money laundering case
-
రష్యన్ సైబర్ నేరస్తుడిని విడుదల చేసిన అమెరికా
వాషింగ్టన్: రష్యాతో సంబంధాలను పునరుద్ధరించడానికి, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఖైదీల మార్పిడిలో భాగంగా బుధవారం రష్యాకు చెందిన సైబర్ నేరస్థుడు అలెగ్జాండర్ విన్నిక్ను అమెరికా విడుదల చేసింది. అమెరికన్ ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్ను రష్యా విడుదల చేసినందుకు ప్రతిగా విన్నిక్ను విడుదలచేసినట్లు తెలుస్తోంది. విన్నిక్ మనీలాండరింగ్ ఆరోపణలపై 2017లో గ్రీస్లో అరెస్టయ్యారు. ఆయనను గ్రీస్ 2022లో అమెరికాకు అప్పగించింది. తన క్రిప్టోకరెన్సీ ఎక్సే్ఛంజ్ బీటీసీ–ఈ ద్వారా రాన్సమ్వేర్ దాడులు, ఐడీ చోరీ, మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలు, ఇతర నేరాల ద్వారా 4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నందుకు మనీలాండరింగ్ చట్టాల కింద విన్నిక్పై కేసులు నమోదయ్యాయి. ఈ నేరాలను విన్నిక్ 2024 మేలో అంగీకరించాడు. అప్పటినుంచి జైలులో ఉన్నారు. మొత్తం 11 మంది విడుదల ఫోగెల్ విడుదల ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి తాము సరైన దిశలో వెళ్తున్నామనడానికి సంకేతమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్టŠజ్ అన్నారు. ఖైదీల మార్పిడి అమెరికా, రష్యాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పడానికి సహాయపడిందని రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ఇవి పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యలే తప్ప ఉక్రెయిన్ కోణంలో చేస్తున్న పనులు కావని ఆయన స్పష్టంచేశారు. రష్యాకు సన్నిహిత మిత్రదేశమైన బెలారస్లో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో అమెరికా పౌరుడిని కూడా విడుదల చేసినట్లు అమెరికా అధ్యక్షభవనం బుధవారం ప్రకటించింది. బెలారస్లో అన్యాయంగా నిర్బంధించబడిన ఒక అమెరికన్ను, ఇద్దరు రాజకీయ ఖైదీలు విడుదల అయ్యారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇతర దేశాల్లోని అమెరికా పౌరుల విడుదలకు కృషిచేస్తున్నామని రూబియో చెప్పారు. ఇవి ట్రంప్ మధ్యవర్తిత్వ సామర్థ్యానికి నిదర్శనమని వైట్హౌస్ వ్యాఖ్యానించింది. గత నెలాఖరులో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విదేశ కారాగారాల నుంచి ఇప్పటిదాకా 11 మంది అమెరికన్లు విడుదలయ్యారు. -
ఈడీకి రూ. లక్ష ఫైన్
ముంబై: బాంబే హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిపై అనవసరంగా మనీలాండరింగ్ కేసును చేపట్టినందుకు ఈడీని మందలించింది. ఈ కేసులో హైకోర్టు ఈడీకి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.ఎటువంటి బలమైన కారణం లేకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్పై మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టిన నేపధ్యంలో బాంబే హైకోర్టు ఈడీకి జరిమానా విధించింది. ఈ సందర్భంగా కేంద్ర సంస్థలు చట్ట పరిధిలో పనిచేయాలని హైకోర్టు పేర్కొంది. పౌరులు అనవసరంగా వేధింపులకు గురికాకుండా ఉండేందుకు చట్ట అమలు సంస్థలకు సందేశం పంపాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిలింద్ జాదవ్తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.వివరాల్లోకి వెళితే రాకేష్ జైన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్(Real estate developer)పై నిబంధనల ఉల్లంఘన, మోసం ఆరోపణలపై ఒక ఆస్తి కొనుగోలుదారు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు విలే పార్లే పోలీస్ స్టేషన్లో నమోదైంది. దీని ఆధారంగా రాకేష్ జైన్పై మనీలాండరింగ్ కేసును నమోదు చేసి, ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు ఆగస్టు 2014 నాటిది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్పై ప్రత్యేక కోర్టు 2014 ఆగస్టులో నోటీసు జారీ చేసింది. తాజాగా మంగళవారం (జనవరి 21) ఈ కేసులో రాకేష్ జైన్పై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది.జస్టిస్ జాదవ్ మాట్లాడుతూ ఇప్పుడు తనముందున్న కేసు.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(Anti-Money Laundering Act) అమలు ముసుగులో వేధింపులకు సంబంధించిన కేసుగా కనిపిస్తోందన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారునితో పాటు ఈడీ కూడా దురుద్దేశంతో చర్యలు చేపట్టిందని స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఇందుకు కఠినమైన శిక్ష విధించాలన్నారు. ఈడీ వంటి కేంద్ర సంస్థలు చట్ట పరిధిలోనే వ్యవహరించాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇలా పౌరులను వేధించడం తగదని సూచించింది.ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
ఈడీ విచారణకు వెళ్తున్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కానున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రకటించారు. ఈ రేసు కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గురువారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు కేటీఆర్ తెలిపారు. గతంలో విచారణకు పిలిచినప్పుడు కొంత సమయం కావాలని కేటీఆర్ కోరిన విషయం తెలిసిందే. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిలను ప్రశ్నించారు. నిధుల బదలాయింపునకు తానే ఆదేశించినట్లు కేటీఆర్ ఏసీబీ ముందు, బహిరంగంగా కూడా ప్రకటించారు. అయితే చెల్లింపులు ఏ విధంగా జరగాలి అనేది అధికారులు చూసుకుంటారని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన. విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితిఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది. ఏసీబీ కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కూడా వెనక్కు తీసుకోవాల్సి రావటంతో ఇక ఆయన విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీంతో ఈడీ విచారణపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.మరోసారి ఏసీబీ నోటీసులు..కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
కేటీఆర్కు మరోసారి ‘ఈడీ’ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో ఈ నెల 16న తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో ఈడీ కోరింది. నిజానికి కేటీఆర్ ఈడీ ఎదుట మంగళవారం(జనవరి 7)విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే క్వాష్ పిటిషన్పై హైకోర్టులో తీర్పు పెండింగ్లో ఉన్నందున విచారణకు వచ్చేందుకు సమయం కావాలని కేటీఆర్ ఈడీని కోరారు. దీంతో ఈడీ సమయమిచ్చింది. మరోవైపు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టివేయడంతో ఈడీ తాజాగా కేటీఆర్కు మళ్లీ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.కాగా, గురువారం(జనవరి 9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ ఇప్పటికే నోటీసులిచ్చింది. అయితే తన క్వాష్ పిటిషన్ కొట్టి వేయడంపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళతారన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.కేటీఆర్ వేసిన పిటిషన్పై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఇదీ చదవండి: సుప్రీంకు ఫార్ములా ఈ కేసు పంచాయితీ -
చంద్రబాబుకు ఒక రూల్.. కేటీఆర్కు మరొకటా?
బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది. కేటీఆర్పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. కేటీఆర్పై అనూహ్యమైన రీతిలో స్పందించిన ఈడీ, అదే ఏపీలో గతంలో చంద్రబాబుపై వచ్చిన కేసుల విషయంలో ఎందుకు స్పందించలేదన్నది పలువురి ప్రశ్నగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా బలపడాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ను వీక్ చేయడానికి చేస్తున్న ప్లాన్ లో ఇవన్ని భాగమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పార్లమెంటులో సైతం ఈడీ,సీబీఐ అనుసరిస్తున్న పద్దతుల గురించి విపక్ష సభ్యులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఈడీ,సీబీఐలను ఆయా నేతలపైకి ఉసికల్పడం, వారు భయపడి బీజేపీలోకి రాగానే కేసులు మూలపడడం జరిగిపోతోందన్నది వారి విమర్శ. దీనినే వాషింగ్ మిషన్ ట్రీట్ మెంట్ అంటే బీజేపీలో చేరగానే పరిశుభ్రం అయిపోతున్నారని ఎద్దేవ చేస్తుంటారు. దానికి తగినట్లుగానే ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరగానే వారిలో ఇద్దరిపై ఉన్న బ్యాంకు రుణాల ఎగవేత కేసులు చప్పబడిపోయాయని అంటారు.మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఈ ఫార్ములా రేస్ విషయంలో తెలంగాణ ఏసీబీ ఇట్టా కేసు నమోదు చేసిందో లేదో, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగిపోయింది.కేటీఆర్ పై కేసు కూడా పెట్టేసిందట. ఇది ఆశ్చర్యంగానే ఉంది. అందులో ఏమైనా మెటీరియల్ ,ఆధారాలు ఉంటే కేసు పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు. అందులో ఏమి జరిగిందో పరిశీలించకుండానే,ఇది రాజకీయ కేసు అని తెలిసి కూడా ఈడీ తెరపైకి వచ్చిందంటే సహజంగానే అనుమానాలు వస్తాయి. పోనీ అన్ని కేసుల్లోను ఇంతే వేగంగా ఈడీ వస్తుంటే ఫర్వాలేదు. కాని కొందరు నేతల విషయంలో అసలు వారి జోలికే వెళ్లదు. అంటే కేంద్రంలోని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఎవరిపై కేసులు పెట్టాలో, ఎవరిపై పెట్టకూడదో ఈడీ,సీబీఐ వంటి సంస్థలు నిర్ణయించుకుంటాయన్న విమర్శలకు ఈ పరిణామం ఊతం ఇస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించగానే, ఎన్సిపి చీలిక వర్గం నేత అజిత్ పవార్ కు క్లీన్ చిట్ వచ్చేసిందని చెబుతారుఇప్పుడు తెలంగాణలో ఈ ఫార్ములా కేసులో కూడా అలాగే బీజేపీ వ్యవహరిస్తోందా? అన్నదానికి అప్పుడే అవునని చెప్పలేకపోయినా, ఈడీ వాయు వేగంతో వ్యవహరించిన తీరుపై డౌట్లు వస్తాయి.హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు సంబంధించి ఆ సంస్థకు సుమారు 55 కోట్ల మేర నిధులు విడుదల చేయడం తప్పన్నది ప్రభుత్వ వాదన.ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందన్నది ఏసీబీ కేసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇంకేదో ఉందని, 600 కోట్ల అవినీతి అని కొత్త విషయం శాసనసభలో చెప్పారు. ఆ విషయం ఫార్ములా రేస్ సంస్థవారే వెల్లడించారని,కేటీఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారని,ఆయన చెవిలో చెప్పారట.ఇందులో నిజం ఉందో లేదో కాని,వినడానికి మాత్రం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే తన ఆధ్వర్యంలోని ఏసీబీ 55 కోట్లు నిధుల దుర్వినియోగం అని చెబుతుంటే, ఏకంగా ముఖ్యమంత్రి అది 600 కోట్లు అని అనడం కేవలం ప్రచారం కోసమే అన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లయింది.దీనిపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు.అక్కడ వారు ఈ నెలాఖరువరకు అరెస్టు చేయవద్దని, అయితే కేసు దర్యాప్తు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చారు.అది వేరే సంగతి. ఈ దశలో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఏసీబీకి లేఖ రాయడం, కేటీఆర్ ,ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయడం జరిగిపోయింది.ఇది ఏసీబీ కేసు ఆధారంగానే జరిగింది.ఇదంతా రేవంత్ రెడ్డి, బీజేపీ కుమ్మక్కు వల్లేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.కేటీఆర్ పై కేసు పెట్టడానికి గవర్నర్ ఓకే చేసిన తర్వాత వేగంగా ఈ పరిణామాలు సంభవించాయి.కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి కేటీఆర్ వెళితే ఈ కేసులో గవర్నర్ అనుమతి రాకుండా చేసుకోవడానికే అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. తీరా చూస్తే గవర్నర్ పర్మిషన్ ఇవ్వడమే కాదు.. ఈడీ కూడా వచ్చేసింది.ఇప్పుడు కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు నేపధ్యం ఇలా ఉంటే గతంలో జరిగిన కొన్ని విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 2019 లో చంద్రబాబు ప్రభుత్వంఓడిపోయిన తర్వాత కొద్ది నెలలకు ఆదాయపన్ను శాఖ అధికారులు చంద్రబాబు పిఎస్ ఇంటిపై దాడి చేసి పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ప్రకటించారు. ఏకంగా రెండువేల కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని సిబిటిడి సాధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పటికి ఐదేళ్లు అయినా ఆ వ్యవహారంపై అతీగతీ లేదు.అంటే ప్రధానమంత్రినో,హోం మంత్రినో, ఆర్ధిక మంత్రినో మేనేజ్ చేసుకుంటే ఎలాంటి కేసు అయినా విచారణ లేకుండా ఆగిపోతుందా అని సామాన్యుడు ఎవరికైనా సందేహం వస్తే ఏమి చెప్పగలం.దేశంలో చట్టాలు కొందరికి చుట్టాలు అన్న నానుడిని నిజం చేసినట్లే కదా? గతంలో జగన్ ప్రభుత్వ టైమ్ లో అమరావతి భూములలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసింది.దానిని పట్టించుకోలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిధులు 350 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధులలో సింహభాగం షెల్ కంపెనీలకు, చివరికి టిడిపి బ్యాంక్ ఖాతాకు చేరాయని అప్పట్లో సిఐడి ఆధార సహితంగా చూపుతూ ఈడీకి కూడా తెలియచేసింది. నిజానికి తొలుత ఈ కేసును జిఎస్టి అదికారులు గుర్తించారు.దానిని ఈడీ టేకప్ చేసి కొందరిని అరెస్టు కూడా చేసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు అది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది.ఆయన ప్రమేయంతోనే రూల్స్ తో నిమిత్తం లేకుండా నిధులు విడుదల అయ్యాయని అభియోగం చేసింది.ఈ కేసులో చంద్రబాబును సిఐడి రిమాండ్ కు తీసుకుంది.ఏభైమూడు రోజుల పాటు జైలులో ఉండి ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పై బయటకు వచ్చారు.ఆ తర్వాత పరిణామాలలో బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కాగలిగారు.బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.అంతే! ఈడీ ఈ కేసులో వేరేవారి ఆస్తులు జప్తు చేసింది తప్ప , చంద్రబాబు ఊసే ఎత్తలేదు. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇవ్వలేదని కేంద్రం చెబుతున్నా,కేసు ఎందుకు ముందుకు కదలడం లేదన్నదానికి జవాబు దొరకదు.ఇప్పుడు చంద్రబాబు అదికారంలోకి రాగానే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి అన్ని వ్యూహాలను పన్నుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.ఆ కేసులను నీరుకార్చడానికి ఢిల్లీ నుంచి తమ లాయర్ సిద్దార్ధ్ లూధ్రాను రంగంలోకి తెచ్చి, ఏకంగా పోలీసు ఉన్నతాధికారులనే ఆయన వద్దకు పంపి సమాలోచనలు జరిపించారట.ఈ క్రమంలోనే గతంలో ఈ కేసులు పెట్టిన సిఐడి అదికారులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.వారిప వేర్వేరు కేసులు పెట్టి , సస్పెండ్ చేస్తున్నారు.ఇది మంచి పరిణామం అవుతుందా?అన్నది చర్చ. ఒకవేళ ఈ ప్రభుత్వం మారి భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగితే, ఇప్పుడు ఈప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహించారని అనేక మంది పోలీసు లేదా,ఇతర శాఖల అధికారులపై చర్యలు ఉండవా?అంటే కచ్చితంగా ఉంటాయని చెప్పాలి. రాజకీయాలలో టిట్ ఫర్ టాట్ అన్నది ఒక నానుడి. కాని ఈలోగా వ్యవస్థకు జరగాల్సి డామేజి జరిగిపోతుంది. అంతేకాదు.ఏకంగా ఏపీలో అయితే చంద్రబాబు కేసులు ఉన్న ఒక న్యాయమూర్తి ఇంటి వద్ద ఇంటెలెజెన్స్ అదికారులు కొందరు నిఘా పెట్టారట.ఈ విషయాన్ని ఆ జడ్జిగారే స్వయంగా కోర్టులో పోలీస అధికారులను ప్రశ్నించారు.ఇది చాలా సంచలన విషయం. అయినా ఎల్లో మీడియా ఇలాంటివాటిని కప్పిపెడుతోంది.గతంలో జయలలితపై కేసులు వచ్చాయి. అంతలో ఆమె ముఖ్యమమంత్రి అయ్యారు.తదుపరి ఆ కేసులను కర్నాటక రాష్ట్ర హైకోర్టుకు బదలీ చేశారు.చంద్రబాబు పై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్ కూడా పడింది. కాని అది ఇంకా విచారణకు వచ్చినట్లు లేదు.పెద్ద నాయకులపై అవినీతి కేసులు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా వ్యవస్థలు తయారు కాకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది. తమకు ఇష్టం లేని నేతలపై కేసులు పెట్టడం, తమకు సరెండర్ అయిపోతే వాటిని పక్కనవేయడం, లేదా వారి మెడపై కత్తిమాదిరి వేలాడదీసినట్లు ఉంచడం.. ఇవి ఆయా వ్యవస్థల జవాబుదారితనాన్ని దెబ్బతీస్తాయి. గతంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారని ఆయనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టింది చూశాం. ఆ విషయాన్ని అప్పటి బీజేపీ నేత సుష్మ స్వరాజ్ పార్లమెంటులోనే వెల్లడించారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే మాదిరి వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు కేసుల విషయంలో ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖ ఎందుకు స్పందించలేదు? కేటీఆర్ కేసులోనే ఈడీ ఎందుకు అతిగా రియాక్ట్ అయింది? తాజాగా కాకినాడ సీపోర్టు షేర్ల బదలాయింపు విషయంలో కూడా ఈడీ ఇలాగే వేగంగా స్పందించడం గమనార్హం. ఈడీ తన బాద్యత నిర్వహిస్తే తప్పుకాదు. కాని కొందరి విషయంలోనే చేస్తే అది సంస్థ నిష్పక్షపాతం పై మరక పడుతుంది. పలుకుబడి, పరపతితో పాటు, మేనేజ్ మెంట్ స్కిల్ లేకపోతే నేతలకు ఇలాంటి చిక్కులు వస్తాయా?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
37 గుర్రాలను అటాచ్ చేసిన ఈడీ.. విలువ రూ.3.98 కోట్లు!
అంతర్జాతీయ సైబర్ మోసాల నెట్ వర్క్, మనీ లాండరింగ్, అక్రమ ఆస్తుల ఆరోపణల వల్ల మెట్ టెక్నాలజీస్ యజమాని కునాల్ గుప్తా, తన సహచరుడు పవన్ జైస్వాల్కు చెందిన రూ.5.23 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ చర్యల్లో భాగంగా కేజీ స్టడ్ ఫామ్ ఎల్ఎల్పీకి చెందిన 37 గుర్రాలను సైతం ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ రూ.3.98 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. గ్రీన్లీఫ్ కాంప్లెక్స్, బాగుయాటి, కోల్కతాలోని రూ.1.08 కోట్ల విలువైన ఫ్లాట్లను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ కేసు ఈ కేసులో ఈడీ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, నవంబర్ 2023లో ఏజెన్సీ రూ.67.23 కోట్లు, జులై 2024లో రూ.85 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.మోసపూరిత వ్యాపార ఒప్పందాలుకునాల్ గుప్తా, అతని సహచరులు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియాలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత కాల్ సెంటర్లను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ యాప్ల ద్వారా తప్పుడు రుణ ఆఫర్లు, మోసపూరిత వ్యాపార ఒప్పందాలు చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. కేజీ స్టడ్ ఫార్మ్ ఎల్ఎల్పీ, జీడీ ఇన్ఫోటెక్తో సహా పలు సంస్థల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.రేసింగ్లో వచ్చిన డబ్బు పెట్టుబడిగా..కునాల్గుప్తా, పవన్ జైస్వాల్ నిబంధనలకు విరుద్ధంగా తమ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరిపింది. ప్రాథమిక విచారణలో భాగంగా కొన్ని ఆస్తులను, గుర్రాలను అటాచ్ చేసింది. సమగ్ర విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేజీ స్టడ్ ఫార్మ్ ఎల్ఎల్పీ గుర్రాలను కొనుగోలు చేయడం, వాటికి శిక్షణ ఇవ్వడం, అమ్మడం వంటి చేస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నిధులను దారిమళ్లించినట్లు ఈడీ గుర్తించింది. నేరారోపణలతో ముడిపడి ఉన్న గుర్రాల ద్వారా రేస్లో సంపాదించిన డబ్బును తిరిగి పెట్టుబడి పెట్టినట్లు అధికారులు తెలిపారు. దాంతో 37 గుర్రాలను ఈడీ అటాచ్ చేసింది. వీటిని వివిధ రేస్ క్లబ్లు, రైడింగ్ పాఠశాలల్లో ఉంచుతున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లులెక్కల్లోలేని లావాదేవీలుజీడీ ఇన్ఫోటెక్ ద్వారా పవన్ జైస్వాల్ గ్రీన్లీఫ్ కాంప్లెక్స్లో అక్రమంగా ఆస్తులను సంపాదించినట్లు ఈడీ తెలిపింది. లెక్కల్లోలేని ఆర్థిక లావాదేవీలు, నగదు డిపాజిట్లు, చట్టబద్ధమైన ఆదాయ వనరులు లేకుండా నగదు బదిలీ చేయడం ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ వెల్లడించింది. -
ఆప్ నేత సత్యేందర్ జైన్కు భారీ ఊరట.. రెండేళ్లకు బెయిల్
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మాజీ మంత్రి అయిన సత్యేందర్ జైన్కు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నమోదైన కేసులో ఆయన దాదాపు 18 నెల జైలులో ఉన్నారు.బెయిల్ మంజూరు సందర్భంగా.. హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ వంటి కఠినమైన కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. విచారణలో జాప్యాన్ని ఎత్తిచూపుతూ.. సత్యేందర్ జైన్ సుధీర్ఘ కాలం నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. ఈమేరకు ఆప్ నేత మనీష్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. సత్వర విచారణ అనేది ప్రాథమిక హక్కుగా తెలిపింది. ట్రయల్ ప్రారంభించడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్న న్యాయస్థానం వీలైనంత త్వరగా కేసును ముగించాలని దర్యాప్తు సంస్థకు సూచించింది.కాగా జైన్ను రెండేళ్ల కిత్రం మే 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. అయితే ఆరోగ్య కారణాలతో వైద్య కారణాలతో 2023 మేలో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఈ ఏడాది మార్చిలో సాధారణ బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జైన్ ఢిల్లీలోని తీహార్ జైలుకు తిరిగి వచ్చారు.ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో బెయిల్ పొందిన మూడో ఆప్ నేత సత్యేందర్ జైన్. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గత నెలలో బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఆగస్టులో బెయిల్ లభించింది. -
మనీలాండరింగ్ కేసులో తమన్నా?
-
Tamannaah Bhatia: తమన్నాను ప్రశ్నించిన ఈడీ
గువాహటి: బిట్కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను సంపాదించవచ్చని హెచ్పీజెడ్ టోకెన్ యాప్లో చేసిన ప్రకటనకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి తమన్నా భాటియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ప్రశ్నించారు. యాప్కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే తమన్నాను ప్రశ్నించారని, ఆమెపై ఎలాంటి నేరసంబంధ కేసు నమోదుకాలేదని సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యాప్ ద్వారా మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న కేసులో ఇప్పటిదాకా 299 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. వీటిలో 76 సంస్థలు చైనా అధీనంలో నడుస్తున్నాయి. వాటిలో పది మంది డైరెక్టర్లు చైనా జాతీయులుకాగా రెండు సంస్థలను విదేశీయులు నడిపిస్తున్నారు. బిట్కాయిన్లు, క్రిప్టో కరెన్సీల మైనింగ్ ద్వారా ఊహించని లాభాలు గడించవచ్చని ఆశపెట్టి కోట్లు దండుకున్నారని యాప్పై కోహిమా పోలీస్స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, బిట్కాయిన్ మైనింగ్ కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలు కళ్లజూస్తారని ప్రచారం చేయడంతో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. రూ.57వేల పెట్టుబడికి మూడు నెలలపాటు ప్రతిరోజూ రూ.4,000 ఇస్తామని చెప్పి కేవలం ఒకే ఒక్కసారి ఇచ్చి మానేశారని బాధితులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఈడీ ఏకంగా రూ.455 కోట్ల విలువైన స్థిర,చరాస్థులను జప్తుచేసింది. అసలు డైరెక్టర్లు లేకపోయినా డొల్ల కంపెనీలు సృష్టించి వాటి పేరు మీద బ్యాంక్ ఖాతాలు, మర్చెంట్ ఐడీలు తీసుకున్నారని తేలింది. -
త్వరలోనే భారత్కు ‘మహదేవ్ యాప్’ సూత్రధారి
న్యూఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రశేఖర్ను త్వరలో భారత్కు రప్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్, మోసం కేసులో ఈడీ వినతి మేరకు ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఇటీవల దుబాయ్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. ఈడీ వర్గాల వినతి మేరకు చంద్రశేఖర్తోపాటు ఈ యాప్ మరో ప్రమోటర్ రవి ఉప్పల్ను కూడా దుబాయ్ అధికారులు అదుపులోకి తీసుకుని, గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొద్ది రోజుల్లో చంద్రశేఖర్ భారత్కు వస్తాడని ఆ వర్గాలు వివరించాయి. చంద్రశేఖర్ 2019లో దుబాయ్ పారిపోయేందుకు ముందు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా భిలాయ్లో సోదరుడితో కలిసి జ్యూస్ షాపు నిర్వహించేవాడు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్తో ఛత్తీస్గఢ్కు చెందిన పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, అధికారులతో సంబంధాలున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. రూ.6 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో ఇప్పటి వరకు 11మందిని అరెస్ట్ చేసింది. -
సిద్ధూపై ఈడీ కేసు
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని లోకాయుక్త నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ఆధారంగా ఈ చర్యకు దిగింది. సిద్ధరామయ్య, భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి తదితరులపై కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. పార్వతి నుంచి 3.16 ఎకరాలను సేకరించిన ముడా ప్రతిగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో ఆమెకు 14 ప్లాట్లను కేటాయించింది. దీంట్లో అవినీతి, అధికార దురి్వనియోగం జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్చంద్ గెçహ్లాట్ అనుమతి మంజూరు చేశారు. దీన్ని సిద్ధూ హైకోర్టులో సవాల్ చేసినా చుక్కెదురైంది. అనంతరం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని ఆధారంగా సిద్ధరామయ్య తదితరులపై ఈడీ సోమవారం కేసు నమోదు చేసింది. విచారణకు రావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసే వీలుంది. అలాగే ఆస్తులను కూడా అటాచ్ చేయవచ్చు. 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తా ముడా కమిషనర్కు పార్వతి లేఖ మైసూరు: భూపరిహారంగా ముడా తనకు కేటాయించిన 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేందుకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి ముందుకు వచ్చారు. ఈ మేరకు ముడా కమిషనర్కు సోమవారం ఆమె లేఖ రాశారు. మైసూరు కేసరే గ్రామంలో తనకు చెందిన 3.16 ఎకరాల భూమిని ముడా తీసుకొని.. విజయనగర లేఔట్ ఫేజ్–3, ఫేజ్–4లో తనకు 14 ప్లాట్లను కేటాయించిందని ఆమె వివరించారు. ‘సేల్ డీడ్ను రద్దు చేయడం ద్వారా నేనీ 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముడా ఈ ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దిశగా సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పార్వతి ముడా కమిషనర్ను కోరారు. ముడా కేటాయింపుల్లో సిద్ధరామయ్యపై దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం, లోకాయుక్త పోలీసుల కేసు నమోదు, తాజాగా సోమవారం ఈడీ కేసు నమోదు నేపథ్యంలో.. ప్లాట్లను తిరిగి ఇచ్చేయాలని పార్వతి నిర్ణయం తీసుకున్నారు. -
సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్
న్యూఢిల్లీ: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన మీద మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది.ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. తద్వారా.. నిందితులను విచారణకు పిలిచేందుకు, విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి EDకి అధికారం దక్కినట్లయ్యింది.ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం, కర్ణాటక గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అబ్రహంతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రతీప్ కుమార్ కూడా సీఎంపై ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రిని విచారించాలని గవర్నర్ ఆదేశించారు. అయితే మరోవైపు ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. దానిని గవర్నర్ తోసిపుచ్చగా విషయం న్యాయస్థానానికి చేరుకుంది. అయితే కోర్టులో సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ఆయన్ని విచారించేందుకు గవర్నర్ ఆదేశించడం చట్టబద్ధమేనని వ్యాఖ్యానించింది. లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. తర్వాత సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పుడు ఈ కేసులో మనీలాండరింగ్ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేయడంతో ఆయనకు మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. -
మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలు సోదా లు జరిపాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం 5:30 గంటల నుంచి జూబ్లీహిల్స్లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లు, పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగాయి. ఏకకాలంలో మొత్తం 15 ఈడీ అధికారుల బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.విదేశాల నుంచి ఖరీదైన వాచీల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 28న చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షరెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కస్టమ్స్, డీఆర్ఐ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల రక్షణలో సోదాలు కొనసాగాయి. పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సహా పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల ఆర్ధికలావాదేవీలపైన ఆరా తీసినట్టు సమాచారం. కేసు వివరాలివీ..: హాంగ్కాంగ్లో నివాసముండే మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ ఈ ఏడాది ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చాడు. అతని వద్ద కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన రెండు లగ్జరీ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ను కస్టమ్స్ అధికారులు విచారించగా, మధ్యవర్తి నవీన్కుమార్ పేరు వెల్లడించాడు. ఈ క్రమంలో నవీన్కుమార్ ద్వారా పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి ముబీన్ నుంచి దాదాపు రూ.7 కోట్లు విలువ చేసే ఏడు లగ్జరీ వాచ్లను కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై సమాధానం ఇవ్వాలని కస్టమ్స్ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ.100 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతోమనీలాండరింగ్ కోణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈడీ దాడులను ఖండించిన మంత్రి సీతక్క ఈడీ దాడులను మంత్రి సీతక్క ఖండించారు. ‘ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. ఈడీ, సీబీఐలను పచ్చిగా దురి్వనియోగం చేస్తోంది. తమకు అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది’ అని సీతక్క ఒక ప్రకటనలో మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇంటిపై ఈడీ అధికారులకు సోదాలకు కారణం బీజేపీ కుట్రలేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్
ఢిల్లీ: తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరైంది. క్యాష్ ఫర్ జాబ్స్(మనీల్యాండరింగ్) కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న సెంథిల్ బాలాజీకి తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో, ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గతేదాడి జూన్లో అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా తమిళనాడులోని రవాణాశాఖలో ఉద్యోగాలు ఇస్తామని(అన్నాడీఎంకే ప్రభుత్వంలో 2011-15 మధ్య) నిరుద్యోగుల నుంచి సెంథిల్ బాలాజీ భారీగా డబ్బులు వసూలు చేశారని ఈడీ ఆరోపించింది. మనీ ల్యాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై జూన్ 15న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అరెస్టుతో ఆయన మంత్రిత్వ శాఖను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.అయితే, ఈ కేసులో బెయిల్ కోసం సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 19న బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా హైకోర్టు కొట్టివేసింది. స్థానిక కోర్టు కూడా అతని బెయిల్ పిటిషన్లను మూడుసార్లు కొట్టివేసింది. ఈక్రమంలో బెయిల్ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. Supreme Court grants bail plea to former Tamil Nadu minister V Senthil Balaji in connection with a money laundering case linked to the cash-for-jobs scam. pic.twitter.com/qBnLoArEoj— ANI (@ANI) September 26, 2024 ఇది కూడా చదవండి: బెంగళూరు మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్ -
మనీలాండరింగ్ కేసు: ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెబర్ 23వరకు 14 రోజుల జ్యుడీషల్ కస్టడీ విధించింది. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్బోర్డ్లో నియామకాలు, ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. ఇక.. ఈ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఈడీ అమానతుల్లా ఖాన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరించింది. అమానతుల్లా ఖాన్ని విడుదల చేస్తే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసి అకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో విచారణకు ఆటంకం కలుగుతుందని ఆయన్ను 14 రోజలు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీ అభ్యర్థను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆప్ ఎమ్మెల్యేకు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం నుంచే ఆప్ ఎమ్మెల్యే నివాసంపై ఈడీ సోదాలు చేపట్టింది. సుమారు ఆరు గంటలు సోదాలు చేసిన అనంతరం ఈడీ అధికారులు అమానతుల్లా ఖాన్ అరెస్ట్ చేశారు. -
Supreme Court: ఇంత కాఠిన్యమా?
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) కేసుల దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవసరానికి మించిన కాఠిన్యం చూపుతోందంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుల నుంచి జప్తు చేసే డాక్యుమెంట్లను వారికిచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ తలంటింది. ‘‘కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ డాక్యుమెంట్లను నిరాకరించడం సబబా? ఇది జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించడం కాదా?’’ అంటూ అక్షింతలు వేసింది. పీఎంఎల్ఏకు సంబంధించిన ఒక కేసును న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఎ.అమానుల్లా, జస్టిస్ఏజీ మసీతో ధర్మాసనం బుధవారం విచారించింది. ‘‘నిందితునికి సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు మీరు జప్తు చేయొచ్చు. అతనికి అవన్నీ గుర్తుండాలని లేదు కదా! అడిగితే ఇవ్వడానికి ఇబ్బందేమిటి? వేలాది పేజీల డాక్యుమెంట్లనైనా నిమిషాల్లో స్కాన్ చేసిన అందుబాటులోకి తేవచ్చు. దర్యాప్తు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడలేరా?’’ అని ప్రశ్నించింది. ‘‘క్లిష్టతరమైన విచారణ ప్రక్రియను ఎదుర్కొంటున్న నిందితునికి సొంత డాక్యుమెంట్లే ఇవ్వకపోవడం న్యాయమా? అత్యంత హీనం, అమానుషమని భావించిన కేసుల్లోనూ నిందితులను బెయిల్ దొరికిన సందర్భాలు బోలెడు! కానీ ఈ రోజుల్లో అమాంబాపతు కేసుల్లో కూడా బెయిల్ రావడం గగనంగా మారుతోంది. కాలం మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కేసుల్లో మేం (ధర్మాసనం) కఠినంగా ఉండొచ్చా? అది భావ్యమేనా?’’ అంటూ ఈడీని జస్టిస్ ఓకా నిలదీశారు. బెయిల్ కోసం, లేదా కేసే తప్పుడుదని నిరూపించేందుకు డాక్యుమెంట్లపైనే ఆధారపడే పరిస్థితుల్లో వాటిని పొందే హక్కు నిందితునికి ఉంటుందని స్పష్టం చేశారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ నేటితో ముగియగా.. తిహార్ జైలులో ఉన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగించింది. ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్ను సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆయన కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని అధికారులు కోర్టును కోరారు. దీంతో కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాలు పొడిగించింది. అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్ మే 10న మధ్యంత బెయిల్ పొందారు. బెయిల్ గడువు ముగిసిన అనంతరం జూన్ 2ను ఆయన మళ్లీ తిహార్ జైలుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ను జూన్ 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల కస్టోడియల్ విచారణ ముగియడంలో కేజ్రీవాల్ను సీబీఐ అధికారులు శనివారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ ఎదుట హాజరుపర్చారు. మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం ఆయనను 14 రోజలపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. కేజ్రీవాల్ను వచ్చే నెల 12వ తేదీ దాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
హేమంత్ సోరెన్కు బెయిల్
రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్(48)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రంగోన్ ముఖోపాధ్యాయ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హేమంత్ సోరెన్కు బెయిల్ ఇస్తే మళ్లీ ఇదే తరహా అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తరఫు న్యాయవాది ఎస్.వి.రాజు పేర్కొన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఈడీ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హేమంత్ ఏ నేరమూ చేయలేదని, బెయిల్పై బయట ఉన్నప్పుడు ఆయన నేరం చేసే అవకాశం లేదని, అందుకే బెయిల్ ఇస్తున్నామని స్పష్టంచేసింది. హేమంత్ రూ.50 వేల పూచీకత్తు సమరి్పంచాలని, ఆయనకు ష్యూరిటీ ఇస్తూ మరో ఇద్దరు రూ.50 వేల చొప్పున పూచీకత్తు సమరి్పంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఈ బెయిల్ తీర్పుపై 48 గంటలపాటు స్టే విధించాలని ఈడీ తరఫున మరో న్యాయవాది జోహబ్ హుస్సేన్ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో 8.86 ఎకరాల భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులో ఇరికించారు: హేమంత్ తనను తప్పుడు కేసులో ఇరికించి, ఐదు నెలలపాటు జైల్లో పెట్టారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యర్తలు, జర్నలిస్టుల గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. -
అయిదు నెలల తర్వాత.. బెయిల్పై హేమంత్ సోరెన్ విడుదల
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎట్టకేలకు విడుదలయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ లభించడంతో దాదాపు అయిదు నెలల శిక్ష అనంతరం శుక్రవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముక్తిమోర్చ కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. అరెస్టుకు కొన్ని గంటల ముందే ఆయన నాటకీయ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. నూతన సీఎంగా చంపాయి సోరెన్ బాధ్యతలు చేపట్టారు. -
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ సెంట్రల్ జైలులో జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను సీబీఐ బుధవారం అదుపులోకి తీసుకుంది. సీబీఐ అధికారులు తొలుత ఆయనను జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఎదుట ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణం కేసులో అవినీతి వ్యవహారాలపై విచారణ నిమిత్తం కేజ్రీవాల్ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ విజ్ఞాపన సమరి్పంచారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన వాదనను కోర్టుకు తెలియజేశారు. మద్యం కుంభకోణంతో తనకు సంబంధం లేదని, తాను అమాయకుడినని పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు, ఆమ్ ఆద్మీ పారీ్టకి ఈ కేసుతో సంబంధం లేదని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్కు సిసోడియాను బాధ్యుడిని చేస్తూ తాను సీబీఐకి స్టేట్మెంట్ ఇచి్చనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, అందులో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. సిసోడియాకు గానీ, ఇతరులను గానీ వ్యతిరేకంగా తాను సేŠట్ట్మెంట్ ఇవ్వలేదన్నారు. అరెస్టు ఇప్పుడే ఎందుకంటే.. తాము నిజాలు మాత్రమే బహిర్గతం చేస్తున్నామని, మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం వెనుక పెద్ద కుట్ర ఉందని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని, ఈ కేసులో కేజ్రీవాల్ను ప్రశ్నించి మరిన్ని నిజాలు రాబట్టాల్సి ఉందని తమ విజ్ఞాపనలో సీబీఐ పేర్కొంది. కేజ్రీవాల్ను ఇప్పుడే అరెస్టు చేయాలని ఎందుకు భావిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా, ఇన్నాళ్లూ సార్వత్రిక ఎన్నికలు జరగడంతో వేచి చూశామని, ఎన్నికలు ముగియడంతో అరెస్టు చేసి, విచారణ కొనసాగించాలని నిర్ణయించినట్లు సీబీఐ తరఫు న్యాయవాది బదులిచ్చారు. నూతన మద్యం విధానంలో భాగంగా ఢిల్లీలో మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించాలని అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సిఫార్సు చేసినట్లు కేజ్రీవాల్ సేŠట్ట్మెంట్ ఇచ్చారని తెలిపారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అనంతరం కేజ్రీవాల్ను అరెస్టు చేసి, మూడు రోజులపాటు కస్టడీలో ఉంచి విచారించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి అమితాబ్ రావత్ అనుమతి ఇచ్చారు. బయటకు రాకుండా కుట్రలు: సునీతా తన భర్త అరవింద్ కేజ్రీవాల్ను జైలు నుంచి బయటకు రానివ్వకుండా మొత్తం వ్యవస్థ కుట్రలు సాగిస్తోందని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశంలో చట్టం అమల్లో లేదని, కేవలం నియంతృత్వం రాజ్యమేలుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ రెగ్యులర్ బెయిల్పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచి్చన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మనూ సింఘ్వీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరో పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. -
ఇక సీబీఐ వంతు!
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను బుధవారం సీబీఐ అరెస్టు చేసే అవకాశం కని్పస్తోంది. సీబీఐ వర్గాలు మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ చర్య ప్రధాని మోదీ కక్షసాధింపులో భాగమేనని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ ఆరోపించారు. అందుకే కేజ్రీవాల్ను తప్పుడు కేసులో ఇరికించారన్నారు.ఢిల్లీ హైకోర్టులో నిరాశేమనీ లాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో కేజ్రీవాల్కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్పై మధ్యంతర స్టే ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సుధీర్కుమార్ జైన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. వాదనలకు ఈడీకి ట్రయల్ కోర్టు సమయమివ్వలేదని ఆక్షేపించింది.కేజ్రీవాల్ ప్రమేయంపై సమర్పించిన పత్రాలను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో, క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమైందని స్పష్టంచేసింది.కేజ్రీవాల్కు బెయిల్ మంజూరుపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీకి తగిన సమయమిచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఉత్తర్వుపై స్టేను రద్దు చేయడం లేదని తేచ్చిచెప్పారు. కేజ్రీవాల్కు ఈ నెల 20న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.దీన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఆ మర్నాడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో బెయిల్పై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు. దాంతో ఆయన కనీసం మరిన్ని రోజులపాటు తిహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
Delhi liquor scam: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తనకు ఇచి్చన బెయిల్పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు ఈ నెల 20న బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండిపోవాల్సి వచి్చంది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
Delhi liquor scam: జైల్లోనే కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మరికొన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఈ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచి్చన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సు«దీర్కుమార్ జైన్, జస్టిస్ రవీందర్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించడానికి సరైన అవకాశం లభించలేదన్నారు. తమ వాదనల సమయంలో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తొందరపెట్టారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ కేసులో వాస్తవాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బెయిల్ను రద్దు చేయడానికి ఇంతకంటే మంచి కేసు ఇంకొకటి ఉండదన్నారు. అనంతరం ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ‘‘ట్రయల్ కోర్టు ఆర్డర్పై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్పై వివరణాత్మక ఆదేశాల నిమిత్తం తీర్పు రిజర్వ్ చేస్తున్నాం. మొత్తం రికార్డులను పరిశీలించాల్సి ఉంది కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తాం. అప్పటివరకూ ట్రయల్ కోర్టు ఆదేశాల అమలుపై మధ్యంతర స్టే విధిస్తున్నాం’’ అని వెల్లడించింది. ఈడీ పిటిషన్పై స్పందించాలంటూ కేజ్రీవాల్కు నోటీసు జారీ చేసింది. -
కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలున్నాయి: ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. సాధారణ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు బుధవారం విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంను కోర్టు ముందు హాజరుపరిచారు.ఈ సందర్బంగా కేజ్రీవాల్పై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ఆరోపణలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు తమ ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొన్నారు.‘ఈ కేసులో మనీలాండరింగ్ నేరంపై కోర్టు విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా సహ నిందితుల బెయిల్ పిటిషన్ను తిరస్కరించడం ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ జరిగినట్లు కోర్టు విశ్వసిస్తోంది’ ఆయన పేర్కొన్నారు.పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. అంతేగాక సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం కేజ్రీవాల్ను నిందితుడిగా పేర్కొనలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.ఇక కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10న సుప్రీం కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం కేసు ఆగస్టు 2022లో ప్రారంభమవ్వగా.. ఎన్నికలకు ముందు 2024 మార్చిలో కేజ్రీవాల్ అరెస్టు చేశారని అన్నారు. ఆయన అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు.మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
మనీలాండరింగ్ కేసు: జైలులో ఉన్న జార్ఖండ్ మంత్రి రాజీనామా
రాంచి: మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న అలంగీర్ ఆలం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలంగీర్ ఆలం మంత్రి పదవికి, కాంగ్రెస్ పక్ష నేత పదవికి రాజీనామా చేసినట్లు ఆయన కుమారుడు తన్వీర్ ఆలం వెల్లడించారు. జూన్ 8 (శనివారం) ఆయన రాజీనామా చేసి.. రిజైన్ లెటర్ను అదే రోజు సీఎం కార్యాలయానికి పంపించారు. అయితే ఆయన రాజీనామా లేఖ జార్ఖండ్ సీఎం చంపయ్ సోరెన్ ఆఫీసుకు సోమవారం చేరినట్లు తన్వీర్ తెలిపారు. అలంగీర్ ఆలం రాజీనామా చేసినట్లు జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ నిర్ధారించారు. మనీలాండరింగ్ కేసులో అలంగీర్ను దర్యాప్తు చేయటం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే15న అరెస్ట్ చేసింది. మే 6 అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలం ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీకి సుమారు రూ. 37 కోట్ల భారీ నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. భారీగా నగదు పట్టుబడటం జార్ఖండ్లో సంచలనం రేపింది. అలంగీర్ ఆలంతోపాటు సంజీవ్ లాల్ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్ మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఈడీ జహంగీర్ ఆలం ఇంటిపై సోదాలు చేసింది. వీరేంద్ర కె రామ్ గతేడాది అరెస్ట్ అయ్యారు. రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్కు సంబంధించిన పలు స్కీముల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.చదవండి: మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు -
హేమంత్ సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. జనవరిలో ఈడీ సొరెన్ను ఆరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. రాంచీ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్న ఫిర్యాదులో వాస్తవాలను బయటపెట్టకపోవటంపై ప్రశ్నించింది. దీంతో తాము దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు సొరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసే అవకాశాలు ఉన్నందున బెయిల్ పిటిషన్ను ఉపసంహరిచుకున్నారు. దీంతో మాజీ సీఎం సొరెన్ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. జార్ఖండ్ మొత్తం 14 లోక్సభ సీట్లలో ఇప్పటి వరకు 7 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మరో 7 స్థానాకలు ఆరో విడత( మే 25), ఏడో విడత (జూన్ 1)న పోలింగ్ జరగనుంది. ఇక.. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పాల్గొనడాడికి మధ్యంతర బెయిల్ కోరుతూ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనపై దాఖలైన నగదు అక్రమ చలామణీ కేసులో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా సొరెన్ చెడగొట్టేందుకు ప్రయత్నించొచ్చని సుప్రీంకోర్టుకు తెలిపింది -
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు. సీబీఐ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జూన్ 3 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎ మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడినీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. మరో ఐదు రోజుల పాటు.. ఈ నెల 20 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయముర్తి కావేరి బవేజా తెలిపారు.తీహార్ జైల్లో ఉన్న మనీష్ సిసోడియా నేటితో కస్టడీ ముగియగా.. ఆయన వీడియో కాన్ఫరెస్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై దాఖలు చేసిన ఆప్పీల్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిసోడియాపై ఉన్న ఆరోపణలపై వాదనలను కోర్టు వాయిదా వేసింది.ఇక.. లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) గతేడాది మార్చి 9న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన తిహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీపై ఉంటున్నారు.గత నెల 30న సిసోడియాకు రెండోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను జడ్జి బవేజా కొట్టివేశారు. సిసోడియాకు బెయిల్ లభిస్తే ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మార్చడం, సాక్షులను ప్రభావితం చేయడం వంటి వాటికి పాల్పడే అవకాశముందని, ఈ కేసులో మనీష్ సిసోడియా చాలా కీలక నిందితుడని ఈడీ తెలిపింది. -
Delhi liquor scam: కేజ్రీవాల్కు ‘ప్రచార’ బెయిల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు పలు షరతులు విధించింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. కేజ్రీవాల్కు వచ్చే నెల 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన కేజ్రీవాల్కు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడం లేదా జైలు నుంచి విడుదల చేయడం వంటి అంశాల్లో సదరు నిందితుడికి సంబంధించిన ప్రాధాన్యతలు, అతడి చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. వాటిని విస్మరించడం పొరపాటే అవుతుందని ఉద్ఘాటించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం అని గుర్తుచేసింది. కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ కాలేదు కేజ్రీవాల్పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనడంలో సందేహం లేదని.. కానీ, ఆయన ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని, ఆయనకు గతంలో నేర చరిత్ర లేదని, సమాజానికి ఆయన వల్ల ముప్పు సంభవించే పరిస్థితి కూడా లేదని వివరించింది. కేజ్రీవాల్ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనా? అది చెల్లుబాటు అవుతుందా? అని ప్రశి్నస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిపై ఇంకా తుదితీర్పు వెలువడలేదని వెల్లడించింది. కేజ్రీవాల్ కేసు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉంది కాబట్టి అతడికి బెయిల్ ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలించామని తెలియజేసింది. నిందితులకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తనకున్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకుందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రతి కేసుకు సంబంధించిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని కోర్టులు మధ్యంతర బెయిల్ ఇస్తుంటాయని పేర్కొంది. 21 రోజులు బెయిలిస్తే పెద్దగా తేడా ఉండదు తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్పై ఇప్పటికిప్పుడు విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వివరించింది. కేజ్రీవాల్ అప్పీల్ తమవద్దే పెండింగ్లో ఉందని, ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలంటూ ఆయనను ఆదేశించడం సరైంది కాదని భావించామని పేర్కొంది. తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ లెక్కచేయలేదని, అందుకే అరెస్టు చేశామంటూ ఈడీ లేవనెత్తిన వాదనపై ధర్మాసనం స్పందించింది. ఇందులో ఇతర కోణాలు కూడా చూడాలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని ప్రస్తావించింది. మద్యం కుంభకోణంలో దర్యాప్తు 2022 ఆగస్టు నుంచి పెండింగ్లో ఉందని, కేజ్రీవాల్ను ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారని, ఇప్పుడు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తే పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోకేజ్రీవాల్కు వచ్చే నెల 1వ తేదీ దాకా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. షరతులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈ కేసు మెరిట్పై అభిప్రాయాల వ్యక్తీకరణగా చూడొద్దని సూచించింది. తిహార్ జైలు నుంచి విడుదలసుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీసంఖ్యలో గుమికూడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేజ్రీవాల్ తన కాన్వాయ్తో జైలు నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, కుమార్తె హర్షితా, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఉన్నారు. సుప్రీంకోర్టు షరతులివే.. 1. రూ.50,000 బెయిల్ బాండు సమరి్పంచాలి, అంతే మొత్తం పూచీకత్తును తిహార్ జైలు సూపరింటెండెంట్కు అందజేయాలి. 2. బెయిల్పై బయట ఉన్నప్పుడు అధికారిక కార్యాలయంలో గానీ, ఢిల్లీ సచివాలయంలోని గానీ అడుగు పెట్టరాదు. 3.లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు 4. మద్యం కుంభకోణం కేసు గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని, సాక్షులతో భేటీ కావడం, సంప్రదింపులు జరపడం వంటివి చేయొద్దు. 5. మద్యం కేసుతో సంబంధం ఉన్న అధికారిక ఫైళ్లను చూడొద్దు. -
బెయిల్ ఇస్తే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయాలని భావించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఆశ నెరవేరలేదు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ లభించలేదు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది.తొలుత కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ కోరడం సరైంది కాదని మెహతా వాదించారు. ‘‘ఇలాంటి వాటికి కూడా బెయిల్ ఇస్తే రాజకీయ నాయకులను ప్రత్యేక తరగతిగా పరిగణించినట్లు అవుతుంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఓ రైతు తనకు పంట కోతలున్నాయంటూ మధ్యంతర బెయిల్ కోరవచ్చు. అందుకే రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండొద్దు.నిందితుడు సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వొద్దు’’ అని సుప్రీంకోర్టును కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ఒక పార్టీ అధినేతగా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం కేజ్రీవాల్కు ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ఇది నిజంగా అసాధారణ పరిస్థితి. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. ఐదేళ్లకోసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసే అవసరం ఆయనకు ఉంది. ఈ కేసులో ఒకవేళ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేము అనుమతించం.అలా చేయడం విరుద్ధ ప్రయోజనాలకు దారి తీస్తుంది. అందుకే బెయిల్పై విడుదలైతే అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు’’ అని స్పష్టం చేసింది. అభిషేక్ సింఘ్వీ స్పందిస్తూ కేజ్రీవాల్ బెయిల్పై బయటకు వెళ్లినా ఎలాంటి ఫైళ్లపై, పత్రాలపై సంతకాలు చేయబోరని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును వాయిదా వేసింది. బుధవారం లేదా గురువారం లేదా శుక్రవారం.. ఎప్పుడైనా సరే దీనిపై తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్పై కూడా ధర్మాసనం విచారణ జరిపింది. దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు, కేజ్రీవాల్ అరెస్టుకు ముందునాటి ఫైళ్లను అధికారులు కోర్టుకు సమర్పించారు. -
‘హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదు’.. సుప్రీంకోర్టుకు మాజీ సీఎం సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్త పిటిషన్ దాఖలు చేశారు.తన పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదంటూ తాజా పిటిషన్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న వాదనలు పూర్తి కాగా, హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిందని.. ఇప్పటి వరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదని లేదని తెలిపారు. ఈ మేరకు సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందు ప్రస్తావించారు.చదవండి: కవిత బెయిల్పై మే మొదటి వారంలో తీర్పుహైకోర్టు తీర్పు నిరాకరించడం వల్ల తరువాత ఏం చేయాలనే విషయంలో సోరెన్ ప్రతిష్టంభనలో ఉన్నారని పేర్కొన్నారు. చట్టపరమైన పరిష్కారాల కోసం ఆయన ముందుకు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. తాము మళ్లీ హైకోర్టుకు వెళ్లి కనీసం తీర్పు ఇవ్వాలని కోరినా జడ్జి ఏం స్పందించలేదని చెప్పారు. సోరెన్ ఇక జైల్లోఏ ఉంటారా? లోక్సభ ఎన్నికలు కూడా ముగిసిపోతాయి. అప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం’ అని తెలిపారు. దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా .. ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్ ఈ అంశాన్ని విచారించే తేదీలను ప్రకటిస్తుందని పేర్కొన్నారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోరెన్ను జనవరి 31న అరెస్టు చేసింది. ఈ కేసులో గతంలోనే సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఫిబ్రవరి 2న హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం తెలిపింది. సోరెన్ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
Enforcement Directorate: సోరెన్ భూమి అటాచ్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన సన్నిహితులపై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోరెన్కు చెందిన రూ.31 కోట్ల విలువైన 8.86 ఎకరాల భూమిని అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తెలిపింది. సోరెన్తోపాటు భాను ప్రతాప్ ప్రసాద్, రాజ్ కుమార్ పహన్, హిలరియాస్ కచ్ఛప్, బినోద్ సింగ్లపై మార్చి 30వ తేదీన రాంచీలోని మనీ లాండరింగ్ నిరోధక(పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టులో ఈడీ ఈమేరకు చార్జిషీట్ వేసింది. ఈ చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. -
వదలని చిక్కులు.. మహువా మొయిత్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు
కలకత్తా: పార్లమెంటులో డబ్బులు తీసుకొని ప్రశ్నలడిగిన వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాపై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే డబ్బులకు ప్రశ్నల వ్యవహారంలో మహువాపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఆధారంగానే ఈడీ తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో విచారణకు రావాల్సిందిగా ఈడీ పంపిన సమన్లకు ఇటీవల మహువా స్పందించలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈడీ కేసు నమోదు చేయడం గమనార్హం. లోక్పాల్ ఆదేశాలతో మహువాపై కేసు నమోదు చేసిన సీబీఐ ఇటీవలే కలకత్తాలోని ఆమె ఇళ్లలో సోదాలు నిర్వహించింది. కాగా, డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి తన పార్లమెంటు లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను ఇచ్చిన ఆరోపణలపై మహువా ఎంపీ సభ్యత్వాన్ని స్పీకర్ ఇప్పటికే రద్దు చేశారు. ఎథిక్స్ కమిటీ సిఫారసుల మేరకు లోక్సభ స్పీకర్ మహువాపై సభ్యత్వ రద్దు చర్య తీసుకున్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మహువా పశ్చిమబెంగాల్లోని కృష్ణానగర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి.. తీహార్ జైలులో కేజ్రీవాల్ కష్టాలు -
మద్యం కుంభకోణంలో ఢిల్లీ మంత్రి కైలాశ్ గహ్లోత్ను ప్రశ్నించిన ఈడీ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. దీనితో ముడిపడ్డ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత కైలాశ్ గహ్లోత్ను ఈడీ శనివారం దాదాపు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సన్నిహితుడైన గహ్లోత్ హోం, రవాణా, న్యాయ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఈడీ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వివాదాస్పద 2021–22 ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించిన మంత్రుల బృందంలో గహ్లోత్ కూడా ఉన్నారు. చార్జిïÙట్లో ఆయన పేరునూ ఈడీ చేర్చింది. మద్యం విధానం ముసాయిదా తయారీ సందర్భంగా ఆప్ కమ్యూనికేషన్ల ఇన్చార్జి విజయ్ నాయర్ ఢిల్లీలోని గహ్లోత్ అధికారిక నివాసాన్ని ఉపయోగించుకున్నట్లు గుర్తించింది. ప్రజాప్రతినిధికి కేటాయించిన అధికారిక బంగ్లాను మరొకరు వాడటం నేరమేనని, దీనిపై చర్యలు తీసుకోవాలని సీబీఐకి సూచించింది. గహ్లోత్ ఒకే సిమ్ కార్డు వాడినా సెల్ఫోన్ ఐఎంఈఐ నెంబర్ మూడుసార్లు మారినట్లు ఈడీ ఆరోపించింది -
రాత్రంతా లాకప్లో..
న్యూఢిల్లీ: ఆప్ సారథి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీలో తొలి రాత్రి భారంగా గడిచింది. లాకప్ రూములో ఉంచి మంచం లేకుండా పరుపు, దుప్పటి మాత్రం ఇచ్చారు. ఏసీ సదుపాయం కల్పించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో గురువారం సాయంత్రం నుంచి కేజ్రీవాల్ను ఆయన నివాసంలో గంటల తరబడి ప్రశ్నించిన ఈడీ అధికారులు, రాత్రి 11 గంటల ప్రాంతంలో అరెస్టు చేయడం తెలిసిందే. రాత్రి భోజనం అనంతరం ఆయనను ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కేజ్రీని లాకప్ గదికి తరలించారు. అక్కడ ప్రత్యేక సదుపాయాలేవీ కలి్పంచలేదు. కేజ్రీవాల్ పెద్దగా నిద్ర పోకుండా భారంగానే గడిపినట్టు సమాచారం. శుక్రవారం ఉదయం చాయ్, అల్పాహారం అందించారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ ఇన్సులిన్ తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. కాసేపటికి కాఫీ ఇచ్చారు. తర్వాత కోర్టులో హాజరు పరిచారు. నిర్బంధంలో సీఎం కుటుంబం: ఆప్ మంత్రుల ధ్వజం కేజ్రీవాల్ కుటుంబాన్ని కలిసేందుకు ఆయన నివాసంలోనికి పోలీసులు అనుమతించడం లేదంటూ ఆప్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ‘‘సీఎం కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రిని, అరెస్ట్తో కుంగిపోయిన కుటుంబాన్ని ఓదార్చనివ్వరా? ఇందుకు ఏ చట్టం అనుమతినిచ్చింది? హౌజ్ అరెస్ట్ను ఆపేయండి’’ అంటూ నినదించారు. అధికారం కోసమే అరెస్టు: కేజ్రీవాల్ భార్య తన భర్తను అక్రమంగా అరెస్టు చేసి ఢిల్లీ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని కేజ్రీవాల్ భార్య సునీత మండిపడ్డారు. ఢిల్లీలో అధికారం దక్కించుకోవాలన్న ఆరాటంతోనే అరెస్టు చేశారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రశ్నించేవారిని అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. -
కేజ్రీవాలే అసలు కుట్రదారు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఆరు రోజులపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి అప్పగిస్తూ రౌజ్అవెన్యూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్ను ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టాలని ఈడీని ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఆదేశించారు. మద్యం కుంభకోణంలో విచారణ కోసం కేజ్రీవాల్ను 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి చేయగా, న్యాయస్థానం కేవలం ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. కేజ్రీవాల్ను ఈడీ అధికారులు గురువారం రాత్రి కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పటిష్టమైన భద్రత మధ్య ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వెనుక ఉన్న అసలు కుట్రదారు, కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని తేలి్చచెప్పారు. ఆయనతోపాటు పలువురు ఢిల్లీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పారీ్టలు నేతలు ఈ కేసులో భాగస్వాములేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో 2021–22లో నూతన లిక్కర్ పాలసీని రూపొందించి, అమలు చేసినందుకు గాను ‘సౌత్ గ్రూప్’ నుంచి కేజ్రీవాల్ కోట్లాది రూపాయలు ముడుపులుగా స్వీకరించారని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా దృష్టికి తీసుకొచ్చారు. సౌత్ గ్రూప్కు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేశారని వెల్లడించారు. నాలుగు హవాలా మార్గాల్లో అందిన రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. మిగిలిన సొమ్ము ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలకు నగదు రూపంలో అందిందని తెలిపారు. నిందితులు, సాకు‡్ష్యల కాల్ డిటైల్ రికార్డులు(సీడీఆర్), స్టేట్మెంట్లు ఇదే విషయాన్ని నిరూస్తున్నాయని తెలియజేశారు. అవినీతి కోసం కేజ్రీవాల్ తన పదవిని వాడుకున్నారని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను ప్రశ్నించి, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, అందుకే ఆయనను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానానికి ఎస్.వి.రాజు విజ్ఞప్తి చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ మనూ సింఘ్వీ హాజరయ్యారు. ‘‘సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరమే లేదు. కేజ్రీవాల్ తప్పు చేశారనేందుకు ఎలాంటి సాక్ష్యాలూ లేవు’’ అని వాదించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దీనిపై విచారణ చేపడతామని ఉదయమే సుప్రీంకోర్టు వెల్లడించగా పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫున అభిõÙక్ సింఘ్వీ మధ్యాహ్నం కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో నిందితురాలైన బీఆర్ఎస్ నేత కవిత బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించిన కాసేపటికే కేజ్రీవాల్ పిటిషన్ను ఉపసంహరించుకోవడం గమనార్హం. ట్రయల్ కోర్టులో విచారణ తర్వాత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సింఘ్వీ చెప్పారు. జైల్లో ఉన్నా సీఎంగా కొనసాగుతా తన జీవితం దేశ సేవకే అంకితమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం కోర్టు నుంచి బయటికొచ్చాక ఆయన మీడియాతో మాట్లా డారు. జైలు బయట ఉన్నా, లోపలున్నా సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. -
Kejriwal: ఈడీ విచారణకు మరోసారి డుమ్మా
న్యూఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డు స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఇప్పటికే లిక్కర్ కేసులో సమన్లకు స్పందించని కేసులో కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చిందని, అయినా ఈడీ మళ్లీ ఎందుకు సమన్లు పంపిందో తెలియడం లేదని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్కు ఈడీ పంపిన సమన్లు చట్ట విరుద్ధమని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో సోమవారం(మార్చ్ 18) తమ ముందు హాజరవ్వాలని ఆదివారం ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అంతకుముందు లిక్కర్ కేసులో ఈడీ వరుస సమన్లకు స్పందించని కేసులో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు శనివారం కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. నేడు కవిత భర్త విచారణ -
కేజ్రీవాల్కు మళ్లీ సమన్లు
న్యూఢిల్లీ: మద్యం విధానం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన నోటీసులను పట్టించుకోని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. విచారణకు రావాలంటూ జనవరి 12, 31వ తేదీలతోపాటు ఫిబ్రవరి 14వ తేదీన పంపిన 4 నుంచి 8 వరకు సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదంటూ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన జడ్జి దివ్యా మల్హోత్రా ఈ నెల 16వ తేదీన తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారు. -
సుప్రీంకోర్టులో డీకే శివకుమార్కు భారీ ఊరట
న్యూఢిల్లీ: కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2018లో శివకుమార్పై నమోదైన మనీలాండరింగ్ కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ఈ కేసులో ఆయనపై విచారణను నిలిపివేయాలని ఈడీని సుప్రీం ఆదేశించింది. డీకే నుంచి రికవరీ చేసిన నగదు మూలాన్ని కనుగొనడంలో దర్యాప్తు సంస్థ విఫలమయ్యిందని పేర్కొంటూ జస్టిస్ అనిరుధ్ బోస్, బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. 2017లో డీకేతోపాటు అతని సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ సోదాల్లో దాదాపు రూ. 300 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఈ కేసును ఈడీ తన ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు చేపట్టింది. 2018లో డీకేపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2019లో అతన్ని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అయితే ఆ తర్వాత నెల రోజులకే ఢిల్లీ హైకోర్టు శివకుమార్కు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ రాజకీయ కక్ష్యకు పాల్పడుతోందని, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని గతంలో శివకుమార్ పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ నేత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని కోరారు. అక్కడ ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. చదవండి: ఎలక్టోరల్ బాండ్లు: మోదీ సర్కారుపై ఖర్గే సంచలన ఆరోపణలు -
టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్
-
మనీలాండరింగ్ కేసు: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ:నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ మఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించి నిధుల దుర్వినియోగం కేసులో విచారించేందుకు ఈడీ సోమవారం సమన్లు ఇచ్చింది. రేపు (మంగళవారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. గత నెల జనవరి 11న కూడా ఈడీ ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేయటం గమనార్హం. దేశంలో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫరూక్ అబ్దుల్లాకు రెండో సారి ఈడీ సమన్లు రావటంపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరగటం గమనార్హం. ఇక.. 2004 నుంచి 2009 వరకు జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్కు సంబంధించి నిధులు పక్కదారి పట్టాయని ఫరూక్ అబ్దుల్లాపై ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ క్రమంలో సీబీఐ రంగంలోకి దిగి.. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ అంశం కావడంతో సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. క్రికెట్ అసోసియేషన్లోని కొందరు ఆఫీస్ బేరర్లతో పాటు ఇతరుల బ్యాంకు నిధులు మళ్లినట్లు ఈడీ గుర్తించింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ చెందిన బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు విత్డ్రా అయినట్లు ఈడీ విచారణలో నిర్ధారించింది. దీంతో 2022లో ఫరూక్పై సీబీఐ అభియోగాలు మోపింది. శ్రీనగర్ లోక్సభ ఎంపీ ఉన్న సమయంలో ఫరూక్ అబ్దుల్లా ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు 2001 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. అదే సమయంలో ఫరూక్ అబ్దుల్లా.. తన అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బీసీసీఐ స్పాన్సర్గా ఉన్న ఈ అసోసియేషన్లో నిధులు పక్కదారి పట్టేలా నియమకాలు జరిగాయని కూడా ఈడీ వెల్లడించింది. చదవండి: Money Laundering Case: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు -
మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు అయంది. తనకు మూడు రోజులు బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజులు బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు మనీష్ సిసోడియా తన మేనకోడలు వివాహానికి హజరవుతారని సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి అవినీతి కేసులో సీబీఐ 26, ఫిబ్రవరి 2023న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరీంగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం మార్చి 9న ఆయన్ను ఆరెస్ట్ చేసింది. చదవండి: Liquor Policy Case: మనీష్ సిసోడియాకు ఊరట -
బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు
రాంచీ: జార్ఖండ్లో కొత్తగా ఏర్పాటైన చంపయ్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన వేళ ప్రభుత్వ సానుకూల ఉత్తర్వును రాంచీ కోర్టు వెలువరిచింది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీలో చంపయ్ సర్కార్ చేపట్టే బలపరీక్షలో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్సోరెన్కు అనుమతినిస్తూ రాంచీలోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. జార్ఖండ్ భూకుంభకోణం ఉదంతంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ హేమంత్ను ఈడీ అరెస్ట్చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. -
జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్!.. కల్పనా సోరెన్కు షాక్?
రాంచీ: జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ పేరు ఖరారైంది. జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపయ్ సోరెన్ను ఎన్నుకున్నట్లు జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రాజేశ్ ఠాకుర్ తెలిపారు. ఆ తరువాత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా లేఖ అందజేశారని వెల్లడించారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. కాగా, చంపయ్ సోరెన్ 1956 నవంబర్లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్ కుటుంబంతో చంపయ్ సోరెన్కు ఎలాంటి బంధుత్వం లేదు. చంపయ్ను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. #WATCH | Jharkhand Minister Alamgir Alam says, "Hemant Soren has resigned from the post of CM...We have the support of 47 MLAs...We have proposed to form a new government. Champai Soren will be our new CM...We have not been given time for swearing in..." pic.twitter.com/AMjjoKNH1F — ANI (@ANI) January 31, 2024 సోరెన్ కుటుంబంలో పొలిటికల్ ట్విస్ట్.. ముఖ్యమంత్రి పదవిపై సోరెన్ కుటుంబంలో ఇంటిపోరు బయటపడింది. హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బహిరంగ ప్రకటన చేశారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నిక కాని, రాజకీయ అనుభవం లేని కల్పననే ఎందుకు? పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలుండగా.. ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. ఆమెను ముఖ్యమంత్రి చేయాలనే ఏ చర్యపైనైనా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తాను’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
మనీ లాండరింగ్ కేసు: సీఎం సోరెన్ అరెస్ట్
రాంచీ: జార్ఖండ్ రాజకీయాలు అనూహ్యమైన మలుపు తిరిగాయి. పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను బుధవారం రాత్రి 9.30 గంటలకు అరెస్టు చేశారు. గురువారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో సోరెన్ను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. అరెస్టు కంటే ముందే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నూతన ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపయ్ సోరెన్ పేరును అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)–కాంగ్రెస్–రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) నేతలు ప్రతిపాదించారు. మనీ లాండరింగ్ కేసులో తొలుత హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు పటిష్టమైన భద్రత మధ్య సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయన తమ ఎమ్మెల్యేలతో రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ను కలిసి తన రాజీనామా పత్రాలు అందజేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ను నిమిషాల వ్యవధిలోనే ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జేఎంఎం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికార నివాసంలో సమావేశమయ్యారు. తమ పార్టీ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నికపై చర్చించారు. కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు జేఎంఎం అధికార ప్రతినిధి వినోద్ పాండే చెప్పారు. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చంపయ్ సోరెన్ అన్నారు. అంతకుముందు హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ లేదా వదిన సీతా సోరెన్ను ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారని ప్రచారం జరిగింది. హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారని జేఎంఎం మహిళా ఎంపీ మహువా మాఝీ చెప్పారు. 7 గంటలపాటు సోరెన్ విచారణ మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు బుధవారం ప్రశ్నించారు. రాంచీలోని సోరెన్ అధికార నివాసంలో 7 గంటలపాటు ఈ విచారణ కొనసాగింది. సోరెన్కు సంఘీభావం తెలియజేస్తూ ఆయన నివాసానికి జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ఈడీ విచారణకు సోరెన్ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా చెప్పారు. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో జేఎంఎం నేతలు, కార్యకర్తలు రాంచీకి చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సోరెన్ను లక్ష్యంగా చేసుకొని, విచారణ పేరుతో వేధిస్తోందని వారు మండిపడ్డారు. దళితుడు కావడం వల్లే సోరెన్పై వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. తమ ముఖ్యమంత్రి జైలుకు వెళితే తాము ఆయనతోపాటు వెళ్తామని తేలి్చచెప్పారు. ఇదే కేసులో ఈడీ అధికారులు ఈ నెల 20న హేమంత్ సోరెన్ను 7 గంటలపాటు విచారించారు. సోమవారం ఢిల్లీలో సోరెన్ నివాసంలో సోదాలు జరిపారు. చట్టవిరుద్ధంగా భూయాజమాన్య మారి్పడికి పాల్పడిన వ్యవహారంలో హేమంత్ సోరెన్ పాత్ర ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈడీ అధికారులపై సోరెన్ ఫిర్యాదు ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోరెన్ ఫిర్యాదు మేరకు రాంచీలోని ఎస్సీ/ఎస్టీ పోలీసు స్టేషన్లో కొందరు సీనియర్ ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలోని తన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిందని, తనను వేధింపులకు గురి చేస్తోందని, తన సామాజిక వర్గాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని ఫిర్యాదులో సోరెన్ ఆరోపించారు. ఈడీ అధికారుల తీరు వల్ల తన కుటుంబం మానసిక వేదన అనుభవిస్తోందని మండిపడ్డారు. ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలో హేమంత్ సోరెన్ ఇంట్లో సోదాలు చేశారు. రూ.36 లక్షల నగదు, కీలక పత్రాలతోపాటు ఓ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ నగదు, ఆ కారుతో తనకు సంబంధం లేదని హేమంత్ తేలి్చచెప్పారు. ఎవరీ చంపయ్ సోరెన్? జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ పేరు ఖరారైంది. ఆయన 1956 నవంబర్లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జని్మంచారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్ కుటుంబంతో చంపయ్ సోరెన్కు ఎలాంటి బంధుత్వం లేదు. చంపయ్ను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. -
సోరెన్ కోసం ఈడీ వెదుకులాట
న్యూఢిల్లీ/రాంచీ: భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇంట్లో లేరని, ఎక్కడున్నారో జాడ తెలియడం లేదని, సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని అధికారులు చెప్పారు. జనవరి 27 రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన సోరెన్ ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. జనవరి 31 మధ్యాహ్నం రాంచీలోని నివాసంలో అందుబాటులో ఉంటానని ఆయన నుంచి మెయిల్ అందినట్లు తెలిపారు. ఈడీ అధికారులు రాత్రి దాకా ఢిల్లీ నివాసంలోనే పడిగాపులు కాశారు. సోరెన్ ఆచూకీ దొరికే దాకా అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన గురించి ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ అభివర్ణించారు. -
రబ్రీ దేవికి ఢిల్లీ కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ కోర్టు బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టులో విచారణకు రావాలంటూ స్పెషల్ కోర్టు జడ్జి విశాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన చార్జిషీటులో ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కట్యాల్ను సైతం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. -
సోరెన్కు ఈడీ మళ్లీ సమన్లు
రాంచీ: భూ మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు సమన్లు జారీ చేసింది. వచ్చే వారంలో 29 లేదా 31వ తేదీల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు విచారణకు రావాలంటూ అందులో కోరింది. తేదీని ఖరారు చేయాలని అందులో స్పష్టం చేసింది. అంతకుముందు, ఈడీ అధికారులు ఈ నెల 27 లేదా 31వ తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు రావాల్సి ఉందంటూ సీఎం సోరెన్ను కోరగా ఆయన స్పదించలేదు. దీంతో, తాజాగా మరోసారి ఆయనకు సమన్లు ఇచ్చారు. -
సోరెన్పై ఈడీ ప్రశ్నల వర్షం
రాంచీ: జార్ఖండ్లో భూకుంభకోణం, సంబంధిత మనీ లాండరింగ్ కేసులో ఆఫీసుకొచ్చి విచారణకు హాజరుకావాలని ఏడు సార్లు సమన్లు ఇచ్చినా బేఖాతరు చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చివరకు ఆయన ఇంటికే వచ్చి విచారించారు. ఈడీ అధికారులు వస్తున్నారన్న వార్తతో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యకర్తలు రావడంతో ఈడీ అధికారుల రక్షణ కోసం భద్రతాబలగాలు భారీ ఎత్తున మొహరించారు. దీంతో ఇంటి పరిసరాలు ఖాకీవనాన్ని తలపించాయి. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాంచీలోని ఆయన నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు సోరెన్పై సుదీర్ఘంగా ఏడు గంటలకుపైగా ప్రశ్నలు సంధించారు. కేసుపై పలు వివరాలు అడిగారు. ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రి జోబా మాంఝీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్, రాజ్యసభ ఎంపీ మహువా మాజీ, కొందరు పార్టీ ఎమ్మెల్యేలు ఇంట్లోనే ఉన్నారు. రాష్ట్ర డీజీపీ అజయ్సింగ్ సైతం అక్కడే ఉన్నారు. జేఎంఎం గిరిజన కార్యకర్తలు కొందరు విల్లు, బాణాలతో సోరెన్ ఇంటిపరిసరాల్లో గుమిగూడి ఈడీ వ్యతిరేక నినాదాలిచ్చారు. ఈడీ వ్యతిరేక ర్యాలీలు జరక్కుండా రాంచీ సబ్ డివిజనల్ మేజి్రస్టేట్ ఉత్కర్‡్ష ఇంటి పరిసరాల్లో కర్ఫ్యూ విధించారు. ఈడీ చర్యపై జేఎంఎం కార్యకర్తలు, గిరిజన సంఘాల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగారు. ఇప్పటికే 14 అరెస్ట్లు భూ హక్కులను మాఫియా అక్రమంగా చేతులు మార్చి కోట్లు కొల్లగొట్టారని ఈడీ గతంలో ఆరోపించింది. ఇప్పటికే ఈ కేసులో 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఛావీ రంజన్ సహా 14 మందిని ఈడీ అరెస్ట్చేసింది. ఈ కేసులో బాధితుడిగా నాటకం ఆడుతూ సీఎం రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయిస్తున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. సీఎంను కేసులోకి లాగి ప్రభుత్వాన్ని కూలదోయాలని మోదీ సర్కార్ కుట్ర పన్నిందని జేఎంఎం ఆరోపిస్తోంది. నా పై కుట్ర: సోరెన్ ఏడు గంటలపాటు ఈడీ విచారణ ముగిశాక ఇంటిబయట కార్యకర్తలనుద్దేశించి సోరెన్ మాట్లాడారు. ‘‘ నా పై కుట్ర పన్నారు. కుట్రను త్వరలోనే బయటపెడతా. మనం ఎవరికీ భయపడేది లేదు. మీ విశ్వాసాన్ని సమున్నతంగా నిలిపేందుకు బుల్లెట్లనైనా ఎదుర్కొంటా. నాకు మద్దతుగా ఇక్కడికొచి్చన మీకందరికీ ధన్యవాదాలు’’ అని సోరెన్ ప్రసంగించారు. -
200 రోజులుగా జైల్లోనే.. తమిళనాడు మంత్రికి మరోసారి ఎదురుదెబ్బ
చెన్నై: ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడిలో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మరోసారి నిరాశే ఎదురైంది. మనీలాండరింగ్ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను చెన్ననై సిటీ కోర్టు మూడోసారి తిరస్కరించింది. ఈ కేసులో ఎలాంటి మార్పు జరగనందున బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు చెన్నై ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ అలీ తీర్పునిచ్చారు. కాగా గతేడాది జూన్ 14న మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గత అన్నా డీఎంకే ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ(2018లో ఆయన డీఎంకే పార్టీలో చేరారు).. రవాణాశాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేసినట్లు ఈడీ ఆరోపించింది. ఆఈ కేసులో కేసు నమోదు చేసిన ఈడీ.. అతన్ని అరెస్ట్ చేసింది. అరెస్ట సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. చదవండి: ‘ఆటల్ సేతు’ నిర్మాణం కోసం ఉపయోగించిన టెక్నాలజీ ఇదే! అక్కడ మంత్రికి బైపాస్ సర్జరీ జరిగింది. అనంతరం ఈడీ విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకొని తరువాత జ్యుడీషియల్ రిమాండ్కు తరలించింది. అప్పటి నుంచి అతని రిమాండ్ను కోర్టు పొడిగిస్తూనే ఉంది. గత 200రోజులకు పైగా సెంథిల్ జైల్లోనే ఉన్నారు. ఎటువంటి పోర్ట్ఫోలియో లేకుండా డీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఆగస్టులో బాలాజీపై ఈడీ 3, 000 పేజీల చార్జిషీట్ను దాఖలు చేసింది. అయితే అనారోగ్య కారణాలతో ఇప్పటి వరకు మూడుసార్లు బాలాజీ బెయిల్ కోసం అభ్యర్ధించగా.. ప్రతిసారీ కోర్టులో తిరస్కరణే ఎదురైంది. అంతకముందు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను మద్రాసు హైకోర్టు అక్టోబర్ 19న కొట్టివేసింది. ముందస్తు బెయిల్ దరఖాస్తులను చెన్నై కోర్టు రెండుసార్లు కొట్టివేసింది. -
ఈడీ చార్జిషీట్లో ప్రియాంక పేరు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుడు, వ్యాపారవేత్త సి.సి.థాంపీ నిందితుడుగా ఉన్న అక్రమ నగదు లావాదేవీల(మనీ లాండరింగ్) కేసులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ చార్జి షీట్లో తొలిసారిగా ప్రస్తావించింది. అయితే, ఆమెను నిందితురాలిగా పేర్కొనలేదు. ఈ చార్జిషీట్ను గత నెలలో ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ సమరి్పంచింది. ఈ నెల 22న చార్జిషీట్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను వచ్చే 29వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో గతంలో సమర్పించిన చార్జిషీట్లో ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరును ఈడీ చేర్చింది. చార్జి్జషీట్లో ఏముందంటే.. ► కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా 2005–06లో హెచ్.ఎల్.పహ్వా అనే ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి హరియాణాలోని అమీపూర్లో 40.08 ఎకరాలు కొన్నాడు. అదే భూమిని 2010 డిసెంబర్లో పహా్వకు అమ్మేశాడు. ► ప్రియాంకాగాంధీ 2006 ఏప్రిల్లో పహ్వా నుంచి అమీపూర్లో 5 ఎకరాలు కొనుగోలు చేశారు. 2010 ఫిబ్రవరిలో ఆ భూమిని తిరిగి అతడికే విక్రయించారు. ► పహ్వా సహాయంతో సి.సి.థాంపీ 2005 నుంచి 2008 మధ్య అమీపూర్లో 486 ఎకరాలు కొన్నాడు. ► రాబర్ట్ వాద్రా, థాంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉమ్మడి, వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ► రాబర్ట్ వాద్రాకు, థాంపీకి విక్రయించిన భూమికి గాను లెక్కలోని రాని నగదును పహ్వా స్వీకరించాడు. ► థాంపీ 2020 జనవరిలో అరెస్టయ్యాడు. వాద్రా తనకు గత పదేళ్లుగా తెలుసని ఈడీ విచారణలో అంగీకరించాడు. దుబాయ్లో, ఢిల్లీలో పలుమార్లు కలుసుకున్నామని వెల్లడించాడు. -
మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ
-
మనీలాండరింగ్ కేసు: ప్రియాంక గాంధీకి షాకిచ్చిన ఈడీ
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్ఆర్ఐకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రియాంక పేరును ప్రస్తావించింది. ఎన్నారై వ్యాపారవేత్త సీపీ థంపి, బ్రిటన్ జాతీయుడు సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా దాఖలు చేసిన చార్జ్షీట్లో ప్రియాంకగాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను ఈడీ చేర్చింది. వివరాల ప్రకారం.. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 సంవత్సరంలో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మేశారు. అదే విధంగా 2006లో అమీపూర్ గ్రామంలో హెచ్ఎల్ పహ్వా ద్వారా.. ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2010లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మటం జరిగింది. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయనేది ఈడీ ఆరోపణ. విదేశాలకు చెందిన సీసీ థంపి(యూఏఈ), సుమిత్ చద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్ పాల్పడ్డారని ఆరోపించింది. Enforcement Directorate (ED) has named Congress leader Priyanka Gandhi Vadra in its charge sheet mentioning her role in purchasing agricultural land measuring 40 kanal (five acres) in Haryana's Faridabad from a Delhi-based real estate agent HL Pahwa in 2006 and selling the same… pic.twitter.com/L5zU9XbkKy — ANI (@ANI) December 28, 2023 ఇక, రాబర్ట్ వాద్రాతోపాటు సంజయ్ భండారీ సన్నిహితులు తంపి, సుమిత్ చద్దాలపై ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈడీ వీరిరువురిని అరెస్టు చేశారు. నిందితులు సీసీ థంపీ, రాబర్ట్ వాద్రాల మధ్య డబ్బు లావాదేవీలే కాకుండా లండన్లో ఉన్న 12 బ్రయాన్స్టన్ స్క్వేర్ ఫ్లాట్ను సీసీ థంపి రాబర్ట్ వాద్రా కోరిక మేరకు పునరుద్ధరించారని ఈడీ కోర్టుకు తెలిపింది. లండన్లోని 12 బ్రయాన్స్టన్ స్క్వేర్, 6 గ్రోస్వెనర్ హిల్ కోర్ట్, లండన్తో సహా అనేక అప్రకటిత విదేశీ ఆస్తులను సంజయ్ భండారీ కలిగి ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ రెండు ఆస్తుల్ని నేరపూరితంగా వచ్చిన ఆదాయం నుంచి పొందారు. సీసీ థంపి, సుమిత్ చద్దా ఈ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను దాచిపెట్టి వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు సంజయ్ భండారీకి చెందిన రూ.26.55 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ రెండు ఆస్తులు మనీ లాండరింగ్, 2002 నిబంధనల ప్రకారం నేరం ద్వారా వచ్చిన ఆదాయం నుండి పొందబడ్డాయని తెలిపింది. -
లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: తాను రైల్వేమంత్రిగా ఉన్న కాలంలో భూములు రాయించుకుని కొందరికి రైల్వేలో గ్రూప్–డీ ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు ఈడీ సమన్లు జారీచేసింది. ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కూ సమన్లు పంపింది. ఈనెల 22వ తేదీన ఢిల్లీ ఆఫీస్కు రావాలని తేజస్వీని, డిసెంబర్ 27న రావాలని లాలూకు ఈడీ సూచించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో వీరిద్దరి నుంచి అధికారులు వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఈడీ ఇప్పటికే ఇదే కేసులో ఏప్రిల్లో ఎనిమిది గంటలపాటు తేజస్వీని విచారించింది. లాలూ ప్రసాద్కు ఈ కేసులో సమన్లు పంపడం ఇదే తొలిసారి. గత నెలలో లాలూ కుటుంబానికి ఆప్తుడైన అమిత్ కాత్యాల్ను ఈడీ అరెస్ట్చేసిన నేపథ్యంలో వీరికి సమన్లు జారీకావడం గమనార్హం. -
కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణాల పేరిట భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: కిసాన్ క్రెడిట్ కార్డ్(కేసీసీ)లపై చేపల చెరువుల నిర్మాణానికి రుణాలు ఇచ్చినట్టు లెక్కల్లో చూపి కోట్ల రూపాయలు దారిమళ్లించిన కేసు దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేశారు. సీబీఐ విశాఖపట్నం బ్రాంచ్ ఏసీబీ విభాగం నమోదు చేసిన ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 29న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు ఈడీ అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ సోదాలు ఏ ప్రాంతాల్లో చేశారన్న విషయాలు ఈడీ అధికారులు వెల్లడించలేదు. రాజమండ్రిలోని ఐడీబీఐ బ్యాంక్లో కిసాన్ క్రెడిట్కార్డులపై రుణాల పేరిట మొత్తం రూ. 311.05 కోట్లు దారిమళ్లించినట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. నిందితులు వారి సంస్థలో పనిచేసే ఉద్యోగులు పలువురి నుంచి కేవైసీ డాక్యుమెంట్లు, బ్లాంక్ చెక్కులు, మరికొందరు రైతుల నుంచి వారికి సంబంధించినపత్రాలను సేకరించి వారి పేరిట రుణాలు మంజూరు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సొమ్మును తర్వాత నిందితులు తమ కంపెనీల్లో పెట్టుబడులకు, కుటుంబసభ్యులు, బినామీల పేరిట ఆస్తుల కొనుగోలుకు వాడినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో కొన్ని కీలకపత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వా«దీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. -
సత్యేందర్ జైన్ బెయిల్ గడువు మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ ఆరోపణలెదుర్కొంటున్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. బెయిల్ గడువు శుక్రవారంతో ముగియడంతో జస్టిస్ ఏఎస్ బొపన్న సారథ్యంలోని ధర్మాసనం విచారించాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేకపోవడంతో జస్టిస్ బేలా ఎం. త్రివేది బెయిల్ గడువును డిసెంబర్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. జైన్ పెట్టుకున్న రెగ్యులర్ బెయిల్ దరఖాస్తుపై విచారణ కూడా అదే రోజున ఉంటుందని స్పష్టం చేశారు. మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై గత ఏడాది మేలో జైన్ను ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
అమెరికా కోటీశ్వరుడు సింఘంకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: న్యూస్క్లిక్ ఆన్లైన్ పోర్టల్పై నమోదైన మనీల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అమెరికన్ బిలియనీర్ నెవిల్లె రాయ్ సింఘంకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. భారత్లో చైనాకు అనుకూలంగా కథనాలు రాసేందుకు న్యూస్క్లిక్కు డ్రాగన్ దేశం నుంచి నిధులు అందుతున్నట్లు గతంలో న్యూయార్క్టైమ్స్, తదితర పత్రికల్లో కథనాలు వచ్చాయి. నెవిల్లె రాయ్ సింఘం, ఆయనకు చెందిన న్యూస్క్లిక్ను అత్యంత ప్రమా దకరమైనవని పేర్కొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన ఈడీ..న్యూస్క్లిక్ ఫౌండర్, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థకు చెందిన ఢిల్లీలోని రూ.4.52 కోట్లు విలువ చేసే భవనాన్ని, రూ.41 లక్షల బ్యాంకు డిపాజిట్లను అటాచ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సింఘం ప్రస్తుతం చైనాలోని షాంఘైలో ఉన్నారు. దీంతో, ఆయ నకు విదేశాంగ శాఖ ద్వారా నోటీసులు పంపింది. కాగా, ఈడీ ఆరోపణలను సింఘం ఖండించారు. దర్యాప్తు చేపట్టిన ఈడీ మొదటిసారిగా 2021లో సింఘంకు నోటీసు పంపింది. -
కేజ్రీవాల్కు ఏదో జరగబోతోంది
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఇరుకున పెట్టేందుకు పెద్ద కుట్ర జరగబోతోందని ఆప్ నేత సంజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన అనంతరం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోంది. ఆయన్ను అరెస్ట్ చేయడం మాత్రమే కాదు. అంతకంటే మించి ఏదో చేయడమే ఆ కుట్ర’ అని అన్నారు. మద్యం విధానం కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించని విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. -
ఢిల్లీ మంత్రి నివాసాల్లో 23 గంటలపాటు ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఢిల్లీ సామాజిక, ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాజ్కుమార్ ఆనంద్ నివాసాలు, కార్యాలయాల్లో 23 గంటలపాటు సోదాలు నిర్వహించారు. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం ఉదయం ముగిశాయి. మంత్రిపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. ఆయన అంతర్జాతీయ హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు, తప్పుడు పత్రాలతో రూ.7 కోట్లకుపైగా పన్ను ఎగ్గొట్టినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) చార్జిïÙట్ దాఖలు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు ఈడీ పరిధిలోకి వచి్చంది. తనను వేధించడమే పనిగా పెట్టుకుందని ఈడీపై మంత్రి రాజ్కుమార్ ఆనంద్ మండిపడ్డారు. -
Delhi Liquor Policy Case: సిసోడియా బెయిల్పై 30న సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 30వ తేదీన తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా తిహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్పై అక్టోబర్ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. తీర్పు సోమవారం ఉదయం వెలువడుతుందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
రూ. 1,600 కోట్ల మోసం కేసు.. అశోకా యూనివర్సిటీ కో-ఫౌండర్స్ అరెస్ట్
పారాబొలిక్ డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తా రూ.1600 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడ్డారని ఈడీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులని తమ విచారణలో తేలినట్టు తెలిపింది. దీనిపై అశోకా యూనివర్సిటీ స్పందిస్తూ ఈ కేసుకు, యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మనీలాండరింగ్ కేసులో హర్యానాకు చెందిన అశోకా యూనివర్సిటీ సహా వ్యవస్థాపకులు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. వీరితోపాటు చార్టెట్ అకౌంటెంట్ ఎస్కే బన్సాల్ను సైతం అదుపులోకి తీసుకుంది. ఈ ముగ్గురిని ఈడీ చంఢీగడ్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అయిదు రోజుల కస్టడీకి అనుమతినినచ్చింది. కాగా పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాపై రూ. 1,627 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి మనీలాండరింగ్ కేసు నమోదైంది. వీరిద్దరిపై, సదరు ఫార్మా కంపెనీపై సీబీఐ 2021లో కేసు నమోదు చేసింది. దీంతో 2022లో వారు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పారాబోలిక్ కంపెనీలకు చెందిన మొత్తం 17 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీ, ముంబై, ఛండీగఢ్, పంచకుల, అంబాల తదితర ప్రాంతాల్లోని ఈ సోదాలు జరిగాయి. దీనిపై అశోకా యూనివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈడీ విచారిస్తున్న పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీకి అశోకా యూనివర్సిటీక ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తమ యూనివర్సిటికి 200కుపైగా ఫౌండర్లు, డోనర్స్ ఉన్నారని, వారిలో వినీత్, ప్రణవ్ గుప్తా ఒకరని తెలిపారు. చదవండి: అవును.. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మహువా మొయిత్రా -
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్ అరెస్టు
కోల్కతా: రేషన్ సరుకుల కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పశ్చిమ బెంగాల్ అటవీ మంత్రి, టీఎంసీ నేత జ్యోతిప్రియో మల్లిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 18 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మల్లిక్ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మల్లిక్ను కోర్టులో ప్రవేశపెట్టి, తదుపరి విచారణ కోసం కస్టడీ కోరుతామని చెప్పారు. 18 గంటలపాటు ప్రశ్నించినా నోరువిప్పలేదని, విచారణకు సహకరించలేదని అన్నారు. కాగా, మంత్రి మల్లిక్ను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలినట్లు తెలిసింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. న్యాయస్థానం ఆయనను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
ఢిల్లీ మద్యం కేసు.. నిందితుల జాబితాలో ఆప్!
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అక్కడి పాలక పార్టీ ఆప్ను మరిన్ని సమస్యలు చుట్టుముట్టేలా కని్పస్తున్నాయి. దీనికి సంబంధించిన అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో ఆప్ను కూడా నిందితుల జాబితాలో చేర్చే విషయమై ఆలోచన చేస్తున్నట్టు సీబీఐ, ఈడీ పేర్కొన్నాయి. వాటి తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు సోమవారం సుప్రీంకోర్టుకు ఈ మేరకు నివేదించారు. అవినీతి వ్యతిరేక చట్టం, నగదు అక్రమ తరలింపు (నిరోధక) చట్టంలోని సెక్షన్ 70 ప్రకారం ఈ చర్య తీసుకోదలచినట్టు వివరించారు. అయితే సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో ఆప్పై ప్రత్యేక అభియెగాలు మోపుతారా అన్న విషయమై మంగళవారం స్పష్టత ఇవ్వాల్సిందిగా ఆయనకు ధర్మాసనం సూచించింది. మద్యం విధానం కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్లపై వాదనల సందర్భంగా ఏఎస్జీ ఈ మేరకు ప్రకటన చేశారు. -
టీపీ గ్లోబల్ కేసు: భారీగా నగలు,నగదు, లగ్జరీ కార్లు సీజ్
TP Global FX: టీపీ గ్లోబల్ ఎఫ్ఎక్స్ ఫారెక్స్ ట్రేడింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద అహ్మదాబాద్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు మంగళవారం అధికారిక ప్రకటన తెలిపింది. ఈ సోదాల్లో వివిధ నేరారోపణ పత్రాలు, భారీ ఎత్తున నగదు, నగలు, విలువైన కార్లను స్వాధినంచేసుకుంది. (Jio AirFiber: జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది..లాంచింగ్ ధర, ఆఫర్లు) టీపీ గ్లోబల్ ఎఫ్ఎక్స్ అక్రమ ఫారెక్స్ ట్రేడింగ్కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఈ దాడులు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 ప్రకారం రూ. 1.36 కోట్లు, 1.2 కిలోల బంగారం (సుమారు రూ. 71 లక్షలు), రెండు లగ్జరీ వాహనాలు, హ్యుందాయ్ ఆల్కాజర్ , మెర్సిడెస్ GLS 350D (సుమారు రూ. 89 లక్షలు) కార్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు, బ్యాంక్ ఖాతాలో రూ. 14.72 లక్షలు స్తంభింప జేశామని ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు రూ.242.39 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు లేదా అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. (గణపయ్యకు ఈ ఏడాది అంబానీ అదిరిపోయే గిఫ్ట్) ఇప్పటికే ఈ కేసులో టీపీ గ్లోబల్ ఎఫ్ఎక్స్ కంపెనీ ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారంటూ ప్రసేన్జిత్ దాస్, శైలేష్ పాండే, తుషార్ పటేల్ ఆరోపణలు నమోదైనాయి.డమ్మీ కంపెనీలు/సంస్థలు/ఎంటిటీలద్వారా ఫారెక్స్ ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. గతంలో అరెస్ట్ అయిన వీరు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే రూ.118.27 కోట్ల విలువైన స్థిరాస్తులను హోటల్ రిసార్ట్స్, వాహనాలు, అటాచ్ చేసింది. ED has conducted search operations in Ahmedabad under the provisions of PMLA, 2002 in case of illegal Forex Trading by TP Global FX. During the search, various incriminating documents, cash amounting to Rs 1.36 Crore, 1.2 Kg of Gold (Approx Rs 71 Lakh), two Luxury Vehicle namely… pic.twitter.com/QQFczwKvJ9 — ED (@dir_ed) September 19, 2023 -
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మెడికల్ బెయిల్ను సుప్రీంకోర్టు పొడిగించింది. జైన్ మధ్యంతర బెయిల్ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు ఏఎస్ బోపన్న, బేల ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్లో ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సత్యేందర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు నేడు విచారించింది. ఈడీ తరుపున అడిషనల్ సొలిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ జైన్ కేసును వాయిదా వేయాలని, బెయిల్ పొడిగించాలని కోరారు. దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ను పొడిగిస్తూ విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. జైన్కు వెన్నుముక సర్జరీ తర్వాత ఆయన మెడికల్ బెయిల్ను పొడిగించడం ఇది మూడోసారి. తొలిసారి మే 26న సత్యేందర్ జైన్కు సుప్రీంకోర్టు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత నెల ఆగస్టులో రెండోసారి పొడిగించింది. అయితే మీడియాతో మాట్లాడకూడదు, అనుమతి లేకుండా ఢిల్లీ వదిలి వెళ్లరాదని పలు ఆంక్షలు విధించింది. కాగా ఆమ్ ఆద్మీ నేత, మాజీ మాంత్రి మనీలాండరింగ్ కేసులో మే నెలలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2015 ఫిబ్రవరి 14నుంచి వివిధ వ్యక్తుల పేరిట అక్రమ ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై నమోదైన సీబీఐ ఫిర్యాదుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును విచారిస్తోంది. చదవండి: ఎట్టకేలకు భారత్ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా -
ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్
న్యూఢిల్లీ: కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో శుక్రవారం రాత్రి అరెస్టయిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ను.. మనీ లాండరింగ్ కేసులను విచారించేందుకు ఏర్పాటైన ముంబైలోని ప్రత్యేక కోర్టు సెపె్టంబర్ 11 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపుతూ శనివారం ఆదేశించింది. కెనెరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్ నరేష్ గోయల్, భార్య అనితపై సీబీఐ మే 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్వేస్కు రూ.848.86 కోట్ల రుణ పరిమితులు, రుణాలు మంజూరు చేశామని.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలున్నాయన్న కెనరా బ్యాంకు ఫిర్యాదుపై కేసు నమోదైంది. -
పవన్ ముంజాల్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ ముంజాల్తోపాటు ఇతరుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, గుర్గావ్లో ఈ సోదాలు జరిగినట్లు వెల్లడించారు. పవన్ ముంజాల్తోపాటు ఇతర నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ గతంలోనే కేసు నమోదు చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్(సీబీఐసీ) ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈడీ దర్యాప్తునకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని హీరో మోటో కార్ప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ, గుర్గావ్లో పవన్ ముంజాల్ నివాసం, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిగాయని తెలియజేసింది. పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ గత ఏడాది మార్చిలో పవన్ ముంజాల్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. -
మూడేళ్లలో 3,110 మనీ లాండరింగ్, 12 వేల ఫెమా కేసులు
న్యూఢిల్లీ: గడిచిన మూడేళ్ల కాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 3,110 మనీలాండరింగ్ కేసులు, విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘనల కింద మరో 12 వేల కేసులు నమోదు చేసినట్లు కేంద్రం సోమవారం తెలిపింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఆయా కేసుల తీవ్రత ఆధారంగానే మనీలాండరింగ్ నిరోధక చట్టం–2002, ఫారిన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా)–1999 కింద ఈడీ కేసులు నమోదు చేసినట్లు మంత్రి పంకజ్ చౌధరి వివరించారు. -
మనీ లాండరింగ్ కేసుల్లో 93 శాతం నేర నిరూపణలు
న్యూఢిల్లీ: దేశంతో గత తొమ్మిదేళ్లలో మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 93.54 శాతం నేరాలను నిరూపించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద 31 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసిందని, ఇందులో 29 కేసుల్లో 54 మందిని దోషులుగా గుర్తించిందని వెల్లడించారు. పీఎంఎల్ఏ కింద నేర నిరూపణ రేటు 93.54 శాతం ఉందని పేర్కొన్నారు. అలాగే ఈడీ గత తొమ్మిదేళ్లలో రూ.16,507.86 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని తెలియజేశారు. -
కవిత, కేటీఆర్పై సుఖేష్ సంచలన ఆరోపణలు, గవర్నర్కు మరో లేఖ
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్కు సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న సుఖేష్ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్పై తమిళిసై సౌందరరాజన్కు లేఖ రాశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లలోని ఆధారాలు ఇవ్వాలని అడుగుతున్నారని అన్నారు. ఆధారాలు ఇస్తే రూ. 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీటు ఇస్తామని ఆశపెడుతున్నారని తెలిపారు. తన వద్ద రూ. 2 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తనకు, కవితకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందన్నారు. ఈ ఆధారాలను ఇప్పటికే ఈడీకి 65- బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చానని, కవిత నుంచి రూ. 15 కోట్లు తీసుకొని కేజ్రీవాల్ తరపు వారికి ఇచ్చానని పేర్కొన్నారు. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. చదవండి: మంత్రి హరీశ్ను కలిసిన ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా ఖండించిన కేటీఆర్ మరోవైపు సుఖేష్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. నేరస్థుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయన్నారు. సుఖేష్ అనే వాడి గురించి తానెప్పుడూ వినలేదని, వాడెవడో కూడా నాకు తెలియదని అన్నారు. సుఖేష్ అనే ఒక రోగ్(పోకిరి) చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. సుకేష్ లాంటి మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. Just learnt from media that a delusional fraudster and a noted criminal called Sukesh has made some ludicrous allegations about me I have never heard of this rogue and intend to pursue strong legal action against him for his nonsensical utterances Request media also to be… — KTR (@KTRBRS) July 14, 2023 -
ఈడీని కట్టడి చేయాల్సిందే
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసుల్లో విచారణ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపరిమితాధికారాలు కట్టబెట్టారని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే ఆందోళన వెలిబుచ్చారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. లేదంటే పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుందన్నారు. దేశంలో ఎవరికీ భద్రత కూడా ఉండబోదన్నారు. ఎం3ఎం రియల్టీ గ్రూప్ డైరెక్టర్లు బన్సల్ బ్రదర్స్ అరెస్టు కేసులో మంగళవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఏఎస్ బొపన్న, ఎంఎం సుందరేశ్ ధర్మాసనం ముందు ఆయన వాదనలు విని్పంచారు. విచారణకు డైరెక్టర్లు అన్నివిధాలా సహకరిస్తున్నా ఈడీ నిరంకుశ పద్ధతిలో అరెస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ముందస్తు బెయిల్ నిబంధనల్లో ఒక్కదానికి కూడా విరుద్ధంగా నడుచుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకు జస్టిస్ సుందరేశ్ సరదాగా స్పందించారు. ‘‘మీరన్నది నిజమే. ఇది పిల్లీ ఎలుకా చెలగాటం. వాళ్లు చట్టాలను ఉపయోగిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. బన్సల్ సోదరులను ఈడీ జూన్ 14న అరెస్టు చేసింది. హరియాణాలోని పంచకుల కోర్టు విధించిన ఐదు రోజుల కస్టడీని వాళ్లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు విజ్ఞప్తి మేరకు విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. -
కస్టడీకి అవకాశం ఇవ్వండి
సాక్షి, చైన్నె: సెంథిల్ బాలాజీని చట్టబద్ధంగానే అరెస్టు చేశామని, ఆయన్ను విచారించేందుకు అవకాశం ఇవ్వాలని కోరు తూ ఈడీ వర్గాలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఆగమేఘాలపై ఆదివారం కోర్టుకు పిటిషన్ రూపంలో వివరాలను సమర్పించాయి. మంత్రి సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. ప్రస్తుతం బైపాస్ సర్జరీ అనంతరం ఆయన కావేరి ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఉన్నారు. ఈ పరిస్థితులలో తన భర్తను ఈడీ చట్టవిరుద్ధంగా అరెస్టు చేసినట్టు సెంథిల్బాలాజి సతీమణి మేఘల కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో మేఘల తరఫున వాదనలు ముగిశాయి. ఇందుకు వివరణ ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. తర్వాత విచారణ 27వ తేదీ జరగాల్సిన నేపథ్యంలో ఆదివారమే ఆగమేఘాలపై ఈడీ వర్గాలు రిట్ పిటిషన్ను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించడం గమనార్హం. ఇందులో సెంథిల్ను చట్టబద్ధంగానే అరెస్టు చేశామని వివరించారు. ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అరెస్టు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఆయన్ను ఇంతవరకు తాము విచారించలేదని, కస్టడీకి అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. అలాగే, అరెస్టుకు ముందుగా అధికారులతో సెంథిల్ దురుసుగా ప్రవర్తించారని, ఆయనకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని తారుమారు చేసే పరిస్థితులు ఉన్నట్టు కోర్టుకు ప్రత్యేకంగా వివరించడం గమనార్హం. అదే సమయంలో మేఘల తరఫున అనుబంధంగా మరో పిటిషన్ దాఖలు చేశారు. చట్టంలో పేర్కొనలేని అంశాలతో సమాచారం ఇచ్చినట్టు ఈడీ సూచించిందని వివరించారు. అలాగే, 13వ తేదీ రాత్రే విచారణ ముగించినట్టు పేర్కొన్నారని, రెండు గంటల అనంతరం అరెస్టు చూపించారని, రెండుగంటల పాటు తన భర్తను ఎక్కడ ఉంచారో వివరాలను కోర్టుకు ఈడీ తెలియజేయాలని పిటిషన్లో పేర్కొనడం గమనార్హం. -
ఈడీ కస్టడీకి సెంథిల్ బాలాజీ
సాక్షి, చెన్నై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని 8 రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ చెన్నై జిల్లా మొదటి Ðమేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లిల్లీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో ఆయన్ను కావేరీ ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం డాక్టర్ ఏఆర్ రఘురాం నేతృత్వంలోని బృందం రెండు మూడు రోజులలో ఆయనకు బైపాస్ సర్జరీ చేయడానికి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సెంథిల్ బాలాజీని 15 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ వేసిన పిటిషన్పై చెన్నై జిల్లా మొదటి మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లిల్లీ విచారణ చేపట్టి..ఎనిమిది రోజుల పాటు సెంథిల్ బాలాజీని కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రిలో ఉన్న దృష్ట్యా, విచారణ అక్కడే జరగాలని ఆదేశించారు. సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ను నిరాకరించారు. సెంథిల్ బాలాజీ సోదరుడు అశోకన్ను విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. -
గుండెపోటు వచ్చేంతగా ఒత్తిడి..
మనీలాండరింగ్ కేసులో అత్యంత నాటకీయ పరిణామాలు, ఉత్కంఠ భరిత వాతావరణం నడుమ రాష్ట్ర విద్యుత్, ఎకై ్సజ్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ బుధవారం అరెస్టు చేసింది. అర్ధరాత్రి వరకు కొన్ని గంటల పాటు తనను నిర్బధించి విచారించడంతో ఆందోళనకు గురైన సెంథిల్ బాలాజీకి గుండెపోటు సైతం వచ్చింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సిందేనని వైద్యులు నిర్ధారించారు. అయినా, ఈడీ తగ్గలేదు. ఆయన్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే హయాంలో రవాణాశాఖలో ఉద్యోగాల పేరిట జరిగిన మోసం వ్యవహారం ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంలో విద్యుత్, ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ మెడకు ఉచ్చుగా మారిన విషయం తెలిసిందే. గతంలో ఆయన రవాణా మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలను ఈడీ అస్త్రంగా చేసుకుంది. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో సెంథిల్ బాలాజీని టార్గెట్ చేసింది. మంగళవారం ఆయన నివాసం, సన్నిహితులు, సోదరుడి నివాసం కార్యాలయాలో ఈడీ సోదాలు పొద్దుపోయే వరకు జరిగాయి. కొన్ని గంటల పాటు ఈడీ వర్గాలు విచారణ పేరిట సెంథిల్ బాలాజీని ఉక్కిరి బిక్కిరి చేసినట్టు సమాచారం. అర్ధరాత్రి మూడు గంటల పాటు ఆయన్ను ప్రత్యేక గదిలో ఉంచి నిర్బంధించి మరీ విచారించినట్టు ప్రచారం. దీంతో ఆయన ఆందోళనకు గురై గుండెపోటు తెచ్చుకున్నట్టున్నారు. అదే సమయంలో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచేందుకు ఈడీ ప్రయత్నించినా, చివరకు సెంథిల్ బాలాజీ నొప్పితో పెడుతున్న కేకలతో సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ భద్రతా బలగాలు, ఈడీ వర్గాలు తమ వాహనంలో ఎక్కించుకుని ఓమందూరార్ ప్రభుత్వ మల్టీ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. మూడు చోట్ల బ్లాక్లు.. పరీక్షించిన వైద్యులు సెంథిల్బాలాజీకి గుండెపోటుగా ధ్రువీకరించారు. ఆయన గుండెలోని నాళాలలో మూడు చోట్ల రక్తం బ్లాక్ అయినట్టు తేల్చారు. అత్యవసరంగా ఆయనకు బైపాస్ సర్జరీ చేయాల్సిందేనని సూచించారు. అయితే, ఆయన తమ ఆధీనంలో ఉండడంతో ఈడీ వర్గాలు వైద్యుల సూచనలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. చివరకు ఈఎస్ఐ వైద్యులు పరిశోధించి నిర్ధారించారు. అయినా, ఈడీ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన్న అరెస్టు చేయడం లక్ష్యంగా దూకుడుగానే ముందుకు సాగింది. సెంథిల్ బాలాజీకి గుండెపోటు సమాచారంతో సీఎం స్టాలిన్, మంత్రులు ఓమందూరార్ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడారు. ఆయన్ను కావేరి ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఈడీ అడ్డుపడడంతో కావేరి వైద్యులు ఓమందూరార్కు వచ్చి మరీ పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ఉత్కంఠ నడుమ అరెస్ట్.. సెంథిల్ బాలాజీ అరెస్టుపై ఈడీ దూకుడును ఏమాత్రం తగ్గించలేదు. చైన్నె జిల్లా మొదటి మెజిస్ట్రేట్ న్యాయమూర్తి లిల్లీని ఆశ్రయించారు. ఆమె స్వయంగా ఆస్పత్రికి వచ్చి సెంథిల్ బాలాజీని విచారించారు. వెళ్తూ వెళ్తూ సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసినందుకు తన వద్ద ఆధారాలు సమర్పించినట్టు ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించి వెళ్లారు. దీంతో సాయంత్రం ఆమె కోర్టులో ఈడీ తరఫు, డీఎంకే తరఫు న్యాయవాదులు వాదనలు వాడి వేడిగా జరిగాయి. ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా సోదాల పేరిట వచ్చి అరెస్టు చేయడమే కాకుండా, మానవత్వాన్ని మరిచి మరీ ఈడీ వ్యవహరిస్తున్నదని వాదనలు వినిపించారు. అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు పేర్కొంటున్నా, కస్టడీకి ఈడీ కోరడం వెనుక కక్ష సాధింపు ధోరణి ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని డీఎంకే సీనియర్ న్యాయవాదులు వాదన వినిపించారు. అలాగే, అరెస్టును వ్యతిరేకిస్తున్నామని, రిమాండ్ను రద్దు చేయాలని కోరారు. లేదా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలో అరెస్టుకు సంబంధించిన సమాచారం, సెంథిల్బాలాజీ, ఆయన కుటుంబానికి తెలియజేశామని, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరారు. వాదనల అనంతరం న్యాయమూర్తి తర్వాత ఉత్తర్వులను రిజర్వుడ్లో ఉంచారు. గురువారం న్యాయమూర్తి తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఆయన్ను శస్త్ర చికిత్స నిమిత్తం కావేరి ఆస్పత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో, ఆయన్ను గుండె పోటు వచ్చేంతగా నిర్బంధించాల్సిన పరిస్థితి ఎమిటో అని ప్రశ్నిస్తూ సెంథిబాలాజీ సతీమణి మేఘల హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను తొలుత ఓబెంచ్కు అప్పగించగా, అందులోని ఓ న్యాయమూర్తి తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొనడం చర్చకు దారి తీసింది. రిమాండ్కు కోర్టు ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యా, ఓమందూరార్ ఆస్పత్రి పరిసరాలలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు నిఘా పెంచారు. ఈడీ పర్యవేక్షణలో సెంథిల్ బాలాజీకి చికిత్స అందిస్తున్నారు. నిఘా కట్టుదిట్టం... మంత్రి అరెస్టు సమాచారంతో ఆయన సొంత జిల్లా కరూర్లో, కొంగు మండలంలోని జిల్లాలో భద్రత పెంచారు. కోయంబత్తూరు జిల్లాకు డీఎంకే ఇన్చార్జ్గా సెంథిల్ బాలాజీ దూసుకెళ్తున్నారు. దీంతో అక్కడ ఆయనకు మద్దతు పెరిగింది. అలాగే, ఆయన సామాజిక వర్గం కూడా అధికంగా ఈ మండలంలో ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, ఓమందూరార్ ఆస్పత్రి పరిసరాలను నిఘా నీడలోకి తెచ్చారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు అవస్థలు తప్పలేదు. గుండెపోటు వచ్చేంతగా ఒత్తిడి.. సెంథిల్బాలాజీకి గుండెపోటు వచ్చేంతగా ఈడీ ఒత్తిడి చేసినట్టుందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మరిచి మరీ తమ యజమానుల కోసం (కేంద్రం) ఈడీ వ్యవహరిస్తున్నట్టు స్పష్టం అవుతోందని ధ్వజమెత్తారు. మంత్రులు ఎం సుబ్రమణియన్, నెహ్రూ, ఉదయనిధి స్టాలిన్, గీతా జీవన్ సెంథిల్ బాలాజీని పరామర్శించినానంతరం కేంద్రం తీరుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. బీజేపీ హద్దులు దాటి వ్యవహరిస్తున్నదని 2024 ఎన్నికలలో ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కోయంబత్తూరు , తిరుప్పూర్, ఈరోడ్ కొంగు మండలంలోని జిల్లాలో బీజేపికి వణుకు పుట్టించే విధంగా సెంథిల్బాలాజీ పనితీరు ఉండడంతో, ఆయన్ను అడ్డు తొలగించుకునేందుకే అరెస్టు అని మండిపడ్డారు. డీఎంకే మిత్ర పక్ష పార్టీలు సీపీఐ నేత రాజా, సీపీఎం నేత బాలకృష్ణన్ అరెస్టును ఖండించారు. అయితే, ఈ అరెస్టును అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమర్థించారు. ఈడీని వెనకేసుకొచ్చారు. తప్పు చేసిన వాళ్లు శిక్షించ బడాల్సిందేనని వ్యాఖ్యలు చేశారు. -
డెక్కన్ క్రానికల్ వెంకట్రామ్రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామ్రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంక్, ఐడీబీఏ బ్యాంక్లను మోసం చేసిన కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. వెంకట్రామ్రెడ్డితో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. వీరిని నేడు కోర్టులో హాజరుపచిన అనంతరం రిమాండ్కు పంపనున్నారు. కాగా రూ. 8 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో వెంకట్రామ్రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది. పెద్ద మొత్తంలో రుణాలు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. రుణాలు ఎగవేసిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా వెంకట్రామ్రెడ్డిపై ఈడీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతోంది. గతంలో వెంకట్రామ్రెడ్డికి చెందిన రూ,3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన పలు బ్యాంకుల్లో 8,800 కోట్ల రుణాలు తీసుకోగా.. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది. చదవండి: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో -
ఉదయనిధి స్టాలిన్ ఫౌండేషన్ ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి నడిపే ఫౌండేషన్కు చెందిన రూ.36 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఫౌండేషన్కు చెందిన తమిళనాడులోని రూ.36 కోట్ల విలువైన స్థిరాస్తులను, రూ.34.7 లక్షల బ్యాంక్ డిపాజిట్లను ఈనెల 25న అటాచ్ చేసినట్లు వివరించింది. ఈ కేసు దర్యాప్తులో కల్లాల్ గ్రూప్, యూకే కేంద్రంగా పనిచేసే లైకా గ్రూప్ అనుబంధంగా భారత్లోని లైకా ప్రొడక్షన్స్, లైకా హోటల్స్లో సోదాలు జరిపినట్లు తెలిపింది. -
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు వైద్య పరీక్షలు
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న జైన్కు శనివారం దీన్దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్లో పరీక్షలు చేయించామని, మరోసారి వైద్యుల అభిప్రాయం తీసుకోవాలన్న ఆయన కోరిక మేరకు సోమవారం సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లామని జైలు అధికారులు తెలిపారు. ఆయన వెంట పోలీసులున్నారని చెప్పారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు పరీక్షించాక ఆయన్ను తిరిగి జైలుకు తీసుకొచ్చారన్నారు. జైన్ను 2022 మే 31వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. జైన్ త్వరగా కోలుకోవాలని ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆకాంక్షించారు. ‘జైన్ను బీజేపీ చంపాలనుకుంటోంది. ఇంతటి క్రూరత్వం పనికిరాదు, మోదీజీ’ అంటూ ట్వీట్ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో జైన్ 35 కిలోలు తగ్గారని ఆయన లాయర్ అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. -
Satyendar Jain: బెయిల్ తిరస్కరణ
ఢిల్లీ: ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు ఊరట దక్కలేదు. మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న జైన్కు గురువారం బెయిల్ తిరస్కరించింది ఢిల్లీ హైకోర్టు. జైన్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. జైన్ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బయటకు వస్తే ఆధారాలను ప్రభావితం చేయొచ్చని సింగిల్ బెంచ్ ధర్మాసనం అభిప్రాయపడింది. జైన్తో సంబంధం ఉన్న నాలుగు కంపెనీలకు సంబంధించిన అక్రమ లావాదేవీలకుగానూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కిందటి ఏడాది మే నెలలో ఆయన్ని అరెస్ట్ చేసింది. కిందటి ఏడాది నవంబర్లో ట్రయల్ కోర్టు బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చడంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మార్చి 21వ తేదీనే ఇరువవర్గాల వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇవాళ బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చుతున్నట్లు తీర్పు వెల్లడించింది. హవాల రూపంలో నగదు బదిలీ.. లెక్కల్లోలేని సొమ్ముతో చరాస్తుల కొనుగోలు ఆరోపణల మేరకు సీబీఐ సత్యేందర్ జైన్పై కేసు నమోదు చేయగా.. ఆపై ఈడీ మనీల్యాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు జైల్లో ఆయనకు అందిన వీఐపీ ట్రీట్మెంట్ వీడియోలు బయటకు రావడంతో.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
ప్రతిపక్షాల ఆరోపణలు.. ఎంతమంది నేతలపై కేసులున్నాయో చెప్పిన ఈడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్త.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). విపక్ష నేతలనే ఈడీ లక్ష్యంగా చేసుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో తమ కేసుల దర్యాప్తు తదితర వివరాలను సంస్థ తాజాగా ప్రకటించింది. తాము నమోదుచేసిన కేసుల్లో ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులు కేవలం 2.98 శాతమేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టంచేసింది. అయితే మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన ఈ 2.98 శాతం కేసుల్లో నేర నిరూపణ శాతం ఏకంగా 96 శాతం ఉండటం గమనార్హం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ చట్టం, పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం(ఎఫ్ఈఓఏ)ల కింద ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు నమోదైన మొత్తం కేసుల తాలూకు తాజా స్థితిగతులను ఈడీ విడుదలచేసింది. ఈడీ గణాంకాల ప్రకారం... ► మనీ లాండరింగ్ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తంగా 5,906 ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్– ఎఫ్ఐఆర్ లాంటిదే)లు నమోదుకాగా వాటిలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై దాఖలైన కేసులు కేవలం 176 (2.98 శాతం) ఉన్నాయి. ► అన్నింటిపై కోర్టుల్లో మొత్తంగా 1,142 అభియోగ పత్రాలు నమోదుచేశారు. 513 మందిని అరెస్ట్చేశారు. కేవలం 25 కేసుల విచారణ పూర్తయింది. 24 కేసుల్లో నిందితులు దోషులుగా తేలారు. అంటే మొత్తంగా 45 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించింది. అంటే 96 శాతం నేరనిరూపణ జరిగింది. ► 5,906 కేసుల్లో 531 కేసులకు సంబంధించి మాత్రమే సోదాలు, ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అంటే కేవలం 9 శాతం కేసుల్లోనే సోదాలు చేశారు. ► మొత్తం కేసుల్లో ఇప్పటిదాకా ఆస్తుల జప్తు/అటాచ్మెంట్కు సంబంధించి 1,919 ఉత్తర్వులను ఈడీ జారీచేసింది. రూ.1,15,350 కోట్ల ఆస్తులను జప్తుచేసింది. ► ఫెమా చట్టం కింద దాదాపు 34 వేల కేసులు నమోదయ్యాయి. ► ఎఫ్ఈఓఏ చట్టం కింద 15 మందిపై కేసులు నమోదుకాగా తొమ్మిది మందిని పరారైన నేరగాళ్లుగా ప్రకటించారు. -
నటికి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపిన సుఖేష్
ముంబై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సుఖేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి ఛాహత్ ఖన్నాకు రూ.100కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపాడు. తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కావాలని అతని తరఫు న్యాయవాది హెచ్చరించాడు. ఛాహత్ ఖాన్నా చేసిన ఆరోపణల వల్ల సుఖేష్ పరువు పోయిందని, మానసికంగా వేధనకు గురయ్యాడని న్యాయవాది పేర్కొన్నాడు. పలు బాలీవుడ్ సినిమాలతో పాటు, సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛాహత్ ఖన్నా. ముఖ్యంగా 'బడే అచ్చే లగ్తే హై' సీరియల్తో బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుఖేశ్ తనను కూడా మోసం చేసేందుకు ప్రయత్నించాడని, తిహార్ జైల్లో అతడ్ని కలిసినప్పుడు పెళ్లి చేసుకుంటాని ప్రపోజ్ చేశాడని ఆరోపించింది. 'ఢిల్లీలో ఈవెంట్ ఉందని చెప్పి ఏంజెల్ ఖాన్(పింకీ ఇరానీ) అనే మహిళ నన్ను తీసుకెళ్లింది. తీహార్ జైలు రోడ్డు మార్గం నుంచి వెళ్లాలని పేర్కొంది. ఆ తర్వాత జైలు వద్ద ఆపి లోపలికి తీసుకెళ్లింది. అక్కడ సుఖేష్ చంద్రశేఖర్ నన్ను కలిశాడు. బ్రాండెడ్ షర్టు వేసుకొని బాగా సెంటు రాసుకొని మెడలో గోల్డ్ చైన్ ధరించి ఉన్నాడు. తాను ఓ సౌత్ ఇండియా టీవీ ఛానల్ ఓనర్నని, జే జయలలిత మేనల్లుడినని పరిచయం చేసుకున్నాడు. ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో ఆరెస్టయ్యానన్నాడు. అసలు నన్ను ఇక్కడకు ఎందుకు పిలిపించారు? ఆరు నెలల బిడ్డను వదిలేసి వచ్చా అని నేను చెప్పా. అప్పుడు అతను నేనంటే ఇష్టం ఇన్నాడు. బడే అచ్చే లగ్తే హై సీరియల్లో నా నటన చూసి ఫ్యాన్ అయ్యానని చెప్పాడు. మోకాలిపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. దీంతో నేను అతనిపై అరిచా. నాకు పెళ్లైంది. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పా. నా భర్త నాకు సరైనోడు కాదని, తాను ఎంతగానో ప్రేమిస్తున్నాని సుఖేష్ చెప్పాడు. నేను కోపంతో అక్కడి నుంచి వచ్చేశా. ఆ తర్వాత నేను తిహార్ జైలుకు వెళ్లిన వీడియో చూపించి ఒకరు రూ.10లక్షలు ఇవ్వమని బెదిరించారు. దీంతో నేను జైలుకు వెళ్లిన విషయం ఎవరికీ తెలియవద్దని, తన పెళ్లిపై ప్రభావం పడొద్దని ఆ డబ్బు వాళ్లకు ఇచ్చేశా. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నా భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. నేను ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. కానీ ఒకదాని తర్వాత మరొకటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటి నుంచి నేను బయటపడాలనుకున్నా.' అని ఛాహత్ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా.. సుకేశ్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొన్నారు. చదవండి: మైనర్తో బాడీ మసాజ్ చేయించుకున్న క్రికెట్ కోచ్ -
డేటింగ్ చేయమని రోజు పది సార్లు కాల్ చేసేది.. నటిపై సంచలన ఆరోపణలు
సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అయి తే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వివరించాడు. మరో నటి నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశాడు. నోరా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్పై ఎప్పుడూ అసూయపడేదని సుకేశ్ విచారణలో తెలిపాడు. తాను జాక్వెలిన్తో రిలేషన్లో ఉండగా.. తనను బ్రెయిన్వాష్ చేయడానికి ప్రయత్నించేదని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నేను జాక్వెలిన్ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ చేయాలని కోరిందని సుకేశ్ వివరించారు. నోరా నాకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేసేదని ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. నోరా ఫతేహి ఈడీ ముందు తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆమె దుర్మార్గపు ఆలోచనలతో తమను మోసం చేసిందని పేర్కొన్నాడు. అయితే జాక్వెలిన్ ఇచ్చిన వాంగ్మూలంపై తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించిన వివరాలతో దిల్లీ పోలీసులు అనుబంధ ఛార్జిషీట్లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ గురించి సుకేశ్ ప్రస్తావిస్తూ.. 'ఆమె నేను గౌరవించే వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ నా జీవితంలో భాగం. ఆమెతో నాతో ఉంటే సంతోషం. ఈ కేసు ఆమెను ఎలా ప్రభావితం చేసిందో నాకు తెలుసు. జాక్వెలిన్ను చూసుకోవడం నా బాధ్యత. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.' అని అన్నారు. కాగా.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
అతని వల్ల నా కెరీర్ మొత్తం నాశనం: ప్రముఖ నటి
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో కీలక విషయాలు వెల్లడించింది. కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో సుకేశ్ చంద్రశేఖర్పై సంచలన కామెంట్స్ చేసింది. కాగా ఈ కేసులో కీలక నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్పై బాలీవుడ్ నటి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అతని వల్లే తన కెరీర్ పూర్తిగా నాశమైందని వాపోయింది. సుకేశ్ తన భావోద్వేగాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జాక్వెలిన్ మాట్లాడుతూ..'సుకేష్ చంద్రశేఖర్ నా కెరీర్ నాశనం చేశాడు. అతను ఒక మోసగాడు. నేను అతని తప్పులను గుర్తించలేకపోయా. నన్ను నయవంచనకు గురిచేశాడు. తనను తప్పుదారి పట్టించాడు. నా భావోద్వేగాలతో ఆడుకున్నాడు.' అంటూ తన వాంగ్మూలంలో వివరించింది. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. కాగా.. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇటీవలే ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
రూ.100 కోట్ల వసూళ్ల కేసులో మాజీ మంత్రికి ఊరట
ముంబై: నెలకి రూ.100 కోట్లు వసూళ్లకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరుపై స్టే పొడగించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది బాంబే హైకోర్టు. దీంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది. డిసెంబర్ 12న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత అనిల్ దేశ్ముఖ్కు జస్టిస్ ఎంఎస్ కర్నిక్ బెయిల్ మంజూరు చేశారు. అయితే, సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు 10 రోజుల సమయం కావాలని సీబీఐ కోరింది. దీంతో ఆయన విడుదల వాయిదా పడింది. గత వారం సీబీఐ అభ్యర్థన మేరకు డిసెంబర్ 27 వరకు బెయిల్పై స్టే విధించింది బాంబే హైకోర్టు. సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం శీతాకాల సెలవుల్లో ఉంది. దీంతో కేసు విచారణ 2023, జనవరిలోనే జరగనుంది. దీంతో మరోసారి స్టే పొడిగించాలని కోరింది దర్యాప్తు సంస్థ. కానీ అందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించిన క్రమంలో మాజీ మంత్రి దేశ్ముఖ్ బుధవారం జైలు నుంచి విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఇదీ కేసు.. అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కేసులో గతేడాది నవంబర్లో ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో గత అక్టోబర్లోనే బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో స్పెషల్ కోర్టు ఆయనకి బెయిల్ నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం ఎన్సీపీ నేత హైకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు బెయిల్ మంజూరు .. క్షణాల్లోనే షాక్! -
Satyendar Jain: ఆప్ మంత్రికి మరో ఎదురు దెబ్బ..15 రోజుల పాటు..
మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కి మరో ఎదురుదెబ్బ తగిలింది. కనీసం సందర్శకులు ఆయన్ను కలుసుకునేందుకు లేకుండా 15 రోజుల పాటు శిక్ష విధించింది. అలాగే అతనికి సెల్, టేబుల్, కుర్చి వంటి అన్ని సౌకర్యాలను తొలగించింది. ఈ మేరకు బీజేపీ నేతృత్వలోని ప్రభుత్వ ప్రతినిధి డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల నేపథ్యంలోనే సత్యేందర్పై ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే అప్పటి జైలు అధికారి సందీప్ గోయోల్ కారణంగానే సత్యేందర్ జైల్లో రాజభోగాలు అనుభవించారంటూ విమర్శలుల రావడంతో గోయెల్పై కూడా కమిటీ శాఖాపరమైన చర్యలను తీసుకున్నట్లు పేర్కొంది. అదీకూడ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ బీజేపీని ఓడించిన వారాల తర్వాత జైన్పై ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి అవినీతి ఆరోపణలు ఎదర్కొంటూ తిహార్ జైలులో ఉన్నసత్యేందర్ జైన్ జూన్ నుంచి జైలులోనే ఉన్నారు. ఆయన వరుస సీసీటీవీ వీడియో లీక్లతో వార్తల్లో హాట్టాపిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. జైల్లో ఆయనకు విఐపీ ట్రీట్మెంట్, పసందైన విందు అంటూ బీజేపీ వరుస వీడియోలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులను సస్పెండ్ చేశారు కూడా. ఆఖరికి ఆయన బెయిల్ తిరస్కరణకు గురవ్వడం తోపాటు మత విశ్వాసాలకు తగ్గట్టుగా ఆహారం తీసుకునేలా అనుమతించమంటూ చేసుకన్న అభ్యర్థన సైతం కోర్టు తిరస్కరించింది. (చదవండి: నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం) -
ఆప్ నేతకు రూ. 60 కోట్లు ఇచ్చా: సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: రూ. 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న కాన్మన్ సుకేశ్ చంద్రశేఖర్.. గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేశాడు. తాజాగా మరోసారి ఆప్ పార్టీపై, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశాడు. పార్టీ నేత సత్యేంద్ర జైన్కు రూ. 60 కోట్లు ఇచ్చిన్నట్లు పేర్కొన్నాడు. అంతేగాక పార్టీ అధినేత కేజ్రీవాల్ను సైతం కలిసినట్లు తెలిపాడు. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ను మంగళవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఉన్నతస్థాయి కమిటీ సుకేశ్ వాంగ్మూలాన్ని స్వీకరించిందని, దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉందని అతని తరపు న్యాయవాది అనంత్ మాలిక్ మీడియాకు తెలిపారు. తనను రాజ్యసభకు నామినేట్ చేస్తానని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత జైన్కు 2016లో అసోలాలోని తన ఫామ్హౌజ్లో రూ.50 కోట్లకు పైగా ఇచ్చానని సుకేశ్ తెలిపాడు. తర్వాత హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో కేజ్రీవాల్ జైన్తో కలిసి పాల్గొన్నారని చంద్రశేఖర్ పేర్కొన్నాడు. అంతేగాక 2019లో జైలులో తన భద్రత కోసం జైన్ రూ. 10 కోట్లు వసూలు చేశాడని చంద్రశేఖర్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రాసిన లేఖలో ఆరోపించారు.పార్టీ కోసం 20 మంది వ్యక్తులను వెతికి వారి నుంచి పార్టీ కోసం 500 కోట్ల ఫండ్ సమకూర్చాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు. సత్యేంద్ర జైన్ తనను బెదిరించారని తెలిపాడు. అప్పటి జైళ్ల శాఖ డీసీ సందీప్ గోయెల్కు రూ.12.50 కోట్లు చెల్లించినట్లు కూడా పేర్కొన్నాడు. తాను నేరస్థుడు అని భావిస్తే.. నా నుంచి రూ.50 కోట్లు ఎందుకు స్వీకరించారని కేజ్రీవాల్ను ప్రశ్నించారు. అయితే చంద్రశేఖర్ ఆరోపణలు అబద్దమని ఆప్ కొట్టిపారేసింది. ఇవన్నీ బీజేపీ ఆడుతున్న నాటకాలని విమర్శించింది. చదవండి: యూనిఫామ్ ఉందని మరిచారా సార్! మహిళతో ఎస్సై డ్యాన్స్ వీడియో వైరల్ కాగా ఇదే కేసులో బాలీవుడ్ నటులు నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విలువైన బంగ్లాతో పాటు విలువైన కానుకలు సుకేశ్ స్వీకరించినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఈడీతో పాటు ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. -
రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండో రోజు ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. మానీలాండరింగ్ కేసులో ఈడీ అడిగిన ఫార్మాట్తో వివరాలతో విచారణకుహజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈడీ అధికారులు ఉదయం 10.30 గంటలకు రమ్మన్నారని తెలిపారు. అయ్యప్ప దీక్షలో ఉండటంతో పూజా కార్యక్రమం వల్ల రాలేకపోయానని తెలిపారు. అయ్యప్ప దీక్ష కారణంగా ఆలస్యం అవుతుందని ఉదయం ఈడీ అధికారులకు మెయిల్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో మధ్యాహ్నం తరువాత విచారణకు వచ్చేందుకు ఈడీ అధికారులు అనుమతిచ్చారన్నారు. పూజ , భిక్ష పూర్తి చేసుకొని విచారణకు వచ్చినట్లు తెలిపారు. కాగా మానీలాండరింగ్ కేసులో రోహిత్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. ఎమ్మెల్యేపై ఈసీఐఆర్ 48/2020 ప్రకారం కేసు నమోదు చేసి ప్రశ్నిస్తోంది. సోమవారం సుమారు ఆరుగంటలపాటు రోహిత్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ.. మరోసారి మంగళవారం విచారణకు రావాలని ఆదేశించింది. పర్సనల్ ప్రొఫైల్, బిజినెస్ ప్రొఫైల్తో హాజరు కావాలని ఈడీ తెలిపింది. రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యుల వివరాలు.. విదేశీ ప్రయాణాలు, ఫోన్ నెంబర్స్ తీసుకురావాలని పేర్కొంది. రోహిత్ రెడ్డిఫై గతంలో నమోదు అయినా కేసుల వివరాలు తెలపాలంది. కంపెనీ ఇన్కం టాక్స్ వివరాలు తీసుకురావాలని చెప్పింది. ఎమ్మెల్యే ఆర్థిక స్థితిగతుల వివరాలు, బ్యాంకు అకౌంట్స్, లాకర్స్ వివరాలు సమర్పించాలని తెలిపింది. ఈడీ అడిగిన వివరాలతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. చదవండి: దిగ్విజయ్ని నియమించటం హర్షణీయం: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు బెయిల్ మంజూరు.. అంతలోనే
ముంబై: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అవినీతి, అధికార దుర్వినియోగం కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్కు బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఏకసభ్య ధర్మాసనం వెల్లడించింది. అలాగే సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. అయితే బెయిల్ మంజూరు చేసిన కొద్ది క్షణాలకే ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సమయం కావాలని సీబీఐ హైకోర్టును కోరింది. దీనిపై స్పందించిన హైకోర్టు జస్టిస్ కార్నిక్.. అనిల్ దేశ్ముఖ్ బెయిల్ ఆర్డర్పై 10 రోజులపాటు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యను దేశ్ముఖ్ తరఫున న్యాయవాదులు అనికేత్ నికమ్, ఇంద్రపాల్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. బెయిల్ ఉత్తర్వులు ఏడు రోజుల్లో అమల్లోకి వచ్చేలా చూడాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే తన ఆర్డర్ను సవాల్ చేసుకోవాలంటూ జస్టిస్ పేర్కొన్నారు. కాగా 71 ఏళ్ల దేశ్ముఖ్కు అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి 100 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కేసులో గతేడాది నవంబర్లో ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ అదుపులోకి తీసుకుంది. అవినీతి ఆరోపణలపై సీబీఐ, మనీలాండరింగ్ కేసులో ఈడీ రెండూ దేశ్ముఖ్పై దర్యాప్తు చేస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో గత అక్టోబర్లోనే బాంబే హైకోర్టు బెయిల్ మంజురు చేసింది. సీబీఐ కేసు కేసులో స్పెషల్ కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం ఎన్సీపీ నేత హైకోర్టును ఆశ్రయించాడు. దేశ్ముఖ్ పిటిషన్ను విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సీబీఐ అభ్యర్థనతో మళ్లీ స్టే విధించింది. చదవండి: బస్సుల్లో ఉమ్మివేస్తే జరిమానా.. ఆ అధికారం కండక్టర్కే -
ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల సోదాలపై ఈడీ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: ఎన్ఆర్ఐ సొసైటీ, వైద్య కళాశాలలో నిధుల మళ్లింపుపై నమోదైన మనీలాండరింగ్ కేసులో సోదాలపై కీలక ప్రకటన చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించి మొత్తం 53 చోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులను సీజ్ చేసినట్లు తెలిపింది. ‘ నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులు సీజ్ చేశాం. ఎన్ఆర్ఐ సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో దుర్వినియోగం చేశారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. ఆ ఆదాయాన్ని ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతాల్లో చూపించలేదని గుర్తించాము. ఎంబీబీఎస్ విద్యార్థుల దగ్గర పెద్ద మొత్తంలో అడ్మిషన్ల పేరుతో వసూళ్ళు చేశారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించారు. ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతా నుండి ఎన్ఆర్ఐఏఎస్ అనే మరో ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించాము.’ అని తెలిపింది ఈడీ. ఎన్ఆర్ఐ సొసైటీలో జరిగిన అవకతవకలపై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ ప్రాంతంలో రెండు రోజులుగా సోదాలు నిర్వహించింది. ఇదీ చదవండి: బీసీలను బెదిరించాడు.. చంద్రబాబు ఆ మాట చెప్పలేకపోతున్నాడు: సీఎం జగన్ -
ఈడీ విచారణకు బాలీవుడ్ నటి నోరా
మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఈడీ శుక్రవారం ప్రశ్నించింది. సుకేశ్ భార్య లీనా ఆహ్వానం మేరకు 2020లో చెన్నైలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో జరిగిన కార్యక్రమానికి ఆమె వెళ్లింది. ఆ సందర్భంగా కొత్త ఐఫోన్, ఖరీదైన బ్యాగ్తో పాటు బీఎండబ్యూ కారు అందజేశారని ఈ సందర్భంగా నోరా వెల్లడించిందని ఈడీ వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాల కోసం ఆమెకు మళ్లీ సమన్లు జారీ చేసే అవకాశాలున్నాయని తెలిపాయి. -
మల్లారెడ్డికి ఊహించని షాక్.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ఐటీ అధికారులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులో భాగంగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో సహా కాలేజీల్లో పనిచేసే వారిని కూడా విచారిస్తున్నారు. అయితే, తాజాగా మంత్రి మల్లారెడ్డి కేసులో ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాశారు. కాగా, మంత్రి మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. సోదాలకు సంబంధించి పూర్తి నివేదికతో ఈడీకి ఐటీ అధికారులు లేఖ పంపించారు. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలను ఐటీ.. ఈడీకి తెలిపింది. కాగా, ఈ కేసులో ఈడీ దర్యాప్తు అవసరం ఉందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఇక, మెడికల్ సీట్లు, డొనేషన్లలో అవకతవకలు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు జరపాలని ఐటీ అధికారులు ఈడీని కోరారు. ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లలో సోదాల సందర్భంగా ఐటీ అధికారులు 18 కోట్ల రూపాయలు, లాకర్లను పగులగొట్టి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, దర్యాప్తులో భాగంగా విదేశాల్లో పెట్టుబడులు, విదేశాలకు డబ్బు తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో, ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాసినట్టు సమాచారం. ఈడీ విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఐటీ భావిస్తున్నది. కాగా, ఈ లేఖపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సి ఉంటుంది. -
జేసీ ప్రభాకర్రెడ్డికి ఈడీ షాక్.. భారీగా ఆస్తుల అటాచ్
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ర్డెఇకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చిది. బస్సుల కొనుగోలు కుంభకోణం కేసులో ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దివాకర్ రోడ్లైన్స్, జఠాదర ఇండస్ట్రీస్కు చెందిన 22.10 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. జీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. అశోక్ లేలాండ్ నుంచి తక్కువ ధరకు వాహనాలు కొన్నట్లు తెలిపింది. స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో కొత్త వాహనాలు నడిపినట్టు ఈడీ పేర్కొంది. బీఎస్ 4 వాహనాల స్కాంలో రూ. 38.36 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలిపింది. రూ.6.31 కోట్ల విలువైన నగదు, అభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు సీజ్ చేశారు. రూ. 15.79 కోట్ల విలువైన 68 చరాస్తులను సీజ్ చేశారు. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్ అక్రమాల బాగోతం ఇలా.. టీడీపీ సీనియర్ నేతలు జేసీ దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి బ్రదర్స్ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్–3 కేటగిరీకి చెందిన 154 లారీలు, బస్సులను తుక్కు కింద జటాధర ఇండస్ట్రీస్ పేరున 50, సి. గోపాల్రెడ్డి అండ్ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నకిలీపత్రాలతో వాటిని బీఎస్–4 వాహనాలుగా చలామణిలోకి తీసుకొచ్చారు. అనంతరం వాటిని నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి, ఎన్ఓసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్లలో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్లో 101 వాహనాలు, తెలంగాణలో 33 వాహనాలు, కర్ణాటకలో 15 వాహనాలు, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్గఢ్లో ఒక బస్సు నిర్వహిస్తున్నారు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాక.. వాహనాల బీమాలోనూ వీరు ఫోర్జరీకి పాల్పడ్డారు. వీటిని కొద్దిరోజులపాటు తిప్పి ఆ తర్వాత పోలీసుల ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో (ఎన్ఓసీ) వాటిని ఇతర రాష్ట్రాల వారికి విక్రయించేశారు. కానీ, వీటిని కొనుగోలు చేసినవారు తాము మోసపోయామని గుర్తించి ఫిర్యాదుచేశారు. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎన్ఐసీ)’ రికార్డులను పరిశీలించారు. జేసీ కుటుంబం సమర్పించిన బీమా పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2020 జూన్లో జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డితోపాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిలను అరెస్టుచేశారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. -
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు కోర్టులో మరోసారి చుక్కెదురు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. జైన్తో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వైభవ్ జైన్, అంకుశ్ జైన్లకు కూడా బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్ను మే 30న అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయన జూన్లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. ఇప్పుడు రెండో సారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ కేసులో విచారణకు జైన్ సహకరించడం లేదని, దర్యాప్తు ముందుకుసాగకుండా తమను తప్పదోవ పట్టిస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో న్యాయస్థానం జైన్కు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. 2017 ఆగస్టు 24న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా జైన్ను ఈడీ అదికారులు మే 30న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. తిహాడ్ జైల్లో జైన్కు వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నాడనే ఆరోపణలతో ఆ జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్ర ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
అక్రమ మైనింగ్ కేసు.. ఈడీ ఎదుట విచారణకు హాజరైన జార్ఖండ్ సీఎం
రాంచీ: అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీనికి ముందు ఆయన జార్ఖండ్లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కమలం పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా కొనసాగకుండా అనర్హత వేటు వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా సోరెన్ స్పందించారు. తనను ఎమ్మెల్యేగా తొలగించాలని గవర్నర్కు ఈసీ సిఫారసు చేసిందని, ఆయన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. గవర్నర్ దేని కోసమో ఎదురుచూస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని సోరెన్ చెప్పారు. అలాగే బీజేపీ తనపై మోపిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం అని సోరెన్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇతర పార్టీల నాయకులపైనా ఇలాంటి కేసులనే కేంద్రం పెడుతుందని జోస్యం చెప్పారు. రాజ్యాంగబద్దమైన సీఎం పదవిలో ఉన్న తనకు సమన్లు పంపిన తీరు, విచారణ జరగుతున్న విధానం చూస్తుంటే తాను ఏదో దేశం వీడి పారిపోతానేమో అన్నట్లుగా చేస్తున్నారని సోరెన్ మండిపడ్డారు. ఇప్పటివరకు బడా వ్యాపారవేత్తలు మాత్రమే దేశం విడిచిపారిపోయారని, ఒక్క రాజకీయనాయకుడు కూడా అలా చేయలేదని వివరించారు. తాను రెండేళ్ల కాలంలో రూ.1000కోట్ల మోసానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారని, కానీ ఆ వ్యవధిలో మైనింగ్లో మొత్తం రూ.750కోట్ల వ్యాపారమే జరిగిందని సోరెన్ వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేసే ముందు కనీసం నిజానిజాలు తెలుసుకోవాలని కేంద్రంపై సెటైర్లు వేశారు. చదవండి: గుజరాత్ ఎన్నికల వేళ ఆప్ నేత ఓవరాక్షన్.. కేసు నమోదు! -
రౌత్ అరెస్ట్ చట్టవ్యతిరేకం
ముంబై: ముంబైలోని గోరేగావ్లో పాత్రా ఛావల్(సిద్దార్థ్ నగర్) పునర్నిర్మాణాభివృద్ధి ప్రాజెక్టులో మనీ లాండరింగ్ అభియోగాలపై అరెస్టయి కారాగారంలో గడుపుతున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కేసు వాదనల సందర్భంగా ముంబైలోని ప్రత్యేక కోర్టు జడ్జి ఎంజీ దేశ్పాండే.. కేసును దర్యాప్తుచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘ ఈడీ ముందు హాజరయ్యేందుకు రౌత్ సమయం కావాలన్నారు. అంతలోపే అరెస్ట్చేయడం చట్టవ్యతిరేకం. ప్రధాన నిందితులైన హౌజింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్టక్చర్(హెచ్డీఐఎల్)కు చెందిన రాకేశ్ వధవాన్, సారంగ్ వధవాన్లను ఇంతవరకు ఎందుకు అరెస్ట్చేయలేదు? మహారాష్ట్ర హౌజింగ్, ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(ఎంహెచ్ఏడీఏ) అధికారులను ఎందుకు అరెస్ట్చేయలేదో కారణం చెప్పలేదు. కేసులో మరో నిందితుడు ప్రవీణ్ రౌత్ను ఈ కేసుతో సంబంధం లేకుండా సివిల్ వివాదంలో అరెస్ట్చేశారు. సంజయ్ రౌత్ను ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్చేశారు’ అని జడ్జి వ్యాఖ్యానించారు. తర్వాత సంజయ్, ప్రవీణ్లకు బెయిల్ మంజూరుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో బుధవారం రాత్రి సంజయ్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఉత్తర్వులను బాంబే హైకోర్టులో సవాల్ చేయాలని ఈడీ భావిస్తోంది. -
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఈడీ నోటీసులు..
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాంచీలోని కార్యాలయం ముందు గురువారం(నవంబర్ 3) విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. అక్రమ మైనింగ్కు సంబంధించి పంకజ్పై మార్చిలో మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం గత జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పంకజ్ మిశ్రా, అతని వ్యాపార భాగస్వాములకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.42 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంకజ్, ఇతరులపై నమోదైన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించింది. సోరెన్తో రాజకీయ పలుకుబడి కలిగిన పంకజ్ మిశ్రా తన సహచరుల ద్వారా సాహెబ్గంజ్, దాని పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది. విచారణ సందర్భంగా దేశ వ్యాప్తంగా మొత్తం ఈడీ 47 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో రూ. 5.34 కోట్ల నగదు, రూ. 13.32 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్లను సీజ్ చేసింది. చదవండి: చెన్నైలో వాన బీభత్సం.. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు -
ప్రత్యేక కోర్టులు అక్కర్లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక నేరాల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిల్ను సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ‘ ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు కోర్టులున్నాయి. పోక్సో కోర్టులున్నాయి. ప్రతి ఒక్క అంశానికి విడిగా కోర్టులు ఏర్పాటుచేస్తూ పోతే కింది స్థాయి జ్యుడీషియల్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అందుకు ఒప్పకోం’ అంటూ పిల్ను తిరస్కరించింది. -
మనీ లాండరింగ్ కేసు.. ఆ నటిపై ఈడీ సంచలన ఆరోపణలు
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె దేశం విడిచి పారియేందుకు యత్నించిందని.. ఆధారాలను తారుమారు చేసేందుకు యత్నించిందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. ఆమెపై లుక్ అవుట్ నోటీసులు ఉన్నందున విదేశాలకు వెళ్లలేకపోయిందని ఈడీ తెలిపింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణకు సహకరించడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఆమె తన మొబైల్ డేటాను డిలీట్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నించారని ఈడీ కోర్టుకు వివరించింది. జాక్వెలిన్, మరో నటి నోరా ఫతేహీ ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన కార్లు బహుమతులుగా స్వీకరించారని ఈడీ తెలిపింది. మధ్యంతర బెయిల్ పొడిగింపు: మరోవైపు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు కోర్టులో ఊరట లభించింది. ఆమె మధ్యంతర బెయిల్ను పొడిగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు ప్రకటించింది. తాజాగా నటి పిటిషన్పై మళ్లీ విచారణ చేపట్టిన ఢిల్లీ న్యాయస్థానం బెయిల్ గడువు తేదీని పొడిగించింది. ఆ బెయిల్ గడువు తేదీని నంవబర్ 10 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం సైతం సోదాలు చేపట్టింది. రుణాల ఎగవేత, నకిలీ ఇన్వాయిస్లతో మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలతో హైదరాబాద్ ఎంబీఎస్ జ్యువెలరీలో ఈడీ అధికారులు మంగళవారం ఉదయాన్నే తనిఖీలు చేపట్టారు. ఎంబీఎస్ జ్యువెలరీ బ్యాంకు లావాదేవీలు, వాల్యూయేటర్ ద్వారా గోల్డ్ వంటి వాటిపై సోదాలు చేపట్టారు. ఈడీకి చెందిన 20 బృందాలు ఎంబీఎస్ జ్యువెలరీ షోరూముల్లో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు.. విజయవాడలోనూ ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బిగ్సీ అధినేత సాంబశివరావు ఇంట్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) తనిఖీలు చేపట్టింది. హార్డ్డిస్క్లు, డాక్యుమెంట్లు తనిఖీ చేశారు ఐటీ అధికారులు. హానర్ హోమ్స్లో రూ.360 కోట్ల లావాదేవీలపై ఐటీ విచారణ చేపట్టింది. ఇదీ చదవండి: టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ మరో షాక్.. -
రూ.1,300 కోట్ల ఐఆర్ఈవో ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో రియల్ ఎస్టేట్ సంస్థ ఐఆర్ఈవోకు చెందిన రూ.1,317 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైర్టెరేట్(ఈడీ) తెలిపింది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ లలిత్ గోయెల్ సంబంధీకులకు చెందిన ఆస్తులు ఇందులో ఉన్నాయని వివరించింది. ఇందులో వాణిజ్య స్థలాలు, ప్లాట్లు, నివాస భవనాలు, బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వాణిజ్య స్థలాలు, ప్లాట్లు, నివాస భవనాలు ఇస్తామంటూ కొనుగోలుదారులను మోసగించి వసూలు చేసిన మొత్తాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపించింది. ఈ మేరకు గురుగ్రామ్, పంచ్కుల, లూథియానా, ఢిల్లీలోని పోలీస్స్టేషన్ల పరిధిలో 30 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపింది. -
ఎట్టకేలకు మాజీ మంత్రికి బెయిల్, కానీ..
ముంబై: మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు ఎట్టకేలకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు మంగళవారం(ఇవాళ) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తులపై ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది బాంబే హైకోర్టు. అయితే.. ఈ ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని ఈడీ కోరింది. దీంతో.. సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసేందుకు ఈడీకి వీలుగా బెయిల్ ఆర్డర్ అక్టోబర్ 13 నుంచి అమల్లోకి వస్తుందని హైకోర్టు పేర్కొంది. అయితే.. బెయిల్ లభించినప్పటికీ ఆయన బయటకు రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఏప్రిల్లో సీబీఐ ఆయనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆర్థర్ రోడ్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. 2019-21 మధ్య హోం మంత్రి పదవిలో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కిందటి ఏడాది నవంబర్లో మనీల్యాండరింగ్ ఆరోపణలతో అనిల్ దేశ్ముఖ్ అరెస్ట్ అయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ ఏడాది మొదట్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ అభ్యర్థన తిరస్కరణకు గురైంది. 72 ఏళ్ల అనిల్ దేశ్ముఖ్ వయసు, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తొలుత హైకోర్టు ఈ అభ్యర్థనలపై స్పందించకపోవడంతో.. సుప్రీంకు వెళ్లారు ఆయన తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో.. ఆరు నెలలుగా విచారణకు సైతం స్వీకరించకుండా అభ్యర్థ పిటిషన్ను పెండింగ్లో ఉంచినందుకు సుప్రీం కోర్టు.. బాంబే హైకోర్టును మందలించింది. అధికారం అండతో.. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి అక్రమంగా రూ.4.7 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు అనిల్ దేశ్ముఖ్పై ఉన్నాయి. ఈ మేరకు ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ ఇచ్చిన వాంగ్మూలంతో సీబీఐ, అనిల్ దేశ్ముఖ్పై అవినీతి కేసును నమోదు చేయగా.. ఆ వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగింది. -
నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే సోదరులకు ఈడీ సమన్లు
బనశంకరి: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఆయన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు పిలిచారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను కొనుగోలు చేసిన యంగ్ ఇండియా ట్రస్ట్కు డీకే సోదరులు చెక్ ఇచ్చినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈడీ సమన్లపై శివకుమార్ స్పందించారు. ఈడీకి తనపై చాలా ప్రేమ ఉందని, అందుకే పదేపదే సమన్లు పంపిస్తోందని అన్నారు. ఈ నెల 7వ తేదీన రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో తాను తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉందని, విచారణకు హాజరు కావడానికి మరో గడువు ఇవ్వాలని కోరుతూ ఈడీకి మెయిల్ చేశామని చెప్పారు. -
హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు బెయిల్
Jacqueline Fernandez Bail: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఊరట లభించింది. 200కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరయ్యింది. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసింది. కాగా సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ను నిందితురాలిగాపేర్కొంటూ రెండో అనుబంధ ఛార్జిషీట్ను ఆగస్టు 17న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 26 కోర్టుల ఎదుట హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ అవగా, సోమవారం జాక్వెలిన్ న్యాయవాదితో కలిసి కోర్టుకు హాజరయ్యింది. ఈ క్రమంలో విచారణ సందర్భంగా ఆమెకు బెయిల్ ఇవ్వాలంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరపు న్యాయవాది కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. దీనిపై అదనపు సెషన్స్ జడ్జి శైలేందర్ మాలిక్ ఈడీ స్పందన కోరింది. అయితే అప్పటికే రెగ్యులర్ బెయిల్ అంశం కోర్టులో పెండింగ్లో ఉన్నందున అప్పటివరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని జాక్వెలిన్ న్యాయవాది కోరారు. దీన్ని అంగీకరిస్తూ రూ.50 వేల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ను ఢిల్లీ పాటియాల కోర్టు మంజూరు చేసింది. -
సంజయ్ రౌత్ కస్టడీ మళ్లీ పొడిగింపు
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. మనీ లాండరింగ్ కేసులో రౌత్ను నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ముంబై పట్రా చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకల కేసులో ఆగస్ట్ ఒకటో తేదీన ఈడీ సంజయ్ రౌత్ను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన కస్టడీని న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. రౌత్ బెయిల్ పిటిషన్పై 21న కోర్టు విచారణ చేపట్టనుంది. -
Bengal Schools Scam: పార్థా చటర్జీకి చెందిన రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ, ఆయన సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన రూ.46.22 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రాష్ట్రంలో 2016లో చోటుచేసుకున్న టీచర్ల నియామకం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పార్థా చటర్జీ, అర్పితా ముఖర్జీల ఆస్తులను జప్తు చేసినట్లు సోమవారం తెలిపింది. ఈడీ సోమవారం వీరిపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ వేసింది. వీరిద్దరినీ ఈడీ జూలైలో అరెస్ట్ చేసింది. వీరికి చెందిన పలు ప్రాంతాల్లో దాడులు జరిపిన ఈడీ రూ.55 కోట్ల నగలు, నగదును స్వాధీనం చేసుకుంది. ఇలా ఉండగా, ఇదే కుంభకోణానికి సంబంధించి సీబీఐ నార్త్ బెంగాల్ యూనివర్సిటీ వీసీ సుబిరెస్ భట్టాచార్యను సోమవారం అరెస్ట్ చేసింది. అప్పట్లో ఆయన బెంగాల్ సెంట్రల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా ఉండేవారు. -
ఈడీ ముందుకు కేపీసీసీ చీఫ్ శివకుమార్
సాక్షి బెంగళూరు: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(60) సోమవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణకు రావాలంటూ గురువారం డీకే శివకుమార్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శివకుమార్ వైద్యులతో పాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో 30 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లు, అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న శివకుమార్ను ఈడీ విచారణకు పిలవడం గమనార్హం. రూ.75 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై 2020లో సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించిన రెండో మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన కుమార్తె ఐశ్వర్యను కూడా ప్రశ్నించింది. -
వేధింపులాపి.. మంచి పనులు చేయండి
న్యూఢిల్లీ: బీజేపీ నేతలు ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం ఏమిటో తనకు ఇప్పటివరకు అర్థం కాలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీబీఐ, ఈడీలతో అందరినీ వేధించడం మానేసి, ఇకనైనా దేశం హితం కోసం మంచి పనులు చేయాలని కేంద్రానికి హితవు పలికారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ ఎక్సైజ్ విధానంలో అవకతవకల కేసులో భాగంగా ఈడీ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు చేసింది. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ‘మద్యం పాలసీలో రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ నేత ఒకరన్నారు. ఢిల్లీ బడ్జెట్ అంతా కలిపి రూ.70 వేల కోట్లు. మరిక రూ.1.5 లక్షల కోట్ల స్కాం ఎలా సాధ్యం? మరో బీజేపీ నేత రూ.8 వేల కోట్ల కుంభకోణమని, ఇంకొకరు రూ. 1,100 కోట్లని అంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నరేమో రూ.144 కోట్లని ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం విలువ రూ.1 కోటి మాత్రమేనని సీబీఐ అంటోంది’’ అని ఆయన మీడియాతో అన్నారు. ‘‘మా మంత్రి మనీశ్ సిసోడియా సొంతూరులోని నివాసం, బ్యాంకు ఖాతాల సోదాల్లోనూ సీబీఐకి ఏమీ దొరకలేదు. మరి స్కాం ఎక్కడ జరిగినట్టు?’’ అని ప్రశ్నించారు. అనవసర అంశాలపై దృష్టి పెడితే దేశం వెనుకబడిపోతుందని కేంద్రానికి హితవు పలికారు. తెలంగాణ, ఏపీల్లోనూ దాడులు సాక్షి, న్యూఢిల్లీ/నెల్లూరు క్రైం: ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 40 చోట్ల ఈడీ శుక్రవారం సోదాలు చేసింది. సోదా బృందాలకు పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరు, ఢిల్లీ నివాసాల్లో తనిఖీలు జరిగాాయి. నెల్లూరు రాయాజీవీధిలోని మాగుంట శ్రీనివాసులరెడ్డి పాత నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. బీరువాలను తెరిపించి, అందులోని ఫైళ్లను పరిశీలించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో నివాసముంటున్న ఎంపీ బంధువు (భార్య చెల్లెలి భర్త) శివరామకృష్ణారెడ్డి ఇంటిలోను ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇదే కేసులో ఈ నెల 6న కూడా ఇలాగే దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. -
శివకుమార్కు ఈడీ సమన్లు
బెంగళూరు: మనీ లాండరింగ్ కేసులో తమ ముందు హాజరుకావాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశించింది. ఈడీ సమన్లు జారీచేయడంపై శివకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇంకొద్ది రోజుల్లో కర్ణాటకలో ప్రారంభంకానుంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలున్నాయి. శాసన, రాజకీయ బాధ్యతలను నేను కచ్చితంగా నిర్వర్తించాలి. ఈడీకి సహకరించేందుకు నేను సిద్ధమే. కానీ, ఈ సమయంలో ఉద్దేశపూర్వకంగా ఈడీ సమన్లు పంపి వేధిస్తోంది’ అని శివకుమార్ గురువారం ట్వీట్చేశారు. ‘భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్కు వస్తున్న అపూర్వ ప్రజా మద్దతును చూసి ఓర్వలేక కర్ణాటకలో యాత్ర ఏర్పాట్లకు భంగం కల్గించేందుకే మోదీ సర్కార్ ఇలా ఈడీ(ఎలక్షన్ డిపార్ట్మెంట్) ఆఫ్ బీజేపీని రంగంలోకి దించింది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కర్ణాటక ఇన్చార్జ్ రణ్దీప్ సూర్జేవాలా ఆరోపించారు. (చదవండి: హిందీని బలవంతంగా రుద్ధితో ఊరుకోం) -
రహస్య లాకర్లలో 431 కిలోల బంగారం, వెండి
న్యూఢ్లిలీ: బ్యాంకు లోన్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ అభియోగాలపై దర్యాప్తులో భాగంగా బుధవారం రక్ష బులియన్ అండ్ క్లాసిక్ మార్బుల్స్ అనే సంస్థ కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ బృందానికి కళ్లు బైర్లు కమ్మాయి! రహస్య లాకర్లలో ఏకంగా 431 కిలోల బంగారు, వెండి కడ్డీలు బయటపడ్డాయి. వీటిలో 91 కిలోలు బంగారు, 340 కిలోల వెండి కడ్డీలున్నాయి. వీటి విలువ కనీసం రూ.47.76 కోట్లు ఉంటుందని తేల్చారు. పరేఖ్ అల్యుమినెక్స్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించి కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. బ్యాంకుల నుంచి రూ.2,296.58 కోట్ల మేరకు మోసపూరితంగా రుణాలు తీసుకున్నట్టు 2018లో పరేఖ్ సంస్థపై కేసు నమోదైంది. తర్వాత పలు షెల్ కంపెనీల ముసుగులో ఈ మొత్తాన్ని విదేశాలకు తరలించాలన్నది అభియోగం. దీనికి సంబంధించి గతంలోనే కంపెనీ తాలూకు రూ.205 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఇదీ చదవండి: విద్యుత్ బిల్లుపై వెనక్కి తగ్గేదేలే... -
ఈ–నగ్గెట్స్ ప్రమోటర్ల నివాసాల్లో సోదాలు
న్యూఢిల్లీ/కోల్కతా: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కోల్కతాకు చెందిన మొబైల్ గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.17 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెడ్పై పేర్చిన రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టల ఫొటోను ఈడీ విడుదల చేసింది. అమీర్ ఖాన్, అతడి కుమారుడు నెజార్ అహ్మద్ ఖాన్ కలిసి ‘ఈ–నగ్గెట్స్ పేరిట మొబైల్ గేమింగ్ యాప్ ప్రారంభించారు. వారితోపాటు మరికొందరు ఈ కంపెనీ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి చెందిన దాదాపు 6 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టామని ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ.17 కోట్ల నగదు లభ్యమైందని, నోట్ల కట్టల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. ఈ–నగ్గెట్స్ కంపెనీ గేమింగ్ యాప్ ద్వారా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, వాటిని తిరిగి వెనక్కి తీసుకొనే అవకాశం ఇవ్వకుండా మోసం చేస్తోందంటూ ఫెడరల్ బ్యాంకు అధికారులు కోల్కతా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కంపెనీతోపాటు ప్రమోటర్లపై కోల్కతా పోలీసులు 2021 ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో ఈడీ సోదాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈడీ సొదాలు జరుగుతుండడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న వ్యాపారవేత్తలపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వల్ల బెంగాల్కు పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఎన్ఎస్ఈ అక్రమాలు: మాజీ సీఎండీ రవి నరైన్కు ఈడీ షాక్
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఇ) మాజీ ఛైర్మన్ రవి నరైన్ను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. కో-లొకేషన్ స్కాం కేసులో ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్ లాంటి రెండు క్రిమినల్ కేసుల్లో భాగంగానరైన్ పాత్రను ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. విచారణలో సహకరించపోవడంతో అధికారులు ఆయను అరస్టు చేసినట్టు తెలుస్తోంది. కస్టడీ నిమిత్తం నరేన్ను బుధవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.ఎన్ఎస్ఈలో జరిగిన అవకతవకలపై ఐదేళ్లుగా విచారణచేస్తున్న సంస్థ నారేన్ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేతోపాటు, మరో ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణను అరెస్టు చేసిన నెలల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కోలొకేషన్ స్కామ్లో మనీ లాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించిన దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తున్న రెండో కేసు ఇది. అయితే ఈ కేసులను సమాంతరంగా విచారిస్తున్న సీబీఐ, కో-లొకేషన్ కేసులో ఆమెను అరెస్ట్ చేసింది. రవి నరైన్ 1994 నుంచి 2013 వరకు ఎన్ఎస్ఈ సీఎండీ వ్యహరించారు. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరిలో 2013, ఏప్రిల్ 1 నుంచి 2017, జూన్ 1 వరకు వైస్ చైర్మన్గా పనిచేశారు. -
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు: జాక్వెలిన్కు బిగుస్తున్న ఉచ్చు..
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ఆమెకు డిల్లీ పాటియాల హౌజ్ కోర్టు షాకిచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీన కోర్టులో హాజరు కావాలని జాక్వెలిన్ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు ఆమెకు సమాన్లు ఇచ్చింది. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పరిగణించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల జాక్వెలిన్పై ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్పై నమోదు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో జాక్వెలిన్ పేరును చేర్చింది ఈడీ. ఈ ఛార్జ్షీట్ను ఈడీ కోర్టులో సమర్పించగా దాని ఆధారంగా తాజాగా కోర్టు జాక్వెలిన్కు సమాన్లు జారీ చేసింది. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ కాగా రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే.. ఈడీ అటాచ్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్ ప్రొసీడింగ్స్ను నిలిపి వేయాలని జాక్వెలిన్ ఈడీని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: యాంకర్ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్ అట నటుడు బ్రహ్మాజీ సటైరికల్ ట్వీట్.. అనసూయను ఉద్ధేశించేనా? -
అవినీతి కేసులో దోషిగా మలేసియా మాజీ ప్రధాని.. 12 ఏళ్ల జైలు శిక్ష
పుత్రజయ(మలేసియా): అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ను దోషిగా తేలుస్తూ ఆ దేశ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. దీంతో మాజీ ప్రధానుల్లో చెరసాలకు వెళ్తున్న తొలి వ్యక్తిగా నజీబ్ అప్రతిష్ట మూటగట్టుకోనున్నారు. దోషిగా నిర్ధారణ కావడంతో ఆయనకు హైకోర్టు గతంలోనే 12 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఆయన చేసిన అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం, మనీ లాండరింగ్ నేరాలకు తగిన శిక్షే ఇది’ అని హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల ఫెడరల్(సుప్రీం) కోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. వెంటనే ఆయన తన జైలుజీవితం మొదలుపెట్టాలని ఆజ్ఞాపించింది. మలేసియా అభివృద్ధికి ఉద్దేశించిన 1 మలేసియా డెవలప్మెంట్ బెహ్రాత్(1ఎండీబీ) నుంచి ఏకంగా 450 కోట్ల అమెరికన్ డాలర్లను నజీబ్ దోచుకున్నారని, 1ఎండీజీ విదేశీ విభాగమైన ఎస్ఆర్సీ ఇంటర్నేషనల్ నుంచి 94 లక్షల డాలర్లు అక్రమంగా పొందారని దర్యాప్తులో తేలింది. దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి మైమన్ను ఈ కేసు విచారణ ప్యానెల్ నుంచి తప్పించాలంటూ నజీబ్ అంతకుముందు చేసిన అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది. ఇదీ చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం! -
సంజయ్ రౌత్ కస్టడీ 5 వరకు పొడిగింపు
ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్(60) జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 5 వరకు పొడిగించింది. ముంబై చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈనెల ఒకటిన ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియడంతో ప్రత్యేక జడ్జి ఎంజీ దేశ్పాండే ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీని పొడిగించాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న జడ్జి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆయన కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
సంజయ్ రౌత్కు లభించని ఊరట.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ముంబై: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఇప్పట్లో ఉపశమనం లభించేలా కనిపించటం లేదు. ఆయనకు విధించిన జ్యుడీషియల్ కస్టడీనీ మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం. ముంబైలోని పాత్రాచాల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై ఆగస్టు 1న సంజయ్ రౌత్ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం కేసుని విచారించిన న్యాయస్థానం ఆగస్టు 8న 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ గడువు సోమవారంతో ముగియనుండటంతో సంజయ్ రౌత్ను ముంబై ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరించింది ఈడీ. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండే.. సెప్టెంబర్ 5వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? -
ఈడీ షాక్.. రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ని నిందితురాలిగా ఈడీ పరిగణించింది. ఈ మేరకు జాక్వెలిన్ పేరును ఢీల్లీ కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో చేరుస్తూ..ఆమెను నిందితురాలిగా పేర్కొంది. రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. (చదవండి: త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న బుల్లితెర నటి) రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్ చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. ఆ తర్వాత బెయిల్ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్ అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన ఈడీ.. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసింది. -
సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు
ముంబై: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఇటీవలే అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తాజాగా ఆయన కస్టడీని పొడింగించింది ముంబై ప్రత్యేక కోర్టు. సోమవారం వరకు ఈడీ అధీనంలోనే విచారణ ఎదుర్కోనున్నారు రౌత్. కస్టడీ పొడిగించిన క్రమంలో.. ఈ కేసు దర్యాప్తులో ఈడీ పురోగతి సాధించినట్లు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. ముంబైలోని ఛాల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని గత ఆదివారం సంజయ్ రౌత్ను సుమారు ఆరు గంటల పాటు విచారించింది ఈడీ. అనంతరం అర్ధరాత్రి అరెస్ట్ చేసింది. అలాగే.. ఆయన భార్య, ఇతరులకు ప్రమేయం ఉన్న ట్రాన్సాక్షన్స్లను సైతం పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా ఆగస్టు 4 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. దీంతో గురువారం పీఎంఎల్ఏ కోర్టు జడ్జి ఎంజీ దేశ్పాండే ముందు రౌత్ను హాజరుపరిచింది ఈడీ. లోతైన విచారణ జరిపేందుకు కస్టడీ పొడగించాలని కోరింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రౌత్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించారు. హౌసింగ్ పునర్నిర్మాణ ప్రాజెక్ట్లో రౌత్, ఆయన కుటుంబం సుమారు రూ.కోటి వరకు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో పేర్కొంది ఈడీ. అయితే.. ఈ వాదనలు తోసిపుచ్చారు రౌత్. సంజయ్ రౌత్ భార్యకు ఈడీ సమన్లు.. పార్థ ఛాల్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్కు గురువారం సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ కేసులో రౌత్ కస్టడీ పొడిగించిన కొన్ని గంటల్లోనే సమన్లు జారీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. వర్ష రౌత్ ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపినట్లు బయటకి రావటంతో ఈ సమన్లు జారీ చేసినట్లు ఈడీ పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వర్ష రౌత్ ఖాతాలోకి సుమారు రూ.1.08 కోట్లు నగదు వచ్చినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? -
సోనియా, రాహుల్కు భారీ షాక్.. ఆ ఆఫీస్కు ఈడీ సీల్
సాక్షి, ఢిల్లీ: సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ హెరాల్డ్ హౌజ్ బిల్డింగ్లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED సీల్ వేసింది. మనీల్యాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఆఫీస్ ప్రాంగణం తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ గంటల తరబడి ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా న్యూఢిల్లీలోని హెరాల్డ్ హౌజ్లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆఫీస్కు సీల్ వేసింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి యంగ్ ఇండియన్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు గరిష్ట వాటాల ఉన్నాయి. ఇక హెరాల్డ్ హౌజ్ సీల్కు సంబంధించి ఈడీ తరపున స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. Delhi | The Enforcement Directorate seals the National Herald office, instructing that the premises not be opened without prior permission from the agency. pic.twitter.com/Tp5PF5cnCD — ANI (@ANI) August 3, 2022 #CLARIFICATION | ED seals Young Indian office at the Herald House building in Delhi as no one was available in the office during the search & thus they were not able to complete the search The order reads that the "premises not be opened without prior permission" from the agency https://t.co/WgiCNwxqVm pic.twitter.com/UvX9iScyIH — ANI (@ANI) August 3, 2022 తాజాగా నేషనల్ హెరాల్డ్ హౌస్తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్కు చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్పేపర్ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 10 జన్ఫథ్లోని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసం వద్ద, ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద అదనపు పోలీస్ బలగాలు మోహరించాయి. ఆఫీస్కు ఈడీ సీల్ వేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. -
శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ అరెస్టు
ముంబై: శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. రూ.11.5లక్షల నగదును జప్తు చేశారు. సంజయ్ రౌత్తో పాటు, ఆయన కుటుంబసభ్యులపై రూ.1000కోట్ల భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ED officials take Shiv Sena leader Sanjay Raut along with them after detaining him post conducting raids at his residential premises in Mumbai. Party workers present at the spot pic.twitter.com/6Jubs44s4k — ANI (@ANI) July 31, 2022 సంజయ్ రౌత్ అరెస్టు నేపథ్యంలో ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు తనను తీసుకెళ్లే సమయంలో ఇంటికి వచ్చిన శివసేన కార్యకర్తల వైపు చూసి రౌత్ అభివాదం చేశారు. పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్ ఇంటికి వెళ్లి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. సంజయ్ రౌత్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీకి భయపడను అంటూ కామెంట్స్ చేశారు. ఏప్రిల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు బిగ్ షాక్ -
కార్వీ స్కామ్: భారీగా ఆస్తులు స్వాధీనం
హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కెఎస్బీఎల్) సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. కార్వీ సీఎండీ పార్థసారథి ఇతరులపై మనీ లాండరింగ్ విచారణకు సంబంధించి రూ.110 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ శనివారం తెలిపింది. కార్వీ స్కామ్లో మనీలాండరింగ్ యాక్డ్ కింద కార్వీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఈ కేసులో ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ మొత్తం విలువ రూ.2,095 కోట్లకు చేరుకుంది. ఇందులో షేర్లు, భూములు, భవనాల షేర్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు ఉన్నాయి. కాగా దాదాపు రూ. 2,800 కోట్ల విలువైన తమ ఖాతాదారుల షేర్లను అక్రమంగా తాకట్టు పెట్టి కార్వీ గ్రూప్ పెద్ద మొత్తంలో రుణాలు పొందిందని, ఆ రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయని ఆరోపిస్తూ రుణాలిచ్చిన బ్యాంకుల ఫిర్యాదులపై హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదైంది. విచారణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో పార్థసారథి గ్రూప్ సీఎఫ్వో జి కృష్ణ హరిని అరెస్టు చేసింది. ఇద్దరూ ఇప్పుడు బెయిల్పై ఉన్న సంగతి తెలిసిందే. -
‘ఆ మంత్రికి హవాలా లింకులు.. వ్యవసాయ భూముల కొనుగోలు’
న్యూఢిల్లీ: హవాలాతో లింకులపై ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మరింత ఇబ్బందుల్లో పడ్డారు. మంత్రి, ఆయన సన్నిహితులు హవాలా లింకులపై కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యేందర్ జైన్, ఆయన సన్నిహితులు.. హవాలానిధులతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాలున్నాయని ఢిల్లీలోని మనీ ల్యాండరింగ్ ప్రత్యేక కోర్టు పేర్కొంది. దీనిపై ఈడీ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు శుక్రవారం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: చీకోటి హవాలా దందాలో మరో నలుగురు -
ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. దీంతో ఈడీ కార్యాలయం నుంచి ఆమె బయటకు వచ్చేశారు. ఈ కేసులో సోనియాను ఇప్పటి వరకు ఈడీ మూడు రోజులు విచారించింది. మొత్తం 12 గంటలపాటు సోనియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. అయితే నేటితో ఆమె విచారణ ముగిసినట్లే తెలుస్తోంది. మరోసారి విచారణకు హాజరు కావాలని సోనియాకు తాజా సమన్లు జారీ చేయలేదు. ఇక సోనియా గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తనతో సహా మొత్తం 65 మంది ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. తమను ఎటో గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్తున్నారని ట్వీట్ చేశారు. మరోవైపు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించినందుకు నిరసనగా రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి బ్రూట్ ఫోర్స్ను ఉపయోగించారని, ఢిల్లీ పోలీసులతో జరిగిన ఘర్షణలో పలువురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారని ఆయన ఆరోపించారు. చదవండి: ఈడీనే కరెక్ట్.. అరెస్ట్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు! -
National Herald case: సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ఎంపీ సోనియా గాంధీ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమె ఉదయం 11 గంటలకు తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రాతో కలిసి సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రియాంక తన తల్లి సోనియా వెంటే ఉండగా, రాహుల్ అక్కడి నుంచి కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయారు. సమన్ల పరిశీలన, హాజరు పత్రంపై సంతకాల తర్వాత ఉదయం 11.15 గంటలకు విచారణ ప్రారంభమయ్యింది. అధికారులు పలు కీలక అంశాలపై సోనియాను ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రియాంక ఈడీ ఆఫీసులోని మరో గదిలో ఉండిపోయారు. దాదాపు 2.50 గంటలపాటు విచారణ అనంతరం మధ్యాహ్నం భోజనం కోసం సోనియా 2 గంటలకు బయటకు వెళ్లారు. 3.30 గంటలకు తిరిగివచ్చారు. ఈడీ అధికారులు విచారణ కొనసాగించారు. మళ్లీ 3 గంటలపాటు సోనియాను ప్రశ్నించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సోనియాకు సూచించారు. ఆ సంస్థల్లో మీ పాత్ర ఏమిటి? సోనియా నివాసం నుంచి ఈడీ కార్యాలయం వరకూ ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ సిబ్బంది సైతం మోహరించారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 21న సోనియా ఈడీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. అధికారులు అడిగిన 28 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నేషనల్ హెరాల్డ్ పత్రికతోపాటు యంగ్ ఇండియా సంస్థ కార్యకలాపాల్లో సోనియా, రాహుల్ గాంధీ పాత్రపై మంగళవారం అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. యంగ్ ఇండియాలో మెజారిటీ వాటాదారు అయిన రాహుల్ని ఈడీ గత నెలలో విచారించింది. రాహుల్ గాంధీ అరెస్టు సోనియా గాంధీను ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు విజయ్ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రపతి భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కాంగ్రెస్ ఎంపీలు విజయ్చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్సహా ఎంపీలను అరెస్ట్ చేశారు. వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించారు. ధర్నా సందర్భంగా పోలీసులు తన పట్ల కర్కశంగా వ్యవహరించారని, వాహనంలోకి నెట్టేశారని అఖిల భారత యువజన కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ ఆరోపించారు. ధర్నాలో ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్బాబు, గిడుగు రుద్రరాజు, చల్లా వంశీచంద్రెడ్డి, సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. -
ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ..
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు గురువారం హాజరయ్యారు. దాదాపు మూడు గంటలపాటు సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. మధ్యాహ్నం తన ఇంటి నుంచి బయల్దేరిన సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియాగాందీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహాయకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతిచ్చింది. విచారణ సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. సోనియాగాంధీ నేటి ఈడీ విచారణ ముగిసింది. సోమవారం మరోసారి విచారణకు రావాలని ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి సోనియా గాంధీ గత నెలలోనే ఈడీ ముందు హాజరుకావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ కోవిడ్ అనంతరం సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలిని దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అదనపు డైరెక్టర్ స్థాయి మహిళా అధికారి నేతృత్వంలోని అయిదుగురు అధికారుల బృందం సోనియాను ప్రశ్నించింది. చదవండి: వాళ్లకు మైండ్ పనిచేయట్లే.. వచ్చేవి బీజేపీ తిరస్కరణ ఎన్నికలే: మమత ఇక ఇదే కేసులో ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. జూన్ 13న తొలిసారి ఈడీ ముందు హాజరైన రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ నాలుగు సిట్టింగ్స్లో 40 గంటల సేపు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. అయితే సోనియాను ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. రాజకీయ కుట్రలో భాగంగానే దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ఆ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ నిరసనలు సోనియా గాంధీపై ఈడీ కేసులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధఙర్ రంజన్ చౌదరీ, సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ తదితరలు పాల్గొనగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నాకు దిగింది. కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు బైక్ను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తగలబడుతున్న బైక్ను మంటలు ఆర్పారు. ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టింది. -
రౌత్కు మళ్లీ ఈడీ సమన్లు
న్యూఢిల్లీ/ముంబై: మనీ లాండరింగ్ కేసులో శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వాస్తవానికి సంజయ్ రౌత్ బుధవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఈడీ ఎదుటకు రాలేదు. ఆగస్టు మొదటి వారం వరకూ సమయం ఇవ్వాలని కోరుతూ సంజయ్ రౌత్ తన లాయర్ల ద్వారా ఈడీకి ఒక లేఖ పంపించారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్నానని, ఈడీ ఎదుటకు రాలేనని పేర్కొన్నారు. దీంతో ఈడీ ఆయనకు కొంత ఉపశమనం కలిగించింది. 27న హాజరు కావాలంటూ మరోసారి సమన్లు జారీ చేసింది. -
ఈడీ ముందుకు సోనియా
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం ఈడీ నడుచుకుంటోందని, ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పార్టీ ఎంపీలు, నేతలు గురువారం కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు దాకా పాదయాత్ర చేయనున్నారు. అలాగే రాజ్భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం పట్ల పార్టీపరంగా ఎలా స్పందించాలన్న దానిపై వ్యూహాన్ని ఖరారు చేయడానికి ఎంపీ మల్లికార్జున ఖర్గే నివాసంలో నేతలు సమావేశమయ్యారు. సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. -
జైలు నుంచే అక్రమాలు.. లక్షల్లో ముడుపులు.. దిమ్మ తిరిగే షాకింగ్ విషయాలు
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అరెస్టై జైలుకు వెళ్లినా క్రమంలో.. అక్కడి నుంచే అన్ని కార్యక్రమాలు నడిపించాడు. అందుకోసం ఢిల్లీ రోహిణి జైలులోని 81మంది అధికారులకు సుకేష్ భారీగా లంచాలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత సుకేష్ను తిహార్ జైలుకు మార్చారు. ఇలా సుకేశ్ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. జైలు బయట ఉన్న తన అనుచరులతో మాట్లాడేందుకు మొబైల్ ఫోన్ వంటివి అందించినట్లు దిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) తేల్చింది. సుకేష్ నుంచి ముడుపులు అందుకున్న జైలు అధికారులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. తన భార్య లీనాతో ఉండేందుకు ఒక్క రాత్రికే జైలు అధికారులకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు సుకేష్ ఇచ్చినట్లు ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఇటీవలే జైలు ఆసుపత్రికి వెళ్లిన సుకేశ్.. అక్కడి నర్సింగ్ స్టాఫ్ సాయంతో అనుచరులతో మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ దిశగానూ ఆర్థిక నేరాల విభాగం విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. తిహార్ జైలులో తమకు ప్రాణహాని ఉందని, దిల్లీ వెలుపలి జైలుకు తమని తరలించాలని గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు సుకేష్, ఆయన భార్య లీనా. జైలులో తమకు సాయం చేసినట్లు అనుమానిస్తున్న అధికారుల నుంచే తమకు ముప్పు ఉందని కోర్టుకు విన్నవించారు. దిల్లీ బయటి జైలుకు తమని మార్చాలని కోరారు. 2017లో ఎన్నికల సంఘం అధికారులకు లంచం కేసుకు సంబంధించిన మరో మనీలాండరింగ్ కేసులో గత ఏప్రిల్ 4న సుకేష్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అయితే.. ఇప్పటే ఆరోగ్య విభాగం ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ సహా పలువురు ప్రముఖ వ్యక్తులను మోసం చేసి కోట్ల రూపాయలు కాజేసిన నేరం కింద అరెస్టై జైలు జీవితం అనుభవిస్తున్నాడు సుకేష్. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు మోడల్స్ను ఈడీ ప్రశ్నించింది. ఇదీ చదవండి: జాక్వెలిన్కి ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర -
ఆమ్నెస్టీపై ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు
న్యూఢిల్లీ: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఏఐఐపీఎల్), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్(ఐఏఐటీ) తదితర సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ మేరకు బెంగళూరులోని ప్రిన్సిపల్ సిటీ సివిల్, సెషన్స్ జడ్జి కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై సంబంధిత సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసిందని ఈడీ తెలిపింది. విదేశీ మారక ద్రవ్య చట్టం(ఫెమా)ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమ్నెస్టీ ఇండియా, సంస్థ మాజీ చీఫ్ ఆకార్ పటేల్లకు శుక్రవారం ఈడీ రూ.61 కోట్లకు పైగా జరిమానా విధించింది. ఈడీ ఆరోపణలపై ఆమ్నెస్టీ ఇండియా స్పందించింది. కఠిన చట్టాలతో విమర్శకులను అణచివేయడం ప్రస్తుత భారత ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆరోపించింది. మనీల్యాండరింగ్ ఆరోపణల విషయం కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపింది. -
ఢిల్లీ మంత్రి భార్యకు ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య పూనమ్ జైన్కి ఈడీ సమన్లు జారీ చేసింది. జులై 14న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కోల్కతాకు చెందిన కంపెనీల్లో హవాలా లావాదేవీలకు సంబంధించి సత్యేంద్ర జైన్ అరెస్టు (మే 30) తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. జైన్ భార్య, తదితరులపై నమోదైన అక్రమ ఆస్తులు, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఏప్రిల్లో రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా 2017, ఆగస్టు 25న, సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సత్యేందర్ జైన్పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. జైన్ ఢిల్లీలో పలు షెల్ కంపెనీలను కొనుగోలు చేసినట్లు సమాచారం. 2010 నుండి 2014 వరకు కోల్కతాకు చెందిన ముగ్గురు హవాలా ఆపరేటర్లకు చెందిన 54 షెల్ కంపెనీల ద్వారా 16.39 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రి అయిన తరువాత ప్రయాస్, ఇండో, అకించన్ కంపెనీల వాటాలను 2015లో భార్య పూనమ్కు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. మరోవైపు జైన్ జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక సీబీఐ కోర్టు జూలై 11 వరకు పొడిగించింది. -
వివోకి భారీ షాక్: పెద్ద ఎత్తున నగలు, నగదు, బ్యాంక్ ఖాతాలు సీజ్
సాక్షి, ముంబై: చైనాకు చెందిన కంపెనీలకు షాకిస్తున్న కేంద్రం తాజాగా వివో మొబైల్స్కు భారీ ఝలకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలపై భారీ ఎత్తున బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 48 ప్రదేశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీగా సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఇండియా వ్యాపారానికి సంబంధించిన 119 బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేసినట్టు ఈడీ గురువారం ప్రకటించింది. మనీలాండరింగ్పై దర్యాప్తులో భాగంగా చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వివో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని 23 అనుబంధ కంపెనీల్లో విస్త్రృత తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా 465 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. 119 బ్యాంకుల్లో 73 లక్షల నగదు సహా, 66 ఫిక్స్డ్ డిపాజిట్లు, 2 కేజీలల బంగారం బార్స్ ఈడీ స్వాధీనం చేసుకుంది. వివో భారతీయ విభాగం దాదాపు 62,476 కోట్ల రూపాయల టర్నోవర్లో దాదాపు 50 శాతం "రెమిట్" చేసిందని ఈడీ గురువారం వెల్లడించింది. విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నష్టాలను చూపించి పన్నులు చెల్లించకుండా ఎగవేసిందని, ఆ నిధులను దేశం వెలుపలికి తరలించిందనీ ఆరోపించింది. 2018లో వివో మాజీ డైరెక్టర్ బిన్ లౌ దేశం విడిచి పారిపోయాడని పేర్కొంది. -
చైనా దిగ్గజం వివోకు ఈడీ షాక్, పెద్ద ఎత్తున సోదాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశంలోని చైనా కంపెనీలకు భారీ షాకిస్తోంది. ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో, దాని అనుభంధ కంపెనీలపై మంగళవారం దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది మనీలాండరింగ్ ఆరోపణలతో ఈ దాడులు చేస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ల కింద ఈ సోదాలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. టెలికాం మేజర్ వివో, దాని అనుబంధ సంస్థలపై ఈడీ 40కి పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తోంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ హర్యానా తదితర రాష్ట్రాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గత నెలలో, రెండు చైనా కంపెనీలు నకిలీ పత్రాలు, చిరునామాలతో అక్రమాలకు పాల్పడినట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించడంతో ఈడీ ఈ చర్యకు దిగింది. ఇప్పటికే జెడ్టీఈ కార్పొరేషన్, వివో మొబైల్ కమ్యూనికేషన్స్ కంపెనీ లోకల్ యూనిట్లు ఆర్థిక అవకతవకల విచారణను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మొబైల్ దిగ్గజం షావోమి కూడా ఈడీ విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. -
వేల కోట్ల సోలార్ స్కామ్: భర్తకి 30 ఏళ్లు.. భార్యకి 11 ఏళ్ల జైలు శిక్ష!
లాస్ ఏంజెల్స్: యూఎస్లోని భార్యభర్తలిద్దరు సోలార్ పిరమిడ్ స్కామ్కి పాల్పడంతో కోర్టు జైలు శిక్ష విధించింది. సోలార్ జనరేటర్ల అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని చెప్పి దాదాపు 20 మంది పెట్టుబడిదారులును మోసం చేశారని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు పాలెట్ కార్పస్ అనే 51 ఏళ్ల మహిళ తన భర్త జెఫ్తో కలిసి దాదాపు 7 వేల కోట్ల రూపాయిల స్కామ్ తెరలేపారని స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టు కార్పస్కి 11 ఏళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతకముందు ఆమె భర్తకి ఇదే స్కాంలో సుమారు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ జంట ప్రాథమిక విచారణలో నేరాన్ని అంగీకరించనట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ స్కాంలో ఈ జంట సుమారు 17 మంది పెట్టుబడుదారుల నుంచి రూ. 7 వేల కోట్లు తీసుకున్నారు. ఈ డబ్బుల్లో కొంత భాగాన్ని ఈ జంట తమ విలాసాలకు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: తండ్రి తుపాకితో ఆడుకుంటూ...పసికందుని కాల్చి చంపిన మైనర్) -
National Herald Case: రెండో రోజు 11 గంటలు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రిక మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని మంగళవారం రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 11 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి బయల్దేరి ఉదయం 11.05కు సోదరి ప్రియాంకతో కలిసి ఆయన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. 11.30కు విచారణ ప్రక్రియ మొదలైనట్టు అధికారులు తెలిపారు. నాలుగు గంటల అనంతరం మధ్యాహ్న.ం 3.30కు భోజన విరామమిచ్చారు. తర్వాత 4.30 నుంచి రాత్రి 11.30 దాకా విచారణ సాగింది. నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్–యంగ్ ఇండియా లావాదేవీలకు సంబంధించిన కీలక అంశాలపై రాహుల్ను మరింత లోతుగా ప్రశ్నించి ఆయన సమాధానాలను, వివరణను రికార్డు చేసినట్టు చెబుతున్నారు. వాటిని రాహుల్ కూలంకషంగా పరిశీలించినట్టు సమాచారం. అధికారులు తరచూ విరామమిస్తూ విచారణ కొనసాగించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం కూడా విచారణకు రావాలని ఈడీ అధికారులు రాహుల్ను ఆదేశించారు. ఒక క్రిమినల్ కేసులో గాంధీ కుటుంబ వ్యక్తి ఒకరిని దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి. రాహుల్ను సోమవారం తొలి రోజు 10 గంటలకు పైగా ఈడీ విచారించడం తెలిసిందే. ఈ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని కూడా 23న ఈడీ విచారించనుంది. రాజస్తాన్లో ఓ భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక భర్త రాబర్ట్ వద్రాను ఈడీ కొన్నేళ్ల క్రితం విచారించింది. భారీగా అరెస్టులు విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోమవారం మాదిరిగానే నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఢిల్లీలో ఆందోళనలు కొనసాగించారు. ఉదయం రాహుల్ నేతృత్వంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైరాం రమేశ్, రణ్దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అధీర్ రంజన్ చౌధరి, దీపీందర్ హుడా, పలువురు పార్టీ ఎంపీలు, సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితర నేతలను పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈడీ విచారణను కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యగా ఈ సందర్భంగా నేతలు అభివర్ణించారు. విచారణను తప్పించుకునేందుకు నిరసనల పేరిట కాంగ్రెస్ ఇలా డ్రామాలాడుతోందని బీజేపీ దుయ్యబట్టింది. -
అరెస్టయిన ఢిల్లీ మంత్రి ఇంట్లో రూ. 2 కోట్ల నగదు, బంగారు నాణేలు
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సత్యేందర్ పై ఉన్నమనీలాండరింగ్ కేసులో భాగంగా ఆయని నివాస ప్రాంతాల్లో ఈడీ సోమవారం సోదాలు నిర్వహించింది. దర్యాప్తు సంస్థ ఆ సోదాల్లో సుమారు రూ. 2 కోట్లకు పైగా నగదు, 1.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అంతేకాదు ఆ రూ.2 కోట్ల నగదును ఎస్ రామ్ ప్రకాష్ జ్యువెలర్స్ లిమిటెడ్ ఆవరణలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పైగా రామ్ ప్రకాష్ జ్యువెలర్స్ లిమిటెడ్కి డైరెక్టర్లుగా వైభవ్ జైన్, అంకుష్ జైన్, నవీన్ జైన్లు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. సత్యేందర్ని కోల్కతా కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్లో రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసి అరెస్టు చేసిన సంగతి విధితమే. దీంతో సత్యేందర్ జైన్ని జూన్1 నుంచి వరకు దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉన్నారు. సత్యేందర్ వాటాదారుగా ఉన్న నాలుగు కంపెనీలకు వచ్చిన నిధుల మూలాన్ని వివరించలేకపోయారని ఆరోపించింది. ఆయన ఢిల్లీలో అనేక కంపెనీలను కొనుగోలు చేయడమే కాకుండా వాటి ద్వారా సుమారు రూ. 16. 39 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చకున్నారంటూ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఐతే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అవన్నీ అబద్ధాలని, ఢిల్లీ అభివృద్ధి చూడలేక చేస్తున్న దాడులంటూ ప్రధాని నరేంద్ర మోదీ పై విరుచకుపడుతున్నారు. (చదవండి: నెక్ట్స్ టార్గెట్ సిసోడియానే: కేజ్రివాల్) -
వేతనం తీసుకోని పిచ్చోడిని: పాకిస్థాన్ పీఎం
లాహోర్: పంజాబ్ సీఎంగా ఉండగా వేతనం కూడా తీసుకోకుండా మూర్ఖుడిలా వ్యవహరించానంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తనను తాను నిందించుకున్నారు. రూ.1,600 కోట్ల మనీలాండరింగ్ కేసులో లాహోర్ ప్రత్యేక కోర్టులో విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పన్నెండున్నరేళ్ల పాటు వేతనం, ఇతర లబ్ధిని పొందలేదు. నేనొక మూర్ఖుడిని. కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ కేసులో నన్ను నిందితుడిగా మార్చారు. ఆ దేవుడే నన్ను పాకిస్థాన్ ప్రధానిగా చేశారు’ అని చెప్పుకున్నారు. అవినీతి, అక్రమ సంపాదన ఆరోపణల నేపథ్యంలో షరీఫ్, ఆయన కుమారులు హంజా, సులేమాన్లపై 2020 నవంబరులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA)మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. హంజా షరీఫ్ ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు., సులేమాన్ యూకేలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి శనివారం ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. షెహబాజ్ కుటుంబానికి చెందిన 28 బినామీ ఖాతాలను తాము గుర్తించామని ఎఫ్ఐఏ కోర్టుకు తెలిపింది. 2008 నుంచి 2018 మధ్య ఈ బినామీ ఖాతాల ద్వారా ఆయన 14 బిలియన్ల పాకిస్తాన్ రూపాయలు అక్రమ సంపాదన ఆర్జించినట్లు ఆరోపించింది. చదవండి: నైజీరియా చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి -
మోహన్ లాల్కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే ?
Mohanlal Questioned By Ed In Money Laundering Case With Monson Mavunkal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్కు పాల్పడినట్లు మోహన్ లాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మోహన్ లాల్కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్లాల్ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై మాన్సన్ను గత సెప్టెంబర్లోనే కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో ఉన్న మాన్సన్ ఇంటికి మోహన్ లాల్ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే అలా మోహన్ లాల్ వెళ్లడానికి కారణాలు తెలియరాలేదు. 'కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ. 10 కోట్ల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాఝీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలిగోరు వంటి వస్తువులు ఉన్నాయని చెప్పాడం అబద్ధం.' అని కేరళ పోలీసులు తెలిపారు. కాగా కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులు విక్రయిస్తున్నాడని 52 ఏళ్ల యూట్యూబర్ను కూడా కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4431454862.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐఏఎస్ ఆఫీసర్ పూజా సింఘాల్ అరెస్ట్
IAS Officer Pooja Singhal Arrest: ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్కు ముందు ఆమెను కొన్ని గంటలపాటు కేసుకు సంబంధించి అధికారులు విచారణ జరిపారు. కాగా పూజా సింఘాల్ జార్ఖండ్ రాష్ట్ర గనులశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడటంతోపాటు ఎమ్ఎన్ఆర్ఈడీఏ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) నిధులను దారి మళ్లించారనే అభియోగాలతో ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు గతవారం దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.f ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ నివాసంతోపాటు ఆమె సన్నిహితుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏకకాలంలో దాడులు చేపట్టింది. జార్ఖండ్ ప్రభుత్వంలో మాజీ జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న రామ్ బినోద్ ప్రసాద్ సిన్హాపై ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి, తన కుటుంబ సభ్యుల పేరుతో పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని పశ్చిమ బెంగాల్లో జూన్ 17,2020న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతికి గురైన డబ్బు ఖుంటి జిల్లాలో ఎమ్ఎన్ఆర్ఈడీఏ కోసం కేటాయించినట్లు ఈడీ పేర్కొంది. నిందితుడిని విచారించగా.. మోసగించిన నిధుల నుంచి తాను జిల్లా పరిపాలనకు ఐదు శాతం కమీషన్ ఇచ్చినట్లు వెల్లడించాడు. చదవండి: వైరల్ వీడియో: సింహాన్ని తరిమిన శునకం దీంతో పూజా సింఘాల్ 2007 నుంచి 2013 వరకు చత్రా, ఖుంటి, పాలము డిప్యూటీ కమిషనర్/జిల్లా మేజిస్ట్రేట్గా పనిచేసే సమయంలో ఆమె అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో భాగంగా మే 7వ తేదీన పూజా సింఘాల్ సీఏ సుమన్ కుమార్ వద్ద రూ.17 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు అతన్నిఅరెస్ట్ చేశారు. అలాగే పూజా సింఘాల్, ఆమె భర్తతో ఉన్న సంబంధాలపై కూడా ఈడీ విచారణ జరుపుతోంది. సింఘాల్, ఆమె భర్త రూ. 1.43 కోట్ల వరకు భారీగా నగదు డిపాజిట్లు చేసుకున్నట్లు, ఆమె జీతం కంటే ఎక్కువగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వెళ్లినట్లు ఈడీ పేర్కొంది. -
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ షాక్
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. జాక్వెలిన్కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను అచాట్ చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్ చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. ఆ తర్వాత బెయిల్ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్ అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా జాక్వెలిన్ ఇప్పటికే పలుమార్లు ఆమె ఈడీ విచారణకు హాజరైంది. -
మనీలాండరింగ్ కేసులో ఈడీ చర్యలు
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టయి జైల్లో ఉన్న ఎన్సీపీ నేత, మాజీ మంత్రి నవాబ్ మాలిక్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కేసులో మహ్మద్ నవాబ్ మహ్మద్ ఇస్లాం మాలిక్, ఆయన కుటుంబ సభ్యులు, సొలిడస్ సంస్థ, మాలిక్ ఇన్ఫ్రా సంస్థల ఆస్తులను పీఎంఎల్ చట్టం కింద అటాచ్ చేశామని ఈడీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలోని గోవావాలా కాంపౌండ్, వాణిజ్య సముదాయం, మూడు ఫ్లాట్లు, రెండు నివాస ఫ్లాట్లు, ఒస్మానాబాద్ జిల్లాలోని 147.79 ఎకరాల భూమిని అటాచ్ చేసినట్లు పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో మాలిక్ను ఈడీ ఫిబ్రవరిలో అరెస్టు చేసింది. విచారణకు సుప్రీం ఓకే మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసి జైల్లో ఉంచిన తనను తక్షణం విడుదల చేయాలని కోరుతూ నవాబ్ మాలిక్ చేసిన అభ్యర్ధనపై విచారణకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. మాలిక్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ చేసిన అభ్యర్థనపై సీజేఐ జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ పరిశీలించి, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించింది. పీఎంఎల్ చట్టం 2005లో అమల్లోకి వచ్చిందని, కానీ తన క్లయింటును 2000 సంవత్సరానికి ముందు జరిగిన నేరానికి పీఎంఎల్ఏ కింద అరెస్టు చేశారని సిబాల్ వాదించారు. అంతకుముందు ఆయన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో మాలిక్ సుప్రీంను ఆశ్రయించారు. మాలిక్ విడుదల అభ్యర్థనను పీఎంఎల్ఏ కోర్టు కొట్టివేయడంలో తప్పులేదని, అలాగే ఆయన్ను రిమాండ్కు పంపడంలో కూడా ఎలాంటి తప్పు జరగలేదని, అందువల్ల జైలు నుంచి విడుదల చేయాలన్న మాలిక్ కోరికను తిరస్కరిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. -
నవాబ్ మాలిక్కు బిగుసుకుంటున్న ఉచ్చు
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్పై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలున్నాయని నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టు పేర్కొంది. మనీ లాండరింగ్ కేసులో బుధవారం అరెస్టైన నవాబ్ మాలిక్పై ఉన్న ఆరోపణలకు సంబంధించి విచారణ చేసేందుకు అవసరమైన సమయం కావాలని, ఈకేసు దర్యాప్తు నిమిత్తం ఆయన పోలీసు కస్టడీకి తప్పనిసరిగా తీసుకోవాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆర్.ఎన్.రొకడే శుక్రవారం తెలిపారు. పీఎంఎల్ఏ కోర్టు నవాబ్ మాలిక్కు మార్చి 3 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి బుధవారం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులకు సంబంధించిన అక్రమ నగదు చలామణీ కార్యకలాపాల్లో నవాబ్ మాలిక్కు సంబంధాలున్నాయని బుధవారం ఈడీ అరెస్టు చేసింది. అయితే కేసు కీలక విచారణకు సంబంధించి నిందితులు సహకరించలేదని కోర్టు ఉత్తుర్వుల్లో పేర్కొంటూ మార్చి 3 వరకు నవాబ్ మాలిక్ను ఈడీ కస్టడీకి అనుమతించింది. కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉన్నందున కేసు వెనుక అసలు వాస్తవాలను వెలికితీసేందుకు విచారణ నిమిత్తం నవాబ్ మాలిక్ను కస్టడీకి అప్పగించడం తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేరం జరిగి 20 ఏళ్లు దాటినందున సరైన దిశలో నేరాన్ని దర్యాప్తు చేసేందుకు కొంత సమయం కూడా అవసరమని కోర్టు అభిప్రాయపడింది. కడుపునొప్పితో మాలిక్ ఆస్పత్రిలో చేరిక రెండ్రోజుల క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన రాష్ట్రమంత్రి, ఎన్సీపీ సీనియర్నేత నవాబ్ మాలిక్ తీవ్రమైన కడుపునొప్పితో శుక్రవారం జేజే ఆస్పత్రిలో చేరారు. అయితే శుక్రవారం ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో తనకు కడుపు నొప్పి వస్తుందని, మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన ఇబ్బందులెదుర్కొం టున్నట్లు ఈడీ అధికారులకు నవాబ్ మాలిక్ చెప్పడంతో వెంటనే ఈడీ అధికారలు ఆయనను నగరంలోని జేజే ఆస్పత్రికి తరలించి, యూరాలజీ విభాగంలో చేర్పించారు. ఈ మేరకు మాలిక్ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. (క్లిక్: మంత్రి అరెస్ట్పై రాజకీయ దుమారం.. ఎవరీ నవాబ్ మాలిక్?) అది సీఎం అభీష్టమే: సంజయ్ రౌత్ అక్రమ నగదు చలామణీ కేసులో రెండ్రోజుల క్రితం నవాబ్ మాలిక్ అరెస్టైన నేపథ్యంలో ఆయన చేసిన రాజీనామాను ఆమోదించాలా వద్దా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పూర్తి వ్యక్తిగత నిర్ణయమని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. నవాబ్ మాలిక్ను అరెస్టు చేసిన తర్వాత రాష్ట్ర బీజేపీ ఆయనపై విరుచుకుపడుతోంది. తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని, అవసరమైతే ఆయన రాజీనామాను ఆమోదించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సంజయ్ రౌత్ శుక్రవారం నగరంలోని విలేకరులతో మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను చేతిలో కీలుబొమ్మలుగా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాలకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మంత్రివర్గంలోని మంత్రి రాజీనామాను ఆమోదించాలా వద్దా అనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. అయితే నవాబ్ మాలిక్ రాజీనామాను సంకీర్ణ కూటమిలోని ఎన్పీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. భివండీలో నిరసనలు.. భివండీ: రాష్ట్రమంత్రి నవాబ్ మాలిక్ అరెస్టు పట్ల భివండీ శుక్రవారం అట్టుడికిపోయింది. ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ మహావికాస్ ఆఘాడీకి చెందిన నాయకులు భివండీలో శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈడీ చర్యను వ్యతిరేకిస్తూ ప్రాంత్కార్యాలయం ఎదురుగా ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనలో శివసేన పట్టణ ప్రముఖులు సుభాష్ మానే, భివండీ పట్టణ ఎన్సీపీ అధ్యక్షుడు షోయబ్ ఖాన్ గుడ్డు, మహిళా అధ్యక్షురాలు స్వాతి కాంబ్లే, భివండీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రషీద్ తాహిర్ మోమిన్, పాటు శామ్ పాటిల్, మధన్ బోయ్, మహేంద్ర కుంబారే, కోమల్ పాటిల్, రాణి అగ్రవాల్ తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. (చదవండి: బిట్కాయిన్ చట్ట విరుద్ధమా? కాదా?) -
విజయ్మాల్యా, తదితరుల నుంచి బ్యాంకులకు రూ. 18 వేల కోట్లు రికవరీ: కేంద్రం
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల వంటి కుబేరుల నుంచి దాదాపు రూ.18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి ఇచ్చామని కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్రం మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇచ్చిన విస్తృత అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టుకి బుధవారం కేంద్రం వెల్లడించింది. అంతేకాదు విదేశాల్లోని పరిస్థితులతో పోలిస్తే భారతదేశంలో పీఎంఎల్ఏ కింద చాలా తక్కువ సంఖ్యలో కేసులను దర్యాప్తు చేస్తున్నామని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో కేంద్రం సుప్రీం కోర్టులో యూకేని ఉదహరించింది, ఇక్కడ మనీలాండరింగ్ చట్టం కింద ఒక ఏడాదిలో 7,900 కేసులు నమోదయ్యాయని, యూఎస్ (1,532), చైనా (4,691), ఆస్ట్రియా (1,036), హాంకాంగ్ (1,823), బెల్జియం (1,862), రష్యా (2,764) నమోదవుతున్నాయని వివరించింది. భారత్లో 4 వేల పీఎంఎల్ఏ కేసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోందని తెలిపింది. అయితే సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్న నేరాల మొత్తం ఆదాయం రూ. 67,000 కోట్లు అని పేర్కొంది. గత 5 ఏళ్లలో ప్రతి ఏడాది విచారణకు తీసుకున్న కేసుల సంఖ్య 2015-16లో 111 కేసుల ఉండగా.. 2020-21 నాటికి 981గా మారుతుందని కేంద్రం తెలిపింది. అంతేకాదు ఇటువంటి నేరాలకు సంబంధించి 33 లక్షల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, కానీ 2 వేల కేసులను మాత్రమే విచారణకు స్వీకరించినట్లు కేంద్రం వెల్లడించింది. (చదవండి: ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్!... కోలుకున్నా ఇంకా బాధిస్తునే ఉంటుంది!) -
ఆమెను తప్పుపట్టొద్దు.. సుకేష్ చంద్రశేఖర్ ఆసక్తికర లేఖ
బాలీవుడ్ బ్యూటీ, శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం సుకేష్ చంద్రశేఖర్తో రిలేషన్లో ఉండటమే. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అతడితో జాక్వెలిన్కు సంబంధం ఉన్నట్లు వార్తలు రావడం, తర్వాత అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. తన వ్యక్తిగత ఫొటోలను ప్రసారం చేయొద్దని జాక్వెలిన్ రిక్వెస్ట్ కూడా చేసింది. అయితే తాజాగా జాక్వెలిన్కు మద్దతుగా నిలిచాడు సుకేష్ చంద్రశేఖర్. ఆమెను తప్పుపట్టొద్దు అంటూ తన లాయర్తో ఓ ప్రకటన విడుదల చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల గురించి తనకు వారం క్రితమే తెలిసిందని, ఆమెను చెడుగా చిత్రీకరించవద్దని కోరాడు. 'ఆ ఫొటోలు రావడం దురదృష్టకరం. అలా ఒక వ్యక్తి ప్రైవేసీకి భంగం కలిగించారు. నేను, జాక్వెలిన్ రిలేషన్షిప్లో ఉన్నామని గతంలోనే చెప్పాను. మేం స్వప్రయోజనాల కోసం డేటింగ్ చేశామని అనుకుంటున్నారు. కానీ, అది నిజం కాదు. ప్రేమతో మాత్రమే మా బంధాన్ని కొనసాగించాం. ఆమెను చెడుగా చిత్రీకరించడం మానుకోండి. నేను జాక్వెలిన్కు, ఆమె కుటుంబానికి ఇచ్చిన బహుమతులు, చేసిన పనులు ప్రేమించిన వ్యక్తి కోసం చేసినవి మాత్రమే. ఇది వ్యక్తిగతం. దీన్ని ఎందుకు ఇంతపెద్ద రాద్దాం చేస్తున్నారో తెలియట్లేదు. ఆమెకు ఈ కేసుతో సంబంధం లేదు. నేను చట్టబద్ధంగానే సంపాదించాను. అదే త్వరలో న్యాయస్థానంలో రుజువు అవుతుంది.' అని సుకేష్ చంద్రశేఖర్ తెలిపాడు. -
వ్యాపారవేత్త ప్రవీణ్ రావత్ అరెస్టు
సాక్షి, ముంబై: మనీ ల్యాండరింగ్ కేసులో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త ప్రవీణ్ రావత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగం(ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. హౌసింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ(హెచ్డీఐఎల్)లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ప్రవీణ్ రావత్ పేరు బయటకు వచ్చింది. పంజాబ్, మహరాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ)లో జరిగిన సుమారు రూ. 4,300 కోట్ల అక్రమాలపై ఈడీతోపాటు ఇతర నేర దర్యాప్తు సంస్థలు కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రవీణ్ రావత్కు సంబంధాలున్నా యని ఆరోపణలు రావడంతో ఈడీ ఆయనను అరెస్టు చేసి ముంబైలోని కార్యాలయానికి తీసుకెళ్లింది. ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లలో కూడా మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ దర్యా ప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది. సబర్బన్ ముంబైలోని మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంహెచ్డీఏ)కు చెందిన ఓ భవనం పునర్నిర్మాణానికి ఎంహెచ్డీఏ నుంచి గురుఆశిష్ నిర్మాణ సంస్థ అనుమతి తెచ్చుకుంది. కాగా, ఈ ప్రాజెక్టులో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) సంబంధించి జరిగిన అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఈడీ దర్యాప్తులో తేలింది. అయితే ఈ గురుఆశిష్ నిర్మాణ సంస్థ ప్రవీణ్రావత్దిగా ఈడీ విచారణలో తేలింది. ఇప్పటికే మనీల్యాండరింగ్ కేసుకింద ప్రవీణ్రావత్కు చెందిన రూ.72కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ విచారణలో హెచ్డీఐఎల్ ద్వారా పీఎంసీ బ్యాంకునుంచి అడ్వాన్సులు, రుణాల రూపంలో ప్రవీణ్ రావత్ రూ.95కోట్ల మేర లబ్ధి పొందినట్లు తేల్చింది. చదవండి: బుధవారం వ్యాపారవేత్త ప్రవీణ్ రావత్ను అరెస్టు చేస్తున్న ఈడీ బృందం కాగా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు లేవని ఈడీ చెబుతోంది. హెచ్డీఐల్కు చెందిన లెడ్జర్లో పాల్ఘర్ ప్రాంతంలో స్థల సేకరణ నిమిత్తం ప్రవీణ్ రావత్కు ఈ నిధులు ఇచ్చినట్లుగా ఉంది. పీఎంసీ బ్యాంకు కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రావత్ భార్య వర్షా రావత్ను గతేడాది ఈడీ విచారణ చేయగా ప్రవీణ్ రావత్ భార్య పేరు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రవీణ రావత్ రూ.1.6 కోట్లను తన భార్య మాధురి రావత్కు ట్రాన్సఫర్ చేయగా..ఆమె రూ.55 లక్షలను వడ్డీ లేని రుణంగా వర్షా రావత్కు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. వీటి ఆధారంగా ఈడీ 2020 అక్టోబర్లో మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. చదవండి: జాతీయ గీతాన్ని అవమానించిన సీఎం మమతా బెనర్జీ.. కోర్టు సమన్లు జారీ -
నటుడు సచిన్ జోషి ఆస్తుల జప్తు
తెలుగుతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించిన సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ భారీ షాక్ ఇచ్చింది. లోన్ ఫ్రాడ్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. శనివారం ఈడీ విభాగం మొత్తం రూ.410 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ వెల్లడించింది. వ్యాపారవేత్త అయిన సచిన్ జోషి 2002లో మౌనమేలనోయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వగా.. ఆ తర్వాత ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను, జాక్పాట్, నీ జతగా నేనుండాలి లాంటి సినిమాల్లో నటించాడు. చివరగా 2017లో వీడెవడు సినిమాలో కనిపించాడు.సెలబ్రిటీ క్రికెట్ లీగ్తోనూ సచిన్ సుపరిచితుడే. ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈమేరకు ఔరంగాబాద్ సిటీ చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయ్యింది. కిందటి ఏడాది సచిన్ జోషి అరెస్ట్ అయ్యాడు కూడా. -
సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బెటర్.. వీడియోపై ట్రోలింగ్
Jacqueline Fernandez Trolls Old Video Her Bodyguard Better Than Sukesh: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి తరచుగా వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఇటీవల తన వ్యక్తిగత ఫొటోలు ప్రసారం చేయొద్దని విన్నవించుకున్న సంగతి తెలిసిందే. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ మధ్యలో సుకేష్తో జాక్వెలిన్ ప్రైవేట్ ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. దీంతో మీడియా మొత్తం జాక్వెలిన్పై దృష్టి సారించింది. అయితే తాజాగా ఈ శ్రీలంక భామ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 'సుకేష్ ఎక్కడా ఉన్నాడు. అస్సలు కనపడట్లేదుగా' అని ఒక యూజర్ రాస్తే సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బాగున్నాడు అని మరొకరు స్పందించారు. 'ఇంకా పీఆర్ వాళ్ల కష్టం బాగా తెలుస్తోంది', 'ఇదంతా డ్యామెజ్ కంట్రోల్ కోసం', 'జాక్వెలిన్ను ఇలా చూసే సుకేష్ ఫిదా అయింటాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ త్రోబ్యాక్ వీడియోలో ఎరుపు రంగు సాటిన్ దుస్తులు ధరించి ప్రతి ఒక్క ఫొటోగ్రాఫర్ ఫొటోలకు ఫోజులిచ్చింది జాక్వెలిన్. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇదీ చదవండి: మీడియాకు జాక్వెలిన్ అభ్యర్థన.. అవి ప్రసారం చేయొద్దని -
నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి
ముంబై: తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఫొటోలను బహిరంగపరచవద్దని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(36) మీడియాను కోరారు. సుకేశ్ చంద్రశేఖర్ అనే మోసగాడితో జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు శనివారం సామాజిక మాధ్యమాల్లో బయటకు రావడంతో ఆదివారం జాక్వెలిన్ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో ఉన్న తనను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. బహ్రెయిన్లో ఉన్న జాక్వెలిన్ తల్లి ఇటీవల గుండెపోటుకు గురయ్యారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. చంద్రశేఖర్ తదితరులకు సంబంధమున్న మనీ లాండరింగ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట పలుమార్లు జాక్వెలిన్ హాజరైన విషయం తెలిసిందే. -
జాక్వెలిన్ను సుకేష్ ఇలా ముగ్గులోకి దింపాడట..
Jacqueline Fernandez Interesting News About Sukesh: శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుకేష్ బాలీవుడ్ హీరోయిన్స్ జాక్వెలిన్, నోరాకు ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో వార్తల్లో ప్రధానంశంగా మారింది. అయితే జాక్వెలిన్ను సుకేష్ ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలు, పలికిన ప్రగల్బాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జాక్వెలిన్ కోసం వరుస సినిమాలను నిర్మిస్తానని సుకేష్ మాట చెప్పాడట. విలాసవంతమైన బహుమతులు ఇచ్చిన సుకేష్ తనకు కేంద్ర ప్రభుత్వంలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. జాక్వెలిన్తో స్నేహం కోసం సుకేష్ పొగడ్తలతో ముంచెత్తాడని ప్రచారం జరుగుతోంది. జాక్వెలిన్ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీలా ఉంటుందని, తనకన్న నువ్వేం తక్కువా కాదని ఆకాశానికెత్తాడట సుకేష్. అంతేకాకుండా రూ. 500 కోట్లతో 3 భాగాలతో మహిళా సూపర్ హీరో ప్రాజెక్ట్ను కూడా నిర్మిస్తానని నమ్మబలికాడట. ఇండియాలో ఇదే హీరోయిన్ ఒరియెంటెడ్ సూపర్ హీరో సినిమా అవుతుందని స్వీట్గా మాయమాటలు చెప్పాడని పుకార్లు వినిపిస్తున్నాయి. సూపర్ హీరో కథలతో హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణులతో సినిమా నిర్మిస్తున్నానని మాట కూడా ఇచ్చాడట సుకేష్. జాక్వెలిన్ను ముగ్గులోకి దింపడానికి సుకేష్ సినిమా బడ్జెట్, ప్రొడక్షన్ పనులపై కొంచెం పరిశోధన చేసాడని సమాచారం. ఇదీ చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే.. అయితే బాలీవుడ్లో సాంగ్స్ మినహా పెద్దగా సినిమా అవకాశాలు లేని జాక్వెలిన్ సుకేష్ స్వీట్ మాటలకు పడిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపినట్లు సమాచారం. తనకు సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ 2015 నుంచి తెలుసని, ఆమెకు ఎన్సీబీ కేసులో సహాయం చేసినట్లు సుకేష్ ఈడీ విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వ్యాపార వేత్త రాజ్ కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసులో బయటకు రావడానికి కూడా హెల్ప్ చేసినట్లు తెలిపాడట. ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్కు ఈడీ సమన్లు.. ఎందుకంటే ? -
మనీలాండరింగ్ కేసు: జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు స్వల్ప ఊరట
ముంబై: మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు స్వల్ప ఊరట లభించింది. ఆమె దేశంవిడిచి వెళ్ళేందుకు ఈడీ అనుమతిచ్చింది. 200కోట్లకు సంబంధించిన ఓ మనీ లాండరింగ్ కేసును విచారిస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ప్రధాన నిందితుడిగా సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పేరును ఛార్జిషీటులో పేర్కొంది. అందులో బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్తోపాటు నోరా ఫతే పేర్లను కూడా చేర్చింది. చదవండి: బాలీవుడ్ భామకి గిఫ్ట్గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఇప్పటికే ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు తీసుకున్న ఆరోపణలపై జాక్వెలిన్కు ఈమధ్యే మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈడీ అధికారులు ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదే సయమంలో ఆమె దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ముంబయి విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. -
బాలీవుడ్ భామ జాక్వెలిన్కు షాక్.. ఎయిర్పోర్ట్ వద్ద అడ్డుకున్న అధికారులు
Jacqueline Fernandez Stopped At Mumbai Airport: బాలీవుడ్ భామ, శ్రీలంక ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు ముంబై విమానాశ్రయంలో షాక్ తగిలింది. ఇండియా నుంచి వెళ్తున్న జాక్వెలిన్ను ముంబై ఎయిర్పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్తో జాక్వెలిన్ సన్నిహితంగా దిగిన ఫొటోలు వైరల్ అవడంతో ఈ భామ చిక్కుల్లో పడింది. అప్పట్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంది. అప్పుడు సుఖేష్ చంద్రశేఖర్కు తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ కొట్టిపారేసింది. ఇది జరిగిన వారాలా తర్వాత సుఖేష్ను ముద్దు పెట్టుకుంటూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. ఇదీ చదవండి: జాదుగాడితో జాక్వెలిన్ కిస్సింగ్ ఫోటో లీక్ అంతకుముందు ఈ రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్, నోరా ఫతేహి, సుఖేష్ చంద్రశేఖర్, అతని భార్య లీనా పాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. పలు నివేదికల ప్రకారం జాక్వెలిన్ను సుకేష్ నాలుగు సార్లు చెన్నైలో కలిశారని సమాచారం. అంతేకాకుండా ఆమె కోసం ప్రైవేట్ జెట్ను కూడా ఏర్పాటు చేశాడట. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతి పొందినట్లు ఈడీ విచారణలో తేలిందని సమాచారం. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సుఖేష్ భార్య లీనా పాల్తో కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్తో పాటు నోరా ఫతేహీనికి కూడా సుఖేష్ భారీ బహుమతులు ఇచ్చాడట. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం. ఇదీ చదవండి: బాలీవుడ్ భామకి గిఫ్ట్గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి -
ఉత్తుత్తి కంపెనీలు.. ఊళ్లు దాటిన వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: చైనా, హాంకాంగ్లకు చెందిన గేమింగ్, డేటింగ్ యాప్స్ కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. యాప్స్ నిర్వహిస్తున్న కంపెనీల లావాదేవీలు చూస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్.. రూ.1,500లకో సంతకంతో వేల కోట్లు దేశం దాటేలా సహకరించాడని వెల్లడించింది. షెల్ కంపెనీల లావాదేవీలకు బోగస్ సర్టిఫికెట్లు జారీ చేసి రూ.1,100 కోట్లు చైనా, హాంకాంగ్ చేరేలా చేశాడని చెప్పింది. హెయిర్ మర్చంట్స్.. క్రిప్టో కరెన్సీ రూపంలో ఢిల్లీకి చెందిన చార్టెట్ అకౌంటెంట్ రవికుమార్.. చైనా, హాంకాంగ్కు చెందిన లింక్యూన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, డోకిపే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లావాదేవీలు చూస్తున్నాడు. సంబంధిత కంపెనీలు మన దేశంలో డేటింగ్, గేమింగ్ యాప్ల ద్వారా వేల కోట్లు వసూలు చేసి మోసం చేశాయి. ఈ డబ్బు ను మనీలాండరింగ్ ద్వారా రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. నకిలీ ఎయిర్ వే బిల్లులు, సీసీ కెమెరాల క్లౌడ్ స్టోరేజ్ మెయింటెనెన్స్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి ఎస్బీఐ, ఎస్బీఎమ్ బ్యాంకుల ద్వారా రూ.1,100 కోట్ల డబ్బును రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. కొంత డబ్బును హవాలా రూపంలో హెయిర్ మర్చంట్స్, క్రిప్టో కరెన్సీ పేరుతో సింగపూర్కు మళ్లించినట్టు తేల్చింది. సంతకానికి రూ. 1,500 మనీ లాండరింగ్ ద్వారా రూ.1,100 కోట్లను దేశాన్ని దాటించేందుకు చైనా, హాంకాంగ్లో ఉన్న మాఫియా నేతృత్వంలో రవికుమార్ 621 బోగస్ కంపెనీలు సృష్టించాడని, అలాగే బోగస్ ఫామ్ 15 సీబీ సర్టిఫికెట్లు జారీ చేశాడని ఈడీ గుర్తించింది. చార్టెడ్ అకౌంటెంట్గా బ్యాలెన్స్ షీట్లను చూడకుండానే షెల్ కంపెనీలకు సంతకాలు చేశాడంది. ఈ మొత్తం వ్యవహారంలో రవికుమార్ తన ప్రతి సంతకానికి రూ.1,500 చొప్పున తీసుకున్నట్టు గుర్తించింది. బోగస్ కంపెనీల సృష్టికర్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, రవికుమార్ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టామని ఈడీ తెలిపింది. రవికుమార్ను విచారించేందుకు కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించినట్టు చెప్పింది.