినట్లు బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. బంగారు నగల వేలం జిల్లాలో 4,53,162 మంది రైతులు బంగారు ఆభరణాలను వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. రుణాలను మాఫీ చేసి బంగారం తిరిగి ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారు. తర్వాత రూ.50 వేల లోపు బంగారు రుణం మాఫీ చేస్తానని చెప్పినా అది కూడా అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే పలు బ్యాంకులు రైతులకు నోటీసులిచ్చాయి. గడువులోపు రుణాలు చెల్లించకపోతే బంగారు వేలం వేస్తామని పత్రికా పక్రటనలు కూడా ఇచ్చాయి. కరువు పుణ్యమా అని అన్నదాతలు రుణాలు చెల్లించి బంగారం విడిపించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ తీరుపై వారు మండిపడుతున్నారు. -
తెలుగు తమ్ముళ్లకు దీపం
గ్యాస్లోనూ ‘పచ్చ’ముద్ర సభలకు మంగళం జన్మభూమి కమిటీలదే పెత్తనం ఎమ్మెల్యేల ఇళ్లల్లో జాబితాల తయారీ విశాఖపట్నం: ఏ నిధులు వచ్చినా..ఏ పథకానికి శ్రీకారం చుట్టినా అవి పచ్చనేతల సంక్షేమం కోసమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. రాకరాక వచ్చిన అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డంగా దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. నిబంధనలను సైతం పక్కన పెట్టి వచ్చినవన్నీ పంచు కోవడమే తెలుగుతుమ్ముళ్ల లక్ష్యంగా మారింది. తాజాగా దీపం గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ వరసలోకే చేరింది. జిల్లాకు 15,481 గ్యాస్కనెక్షన్లు మంజూరయ్యాయి. కానీ ఇవేమీకొత్తగా మంజూరు చేసినవేమి కావు. గత కాంగ్రెస్ సర్కార్ హయాంలో రాష్ర్ట ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం వల్ల మంజూరు చేయకుండా నిలిపివేసిన వేలాది కనెక్షన్లను ఇప్పుడు తామేదో కొత్తగా మంజూరు చేస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తూ పంపిణీకి సన్నద్ధం చేశారు. ఎన్నికల ముందు ఎంపికైన లబ్ధిదారులంతా ఈ కనెక్షన్ల కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని గ్యాస్ కంపెనీల చుట్టూ ఇన్నాళ్లు తిరిగారు. కానీ ఈ జాబితాలనుపక్కన పెట్టేసిన టీడీపీ సర్కార్ కొత్తగా అర్హుల జాబితా ఎంపిక కోసం గతనెల 21వ తేదీన జీవో నెం-2 ను జారీచేసింది. ఈ జీవో ప్రకారం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను గ్యాస్కంపెనీలు, పౌరసరఫరాలు, రెవెన్యూశాఖాధికారులుకు అప్పగించారు. ఇదంతా సర్పంచ్ అధ్యక్షతన జరిగే గ్రామసభ సమక్షంలోనే జరగాలి. ఇలా అయితే తమ ముద్ర కనపడదనే భావనతో జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టేలా ఈ నెల 5వ తేదీన ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. జన్మభూమి కమిటీ పర్యవేక్షణలోనే దీపం లబ్దిదారుల ఎంపిక చేపట్టాలన్నది ఈ జీవో సారాంశం. వితంతువులు, వికలాంగులు, అల్పాదాయ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంది. కానీ గ్రామసభలోనే ఎంపిక జరగాలి..కచ్చితంగా నిబంధనలను పాటించాలి. కానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం తమ అనుచరులను ఈ జాబితాలో చేర్చి జన్మభూమికమిటీల ద్వారా ఆమోదముద్ర వేసి ఎంపీడీలకు ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే సభల్లోనే ఎంపిక జరిగినట్టుగా రికార్డులు సైతం సృష్టిస్తున్నారు. ఎవరైనా గట్టిగా అడిగితే ఎమ్మెల్యే గార్ని అడగండి అంటూ సలహా ఇస్తు న్నారు. ఈ నెలాఖరులోగా జాబీతాలు సిద్ధం చేసి వచ్చే నెలాఖరులోగా పంపిణీ పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ, ఎస్టీ, వితంతు, వికలాంగ లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. కంపెనీలిచ్చిన దరఖాస్తులన్నీ కార్యకర్తలు ఇచ్చి నింపుతున్నారు. వీరిలో చాలా మందికి గ్యాస్ కనెక్షన్లున్నప్పటికీ కుటుంబసభ్యుల పేరిట మరో కనెక్షన్లు తీసుకునేందుకు కార్యకర్తలు ఎగబడుతున్నారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇళ్ల వద్ద గ్యాస్ కనెక్షన్ల కోసం కార్యకర్తల సందడి కనిపిస్తోంది. -
ఈసీ కొరడా
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీరంగం నియోజకవర్గంలో భారీ సంఖ్యలో నకీలీ ఓటర్లున్నారని ఆరోపణలు వచ్చినందున కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా ఆదేశించారు. అనేక సవరణలతో ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని, ముఖ్యంగా ఉప ఎన్నికలు జరుగుతున్న శ్రీరం గం నియోజకవర్గ పరిధిలో 9 వేల మంది నకిలీ ఓటర్లు చేరిపోయారని డీఎంకే తరపున ఆ పార్టీ నేత ఆర్ఎస్ భారతి ఈనెల 19న ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సైతం సమర్పించింది. నకిలీ ఓటర్ల పేర్లను ఫొటోలతో సహా ఎన్నికల కమిషన్కు అందజేసింది. నకిలీ ఓటర్ల జాబితా సైతం సిద్ధం అవుతోంది. అయితే ఒకే ఊరును అనేక పేర్లతో పిలుస్తున్న కారణంగా నకిలీలను గుర్తించడం కష్టంగా మారింది. ఉప ఎన్నిక జరిగే శ్రీరంగంను తిరువరంగం అని కూడా సంబోధించడంతో ఇబ్బందులు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, న్యాయశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఊరిపేర్లను గుర్తించేందుకు ఒక బృందం సిద్ధమైంది. ఒక ఊరిని ఇలాగే పిలవాలి, రాతల్లో సైతం ఇలాగే పేర్కొనేలా ఉత్తర్వులను ఈ బృందం జారీ చేస్తుంది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు చేపట్టనున్నారని సందీప్ సక్సేనాను మీడియా ప్రశ్నించగా, డీఎంకే ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తిరుచ్చిరాపల్లి జిల్లా క లెక్టర్ను ఆదేశించానని తెలిపారు. ఈ ఆదేశాల మేరకు శ్రీరంగం నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశీలించి కొత్త జాబితాను సిద్ధం చేయనున్నామని తెలిపారు. ఒకే ఓటరు పేరు రెండుచోట్ల ఉండడం, మరణించిన వారు, ఇంటి చిరునామా మారిన వారి పేర్లను తొలగించకుంటే వారికోసం వేరుగా మరో జాబితాను సిద్ధం చేస్తామని చెప్పారు. శ్రీరంగంలో నామినేషన్ల దాఖలు ప్రారంభమైనందున ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగా నకిలీ ఓటర్లను గుర్తించి శ్రీరంగం నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్లకు వారి వివరాలను పంపుతామన్నారు. నకిలీ ఓటర్లు ఓటువేయకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఒకే ఊరికి రెండు మూడు పేర్లు ఉన్నందున తలెత్తిన ఇబ్బందులను అధిగమిస్తామని, అధికారికంగా ఊరిపేర్ల ఖరారు తరువాత మరింత మంది నకిలీ ఓటర్లను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తామని ఎన్నికల కమిషనర్ చెప్పారు. అలాగే ఈనెల 18వ తేదీ వరకు ఓటర్లుగా చేరిన వారికి కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తామని తెలిపారు. పరిశీలకునిగా శ్రీధర్ ధోరా శ్రీరంగంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల పరిశీలకునిగా శ్రీధర్ దోరాను నియమించామని, ఆయన 18వ తేదీ నుంచే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఏమైనా ఫిర్యాదులు చేయదలుచుకుంటే 9438917128 నెంబరుకు ఫోన్ చేయవచ్చని చెప్పారు. ప్రధాన పరిశీలకునిగా ఉత్తరప్రదేశ్కు చెందిన సింగ్ అనే ఐఆర్ఐ అధికారిని నియమించారని, ఈనెల 27న సింగ్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. అలాగే శ్రీరంగంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు చెక్పోస్టులతో నిఘా పెట్టినట్లు చెప్పారు. అవసరమైన పక్షంలో మరిన్ని ఫ్లయింగ్ స్క్వాడ్లను పంపుతామని తెలిపారు. -
రుణమాఫీ తీరుపై జనాగ్రహం
సాధికార సదస్సుల్లో నిలదీసిన రైతులు జాబితాలో పేర్లు లేవని మండిపాటు బ్యాంకుల వద్ద ఆందోళనలు చిత్తూరు: రైతురుణమాఫీ అమలు తీరుపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ నెల 11 నుంచి 16 వతేదీ వరకు ప్రభుత్వం గ్రామపంచాయతీ స్థాయిలో నిర్వహించిన రైతు సాధికార సదస్సులు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. రుణమాఫీ పత్రాలను అందించేందుకు వెళ్లిన అధికారులను రైతు లు అడుగడుగునా నిలదీశారు. ఎన్నికల్లో చెప్పిందేమిటి? ఇప్పుడు చేసిందేమిటి ? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘లక్షా ఏభై వేలు రుణం తీసుకుంటే..’ 10వేలు 12 వేలు మాఫీ చేస్తారా! అంటూ ప్రశ్నించారు. అర్హుల పేర్లు రుణమాఫీ జాబితాలో లేకుండా చేశారంటూ ధ్వజమెత్తారు. తొలుత సదస్సుల్లో కొన్ని చోట్ల రైతులు నిలదీయడంతో అధికారులు బెంబేలెత్తిపోయారు. రెండో జాబితాలో మీ పేర్లు వస్తాయం టూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. చాలా గ్రామాలకు అధికారులు వెళ్లిన పాపాన పోలేదు. కొన్ని చోట్ల రుణమాఫీ పత్రాలు మీరే ఇవ్వండంటూ రెవెన్యూ కార్యదర్శులకు అప్పగించగా, మరికొన్ని చోట్ల తెలుగు తమ్ముళ్ల స్వాధీ నం చేసినట్లు సమాచారం. మరికొందరు అధికారులు మాఫీ పత్రాలు రైతులకు మీరే ఇవ్వండంటూ ఆయా బ్యాంకుల్లోనే అప్పగించారు. కుప్పం మండలంలోని గుడ్లనాయనిపల్లెలో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమేకాక సదస్సును అడ్డుకున్నారు. అధికారులు రుణమాఫీ పత్రాలను స్థానిక వీఆర్వోకు అప్పజెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కుప్పం మండలం వానగుట్టపల్లె గ్రామ సదస్సులో రైతులు అధికారులను నిలదీశారు. ఇష్టానుసారం రుణమాఫీ చేస్తారా..! అంటూ విరుచుకుపడ్డారు. అధికారులు సదస్సు నిర్వహించకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు లో జరిగిన రైతు సదస్సులోనూ అధికారులను రైతులు నిలదీశారు. అక్కడి కార్పొరేషన్ బ్యాంకు,ఎస్బీఐ ఎదుట ఆందోళన నిర్వహించారు. పలమనేరు మండలంలోని టీ.వడ్డూరులో రైతులు రుణమాఫీపై అధికారులను నిలదీశారు. పుంగనూరు మండలం సోమలలో రైతులు అధికారులను అడ్డుకోవడంతో పాటు రుణమాఫీ జాబితా తప్పులతడకగా ఉందంటూ బ్యాంకువద్ద ధర్నా చేశారు. రుణమాఫీ పత్రాలు బ్యాంకుల్లో చెల్లుబాటుకావని బ్యాంకు అధికారులే చెబుతున్నారని అలాంటపపుడు ఈ పత్రాలు ఎందుకిస్తున్నారని పూతలపట్టు నియోజకవర్గంలో రైతులు నిలదీశారు. విజయపురం మండలంలో మంగళవారం చివరి రోజు జరిగిన రైతు సాధికారిక సదస్సులో రుణమాఫీ జాబితాలో మా పేర్లేవంటూ రైతులు అధికారులను గట్టిగా ప్రశ్నించడంతో వారు తరువాత జాబితాలు ఉన్నాయని, వాటిలో మీ అందరి పేర్లు వస్తాయంటూ నమ్మబలికి అక్కడి నుంచి ఎలాగో లా బయటపడ్డారు. -
గజి బిజి జాబితా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ప్రభుత్వం రుణమాఫీ చేస్తూ రైతులు తీసుకున్న రుణాలకు సంబంధించి వారి ఖాతాలకు డబ్బులు జమ చేసింది. అయితే ఈ జాబితాలు అంతా గందరగోళంగా తయారయ్యాయి. జిల్లాలో ఏడు లక్షల 495 రైతు ఖతాలుండగా కేవలం మూడు లక్షల 29 వేల మందికి మాత్రమే మొదటి జాబితాలో రుణమాఫీ జరిగింది. తమ రుణాలు మాఫీ అయ్యాయా లేదా తెలుసుకోవడానికి రైతులకు చుక్కలు కనపడుతున్నాయి. బ్యాంకులు, మీసేవా కేంద్రాలు, నెట్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో బ్యాంకుల వద్దకు చేరుకుని సమాచారం తెలుసుకునేందుకు పోటీ పడుతున్నారు. రుణ మాఫీకి సంబంధించిన ఆన్లైన్ సర్వర్ పనిచేయకపోవడంతో ఎలాంటి సమాచారం అందక ఆందోళన చెందారు. మద్దిపాడు మండలం నారా అంజిరెడ్డికి లక్ష రూపాయల మేర రుణమాఫీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అందులో వారికి 20 శాతం అనగా రూ. 19,800 వారి ఖాతాలలో జమయినట్లు చూపింది. కానీ అ రైతుకు ఇప్పటివరకు వడ్డీనే రూ. 23,000 కాగా కేవలం రూ.19,800 జమయినట్లు చూపటంతో వడ్డీ డబ్బులు కూడా రాలేదని విచారం వెలిబుచ్చాడు. వచ్చిన డబ్బు వడ్డీ కింద పోతే అసలు ఎలా పోతుందో అర్థం కావటంలేదని వాపోయాడు. అద్దంకికి చెందిన సుబ్బారావు మూడుసార్లు తన ఆధార్కార్డు, రేషన్ కార్డు పట్టాదారు పాసుపుస్తకాలను అధికారులకు అందజేశారు. అయినా రుణ అర్హత జాబితాలో అతని పేరు లేదు. పంట రుణం రూ. 30 వేలు, బంగారు రుణం రూ.60వేలు తీసుకున్న నాగరాజుకు పంట రుణం తాలూకూ ఖాతాకు కాకుండా, బంగారు రుణం ఖాతాకు తీసుకున్న రూ. 60 వేలకు వడ్డీతో కలిపి రూ.72 వేలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాతిపదికన రూ.14వేలు మాత్రమే మాఫీ అయింది. ఒకరి రేషన్ కార్డులు మరొకరికి మారాయి. దీంతో ఒకరికి చెందాల్సిన మాఫీ మరొకరి అకౌంట్లలోకి వెళ్ళిపోయింది. ముండ్లమూరు మండలం పసుపుగల్లుకు చెందిన చింతా చిన తిరుపతిరెడ్డి రేషన్ కార్డు నెంబరు అదే గ్రామానికి చెందిన చింతా వెంకట శ్రీనివాసరెడ్డికి వేయడంతో తిరుపతిరెడ్డికి చెందాల్సిన రూ.51672 శ్రీనివాసరెడ్డి జాబితాలోకి వెళ్ళాయి. తూర్పు వీరాయపాలేనికి చెందిన ముప్పరాజు శ్రీనివాసరావుకు చెందిన రేషన్ కార్డు నెంబరు చెర్వుకొమ్ముపాలేనికి చెందిన అదే పేరుగల వ్యక్తి వేయడంతో రూ.1.30 లక్షల మాఫీకి సంబంధించిన సొమ్ము చెర్వు కొమ్ము పాలేనికి చెందిన వ్యక్తి జాబితాలోకి వెళ్లిపోయింది. -
రుణమాఫీ జాబితాలెక్కడ?
ఏలూరు:జిల్లాలో రుణమాఫీకి అర్హులైన వారి జాబితాల ప్రకటనలో ఆలస్యంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. చంద్రబాబు ఆర్భాటపు ప్రకటన తప్ప ఆచరణలో అధికారులు మాత్రం వివరాలను అందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈనెల ఆరో తేదీన రూ.50 వేల లోపు రుణం మాఫీ అయ్యేవారి జాబితాలను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నప్పటికీ ఎక్కడా వాటి ఊసేలేదు. శ నివారమే ఈ జాబితాలను ప్రకటించాల్సి ఉంది. ఆదివారం అందరికీ సెలవు కావడంతో ఆరో తేదీన అధికారులెవరూ దీనిపై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. లీడ్బ్యాంక్ పరిధిలోని 510 బ్రాంచిల్లోను జాబితాలు ఆన్లైన్లో హైదరాబాద్ నుంచి వచ్చినప్పటికీ అవి బ్రాంచిల్లో ప్రదర్శనకు ఉంచలేదు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోను, 257 సోసైటీల పరిధిలోను అర్హుల జాబితాలు వచ్చినప్పటికీ అక్కడక్కడా మాత్రమే వీటిని ప్రదర్శనకు ఉంచారు. డీసీసీబీ పరిధిలో 2.06 లక్షల మందికి రూ.994 కోట్ల మేర రుణమాఫీ చేయాలని ప్రతిపాదించగా, ఇందులో 12వేల ఖాతాలకు ఆధార్ సమర్పించకపోవడంతో వాటిని రెండో విడతలో తీసుకునే అవకాశం ఉంది. కాగా రూ.50వేల లోపు రుణం తీసుకున్న వారి వివరాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. రుణమాఫీకి ఎంతమంది అర్హులనేది కూడా లీడ్బ్యాంకు అధికారుల వద్ద, డీసీసీబీ వద్ద సమాచారం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇంత ప్రతిష్టాత్మకమైన విషయంపై అధికారులు కనీసం వాకబు చేసే పరిస్థితిలో ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం నాటికి రూ.50వేల లోపు రుణమాఫీకి అర్హులెంతమనేది తేలే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికీ సమాచారం వెల్లడించలేని అధికారులు పదో తేదీలోగా రైతుల ఖాతాలకు ఆయా రుణమాఫీ సొమ్మును జమ చేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
తెలంగాణ ఓటర్లు 2.82 కోట్లు
పురుషులకన్నా మహిళా ఓటర్లే ఎక్కువ హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత తొలిసారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల 13వ తేదీన ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభంకాగా.. డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనుంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండే యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదుకు అర్హులు. అలాగే ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవడానికి, ఏవైనా సవరణలు చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం జిల్లాల వారీగా ముసాయిదా జాబితాలను ఆదివారం ప్రకటించింది. ఆ ముసాయిదా జాబితా ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,82,66,089. ఇందులో పురుష ఓటర్లు 1,44,42,254 మందికాగా.. మహిళా ఓటర్లు 1,38,21,536 మంది. మొత్తంగా మహిళా ఓటర్ల కన్నా పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. హిజ్రా ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో కన్నా తెలంగాణలో తక్కువగా ఉన్నారు. ఇక్కడ హిజ్రా ఓటర్ల సంఖ్య 2,299 మంది. -
5న రుణమాఫీ లబ్దిదారుల జాబితా ప్రకటన
-
5న రుణమాఫీ లబ్దిదారుల జాబితా ప్రకటన
హైదరాబాద్ : రుణమాఫీ లబ్దిదారుల జాబితాను ఏపీ సర్కార్ నవంబర్ 5నప్రకటించనుంది. పదో తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరించనుంది. అయితే, రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లబ్దిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ పేరుతో భారీ కోత పెడుతోంది. ఆధార్ కార్డు లేదని 18 లక్షలమంది అకౌంట్లను ఏపీ సర్కార్ తిరస్కరించింది. ఆధార్ కార్డుల సమర్పణకు శుక్రవారంతో బ్యాంకుల వద్ద గడువు ముగిసింది. దాంతో ఇకనుంచి గడువు పెంచలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. రుణమాఫీ లబ్దిదారుల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15 నుంచి తొలివిడత చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. రుణమాఫీతో 30లక్షల కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది కలుగుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అయితే, మొత్తం రుణాలున్న రైతుల్లో ఐదోవంతు మందికి మాత్రమే తొలి విడతలో రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించింది. దానికితోడు కుటుంబంలో ఒక్కరికే, ఒక్క రుణమే మాఫీ చేస్తామనడంతో డ్వాక్రా రుణాలు, పంట రుణాలు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల విషయం ఏమవుతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
ఇన్పుట్ సబ్సిడీ.. ఖజనాలో బందీ
చేప చేప ఎందుకు ఎండలేదు... అన్నట్లు పంటనష్ట పరిహారం పంపిణీలో ఇంత జాప్యానికి కారణమెవరు..? పరిహారపు జాబితాలో అనర్హులున్నారని నిలదీసిన రాజకీయ నేతలా...? అసలు పంట నష్టపోయిన రైతుల జాబితాలు సిద్ధం చేయని వ్యవసాయ శాఖనా...? క్షేత్రస్థాయిలో అనర్హుల ఏరివేతకు సహకరించని రెవెన్యూ శాఖనా..? బిల్లులు విడుదల చేయటంలో తాత్సారం చేస్తున్న ట్రెజరీ విభాగమా..? ఇంత జరుగుతున్నా పట్టింపు లేని అధికారులా..? కారణమెవరైనా.. సర్కారు విడుదల చేసిన ఇన్పుట్ సబ్సిడీ రెండు నెలలుగా ఖజానాలో మూలుగుతోంది. పంటనష్టంతో చితికిన అన్నదాతలకు అందని ద్రాక్షలా ఊరిస్తోంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : గత నెలలోనే రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన పరిహారం ఇప్పటికీ కలెక్టరేట్ ఖజానా దాటలేదు. గడిచిన అయిదేళ్లలో ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.105.92 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసింది. ఆగస్టులో వచ్చిన ఈ డబ్బు ఇప్పటికీ జిల్లా ఖజనాలోనే మూలుగుతోంది. స్వయానా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాలతో గత నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మాటిచ్చిన జిల్లా యంత్రాంగం ఇప్పటికీ అర్హులెవరంటూ ఆరా తీసే విచారణ పేరుతోనే సాగదీస్తోంది. నాలుగేళ్ల వ్యవధిలో వివిధ సందర్భాల్లో వడగళ్ల వానలు.. అకాల వర్షాలతో వరద నష్టంతో లక్షకుపైగా హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా 86,000 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. 1.80 లక్షల మంది రైతులు నష్టపోయిన జాబితాలో ఉన్నారు. 2009 నుంచి వరుసగా మూడు సీజన్లలో వడగళ్ల వానలతో 29,392 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 76,365 మంది రైతులు నష్టపోయారు. యాభై శాతానికి మించి నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. రైతుల జాబితాలను సైతం సిద్ధం చేసింది. వాటి ఆధారంగానే ఇన్పుట్ సబ్సిడీ పేరుతో ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఈ పరిహారం జాబితాలో అర్హులకు బదులు అనర్హులున్నారని, ఆదర్శ రైతులు ఇష్టమొచ్చిన పేర్లు రాసుకున్నారని గత నెలలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రతిపక్ష, అధికారపక్ష నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్ కేవలం అర్హులైన రైతులకు మాత్రమే పరిహారం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్ వీరబ్రహ్మయ్య పంట నష్టపోయిన రైతుల జాబితాలను విచారణ చేయాలని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. 1బీ రిజిస్టర్ ఆధారంగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. సెప్టెంబర్ 23వ తేదీవరకు అర్హులను గుర్తించి 30 లోగా రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేయాలని గడువు విధించారు. కానీ.. ఈ విచారణ ఇప్పటికీ సాగుతూనే ఉండటం రైతుల పాలిట శాపంగా మారింది. మొత్తం రూ.105.92 కోట్లలో కలెక్టర్ విచారణకు ఆదేశించకముందే మొదటి విడతగా ప్రభుత్వం విడుదల చేసిన రూ.18.86 కోట్లు పంపిణీ జరిగింది. దాదాపు 76,365 మంది రైతుల ఖాతాల్లో జమయింది. మిగిలిన రూ.87.09 కోట్ల పంపిణీకి సంబంధించిన విచారణ మొదలైంది. మండలాల్లో రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ ప్రక్రియ నత్తనడక పట్టింది. ఇప్పటివరకు జిల్లాలో కేవలం 10 మండలాల్లోనే పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. పలుచోట్ల అనర్హులున్నట్లు గుర్తించారు. ఈ లెక్కన మిగతా మండలాల్లో విచారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు పరిహారం రైతులకు అందే పరిస్థితి లేదు. కనీసం అర్హుల జాబితాలు సిద్ధమైన మండలాల్లో పంపిణీకి వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ట్రెజరీ దాటడం లేదు. నిబంధనల ప్రకారం వ్యవసాయ శాఖ పరిహారం చెల్లింపునకు సంబంధించి మండలాల వారీగా ప్రొసీడింగ్లు, బిల్లులను తయారు చేసి ట్రెజరీకి అప్పగించాలి. అప్పుడు బిల్లు పాస్ అవుతుంది. జిల్లాలోని నోడల్ బ్యాంకులో నిధుల జమ అవుతాయి. అక్కణ్నుంచి రైతుల ఖాతాలున్న బ్యాంకు బ్రాంచీలకు బదిలీ అవుతాయి. అసలు బిల్లులే ఇవ్వకుంటే డబ్బులెలా ఇస్తామని ట్రెజరీ అధికారులు తప్పును వ్యవసాయ శాఖ అధికారులపైకి నెట్టేస్తున్నారు. మండలాల వారీగా ఎప్పటికప్పుడు బిల్లులు ఇస్తున్నామని వ్యవసాయ శాఖ తేల్చేస్తోంది. కారణమేదైనా.. పట్టింపులేని తనం ఎవరిదైనా... జిల్లా అధికారుల నిర్వాకంతో సకాలంలో బాధిత రైతులకు ఈ పంపిణీ చేయాల్సిన వ్యవసాయ, రెవెన్యూ శాఖలు ఇప్పటికీ విచారణ పేరుతో కాలాతీతం చేస్తున్నాయి. -
స్మార్ట్ సిటీల జాబితాలో నెల్లూరును చేర్చాలి
కోట: కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో నెల్లూరుకు స్థానం కల్పించేలా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బాధ్యత తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దేశ వ్యాప్తంగా వంద స్మార్ట్సిటీల అభివృద్ధికి ఏడు వేల కోట్లు కేటాయిస్తూ కేంద్రం ప్రకటిం చిం దని, స్మార్ట్ సిటీల జాబితాలో నెల్లూరుకు స్థానం కల్పించకపోవడం అం దరిని బాధించిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోటలో శనివారం జరిగిన పార్టీ కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంటనే ప్రధాన మంత్రి దృష్టికి తీసుకె ళ్లి నెల్లూరును స్మార్ట్ జాబితాలో చేర్చేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. నగరాన్ని స్మార్ట్సిటీగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. జిల్లా వైఎస్సార్ సీపీకి కంచుకోటగా పేర్కొన్నారు. దుగ్గరాజపట్నం పోర్టుపై సందేహా లు ఉన్నా టీడీపీ నాయకులు మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లా మంత్రి అనుభవ రాహిత్యం కారణంగా దుగ్గరాజపట్నం పోర్టు, ఎరువుల కర్మాగారం, విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. రుణమాఫీపై ప్ర స్తుత పరిస్థితి కొనసాగితే రైతులే చంద్రబాబుకు రాజకీయంగా ఉరి వేస్తారని హెచ్చరించారు. అధికారులూ పొరపాట్లు చేయకండి : ఎమ్మెల్యే సునీల్ ఎమ్మెల్యే గ్రాంటుని ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేక పోవడంలో ఎంపీ,జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతామని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ తెలిపారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరిం చాలని సూచించారు. నియోజకవర్గంలో కొన్ని రాజ్యాంగేతర శక్తులు పెత్తనం చేయడానికి చూస్తున్నాయ ని వాటికి సహరించవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్కుమార్రెడ్డి, మం డల ఉపాధ్యక్షుడు మధు, కోట స ర్పంచ్ రాఘవయ్య,చిట్టేడు సర్పం చ్ రాము,సన్నారెడ్డి శ్రీనివాసులురె డ్డి, దువ్వూరు రాజగోపాల్రెడ్డి పాల్గొన్నారు. తెలివైన మోసగాడు బాబు వాకాడు : ప్రపంచంలో తెలివైన మోసగాడు ఎవరైనా ఉంటే అది చంద్రబాబేనని ప్రసన్నకుమార్రెడ్డి అభివర్ణించారు. రుణమాఫీ పేరుతో ప్రజలను మభ్యపెట్టాడన్నారు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నెల రోజుల్లో పార్టీ అన్ని కమిటీలను నియమిస్తామని చెప్పారు. పార్టీకి అనుబంధంగా చేనేత,మత్స్యకారుల కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రసన్నను అభినందించిన నేదురుమల్లి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఎన్ ప్రసన్నకుమార్రెడ్డిని పార్టీ సీనియర్ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి అభినందించారు. వాకాడులోని తన నివాసంలో ప్రసన్నకు శాలువా కప్పి సత్కరించారు. మొదట పద్మనాభరెడ్డి ఆరోగ్య పరిస్థితిని ప్రసన్న వాకబు చేశారు. ఆయన వాకాడు మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయశేఖర్రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్కుమార్రెడ్డి, దొరవారిసత్రం నేత బాలచంద్రారెడి,్డ పెళ్లూరు కోటీశ్వరరెడ్డి, చంద్రమౌళిరెడ్డి, నెల్లూరు పెంచలరెడ్డి, యల్లంటి వెకటసుబ్బారెడ్డి,కాశీపురం శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
తేలని కచ్చితమైన లెక్క
నల్లగొండ అగ్రికల్చర్ : రైతుల రుణమాఫీపై ఇంకా కచ్చితమైన లెక్క తేలలేదు. రూ.లక్షలోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. రూ.లక్షలోపు రుణం తీసుకుని రుణమాఫీ అర్హత పొందిన లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి ఆదివారం వరకు కలెక్టర్, జేడీఏకు అందజేయాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కానీ బ్యాంకర్లు మండలాలు, గ్రామాల వారీగా రూ.లక్షలోపు రుణమాఫీకి అర్హత పొందిన రైతుల జాబితాలను తయారు చేసేటప్పుడు కొన్ని తప్పిదాల వల్ల చాలామంది రైతుల పేర్లు జాబితాలో లేకుండాపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కలిపి రూ.లక్షలోపు రుణమాఫీకి అర్హత పొందిన వారు సుమారు 5లక్షల మంది రైతులున్నట్టు తెలుస్తోంది. వీరికి సంబంధించి రూ.2756 కోట్ల మేరకు పంటరుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మండల, గ్రామాల వారీగా రుణమాఫీకి అర్హత పొందిన రైతుల జాబితాలను రెండు మూడు రోజుల నుంచి ఆయా గ్రామ పంచాయతీల వద్ద అతికిస్తున్నారు. తమ పేర్లు జాబితాలో లేవని చాలా గ్రామాలలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలు తెలియజేస్తే వాటిని స్వీకరించి అర్హత ఉంటే తప్పక జాబితాలో చేర్చుతామని అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం నుంచి అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ జాబితాను సిద్ధం చేయనున్నారు. ఏదేమైనా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి రుణాలను పొందిన రైతుల వివరాలను సేకరిస్తే పక్కా సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు.. ముగ్గురు రుణాలను పొందడం, ఒక వ్యక్తి రెండు మూడు బ్యాంకులలో రుణాలను తీసుకున్న సంఘటనలు ఉన్న నేపథ్యంలో తుది జాబితా తయారు కావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఎన్ని బ్యాంకులలో రుణాలను తీసుకున్నా, ఇద్దరు ముగ్గురు రుణాలను తీసుకున్నా ఒక్కో కుటుంబంలో రూ.లక్షలోపు వరకే రుణాన్ని మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. -
రెణ్ణిమిషాల జాబితా
ప్రార్థన వరుసగా ‘ఐదు రోజులు’ సెలవులు రావడంతో- పిల్లలు ఊరెళ్లారు. పుస్తకాలు రంజింపజేయలేని ఒంటరితనం! ఈ ఆదివారపు నిరర్థకమైన పగటిపూటకు నన్ను అక్కున చేర్చుకోగలిగేవారెవరు? లక్కీగా అజయ్ ఖాళీగావున్నాడు. పైగా ఇలాంటి పిలుపుకోసమే ఎదురుచూస్తున్నాడు. ఇంకేం! ఇద్దరమూ అనంతగిరి వెళ్లిపోయాం. వికారాబాద్ ఎర్రటినేలలు, కడిగినట్టున్న నల్లటి రోడ్లు, పచ్చటి ఆకులు, మసక మసక కొండల అంచులు, ఊయలలూగనిచ్చే గిల్లీ తీగలు, గుహను తొలిచిన మున్యాశ్రమం, కోనేటిపక్కన వాల్చిన నడుము, అడ్డంగా పరుగెత్తిన ముంగిస, సాగినంత నడక, పీల్చుకోగలిగినంత గాలి, వర్షం పడీపడనట్టున్న సుతిమెత్తటి వాతావరణం... మేము ఆశించినదానికంటే దొరికింది చాలా ఎక్కువ! దానికి ‘కృతజ్ఞతగా’ మెట్లు ఎక్కీ దిగీ ఆలయంలోకి వెళ్లాం. సన్నని ద్వారంగుండా దిగువకు, లోపలికి ప్రవేశించాం. పలుచటి జనంతో అనంతపద్మనాభ స్వామి! పూజారి - మంత్రాలేవో చదువుతున్నాడు. ముందున్నవాళ్లు శ్రద్ధగా వింటున్నట్టున్నారు. నా పక్కనున్న అజయ్ దండం పెట్టుకోవడానికి చేతులు ముడుస్తున్నాడు. అయితే, దేవుడి దగ్గర తనకు అహం ఏమీలేదన్నమాట! నేనేం చేయను? ఒకటేదో కోరుకోవాలి; నాకు సంబంధించినవాళ్లందరికీ శుభం కలగాలి. రెండు నిమిషాలు(!) కళ్లు మూసుకున్నాను. అమ్మ, బాపు, తమ్ముడు, పిల్లలు, చెల్లి, వాళ్ల పిల్లలు- వారిని పట్టించే ఆహార్యాలతో నా లోపల కదలాడారు. బంధువులు- మేనత్తలు, మామయ్యలు, వాళ్ల కుటుంబం, మా అత్తవాళ్లు, వదినలు... మా ఆఫీసు సహచరులు- ఎం, వై, 1, 2, 3, 4, 5... అక్క, బావ... ఐదో తరగతి దోస్తులు- రా, బా, ఎ, కె... ఆ వీళ్లు- నీ, పు, అ, కి... టెన్తు ఫ్రెండ్సు- శి, ప్ర, క్రా, సు, సా... డిగ్రీ, పాతాఫీస్, అక్కడ, అరే ఇటు, అటు... స్థలాన్ని దాటి కాలపు వేగంతో పేర్లు నాకు తగులుతూవున్నాయి. రా, సం, కు, మ, శ్రీ, భ... పేరునుంచి మరో పేరుకూ, ఊరినుంచి మరో ఊరికీ, పట్నం నుంచి నగరానికీ స్మరణ దూకుతూవుంది. ఇంకా ఎవరు? ఎల్, జె, బి, పి, ఎస్... ఇంకా ఎవర్ని మిస్సయ్యాను! నిజంగా నేను కోరుకోవడం వల్లే వాళ్లందరికీ మంచి జరిగేట్టయితే, నేను వాళ్లపేరు తలుచుకోకపోవడం న్యాయం కాదు కదా! పేర్లను తలుచుకుంటున్నప్పుడు కూడా కాలాన్ని లెక్కగట్టడం ఆపలేదు. రెణ్నిమిషాల అంచనాతో కళ్లు తెరిచాను. దేవుడు నన్ను సూటిగా చూస్తున్నట్టున్నాడు! ఇంకా ఎన్నో పేర్లు స్ఫురిస్తున్నాయి. మామూలుగా రోజూ మాట్లాడేవాళ్లు ఇందాక గుర్తురాలేదు. డి, ఐ, జె, వి, బి, ఎన్... ఇంకా, వెళ్తున్నప్పుడు ఉప్పు రాసి జామకాయలమ్మిన ముసలాయన... మమ్మల్ని ఆటోలో అంతదాక మోసుకెళ్లిన అమ్జాద్... అక్కడే డిపార్టుమెంటులో పనిచేసే యాదగిరి... నేను కోరుకోవడం వల్లే మంచి జరిగేట్టయితే- ఏ ఒక్కరినీ వదలకూడదని కదా నా ఆలోచన! నా స్మరణ ఎంత వేగంగా జరిగినప్పటికీ, కొన్ని పదులకొద్దీ పేర్లను తలచుకున్నప్పటికీ, ఇంకా ఎన్నో పేర్లు నేను ఆ క్షణంలో మరిచిపోయాను. అలాంటిది, ఈ భూమ్మీది కోటానుకోట్ల మనుషుల్నీ, మనుషుల్నే కాకుండా సకల చరాచర జీవరాశుల్నీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడా? ఒకవేళ మరిచిపోతే? గుర్తుపెట్టుకుంటేగనక ఆయన కచ్చితంగా దేవుడే అయ్యుండాలి! - పూడూరి రాజిరెడ్డి -
30న మంత్రివర్గ విస్తరణ!
-
స్విస్ అభ్యంతరాలు చెబుతోంది: జైట్లీ
న్యూఢిల్లీ: అక్రమ బ్యాంకు ఖాతాల జాబితాను ఇవ్వాలని సిట్జర్లాండ్ను కోరితే.. ఆ దేశం న్యాయపర అభ్యంతరాలు లేవనెత్తుతోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. శుక్రవారం లోక్సభలో స్విస్ బ్యాంక్ అకౌంట్లపై చర్చలో ఈ విషయం చెప్పారు. అయితే అక్రమ ఖాతాదారులకు సంబంధించి సాక్ష్యాలు సంపాదించేందుకు ఆ దేశం నుంచి ఖాతాల జాబితాను రప్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. స్విస్ అధికారులతో సంప్రదింపుల నేపథ్యంలో ఆ దేశ న్యాయసూత్రాలను అనుసరించి ఒక ఒప్పందం కూడా చేసుకోబోతున్నామని వెల్లడించారు. స్వభావరీత్యా అది భవిష్యత్ ఖాతాలకు సంబంధించినది కావడంతో గత ఖాతాల వివరాలు వెల్లడించడానికి స్విట్జర్లాండ్ సహకరించడంలేదన్నారు. -
30న మంత్రివర్గ విస్తరణ!
ఆరుగురిని తీసుకునే వీలున్నా.. ఐదుగురితోనే సరిపెట్టనున్న సీఎం కేసీఆర్ ఈ సారి జూపల్లికి కచ్చితంగా స్థానం! విస్తరణలో ఎస్టీ సామాజిక వర్గానికి అవకాశం మహిళల్లో చోటు ఒకరికా.. ఇద్దరికా? హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఈ నెల 30వ తేదీన విస్తరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల చివరివారంతో ఆషాఢ మాసం పూర్తవుతుందని.. ఆ తరువాత ఒకటిరెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణను చేపట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సన్నిహితులు వెల్లడించారు. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది ఉన్నారు. మరో ఆరుగురిని కేబినెట్లోకి తీసుకోవడానికి వీలుంది. ఐదుగురితోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, కొంతకాలం తర్వాత మరొకరికి మంత్రిగా అవకాశమివ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా వారు చెబుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇద్దరిని కేబినెట్లోకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లా విషయంలో సీఎం కేసీఆర్ మదిలో ఉన్నదేమిటో ఎవరికీ తెలియ డంలేదు. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్కు జలగం వెంకట్రావు ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు సామాజిక వర్గం ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఇప్పటికే ఆ సామాజికవర్గం నుంచి సీఎం కేసీఆర్ సహా హరీశ్రావు, కేటీఆర్ మంత్రివర్గంలో ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి మాత్రం అదే సామాజికవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గంలో కచ్చితంగా అవకాశం దక్కనుంది. తొలి మంత్రివర్గ ఏర్పాటులోనే జూపల్లికి అవకాశం వస్తుం దని అంచనా వేసినా... ఆ సామాజికవర్గం నుంచి ఎక్కువమంది అవుతున్నారనే ఏకైక కారణంతో అప్పుడు వాయిదా వేశారు. దాంతో.. ‘ఉద్యమంలో ఉన్నప్పుడు అవరోధం కాని కులం మంత్రివర్గంలో స్థానం అనే సరికి అవరోధం అవుతుందా? మంత్రి పదవిని, కాంగ్రెస్ని వదిలిపెట్టి ఉద్యమంలోకి వచ్చిన నాకు తెలంగాణ రాష్ట్రంలో లభిస్తున్న గౌరవం ఇదేనా?’ అని జూపల్లి ఇప్పటికే తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. మహబూబ్నగర్ జిల్లా నుంచి సి.లక్ష్మారెడ్డికి కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. పెరుగుతున్న ఆశావహుల జాబితా.. మంత్రివర్గం విస్తరణలో జాప్యం పెరుగుతున్న కొద్దీ ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రెండు, మూడేళ్లు నిరీక్షించి ఆ తర్వాత మంత్రివర్గంలో చోటు కోరుదామనుకున్నవారు కూడా ఈ విస్తరణలోనే అవకాశం కోరుతున్నారు. బీఎస్పీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్రెడ్డి కూడా కేబినెట్లో చోటు కోరుతున్నారు. టీఆర్ఎస్లో చేరడానికి ముందుగానే ఇంద్రకరణ్కు ఈ మేరకు హామీ లభించినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే జిల్లా నుంచి సీనియర్గా ఉన్న నల్లాల ఓదెలుకు చీఫ్ విప్గా అవకాశం రానుంది. ఎస్టీ వర్గం నుంచి కోవ లక్ష్మికి మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా నుంచి కూడా ఎ.చందూలాల్తో పాటు కొండా సురేఖ, డి.వినయ్భాస్కర్ మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. ఎస్టీ కోటాలో స్థానం కోసం ఎ.చందూలాల్, రాములు నాయక్, కోవ లక్ష్మి ఎదురుచూస్తున్నారు. సీనియర్గా ఉన్న చందూలాల్కు అవకాశం దక్కుతుందని నేతలు చెబుతున్నా.. రాములు నాయక్ను ఎమ్మెల్సీగా తీసుకోవడానికి ముందుగానే మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీని కేసీఆర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కోవ లక్ష్మికి అవకాశమిస్తే ఎస్టీ కోటాతోపాటు మహిళకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినట్టు అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇద్దరు మహిళలకైనా చోటివ్వకపోతే వారికి తగిన ప్రాతినిధ్యం లేదనే విమర్శలు వస్తాయనే చర్చ టీఆర్ఎస్లో ఉంది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏను గు రవీందర్రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. -
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో హిమాచల్ పార్క్!
జాతీయ వనం ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో గ్రేట్ హిమాలయన్ జాతీయ ఉద్యానవనం చోటుచేసుకుంది. ‘హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లాలో గల ఈ జాతీయ వనం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అత్యద్భుతం’గా ఖతార్లోని దోహా ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మన దేశంలోని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఇప్పటికే జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా 1972లో కేంద్రప్రభుత్వం, 1999 లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను రూపొందించాయి. ఈ ప్రాంతంలో 832 జాతుల సుగంధద్రవ్యపు మొక్కలు ఉండగా వీటిలో 26 శాతం పుష్ప జాతికి చెందినవే! ఇది హిమాలయాలలోనే అత్యధిక సంఖ్య. అయితే ఇక్కడ అధిక సంఖ్యలో ఔషధ, సుగంధ ద్రవ్యపు మొక్కలు ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. హిమాలయాల్లోని నల్ల ఎలుగుబంట్లు, చిరుతపులి, కస్తూరి జింక... మొదలైన జంతుజాలాన్ని రక్షించేందుకు, వీటి సంఖ్యను అభివృద్ధి పరిచేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇప్పటికే మంచు చిరుత, ఎర్ర తల రాబందు అంతరించే ప్రాణుల జాబితాలో ఉన్నాయి. ఈ జాతీయ వనాన్ని ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సందర్శించవచ్చు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి విమానంలో కుల్లు జిల్లాకు చేరు కోవచ్చు. సమీప మండీలో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి బస్సులు, క్యాబ్స్ ద్వారా ఈ జాతీయవనానికి చేరుకోవచ్చు. -
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్ మనీ జాబితా సిద్ధం
జురిచ్: నల్లధనం వెలికితీసేందుకు పోరాడుతున్న భారత్కు ఉపకరించేలా స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లించకుండా స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నట్టు భావిస్తున్న భారతీయుల జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం తయారు చేసింది. ఈ వివరాలను భారత ప్రభుత్వానికి అందజేయనుంది. స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులకు నిజమైన యజమానులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా భారతీయ ఖాతాదారుల వివరాలపై నిఘా వేసినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. వ్యక్తిగత, ట్రస్టు, కంపెనీల పేరు మీద దాచిన డబ్బుకు పన్ను చెల్లించలేదని భావిస్తున్న వారి జాబితాను తయారు చేశారు. అయితే వారి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమాచార మార్పు దౌత్య ఒప్పందంలో భాగంగా గోప్యంగా ఉంచాలన్న నిబంధన ఉందని తెలిపారు. భారత ప్రభుత్వంలో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. నల్లధనం వెలికితీసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)కు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. -
పోస్టింగ్..‘టెస్టింగ్’
తహశీల్దార్ల కేటాయింపుపైఅర్ధరాత్రి వరకు కసరత్తు పేర్లు వెల్లడించలేకఅధికారుల ఉక్కిరిబిక్కిరి ఎమ్మెల్యేల తీవ్ర ఒత్తిళ్లే కారణమా? నేడు వెల్లడిస్తాం: డీఆర్వో తహశీల్దార్ల కేటాయింపు జిల్లా ఉన్నతాధికారులకు పెద్ద పరీక్షగా మారింది. జాబితాతో అర్ధరాత్రి వరకు కుస్తీపట్టిన అధికారులు పరిష్కారం చూపలేకపోయారు. తమ వారికి అనువైనచోట విధులు కేటాయిం చాలని ఎమ్మెల్యేలు కొందరు అధికారులపై ఒత్తిడి పెంచడంతో పోస్టింగ్లు కేటాయించలేక.. జాబితా వెల్లడించలేక తలలు పట్టుకుంటున్నారు. ఇలాఉండగా, విద్యాసంవత్సరం ప్రారంభమవడంతో ధ్రువీకరణపత్రాల కోసం విద్యార్థులు చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునేవారులేరు. కలెక్టరేట్: ఎన్నికల తరువాత అంతర్జిల్లాల నుంచి జిల్లాకు వచ్చిన 38 మంది తహశీల్దార్లను ఆయా మండలాలకు కేటాయించేందుకు మంగళవారం అర్ధరాత్రి వరకు అధికారులు తీవ్ర కసరత్తు చేసి చివరి జాబితాను వెల్లడించలేకపోయారు. పోస్టింగ్స్ విషయంలో కొందరు తహశీల్దార్లు ఎమ్మెల్యేలనే రంగంలోకి దింపడంతో అధికారులు కంగుతింటున్నారు. తమవారికి అనుకూలమైన చోట పోస్టింగ్ ఇవ్వాలని జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఇక అధికారులు గత పదిరోజులుగా చేస్తున్న కసరత్తు మంగళవారంతో ముగుస్తుందని అంతా భావించారు. తీరా ఒత్తిళ్ల నేపథ్యంలో జాబితాను వెల్లడించలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే తుది కసరత్తు ఎప్పుడు ముగుస్తుందనే విషయంపై అయోమయం నెలకొంది. ఇదిలాఉండగా, ఇక జిల్లాలో అతిప్రాముఖ్యం కలిగిన ఐదు మండలాలకు అధికారుల ఎంపిక జిల్లా అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ముందుగా ఈ మండలాలకు అధికారులను నియమించారు. అయితే సదరు ప్రజాప్రతినిధులకు నచ్చకపోవడంతో ఇదివరకు రెండుసార్లు జాబితాను మార్చినట్లు సమాచారం. తహశీల్దార్ల పోస్టింగ్స్ విషయంలో ఎప్పుడూ యూనియన్ నేతలది హడావుడి కనిపించేది. కానీ ఈసారి ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడంతో వారంతా మౌనం దాల్చారు. ఇక తహశీల్దార్లు ఆశించిన మండలాలకు తమను కేటాయిస్తే అడిగిన ఆఫర్లను ప్రకటిస్తున్నట్లు స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. వీడని ఉత్కంఠ! తహశీల్దార్లను మండలాలకు కేటాయించే ప్రక్రియ రోజురోజుకూ పెండింగ్ పడటంతో జిల్లాలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అసలే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీ అత్యవసరమైంది. ఈ సమయంలో తహశీల్దార్లు లేని కారణంగా ధ్రువీకరణపత్రాలు పెండింగ్కే పరిమితమవుతుండటంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థులు పాఠశాలు, కళాశాలలకు వెళ్లడం కష్టమే అనిపిస్తోంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో రైతులు రుణాలు, ఎరువులు, విత్తనాల కోసం అధికారుల కోసం పరుగులు పెడుతున్నారు. ఈ సమయంలో అన్నదాతలకు సమాధానం చెప్పేవారు లేకపోవడంతో బిక్కమోహం వేస్తున్నారు. నేడు వెల్లడిస్తాం.. తహశీల్దార్లను జిల్లాలోని ఆయా మండలాలకు కేటాయించిన జాబితాను బుధవారం వెల్లడిస్తామని డీఆర్వో రాంకిషన్ తెలిపారు. ఇందుకు సంబంధించి జాబితాను సిద్ధంచేసినా కలెక్టర్ ఆమోదించకపోవడంతోనే వెల్లడించలేకపోయామని చెప్పారు. నేటితో ప్రక్రియను పూర్తిచేసి మరోవారం రోజుల్లో అందరూ విధుల్లో ఉండేవిధంగా చూస్తామని ఆయన తెలిపారు. -
పోలీసులపై టీడీపీ నేతల కన్ను
అర్బన్, చిత్తూరు జిల్లాల్లో సీఐలపై త్వరలో వేటు మండల స్టేషన్లలో ఎస్ఐలకూ స్థానచలనం ఇప్పటికే బాబు దృష్టికి తీసుకెళ్లిన తమ్ముళ్లు సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నాయకుల దృష్టి అధికారులపై పడింది. నిన్నమొన్నటి వరకు పాలనా వ్యవహారాల్లో తమకు అనుకూలమైన వారి జాబితాను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు పోలీసులపై దృష్టి సారించారు. పోలీసు శాఖలో తమకు అనుకూలమైన అధికారులను పోస్టింగ్లు వేయించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వారంలోపే ఈ మార్పులు చేయించాలని జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పట్టుదలగా ఉన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో ముఖ్యంగా తిరుపతి నగరంలో కమ్మ, బలిజ సామాజిక వర్గాలకు చెందిన అధికారులను తెచ్చుకోవాలనే ఆలోచనలో కసరత్తు మొదలుపెట్టారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి వంటి పట్టణాల్లోని కీలక పోస్టింగ్లో ఉండే పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకుల ఆశీస్సులతో బయటి జిల్లాలకు వెళ్లలేదు. వరుసగా వచ్చిన మూడు ఎన్నికల్లో పోలీసులు తమకు అనుకూలంగా వ్యవహరించకపోగా ఇబ్బంది పెట్టారన్న కోపంతో తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులను తక్షణం బదిలీ చేయాల్సిందేనని చంద్రబాబును కోరనున్నట్లు సమాచారం. సీఐలే లక్ష్యం చిత్తూరు, తిరుపతి అర్బన్ పోలీసు జిల్లాల్లో మూడేళ్లకు పైగా పనిచేస్తూ తిరుపతి, చిత్తూరులో కొనసాగుతున్న సీఐలకు స్థాన చలనం కలిగించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. చిత్తూరులో గతంలో తమ రాజకీయ ప్రత్యర్థులు చెప్పినట్లుగా అధికారులు పనిచేశారని, అలాంటి వారు తమకు అక్కరలేదని, తక్షణం బదిలీ చేసి, తాము సూచించిన వారికి పోస్టింగ్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరు ఒన్ టౌన్, టూటౌన్లతోపాటు రూరల్ సర్కిల్, ట్రాఫిక్, క్రైం సీఐలకు స్థాన చలనం తప్పకపోవచ్చని సమాచారం. తిరుపతిలో ఈస్టు, వెస్ట్, తిరుచానూరు, ఎస్వీ యూనివర్సిటీ, అలిపిరి సీఐలకు కూడా స్థానచలనం ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో ఒకరిద్దరు గల్లా అరుణకుమారి ప్రాపకంతో తిరుపతిలోనే కొనసాగేందుకు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. తిరుపతి నగరానికి సంబంధించి ఎన్నికల్లో పోలీసులు సరిగా వ్యవహరించలేదని ఎమ్మెల్యే వెంకటరమణ కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయన కూడా తనకు అనుకూలురైన పోలీసు అధికారులను పిలిపించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. డీఎస్పీలపైనా త్వరలో బదిలీ వేటు జిల్లాలో 10కి పైగా ఉన్న డీఎస్పీ పోస్టింగ్ల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. తిరుపతి ఈస్టు, వెస్ట్లతోపాటు శ్రీకాళహస్తి, తిరుమల డీఎస్పీ పోస్టింగ్ల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఎన్నికలకు ముందే బాధ్యతలు స్వీకరిం చిన ఒకరిద్దరు డీఎస్పీలు కూడా మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి ఆశీస్సులతో వచ్చినవారు కావడం తో వారిపైనా వేటు పడనుంది. చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలో పలమనేరు, చిత్తూరు, మదనపల్లె, పుత్తూరు డీఎస్పీల పోస్టింగుల్లో మార్పులు జరిగే అవకాశముంది. ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసిన తర్వాత కొత్తవారిని నియమించి ఆ తర్వాతే కింది అధికారుల బదిలీలకు తెరలేపుతారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఎన్నికైన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే అధినేత ద్వారా తమ నియోజకవర్గాల్లో కొత్త అధికారుల నియామకం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. -
మంచి పని దయ ఎక్కడో... దైవం అక్కడ!
కొందరు మంచి పనులు చెయ్యాలనుకుంటారు. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో తెలీదు. ఇంకొందరు తాము చెయ్యాలనుకుంటున్న సాయం ఎంతమేరకు ప్రయోజనకరంగా ఉంటుందో అని సందేహపడుతూ కొంతకాలం, తగిన మార్గం తోచక కొంతకాలం, తోచినా కూడా తర్వాత చేద్దాంలే అని మరికొంతకాలం తాత్సారం చేస్తూ చివరికి ఏ పనీ చేయకుండానే పుణ్యకాలం కాస్తా గడిపేస్తారు. అయితే మంచి పనులు చేసిన వారి జాబితా అంతా ఒక చోట రాసి, అందులో వారు ఏం చేశారో, ఆ పనిని ఎలా చేశారో ఎవరైనా రాస్తే ఎలా ఉంటుంది? అవన్నీ చదివిన తర్వాత తప్పక మంచి ఆలోచనలు వస్తాయి, ‘మంచి’తో మమకారం ఏర్పడుతుంది. సరిగ్గా ఇలాగే ఆలోచించారు ప్రముఖ రచయిత మల్లాది. అందుకే మంచి పనులు చేసిన వారి వివరాలన్నింటినీ ఓపిగ్గా సేకరించి, వాటన్నింటినీ ఒక చోట గుదిగుచ్చారు. దానికి ‘గుడ్ బెటర్ బెస్ట్’ అనే పుస్తక రూపమిచ్చారు. ఇందులో దేశవ్యాప్తంగా రకరకాలైన మంచి పనులు చేసిన వారి గురించి ఎంతో క్లుప్తంగా, మరెంతో ఆప్తంగా పొందుపరిచారు. ప్రపంచ ప్రఖ్యాతుల దగ్గర నుంచి, పేరు కూడా తెలియని వారి వరకు ఉన్న ఈ పుస్తకం చివరలో అవలీలగా ఆచరించదగిన కొన్ని పనుల గురించి రచయత తెలియజేసిన తీరు అభినందనీయం. ఒకవిధంగా ఈ పుస్తకాన్ని చదవడం కూడా మంచి పనే, ఎందుకంటే పదిమందికీ మేలు చేసే పనుల గురించి తెలుస్తుంది. ఆచరణీయ మార్గం దొరుకుతుంది. నాస్తికులకు కూడా నచ్చే ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ దొరుకుతుంది. - డి.వి.ఆర్ -
టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
-
కాంగ్రెస్లో.. జెడ్పీ చిచ్చు
చైర్మన్ పదవికి పరిశీలనలో ఎమ్మెల్యే బాలునాయక్ పేరు తెరపైకి భారతీ రాగ్యానాయక్ కూడా.... రెండు మూడు రోజుల్లో రానున్న స్పష్టత జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ నేతల్లో చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. జెడ్పీ చైర్మన్ పదవి మొదటిసారి ఎస్టీలకు రిజర్వు అయ్యింది. జిల్లావ్యాప్తంగా ఎస్టీ విభాగంలో జనరల్, మహిళలకు రిజర్వు చేసిన జెడ్పీటీసీ స్థానాలు ఏడు. దీంతో ఈ ఏడుగురిలో ఒకరికి పీఠం దక్కుతుంది. అయితే, మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి మధ్య ఈ పదవి కోసం పోటీ ఉండేలా కనిపిస్తోంది. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోనే ఎస్టీలకు రిజర్వు చేసిన జెడ్పీటీసీ స్థానాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే భారతీ రాగ్యానాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ల పేర్లు జెడ్పీచైర్మన్ పదవి కోసం తెరపైకి వచ్చాయి. సాక్షిప్రతినిధి, నల్లగొండ జిల్లా పరిషత్ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. రెండుమూడు రోజుల్లో జెడ్పీటీసీ స్థానాల్లో బరిలో మిగిలే అభ్యర్థుల జాబితా తేలిపోతుంది. జిల్లాలోని 59 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఎస్టీలకు ఏడు స్థానాలు రిజర్వు అయ్యాయి. ఇందులో నాలుగు మహిళలకే కేటాయించారు. చిలుకూరు, చింతపల్లి, నూతన్కల్ ఎస్టీ జనరల్ స్థానాలు కాగా, కోదాడ, నేరేడుచర్ల, సూర్యాపేట, తుంగతుర్తి జెడ్పీటీసీ స్థానాలు ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. దీంతో ఈ ఏడు చోట్ల గెలిచే అభ్యర్థులనే పదవి వరిస్తుంది. అయితే, అధికార కాంగ్రెస్ పార్టీలో అపుడే ఈ పదవిని తమ అనుచరులకు ఇప్పించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. జిల్లాలో ఇటీవల ముఖ్యమైన పదవులు కొన్ని హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు కేటాయించారు. దీంతో ఈసారి తమ నియోజకవర్గానికి చెందిన వారి, తన అనుచరుల కోసం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే ఆర్.దామోదర్రెడ్డి పట్టుబట్టే అవకాశాలున్నాయి. కాగా,సీనియర్ నేత జానారెడ్డి ఆలోచన మరో విధంగా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే భారతీ రాగ్యానాయక్ పేరును చైర్పర్సన్ పదవి కోసం తెరపైకి తెచ్చారు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మరో పేరుపైనా కాంగ్రెస్లో జోరుగా ప్రచారం జరిగింది. దేవరకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలూనాయక్ పేరు జెడ్పీచైర్మన్ పదవి కోసం పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఆయన ఇందుకు ససేమిరా అన్నారని, తనకు ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ భారతీ రాగ్యానాయక్ను బరిలోకి దింపాలని చూసినా, ఆమె పోటీ చేయడానికి చింతపల్లి జనరల్ స్థానం మినహా మరో అవకాశం లేదు. గతంలో దేవరకొండ ఎమ్మెల్యేగా ఆమె భర్త రాగ్యానాయక్, ఆ తర్వాత ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్సీగా పదవి దక్కించుకున్న భారతీ రాగ్యానాయక్ మిర్యాలగూడ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అయితే, ఇప్పటికే దేవరకొండ నియోజకవర్గంలో రాగ్యానాయక్ కుటుంబం పట్ల ఓటర్లతో సానుభూతి ఉందని, దీంతో ఆమెను చింతపల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలోకి దింపాలన్న వాదనను సీనియర్ నేత జానారెడ్డి తెచ్చారని అంటున్నారు. అదే సమయంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ పేరుపైనా జోరుగా ప్రచారం ఉంది. ఒక వేళ బలవంతంగా కాంగ్రెస్ నుంచి జెడ్పీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందేనని అధినాయకత్వం పట్టుబట్టేట్టయితే, ఆయన పార్టీ మారేందుకు కూడా సిద్ధపడతారన్న ఊహాగానాలు బయలు దేరాయి. బాలూనాయక్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని జరుగుతున్న ప్రచారం దీనికి బలం చేకూరుస్తోంది. మరో వైపు ఆయనకు టికెట్ నిరాకరించే పక్షంలో కాంగ్రెస్లోని బలమైన వర్గంగా ఉన్న నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం వైపు ఆయన వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. ఈ ఇద్దరు నేతలను మినహాయిస్తే, కాంగ్రెస్లో జెడ్పీ పీఠానికి సరిపోయే స్థాయిలో ఒక్క నాయకుడూ కనిపించడం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉంది. ఈ నెల 24వ తేదీన జెడ్పీటీసీ స్థానాలకు తుది జాబితా సిద్ధమయ్యాక మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఓటు కోసం 35951 దరఖాస్తులు
జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఓటర్ల నమోదు దరఖాస్తుల వివరాలు అధికారులు సో మవారం వెల్లడించారు. మొత్తం 35951 దరఖాస్తులు(ఫారం-6) అధికారులకు అందాయి. అయితే వీటిలో తొలిసారిగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నవారు అంటే.. 18నుంచి 19ఏళ్ల మద్య వయస్కులు 9509 మంది ఉండటం విశేషం. అయితే ఉత్సాహంగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసకున్నవారిలో ఎంతమందికి అధికారులు ఓటర్ల జాబితాలో చోటుకల్పిస్తారో చూడాలి. ఇప్పటికే నవంబర్ మూసాయిదా అనంతరం దరఖాస్తు చేసుకున్న వారిలో 90 శాతం మందికి అధికారులు జాబితాలో చోటివ్వలేదు. అంతేకాదు చెప్పపెట్టకుండా చాలామంది పేర్లు జాబితా నుంచి తొల గించారు. ఈ విషయంపై ఆదివారం ప్రజలు నిలదీస్తే అధికారులు నీళ్లు నమిలారు తప్ప.. సమాధానం చెప్పలేకపోయారు. ఆందోళన చేసినవారందరినీ మళ్లీ దర ఖాస్తు చేసేకోమని చెప్పారు. దరఖాస్తులకు ఇంకా అవకాశం ఓటరుగా ఇప్పటికీ నమోదు చేసుకోనివారు తమ ఓటు కోసం సంబందిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చు. ఈ అవకాశం సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే ముందురోజు వరకు ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఆదివారం 12నియోజకవర్గాల్లో అందిన దరఖాస్తుల వివరాలు నియోజకవర్గం 18-19ఏళ్ల వారు 19సం.పైవారు జనగామ 777 2746 స్టేషన్ఘన్పూర్ 467 2193 పాలకుర్తి 351 1716 డోర్నకల్ 602 2534 మహబూబాబాద్ 1180 3101 నర్సంపేట 871 943 పరకాల 1313 2810 వరంగల్(ప) 284 2815 వరంగల్(తూ) 392 1320 వర్ధన్నపేట 82 2306 భూపాలపల్లి 936 2367 ములుగు 2254 1591 మొత్తం 9509 26442 -
సీఎం మాటలు.. నీటి మూటలు మిగిలేది కన్నీరే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘నష్టం వాటిల్లని రైతుల పేర్లు ఉన్నా ఫర్వాలేదు. కానీ నష్టపోయిన ఒక్క రైతు పేరు కూడా పంట దెబ్బతిన్న వారి జాబితాలో లేకపోతే ఉపేక్షించేది లేదు. పంట నష్ట పోయిన రైతులను గుర్తించడంలో మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఏ మాత్రం అవకాశమున్నప్పటికీ నష్టపోయిన వారి జాబితాలో చేర్చండి. నేలకొరిగిన పంటలనే కాదు.. పైకి బాగానే ఉండి లోపల కుళ్లిపోయిన పంటను గుర్తించేందుకు శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలను రంగంలోకి దింపుతున్నాం’ సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి జిల్లా పర్యటనలో పలికిన పలుకులివి. ఆచరణకు వచ్చేసరికి ఈ మాటలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. జిల్లాలో ప్రాథమిక అంచనాలకు పొంతన లేని రీతిలో తయారవుతున్న పంటనష్టం నివేదికలు నష్టపోయిన రైతుల ఆశలపై నీళ్లుచల్లుతున్నాయి. ముఖ్యమంత్రి హామీలు ఆదిలోనే అటకెక్కేలా కనిపిస్తున్నాయనేఆవేదన వారిలో పెల్లుబుకుతోంది. పంటలో 50 శాతం - మిగతా 2లోఠపైగా నష్టపోతేనే నష్టంగా పరిగణించాలన్న నిబంధన తమకు పరిహారం చెల్లించకుండా ఏదోలా ఎగ్గొట్టేందుకేనని వారు ఆక్రోశిస్తున్నారు. జరిగిన నష్టం రూ.505 కోట్లకు పైనే.. గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లావ్యాప్తంగా వరితో సహా అన్ని రకాల పంటలు కలిపి సుమారు 3లక్షల15వేల ఎకరాలలో దెబ్బతిన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. వరి 2 లక్షల 40వేల ఎకరాల్లో, పత్తి 37 వేల హెక్టార్లలో, కూరగాయల తోటలు 12,500 ఎకరాల్లో, అపరాలు 150 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. పంట నష్టం రూ.505.22 కోట్ల పైమాటేనని అంచనా వేశారు. జిల్లాలో 1404 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 906 గ్రామాలు భారీ వర్షాల బారినపడ్డాయని అధికారులు విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలే చెపుతున్నాయి. పంట నష్టం అంచనా వేసేందుకు జిల్లావ్యాప్తంగా 40 బృందాలను ఏర్పాటు చేశారు. నిర్దేశించిన 906 గ్రామాల్లో సర్వే దశకు వచ్చేసరికి సుమారు 200 గ్రామాలను జాబితా నుంచి తప్పించారని తెలియవచ్చింది. ఇందుకు అధికారులు 50 శాతం మేర పంట దెబ్బ తినలేదనే కారణం చూపిస్తున్నారు. దీనిని బట్టే బాధిత రైతుల పట్ల కిరణ్ ప్రభుత్వం కారుణ్యం ఏ పాటిదో అర్థమవుతుంది. జాబితా నుంచి పేర్లు తొలగించిన 200 గ్రామాల్లో కనీసం 100 గ్రామాల్లో 40 నుంచి 50 శాతం దెబ్బ తిన్నప్పటికీ నిబంధనల పేరుతో పక్కనపెట్టేయాల్సి వచ్చిందని క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న సిబ్బంది చెబుతున్నారు. 50 శాతం లోపు నష్టపోతే పరిగణనలోకి తీసుకోవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో తామేమి చేయగలుగుతామని పేర్కొంటున్నారు. పంట నష్టం అంచనాల బృందాలు 55 మండలాల పరిధిలో సర్వే నిర్వహించి లక్షన్నర ఎకరాల్లో మాత్రమే వరిపంట దెబ్బతిన్నట్టుగా లెక్కతేల్చినట్టు మంగళవారం రాత్రి జిల్లాకేంద్రానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పత్తి పంట పాతికవేల ఎకరాల్లో దెబ్బ తిన్నట్టు నిర్ధారించారు. మరో మూడు మండలాలు (యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు) మినహా 55 మండలాల్లో వరి, పత్తి సహా అన్ని రకాల పంటల నష్టాలపై నివేదికలు తయారయ్యాయి. వరి, పత్తికి సంబంధించిన నివేదికల్లోనే ప్రాథమికంగా అంచనా వేసిన దానిలో సుమారు 40 శాతం వరకు నష్టం జరగలేదని తేలుస్తుండగా మిగిలిన పంటలకు సంబంధించి కూడా ప్రాథమిక అంచనాలకు పొంతన లేకుండా నివేదికలు తయారవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదేమి ప్రామాణికం..? గ్రామంలో ఏదో ఒక కమతాన్ని ఎంపిక చేసుకుని అక్కడ పంట దిగుబడిని అంచనా వేస్తారు. దీన్నే గ్రామంలో సాగైన మొత్తం విస్తీర్ణానికి వర్తింపచేస్తారు. ఈ ప్రామాణికంగానే ఆ గ్రామంలో దిగుబడిపై ఒక అంచనాకొస్తున్నారు. ఖరీఫ్లో ఎకరాకు 24 బస్తాల ఉత్పత్తి అవుతుందని అంచనా. 10 నుంచి 12 బస్తాల దిగుబడి వస్తే 50 శాతం పంట దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ, రెవెన్యూశాఖాధికారులు సంయుక్తంగా నిర్ధారణకు వస్తారు. ఎంపిక చేసిన కమతంలో 50 శాతం కంటే ఒక్క శాతం తగ్గినా ఆ గ్రామంలో పంట దెబ్బ తినలేదన్నట్టుగా లెక్కతేల్చి మొత్తం గ్రామాన్నే పంటనష్టపోయిన గ్రామాల జాబితా నుంచి తొలగిస్తారు. జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నరైతులు ప్రభుత్వాధికారుల తీరుతో మరింత కుదేలవుతున్నారు. సాధారణంగా 50 శాతానికి పైబడి దెబ్బతిన్న పంటలకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ లభించనుంది. ఇప్పుడేమో ప్రాథమిక అంచనాలకు పొంతన లేకుండా తయారవుతున్న పంట నష్టాల అంచనాలతో తమకు అందే అరకొర సాయం కూడా అందకుండా పోతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. -
నెలరోజుల్లో ఎన్సీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా
సాక్షి, ముంబై: నెలరోజుల్లో లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై సోమవారం ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్పవార్తోపాటు ఇరు కాంగ్రెస్ల మహారాష్ట్ర అధ్యక్షులు పాల్గొననున్నారన్నారు. అనంతరం నెల రోజుల్లోగా ఎన్సీపీ తమ లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఇదిలా వుండగా ఈసారి అత్యధిక లోక్సభ స్థానాలకు దక్కించుకుని కేంద్రంలో కీలకపాత్ర పోషించేందుకు ఎన్సీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గతంలో కంటే అధికస్థానాలు దక్కించుకేనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పొత్తులు ఖరారు చేసుకోవడంతోపాటు సీట్ల పంపకాల విషయంపై చర్చలు జరిపేందుకు ఇరు పార్టీల నాయకులు ఉద్రుక్తులవుతున్నారు. ఎన్సీపీ ఒక అడుగు ముందుకు వేసి నెలలోగానే అభ్యర్థులకు ప్రకటించనున్నట్టు పేర్కొనడం విశేషం.