obesity
-
ఆటలు లేని బాల్యం : ఊబకాయం, ఫ్యాటీ లివర్
ప్రపంచీకరణతో మన దేశానికి ఏస్థాయిలో మేలు జరిగిందో అదే స్థాయిలో కీడూ జరుగుతోంది. ఇప్పటి వరకూ పాశ్చాత్యదేశాలను మాత్రమే పట్టి పీడిస్తూ వచ్చిన అధిక బరువు, ఊబకాయం(Obesity) లాంటి సమస్య అభివృద్ధి చెందుతున్న భారత్కు సైతం తలనొప్పిగా మారింది. ప్రధానంగా చిన్నారులలో అధిక బరువు, ఊబకాయాలు... ఫ్యాటీ లివర్ (Fatty Liver) వ్యాధికి దారి తీయడం ఆందోళన కలిగిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనూహ్యంగా మార్పులకు లోనుకావటం, ఆడుకునే అవకాశం లేకపోవడం పిల్లల ఈ స్థితికి కారణమని నిపుణులు అంటున్నారు. పాఠశాల స్థాయి నుంచే ఆటలకు దూరమవుతున్న చిన్నారులు టీవీలకు, సెల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. బాల్యంలో ఓ ప్రధాన భాగమైన సంప్రదాయ (కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిళ్ల, కర్రాబిళ్ళా, బెచ్చాలు, గోళీలాంటి) ఆటలకు సైతం నోచుకోలేక పోతున్నారు. విద్యారంగంలో ప్రభుత్వ భాగస్వామ్యం తగ్గి ప్రైవేటు భాగస్వామ్యం రాను రాను పెరిగిపోవడంతో ఆటలు అటకెక్కాయి. చదువే ప్రధాన వ్యాపకంగా మారిపోయింది. విద్య ప్రభుత్వ బాధ్యతగా ఉన్నంతకాలం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల స్థాయిలో క్రీడలకు తగిన సదు పాయాలు ఉండేవి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలకు సువిశాలమైన ఆటస్థలాలతో పాటు తగిన సంఖ్యలో వ్యాయామ ఉపాధ్యాయులు సైతం ఉండటం ఒకప్పుడు సాధారణ విషయమైతే ఇప్పుడు అసాధారణ విషయంగా మారిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు నగరాలలోసింగిల్ బెడ్ రూమ్ పాఠశాలలు, డబుల్ బెడ్ రూమ్ కళాశాలలు మనకు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా సదుపాయాలు, మైదానాలు మచ్చుకైనా కనిపించవు. ఇలాంటి విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఆటలంటే ఏమిటో తెలియకుండా అమూల్యమైన తమ బాల్యాన్నీ, విద్యార్థి దశనూ ముగించడాన్ని మించిన విషాదం (Tragedy) మరొకటి లేదు.చదవండి: ఇరాన్ బీచ్లో‘బ్లడ్ రెయిన్’ : నెటిజన్లు షాక్, వైరల్ వీడియోపాఠశాల దశ నుంచే ఆటలకు, క్రీడాసంస్కృతికి దూరమైన చిన్నారులు ఆ తరువాతి కాలంలో శారీరకంగా, మానసికంగా పలు రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తోంది. మన దేశంలో ఈమధ్య కాలంలో నిర్వహించిన పలు అధ్యయనాల ప్రకారం ఆటపాటలకు దూరమైన చిన్నారులు అధిక బరు వుతో పాటు ఫ్యాటీ లివర్ (నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్) వ్యాధి బారిన పడుతున్నట్లు తేలింది. పిల్లలు బాల్యంలో ఆటలకు దూరం కావడం అంటే శారీరకంగా, మానసికంగా ఎదుగు దలకు దూరంకావటమేనని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనాల ప్రకారం దేశ జనాభాలో 60 శాతం మంది అధిక బరువు సమస్య ఎదుర్కొంటుంటే... అందులో 30 శాతం మంది ఊబకాయం సమస్యతో నానాపాట్లు పడుతున్నారు. బాలల్లో 40 శాతం మంది ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి సైతం హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో బాల్యంలో ఆటలూ అంతే ముఖ్యమని తల్లిదండ్రులూ... ఆరోగ్యవంతమైన, ఆహ్లాదభరితమైన బాల్యాన్ని అందించాల్సిన బాధ్యత తమపైనే ఉందని పాలకులూ, పాఠశాలల యాజమాన్యాలు గ్రహించిన రోజే బాల్యం అమూల్యంగా, అపు రూపంగా మిగిలిపోగలుగుతుంది.– కృష్ణారావు చొప్పరపుసీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ -
బరువు తగ్గాలన్నా, ఫిట్గా ఉండాలన్నా ది బెస్ట్ ఫార్ములా!
బరువు తగ్గాలంటే జీవన శైలి మార్పులు చేసుకోవాలి. వాకింగ్, యోగా ఇలాంటి ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి. అంతేకాదు ఆరోగ్యంగా, ఫిట్గా ఉండాలన్నా కూడా వాకింగ్కు మించింది లేదు. ఈ వాకింగ్లో చాలా పద్దతులు న్నాయి. రోజులో కనీసం 5 వేల అడుగులు వేయాలని, 10 వేల అడుగులు నడిచే వారికి ఊబకాయం అనే సమస్య ఉండదని నిపుణులు చెబుతారు. అయితే ఒక పద్ధతిని పాటిస్తే వాకింగ్ బోర్ కొట్టకుండా ఉత్సాహంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకుందామా మరి.ఫిట్గా ఉండటానికి నడక కంటే మెరుగైన వ్యాయామం లేదు. రెగ్యులర్ వాకింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నడక వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. గుండెకు బలం చేకూరుతుంది. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు, దృఢంగా మారతాయి. కండరాల శక్తి పెరుగుతుంది. బీపీ, షుగర్ లాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. వీటన్నింటికి మించి ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే, ఈ రోజువారీ నడకలో చిన్న మార్పులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయని నిపుణులు అంటున్నారు. అదే 2:2:1 వాకింగ్ ఫార్ములాచదవండి: ఇంటి గుట్టు :దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!ఏంటీ 2:2:1 వాకింగ్ ఫార్ములా రెండు(2) నిమిషాలు వేగంగా నడవడం (Brisk walking) తరువాతి రెండు(2) నిమిషాలు జాగింగ్ (jogging) చేయడంఆ తరువాత ఒక నిమిషం (1) పాటు సాధారణ నడక(normal walking) అన్నమాట. ఈ సైకిల్ను రిపీట్ చేస్తే అటు బరువు తగ్గడంతోపాటు, ఇటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. రోజులో కనీసం అరగంట ఈ పద్ధతినే పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారికి గేమ్-ఛేంజర్గా భావిస్తారు. ప్రయోజనాలుకేలరీలు తొందరగా,ఎక్కువగా బర్న్ అవుతాయి. 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల 200 కేలరీలు బర్న్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయిజీవక్రియ వేగవంతమవుతుంది.వేగంగా నడవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఆ తరువాత చేసే జాగింగ్ కొవ్వును వేగంగా కరిగించడానికి సాయపడుతుంది. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్తాయి పెరుగుతుంది. నెమ్మదిగా నడుస్తున్నప్పుడు జాగింగ్తో అలసిన కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విధానంలో అలసట రాదు , ఆసక్తికరంగా ఉంటుంది కూడా. నెమ్మదిగా, స్థిరంగా చేసే ఒకే రకమైన వ్యాయామాల కంటే ఇంటర్వెల్-స్టైల్ వ్యాయామాలు కొవ్వును కరిగించ డానికి, సమర్థవంతంగా ఉంటాయని అధ్యయనాల ద్వారా వెల్డైంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే 2:2:1 ఫార్ములా ఉత్తమమంటున్నారు నిపుణులు. -
సగం జనాభా లావెక్కింది
న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో సగానికి పైగా వయోజనులు ఊబకాయులుగా మారిపోయారు! 2050 నాటికి ఇది 57 శాతం దాటనుంది. అంతేగాక పిల్లలు, టీనేజర్లు, యువకుల్లో మూడింట ఒక వంతు ఊబకాయులుగా మారొచ్చని లానెస్ట్ జర్నల్ అంచనా వేసింది. 200 పైగా దేశాలకు చెందిన గ్లోబల్ డేటాను విశ్లేషించిన మీదట ప్రచురించిన తాజా అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించింది. దశాబ్ద కాలంలో ముఖ్యంగా అల్పాదాయ దేశాల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని కట్టడికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ)కు చెందిన ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ నాయకత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఊబకాయుల సంఖ్య 1990తో పోలిస్తే నేడు రెట్టింపైంది. 2021 నాటికి ప్రపంచ వయోజనుల్లో సగం మంది ఊబకాయులుగా మారిపోయారు. 25 ఏళ్లు, అంతకు పైబడ్డ వారిలో ఏకంగా 100 కోట్ల పురుషులు, 111 కోట్ల మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే 2050 ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య పురుషుల్లో 57.4 శాతానికి, స్త్రీలలో 60.3 శాతానికి పెరగవచ్చు. ఇక 1990 నుంచి 2021 నాటికి పిల్లలు, టీనేజర్లలో ఊబకాయులు 8.8 శాతం నుంచి 18.1 శాతానికి పెరిగారు. 20–25 మధ్య వయసు యువతలో 9.9 నుంచి 20.3 శాతానికి పెరిగింది. చైనాలో 62 కోట్లు ఊబకాయుల సంఖ్య 2050 నాటికి చైనాలో 62.7 కోట్లు, భారత్లో 45 కోట్లు, అమెరికాలో 21.4 కోట్లకు చేరనుంది. సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో ఈ సంఖ్య ఏకంగా 250 శాతానికి పైగా పెరిగి 52.2 కోట్లకు చేరుతుదని అంచనా. నైజీరియా 2021లో 3.66 కోట్ల మంది అధిక బరువుతో ఉండగా 2050 కల్లా 14.1 కోట్లకు చేరనుంది. సామాజిక వైఫల్యం... వయోజనుల్లో సగం ఊబకాయులే కావడాన్ని సామా జిక వైఫల్యంగా చూడాలని ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ అన్నారు. యువతలో ఊబకాయం వేగంగా పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. ‘‘కొత్తగా వచ్చిన బరువు తగ్గించే మందుల ప్రభావాన్ని అధ్యయనం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటే విపత్తును ఎంతో కొంత నివారించవచ్చు’’అని ఆమె వెల్లడించారు. ఆరోగ్య వ్యవస్థలకు సవాలు ఊబకాయం పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు సవాలేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మర్డోక్ చి్రల్డన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు చెందిన డాక్టర్ జెస్సికా కెర్. ‘‘పిల్లలు, టీనేజర్ల విషయంలో ఇప్పట్నుంచే శ్రద్ధ పెడితే ఊబకాయాన్ని నివారించడం సాధ్యమే. యూరప్, దక్షిణాసియా దేశాల్లో పిల్లలు, టీనేజర్లు అధిక బరువుతో ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.ఉత్తర అమెరికా, ఆస్ట్రలేషియా, ఓషియానియా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఊబకాయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టీనేజీ బాలికల్లో ఎక్కువగా ఉంది’’అని చెప్పారు. భావి తరాలు అనారోగ్యం బారిన పడకుండా చూడటం, ఆర్థిక, సామాజిక నష్టాలను నివారించడం తక్షణ కర్తవ్యమని సూచించారు. -
ఒక 24 గంటలు నిద్రలేకుండా గడిపారో ఊబకాయం, కానీ!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం.. ప్రతి ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్ర లేమి మధుమేహం, కేన్సర్ లాంటి అనేక దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుందని అనేక అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. అంతేకాదు తగినంత నిద్ర లేనపుడు మెదడు పనితీరు ప్రభావితమవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 24 గంటలు నిద్ర పోకపోవడం వలన పెద్దల్లో ఊబకాయం ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధన తేల్చింది. కువైట్లోని దాస్మాన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ (DDI) ఆరోగ్యకరమైన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థపై స్వల్పకాలిక నిద్ర లేమి ప్రభావాన్ని అంచనా వేసింది. ఊబకాయం, మధుమేహం , గుండె జబ్బులు వంటి పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించింది. ఈ పరిశోధన ప్రకారం, ఆరోగ్యకరమైన పెద్దలలో ఒక రాత్రి నిద్రను దాటవేయడం వల్ల దీర్ఘకాలిక మంట (chronic inflammation)తో ముడిపడి ఉన్న కణాల్లో పెరుగుదల నమోదైంది. ఇదే ఊబకాయానికి ముఖ్య లక్షణం. అయితే ఆసక్తికరవిషయం ఏమిటంటే, సాధారణ నిద్ర పునరుద్ధరించుకున్న తరువాత ఇది సాధారణ స్థితికి చేరింది. తమ పరిశోధన నిద్ర, రోగనిరోధక ఆరోగ్యం మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధాన్ని హైలైట్ చేస్తుంది అంటున్నారు పరిశోధకులు.నిద్ర - బరువు మధ్య సంబంధంపై చాలా కాలంగా పరిశోధనలు సాగుతున్నాయి. నిద్ర నియంత్రణ అనేది మెదడుకు మాత్రమే సంబంధించినది కాదు, మెదడు ,శరీరంలోని మిగిలిన భాగాల మధ్య సంక్లిష్ట పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుందని ఇప్పటికే స్పష్టమైంది. ఆరోగ్యంపై నిద్ర లేమి ప్రభావం తెలిసినప్పటికీ, ఈ అనుబంధానికి అంతర్లీనంగా ఉన్న విధానం తక్కువగా అర్థం చేసుకున్నారు. 237 మంది ఆరోగ్యకరమైన పెద్దలపై ఈ పరిశోధన జరిగింది. వీరిబాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఆధారంగా పీలగా ఉన్నవారు, అధిక బరువుతో ఉన్నవారు, ఊబకాయంతో ఉన్నవారు ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు , మూత్రపిండాల పనితీరు బావుందని నిర్ధారించుకున్నారు. అలాగే మధుమేహం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA), అధిక రక్తపోటు లేదా అధిక రక్తపోటుకు మందులు తీసుకుంటున్న వారు. గుండె సమస్యలు (గుండెపోటు, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ (CABG) శస్త్రచికిత్స, కరోనరీ యాంజియోప్లాస్టీ లేదా 'స్టెంట్లు') గుండె సంబంధిత కారణాల వల్ల అకాల మరణం (40 ఏళ్లకు ముందు) సంభవించిన కుటుంబ చరిత్ర ఉన్నవారిని, డిప్రెషన్, సంబంధిత మందులు తీసుకుంటున్న వారికి కూడా మినహాయించారు."నిద్ర లేమి, రోగనిరోధక కణాల డైనమిక్స్ మధ్య పరస్పర చర్యను పరిశీలించేందుకు ఐదుగురు 'సాధారణ బరువు' వ్యక్తులను - ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలను - 24 గంటల పాటు నిద్ర లేమికి గురిచేశారు. వారి నాన్-క్లాసికల్ మోనోసైట్లు (NCM) , ప్రోఇన్ఫ్లమేటరీ సైటోకిన్ల స్థాయిలను గమనించారు. ఇందులో ఎన్సీఎంలో తీవ్రమైన, గణనీయమైన పెరుగుదలను గమనించారు. అయితే ఇది రెండు రోజుల తర్వాత అంటే వారు సాధారణంగా నిద్రపోయినపుడు ఇది సాధారణ స్థితికి వచ్చిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనం ది జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీలో ప్రచురితమైంది. -
బెడ్ ఎక్కిస్తున్న ప్రాసెస్డ్ ఫుడ్
సాక్షి, అమరావతి: దేశంలో సంప్రదాయ ఆహారపు అలవాట్లు పాశ్చాత్య జీవనశైలి వైపు మారుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర పానీయాల వినియోగం సర్వసాధారణమైంది. పండ్లు, కూరగాయలు తినడం తగ్గుతోంది. ఫలితంగా ఆహారంలో పోషకాల తగ్గి.. అధిక కేలరీలకు దారి తీస్తోంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 20–40 ఏళ్ల వయసు్కల్లో ప్రాసెస్డ్ ఫుడ్ ఆరోగ్యాన్ని దిగజారుస్తున్నట్టు చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రాసెస్డ్ ఫుడ్ వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన ఖర్చు చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలపై పెరిగిన ఖర్చు మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ సమస్యలు వంటి నాన్–కమ్యూనికబుల్ వ్యాధుల పెరుగుదలతో ముడిపడి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా గృహ వ్యయ సర్వేలో గ్రామీణ భారతంలోని నెలవారీ ఖర్చులో 47 శాతం ఆహారం కోసం వెచ్చిస్తున్నారు. ఇందులో ఏకంగా 10 శాతం మొత్తాన్ని ప్రాసెస్ చేసిన ఆహారానికి కేటాయించడం గమనార్హం.ఇది పండ్లు (3.85 శాతం), కూరగాయలు (6.03 శాతం), తృణధాన్యాలు (4.99 శాతం), గుడ్లు, చేపలు, మాంసంపై (4.92 శాతం) కంటే అధికంగా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. నెలవారీ ఖర్చులో 39 శాతం ఆహారం కోసం వెచ్చిస్తే ఇందులో పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్పై 11 శాతం వరకు ఖర్చు చేస్తున్నారు. ఇది పండ్లు (3.87 శాతం), కూరగాయలు (4.12 శాతం), తృణధాన్యాలు (3.76 శాతం), గుడ్లు, చేపలు, మాంసం (3.56 శాతం) ఖర్చును అధిగమించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంపై సగటు నెలవారీ తలసరి వ్యయం 2022–23లో 46.38 శాతం నుంచి 2023–24లో 47.04 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 39.17 శాతం నుంచి 39.68 శాతానికి వృద్ధి చెందింది. ప్రమాదంలో ప్రజారోగ్యం గత ఏడాది నాన్–కమ్యూనికబుల్ వ్యాధులు (ఎన్సీడీ) రిస్క్ ఫ్యాక్టర్ సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రచురించిన లాన్సెట్ అధ్యయనం ప్రకారం 2022లో.. ప్రపంచ వ్యాప్తంగా భారత్లోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారిలో 62 శాతం మందికి ఎటువంటి చికిత్స అందటం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయంతో బాధపడుతున్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది. దాదాపు 8 కోట్ల మంది స్థూలకాయ బాధితులు ఉంటే.. 5–19 సంవత్సరాల వయస్కుల్లో కోటి మంది ఉండటం గమనార్హం. ఈ సమస్యతో ఏటా 60 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనారోగ్యాలపై 6 ట్రిలియన్ల ఖర్చు ఇలా దీర్ఘకాలిక అనారోగ్యాలపై 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు పెరుగుతుందని అంచనా. దేశంలో అత్యున్నత వైద్య ప్యానల్ అయిన ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా మొత్తం వ్యాధుల్లో 56.40 శాతం అనారోగ్యకర ఆహారాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొంది. మరోవైపు ఒత్తిడి, నిశ్చల జీవనానికి విఘాతం కలిగించే అలవాట్లు కూడా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఉప్పు, చక్కెరలను పరిమితంగా తీసుకోవడం, సమతుల్య ఆహారాన్ని పెంచడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయాలని నివేదికలు సిఫారసు చేస్తున్నాయి. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు కేవలం 10 నిమిషాల్లోనే భోజనాన్ని అందిస్తున్నాయి. ఇదే ఆహార ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలా డెలివరీ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి ఫుడ్ డెలివరి ప్లాట్ఫామ్లతో దేశంలో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాల వినియోగం పెరిగింది. అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ చైన్లు పాశ్చాత్య ఆహార ధోరణులను భారతీయ గృహాలకు పరిచయం చేశాయి. ఇక్కడే ఫుడ్ డెలివరీ మార్కెట్ 2030 నాటికి రూ.2.12 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. పైగా దేశంలో ఆదాయం పెరగడంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది. ఫిచ్ సొల్యూషన్స్ నివేదిక ప్రకారం భారతదేశ గృహ వ్యయం 2027 నాటికి 3 ట్రిలియన్ల డాలర్లను దాటనుంది. అప్పటికి.. దాదాపు 25.80 శాతం భారతీయ కుటుంబాల్లో సాధారణ ఖర్చులు పోనూ రూ.86 వేలు అదనంగా వ్యయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.రెండు దశాబ్దాల కిందటి వరకు గ్రామీణ భారతం జంక్ ఫుడ్ కోసం కేవలం 4 శాతం మాత్రమే ఖర్చు చేసేది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6.35 శాతంగా ఉండేది. 2004–05, 2009–10 మధ్య కాలంలో పెద్దఎత్తున జంక్ ఫుడ్ ధరలు, వినియోగం కూడా పెరిగాయి. -
ఊబకాయానికి ఉటోపియా విరుగుడు!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యధిక మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ఒకటి. శరీరంలో కొవ్వు పెరుగుతున్నాకొద్ది.. కొత్త కొత్త వ్యాధులు కూడా పెరుగుతాయి. ఊబకాయాన్ని తగ్గించుకొనేందుకు కొందరు శారీరక శ్రమ చేస్తే.. మరికొందరు ఆకలిని తగ్గించే ఒజెంపిక్ వంటి మందులపై ఆధారపడుతున్నారు. ఇకపై ఇలాంటి కష్టతరమైన పనులతో అవసరం లేకుండా ఒక్క టీకాతో ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చని చెబుతోంది ఉటోపియా థెరపాటిక్స్ సంస్థ. ఊబకాయాన్ని తగ్గించేందుకు ఈ సంస్థ ప్రత్యేక వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఈ టీకా ఆవిష్కరణలో సంస్థ సీఈవో డాక్టర్ గోపి కడియాల కీలక భూమిక పోషించారు. ఇది ఎలా పనిచేస్తుందంటే..: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఊబకాయాన్ని తగ్గించే మందుల్లో అత్యధికం ఆకలిని తగ్గించటం ద్వారా శరీరంలోని కొవ్వును కరిగించే పని చేస్తాయి. ఈ విధానంలో దుష్ప్రభావాలు కూడా అధికమే. అందుకు భిన్నంగా ఉటోపియా సిద్ధం చేసిన టీకా ఆకలిని తగ్గించకుండానే.. నేరుగా శరీరంలో కొవ్వును కరిగించే వ్యవస్థను చైతన్యవంతం చేస్తుంది. తద్వారా ఒక క్రమ పద్ధతిలో ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా ఈ టీకా నియంత్రిస్తుందని ఉటోపియా చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ఉదయ్ సక్సేనా తెలిపారు. ఈ టీకాను ఇప్పటికే కోళ్లు, ఎలుకలపై ప్రయోగించి చూశామని, శరీరానికి హాని చేసే ట్రైగ్లిజరైడ్స్ 42 శాతం వరకు తగ్గినట్లు గుర్తించామని డాక్టర్ గోపి కడియాల చెప్పారు. అలాగే పొట్ట భాగంలో ఉండే విసరల్ ఫ్యాట్ 24 శాతం తగ్గిందని, ప్రీక్లినికల్ ట్రయల్స్లో ఎలాంటి దు్రష్పభావాలు కానీ.. కండర నష్టం, ఆకలి తగ్గిపోవడం వంటివి కనిపించలేదని వెల్లడించారు. త్వరలో ఈ టీకాను మనుషులపై కూడా ప్రయోగించనున్నట్లు తెలిపారు. వచ్చే ఫలితాల ఆధారంగా టీకాను అందరికీ అందుబాటులోకి తెస్తామని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఉటోపియా థెరపాటిక్ సంస్థకు బయో ఆసియా–2025 సదస్సులో టాప్–5 ఉత్తమ స్టార్టప్లో ఒకటిగా అవార్డు రావటం విశేషం. -
ఓవర్ ఆయిల్ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?
ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఊబకాయం (obesity)పై మన దేశ ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మాట్లాడుతూ 10 శాతం వంట నూనెల వాడకం తగ్గించాలన్నారు. దీంతో ఆయిల్ వాడకం వల్ల లాభనష్టాల మాట మళ్లీ చర్చకి వచ్చింది. మనం ఎలాంటి నూనెలు వాడితే మంచిది? ఏ వయసువాళ్లు ఎంత నూనె వాడాలి? మహిళలు, పురుషులు వారి ఆరోగ్య రీత్యా వాడే నూనెలలో తేడాలుండాలా.. ఈ అంశాల గురించిన వివరణ. ప్రపంచంలో 250 కోట్ల మంది అధికబరువుతో ఉన్నారని, ఆహారంలో నూనెల వాడకం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతోందని మోదీ డబ్ల్యూహెచ్ఓ డేటాని ఉటంకిస్తూ రోజువారి ఆహారంలో తక్కువ నూనె వాడకం ప్రాముఖ్యతను వివరించారు.కుటుంబ బాధ్యతవంటల్లో నూనెని తగ్గిస్తే ఊబకాయం నుంచి బయటపడొచ్చు. వంటల్లో నూనె తగ్గించడాన్ని కుటుంబం పట్ల బాధ్యతగా తీసుకోవాలి. ఎక్కువ నూనె వాడితే గుండె సమస్యలు, షుగర్, బీపి వంటివి వస్తాయి. అలాంటి వాటి నుంచి తప్పించుకునేందుకు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసి హెల్దీగా, ఫిట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చు. ప్రమాదకరమైనవివంట నూనెల్లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం ఊబకాయానికి కారణమవుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. నూనెలోని కొవ్వు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులను పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. అధిక రక్త΄ోటు ప్రమాదం పెరుగుతుంది. చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?తగ్గించాలంటే... పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేయాలి. ఊబకాయం గురించి అవగాహన కల్పించడానికి మోదీ పదిమంది సెలబ్రిటీలను నామినేట్ చేశారు. వారిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, నటులు ఆర్.మాధవన్, దినేష్ లాల్ యాదవ్ నిరాహువా, మోహన్ లాల్, స్పోర్ట్స్ షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, గాయని శ్రేయా ఘోషల్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. అధికంగా తీసుకుంటే నష్టాలుగ్రాము నూనెలో 9 క్యాలరీలు ఉంటాయి. అధికంగా తీసుకుంటే శరీర బరువు పెరుగుతుంది. కొవ్వు అధికంగా కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు.ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న నూనెలు హాని చేస్తాయి.అసమతుల్యమైన నూనెలు తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.అధిక నూనె వాడకం ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.ఏ నూనెలు వాడాలి? సమతుల కొవ్వులు ఉండే నూనెలను వాడాలి. ముఖ్యంగా ప్రాసెసింగ్ తక్కువగా చేసిన (కోల్డ్ ప్రెస్డ్) నూనెలు ఆరోగ్యానికి మంచివి.సురక్షితమైన, ఆరోగ్యకరమైనవి: సన్ఫ్లవర్, వేరుశనగ, ఒమేగా, మొక్కజొన్న నూనె, ఆలివ్ ఆయిల్, అవిసె నూనె, కోల్డ్ ఫ్రెస్డ్ ఆయిల్లలో ప్రాసెసింగ్ తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువ. చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్తక్కువగా వాడవలసినవి: పామ్ ఆయిల్ (Palm oil) ) – అధికంగా ప్రాసెస్ అవుతుంది.వనస్పతి – ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువ స్నాక్స్ తయారీలో ఒకసారి ఉపయోగించినవి, తిరిగి వాడుతుంటారు. వీటి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. సరైన పరిమితిలో తగిన రకాల నూనెలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలే చేస్తుంది.నూనెలు మంచి క్యాలరీ సోర్స్గా పనిచేస్తాయి. వీటిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్) ఉంటాయి.ఒమేగా–3, ఒమేగా–6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.కొన్ని నూనెలలో విటమిన్–ఇ, కె, శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం, కేశాల ఆరోగ్యానికి మంచిది.కొవ్వులు శరీరంలోని వివిధ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైనవి.ఎవరు ఎంత ఆయిల్ పిల్లలు (6–19 ఏళ్లు) రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్) ఆడ–మగ ఇద్దరికీ. ముఖ్యంగా కొబ్బరి, ఆలివ్ ఆయిల్, కనోలా, నెయ్యి వంటి ఆరోగ్యకరమైన నూనెలు వాడాలి. 20 – 59 ఏళ్ల వరకు : రోజుకు 5 – 6 టీస్పూన్లు (25–30ఎం.ఎల్) ఆడ–మగ ఇద్దరికీ. ఆలివ్, కనోలా, అవకాడో, వేరుశనగ, సన్ఫ్లవర్, రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్. కొబ్బరినూనె, అవిసె నూనె రోజుకు60 ఏళ్ల.. అంతకు మించి...రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్.) ఆడ–మగ ఇద్దరికీ. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆలివ్, అవిసె, కనోలా నూనెలను వాడాలి. గర్భవతులు మాత్రం రోజూ 6–7 టీ స్పూన్ల ఆరోగ్యకరమైన నూనె వాడాలి. వాటిలో ఆలివ్, అవకాడో, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్స్ (ఒమెగా 3 ఉన్న నూనెలు) వాడాలి. -డా. జానకి, పోషకాహార నిపుణులు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆయిల్ -
ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీ
ఊబకాయం (Obesity)పై అవగాహన పెంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi) వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేశారు. ఆరోగ్య ముప్పును అరికట్టడానికి చర్యలు తీసు కోవాలని ప్రజలను ఉద్బోధించిన ప్రధాని తాజాగా ఊబకాయంపై పోరాటంలో సహాయం చేయడానికి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra), నటుడు మోహన్ లాల్ (Mohanlal)తోపాటు వివిధ రంగాలకు చెందిన 10 మందిని సోమవారం నామినేట్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉద్యమాన్ని విస్తరిస్తూ, ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని ఆయన వారిని కోరారు.As mentioned in yesterday’s #MannKiBaat, I would like to nominate the following people to help strengthen the fight against obesity and spread awareness on reducing edible oil consumption in food. I also request them to nominate 10 people each so that our movement gets bigger!… pic.twitter.com/bpzmgnXsp4— Narendra Modi (@narendramodi) February 24, 2025 దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని ఆదివారం జరిగిన మన్ కీ బాత్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రజలు ఆహారంలో తక్కువ నూనె వాడాలని, నూనె తీసుకోవడం 10 శాతం తగ్గించడంతోపాటు, ఈ చాలెంజ్ను మరో పది మందికి అందించాలని ఆదివారం తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని కోరారు. ప్రధానమంత్రి డబ్ల్యూహెచ్వో WHO డేటాను ఉటంకిస్తూ, 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ లెక్కలు చాలా తీవ్రమైనవని, ఇలాఎందుకు జరుగుతుందో మనమందరం ఆలోచించాలని పిలుపినిచ్చారు. అధిక బరువు లేదా ఊబకాయం అనేక రకాల సమస్యలు, వ్యాధులకు దారితీస్తుంది అని అన్నారు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఅలాగే దీనికి సంబంధించిన ఎక్స్లో ఒక పోస్ట్ను షేర్ చేశారు. ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహనను విస్తృతం చేసేందుకు తానుఈ క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఉద్యమం పెద్దదిగా మారడానికి ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని కూడా వారిని అభ్యర్థిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని నామినేట్ చేసిన ప్రముఖులుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహేంద్ర, ప్రముఖ నటుడు మోహన్లాల్ భోజ్పురి గాయకడు, నటుడు నిరాహువాహిందుస్తానీ, షూటింగ్ ఛాంపియన్ ఒలింపిక్ విజేత మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయ ఘోషల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి ఉన్నారు. ఈ పదిమంది ఎంతమందిని నామినేట్ చేస్తారో.. ఈ లిస్టులో ఎవరెవరు ఉంటారో చూద్దాం.! -
స్థూల భారతం.. మందుల మార్గం!
జీవన శైలిలో మార్పులు, శరీరానికి వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ వినియోగం పెరగడంతో.. మన దేశంలో స్థూలకాయుల సంఖ్య ఏటేటా మరింతగా పెరిగిపోతోంది. ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)’2022 ప్రకారం ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు 8 కోట్ల మంది ఇప్పటికే స్థూలకాయుల కేటగిరీలోకి చేరగా.. మరో 3 కోట్ల మంది వయోజనులు పొట్ట చుట్టూ అధిక కొవ్వు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్టు అంచనా. ఒబేసిటీ అత్యధికంగా ఉన్న టాప్–10 దేశాల జాబితాలోకి భారత్ కూడా చేరిపోయింది. దీంతో అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. ఇప్పటికే బరువు తగ్గించే పలు రకాల మందులు మార్కెట్లో ఉండగా.. మరికొన్ని ఔషధాలు మన మార్కెట్లోకి రానున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్మూడింతలు పెరిగిన మార్కెట్.. ఒబేసిటీ చికిత్సలో ఉపయోగించే ఔషధాలను జీఎల్పీ–1 (గ్లూకగాన్ తరహా పెప్టైడ్ రిసెప్టర్ ఎగోనిస్ట్స్)గా వ్యవహరిస్తారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని నియంత్రించే హార్మోన్లుగా పనిచేస్తాయి. పొట్ట నిండుగా ఉన్నట్లుగా మెదడుకు సంకేతాలు పంపించి, పొట్ట ఖాళీ అయ్యే ప్రక్రియను నెమ్మదింపజేసి, బరువు తగ్గించుకునేందుకు తోడ్పడతాయి. అంతర్జాతీయంగా యాంటీ–ఒబేసిటీ ఔషధాల అమ్మకాలు 2024లో సుమారు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా... 2035 నాటికి 105 బిలియన్ డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. మన దేశంలోనూ బరువు తగ్గించే మందులకు డిమాండ్ పెరుగుతోంది.2020 నవంబర్లో వీటి అమ్మకాలు రూ.137 కోట్లుగా ఉంటే.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరాయి. అంటే సుమారు 290 శాతం పెరిగింది. ఒబేసిటీ సర్జరీ సొసైటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం బరువు తగ్గేందుకు చేయించుకునే సర్జరీలు 2004లో సుమారు 200 మాత్రమేకాగా... 2019 నాటికి ఏకంగా 100 రెట్లు పెరిగి 20,000కు చేరుకున్నాయి. స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో హైపర్టెన్షన్, మధుమేహం, కాలేయ వ్యాధులు వంటి సమస్యలూ వస్తాయి. వీటి చికిత్సల్లో ఉపయోగించే ఔషధాలకూ డిమాండ్ పెరిగిపోతోంది.ఖరీదైన వ్యవహారంగా చికిత్స..యాంటీ–ఒబేసిటీ చికిత్స ఆషామాషీ వ్యవహారం కాదని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ఈ చికిత్సలకు నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చవుతుందని అంటున్నారు. ఈ ఔషధాలను దీర్ఘకాలంపాటు తీసుకుంటేనే ఫలితాలు కనిపిస్తాయని, మధ్యలో ఆపేస్తే అప్పటిదాకా చేసినదంతా వృథా అవుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు ఒకే మందు అందరికీ పనిచేయదని... శరీరతత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకం ఔషధం వాడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.ఇక యాంటీ ఒబేసిటీ మందులతో కొన్ని దుష్ఫలితాలకూడా వచ్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. కొన్నిరకాల ఔషధాలను దీర్ఘకాలం ఉపయోగిస్తే ఇతర దు్రష్పభావాలు తలెత్తవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. అయినా మన దేశంలో యాంటీ ఒబేసిటీ ఔషధాల వినియోగం పెరుగుతోంది. సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్, ఒర్లిస్టాట్, టిర్జెప్టైడ్ వంటి ఫార్ములాల ఆధారిత ఔషధాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.అంతర్జాతీయ కంపెనీల కన్ను.. భారత్లో బరువు తగ్గే మందులకు డిమాండ్ నెలకొనడంతో.. అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు మన దేశంపై దృష్టి పెడుతున్నాయి. డెన్మార్క్ కంపెనీ నొవో నోర్డిస్క్కు చెందిన ఓరల్ సెమాగ్లూటైడ్ ట్యాబ్లెట్ రైబెల్సస్ను 2022లో దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టగా.. అది 65 శాతం యాంటీ–ఒబేసిటీ మార్కెట్ను ఆక్రమించింది. దీంతో సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్లను కూడా భారత్లో ప్రవేశపెట్టేందుకు ఆ కంపెనీ కసరత్తు చేస్తోంది. వెగోవీ, ఒజెంపిక్ వంటి ఔషధాల వినియోగం కూడా మనదేశంలో భారీగానే ఉంటోంది. మరింత బాగా పనిచేస్తా యని పేరుండి.. మన దగ్గర విక్రయించని కొన్ని ఔషధాలను అనధికారిక మార్గాల్లో తెప్పించుకునే ధోరణి కూడా పెరుగుతోంది. ఇక అమెరికాకు చెందిన ఎలై లిల్లీ కంపెనీ సైతం టిర్జిప్టైడ్ ఆధారిత మౌంజారో ఔషధాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మన దేశీయ కంపెనీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. గ్లెన్మార్క్ ఇప్పటికే లిరాగ్లూటైడ్ జనరిక్ వెర్షన్ను ప్రవేశపెట్టగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా తదితర కంపెనీలు పేటెంట్ ముగిసిన జీఎల్పీ–1 ప్రత్యామ్నాయాల మీద పని చేస్తున్నాయి. సన్ ఫార్మా కూడా ఈ విభాగంలో కొత్త మాలిక్యూల్పై పరిశోధన చేస్తోంది. -
వంట నూనెని తీసుకోవడం తగ్గించండి..!: ప్రధాని మోదీ విజ్ఞప్తి
శారీరక శ్రమ లేకపోవడం, జంక్ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లు, జీవనశైలి తదితరాలే ఊబకాయం సమస్యకు కారణం అని అంతా చెబుతుంటారు. కానీ ప్రధాన కారణం వంట నూనె అట. సాక్షాత్తు ప్రధాని మోదీనే అన్నారు. ఆయన ఎందుకిలా పిలుపునిచ్చారు..? ఊబకాయం సమస్యకి వంటనూనె కారణమా..? తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.దయచేసి అందరూ ఇళ్లల్లో వంటనూనె వినియోగాన్ని తగ్గించండి ఇదే ఊబయకాయం రావడానికి ప్రధానం కారణం అంటూ పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. న్యూఢిల్లీలో జరిగిన 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వంటనూనె అధిక వినియోగమే ఊబకాయం సమస్యకు ప్రధాన కారణం అని అన్నారు. దేశంలోని అన్ని వయసుల వారు, ముఖ్యంగా యువత ఈ సమస్య బారినపడుతున్నారని అన్నారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ ఊబకాయం మధుమేహం, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదాన్ని పెంచుతోందన్నారు. రోజువారీగా వ్యాయమం చేయడం, సమతుల్య పోషకాహారంపై దృష్టిపెట్టడం తోపాటు నూనె తీసుకోవడం తగ్గించాలని ప్రజలకు సూచించారు మోదీ. "మన ఇళ్లల్లో నెల ప్రారంభంలో రేషన్ వస్తుంది. ఇప్పటి వరకు ప్రతినెల రెండు లీటర్ల వంట నూనె ఇంటి తీసుకొచ్చినవారు దానిని కనీసం 10%కి తగ్గించండి." అని కోరారు మోదీ. మరి దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. మణిపాల్ ఆస్పత్రిలోని డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ కుమార్ సైతం వంట నూనెని తగ్గించాలన్నారు. అధిక బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీసే కడుపు నిండిన అనుభూతిని కలిగించకుండా చేసేది వంటలో ఉపయోగించే అదనపు నూనె అని అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి నెలకు 600-700 ఎంఎల్ కంటే ఎక్కువ తినకూడదని చెప్పారు. అంటే రోజుకి సుమారు నాలుగు టీస్పూన్లకు మించి వాడకూడదని అన్నారు.మరో డాక్టర్ అనూప్ మిశ్రా మాట్లాడుతూ..సాధారణంగా ప్రజలు సిఫార్సు చేసిన నూనెకి మించి అధికంగా నూనెని వాడతారు. కొందరూ ఫ్రై చేసిన నూనెని తిరిగి వినియోగిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఆహార పదార్థాలు వేయించడానికి ఉపయోగించిన నూనెని తిరిగి ఉపయోగించడం వల్ల ట్రాన్స్-ఫ్యాట్స్ పెరుగుదలకు దారితీస్తుంది. ఇవి గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక నూట్రిషన్లు నూనె పరిమాణం తోపాటు నూనె నాణ్యత కూడా ముఖ్యమేనని అన్నారు. ముఖ్యంగా ఆవాల నూనె, వేరుశెనగ నూనె వంటకు చాలామంచివని చెప్పారు. అలాగే మిశ్రమ నూనెల కలయిక కూడా చాలామంచిదని చెప్పారు. ఉదాహారణకి వేరుశెనగ, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, బియ్యం ఊక నూనెల మిశ్రమంగా వాడటం కూడా మంచిదని అన్నారు. ఇక ఆర్థిక సర్వే 2023-2024 అనారోగ్యకరమైన ఆహారం,ఎక్కువగా కూర్చొనే అలవాట్లు మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొంది. అంతేగాదు ఇది దేశ ఆర్థిక సామర్థ్యానికి ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. శతాబ్దాలుగా మన భారతీయ సాంప్రదాయ ప్రకృతి, పర్యావరణానికి అనుకూలంగా ఆరోగ్యంగా, సామరస్యంగా ఎలా జీవించాలో చూపించాయి. దానికి అనుగుణంగా భారతీయ వ్యాపారాలు ఉండాలి. ప్రపంచ మార్కెట్ని ఉపయోగించుకోవడానికి బదులుగా నడిపించేలా భారతీయ వ్యాపారాలు ఉండాలి. అంటే ఆరోగ్యానికి పెద్దపీటవేసేలా సాగితే.. అన్ని విధాల శ్రేయస్కరం, ప్రగతి పథం కూడా అని అన్నారు ప్రధాని మోదీ. (చదవండి: -
అది ఒబెసిటీ కాదట..!15 ఏళ్ల తర్వాత..
ఇన్నాళ్లుగా అనుకున్నట్లుగా ఒబెసిటీ అంటే అది కాదట. దశాబ్దాలు అలానే తప్పుగా భావించమని తేల్చి చెప్పారు వైద్యులు. అసలు ఒబెసిటీ అంటే ఏంటో..అందుకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను అందించారు నిపుణులు. మరీ ఒబెసిటీ అంటే ఏంటంటే..దశాబ్దాలుగా వైద్యులు ఊబకాయాన్ని(obesity) కొలవడానికి బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)(body mass index (BMI))సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బీఎంఐ అనేది వ్యక్తి బరువును కిలోగ్రాముల్లోనూ, ఎత్తు చదరుపు మీటర్లలో భాగించగా వచ్చిన దాన్ని శరీర కొవ్వు కొలతగా నిర్వచించేవారు. దీంతో బీఎంఐ 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణించారు. అయితే కొందరిలో మాత్రం అధిక శరీర కొవ్వు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ 30 కంటే ఎక్కువ బీఎం ఉండదు. అలాంటప్పుడూ రాబోయే ఆరోగ్య ప్రమాదాలు గుర్తించలేమని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ప్రస్తుత జనాభా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. అలాంటప్పుడు కాలం చెల్లిన బీఎంఐలతో బరువు, ఎత్తు నిష్పత్తిలతో అంచనా వేస్తే సరిపోదని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ ఒబెసిటీకి సరికొత్త నిర్వచనాన్ని మార్గదర్శకాలను అందించింది. అవేంటంటే..ఊబకాయం అనే అధిక శరీర కొవ్వు. ఇది అనేక వ్యాధులకు కారణమయ్యే దీర్ఘకాలిక వ్యాధి. అలాగే ఇక్కడ బీఎంఐ అనేది శరీర కొవ్వును అతిగా లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. అంతే తప్స స్పష్టమైన అంచనా మాత్రం ఇవ్వదు. అందుకని ఈ ఊబకాయాన్ని దీర్ఘకాలిక వ్యాధికి సరిగ్గా సరిపోయేలా అనారోగ్య స్థితిగా నిర్వచించారు. ఇది అవయవాలు, కణజాలల పనితీరుపై నేరుగా ప్రభావం చూపే అధిక కొవ్వుగా పరిగణించారు. దీన్ని బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ లేదా డీఈఎక్స్ఏ స్కాన్లు వంటి ప్రత్యేక యంత్రాలతో కచ్చితంగా నిర్థారించగలమని అన్నారు. అయితే ఇవి ఖరీదైనవి కావడంతో క్లినిక్లలో అందుబాటులో లేవు. ఇక ఊబకాయం ఉన్నవారికి శరీరంలో కొవ్వు ఎక్కడ పేరుకుపోయిందనేది ముఖ్యమట. అంటే బొడ్డు చుట్టూ ఉంటే ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాలు బెల్లీఫ్యాట్(Belly Fat)ని తీవ్రమైన ఒబెసిటీ పరిగణించమని చెబుతోంది. అలాగే ఆయా వ్యక్తులకు మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది కూడా పరిగణలోనికి తీసుకోవాలట. కొత్త మార్గదర్శకాల్లో ఒబెసిటీని రెండు దశల్లో వర్గీకరించారు. దశ1: అవయవ పనితీరుపై లేదా సాధారణ రోజువారీ కార్యకలాపాలపై స్పష్టమైన ప్రభావాలు లేకుండా పెరిగిన కొవ్వు (BMI > 23 kg/m². ఈ దశ ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు చూపించకపోయినా..భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందట. దశ2: బీఎంఐ 23 కిలోలు/మీ2 కంటే ఎక్కువ ఉండి, పొట్ట చుట్టూ కొవ్వు, అధిక నడుము చుట్టుకొలత ఉంటే దీన్ని ఊబకాయంగా పరిగణిస్తారు. ఇది శారీరక అవయవ విధులను ప్రభావితం చేస్తుంది. టైప్2 డయాబెటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఈ మార్గదర్శకాలను అక్టోబర్ 2022 నుంచి జూన్ 2023 వరకు ఐదు సర్వేలు నిర్వహించి మరీ అందిచినట్లు నిపుణుల చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అందించిన ఈ మార్గదర్శకాలు ఆచరణాత్మకమైనవి, అలాగే ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి నివారించడానికి ఉపయోగపడతాయని చెప్పారు.(చదవండి: 32 ఏళ్లు ద్వీపంలో ఒంటరిగా బతికాడు! సడెన్గా జనాల్లోకి తీసుకురాగానే..) -
రక్తపోటు.. గుర్తించకపోతే స్ట్రోక్ ముప్పు
రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి జబ్బులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. ఈ సమస్యలు కిడ్నీ, మెదడు, గుండె సంబంధిత పెద్ద జబ్బులకు ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 4.58 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. వీరిలో 1.17 కోట్ల మంది రాష్ట్రాల ఆరోగ్య శాఖ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో మందులు, చికిత్సలు అందుకుంటున్నారు. రక్తపోటు.. హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు అమెరికాలోని 27,310 మంది పెద్దల ఆరోగ్య రికార్డులను 12 ఏళ్లకు పైగా పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల సగటు వయస్సు 65 ఏళ్లుగా ఉంది. – సాక్షి, అమరావతి10 కంటే ఎక్కువైతే 20% ప్రమాదం రక్తపోటు సగటు కంటే ఎక్కువయ్యే కొద్దీ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. రక్తపోటు సగటు కంటే 10 ఎంఎం హెచ్జీ ఎక్కువగా ఉన్న వారిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ప్రమాదం 31 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. 31 నుంచి 67 శాతం ఎక్కువ ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఐదేళ్లు అధిక రక్తపోటు సమస్యతో బాధపడిన వ్యక్తులు స్ట్రోక్ బారిన పడేందుకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించారు. ఆరు నుంచి 20 ఏళ్ల పాటు రక్తపోటు సమస్య ఉన్న వ్యక్తుల్లో 50 శాతం, రెండు దశాబ్ధాలుపైగానే సమస్యతో బాధపడే వ్యక్తుల్లో 67 శాతం ఎక్కువగా స్ట్రోక్కు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు రక్తపోటు సంబంధిత లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు, చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంచుకుంటే జీవితకాల వైకల్యం ముప్పు తప్పుతుందన్నారు. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేకుండానే కొందరిలో రక్తపోటు చాప కింద నీరులా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తరచూ రక్త పోటు పరీక్షలు చేయించుకుంటూ, ఉండాల్సినదాని కంటే ఎక్కువ రికార్డు అయితే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలిలో మార్పు రావాలి ఆహారం, నిద్ర, జీవన శైలిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాయామాన్ని రోజువారి దినచర్యలో ఓ భాగం చేసుకోవాలి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఒత్తిడిని దరి చేరనివ్వకుండా చూసుకోవాలి. ప్రస్తుతం స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. – డాక్టర్ బి.విజయ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
ఉప్పెనలా ఊబకాయం
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన 3వ తరగతి విద్యార్థి 46 కిలోల బరువు ఉన్నాడు. జంక్ఫుడ్ అతిగా తినడంతోనే బరువెక్కినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మిగతా విద్యార్థులతో సమానంగా క్రీడల్లో పాల్గొనలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊబకాయం కారణంగా చలాకీతనం కోల్పోయాడని అంటున్నారు.రెండు వారాల క్రితం తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థి బస్సులో ప్రయాణిస్తూ.. పుట్టపర్తి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు సాయం చేసి.. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు నిర్ధారించారు. ఊబకాయమే సమస్యకు కారణమని వైద్యులు తేల్చారు. బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నారంటారు. కానీ అధిక భారం అలాగే కొనసాగితే వారికి వారే భారం కావడం ఖాయం. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమూ ఉంది. జీవనశైలిలో మార్పుల కారణంగా భవిష్యత్తులో ఊబకాయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాక్షి, పుట్టపర్తి: ఊబకాయం.. ప్రతి వందలో 20 మందిని తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య. శారీరక వ్యాయామం తగ్గటం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి విధానంతో ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఊబకాయులుగా మారుస్తోంది. బాల్యంలోనే ఊబకాయం వస్తే చలాకీతనం కోల్పోతారు. చిన్న వయసులోనే అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతారు. వయసుకు తగిన బరువు ఉంటే చాలని.. అధిక బరువు అనర్థాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయల్లో సమస్యలు ఇవే.. ∙ఊబకాయం ఉన్న పిల్లలు సహచరుల నుంచి తరచూ అవహేళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా డిప్రెషన్కు లోనయ్యే ప్రమాదం ఉంది. » ఊబకాయం ఉన్న పిల్లలు చలాకీతనం కోల్పోవడం కారణంగా క్రీడల్లో రాణించలేరు. కనీసం అవకాశాలు రావడం కూడా కష్టమే. » అందరితో పాటు వ్యాయామం చేయాలనుకున్నప్పటికీ.. కాసేపటికే అలసిపోతారు. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతారు. » మానసిక ఒత్తిడి కారణంగా చదువులో వెనుకబడే అవకాశం ఉంది. విద్యలో ఉన్నత స్థానాలకు వెళ్లడం కష్టమే. » టీనేజీలోకి వచ్చేసరికి మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఫలితంగా అందరిలో కలవకుండా ఒక్కరే ఉండేందుకు ఇష్టపడతారు. » ప్రీ డయాబెటిస్, హైపర్టెన్షన్ చిన్న వయసులోనే దరి చేరుతాయి. ఫలితంగా జీవితాంతం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన పరిస్థితి. » ఊబకాయం కారణంగా స్కిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా సోకే ప్రమాదం ఉంది. ఊబకాయం ఇలా..» జంక్ఫుడ్, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, పిజ్జా, బర్గర్, నూడిల్స్ తినడం కారణంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. » జంక్ఫుడ్ టేస్ట్ డిఫరెంట్గా ఉండటంతో ఎక్కువ మోతాదులో తీసుకుని బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. » కదలిక లేని జీవన విధానంతో బరువు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. బిజీ షెడ్యూల్లో చాలామంది నడవడం తగ్గించి వాహనాలను వినియోగిస్తున్నారు. » టీవీ, సెల్ఫోన్ చూస్తూ.. మోతాదుకు మించి భోజనం తినేస్తున్నారు. ఫలితంగా మనిషి సాధారణం కంటే బరువు పెరిగే అవకాశం ఉంది. » తల్లిదండ్రులు ఊబకాయులైనా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చాయి. జన్యుపరమైన కారణాల రీత్యా కూడా ఊబకాయం రావచ్చని అంటున్నారు.ఇలా చేస్తే మేలు.... » జంక్ఫుడ్ను వీలైనంత వరకు తగ్గించాలి » టీవీ, సెల్ఫోన్ చూసే సమయం తగ్గించాలి » క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి » తల్లిదండ్రులు శ్రద్ధతో పిల్లలతో వాయింగ్ చేయించాలి »ఊబకాయం ఉన్న పిల్లలను రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించాలి వ్యాయామం తప్పనిసరిఊబకాయం ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారంలో రెండు , మూడుసార్లు జంక్ఫుడ్ తింటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారం తినడమూ కారణంగా చెప్పవచ్చు. పిల్లల బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా వాకింగ్కు తీసుకెళ్లాలి. జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకర ఆహారం తీసుకునేలా చేయాలి. – డాక్టర్ ప్రతాప్, హిందూపురం జీవనశైలి మార్పులతో.. జంక్ ఫుడ్ బదులు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. నిత్యం వ్యాయామం చేయలేని వారు ఇతర మార్గాల్లో శారీరక బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవతలి వ్యక్తి అవహేళన చేసినప్పుడు డిప్రెషన్కు లోను కాకూడదు. పిల్లల బరువు తగ్గే విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం. జీవన శైలిలో మార్పులతో ఊబకాయం నుంచి బయట పడవచ్చు. – డాక్టర్ రాజశేఖర్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ -
హై రిస్క్ ప్రెగ్నెన్సీ?!
నేనిప్పుడు ప్రెగ్నెంట్ని. రెండో నెల. తొలి చూలు. బరువు 110 కేజీలు ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఊబకాయం ఉంది. డాక్టర్ను సంప్రదిస్తే బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అలా కాకుండా ఏమి చెయ్యాలి. కొన్ని మందులు రాశారు. అవి వాడొచ్చా? – మనీషా, బెంగళూరుకాళ్లల్లోని డీప్ వీన్స్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే చాన్స్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ)అంటారు. ఈ క్లాట్ కనుక రక్తనాళాల్లోకి వెళ్తే చాలా ప్రమాదం. ఇవి కొంతమందికి ఊపిరితిత్తులు, గుండెలోకీ మూవ్ అవుతుంటాయి. బ్లడ్ థిక్ కావడం వల్ల ఈ క్లాట్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొంతమందిలో ఇతరత్రా మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నెమ్మదిగా రక్తప్రసరణ జరుగుతుంది. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే, రక్తం చిక్కనవుతుంది. జనరల్ సర్జరీ తర్వాత కూడా శరీరంలో ఈ ప్రోటీన్స్ పెరుగుతాయి. వీటన్నిటి దృష్ట్యా.. కొంతమందికి ప్రెగ్నెన్సీ తొలి వారల్లోనే బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వారికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అధిక బరువు అంటే, బాడీ మాస్ ఇండెక్స్ 35 లేదా అంతకంటే ఎక్కువ, వయసు 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, వ్యక్తిగతæ లేదా ఫ్యామిలీ హిస్టరీలో బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్ ఉన్నవారు, ఏపీఎల్ఏ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నవారు, సివియర్ వెరికోస్ వీన్స్ ఉన్నవారు, బెడ్ రెస్ట్లో ఉన్నవారికి ఈ రిస్క్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు కాలులో నొప్పి , వాపు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పి వంటివి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్ని కలవాలి. లంగ్ స్కాన్, లోయర్ లింబ్ డాప్లర్ స్కాన్ ద్వారా క్లాట్స్ని కనిపెడ్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించి.. కాళ్లల్లో క్లాట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇంట్లో, ఆఫీసులో ఒకే చోట కూర్చోకుండా, గంటకు ఒకసారి అయిదు నిమిషాలు వాకింగ్ చేయాలి. మంచం మీద పడుకున్నప్పుడు కూడా మోకాళ్లు, కాళ్లు కదుపుతూ ఉండాలి. తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. రిస్క్ జోన్లోఉన్నవారికి వీటితో పాటు రిస్క్ అసెస్మెంట్ చేసి, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్రెషన్ స్టాకింగ్స్ లాంటివి కూడా బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ థిన్ కావడానికి ఏ్ఛp్చటజీn జీn్జ్ఛఛ్టిజీౌnటఅనేవి ఉంటాయి. డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తారు. డైలీ తీసుకోవాలి. వీటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. వీటి వలన బ్లడ్ క్లాట్ రిస్క్ బాగా తగ్గుతుంది. ఇవి గర్భస్థ శిశువుకేమీ ప్రమాదం కలిగించవు. -
ఊబకాయంతో గుండెకు ముప్పు
ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి... అన్ని వయసుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వెరసి కొన్ని అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇందులో ఊబకాయం కూడా ఆ కోవకు చెందినదే. వివిధ జబ్బులకు కారణమవుతున్న ఈ సమస్య మరణాల ముప్పును కూడా పెంచుతోంది. ఊబకాయుల్లో గుండె జబ్బుల మరణాలు గడచిన రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగినట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. 1999 నుంచి 2020 నాటికి ఊబకాయంతో ముడిపడి ఉన్న గుండె జబ్బుల మరణాల రేటు సుమారు 180 శాతం పెరిగినట్టు నిర్ధారించారు. పురుషుల మరణాల రేటులో పెరుగుదల అధ్యయనంలో భాగంగా ఊబకాయ సంబంధిత ఇస్కిమిక్ గుండె జబ్బుతో ముడిపడిన 2.26 లక్షల మరణాలపై పరిశోధన నిర్వహించారు. 1999లో ప్రతి లక్ష మంది పురుషుల్లో 2.1గా మరణాలు రేటు ఉన్నట్టు గుర్తించారు. ఇది 2020నాటికి 243 శాతం పెరిగి 7.2కు చేరుకున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా మహిళల్లో 1999లో ప్రతి లక్ష మందికి 1.6గా ఉన్న మరణాల రేటు... 131 శాతం పెరిగి 2020 నాటికి 3.7కు చేరుకుంది. అధ్యయనంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఇస్కిమిక్ హార్ట్ స్ట్రోక్కు ఊబకాయం తీవ్రమైన ప్రమాదకారిగా నిర్ధారించారు. బరువు పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం వృద్ధి చెందుతోందని అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ అలీనా మోహ్సిన్ తెలిపారు. ఏమిటీ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ గుండెకు రక్తం సరఫరాలో ఏర్పడే ఇబ్బందిని ‘ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్’ అంటారు. దీనికి పొగతాగడం, బీపీ, షుగర్, రక్తంలో కొలె్రస్టాల్, ఊబకాయం ప్రధాన కారణం. గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు కొన్ని రోజులకు గుండె కండరం క్రమేణా క్షీణిస్తూ... దెబ్బతింటుంది. ఈ డ్యామేజ్ శాశ్వతంగా అవ్వకముందే గుర్తించి వైద్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అరికట్టవచ్చు. యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులను వైద్యులు గుర్తిస్తారు. అడ్డంకులు ఉన్నట్లయితే అవసరమైన మేరకు చికిత్స చేయడం, స్టెంట్ వేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ]ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మృతికి గుండె జబ్బే కారణంప్రపంచవ్యాప్తంగా గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఊబకాయుల్లో గుండె వైఫల్యం, ఆకస్మిక గుండెపోటు, ధమనుల గోడల్లో కొవ్వు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టడం, గుండె కొట్టుకోవడంలో అసమతుల్యత ప్రమాదాలు ఉన్నట్టు ఆ సర్వేలో గుర్తించారు. సాధారణ బరువున్న వారితో పోలిస్తే ఊబకాయుల్లో టైప్–2 డయాబెటీస్ బారినపడే ప్రమాదం మూడు రెట్లు అధికమని పేర్కొన్నారు. 20–49 ఏళ్ల వయసున్న పురుషుల్లో 78 శాతం, మహిళల్లో 65 శాతం అధిక రక్తపోటుకు బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ) ఎక్కువగా ఉండటమే కారణమని గుర్తించారు. -
ఎత్తుకు తగ్గా బరువు ఉంటున్నారా..?
ఉండాల్సినదాని కంటే ఎక్కువ బరువు ఉండటం ఆరోగ్యానికి మేలు చేయదని అనేక మార్లు రుజువైంది. ఇటీవల ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో దాదాపు పదివేలమంది స్థూలకాయం ఉన్నవారితో పాటు సాధారణ బరువున్న మరో మూడు లక్షలమందిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది మరో మారు వాస్తవమని తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ‘లాస్’ అనే మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. బరువు పెరుగుతున్న కొద్దీ గుండెజబ్బులు, కేన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు వచ్చి అవి మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎవరి ఎత్తుకు తగినట్టు బరువును అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. (చదవండి: డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!) -
బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?
మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలకు మూలం ప్రకృతి. కానీ చాలావరకు ప్రకృతి సహజంగా లభించే మూలికల గురించి మొక్కల గురించి నేటి తరానికి అవగాహన కరువుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి వాటి గురించి తెలుసు కోవడం, అవగాహన పెంచుకోవడం, ఆచరించడం చాలా ముఖ్యం.అలాంటి వాటిల్లో ఒకటి అరటి పండు. అరటిపండులో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులోని పోషక గుణాలు పిల్లలకీ, పెద్దలకీ చాలా మేలు చేస్తాయి. ఒకవిధంగా అరటి చెట్టులో ప్రతీ భాగమూ విలువైనదే. అరటి ఆకులను భోజనం చేసేందుకు వాడతారు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో కార్తీక దీపాలను పెట్టేందుకు అరటి దొప్ప ఆధ్యాత్మికంగా చాలా విలువైంది. ఇక అరటి పువ్వుతో పలు రకాల వంటకాలు తయారు చేస్తారు. కానీ అరటి కాండంలోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం.అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ సి, కాపర్, ఐరన్, మాంగనీస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఇతర ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్కు చెక్ చెప్పవచ్చు.ఇందులో కేలరీలు తక్కువ. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వాడటం వల్ల దీర్ఘకాలంలో మలబద్ధకం , కపుడు అల్సర్లను నివారించడంలో ఉపయోపడుతుంది.ఈ జ్యూస్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది.కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నవారికి ఇది సంజీవని లాంటిదని చెప్పవచ్చు. ఇందులోని పొటాషియం , మెగ్నీషియం రాళ్లను నివారిస్తుంది.కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు కూడా మంచిది. గుండె జబ్బులను కూడా అడ్డుకుంటుంది. శరీరంలోని మలినాలు బయటికి పంపింస్తుంది. అధిక బరువు సమస్యకు కూడా చెక్పెడుతుంది.బరువు తగ్గడానికి ప్రతిరోజూ 25 గ్రా నుండి 40 గ్రా అరటి కాండం జ్యూస్ను తీసుకోవచ్చు.అరటి కాండం రసం శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తుంది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ నుంచి అసిడిటీ వరకూ చాలా సమస్యలు దూరమవుతాయి..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు కూడా పనిచేస్తుంది. శరీరంలోని ట్యాక్సిన్ని బయటికి పంపి మూత్ర నాళాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది.అరటి కాండం ఆకుపచ్చ పొరను తీసివేసి, లోపల కనిపించే తెల్లటి కాండాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, 15 నిమిషాలు ఉడకబెట్టి, రోజుకు రెండుసార్లు సేవించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చోట్ల తొట్టెల్లో అరటి కాండాన్ని ఊరబెట్టి, ఆ నీటిని వడపోసి ఔషధంగా వాడతారు. శుభ్రం చేసి కట్ చేస్తే మజ్జిగలో నానబెట్టి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవచ్చు.దక్షిణ థాయ్లాండ్లో, తీపి , పుల్లని కూరగాయల సూప్ లేదా కూరలో సన్నగా తరిగిన అరటి కాడను కలుపుతారు. సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా దుష్ప్రభావాలను కలిగి లేనప్పటికీ, అలెర్జీ, కడుపు నొప్పి, వాంతులు, అలర్జీ రావొచ్చు. ఒక్కోసారి లే కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగించే అవకాశంఉంది. అయితే, వ్యక్తి వైద్య చరిత్ర , అరటి కాండం పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా రూపంలో తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు మితంగా ఉండాలి. నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే .వైద్య నిపుణుడు, పోషకాహార నిపుణుడు లేదా డైటీషియన్ను సంప్రదించడం చాలా ముఖ్యం. -
టెక్కీ.. వెయిటెక్కీ
ఎక్కువ పనివేళలు టెకీలను ఊబకాయులుగా మారుస్తున్నాయా?! అనే సందేహానికి ‘అవును’ అనే సమాధానం సాఫ్ట్వేర్ రంగం నుంచి వస్తోంది. ఈ విషయంపైన ‘చైనీస్ ఇన్స్టాగ్రామ్ జియాహోంగ్షులో వా΄ోతున్న యువతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద’ని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడి చేసింది. టెకీ ఉద్యోగçస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు చెబుతున్న సూచన లు ΄ాటిద్దాం..చైనాలోని ఓయాంగ్ వెన్జింగ్ అనే 24 ఏళ్ల యువతి ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా గత ఏడాది కాలంలో 20 కేజీల బరువు పెరిగిందని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడించింది. ‘నా శారీరక, మానసిక ఆరోగ్యానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒక విపత్తుగా మారింది. ఎక్కువ పని గంటలు, మారుతూ ఉండే షిప్ట్ వేళల కారణంగా ఆహారం తీసుకోవడంలో అపసవ్యత చోటు చేసుకునేది. దీంతో ఏడాది కాలంలో 60 కేజీల నుంచి 80 కేజీల బరువు పెరిగాను. ఇలా అయితే నా ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో అని జూన్లో ఉద్యోగం మానేశాను. అప్పటి నుంచి నా ఆరోగ్యంలో మెరుగైన మార్పులు వచ్చాయి’ అని ఇన్స్టాలో ΄ోస్ట్ చేసింది ఓయాంగ్. ఆమె ఇప్పుడు ఫ్రీలాన్స్ వెయిట్లాస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. తన ఆహారంలో కూరగాయలు, ధాన్యాలు, ్ర΄ోటీన్లను చేర్చుతూ 6 కిలోల బరువు తగ్గానని తెలిపింది. ఓయాంగ్ అనుభవం చెప్పడంతో ఆమెలాంటి వ్యక్తులు తమ పని కష్టాలను పంచుకోవడానికి ముందుకు వచ్చారు. చైనాలోనే కాదు ఏ దేశంలోనైనా సాఫ్ట్వేర్ ప్రపంచంలో పనిచేసే టెకీలందరికీ ఇది వర్తిస్తుంది. మానసికమైన అలసట ‘పని ఒత్తిడి కారణంగా డిజర్ట్లను అతిగా తినడం వల్ల నెల రోజుల్లోనే 3 కిలోల బరువు పెరిగాను’ అని తన అనుభవాన్ని ఇన్స్టా ద్వారా పంచుకుంది మరో టెక్ ఉద్యోగిని 33 ఏళ్ల షాంఘై.. అతిగా ఆకలిఎక్కువ గంటలు పనిచేయడం అనేది పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణాలలో ఒకటి. ఈ పరిస్థితి సందడిగా ఉండే నగరాల్లో ఆందోళనకరమైన ధోరణిగా మారుతోంది. వర్క్ షిప్ట్ వల్ల సరైన నిద్ర వేళలు ఉండవు. దీంతో కార్టిజోల్ హార్మోన్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే మెలటోనిన్ తగ్గి΄ోతుంది. లేట్నైట్స్ మేల్కొని ఉండటం వల్ల ఆకలి పెరగడంతో ఫుడ్ తెప్పించుకుని తింటారు. దీంతో కదలికలు ఉండవు. ఇక వర్క్ఫ్రమ్ హోమ్ వచ్చాక పడుకొని వర్క్ చేసే వారున్నారు. దీంతో వారి శరీరంలో ఏ ఆర్గాన్ అయితే బలహీనంగా ఉంటుందో దానిపైన త్వరగా ప్రభావం పడుతుంది. తినే వేళలు సరి చేసుకోవాలిచైనాలో పని సంస్కృతి ముఖ్యంగా టెక్ పరిశ్రమలో వారానికి ఆరు రోజుల ΄ాటు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. న్యూట్రిషన్ విభాగానికి చెందిన డాక్టర్ జువో జియోక్సియా హెల్త్ టైమ్స్తో మాట్లాడుతూ ‘ఆలస్యంగా భోజనం చేయడం, అతిగా తినడం, నిద్రలేమి, ‘అధిక పని ఊబకాయానికి దారితీస్తుందని చె΄్పారు. ఈ సమస్యను అధిగమించాలంటే ఎక్కువ కూరగాయలు, తక్కువ మాంసాహారం తీసుకోవాలి. అంతేకాదు, తినే వేళలను సక్రమంగా ΄ాటించాలి. ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలిలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి’ అని సూచిస్తోంది. ఈ సమాచారం టెకీలందరికీ వర్తిస్తుంది.అరకేజీ ఫ్రూట్ –వెజ్ సలాడ్వయసులో ఉన్నప్పుడు పని, జీతం అన్నీ బాగానే అనిపిస్తాయి. అయితే, సరైన జీవన శైలి ΄ాటించక΄ోతే నలభై దాటిన దగ్గర నుంచి ప్రతి ఐదేళ్లకు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువ చూస్తుంటాం. లుక్ కోసం అవసరం లేని కాస్మటిక్ ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. లుక్ కాదు ఆరోగ్యమే ప్రధానమని గుర్తించాలి. పని ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్ ఔషధంలా పనిచేస్తుంది. ∙నిద్ర వేళలు సరిగ్గా చూసుకోవాలి. 6–8 గంటలు నిద్రకు కేటాయించుకోవాలి. ∙వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. ∙టైమ్కి ఆహారం తీసుకోవాలి. దీంతో΄ాటు ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్ రోజు వారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల కొవ్వు పెరగదు. అతిగా ఆకలి అవడం ఉండదు. – డాక్టర్ జానకి, ΄ోషకాహార నిపుణులు -
బెల్లీ ఫ్యాట్తో ఇబ్బంది పడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఉరుగుల పరుగుల జీవితం. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనకు తోడు, పొట్ట, పిరుదుల్లో బాగా కొవ్వు చేరడం, ఊబకాయం వెరసి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అన్నింటికంటే బెల్లీ ఫ్యాట్ అనేది తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. అధిక బరువు లేదా పొట్ట పెరగడానికి గల కారణాలను తెలుసుకుందాం!పౌష్టికాహారం లోపించడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఒకేచోట గంటలతరబడి కూర్చోడం, ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోని పని చేయడం వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. హార్మోన్లు, ఆహారం, వివిధ కారకాలు పొత్తికడుపు కొవ్వును ప్రభావితం చేస్తాయి. ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారాలు కాకుండా కొవ్వు, సుగర్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం. వీటన్నింటితోపాటు జీవనశైలి విషయంలో కొన్ని తప్పులు కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతున్నాయి.రోజులో అతి కీలకమైన అల్పాహారం మానేయడం ఒక కారణం. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మీ జీవక్రియ దెబ్బతింటుంది. మీ బరువు తగ్గాలంటే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. అల్పాహారం రాజులా , మధ్యాహ్న భోజనం యువరాజులా , రాత్రి భోజనం పేదలా తినాలి అనేది పెద్దల మాట.సమయానికి తినకపోవడం పెద్ద తప్పు అయితే, ఇష్టం వచ్చినట్టు ఉపవాసాలు ఉండటం మరో తప్పు. సమయం ప్రకారం తినడంతోపాటు ప్రొటీన్, ఫైబర్తో నిండిన ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. భోజనానికి, భోజనానికి మధ్యలో పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి భోజనంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు కాకుండా, ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. దీంతో జీర్ణక్రియ సులభమవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. రాత్రి భోజనం చేసిన నిద్రకు ఉపక్రమించడం కూడా పొత్తికడుపు కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. రాత్రి భోజనం తరువాత కనీసం 10-20 నిమిషాల నడక అటు జీర్ణక్రియకు, ఇటు బరువు నియంత్రణకు సాయపడుతుంది.వీటన్నింటి కంటే ప్రధానమైంది. తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి కీలకం. మనిషి రోజుకు 6-7 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర పోనివారు రోజువారీ ఎక్కువ కేలరీలు తీసుకుంటారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. సరిపడినన్ని నీళ్లు తాగడం కూడా చాలా కీలకం. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. వాకింగ్, జాకింగ్, యోగా లాంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే బెల్లీ ఫ్యాట్కు దూరంగా ఉండటమేకాకుండా, మంచి ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.నోట్: ఇవి కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. వేరే ఇతర అనారోగ్య కారణాలతో కూడా పొట్ట పెరిగే అవకాశం ఉంది. ఈ తేడాను గమనించి సరైన వైద్య పరీక్షలు చేయించుకొని, చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
ఆ ఒక్కటీ తప్ప.. ఉల్లితో చాలా ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ వంటకాల్లో కనిపించే వాటిల్లో చాలా ముఖ్యమైంది ఉల్లిపాయ. పసుపు, తెలుపు , ఎరుపు రంగుల్లో ప్రత్యేకమైన ఘాటైన రుచి, వాసనతో లభిస్తుంది. దాదాపు అన్ని కూరల్లో దీన్ని విరివిగా వాడతాం. అయితే పచ్చిగా తీసుకోవడం వల్ల కూడా ఉల్లితో చాలా ఔషధ ప్రయోజనాలున్నాయి. ‘ఉల్లి చేసిన మేలు తల్లి అయినా చేయదు’ అన్నట్టు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్య , షుగర్ తదితర సమస్యలకు చక్కటి పరిష్కారం ఉల్లి.ఇందులో క్రోమియం షుగర్ స్థాయిలనుఅదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుతుందిపచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి వాటికి సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బయోటిక్ గుణాలతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిదిఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా అధిక రక్తపోటు ముప్పు కూడా తగ్గుతుంది.జీర్ణక్రియలో పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు ఊతమిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ , హేమోరాయిడ్స్ వంటి వివిధ వ్యాధులను నివారిస్తుంది.వాపును తగ్గిస్తుందిక్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్ వ్యాధులకు ఉపశమనానికి అందిస్తుంది.ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందిఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాల్షియం శోషణను ప్రోత్సహించి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది.మెదడు పనితీరును పెంచుతుందిపచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలు మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ , ఏకాగ్రత పెరగడానికి దోహదపడతాయి.కేన్సర్ నివారణలోపచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ , యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ నివారణలో సాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ ,అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.చర్మ ఆరోగ్యానికి కూడా పచ్చి ఉల్లిపాయల్లోని అధికంగా లభించే యాంటీఆక్సిడెంట్లు ,విటమిన్ సీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. ముడతలు, వయసు మచ్చలు , పిగ్మెంటేషన్ స్థాయిలను తగ్గించి, ఆరోగ్యకరమైన , మెరిసే చర్మాన్ని అందిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందిపచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గడంలో తక్కువ కేలరీలు , అధిక ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అతిగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.నోట్: ఏదైనా మితంగా తీసుకోవడం ఉత్తమం. అధిక వినియోగం జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది. ప్రధానంగా పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన వస్తుందనిది గమనించాలి. -
అమ్మాయిల్లో తొలి పీరియడ్స్ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం
సాధారణంగా ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, తదితర కారణాల రీత్యా ఈ మధ్య కాలంలోనే చాలా చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలై పోతున్నాయి. అంటే దాదాపు 8-10 ఏళ్ల మధ్యే మెచ్యూర్ అవుతుండటాన్ని చూస్తున్నాం. అయితే తొలి ఋతుస్రావం, చిన్నతనంలోని స్థూలకాయంతో ముడిపడి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం, మొదటి పీరియడ్స్ వచ్చే సగటు వయస్సు 1950-1969 నుండి 2000-2005 వరకు జన్మించిన మహిళల్లో 12.5 సంవత్సరాల నుండి 11.9 సంవత్సరాలకు పడిపోయింది. అమెరికాలోని 70వేల మందికి పైగా యువతులపై ఈ పరిశోధన జరిగింది. అంతేకాదు చిన్నతనంలో రజస్వల కావడం హృదయ సంబంధ వ్యాధులు , కేన్సర్ వంటి ప్రతికూల ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్వర్క్ ఓపెన్లో ప్రచురితమైన ఈ అధ్యయనం, జాతులు , సామాజిక వర్గాలలో మహిళల్లో రుతుక్రమ పోకడలను గుర్తించిన తొలి అధ్యయంనంగా పరిశోధకులు పేర్కొన్నారు.ఋతు చక్రాలు సక్రమంగా ఉండేందుకు సమయం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. 1950- 1969 మధ్య జన్మించిన వారిలో 76 శాతంమందిలో తొలి పీరియడ్స్ తర్వాత రెండు సంవత్సరాలలోపు రెగ్యులర్ పీరియడ్స్కనిపించగా, 2000- 2005 మధ్య జన్మించిన 56 శాతం మహిళళ్లో మాత్రమే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చాయి. ప్రారంభ నెలసరి, దాని కారణాలను పరిశోధనలు కొనసాగించడం చాలా కీలకమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో పోస్ట్డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో , సంబంధిత రచయిత జిఫాన్ వాంగ్ తెలిపారు. -
ఒబెసిటీ ఇంత ప్రమాదకరమైనదా? పాపం ఆ వ్యక్తి..!
ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్తమైన జీవన విధానం, కల్తీ ఫుడ్ల కారణంగా టీనేజీ యువత ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తోంది. కనీసం పెళ్లీడు రాకమునుపే పెద్దవాళ్లలా కనిపించేంత భారీకాయంతో సతమతమవ్వుతున్నారు. అచ్చం అలాంటి సమస్యతోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి మరణించాడు. జస్ట్ 33 ఏళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒబెసిటీ ఇంత ప్రమాకమైనదే? లావుగా ఉంటే అంతే సంగతులా..!లావుగా ఉంటే లైఫ్ లాసే అని ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. బ్రిటన్ నివాసి జాసన్ హోల్డన్ యూకేలోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి. అతడి బరువు ఏకంగా 317 కిలోలు. అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి అగ్నిమాపక సిబ్బంది సహాయం తీసుకోవాలట. ఇక అతడు పడుకోవాలన్నా.. ప్రత్యేకంగా రూపొందించిన ఫర్నిచర్పై బెడ్పై నిద్రిస్తాడు. అతడికి అతిగా తినే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎంతలా ఉందంటే రోజువారీగా ఏకంగా పదివేలకు పైగా కేలరీలు తీసుకునేంత స్థాయిలో ఉంది. అతడి బ్రేక్ఫాస్ట్లో డోనార్ కబాబ్లు తీసుకుంటాడంటే..అతడు ఎంతలా తింటాడో చెప్పాల్సిన పనిలేదు. దీని కారణంగానే ఆరోగ్యం క్షీణించటం మొదలయ్యింది. దీంతో అతను కొన్నాళ్లుగా గదికే పరితం కాగా, క్రమేణ మంచానికే పరిమతమయ్యాడు. ఆ తర్వాత చలనశీలత దెబ్బతింది. మొదట అతడి శరీరంలో కిడ్నీ పనిచేయడం మానేసింది. అలా నెమ్మదిగా మిగతా అవయవాలు వైఫల్యం చెందడం ప్రారంభించడంతో 34వ ఏటాలోకి అడుగుపెట్టడానికి కొన్ని రోజుల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు గతేడాది ఒక ఇంటర్వ్యూలో తన సమయం అయిపోయిందని, తాను ఎన్నాళ్లో బతకనని చెప్పేశాడు కూడా. పైగా అలా కాకుండా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి 2020లో ప్రమాదవశాత్తు హోల్టన్ మూడవ అంతస్తు నుంచి పడిపోయాడు. పాపం అతడిని రక్షించటానికి ఏకంగా 30 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, క్రేన్ రంగంలోకి దిగి కాపాడారు. ఆ ఘటనను తలచుకుంటూ అది తన జీవితంలో అత్యంత బాధకరమైన ఘటనగా పేర్కొన్నాడు హోల్డన్. ఆ టైంలో తనను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి చాలా బాధపడడ్డానని అన్నాడు. హోల్డన్ మానసిక స్థితి ఎంతలా మారిపోయిందంటే.. లావుగా ఉండే వ్యక్తులను ఆధారం చేసుకుని తీసిన సినిమాలు సైతం అతడికి భయానక చిత్రాలుగా అనిపించాయి. కనీసం తన అమ్మను కూడా చూడొద్దని కన్నీటి పర్యంతమయ్యాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ అధిక బరువు కారణంగా ఎంతగా ఇబ్బంది పడ్డానేది నేరుగానే తెలుస్తోంది. అతను తరుచుగా ఈ బ్రిటన్ దేశంలో తానే అత్యంత లావుగా ఉన్నవ్యక్తిని అని బాధపడేవాడు. అతడి పోస్ట్మార్టం రిపోర్టులో కూడా అధిక బరువు కారణంగా అవయవాల వైఫల్యం చెంది మరణించినట్లు ఉంది. హోల్టన్ ఈ అధిక బరువు కారణంగా స్ట్రోక్లు, రక్త గడ్డకట్టడం వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అధిక బరువు అనేది ప్రాణాంతకమైన సమస్యే. నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తగ్గించుకునే యత్నం చేయకపోతే అంతే సంగతులని ఈ ఉదంతమే చెబుతోంది. అందువల్ల కొద్దిపాటి శారీరక శ్రమ, క్యాలరీల తక్కువ ఉన్న ప్రత్యామ్నాయ ఆహారంతో బరువుని అదుపులో ఉంచుకునే యత్నం చేయండి. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించండి.(చదవండి: సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?) -
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిమ్కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామంఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్ర్సైజ్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
దాల్చిన చెక్కతో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ నిజంగా తగ్గుతుందా?
సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క. శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి.దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది. నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు. -
కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావడం లేదా? ఇలా ట్రై చేయండి!
ఊబకాయం, లేదా ఒబెసిటీ అనేక రోగాలకు మూలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తు తాయి. అందుకే వయసు, ఎత్తుకు తగ్గట్టు బరువును, కొలెస్ట్రాల్ను నియంత్రించుకోవడం చాలా అవసరం. అయితే వెయిట్ లాజ్ జర్నీ అనుకున్నంత ఈజీకాదు. దీనికి పట్టుదల, జీవన శైలి మార్పులు, తగిన వ్యాయామం తప్పనిసరి. ఈ క్రమంలో చెడు కొలెస్ట్రాల్కి చెక్ చెప్పే కొన్ని సహజమైన జ్యూసెస్ గురించి తెలుసుకుందాం. కరివేపాకు: ప్రతి వంటలోనూ కరివేపాకును ఉపయోగించడం మనకు బాగా అలవాటు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్పెరగడానికి దోహదపడతాయి. ప్రతిరోజూ కరివేపాకు రాసం తాగడం వల్లన కొలెస్ట్రాల్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రసం తయారుచేసుకునే ముందు, ఆకులను శుభ్రంగా కడగాలి. చీడపీడలు లేని ఆకులను తీసుకోవాలి. కొత్తిమీర: వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడంలో కొత్తిమీర తరువాతే ఏదైనా. ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులను సలాడ్లో చేర్చుకోవచ్చు. కొత్తిమీర రసం రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది. నేరేడు ఆకులు : మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో నేరేడు పళ్లు, గింజలు బాగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచడంలో కూడా ఇది బేషుగ్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ ఆంథోసైనిన్ వంటి లక్షణాలు వీటిల్లో మెండుగా ఉన్నాయి. ఇదిసిరల్లోపేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పని చేస్తుంది. జామున్ ఆకులను శుభ్రంగా ఎండ బెట్టి పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు 1-2 సార్లు త్రాగవచ్చు. మెంతి ఆకులు: మెంతి కూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ను తగ్గించడానికి మెంతి ఆకులను తినవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. తులసి ఆకులు : తులసి పవిత్రమైందిగా భావిస్తాం. దీని ఆకులు, జలుబు, గొంతు నొప్పినివారణలో బాగా పనిచేస్తుంది. అలాఏగ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు చాలా ప్రయోజనకరం. జీవక్రియ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను శుభ్రంగా కడిగి తింటే నోటికి, ఒంటికి కూడా చాలా మంచిది. అలోవెరా: కలబందప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌందర్యపోషణలో, ఆరోగ్య రక్షణలోనూ ఇది చక్కటి ఔషధం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా గుజ్జును తీసుకుంటే కొలెస్ట్రాల్ మాయమైపోతుంది. శరీరంలోని ఇతర అనారోగ్యాలకు కూడా ఇది దివ్యౌషధం. పైన పేర్కొన్న వాటి అన్నింటిలో కావాలంటే కొత్తిగా తేనెను యాడ్ చేసుకోవచ్చు. నోట్: ఈ సూచనలు అన్నీ అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఊబకాయానికి విరుగుడీ మాత్ర!
స్లిమ్గా, ఫిట్గా ఉండాలని ఎవరు కోరుకోరు? కానీ తినే తిండిపై సరైన కంట్రోల్ లేకపోతే ఈజీగా బరువు పెరుగుతారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎంత నోరు కట్టేసుకుందామనుకున్నా కళ్లముందు టేస్టీ వంటలు కనిపిస్తే తినకుండా ఉండటం కష్టమే. అందుకే ఏమీ తినకపోయినా తిన్న ఫీలింగ్ కలిగించే ట్యాబ్లెట్స్ను సైంటస్టులు తయారుచేశారు. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుతుందట. ఏంటీ ట్యాబ్లెట్? ఎప్పుడు వేసుకోవాలి? అన్న ఇంట్రెస్టింగ్ విశేషాలు మీ కోసం.. సాధారణంగా మనం కడుపునిండా భోజనం చేశాక ఇక చాలు.. అనేలా మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇవి ఇన్సులిన్, సి-పెప్టైడ్, పైయ్, జిఎల్పి-1 వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో కడుపునిండిన ఫీలింగ్ కలిగి తినడం మానేస్తాం. అయితే ఇదే పద్దతిని కృత్రిమంగా చేసి ఆకలిని తగ్గించొచ్చు అంటున్నారు MIT సైంటిస్టులు. అదెలా అంటే.. తిన్న తర్వాత మామూలుగానే పొట్ట కాస్త ముందుకు సాగుతుంది. దీన్ని కృత్రిమంగా అనుభూతి పొందేలా వైబ్రేటింగ్ ఇన్జెస్టిబుల్ బయోఎలక్ట్రానిక్ స్టిమ్యులేటర్ (VIBES)అనే పిల్ను సైంటిస్టులు రూపొందించారు. తినడానికి ముందే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా కడుపునిండట్లుగా వైబ్రేషన్ కలుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్గా మెదడుకు హార్మోన్లను పంపిస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత పందుల్లో ప్రయోగించారు. ఆహారం తినడానికి 20 నిమిషాల ముందు వాటికి పిల్స్ ఇవ్వగా సాధారణం కంటే 40% తక్కువగా తిన్నాయని, బరువు కూడా నియంత్రణలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఒబెసిటీకి బెస్ట్ ట్రీట్మెంట్లా పనిచేస్తోందని సీనియర్ సైంటస్ట్ గియోవన్నీ ట్రావెర్సో అభిప్రాయపడ్డారు. పిల్లో రూపొందించిన చిన్న సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీతో నడిచే వైబ్రేటింగ్ సిస్టమ్ ద్వారా భోజనానికి ముందు, ఆ తర్వాత ఆన్, ఆఫ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉందని వివరించారు. -
2023లో జనం సెర్చ్చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే!
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఇటువంటి సందర్భంలో గడచిన కాలాన్ని ఒకసారి నెమరువేసుకోవడం సహజం. ఈ ఏడాది గూగుల్లో కొన్ని వ్యాధులకు సంబంధించిన వివరాల కోసం కొందరు వెదికారు. అలాగే ఈ వ్యాధుల నివారణకు ఇంటి చిట్కాల కోసం కూడా శోధించారు. వీటిలో కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీలపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2023లో చాలామంది గూగుల్లో సెర్చ్ చేసిన టాప్-5 వ్యాధులు లేమిటో వాటి నివారణకు ఉపయుక్తమయ్యే సులభ ఉపాయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక కొలెస్ట్రాల్ ఈ సంవత్సరం చాలామంది అధిక కొలెస్ట్రాల్ నివారణకు ఇంటి చిట్కాల కోసం చాలా శోధించారు. నిజానికి, కొలెస్ట్రాల్ పెరగడం అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ఈ కారణంగానే గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని గృహచిట్కాలు ధమనులలో పేరుకుపోయిన వ్యార్థాలను క్లియర్ చేసేందుకు దోహదపడతాయి. కొత్తిమీర నీరు, సెలెరీ టీ, ఫైబర్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు అధిక కొలెస్ట్రాల్ను నివారించడంలో ఉపయుక్తమవుతాయి. 2. మధుమేహం మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి. దీనితో చాలామంది సతమతమవుతున్నారు. ఈ వ్యాధి నివారణకు చక్కెరను తీసుకోకూడదు. మధుమేహం నివారణకు కొన్ని ఇంటి చిట్కాలు దోహదపడతాయి. ఓట్స్ తీసుకోవడం లాంటివి మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపకరిస్తాయి. అలాగే ఉసిరి రసం, మెంతులు తీసుకోవడం కూడా మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది. 3. అధిక యూరిక్ యాసిడ్ అధిక యూరిక్ యాసిడ్ సమస్య నివారణకు ఆనపకాయ రసం లేదా బార్లీ నీటిని తాగడం ఉత్తమం. నీరు, పీచు సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. 4. హై బీపీకి హోం రెమెడీ అధిక బీపీ నివారణకు చాలామంది గృహ వైద్యం కోసం గూగుల్లో శోధించారు. హైబీపీని అదుపులో ఉంచేందుకు తగినంత నీటిని తాగడం ఉత్తమం. అలాగే నిమ్మరసం, ఫెన్నెల్ టీ కూడా చక్కగా పనిచేస్తుంది. హైబీపీ నివారణకు ఈ ఎఫెక్టివ్ విధానాలను ప్రయత్నించవచ్చు. 5. ఊబకాయం ఊబకాయాన్ని తగ్గించడంలో కొన్ని హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. బొప్పాయి తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతే కాకుండా పసుపు కలిపిన నీరు తాగడం వల్ల కూడా ఊబకాయం అదుపులో ఉంటుంది. ఇది కూడా చదవండి: 2023లో కశ్మీర్ను ఎంతమంది సందర్శించారు? -
లైఫ్ స్టయిల్ మారుద్దాం..!
ఈ రోజుల్లో...ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం!? పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఉరుకుల పరుగుల జీవనంలో ఇవన్నీ సహజమే అని వదిలేస్తే ..‘భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు’ అంటున్నారు లీ హెల్త్ డొమైన్ డైరెక్టర్ లీలారాణి. ఆరోగ్య విభాగంలో న్యూట్రాస్యు టికల్, ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టే ఈ సంస్థ ద్వారా మన జీవనవిధానం వల్ల ఎదుర్కొనే సమస్యలకు మూలకారణాలేంటి అనే విషయంపై డేటా సేకరించడంతో పాటు, అవగాహనకు కృషి చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్, సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఏపీ చాంబర్స్, విశాఖపట్నం జోన్ చెయిర్ పర్సన్గానూ ఉన్న లీలారాణి మహిళలు, పిల్లల ఆరోగ్య సమస్యలపై డేటా వర్క్, బేసిక్ టెస్ట్లు చేస్తూ తెలుసుకుంటున్న కీలక విషయాలను ఇలా మన ముందుంచారు.. ‘‘ప్రస్తుత జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల పిల్లలకు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్కూళ్లవైపుగా డేటా సేకరించాలనుకున్నాం. ముందు 8–10 ఏళ్ల పిల్లలకు స్కూళ్లలో ఇటీవలప్రారంభించాం. ఊర్జాప్రాజెక్టులో భాగంగా బేసిక్ న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లల్లో .. ఆహారానికి సంబంధించిన సమస్యలు ఏమన్నాయి, తల్లిదండ్రులు– కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నారు, శారీర చురుకుదనం, డిజిటల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, నిద్ర సమస్యలు ఏంటి.. ఇలా కొన్నింటితో ఒక ప్రశ్నాపత్రం రూపొందించాం. పిల్లల దగ్గర సమాధానాలు తీసుకొని, వాటిలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాం. ఆంధ్రా, తెలంగాణలోని స్కూళ్లలో పెద్ద స్థాయిలో డేటా తీసుకోవాలని ప్రారంభించాం. ఇప్పుడైతే 200 మంది పిల్లలతో విశాఖపట్నంలో ఈ డేటా మొదలుపెట్టాం. 8–15 ఏళ్ల వయసులో .. పిల్లలతో కలిసి రోజువారి జీవనవిధానం గురించి చర్చించినప్పుడు ‘మా పేరెంట్స్ బిజీగా ఉంటారు. వాళ్లు డిజిటల్ మీడియాను చూస్తారు, మేమూ చూస్తాం.’ అని చెబుతున్నారు. ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటున్నారు. కారణం అడిగితే – ‘అమ్మనాన్నలను ఏదైనా విషయం గురించి అడిగితే చెప్పరు. అందుకని డిజిటల్లో షేర్ చేసుకొని తెలుసుకుంటాం’ అంటున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఈ విధంగా పెంచుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి స్కూళ్లలో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంటి బయట ఎలా ఉంటున్నారు,.. అనేది కూడా ఒక డేటా తీసుకుంటున్నాం. 8–15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వారు యంగేజ్కు వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాం. ఊబకాయమూ సమస్యే ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంది. డబ్యూహెచ్ఓ సూచించిన టెస్ట్లు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తించాం. వాటిలో శారీరక చురుకుదనం లోపించడమే ప్రధానంగా కారణంగా తెలుసుకున్నాం. బయట జంక్ ఫుడ్ నెలలో ఎన్ని సార్లు తీసుకుంటున్నారు అనేదానిపైన రిపోర్ట్ తయారుచేశాం. పిల్లల నుంచి సేకరించిన రిపోర్ట్ను ఆ స్కూళ్లకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్లో ‘మీ స్కూల్ కరిక్యులమ్లో చేర్చదగిన అంశాలు అని ఓ లిస్ట్ ఇస్తున్నాం. వాటిలో, చురుకుదనం పెంచే గేమ్స్తో పాటు న్యూట్రిషన్ కిచెన్, గార్డెనింగ్.. వంటివి ఒకప్రాక్టీస్గా చేయించాలని సూచిస్తున్నాం. ముందుగా 40 ఏళ్ల పైబడినవారితో.. రెండేళ్ల క్రితం ఒక కార్పోరేట్ సెక్టార్లో దాదాపు పది వేల మందికి (40 ఏళ్లు పైబడినవారికి) ఎన్జీవోలతో కలిసి బిఎమ్డి టెస్ట్ చేశాం. వీరిలో బోన్డెన్సిటీ తక్కువగా ఉండటమే కాకుండా, మానసిక ప్రవర్తనలు, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్.. వంటివి దేని వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. నిజానికి 60 ఏళ్ల పైబడి న వారి బోన్ డెన్సిటీ బాగుంది. కారణం, ఆ రోజుల్లో వారు చేసే శారీరక శ్రమయే కారణం. ఇప్పుడది తగ్గిపోయింది. పరిష్కారాలూ సూచిస్తున్నాం.. ఎక్కడైతే టెస్ట్లు చేశామో, వారి జీనవవిధానికి తగిన సూచనలూ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఏవి అధికంగా వస్తున్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునే విధానాలను సూచిస్తున్నాం. చాలావరకు ఈ వయసు వారిలోనూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సమస్యలు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. పని ప్రదేశంలో శరీర కదలికలు లేకపోడం, అక్కడి వాతావరణం, స్క్రీన్ నుంచి వచ్చే సమస్యలు, డిజిటల్ ఎక్స్పోజర్.. వీటన్నింటినీ ఒక్కొక్కరి నుంచి తీసుకొని వారికి తగిన సూచనలు ఇస్తూ వచ్చాం. సమస్యలు ఎక్కువ ఉన్నవారి బాల్య దశ గురించి అడిగితే మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. బాల్య దశ కీలకం పెద్దవాళ్లలో సమస్యలు గమనించినప్పుడు వారి బాల్య దశ కీలకమైందని గుర్తించాం. దీంతో పిల్లల్లోనే ముందుగా సమస్యను పరిష్కరిస్తే మంచిదని, పిల్లల్లో పరీక్షలు చేసినప్పుడు వారిలో బోన్డెన్సిటీ సమస్య కనిపించింది. దీని గురించి డాక్టర్లతో చర్చించినప్పుడు మూల కారణం ఏంటో తెలిసింది. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దుమకడం.. వంటివి చాలా సహజసిద్ధంగా జరిగిపోయేవి. వారి ఆటపాటల్లో శారీరక వ్యాయామం చాలా బాగుండేది. అది ఈ రోజుల్లో లేదు. క్రీడలు కూడా వృత్తిపరంగా ఉన్నవే తప్ప ఆనందించడానికి లేవు. ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఇన్ని గంటలు అవసరం అనేది గుర్తించి, చెప్పాలనుకున్నాం. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యసమస్యలను భరించడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. మధ్య తరగతే కీలకం మధ్యతరగతి, దానికి ఎగువన ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లోపం ఎక్కువ కనిపించింది. వారి ఎముక సామర్థ్యం బలంగా లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోక తప్పదు. పిల్లలు ఎదిగే దశలో వారి ఆహారం, అలవాట్లు బాగుండేలా చూసుకోవాలి. ఈ విషయంలో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ అన్ని విషయాలపై ఇంకా చాలా డేటా సేకరించాల్సి ఉంది. ముందు మానసిక సమస్యలు అనుకోలేదు. కానీ, సైకలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నవారితో సరైన ఇంటరాక్షన్స్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ డిజిటల్ మీడియాలో ఉండటం వల్ల కంటి సమస్యలు, కుటుంబంతో గ్యాప్ ఏర్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలియజేశారు. లీలారాణి. – నిర్మలారెడ్డి -
అమెరికాలో అలా .. ఆసియాలో ఇలా?
సాక్షి, హైదరాబాద్: మధుమేహంతో పాటు గుండెజబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా భారత్ ఇతర ఆసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. కానీ వ్యాధి సోకడం, లక్షణాల వంటివి ప్రాంతాన్ని బట్టి మారిపోతున్నాయి. మధుమేహాన్ని తీసుకుంటే టైప్ 2 మధుమేహం అమెరికా లాంటి దేశాల్లో ఊబకాయం ఉన్నవారిలో కన్పిస్తుంది. కానీ భారత్లాంటి కొన్ని దేశాల్లో బక్కపలుచగా ఉన్నప్పటికీ దీనిబారిన పడుతున్నారు. అందరిలోనూ జన్యువులు ఒకే రకంగా ఉన్నప్పటికీ జన్యువుల పైభాగంలో వాతావరణం, సూక్ష్మ పోషకాల లోపం వల్ల చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల కారణంగా ఈ తేడాలు చోటు చేసుకుంటున్నట్లు తేలింది. మరోవైపు వీటి కోసం తయారు చేసిన ఔషధాలు ఒక ప్రాంతంలో పనిచేస్తే మరొక ప్రాంతంలో పని చేయడం లేదు. మధుమేహంతో పాటు గుండె జబ్బులు, మానసిక సమస్యలకు పైన పేర్కొన్న తేడాలు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, అందరికీ సమర్ధంగా ఉపయోగపడే మందులు కనిపెట్టేలా, మానవజాతి ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఓ మహా ప్రయత్నం మొదలైంది. భారత్ సహా నాలుగు దేశాల్లోని 13 వేల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధి ముప్పును తగ్గించే ప్రాజెక్టుకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. డైవర్స్ ఎపిజెనిటిక్, ఎపిడిమియాలజీ పార్ట్ నర్షిప్ (డీప్) అని పిలుస్తున్న ఈ అంతర్జాతీయ ప్రాజెక్టులో ఇరవై పరిశోధక బృందాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై సంస్థలు భాగస్వాములు కానున్నాయి. ఇప్పటివరకు ‘యూరప్’ సమాచారమే ఆధారం ప్రజారోగ్యం విషయంలో ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలకు అత్యధికంగా యూరోపియన్ మూలాలున్న మానవుల నుంచి సేకరించిన సమాచారమే ఆధారం. అంటే ఆరోగ్య సమస్యల పరిశోధనల్లో ఇతర ప్రాంతాల వారి భాగస్వామ్యం చాలా తక్కువన్నమాట. అంతేకాకుండా జన్యుపరమైన, వాతావరణ సంబంధిత వైవిధ్యతను కూడా ఇప్పటివరకూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కొంచెం వివరంగా చెప్పాలంటే మన జన్యువులు, మనం ఉన్న వాతావరణం ప్రభావం.. మనకొచ్చే వ్యాధులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పటివరకూ స్పష్టంగా తెలియదన్నమాట. కాగా ‘డీప్’ప్రాజెక్టు ఈ లోటును భర్తీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల ఖర్చుతో ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. సీసీఎంబీ నేతృత్వంలో యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్,, ఎంఆర్సీ యూనిట్, ద గాంబియాలు ఇందులో పాల్గొననున్నాయి. అధ్యయనంలో భాగంగా కొన్ని వ్యాధులు కొన్ని ప్రాంతాల వారికి లేదా సమూహాలకు మాత్రమే ఎందుకు వస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనిద్వారా ఒక ప్రాంత ప్రజల కోసం తయారు చేసిన మందులు ఇతర ప్రాంతాల వారికీ సమర్థంగా ఉపయోగపడతాయా? లేదా? అన్నది స్పష్టమవుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ఆర్.గిరిరాజ్ ఛాందక్ తెలిపారు. సీసీఎంబీ ఎప్పుడో చెప్పింది... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) చాలాకాలంగా భారతీయుల జన్యు నిర్మాణంలోని తేడాలు.. టైప్–1, టైప్–2 మధుమేహం, క్లోమగ్రంథి వ్యాధులపై వాటి ప్రభావం గురించి పరిశోధనలు చేస్తోంది. విటమిన్ బీ–12, ఫొలేట్ తదితర సూక్ష్మ పోషకాలు, పర్యావరణాలు.. వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు కూడా సీసీఎంబీ నిరూపించింది. పర్యావరణం నుంచి అందే సంకేతాల ఆధారంగా డీఎన్ఏలో వచ్చే కొన్ని రకాల మార్పులు మనిషి ఆరోగ్యం, వ్యాధులకు కారణమవుతున్నట్టుగా కూడా సీసీఎంబీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. అంటే ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలన్నీ యూరోపియన్లపై ఆధారపడి జరిగినవి కావడంతో వారికి పనిచేసే మందులు, చికిత్స పద్ధతులు కచ్చితంగా మనకూ పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదన్నమాట. అలాగే మనకు పనిచేసే మందులు బ్రిటిష్ వారికి లేదా అమెరికన్లను అక్కరకు వస్తాయా? అన్నది కూడా ప్రశ్నార్థకమే అన్నమాట. భారతీయులకూ భాగస్వామ్యం జన్యువులు – జన్యువులకు మధ్య, జన్యువులకు పర్యావరణానికి మధ్య జరుగుతున్న కార్యకలాపాలు అర్థం చేసుకునేందుకు మధుమేహం, గుండెజబ్బుల వంటి అసాంక్రమిక వ్యాధులకూ వీటికి ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టులో భారతీయులను కూడా చేర్చుకోవడం ఎంతో ఆసక్తికరమైన అంశం. – డాక్టర్ ఆర్.గిరిరాజ్ ఛాందక్, ‘డీప్’ప్రాజెక్ట్ హెడ్ -
జిమ్ చేస్తున్నా బరువు తగ్గడం లేదు.. సర్జరీ చేయించుకోవచ్చా?
కొందరు ఎంత తిన్నా శరీరానికి కొవ్వు పట్టదు. జీరో సైజ్లోనే కనిపిస్తుంటారు. మరికొందరికేమో కొంచెం తిన్నా లావెక్కిపోతారు. ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది అన్ని వయసుల వారికి పెద్ద సమస్యలా మారింది. బరువు అదుపులో ఉంచుకునేందుకు గంటల తరబడి జిమ్లో వర్కవుట్స్ చేసినా, డైట్ కంట్రోల్ చేసినా ఏ మాత్రం రిజల్ట్ ఉండటం లేదు. ''నాకు 24 ఏళ్లు. నా హైట్ 5.2. బరువు 92 కిలోలు ఉన్నాను. యోగా, రెగ్యులర్గా జిమ్కి వెళుతున్నా, డైటింగ్ కూడా చేస్తున్నా. అయినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చా? భవిష్యత్లో ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా?'' మీ వయసు 24 కాబట్టి డైటింగ్, ఎక్సర్సైజెస్ కొంతవరకు బరువు తగ్గడానికి దోహద పడతాయి. మీరు చెప్పిన మీ ఎత్తు, బరువు వివరాలను బట్టి మీ బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 40 పైనే వస్తుంది. అంటే అధిక బరువు ఉన్నారని అర్థం. మార్బిడ్ ఒబేసిటీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్గా తీసుకోకండి. ప్రొఫెషనల్ జిమ్ ఇన్స్ట్రక్టర్, డైట్ కౌన్సెలర్ని కలవండి. ఒకసారి హార్మోన్స్, థైరాయిడ్, సుగర్ టెస్ట్లు చేసుకోండి. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా బరువు తగ్గించుకునే వీలు ఉంటుంది. బీఎమ్ఐ 40 దాటిన వారికి బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తాం. బీఎమ్ఐ 35 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా స్పెషలిస్ట్ని సంప్రదించిన తరువాతే మీకు ఏది సరిపోతుందో అంచనా వేస్తాను. మామూలుగా బేరియాట్రిక్ సర్జరీ అయిన 12– 18 నెలల తరువాత మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చెయ్యాలి. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో మొదట్లో పోషకాల లోపం తలెత్తుతుంది. వాటిని మల్టీ విటమిన్స్తో కవర్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా డైట్ని సూచించాల్సి ఉంటుంది. బీపీ, సుగర్ సమస్యలు తలెత్తకుండా టెస్ట్ చెయ్యాలి. బేరియాట్రిక్ సర్జరీ తరువాత ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఏ సమస్యలూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్లో తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, నెలలు నిండకుండానే ప్రసవమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఒబేసిటీతో ఉన్నప్పటి రిస్క్ కంటే ఈ రిస్క్ చాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మంచి స్పెషలిస్ట్ని కలిసిన తరువాత అన్ని విషయాలు అసెస్ చేసుకుని అప్పుడు బేరియాట్రిక్ సర్జన్ని కలిస్తే మంచిది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
విలయం.. యువ హృదయం!
విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన 40 ఏళ్ల యువకుడు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల ఓ రోజు ఉదయం ఛాతిలో నొప్పి అని చెప్పి కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు విడిచాడు. తీవ్రమైన గుండెనొప్పి కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తేల్చారు. విజయవాడ వన్టౌన్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఛాతిలో నొప్పి అని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో యువతలో గుండె పోటు మరణాలు ఎక్కువగా సంభవించడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. మరీముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. మారుతున్న జీవన శైలి, దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రౖమెన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగానే చిన్న వయస్సులో గుండె జబ్బుల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ని యంత్రించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాల్సిన అవసరముందంటున్నారు. అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించుకుని గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆకస్మిక మరణాలు గుండె ఆగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణా లకు వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు. ధూమపానం, మద్యపానం,ఊబకాయం, వ్యాయామం లేకపోవడం పోస్టు కోవిడ్ గుండె రక్తనాళాల్లో పూడికలు, గుండె కండరాలు ఉబ్బడం(మయోకార్డిటైస్) పల్మనరీ ఎంబోలిజం(గుండె నుంచి ఊపిరి తిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) ముందు జాగ్రత్తే మందు గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిళ్లకు దూరంగా ఉండటం నీరు ఎక్కువగా తీసుకోవడం యువతలో అధికమవుతున్నాయ్.. గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి వారిలో 80 శాతం మందికి గుండెపోటు రావడానికి పొగతాగడం, మద్యం తీసుకోవడం, ఒత్తిడే కారణాలు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్ వేస్తున్నాం. పోస్టు కోవిడ్ వారిలో కూడా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తపోటు, మధుమేహం ఉన్న వారు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా, మెడిటేషన్ను అలవర్చుకోవాలి. – డాక్టర్ బొర్రా విజయ్చైతన్య, కార్డియాలజిస్ట్ -
'ఒబెసిటీ'కి సరికొత్త పేరు..ఇక అలా పిలవొద్దని సూచన!
అధిక బరువు ఉంటే ఒబిసిటీ అని పిలిచేవారు కదా. ఇక నుంచి అలా పిలవకూడదట. ఎందకంటే ఆ పదమే పేషెంట్ సమస్యకు మరింత కారణమవుతుందని, అందువల్ల దానికి పేరు మార్చాలని ఆరోగ్య నిపుణులు నిర్ణయించారు. అధిక బరువు ఉన్నవాళ్లని సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిందే. పలువురుతో జరిపిన విస్తృత చర్చల అనంతరం అధికం బరువు సమస్యకు కొత్త పేరు పెట్టాలనే వాదన వినిపించింది. లావుగా ఉన్నవారికి వారు అలా ఉన్నదాని కంటే ఆ పేరే వారిని ఇబ్బందుల పాలు చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే అధిక బరువు సమస్యను మరోక పేరు పెట్టాని నిపుణలు భావించారు. పేరు మార్చాల్సినంత నీడ్.. 1950లలో స్వలింగ సంపర్కాన్ని సామాజిక వ్యక్తిత్వ భంగంగా భావించారు. ఆ తర్వాత అనేక నిరసనలు, వ్యతిరేకతలు గట్టిగా రావడంతో దాన్ని అపకీర్తిగా భావించడం మానేశారు. అదోక మానసిక రుగ్మతకు సంబంధించినదని అంగీకరించారు. అలానే ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. నిజాని నాన్ ఆల్కహాలిక్లకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అని పేరు మార్చాలనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో ఆ తర్వాత ఆ వ్యాధికి మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్" అని పేరు పెట్టారు.ఈ నేపథ్యంలోనే ఒబెసిటీ అనే పదం మార్చడం తప్పనిసరైంది. అదీగాక ఆయా పేషంట్లు ఆ పేరు కారణంగానే సమాజంలోనూ, కుటుంబ పరంగాను వివక్షకు గురవ్వుతున్నారు. కొత్తపేరు బీఎంఐకి మించి ఉండాలి అధిక బరువును బీఎంఐల ద్వారా నిర్ణయిస్తారు. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ఇది కూడా సరిపోదు. ఇది కండర ద్రవ్యరాశిని లెక్కించదు, శరీర బరువు లేదా కొవ్వు కణజాలం (శరీర కొవ్వు) గురించి సరైన సమాచారం ఇవ్వదు. నిపుణులు సూచించిన కొత్తపేరు ఈ ఒబెసిటీని “అడిపోసిటీ ఆధారిత దీర్ఘకాలిక వ్యాధి” అని పిలవాలని సూచించారు ఆరోగ్య నిపుణులు. దీని పేరులోనే ఆ వ్యాధి ఏంటో అవగతమవుతుంది. జీవక్రియలు పనిచేయకపోవడమే ఈ వ్యాధి లక్షణం అని తెలుస్తుంది. ఈ పేరు కారణంగా సమాజ దృక్పథం మారి చులకనగా చూసే అవకాశం తగ్గుతుంది. అధిక బరవు సమస్య అనేది వ్యాధేనా.. అధిక బరవు అనేది శారీరక లేదా మానసిక వ్యవస్థలు సరిగా పనిచేయక పోవడం వల్ల ఎదురయ్యే సమస్య దీన్నిబట్టి ఆ సమస్యను వ్యాధిగా పరిగణించలేం. మొదట్లో అధిక బరువు హానికరం కాకపోవచ్చు. కొందరూ లావుగా ఉన్నా.. వారికి ఎలాంటి హెల్త్ సమస్యలు ఉత్పన్నం కావు. కొందరికి క్రమేణ అధిక బరువు వివిధ శారీరక సమస్యలకు దారితీస్తుంది. ఈ పేరు మార్పు కారణంగా ప్రజలకు ఆయా వ్యకుల పట్ల చులకన భావం, హేయభావం తగ్గి వారి సమస్యను అర్థం చేసుకునే యత్నం చేయగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్!ఏంటంటే ఇది!) -
ఒబెసిటీ, హైబీపీ ఎక్కువే.. పన్నీర్, జంక్ ఫుడ్, నాన్ వెజ్ వల్ల..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీవనశైలి వ్యాధుల సూచికల్లో తెలంగాణ పరిస్థితి అత్యంత పేలవంగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. అలాగే స్థూలకాయం, రక్తపోటు కేసుల సంఖ్య సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ‘మెటబాలిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎంఆర్ ఐఎన్డీఐఏబీ) పేరిట లాన్సెట్ రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 25 శాతం మంది సెంట్రల్ ఒబేసిటీ, హైపర్టెన్షన్తో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 మధ్య మొత్తం 1,13,043 మంది (గ్రామీణ ప్రాంతాల నుంచి 79,506 పట్టణ ప్రాంతాల నుంచి 33,537 మంది)పై నిర్వహించిన అధ్యయన ఫలితాలను లాన్సెట్ ఇటీవల ప్రచురించింది. ఊబకాయం కేసులలో తెలంగాణ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మణిపూర్, మిజోరం, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హరియాణా, ఢిల్లీల సరసన నిలుస్తోంది. దీనికి కారణం ఉదర ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్కు మధ్య దగ్గరి సంబంధం ఉండటమేనని వైద్య నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం.. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం.. లాన్సెట్ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజల్లో ఊబకాయం, రక్తపోటు, ట్రైగ్లిజరిడెమియా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ‘ఇది తక్కువస్థాయి శారీరక శ్రమతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల పెరుగుతున్న సమస్య. ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న రోగులను ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. ఇవి మెటబాలిక్ సిండ్రోమ్ సంకేతాలు. చికిత్స తీసుకోకుంటే గుండె, మూత్రపిండాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి’’ అని నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరించారు. హైపర్ టెన్షన్... స్లీప్ అప్నియాలకూ దోహదం.. ‘పన్నీర్, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధికస్థాయి కొలస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. దీనికితోడు డెస్క్ జాబ్లు సెంట్రల్ ఒబేసిటీకి దారితీస్తున్నాయి. ఊబకాయంతో గుండె జబ్బులు, మధుమేహమే కాకుండా హైబీపీ, స్లీప్ యాప్నియా వంటి ఇతర జబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సమస్యలకు అధిక మద్యపానం కూడా ఒక ప్రధాన కారణం’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలవాట్లను కట్టడి చేస్తేనే.. పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు అధికంగా చేరడాన్నే సెంట్రల్ ఒబేసిటీగా పేర్కొంటారు. పెరిగిన విసరల్ ఫ్యాట్ పోర్టల్ బ్లడ్ సిస్టమ్ ద్వారా సరఫరా అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోని అదనపు కొవ్వు రక్తప్రవాహంలోకి కొవ్వు నిల్వలను విడుదల చేస్తుందన... ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపధ్యంలో వ్యాయామం, శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం తప్పనిసరని వారు సూచిస్తున్నారు. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్ @ 68
పేదరికాన్ని ఓల్డ్సిటీ చూపించింది. దాతృత్వాన్ని నాన్న వైద్యం నేర్పించింది. ఆరోగ్య భద్రతా లేమిని ఆదివాసీ జీవనం తెలిపింది. అందంగా జీవించడాన్ని బాల్య స్నేహం చెప్పింది. కొండంత సాహసాన్ని తనకు తానే చేసింది. డాక్టర్ శోభాదేవి రాసుకున్న రికార్డుల జాబితా ఇది. ‘‘నేను జర్నలిస్ట్ని కావాలనుకున్నాను. మా నాన్న నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. ఆయన మాటే నెగ్గింది. కానీ నా అచీవ్మెంట్స్తో తరచూ జర్నల్స్లో కనిపిస్తూ ఉండటం ద్వారా నేను సంతోషిస్తున్నాను’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. హైదరాబాద్, హిమాయత్ నగర్లో పుట్టి పెరిగి, వెస్ట్ మారేడ్పల్లిలో స్థిరపడిన శోభాదేవి ఒక గ్లోబల్ పర్సనాలిటీ. డయాబెటిస్ అండ్ ఒబేసిటీ స్పెషలిస్ట్గా ఆమె పదికి పైగా దేశాల్లో సెమినార్లలో పాల్గొని అధ్యయనాల పేపర్లు సమర్పించారు. కోవిడ్ సమయంలో రోజుకు పద్దెనిమిది గంటల సేపు ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ సేవలందించిన ఈ డాక్టర్ తన పేషెంట్లను హాస్పిటల్ గడప తొక్కనివ్వకుండా ఆరోగ్యవంతులను చేశారు. అందుకు ప్రతిగా ఆమె డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు ముందు ఆ తర్వాత దేశవిదేశాల్లో ఆమె అందుకున్న పురస్కారాల సంఖ్య వందకు పైగానే. వెస్ట్ మారేడ్పల్లిలోని ఆమె ఇంట్లో రెండు గదులు మెమెంటోలతో నిండిపోయి ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు 8కె చేరుకుని మరో రికార్డు సృష్టించుకున్నారు. అది బేస్ క్యాంపుకు చేరిన రికార్డు మాత్రమే కాదు. 68వ ఏట ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించడం, మిసెస్ ఇండియా విజేత, అందాల పోటీ కిరీటధారి ఎవరెస్ట్ను అధిరోహించడం కూడా రికార్డులే. ప్రతి రోజునూ స్ఫూర్తిదాయకంగా మలుచుకోవడం ఒక కళ. ఆ కళ ఆమె చేతిలో ఉంది. ఇలాంటి సాహసాలు, సరదాలతోపాటు నల్లమల, భద్రాచలం, ఆసిఫాబాద్ జిల్లాల్లో నివసించే ఆదివాసీలకు ఆరోగ్య చైతన్యం కలిగించడం ఆమెలో మరో కోణం. ‘ఒక డాక్టర్గా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్వించడానికి ఎప్పుడూ ముందుంను. అది తండ్రి నేర్పిన విలువల నుంచి గ్రహించిన జీవితసారం’ అన్నారామె. వైవిధ్యభరితమైన తన జీవితప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు డాక్టర్ శోభాదేవి. నాన్న నేర్పిన విలువలు ‘‘మా నాన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా పని చేశారు. అమ్మ రోజరీ కాన్వెంట్ స్కూలో టీచర్. అలా నేను అదే స్కూల్లో చదివాను. నాన్న ఆసక్తి కొద్దీ హోమియోవైద్యం కోర్సు చేసి ఉచితంగా వైద్యం చేసేవారు. నన్ను మెడిసిన్ చదివించడం కూడా నాన్న ఇష్టమే. ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో నాకు బాలికల కేటగిరీలో రెండవ ర్యాంకు, జనరల్ కేటగిరీలో ఎనిమిదవ ర్యాంకు వచ్చింది. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుంచి డయీబెటిస్లో పీజీ, యూకేలో ఒబేసిటీలో కోర్సు చేసి అక్కడ దాదాపు ఇరవై ఏళ్లు పని చేశాను. నాన్న కోసం తిరిగి ఇండియా వచ్చేసి హైదరాబాద్లో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. ఓల్డ్సిటీలో అడిగి మరీ పోస్టింగ్ వేయించుకున్నాను. పేదరికం ఎంత దారుణంగా ఉంటుందో కళ్లారా చూశాను. పేషెంట్లకు చాయ్, బన్నుకు డబ్బిచ్చి తినేసి రండి మందులు రాసిస్తానని పంపేదాన్ని. ‘భగవంతుడు మనల్ని చాలామంది కంటే మెరుగైన స్థానంలో ఉంచాడు. భగవంతుడిచ్చింది అంతా మన కోసమే కాదు, ఆకలితో ఉన్న వాళ్ల కోసం పని చేయాల్సిన బాధ్యతను కూడా ఇచ్చి ఈ భూమ్మీదకు పంపాడు. సమాజానికి తిరిగి మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాట తరచూ గుర్తు వచ్చేది. ఆ ప్రభావంతోనే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్లకు సహాయం చేయడం చిన్నప్పుడే అలవాటైంది. ఆదివాసీల జీవనశైలి గురించి నాకు తెలిసింది బాగా పెద్దయిన తర్వాత మాత్రమే. అడవిలో నివసిస్తూ అక్కడ దొరికే ఆహారం తింటూ కడుపు నింపుకోవడమే వాళ్లకు తెలిసింది. సమతుల ఆహారం అంటే ఏమిటో తెలియదు. సీజన్లో వచ్చే జ్వరాల గురించి అవగాహన కూడా తక్కువే. వాళ్లకు ఆహారం గురించి ఆరోగ్యం చైతన్యవంతం చేయడంతోపాటు ఎసెన్షియల్ ఫుడ్ పౌడర్లు, వంటపాత్రలు, దుప్పట్లు ఇవ్వడం మొదలు పెట్టాం. అన్ని రకాల కాయగూరలను పండించుకోవడంలో శిక్షణ ఇచ్చాం. మనిషి జీవితంలో ఆహారం, ఆరోగ్యం ప్రధాన భూమిక పోషిస్తాయనే అవగాహన కల్పించగలిగాను. బాల్య స్నేహితురాలి చొరవ బ్యూటీ పాజంట్ అవతారం ఎత్తడానికి కారణం నా స్కూల్ ఫ్రెండ్ రేణుక. మా అబ్బాయిలిద్దరూ యూఎస్లో సెటిలయ్యారు. మా వారు 2015లో మాకు దూరమయ్యారు. ఇంత ఇంట్లో నేనొక్కర్తినే, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నన్ను నేను నిమగ్నం చేసుకుంటూ నిబ్బరంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రేణుక ఆల్బమ్ చేయిస్తానని నా ఫొటోలు తీసుకుని వెళ్లి ‘2019 మిసెస్ తెలంగాణ’ పోటీలకు పంపించేసింది. ఆ తర్వాత నాకు అన్ని ఈవెంట్లలో పాల్గొనక తప్పలేదు. ఫైనల్స్ సమయంలో స్కాట్లాండ్లో ఒబేసిటీ మీద ఇంటర్నేషనల్ సెమినార్కి వెళ్లాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే తిట్లు. చివరి నిమిషంలో వచ్చి ఫైనల్ రౌండ్ పూర్తి చేశాను. మిసెస్ ఇండియా పోటీలకు ఇలా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ కాకుండా జాగ్రత్త పడ్డాను. మిసెస్ ఇండియా విజేత అయినప్పుడు 63 పూర్తయి 64లో ఉన్నాను. సక్సెస్ ఇచ్చే కిక్ని బాగా ఎంజాయ్ చేశాననే చెప్పాలి. నేనే ఉదాహరణ అప్పటి వరకు నేనందుకున్న పురస్కారాల సమయంలో స్ఫూర్తిదాయకమైన మహిళగా ప్రశంసిస్తుంటే నా అర్హతలకు మించిన గౌరవం ఇస్తున్నారేమో అనిపించేది. ఈ వయసులో నేను సాధించిన ఈ లక్ష్యం నన్ను సంతోషంలో ముంచెత్తుతోంది. ప్రాణం పోయినా ఫర్లేదనే సంసిద్ధతతో మొదలు పెడతాం, అవాంతరాలెదురవుతాయి, కానీ సాధించి తీరాలనే సంకల్ప శక్తితో ముందుకెళతాం. లక్ష్యాన్ని చేరిన తర్వాత కలిగే ఆత్మవిశ్వాసంతో కూడిన అతిశయం చాలా గొప్ప భావన. చైతన్యవంతంగా ముందడుగు వేయాలనుకునే మహిళలకు నేనొక ప్రత్యక్ష నిదర్శనం’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. పర్వతం పెద్ద చాలెంజ్ ఎవరెస్ట్ బేస్క్యాంప్ ఆరోహణ ఆలోచన మెడిసిన్ క్లాస్మేట్స్తో న్యూజిలాండ్ టూర్లో వచ్చింది. అక్కడ గ్లేసియర్లు, ట్రెకింగ్ జోన్లు చూసినప్పుడు ఇదేపని మన దగ్గర ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కానీ మన దగ్గర పర్వతారోహణ శిక్షణ కేంద్రాలుండవు. జిమ్, కేబీఆర్ పార్క్, సిటీలో క్రాస్ ఓవర్ బ్రిడ్జిలు, కర్నాటకలో నందిహిల్స్ నా శిక్షణ కేంద్రాలయ్యాయి. ఎవరెస్ట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేసింది. డాక్టర్గా నా వృత్తికి నూటికి నూరుశాతం సేవలందించాల్సిన సమయం అది. నా పేషెంట్ల నంబర్ రాసుకోలేదు కానీ పేషెంట్లకు మందులు, ఇతర జాగ్రత్తలు, ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్లో రోజూ తెల్లవారు జామున రెండు– మూడు గంటల వరకు ఆన్లైన్లో టచ్లో ఉండేదాన్ని. ఆ తర్వాత నాకూ కోవిడ్ వచ్చింది, తగ్గింది. కానీ వెన్ను పట్టేయడం, ఫ్రోజన్ షోల్డర్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాలు బాధించాయి. వాటన్నింటినీ చాలెంజ్గా తీసుకుని బయటపడి పర్వతారోహణ చేశాను. మేనెల ఆరవ తేదీ హైదరాబాద్ నుంచి బయలేరి ఖాట్మండూకు వెళ్లాను. ఎనిమిదో తేదీన ‘లుక్లా’ నుంచి నడక మొదలు పెట్టి 15వ తేదీకి బేస్ క్యాంపులో ఎత్తైన శిఖరం ‘8కె’కి చేరాను. ఈ ట్రిప్లో నేను పర్వతారోహకులకు మార్గాన్ని సుగమం చేసే షెర్పాల దయనీయమైన జీవితాన్ని దగ్గరగా చూశాను. ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులు చేస్తుంటారు వాళ్లు. – వాకా మంజులారెడ్డి -
ఇంత బరువున్నావ్.. ఎక్కువ రోజులు బతకవ్.. దెబ్బకు 165 కిలోలు తగ్గాడు..
వాషింగ్టన్: బరువు విపరీతంగా పెరిగిపోయి సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తికి డాక్టర్లు చెప్పిన విషయం దిమ్మతిరిగేలా చేసింది. ఇలాగే ఉంటే 3-5 ఏళ్లకు మించి బతకవు, నీ టైం బాంబ్ కౌంట్ డైన్ స్టార్ట్ అయింది.. అనే మాట అతడి జీవితాన్ని మార్చేసింది. అమెరికా మిసిసిప్పికి చెందిన 42 ఏళ్ల ఈ వ్యక్తి పేరు నికోలస్ క్రాఫ్ట్. 2019లో ఇతని బరువు 294 కిలోలు. వైద్యులు షాకింగ్ విషయం చెప్పిన తర్వాత ఎలాగైనా బరువు తగ్గాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే డైట్ మొదలుపెట్టాడు. నెల రోజుల్లోనే 40 కిలోలు తగ్గాడు. దీంతో అతడి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అప్పటి నుంచి డైట్తో పాటు వ్యాయామం చేస్తూ 165 కిలోల బరువు తగ్గాడు క్రాఫ్ట్. ప్రస్తుతం ఇతని బరువు 129 కేజీలు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడటమే గాక ఆరోగ్యంగా తయారయ్యాడు. అయితే తాను డిప్రెషన్లోకి వెళ్లి అధికంగా తినడం వల్లే బరువు పెరిగినట్లు క్రాఫ్ట్ చెప్పుకొచ్చాడు. తనకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని పేర్కొన్నాడు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతోనే ఒత్తిడి నుంచి బయటపడి బరువు తగ్గినట్లు చెప్పకొచ్చాడు. 165 కిలోల బరువు తగ్గడంతో క్రాఫ్ చర్మమంతా వదులైంది. దీంతో నొప్పి వచ్చి అతను ఇబ్బందిపడుతున్నాడు. శస్త్రచికిత్స చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే దీనికి ఇన్సూరెన్స్ వర్తించదని, ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు. చదవండి: ఆమె పోరాడింది.. టాప్లెస్ సమానత్వం సాధించింది -
మధుమేహ భారతం! 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!
సమాజాన్ని దీర్ఘకాలిక వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మరణాల్లో 65 శాతం దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని... అధిక బరువు, ఊబకాయం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ప్రజల్లో 73 శాతం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తేల్చిచెప్పింది. ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధులపై ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సహా 21 సంస్థలు సర్వే చేశాయి. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల నుంచి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 10,659 మందిని (18–69 ఏళ్ల వయసు వారు) సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించాయి. తెలంగాణలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సర్వే చేసింది. సర్వే నివేదికపై పార్లమెంటు ఇటీవల చర్చించింది. దేశంలో దీర్ఘకాలిక వ్యాధులపై జరిగిన మొట్టమొదటి సర్వే ఇదేనని కేంద్రం తెలిపింది. – సాక్షి, హైదరాబాద్ సర్వేలో వెల్లడైన అంశాలు... ►2019లో దేశంలో దీర్ఘకాలిక జబ్బులతో 61 లక్షల మంది చనిపోయారు. అందులో షుగర్తో 1.70 లక్షల మంది మరణించారు. 1990తో పోలిస్తే దీర్ఘకాలిక వ్యాదులతో మరణించే వారి సంఖ్య రెట్టింపు అయింది. ►ధూమపానం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 15.5 శాతం ఎక్కువ. అధికంగా పొగతాగడం వల్ల కేన్సర్ ముప్పు సైతం 39 శాతం పెరుగుతుందని సర్వే తేల్చింది. ఉప్పుతో పెరుగుతున్న ముప్పు... ►సర్వేలో పాల్గొన్న వారిలో సగటు ఉప్పు వినియోగం 8 గ్రాములుగా వెల్లడైంది. అందులో పురుషుల్లో ఉప్పు సగటు వినియోగం 8.9 గ్రాములుకాగా, మహిళలు 7.1 గ్రాములు వాడుతున్నారు. పట్టణాల్లో 8.3 గ్రాములు, పల్లెల్లో 8 గ్రాముల మేర వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినదానికంటే దేశంలో రెట్టింపు ఉప్పు వినియోగం జరుగుతోంది. ‘పొగ’బారిన 33% మంది సర్వే ప్రకారం దేశంలో 32.8 శాతం మంది పొగతాగుతున్నారు. అందులో పురుషులు 51.2 శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం, పల్లెల్లో 36.8 శాతం పొగ తాగుతున్నారు. ►15.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. అందులో పురుషులు 28.3 శాతం, మహిళలు 2.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 14.2 శాతం, పల్లెల్లో 16.7 శాతం ఉన్నారు. అందులో అధిక మద్యం సేవించేవారు 5.9 శాతం మంది ఉన్నారు. అధిక మద్యం సేవించేవారిలో పురుషులు 10.9 శాతం, 0.5 శాతం మహిళలున్నారు. పట్టణాల్లో 10.7 శాతం, పల్లెల్లో 6.1 శాతం అధిక మద్యం సేవిస్తున్నారు. దేశంలో మద్యం వినియోగించే వారిలో 20–35 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నారు. వేధిస్తున్న ఊబకాయం... ►సర్వేలో పాల్గొన్న వారిలో 41.3 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో పురుషులు 30.9 శాతం మంది, మహిళలు 52.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 51.7 శాతం, గ్రామాల్లో 36.1 శాతం మంది చేయడంలేదు. ►26.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అందులో పురుషులు 23.3 శాతం, మహిళలు 29.3 శాతం ఉన్నారు. పట్టణాల్లో 42.5 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు, గ్రామాల్లో ఇది 18 శాతంగా ఉంది. పెరుగుతున్న బీపీ, షుగర్... ►28.5 శాతం మందిని బీపీ పట్టిపీడిస్తోంది. పురుషుల్లో 29.9 శాతం, మహిళల్లో 27 శాతం బీపీతో బాధపడుతున్నారు. ఇక పట్టణాల్లో 34 శాతం, గ్రామాల్లో 25.7 శాతం మంది బీపీతో ఉన్నారు. ►9.3 శాతం మంది షుగర్తో బాధపడుతున్నారు. అందులో పురుషుల్లో 8.5 శాతం, మహిళల్లో 10.2 శాతం షుగర్ ఉంది. పట్టణాల్లో 14.4 శాతం, గ్రామాల్లో 6.9 శాతంగా ఉంది. 2040 నాటికి ‘బరువు’మూడింతలు ►సర్వే అంచనాల ప్రకారం 2040 నాటికి అధిక బరువు బాధితుల సంఖ్య రెట్టింపు కానుంది. ఊబకాయం బాధితుల సంఖ్య మూడింతలు అవుతుంది. బీఎంఐ 25–30 మధ్య ఉంటే అధిక బరువు అంటారు. బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయం అంటారు. నడుము చుట్టుకొలత పురుషుల్లో 90 సెంటీమీటర్లు, మహిళల్లో 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే అధిక పొట్ట ఉన్నట్లు లెక్క. ►బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే అధికంగా ఉన్నట్లు. షుగర్ ఫాస్టింగ్ 126 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్లు లెక్క. వ్యాయామానికి విరామం... ►ఈ సర్వే ప్రకారం దేశంలో 98.4 శాతం మంది నిర్ణీత పరిమాణంలో కూరగాయలు, పండ్లు తీసుకోవడంలేదు. ►వారానికి కనీసం 150 నిమిషాలపాటు తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయి లేదా 75 నిమిషాలపాటు తీవ్రస్థాయిలో శారీరక శ్రమ చేయాలి. ఆ ప్రకారం శారీరక శ్రమ చేయనివారు 41.3 శాతం మంది ఉన్నారు. ప్రతి మూడు మరణాల్లో రెండు అవే... గత 30 ఏళ్లలో జీవనశైలి జబ్బుల ప్రభావం భారతీయుల్లో రెట్టింపైంది. దేశంలో ప్రస్తుతం సంభవించే ప్రతి 3 మరణాలలో రెండు వీటికి చెందినవే. తగిన శారీరక శ్రమ, బరువును అదుపులో ఉంచుకోవడం, తాజా కూరగాయలు, పండ్లు రోజుకు 400 గ్రాములకు తగ్గకుండా తీసుకోవడం ద్వారా ఈ జబ్బులను దూరం చేయవచ్చు. – డాక్టర్ హరిత, వైద్యురాలు, నిజామాబాద్ -
లావైపోతున్నారు! ముంచేస్తున్న ఆహారపు అలవాట్లు
ఊబకాయం.. ఇప్పుడు సాధారణమైపోయింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య పీడిస్తోంది. దీని ప్రభావం శరీరంలోని మిగతా అవయవాల మీద పడుతోంది. ఫలితంగా గుండె, కిడ్నీ, మధుమేహం వంటి వ్యాధులకు మూలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఊబకాయం నివారణకు జీవనశైలిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత ఆహారపు అలవాట్లు లావు కావడానికి ఒక కారణమైతే, సరైన వ్యాయామం లేకపోవడం మరో కారణమని జాతీయ ఆరోగ్య మిషన్ చేసిన సర్వేలో తేలింది. శ్రమగల జీవన విధానం, సమతులాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సర్వే స్పష్టం చేసింది. సాక్షి, చిత్తూరు రూరల్: ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం పెరిగిపోతోంది. దానికి తోడు వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అధిక బరువు ఉన్న వారిని గుండె జబ్బులతో పాటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, కీళ్ల సమస్యలు వెంటాడుతున్నాయి. ఊబకాయులు ఇటీవల అనేక దుష్ఫలితాలతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. కార్డియాలజీ రోగుల్లో 25 శాతం మంది ఊబకాయులే ఉంటున్నారు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిర్వహిస్తున్న నాన్ కమ్యూనికల్ డిసీజెస్ (ఎన్ఎసీడీ) సర్వేలో సైతం ఒబెసిటీ కారణంగా రక్త పోటు, మధుమేహం, గుండె జబ్బులు సోకుతున్నట్లు తేలింది. జిల్లాలో 17,54,254 మంది ఉండగా 12,99,758 మందిని ఎన్సీడీ సర్వే చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సర్వే 74.09శాతం పూర్తయింది. అయితే ఈ సర్వేలో బీపీతో బాధపడుతున్నవారు 1,96,772 మంది, మధుమేహంతో 1,96,957 మంది, రెండు ఉన్నవారు 17,675 మంది ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం ప్రజల ఆహార అలవాట్లు, జీవనశైలి, అధికబరువు వంటివి అని వైద్యులు చెబుతున్నారు. బరువుతో గుండె బలహీనత గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ఊబకాయులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కార్డియాలజీ ఓపీల సంఖ్య పెరుగుతోంది. రోజుకు జిల్లాలో 200 నుంచి 250 మంది వరకూ రోగులు వస్తున్నట్లు వైద్యులు లెక్కలు చెబుతున్నాయి. వారిలో 25 శాతం మంది అంటే 55 మంది ఊబకాయులే. వారిలో గుండె రక్తనాళాలు సన్నబడి బ్లాకులు ఏర్పడటం, గుండెపై తీవ్ర ఒత్తిడి, పల్మనరీ ఎంబోలిజమ్, పల్మనరీ హైపర్ టెన్షన్ వంటి సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు. రక్తనాళాల్లో బ్లాకులు ఉన్న వారికి వాటిని తొలగించి స్టెంట్లు వేస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఒబెసిటీ కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పడుతోంది. ఆ కారణంగా ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. దీంతో యూరిన్లో ప్రొటీన్లు లీకవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాళ్ల వాపులు రావడం, కిడ్నీలు పూర్తిగా పాడైన వారిని చూస్తున్నారు. ఊబకాయుల్లో వచ్చే మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న వారు డయాలసిస్ కోసం వస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిత్యం 50 నుంచి 65 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇతర వ్యాధులు ఒబెసిటీ వారిలో రక్తపోటు, మధుమేహం వలన వచ్చే దుష్ఫలితాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒబెసిటీ ఉన్న వారిలో పదిశాతం మందికి గాల్బ్లాడర్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఫ్యాటీ లివర్ ఏర్పడి, దీర్ఘకాలంలో తీవ్రమైన లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి. మోకీళ్లపై ప్రభావం చూపి, నాలుగు పదుల వయసులోనే మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తోంది. బరువు పెరగడానికి కారణాలు పట్టణాల నుంచి పల్లెల వరకు జంక్ఫుడ్ వినియోగం పెరిగింది. పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ఫుడ్, ఐస్క్రీమ్లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోని కొన్ని యాప్లద్వారా జంక్ఫుడ్ను ఆర్డర్ పెడితే క్షణాల్లో గుమ్మం ముందు డెలివరీ చేస్తున్నారు. దీనికి తోడు రెస్టారెంట్లలో విక్రయించే ఆహారాల్లో బిర్యానిదే మొదటిస్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండడం, వీటికి తోడు కూల్డ్రింక్లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మగవారితోపాటు అధికంగా మహిళలకు ఊబకాయం వచ్చేస్తోంది. ఇలా చేస్తే మేలు దేశంలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23.5 దాటిన వారందరినీ ఊబకాయులుగా భావిస్తారు. వారు బరువు తగ్గేందుకు శ్రమగల జీవన విధానం, సమతుల ఆహారం తీసుకుంటే సత్పలితాలు రాబట్టవచ్చు. బరువు తగ్గేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక విధానాలు ఉన్నాయి. దీర్ఘకాల విధానంలో వారానికి మూడు, నాలుగు గంటలు వ్యాయామం ద్వారా బరువు చేయడం తగ్గించుకోవచ్చు. స్వల్పకాలంలో రోజుకు వెయ్యి కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. బీఎంఐ27 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పద్ధతులను అనుసరించినా బరువు తగ్గకుంటే బీఎంఐ 30 శాతం దాటిన వారికి బేరియాట్రిక్ (మెటబాలిక్) సర్జరీలతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. బరువు తగ్గితే మంచిది ఊబకాయం ఉన్న మధుమేహులు తమ బరువులో ఐదు శాతం తగ్గించుకోగా తక్కువ మందులతో మెరుగైన వ్యాధి నియంత్రణా ఫలితాలు రాబట్టవచ్చు. హృద్రోగ సమస్యలను నివారించుకోవచ్చు. సమతుల ఆహారం, క్రమగల జీవన విధానం, జీవనశైలిలో మార్పులు పాటించడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఊబకాయుల్లో మధుమేహ నియంత్రణకు ఆధునిక మందులు అందుబాటులోకి వచ్చాయి. – డాక్టర్ అరుణ్కుమార్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
బొద్దు..వద్దమ్మా..! మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం
అందానికి, ఆకృతికి మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే జీవన శైలిలో వచ్చిన మార్పులతో మగువలు బొద్దుగా మారుతున్నారు. స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 29 శాతం మంది మహిళలు అధిక బరువుతో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్నూలు(హాస్పిటల్): ఇంటి పనితోపాటు పిల్లల బాధ్యత చూస్తూ మహిళలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వంట చేసే సమయం లేక కొందరు బయట నుంచి ఆహారాన్ని తెచ్చుకుని ఆరగిస్తున్నారు. కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత అంచనాల ప్రకారం 48 లక్షల జనాభా ఉంది. అందులో మహిళలు 23 లక్షలకు పైగా ఉన్నారు. వీరిలో 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు 16 లక్షల వరకు ఉన్నారు. మొత్తం మహిళా జనాభాలో 29 శాతం అంటే 6.67లక్షల దాకా స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నట్లు ఐదో జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడవుతోంది. పట్టణాల్లోనే అధికం.. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లోని మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 32.6 శాతం స్థూలకాయులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేసే వారు అధికం. దీంతో పల్లెల్లో ఊబకాయుల సంఖ్య తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలకు విరుద్దంగా పట్టణాల్లో పరిస్థితి ఉండడంతో లావైపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎక్కువ మంది ఇంటి పనిలో యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఒక వైపు కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దడం, మరోవైపు ఉద్యోగ బాధ్యతలతో కొందరు కొన్నిసార్లు ఒకపూట ఆహారం తీసుకోకపోవడం, తర్వాత తీసుకున్నా ఒకేసారి ఎక్కువ తినడం చేస్తున్నారు. ఫలితంగా వారిలో స్థూలకాయ సమస్య తలెత్తుతోంది. గృహిణిలైతే ఇంట్లో ఒక్కరే ఉండటం, అత్తా, తోడి కోడళ్లు ఉంటే వారితో పొసగకపోవడం వంటి కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా ఊబకాయం పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జంక్ఫుడ్తో అసలు సమస్య కార్పొరేట్ కంపెనీలు నగరాల నుంచి పట్టణాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ ఫుడ్, ఐస్క్రీమ్లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోనే జొమాటో, స్విగ్గీల ద్వారా జంక్ఫుడ్ను ఆర్డర్ పెట్టేసి మరీ తెప్పించుకుని తింటున్నారు. దీనికితోడు రెస్టారెంట్లలో విక్రయించి ఆహారాల్లో బిర్యానీదే మొదటి స్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండటం, వీటికితోడు కూల్డ్రింక్లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మహిళల్లో ఊబకాయం వచ్చేస్తోంది. క్యాన్సర్ వచ్చే అవకాశం సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. బరువు పెరిగితే గర్భాశయంలో నీటి బుడగలు వచ్చి సంతానలేమి సమస్య ఎదురవుతుంది. వీరికి భవిష్యత్లో టైప్–2 డయాబెటీస్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యకు హార్మోన్ మాత్రలు ఇవ్వడం వల్ల మరింత ఊబకాయం వస్తుంది. అధిక బరువు వల్ల బీపీ, షుగర్, గుండెజబ్బులు సైతం వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్లకు కూడా ఊబకాయం దారి తీస్తుంది. –డాక్టర్ కె. కావ్య, గైనకాలజిస్టు, కర్నూలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి తినే ఆహారానికి సరిపడా వ్యాయామం చేయకపోవడం వల్లే ఊబకాయం వస్తోంది. ఈ సమస్య నివారణకు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వేపుళ్లు, తీపి పదార్థాలు తగ్గించాలి. ఐస్క్రీమ్లు, జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్ మానేయాలి. ఇంట్లో వండిన ఆహారాన్నే తినేందుకు సుముఖత చూపాలి. ఆహారంలో అధికంగా కూరగాయలు, పండ్లు, నట్స్ ఉండేలా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు, కార్పొహైడ్రేట్లు తగ్గించుకోవాలి. వేళకు భోజనం చేయడం, నియమిత వ్యాయామం చేయడం, ప్రశాంతంగా ఉండడం వల్ల ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చు. –డాక్టర్ జి. రమాదేవి, పోషకాహార నిపుణురాలు, కర్నూలు వ్యాయామం తప్పనిసరి ఎంతైనా తిను...తిన్న దానిని అరిగించు అనేది నేటి తరం వైద్యుల మాట. కానీ తిన్న తర్వాత కూర్చోవడమే పనిగా చాలా మంది మహిళలు ఉంటున్నారు. తినడం ఆ తర్వాత మొబైల్, టీవీలు చూస్తూ కూర్చోవడం వల్ల ఊబకాయం పెరిగిపోతోంది. ఉదయం లేవగానే ఓ గంటపాటు వ్యాయామం చేసే ఓపిక చాలా మందిలో ఉండటం లేదు. కేవలం ఒకటి నుంచి నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే యోగాశ్రమాలు, జిమ్లు, వాకింగ్కు వెళ్లి శారీరక శ్రమ చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థినులకు ఆటలే ఉండటం లేదు. వీరే అధికంగా ఆహారాన్ని తింటూ ఎక్కువ సేపు తరగతుల్లో గడుపుతున్నారు. వీరిలోనూ సమస్య అధికమవుతోంది. ఇదీ చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధితో పాటు అనారోగ్య కారక జీవనశైలికీ మన నగరం కేంద్రంగా మారుతోంది. ఇక్కడి మహిళల్లో ఒబెసిటీకి కూడా చిరునామాగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఓ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఒబెసిటీకి నగరం రాజధానిగా నిలిచింది. దేశంలో 15 నుంచి 49 సంవత్సరాల వయసు పురుషుల కంటే స్త్రీలలో అధిక బరువు/ఊబకాయం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో పురుషుల (22.9%) కంటే మహిళలు (24%) ముందున్నారు. జాతీయ ఆరోగ్య సర్వే ఆధారంగా నగరం కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ నిర్వహించిన అధ్యయనం ఈ అంశాలను తేటతెల్లం చేసింది. పెరుగుదలలో మనం తక్కువే.. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అధ్యయనం ప్రకారం మహిళల్లో అధిక బరువు/ఊబకాయం డేటాను పోల్చినప్పుడు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఒబెసిటీ సంఖ్యలు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. మహిళలు, పురుషులిరువురి విషయంలోనూ ఉత్తర భారతం కంటే దక్షిణ భారతమే ముందంజలో ఉంది. పెరుగుదల ప్రకారం చూస్తే.. జాతీయ స్థాయిలో, ఊబకాయం 3.3% పెరగగా, దక్షిణాది రాష్ట్రాల్లో అంతకు మించి వేగంగా పెరుగుతోంది. ఈ విషయంలో 9.5%తో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా, వరుసగా 6.9%, 5.7%లతో కర్ణాటక, కేరళ దానిని అనుసరిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం 2%తో అత్యల్పంగా ఉండడం ఊరటనిచ్చే అంశం. రాష్ట్రంలో సిటీ టాప్... దేశవ్యాప్తంగా 120 జిల్లాలు, మన రాష్ట్రంలో 31 జిల్లాల్లో నిర్వహించిన అధ్యయనంలో.. మహిళల్లో ఊబకాయం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. మన జిల్లాలో 51% మంది ఊబకాయంతో బాధపడుతున్నారని తేలింది. అదే సమయంలో 14%తో అతి తక్కువ ఊబకాయులున్న కుమరంభీం ఆసిఫాబాద్ ఈ జాబితాలో అట్టడుగున ఉంది. అదే విధంగా గ్రామీణ ప్రాంత మహిళల కంటే పట్టణ మహిళలే ఎక్కువ ఊబకాయంతో బాధపడుతున్నారని, సంపన్న, నిరుపేద వర్గాలతో పోలిస్తే మధ్యతరగతి వర్గాలలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇందులోంచి గర్భిణులు, బాలింతలను మినహాయించారు. అందుబాటులోకి కొత్త పరిష్కారాలు ఓ వైపు ఒబెసిటీ బాధితులు పెరుగుతున్న కొద్దీ మరోవైపు కొత్త పరిష్కార మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. డైట్, వర్కవుట్స్ వంటి సహజమైన పద్ధతులను అనుసరించి బరువు తగ్గే విధానాలతో పాటు సర్జరీలు, మందులు, ఇంజెక్షన్లు వగైరా రోజుకోటి నగరంలో వెల్లువెత్తుతున్నాయి. ‘ఒబెసిటీ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి పరిష్కారాలు వీలైనంత సులువుగా ఇతరత్రా ఇబ్బందులు కలగించనివిగా ఉండాలని ఆధునిక మహిళలు కోరుకుంటున్నారు’ అని చెప్పారు వెయిట్లాస్కి ఉపకరించే క్యాప్సూల్ తరహా గ్యా్రస్టిక్ బెలూన్ని తాజాగా నగరంలో విడుదల చేసిన అల్యూరిన్ సంస్థ వ్యవస్థాపకులు డా.శంతను గౌర్. -
Payal Kothari: టీబీ.. డిప్రెషన్.. సమస్యలు అధిగమించి హెల్త్ కోచ్గా!
‘‘జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలు భవిష్యత్లో తమతోపాటు ఎంతోమంది జీవితాలను సరిదిద్దుకోవడానికి పాఠాలుగా మారతాయి. కష్టసమయాల్లో కిందపడి కెరటంలా పైకి లేచిన ప్రతిసారి మనకెదురయ్యే పరిష్కార మార్గాలు మన భవిష్యత్ను చక్కగా తీర్చిదిద్దుతాయి. నా జీవితంలో అది జరగబట్టే ఈ రోజు నేను సెలబ్రెటీ గట్ హెల్త్ కోచ్గా మారాను’’ అని చెబుతోంది పాయల్ కొఠారి. ముంబైకి చెందిన పాయల్ కొఠారి కోల్కతాలోని గుజరాతీ జైన్ కుటుంబంలో పుట్టింది. పాయల్కు రెండేళ్లు ఉన్నప్పుడు కుటుంబం ముంబైకి మకాం మార్చి అక్కడే స్థిరపడింది. అక్కడికి వచ్చిన కొద్దిరోజుల్లోనే పాయల్కు టీబీ వచ్చింది. చికిత్స తీసుకున్నాక నయమైంది కానీ జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింది. ఫలితంగా పోషకాహార లోపం ఏర్పడి, పదమూడేళ్లు వచ్చేవరకు బక్కపలుచగా ఉండేది తను. ఫెయిలవడంతో... ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ చదువులో చాలా చురుకుగా ఉండేది పాయల్. కానీ మన సులో ఎప్పుడూ తెలియని నిరాశ వెంటాడేది. ఇలా అనిపించిన ప్రతిసారి విపరీతంగా తింటుండేది. దీంతో తన బరువు అమాంతం పెరిగి ఒబెసిటీ వచ్చింది. ఉన్నట్టుండి బరువు పెరిగిన పాయల్ను మిగతా విద్యార్థులంతా హేళన చేస్తుండేవారు. వారి కామెంట్లను భరించలేని పాయల్ తీవ్ర నిరాశకు లోనై సరిగా చదవలేకపోయేది. దీంతో ఫెయిల్ అయ్యింది. ‘‘ఎవరేమి మాట్లాడినా పట్టించుకోకు, నీ పని నువ్వు చూసుకో’’ అని ఆమె తల్లి పదేపదే చెప్పడంతో డిప్రెషన్ నుంచి బయటపడింది. కాస్త పర్వాలేదు అనుకునేలోపు... మానసికంగా కాస్త పర్లేదు అనుకుంటుండగా..పదోతరగతి పూర్తై కాలేజీలో అడుగుపెట్టిన పాయల్ను పొట్ట ఆరోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీంతో అనేక మ్యాగజీన్లు చదివి తన కడుపు సమస్యకు డాక్టర్ దగ్గర చికిత్స తీసుకుంటూనే కిచిడి, పెరుగన్నం, పండ్లు, నెయ్యి, సూప్లు తీసుకుంటూ పేగుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచి పొట్ట, ఒబెసిటీ సమస్యలను తగ్గించి ఫిట్గా తయారైంది. డిగ్రీ పూర్తయ్యాక ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్ స్కూల్ అయిన న్యూయార్క్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంట్రాగేటివ్ న్యూట్రిషన్(ఐఐఎన్) లో క్లినికల్ న్యూట్రిషన్లో సర్టిఫికెట్ కోర్సులు చేసింది. పదిహేనేళ్ల తరువాత.. కోర్సు పూర్తయ్యాక పాయల్కు ఓ వ్యాపారవేత్తతో వివాహం జరగడంతో భర్తతో హాంగ్కాంగ్ వెళ్లిపోయింది. పదిహేనేళ్లపాటు గృహిణిగా ఉన్న పాయల్ భర్తకు వ్యాపారంలో నష్టం రావడంతో 2016లో ఇండియాకి తిరిగి వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో ఉంటోన్న పాయల్ను చూసిన కొంతమంది ‘‘అధిక బరువు నుంచి ఇంత ఫిట్గా ఎలా తయారయ్యావు? నీ చర్మం కూడా కాంతిమంతంగా ఉంది’’ మాకు కొన్ని టిప్స్ చెప్పు అని అడిగేవారు. దీంతో క్లినికల్ స్టడీ సర్టిఫికెట్ కోర్సు చేయడం, స్వయంగా తను కూడా ఒకప్పుడు ఒబెసిటీ బాధితురాలి నుంచి ఫిట్గా మారిన అనుభవంతో ‘గట్ హెల్త్ కోచ్’ గా మారాలనుకుంది. కోచ్గా పనిచేయడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా సాయపడవచ్చన్న ఉద్దేశ్యంతో వెంటనే గట్ చోచ్గా మారింది. ప్రారంభంలో చుట్టూ ఉన్నవాళ్లకు, ఆ తరువాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటిదాకా రెండు లక్షలమందికి కోచ్గా బాలీవుడ్ సెలబ్రెటీల నుంచి పెద్ద కంపెనీల సీఈఓల వరకు కోచ్గా పనిచేసింది. ఇలా ఇప్పటిదాకా రెండు లక్షలమందికి కోచ్గా పనిచేసి వారి ఆరోగ్యస్థితిగతులను మెరుగుపరిచింది. పెద్దవాళ్లకేగాక స్కూళ్లకు వెళ్లి పిల్లలకు మహిళా క్లబ్బులు, ఎన్జీవోలను సందర్శించి గట్ హెల్త్పై అవగాహన కల్పిస్తోంది. ద గట్ పేరిట బుక్ కూడా రాసింది. ఆన్లైన్ న్యూట్రిషన్ స్కూల్ ప్రారంభించి గట్ ఆరోగ్యం గురించి వివరించడంతోపాటు.. కాలేజీలు, యూనివర్శిటీల్లో సెమినార్లు నిర్వహిస్తోంది. వివిధ ఆర్టికల్స్ రాస్తూ ఫిట్నెస్ పట్ల అనేకమందిలో అవగాహన కల్పిస్తోంది. జాతీయ అంతర్జాతీయ న్యూట్రిషన్ సంస్థలతో కలిసి పనిచేస్తూ పదిమంది మెప్పూ పొందుతోంది పాయల్. చదవండి: Precision Oncology: ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా.. క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో.. -
దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయెజనాలెన్నో..!
ఒక రకరమైన ఇబ్బందికరమైన ఇనుము రుచితో ఉండే ఐరన్ ట్యాబ్లెట్లు వాడటం కంటే హాయిగా తినాలనిపించే రుచికరమైన దానిమ్మతో ఒంట్లో ఐరన్ మోతాదులు పెరుగుతాయి. అలా ఈ పండు రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తనాళాలనూ శుభ్రపరుస్తుంది. ఒంటికి మంచి ఆరోగ్యకరమైన రక్తం పట్టడం వల్ల మనిషి చురుగ్గానూ మారుతారు. ఇక ఇదే దానిమ్మ బరువు పెరగకుండా కూడా నివారిస్తుంది. ఇలా దానిమ్మతో బరువు తగ్గడానికి కారణం... ఇందులో ఉండే దాదాపు 7 గ్రాముల పీచు. ఇలా బరువు తగ్గించడం ద్వారా ఇది గుండెజబ్బులనూ నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ కె, విటమిన్ సీ వంటి విటమిన్ల వల్ల రోగనిరోధకSశక్తిని పెంపొందిస్తుంది. ఇందులోని పొటాషియమ్ రక్తపోటును అదుపులో పెడుతుంది. దాదాపు 25 గ్రాముల చక్కెర కారణంగా తక్షణం 144 క్యాలరీల శక్తి సమకూరుతుంది. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు ఉండటం అన్న అంశం కూడా వేగంగా బరువు తగ్గడానికి/పెరగకుండా నివారించడానికి తోడ్పడతాయి. అన్ని రకాల పండ్లూ ఆరోగ్యానికి మంచివే అయినా... ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను ఒక పండే ఇవ్వడం అన్నది చాలా కొద్ది పండ్ల విషయంలోనే ఉంటుంది. అందుకే రక్తహీనత తగ్గడం, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపరచుకోవడం, వ్యాధినిరోధకతను పెంచుకోవడం లాంటి బహుళ ప్రయోజనాలను పొందాలంటే దానిమ్మ పండు తినడం రుచికరమైన ఓ మంచి మార్గం. -
Health Tips: డైట్ సోడా తాగినా.. ప్రమాదంలో పడ్డట్లే! ప్రాణాంతక వ్యాధులు..
చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అందులోనూ సోడా ఉండే వాటిని ఎక్కువ మంది ఇష్టంగా తీసుకుంటారు. వేసవికాలం, చలికాలం అనే సంబంధం లేకుండా వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కలిగే ప్రయోజనాల కన్నా... ఆరోగ్య సమస్యలే ఎక్కువ. కూల్ డ్రింకులు, సోడాలు, చక్కెర పానీయాలు తాగడం వల్ల మధుమేహం,ఊబకాయం, కొవ్వు పెరిగి కాలేయం, మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొందరు సోడాకు బదులు డైట్ సోడా తాగితే ఆరోగ్యంపై అంతగా ప్రభావం ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ, మెటబాలిక్ సిండ్రోమ్, అలాగే స్ట్రోక్ ప్రమాదాలను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. మరి కొన్ని పరిశోధనల ప్రకారం, డైట్ సోడా వినియోగం కూడా ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. అదే విధంగా.. రసాయనాలు కలిసిన కూల్డ్రింకులు తాగితే, ఈ సమస్యలకు తోడు పేగుల్లో సమతుల్యత దెబ్బతిని, జీర్ణకోశ సమస్యలూ తలెత్తే ప్రమాదం లేకపోలేదు. చదవండి: Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల.. -
మొత్తానికి ఈజీ డైటింగ్ టెక్నిక్: ఈ వీడియో చూస్తే
సాక్షి, ముంబై: కొండలా పెరిగిన శరారీన్ని, బాన లాంటి పొట్టను తగ్గించుకోవడం అంత వీజీ కాదు. డైటింగ్లూ, జిమ్లూ అంటూ కసరత్తు చేయడం, ఎక్కడో ఒక చోట్ ఫెయిల్ అవ్వడం మనం చూస్తుంటాం. కొంతమందేమో ఎంత కడుపుమాడ్చుకున్నా.. వ్యాయామం చేస్తున్నా..ఒళ్లు మాత్రం తగ్గడం లేదంటూ నిరాశ చెందుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలంటే చక్కటి ప్రణాళిక, దానికి మించిన నిబద్ధత, ఒక్కోసారి మంచి ట్రైనర్ ఉండటం చాలా అవసరం. అలాగే వైద్యపరంగా ఎందుకు లావు అవుతున్నామనే విశ్లేషణ కూడా అంతే అవసరం. ఈ క్రమంలో వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఒక ఫన్నీ వీడియోను ట్వీట్ చేశారు. మొత్తానికి ఈజీ డైటింగ్ని మార్గాన్ని కనుగొన్నారు అంటూ ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఇలా చేస్తే.. మీరు కచ్చితంగా స్లిమ్ అవడం ఖాయం అంటూ నెటిజన్లు ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. Finally found a way to make dieting easier …..😀😀 pic.twitter.com/CzY6jvil8V — Harsh Goenka (@hvgoenka) June 26, 2022 -
ఈ జాకెట్స్తో బాడీ ఫిట్గా.. ధర వెయ్యి లోపే!
Body Shaper Fit Jacket: శరీరతత్వమో.. హార్మోన్ల అసమతుల్యమో, ప్రసవానంతరం వచ్చే సమస్యో.. ఇలా కారణం ఏదైనా చాలా మంది ఆడవాళ్లు వయసుతో సంబంధం లేకుండా స్థూలకాయంతో బాధపడుతుంటారు. శరీరంలో కొవ్వు పెరగడం వేరు.. కేవలం నడుము, పొట్ట భాగాల్లో కొవ్వు పేరుకోవడం వేరు. దాని వల్ల ముఖం ఎంత అందంగా ఉన్నా.. ఆకృతిపరంగా షేప్ లెస్గా కనిపిస్తుంటారు. దాంతో ఏ డ్రెస్ వేసుకున్నా ఒకేలా కనిపిస్తోంది. పొట్టేమో ఫ్లాట్గా.. నడుము దగ్గర సన్నగా .. భుజాలు నిటారుగా ఉంటే ఆ ఆకృతే వేరు కదా! అలాంటి ఫిగర్ను సొంతం చేసే జాకెట్టే(బాడీ షేపర్) ఇది. శరీర ఆకృతిపై ప్రత్యేక శ్రద్ధ చూపించే స్త్రీలకు ఇదో మంచి బహుమతి. 30% స్పాండెక్స్, 70% నైలాన్తో రూపొందిన ఈ షేప్వేర్ బాడీసూట్ టాప్ గ్రేడ్ ఫ్యాబ్రిక్ కావడంతో సులభంగా సాగుతుంది. మన్నుతుంది కూడా. ప్రసవానంతర రికవరీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని జంప్ సూట్ మాదిరిగా వేసుకోవాలి. సౌకర్యవంతంగా ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళడానికి వీలుగా జిప్ ఉంటుంది. దాంతో వేసుకున్న డ్రెస్ పూర్తిగా తొలగించాల్సిన పనిలేదు. ఫిట్టింగ్ టాప్స్, స్కర్ట్స్, జీన్స్, పొట్ట భాగం కనిపించని మోడర్న్ వేర్ ఏది వేసుకున్నా దీన్ని చక్కగా ధరించొచ్చు. ఇలాంటి మోడల్ జాకెట్స్ విషయంలో.. క్వాలిటీని బట్టి, అదనపు సౌలభ్యాలను బట్టి ధరలు మారుతుంటాయి. సాధారణమైన జాకెట్స్ వెయ్యి రూపాయాల్లోపు కూడా దొరుకుతాయి. ఈ జాకెట్స్తో బాడీని ఫిట్గా మార్చుకుంటే.. ఆకర్షణీయమైన రూపంతో పాటు ఆత్మవిశ్వాసమూ రెట్టింపవుతుంది. చదవండి: పొటాటో పోషణ -
మనిషి ఆరోగ్యానికి ఏ రకమైన బియ్యం మంచిది ??
-
బరువుగా పెంచకండి
కొంతమంది తల్లులు పిల్లల మీద ప్రేమతో వారు వద్దంటున్నా వినకుండా కొసరి కొసరి తినిపిస్తారు. తల్లులతోపాటు నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యల వంటి వారు కూడా లేకలేక పుట్టారనో, బోలెడంత మంది ఆడపిల్లల్లో ఒక్కగానొక్క మగపిల్లాడని లేదా అందరు మగపిల్లల మధ్య మహాలక్ష్మి లా ఒకే ఆడపిల్ల అనో అతిగా గారం చేసి వారికి అతిగా తినిపిస్తారు. దాంతో పిల్లలు విపరీతంగా బరువు పెరిగిపోతారు. బొద్దుగా ఉంటే ముద్దుగానే ఉంటారు కానీ, క్రమేణా ఆ బొద్దుతనం కాస్తా ఊబకాయంగా మారిపోతుంది. ఫలితంగా పెద్దయ్యేకొద్దీ రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. దేనినైనా చేతులు దాటకముందే పరిష్కరించుకోవాలి లేదంటే డాక్టర్ల దాకా వెళ్లాల్సి వస్తుంది. పిల్లలు బొద్దుగా ఉండటం కాదు... ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. లావుగా ఉండే పిల్లల ఆహారపుటలవాట్లలో, జీవనశైలి లో చిన్నచిన్న మార్పులు చేస్తే వారు ఆరోగ్యంగా పెరుగుతారు. దీనిపై అవగాహన కోసం... కొంతమంది పిల్లలు లావుగా ఉన్నప్పటికీ, టీనేజీకొచ్చేసరికి సన్నబడిపోతారు. కానీ ఒక్కోసారి అలా జరగకపోవచ్చు. ఒక పరిశోధన ప్రకారం 5.5 ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 60 శాతం మంది 20 ఏళ్ల వయస్సులో కూడా బరువు ఎక్కువే ఉన్నారు. రెండున్నర ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 44 శాతం మంది 16 ఏళ్ల వయస్సులో కూడా ఎక్కువ బరువే ఉన్నారు. ఎందుకంటే, వయసు పెరిగిన కొద్దీ, కాస్తో కూస్తో లావెక్కడం సహజం. అలాగని చిన్నప్పుడు సన్నగా ఉన్నవారు పెద్దయ్యాక లావెక్కరని కాదు. చిన్నప్పటినుంచి ఉన్న బరువు అలాగే కొనసాగడం వల్ల వారు రకరకాలయిన ఇబ్బందులు పడతారు. స్కూల్లో, కాలేజీలో తోటిపిల్లలు వారికి పేర్లు పెడతారు. అదేవిధంగా తమకు నచ్చిన దుస్తులు ధరించలేరు. పిల్లలు టీనేజీలోకి వచ్చాక సామాజికంగా వారే తెలుసుకుని తాము తగ్గాలో పెరగాలో అనేది వారే డిసైడ్ చేసుకుంటే అది ఒక రకం కానీ, పెద్దల గారం మూలంగా బరువు పెరిగిన పిల్లలు పెద్దయ్యాక స్థూలకాయులుగా తయారు కాకుండా ఏం చేయాలో చూద్దాం. జంక్ ఫుడ్కు దూరంగా ఉంచాలి: చాక్లెట్లు, స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ఫుడ్స్ వంటివి అలవాటు చెయ్యకుండా ఉండడం అత్యవసరం. బరువు పెంచే లక్షణాలు వాటిలోనే అధికంగా ఉంటాయి. పైగా ఆయా పదార్థాల రుచిని పెంచడం కొరకు అజీనమోటో వంటి హానికర రసాయన పదార్థాలు కలుపుతారు. అవి పిల్లల శారీరక ఎదుగుదలతోపాటు మెదడులోని నరాల ఎదుగుదలను దెబ్బతీస్తాయి కాబట్టి అటువంటి వాటిని అతిగా ఇవ్వకుండా అప్పుడప్పుడు మాత్రమే తినిపించాలి. ఇక ఇంట్లో చేసిన ఆహారపదార్థాలలో కూడా రుచి కోసం విపరీతంగా నూనెపోసి చేసే వేపుడు కూరలు, మసాలాలు, నెయ్యితో తయారు చేసిన స్వీట్లు కూడా పరిమితికి మించి తినిపించకూడదు. అవి తినకుండా ఉండలేని స్థితికి తీసుకుని రాకూడదు. అంత అతిగా అలవాటు చెయ్యకూడదు. పిల్లలు స్కూల్కు వెళ్ళే సమయంలో స్నాక్స్ కావాలని మారాం చెయ్యడం సహజం. అటువంటి సందర్భాల్లో చాక్లెట్లు, చిప్స్ వంటి వాటి బదులు ఇంటిలో చేసిన పల్లీపట్టీలు, బెల్లం వేరుశనగ ఉండలు, మినప సున్నిఉండలు, నువ్వుల ఉండలు, ఇంట్లోనే చేసిన బూందీ, కారా వంటివి ఇవ్వడం ఉత్తమం. పిల్లలు ఏం తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి? జంక్ ఫుడ్ నుండి పిల్లలను ఎలా రక్షించుకోవాలి? బిడ్డకు ఊబకాయం వచ్చేసిన తరవాత తల్లిదండ్రులు చెయ్యగలింగింది ఎక్కువ ఉండదు. అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మన్యూనతాభావం: బిడ్డ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పనులు, మాటలకు దూరంగా ఉండటం ఉత్తమం. పొట్టమాడ్చకూడదు: పిల్లలు లావు అవుతున్నారు కదా అని ఒక్కసారిగా తిండి తగ్గించడానికి ప్రయత్నం చెయ్యకండి. ఆలా చేస్తే వారి పసిమనసుకు తప్పుడు సంకేతాలు వెళతాయి. మెల్లి మెల్లిగా తగ్గించాలి. తక్కువ క్యాలరీలుండే మరమరాలు, అటుకులు, పుచ్చకాయ, బొప్పాయి ముక్కలు వంటి వాటిని ఎక్కువ అలవాటు చెయ్యాలి. వ్యాయామం: శారీరక శ్రమను ప్రోత్సహించండి. వారి చేత గార్డెనింగ్ చేయించడం, చిన్న చిన్న దూరాలు నడిపించడం, లిఫ్ట్కు బదులుగా మెట్లెక్కేలా చేయడం వంటివి. మానసిక ఆరోగ్యం: బిడ్డ ఎక్కువ తినటానికి కారణం వత్తిడి, ఆందోళన, అభద్రతా భావం కావచ్చును. సందర్భాన్ని బట్టి నిపుణులను సంప్రదించండి. జీవనశైలి: ఏవైనా మార్పులు ఎల్లకాలం పాటించగలిగేలా ఉండాలి. రోజూ స్నానం చేసినట్లు, లేదా పళ్ళు తోముకున్నట్లు. మార్పులు జీవనశైలిలో భాగం కావాలి. అంతేకానీ, జబ్బుకన్నా మందు కష్టం కాకూడదు. నిరంతరం బరువు తగ్గటం లేదన్న భావనతో బాధ పడటం కన్నా ఊబకాయంతో బాధపడటం కొంతలో కొంత మేలు. -
Hyderabad: 50% మంది మహిళలకు ఒకే సమస్య.. కారణమదే అంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య 15వేల దాకా ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నవారు లక్ష మంది దాకా ఉంటారని కేర్ ఆస్పత్రి వైద్యుడు డా.వంశీకృష్ణ చెబుతున్నారు. మొత్తం కిడ్నీ రోగుల్లో 40 శాతం మందికి అధిక రక్తపోటుతో కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతుందంటున్నారాయ. దురదృష్టకర విషయమేంటంటే వీరిలో ఎవరికి తాము రక్తపోటు బాధితులమని తెలియకపోవడం. తాజాగా నగరానికి చెందిన 51 శాతం మంది మహిళలు అధిక బరువుతో లేదా తమ బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 25కేజీ/ఎమ్2 కన్నా ఎక్కువగా లేదా సమానమైన ఒబెసిటీతో బాధపడుతున్నారని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) వెల్లడించింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ కోసం ప్రచురించినదీ సారాంశం. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన వివరాలతో రూపొందించిన గణాంకాలివీ. దీనిలో నగరం అత్యధిక శాతం అధిక బరువున్న మహిళలతో ముందంజలో ఉండడం గమనార్హం. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అన్నీ ఉన్నా...ఆరోగ్యం? నిజానికి నగరంలో విద్యాధికులకు కొదవలేదు. వైద్య సౌకర్యాలకు కొరత లేదు. అయినప్పటికీ డయాబెటిస్ మొదలుకుని ఏ వ్యాధికి సంబంధించి చూసినా నగరంలోనే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్టు పలుమార్లు అధ్యయనాలు వెల్లడించాయి. శారీరక శ్రమ కరువైన జీవనశైలి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, సూర్య కాంతికి ఎక్కువగా తగలకపోవడం... వంటివి నగర మహిళల్ని అధిక బరువు దిశగా నడిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘కోవిడ్ నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి పద్ధతులు కొత్తగా వచ్చాయి. ఈ పరిణామం చాలా మందిని ఊబకాయులుగా మార్చింది. నగరాల్లో ఒత్తిడి స్థాయి ఎక్కువగా ఉండడం కూడా మరో కారణం’ అని న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్ అభిప్రాయపడ్డారు. వేగం.. నగర జీవననాదం.. నగర జీవనంలో ఉరుకులు పరుగులు సర్వసాధారణంగా మారాయి. రోజుకు 24 గంటలు ఉంటున్నా సరిపోవడం లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి. దీనికి మరోవైపు సోషల్ మీడియా సరికొత్త సోమరితత్వాన్ని మోసుకొస్తోంది. దీంతో ఆహారపు అలవాట్లు ఛిన్నా భిన్నమయ్యాయి. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్టుగా ఆహార విహారాలు మారడంతో అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. ‘మారుతున్న జీవన శైలిలో భాగంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరైన సమయానికి నిద్ర లేవకపోవడం, సరైన సమయంలో భోజనం చేయకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటివి నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ్యాయామం, ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం’ అని కిమ్స్ హాస్పిటల్స్కు చెందిన కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, డాక్టర్ వేదస్విరావు వెల్చల చెప్పారు. -
‘చిరు’కు రుచి మరిగి లావైపోయారు.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు..
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): శ్రీధర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. కరోనా సెకండ్ వేవ్లో కంపెనీ అతనికి ఇంటి నుంచే పని చేయాలని బాధ్యతలు అప్పజెప్పింది. ఆఫీసులో అటూ ఇటూ తిరుగుతూ పనిచేసే అతను ఇంట్లో ఒకేచోట గంటల తరబడి కూర్చోవడమే గాక కుటుంబసభ్యులు గంటకోసారి చేసి పెట్టే చిరుతిళ్లు తింటూ లావైపోయాడు. మొదట్లో 65 కిలోల బరువు ఉండే అతను ఇప్పుడు 85 కిలోలకు పెరిగాడు. దీంతో పెరిగిన బరువును తగ్గించేందుకు న్యూట్రిషన్ సెంటర్లవైపు పరుగులు తీస్తున్నాడు. ►నారాయణరెడ్డి కేంద్ర సంస్థలో పనిచేసి రెండేళ్ల క్రితమే రిటైరయ్యాడు. అతను రిటైరైనప్పటి నుంచి కోవిడ్ ప్రారంభమైంది. అప్పటి వరకు ప్రతిరోజూ ఉదయమే గంటసేపు వాకింగ్ చేసేవాడు. లాక్డౌన్, కోవిడ్ నిబంధనల మేరకు ఇంట్లోనే గడపాల్సి వచ్చి ంది. కోవిడ్ తగ్గుముఖం పట్టినా కుటుంబసభ్యులు అతన్ని బయటకు వెళ్లనీయలేదు. దీంతో సన్నగా 65 కిలోల బరువుండే అతను ఇప్పుడు 80 కిలోలకు చేరాడు. దీంతో అతనిలో బీపీ, షుగర్ స్థాయిలు బాగా పెరిగాయి. ఈ కారణంగా మందుల వాడకమూ పెరిగింది. బరువు తగ్గేందుకు ఇప్పుడు ట్రెడ్మిల్ కొనుగోలు చేసి ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నాడు. చదవండి: (Jayanthi Narayanan: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు) వీరిద్దరే కాదు కోవిడ్ కారణంగా బరువు పెరిగి ఇబ్బంది పడే వారి సంఖ్య జిల్లాలో వేలల్లో ఉంది. కోవిడ్ వైరస్ను ఒక్కటే తీసుకురాలేదు. దాంతో పాటు పరిస్థితుల ప్రభావం వల్ల మానవుల జీవనశైలినే మార్చేసింది. దీంతో ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోయాయి. బద్దకం పెరిగిపోయి ఊబకాయం అధికమైంది. దీంతో పాటు జీవనశైలి జబ్బులూ పెరిగిపోయాయి. వీటిని నియంత్రించేందుకు ఇప్పుడు ఆన్లైన్ యోగా క్లాసులు, ఇంట్లో ట్రెడ్మిల్ వాకింగ్లు గట్రా చేస్తూనే నోటిని కట్టడి చేస్తూ కడుపు కాల్చుకుంటున్నారు. జిల్లాలో 2020 మార్చి 28వ తేదీన తొలి కోవిడ్ కేసు నమోదైంది. దానికి నాలుగు రోజుల ముందు నుంచే దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలైంది. 20 నెలల క్రితం నాడు మొదలైన కోవిడ్ కేసుల సంఖ్య నేడు 1.25 లక్షల దాకా చేరుకున్నాయి. దీనిబారిన పడి 854 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ రోజూ ఒకటో, రెండో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మొదటి అల, రెండో అల పేరుతో దూసుకొచ్చిన కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఆంక్షలు ఫలితంగా చాలా మందికి శారీరక శ్రమ కరువైంది. వాకింగ్ చేయాలంటే మైదానాలు, పార్కులు మూతపడ్డాయి. వీధుల్లో నడవాలంటే మోకాళ్ల నొప్పులు వస్తాయని భయం. జిమ్కు వెళ్లాలన్నా వాటిపైనా ఆంక్షలు. ఇప్పుడిప్పుడే అవి తెరుచుకున్నా రోజుల తరబడి విశ్రాంతి తీసుకున్న మనసు బద్దకిస్తోంది. తెగించి జిమ్కు వెళ్లినా ఒకటి రెండు రోజులకే మళ్లీ మనసు విశ్రాంతినే కోరుకుంటోంది. దీనికితోడు కూర్చుని తినే కార్యక్రమం అధికం కావడంతో జిల్లాలో గతంలో ఉన్న వారితో పోలిస్తే అదనంగా 30 శాతం మంది స్థూలకాయులుగా మారారని వైద్యులు పేర్కొంటున్నారు. చదవండి: (కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా తగ్గుతాయి..) వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇబ్బందులు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారిలో 90 శాతం మందికి కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించారు. ఈ కారణంగా ఇంట్లోనే ఉండటంతో చిరుతిళ్లపై మనసు లాగడంతో వారికి వండిపెట్టేవారూ రెడీ అయ్యారు. ఈ కారణంగా అవసరం లేకపోయినా చిరుతిళ్లు తింటూ పనిచేసుకునే వారు అధికమయ్యారు. దీంతో చాలా మందికి శరీరంలో అవసరమైన దానికంటే అధికంగా కేలరీలు పెరిగి స్థూలకాయం వచ్చింది. మారిన ఆహారపు అలవాట్లు చాలా మందికి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. రెండేళ్ల క్రితం రోజుకు మూడు పూటలు తినేవారు కరోనా దెబ్బకు ఐదారు పూటలు (స్నాక్స్తో కలిపి) లాగించేశారు. అధిక శాతం ఇంట్లోనే ఉండటం, కోవిడ్ను ఎదుర్కోవాలంటే ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలనే వాదన ఒకటి రావడంతో చాలా మంది ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో శారీరక శ్రమను గాలికి వదిలేశారు. దీంతో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చదవండి: (సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు.. వీటిని ఎప్పుడైనా రుచి చూశారా?) ఊబకాయంతో నష్టాలు ఊబకాయం కారణంగా పది మందిలో తిరగాలంటే ఇబ్బంది. ఇతరులు సన్నగా, నాజూగ్గా ఉంటే వీరు చురుకుతనం తగ్గిపోయి బరువుగా అడుగులు వేయాల్సి వస్తుంది. అప్పటికే ఒంట్లో బీపీ, షుగర్లు ఉంటే వాటి స్థాయిలు మరింత పెరిగి మందుల డోసు కూడా అధికమైంది. దీనికితోడు అధిక బరువు కారణంగా కీళ్లనొప్పులు, ఆయాసం, గుండెజబ్బులు, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. కిడ్నీలపై భారం పడుతుంది ఊబకాయం వల్ల కిడ్నీ పనితనంపై భారం పెరిగే అవకాశం ఉంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 దాటితే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో పాటు స్మోకింగ్ అలవాటు ఉంటే రక్తనాళాలు కుచించుకుపోయి రక్తసరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో కిడ్నీ ఎక్కువగా పనిచేయడం వల్ల ప్రొటీన్స్ లీక్ అవుతాయి. ఈ కారణంగా కాళ్లవాపులు వస్తాయి. ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. –డాక్టర్ పీఎల్. వెంకటపక్కిరెడ్డి,నెఫ్రాలజిస్టు, కర్నూలు బరువు నియంత్రణా ముఖ్యమే కోవిడ్ అనంతరం ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఆహారం తీసుకోవడంలో వచ్చిన మార్పులే. అధిక బరువును ఆహార నియంత్రణతోనే తగ్గించుకోవాలి. ఈ మేరకు శరీరానికి అవసరమైన కేలరీలను వారి బరువు, వయస్సుకు తగినట్లుగా తీసుకోవాలి. రోజూ తగినంత వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్లు నీరు తాగాలి. ఇదే క్రమంలో తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఫాస్ట్ఫుడ్లు, జంక్ఫుడ్లు మానేయాలి. – డాక్టర్ జి.రమాదేవి, డైటీషియన్, కర్నూలు -
ఎప్పుడంటే అప్పుడు బరువు తగ్గిపోవచ్చా? నిజంగానే ఇదొక సవాలా?
సాక్షి, హైదరాబాద్: కేవలం అతిగా తినడం వల్లే ఊబకాయం రాదు. దీనికి అనేక కారణాలున్నాయి. అతి తక్కువ సమయంలో శరీర బరువు బాగా పెరగడం, ఊబకాయానికి దారి తీస్తుంది. హెరడిటరీ, శారీరక, పర్యావరణ అంశాలతో పాటు మనం తీసుకునే ఆహారం ముఖ్యం పాత్ర పోషిస్తాయి. అధిక బరువుతో అంద విహీనంగా కనపడుతున్నామనే ఒత్తిడి ఒక్కటే కాదు, గుండెజబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్, స్లీప్ ఆప్నియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే ఈ స్థూలకాయం, నివారణ మార్గాలపై కొన్ని అపోహలున్నాయి. నవంబరు 26 వరల్డ్ యాంటీ ఒబెసిటీ డే సందర్భంగా కొన్ని అపోహలు, వాస్తవాలు మీకోసం. (World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!) ఊబకాయం అనేది కేవలం కాస్మొటిక్ వ్యాధి మాత్రమేనా? కానే కాదు. లావుగానే ఉన్నామనే తీవ్ర ఆందోళన ఎంత తప్పో, కాస్త బొద్దుగా ముద్దుగా కనిపిస్తున్నామే తప్ప, దీనివలన పెద్దగా ఆరోగ్య సమస్యలు రావని అనుకోవడం కూడా భ్రమ. వాస్తవానికి, ఒబెసీటీకి కారణాలు అనేకం, అలాగే ఇది అనేక ఇతర వ్యాధులకు మూల కారణం. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకం కావచ్చు. ఈ విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఊబకాయం అనేది మామూలే, జీవనశైలి రుగ్మత మాత్రమే అనుకుంటే పొరపాటే. సీనియర్ బేరియాట్రిక్ సర్జన్ల తాజా లెక్కల ప్రకారం, ఊబకాయం ఇప్పుడు మల్టీఫ్యాక్టోరియల్ ఎటియాలజీతో కూడిన వ్యాధి. ఈ వ్యాధిని నిపుణుల పర్యవేక్షణలో వైద్యపరంగా వీలైనంత త్వరగా పరిష్కరించు కోవాలి. అంత సులువు కాదు..కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బరువు తగ్గవచ్చు. ఇది ఒక విధంగా అపోహ. నేను ఎంత తొందరగా బరువుపెరుగుతానో, అంతే వేగంగా బరువు తగ్గుతాను అని చాలామంది అనుకుంటారు. కొద్దిపాటి సంకల్పం, వ్యాయామం మాత్రమే చాలు అని భావిస్తారు చాలామంది. వాస్తవం మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఇది అందరికీ సాధ్యం కాదు. స్థూలకాయులకు ఆ అదనపు కిలోలను తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. ఒకసారి ఉండాల్సిన బరువుకంటే 25 కిలోలు పెరిగితే దీన్ని తగ్గించుకోవడం ఒక సవాల్ అని బెంగళూరులోని లివ్లైఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నిపుణుల అభిప్రాయం, వైద్య చికిత్స చాలా అవసరమని తెలిపారు. ఊబకాయం అనేది పట్టణాల్లోని ధనవంతులకే పరిమితమా? ఇది కూడా అపోహ మాత్రమే. భారతదేశంలోని మురికివాడల జనాభాలో 3 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఎందుకంటే పౌష్టికాహార లోపం కూడా ఊబకాయానికి పెద్ద కారణం. ఊబకాయం వల్ల ఐరన్, విటమిన్ డి-3 లోపం వంటి సమస్యలొస్తాయి. చిన్నపుడు లావుగా ఉండే పిల్లలు లావుగా ఉన్న పిల్లలు వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోతారా అంటే కాదు అంటున్నారు నిపుణులు. దాదాపు 80శాతం మంది ఊబకాయం ఉన్న పిల్లలు ఊబకాయులుగా పెరుగుతారని ఢిల్లీలోని మాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్, మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ చౌబే వెల్లడించారు. అంతేకాదు వీరిలో మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులొచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. బాల్యంలో వచ్చే స్థూలకాయంపై అప్రమత్తంగా ఉండాలని, మొదటినుంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని, నియమాలను అలవాటు చేయాలని సూచించారు. ఇన్ఫెర్టిలిటీ సంతానలేమి ఊబకాయానికి కారణమవుతుంది. నిజానికి ఊబకాయం లేదా, అధిక బరువే ఇన్ఫెర్టిలిటీకి కారణం. యువతలో ప్రాథమిక వ్యంధత్వానికి అత్యంత సాధారణ కారణాలలో ఊబకాయం ఒకటని వైద్యనిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ థైరాయిడ్ తక్కువగా ఉండటం వల్ల ఊబకాయం వస్తుంది. కాబట్టి థైరాయిడ్ మందులు తీసుకుంటే చాలు అనుకుంటే ఇది కూడా ఒక మిత్. హైపో థైరాయిడిజంతో బాధపడుతున్న అందరూ ఊబకాయంతో బాధపడరు. అలాగే, ఏ వ్యక్తిలోనైనా స్థూలకాయానికి ఏకైక కారణం హైపోథైరాయిడిజమ్గా చెప్పలేం. హార్మోన్ల సమస్యలు ఇందుకు కారణం. వైద్యుల సలహాలేకుండా థైరాయిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం హానికరమైన ఆరోగ్య ప్రభావాలకు దారితీయవచ్చు. ఊబకాయం మనిషి శరీరాకృతిని ప్రభావితం చేయడం మాత్రమే కాదు ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అతి తక్కువ కాలంలో బరువు బాగా పెరగడంతో మధుమేహం, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అంతేకాదు తెలియకుండానే మూత్రపిండాల పనితీరును దెబ్బతిస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవడం, వేళాపాళా లేకుండా భోజనం చేయడం, మద్యం, పొగతాగడం, ఒత్తిడి ఊబకాయానికి ముఖ్య కారణాలు. మారుతున్న జీవన శైలి, విచ్ఛలవిడిగా జంక్ ఫుడ్స్ వినియోగంతో బరువు పెరుగుతున్నారు. ప్రమాదాన్ని పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్య ఇంకా అధికమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం, కనీస వ్యాయామం, అవసరమైతే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అవసరమంటున్నారు. -
కందిరీగ నడుము కావాలా.. ఫ్యాటీ బెల్లీకి చెక్ చెప్పండిలా
సాక్షి, హైదరాబాద్: ఓవర్ వెయిట్, ఫ్యాటీ బెల్లీ ఇపుడివే చాలామందిని వేధిస్తున్నపెద్ద తలనొప్పి. మారుతున్న జీవన శైలి, కనీస వ్యాయామం లేకపోవడం, కంప్యూటర్కు అతుక్కుపోయే ఉద్యోగాలతో ఊబకాయానికి తోడు పొట్ట, నడుం చుట్టూ కొవ్వు పేరకుపోయి పెద్ద సమస్యగా మారిపోతోంది. దీంతో వయసుతో నిమిత్తంలేకుండా కుండలాగాపెరిగిన పొట్ట ముందుకొచ్చి మరీ వెక్కిరిస్తోంది. అంతేనా నచ్చిన డ్రెస్ వేసుకోవడానికి లేదు. బాడీషేప్ మారిపోయి అందవికారంగా ఉన్నామనే ఇన్ఫీరియారిటి. మరి ఈ సమస్యల్నింటికి పరిష్కారం ఏమిటో తెలియాలంటే.. స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉండాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. -
మీ బరువు సాధారణంగానే ఉన్నా.. పొట్ట పెద్దదిగా ఉంటే?
మీ శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ... మీ పొట్ట పెద్దగా బయటకు కనిపిస్తూ ఉంటే అది ఒకింత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోండి. మీరు మీ పొట్ట దగ్గర అంటే నడుము చుట్టుకొలతను ఓ టేప్ సహాయంతో తీసుకోండి. ఇలా కొలిచే క్రమంలో బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలని గుర్తుంచుకోండి. ఆ కొలతకూ, పిరుదుల మధ్య (హిప్)లో... గరిష్ఠమైన కొలత వచ్చే చోట టేప్తో మరోసారి కొలవండి. ఈ రెండు కొలతల నిష్పత్తిని లెక్కగట్టండి. అంటే నడుం కొలతని హిప్ కొలతతో భాగించాలన్నమాట. అది ఎప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. అలాగే పురుషుల విషయానికి వస్తే ఇది 0.90 కంటే తక్కువ రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది ఒకింత ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోండి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండె సమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి ఎక్కువగా శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్టను అంటే నడుము చుట్టుకొలతను తగ్గించుకోవడం అన్ని విధాలా మేలు. -
అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..
గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడాన్నికార్డియాక్ అరెస్ట్ అంటారు. నిజానికి ఇది ఒక రకంగా ప్రాణాంతకమైన గుండె సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు. అమెరికాలో సగానికిపైగా జనాభా దీని భారీన పడుతున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయి. ఐతే దీని బారిన పడ్డవెంటనే చికిత్స అందిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు, ఎవరెవరు దీని బారినపడతారో, చికిత్స ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకుందాం.. కార్డియాక్ అరెస్ట్కు కారణాలు ►వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ గుండెలో నాలుగు గదులు ఉంటాయి. దిగువ రెండు గదులను జఠరికలు, పై రెండు గదులను కర్ణికలు అంటారు. కొన్ని సందర్భాల్లో గుండె లయ తప్పడం వల్ల జఠరిక రక్తప్రరసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది కూడా. ఇది ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుంది. సాధారణంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కారణంగానే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ►కర్ణిక దడ ఎగువ గదుల్లో (కర్ణిక)ని అరిథ్మియా వల్ల కూడా గుండె కొట్టుకోవడం ఒక్కోసారి ఆగిపోతుంది. సినోట్రియల్ నోడ్ సరైన విద్యుత్ ప్రేరణలను పంపనప్పుడు కర్ణికల్లో దడ ప్రారంభమవుతుంది. ఫలితంగా జఠరికలు శరీరానికి సమర్ధవంతంగా రక్తాన్ని పంపవు. కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఎవరికి ఉంది? ►కరోనరీ హార్ట్ డిసీజ్తో బాధపడే వారిలో ఈ సమస్య సాధారణంగా తలెత్తుతుంది. ►గుండె పరిమాణం పెద్దదిగా ఉన్నవారిలోకూడా హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ►పుట్టుకతోనే గుండె జబ్బులు ఉన్న పిల్లల్లో కూడా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చు. ►గుండె విద్యుత్ వ్యవస్థతో సమస్యలు తలెత్తినా ఆకస్మిక మరణం సంభవిస్తుంది. ఈ కింది కారణాల వల్ల కూడా సంభవించవచ్చు.. ►ధూమపానం ►ఒకేచోట కూర్చుని పనిచేసే జీవనశైలి ►అధిక రక్త పోటు ►ఊబకాయం ►వంశపారంపర్య గుండె జబ్బులు ►45 కంటే ఎక్కువ వయస్సున్న పురుషులకు, 55 కంటే ఎక్కువ వయసున్న మహిళలకు ►పొటాషియం/మెగ్నీషియం స్థాయిలు తక్కువ ఉన్నవారిలో కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ►తలతిరుగుతుంది ►అలసటగా అనిపించడం ►వాంతి ►గుండెల్లో దడ ►ఛాతి నొప్పి ►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ►స్పృహ కోల్పోవడం ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణం నిలుపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అనే పరీక్ష చేసి, సత్వర చికిత్స అందించడం ద్వారా శరీరానికి రక్తం ప్రసరించేలా ప్రేరేపిస్తారు. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడవచ్చు. చదవండి: మత్స్యకారులకు దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద.. -
లావు ఉండటం మైనస్సే కాదు.. బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోండి
శరీరం పరిమాణం... ఆకృతిని బట్టి అందాన్ని కొలిచే జనరేషన్ ఇది. సన్నగా, నాజూకుగా ఉండే అమ్మాయిలనే అందగత్తెలుగా గుర్తించడం కామన్ అయింది. అలాంటిది లావుగా ఉన్నవారిని ఏ మాత్రం పట్టించుకోక పోగా, వారి మనసు గాయపడేలా కామెంట్లు చేస్తుంటారు. ప్లస్ సైజు అయితే ఏంటీ? సైజు గురించి పట్టించుకోకండి! అది అస్సలు మైనస్సే కాదు! ఒబేసిటిని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోండి! అంటోంది తన్వి గీతా రవిశంకర్. తన్వి లావుగా ఉన్నప్పటికీ నచ్చిన డ్రెస్లు వేసుకుంటూ ఫ్యాషన్ను ఎంజాయ్ చేస్తూ.. ఫ్యాటీ ఫ్యాషన్ వీడియోలను తన ఇన్స్ట్రాగామ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. డ్యాన్సర్, స్టైలిస్ట్, వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ అయిన తన్వి ముంబైలో పుట్టి పెరిగింది. చిన్నప్పటినుంచి బొద్దుగా ఉండే తన్విని అందరూ బాగానే ముద్దు చేసేవారు. ఆమెకు మొదటి నుంచి డ్యాన్స్ అంటే ఆసక్తి. మిగతా విద్యార్థుల కంటే తాన్వి బాగా డ్యాన్స్ చేస్తుందని టీచర్ కూడా చెప్పేవారు. దీంతో చిన్నతనం నుంచే తన్వికి తనపై తనకు ఒక నమ్మకం ఏర్పడింది. అంతేగాక తన శరీరం భారీగా ఉన్నప్పటికీ పన్నెండేళ్ల నుంచే ఫ్యాషన్గా ఉండడానికి ఇష్టపడేది. మొదట్లో ఇంజినీరింగ్ చదవాలనుకుంది. కానీ డాన్స్ అంటే మక్కువతో ఫైనలియర్లోనే ఇంజినీరింగ్ను వదిలేసి, ముంబైలో డ్యాన్స్ అకాడమీలో చేరి, డాన్స్ నేర్చుకుంది. దాంతోబాటు తనకు ఫ్యాషన్ మీద కూడా ఆసక్తి ఉన్న ఉండడంతో ఫ్యాషన్ డిగ్రీ చదివింది. అయితే అక్కడా ఆమె శరీరాకృతి గురించి కామెంట్లు తప్పేవి కాదు. అయితే, అవేమీ లెక్క చేయకుండా నచి్చన డ్రెస్లు వేసుకుంటూ, వాటిలోనే అందంగా కనిపిస్తూ ఆత్మవిశ్వాసంతో అందరి నోళ్లు మూయించింది. శరీరాన్ని చూసి చిన్నబుచ్చుకోవద్దు..దాన్ని సెలబ్రేట్ చేసుకోండని చెబుతోన్న తన్వి మాటలు భారీకాయులెందరికో స్ఫూర్తిదాయకం. ఆ మాటలు వినకండి.. కడుపునిండా తినకండి, నెయ్యి వేసుకోవద్దు, చిప్స్ తినొద్దు. ఇలాంటి మాటలు అస్సలు వినకండి. వీటిని విన్నారంటే ఆహారాన్ని ప్రసాదంలాగా తినాల్సి వస్తుంది. మా అమ్మ తరపున వాళ్లు సన్నగా ఉంటే, నాన్న తరపు వాళ్లు బొద్దుగా ఉండేవాళ్లు. నేను వాళ్ల కమ్యూనిటీలో చేరాను. చాలామంది లావుగా ఉన్నవాళ్లను చూసి వీళ్లు అతిగా తింటారు, శరీరానికి వ్యాయామం ఉండదు. బద్దకంగా తయారవుతారు అంటారు. అది నిజం కాదు. ఇన్స్టా స్టైలిస్ట్గా స్కూలు, కాలేజీలో ఎక్కడా నేను నా శరీరాన్ని గురించి సిగ్గుపడింది లేదు. లావుగా ఉన్నానని ఫీల్ అవ్వలేదు. అందుకే ఇన్స్ట్రాగామ్ అకౌంట్ను ఎంతో ధైర్యంగా క్రియేట్ చేసాను. ఇండియాలో దొరికే బ్రాండెడ్ డ్రెస్లు వేసుకుని ఇన్స్టాలో పోస్టు చేసేదాన్ని. జీన్స్, బికినీ, షార్ట్స్’, చీరలతోపాటు దాదాపు అన్నిరకాల డ్రెస్లు వేసుకుని ఫొటోలు అప్లోడ్ చేసేదాన్ని. అంతేగాక లిప్స్టిక్, ఐలైనర్, ఫౌండేషన్, షూస్, మ్యాచింగ్ జ్యూవెలరీ వేసుకునేదాన్ని. నా పోస్టులకు చాలా అభినందనలు వచ్చేవి. సెలబ్రేట్ చేసుకోండి! మీరు ఊబకాయం, అధిక బరువుతో ఉన్నారని ఇబ్బంది పడొద్దు. బరువు ఎక్కువగా ఉండడం వల్ల మీ శరీరంలో ఏదో లోపించిందని కాదు. సన్నగా ఉన్నవారిలాగే మీరు అన్ని చేయగలరు. ఫ్యాటీగా ఉన్నప్పటికీ ఫిట్గా, యాక్టివ్గా హెల్దీగా ఉండేందుకు ప్రయతి్నంచాలి. దీనివల్ల మిమ్మల్ని చులకన చేసి మాట్లాడే సమాజం కామెంట్ చేయడానికి ఆలోచిస్తుంది. లావుగా ఉన్న శరీరం గురించి ఫీల్ కాకుండా ప్రతిరోజూ ‘‘ఐయామ్ ఓకే, ఐయామ్ వర్త్ ఇట్’’ అని చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ వ్యక్తిత్వాన్ని రంగులమయం చేసుకుని డైలీ సెలబ్రేట్ చేసుకోండి. నిజంగా ఇలాంటి ప్రేరణ కలిగించే వారు ఉంటే ఎలా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నామనే భావన కలుగుతుంది. -
ఏం చేసినా బరువు తగ్గడం లేదా.. తప్పు మీది కాదు బ్యాక్టీరియాది
సియాటెల్/వాషింగ్టన్: ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతకీ ఫలించడం లేదా? కడుపు కట్టుకున్నా.. రకరకాల వ్యాయామాలు చేస్తున్నా.. ఎంతకీ బరువు తగ్గడం లేదా? అయితే తప్పు మీది కాకపోవచ్చు. మీ జీర్ణ వ్యవస్థలో తిష్టవేసుకున్న కొన్ని రకాల బ్యాక్టీరియా మీరు బరువు తగ్గకుండా అడ్డుకుంటూ ఉండవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రయత్నపూర్వకంగా బరువు తగ్గిన.. తగ్గని వారి పేవుల్లోని సూక్ష్మజీవులను పరిశీలించడం ద్వారా ఈ విషయం స్పష్టమైంది. అమెరికాలోని సియాటెల్ కేంద్రంగా పనిచేస్తున్న సిస్టమ్స్ బయాలజీ అనే సంస్థ ఇటీవల ఒక పరిశోధన నిర్వహించింది. బరువు తగ్గాలని నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్న సుమారు వంద మందితో ఈ పరిశోధన జరిగింది. వీరిలో 50 మంది ఆరు నుంచి పన్నెండు నెలల్లోపు శరీర బరువులో ఒక శాతం తగ్గిన వారు కాగా... మిగిలిన వారు ఏమాత్రం బరువు తగ్గనివారు. రక్తం, మలం, జన్యుపదార్థాలను క్షుణ్ణంగా విశ్లేషించినప్పుడు రెండు వర్గాల వారి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నట్లు గుర్తించారు. మన జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని పులియబెట్టడం ద్వారా జీర్ణం చేసేందుకు అనువుగా అభివృద్ధి చెందిందని, అదే సమయంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం కూడా బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్టియన్ డైనర్ తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారు పిండి పదార్థాలను శరీరం శోషించుకోగల చక్కెరలుగా మలచుకోవడంలో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారన్నారు. బ్యాక్టీరియా పెరుగుదల మందగిస్తే తిన్న ఆహారంలోని పీచుపదార్థం పులిసేందుకు ముందుగానే చక్కెరలుగా మారిపోయి రక్తంలోకి చేరిపోతాయని, ఫలితంగా బరువు తగ్గడం అసాధ్యంగా మారుతుందని వివరించారు. ఊబకాయులు ఒకొక్కరికీ వేర్వేరు చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. -
Weight Loss: పాలతో అవిసె గింజలు, అరటిపండు కలిపి తింటే..
Rajgira: దాదాపు 10 నుంచి 12 గంటల విరామం తరువాత ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము. బ్రేక్ఫాస్ట్లో తీసుకునే పోషకాలు బరువును నియంత్రణలో ఉంచడంలోనూ, మధుమేహం, రక్తపీడనాన్ని అదుపులో ఉంచడంలోనూ తోడ్పడతాయి. అందువల్ల రాజ్గిరా లేదా రమదానా అని పిలిచే మిల్లెట్స్ను బ్రేక్ఫాస్ట్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు అందుతాయి. వీటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల రక్తపీడనం, రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. పాలతో గుమ్మడి గింజలు, అవిసె గింజలు, అరటిపండుతో కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు. ప్రోటీన్, పీచుపదార్థం అధికంగా ఉండడం వల్ల ఇవి తింటే కడుపునిండిన భావన కలుగుతుంది. దీంతో అధిక బరువు కూడా తగ్గుతుంది. చదవండి: ఆ సమయంలో ‘అలోవెరా’ అస్సలు వద్దు! Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!! -
పని చేస్తున్న చోటే తింటే చాలా ప్రమాదమట..!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో అందరూ వర్క్ ఫ్రం హోంకే పరిమతమయ్యరు. చాలామంది దీనికే అలవాటు పడిపోయారు. అయితే కొన్ని నెలలుగా ఆఫీసులు, పరిశ్రమలు మళ్లీ తెరవడంతో అందరూ ఆఫీసులకి వెళ్లడం మొదలైంది. ఇన్నాళ్లు వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంటి వాతవరణాన్ని ఆఫీస్ మాదిరిగాసెట్ చేసి పనులు చేసుకున్నారు. ఎప్పుడేతే బాస్లు ఆఫీస్లకు రమ్మని చెప్పారో అక్కడి వాతావరణానికి అలవాటుపడటానికీ, యథాస్థితికి రావడటానికీ చాలామంది ఇబ్బంది పడుతున్నారట. ఎందుకంటే మన ఇల్లు కాబట్టి మనకు నచ్చిన విధంగా, ఎలా కావల్సితే అలా ఉండేవాళ్లం.. తినేవాళ్లం. కానీ ఆఫీసులో అలా తినడానికి.. ఉండటానికి కుదరదు. క్యాంటీన్కు వెళ్లాల్సిందే. అయితే అలా వెళ్లడానికి బద్దకించి.. కొందరు కూర్చున్న దగ్గరే తింటున్నారట. కానీ ఇలా పని చేసే దగ్గరే తింటే అది మన ఆరోగ్యం మీద రకరకాల దుష్ప్రభావాలు చూపుతుందంటున్నారు నిపుణులు. ఆ దుష్ప్రభావాలు ఏంటంటే.. తెలియకుండానే ఎక్కువ తినేస్తాం.... వర్క్ ప్లేస్లో తినేటపుడు ఒక చేతిని కీబోర్డు పై ఉంచి.. మరొక చేత్తో స్పూన్ పట్టుకుని తినడం వల్ల ఎంత తింటున్నమో? ఏమి తింటున్నామో గమనించకుండా తినేస్తాం. దీని వల్ల ఎక్కువ కేలరీలు మన శరీరంలో చేరి ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. లేదా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. (చదవండి: మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్!) గబగబ తినేయడం.... వర్క్ హడావిడలో గబగబ తినేయడంతో మధ్య మధ్యలో గాలిని మింగేస్తాం, నీళ్లు తాగేస్తుంటాం. దీని వల్ల కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ ట్రబుల్ సమస్య ఎదురవుతుంది. అంతేకాదు ఒక్కోసారి అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమయానుగుణంగా తినడం...... సమయానుగుణంగా తినకపోవటం చాలా మంది చేసే అతి పెద్ద తప్పు. వర్క్ ఎక్కువగా ఉందనో లేక ఇతరత్ర కారణాల వల్ల చాలా మంది టైమ్కి తినరు. ఇది మన జీర్ణవ్యవస్థ మీద అత్యంత దుష్ప్రభావం చూపుతుంది. అంతేకాదు, ఎసిడిటీ, అల్సర్, వంటి రకరకాల వ్యాధుల భారిన పడే అవకాశాలు ఎక్కుగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరూ ఇంతలా కష్టపడి పనిచేసేది కుటుంబం కోసమే కదా. విరామం తీసుకుని నిదానంగా తింటే పని ఒత్తిడి నుంచి ఉపశమనం దొరికనట్టు ఉంటుందీ, మళ్లీ మరింత వేగంగా, ఉత్సహంగా పనిచేయగలిగే శక్తి లభిస్తోంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి బ్రేక్ తీసుకుని నిదానంగా, టైంకి బోజనం చేయడం వల్ల మానసికంగానూ, శారీరకంగానూ ఆరోగ్యగంగా ఉంటాం. అప్పుడే మనం, మన ఫ్యామీలీతో ఉల్లాసంగా గడపగలం. కాబట్టి క్యాంటీన్ ఏరియాకు వెళ్లి తినడం మేలు. (చదవండి: పట్టాలపై మతిస్థిమితం లేని మహిళను కాపాడిన పోలీస్) -
పురుషుల్లో కంటే మహిళల్లోనే ఉబకాయం పెరుగుతోంది..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళల్లో ఊబకాయం పెరిగిపోతోంది. పురుషుల్లో కన్నా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. నాలుగవ జాతీయ కుటుంబ సర్వేతో పోలిస్తే అయిదవ సర్వేలో మహిళల్లో ఈ సమస్య పెరిగింది. నాలుగవ సర్వేలో 33.2 శాతం మహిళల్లోనే ఉండగా ఆ తర్వాతి సర్వేకు వచ్చేసరికి ఇది 36.3 శాతానికి పెరిగింది. అయితే.. అదే సమయంలో పురుషుల్లో మాత్రం ఈ తీవ్రత 33.5 శాతం నుంచి 31.3 శాతానికి తగ్గింది. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్గా.. పట్టణాల్లోనే ఊబకాయులు ఎక్కువ నిజానికి వయస్సు, ఎత్తు ఆధారంగా ప్రతీ మనిషి ఎంత బరువు ఉండాలన్నది నిర్దేశిస్తారు. ఇలా నిర్దేశిత బరువు కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఊబకాయంగా గుర్తిస్తారు. ప్రధానంగా.. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లోని మహిళలు, పురుషుల్లోనే ఎక్కువ ఊబకాయం ఉన్నట్లు ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ మహిళల్లో 32.6 శాతం ఊబకాయ సమస్య ఉంది. అదే పురషుల విషయానికొస్తే.. పట్టణాల్లో 37.7 శాతం, పల్లెల్లో 28.0 శాతంగా ఉంది. ఒక్క కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల గతం కన్నా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగినట్లు సర్వే పేర్కొంది. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా.. కొబ్బరి ప్రయత్నించండి! అవగాహన లేకపోవడమే.. వ్యాయామంపై చాలామంది మహిళలకు అవగాహన తక్కువ. దీంతో పాటు బిడ్డలను కన్నాక వారిలో శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల లోపాలు వంటివి సమస్యలుగా మారతాయి. ఇలాంటి సమయంలో వారి శరీరంలో మార్పువచ్చి బరువు పెరుగుతుంటారు. దీన్ని అధిగమించాలంటే శారీరక వ్యాయామం చేయాల్సిందే. కొత్త తరం అమ్మాయిలు, మహిళలు వ్యాయామంపై అవగాహనతో ఉంటున్నారు. – డా. విద్యాసాగర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
బరువు తగ్గేందుకు భరోసా!
-
వయసు రెండేళ్లు, బరువు 45 కిలోలు, దీంతో...
న్యూఢిల్లీ: ఆ పాప వయసు కేవలం రెండు సంవత్సరాలు. కానీ బరువు మాత్రం ఏకంగా 45 కేజీలు. సాధారణంగా, ఆ వయస్సు పిల్లల బరువు 12-15 కిలోలు. కానీ ఖ్యాతి వర్షిణి ఊబకాయంతో తీవ్రంగా బాధపడుతూ, అడుగులు వేయలేకపోయేది. సరిగ్గా పడుకోవడమూ కష్టమైపోయింది. దీంతో ఆ పాపకి ఒంట్లోంచి కొవ్వుని బయటకు తీసే అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఢిల్లీలోని పత్పర్గంజ్లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు ఈ శస్త్ర చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. బేరియాట్రిక్ సర్జరీతో ఆకలి మందగించి తీసుకునే ఆహారం తగ్గిపోతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. ‘‘ఖ్యాతి వర్షిణి పుట్టినప్పుడు సాధారణంగానే రెండున్నర కేజీల బరువుంది.. కానీ ఆ తర్వాత చాలా త్వరగా బరువు పెరిగిపోయింది. 6 నెలలు వచ్చేసరికి 14 కేజీలు ఉన్న ఆ పాప రెండేళ్లకి 45 కేజీలకు చేరుకుంది. అధిక బరువు కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుండడంతో రిస్క్ తీసుకొని సర్జరీ చేయాల్సి వచ్చింది’’అని పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ మన్ ప్రీత్ సేథి వివరించారు. దేశంలో బరువు తగ్గించే శస్త్రచికిత్స చేయించుకున్న అతి పిన్నవయస్కురాలు ఖ్యాతియేనని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స జరిగిన ఐదు రోజుల తర్వాత, ఖ్యాతి పరిస్థితి బాగా మెరుగు పడిందని, ప్రధాన లక్షణాలలో ఒకటైన గురక పూర్తిగా ఆగిపోయిందని మత్తుమందు నిపుణుడు డాక్టర్ అరుణ్ పురి చెప్పారు. అలాగే ఊబకాయంతో బాధపడుతున్నఇతర పిల్లలకు భవిష్యత్తులో ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి మార్గం మరింత సుగమమైందని \చెప్పారు. -
లాక్డౌన్కు తిరిగిచ్చేయాలి.. లేకుంటే లావైపోతాం!
కరోనా వచ్చినప్పటి నుంచి లాక్డౌన్లు, వర్క్ ఫ్రం హోమ్లు మొదలయ్యాయి. బయట తిరగడం తగ్గిపోయింది. శరీరానికి అంతో ఇంతో ఎక్సర్సైజ్ ఆగిపోయింది. ఇది ఇలాగే ఓ ఐదేళ్లు కొనసాగితే ఏమవుతుందో తెలుసా?.. తెల్లగా పాలిపోయిన చర్మం నుంచి కోడిగుడ్డులాంటి షేప్లోని శరీరం వరకు చాలా మార్పులు జరుగుతాయట. ఓ ఫార్మా కంపెనీ, కొందరు డాక్టర్లు సర్వే చేసి ఈ అంచనాలు వేశారు. ఇప్పటికే అలాంటి పరిస్థితి మొదలైందనీ తేల్చేశారు. అసలు సమస్య ఏమిటో, ఎలా బయటపడాలో సూచించారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఇల్లు కదలక.. ఏడాదిన్నర ఓ మహిళ ఉదాహరణగా.. లాక్డౌన్, వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు, ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా ఉండిపోవడం వంటివి లైఫ్స్టైల్, అలవాట్లలో గణనీయ మా ర్పులు తెచ్చాయి. శరీరానికి వ్యాయామం తగ్గింది. ఉద్యోగాలు, వ్యాపారాలపై ఆందోళన పెరిగింది. శరీరానికి సూర్యరశ్మి తగలడమే గగనమైపోయింది. భవిష్యత్తులో వీటిన్నింటి ప్రభా వం ఎంతగా ఉందన్న దానిపై లాయ్డ్ ఫార్మసీ సంస్థ అధ్యయనం చేయించింది. తమకు అనుబంధంగా పనిచేస్తున్న వైద్యుల వద్దకు వచ్చిన పేషెంట్లు, వారి ఆరోగ్య సమస్యలు, వాటికి కారణాలను విశ్లేషించి నివేదికను రూపొందించింది. ఓ మహిళను ఉదాహరణగా తీసుకుని, ఎలా మారిపోవచ్చో అంచనా వేసింది. ఎలాంటి మార్పులు రావొచ్చు, దానికి ఏమేం కారణం కావొచ్చన్నది వివరించింది. ఆ నివేదిక ప్రకారం.. వచ్చే సమస్యలు.. సోఫాల్లో, బెడ్పై అడ్డదిడ్డంగా గంటలు గంటలు కూర్చోవడం పెరిగింది, నడక బాగా తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్నవాళ్లు గంటలకు గంటలు కదలకుండా కూర్చుండిపోతున్నారు. దీని వల్ల శరీర ఆకృతిలో మార్పు వస్తోంది. భుజాలు వంగిపోతున్నాయి (గూనితనం). బరువు పెరిగి ఊబకాయం వస్తోంది. పొట్ట, వెనుకభాగం పెరిగి.. శరీరం కోడిగుడ్డు ఆకారంలోకి వచ్చేస్తోంది. శరీరానికి తగినంత సూర్యరశ్మి సోకక చర్మం పాలిపోవడం, శరీరానికి డి విటమిన్ అందక ఎముకలు, దంతా లు, కండరాలు బలహీనం కావడం, రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో సమస్య ఎక్కువగా ఉంటోంది. ఇంటికే పరిమితమైన చాలా మంది సహజ కాంతి లేకుండా ఎక్కువ సమయం ఎలక్ట్రిక్ లైట్ల వెలుతురులో గడపడం, ఎక్కువ సేపు టీవీ చూడటం పెరిగింది. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు కోసమో.. సినిమాలు, సోషల్ మీడియా, ఇతర టైం పాస్ కోసమో కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ పైనో గడపుతున్నారు. దీనివల్ల కంటి చూపు దెబ్బతింటోంది. నిద్రలేమికి దారితీస్తోంది. ఇంటికే పరిమితమైన చాలా మంది సహజ కాంతి లేకుండా ఎక్కువ సమయం ఎలక్ట్రిక్ లైట్ల వెలుతురులో గడపడం, ఎక్కువ సేపు టీవీ చూడటం పెరిగింది. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు కోసమో.. సినిమాలు, సోషల్ మీడియా, ఇతర టైం పాస్ కోసమో కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ పైనో గడపుతున్నారు. దీనివల్ల కంటి చూపు దెబ్బతింటోంది. నిద్రలేమికి దారితీస్తోంది. ఉద్యోగం, వ్యాపారంలో దెబ్బతినవచ్చనే ఆందోళనకుతోడు ఇంతసేపూ ఇంట్లోనే ఉండటం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. వెంట్రుకలు రాలిపోయే సమస్య బాగా పెరిగింది. ఒత్తిడి కారణంగా నిద్రలో పళ్లునూరడం వంటి సమస్యతో దంతాలు అరగడం, దెబ్బతినడం ఎక్కువైంది. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య పెరిగింది. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వల్ల వ్యక్తుల్లో లైంగిక సామర్థ్యం దెబ్బతింటోంది. ఆల్కాహాల్, సిగరెట్లు వంటి అలవాట్లు పెరగడం సమస్యను మరింతగా పెంచుతోంది. డాక్టర్ల సలహాలు.. వారంలో ఐదు రోజులు రోజూ కనీసం అరగంటకుపైగా కఠినమైన వ్యాయామాలు చేయాలి. మరో గంట పాటు ఇంటి ఆవరణలోనో, వీలున్న చోటనో వాకింగ్ చేయాలి. టీవీ చూస్తూనో, ఫోన్తో గడుపుతూనో ఏదో ఒకటి తింటూ ఉండే అలవాటు మానుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సేపు ఒకేచోట కూర్చు ని ఉండకుండా.. మధ్యలో లేచి ఒకట్రెండు నిమిషాలు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. ఇంటి ఆవరణలోనో, డాబా మీదనో రోజూ పొద్దున పది, ఇరవై నిమిషాల పాటు చర్మానికి ఎండ తగిలేలా నిలబడాలి. అవసరమైతే వైద్యుల సూచనల మేరకు విటమిన్ డి మాత్రలు వేసుకోవాలి. కరోనా నుంచి కోలుకోవడానికి విటమిన్ డి చాలా తోడ్పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో పగలంతా కూడా బయటి నుంచి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. రెండు మీటర్ల కన్నా ఎక్కువ దూరం నుంచి టీవీ చూడాలి. ఫోన్, కంప్యూటర్లలో నైట్ మోడ్ ఆప్షన్ వాడుకోవాలి, బ్లూ లైట్ తక్కువగా వచ్చేలా చూసుకోవాలి. వీలైతే యాంటీ గ్లేర్ అద్దాల వంటివి అమర్చుకోవాలి. ప్రతి పది, ఇరవై నిమిషాలకు ఒకసారి కాసేపు స్క్రీన్ నుంచి దృష్టి మరల్చి దూరంగా ఉన్న వస్తువులపై దృష్టి సారించాలి. వీలైనంత వరకు మానసిక ఆందోళన తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. సమస్యల గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడితే డిప్రెషన్ (కుంగుబాటు)కు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాస్త శారీరక శ్రమ, వ్యాయామం వంటివి మంచి నిద్రకు, మానసిక సమస్యల నియంత్రణకు తోడ్పడుతాయి. ఇష్టమైన వారితో మాట్లాడటం, సంగీతం వినడం, హాబీలు వంటివాటి వైపు మనసు మళ్లించుకోవాలి. వీలైనంత వరకు మానసిక ఆందోళన తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. సమస్యల గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడితే డిప్రెషన్ (కుంగుబాటు)కు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాస్త శారీరక శ్రమ, వ్యాయామం వంటివి మంచి నిద్రకు, మానసిక సమస్యల నియంత్రణకు తోడ్పడుతాయి. ఇష్టమైన వారితో మాట్లాడటం, సంగీతం వినడం, హాబీలు వంటివాటి వైపు మనసు మళ్లించుకోవాలి. తగినంతగా వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం, భాగస్వాముల తోడ్పాటు ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఆల్కాహాల్, సిగరెట్లు మానేయడం మంచిది. గుర్తించి, మార్చుకోవాల్సింది మనమే.. ఈ సమస్యలన్నీ వింటే.. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు, ఇంట్లోనే గడపడం మంచిది కాదా అన్న సందేహాలు వస్తాయి. అయితే లాక్డౌన్ వల్ల వచ్చిన మార్పులను.. తిరిగి లాక్డౌన్కు ఇచ్చేయాలని, లైఫ్స్టైల్ మార్పులను నియంత్రణలో ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘‘కరోనా ఆంక్షలు, లాక్డౌన్ల కారణంగా మనుషుల ప్రవర్తన, అలవాట్లలో చాలా పెద్ద మార్పు లు వచ్చాయి. మనుషుల్లో శారీరకంగా జడత్వం పెరిగింది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగడం వల్ల.. ఈ అలవాట్లు, ప్రవర్తన ఇలాగే ఎప్పటికీ ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ అలవాట్లు, ప్రవర్తన మంచివి కాదని గుర్తించి, సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టడం అత్యంత అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు..’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ కేరన్ సేయన్ స్పష్టం చేశారు. ఆఫీస్ తరహా సెటప్ ఉంటే బెటర్ వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు, ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్న వారు అలాగే కూర్చుని ఉండిపోకుండా.. మధ్యలో బ్రేక్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సోఫా, బెడ్ మీద కూర్చుని పనిచేయడం, క్లాసులు వినడం వంటివి చేయొద్దని.. ఆఫీసు/కాలేజీ తరహాలో కుర్చీ, టేబుల్ వంటి ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. -
బరువు తగ్గేందుకు పంటికి తాళం.. మరీ ఇంత క్రూరమా?
బరువు తగ్గటానికి చాలా మంది డైట్ కంట్రోల్ చేసుకుంటారు. కానీ స్వీట్లు లేదా మనకు ఇష్టమైన ఆహార పదార్థాలు కనిపిస్తే చాలు డైట్ను పక్కన పెట్టేస్తాం. ఆహారం తినకుండా నియంత్రించుకోలేని వారికోసం న్యూజిలాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధిపరిచారు. డైట్ నియంత్రించుకోవాలని అనుకునే వారి దంతాలకు ఈ పరికరాన్ని తగిలించుకుంటే చాలు మీరు చాలా నియంత్రణలో ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. డెంటల్ స్లిమ్ డైట్ కంట్రోల్ అని పిలిచే ఈ పరికరం దవడలోని పై దంతాలకు, కింది దంతాలను బోల్టు, అయస్కాంతం సాయంతో కలుపుతుంది. అప్పుడు నోటిని కేవలం 2 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే తెరవగలం. మాట్లాడటానికి లేదా గాలి పీల్చుకోవడానికి మాత్రమే వీలు కలుగుతుంది. దీంతో మనం ఏదైనా తినాలని భావించినా.. సాధ్యపడదు. పైగా ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకునే చాన్స్ ఉంటుంది. ఇలా డైట్ను నియంత్రించుకోవడం ద్వారా బరువు తగ్గించుకునేందుకు దోహదపడుతుందని యూనివర్సిటీ ప్రో–వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పాల్ బ్రంటన్ వివరించారు. ఒక్కసారి బరువు తగ్గాక ఈ పరికరాన్ని డీ యాక్టివేట్ చేయొచ్చని పేర్కొన్నారు. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవని, చాలా చౌకగా లభిస్తుందని, బరువు తగ్గే శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని తెలిపారు. వీరు చెబుతున్నది బాగానే ఉన్నా.. ఈ పరికరం గురించి యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించగానే విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతటి క్రూరమైన ఆవిష్కరణ ఎక్కడా చూడలేదంటూ మండిపడుతున్నారు. -
WHO Health Policy: ఉప్పుతో ముప్పు తప్పదు!
సాక్షి, అమరావతి: ఉప్పు లేని పప్పేమిటని మనం అంటుంటే ఉప్పు తింటే కొంపకు తిప్పలేనని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా ఆరోగ్య విధానపత్రంలో స్పష్టం చేసింది. మోతాదుకు మించి ఉప్పు తింటే గుండెజబ్బులు, ఊబకాయం, లివర్, మూత్రపిండాల వ్యాధులొస్తాయని ప్రకటించింది. పలు దేశాల్లో ప్రయోగాల అనంతరం ఈ విషయాన్ని పేర్కొంది. ప్యాక్డ్ ఫుడ్స్లో సోడియం ఎక్కువే.. అనేక సంపన్న దేశాలతో పాటు అల్పాదాయ దేశాల్లోనూ ఆహారంలో సోడియం బెడద ఉంది. బ్రెడ్, చిప్స్, తృణ ధాన్యాలతో తయారు చేసే ప్యాక్డ్ ఆహార పదార్ధాలు, ప్యాకింగ్ రూపంలో ఉండే మాంసం, జున్ను సహా పాల ఉత్పత్తుల నుంచి ఉప్పు ఎక్కువగా వస్తోంది. ఉప్పుకు మరోపేరే సోడియం క్లోరైడ్.. ఉప్పు రసాయన నామం సోడియం క్లోరైడ్. శరీరంలోని నీటి పరిమాణాన్ని సోడియం నియంత్రించే ఖనిజం. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక సోడియం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, గ్యాస్ట్రిక్ కాన్సర్, లివర్ సిరోసిన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రజలకు అవగాహన కలిగించాలి.. ఉప్పు ముప్పును తగ్గించేలా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రజలు రోజుకు 5 గ్రాముల ఉప్పు (2 గ్రాముల సోడియంతో సమానం) తినాలని డబ్ల్యూహెచ్వో సిఫారసు చేసింది. 2025 నాటికి 30 శాతం ఉప్పును తగ్గించాలన్నది 2013లో ప్రపంచ దేశాలు పెట్టుకున్న లక్ష్యం. అయితే ఈ లక్ష్య సాధన దిశలో ప్రస్తుత ప్రపంచం లేనట్టుగా ఉందని ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి ఉప్పు వాడకాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది. షుగర్ వ్యాధి, గుండెజబ్బులు, కాలేయ వ్యాధులతో బాధ పడే వారే మన రాష్ట్రంలో ఎక్కువ. మనకు తెలియకుండానే మన పిల్లలకు చిప్స్, బ్రెడ్స్, కేకుల రూపంలో సోడియంను వంట్లోకి పంపిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతోనైనా ప్రజలు అప్రమత్తం కావాలి. మనం తినే అన్నం, కూరలలో కూడా ఎంతో ఉప్పు ఉంటుంది. అది సరిపోతుందని గమనించాలి. – డాక్టర్ విజయసారథి -
ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సమస్య ఒబెసిటీ. వ్యక్తుల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం వంటి అనేక కారణాలతో ఇప్పుడు ఇదొక జీవనశైలికి సంబంధించిన అంశంగా మారింది. అందరూ దీనిని కేవలం అధిక బరువుతోనే కొలుస్తుంటారు. అయితే ఇది అంతకు మించిన తీవ్రమైన పరిస్థితిగా పరిగణించి పూర్తి స్థాయి చికిత్స చేయాలి అంటున్నారు కేర్ ఆసుపత్రికి చెందిన డా.బిపిన్ సేథీ. రోజువారీ జీవనం మీద ఒబెసిటీ ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. హృద్రోగం, డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, కీళ్ల నొప్పులు.. ఇంకా అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాలతో పాటు కొన్ని రకాల కేన్సర్లకూ కారణమవుతుంది. కేవలం శారీరకమైనవే కాకుండా డిప్రెషన్, న్యూనతాభావం తదితర మానసిక సమస్యలకూ ఇది దోహదం చేస్తుంది. సరైన కారణం గుర్తించాలి ఒబెసిటీ విషయంలో వ్యక్తిగత బాధ్యతా రాహిత్యం, విల్పవర్ లోపించడం.. వంటివి చూపిస్తూ బాధితులపైనే పూర్తిగా నెపం వేస్తుంటారు. అలాగే కేవలం ఎక్కువ తినడం, వ్యాయామం లేకపోవడం వంటివి మాత్రమే ఒబెసిటీకి కారణం కావనేది అర్ధం చేసుకోవాలి. దీనికి జన్యుపరమైన సమస్యలతో పాటు పరిసరాలు, వాతావరణం, ప్రవర్తన... ఇవన్నీ కూడా కారణాల్లో ఉండొచ్చు.. ఒబెసిటీ కారణాల గురించి మనకు తక్కువ అవగాహన ఉంది. హార్మోనల్ కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా దీనిని సరైన రీతిలో అర్ధం చేసుకునే దశలోనే మనం ఉన్నాం. కాబట్టి త్వరపడి ఏదోఒక కారణాన్ని నిర్ధారించుకుని చికిత్స సరికాదు. చికిత్సకు నిర్ణీత వ్యవధి ఒబెసిటీ బాధితులు కూడా తామేదో హార్మోనల్ సమస్య అని భావిస్తూ సరైన క్రమపద్ధతిలో కాకుండా త్వరితంగా సమస్య నుంచి బయటపడే మార్గాలు వెతుకుతుంటారు. అది సరైంది కాదు ఈ సమస్య నుంచి కోలుకోవడానికి జీవిత కాలపు ఆరోగ్య నిపుణుల అవసరం ఉంటుంది. వ్యక్తులకు సంబంధించిన డైట్ మాత్రమే కాకుండా తినే ఆహారం, అలాగే వ్యాయామాలను పరిశీలించాల్సి ఉంది. నెగిటివ్ కేలరీ బ్యాలెన్స్తో పాటు ఇదొక దీర్ఘకాలికం కొనసాగాల్సిన ప్రక్రియ, అంతే తప్ప శరవేగంగా ఫలితాలను ఆశించడం, వెంటనే బరువు తగ్గాలని కోరుకోవడం, పెళ్లి వంటి వేడుకల కోసం హడావుడిగా సర్జరీ ప్లాన్స్ ఎంచుకోవడం వల్ల సరైన ఫలితం రాదు. తీవ్రతకు తగ్గ చికిత్స వ్యక్తిగత ఒబెసిటీ తీవ్రతపై ఆధారపడి దీనికి చికిత్స ఉండాలి. అలాగే వ్యక్తిగత ఆరోగ్య ప్రమాదాలు, మానసిక ప్రవర్తన శైలులు, మెటబాలిక్ క్యారెక్టరిస్టిక్స్లతో పాటు గతంలోని అధిక బరువు తగ్గించుకునే యత్నాలు వాటి ఫలితాలు కూడా దీనిలో పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత చికిత్సా పద్ధతులు అనుసరిస్తూ మల్టీ లెవల్ ఒబెసిటీ మేనేజ్మెంట్ నెట్వర్క్తో సమన్వయంతో పనిచేస్తే లక్ష్యం చేరుకోవడానికి వీలవుతుంది. ఒబెసిటీ మేనేజ్మెంట్లో నైపుణ్యం కలిగిన బృందం పనిచేయాలి. చికిత్సలో భాగంగా అన్ని రకాల ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. రోగి జీవనశైలికి, ప్రాధామ్యాలకు నప్పేలా దీనిని డిజైన్ చేస్తారు. మందుల వాడకాన్ని సమీక్షించడం, మార్పు చేర్పులు, పోషకాల సహకారం, శారీరక కార్యకలాపాలు పెంచడం, కౌన్సిలింగ్, రోగికి నప్పేదైతే బేరియాట్రిక్ సర్జరీ.. వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. పలువురు భావిస్తున్నట్టు ఇది ఒంటరిగా పోరాడే పరిస్థితి కాదు. వైద్య నిపుణుల పర్యవేక్షణ సహకారం అవసరం. - డాక్టర్ బిపిన్సేథీ, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ -
హాయిగా కూర్చునే బరువు తగ్గొచ్చు..
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కొందరు ఆడవారికి ఇంటిపనితో పాటు ఆఫీస్ ఒత్తిడి పెరిగిపోవడం లేదా శరీరంపై శ్రద్ధ తగ్గడంతో బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతూ ఉంటుంది. వేళకు మంచి ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం అందకపోవడం.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం.. ఇలా పలు కారణాలతో.. పొట్ట, నడుము, పిరుదులు, చేతులు, తొడలు.. ఇలా చాలా భాగాల్లో కొవ్వు పేరుకుపోయి.. చూడటానికి షేప్లెస్గా మారిపోతుంటారు చాలా మంది. అతి తక్కువ సమయంలో స్లిమ్గా, నాజుగ్గా మారాలంటే ఈ బ్యాగ్లో చక్కగా ఓ కుర్చీ వేసుకుని కూర్చుంటే సరి. అదే ఈ పోర్టబుల్ పర్సనల్ స్టీమర్ ప్రత్యేకత. చిత్రంలోని మెషిన్తో పాటు ప్రత్యేకమైన టెంట్, ఒక చైర్(చిత్రంలో గమనించవచ్చు) లభిస్తాయి. టెంట్ ఓపెన్ చేస్తే.. గుడారంలా ఒక మనిషి పట్టేంత వైశాల్యంతో పెద్దగా ఓపెన్ అవుతుంది. అవసరం లేనప్పుడు మడిచి గుండ్రటి రింగ్లా చిన్న బ్యాగ్లో పట్టేవిధంగా మార్చేసుకోవచ్చు. (అచ్చం దోమలు రాకుండా వాడే నెట్ టెంట్ మాదిరి ఫోల్డ్ చేసుకోవచ్చు). టెంట్ వాటర్ ప్రూఫ్ కావడంతోపాటు వాటర్ లీక్ కాకుండా ప్రొటెక్టివ్గా ఉంటుంది. దీనికి రెండు వైపులా జిప్ ఉంటుంది. ఇక స్టీమర్లో ఉన్న వాటర్ ట్యాంక్లో వాటర్ పోసుకుని దాని ముందు భాగంలో ఉన్న డిస్ప్లేలో ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. దీన్ని రిమోట్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. స్టీమర్కి, టెంట్కి కనెక్షన్ ఉంటుంది. లోపలికి ఆవిరి వెళ్తూ.. బాడీ మొత్తానికి స్పా అవుతుంది. దీనిలో స్పా చేసుకుంటే బరువు తగ్గడంతో పాటు.. జాయింట్ పెయిన్స్ తగ్గడం, మజిల్స్ స్టిఫ్గా మారడం, మానసిక ఒత్తిడి తగ్గడం.. రక్తప్రసరణ బాగా జరగడం, ఎనర్జీలెవల్స్ పెరగడం, చర్మం కాంతిమంతంగా మారడం వంటి పలు ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఈ స్టీమర్తో పాటు అదనంగా 2 కనెక్షన్ పైప్స్, ఒక ఫస్ట్ఎయిడ్ బాక్స్, క్యారీ బ్యాగ్ లభిస్తాయి. దీని ధర సుమారు 90 డాలర్లు. అంటే సుమారు 6,600 రూపాయలు. -
అధిక బరువు: మృత్యుమార్గంలో పయనించడమే
వాషింగ్టన్: ఒక వ్యక్తి ఉండాల్సిన దాని కంటే అధికంగా బరువు పెరుగుతుంటే అది మృత్యుమార్గంలో ప్రయణించడమేనని యూఎస్కు చెందిన ‘ప్లాస్’ మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో సుమారు పదివేలమంది స్థూలకాయం ఉన్నవారితో పాటు మూడు లక్షలమందికి పైగా సాధారణ బరువున్న వారిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ జర్నల్లో పేర్కొన్నారు. ఒకవేళ నేరుగా బరువే మరణాలకు కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు. చదవండి: కూల్డ్రింక్స్ తాగితే.. శరీరం చల్లబడుతుందా? -
కూల్డ్రింక్స్తో శరీరం చల్లబడుతుందా?
చల్లని పానీయాలు వేసవిలో మంచి ఉపశమనం కలగజేస్తాయనే అపోహతో మనం కూల్డ్రింక్స్ తాగుతుంటాం. వాటిని తాగగానే దాహం తీరుతుందనే దురభిప్రాయంతో చాలామంది నీటికి బదులుగా తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాల్లో రుజువైంది. పిల్లల్లో వీటి వల్ల ఊబకాయం వస్తుంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఉంది. కూల్డ్రింక్స్లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ దంతాలపై ఉండే అనామిల్ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫారిక్ యాసిడ్తో క్యాల్షియం మెటబాలిజమ్ సైతం దెబ్బతిని, ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయనే పరిశోధనల నివేదికలు ఉన్నాయి. పైగా కూల్డ్రింక్స్ను నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాలు (ప్రిజర్వేటివ్స్) వల్ల పిల్లల్లో విపరీత ధోరణులు పెరిగి మానసిక అనారోగ్యాలకు దారితీస్తుందని తెలిసింది. -
ఒళ్లు కరిగించే మధుమేహ మాత్ర!
ఊబకాయులకు ఓ శుభవార్త. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒళ్లు తగ్గడం లేదన్న మీ బెంగ త్వరలోనే తీరబోతోంది. ఎందుకంటే మధుమేహానికి వాడే సెమాగ్లుటైడ్ అనే మందు శరీరాన్ని తగ్గించేందుకు భేషుగ్గా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకలిని నియంత్రించే వ్యవస్థను తన అధీనంలోకి తీసుకోవడం ద్వారా ఈ మందు పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మందును వాడిన ఊబకాయుల్లో 33 శాతం మంది బరువు తగ్గారు. అది కూడా వారి శరీర బరువులో 20 శాతం వరకు తగ్గుదల నమోదు కావడం విశేషం. ఈ ప్రయోగంలో పాల్గొన్న వారందరూ వారానికి ఒకసారి సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ తీసుకోవడమే కాకుండా బరువు తగ్గేందుకు సాధారణంగా ఆచరించే పద్ధతులన్నింటినీ కొనసాగించారు. సెమాగ్లుటైడ్ అనేది ఆకలి భావనను తగ్గిచేందుకు ప్రకృతిలో లభించే జీఎల్పీ–1 హార్మోన్ మాదిరిగా ఉంటుంది. 2017లో దీన్ని బరువు తగ్గించేందుకూ ఉపయోగించొచ్చా? అన్నది పరిశీలించి సానుకూల ఫలితాలు సాధించారు కూడా. అప్పట్లో 28 మంది ఊబకాయులకు ఈ మందు ఇవ్వగా, ఆకలి తగ్గిపోయిన కారణంగా 12 వారాల తర్వాత వీరి శరీర బరువు సగటున 5 కిలోల వరకు తగ్గింది. ప్రస్తుతం మూడో దశ మానవ ప్రయోగాలు జరుగుతున్నాయి. 16 దేశాల్లోని 129 ప్రాంతాల్లో 2 వేల మందిపై ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. మొత్తం 68 వారాల పాటు ఈ ప్రయోగాలు జరగ్గా కొంతమందికి వారానికి ఒకసారి సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్, మరి కొంతమందికి ఉత్తుత్తి ఇంజెక్షన్ ఇచ్చారు. ఉత్తుత్తి ఇంజెక్షన్ ఇచ్చిన వారు సగటున 2.6 కిలోల బరువు తగ్గగా, బాడీ మాస్ ఇండెక్స్ కూడా 0.92 వరకు తగ్గింది. సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ తీసుకున్న వారు సగటున 15.3 కిలోల బరువు తగ్గారు. బీఎంఐ తగ్గుదల 5.54గా నమోదైంది. గుండెజబ్బుకు కారణాలైన మధుమేహం, రక్తపోటు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. -
వీడని భయం.. ఊబకాయం
మితివీురిన ఆహారం, జంక్ ఫుడ్ల వల్ల శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి హాని చేసే ఒక వ్యాధినే ఊబకాయంగా పిలుస్తారు. దీనినే స్థూలకాయం అని కూడా అంటారు. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ధూమపాన వ్యసనం, ఒత్తిళ్లు, కొన్నిసార్లు వారసత్వం వల్ల కూడా దీనిబారిన పడొచ్చు. అంటే ఒక వ్యక్తి తన ఎత్తు, వయస్సుకు తగ్గట్లుగా ఉండాల్సిన బరువుకు మించితే దీనిని అనారోగ్య సమస్యగా గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం (గురక), కీళ్లకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన కేన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పనిభారం అధికం కావడంతో ఒత్తిడికి గురవుతుంటారు. ఊబకాయానికి తోడు ఆర్థిక సమస్యలు, నిద్రలేమి, సామర్థ్యానికి మించి పనిచేయడం వలన పలువురు రక్తపోటు బారిన పడుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు పెరగడం అంతిమంగా హృదయంపై ప్రభావం చూపనుంది. ఉదయం, సాయంత్రం వేళ కచ్చితంగా కొంత సమయం వ్యాయామం చేయాలని, చెమట పట్టేలా నడవడం, పరిగెత్తడం ద్వారా కొవ్వు కరిగించి బరువు తగ్గాలని వైద్యులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ ప్రభావం అధిక కేలరీలు కలిగి ఉండే ఆహారంగా చెప్పుకునే జంక్ఫుడ్ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతోంది. పెద్దల పరిస్థితీ అంతే. సాచ్యురేటెడ్ కొవ్వులు, ఉప్పు, పంచదార పాళ్లు మోతాదుకు మించి ఉండే చిరుతిళ్లు తినడం ప్రమాదకరం. అంటే బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేకులు, నూడిల్స్, చిప్స్, తీపి ఉండలు, పంచదార పెట్టిన సీరల్స్, ఫ్రైడ్, ఫాస్ట్ ఫుడ్, కార్బొనేటెడ్ డ్రింక్స్, రెడిమేడ్ కూల్ డ్రింక్స్ లాంటివి జంక్ ఫుడ్గానే చెప్పొచ్చు. ఇంకా మసలా చాట్, పకోడీలు, బజ్జీలు, టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్ డింగ్–డాంగ్స్ లాంటివి కూడా ఎక్కువ తీసుకోవద్దు. మోతాదుకు మించి తినొద్దు పిల్లలు టీవీ ముందు కూర్చొని చిరుతిళ్లు ఎక్కువగా తింటుంటారు. ఈ పద్ధతిని మాన్పించాలి. పెద్దలు వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలి. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఫైబర్ ఉన్న పదార్థాలు తినాలి. మాంసాహారం, ధూమపానం, మద్యపానం అలవాట్లు మానాలి. – డాక్టర్ భూక్యా నాగమణి, సుజాతనగర్ పీహెచ్సీ -
‘మేడ్ ఇన్ ఇండియా’ సైకిల్పై బ్రిటన్ ప్రధాని
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. కరోనాపై పోరులో భాగాంగా స్థూలకాయానికి (ఒబెసిటీ)కి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జీబీపీ 2 బిలియన్ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్ను ప్రారంభించిన బోరిస్.. దానిలో భాగంగా నాటింగ్హామ్లోని బీస్టన్ వద్ద ఉన్న హెరిటేజ్ సెంటర్లో సైకిల్ తొక్కారు. 56 ఏళ్ళ బోరిస్కి సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టమట. హెల్త్, ఫిట్నెస్ కోసం సైక్లింగ్ చాలా మంచిదని ఆయన అంటున్నారు. బ్రిటన్లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నవారిలో చాలామంది స్థూలకాయులేనని, మితిమీరిన శరీర బరువు వల్ల వారు మృత్యువాత పడుతున్నారని కొందరు నిపుణులు ఇటీవల తేల్చారు. దాంతో ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న ఉద్దేశంతో బిట్రన్ ప్రభుత్వం ఇప్పటికే ఆహార పదార్థలపై ఇచ్చే వన్ ప్లస్ వన్ ఆఫర్ను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా బోరిస్ ఈ సైక్లింగ్ డ్రైవ్ను ప్రారంభించారు. ప్రధాని తొక్కిన సైకిల్ ఇండియాకు చెందిన హీరో మోటార్స్ కంపెనీది. వికింగ్ ప్రో బైక్ పేరుతో ఆ సైకిల్ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మాంచెస్టర్లో సైకిల్ను డిజైన్ చేశారు. (ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక) సైకిల్ తొక్కడాన్ని ఇష్టపడే బోరిస్.. దేశంలో వేల కిలోమీటర్ల బైక్ లేన్లను ఆవిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు. కొత్త ఫిట్నెస్ స్ట్రాటజీలో భాగంగా ప్రభుత్వం సైకిల్ తొక్కేవారికి ప్రత్యేక లేన్ వేయనున్నట్లు తెలిపింది. అంతేకాక నిత్య జీవితంలో సైక్లింగ్ను ప్రొత్సాహించడానికి గాను రవాణా కేంద్రాలు, పట్టణం, నగర కేంద్రాలు, ప్రభుత్వ భవనాల వద్ద మరిన్ని సైకిల్ రాక్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇళ్లలో పార్కింగ్ స్థంల లేని వారి కోసం వీధుల్లో రాక్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సైక్లింగ్ వల్ల ఫిట్గా ఉండటమే కాక గాలి నాణ్యత మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరతాయన్నారు బోరిస్. (ఒక్క క్షణం.. అందరినీ పిచ్చోళ్లను చేశాడు) -
కరోనా, లాక్డౌన్ ఇచ్చిన బహుమానాలివే..
సాక్షి, హైదరాబాద్: మాయదారి కరోనా మనుషుల ఆరోగ్యాలను అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ సోకిన వారు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడతారని కొన్ని అధ్యయనాలు చెబుతుంటే... దీని బారినపడని వారూ పరోక్షంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఎయిమ్స్ ప్రొఫెసర్లు జరిపిన సర్వే వివరాలను ‘డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిన్డ్రోమ్ జర్నల్’ ప్రచురించింది. దీని ప్రకారం కరోనా, లాక్డౌన్ కారణంగా దేశానికి మధుమేహం, ఊబకాయం ముప్పు పొంచి ఉందని స్పష్టమవుతోంది. లాక్డౌన్ సమయంలో జనం ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడం, తగిన వ్యాయామం చేయకపోవడం, మితం లేని ఆహారం తీసుకున్న కారణంగా 40 శాతం మంది బరువు పెరిగారని తేలింది. వీరిలో 7 శాతం మంది డయాబెటిస్ (షుగర్) వ్యాధి బారినపడే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ సర్వేను వయసు, లింగం, బరువు, కుటుంబ చరిత్ర, వ్యాయామ పద్ధతుల ఆధారంగా శాస్త్రీయంగా నిర్వహించినట్టు జర్నల్లో పేర్కొన్నారు. జాగ్రత్త సుమా.. లాక్డౌన్ సమయంలో 38 శాతం మంది మాత్ర మే వారానికి మూడ్రోజుల పాటు 30–45 నిమిషాల సమయం వాకింగ్కు కేటాయించినట్టు చె ప్పారని సర్వే తెలిపింది. ఊబకాయం ఉన్న వారి కి కరోనా సోకితే మరణాల రేటు పెరిగే అవకాశం ఉందని, వెంటిలేటర్ చికిత్స వరకు వెళ్లే అవకాశం ఉందని గతంలో జరిపి న అధ్యయనాలు వెల్లడించాయని, ఇప్పు డు లాక్డౌన్ కారణంగా బరువు పెరిగిన వారు కరోనా సోకకుండా జాగ్రత్త గా ఉండాలని సర్వే హెచ్చరించింది. రక్త పరీక్షలు మేలు 30 ఏళ్లు దాటిన వారు రక్తంలో గ్లూకో జ్ పరీక్ష చేయించుకుంటే మేలని సర్వే సూచించింది. అసలు రక్త పరీక్షలు చేయించుకోని వారు, నియంత్రణలో లేని షుగర్ ఉన్నవా రు కరోనాకు గురయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. బరువు పెరిగారు.. లాక్డౌన్ సమయంలో వంద మంది నాన్ డయాబెటిక్ రోగులను పరిశీలించగా అందులో 40 శాతం మంది బరువు పెరిగారు. 41 శాతం మంది బరువులో ఎలాంటి మార్పు లేకపోగా, 19 శాతం మంది బరువు తగ్గారు. 0.1–5 కిలోల బరువు పెరిగినవారు 40 శాతం ఉంటే, ఏకంగా 16 శాతం మంది. 2.1–5 కిలోల బరువు పెరిగారు. ఇక, వీరిలో 7 శాతం మందికి డయాబెటిస్ ముప్పు పొంచి ఉందని సర్వే వెల్లడించింది. లక్షణాలు ఇప్పుడే కనిపించవు బరువు పెరిగిన వారు డయాబెటిస్కు గురయ్యే అవకాశం ఎక్కువ. కనీసం 100లో 7% మందికి షుగర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వారికి ఆ లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో షు గర్ బారిన పడడం ఖాయం. – డాక్టర్ అనూప్ మిశ్రా, ఎయిమ్స్ ప్రొఫెసర్ -
పోలీసుల్లో చాలామందికి కరోనా ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: ‘పోలీసు సిబ్బందికి షిఫ్ట్లు..ప్రతి వారం వీక్లీ ఆఫ్లు’ – ఏళ్లుగా వినిపిస్తున్న ఈ మాటలు నీటి మూటలే అయ్యాయి. ఆ ప్రభావం ప్రస్తుతం నెలకొన్న ‘కరోనా ఫీవర్’పై తీవ్రంగా కనిపిస్తోంది. ఆరోగ్యవంతుల కంటే ఊబకాయం సహా ఇతర రుగ్మతలతో కూడిన వారికి కరోనాతో ముప్పు ఎక్కువని నిపుణులు, వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నమరణాలను పరిశీలిస్తే ఈ విషయం నిజమేనని స్పష్టమవుతోంది. పోలీసు విభాగాన్ని తీసుకుంటే గరిష్టంగా 30 శాతం మంది పూర్తి ఫిట్నెస్తో ఉండరు. అనేక మందికి ఊబకాయం, షుగర్, బీపీ, శ్వాసకోస సమస్యలు, హృద్రోగం తదితరాలలో ఇబ్బంది పడుతున్న వారే. ఇలాంటి పరిస్థితుల్లో నగర పోలీసు విభాగాన్ని కరోనా వైరస్ చుట్టేస్తుండటం పోలీసులతో పాటు వారి కుటుంబాలనూ కలవరపాటుకు గురిచేస్తోంది. సోమవారం నాటికి సిటీ పోలీసు విభాగంలో పాజిటివ్ కేసుల సంఖ్య 125 దాటింది. ఇప్పటి కరోనా పరిస్థితులు పక్కన పెట్టినా...పోలీసు సిబ్బందిలో ఈ రకమైన అనారోగ్యకర పరిస్థితి నెలకొనడానికి అనేక కారణాలున్నాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర శాఖలతో పోలిస్తే ఫిట్నెస్ అనేది పోలీసు వారికి అత్యంత కీలకమైన అంశం. ఎంపిక, శిక్షణ, విధి నిర్వహణ ఇలా అన్ని స్థాయిల్లోనూ ఇది పరిగణలోకి తీసుకుంటారు. ఎంపిక, శిక్షణ దశల్లో ఉన్న దారుఢ్యం ప్రస్తుతం 15 శాతం మందిలోనూ కనిపించట్లేదు. అప్పట్లో ఉన్న శ్రద్ధ, సమయం లేకపోవడంతో పాటు పనితీరు కూడా దీనికి దోహదం చేస్తోంది. 30 శాతం మందికీ వర్తించని బీఎంఐ... ఎంత ఎత్తు ఉన్న వ్యక్తి ఎంత బరువు ఉండాలనే దానికి సంబంధించి అంతర్జాతీయ గణన ఉంది. దీన్నే సాంకేతికంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అంటారు. పోలీసు విభాగంలో కానిస్టేబుల్గా దరఖాస్తు చేసుకునే వారు పురుషులైతే కనిష్టంగా 167.6 సెంమీ, మహిళలైతే 152.5 సెంమీ ఎత్తు ఉండాలి. (రిజర్వేషన్ ప్రకారం కొందరికి మినహాయింపులు ఉంటాయి.) దీని ప్రకారం చూస్తే 58.3–68.2 కేజీల మధ్య మాత్రమే బరువు కలిగి ఉండాలి. ఎంపికయ్యే వారి గరిష్ట ఎత్తు 182.8 సెంమీ (ఆరు అడుగులు) అనుకున్నా... 63.6–79.5 కేజీల మధ్య మాత్రమే ఉండటం బీఎంఐ ప్రకారం తప్పనిసరి. అయితే ప్రస్తుం నగర కమిషరేట్ పరిధిలో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిలో కనిష్టంగా 30 శాతం మంది కూడా బీఎంఐ ప్రకారం ఎత్తుకు తగ్గ బరువుతో ఫిట్గా ఉండరన్నది అధికారులే అంగీకరిస్తున్నా వాస్తవం. 60 శాతం మంది అధిక బరువు, మరో పది శాతం మంది ఒబేసిటీతో బాధపడుతుంటారని వారే చెప్తున్నారు. ఈ కారణంగానే అనేక మంది వివిధ రకాలైన రుగ్మతల పాలవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్థితికి కారణాలు అనేకం... పోలీసు ఉద్యోగం కోసం ఎంపికయ్యే, శిక్షణలో ఉన్నప్పుడు తీసుకున్నంత ఆరోగ్య శ్రద్ధ విధుల్లో చేరిన తరవాత తీసుకోకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోపక్క సమయం, సందర్భం లేకుండా బందోబస్తు, ఇతర విధులు నిర్వర్తించే సిబ్బందికి ఆహారం, నిద్ర సరైన సమయానికి సాధ్యం కావు. అన్ని రోజుల్లోనూ ఒకే సమయంలో తీసుకోవడం కూడా అసంభవమే. ఇది పొట్ట, ఊబకాయం పెరగడంతో పాటు అనేక ఇతర రుగ్మతలకూ మూలంగా మారుతోందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఇబ్బందులతో పాటు మహిళా సిబ్బంది విషయంలో మరికొన్ని కారణాలతో ఊబకాయం సమస్యకు లోనవుతున్నారు. పురుష కానిస్టేబుళ్లతో పోలిస్తే మహిళా కానిస్టేబుళ్లతోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని పోలీసులే చెప్తున్నారు. ట్రాఫిక్ విభాగంలో పని చేసే సిబ్బంది అనునిత్యం కాలుష్యం, దుమ్ము–ధూళి ప్రభావానికి లోనవుతూ ఉంటారు. ఈ కారణంగానే వీరికి శ్వాసకోస సంబంధ వ్యాధులతో పాటు బీపీ, షుగర్ వంటివి ఎక్కువగా వస్తున్నాయి. బందోబస్తులు మరో ‘భారం’ సిటీలో పని చేసే సిబ్బంది బందోబస్తులతో మరింత ‘భారం’గా మారుతున్నారు. నగరంలో పని చేసే వారిలో సగం కంటే ఎక్కువ మంది దాదాపు 160 నుంచి 180 రోజుల వరకు ఈ విధుల్లో గడపాల్సిందే. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయిస్తే ఒకే ప్రాంతంలో గంటల తరబడి కూర్చోవడం, ఎక్కువగా బయట తయారు చేసి, నూనె ఉత్పత్తులు తీసుకోవడం అనివార్యంగా మారుతోంది. ఈ కారణంగానే సిబ్బంది తమ బరువుపై అదుపు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వీటన్నింటికీ మించి ఇతర విభాగాలతో పోలిస్తే పోలీసులు చాలా తొందరగా, తేలిగ్గా దురలవాట్లకు బానిసలు అవుతుండటం కూడా ఒబెసిటీకి మరో కారణంగా కనిపిస్తోంది. అప్పటిలా కనిపించని డ్రిల్స్... పోలీసు విభాగంలో పని చేసే సిబ్బంది కచ్చితంగా ఫిట్నెస్తో ఉండాలన్న ఉద్దేశంతో డ్రిల్స్ను ప్రవేశపెట్టారు. గతంలో ఇవి పోలీసుస్టేషన్లు, డివిజన్ల వారికీ ప్రతి వారం జరిగేవి. ఇందులో భాగంగా దాదాపు మూడునాలుగు గంటల పాటు వ్యాయామం, ఇతర కసరత్తులు చేయించే వారు. అయితే ప్రస్తుతం బందోబస్తులు, ఇతర పనులకే సమయం చాలకపోవడంతో డ్రిల్స్ మూలనపడ్డాయి. ఎవరికి వారూ సొంతంగా చేసుకోవడానికీ అవకాశం చిక్కట్లేదు. మిలటరీ విభాగాల్లో ఉన్నట్లు పోలీసు సిబ్బందికి నిత్యం ఫిట్నెస్ పరీక్షలు, వ్యాయామాలు లేకపోవడం, ఉన్నతాధికారుల మాదిరి మిడ్ కెరియర్ శిక్షణలు కరవు కావడం వీరికి శాపంగా మారుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటీవలే పోలీసుస్టేషన్లలో జిమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిని వినియోగించుకునే సమయం సిబ్బందికి దొరకట్లేదు. షిఫ్ట్, వీక్లీ ఆఫ్ అమలు చేయాలి ‘ప్రస్తుతం సిటీలో రోజు రోజుకూ కరొన కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఆంక్షలు, కఠిన నిబంధనలు ప్రవేశపెట్టాలన్నా పోలీసుల సహకారం అత్యంత కీలకం. అయితే పోలీసు విభాగం అలాంటి పరీక్షల్ని ఎదుర్కొవడానికి సిద్ధంగా లేదు. సమయ పాలనతో పాటు సరైన నిద్ర, ఆహారం లేని విధులు నిర్వర్తించే పోలీసుల్లో ఫిట్నెస్ ప్రధాన సమస్యగా మారుతోంది. ముందుగా సిబ్బంది సంఖ్యను పెంచి, షిఫ్ట్ డ్యూటీలు, వీక్లీ ఆఫ్లు అమలు చేయాలి. ప్రధానంగా ప్రతి పోలీసులకూ కేవలం ఎనిమిది గంటలు మాత్రమే డ్యూటీ టైమ్గా స్పష్టం చేసి, అమలు చేయాలి. అలా చేస్తేనే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళనూ పోలీసు విభాగం సమర్థంగా ఎదుర్కోగలదు’.– పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారి -
కాకరతో 10 అద్భుత ప్రయోజనాలు..
కాకరకాయను తలచుకోగానో దీని చేదు స్వభావం ముందుగా కళ్ల ముందు కదలాడుతుంది. చేదుగా ఉంటే కాకరను ఎలా తింటాంరా బాబూ అని చాలా మంది దూరం పెడుతుంటారు. అయితే కొంతమందికి మాత్రం కాకరకాయ పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది. రోజువారీ ఆహారం కాకరను తప్పనిసరిగా వినియోగిస్తారు. రుచికి చేదు అయినా ఆరోగ్యానికి అమృతం లాంటింది. ఎంతో మందికి కాకర వల్ల కలిగే ప్రయోజనాలు తెలియవు. దానిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఇక వదులుకోరు. కాకర ఆస్తమా, జలుబు, దగ్గు వంటి మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతవమైన ఔషధంగా పనిచేస్తుంది. కాకర జ్యూస్ తాగితే లివర్ సమస్యలు తగ్గుతాయి. న్యూట్రిషన్ విలువలు ► మొత్త కాలరీలు-16 ►ఆహార ఫైబర్ - 2.6 గ్రా ►కార్బోహైడ్రేట్లు - 3.4 గ్రా ►కొవ్వులు - 158 మి.గ్రా ►నీటి శాతం - 87.4 గ్రా ►ప్రోటీన్ - 930 మి.గ్రా అసలు మనిషి ఆరోగ్యానికి కాకరకాయ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంలో అనేక క్లినికల్ అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాలలో దీనిని తినడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని వెల్లడైంది. మనలో చాలా మంది కాకరను రుచి కారణంగా తినడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా, సమృద్ధిగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత, మీరు బహుశా మీ ఆలోచనను మార్చుకోవచ్చు. దీనితో కడుపు నొప్పి, మధుమేహం, కాన్యర్, గుండె జబ్బులు వంటి సర్వ రోగాలకు నివారిణిగా పనిచేస్తుంది. ఎంతో మేలు చేస్తుంది. 1.మలబద్దకం, జీర్ణాశయం వ్యాధులు నివారణ కాకరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి వంటి పేగు రుగ్మతలను నయం చేయడమే కాకుండా, జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే పరాన్నజీవులను చంపడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపించడానికి, జీర్ణక్రియకు ఉపకరిస్తుంది.అధిక ఫైబర్ ఉంన్నందు వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాకరను వైద్యులు సిఫార్సు చేస్తారు. 2. డయాబెటిస్ కాకర డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది. డయాబెటిస్తో బాధపడుతున్న ఎవరికైనా దీనిని తరచుగా తీసుకోవాలని సూచిస్తారు. ఇందులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలతో కూడిన మూడు క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. అవి పాలీపెప్టైడ్-పి, వైసిన్, చరణి. ఇవి ఇన్సులిన్ లాంటి లక్షణాలు కలిగి రక్తంలో గ్లూకోజ్ విలువలను తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయని నిర్ధారణ జరిగింది. రక్తంలో షుగర్ లెవల్స్లను తగ్గించడంలో చురుకుగా పనిచేస్తాయి. అంతేకాక కాకరలో లెక్టిన్ ఉందని, ఇది ఆకలిని అణచివేయడం,పరిధీయ కణజాలాలపై పనిచేయడం ద్వారా శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ను తగ్గించడానికి సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ ఉదయం కాకర జ్యూస్ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మీ డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవచ్చు. దీనిలో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది. 3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాకరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. మానవ శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఇది రోగనిరోధక కణాలు,తెల్ల రక్త కణాలు (డబ్ల్యూసీ) పెంచడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, అలెర్జీని నివారించడంలో సహాయపడుతుంది. కాకర కాయలు, ఆకులను నీటిలో ఉడకించి తీసుకోవడం వల్ల అంటు రోగాలు దరిచేరకుండా ఉంటాయి. 4. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది కాకరకు గల యాంటీమైక్రోబయల్, యాటీఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలోని చెత్తను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాక ఇది మీ కాలేయంలో స్థిరపడిన అన్ని రకాల మత్తులను తుడిచిపెట్టడానికి దోహదపడుతుంది. అందువల్ల ఇది అనేక కాలేయ సమస్యలను నయం చేస్తుంది. అలాగే మీ పేగును శుభ్రపరుస్తుంది. ఇది మూత్రాశయం సరైన పనితీరుకు సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు హ్యాంగోవర్ అయితే, చేదుకాయ రసం తీసుకోవడం వల్ల మన శరీరం నుంచి ఆల్కహాల్ మత్తును తగ్గించి చురుకుగా ఉంటారు. 5. క్యాన్సర్ నుండి రక్షింస్తుంది. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్కు ప్రధాన కారణం. అవి మన శరీరం పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. నిందుకు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ లేకుండా చూసుకోవాలి. ఫ్రీ రాడికల్స్.. ధూమపానం, కాలుష్యం,ఒత్తిడితో అధికంగా పెరుగుతుంది. కావున కారలో లైకోపీన్, లిగ్నన్స్, కెరోటినాయిడ్లు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో విటమిన్ ఎ, జియా-శాంథిన్,లుటిన్ ఉన్నాయి. ఇవి ప్రాధమిక యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. దీంతో చివరకి మన శరీరంలో కణితులు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. 6. కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ధమనులలో కొవ్వు ఫలకం ఏర్పడుతుంది, ఇది గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పనిచేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాకర చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పుష్టి ఆరోగ్యానికి తోడ్పడటానికి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. కాకరలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ గుండెపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. 7. అధిక బరువును తగ్గిస్తుంది. కాకరలో గొప్ప పోషకాలు ఉండటం వల్లగా బరువు తగ్గించే ఆహారంగా సహకరిస్తుంది. 100 గ్రాముల కాకరలో 16 కేలరీలు, 0.15 గ్రాముల కొవ్వు, 0.93 గ్రాముల ప్రోటీన్, 2.6 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటాయి. అందువల్ల, మన బరువుకు అదనపు పౌండ్లను జోడించకుండా తగ్గిస్తుంది. పోషకాలు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. జంక్, అనారోగ్యకరమైన స్నాక్స్ మీద ఆధారపడకుండా చేస్తుంది. కాకర రసం తాగడం ద్వారా ఉబకాయం తగ్గుముఖం పడుతుంది. కాకరలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మంచి ప్రోటీన్, ఫైబర్ ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి. 8. జుట్టుకు మెరుపు అందిస్తుంది. కాకర జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలో ప్రోటీన్, జింక్.విటమిన్ సి వంటి భాగాలు జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. జుట్టుకు కాకర జ్యూస్ను రాయడం వల్ల మూలాలు బలోపేతం అవుతాయి. స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు చికిత్స అందుతుంది. ఇది జుట్లును షైన్గా ఉండటంలో సహాయపడుతుంది. 9. చర్మాన్ని అందంగా చేస్తుంది మొటిమలు, మచ్చలు, చర్మ అంటు వ్యాదులను తొలగిస్తుంది. నిమ్మరసంతో కాకరను ప్రతిరోజు పరగడుపున 6 నెలలు తీసుకుంటే సరైన ఫలితాలు పొందుతారు. చర్మాన్ని ముడతలు లేకుండా ఉంచడంలో, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం సున్నితత్వానికి కారణమవుతుంది. ఇంకా సోరియాసిస్ , తామర చికిత్సకు సహాయపడుతుంది.సూర్యుడి నుంచి హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. 10. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది కంటి చూపు, కంటిశుక్లం వంటి దృష్టి సంబంధిత సమస్యలను నివారించడంలో కాకర సహాయపడుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ నిండి ఉంటాయి. ఇవి కళ్ళకు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక కళ్ల కింద నల్లడి వలయాలను తగ్గించేందుకు మంచి నివారణగా ఉపకరిస్తుంది. -
కలుషితమైన గాలిని పీలిస్తే..
వాషింగ్టన్: కలుషితమైన గాలిని పీల్చడం ఒబెసిటీ (ఊబకాయం), డయాబెటిస్, జీర్ణాశయాంతర రుగ్మతలు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను పెంచుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురితమైంది. అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ నిపుణులు ఈ పరిశోధన నిర్వహించారు. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు సూర్మరశ్మికి గురైనప్పుడు ఓ ప్రమాదకరమైన వాయు కాలుష్య ఓజోన్ వీరు గుర్తించారు. ఈ గాలి, అందులో ఉండే కారకాలు ఊబకాయ వ్యాధికి కారణమవుతాయని వారు పేర్కొన్నారు. (చదవండి: వణికిపోతున్న అమెరికా..) ‘వాయు కాలుష్య కారకాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని గత అధ్యయనాలు వెల్లడించినట్లు మనకు తెలిసిందే’ అని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తాన్యా అల్డిరీట్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 88 లక్షల మంది ఈ వాయు కాలుష్య బారిన పడి మృతి చెందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. శ్వాసకోశ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ కనబరిచినప్పటికీ.. వాయు కాలుష్యం రక్తంలో చక్కెరను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, అలాగే ఊబకాయం ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందని తేలింది. (మరణాలు 5 వేలు.. కేసులు 1.34 లక్షలు) -
కిడ్స్కు.. కిడ్నీ గండం!
స్థూలకాయం, పోషకాహార లోపమే కారణం.. స్థూలకాయం, పోషకాహార లోపం, జన్యుపరమైన సమస్యలు, అనారోగ్యకరమైన ఆహారం, రసాయనాలతో నిండిన ఆహారం, శారీరక శ్రమ లోపించడం తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా కూల్డ్రింక్స్ వంటి వాటిని తాగేవారిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇంట్లో తినడానికి బదులు బయట పిజ్జాలు, బర్గర్లు, ఇతరత్రా ఫాస్ట్ఫుడ్ వంటివి తినడం వల్ల రక్తంలో క్రియాటిన్ పెరగడానికి కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. దేశంలో 10 నుంచి 19 ఏళ్ల వయస్సు వారిలో 4.9 శాతం మందికి బీపీ ఉండగా, తెలంగాణలో 6.7 శాతం మంది ఉండటం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే, అదీ బీపీ, షుగర్ అధికంగా ఉన్న వారిలోనే కనిపించే కిడ్నీ వ్యాధి ఇప్పుడు పిల్లలనూ వెంటాడుతోంది. 5 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలపై పంజా విసురుతోంది. 5 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లల్లో కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశమున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండగా, 10 నుంచి 19 ఏళ్ల వయసు వారిలో రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2016–18 సమగ్ర జాతీయ న్యూట్రిషన్ సర్వేను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో దాదాపు పావు శాతం పిల్లలకు కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అంటే ఆయా వయసు పిల్లల్లో ప్రతీ నలుగురిలో దాదాపు ఒకరికి కిడ్నీ వ్యాధి ప్రమాదం ఉన్నట్లు నివేదిక తెలిపింది. దీనిపై వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే యువతీ యువకుల భవిష్యత్ అంధకారం కానుందని హెచ్చరిస్తున్నారు. వారి రక్తంలో సీరం క్రియాటిన్ అధికం.. కేంద్రప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే ప్రకారం వివిధ వయçస్సు వారి ఆరోగ్య వివరాలను సేకరించింది. కిడ్నీ పనితీరును తనిఖీ చేయడానికి వైద్యులు సాధారణంగా బ్లడ్ క్రియాటిన్ స్థాయిని కొలుస్తారు. ఇది మూత్రపిండాల పనితీరును సూచిస్తుంది. సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 5 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లల్లో సరాసరి 7 శాతం మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నట్లు తేలింది. అందులో తెలంగాణలో 23.6 శాతం పిల్లల్లో అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే 10 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లల్లో దేశవ్యాప్తంగా 6.6 శాతం మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నట్లు గుర్తించగా, తెలంగాణలో 24.3 శాతం మందికి అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. దేశ సగటు కంటే మూడు నాలుగు రెట్ల వరకు క్రియాటిన్ అధికంగా ఉండటం మరింత ఆందోళన కలిగించే పరిణామం. అయితే సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ పరిస్థితికి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. మూత్రాశయ సమస్యలు లేదా పుట్టుకతో వచ్చే రుగ్మతల కారణంగా ఒక్కోసారి సీరన్ క్రియాటిన్ అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో కిడ్నీలు ఏర్పడకపోవడం, లేదా జన్యుపరమైన సమస్యలు, పర్యావరణం, కాలుష్యం వంటివి కారణాలుగా ఉంటున్నాయని చెబుతున్నారు. పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యలను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలుంటుందని అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఇంత అధికంగా ఆయా వయసు పిల్లల్లో క్రియాటిన్ అధికంగా ఉండటానికి కారణాలపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. మాంసాహారుల్లోనే అధికం.. 10 నుంచి 19ఏళ్ల వయసున్న వారిలో బాలికల కంటే బాలురుల్లోనే అధికంగా క్రియాటిన్ సమస్యలున్నాయని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఈ వయసు పిల్లల్లో 8.3% మంది బాలురు, 4.9% మంది బాలికల్లో కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయని తెలిపింది. మాంసాహారుల్లోనే అధికంగా క్రియాటిన్ కని పిస్తోంది. దేశంలో మాంసాహారం తినే ఈ వయసు పిల్లల్లో 9% మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉండగా, కేవలం గుడ్డు తినే వారిలో 6% ఉంది. శాకాహారుల్లో 5.4% మందిలోనే క్రియాటిన్ కనిపించి నట్లు నివేదిక తెలిపింది. మతపరంగా చూస్తే ఈ వయసు పిల్లల్లో అత్యధికంగా క్రిస్టియన్లలో 18.4% మందిలో క్రియాటిన్ ఎక్కువ గా ఉండగా, ముస్లింల్లో 11.2% ఉంది. హిందువుల్లో 5.6% ఉం డగా, సిక్కుల్లో 3.8% ఉన్నట్లు నిర్ధారించారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఈ వయసు గల వారిలో ఎస్సీల్లో 6.3%, ఎస్టీల్లో 7.2%, బీసీల్లో 5.1%, ఇతరుల్లో 9.2% క్రియాటిన్ ఉన్నట్లు నిర్ధారించారు. ఇదే వయసున్న పట్ట ణపిల్లల్లో 4.3% సీరం క్రియాటిన్ ఉండగా, గ్రామీణ ప్రాంత పిల్లల్లో అది 7.4‘% ఉండటం గమనార్హం. నిరుపేదలైన ఈ వయసు పిల్లల్లో 8.9 శాతం సీరం క్రియాటిన్ ఉండగా, పేదల్లో 7.4 శాతం, మధ్యతరగతి పిల్లల్లో 7.5 శాతం, ధనికుల్లో 5 శాతం, అత్యంత ధనికుల్లో 4.6 శాతం ఉన్నట్లు నివేదిక తెలిపింది. తల్లిదండ్రులు మేల్కొనాలి.. కేంద్ర సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలో కిడ్నీ సమస్యలు రావడానికి అవకాశాలెక్కువ. స్థూలకా యం, శారీరక శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాలతో ఈ ముప్పు వస్తుంది. ప్రస్తుత నివేదిక హెచ్చరికలాంటింది. పిల్లల తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోకుంటే మరింత ప్రమాదం జరగొచ్చు. – డాక్టర్ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్, హైదరాబాద్ ఆహారం, తాగునీటి లోపాల వల్లే..: అనారోగ్యకరమైన ఆహారం, శుద్ధమైన తాగునీరు లేకపోవడంతో కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. పోషకాహార లోపం రాష్ట్రంలో అధికం. ఇది కూడా ఓ కారణమే. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మిషన్ భగీరథ నీటితో కిడ్నీ వ్యాధులు తగ్గుతాయి. – డా.కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిజామాబాద్ -
మందులు కలిపితే కీళ్లనొప్పులు ఫట్?
ఆర్థరైటిస్ సమస్యకు సాల్క్ పరిశోధకులు ఓ వినూత్నమైన కొత్త చికిత్స పద్ధతిని కనుక్కున్నారు. మందులేసుకోవడం లేదా కీళ్లు మార్పించుకోవడం మాత్రమే ఇప్పటివరకూ ఉన్న కీళ్లనొప్పుల పరిష్కారాలు కాగా.. శక్తిమంతమైన రెండు కొత్త మందులను కలిపి వాడటం ద్వారా నొప్పులు తగ్గించడంతోపాటు కీళ్ల మధ్య ఉండే పదార్థాన్ని మళ్లీ పెరిగేలా చేయవచ్చునని వీరు చెబుతున్నారు. ఎలుకలతోపాటు మానవ కార్టిలేజ్ కణాలపై జరిగిన పరిశోధనలు ఇప్పటికే మంచి ఫలితాలిచ్చాయని ప్రొటీన్ అండ సెల్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. వయసు పెరిగే కొద్దీ కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి కణజాలం అరిగిపోయి నొప్పులు వస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. ఊబకాయం కూడా ఈ సమస్యకు కొంతవరకూ కారణమవుతోంది.ఆల్ఫా క్లోథో, టీజీఎఫ్ఆర్2 అనే రెండు రసాయన మూలకాలు ఈ సమస్యకు పరిష్కారం చూపగలవని ఇప్పటికే గుర్తించగా.. సాల్క్ పరిశోధకులు ఈ రెండింటిని కలిపి ఎలుకలపై ప్రయోగించారు. ఈ రెండు మందులు మృదులాస్థి కణాలు అరిగిపోకుండా చేస్తున్నట్లు గుర్తించారు. టీజీఎఫ్ఆర్2 కణాలు ముక్కలైపోకుండా అడ్డుకోవడమే కాకుండా.. వృద్ధి చెందేందుకు ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల ద్వారా తెలిసింది. ఆరు వారాల చికిత్స తరువాత ఈ రెండు మందులు కలిపి అందించిన ఎలుకల్లో కీళ్లనొప్పుల తాలూకూ లక్షణాలు గణనీయంగా తగ్గిపోయాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టినెజ్ రెడొండో తెలిపారు. -
పిల్లలు విపరీతంగా బరువు పెరుగుతున్నారా?
ఇటీవల పిల్లలు జంక్ఫుడ్ ఎక్కువగా తినడం వంటి అనారోగ్యకరమైన జీవనశైలితో అనర్థాలు తెచ్చుకుంటున్నారు. టీనేజ్లో ఉన్న సమయంలోనే పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పిల్లల్లో వారి ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో ముందుగా గమనించాలి. ముందుగా వారికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి. ►స్వీట్లు, సాఫ్ట్డ్రింక్స్, జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్డ్రింక్స్లోని ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్డ్రింక్స్కు పిల్లలను మరింత దూరం ఉంచడం మంచిది ►వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు ►పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు ►తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది ►పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనా పాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది ►పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. -
చిక్కటి పాలతో ఊబకాయం రాదు
టొరంటో: చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి చిక్కటి పాలకు మించినది మరేది లేదని మరోసారి రుజువైంది. ఈ మధ్య కాలంలో వెన్న, కొవ్వు తీసేసిన పాలు అమ్ముతూ, అదే ఆరోగ్యానికి మంచిదని, ఊబకాయం రాదని ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని కెనడాలో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. కొవ్వు తీసేసిన పాలు తాగిన వారి కంటే హోల్ మిల్క్ తాగిన పిల్లల్లో ఊబకాయం ప్రమాదం 40 శాతం తక్కువగా ఉన్నట్టుగా తేలింది. కెనడాలో సెయింట్ మైకేల్ ఆస్పత్రి పరిశోధకులు మొత్తం 28 అధ్యయనాలను విశ్లేషించి నివేదిక రూపొందించారు. ఈ వివరాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించారు. కెనడా పరిశోధకులు విశ్లేషించిన 28 అధ్యయనాల్లో కూడా వెన్న తీసేసిన పాలు తాగినంత మాత్రాన ఊబకాయం, అధిక బరువు ప్రమాదం ఉండదని రుజువు కాలేదు. అంతేకాదు, వాటిలో 18 అధ్యయనాలు చిక్కటి పాలు తాగిన వారిలో ఊబకాయం ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. రెండేళ్ల వయసు దాటాక తక్కువ కొవ్వున్న పాలు తాగితే పిల్లల్లో ఊబకాయం సమస్యలు ఉండవన్న అంతర్జాతీయ మార్గదర్శకాలను ఈ పరిశోధన సవాల్ చేసినట్టయింది. -
ఇక ఈ బీర్లకు చీర్స్ చెప్పాల్సిందే!
న్యూఢిల్లీ : ఇక ఎవరైనా మూడు బీర్లు, ఆరు గ్లాసులతో ఛీర్స్ చెప్పాల్సిందే. ఇంతకాలానికి శాస్త్రవేత్తలు బీరులో ఉన్న మంచి గుణాలను కనిపెట్టారు. బీరు తాగితే కొత్తగా బొజ్జలు రాకపోవడమే కాకుండా బొజ్జలు కరిగిపోయి మొత్తంగా స్థూలకాయం తగ్గుతుందట. పైగా సుఖంగా నిద్ర పడుతుందట. వీటిలో ఒకరకమైన బ్యాక్టీరియా, ఈస్ట్ మిశ్రమం ఉండడమే అందుకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అన్ని బీర్లలో ఈ గుణం ఉందో, లేదో తెలియదుగానీ బెల్జియంకు చెందిన హోగార్డెన్, వెస్ట్మల్లే ట్రిపల్, ఎట్ క్రైకెన్బియర్ బ్రాండ్ల బీర్లలో ఈ మంచి గుణాలు ఉన్నాయట. ఆ బీర్లు రెండుసార్లు, భూగర్భంలో ఉండగా ఒకసారి, సీసాలో మరోసారి బీరు పులియడం వల్ల వాటికి ఆ మంచి గుణాలు అబ్బాయట. భూగర్భంలో పులియడానికి ఒకరకమైన ఈస్ట్, సీసాలో పులియడానికి మరో రకమైన ఈస్ట్ను ఉత్పత్తిదారులు ఉపయోగిస్తున్నారని, ఈ రెండోసారి పులియడంతోనే బీరులో ఎక్కువగా ఆరోగ్య లక్షణాలు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటిలో కూడా లైట్ బీరుకన్నా స్ట్రాంగ్ బీరే మంచిదని, అలా అని ఎక్కువగా బీర్లు తాగమని తాను సిఫార్సు చేయడం లేదని ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీలో బ్యాక్టీరియా నిపుణుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎరిక్ క్లాసెన్ చెప్పారు. ‘ఎక్కువ ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ రకమైన బ్రాండ్లలో రోజొకటి తాగినా ఆరోగ్యానికి మంచిదే. ఈ రకాల బీరు బాటిళ్లలో 50 శాతానికిపైగా మంచి బ్యాక్టీరియా ఉంది’ ఆయన చెప్పారు. -
జంక్ ఫుడ్ మానేసి.. వైన్ పారేసి...
ఈ ఫొటోలో ఉన్న కొరి డిసిల్వా వయసు 40 ఏళ్లు. వాయువ్య ఇంగ్లాండ్లోని చెషి అనే ప్రాంతంలో ఉంటోంది. ఇద్దరు పిల్లల తల్లి. కాని తనకు తాను కొన్నాళ్లుగా నచ్చట్లేదు. అందుకు కారణం స్థూలకాయం. కొరి డిసిల్వాకు వెన్ను సర్జరీ జరిగింది. దాని వల్ల ఆమె ఎక్కువగా విశ్రాంతిలో ఉండాల్సి వచ్చేది. ‘డాక్టర్లు నన్ను జిమ్ వైపు పొరపాటున కూడా వెళ్లొద్దు అని చెప్పారు’ అంటుందామె. కదలక మెదలక ఉండేసరికి క్రమంగా ఆమె బరువు పెరిగింది. ఆఖరుకు అది 94 కిలోల వద్ద స్థిరపడింది. ‘నన్ను నేను చూసుకుంటే చాలా కష్టంగా అనిపించింది’ అని కొరి అంది. వెంటనే బరువు తగ్గాలనుకుంది. అయితే దానికి పూర్తి వ్యాయామం చేసే పరిస్థితి లేదు. మరి ఎలా తగ్గడం. కొరికి జంక్ ఫుడ్ ఇష్టం. రోజూ బయటి నుంచి ఆహారం రావాల్సిందే. లేకుంటే తానే వెళ్లి తినాల్సింది. ఆమె జంక్ ఫుడ్ ఖర్చు నెలకు దాదాపు లక్ష రూపాయలు. దానిని మానేయాలి అని మొదట ఆమె నిశ్చయించుకుంది. అలాగే ఆమెకు రోజూ రాత్రి పూట వైన్ తాగే అలవాటు ఉంది. దానిని కూడా మానేయాలని అనుకుంది. రెండూ కష్టమైన పనులే. కాని గట్టిగా చేయాలని నిశ్చయించుకుంది. ఇంట్లోనే వండుకున్న ఆహారం, పరిమిత వ్యాయామం, పాజిటివ్ ఆలోచనలు... ఇవన్నీ కొరి డిసిల్వా బరువును మెల్లగా తగ్గించడం మొదలెట్టాయి. 14 వారాల్లో ఆమె తగ్గిన బరువు ఎంత తెలుసా. అక్షరాలా 19 కిలోలు. ‘డబ్బు మిగిలింది. అరోగ్యమూ వచ్చింది. అందంగా తయారయ్యాను’ అని కొరి మురిసిపోతోంది. మనం ఎంత తింటున్నాం, ఏది తింటున్నాం చెక్ చేసుకుంటే కొన్ని మానేస్తే మరికొన్ని అదుపుచేస్తే అదనపు బరువు రాదని కొరి ఉదాహరణ అందంగా సలహా ఇస్తోంది. -
బరువు పెరుగుతుంటే – ఆయుష్షు తగ్గుతుంది
ఒంటి బరువు పెరుగుతున్న కొద్దీ జరిగే అనర్థాల గురించి అందరికీ తెలిసిందే. పెరిగే బరువు కారణంగా రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ వంటివి వచ్చే అవకాశాలు పెరిగి అది గుండెపోటుకూ, పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉందన్న విషయాలు మనం తరచూ చదువుతూనే ఉంటాం. ఇటీవల నిర్వహించిన మరికొన్ని అధ్యయనాల్లోనూ ఆ అనర్థాల గురించి మళ్లీ మళ్లీ తెలిసివచ్చింది. ఓ వ్యక్తి తాను ఉండాల్సినదాని కంటే ఎక్కువ బరువు పెరుగుతుంటే... అది మృత్యువును మరింత త్వరగా రమ్మని ఆహ్వానించడమేనని యూఎస్కు చెందిన ‘ప్లాస్’ మెడికల్ జర్నల్లోని విషయాలు చెబుతున్నాయి. స్థూలకాయంతో బాధపడుతున్న తొమ్మిది వేల ఐదొందల మంది వ్యక్తులతో పాటు పాటు మామూలు బరువే ఉన్న మూడు లక్షల మందికి పై చిలుకు సాధారణ వ్యక్తులపై దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాలను నిర్వహించారు. ఈ అధ్యయనాలన్నీ మూకుమ్మడిగా వెల్లడించిన విషయాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ అధ్యయనాల్లో తేలింది. బరువే మరణాలకు నేరుగా కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు. -
జంక్ ఫుడ్ తింటున్నారా.. బీ కేర్ఫుల్
సాక్షి, న్యూఢిల్లీ : బయటి ఆహారం కన్నా ఇంటి ఆహారం ఎంతో మేలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల నేటి యాంత్రిక జీవితంలో పెద్దల మాటలను పెడ చెవిన పెట్టి ‘ఫాస్ట్ ఫుడ్స్’ను ఆశ్రయిస్తుంటాం, జంక్ ఫుడ్ను తింటుంటాం. వీటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తాయని, వాటి వల్ల మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తి అంతరించడంతోపాటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులు వస్తాయని, సంతాన సాఫల్య లోపం ఏర్పడుతుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ‘సైలెంట్ స్ప్రింగ్ ఇనిస్టిట్యూట్’కు చెందిన శాస్త్రవేత్తలు మనం బయట తినే జంక్ ఫుడ్లపై అధ్యయనం చేశారు. బయట దొరికే ఫుడ్లో కల్తీ నూనెలు ఉంటాయని, శుచీ శుభ్రం ఉండదని, అందుకని అవి ప్రమాదకరమని ఇంతకుముందు ఎంతో మంది పరిశోధకులు చెబుతూ వచ్చారు. తాజా అధ్యయనంలో కొత్త విషయాలు తెలిశాయి. ‘పీఎఫ్ఏఎస్’గా వ్యవహరించే మానవ తయారీ రసాయనాలు ఈ ఫాస్ట్ ఫుడ్లలో ఉన్నట్లు తేలింది. ప్యాకేజీల ద్వారా ఆహార పదార్థాల్లోకి ఇవి వస్తున్నాయని, అలాగే ఒవెన్లో తయారు చేసే పాప్ కార్న్లో కూడా ఈ రసాయనాలు దండిగా ఉన్నాయని వారి పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాలైన ప్యాకేజీ మెటీరియల్స్ను ఈ రసాయనాలను ఉపయోగించి తయారు చేయడమే వల్ల రసాయనాలు ఆహారపదార్థాల్లోకి రావడమే కాకుండా కలుషిత నీటి ద్వారా, పరిసరాల కలుషిత వాతావరణం ద్వారా ఈ రసాయనాలు ఆహార పదార్థాల్లోకి చేరుతున్నాయట. జంక్ ఆహార పదార్థాలు, వాటి ప్యాకింగ్లపై అధ్యయనం జరపడంతోపాటు ఇంటి వంటకాలు, బయటి వంటకాలు తింటున్న దాదాపు పదివేల మంది అమెరికన్ల వైద్య రికార్డులు పరిశీలించి రసాయనాల గురించి నిర్ధారణకు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కారణంగా ఇంటి వంటకాలే అన్ని విధాల శ్రేయస్కరమని పరిశోధకులు మరోసారి తేల్చారు. ఈ ప్రమాదకరమైన రసాయనాలు ఇంటిలోని ‘నాన్ స్టిక్’ వంట పాత్రల్లో, వాటర్ ప్రూఫ్ ఫాబ్రిక్ కోటింగ్స్లో కూడా ఉంటాయని, వంటకాల కోసం వాటిని ఉపయోగించకూడదని కూడా పరిశోధకలు తెలిపారు. ‘పీఎఫ్ఏఎస్’గా వ్యవహరించే ఈ రసాయనాలను 1930 దశకంలో పలు రకాల వస్తువుల తయారీ కోసం శాస్త్రవేత్తలు సృష్టించారు. -
ప్లీజ్ దయచేసి 'లావు' ఉండొద్దు
సాక్షి, గుంటూరు : ఆధునిక జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లతో నేడు పాఠశాల చదివే పిల్లవాడు మొదలుకొని యవకులు, పెద్దల వరకు అధిక బరువుతో(ఊబకాయం) బాధ పడుతున్నారు. ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ నివేదిక ప్రకారం 2030 నాటికి 250 మిలియన్ల మంది 5 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు ఊబకాయులుగా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2.8 మిలియన్స్ మంది ప్రజలు ఊబకాయం వల్ల చనిపోతున్నారు. పెరిగిన శరీరం తగ్గించుకోవటం కోసం చాలా మంది ఉదయానే లేచి రోడ్ల వెంబడి పరుగులు తీయటం, జిమ్లలో గంటల కొద్ది వ్యాయామం చేయటం, ఆస్పత్రుల చుట్టూ తిరగటం చేస్తున్నారు. స్థూలకాయంపై ప్రజలకు అవగాహన కల్పించి, దీని బారిన పడకుండా ఉండటం కోసం ఏటా అక్టోబర్ 11న ప్రపంచ స్థూలకాయ వ్యతిరేక దినోత్సం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఊబకాయం(ఒబెసిటీ) కారణాలు... నేడు ఊబకాయం సమస్య అధికమవుతోంది. ఈ సమస్య రోజురోజుకూ పెరగటానికి కారణం అధిక కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవటం, మితిమీరిన ఆహారం తినడం, శరీరానికి తగిన శారీరక శ్రమ లేకపోవటమే. వంశపారంపర్యంగా కొంత మందికి ఊబకాయం వస్తుంది. పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయి. జీవన విధానంలో తేడాల వల్ల అధిక బరువు వస్తుంది. పాఠశాలల పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న జనాభాలో మూడో వంతు మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు. ఊబకాయంతో రోగాలు... ఊబకాయం వల్ల పిల్లల్లో మధుమేహం వస్తుంది. రక్తపోటు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, లివర్, కీళ్ల నొప్పులు, గురక, నిద్ర సమస్యలు, పిల్లలు పుట్టకపోవటం తదితర వ్యాధులకు గురవుతారు. సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, తగిన శారీరక శ్రమ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఊబకాయం బారిన పడకుండా ఉండవచ్చు. ఆహారంలో కొవ్వును తగ్గించవచ్చు శరీరంలోని ఎలాంటి జబ్బులనైనా 70 శాతం ఆహారంతో తగ్గించవచ్చు. తినే ఆహారం కొంచెమైనా అందులో పోషక విలువలు ఉండాలి. ఎలాంటి పరికరాలను వినియోగించకుండానే పళ్ళరసాలు, కాయగూరల రసాలు, పళ్ళు, ఉడకబెట్టిన ఆహారం, ఉడకబెట్టని(రాఫుడ్) తీసుకుంటే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. వ్యాయామం ద్వారా 20 శాతం జబ్బులను, యోగాతో కొవ్వును కరిగించవచ్చు. – డాక్టర్ షేక్ హుస్సేన్, మెడికల్ ఆఫీసర్ -
ఆర్థరైటిస్ నివారణకు తేలిక మార్గాలు
ఒక వయసు దాటాక ఎముకలు అరిగిపోవడం సహజం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇలా ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ సమస్యను కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా నివారించుకోవచ్చు. అవేమిటో తెలుసుకోండి. చాలాకాలం పాటు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ►స్థూలకాయం వల్ల మీ ఒంటి బరువు ఎముకలపై పడి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ►మన శరీర కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కూర్చుని చేసే వృత్తుల్లో ఉండేవారు వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు చేయాలి. ►మరీ ఎక్కువగా కీళ్లు అరిగే అవకాశం ఉన్నవారు కీళ్లకు తగినంత విశ్రాంతి కల్పించాలి. వేగంగా పరుగెత్తే తరహా వ్యాయామాలు చేసేవారు తమ స్పోర్టింగ్ యాక్టివిటీస్ను తగ్గించాలి. దానికి బదులు వేగంగా నడవడం మంచిది. తమ ఒంటి బరువును గణనీయంగా తగ్గించే ఈదడం (స్విమ్మింగ్ ఎక్సర్సైజ్) ఇంకా మంచిది. ►కాళ్లు మడిచి, బాసిపట్లు వేసి కూర్చోవడం (స్క్వాటింగ్) మంచిది కాదు. వీలైనంత వరకు కుర్చీ లేదా బల్ల వంటి వాటి మీద కూర్చోవాలి. ►పాల వంటి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ►మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ►కీళ్లలో నొప్పి కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను తప్పక సంప్రదించాలి. -
ఫైబ్రాయిడ్స్ తిరగబెట్టకుండా నయం చేయవచ్చా?
నా వయసు 43 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – ఎమ్. రాధాబాయి, మిర్యాలగూడ గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నా సమస్యకు హోమియో వైద్యం ఉంటుందా? నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువై డాక్టర్ను సంప్రదించాను. ఆయన ఎమ్మారై తీసి డిస్క్ బల్జ్తో పాటు సయాటికా అంటున్నారు. నా సమస్యకు హోమియో వైద్యం ఉంటుందా? దయచేసి వివరంగా చెప్పండి. – వెంకటరామ్, తాడేపల్లిగూడెం సయాటికా అనే పదాన్ని రోజుల్లో వినని వారుండరు. ఈ వ్యాధి బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. సయాటికాను త్వరగా గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీలతో పాటు హోమియో సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యలను శాశ్వతంగా దూరం చేయవచ్చు. శరీరంలో అన్నిటికంటే పెద్దది, పొడవాటిది అయిన నరం పేరు సయాటికా. అది వీపు కింది భాగం నుంచి పిరుదుల మీదుగా కాలి వెనక భాగం మీదుగా కాలి మడమల వరకు వరకు వెళ్తుంది. ఈ నరం మీద వెన్నుపూసల ఒత్తిడి పడి, నరం నొక్కుకుపోవడం వల్ల కాలి వెనక భాగం తీవ్రమైన నొప్పికి గురవుతుంది. దీన్నే సయాటికా నొప్పి అంటారు. దీని కారణంగా తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం, మంటలు, నడకలో మార్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 62% మంది ఈ సమస్యతో విధులకు గైర్హాజరు అవుతుంటారు. కారణాలు : నర్వ్ కంప్రెషన్: నర్వ్ రూట్స్ ప్రెస్ కావడం వల్ల నొప్పి వస్తుంది. స్పైనల్ డిస్క్ హెర్నియేషన్: ఎల్4, ఎల్5 నరాల రూట్స్ ఒత్తిడికి గురై సరైన పొజిషన్స్లో ఒంగక పక్కకు జరిగి సయాటికా నొప్పి వస్తుంది. స్పైనల్ కెనాల్ స్టెనోసిస్: వెన్నుపూసల మధ్య ఒక సన్నటి కెనాల్ ఉండి, అందులో వెన్నుపాము నుంచి వచ్చే నరాల వ్యవస్థ ఉంటుంది. ఆ వెన్నుపూసల మధ్యనున్న నాళం (కెనాల్) సన్నబారడం వల్ల వెన్నుపాములోని నరాలు నొక్కుకుపోవడం వల్ల కూడా ఈ నొప్పి వస్తుంది. పెరిఫార్మిస్ సిండ్రోమ్ : దెబ్బలు, గాయాలు పెరిఫార్మిస్ అనే కండరం నర్వ్రూట్స్ను నొక్కుతుంది. దీనివల్ల కూడా సయాటికా నొప్పి వస్తుంది. శాక్రో ఇలియాక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్ : శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు పనిచేయనప్పుడు సయాటికా రావచ్చు. గర్భవతులకు, తమ ప్రెగ్నెన్సీ చివరి నెలలో పిండం బరువు పెరిగి నర్వ్రూట్స్ మీద ఒత్తిడి పడటం వల్ల సయాటికా నొప్పి వస్తుంది. పరీక్షలు : ఎక్స్రే తో పాటు ఎమ్మారై స్కాన్ సహాయంతో డిస్క్హార్నియేషన్, డిస్క్ప్రొలాప్స్ నిర్ధారణ చేయవచ్చు. ఏ నర్వ్రూట్ ఎక్కడ కంప్రెస్ అయ్యిందో తెలుసుకోవచ్చు. నొప్పి వస్తే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేసేవాళ్లు చాలామంది ఉంటారు. నొప్పిమాత్రలు తరచూ వేసుకోవడం వల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, అసిడిటీ, అల్సర్ రావచ్చు. చికిత్స : సయాటికాకు రోగలక్షణాలు, మూలకారణాలను బట్టి హోమియో మందులను సూచిస్తారు. ఇప్పుడు ఇందుకోసం రస్టాక్స్, కిలోసింథ్, రోడోడెండ్రాన్, కాస్టికమ్ వంటి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన వైద్యనిపుణుల సర్యవేక్షణలో హోమియో మందులు వాడితే సయాటికా సమస్య శాశ్వతంగా నయమవుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ తిన్నవెంటనే కడుపునొప్పి... ఏమిటీ సమస్య? నా వయసు 43 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. – జి. సుధీర్బాబు, విజయవాడ ►మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. ►అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ►దీర్ఘకాల జ్వరాలు ►మానసిక ఆందోళన ►కుంగుబాటు ►ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్వాడటం ►జన్యుపరమైన కారణలు చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయిలెట్కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది.దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ►పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ►పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ►రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
వయసు 20.. బరువు 80..
యువత అంటే ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు.. అనే నిర్వచనం క్రమంగా మారుతోంది. వారిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. ప్రధానంగాకళాశాలలకు వెళ్లే వయసులో చాలామందిఊబకాయంతో బాధపడుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టడం తప్ప ఆటలకు దూరంగా ఉంటున్నారు. చిన్న వయసులోనే ఇది అధిక బరువు సమస్యకు దారి తీస్తోంది. నగర యువతలో దాదాపు 30 శాతం మంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యువతుల్లో ఈ సమస్య ఎక్కువ ఉందని చెబుతున్నారు. 16 నుంచిపాతికేళ్ల వయసున్న వారిలో గరిష్ట బరువు కంటే 8– 15 కిలోలు అధికంగా ఉన్నట్లు స్పష్టంచేస్తున్నారు. 20 సంవత్సరాలకే 80 కిలోలు ఉండటంతో పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అధిక కేలరీల ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం ఇతరేతర కారణాలతో స్థూలకాయం వస్తుందంటున్నారు. నగరంలోని యువతలో పెరుగుతున్న స్థూలకాయం, కారణాలు, పరిష్కారం తదితర అంశాలపై ‘సాక్షి’ కథనం. శారీరక శ్రమ లేక.. చాలామంది యువతీ యువకుల్లో శారీరక శ్రమ ఉండటం లేదు. స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక.. ఆటలకు దూరమవుతున్నారు. చాలా పాఠశాలలు, కళాశాలల్లో ఆటలకు ప్రాధాన్యం తగ్గుతోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. చదువుతోపాటు ఆటల వైపు పిల్లలను ప్రోత్సహించాలి. ఫలితంగా వారికి శారీరక శ్రమ అలవాటు అవుతుంది. యువతీ, యువకులు చదువుతోపాటు శారీరక శ్రమపై దృష్టి పెట్టాలి. నిత్యం గంటపాటు వ్యాయామం చేయాలి. చెమట వచ్చేలా ఏదైనా పని చేయవచ్చు. క్రికెట్, ఫుడ్బాల్, తాడాట, ఈత, తోట పని, వేగవంతమైన నడక ఇలా ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. మితమే హితం.. ఆహారం విషయంలో మితం పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తక్కువగా తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు నిత్యం 500 గ్రాములకు తక్కువ కాకుండా చూసుకోవాలి. ఉదయం అల్పాహారం ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఆకు కూరలు, కాయగూరలు, గుడ్డు, చేపలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట 8 గంటలలోపు భోజనం ముగించాలి. సమతుల ఆహారానికి ప్రాధాన్యమిస్తూ.. జంక్ఫుడ్స్కు దూరంగా ఉండాలని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. ఒకేచోట అతుక్కుపోతూ.. చాలామంది కూర్చున్న చోటు నుంచి కదలటానికి ఇష్టపడరు. కంప్యూటర్, సెల్ఫోన్, టీవీలకు గంటల తరబడి అతుక్కుపోతుంటారు. అక్కడే భోజనం కానిస్తుంటారు. చాలామంది ఇంట్లో పనులకు దూరంగా ఉంటున్నారు. ఇళ్లు ఊడవటం.. దుస్తులు ఉతకటం.. గార్డెనింగ్ లాంటి పనులను పని మనుషులకు అప్పగిస్తున్నారు. చిన్నచిన్న పనులు పిల్లలకు అప్పగించక పోవడం వల్ల వారిలో సోమరితనాన్ని పెంచి పోషించినట్లు అవుతోంది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న చాలా ఇళ్లలో పిల్లల తిండిపై శ్రద్ధ ఉండటం లేదు. అమ్మానాన్నలతోపాటు పిల్లలకు బయట తిండే అలవాటవుతోంది. మసాలాలు, నూనెలతో కూడిన ఆహారం వల్ల తెలియకుండానే వారిలో అధిక బరువుకు దారి తీస్తోంది. రోడ్సైడ్ ఫుడ్తో.. రోడ్సైడ్ ఆహారంలో ఎక్కువ శాతం మసాలాలు, నూనెలు వాడుతుంటారు. తరచూ ఇదే ఆహారం తీసుకోవడంతో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఒకసారి బరువు పెరిగితే తగ్గించుకోవాలంటే కష్టం. స్థూలకాయం ఎన్నో రకాల శారీరక, మానసిక రుగ్మతలకు హేతువుగా గుర్తించాల్సిన అవసరముంది. వ్యక్తిగతంగా, కేరీర్ పరంగానూ ఇబ్బందే. యువతకు ఈ సమస్య మరింత నష్టం కలిగిస్తోంది. ఎలాంటి ఆహారం తింటున్నామో.. ఎంత తింటున్నామో.. అనే విషయంపై నిత్యం అవగాహనతో ఉండాలి. యుక్త వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలకు అధిక బరువు ప్రధాన కారణం. కొందరిలో ఇది తీవ్రమైన కుంగుబాటుకు దారి తీస్తుందని గుర్తించాలి. ఈ విషయంలో యువతీయువకులు తగినంత జాగ్రత్త వహించాలి. -
పాపం అంజలికి స్థూలకాయం
సాక్షి, కడప : అంజలి పేరు విని అమ్మాయి అనుకునేరు. అంజలి అంటే కోతిపేరు. ఆ కథ ఏంటో తెలుసుకుందాం... పెద్దశెట్టిపల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి, సుబ్బలక్షుమ్మలకు సంతానం లేదు. చిన్న తనంలో తన ఇంటి పరిసరాల్లో వచ్చిన కోతిని మచ్చిక చేసుకున్నారు. కోతికి అంజలి అని ముద్దుగా పేరు పెట్టారు. దీంతో వారికి కోతితో అనుంబంధం ఏర్పడింది. కోతికి ప్రత్యేకంగా డ్రెస్ కుట్టించడంతోపాటు ఇంటిలోనే ఆహార పానీయాలు పెడుతూ పోషిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి అలాగే పోషిస్తుండగా ప్రస్తుతం కోతికి స్థూలకాయం ఏర్పడింది. 14 కిలోల బరువు ఉంది. దీంతో నడవడానికి అంజలి ఇబ్బంది పడుతోంది. వైద్య చికిత్స నిమిత్తం సోమవారం గోపవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ పశువైద్య కళాశాల ప్రాంగణంలో ఉన్న వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన అనంతరం పశువైద్య నిపుణుడు అన్నం పెట్టకుండా కేవలం జొన్న, రాగులతో తయారు చేసిన వంటకాలను మాత్రమే పెట్టాలని సూచించారు. పశువైద్య కళాశాల విద్యార్థులు ఆశ్చర్యంతో శివారెడ్డిని కోతి గురించి అడిగి తెలుసుకున్నారు. -
ఈ ‘టీ’ తాగితే బరువు తగ్గొచ్చు!!
ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ మధుమేహంతో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి, సరైన వ్యాయామం లేని కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ కారణంగా తీపి తినాలనుకుంటే నోరు కట్టేసుకోవడమే కాకుండా.. తరచూ చెకప్లు చేయించుకోవడం, ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇంజక్షన్లు తీసుకోవడం పెద్ద ప్రహసనం. ఇక డయాబెటిస్తో పాటు అత్యధికులను బాధిస్తున్న మరో సమస్య ఒబేసిటి. ఈ ఆరోగ్య సమస్యలన్నింటికీ మెంతి టీతో చెక్ పెట్టవచ్చంటున్నారు న్యూట్రీషనిస్టులు. మెంతి గింజలతో తయారు చేసే తేనీరుతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అదే విధంగా పరగడుపున ఈ టీ తాగడం ద్వారా స్థూలకాయం నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొంటున్నారు. అంతేగాక కడుపునొప్పితో బాధ పడేవారికి మెంతి టీ యాంటాసిడ్గా ఉపయోగపడి.. జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుందని వెల్లడిస్తున్నారు. వేడినీళ్లలో గుప్పెడు మెంతి గింజలను కలుపుకొని తాగడం ద్వారా కొలెస్ట్రాల్ను కూడా అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు. తరచుగా ఈ టీని తాగితే కిడ్నీలో రాళ్లు కరిగించుకోవచ్చని పేర్కొంటున్నారు. మెంతి టీ తయారీ ఒక టీ స్పూను మెంతి గింజలను తీసుకుని పొడి చేయాలి. ఒక కప్పులో నీటిని తీసుకుని వేడి చేసి.. అందులో మెంతి పొడి కలపాలి. కావాలనుకుంటే టీ స్పూన్ తేనె, తులసి ఆకులు, తేయాకులను కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవచ్చు. 2-3 నిమిషాల తర్వాత ఈ టీని తాగినట్లైతే మంచి ఫలితాలు పొందవచ్చు. -
బయటకు తీసుకురావడానికి గోడని కూల్చేశారు!
పాకిస్తాన్ భారీకాయుడు నూర్ హస్సన్ను చికిత్స నిమిత్తం లాహోర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ రెస్క్యూ టీంల సహకారంతో నూర్ హస్సన్ను పంజాబ్లోని సదిక్వాబాద్ నుంచి మిలిటరీ హెలికాప్టర్లో లాహోర్కు తరలించారు. అతని తరలింపు, చికిత్స కోసం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమార్ జావేద్ బజ్వా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థూలకాయుడు హస్సన్ 330 కిలోల బరువుండి కదలడానికి కూడా వీలు లేని స్థితిలో ఉన్నాడు. దీంతోపాటు బరువు కారణంగా వచ్చిన ఇతర ఆరోగ్య సమస్యలు అతన్ని బాధిస్తున్నాయి. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం లాపొరోస్కోపీ సర్జరీ చేయించుకోనున్నాడు. అతన్ని చికిత్సకు తరలించడానికి రెస్క్యూ టీం నానాకష్టాలు పడింది. అతని శరీరం పెద్దదిగా ఉండి ఇంటి ప్రధాన ద్వారంలో పట్టకపోవడంతో ఇంటి గోడను కూల్చి బయటకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో లాహోర్కు తరలించారు. పాకిస్తాన్ మీడియా నూర్ హస్సన్ను ఆ దేశంలోనే అతి భారీకాయుడిగా వర్ణిస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం తెలియరాలేదు. 2017లో 360 కిలోల బరువున్న ఊబకాయుడు కూడా లాపొరోస్కోపీ సర్జరీ ద్వారా 200 కిలోలకు తగ్గాడు. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే నూర్ హస్సన్ ఉన్నాడు. ఓ నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 29 శాతంమంది అధిక బరువుతో బాధపడుతుండగా అందులో 51 శాతం ఊబకాయుల లిస్టులో ఉన్నారు. -
గర్భిణుల్లో మధుమేహం... పిల్లలకు ఊబకాయం?
గర్భిణి స్త్రీల రక్తంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉంటే.. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తులో ఊబకాయులుగా మారే అవకాశం ఉందని అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ టెనసీ శాస్త్రవేత్తలు. ప్లాస్ వన్ పరిశోధన జర్నల్లో ప్రచురితమైన తాజా వ్యాసం ప్రకారం.. గర్భం దాల్చినప్పుడు స్త్రీలలో తాత్కాలికంగా కనిపించే మధుమేహాన్ని గుర్తించకపోయినా ఫలితం మాత్రం మారదు. 1995 – 2004 మధ్యకాలంలో కాన్పులైన దాదాపు 40 వేల మంది గర్భిణులను తాము పరిశీలించామని.. పిల్లల వివరాలను కూడా పరిగణలోకి తీసుకున్న తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త సమంత ఎహెర్లిచ్ తెలిపారు. ఈ 40 వేల మందికీ 24, 28 వారాల గర్భం ఉన్న సమయంలో రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను పరిక్షించామని, ఏడేళ్ల వయసుకు చేరేవరకూ పిల్లల వివరాలూ సేకరించామని వివరించారు. పరిశీలన సమయంలో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే.. జెస్టేషనల్ డయాబెటిస్ ఉందా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు అదనంగా మరో పరీక్ష చేశామని సమంత తెలిపారు. అయితే సాధారణ చక్కెర మోతాదులు ఉన్న వారితో పోలిస్తే ఎక్కువ ఉన్నవారి పిల్లలు ఊబకాయులయ్యేందుకు 13 శాతం అవకాశం ఉందని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని చెప్పారు. ఒకవేళ ఆ మహిళకు జెస్టేషనల్ డయాబెటిస్ ఉంటే పిల్లలు ఊబకాయులయ్యేందుకు 52 శాతం అవకాశముందని అన్నారు. ఒకవేళ గర్భిణి స్త్రీల బాడీమాస్ ఇండెక్స్ సాధారణ స్థాయిలో ఉండి, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ పిల్లలకు ఊబకాం రాలేదన్నది తమ అధ్యయనం చెబుతోందని అన్నారు. -
ఊబకాయానికి కొత్త చికిత్స...
ఊబకాయం సమస్యను అధిగమించేందుకు కాలిఫోర్నియా యూనివర్సిటీ (శాన్ఫ్రాన్సిస్కో) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. జన్యువుల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు ఉపయోగించే క్రిస్పర్ టెక్నాలజీ సాయంతో తాము కొన్ని జన్యువుల పనితీరును నియంత్రించగలిగామని, తద్వారా ఊబకాయానికి చెక్ పెట్టగలిగామని అంటున్నారు నవనీత్ అనే శాస్త్రవేత్త. అయితే ఈ క్రమంలో జన్యువుల్లో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోవని, ఆకలికి సంబంధించిన జన్యువులపై ప్రభావం చూపడం ద్వారా ఆహారం తీసుకోవడం తగ్గిపోతుందని నవనీత్ వివరించారు. మన జన్యుక్రమంలో ప్రతి జన్యువుకూ ఒక నకలు ఉంటుందని, ఈ రెండింటిలో ఒకదాంట్లో మార్పులు చోటు చేసుకుని, రెండోది మామూలుగా ఉన్నప్పుడు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశముందని వివరించారు. ఈ నేపథ్యంలో ఎలుకల్లో తాము ఆకలికి సంబంధించిన సిమ్1, ఎంసీఆర్4ఆర్ అనే రెండు ఆకలి జన్యువులపై క్రిస్పర్ టెక్నాలజీని ఉపయోగించామని, రెండు జన్యువుల స్థానంలో ఒకటే ఉండేలా చేసినప్పుడు వాటి శరీర బరువు నియంత్రణలోకి వచ్చేసిందని, తినడం తగ్గిపోవడాన్ని గమనించామని చెప్పారు. జన్యుపరమైన మార్పులేవీ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఈ టెక్నిక్ను మనుషుల్లోనూ ప్రయోగించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. -
కునుకు లేమితో అనారోగ్యకరమైన అలవాట్లు
పిల్లలు, కౌమార వయస్కులకు తగినంత నిద్ర లేకపోవడమన్నది అనారోగ్యకరమైన అలవాట్లు ఏర్పడేందుకు కారణమవుతుందని న్యూబ్రన్స్విక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు 1.77 లక్షల మందితో జరిపిన అధ్యయనం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని లాబ్రోస్ సిడోసిస్ అనే శాస్త్రవేత్త చెప్పారు. అధ్యయనం చేసిన వారందరిలో కనీసం 40 శాతం మంది తగినంత సమయం నిద్రపోవడం లేదని ఫలితంగా వాళ్ల ఆరోగ్యపు అలవాట్లు దెబ్బతినడంతోపాటు టీవీలు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడం కూడా ఎక్కువగా ఉంటోందని.. ఇవన్నీ ఊబకాయానికి దారితీస్తున్నాయని వివరించారు. ఆరు నుంచి 12 ఏళ్ల మధ్య వయస్కుల నిద్రా సమయం 9 – 12 గంటలు కాగా.. 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు కనీసం ఎనిమిది నుంచి పది గంటలపాటు నిద్రపోవాలని వివరించారు. ఈ స్థాయిలో నిద్రపోని వారు పొద్దున్నే ఉపాహారం తీసుకోకపోవడం, పిజ్జా, బర్గర్ల వంటి ఫాస్ట్ఫుడ్కు అలవాటు పడటం, తరచూ తీపి పదార్థాలు తీసుకోవడం చేస్తున్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలిసిందని లాబ్రోస్ తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామం చేసే వాళ్లు.. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లూ కలిగి ఉన్నట్లు తెలియడం ఇంకో విశేషమన్నారు. -
వాయు కాలుష్యంతో ఒబేసిటీ
న్యూఢిల్లీ: కాలుష్యం... కాలుష్యం... ఇప్పుడు ఏ వార్తాపత్రిక చదివినా, ఏ న్యూస్ చానల్ పెట్టినా ఇదే వార్త. వాయుకాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పటి వరకు కాలుష్యానికి ప్రభావితమవుతున్న వారు ఊపిరిత్తుల, శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని మాత్రమే తెలుసు. కాగా తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో... వాయు కాలుష్యం వల్ల బరువు కూడా పెరుగుతున్నట్లు తేలింది. గాలిలోని టాక్సిన్ల వల్ల ఊబకాయం బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పది సంవత్సరాల వయసు ఉన్న చిన్నారుల్లో వాయు కాలుష్యానికి ప్రభావితమైన వారు, మంచి గాలి పీల్చుకుంటున్న వారికంటే ఎక్కువ బరువుతో ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. కలుషిత గాలి పీల్చుకోవడం వల్లే వీరు బరువు పెరుగుతున్నారని తేల్చి చెబుతున్నారు. ఇలా జరగడానికి గల కారణాన్ని పరిశోధకులు వివరిస్తూ... ‘కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి సంచులపై ప్రతికూల ప్రభావం చూపడం వల్ల కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. దీంతో తీసుకున్న ఆహారంలోని శక్తిని గ్రహించే స్థాయి తగ్గుతుంది, అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. ఈ అస్థిరతల వల్ల ఆకలిలో హెచ్చుతగ్గులు రావడంతో తమకు తెలియకుండానే ఎక్కువ తినేస్తారు. ఈ కారణంగానే ప్రజలు బరువు పెరుగుతున్నార’ని చెప్పారు. -
ఫైబ్రాయిడ్స్ మళ్లీ మళ్లీ రాకుండా తగ్గించవచ్చా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 46 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – సుహాసిని, విశాఖపట్నం గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు: ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ బాబుకు ఏడీహెచ్డీ.. తగ్గుతుందా? మా బాబు వయసు ఆరేళ్లు. ఎప్పుడూ కుదురుగా ఉండడు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. పదే పదే ఒకే మాట రిపీట్ చేస్తుంటాడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్ నుంచి ఎవరో ఒక టీచర్ మావాడి ప్రవర్తన గురించి ఏదో ఒక కంప్లయింట్ చేస్తుంటారు. డాక్టర్కు చూసిస్తే ఒకరు ఏడీహెచ్డీ అన్నారు. హోమియోలో మా వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా? – ఎస్. రంగారావు, భీమవరం ఏడీహెచ్డీ అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే వ్యాధి పేరుకు సంక్షిప్త రూపం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కూడా మీ బాబుకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ) అనే సమస్యే ఉందని అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు. సమస్యకు కారణాలు: ∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు. లక్షణాలు: ∙మతిమరపు, తలనొప్పి ∙ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు ∙మానసిక స్థితి చక్కగా లేకపోవడం ∙ఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం ∙ఇతరులను ఇబ్బంది పెట్టడం. నిర్ధారణ: రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారై చికిత్స: హోమియోలో ఏడీహెచ్డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లటి మచ్చలు... తగ్గుతాయా? నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. డాక్టర్ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. ఈ సమస్యతో నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఇది ఎందుకు వస్తుంది? హోమియోతో పరిష్కారం లభిస్తుందా? – ఆర్. శంకర్రావు, కావలి చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైమ్ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంంది. కారణాలు: ∙దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ∙కొన్నిసార్లు కాలిన గాయాలు ∙పోషకాహారలోపం ∙జన్యుపరమైన కారణాలు ∙దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు మందులు, రసాయనాలు ∙కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్లలో లోపాలు ∙వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం లేదా మన సొంత వ్యాధి నిరోధక కణాలు మనపైనే దాడి చేయడం వంటి అంశాలు బొల్లి వ్యాధి వచ్చేందుకు కొన్ని కారణాలు. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ను ఇస్తారు. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఎక్సర్టైన్మెంట్
ఫేస్బుక్, సోషల్ మీడియా, టీవీ, సినిమా.... మారోగోలి.ఎంటర్టైన్మెంట్ కావాలా?నలుగురితో కలిసి వ్యాయామం చేయండి. ఎక్సర్టైన్మెంట్లో ఉండే మజా టేస్ట్ చేయండి. ఒంటికి పని చెప్పాల్సిన యువత ఇప్పుడు కంటికి పని చెబుతోంది. ఏ స్మార్ట్ఫోన్లోనో ముఖం దాచుకొని కాలం గడిపేస్తోంది. సోషల్ మీడియాలో ముఖం కూరేసి ముచ్చట్లకు పరిమితమైపోతోంది. దీని వల్ల ఊబకాయాలు, ఊకదంపులకు పాల్పడుతోంది. ‘కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’ అన్నాడు కవి. ఈ పరిస్థితి చూస్తే ‘కొంతమంది కుర్రవాళ్లు వ్యాయామానికి అంధులు’ అనవలసి వస్తోంది. ఈ పరిస్థితిని తప్పించలేమా? తప్పించ వచ్చు. ఫేస్బుక్, సోషల్ మీడియాలలో కనిపించే వినోదం నలుగురితో కలిసి చేసే వ్యాయామంలో వెతుక్కుంటే సరదాకు సరదా ఆరోగ్యానికి ఆరోగ్యం. దానికి చేయాల్సిందల్లా కొద్దిగా శ్రమ. అంతే. యువత ఎక్సర్సైజ్లకు పూనుకుంటే అది యువతను ఎన్నో చెడు వ్యసనాల నుంచి కాపాడుతుంది. పదిమందితో కలిసి సోషలైజ్ అయ్యేలా చేస్తుంది. అసలు ప్రయోజనం బరువు తగ్గడాన్నీ చేకూరుస్తుంది. గతవారం కొన్ని సాధారణ వ్యాయామాలు ఎలా చేయాలో చూశాం. ఇప్పుడు కాస్తంత ముందుకు వెళ్దాం. ఇవి వ్యాయామాల్లో ఒకింత కష్టమైనవి కావడంతో పాటు వీటిని తర్వాతి అంచె (నెక్స్ట్ లెవెల్)గా చెప్పుకోవచ్చు. ‘హిట్’ కొట్టడం ఎలా? సాధారణ వ్యాయామాల తర్వాత కొందరికి అంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్లాలని ఆసక్తి ఉంటుంది. అది వారు వ్యాయామాల్లో ‘హిట్’ కొట్టడానికి తోడ్పడుతుంది. ఇంతకీ ఈ హిట్ ఏమిటి? హిట్ కొట్టడం ఎలా? ‘హై ఇంటెన్సివిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్’ (హెచ్ఐఐటీ)కి సంక్షిప్తరూపమే ఈ హిట్. దీనిలో మన సాధారణ వ్యాయామాలనే చాలా తక్కువ వ్యవధిలో పూర్తయ్యేలా లక్ష్యాలు నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు మీరు బ్రిస్క్ వాకింగ్ చేస్తూ మధ్యన చాలా వేగంగా జాగింగ్ చేస్తూ ఉండవచ్చు. ఇలాంటి వ్యాయామాల్లో ‘టబాటా’ అనే వ్యాయామరీతి చాలా ఫేమస్. ప్లయోమెట్రిక్స్ చాలా తక్కువ కాలంలో చాలా వేగంగా కండరాలు పెంచుకోడానికి ఉద్దేశించిందే ‘ప్లయోమెట్రిక్’ వ్యాయామం. ఇందులో పరుగెత్తే సమయంలోనే చాలా ఎత్తుకు ఎగిరి వేగంగా గుంజీళ్లు తీయడానికి అనువుగా కాళ్లు వంచడం, వేగంగా 18 అంగుళలా పెట్టేలోకి గెంతడం మళ్లీ బయటకు రావడం... ఇలాంటి వ్యాయామాలు చేస్తుంటారు. ప్లయోమెట్రిక్ వ్యాయామాల్లో గాయపడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీటిని తప్పకుండా శిక్షకుల పర్యవేక్షణలో మాత్రమే చేయడం మంచిది. కొత్తగా వ్యాయామాలు మొదలుపెట్టినవారికి ఇది అంత ఉపయుక్తం కాదు. ఇంట్లో చేయడానికి వీలుకాదు. ఆరుబయట ట్రైనర్స్ పర్యవేక్షణలోనే చేయాలి. క్రాస్ఫిట్ వ్యాయామాలు ఇందులో ఫ్లెక్సిబుల్ వ్యాయామాలతో మొదలుపెట్టి కాసేపు ఏరోబిక్ వ్యాయామాలు, మరికాసేపు మన బరువునే ఉపయోగించి చేసే క్యాలిస్థెనిక్స్, మరికాసేపు ఉపకరణాలతో బరువును ఎత్తుతూ చేసే వ్యాయామాలు కలగలిపి చేస్తుంటారు. ఇందుకోసం డంబెల్స్, పుల్బార్స్, జిమ్నాస్టిక్ రింగ్స్, జంప్రోప్స్, కెటిల్బాల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్స్, తాళ్లు లాగుతూ చేసే రోయింగ్ మెషిన్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి బిగినర్స్కు అంత మేలు చేసేవి కాదు. ఇంట్లోనూ చేయవచ్చు కానీ జిమ్లో అయితే ఉపకరణాల లభ్యత బాగా ఉంటుంది. జుంబా ఇదొక డాన్స్ లాంటి వ్యాయామ ప్రక్రియ. దీన్ని కొలంబియన్ డాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన అల్బర్టో ‘బీటో’ పెరేజ్ 1990లలో రూపొందించాడు. ఇందులో లయబద్ధంగా డాన్స్ చేయడంతో పాటు ఒంటి కదలికలు సంగీతానికి అనుగుణంగా హాయిగా కదిలిస్తూ చేస్తుంటారు. దీనిలో హిప్–హాప్, సోకా, సాల్సా, మెరెంగ్యూ, మాంబో వంటి నృత్యరీతులు కలగలిసి ఉంటాయి. గుంజీళ్లు తీసినట్లుగా మోకాళ్లు వంచడం జరుగుతుంటుంది. దీని శిక్షణ కోసం జుంబా ట్రైనర్స్ దగ్గరికి వెళ్లాలి కాబట్టి ఖర్చుతో కూడిన వ్యవహారమే. అయితే స్తోమత, ఆసక్తి ఉన్న బిగినర్స్ అనుసరించదగిన పద్ధతే. బరువు తగ్గడానికి బాగా పనికివచ్చే తేలికపాటి ఉత్సాహవంతమైన మార్గం ఇది. టబాటా ఒక్కొక్క వ్యాయామాన్ని చాలా వేగంగా 20 సెకన్లు చేస్తూ... ఆ 20 సెకన్లు పూర్తికాగానే మళ్లీ 10 సెకన్లు విశ్రాంతి తీసుకుంటూ... మళ్లీ మరో 20 సెకన్లు మరో ఏరోబిక్ను ఎంచుకుంటూ... ఇలా నాలుగు నిమిషాలు వ్యాయామాన్ని కొనసాగించడాన్ని ‘టబాటా’ ప్రక్రియ అంటారు. ఇది ఎంతో పాపులర్ ‘హై ఇంటెన్సివిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్’ (హిట్) ప్రక్రియ. ఇందులో కొవ్వు దహనం కావడం మాత్రమే కాదు... భస్మం అవుతుందనడంలో సందేహం లేదు. ఇంగ్లిష్లో చెప్పాలంటే... ఇది కొవ్వును బర్న్ చేయడం కాదు... బ్లాస్ట్ చేస్తుంది. టబాటా ప్రయోజనాలు దీన్ని అప్పుడే వ్యాయామాలు మొదలుపెట్టిన బిగినర్స్ మొదలుకొని ఎవరైనా చేయవచ్చు. ఔట్డోర్స్లో, ఇంట్లో... ఎక్కడైనా చేయవచ్చు. క్రాస్ ట్రైనింగ్ వ్యాయామాలు క్రాస్ ట్రైనింగ్ అంటే మరేదే ప్రత్యేకమైనవి కాదు... మీకు ఆసక్తి చచ్చిపోకుండా ఉండేందుకు రకరకాల వ్యాయామ రీతులను మార్చి మార్చి చేస్తూ... వ్యాయామం నుంచి గరిష్ఠ ప్రయోజనం పొందేందుకు చేసేవి.ఉదాహరణకు మొదట రెండు నిమిషాలు దూకుతూ మోకాళ్లు పూర్తిగా ఒంచే స్వాట్ జంప్స్ చేసి వెంటనే మరో రెండు నిమిషాలు స్కిప్పింగ్, ఆ తర్వాత ఇంకో రెండు నిమిషాలు మోకాళ్లు నడుము పై వరకు వచ్చేలా హైనీస్, ఇంకో రెండు నిమిషాల రన్నింగ్, తర్వాత పుష్లప్స్ ఇలా... మార్చి మార్చి చేస్తూ పది నిమిషాలు కొనసాగించాలి. రెండు నిమిషాల విశ్రాంతి తర్వాత మళ్లీ ఇదే కొనసాగించాలి. ఇలా చేస్తే గంటలో 5 కాంబినేషన్ సెట్లు పూర్తవుతాయి. ఈ కాంబినేషన్ అన్నది మీరు ఆశించే ప్రయోజనాలకు అనుగుణంగా కూడా రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఏ ఎస్ఐ సెలెక్షన్లో భాగంగా ఎక్కువ దూరం పరుగెత్తేలా శిక్షణ తీసుకోదలిస్తే... వేగంగా పరుగెత్తే వ్యాయామాలను ఎక్కువగా అందులో భాగం చేసుకోవాలి. వీటినీ ఖర్చు లేకుండా ఔట్డోర్స్లో హాయిగా చేయవచ్చు. బిగినర్స్ కూడా నిరభ్యంతరంగా మొదలుపెట్టవచ్చు. బూట్ క్యాంప్ వ్యాయామాలు ఇవి మిలటరీ తరహా వ్యాయామాలు. అయితే వీటిలో ఒంటి బరువును ఉపయోగించడంతో పాటు ట్రాక్టర్ టైర్ల వంటివి కూడా వాడుతూ చేయవచ్చు. మన ఒంటి బరువుతో పుష్అప్స్, పుల్ అప్స్ చేస్తూ, టైర్లు ఎత్తి ఎత్తి దొర్లిస్తూ, తాళ్ల వంటివాటిని అలల్లా బలంగా కదిలిస్తూ క్రమం తప్పని ఇంటర్వెల్స్లో చేసే ఈ వ్యాయామాలను ‘ఇంటెన్సివ్ ఎక్స్ప్లోజివ్ ఎక్సర్సైజ్ రెజీమ్’గా చెప్పవచ్చు. వీటిని అప్పుడే వ్యాయామం ప్రారంభించిన బిగినర్స్తో పాటు క్రమం తప్పక కొంతకాలం సాధారణ వ్యాయామం చేసేవారు తమ వ్యాయామరీతులను మరో అంచెకు చేర్చడానికీ వీటిని చేయవచ్చు. ఇవి కాస్త స్థలం ఉంటే ఇంట్లోనూ చేయడం వీలవుతుంది గానీ... ట్రాక్టర్ టైర్ల వంటివి ఎత్తి పడేయడం కోసం ఔట్డోర్స్ బాగా ఉపయుక్తం. ఇక ఉపకరణాల విషయానికి వస్తే ప్రత్యేకంగా వ్యాయామ ఉపకరణాలు అవసరం లేదు. ఇంట్లో ఉండే నిరుపయోగమైన బరువైన వస్తువులనూ వాడుకోవచ్చు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మీ సందేహాలను ఈ కింది ఈమెయిల్కి పంపి, నిపుణులచే సరైన సమాధానాలు తెలుసుకోవచ్చు. oobacolumn@gmail.com స్విస్ బాల్... కొత్త దనం కోరుకునే ఫిట్నెస్ ప్రియుల కోసం ఇటీవల ప్రాచుర్యంలో కి వచ్చింది స్విస్ బాల్. దీనిని జిమ్ బాల్ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా ఎక్సర్సైజ్బాల్స్ మన దగ్గర జిమ్ లలో వాడుతున్నారు. ఇవి 55సెం.మీ, 65 సెం.మీ, 75 సెం.మీ ల పరిమాణంలో లభిస్తున్నాయి.రీబాక్ హర్బింగర్,నైక్ తదితర కంపెనీలు విభిన్న రకాల ప్రయోజనాలతో వీటిని రూపొందిస్తున్నాయి. కనీసం రూ..2,000 నుంచి రూ..5,000 దాకా అందుబాటులో ఉన్నాయి. మామూలుగా చేసే వ్యాయామాలే బాల్ ఆధారంగా చేయడం ద్వారా మరింతగా కేలరీలు ఖర్చు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీని వల్ల కోర్ మజిల్ పై ఒత్తిడి ఎక్కువ పడుతుంది. స్టెబిలిటీని, బాడీ బ్యాలెన్స్ని సరిచూసుకునేందుకు పనికొస్తుంది. ఈ వర్కవుట్లు పక్కటెముకల కింద ఉండే ఆబ్లిక్స్ (ఇంటర్నల్, ఎక్స్ టర్నల్) ను పటిష్టపరుస్తాయి. ప్రారంభంలో దీని మీద కదలకుండా విభిన్న భంగిమల్లో కాసేపు నిశ్చలంగా ఉన్నా కూడా మంచి వర్కవుట్ అవుతుంది. దీనిని ఉపయోగించి యాబ్స్, సిటప్స్, పుషప్స్... వగైరా విభిన్న రకాల వర్కవుట్స్ చేయవచ్చు. స్పిన్నింగ్...కేలరీ బర్నింగ్ మొత్తం ఎక్సర్సైజ్ చేసే హాల్ను ఓ డిస్కో«ధెక్లా తలపించే లా చేసే కొత్త వ్యాయామశైలి స్పిన్నింగ్. ఇది వ్యాయామప్రియుల్ని ఉర్రూతలూగిస్తుంది. సైక్లింగ్ తరహాలో ఉండే లేటెస్ట్ స్టైల్ ఎక్సర్సైజ్ ఓ గ్రూప్ యాక్టివిటీ. దీనిని హై కార్డియో వాస్క్యులర్ యాక్టివిటీగా ఫిట్నెస్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. అమెరికా, కెనడాల్లో ఇది అత్యుత్తమ ఇండోర్ ఎక్సర్సైజ్గా ప్రసిద్ధి చెందింది.స్పెషల్గా డిజైన్ చేసిన ఎక్సర్సైజ్ బైక్ దీని స్పెషాలిటీ. ఈ స్పిన్నింగ్ బైక్కి ఫిక్సడ్ గేర్ రేసింగ్ హ్యాండిల్బార్స్, పెడల్స్, ఎడ్జస్ట్బుల్ సీట్... వంటివి ఉంటాయి. వర్కవుట్లోని సామర్ధ్యం హె చ్చుతగ్గులను బైక్ కున్న రెసిస్టెన్స్నాబ్ ద్వారా నియంత్రించుకోవచ్చు. హార్ట్రేట్ మానిటర్స్ బైకర్స్ను గైడ్ చేస్తుంటాయి. వ్యక్తి ఎత్తు బరువుని బట్టి స్పిన్నింగ్ ఎడ్జెస్ట్మెంట్కు అవకాశం. ఉంటుంది. ప్రయోజనాలెన్నో... ఈ స్పిన్నింగ్తో తొడల ముందు, తుంటి భాగంలో ఉన్న ఫ్యాట్ కరుగుతుంది. మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరుగుతుంది. లాక్టిక్ యాసిడ్ ప్రభావాన్ని అదుపుచేసి మజిల్స్ తొందరగా అలసిపోయే పరిస్ధితిని నివారిస్తుంది. నిమిషంలో 60–80 రౌండ్స్ నుంచి 80–120 వరకూ చేయగల్గితే అద్భుతంగా ఫ్యాట్లాస్కి ఉపకరిస్తుంది. వ్యక్తి బరువును బట్టి 45 నిమిషాల స్పిన్నింగ్ ద్వారా 600 కు పైనే కేలరీలను ఖర్చు చేయవచ్చు. కార్డియో కిక్ బాక్సింగ్... కరాటే పంచ్లు, బ్లాక్స్, కిక్స్ వంటివి సంప్రదాయ ఏరోబిక్స్తో మిళితం చేసిన అన్ని వయసుల వారికీ అనుగుణమైన ఫిట్నెస్ ప్రోగ్రామ్ కార్డియో కిక్ బాక్సింగ్. అత్యుత్తమ ఫ్యాట్ని కరిగించే సాధనంగా చెప్పవచ్చు. బరువు తగ్గడంతో పాటు ఫిట్నెస్ సాధించాలనుకునేవారు రొటీన్కి భిన్నంగా ఎంచుకోదగ్గది. ప్రారంభంలో సాధన చేసేవారు 1 గంటలో 400– 500 క్యాలరీలు, కొంత అలవాటైన తర్వాత 800–900 క్యాలరీలు ఖర్చు చేయవచ్చు. మరిన్ని లాభాలు దీని ద్వారా పూర్తి దేహానికి వ్యాయామం అందుతుంది. కంటికి, దేహానికి సమన్వయం పెంచుతుంది. కదలికల్లో వేగం పెంచుతుంది. కిక్స్, పంచెస్ ఇచ్చేపుడు లోయర్బాడీని బ్యాలెన్స్ చేసుకునే అవసరం ద్వారా కాళ్ళకు, నడుం కింది భాగానికి ఫిట్నెస్ లభిస్తుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్ తదితర పంచ్లతో స్వీయరక్షణ కూడా సాధ్యపడుతుంది. మోకాలు, లోయర్బ్యాక్లపై తక్కువ భారాన్ని మోపే వ్యాయామం ఇది. ప్రారంభంలో మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రయినర్ని తప్పనిసరిగా ఎంచుకోవాలి. పరిణతి సాధించాక ఒక పంచ్బ్యాగ్ను ఏర్పాటు చేసుకుని స్వంతంగానే సాధన కొనసాగించవచ్చు. ఆక్వా వర్కవుట్స్... పూల్లో స్విమ్మింగ్తో సరిపెట్టేయకుండా నీళ్ళలోనే కాసేపు గడిపి బోలెడన్ని వర్కవుట్లు చేయాలని ఆశించే వారికి మంచి మార్గం ఆక్వాఏరోబిక్స్. కంఠం వరకూ నీళ్ళలో నిలబడి గాలిలోకి చేతులు జాపుతూ చేసే ఎరోబిక్స్, తక్కువ బరువుతో చేసే వెయిట్ ట్రయినింగ్, స్ట్రెచ్చింగ్... వంటివన్నీ ఇందులో భాగమే. వీటినన్నింటినీ కలిపి ఆక్వా ఏరోబిక్స్ గా వ్యవహరిస్తారు. లాభాలివే నీటిలో వ్యాయామాలతో గాయాలు కావడం జరగదు. నీటికి సాంద్రత ఎక్కువని తెల్సిందే. నీళ్ళలో కదలికలు కాస్త కఠినంగా అన్పించడానికి కారణమిదే. ఫలితంగా దేహంలోని కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. తద్వారా బాడీ టోనింగ్కూ ఉపకరిస్తుంది. నేలమీద చేసే ఏరోబిక్స్లో గంట వర్కవుట్కు 250–400 కేలరీలు ఖర్చయితే వాటర్లో చేసే ఈ ఏరోబిక్స్కు కనీసం 650–700 కేలరీలు ఖర్చవుతాయి.వీటిని చేయడానికి స్విమ్మింగ్ తెల్సి ఉండనక్కర్లేదు. అయితే స్విమ్సూట్, నీళ్ళలో ఉండగా స్దిరత్వాన్ని అందించేందుకు ఆక్వా షూస్, తల వెంట్రుకలు ముఖం పై పడి ఇబ్బంది పెట్టకుండా స్విమ్ క్యాప్స్ అదే విధంగా ఆక్వాబ్లాక్స్, ఫ్లోటేషన్ బెల్ట్స్,గ్లోవ్స్,కిక్బోర్ట్స్, ఆక్వాస్టెప్... వంటివి అవసరం. బయట చేసే నడవడం, రన్నింగ్, స్ట్రెచ్చింగ్ వర్కవుట్స్ నీళ్ళలో కూడా చేయవచ్చు. జంపింగ్ జాక్స్ తరహా వ్యాయామాలు దేహంలోని అన్ని మజిల్స్కూ పని కల్పిస్తాయి. స్కైయింగ్ మోషన్ బ్యాక్, ఫోర్త్, లంగ్స్ ఇన్ ఛెస్ట్ డీప్ వాటర్, కిక్ బాక్సింగ్ మూవ్స్... వంటివి కూడా వర్కవుట్లో భాగంగా మార్చుకోవచ్చు. ఈ వర్కవుట్ల కోసం ప్రత్యేకమైన పరికరాల్లో ఆక్వా డంబెల్స్ ఒకటి. ఈ డంబెల్స్తో చేతులు, బైసప్స్, ట్రైసప్స్, షోల్డర్స్కు నీళ్ళలో ఉండే వ్యాయామాలు చేయవచ్చు.వీటిలో దేన్ని ఎంచుకోవాలనుకున్నా... మొదట మీ డాక్టర్ను సంప్రదించి మీకు ఏది అనువైనదో నిర్ణయించుకున్న తర్వాత చేయాలి. మీ శరీర సామర్థ్యం, నిర్మాణం, మీకు ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీ డాక్టర్ మీకు అనువైన వాటిని సూచిస్తారు. మీరు వాటిని తప్పక అనుసరించడం చాలా మంచిది. ఎమ్. వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్ హైదరాబాద్ -
ఆరోగ్యకరమైన బరువుకు సూచిక బీఎంఐ కాదు..!
ఊబకాయం ఉంటే బోలెడన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని మనం వినే ఉంటాం. చాలా ఆరోగ్య సమస్యలకు చికిత్స ‘తగినంత’ కంటే ఎక్కువ బరువు ఉండటమేనని అనడమూ కద్దు. అందుకే దాదాపు వందేళ్లుగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అనే లెక్కకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే తాజా పరిశోధనలు మాత్రం ఆరోగ్యకరమైన బరువు ఎంత అనేందుకు బీఎంఐ ఒక్కటే సూచిక కాదని అంటోంది. శరీరం బరువుకు, ఎత్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపే బీఎంఐ చాలా ఎక్కువన్నప్పటికీ పదిశాతం కంటే తక్కువ కొవ్వు ఉండేవాళ్లు మనచుట్టూ ఎందరో ఉన్నారు. అంతేకాదు.. ఊబకాయంతో ఉన్న వారందరికీ మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి వచ్చే అవకాశాలు లేవని కూడా ఇప్పటికే చాలా అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో బరువుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎవరికి ఉన్నాయో తెలుసుకునేందుకు చుక్క రక్తం ఉపయోగపడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. రక్తంలోని జీవక్రియలకు ఉపయోగపడే అనేకానేక రసాయనాల మోతాదులను గుర్తించడం ద్వారా గుండెజబ్బులు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలను 80 – 90 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చునని వీరి అంచనా. కొన్ని వేల మందిని పరిశీలించిన తరువాత తామీ అంచనాకు వచ్చినట్లు సెల్ ప్రెస్ శాస్త్రవేత్తలు తెలిపారు -
కదలండి.. తగ్గుదాం
కదలకపోవడం జడత్వం.కదలడం చైతన్యం.ఊబకాయం ప్రమాదకరమైన శారీరక అవస్థ.అదుపు తప్పిన బరువు అన్ని రుగ్మతలకు హేతువు.కాని ప్రయత్నిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చు. ఇంట్లోనూ బయటా డబ్బు ఖర్చు కాని పద్ధతిలో వ్యాయామం చేసి బరువు తగ్గవచ్చు.ఉత్సాహకరమైన శరీరమే ఉజ్వలమై భవిష్యత్తు.ఊబగా ఉన్న ఈ గతాన్ని వదిలేయండి.వెలుతురు నిండిన భవిష్యత్తు వైపు అడుగు వేయండి.కదలండి. బరువు తగ్గండి. ప్రమాదకరమైన వ్యాధులనగానే గుండెపోటు, మధుమేహం, క్యాన్సర్ అనుకుంటాం. కాని ఊబకాయం కూడా ప్రమాదకరమైన వ్యాధిలాంటిదే. ఈ వ్యాధికి విరుగుడు బరువు తగ్గడం. అందుకు సరైన మందు వ్యాయామం. దీని కోసం జిమ్లు, వ్యాయామశాలల్లో చేరనక్కర్లేదు. ఇంట్లో ఉంటూ బయట నడుస్తూ కూడా వ్యాయామాన్ని పూర్తి చేయవచ్చు. ఫలితంగా బరువు తగ్గవచ్చు. మేలు చేసే వ్యాయామం ► సమతుల ఆహారం తింటూ, సరైన వ్యాయామాలు చేస్తూ ఉంటే బరువు పెరుగుతుందనే భయమే ఉండదు. క్యాలరీల పట్ల మరీ అప్రమత్తంగా ఉండాల్సిన బాధ ఉండదు. రాబోయే వ్యాధులకు అడ్డుకట్ట వేసే శక్తి వ్యాయామానికి ఉంది. బీపీ, కొలెస్ట్రాల్ వంటివి నియంత్రణలో ఉంచి గుండెపోటు రాకుండా నివారిస్తుంది వ్యాయామం. దీని వల్ల దేహం ఆరోగ్యవంతమై వ్యాయామాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యాయామం ఎప్పుడు చేస్తామో అప్పుడు బరువు పెరగకుండా ఉంటుంది. ► క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ కూడా పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా కోలన్, బ్రెస్ట్ క్యాన్సర్లు. ► వ్యాయామం చేయడం వల్ల జరిగే మేలైన ప్రయోజనం ఆత్మస్థైర్యం పెరగడం. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. వ్యాయామానికి అనువుగా ఉంటుంది. బరువును నియంత్రణలో ఉంచుకోగలుగుతుంది. ► బరువు తగ్గేందుకే కాదు ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా వ్యాయామం ఉపయోగపడుతుంది. జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తుంది. 30 నిమిషాలు తప్పనిసరి బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారు సులువుగా చేయదగిన ఎరోబిక్ వ్యాయామాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అవి.. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ వంటివి. వీటిని వారంలో కనీసం మూడుసార్లు 30 నిమిషాల చొప్పున చేయాలి. బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రం 30 నిమిషాల కన్నా అదనంగా చేస్తేనే అధిక బరువు తగ్గడం ప్రారంభిస్తారు. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందు మోడరేట్ ఎక్సర్సైజులతో (ఆధునిక జీవనశైలిలో మార్చుకునేవి) బాడీని వార్మ్అప్ చేయాలి లేదా ఓ పదిహేను నిమిషాలు రెండు కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. దీని వల్ల 100 అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఆపై 30 నిమిషాల పాటు చేసే ఎరోబిక్ వ్యాయామాల వల్ల 700 క్యాలరీలు ఖర్చు అయ్యి, ఏడాది మొత్తంలో 5 కిలోల అదనపు బరువు తగ్గుతారు. గుండెవేగాన్ని లెక్కించాలి ఒకసారి వ్యాయామానికి అలవాటుçపడ్డాక ఆరోగ్యం బాగుంది అనే భావన కలిగి ఉత్సాహం వస్తుంది. దీంతో ఇంకాస్త అధిక తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకుంటారు. అవి ఎంత కష్టమైనవైనా చేయగలుగుతారు. మీ గుండెవేగాన్ని క్రమంగా పెంచుతూ తిరిగి నార్మల్ చేస్తూ వ్యాయం చేస్తే బరువు తగ్గుతారు. ఒక వ్యక్తి తన గుండె వేగాన్ని ఎంత వరకు పెంచాలో ఎలా తెలుస్తుంది?సులభం. మీ వయసును 220 నుండి తీసేసి, ఆ సంఖ్యను 70 శాతంతో లెక్కిస్తే ఎంత సంఖ్య వస్తుందో అంత సంఖ్యకు గుండె వేగాన్ని పెంచాలి. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి 126 సార్లు గుండె వేగంగా కొట్టుకునే స్థాయికి వ్యాయామం చేయాల్సి ఉంటుంది. వ్యాయామం వల్ల కలిగే ఫలితాలను మన శరీరం పొందాలంటే వ్యాయామంలో ఒక వేగం పాటించడం అవసరం. ఈ వేగం ద్వారా మన గుండె వేగాన్ని కూడా 135 – 150 స్పందనలకు పెంచాలి. ఆ హార్ట్బీట్ను కనీసం 40 నిమిషాల సేపు కొనసాగనివ్వాలి. ఒకే వ్యాయామ రీతిని 40 నిమిషాలపాటు కొనసాగినివ్వాలంటే విసుగ్గా అనిపించినప్పుడు వాకింగ్, స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్.. ఇలా మార్చి మార్చి కూడా చేసుకోవచ్చు. బోర్ కొట్టకపోతే ఒకే వ్యాయామరీతిని కొనసాగించవచ్చు. వైద్యులను సంప్రదించాలా? మీకు బలమైన గాయాలు, మధుమేహం లేదా గుండె సమస్యలు ఉంటే వ్యాయామాలు ప్రారంభించడానికి ముందు జనరల్ ఫిజీషియన్ను కలిసి మీ ఫిట్నెస్ ప్రోగ్రామ్ని వివరించి, వారి సాయం తీసుకోవడం అవసరం. లేదా వారి సూచన ప్రకారం నిపుణులైన ఫిజియోథెరపిస్ట్ లేదా సర్టిఫైడ్ ఫిట్నెస్ నిపుణులను సంప్రదిస్తే మీకు సరైన వర్కవుట్స్ను నిర్ణయిస్తారు. ప్రతి ఇబ్బందికీ ఆల్టర్నేట్ వ్యాయామాలు ఉంటాయి. వాటిని తెలుసుకుని చేయాలి. ఉత్సాహంగా చేస్తున్నారా? ఏ పనైనా ఇష్టంగా చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. వ్యాయామం చేయాలని నిర్ణయించుకున్నాక మీరు దానిని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదా అని ప్రశ్నించుకోవాలి. ‘ఎస్’ అనే సమాధానం వస్తే మీరు ఎక్సర్సైజ్లను రోజూ చేయవచ్చు. ఎరోబిక్స్ ఎందుకంటే! చాలామంది రెగ్యులర్ జిమ్ వ్యాయామాల కంటే ఎరోబిక్స్ని ఇష్టపడతారు. కారణం దీంట్లో కష్టం అనిపించకపోవడం. పైగా, ఏ వ్యాయామాన్ని చేయాలనే నిబంధన ఎరోబిక్ ఎక్సర్సైజుల్లో ఉండదు. ► ఎరోబిక్ ఎక్సర్సైజులు మీ గుండెకు రక్తప్రసరణను వేగవంతం చేస్తాయి. ► వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ వంటివన్నీ చేసినంత ఫలితం ఎరోబిక్ ఎక్సర్సైజుల్లో కలుగుతుంది. అంతేకాదు– వర్కవుట్స్కి ట్రెడ్మిల్, ఎలిప్టికల్, స్టెయిర్ స్టెప్పెర్ వంటì ఫిట్నెస్ మిషనరీని ఉపయోగించినంత ప్రయోజనమూ చేకూరుతుంది. బరువుకు తగిన శిక్షణ అధిక కొవ్వును తొలగించడానికి, కండరాల వృద్ధికి పెద్ద ప్రయోజనం చేకూర్చేవి వర్కవుట్స్. అందుకు సుశిక్షితులైన నిపుణుల సాయం అవసరం. వీటిని వారానికి మూడుసార్లు చేయడం వల్ల ప్రధాన కండరాల సముదాయం బలపడుతుంది. అవి ఏంటంటే.. ► ఉదరం ► వీపు ► పిరుదులు ► మణికట్టు ► ఛాతీ ► ముంజేతులు ► మోకాలు ► తొడ ► భుజాలు ► బాహువులు ఆరోగ్యకర జీవన అలవాట్లు ► నడవడం లేదా ౖసైకిల్ తొక్కడం లేదా పని చేయడం లేదా పరిగెత్తడం ► లిఫ్ట్ లేదా ఎలివేటర్ని ఉపయోగించడానికి బదులు మెట్లు ఎక్కడం ► మీరు చేరుకోవాల్సిన చోటుకు నడవగలిగినంత దూరంలోని పార్కింగ్ ఏరియాలో మీ వాహనాన్ని పార్క్ చేసి, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లడం. రోజులో ఎన్ని క్యాలరీలు కావాలి? పురుషుడికైతే 2,200 క్యాలరీలు రోజుకు అవసరం. అదే మహిళకు 1,800 క్యాలరీలు అవసరం. ఇక కేలరీల ఖర్చు విషయానికొస్తే ఆడ–మగ ఇద్దరి పనులలో తేడాలు ఉంటాయి. అలాగే, ఒక గంటకు క్యాలరీ ఖర్చులో తేడాలుంటాయి. రోజూ చేసే పనుల వల్ల ఖర్చయ్యే క్యాలరీలు: ► బాడ్మింటన్ ఆడటం లేదా ఇంటిని శుభ్రపరచడం వల్ల గంటకు: 240 – 300 క్యాలరీలు ఖర్చు చేస్తారు. ► బ్రిస్క్ వాకింగ్ (12 నిమిషాలకు 1.5 కిలోమీటర్ల లెక్కన), సైక్లింగ్, డ్యాన్సింగ్ (గంటకు) : 370 – 460 క్యాలరీలు ► ఫుట్బాల్ ఆడటం, జాగింగ్ (9 నిమిషాలకు 1.5 కిలోమీటర్ల లెక్కన) లేదా స్విమ్మింగ్ : 580 – 730 క్యాలరీలు ► రన్నింగ్ (7 నిమిషాలకు 1.5 కిలోమీటర్ల లెక్కన గంటకు) : 740 – 920 క్యాలరీలు ఇంటిని శుభ్రపరచడం ఒక గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ, ఆ పనిలో మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. కనుక హృదయ స్పందన వేగం పెరగదు. అందుచేత క్యాలరీల ఖర్చు తక్కువ ఉంటుంది. అదేవిధంగా, చాలా మంది ఒక సాధారణ నడకతో ఎక్కువ దూరం ప్రయాణించినప్పటికీ అవసరమైన తీవ్రత లేక హృదయ స్పందన రేటును చేరుకోక బరువు తగ్గరు. కాబట్టి, వ్యాయామం చేసే సమయంలో గుండె వేగం పర్యవేక్షించడం ముఖ్యం. ఎందుకంటే అధిక బరువు తగ్గాలంటే ఒక క్రమ తీవ్రతలో వ్యాయామం చేయాలి. ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్లో ► అధికబరువు ఉన్నవాళ్లు ధూమపానం, మద్యపానం వెంటనే మానేయాలి. ► మీరు ఓ కొత్త వ్యాయామాన్ని ప్రారంభించినప్పుడు మీ శరీరం మీకు ఇచ్చే సంకేతాలపట్ల శ్రద్ధ చూపడం ముఖ్యం. మీ ఫిట్నెస్ స్థాయి మెరుగుపరచడానికి మీతో మీరు ఢీకొనాలి. అయితే వ్యాయామ స్థాయిలను పెంచుతూ పోవడం వల్ల ఒక్కోసారి గాయపడవచ్చు. అందుకని నొప్పి, శ్వాసలో తేడాలు వచ్చినప్పుడు వ్యాయామం చేయడం ఆపేయాలి. ఇలాంటప్పుడు వ్యాయామం మరో ఎంపిక తీసుకోవచ్చు. ట్రెడ్మిల్, స్టెప్పర్స్, ఎల్లిప్టికల్స్ ఈ తరహా మెషిన్లు మంచి ఎరోబిక్ వ్యాయామాన్ని అందిస్తాయి. అయితే వీటిలో కూడా సత్ఫలితాలు దుష్ఫలితాలు ఉన్నాయి. ఈ మెషిన్లపై వ్యాయామం అత్యంత చురుగ్గా ఉంటుంది ఆనందాన్ని కూడా అందిస్తుంది. వ్యాయామ ప్రారంభంలో ఉన్నవారికి, అలాగే తక్కువ ఫిట్నెస్ స్థాయిలు ఉన్నవారికి ఇవి సరైన ఎంపిక. వ్యక్తిగత ఫిట్నెస్ స్థాయిలకు తగ్గట్టుగా వీటిలో సెట్టింగ్స్ను మార్చుకునే వెసులుబాటు ఉండడం మరొక ఉపయుక్తమైన అంశం. మన సామర్ధ్యానికి తగ్గట్టుగా ఇది నప్పుతుందా లేదా అని తేల్చుకోవడానికి స్టోర్ లేదా ఫిట్నెస్ సెంటర్లో ట్రయల్ రన్కు ప్రయత్నించవచ్చు. ఈ మెషిన్ల వల్ల ఉన్న మరో ప్రధాన ఉపయోగం ఏమిటంటే... వాతావరణంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా చేయదగ్గ ఇండోర్ యాక్టివిటీని ఇవి అందిస్తాయి. కాని మోకాలి సమస్య లేదా పిరుదుల సమస్య ఉన్న వ్యక్తులు స్టెయిర్ క్లైంబర్స్, స్టెప్పర్స్కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ మెషిన్లు కీళ్లపై అదనపు భారాన్ని మోపుతాయి. వాకింగ్ మీ ఫిట్నెస్ స్థాయిని, సామర్థ్యాన్ని నడక పెంచుతుంది. ఇతరత్రా ఫిట్నెస్ పరికరాలు దీనికి అవసరం లేదు. ఇంట్లోనూ, బయట ఎప్పుడైనా, ఎక్కడైనా నడవ్వచ్చు. మాల్స్, ఇండోర్ ట్రాక్స్ లేదా ట్రెడ్మిల్.. ఏదైనా నడవడం ప్రధానం. ఆరోగ్యంగా ఉండటానికి రోజూ 10,000 అడుగులు వేయాలి. మీరు అదనపు బరువు కోల్పోవాలనుకుంటే 12,000 అడుగులు వేయాలి. రోజుకు వేసే అడుగుల సంఖ్యను కచ్చితంగా తెలుసుకోవాలంటే పెడోమీటర్ పర్యవేక్షణతో తెలుసుకోవచ్చు. 10,000 అడుగులు అంటే ఉజ్జాయింపుగా 8 కిలోమీటర్లు. యోగా అమెరికాలోని ‘ఫ్రెడ్ హాచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్’ పరిశోధకులు బరువు తగ్గేందుకు యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే సంగతి గురించి ఓ అధ్యయనం చేశారు. యోగా ఇతర రకాల వ్యాయామాల మాదిరిగా బరువు తగ్గించడంలో తీక్షణంగా పని చేయకపోయినా దానిని నిత్యం సాధన చేయండం వల్ల ఆహారం, అలవాట్లకు సంబంధించి ఆరోగ్యకరమైన నియమావళి ఏర్పడి ఊబకాయం తగ్గడానికి పరోక్షంగా ఉపయోగపడుతుందని తేల్చారు. స్విమ్మింగ్: ఇది ఒక అద్భుతమైన ఎరోబిక్ వ్యాయమం. అయితే ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తలు అవసరం. తక్కువ శక్తి–సామర్ధ్యం కలిగిన వారికి గతంలో స్విమ్మింగ్ చేయని వారికి నిర్ణీత 30 నుంచి 60 నిమిషాల పాటు ఈత కష్టం కావచ్చు. అందుకే క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. మొలలోతు నీళ్లలో అటూ ఇటూ నడవడం కూడా వ్యాయామం కిందకే వస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు స్విమ్మింగ్కు ముందు తమ ఫిజిషియన్ని సంప్రదించడం మంచిది. జాయింట్ పెయిన్స్ ఉన్నవారికి వాటర్ ఎరోబిక్స్ మంచి ప్రత్యామ్నాయం. నీటికి ఉన్న తేల్చే గుణం కారణంగా కీళ్లపై తక్కువ ఒత్తిడి పడుతుంది. స్విమ్మింగ్ పూల్లో రెయిలింగ్ పట్టుకొని పెడలింగ్ చేసినట్టుగా కాళ్లు ఆడించినా స్విమ్మింగ్తో ప్రయోజనాలే కలుగుతాయి. సైక్లింగ్ : రోజూ ఇంటికి ఏదో ఒక చిన్న చిన్న కిరాణ సామగ్రి అవసరం పడుతుంది. ప్రతీదానికి బైక్ కాకుండా సైకిల్ వేసుకొని వెళ్లండి. ఎముకలు పెళుసుబారడం, కీళ్లవాతం, కీళ్లనొప్పులు.. వంటి సమస్యలు ఉంటే నడకను ఎంచుకోండి. వాకింగ్, సైక్లింగ్ రెండూ హృదయనాళ వ్యవస్థకు మేలైన ప్రయోజనాలు ఇస్తాయి. అధికబరువు గలవారికి సైక్లింగ్ సరైన ఎంపిక. యాంత్రిక జీవనంలోని స్ట్రెస్ నుంచి గుండెకు రిలీఫ్ లభిస్తుంది. వెన్ను, పిరుదులు, మోకాళ్లు, మడమలలోని ఒత్తిడి కూడా నడక వల్ల రిలీజ్ అవుతుంది. -
మెదడు... మెథడు
బరువు తగ్గడానికి డైట్ ప్లాన్స్ చూశారు. ఆ ప్లాన్స్తో పాటు ఇంకో కొత్త ప్లాన్ కూడా ఉంది. అదే లైఫ్స్టైల్ ప్లాన్. మీ రోజువారీ లైఫ్ని కాస్తంత మార్చుకుంటే కంట్రోల్ చేసుకుంటే, హద్దులు విధించుకుంటే బరువు తగ్గచ్చు. బరువు తగ్గాలంటే శరీరం కంటే ముందు మెదడు అదుపులోకి రావాలి. ఆ మెథడ్ ఏంటో తెలుసుకొని ఆచరించండి. స్లిమ్ అవ్వాలి. ఎలా? రేపట్నించి వ్యాయామం మొదలుపెడదాం!’ అని ఓ నిర్ణయానికి వచ్చేసి రేపటికి వాయిదా వేస్తూనే ఉండి ఉంటారు. తినే ఆహారం ద్వారా ఒంట్లో అదనంగా క్యాలరీలు చేరుతూనే ఉంటాయి. టీవీలో వచ్చే షోస్ని గంటల తరబడి చూస్తూ కూర్చునే ఉంటారు. కంప్యూటర్ల ముందు కీ బోర్డ్ నొక్కుతూ పని చేశామనుకుంటారు. కానీ, కాలు కదపక, ఒళ్లు కదలక శరీరంలో చేరిన క్యాలరీలు ఖర్చు కావు. ఫలితం మరింత బరువు. ‘ఈ మధ్య ఒళ్లు చేసినట్టున్నారు..’ అనే సన్నిహితుల మాటలు నిరాశ కల్గిస్తుంటాయి. ‘ఎలాగైనా సరే బరువు తగ్గాల్సిందే అనే లక్ష్యం మీదైతే ఇది మీకోసమే! వ్యాయామం చేయకుండానే అదనపు బరువును తగ్గించుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా.. మీ రోజువారీ జీవనశైలి ఏవిధంగా ఉందో పరిశీలించాలి. ఓ రకంగా మీకు మీరే పరిశోధకులు. మీ జీవనప్రయాణం ఎలా ఉందో చిన్న చిన్న గమనింపులు చేసుకుంటూ, కొద్దికొద్దిగా మార్పులు చేసుకుంటూ కొనసాగించండి. మీబరువు మీ అధీనంలో ఉంటుంది. మీ ప్రయత్నాలు ఇప్పుడే మొదలుపెట్టండి. అందుకు ఇది ఒక చిన్న అడుగే కావచ్చు. కానీ, రేపు పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా వేసే అడుగులకు దారులను సుగమం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడేవి నిర్ధారించి, ఫలితం పొందిన సులువైన మార్గాలు 15 ఉన్నాయి. అవి, ఎక్కువగా అటూ ఇటూ తిరుగుతూ ఉండటం, తక్కువ తినడం, మిమ్మల్ని మీరు చూసుకున్న ప్రతీసారి మెరుగైన ఫలితం పొందామన్న అనుభూతిని పొందడం. ఈ రోజువారీ జీవనశైలి మార్పులను కేవలం ఒకటి – రెండు వారాలు పాటించండి. దాదాపు 3 అంగుళాల మేరకు మీ నడుము వెడల్పు తగ్గుతుంది. కొన్నినెలల్లోనే 5 కిలోల బరువు తగ్గుతారు.అంతేకాదు ఈ విధానం మెరుగైన, ఆరోగ్యకరమైన అలవాట్లు మీ జీవితకాలం ప్రయోజనాన్ని పొందేలా చేస్తుంది. వాణిజ్య ప్రకటనల సమయం టీవీలో మీకిష్టమైన షో చూస్తున్న సందర్భంలోనూ ఒకేచోట కూర్చోకుండా అటూ ఇటూ నడుస్తూ చూడండి. వాణిజ్య ప్రకటనలు వచ్చే సమయంలో బయటవరకు వెళ్లడం, కొన్ని మెట్లు ఎక్కి దిగి రావడం, ఉన్న చోట నుంచి ఒక చిన్న పరుగులాంటి నడకతో మరో చోటుకి వెళ్లడం... వంటివి చేస్తూ ఉండండి. వీటివల్ల మీ గుండె వేగం, శ్వాస వేగం పెరగాలి. రోజూ రాత్రి సమయంలో రెండు గంటలపాటు టీవీ చూస్తూ ఉన్నారనుకోండి ప్రతి 2 నిమిషాలకోసారి విరామం తీసుకోండి. దీనివల్ల అదనంగా 270 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇలా రోజూ చేస్తూ ఉంటే ఏడాదిలో 8 కిలోల బరువు తగ్గవచ్చు. కొవ్వు పదార్థాలు– పరిమితులు అధికం మీకు బాగా నచ్చే ఆహారపదార్థాలలో కొవ్వు అధికంగా ఉండే .. కుకీస్, చాక్లెట్స్, ఐస్క్రీమ్, చిప్స్, వేపుళ్లు..వంటివి ఉన్నాయనుకోండి. వీటిని క్రమంగా తగ్గిస్తూ పోండి. అంటే, కొవ్వు పదార్థాలలో వారానికి ఆరు రకాలవి తీసుకుంటున్నట్లయితే ఆ సంఖ్య 5కు పరిమితం చేయండి. ఆ తర్వాత 4. ఇలా వారానికి ఒకటి చొప్పున తగ్గిస్తూ పోతే మీరే ఆ మరుసటి వారానికి రెండు కొవ్వుపదార్థాలను తీసుకోవడం మానేస్తారు.వీటికి బదులుగా క్యారెట్స్, ఆరెంజ్లు.. వంటి ఇతర తాజాపండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. బరువు తగ్గడానికి వార్తలు ఫిట్నెస్, ఆహారనియమాలకు సంబంధించిన ఆర్టికల్స్ను 16 వారాల పాటు చదువుతూ ఉంటే శారీరక చురుకుదనానికి కావల్సిన మార్పులను తమకు తామే చేసుకోవడానికి సిద్ధం అవుతారని ఒక నివేదికలో తేలింది. ఇలా బరువుకు సంబంధించి హెల్త్ ఆర్టికల్స్ చదివే వారు కొవ్వు పదార్థాలు తగ్గించి తాజాపండ్లు, కూరగాయలు తీసుకోవడం పెరిగింది. ఇవే అలవాట్లు ఎవరైనా 16 వారాల పాటు కొనసాగిస్తే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడినట్టే. అధిక బరువుకు చెక్పెట్టినట్టే! బేసిక్గా బాడీ వెయిట్ ఎక్సర్సైజులు జిమ్లో చేసేవి స్క్వాట్స్, పుషు–అప్స్ వంటి ప్రా«థమిక వ్యాయామాలు ఉన్నాయి. ఇవి ఇంట్లోనూ చేయవచ్చు. నీళ్లు నింపిన బాటిళ్లు, కూరగాయల సంచులు పైకి లేపడం, నెమ్మదిగా వాటిని కిందకుదించడం.. వంటివి చేయవచ్చు. పరిశీలిస్తే ఇంటి వాతావరణంలోనే ప్రాథమిక వ్యాయామాలు చేయడానికి అనువైనవి ఎన్నో ఉన్నాయి. వీటివల్ల నిమిషాల్లో మెటబాలిజం–రివైవింగ్ అయ్యి కండరాల బలం పెరుగుతుంది. దీంతోపాటే ఇవి బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. మెట్లు ఎక్కడం రోజులో 2 – 3 నిమిషాలైనా మెట్లు ఎక్కాలి. కనీసం 3 నుంచి 5 అంతస్తులు ఎక్కాలి. దీనివల్ల ఏడాదిలో పెరిగిన బరువులో 2 కేజీల బరువును తగ్గించుకోవచ్చు. ఇది తగ్గిన మీ నడుము చుట్టుకొలతనే చెబుతుంది. మహిళలకన్నా మగవారు వారంలో 70కి పైగా మెట్లు ఎక్కి వారానికి 20 చొప్పున పెంచుతూ పోవాలి. మెట్లెక్కడం వల్ల 18 శాతం మరణాల రేటు తగ్గినట్టు హార్వర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది.అందుకని ఈ రోజే మెట్లను అధిరోహించడం ప్రారంభించండి. రోజూ 3 మెట్లు అదనంగా ఎక్కుతూ మీ ట్రెక్కింగ్ను ఇప్పుడే మొదలుపెట్టండి. ఇలా చేస్తే బరువు తగ్గింపులో మీరు ఎన్నోమెట్లు ఎక్కినట్టే. మరింత అదనం మీరు ఒక ఏడాది కాలంలో వేలాది క్యాలరీలు డబ్బును పొదుపు చేస్తున్నట్టుగా ఒంట్లో సేవ్ చేస్తూ ఉంటారు. అదెలాగో చూద్దాం.. వారాంతంలో రెస్టారెంట్కి వెళ్లారు. అక్కడ 610 క్యాలరీలు గల ఒక చికెన్ బర్గర్ను తిన్నారు. దీంట్లో 40 శాతం కొవ్వు, 1,440 మిల్లీ గ్రాముల సోడియం ఉంటాయి. అదే, మీరు సొంతంగా ఇంట్లోనే చికెన్ బర్గర్ని తయారుచేసుకుంటే 230 క్యాలరీలకు మించదు. అంటే, కనీసం దీనివల్ల 400 క్యాలరీలు, 520 మిల్లీగ్రాములు సోడియం కటాఫ్ చేస్తున్నారన్నమాటే. అందుకని మీరు తినే భోజనాన్ని హోటల్స్ వారికి ఆర్డర్ ఇవ్వకుండా మీరే సిద్ధం చేసుకోవడం ఉత్తమం. అలాగే, తినే ఆహారంలో పంచదార, ఉప్పు, కొవ్వులను తగ్గిస్తూ ఉండడం చాలా అవసరం. ఇప్పుడు చెప్పినవన్నీ రెస్టారెంట్ ఫుడ్లో ఎక్కువ శాతం ఉంటాయి. కిలోమీటర్ అనే విధానం కచ్చితం చేయాలి మూడు కిలోమీటర్ల కంటే తక్కువ దూరాలుండే అన్ని ప్రయాణాలకు 89 శాతం వాహనాల మీదే వెళుతుంటారు చాలామంది. డ్రైవింగ్కి ఖర్చుకు చేసే ప్రతి అదనపు గంటకు బరువు 6 శాతం పెరుగుతుంది.క్యాలరీలను ఖర్చు చేయాలంటే తప్పనిసరి రూల్ పాటించాలి. మీరు వెళ్లాల్సిన చోటు కిలోమీటర్ కన్నా తక్కువ దూరం ఉంటే డ్రైవింగ్కి బదులు చురుకుగా నడవాలని ప్రతిజ్ఞ చేసుకోండి. తక్కువ దూరానికి కూడా మీ కారులో ప్రతీసారి వెళ్తూ పార్కింగ్ కోసం టైమ్ వృ«థా చేయకుండా నడక ద్వారా అనేక పనులు సులువుగా చేసుకోవచ్చు అని మీకు మీరే చెప్పుకోండి. ఈ రూల్ని మీరు ఇప్పుడు మెదలుపెడితే వచ్చే ఏడాది వరకు కనీసం 6 నుంచి 7 కిలోలు బరువు తేలికగా తగ్గిపోతారు. రోజులో 10 సార్లు కాళ్లు, చేతులే కాదు నోటి కదలికలకు కూడా పని చెబుతూ ఉండాలి. అంటే, ఒకే మొత్తాన్ని ఒకేసారి భుజించడం కాకుండా రోజులో ఎక్కువసార్లు తినాలనే రూల్ పెట్టుకోండి. దీంట్లో మీరు తినబోయే పదార్థాన్ని నిమిషం సేపు గమనించడం, వాసన చూడటం, దాని వల్ల కలిగే ప్రయోజనాన్ని ఆలోచించడం వంటివి చేయండి. ఆ తర్వాత చాలా కొద్దిగా మాత్రం నోట్లో పెట్టుకోండి. దాన్ని నెమ్మదిగా, బాగా నమలాలి. ఎంతగా అంటే ఆ పదార్థం నోరంతా తిరగాలి. రుచిని ఆస్వాదించాలి. లాలాజలం ఊరాలి. ఆ తర్వాత మరొక ముద్ద తినాలి. దీనివల్ల ఆహారం తీసుకోవడంలో ఒక సంతృప్తి భావన కలుగుతుంది. మీకు ఇంకా తిన్న అనుభూతి కలగాలంటే మరో 20 సార్లు నమలడం పెంచండి. దీనిని ఈటింగ్ ఎక్సర్సైజ్ అనవచ్చు. 10 నిమిషాల్లో తినడం ముగించండి. నెమ్మదిగా తినడం వల్ల మైండ్ కూడా ఫుల్ అయ్యిన భావన కలుగుతుంది. పండ్లు తినండి తాగద్దు పండ్లను తినడం వల్ల శరీరానికి తగినంత పీచు అందుతుంది. రోజూ ఒక యాపిల్ తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. అదే ఒక యాపిల్తో చేసిన జ్యూస్ తాగితే పీచు కాకుండా క్యాలరీలే శరీరానికి అందుతాయి(ఒక యాపిల్లో 3.5 గ్రాముల పీచు ఉంటే, అదే జ్యూస్లో 0.5 గ్రాములు ఉంటుంది). కార్బోహైడ్రేట్స్ ఉండే జ్యూస్ల కన్నా ఫైబర్ ఉన్న పండ్ల వల్ల ఎక్కువ సంతృప్తి, ఆరోగ్యం లభిస్తుందని సుదీర్ఘపరిశోధనల ద్వారా స్పష్టమైంది. ఆహారం అంటేనే నమిలి తినాలి. అది మీ లాలాజలంతో కలవాలి. అప్పుడే మైండ్ సంతృప్తి చెందుతుంది. అదే పండును జ్యూస్ చేసి తాగితే ఆ భావన మైండ్కు చేరదు. పైగా తీపి కోసం వేసే పంచదార వంటివి యాపిల్ పండు కన్నా 48 శాతం క్యాలరీలను జ్యూస్ చేర్చుతుంది. సహాయం పొందండి వ్యాయామం చేయడానికి ఫ్రెండ్ను మించిన ఉత్సాహభరితమైన సపోర్ట్ మరోటి ఉండదు. మీ వీధి చివరన ఉండే ఫ్రెండ్ను కలవడానికి కాలినడకన వెళ్లచ్చు. చేసే వర్కవుట్స్ గురించి ముఖాముఖిగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మధ్య భేషజాలు ఉండవు. మహిళలు నలుగురిలో కలిసి ఉండి, చర్చించుకునే గ్రూప్స్ మన సమాజంలో ఎక్కువ. ఇలా ఒకరికి ఒకరు వ్యాయామం, ఆహారపు అలవాట్ల విషయంలో చర్చించుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ రోజూ 300 క్యాలరీలు ఆహారంలో తగ్గిస్తూ, నడకను మైలు దూరం కన్నా పెంచుకుంటూ ఉంటే 9 నెలల్లో 6 కిలోల అదనపు బరువు తగ్గుతారు. కప్పు కాఫీ పెంచే బరువు రోజూ 3,000 కప్పులు అమ్మే 115 కాఫీషాప్లను సందర్శించి నిపుణులు ఓ నివేదికను అందించారు. ఎలాగంటే రోజూ ఒక కప్పు కాఫీ లేదా టీ ద్వారా (పాలు + పంచదారతో కలిపి) సగటున 239 క్యాలరీలు సగటున సేవిస్తున్నారు. 2–3 నుంచి కప్పుల కాఫీ లేదా టీ సేవించినా రోజులో ఒక్కొక్కరు సగటున 630 క్యాలరీలు అదనంగా తీసుకుంటున్నారు. ఈ అలవాటును మానుకుంటే ఏడాదిలో 6 కేజీల అదనపు బరువును తగ్గించవచ్చు. పెన్ను తీసుకోండి దాంతో పాటే ఒక చిన్న నోట్ బుక్ తీసుకోండి. దీని మీద ఫుడ్ డెయిరీ లేదా ఫుడ్ లాగ్స్ అని పేరు రాయండి. ఈ రోజు నుంచి కాదు ఇప్పటి నుంచే రోజులో ఏమేం తింటున్నారో ప్రతి అరగంటకోసారి రాస్తూ ఉండండి. అంతేకాదు, ఆ ఆహారంలో ఉండే క్యాలరీలు కూడా ఇంచుమించుగా నోట్ చేస్తూ ఉండండి. ఈ ఫుడ్ డెయిరీ మీరు తీసుకునే అదనపు క్యాలరీలను తీసుకోకుండా మీ నోటికి అడ్డుపడుతూ ఉంటుంది. ఇటీవల పరిశోధనలో తేలిందేమంటే.. ఫుడ్ డెయిరీలో ఆహారం తీసుకునే సమయాలు, క్యాలరీలు నోట్ చేసుకున్నవారు త్వరగా బరువు తగ్గడం గమనించారు. ఫుడ్ డెయిరీని రోజూ రాయడం అలవాటు చేసుకున్నవాళ్లు మితంగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడానికి ప్లాన్ చేసుకోవడం..వంటివి ప్రారంభించారు. ఈ విధానాన్ని పాటించినవాళ్లు దాదాపు 6 నెలల సమయంలో 7 కిలోల బరువు తగ్గారు. ఫుడ్ డెయిరీ వల్ల ఆహారపు అలవాట్లు మీలోని అంతర్దృష్టిని మేల్కొలిపి, అవగాహన ³రిచేలా చేస్తుంది. అంటే పెన్ మీ అధిక క్యాలరీలను కాల్చేసే గన్లా ఉపయోగపడుతుందన్నమాట. అదనంగా 5 నిమిషాలు శారీరక శ్రమలో భాగంగా నడకకు రోజూ ఓ 5 నిమిషాల సమయం పెంచుకుంటూ పోవాలి. ఇలా చేస్తుంటే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి నాలుగు నెలల్లో మీ నడుము చుట్టుకొలత 2 1/2 ఇంచులు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు మీ లక్ష్యం 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వాకింగ్ చేయడం అనుకోండి. రోజూ మరో 5 నిమిషాలు అదనంగా వాకింగ్ చేస్తూ ఉండండి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్ చేస్తుంటే 120 క్యాలరీలు ఖర్చు అవుతాయి. నిద్రతో తగ్గే బరువు బరువు తగ్గడానికి ఒక అతిముఖ్యమైన పాయింట్ హాయిగొలిపే నిద్ర. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు నిద్రలేమి తక్షణ బరువుకు దారి తీస్తుందని తేల్చారు. 5 రాత్రుల్లో కనీసం 4 రాత్రుళ్లు హాయిగా నిద్రపోయినవారు కిలో బరువు తగ్గినట్టు గుర్తించారు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బరువును విసిరి కొట్టండి!
బరువు తగ్గడానికి ప్రపంచంలో ఉన్న ?డైట్ ప్లాన్స్ అన్నీ వివరించాం.కాని అసలైన డైట్ మన వాకిలి ముంగిటే ఉంది.మన చేలలోనే ఉంది.పంట పొలాల్లోనే పండుతోంది. సిరి ధాన్యాలతో ఒంటి మీద పేరుకున్న అదనపు సిరిని వదిలించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. తరిమికొట్టవచ్చు.అరికలు, సామలు, ఊదలు, కొర్రలు... ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యవంతం చేయడమే కాదు బరువును అదుపు చేస్తాయి. భారాన్ని తగ్గిస్తాయి. సిరిధాన్యాలతో బరువును విసిరికొట్టండి. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో మార్పు వచ్చింది. తినే ఆహారం మారిపోయింది. పీచుపదార్థం, పిండిపదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని మానవాళి గత కొద్ది దశాబ్దాలుగా వదిలిపెట్టింది. ఆధునికత పేరుతోనో, సౌలభ్యం కోసమనో పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహారానికి తోడు వ్యాయామం/నడక చాలావరకూ తగ్గిపోతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిండిపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినటం, వ్యాయామం లోపించడం, స్టెరాయిడ్స్ తీసుకోవటం తప్ప.. ఇటీవల దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య తామరతంపరగా పెరగడానికి మరో మూల కారణమేదీ లేదు. అనువంశికత కారణం కాదు. ఊబకాయానికి, మధుమేహానికి కూడా ముఖ కారణాలు ఇవే. గతంలో ఊబకాయుల సంఖ్య తక్కువ ఎందుకని? పూర్వం ఊబకాయంతో బాధపడే ప్రజలు దాదాపుగా లేరు. క్రీ.శ.1900 వరకు ఊబకాయ సమస్య పహిల్వానులు వంటి వాళ్లలో తప్ప సాధారణ ప్రజానీకంలో చాలా అరుదుగా ఉండేది. ఎందుకనంటే, అప్పట్లో గ్లూకోజ్ నిదానంగా రక్తంలో కలిసేందుకు అనువైన ఆహారం మనం తింటూ ఉండేవాళ్లం. అదీకాకుండా, ప్రజలంతా రోజూ చాలా సేపు నడిచేవారు. అంటే, ఆహారం ద్వారా రక్తంలోకి చేరే గ్లూకోజ్ ఖర్చు అయ్యేది. ఎప్పుడైతే గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ అవుతూ, పేరుకుంటూ వస్తున్నదో అప్పుడు గ్లైకోజన్ గాను, కొవ్వు గాను, మాంసం గాను మార్చే వ్యవస్థ తయారవుతుంది. ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ మొదలవుతాయన్నమాట. వీటికితోడు కాలక్రమంలో పంచదార ఉత్పత్తి, వినియోగం బాగా పెరిగింది. చక్కెర ఉత్పత్తి క్రీ.శ. 1846 నుంచే ప్రారంభమైంది. గడచిన 70 సంవత్సరాల్లో వరిబియ్యం, గోధుమలతోపాటు పంచదార వినియోగం బాగా పెరిగింది. వరి, గోధుమల్లో పీచుపదార్థం అతి తక్కువగా ఉంది. పంచదార ద్వారా తీసుకునే గ్లూకోజ్ను ఖర్చు చేసే వ్యాయామం చేయకపోవడం వల్ల ఊబకాయం ఏర్పడుతోంది. సూటిగా చెప్పుకోవాల్సిందేమిటంటే.. ఆహారంలో వచ్చిన మార్పు వల్ల, వ్యాయామం తగ్గిపోవడం వల్ల ఊబకాయం వచ్చింది. సరైన ఆహారం తినాలి. సరిగ్గా వ్యాయామం చేయాలి. అప్పుడే తిరిగి సంపూర్ణ స్థితి నెలకొంటుంది. అంటే ఊబకాయులు తమ శరీరంలో అతిగా పెరిగిన మాంసం, కొవ్వు పదార్థం, గ్లైకోజెన్ కరిగించుకునేలా ఆహార విహారాలను నియమబద్ధంగా మార్చుకోవాలి. అంటే, ఎక్కువగా నడవాలి. గ్లూకోజ్ను రోజూ నడక ద్వారా ఖర్చు చేయాలి. అదే సమయంలో.. ఆహారం ద్వారా గ్లూకోజ్ నిదానంగా రక్తంలోకి వచ్చేలా చూడాలి. సిరిధాన్యాలను ఎప్పుడో ఒక సారి కాకుండా రోజువారీగా ముఖ్య ఆహారంగా తింటూ ఉంటేనే ఇది సాధ్యమవుతుందని గుర్తించాలి. స్టెరాయిడ్స్ వల్ల ఊబకాయం.. ఆహారం వల్ల సహజంగా ఊబకాయం తయారవటం ఒకటైతే వైద్యచికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం కూడా ఊబకాయానికి మరో ముఖ్య కారణం. రోగాలకు చికిత్సలో భాగంగా ఈ మధ్యకాలంలో డాక్టర్లు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఆడవాళ్లలో హార్మోన్ అసమతుల్యతకు, ఆస్తమా, నొప్పి మందులుగా వాడుతున్నారు. సాధారణంగా ఆహార విహారాలలో మార్పుల వల్ల కన్నా స్టెరాయిడ్స్ వాడే వారికి మరింత వేగంగా ఊబకాయం వస్తుంది. స్టెరాయిడ్స్ వల్ల ఆకలి ఎక్కువ కావటం వల్ల ఎక్కువగా తినటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల కూడా కొందరు ఊబకాయులుగా మారుతున్నారు. మాంసం, కోడిగుడ్లను తక్కువ రోజుల్లో అధికోత్పత్తి సాధించే క్రమంలో పశువులకు, కోళ్లకు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. అలా ఉత్పత్తయిన మాంసం, కోడిగుడ్లను తిన్న వారి ఆరోగ్యంపై కూడా ఈ స్టెరాయిడ్స్ ప్రభావం ఉంటుంది. వీళ్లు కూడా ఎక్కువ తినటం మొదలు పెట్టి ఊబకాయులుగా మారిపోతున్నారు. మాంసాహారం తినటం అంతకంతకూ ఎక్కువై పర్యావరణ అసమతుల్యతకు దారితీస్తోంది. జంతువుల పాలు మనిషి ఆరోగ్యానికి సరిపడవు. పాలు, టీ, కాఫీలు తాగటం వల్ల హార్మోన్ అసమతుల్యత మనుషుల ఆరోగ్యాన్ని అస్థవ్యస్థం చేస్తోంది. పాలను తోడు వేస్తే ఈ అలసమతుల్యత సమసి పోతుంది. కాబట్టి, పెరుగు, మజ్జిగ పర్వాలేదు. మొత్తంగా ప్రపంచం ఇప్పుడు తింటున్న ఆహారం పర్యావరణానికి కూడా పెనుముప్పుగా మారాయి. సిరిధాన్యాలతో మనుషులు సంపూర్ణ ఆరోగ్యం పొందటమే కాకుండా భూతాపాన్ని కూడా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. మెట్ట రైతులనూ బతికించుకోవచ్చు. నెమ్మదిగానైనా రోజూ నడవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయం గంట, సాయంత్రం గంట నడవాలి. అధికబరువు ఉన్న వారు నడవడానికి ఇబ్బందులు ఉంటాయి. అయితే, ఈ రోగానికి కారణభూతాలైన ఆహారం తినటం మాని, సిరిధాన్యాలు తినటం, కషాయాలు తాగటం మొదలు పెడితే వారికి నడిచే శక్తి వస్తుంది. కీళ్ల నొప్పులు, సంధివాతం కొర్రలతోనే బాగువుతుంది. అందుకే ఐదు ధాన్యాలూ తినాలి. అరికెలు, సామలు ఎక్కువ రోజులు తింటూ మిగతా 3 ధాన్యాలూ తక్కువ రోజులు తినాలి. ఊబకాయులు వేగంగా నడవనక్కర లేదు. నెమ్మదిగా నడిచినా చాలు. ఉదయం, సాయంత్రం గంట చొప్పున వారికి చేతనైనంత వేగంతో నడవవచ్చు. రోజులు గడిచేకొద్దీ వారు బాగా నడవగలుగుతారు. వేగంగా తగ్గటం మంచిది కాదు.. ఆహారంలో, శారీరక వ్యాయామంలో వచ్చిన మార్పు వల్ల ఊబకాయం మరీ వేగంగా పెరగదు. కొన్ని ఏళ్లపాటు, నిదానంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి, తగ్గేటప్పుడు కూడా ఆహారంలో మార్పు చేసుకొని, నడక వంటి వ్యాయామం క్రమబద్ధంగా చేస్తూ నిదానంగానే ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. సిరిధాన్యాలు తింటూ, కషాయాలు తాగుతూ, నడుస్తూ ఉంటే.. ఆరు నెలల నుంచి రెండేళ్లలో వయసు, ఎత్తుకు తగిన బరువును సంతరించుకోవటంతోపాటు.. ఏ వయస్కులైనా, ఏయే జబ్బులున్న వారైనా, ఆడవారైనా, మగవారైనా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. 6 నెలల్లో 10–25 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. మరీ ఎక్కువ బరువున్న వారు కొంచెం వేగంగా, మధ్యస్థంగా అధిక బరువున్న వారు కొంచెం నెమ్మదిగా బరువు తగ్గుతారు. ఉదాహరణకు 100 కిలోల బరువున్న మనిషి ఆహార విహారాలను మార్చుకుంటే ఆరునెలల్లో 12 కిలోల వరకు తగ్గొచ్చు. 80–90 కిలోలున్న వారు అదే ఆరునెలల్లో 10 కిలోలు తగ్గొచ్చు. చిన్న వయస్కులైన ఊబకాయులు 50 ఏళ్లు దాటిన ఊబకాయులకన్నా కొంచెం వేగంగా బరువు తగ్గుతారు. ఇంతకన్నా వేగంగా బరువును తగ్గించే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అవి ప్రమాదకరం.మరీ వేగంగా బరువు తగ్గటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల కిడ్నీ సంబంధమైన సమస్యలు వస్తాయి. హానికరమైన ఆహారాన్ని తినటం మానేసి చిరుధాన్యాలను (కనీసం 2–4 గంటలు నానబెట్టుకొని వంట చేసుకోవటం విధిగా పాటించవలసిన చాలా ముఖ్యమైన నియమం) తింటూ, కషాయాలు తాగుతూ, క్రమం తప్పకుండా నడుస్తూ ఉంటే.. ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు ఎంతటి రోగాలున్న వారైనా (అవసరాన్ని బట్టి హోమియో/ఆయుర్వేద మందులను తీసుకోవాలి) ఆయా రోగాల పీడ నుంచి పూర్తిగా బయటపడటమే కాకుండా.. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని నా దగ్గరకు వచ్చిన వేలాది మంది సాక్షిగా బల్లగుద్ది చెప్పగలను. అరికెలు, సామలు ఎక్కువ రోజులు తినాలి.. ఏ కారణంగా ఊబకాయం వచ్చినా.. ఊబకాయాన్ని ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవాలనుకునే వారు మొదట ఆహారం మార్చుకోవాలి. గ్లూకోజ్ను అసమతుల్యంగా, తక్కువ సమయంలోనే రక్తంలోకి పంపించే వరి బియ్యం, గోధుమలు, మైదాతో చేసిన ఆహారాన్ని తినటం మానేయాలి. గ్లూకోజ్ను సమతుల్యంగా, కొన్ని గంటల పాటు నెమ్మదిగా రక్తంలోకి వదిలే సిరిధాన్యాలను ముఖ్య ఆహారంగా తినాలి. వరుసగా మూడు రోజులు అరికెలు, మరో మూడు రోజులు సామెలు రోజువారీ ముఖ్య ఆహారంగా తినాలి. కొర్రలు, ఊదలు, అండుకొర్రలను వరుసగా ఒక్కోరోజు తినాలి. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి. సిరిధాన్యాలు తింటే ఏమవుతుంది? కాలేయం, క్లోమం.. ఇవన్నీ తమ పనులను సక్రమంగా పనిచేయాలంటే రక్తం శుద్ధంగా ఉండాలి. రక్తం పలచగా, తేలిగ్గా ఉండి, ఇమ్యునో బాగ్యులన్స్ అన్నీ సరిగ్గా ఉంటేనే నిర్ణాల గ్రంథులన్నీ(ఎండోక్రైన్ గ్లాండ్స్) సరిగ్గా పనిచేసేది. రక్తం శుద్ధ కావటానికి, నిర్ణాల గ్రంధులు సరిగ్గా పనిచేయటానికి ఈత ఆకు కషాయం పని చేస్తుంది. దీనికి తోడు సిరిధాన్యాలు ప్రధాన ఆహారంగా తినాలి. ఇలా చేస్తే దేహంలో పేరుకున్న కొవ్వు, మాంసం క్రమంగా కరగటం ప్రారంభమవుతుంది. పసుపు, గరిక, ఈత ఆకుల కషాయాలు తాగాలి సిరిధాన్యాలు తినటంతోపాటు.. పసుపు, గరిక, ఈత ఆకుల కషాయాలు తాగాలి. వీటిల్లో వారానికి ఒక రకంæచొప్పున తాగాలి. ఉదయం, సాయంత్రం తాగాలి. దీనిలో కొంచెం ఈతబెల్లం లేదా తాటిబెల్లం పాకాన్ని రెండు చుక్కలు కలుపుకుంటే.. కషాయం రుచిగానూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈతబెల్లం జనాన్ని సన్నగా ఉంచుతుంది. ఈతాకులో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల మజ్జలో పనిచేస్తుంది. ఎముకల మజ్జ శుభ్రం అయితేనే ఊబకాయం తగ్గుతుంది. – డా. ఖాదర్ వలి, స్వతంత్ర శాస్త్రవేత్త, ప్రముఖ ఆహార, ఆరోగ్య నిపుణులు, హోమియో వైద్యులు, మైసూరు -
కొలెస్ర్టాల్తో మెదడుకు రిస్క్..
లండన్ : పొత్తికడుపులో కొవ్వుతో మెదడు సంబంధిత వ్యాధులు, శరీరంలో వాపు నెలకొనే ముప్పు అధికంగా ఉందని తాజా అథ్యయనం వెల్లడించింది. పొట్ట మినహా ఇతర శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయిన వారితో పోలిస్తే పొట్టభాగంలో కొలెస్ర్టాల్ అధికంగా ఉన్న వారికి ఈ వ్యాధుల ముప్పు అధికమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, రివర్సైడ్ అథ్యయనంలో వెల్లడైంది. మహిళలతో పోలిస్తే పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోయిన పురుషుల్లోనే మెదడులో వాపు ముప్పు అధికమని పరిశోధకులు గుర్తించారు. రోజూ తీసుకునే ఆహారంపై కన్నేసి ఉంచాలని, ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ డుడికా కాస్ సూచించారు. పొత్తికడుపులో పేరుకుపోయే కొవ్వు రక్త ప్రసరణకు అడ్డంకిగా మారుతుందని, మెదడుకు రక్తసరఫరాను కూడా ఇది ప్రభావితం చేస్తుందని పరిశోధకులు హెచ్చరించారు. -
కొవ్వుతోనే కొవ్వుకు కోత
వజ్రాన్ని కోయాలంటే వజ్రమే కావాలట. ఉష్ణాన్ని చల్లబరచడం ఉష్ణానికే సాధ్యమట. తెలుగులో తరచూ వాడే రెండు సామెతలివి. కీటో డైట్ కూడా పై సామెతల్లాగే పనిచేస్తుందేమో!?బరువు పెరగడం అంటే కొవ్వు పెరగడమే కదా. కొవ్వు పేరుకుంటేనే కదా ఊబకాయం వచ్చేది! కీటోజెనిక్ ఫుడ్ను తీసుకుంటే...కొవ్వును కొవ్వే కోసేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ట్రై చేసి చూడండి.బరువు తగ్గడానికి ఉన్న ఆహార ప్రక్రియల్లో అత్యంత ప్రాచుర్యం ఉన్న వాటిల్లో కీటోజెనిక్ డైట్ చాలా ప్రధానమైనది. దీన్నే సంక్షిప్తంగా ‘కీటో’ డైట్ అని కూడా అంటుంటారు. ఒక్క బరువు తగ్గడం మాత్రమే గాక... బరువుతో వచ్చే అనర్థాలకు అంటే... డయాబెటిస్, క్యాన్సర్ వంటివాటికీ ఇది సమర్థంగా పనిచేస్తుందని కొందరి నమ్మిక. అదేంకాదు... ఎపిలెప్సీ, అల్జిమర్స్ వ్యాధుల నివారణకూ ఇది తోడ్పడుతుందని కొందరు నిపుణులు చెబుతుంటారు. కీటోజెనిక్ డైట్ అంటే... ఇందులో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) చాలా తక్కువ. కొవ్వులు చాలా ఎక్కువ. మనకు కార్బోహైడ్రేట్ల నుంచి తక్షణ శక్తి సమకూరుతుందన్న విషయం తెలిసిందే కదా. అయితే కీటో డైట్లో ఈ శక్తిని కొవ్వుల నుంచి పొందుతాం అన్నమాట. ఇలా కార్బోహైడ్రేట్ల స్థానంలో కొవ్వుల నుంచి శక్తి పొందే జీవక్రియను ‘కీటోసిస్’ అంటారు. ఇలా తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు అందుబాటులో లేక కేవలం కొవ్వు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు శరీరం కొవ్వునే దహనం చేసి తమకు అవసరమైన శక్తిని పొందుతుంది. (ప్రోటీన్, కార్బోహైడ్రేట్... ఈ రెండు పోషకాల్లో 1 గ్రాము నుంచి 4 క్యాలరీల శక్తి పుడుతుంది. అదే 1 గ్రాము కొవ్వునుంచి 9 క్యాలరీల శక్తి ఆవిర్భవిస్తుంది). ఇలా కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కాలేయంలో కొవ్వు నుంచి కీటోను అనే రసాయనాలు వెలువడుతాయి. కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కీటోన్లు పుడుతుంటాయి కాబట్టి దీన్ని కీటోజెనిక్ డైట్ అంటారు. ఈ ఆహారంలో రక్తంలో చక్కెర పాళ్లు గణనీయంగా తగ్గిపోతాయి. ఇలా చక్కెర తగ్గడం, కీటోన్లు పెరగడం అనేది చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది కాబట్టి ఈ డైట్ చాలా ప్రాచుర్యం పొందింది. కీటోజెనిక్ డైట్స్లోని రకాలు : కీటోజెనిక్ డైట్లోనే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని... స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్ (ఎస్కేడీ) : ఇందులో కార్బోహైడ్రేట్లు చాలా చాలా తక్కువ. ప్రోటీన్లు ఒక మోస్తరు. ఇక కొవ్వుల విషయానికి వస్తే వాటి మోతాదు చాలా ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇందులో కొవ్వులు 75శాతం, ప్రోటీన్లు 20శాతం, కార్బోహైడ్రేట్లు 5 శాతం మాత్రమే ఉంటాయి. సైక్లికల్ కీటోజెనిక్ డైట్ (సీకేడీ) ఇందులో ఒక పీరియాడిసిటీ ఉంటుంది. అంటే... వారంలోని ఐదు రోజులు పైన పేర్కొన్న ఎస్కేడీ డైట్ ఇస్తూ... మిగతా రెండు రోజులు మాత్రం కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవచ్చు. టార్గెటెడ్ కీటోజెనిక్ డైట్ (టీకేడీ) ఈ తరహా కీటోజెనిక్ డైట్లో సాధారణంగా స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్ తీసుకుంటూ... బాగా వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రం కార్బోహైడ్రేట్లు తీసుకోవచ్చు. హై–ప్రోటీన్ కీటోజెనిక్ డైట్ ఇది కూడా మామూలుగా స్టాండర్డ్ కీటో–డైట్ను పోలి ఉన్నప్పటికీ ఇందులో ప్రోటీన్ల మోతాదు ఎక్కువగా ఉంటుంది. అంటే కొవ్వులు 60 శాతం, ప్రోటీన్లు 35 శాతం, కార్బోహైడ్రేట్లు కేవలం 5 శాతం మాత్రమే ఉండేలా ఆహారం తీసుకోవాలి. ఏమైనప్పటికీ కీటో డైట్లోని ఒకే ఒక సాధారణ అంశం ఏమిటంటే... అది ఏ తరహా కీటో–డైట్ అయినప్పటికీ కార్బోహైడ్రేట్లు 5శాతం కంటే ఎక్కువగా ఉండబోవని గుర్తుంచుకుంటే చాలు. కీటోజెనిక్ డైట్లో తీసుకోకూడని ఆహారాలు ముందుగా చెప్పినట్లు కీటో–డైట్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండాలి కదా. అందుకే ఈ కింద పేర్కొన్న పిండిపదార్థాలను కలిగి ఉన్న ఆహారాలను కీటో–డైట్లో భాగంగా తీసుకోరు. చక్కెరలు ఎక్కువగా ఉండేవి సోడాలు, పండ్ల రసాలు, స్మూదీస్, కేక్లు, ఐస్క్రీమ్, క్యాండీలు. ధాన్యాలు వరి, గోధుమ, తృణధాన్యాలు (సిరియల్స్) వంటివి. పండ్లు అన్ని రకాల పండ్లూ తినకూడదు. అయితే నేరేడు జాతికి చెందిన బెర్రీలు, స్ట్రాబెర్రీలకు మాత్రం మినహాయింపు ఉంది. బీన్స్ జాతి గింజలు వేరుశెనగలు, కిడ్నీబీన్స్, బీన్స్, శెనగలు (చిక్పీస్) వంటివి. దుంపజాతికి చెందినవి బంగాళదుంప (ఆలూ), చిలగడదుంప (మోరంగడ్డ/గెణుసుగడ్డ), క్యారట్ వంటివి. తక్కువ కొవ్వులు ఉండేవి కొన్ని బాగా పొట్టుతీసిన పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ లో–ఫ్యాట్ పదార్థాలను తీసుకోకూడదు. అనారోగ్యకరమైన కొవ్వులు కీటో–డైట్లో కొవ్వులు ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ ఆ కొవ్వుల్లోనూ ఆరోగ్యకరమైన కొవ్వులనే తీసుకోవాలి. కొన్ని కొవ్వులు ఉదాహరణకు ప్రాసెస్ చేసిన వంటనూనెలు, మయోన్నెయిజ్ వంటివి తీసుకోకూడదు. ఆల్కహాల్ : చాలా ఆల్కహాల్స్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. అవి కీటోసిస్ ప్రక్రియను అడ్డుకుంటాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. తీసుకోవాల్సిన ఆహారాలు కీటో–డైట్లో భాగంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి... వేటమాంసం, చికెన్, టర్కీ కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు (ఫ్యాటీ ఫిష్) సాల్మన్ (దీన్ని తెలుగులో కొన్నిచోట్ల మాగా/బుడతమాగ అంటారు) ట్యూనా (టూనా చేప) మాకెరల్ (దీన్ని తెలుగులో కొన్ని చోట్ల కన్నగడతలు అంటారు), సార్డిన్ (దీన్ని తెలుగులో కొన్నిచోట్ల కవలు/నూనా కవలు అంటారు) వంటి చేపలు తీసుకోవచ్చు. మనకు అందరికీ తెలిసిన కొర్రమీను ఈ డైట్లో చాలా మంచిది. గుడ్లు పాçశ్చరైజ్ చేసి ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే గుడ్లు. వెన్న, క్రీమ్ గడ్డి మేసే జంతువుల పాల నుంచి తీసిన వెన్న, మీగడలు. నట్స్, గింజలు బాదాం, వాల్నట్, అవిశె గింజలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్. ఆరోగ్యకరమైన నూనెలు వర్జిన్ ఆలివ్ ఆయిల్, అవకాడో నూనె, కెనోలా నూనె, పల్లీల నూనె, నువ్వుల నూనె, కొబ్బరినూనె. (ఇటీవల హార్వర్డ్కు చెందిన ఒక ప్రొఫెసర్ కొబ్బరి నూనె అంత శ్రేష్టమైనది కాదని చెబుతున్నారు. నిపుణులను సంప్రదించాకే నూనెలు వాడాలి).కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉండే వెజిటబుల్స్: ఆకుపచ్చరంగులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు, టొమాటో, ఉల్లి వంటివి. వీటితో పాటు కాప్సికమ్ అని పిలిచే బెల్పెప్పర్ను వాడుకోవచ్చు. ఇవి పసుపుపచ్చ, ఆకుపచ్చ, ఎర్రరంగులో దొరుకుతుంటాయి. పరిమితులు ఒంట్లోని జీవక్రియల వేగం పెంచడం అంటే మెటబాలిక్ హెల్త్ను మెరుగుపరడం ద్వారా కీటో–డైట్ అన్నది వ్యక్తుల బరువు తగ్గించడంలో, డయాబెటిస్ను అదుపు చేయడంలో చాలా అద్భుతాలే చేస్తుంది. అయితే దీనికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. చాలా తీవ్రమైన వ్యాయామం అవసరమైన అథ్లెట్లు వంటి వారికీ, కండరాల పెరుగుదలను కోరుకునే వారికి కేవలం ఈ డైట్ మాత్రమే సరిపోదు. ఇక మీరు ఏ ఆహార ప్రక్రియను అవలంబిస్తున్నప్పటికీ... సుదీర్ఘకాలం దాన్నే అనుసరిస్తూ ఉంటే తప్ప అది పెద్దగా సత్ఫలితాలు ఇవ్వదు. ఇదే అంశం కీటో–డైట్కూ వర్తిస్తుంది. ఇవి మినహా కీటో–డైట్ మిగతా అన్ని సందర్భాల్లోనూ మంచి ఫలితాలే ఇస్తుందన్నది నిపుణుల మాట. కీటోజెనిక్ ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒంట్లోని నీరు, ఖనిజలవణాల బ్యాలెన్స్ కూడా మారుతుంది. అందుకే కీటో–డైట్లో ఉన్నప్పుడు కాస్త ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా అవసరం. లవణాల్లో భాగంగా రోజుకు 3,000 – 4,000 ఎంజీ సోడియమ్, 1,000 ఎంజీ పొటాషియమ్, 300 ఎంజీ మెగ్నీషియమ్ తీసుకోవడం మంచిది. కీటో డైట్ తీసుకునే మొదటిరోజుల్లో... మిగతా ఆహారాలవైపునకు (అదనపు క్యాలరీల వైపునకు) మనసు పోకుండా ఉండేందుకు కడుపునిండా తింటూ ఉండటం మంచిది. కీటో–ఫ్లూ ఉన్నప్పుడు ఒంటికి అంతగా శక్తి సమకూరినట్లుగా అనిపించదు. మెదడుకు అవసరమైన శక్తి అందదు. దాంతో ఎప్పుడూ ఆకలిగా ఉన్నట్లు అనిపించడం, నీరసం, నిద్రవస్తున్నట్లుగా ఉండటం, వికారం, జీర్ణవ్యవస్థలో (కడుపులో) ఇబ్బంది (స్టమక్ డిస్కంఫర్ట్), మునుపటిలా వ్యాయామం చేయలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇవి తగ్గేవరకు మొదట్లో ఒకటి రెండు వారాలు చాలా తక్కువ మోతాదుల్లో కార్బోహైడ్రేట్లు తీసుకుంటూ ఉంటే మంచిది. అలా వాటిని తగ్గిస్తూ క్రమంగా ఒంట్లోని కార్బోహైడ్రేట్లకు బదులు కొవ్వులను ఖర్చు చేసేలా ఒంటిని అలవాటు చేయాలి. కీటో–డైట్తో ఏర్పడే సైడ్ఎఫెక్ట్స్, వాటిని తగ్గించడం ఎలా: చాలావరకు కీటో–డైట్ అనేది మంచి ఆరోగ్యకరమైనదే. అయితే శరీరం దానికి అలవాటు పడే ముందు కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. డైట్ ప్రారంభదశల్లో కనిపించే ఈ దుష్ప్రభావాలూ, వాటి వల్ల కలిగే అనారోగ్యాలను ‘కీటో–ఫ్లూ’ అంటారు. అయితే కొన్నాళ్లలోనే ఈ కీటో–ఫ్లూ తగ్గిపోతుంది. డైట్ ప్లాన్ ఇలా... (కీటోజెనిక్ డైట్ తీసుకోవాలనుకున్నవారికి ఉజ్జాయింపుగా ఒక డైట్–ప్లాన్) పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా... వెన్నలో గార్నిష్ చేసిన చేపలనో లేదా వేటమాంసాన్నో పకోడాగా వేయించిన శ్నాక్. (దీన్ని పల్లీనూనెతో లేదా కొబ్బరినూనెతో తయారు చేసుకోవచ్చు). (లేదా) గుడ్డును ఆమ్లెట్గా వేసి తినవచ్చు (అయితే ఈ ఆమ్లెట్నూ మంచి వెన్నతో లేదా ఆలివ్నూనెతో వేసుకోవచ్చు) లేదా వివిధ రంగుల్లో ఉండే కాప్సికమ్ను పుష్కలంగా వేసి, గుడ్డు పొరటును చేసుకొని తినవచ్చు. (దీన్ని తయారు చేయడానికి ఆలివ్నూనె లేదా ఎక్కువ వెన్నను ఉపయోగించాలి). మధ్యాహ్న భోజనం (లంచ్)గా : లంచ్లో భాగంగా సలాడ్స్గా పాలకూర, పసుపుపచ్చ, ఆకుపచ్చ, ఎర్రరంగులో దొరికే కాప్సికమ్, పుట్టగొడుగులు (మష్రూమ్స్)ను ఆలివ్నూనె లేదా వెన్నలో కాస్తంత దోరగా వేపి తినవచ్చు. అలాగే కొన్నిసార్లు ఈ సలాడ్తో పాటు వెన్నలో వేయించిన చికెన్ ముక్కలు, వెన్నలో కాస్తంత దోరగా కాల్చిన ఉడకబెట్టిన గుడ్లు కూడా తీసుకోవచ్చు. వెన్న టాపింగ్తో ఈ సలాడ్ను తీసుకోవాలి. చేపలు, మాంసాహారం, చికెన్ లేదా పనీర్ను పకోడాలా వేయించి తీసుకోవచ్చు. ఆలివ్నూనె, పల్లీనూనె లేదా కొబ్బరినూనె పోసి వండిని కాలీఫ్లవర్ కూరను పైన పేర్కొన్న చేప, మటన్, చికెన్ పకోడాతో పాటు తీసుకోవచ్చు. రాత్రి భోజనంగా (డిన్నర్లో) : మీగడతో గార్నిష్ చేసిన పాలకూరను వెన్నలో వేయించి తీసుకోవచ్చు. లెమన్ చికెన్ సూప్ చేపలు, మాంసాహారం, చికెన్ లేదా పనీర్ను పకోడాలా వేయించి తీసుకోవచ్చు. (ఫ్రైడ్ పనీర్ పకోడా) కైమా లాగా కొట్టిన మటన్ను పైన పేర్కొన్న నూనెలతో వండి తీసుకోవచ్చు. కొబ్బరినూనె / ఆలివ్నూనె / పల్లీనూనెలో దోరగా వేయించి క్యాబేజీ సలాడ్.వారమంతా పైన పేర్కొన్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో మీకు అందుబాటులో ఉన్న పదార్థాలను, మీ ఛాయిస్ను బట్టి మార్చి మార్చి వాడుకోవచ్చు. గమనిక : బరువు తగ్గడానికి కీటో డైట్ను ఫాలో అవ్వాలనుకున్నవారు తప్పనిసరిగా ముందుగా నిపుణుల సలహా తీసుకోవాలి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ప్లీజ్ వెయిట్
కొందరు ‘భోజనం మానేయ్’ అంటారు. ఇంకొందరు ‘ఇది కాదు, అది తిను’ అంటారు. మరికొందరు ‘నేను చెప్పిందే రైటు’ అంటారు.ఇంకెవరో ‘ఊహు.. వాళ్లందరూ రాంగ్’ అంటారు. వెయిట్ కంట్రోల్లో ఉంచుకోడానికీ..వెయిట్ తగ్గడానికీ 3 ‘డబ్ల్యూ’లను అర్థం చేసుకోవడం అవసరం. వై.. వెన్.. వాట్.అందుకే తొందర పడొద్దు. ఇన్ని సమాచారాలతో కన్ఫ్యూజ్ అవ్వొద్దు.మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ప్లీజ్ వెయిట్! ఆహారం ఎందుకు తీసుకోవాలంటే? అది యంత్రమైనా, వస్తువైనా, మరేదైనా... దాని నిర్వహణ బాగుంటేనే అది బాగుంటుంది, దీర్ఘకాలం పని చేస్తుంది. దేహమూ అంతే. ఓ యంత్రంలాగే పని చేస్తుంది కాబట్టి దాన్ని కూడా దేహయంత్రం అని అంటుంటారు. ఒక వాహనానికి ఇంధనం లాగే... శక్తిని పుట్టించే ఒక టర్బైన్కు కూడా శక్తి అవసరమైనట్లే... మనకూ శక్తి కావాలి. ఆ శక్తి కోసమే మనం భోజనం తీసుకుంటుంటాం. కేవలం శక్తి కోసమేనా అంటే... అవును మౌలికంగా అంతే. అయితే దానితో పాటు మన కణాలూ, కండరాలు రోజువారీ పనుల్లో దెబ్బతింటూ ఉంటాయి. ఆ కణాలూ, కండరాల రిపేర్లకు ప్రోటీన్లు కావాలి. దాంతోపాటు కండరాల నిర్మాణం, కండరాల రిపేర్లతో పాటు, రక్తం, చర్మం, ఎముకల వంటి కణజాలం రిపేర్ల కోసం కూడా ప్రోటీన్ కావాల్సిందే. ఇక తక్షణ శక్తి సమకూర్చడానికి పిండిపదార్థాలు కావాలి. దాంతోపాటు దీర్ఘకాలం నిల్వ ఉంచుకోడానికి, కొన్ని కీలక శరీర అవయవాల రక్షణకు కొవ్వులూ కావాలి. ఆహారం అందనప్పటి అవసరాల కోసం కూడా... కొన్ని సందర్భాల్లో శరీరానికి అవసరమైన ఆహారం అందకపోవచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా శరీరం కొవ్వుల రూపంలో కొంత ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటుంది. అలాగే శీతల ప్రాంతాల్లో శక్తి కోసం వాడే పిండిపదార్థాల కంటే కొవ్వుల నుంచి ఎక్కువ శక్తి, వేడిమి పొందడం అవసరమవుతుంది. ఒక గ్రాము కొవ్వు ద్వారా 9 క్యాలరీల శక్తి పుడుతుంది. అదే ఒక గ్రాము పిండిపదార్థం నుంచి కేవలం 4 క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది. ప్రోటీన్ నుంచి కూడా అంతే శక్తి ఆవిర్భవిస్తుంది. కేవలం ఇందుకోసం మాత్రమే కాదు... కొన్ని విటమిన్లు మనలోకి ఇంకిపోవడం కోసం కూడా కొవ్వులు అవసరమే. ఇలా మనకు ప్రోటీన్లూ, పిండిపదార్థాలు, కొవ్వులూ కావాలి. కాబట్టి వీటిని ప్రధాన పోషకాలు అంటాం. ఇవి మాత్రమే గాక అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, లవణాలు వంటివి కూడా ఒంటికి కావాలి. తక్కువ మోతాదులో అవసరమైన వీటిని మైక్రో న్యూట్రియెంట్స్ అంటాం. ఇవన్నీ కలిసి కేవలం ఇంధనంగా శక్తిగా మాత్రమే గాక మనం శ్వాసించడానికీ, ఆహారాన్ని జీర్ణం చేయడానికి, మనలోని నిర్దిష్ట ఉష్ణోగ్రత నిర్వాహణ కావడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు... మన రోగనిరోధక శక్తి పదిలంగా ఉండటానికి... ఇలా అనేక రకాల ప్రయోజనాల కోసం ఆహారం కావాలి. అయితే ఆ ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలో (వై), ఎప్పుడెప్పుడు తీసుకోవాలో (వెన్), అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందో (వాట్) అన్న విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఆహారానికి... బరువుకు లింకు ఉందా? తప్పక ఉంది. ఆహారానికి, బరువు పెరగడానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. కొవ్వులు, పిండిపదార్థాలు ఎక్కువ మోతాదులో తినేవారి బరువు వెంటనే పెరుగుతుంది. వాటిని పరిమితంగా తీసుకుంటూ, అన్ని పోషకాలు పుష్కలంగా, సమగ్రంగా ఉండే ఆకుకూరలు వంటివి తీసుకునే వారి బరువు (మంచి పరిమాణంలో ఆహారం తీసుకుంటున్నా) ఎప్పుడూ అదుపులోనే ఉంటుంది. తీసుకునే ఆహారానికి, పెరిగే బరువుకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. అలాగని ఇవన్నీ ప్రతివారికీ ఒకేలా వర్తించాలని నియమమేమీ లేదు. వారి వారి వ్యక్తిగత జన్యుచిత్రపటం, వంశపారంపర్యత, కుటుంబ చరిత్రను అనుసరించి కొంత విభిన్నంగా ఉండవచ్చు. అందుకే ఇక్కడ పేర్కొన్న అంశాలు అందరికీ స్థూలంగా వర్తించేవి మాత్రమే. అంతే తప్ప నిర్దిష్టంగా వర్తించేవి కావని గుర్తించాలి. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి లేదా... బరువు పెరగకుండా ఉండటానికి ఆహారపరంగా చేయాల్సినవి... కావాల్సినవి ఇవి. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవడం ఎందుకంటే ఒక పూట భోజనంలో తక్షణ శక్తిని ఇచ్చే పిండిపదార్థాలు, శక్తిని నిల్వ చేసుకునేందుకు అవసరమైన కొవ్వులు, కణాల రిపేర్లకు అవసరమైన ప్రోటీన్లు; పోషకాలను సమకూర్చే ఆకుకూరలు, కూరగాయలు; విటమిన్లను ఇచ్చే తాజాపండ్లు, లవణాలను ఇచ్చే ఇతర ఆహార పదార్థాలు... ఇవన్నీ ఏదీ ఎక్కువా, ఏదీ తక్కువా కాకుండా సమపాళ్లలో ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దాన్నే సమతులాహారం అంటారు. ఇలా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలంగా చేసి, మనల్ని అనారోగ్యం పాలు కాకుండా చేసి సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సమతుల ఆహారం తీసుకోవడమే బరువును అదుపులో ఉంచుతుంది. అదే కొవ్వులు ఎక్కువగానో, పిండిపదార్థాలను అధికంగానో తీసుకుంటే మళ్లీ అది బరువు పెరగడానికి దారితీస్తుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం ఎందుకంటే: బరువు పెరగకుండా ఉన్నవారిపై ఒక అధ్యయనం నిర్వహించినప్పుడు వారిలో 78 శాతం రోజూ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకునే వారు ఉన్నారు. కేవలం 4 శాతం మాత్రమే అలా తీసుకోని వారున్నారు. ఇక మరో అధ్యయనాన్ని బట్టి చూస్తే బ్రేక్ఫాస్ట్ తీసుకోని వారిలో బరువు పెరిగే అవకాశాలు 4.5 రెట్లు ఎక్కువ అని నిశ్చయంగా తేలింది. బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఏం జరుగుతుంది? దీనికి ఒక కారణమూ ఉంది. పొద్దున్నే సంతృప్తికరంగా బ్రేక్ఫాస్ట్ తీసుకునే వారు ఇక రోజంతా తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ఈ అంశమే బరువును పెరగనివ్వదు. పొద్దున్నే సంతృప్తికరమైన బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే, కాలే కడుపు వారిని ఖాళీగా ఉండనివ్వకుండా అదో ఇదో నమిలేలా చేస్తుంది. దాంతో వారు ఉదయం తీసుకునేదానికంటే చాలా ఎక్కువ క్యాలరీను అడపాదడపా నములుతూ బరువును పెంచుకుంటారని ఆ అధ్యయనం తేల్చింది. అలాగే ఉదయం సంతృప్తికరంగా భారీగా బ్రేక్ఫాస్ట్ చేసేవారు, మధ్యాహ్నం అంతకంటే తక్కువగా ఎలాగూ తింటారు. ఇక రాత్రి చాలా పరిమితంగానూ తినడం వల్ల వారు బరువు పెరగకుండా ఉంటారు. ఎప్పుడెప్పుడు తినాలంటే... మనం తినే ఆహారాన్ని చాలా చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. మనం రోజుల్లో భోజనం చేసే ఆహారాన్ని ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా... తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. అంటే ఉదయం ఉపాహారం (బ్రేక్ఫాస్ట్), మధ్యాహ్నం భోజనం (లంచ్), సాయంత్రపు పలహారం (ఈవినింగ్ స్నాక్స్), రాత్రి భోజనం (సప్పర్/డిన్నర్) గా విభజించుకొని కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. ఇలా తింటే ఏం జరుగుతుందంటే అలా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడదు. ఇలా తినడం వల్ల బరువు పెరగకపోవడానికి మరో కారణం కూడా ఉంది. మనకు భోజనం లభ్యత తక్కువగా ఉన్నప్పుడు మన మెదడు దొరికిన ఆహారాన్ని నిల్వ ఉంచాలంటూ మన జీవక్రియల వ్యవస్థను ఆదేశిస్తుంది. దాంతో తక్కువ సార్లు ఎక్కువ మోతాదుల్లో భోజనం తినే సందర్భాల్లో ఆకలితో మాడే సమయం ఎక్కువగా ఉన్నందున ఆ సమయంలోని జీవక్రియల అవసరాల కోసం ఆహారాన్ని నిల్వ చేయాల్సిందిగా అందే ఆదేశాల మేరకు కొవ్వు పేరుకుంటుంటుంది. దాంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంది. అదే తక్కువ మోతాదుల్లో అయినా ఎక్కువసార్లు భోజనం లభ్యత జరుగుతున్నందున భోజనాన్ని నిల్వ చేసే అవసరం లేదని మెదడు నిర్ణయిస్తుంది. దాంతో కొవ్వు పేరుకోదు. పైగా తక్కువ మోతాదుల్లోనే తింటున్నందున అవసరమైన మేరకే క్యాలరీలు అందుతాయి. అంతేతప్ప కొవ్వుల పేరుకునేందుకు అవసరమైనంత ఆహార లభ్యత ఉండదు. దాంతో బరువు పెరిగేందుకు అవకాశమే ఉండదు. ఈ విషయంలోనూ ఒక అధ్యయనం జరిగింది. దాదాపు 4,000 కంటే ఎక్కువ మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పుష్కలంగా భోజనం అందేవారిని ఒక గ్రూపుగానూ, అడపాదడపా మాత్రమే భోజనం ఇస్తూ ఎప్పుడూ స్నాక్స్పై ఉండేవారుగానూ మరో గ్రూపుగానూ... ఇలా రెండు గ్రూపులుగా విభజించారు. ఈ అధ్యయనాన్ని మూడేళ్ల పాటు కొనసాగించి చూడగా క్రమం తప్పకుండా తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు భోజనం చేసేవారి బరువు దాదాపుగా స్థిరంగా ఉండగా నిత్యం స్నాక్స్ మీద ఉండేవారి బరువు ఎక్కువగా పెరిగింది. అంతేకాదు ఇక్కడ మరో అంశాన్ని కూడా అధ్యయనవేత్తలు గమనించారు. నిత్యం స్నాక్స్ తినేవారు తమ ఆకలి (రియల్ ఫిజియలాజికల్ హంగర్) కోసం కంటే... ఏదైనా ఒత్తిడి ఉన్నప్పుడు దాన్ని అదిగమించడం కోసం (ఎమోషనల్ హంగర్) ఎక్కువగా తింటున్నారని దాంతో బరువు పెరుగుతున్నారని ఆ అధ్యయనంలో తేలింది. ఇలా ఆకలిగా లేనప్పుడు కూడా స్నాక్స్ తినడం వల్ల ఏమవుతుందో తెలుసా? అవసరమైన దానికంటే ఒక రోజున 100 క్యాలరీలు ఎక్కువగా తింటూ అలా ఏడాది పాటు అదే అలవాటును కొనసాగిస్తే ఏడాది తర్వాత 6 కిలోల బరువు పెరుగుతారు. అంటే ఏదైనా ఆఫీసులో ఇలాంటి అలవాటును కేవలం ఐదేళ్ల పాటు కొనసాగించినా బరువు స్థిరంగా ఉండాల్సిన చోట దాదాపు 30 కిలోలు అదనంగా పెరుగుతారు. ఇలా స్నాకింగ్ మీదే ఉండేవారిని ఈ అలవాటు తప్పక ఇబ్బందుల్లోకి, ఆరోగ్య సమస్యల్లోకి నెడుతుందనేందుకు ఈ అధ్యయనమే ఒక ఉదాహరణ. అంటే దీన్ని బట్టి మీకు తెలుస్తున్నదేమిటి? తక్కువ క్యాలరీలతో ఉండే ఆకుకూరలు, కాయగూరలతో కూడిన భోజనాన్ని ఎక్కువసార్లు తినాలి. స్నాక్స్ అన్నవి ఎప్పుడో ఒకసారి అరుదుగా సరదాగా నమలడానికే తప్ప రోజూ తినడానికి కాదు. అసలు ఇలా తక్కువ క్యాలరీలతో ఎప్పుడూ మంచి భోజనం చేస్తుండటం వల్ల చిరుతిండ్లూ, స్నాక్స్, ఎక్కువ క్యాలరీలు ఉండే జంక్ఫుడ్ తినాలన్న ధ్యాస కూడా ఉండదు. ఇదే బరువును స్థిరంగా, నియంత్రణలో ఉంచే అంశం. రకరకాల ఆహారాలను ఎందుకు తీసుకోవాలంటే: మనలో ఆలూ తినేవారు ఎప్పుడూ బంగాళదుంపలనే ఇష్టపడుతుంటారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునేవారు ఎప్పుడూ అది ఉంటేనే తినగలుగుతారు. అప్పుడేం జరుగుతుందంటే... : ఎక్కువ వెరైటీలు అన్నది కేవలం ఆరోగ్యకరమైన ఆకుకూరలకు మాత్రమే పరిమితం కావాలి. మిఠాయిలకు, స్నాక్స్కూ, చాకొలెట్ క్యాండీలకు, చక్కెర ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్లకు వర్తిస్తే బరువు పెరిగే ముప్పు తప్పదు. భోజనంలో ఎప్పుడూ దుంపలు తినడానికి బదులు రకరకాల కూరగాయలు, ఆకుకూరలు తింటే ఆయా రకాల కూరల్లో ఉండే అన్ని పోషకాలూ శరీరానికి సమకూరతాయి. దాంతో అటు ప్రధాన పోషకాలైన మ్యాక్రోన్యూట్రియెంట్స్... ఇటు సూక్ష్మపోషకాలైన మైక్రోన్యూట్రియెంట్స్, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు... ఇలా అన్ని రకాల పోషకాలు సమకూరి ఆరోగ్యంగా ఉంటారు. మార్చిమార్చి తింటుండటం వల్ల ఒక్కోసారి రుచిగా ఉన్నవీ, ఒక్కోసారి రుచిగా లేనివి అన్ని రకాలూ అందుతూ సగటును ఎంతగా అందాలో అన్ని పోషకాలే ఒంటికి అందుతుంటాయి. అయితే ఇదే సూత్రం మిఠాయిలకూ, స్నాక్స్కూ వర్తింపజేస్తే మాత్రం... మిఠాయిల్లో అనేక వెరైటీలు, క్యాండీలు, చాకొలెట్స్, జంక్ఫుడ్, బేకరీ ఐటమ్స్, చక్కెర ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్లు, రిఫైన్డ్ పిండిపదార్థాలతో కూడిన శ్నాక్ వెరైటీలన్నీ చాలా రుచిగా ఉండటం వల్ల అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీలు ఒంటికి అందుతూనే ఉంటాయి. అందుకే ఈ వెరైటీలు అనేది కేవలం ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కాయగూరలు, తృణధాన్యాలకు మాత్రమే. కానీ స్వీట్స్, క్యాండీల విషయంలో మాత్రం వెరైటీలు అరుదుగానే అందాలి. బరువు పెరగకుండా ఉండటానికి వెరైటీలు అనే మంచి సూత్రాన్ని విచక్షణతో వాడాలి. ఇలా ఆహారాన్ని ఎందుకు తినాలో ... ఎప్పుడెప్పుడు ఎన్ని పూటలుగా తినాలో .. అప్పుడు ఏమవుతుందో అనే ఈ మూడు డబ్ల్యూల గురించి తెలుసుకుంటే... వెయిట్ అనే మరో డబ్ల్యూ కూడా మన అదుపులో ఉంటుంది. అధికం కాకుండా ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గడానికి అందుబాటులో ఉన్న రకరకాల పాపులర్ డైట్ ప్లాన్స్ని రాబోయే వారాల్లో మీకు పరిచయం చేస్తాం..! వ్యాయామం ముందు బ్రేక్ఫాస్ట్ మంచిదే వ్యాయామానికి ముందు బ్రేక్ఫాస్ట్ చేయడం మంచిదా, కాదా? మనలో చాలామందికి వచ్చే అనుమానం ఇది. ఇప్పటివరకూ ఏమీ తినకుండానే వ్యాయామం చేయడం అలవాటు కూడా. అయితే బాత్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధన ఒకటి భిన్నమైన విషయాన్ని చెబుతోంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత కొంత సమయానికి వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని పిండిపదార్థాలు మెరుగ్గా జీర్ణమవుతాయని వీరు అంటున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసిన రెండు గంటలకు వ్యాయామం చేసిన వాళ్లను.. బ్రేక్ఫాస్ట్ తరువాత మూడు గంటలపాటు విశ్రాంతి తీసుకున్న వారిని పోల్చి చూసినప్పుడు మొదటి వర్గంలో వ్యాయామం చేసేటప్పుడు పిండిపదార్థాలు బాగా ఖర్చయినట్లు తెలిసింది. ఆ తరువాత కూడా ఆహారం బాగా జీర్ణమైనట్లు, వీరు రక్తంలోని చక్కెర మోతాదులు, కండరాల్లోని గ్లైకోజెన్ పరిమాణాలను బట్టి నిర్ణయించారు. అప్పుడే తీసుకున్న ఆహారంలోని పిండిపదార్థాలతోపాటు కండరాల్లో గ్లైకోజెన్ రూపంలో నిల్వ ఉన్నవి కూడా ఖర్చు కావడం గమనించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జేవియర్ గోంజాలెజ్ తెలిపారు. పరిశోధన వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ: ఎండోక్రై నాలజీ అండ్ మెటబాలిజమ్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.నీళ్లు తాగడం భోజనానికి అరగంట ముందు దాదాపు అరలీటరు నీళ్లు తాగాలి. ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుందంటే... జీవక్రియల వేగాన్ని పెంచడంతో పాటు, తీసుకునే ఆహారపు పరిమాణాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. దీని వల్ల క్యాలరీలను దహనం జరుగుతుంది, అదనపు క్యాలరీలను తీసుకోకుండా నివారణ జరుగుతుంది. అంటే భోజనానికి ముందు తీసుకున్న నీరు బరువు పెరగకుండా స్థిరంగా ఉండడానికి దోహదపడుతుంది. అందుకే బరువు తగ్గడానికి నీళ్లనూ విచక్షణతో స్మార్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఇదీ వాస్తవం... నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టు కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తలో కొవ్వు శాతం పెరగడం (హైపర్లిపిడిమియా) వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. ఇక పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం అన్నది నేరుగా గుండెకు ముప్పు తెచ్చే అంశం. అందుకే కాస్త ఎక్కువగాఒళ్లు రావడం కంటే... కాస్త తక్కువగా పొట్టరావడమే ఎక్కువ ప్రమాదకరం. ఉప్పు తక్కువగా ఉండే ఆహారం ఆహారంలో ఉప్పు చాలా పరిమితంగా ఉండాలి. ఉప్పు తక్కువగా తినడం వల్ల ఏం జరుగుతుందంటే...ఉప్పు ఆహారానికి రుచిని పెంచుతుంది. రుచిగా ఉన్న ఆహారం ఆకలిని పెంచుతుంది. దాంతో ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీనే సందర్భాల్లో మన జిహ్వ, మన మెదడు అంత తేలిగ్గా సంతృప్త భావనకు (సేసియేషన్కు) లోను కాదు. దాంతో అపరిమితంగా తింటూ ఉంటారు. ఇది తీసుకునే క్యాలరీలను పెంచుతుంది. ఆ అదనపు క్యాలరీలన్నీ కొవ్వు రూపంలో ఒంట్లో పేరుకుపోతాయి. దాంతో బరువు అపరిమితంగా పెరుగుతూ పోతుంది. అందుకే ఉప్పు తక్కువగా ఉన్న ఆహారంతో భోజనం చేసేవారు పరిమితంగా తింటారు. పైగా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇదే సూత్రం ఆహారాల్లో వాడే రకరకాల ఫ్లేవర్లకు, కలర్లకు వర్తిస్తుంది. ఫ్లేవర్లతోనూ రుచి పెరిగి ఎక్కువగా తినేస్తాం. అలాగే కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా కనిపించే ఆహారాల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆ ఫ్లేవర్లూ, కలర్లూ స్వాభావికం కాకుండా, కృత్రిమ రసాయనాలై ఉంటే ఆరోగ్యానికి అదో ముప్పు. పైగా అలాంటి కృత్రిమ ఫ్లేవర్లూ, కలర్లూ చాలావరకు క్యాన్సర్ కారకాలై ఉంటాయి. అందుకే అటు బరువు పెంచే విషయంలోనూ, ఇటు క్యాన్సర్ కలిగించేందుకు దోహదపడేవీ అయిన ఆ కృత్రిమ రంగులనూ, ఫ్లేవర్లనూ ఆహారంలో వాడకపోవడమే అన్ని రకాలా మేలు. - డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
‘బొద్దు’ బాబోయ్!
సాక్షి,సిటీబ్యూరో: బుడిబుడి నడకల ప్రాయం బాలలు ‘బొద్దు’గా ఉంటే ఎంత బాగుంటుందో కదూ..! ఇలాంటి వారు ఎంత ముద్దొస్తారో! తల్లిదండ్రులు కూడా ఒకరి పిల్లలను చూసి మరొకరు బలం వస్తుందని.. అతిగా తినిపిస్తుంటారు. ‘బాగా తిని బాగా చదువుకో’.. అని నూరిపోస్తుంటారు. మీ ఇంట్లోని పిల్లలను ఇలాగే చూస్తున్నట్టయితే ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే తిండి.. చదువు తప్ప ఆరుబైట ఆటల ధ్యాస లేకుండా చేస్తే పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల గ్రేటర్ లోని పిల్లలపై చేసిన అధ్యయనంలో ఈ సమస్య తీవ్రతను గుర్తించారు. గ్రేటర్ పరిధిలో పలు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆటపాటకు దూరం కావడం.. గంటల తరబడి తరగతి గదుల్లో పుస్తకాలు, హోమ్వర్క్తో కుస్తీ పడుతుండడంతో ‘ఒబెసిటీ’ బారిన పడుతున్నారని ‘పీడియాట్రిషియన్స్ అసోసియేషన్’ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. మహానగరం పరిధిలో సుమారు 15 శాతం మంది చిన్నారులు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు 10 గంటలకు పైగా వారు తరగతి గదుల్లో బందీ అవడం.. పాఠశాల వేళలు ముగిశాక కూడా ట్యూషన్లు, ఇండోర్ గేమ్స్కే పరిమితం కావడంతో ఈ సమస్య తీవ్రమవుతోందని తేలింది. పెరుగుతున్న బాధితులు చిన్నారుల్లో రోజురోజుకూ ఊబకాయం పెరగడంతో వారిలో బద్ధకం పెరగడం.. చదువులో ఏకాగ్రత లోపించడం, కడుపు నొప్పి, జీర్ణకోశ, అజీర్ణం వంటి సమస్యలు పదేళ్లలోపు వారిలోనూ కనిపిస్తున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ప్రధానంగా పిల్లలు రోజులో సుమారు 8–10 గంటల పాటు తరగతి గదులకే పరిమితం అవుతుండడం.. చాలా పాఠశాలల్లో విద్యార్థులు స్వేచ్ఛగా ఆడుకునేందుకు అవసరమైన ఆటస్థలాలు లేవు. ఇంటికి వచ్చిన తరవాత కూడా హోమ్వర్క్లు, ట్యూషన్ల పరిమితం అవడం, జంక్ఫుడ్స్ అధికంగా తీసుకోవడం.. సమస్యను మరింత పెంచుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ‘డి’ విటమిన్లోపమే ప్రధాన సమస్య ఊబకాయంతో బాధపడుతోన్న చాలామంది చిన్నారులకు ‘డి’ విటమిన్ లోపం ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి నుంచి లభించే ‘డి’ విటమిన్ పిల్లలకు అందకపోవడంతో త్వరగా ఊబకాయం బారినపడుతున్నారని తేల్చింది. మరోవైపు తల్లిదండ్రులు అధిక క్యాలరీలు ఉండే జంక్ఫుడ్స్, కార్భోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను నిత్యం పెడుతుండడంతో సమస్య మరింత పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నుంచి వచ్చిన చిన్నారులను బలవంతంగా ట్యూషన్లు, హోమ్వర్క్ల ఒత్తిడి లేకుండా కనీసం గంట పాటు ఆరుబయట ఆడుకునే అవకాశం కల్పిస్తే అనారోగ్య సమస్యల నుంచి వారికి విముక్తి లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ఉత్తమం.. చిన్నారులకు ఉదయం, సాయంత్రం వేళల్లో రెండుగంటల పాటు విధిగా ఆటవిడుపు ఉండాలి. జంక్ఫుడ్కు బదులు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, పండ్లు,నట్స్ వంటివి అందించాలి. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ సమయంలో జంక్ఫుడ్ను దూరంగా ఉంచాలి. బలవంతంగా తరగతి గదులు, ట్యూషన్ల పేరుతో గంటల తరబడి నాలుగు గోడల మధ్య బంధించవద్దు. ఊబకాయంతో చిన్నారుల్లో రోగనిరోధక శక్తి సైతం తగ్గుతుంది. త్వరగా జబ్బుల బారిన పడతారని తల్లిదండ్రులు గుర్తించాలి. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యుడు -
కొవ్వును మార్చేస్తారు.. ఒళ్లు కరిగిస్తారు?
శరీరంలో రెండు రకాల కొవ్వులుంటాయి. ఆరోగ్యకరమైన బ్రౌన్ఫ్యాట్ ఒకటైతే.. హాని కలిగించే తెల్లటి కొవ్వు ఇంకోటి. తెల్ల కొవ్వుతో సమస్యలెక్కువ. బోలెడంత శక్తిని ఠక్కున కరిగించేయగల శక్తి బ్రౌన్ఫ్యాట్ సొంతం. అంటే.. బ్రౌన్ఫ్యాట్ ఎక్కువ ఉంటే.. ఎంత తిన్నా ఒళ్లు మాత్రం చేయం అన్నమాట! దీనిర్థం.. ఊబకాయం రాదు.. మధుమేహం, గుండెజబ్బులు వంటివీ దూరంగా ఉంటాయి! అంతా బాగానే ఉంది కానీ.. ఈ బ్రౌన్ఫ్యాట్ను పెంచుకోవడం ఎలా? చాలా సింపుల్ అంటున్నారు కొలంబియా ఇంజినీరింగ్ శాస్త్రవేత్త సామ్ సియా! శరీరంలోంచి తెల్లకొవ్వు కొంత సేకరించి.. పరిశోధన శాలలో దాన్ని బ్రౌన్ఫ్యాట్గా మార్చేసి.. మళ్లీ శరీరంలోకి జొప్పిస్తే సరి అంటున్నారు సామ్. ఒక భాగంలోని కొవ్వును తీసి ఇంకోభాగంలోకి ఎక్కించడమనే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ప్రక్రియను ఇప్పటికే చాలామంది నిరపాయకరంగా చేస్తున్నారని, కొవ్వును మార్చి మళ్లీ చేర్చడం మాత్రమే తాము కొత్తగా ప్రతిపాదిస్తున్నామని వివరించారు. తెల్లకొవ్వును బ్రౌన్ఫ్యాట్గా మార్చే విషయంలో తాము ఇప్పటికే విజయం సాధించామని, వైద్యులు క్లినిక్లో చాలా సులువుగా చేయగల పద్ధతి ఇదని సామ్ తెలిపారు. బ్రౌన్ఫ్యాట్ను పెంచేందుకు శరీర భాగాలను విపరీతమైన చల్లదనానికి గురి చేయడం ఇంకో పద్ధతి కూడా అందుబాటులో ఉన్నప్పటికీ దీనివల్ల అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. పరిశోధన శాలలో ఎలుకల తెల్ల కొవ్వును బ్రౌన్ఫ్యాట్గా మార్చేక్రమంలో సామ్ బృందం దశలవారీగా పరిశీలనలు జరిపింది. మారుతున్న కొవ్వు ఆరోగ్యానికి మేలు చేసేదిగానే ఉందని నిర్ధారించుకున్న తరువాతగానీ దాన్ని మళ్లీ శరీరంలోకి ప్రవేశపెట్టలేదు. బ్రౌన్ఫ్యాట్ను సూచించే రసాయనాలు, మైటోకాండ్రియా ప్రక్రియలను నిర్ధారించుకున్న తరువాత మళ్లీ దాన్ని ఎలుకల్లోకి ప్రవేశపెట్టారు. రెండు నెలల తరువాత కూడా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు. ఎలుకల్లో జరిపిన ప్రయోగాలను తాము మనుషుల్లోనూ చేశామని, చర్మం అడుగున ఉండే తెల్లకొవ్వును సేకరించి పరిశోధన శాలలో బ్రౌన్ఫ్యాట్గా మార్చామని సామ్ వివరిస్తున్నారు. శరీరం బరువు తగ్గించేందుకు భవిష్యత్తులో ఇదో మెరుగైన పద్ధతి కావచ్చునని సామ్ అంచనా. రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించేందుకు, బరువు పెరక్కుండా చూసేందుకూ ఉపయోగపడవచ్చునని అంచనా. కొవ్వుతో కూడిన ఆహారం తీసుకుంటున్న ఎలుకలపై తమ పద్ధతి అంతగా పనిచేయలేదని సామ్ స్పష్టం చేశారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ పద్ధతి లాభనష్టాలను బేరీజు వేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. -
బరువు సన్నమార్గాలు
ముందు ‘అన్న’ మార్గాలు చెబుతున్నాం అంటే అన్నం మితంగా తినమని చెబుతున్నాం. ఆ తర్వాత ‘ఉన్న’ మార్గాలు చెబుతున్నాం. అంటే జీవనశైలిలో పాటించడానికి ఉన్న మార్గాలివి. ఆ తర్వాత ‘భిన్న’ మార్గాలు చెబుతున్నాం. అంటే... తగ్గడానికి ఉన్నభిన్న భిన్న మార్గాలన్న మాట. ఈ మార్గాల్లో వీలును బట్టి ఏదైనా అనుసరించవచ్చు. ఎందుకంటే... సన్నబడే మార్గాలన్నీ సన్మార్గాలే! మెరుపుతీగలా ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సాధారణం శరీరాకృతితో ఉండటం సగం విజయం అని చెప్పుకోవచ్చు. కాని అధిక బరువుకు శరీరం చేరుకుంటే, కాయం ఊబకాయంగా మారితే జీవితం మందగిస్తుంది. సమస్యలు సంకెలలుగా మారతాయి. కదలికలకు నిరోధం పడుతుంది. నాణ్యమైన జీవితం అనుభవించడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే బరువు తగ్గాలి అధిక బరువు తగ్గాలంటే జీవనశైలి మార్చుకోవడం, లో–కార్బ్ డైట్, వాటర్ థెరపీ, లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ వంటి మార్గాలు చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉండాల్సిన బరువు కంటే లావు ఉన్నవారికి లేదా స్థూలకాయులుగా ఉన్నవారికి. కాని అపాయకర రీతిలో ఊబకాయం ఉన్నవారు అంటే మార్బిడ్ ఒబేసిటీ ఉన్నవారు ఈ మార్గాలన్నింటినీ గాక బేరియాట్రిక్ సర్జరీ వంటి శస్త్రచికిత్సా పద్ధతులను అవలబించే వీలుంది. ఈ బరువు తగ్గే మార్గాలన్నింటి గురించి ఒక పరిచయం ఇది. ముందుగా సర్జికల్ మార్గాలు చూద్దాం. శస్త్రచికిత్సల ప్రక్రియలివి... మీ బరువు ప్రమాదకరమైన స్థాయి దాటితే... సాధారణ జీవనశైలిలో మార్పులు, ఆహారం, వ్యాయామం వంటి స్వాభావిక ప్రక్రియల ద్వారానే సన్నబడటం చాలా కష్టం. పైగా అత్యధిక బరువు ఉన్నవారు తమ బరువు కారణంగానే ప్రాణాపాయాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివారు బరువు తగ్గడానికి కొన్నిసార్లు కొన్ని శస్త్రచికిత్సలను అనుసరించాల్సి రావచ్చు. అలా చేయకపోతే వారి బరువే వారిని కబళించవచ్చు. ఆ శస్త్రచికిత్సలను బేరియాట్రిక్ సర్జన్స్ / సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్లు చేస్తారు. ఆ ప్రక్రియల గురించి స్థూలంగా... లాపరోస్కోపిక్ అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ మనం తినే ఆహారం అన్నకోశం (స్టమక్)లోకి వెళ్తుంది. ఇది ఒక సంచిలా ఉంటుంది. మన పొట్ట నిండగానే తృప్తి (సేషియేషన్) కలుగుతుంది. నడుముకు బెల్ట్లాంటిదాన్ని పెట్టినట్లుగానే... ఒక శస్త్రచికిత్స ద్వారా అన్నకోశం (స్టమక్)కు కూడా బెల్ట్ వంటి దాన్ని అమర్చుతారు. మనిషి లావును బట్టి ఎంత మోతాదు ఆహారం అవసరమో నిర్ణయించి, దాన్ని బట్టి ఒక బ్యాండ్ను అమర్చుతారు. అందుకే దీన్ని అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ అంటారు. దాని కారణంగా స్టమక్ సైజ్ తగ్గుతుంది. ఫలితంగా కొంత తినగానే పొట్టనిండినట్లయి తృప్తి కలుగుతుంది. అనుకూలతలు/ప్రతికూలతలు: కేవలం గ్యాస్ట్రిక్ బ్యాండ్ అమర్చడం వల్ల ఎలాంటి హానీ ఉండదు. అయితే ఎలాగూ బ్యాండ్ అమర్చుకున్నాం కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రొసిజర్ తర్వాత నిపుణులు సూచించిన విధంగా ఆహార నియమాలు పాటించడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. అలా చేయకపోతే దీనివల్ల ఆశించిన ఫలితాలు ఉండవు. అన్నకోశం తొలగింపు బరువు విపరీతంగా పెరిగి అది ప్రాణాపాయంగా పరిణమించినప్పుడు శస్త్రచికిత్సతో 85శాతం మేరకు అన్నకోశాన్ని (స్టమక్ను) తొలగిస్తారు. దాంతో అన్నకోశం కాస్తా ఒక పేగు ఆకృతికి మారుతుంది. అనుకూలతలు / ప్రతికూలతలు: బరువు తగ్గించడానికి ఇది చాలా ప్రభావవంతమైన శస్త్రచికిత్స. అయితే అన్నకోశాన్ని తొలగించాక మళ్లీ మునుపటిలాగే తినడం వల్ల అన్నకోశం మళ్లీ మామూలుగా సంచిలా సాగిపోయే అవకాశం ఉంది కాబట్టి వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలతో పాటు ఆహార మార్గదర్శకాలన్నీ తప్పకుండా పాటించాలి. ల్యాపరోస్కోపిక్ రూ–ఎన్ వై గ్యాస్ట్రిక్ బైపాస్... ఈ శస్త్రచికిత్స ప్రక్రియతో ఆహారాన్ని అన్నవాహిక నుంచి స్టమక్లోకి కాకుండా నేరుగా పేగులకు వెళ్లేలా కలుపుతారు. అంటే... అన్నకోశాన్ని (స్టమక్ని) బై–పాస్ చేస్తూ... నేరుగా అన్నవాహికను పేగులతో అనుసంధానిస్తారు. అన్నవాహిక దగ్గర ఒక చిన్న సంచిని రూపొందించేలా ఈ సర్జరీ చేస్తారు. మళ్లీ ఈ సంచి నుంచి పేగుల్లోకి ఆహారం వెళ్లేలా దారి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియనే అనాస్టమోసిస్ అంటారు. అనుకూలతలు / ప్రతికూలతలు: అన్నకోశాన్ని పూర్తిగా బైపాస్ చేయడం వల్ల ఆపరేషన్ తర్వాత విటమిన్ లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కనిపించేందుకు అవకాశం ఉంది. నీరసంగా అనిపించడం, జుట్టురాలడం, విటమిన్లోపాల కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటివి కనిపించవచ్చు. కాబట్టి ఆ మేరకు విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. లాపరోస్కోపిక్ బిలియో–ప్యాంక్రియాటిక్ డైవర్షన్ (+/– డియోడోనల్ స్విచ్) ఇందులో అన్నకోశంతో పాటు కొంతమేర చిన్న పేగులను కూడా తొలగిస్తారు. ఫలితంగా తీసుకునే ఆహారం తగ్గుతుంది. అలాగే జీర్ణమయ్యే ఆహారమూ గణనీయంగా తగ్గిపోతుంది. అయితే ఈ శస్త్రచికిత్సలో కొంతమేర పేగులను తొలగించి ఆహారమార్గాన్ని కుదిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా జీర్ణస్రావాలు పొట్టలోకి కాకుండా నేరుగా పేగుల్లోకి వచ్చేలా శస్త్రచికిత్స నిర్వహిస్తారు. లైపోసక్షన్ శరీరంలో కొవ్వు పేరుకోవడం అన్నది ఆయా వ్యక్తుల జన్యువుల ఆధారంగా కొన్ని కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లో జరుగుతుంటుంది. ఉదాహరణకు కొందరికి పొట్ట, మరికొందరికి తొడలు, పిరుదులు వంటి భాగాల్లో ఇలా కొవ్వు పేరుకుంటుంటుంది. వ్యక్తుల్లో వారి వారి వ్యక్తిగత శరీర నిర్మాణాన్ని అనుసరించి, చాలా ఎక్కువగా కొవ్వు పేరుకున్న ప్రదేశం నుంచి కొవ్వును సక్షన్ ప్రక్రియ ద్వారా లాగేయడాన్ని లైపోసక్షన్ అంటారు. అనుకూలతలు/ప్రతికూలతలు: ఈ ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండదు. వ్యక్తుల బరువును బట్టి, వారిలో కొవ్వు పేరుకున్న ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మోతాదుకు మించి ఒకేసారి ఎక్కువ కొవ్వును తొలగించడం అన్నది కొందరిలో తీవ్రమైన ప్రాణాపాయం కలిగించవచ్చు. కొవ్వు తొలగించాక కొంతకాలం ఒంటి నొప్పులు కొనసాగుతాయి. (అయితే కొంతకాలం తర్వాత తగ్గిపోతాయి.) మరో ప్రతికూల అంశం ఏమిటంటే... ఒకసారి కొవ్వును తొలగించాక వదులైన శరీర భాగాలు సంచుల్లాగా వేలాడుతుంటాయి. అవి మామూలుగా శరీరాన్ని అంటుకుని ఉండేలా చేయడానికి మూడు నెలలకు పైగా బాగా బిగుతైన దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఒకసారి కొవ్వు తొలగించాక బరువు తగ్గినప్పటికీ, ఒకవేళ ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించకుండా, క్రమశిక్షణ లేకుండా మళ్లీ ఎప్పటిలాగే ఆహారపు అలవాట్లు కొనసాగించడమూ, వ్యాయామం చేయకపోవడం వంటివి చేస్తుంటే... మళ్లీ మునపటిలాగే బరువు పెరిగిపోతారు. అంటే ఇది శాశ్వతమైన పరిష్కారం కాదన్నమాట. ఇంతవరకు చెప్పినవన్నీ ప్రమాదకరమైన స్థితిలో బరువు పెరిగినప్పుడు పాటించే పద్ధతులు. అయితే అసలు అంతవరకు రాకుండా కొన్ని పద్ధతులు పాటించడం వల్ల కూడా ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు. ఆ పద్ధతులూ చూద్దాం. జీవనశైలి మార్పులు (లైఫ్స్టైల్ టెక్నిక్స్) జీవనశైలి మార్చుకొని బరువు తగ్గడం అంటే కడుపు మాడ్చుకోవడం కాదు... కడుపునిండా తింటూనే లావెక్కకుండా చూసుకోవడం. ఇది దాదాపు నిరపాయకరమైన పద్ధతి. క్రమశిక్షణ ఉన్నవారు క్రమం తప్పకుండా పాటిస్తే చాలావరకు మేలు జరుగుతుంది. అంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఉదాహరణకు కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ప్రోటీన్లపై ఆధారపడటం, అన్ని పోషకాలు అందేలా తక్కువ క్యాలరీలు ఉండే సమతులాహారం తీసుకోవడం వంటివి చేయాలి. అలా తిన్న ఆహారంతో సమకూరే అదనపు క్యాలరీలను లెక్కించడం, తగ్గించడం అవసరం. అలా తగ్గించడానికి వ్యాయామంతో క్యాలరీలను దహించడం, కొవ్వును కరిగించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, కాయగూరల్లో పోషకాలు ఎక్కువ పాళ్లలో ఉంటాయి. వాటిని భుజించాలి. నీటిపాళ్లు ఎక్కువగా ఉండే కాయగూరలు తింటే పోషకాలు భర్తీ అవడమే కాకుండా... వాటిలోని నీరు త్వరగా కడుపు నింపేలా చేస్తుంది. అందుకే పోషకాలు పుష్కలంగా అందడంతో పాటు కడుపు త్వరగా నిండి తృప్తి కలుగుతుంది తృప్తి కలగడం వల్ల ఎంత ఆహారం కావాలో అంతే తింటారు. బరువు తగ్గడంలో భాగంగా గుడ్డు తినడం కూడా మంచిదే. గుడ్డులో ల్యూసిన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఉంది. శాకాహారం విషయానికి వస్తే గుమ్మడిగింజలు, వేరుశెనగల్లో ల్యూసిన్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి నేరుగా ఉపయోగపడుతుంది. మాంసాహారాన్ని ఇష్టపడేవారు చేపలు తినడం చాలా మంచిది. చేప మాంసంలో కొవ్వులు దాదాపు సున్నా (జీరో). మసాలాలను తగ్గించాలి. ఇక పండ్లలో తక్కువ చక్కెర ఉండే పండ్లు మంచివి. ఇక వ్యాయామంలో భాగంగా ఒళ్లు పూర్తిగా బడలిక చెందనివిధంగా, నీరసపడిపోకుండా మీరు భరించగలిగే పరిమితిలో నడక (బ్రిస్క్ వాక్) చేయడం అన్నింటికన్నా ఉత్తమమైన వ్యాయామం. నెమ్మదిగా పరుగు (స్లో జాగింగ్) వంటి వ్యాయామాలు చేయడం చాలా మేలు చేసే అంశమే. అనుకూలతలు / ప్రతికూలతలు: బరువు తగ్గడానికి అనుసరించే వాటిల్లో ఈ పద్ధతులు చాలా ఆరోగ్యకరం. ప్రతికూలతలు చాలా తక్కువ. ఇక మోకాళ్ల నొప్పులు ఉన్నవారు శరీర భారం ఫీలవ్వని ఈత లేదా మోకాళ్లపై భారం పడని సైక్లింగ్ వంటి వ్యాయామాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. లో కార్బ్ డైట్ ఇందులో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేసి, చాలా తక్కువ మోతాదులో శక్తిని వెలువరించే పిండిపదార్థాలను తీసుకుంటారు. అంటే రిఫైన్ చేసిన పిండిపదార్థాలకు బదులుగా, అంతగా పాలిష్ చేయని పొట్టు ఉన్న గింజలను తీసుకోవడం, కొన్నిసార్లు కార్బోహైడ్రేట్లను దాదాపుగా తగ్గించడం వంటివి అన్నమాట. అయితే దీన్ని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఇందులోనూ అనేక డైట్ ప్రక్రియలు ఉన్నాయి. ప్రతికూలతలు: ఒక్కోసారి శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు గణనీయంగా తగ్గించడం వల్ల చక్కెర పాళ్లు పడిపోయి సదరు స్థూలకాయుడిని ప్రమాదకరమైన పరిస్థితిలోకి (హైపోగ్లైసీమియా స్థితికి) తీసుకెళ్లవచ్చు. దాన్ని తప్పించాక... ఒకసారి స్థూలకాయులు మళ్లీ మామూలు స్థితికి వచ్చాక మళ్లీ మొదటిలాగే సాధారణ ఆహారపు అలవాట్లను కొసాగించే అవకాశాలు ఉంటాయి. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికే రావచ్చు. వాటర్ థెరపీ ఒక అధ్యయనం ప్రకారం భోజనానికి అరగంట ముందుగా... పూటకు అరలీటరు నీళ్లు తాగితే జీవక్రియల వేగం (మెటబాలిజం రేటు) 30 శాతం పెరుగుతుంది. ఈ అధ్యయానం ‘ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్’ అనే వైద్యవిజ్ఞాన జర్నల్లో ప్రచురితమైంది. దీన్నిబట్టి ఒక వ్యక్తి తాను తీసుకోవలసిన దాని కంటే ఒక రోజులో 1.5 లీటర్ల నీళ్లు ఎక్కువగా తాగితే అతడు క్యాలరీలను ఎక్కువగా ఖర్చుచేయగలడు. ఇలా చేస్తే ఏడాదిలో దాదాపు రెండున్నర కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. అనుకూలతలు / ప్రతికూలతలు : ఎక్కువ నీళ్లు తాగడం వల్ల తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. బరువు పెరగకుండా ఉండటానికి ఈ అంశం దోహదపడుతుంది. ఇదొక్కటే అనుకూలత. ఇక ప్రతికూలతల విషయానికి వస్తే ఇది నమ్మకమైన ప్రక్రియ కాదు. ఎందుకంటే... నీళ్లు కొవ్వులను నేరుగా కరిగించలేవు. అందువల్ల కొవ్వు పేరుకోవడంతో పెరిగే బరువు అన్నది వాటర్ థెరపీతో తగ్గేందుకు అవకాశమే లేదు. ఇవీ స్థూలంగా బరువు తగ్గడానికి ఉన్న కొన్ని మార్గాలు, వాటితో ప్రయోజనాలు, ప్రతికూలతలు. ఇవన్నీ కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కోసం మాత్రమే. వీటిని కొన్నింటిని నేరుగా ఆచరించడం ప్రమాదకరం కావచ్చు కూడా. ఉదాహరణకు విచక్షణ రహితంగా చేసే డైటింగ్, కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవడం వంటివి. ఇక బరువు తగ్గడానికి కొందరు కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ట్యాబ్లెట్లు, మూలికలు, హెర్బ్స్ కూడా ఇస్తుంటారు. ఇవి ఎలాంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు. వాటి వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. గమనిక: ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు ముందుగా తప్పనిసరిగా మొదట ఫిజీషియన్ను సంప్రదించాలి. ఇక బరువు అన్నది ప్రాణాంతకంగా మారినప్పుడే (మార్బిడిటీకి దారితీసినప్పుడే) బేరియాట్రిక్ సర్జన్లు బరువు తగ్గే శస్త్రచికిత్సలను చేస్తారు. అంతే తప్ప బరువు తగ్గాలనుకునే ప్రతివారికీ అవే మార్గాలు కావని గుర్తుంచుకోవాలి. పాఠకులకు మనవి: ఈ కథనంలో విపులంగా చర్చించని కొన్ని అంశాలతో పాటు అనేక ఆహార విధానాలను రాబోయే వారాలలో విపులంగా ఇవే పేజీలలో చూడవచ్చు. కూల్స్కల్ప్టింగ్ కొన్ని చోట్ల ఉన్న కొవ్వు ఎంతగా ప్రయత్నించినా కరగదు. దాన్ని ఎంతకూ లొంగని కఠినమైన కొవ్వుగా పేర్కొంటారు. అలాంటి కొవ్వు కణాలను చాలా ఎక్కువగా చల్లబరచడం ద్వారా చనిపోయేలా చేస్తారు. ఇలా కొవ్వును నియంత్రితమైన రీతిలో (కంట్రోల్డ్గా) ఘనీభవించేంతగా చల్లబరచడం ద్వారా లాగేసే నాన్ సర్జికల్ ప్రక్రియే కూల్స్కల్ప్టింగ్. ఇలా చేయడం వల్ల అక్కడి కొవ్వు కణాలు నిర్వీర్యమై అచేతనమవుతాయి. దాంతో అవి ముడుచుకుపోతాయి. ఈ దశలో ఈ కొవ్వుకణాలు సహజ ప్రక్రియలో భాగంగా బయటకు విసర్జితమవుతాయి. ఇలా చేసేందుకు ప్రత్యేకమైన కూల్ స్కల్ప్టింగ్ యంత్రాన్ని వాడతారు. ప్రతికూలతలు: ఇది చాలా సుఖవంతమైన ప్రక్రియలా అనిపించినా కొవ్వు తొలగించిన ప్రాంతంలో బాగా లాగినట్లుగా అనిపించడం, నొప్పి, తాత్కాలికంగా ఆ ప్రదేశం ఎర్రబారడం, కొన్నిసార్లు చిన్న గాయంలా అనిపించడం కూడా జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో కొవ్వుకణాలు అంతమైపోవడం వల్ల చాలా సందర్భాల్లో మళ్లీ కొవ్వు పేరుకోకపోవచ్చు. ఒక్క టీకాతో ఊబకాయం పోతుందా? వినడానికి కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే ఇది. ఊబకాయాన్ని తగ్గించడం చిటికెలో పని అంటున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు కొందరు. ఆరోగ్యకరమైన బరువున్న వారితో పోలిస్తే ఊబకాయుల్లో అడినోవైరస్ – 36 అనే వైరస్ నాలుగు రెట్లు ఎక్కువగా కనిపిస్తోందని.. ఈ వైరస్ను తొలగిస్తే బరువు పెరక్కుండా అడ్డుకోవచ్చునన్నది వీరి వాదన. ఎలుకల్లో తాము కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు పెరిగిన ఒళ్లు బరువులో 15 శాతానికి అడినోవైరస్ – 36 కారణమని తెలిసినట్లు వీరు చెబుతున్నారు. కొవ్వు కణాలను చీకాకుపెట్టి అవి వాచిపోయేలా చేయడం.. చనిపోకుండా అడ్డుకోవడం అనే రెండు పనుల ద్వారా ఈ వైరస్ ఒళ్లు పెరిగేందుకు కారణమవుతున్నట్లు యూనివర్శిటీ ఆఫ్ మసాచూసెట్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. విన్కాన్సిన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ రిచర్డ్ అట్కిన్సన్ ఇప్పటికే ఓ వ్యాక్సిన్కు పేటెంట్ కూడా సంపాదించగా.. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తమదైన వ్యాక్సిన్తో జరిపిన పరిశోధనలు విజయవంతమయ్యాయి కూడా. యువకులకు ఈ వ్యాక్సీన్ ఇవ్వడం ద్వారా వాళ్లు బరువు పెరక్కుండా అడ్డుకోవచ్చునని తద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇంకొందరు శాస్త్రవేత్తలు మాత్రం వ్యాక్సిన్ను వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ముందుగానే మరిన్ని పరిశోధనలు నిర్వహించాలని... వైరస్ ద్వారానే ఒళ్లు పెరుగుతున్నట్లు రూఢి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒక అపోహ: తల్లిపాలు పుష్కలంగా తాగిన పిల్లలు పెద్దయ్యాక ఊబకాయులు కారు ఒక వాస్తవం: కొంత కాలం క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ఈ మాట ప్రకటించడంతో అందరూ ఇది వాస్తవమే అనుకున్నారు. అయితే తరువాతి కాలంలో ఇదే సంస్థ తమ ప్రకటనలో వాస్తవం కొంతేనని, అధ్యయనం జరిగిన తీరులో లోపం కారణంగా ఫలితం అలా వచ్చిందని స్పష్టం చేసింది. తల్లిపాలకు, ఊబకాయానికి మధ్య స్పష్టమైన సంబంధం ఏదీ ఇప్పటివరకూ కనిపించలేదని ఇంకో విస్తృత అధ్యయనం ఆధారంగా తేల్చింది. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. ఊబకాయులు కాకుండా నిరోధిస్తుందా లేదా అన్నది పక్కనపెడితే తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు మాత్రం బోలెడు. అన్ని లాభాలు ఏకరవు పెట్టాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని వారు అంటున్నారు. డాక్టర్ వి.సుధాకర్ ప్రసాద్ సీనియర్ కన్సల్టెంట్, కాస్మటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
అంతా మీరే చేస్తున్నారు!
ఒకప్పుడు ఒబేసిటీ బాధితులు చాలా తక్కువ. మరి ఇప్పుడు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి 100 మందిలో 30 మంది దీనిబారిన పడుతున్నారు. బాధితుల సంఖ్య ఇంతగా పెరగడానికి కారణమేంటి? ఇదేమైనా అంటువ్యాధా? ..ఎస్, అవుననే అంటున్నాయి పరిశోధనలు. అనారోగ్య సమస్య నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందకపోయినా.. అందుకు కారణమయ్యే అలవాట్లు మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నాయట. ఉదయాన్నే లేవడం, ఇంటి పని చకచకా చేసుకోవడం, ఇంట్లో తయారుచేసే టిఫిన్ తినేసి పనులకెళ్లడం, సాయంత్రం వచ్చాక కుటుంబసభ్యులతో కలసి సరదాగా గడపడం, పొద్దుగూకిన మరుక్షణమే పడుకోవడం.. ఇవన్నీ కనుమరుగై చాలారోజులే అయ్యింది. కాలచక్రం కాస్త.. కాదు కాదు.. బాగానే ముందుకు కదిలింది. రాత్రి ఒంటిగంట దాటిన తర్వాతే నిద్ర. పొద్దున 10 దాటిన తర్వాతే పక్కదిగడం. ఇక ఫోన్లో ఆర్డరిచ్చి, కార్లో తినేయడం, కదలకుండా గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయడం, ఇంటికొచ్చాక సోఫాలో సాగిలబడి టీవీకి అతుక్కుపోవడం, వంటి అలవాట్లే మన కొంప ముంచుతున్నాయి. అలాగే రాబోయే తరాల ఆరోగ్యాన్నీ మనమే పాడుచేసేలా చేస్తున్నాయి. కారణం చిన్నపిల్లలు మనల్ని చూసి ఇలాంటి అలవాట్లు అనుకరిస్తుండడమే. అంటు వ్యాధిలా అలవాట్లు..: తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఎన్నో నేర్చుకుంటారు. వారి ఆహార్యాన్ని అనుకరించడమేకాదు.. అలవాట్లనూ పాటిస్తారు. పేరెంట్స్ ఒబెసిటీ మార్గంలో నడిస్తే.. పిల్లలూ అదేబాట అనుసరించి రేపటి ఒబెసిటీ పేషెంట్లవుతారు. అమెరికాలోని బఫెలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాదాపు 286 కాలేజీల విద్యార్థుల అలవాట్లను పరిశీలించి, కారణాలను విశ్లేషించి చెప్పిన సంగతిది. ఇలా అలవాట్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం వల్లే యువతరం ఒబేసిటీ బారిన పడుతున్నారని తేల్చారు. -
ఊబకాయానికి.. బ్యాక్టీరియాకు లింకు!
‘‘తినడం తగ్గించేశాను.. రోజూ వ్యాయామం చేస్తున్నాను. కాని ఒళ్లు తగ్గడం లేదు’’ ఈ రకమైన వ్యాఖ్యలు మనం తరచు వింటూంటాం. శరీర™ è త్వం అంతేనేమో అనుకుని సరిపెట్టుకుంటాం కూడా. అయితే అసలు కీలకం మన పేగుల్లోని బ్యాక్టీరియాలో ఉందంటున్నారు మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు. శరీరానికి శక్తినిచ్చే కేలరీలన్నీ ఒకేరకంగా ఉండవని, పేగుల్లోని బ్యాక్టీరియా మనం ఆహారాన్ని ఖర్చుపెట్టే క్రమాన్ని మార్చేడం ద్వారా ఒళ్లు పెరగడం/తగ్గడాలను ప్రభావితం చేస్తున్నట్లు వీరు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. బరువు తగ్గించుకోవాలనుకుంటున్న ఊబకాయుల పేగుల్లోని బ్యాక్టీరియాలో చాలా మార్పులు ఉన్నాయని వీరు గుర్తించారు. సులువుగా ఒళ్లు తగ్గే వారిలో ఫాస్కోలార్కోటో బ్యాక్టీరియం ఎక్కువగా ఉంటే, ఇతరుల్లో డయాలిస్టర్ బ్యాక్టీరియా సమృద్ధిగా ఉన్నట్లు తాము గుర్తించామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త వందనా నెహ్రా తెలిపారు. అలాగే కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయగల ఎంజైమ్ల విషయంలోను ఇరువురిలో తేడాలు ఉన్నట్లు తెలిసిందని ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వైద్యులు ఊబకాయులకు మరింత ప్రభావవంతమైన సలహా, సూచనలు ఇవ్వవచ్చునని వందన వివరించారు. -
నీవు లావా కావా
నీవు లావా? కావా?? ఇదో పెద్ద పోరాటం.ఇంగ్లిష్లో బ్యాటిల్ ఆఫ్ ద బల్జ్ అంటారు. ‘‘ఏవోయ్ శ్రీనివాస్... అలా చిక్కిశల్యమైపోయావేమిటీ?’’ అన్న కామెంట్స్ ఈరోజుల్లో అస్సలు వినిపించడంలేదు. ‘‘ఏవయ్యా శ్రీనివాస్... కాస్త ఒళ్లు చేసినట్టున్నావ్ కదూ’’ ఇది ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వినిపించే మాట. ఇలా చిక్కలేక... చిక్కుల్లో ఉన్నవాళ్లకీ లావు పెరిగి బిక్కుబిక్కుమంటున్నవాళ్లకీఅసలు నువ్వు లావా..? కావా..?అని చెప్పడానికే ‘ఊబకాలమ్’లో ఈ స్పెషల్ రెండో కథనం. ఒక వ్యక్తి స్థూలకాయుడా కాదా అని నిర్ణయించడం ఎలా? ఇందుకు ‘బీఎమ్ఐ’ గురించి తెలుసుకోవాలి. ఒక వ్యక్తి స్థూలకాయుడా కాదా అని నిర్ధారణ చేయడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ) అనే ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. దీన్ని కొలిచే పద్ధతి ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాములలో కొలవాలి. ఆ విలువను అతడి ఎత్తు స్క్వేర్తో భాగించాలి. స్క్వేర్ అంటే అదే సంఖ్యను మళ్లీ అదే సంఖ్యతో గుణించడం. ఈ ఎత్తు విలువను మీటర్లలో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 100 కిలోలు. అతడి ఎత్తు 1.7 మీటర్లు. అప్పుడు అతడి బీఎమ్ఐ విలువ ఎంత అంటే... 100 / 1.7 ’ 1.7 = 34.60 కి.గ్రా./మీ. స్క్వేర్. ఇప్పుడు ఈ విలువను బీఎమ్ఐ పట్టికతో సరిపోల్చుకుని మీరు ఏ స్థూలకాయ స్థాయిలో ఉన్నారో నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా విదేశాలలో జరిగే అధ్యయనాల ప్రకారం వచ్చిన విలువలనే మన దేశవాసులకూ అన్వయిస్తుంటారు. కానీ స్థూలకాయం విషయంలో ఈ ప్రమాణాలు విదేశీయులకూ, భారతీయులకూ ఒకటి కాదు. (పైన వచ్చిన విలువ విదేశీయుల లెక్కలో స్వల్ప స్థూలకాయమే అయినా... భారతీయుల విషయంలో మాత్రం అధిక స్థూలకాయం కిందనే లెక్క.)బీఎమ్ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మనం తక్కువ స్థూలకాయస్థాయిలో ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. భారతీయులలో స్థూలకాయం... భారతీయుల్లో బీఎమ్ఐ విలువ 25 – ఆపైన ఉంటే స్వల్ప స్థూలకాయం ఉన్నట్లే. ఒకవేళ బీఎమ్ఐ విలువ 30 – ఆ పైన ఉంటే అధిక స్థూలకాయం ఉన్నట్టుగా పరిగణించాలి. స్థూలకాయాన్ని నిర్ణయించే మరో లెక్క నడుము–హిప్ రేషియో.నడుము చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లు. ఇక నడుం–హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి. ఉదాహరణకు ఒక పురుషుడి నడుము 100 సెం.మీ. ఉండి అతడి హిప్ కేవలం 80 సెం.మీ. ఉందనుకోండి. అప్పుడు 100 / 80 = 1.25. అంటే 0.9 కంటే ఎక్కువ కాబట్టి అతడికి స్థూలకాయం ఉన్నట్లే. అలాగే ఒక మహిళ నడుము 90 సెం.మీ. ఉండి, ఆమె హిప్ 100 సెం.మీ. ఉంటే... 90 / 100 = 0.9. అది 0.8 కంటే ఎక్కువే కాబట్టి ఆమెది స్థూలకాయమేనని పరిగణించవచ్చు. పైన పేర్కొన్న పద్ధతుల ద్వారా మీరు స్థూలకాయులా కాదా అని మీకు మీరే తెలుసుకోవచ్చు. సెంట్రల్ ఒబేసిటీ... చాలామంది ఒళ్లంతా లావెక్కడాన్నే ఒబేసిటీగా అనుకుంటుంటారు. కానీ సన్నగా ఉండి పొట్ట పెరగడం కూడా ఒబేసిటీ కిందనే లెక్క. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. డయాబెటిస్, హైబీపీ, రక్తంలో కొవ్వు శాతం పెరగడం (హైపర్ లిపిడిమియా) వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. ఇదేగాక మరికొన్ని రకాల స్థూలకాయాలనూ పరిగణనలోకి తీసుకోవచ్చు. అవి... 1. ఇనాక్టివ్ ఒబేసిటీ: ఎలాంటి వ్యాయామమూ, శారీరక శ్రమ లేని కారణంగా ఒంట్లో పలు చోట్ల కొవ్వు పేరుకుపోయి వచ్చే స్థూలకాయాన్ని ఇనాక్టివ్ ఒబేసిటీ అంటారు. 2. ఫుడ్ ఒబేసిటీ: వేళకాని వేళల్లో, రాత్రివేళల్లో ఇష్టం వచ్చినట్లుగా తినడం వల్ల కొవ్వు రూపంలో వచ్చే స్థూలకాయమిది. 3. యాంగై్జటీ ఒబేసిటీ: కొందరిలో యాంగై్జటీ లేదా డిప్రెషన్ ఉన్నప్పుడు ఊబకాయం వస్తుంది. ఇలాంటి ఒబేసిటీ తగ్గించాలంటే మొదట వారి మానసిక సమస్యను నయం చేయాల్సి ఉంటుంది. అంతేతప్ప సాధారణ ఊబకాయం ఉన్నవారిలో అనుసరించే మార్గాలు వీరికి అంతగా ఉపకరించవు. 4. వీనస్ ఒబేసిటీ: కొందరికి కొన్ని నిర్దిష్ట సమయాల్లో ఊబకాయం వస్తుంటుంది. అంటే... ఒక నిర్దిష్టమైన వయసులోనో లేదా మహిళల్లో అయితే నిర్దిష్టంగా గర్భధారణ సమయంలోనో... ఇలా. ఈ తరహాలో నిర్దిష్ట సమయాల్లోనే కనిపించే ఊబకాయం కేవలం వ్యాయామంతోనే తగ్గిపోతుంది. ఊబకాయానికి కారణాలు ∙జన్యుపరమైన కారణాలు: సాధారణంగా తల్లిదండ్రుల్లో ఊబకాయం ఉన్నప్పుడు కుటుంబాల్లో అది వంశపారంపర్యంగా వస్తుండటం మామూలే. దీన్ని తగ్గించడం చాలావరకు సాధ్యంకాదు. అయితే ప్రయత్నం మీద కొంత తగ్గి, చురుగ్గా తమ కార్యకలాపాలు జరుపుకుంటే ఆరోగ్యంగా ఉన్నట్లే పరిగణించవచ్చు. ∙వయసు: చాలామంది మధ్యవయసుకు వచ్చేసరికి బరువు పెరగడం మామూలే. స్త్రీపురుషులిద్దరిలోనూ ఈ పరిణామం చోటుచేసుకున్నా మహిళల్లో మరీ ఎక్కువ. ప్రత్యేకంగా మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో ఇది మరీ ఎక్కువ. ఇక పురుషుల్లో అయితే పొట్ట రావడం చాలా సహజం. ఇది ఒంట్లో సరిగ్గా మధ్య భాగంలో వస్తుంటుంది కాబట్టి ఇలా జరగడాన్ని కొందరు సరదాగా ‘మిడిల్ ఏజ్డ్ మిడ్ ట్రెజర్’ అంటూ చమత్కరిస్తుంటారు. ∙ఆహార అలవాట్లు: కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం (శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ఫ్యాట్స్, షుగర్స్)తో పాటు పిజ్జా, బర్గర్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, వేళకు తినకపోవడం, రాత్రి డ్యూటీలు పెరగడం వల్ల రాత్రిపూట చాలా ఎక్కువ ఆహారం తీసుకొని, పగలు పడుకోవడం వంటి కారణాల వల్ల బరువు పెరుగుతుంటారు. ∙శరీర కదలికలు మందగించడం: ఇటీవల కూర్చొని చేసే వృత్తుల వల్ల బరువు పెరగడం అన్నది బాగా పెరిగిపోయింది. పైగా ఆధునిక వృత్తుల్లో ఒంటి కదలికలకు ఏమాత్రం ఆస్కారం లేకపోవడంతో, శరీరానికి తగిన శ్రమ లేక క్యాలరీలు దహనం కాక అవి కొవ్వుల రూపంలో పేరుకుపోవడం వల్ల ఊబకాయం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ∙కొన్ని రకాల జబ్బులు (మెడికల్ రీజన్స్): హైపోథైరాయిడిజమ్, కుషింగ్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి వైద్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఒంటి బరువు పెరుగుతుంది. ∙కొన్ని రకాల మందులు వాడటం: స్టెరాయిడ్స్తో కూడిన మందులు వాడినప్పుడు ఊబకాయం రావడం మామూలే. డిప్రెషన్ ఉన్నవారు వాడే యాంటీ డిప్రెసెంట్స్, మూర్ఛవ్యాధిగ్రస్తులు వాడే యాంటీ ఎపిలెప్టిక్ మందులతోనూ ఒళ్లు వస్తుంది. (బరువు తగ్గడానికి ఉపయోగపడే వేర్వేరు ప్రక్రియల గురించి విపులంగా వచ్చే వారం) ఒంట్లో కొవ్వు ఎంత ఉండాలి... శరీరంలో శక్తిగా మారక మిగిలిపోయిన ఆహారం కొవ్వుగా మారి నిల్వ ఉంటుందన్న విషయం తెలిసిందే. మరి కొవ్వు పేరుకోవడం స్థూలకాయానికి దారితీస్తుందన్న అంశమూ అందరికీ తెలుసు. అలాగని కొవ్వును పూర్తిగా పరిహరించకూడదు. ఎందుకంటే... మనకు కంటి చూపుకు అవసరమైన విటమిన్–ఏ, ఎముకలకు బలాన్నిచ్చి, అనేక క్యాన్సర్లనుంచి కాపాడుతూ శరీర రక్షణ వ్యవస్థకు బలం సమకూర్చే విటమిన్–డి, ఒంటికి అందాన్ని పెంచే విటమిన్–ఈ, రక్తం గడ్డకట్టేలా చేసి ప్రమాదాల్లో ప్రాణాలను నిలిపే విటమిన్–కే ల విటమిన్లన్నీ శరీరంలోకి ఇంకడం అన్న ప్రక్రియ కొవ్వు లేకపోతే జరగదు. అలాగే మనలోని చాలా కీలక అవయవాల చుట్టూ కొవ్వు ఒక రక్షణ కవచంలా పేరుకుపోయి ఉంటుంది. శరీరం రోజూ ఎదుర్కొనే చిన్న కొద్దిపాటి దెబ్బలకు కీలక అవయవాలు దెబ్బతినకుండా వాటి చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా ప్రకృతి అద్భుతమైన ఏర్పాటు చేసింది. అందుకే మనం గమనిస్తే... గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. అలాగే కిడ్నీలు కొవ్వులో కూరుకుపోయే ఉంటాయి. ఇక పేగుల చుట్టూ కూడా అంతో ఇంతో కొవ్వులు ఉండనే ఉంటాయి. అందుకే మన విటమిన్ల శోషణకూ, మన అవయవాల రక్షణకు అవసరమైన మేరకు కొవ్వు ఉండాల్సిందే. బరువు తగ్గడానికి మార్గాలు : మనం అనుసరించే సాధారణ మార్గాలకు తోడుగా బరువు తగ్గడానికి చాలా రకాల ప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ... ∙అధిక బరువు (బీఎమ్ఐ 23 – 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్ఐ 25 – 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవాలి (బ్రిస్క్ వాకింగ్), తేలికపాటి వ్యాయామాలు మంచివే. స్పోర్ట్స్ ఆడటం చాలా మంచి వ్యాయామం. ఆటలో భాగంగా మనకు తెలియకుండానే చాలా మంచి వ్యాయామం జరిగిపోతుంటుంది ∙మసాలాలు ఏమాత్రం వాడని ఆహారం తీసుకోవాలి. సాధారణంగా మసాలాలు లేని ఆహారమంతగా రుచి అనిపించదు. దాంతో మనం ఆహారం తీసుకునే పరిమాణం తగ్గుతుంది. ఇలా బ్లాండ్ డైట్ రూపంలో పోషకాలు సమకూరి దేహం ఆరోగ్యవంతం కావడంతో పాటు బరువు తగ్గడానికీ ఇది తోడ్పడుతుంది ∙ప్రోటీన్ డైట్లో శాకాహార ప్రోటీన్లు తీసుకోవడం, వంటల్లో నూనెలు, నెయ్యి వంటి ఫ్యాట్స్ను చాలా పరిమితంగానే వాడటం, మాంసాహారం ఇష్టంగా తినేవారు వేటమాంసం వంటి రెడ్మీట్కు బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపల వంటి వైట్ మీట్ తీసుకోవడం ∙తప్పనిసరిగా క్రమం తప్పకుండా వేళకు తినడం ∙చిరుతిండ్లకూ, కూల్డ్రింక్స్కూ, ఆల్కహాల్కూ దూరంగా ఉండటం... వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఇది అధిక బరువు ఉన్నవారికే గాక... అందరికీ ఆరోగ్యాన్నిచ్చే ప్రక్రియ. అయితే ఒకవేళ బీఎమ్ఐ 30 – ఆ పైన ఉంటే ఈ మామూలు మార్గాలు పనిచేయవు. అప్పుడు కొందరు కొన్ని ప్రత్యేక మార్గాలను అనుసరిస్తుంటారు.వాటిలో ముఖ్యమైన కొన్ని... ∙పొట్ట, తొడలు, పిరుదులు వంటి చోట్ల పేరుకున్న కొవ్వును లైపోసక్షన్ ద్వారా తగ్గించడం ∙కూల్ స్కల్ప్టింగ్ అనే ప్రక్రియ ద్వారా బరువు తగ్గించుకోవడం ∙ఒక వ్యక్తిని మరణానికి చేరువ చేసేంతగా ఊబకాయం ఉంటే (దీన్నే ఇంగ్లిష్లో మార్బిడ్ ఒబేసిటీ అంటారు) ‘బేరియాట్రిక్ సర్జరీ’ అని పిలిచే శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఒక వాస్తవం పిండిపదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అనేవి వాటి అణు నిర్మాణం ఆధారంగా రెండు రకాలు. మామూలుగా ఉండేవి ఒకటైతే... సంక్లిష్టమైన నిర్మాణం ఉండేవి రెండో రకం. బిస్కెట్లు, చాక్లెట్లు, వంటి వాటిల్లో మామూలు పిండిపదార్థాలు ఉంటాయి. బరువు తగ్గాలంటే విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు కూడా లేని ఈ రకమైన ఆహారాన్ని తీసుకోకపోవడం మేలు. అయితే పండ్లు, బీన్స్, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్లలో ఉండే సంక్లిష్టమైన పిండిపదార్థాల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఊబకాయంతో యువత గుండెకూ చేటే! ఊబకాయం యుక్తవయస్కుల గుండెలకూ చేటు చేస్తుందని బ్రిటిష్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరం బరువు పెరిగితే గుండెజబ్బులు వస్తాయని గతంలోనే పలు పరిశోధనలు రుజువు చేయగా.. ఈ పరిస్థితి యువతకూ చేటు చేస్తుందన్న విషయం తాజాగా అర్థమైందని అంటున్నారు కాట్లిన్ వేడ్. బ్రిస్టల్ మెడికల్ స్కూల్కు చెందిన ఈ శాస్త్రవేత్త బ్రిటన్కు చెందిన యువకులపై పరిశోధనలు చేశారు. బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న యువకుల గుండె కండరాలు బాగా మందంగా ఉన్నాయని, పైగా చాలామందికి అధిక రక్తపోటు సమస్య కూడా ఉందని తెలిసిందని కాట్లిన్ తెలిపారు. పదిహేడు నుంచి 21 ఏళ్ల వయసున్న కొన్ని వేల మంది వివరాలతో తాము ఈ పరిశోధన జరిపామని సరికొత్త జన్యు విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి పరిశీలించగా బాడీమాస్ ఇండెక్స్ ఎంత ఎక్కువగా ఉంటే... రక్తపోటు తీవ్రత అంతేస్థాయిలో ఎక్కువగా ఉందని... ఫలితంగా గుండెచప్పుళ్ల మధ్య ధమనులపై ఒత్తిడి కూడా ఎక్కువవుతోందని వివరించారు. అధికబరువు వల్ల గుండెలోని ఒక కవాటం (లెఫ్ట్ వెంట్రికల్) వ్యాకోచం చెందుతున్నట్లు తెలిసిందని కాట్లిన్ అన్నారు. ఈ మార్పులన్నింటి ఫలితంగా గుండెకండరాల బరువు పెరిగి అవి మందంగా మారుతున్నట్లు చెప్పారు. మొత్తమ్మీద చూస్తే యుక్తవయసు నుంచి ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ ఉండేలా చూసుకోవడం ద్వారా భవిష్యత్తులో గుండెజబ్బుల బారిన పడకుండా రక్షించుకోవచ్చునని నిర్ద్వంద్వంగా తెలుస్తున్న మాట!! డా.ఎమ్. గోవర్థన్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
భారము మీదే కదా! ఊబ కాలమ్
జీవితంలో బరువుబాధ్యతలుంటాయి...అవి తప్పనిసరి. అలా అని బాధ్యతగా బరువు పెంచుకుంటే ఎలా? అసలు మనిషి ఎంత బరువుండాలి? కొంచెం బొద్దుగా ఉన్న అప్పటి హీరోయిన్లు ఆరోగ్యంగా లేరనా? జీరోసైజ్లో ఉన్న నేటి హీరో హీరోయిన్లు చాలా హెల్దీ అనా? సోషల్ మీడియా కుంపటి ఒకటి దాంతో వచ్చే బరువైన సలహాల్లో ఏది ఒప్పు... ఏది ముప్పు అన్నది ఎలా తెలుసుకోవాలి?ఈ గురువారం నుంచి బరువు దించే బాధ్యత మనం అందరం తీసుకుందాం. ఎందుకంటే... ‘భారము మీదే కదా!’ ఇప్పుడంటే సన్నగా ఉండటమే అందం అనే భావన బలపడిందిగానీ గతంలో బొద్దుగా ఉండటాన్నే ఆరోగ్యానికి చిహ్నంగా పరిగణించేవారు. సినిమాల్లో భానుమతి, సావిత్రి... ఆ తర్వాత సౌందర్య, నగ్మా... ఇలా పిసరంత లావుగా ఉన్నవాళ్లనే అందమైనవారుగా ఎంచేవారు. కానీ ఆ రోజులు పోయాయి. లావుగా ఉండటం సౌందర్యానికి ఆటంకంగా అనారోగ్యానికి చిహ్నంగా భావించే పరిస్థితులు వచ్చాయి. ఊబకాయం కేసులు పెరుగుతున్న కొద్దీ మనుషులూ తద్వారా దేశాలూ దాని గురించి సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రపంచానికీ, దేశాలకూ అస్వస్థతా!? ఊబకాయం వల్ల డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, స్లీప్ ఆప్నియా, డిప్రెషన్ వంటి దాదాపు 65 రకాల జబ్బులు నేరుగా వస్తాయన్నది ఇప్పటికే తేలిన సంగతి. అయితే వీటితో పాటు మరో 100 రకాల ఆరోగ్య సమస్యలకు కూడా బరువు పెరగడమే పరోక్ష కారణం అని తెలుస్తోంది. ఊబకాయం వల్ల ఇప్పటివరకూ మనం ఊహించని సామాజిక, ఆర్థిక అస్వస్థతలు కూడా ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు... ∙ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 4 కోట్ల మంది ప్రీ–స్కూల్ వయసు పిల్లలు స్థూలకాయం వల్ల మరణిస్తున్నారని 2007 నాటి ఒక ర్యాండమ్ అధ్యయనంలో తెలిసింది. మరి ఇదే సమస్యతో మరణిస్తున్న యువత సంఖ్య ఎంతో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 28 లక్షలు. ఇంత విలువైన మానవ వనరులను మనం కోల్పోతున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా సమాజానికి జరుగుతున్న తీరని నష్టం. ∙పిల్లల్లో ఆధునిక ఆహారంతో స్థూలకాయం వస్తోందని గ్రహించి కార్లలో పిల్లల కోసం స్టాండర్డ్ సీట్ కొలతలు ఎలా ఉండాలో నిర్ణయించేందుకు అమెరికాలో 2,50,000 మంది పిల్లలను అధ్యయనం చేశారు. దాని ఫలితంగా ఇప్పుడున్న కొలతల కంటే సీట్లు పెద్దవి చేయాల్సిందేనని తేలింది. అలా పెద్దవి చేస్తే గాని ఊబకాయం ఉన్న చిన్నారులకు అవి సరిపోవని తెలిసి ఎర్గానమిక్ నిపుణులు అవాక్కయారు. ఇలా స్థలంపై పడే ఒత్తిడీ, కార్ల సీట్ల ప్రామాణికతను పునర్నిర్వచించడం, వాటి తయారీ... ఇవన్నీ అనుకోని ఖర్చులూ, సమాజంపై అదనపు భారాలే. ∙మిగతా వారితో పోలిస్తే ఊబకాయులకు సాధారణంగా రకరకాల జబ్బులు వస్తాయన్నది తెలిసిందే కదా. అమెరికాలో ఊబకాయం ఉన్నవారు తమ జబ్బులకోసం ఖర్చు చేస్తున్న డబ్బు భారతీయ కరెన్సీలో చూస్తే ఏడాదికి 18,61,785 కోట్ల రూపాయలు. ఇది కేవలం డబ్బు పరంగా దేశానికి వాటిల్లుతున్న నష్టం కాగా... వారు పెట్టే సెలవులు, ఆఫీసు ఎగ్గొట్టే రోజులు లెక్కేస్తే దాదాపు నాలుగు కోట్ల పనిదినాలని తేలింది. ఇదీ అమెరికా వంటి అగ్రదేశం చవిచూస్తున్న నష్టం. అది ఆర్థిక అస్వస్థతకు ఒక పక్కా ఉదాహరణ. మానసికంగా వేధింపులూ ఉంటాయి... లావుగా ఉన్నవారు ఎంత గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నప్పటికీ, ఎంతటి సమర్థులైనప్పటికీ వారిని రకరకాలుగా అవమానిస్తారు. చనువును బట్టి నేరుగా కూడా విమర్శిస్తారు. రకరకాల నిక్నేమ్లతో పిలుస్తుంటారు. ఆయిల్డ్రమ్ము, రోడ్డురోలర్, దిబ్బరొట్టె, లడ్డూ లాంటి పేర్లతో పిలుస్తూ ఎగతాళి చేస్తుంటారు. దాంతో లావుగా ఉన్నవారు న్యూనతకు గురవుతుంటారు. స్థూలకాయులు డిప్రెషన్లోకి కూరుకుపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటం వైద్యపరమైన అంశం కాగా వారు ఆత్మన్యూనతకు గురికావడం కూడా దీనికి తోడయ్యే అంశం. అంటే దీన్ని బట్టి తెలిసేదేమిటంటే. ఒకరు ఎంతటి మంచి స్థానంలో ఉన్నా, ఎంతగా ప్రభావితం చేయగల పొజిషన్లో ఉన్నా ఫిట్నెస్ లేకపోతే వారు మరోరకంగా కూడా న్యూనతకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అవి ఒక్కోసారి కెరీర్ను సైతం ప్రభావితం చేస్తుంటాయి. అదనపు బరువుతో ఖర్చు ఆకాశంలోకి ఎగిరింది యూఎస్ ఎయిర్లైన్స్ 2000 సంవత్సరంలో సరదాగా ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా విమానం టికెట్టు వెల ఒకటే కదా. మరి అలాంటప్పుడు ఊబకాయం ఉన్నవారి ఆ అదనపు బరువుపై తాము ఏడాదికి ఎంత ఖర్చు పెడుతున్నారో చూద్దామని అనుకున్నారు. సరదాగా వారు చేసిన ఈ పరిశీలన సీరియస్గా గుండెలు బాదుకునేలా చేసింది. ఇలా అదనపు బరువున్న వారి కోసం వారు కాల్చిన అదనపు ఇంధనం 132.48 కోట్ల లీటర్లు కాగా అందుకు వారు చేసిన వ్యయం రూ. 1896.81 కోట్లు. ఇది ఒక దేశానికి తాను ఏమాత్రం ఊహించని కోణంలో ఊహించని విధంగా జరుగుతున్న నష్టం. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–4... అంటే 2015–16 లెక్కల ప్రకారం భారత్లోని ఊబకాయం చిత్రపటం ఇలా ఉంది. భారత్లో లావుకు/అధిక బరువుకు ప్రామాణికంగా పరిగణించే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం చూస్తే... ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న మహిళలు 20.7 శాతం కాగా... పురుషులు 18.9 శాతం. తెలంగాణలో బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం చూస్తే... ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న మహిళలు 28.1 శాతం కాగా... పురుషులు 24.2 శాతం. అదే ఆంధ్రప్రదేశ్లో బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం చూస్తే... ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న మహిళలు 33.2 శాతం కాగా... పురుషులు 33.5 శాతం. అంటే మొత్తం దేశంలో ప్రజల ఊబకాయాలతో పోలిస్తే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్... ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఊబకాయాలు ఎక్కువే. అయితే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఊబకాయం మరింత ఎక్కువ. అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు మూడో వంతు మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఒక అపోహ వ్యాయమం చేస్తున్నందున బరువు పెరగదు, కాబట్టి ఏమైనా తినేయవచ్చు. ఒక వాస్తవం ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ తగినంత వ్యాయామం చేస్తున్నాం కదా అని ఏదైనా తినడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఊబకాయం రాకుండా ఉండేందుకు వ్యాయామం ఒక్కటే పరిష్కారం కాదు. అలాగని తిండి ఒక్కటి తగ్గిస్తే కూడా ఫలితం నాస్తి. వీలైనంత తక్కువ కేలరీలతో ఆహారం తీసుకుంటూ తగినంత వ్యాయామం చేయడం ద్వారా మాత్రమే బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఊబకాయంతో వచ్చే ప్రత్యక్ష ఆరోగ్య సమస్యల్లో కొన్ని ఇవి... ఊబకాయంతో కొన్ని జబ్బులు తప్పక వచ్చే ముప్పు ఉంది. దినచర్యల్లో చురుకుదనం లోపించడం, , ఆయాసంతో పాటు వాటిలో ఇవి కొన్ని... ∙డయాబెటిస్ ∙గర్భాశయంలో నీటితిత్తులు ( పీసీఓడీ–పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) ∙హైబీపీ స్లీప్ ఆప్నియా (గురక, నిద్రలో ఊపిరి తీసుకోవడం సాధ్యం కాకపోవడం) ∙ఆర్థరైటిస్ ∙గుండెజబ్బులు ∙కొన్ని రకాల క్యాన్సర్లు సంతానలోపం, అంగస్తంభన లోపాలు, లావు కారణంగా లైంగిక సామర్థ్యం తగ్గడం (విరులిటీ) ∙హైకొలెస్ట్రాల్ మహిళల్లో హార్మోనల్ మార్పులు, రుతుక్రమంలో మార్పులు, ముఖంపై అవాంఛిత రోమాలు, మొటిమలు రావడం ∙జీర్ణక్రియ మందగించడం ∙మానసిక (సైకోసొమాటిక్ ) సమస్యలు ∙మూత్రసంబంధమైన (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ ∙మలబద్దకం గ్యాస్ట్రయిటిస్, అసిడిటీ ∙కీళ్లనొప్పులు నడుము నొప్పి ∙డిప్రెషన్ వంటివి. అసలు ఊబకాయం కాస్మటిక్ అంశం కాదనీ, దాన్ని జబ్బుగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. జబ్బులెందుకు వస్తాయి? ఒళ్లు పెరిగితే జబ్బులోస్తాయని తరచూ వింటూ ఉంటాం. అయితే ఇలా ఎందుకు అవుతుందో తెలుసుకుందామని వర్జీనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. కొవ్వు కణజాలంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ కణాలు ఊబకాయంతో గతి తప్పడం వల్ల ఊబకాయులకు జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఈ పరిశోధన చెబుతోంది. శరీరంలోని స్వేచ్ఛాణువులు (ఫ్రీ రాడికల్స్) కొవ్వు కణాలకు అతుక్కోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుందనీ మంట/వాపుల రూపంలో ఉండే ఈ స్పందన ఎక్కువ కాలంపాటు కొనసాగితే వ్యాధిగా పరిణమిస్తుందని ఇప్పటికే మనకు తెలుసు. అయితే ఇది అన్ని రకాల కొవ్వు కణాల విషయంలో నిజం కాదని తాజా పరిశోధన చెబుతోంది. కొవ్వులకు అతుక్కున్న స్వేచ్ఛాణువులు కొన్ని రోగ నిరోధక కణాలపై ప్రభావం చూపి అవి అతిగా పనిచేసేలా చేస్తున్నాయని ఫలితంగా మంట/వాపులు మొదలవుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వ్లాడ్ సెర్బూలియా అంటున్నారు. కురచగా ఉన్న కొవ్వులకు స్వేచ్ఛాణువులు అతుక్కున్నప్పుడు ఆరోగ్యానికి మేలు జరుగుతోందని వ్లాడ్ బృందం గుర్తించింది. ఆరోగ్యకరమైన కొవ్వు కణజాలాంతో పోల్చినప్పుడు ఊబకాయపు కణజాలంలో కురచ కొవ్వు కణాలు తక్కువగా ఉన్నట్లు తెలిసిందని వ్లాడ్ తెలిపారు. తగ్గడానికి సింపుల్ మార్గాలు బరువు తగ్గడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆహారనియమాలు పాటిస్తూ ఆచరించేవి, వ్యాయామ రీతులను అనుసరిస్తూ చేసేవి... ఇలా ఎన్నో ఉన్నప్పటికీ చాలా తేలిగ్గా అందరూ అనుసరించగలిగే కొన్ని మార్గాలను ఇక్కడ సూచిస్తున్నాం. ∙భోజనానికి అరగంట ముందు అరలీటరు నీళ్లు తాగాలి. ఆ ప్రక్రియ జీవక్రియల వేగాన్ని 24–30 శాతం పెంచుతుంది. దాంతో వాస్తవంగా దహనమయ్యే క్యాలరీల కంటే మరికొన్ని అదనంగా దగ్ధమవుతాయి. ∙కాఫీలు, టీలలో పాలు, పంచదార వాడకూడదు. సాధారణ కాఫీ, టీలకు బదులు బ్లాక్కాఫీ, బ్లాక్ టీ తాగడం మంచిది. దీని కంటే గ్రీన్ టీ తాగుతుండటం ఇంకా మేలు. ∙బాగా పొట్టు ఒలిచిన పిండిపదార్థాలకు (రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్కు) బదులుగా పొట్టు తీయని ముడి ఆహారాలు తీసుకోవాలి. కార్భోహైడ్రేట్లను వీలైనంతగా తగ్గిస్తే ఇంకా మంచిది. ∙తిండి కలిగితే కండకలదోయ్... కండ కలవాడే మనిషోయ్ అన్న సూక్తి అక్షర సత్యం. ఆ తిండి ఆరోగ్యకరంగా ఉండాలి. ఆ కండ పెరగడం ఫిట్నెస్ కోసం అయి ఉండాలి. ఇక్కడ తిండి కండ పెరగడం కోసమే తప్ప కొవ్వు పెరగడం కోసం కాదు. కొన్ని తిండ్లతో కొవ్వు పెరుగుతుందనీ... కొవ్వు పెరిగేవాడు రోగి అవుతాడని గుర్తుంచుకోవాలి. ∙రాత్రిపూట డిన్నర్ తర్వాత బ్రష్ చేసుకోవాలి. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్రష్ చేసుకొని ఉన్నందువల్ల మళ్లీ ఏదైనా తినడానికి వెనకాడతారు. ∙ఆకలైనప్పుడే తినాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. ఇలా తినడమే బరువు తగ్గడానికి మంచి మార్గం. ∙భోజనం చేసే సమయంలో మెల్లగా చాలాసేపు నములుతూ తినాలి. దీనివల్ల తక్కువ తినడంతోపాటు తక్కువ ఆహారంతోనే కడుపు నిండుతుంది. ∙ఆహారంలో మిరియాలు వాడిన పదార్థాలను తింటే బరువు తగ్గుతుంది. వాటిలోని కొన్ని పోషకాలు జీవక్రియలను పెంచడం వల్ల క్యాలరీలు త్వరగా దహనమవుతాయి... ఆకలి కూడా కాస్తంత తగ్గుతుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, పండ్లలో పీచు పదార్థాలు ఎక్కువ. ∙ఆహారంలో పిండిపదార్థాలు, కొవ్వుల కంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ∙కూల్డ్రింక్స్, చక్కెరతో ఉండే సోడాలు, ఫ్రూట్జ్యూస్లు వద్దు. పండ్లరసాలకు బదులు పండ్లే తినండి. ∙చిన్న చిన్న దూరాలకు వాహనం వాడకండి. వాహనం మీద వెళ్లాల్సి వస్తే సైక్లింగ్ చేస్తూ వెళ్లండి. లేదా నడవండి. దీనివల్ల మూడు ప్రయోజనాలు... ఇంధనం తక్కువ కాలడం వల్ల డబ్బు ఆదా. కాలుష్యం తగ్గడం ఆరోగ్యానికి దోహదపడుతుంది. అలాగే వ్యాయామ ఫలితం కూడా దక్కుతుంది. ∙టీవీ చూసే సమయంలో రిమోట్ దగ్గరగా ఉంచుకోకండి. దాంతో ఛానెల్ మార్చాలనుకున్నప్పుడల్లా టీవీ దగ్గరకు నడిచివెళ్లే అవసరం ఏర్పడుతుంది. ∙ఆఫీసు లేదా వర్క్ప్లేస్లో మూడు లేదా అంతకులోపు అంతస్తులకోసం మెట్లు వాడండి. ∙బరువు తగ్గడానికి బరువులు ఎత్తే వ్యాయామాల కంటే ఏరోబిక్ వ్యాయామాలు, స్లో జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు చాలా మంచివి. ∙కంటినిండా నిద్రపోవాలి. ఒక అధ్యయనం ప్రకారం నిద్రలేమికీ, ఊబకాయానికి సంబంధం ఉంది. నిద్రసరిగా పోని పిల్లల్లో 89 శాతం మందికి, పెద్దల్లో 55 శాతం మందికి ఊబకాయం వస్తుందని ఆ అధ్యయనంలో తేలింది. పైన పేర్కొన్న సాధారణ, సింపుల్ ఉదాహరణలు కాకుండా బరువు తగ్గడానికి అనేక ఆహారప్రక్రియలు, వ్యాయామ రీతులు, సూర్యనమస్కారాలు, యోగా వంటి ప్రక్రియలు వంటి ప్రత్యేకమైన మార్గాలున్నాయి. మరింత విపులమైన కథనాల రూపంలో వాటిని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. గమనిక : ఈ సూచనలు సమగ్రం కాకపోవచ్చు. వీటిలో కొన్ని కొందరికి సరిపడకపోవచ్చు. శరీరతత్వాన్ని బట్టి మనిషికీ మనిషికీ మారవచ్చు. అందుకే నిపుణుల సలహాలు తప్పనిసరి! – డాక్టర్ కె. శివ రాజు సీనియర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
ప్రపంచ భారీ బాలుడు.. బరువు తగ్గాడు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత బరువైన బాలుడు మిహిర్ జైన్(237కిలోలు)కు వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా 60కిలోల బరువును తగ్గించారు. వ్యక్తుల ఎత్తు, బరువు ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) లెక్కిస్తారు. బీఎమ్ఐ విలువ 22.5గా ఉంటే సాధారణ వ్యక్తిగా, 32.5గా ఉంటే ఊబకాయుడిగా పరిగణిస్తారు. ఇలాంటి వారికి శస్త్ర చికిత్సను సిఫార్సు చేస్తారు. అయితే ఢిల్లీలోని ఉత్తర్ నగర్కు చెందిన మిహిర్ జైన్ (14) బాలుడు 237 కిలోల బరువు పెరగడంతో అతడి బీఎంఐ 92కు చేరింది. ప్రపంచంలోనే అత్యంత బరువైన టీనేజ్ ఊబకాయుడికి వైద్యులు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. దీంతో మిహిర్ దాదాపు 60కిలోల బరువు తగ్గాడు. నవంబర్ 2003లో పుట్టినప్పుడు మిహిర్ 2.5 కిలోలు బరువు ఉండేవాడు, కానీ క్రమంగా బరువు పెరుగుతూ ఐదేళ్ల నాటికి 60 నుంచి 70 కిలోలకు చేరుకున్నాడని తల్లి పూజా తెలిపారు. తమ కుటుంబంలో అందరూ బలంగానే ఉండటంతో దీన్ని అంతగా పట్టించుకోలేదని ఆమె తెలియజేశారు. అయితే కొద్ది కాలానికి లేచి నడవడానికి కూడా ఇబ్బంది పడటంతో 2వ తరగతి నుంచి స్కూల్ మాన్పించి, ఇంటి దగ్గరే పాఠాలు బోధించినట్టు పూజా పేర్కొన్నారు. 2010లో తొలిసారిగా వైద్య సాయం కోసం ప్రయత్నించాం కానీ, ఆపరేషన్కు తగిన వయసు కాదని వైద్యులు తిరస్కరించారని చెప్పారు. తక్కువ కేలరీల ఆహారం అందించాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు ఆహార కట్టడితో 40 కిలోలు తగ్గాడు. అనంతరం మ్యాక్స్ హాస్పిటల్ వైద్యులు గ్యాస్టిక్ బైపాస్ సర్జరీ చెసి బరువును తగ్గించారు. దీనిపై డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. మిహిర్ను తొలిసారి చూడగానే అతడికి శస్త్రచికిత్స విజయవంతమవుతుందనే నమ్మకం కలగలేదన్నారు. ‘శస్త్ర చికిత్సకు ముందు మాకు పూర్తి నమ్మకం కలగలేదు. అందుకే తక్కువ కేలరీల ఆహారం ముందు సిఫార్సు చేశాం. దీంతో అతని బరువు 196 కిలోలకు తగ్గింది. ఈ దశలో అతనికి సర్జరీ చేయాలని నిర్ణయించాం. విపరీతమైన స్థూలకాయం కారణంగా మిహిర్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కారణంగా అతనికి సర్జరీ చేయడం కోసం ప్రత్యేక పరికరాలను ఉపయోగించవలసి వచ్చింది’ అని డాక్టర్ ప్రదీప్ చెప్పారు. డాక్టర్ల ప్రయత్నం వల్ల మిహిర్ సర్జరీ విజయవంతంగా జరిగింది. వారం రోజుల తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అతనికి పరిమిత ఆహారం తినాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం అతను 177 కిలోల బరువు ఉన్నాడు. అతని బరువును మూడేళ్లలో 100 కిలోలకు తగ్గించాలన్నది తమ లక్ష్యమని డాక్టర్లు తెలిపారు. -
ఊబకాయం ఉచ్చు.. !
‘‘సుబ్బారావు 21 వయసులో పోలీసు ఉద్యోగంలో చేరాడు.. చురుకుగా ఉండేవాడు.. పరిశోధనలో మెలకువలతో రాణిస్తున్నాడు.. అధికారుల మన్ననలు పొందాడు.. వేళాపాళా లేని డ్యూటీలు.. సరియైన నిద్ర కరువైంది.. ఊబకాయం వచ్చిపడింది.. ఓ రోజు మధ్యాహ్నం భోజన చేసి కూల్డ్రింక్ తాగాడు.. ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యాడు.. ఇదీ ప్రస్తుతం యువత పరిస్థితి. ’’ లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రస్తుతం జీవనశైలి మారింది. ఆహార అలవాట్లు మారాయి. నిద్రతో పాటు విశ్రాంతి తీసుకునే సమయాలు మారిపోయాయి. ప్రస్తుతం యువత కెరీర్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. శరీరిక శ్రమ తగ్గిపోయింది. పని పద్ధతులు మారాయి. ఎక్కువ మంది యువత ఆఫీసు కదలకండా కుర్చుని చేసే పనులు ఇష్టపడుతున్నారు. కుర్చున టేబుల్ వద్ద అన్ని వచ్చేస్తున్నాయి. ఫలితంగా అనేక రుగ్మతలకు గురవుతున్నారు. ప్రధానంగా ఊబకాయం.. అమరావతి రాజధానిగా రూపాంతరం చెందిన విజయవాడ, గుంటూరు నగరాల ప్రజల్లో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయి. ఊబకాయం సమస్య వెంటాడుతోంది. చిన్నవయసులోనే గుండెపోటు, మెదడుపోటుకు గురవుతున్నారు. మూడు పదులు వయసు వచ్చేసరికి దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటుతో పాటు బారిన పడి కీళ్లనొప్పులు,నడుమునొప్పి వంటి సమస్యలుతెచ్చుకుంటున్నారు. వ్యాధులకు కారణాలివే.. మారిన జీవనశైలి, శారీరక వ్యాయామం లేక పోవడం, మాంసాహారం అధికంగా తీసుకోవడం, కార్పొహైడ్రేడ్లు ఎక్కువగా ఉండే జంక్ఫుడ్ లాగించేయడంతో ఒబెసిటీతో పాటు, మధుమేహం, రక్తపోటు వంటి వాటికి గురవుతున్నారు. జనాభాలో 50 శాతం మంది ఒబెసిటీకి గురికాగా, 18 శాతం మధుమేహం, 22 శాతం మంది రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడినట్లు వైద్యుల అధ్యయనాలు చెబుతున్నారు. ఒబెసిటీ కారణంగా రక్తంలో చెడు కొలస్ట్రాల్ పెరుగుతుండటంతో చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. ఇటీవల 22 ఏళ్ల యువకుడు గుండెపోటుకు గురైనట్లు కార్డియాలజిస్టులు చెబుతున్నారు. రక్తపోటు అదుపులో లేకపోవడం వలన 28 ఏళ్ల వయసులోనే బ్రెయిన్స్ట్రోక్కు గురైన ఘటన ఇటీవల వెలుగు చూసింది. అవగాహనతోనే వ్యాధులకు దూరం మన శరీరంలో ఉండాల్సిన చక్కెర స్థాయిలు, కొలస్ట్రాల్, బ్లడ్ ప్రషర్లతో పాటు, బీఎంఐ అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఇలా అదుపులో ఉంచుకోండి. రక్తంలో చక్కెర స్థాయిలు.. ♦ హెచ్బీఎ1సీ(మూడు నెలల షుగర్ స్థాయి)– 6.5శాతం లోపు ఉంచుకునేలా చూడాలి. ♦ పాస్టింగ్– 70 నుంచి 100 మధ్యలో ఉండాలి. ♦ ఆహారం తీసుకున్న తరువాత 2 గంటలకు 160 వరకు ఉండవచ్చు. ♦ బీఎంఐ– 18.5 నుంచి 23.5 వరకు నార్మల్ బీఎంఐగా పరిగణిస్తారు. ♦ లిపిడ్ ప్రొఫెల్: శరీరంలో చెడు కొలస్ట్రాల్ వంద కన్నా తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. ♦ గుండె జబ్బులు ఉన్న వారైతే 70 కన్నా తక్కువగా వుండేట్లు చూసుకోవాలి ♦ మంచి కొలస్ట్రాల్(హెచ్డీఎల్) 40 కన్నా ఎక్కువ ఉండేలా చూడాలి. ♦ బ్లడ్ ప్రెజర్: 80/120 నార్మల్గా భావిస్తారు. జీవన శైలిలో మార్పు అవసరం ఆహారపు అలవాట్లలో మార్పులు, సరైన వ్యాయామం లేక పోవడం, ఒత్తిడి కారణంగా అనేక మంది మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు బారిన పడుతున్నారు. తద్వారా గుండె జబ్బులు, పక్షవాతానికి గురువుతున్నారు. నిత్యం పనిలో ఎంత బిజీగా ఉన్న మన ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ప్రతిరోజు తప్పనిసరిగా కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయడంతో పాటు, యోగ, మెడిటేషన్పై దృష్టి సారించాలి. ఆహారంలో నూనె పదార్థాలు, స్వీట్లు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. ప్రస్తుతం మధుమేహం, రక్తపోటు మనకు సవాళ్లుగా మారాయి. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందడం కన్నా. ముందు జాగ్రత్తలే మిన్న అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి,డయాబెటాలజిస్ట్ -
ఊబకాయంతో నష్టమా? లాభమా?
బరువు పెరిగినకొద్దీ మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి చుట్టుముడతాయని తరచూ వింటూ ఉంటాం. అందుకే బరువు తగ్గించుకునేందుకు నానా తంటాలూ పడుతూ ఉంటాం. అయితే కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితుల్లో అవసరం కంటే ఎక్కువ బరువు ఉండటం లాభదాయకమే అని అంటున్నారు శాస్త్రవేత్తలు. దాదాపు 15 ఏళ్ల క్రితం కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకుంటున్న వారి వివరాలు సేకరించినప్పుడు విచిత్రమైన అంశం ఒకటి బయటపడింది. ఆరోగ్యకరమైన బరువు ఉన్నవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటే.. ఊబకాయుల్లో అది తక్కువగా ఉంది. ఈ ఊబకాయ వైచిత్రిని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు పదేళ్లకుపైగా సమయం పట్టింది. ఒక్క కిడ్నీ సమస్యలకు మాత్రమే కాకుండా కొన్ని ఇతర వ్యాధుల విషయంలోనూ ఊబకాయం పాజిటివ్ ఫలితాలిస్తున్నట్లు తాజా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. నెదర్లాండ్స్లో సాధారణ సాంక్రమిక వ్యాధులతో ఆసుపత్రిలో చేరిన దాదాపు 18 వేల మందిని పరిశీలించినప్పుడు ఇతరులతో పోలిస్తే ఊబకాయులు ఎక్కువకాలం జీవించినట్లు తెలిసింది. నుమోనియా, సెప్పిస్ వంటి విషయాల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వెలువడటం గమనార్హం. వీటన్నింటిని బట్టి శాస్త్రవేత్తలు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. శరీరం తీవ్రంగా వ్యాధిగ్రస్తమైనప్పుడు అది అదనపు ఇంధనం కోసం ప్రయత్నిస్తుందని.. ఈ క్రమంలో తగినంత బరువు మాత్రమే ఉండేవారి కండరాలు బలహీనపడిపోతే.. ఊబకాయుల్లో మాత్రం ఇది చాలా తక్కువగా జరుగుతూంటుందని ఫలితంగా వారు బతికేందుకు ఎక్కువ అవకాశం ఏర్పడుతూండవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫోన్లు, ట్యాబ్లెట్లతో నిద్రకు చేటే... స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లను పొద్దుపోయేంత వరకూ తెగ వాడేస్తున్నారా? అయితే మీకు నిద్రకు చేటు వచ్చినట్లే. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయాన్ని వినే ఉంటాంగానీ.. తాజాగా హార్వర్డ్లోని బోస్టన్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు కూడా దీన్ని ఇంకో అధ్యయనం ద్వారా స్పష్టం చేస్తున్నారు. ట్యాబ్లెట్లను ఇష్టమొచ్చినట్లు వాడుకొమ్మని చెప్పి కొంతమంది యువకుల నిద్రతీరును పరిశీలించినప్పుడు కొన్ని కొత్త అంశాలు తెలిశాయి. ఈ గాడ్జెట్ల నుంచి వెలువడే శక్తిమంతమైన తెల్లటి వెలుగు మెలటోనిన్ రసాయన ఉత్పత్తిని తగ్గించిందని ఈ అధ్యయనానికి నేతత్వం వహించిన శాస్త్రవేత్త జీనీ డుఫీ తెలిపారు. స్క్రీన్స్ను దగ్గరగా ఉంచుకోవడం వల్ల తెల్లటి వెలుగు మన జీవ గడియారంపై దుష్ప్రభావం చూపుతుందని ఫలితంగా తగినంత నిద్ర పట్టదని జీనీ అంటున్నారు. ట్యాబ్లెట్లను విచ్చలవిడిగా వాడుకునే అవకాశం ఇచ్చిన తరువాత కొన్ని రోజులకు తాము వారిని మరోసారి పరీక్షించామని.. ఈసారి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఏవీ ఇవ్వకుండా కేవలం వార్తాపత్రికలు చదివేందుకు మాత్రమే అవకాశమిచ్చామని.. అప్పుడు వారు సుఖంగా నిద్రపోయినట్లు తెలిసిందని చెప్పారు. పడుకునే ముందు ట్యాబ్లెట్లు వాడే వారిలో మెలటోనిన్ ఉత్పత్తి కనీసం అరగంట తరువాత మాత్రమే జరుగుతున్నట్లు తెలిసిందని, పైగా నిద్రలోంచి మేల్కొన్న తరువాత గంట సేపటి వరకూ వారు చురుకుగా ఉండలేకపోయారని జీనీ వివరించారు. -
చక్కెర కేలరీలతో చిక్కే
ఆహారం ఏదైనా కేలరీలు ఎక్కువైతే ఊబకాయం, మధుమేహం వంటివి వచ్చేస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే చక్కెరతో కూడిన పానీయాలతో శరీరానికి చేరే కేలరీలతో సమస్య మరింత ఎక్కువ అవుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒబేసిటీ రివ్యూస్ జర్నల్లో పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఆహారం, ఆరోగ్యంపై ప్రభావం అనే అంశంపై ఇప్పటికే జరిగిన దాదాపు 22 పరిశోధనల ఫలితాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు కింబర్ స్టాన్హోప్ తెలిపారు. చక్కెర బదులుగా వాడే ఆస్పర్టైమ్ వంటి కృత్రిమ పదార్థాలతో బరువు పెరుగుతారన్నది అపోహ అని స్టాన్హోప్ అంటున్నారు. ఈ విషయం అందరి ఆలోచనల కంటే భిన్నంగా ఉన్నప్పటికీ పరిశోధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించారు. కొన్ని రకాల నూనెలు, విత్తనాలు, గింజల్లో ఉండే పాలీ అన్శ్యాచురేటెడ్ కొవ్వులు సంతృప్త కొవ్వులతో పోలిస్తే మేలైనవని అన్నారు. అయితే పాల ఉత్పత్తులో ఉండే సంతృప్త కొవ్వులతో పెద్దగా ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. -
ఇవి తింటే కీళ్లనొప్పులు తగ్గుతాయి...
ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచంలోని 18 శాతం మంది మహిళలు, 9.6 శాతం మంది పురుషులు ఆర్థటైటిస్(కీళ్లనొప్పులు)తో బాధ పడుతున్నట్లు పలు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. 60 ఏళ్లకు పైబడిన వ్యక్తుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. అయితే ఆర్థటైటిస్ సమస్యతో బాధపడేవారికి విముక్తి కలిగించేందుకు యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సర్రే పరిశోధకులు పరిష్కారం కనుగొన్నారు. గతంలో చేసిన 68 పరిశోధనలను విశ్లేషించి కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు పలు అంశాలు వెల్లడించారు. రోజుకు ఒక గ్రామ్ చేప నూనె(ఫిష్ ఆయిల్) క్యాప్యూల్స్ తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు.. హృద్రోగ సమస్యలు కూడా నివారించవచ్చని పేర్కొన్నారు. చేపనూనెలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు కీళ్ల వాపును తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. ఈ విషయాలను రుమటాలజీ జర్నల్లో ప్రచురించారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు.. వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని సర్రే యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్గరెట్ రేమాన్ తెలిపారు. విటమిన్- కె సమృద్థిగా ఉంటేనే.. పాలకూర, కొత్తిమీర, క్యాబేజీలలో విటమిన్- కె అధికంగా ఉంటుంది కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా ఇవి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తద్వారా కీళ్లనొప్పులకు చెక్ పెట్టవచ్చన్నారు. విటమిన్- కె లోపం ఉన్నవారిలో ఎముకల పెరుగుదల మందగిస్తుందని.. అంతేకాకుండా ఇది ఆస్టియో ఆర్థటైటిస్కు దారి తీస్తుందని పేర్కొన్నారు. బరువు తగ్గితేనే.. ఊబకాయం వల్ల కీళ్లపై బరువు పడటంతో పాటు శరీరంలోని వ్యవస్థాపక మార్పులపై ప్రభావం కూడా చూపుతుంది. డైట్ పాటించడంతో పాటు.. ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయడం ద్వారా శరీర బరువు తగ్గించుకుంటే ఆర్థటైటిస్ను కొద్దిమేర తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. -
పగటి మీటింగ్స్లోనూ నిద్ర
స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నాను. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్లో పాల్గొంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం ఉందా? – మంజునాథ్, హైదరాబాద్ మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. కొన్ని సమయాల్లో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కలిదే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసరులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఇక మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాట కూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీడిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు. షిష్ట్ మారినప్పుడల్లా కోపం.. చిరాకు నా వయసు 29 ఏళ్లు. ఐటీ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ ఇలా షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటివల నిద్ర సరిగా ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ఏ అంశంపైనా సరిగా దృష్టి నిలపలేకపోతున్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. – ప్రమోద్, విశాఖపట్నం మీరు చెప్పిన వివరాలను బట్టి మీరు ‘షిఫ్ట వర్క్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’తో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చిమార్చి పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. అలారంలాగే మనం తినేవేళలు, నిద్రపోయే సమయాలు ఆ గడియారంలో నమోదై ఉంటాయి. అది నిర్వహించే క్రమబద్ధతకు ‘సర్కేడియన్ రిథమ్’ అని పేరు. ఈ రిథమ్ దెబ్బతినడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. షిఫ్ట్లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. దాంతో వాళ్ల పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయినా వాళ్లకు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. పొద్దున్నే పనిచేసేవాళ్లలో, రాత్రిడ్యూటీలు చేసేవారిలో, పనివేళలు తరచూ నైట్ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి ఈ సమస్య వచ్చిన వారిలో కనిపిస్తుంటాయి. ఇలాంటివారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిద్రపట్టడంలో ఇబ్బంది, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలూ కనిపిస్తాయి. దాంతో కార్యక్షేత్రాలలో గాయపడటం, పనుల్లో తప్పులు చేయడం, ఒక్కోసారి కార్యక్షేత్రాలలో గాయపడటం కూడా జరుగుతుంది. ఒక్కోసారి వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. రక్తంలో కొవ్వుల పాళ్లు పెరగడం, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల బారిన పడటం, గుండెజబ్బల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్లు ఉంటాయి. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ ఉండే కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్ వర్క్ డిజార్డర్తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీ, మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
పరి పరిశోధన
జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు కొత్త మార్గం! వయసుతోపాటు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మనలో అందరికీ ఎదురయ్యే సమస్యే. గుండెపోటుకు గురైనవారు లేదా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల బారిన పడినవారికీ అకస్మాత్తుగా జ్ఞాపకశక్తి మందగిస్తుంది. ఈ సమస్యలకు ఇప్పటివరకూ కచ్చితమైన పరిష్కారాలు లేవు. అయితే వేక్ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల తాజా ప్రయోగాల పుణ్యమా అని ఇకపై మాత్రం అవసరమైనప్పుడు మెదడు పనితీరును సూపర్ చార్జ్ చేసుకునేందుకు వీలేర్పడనుంది. ఎలాగంటారా? చాలా సింపుల్. కంప్యూటర్లలో ర్యామ్ పెంచుకున్నట్లే మన మెదడులోనూ ఓ చిప్లాంటిది ఉంచుకుంటే సరి అంటున్నారు రాబర్ట్ హాంప్సన్ అనే శాస్త్రవేత్త. ఇలాంటి పరికరాన్ని తాము ఇప్పటికే తయారు చేశామని.. ఇటీవలే కొందరి మెదళ్లలో ఈ పరికరాన్ని అమర్చి విజయవంతంగా పరీక్షలు కూడా పూర్తి చేశామని రాబర్ట్ తెలిపారు. అటు షార్ట్ టర్మ్ మెమరీతోపాటు, ఇటు లాంగ్టర్మ్ మెమరీ కూడా ఈ పరికరం ద్వారా మెరుగుపడినట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని చెప్పారు. వీడియోగేమ్లు ఆడుతున్న కొందరి మెదళ్లను పరిశీలిస్తూ.. హిప్పోకాంపస్ ప్రాంతంలో న్యూరాన్లు ఏ పద్ధతిలో చైతన్యవంతం అవుతున్నాయో గుర్తించి అదే పద్ధతిలో పనిచేసే పరికరాన్ని అభివృద్ధి చేశామని వివరించారు. మరిన్ని పరిశోధనలతో ఈ పరికరాన్ని మెరుగుపరిస్తే భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఎక్కువ జ్ఞాపకశక్తిని అందించే యంత్రాల తయారీకి వీలేర్పడుతుందని హాంప్సన్ తెలిపారు. నిద్రలేమి.. ఒత్తిళ్లతో ఊబకాయం! వేళాపాళా లేని తిండి, నిద్ర, రకరకాల ఒత్తిళ్లు... ఆరోగ్యానికి చేటని, బరువు పెరిగేందుకూ కారణమవుతాయనీ తెలుసు. అయితే స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా ఇందుకు గల కారణాలను స్పష్టంగా తెలుసుకోగలిగారు. మన శరీరంలో ఒక పద్ధతి ప్రకారం హెచ్చుతగ్గులకు గురయ్యే గ్లూకోకార్టికాయిడ్ హార్మోన్లతో ఈ చిక్కులన్నీ వస్తున్నాయని వీరు అంటున్నారు. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ కూడా గ్లూకో కార్టికాయిడ్ హార్మోన్ కావడం గమనార్హం. సాధారణంగా ఈ హార్మోన్లు ఒక రోజులో గరిష్టస్థాయికి చేరి... తగ్గిపోతూంటాయి. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అతితక్కువగా... ఉదయం 8 గంటలకు ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం, ఒత్తిడి లేదంటే కొన్నిరకాల మందుల ద్వారా అప్పుడప్పుడూ ఈ హార్మోన్ కొద్ది సమయం పాటు ఎక్కువవుతూంటుంది. అయితే ఈ పరిస్థితి దీర్ఘకాలంపాటు కొనసాగితే అది కొవ్వు పదార్థాలు జీర్ణమయ్యే ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో స్టాన్ఫర్డ్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం జరిపి ఈ హార్మోన్లు 12 గంటల్లోపు అత్యధిక, అత్యల్ప స్థాయిలకు చేరుకుంటే కొవ్వు కణాలు తొందరగా జీర్ణమవుతాయని గుర్తించారు. ఎలుకలకు ఈ హార్మోన్ను అందించినప్పుడు సహజమైన ప్రక్రియకు విఘాతం కలిగి కొవ్వు రెట్టింపు అయిందని తెలిసింది. ఈ పరిశోధన బరువు నియంత్రణకు ఉపయోగపడుతుందని అంచనా. పాలపుంత మధ్యలో బోలెడన్ని కృష్ణబిలాలు సౌరకుటుంబంతోపాటు కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలకు నెలవైన మన పాలపుంత మధ్యలో బోలెడన్ని కృష్ణబిలాలు ఉన్నట్లు కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలపుంత మధ్యలో సాగిట్టారిస్ పేరుతో అత్యంత భారీ కృష్ణబిలం ఉందని చాలాకాలంగా తెలుసు. అయితే దీన్ని గుర్తించేందుకు ఉపయోగించిన పద్ధతిలో కొన్ని మార్పులు చేసి పరిశీలించినప్పుడు ఆ భారీ కృష్ణబిలం పరిసరాల్లో కొన్ని వేల సంఖ్యలో కృష్ణబిలాలు ఉన్నట్లుగా తెలిసింది. ఇంత పెద్దస్థాయిలో కృష్ణబిలాలను ప్రత్యక్షంగా గుర్తించడం ఇదే తొలిసారి. నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని కొలంబియా విశ్వవిద్యాలయ ఖగోళశాస్త్రవేత్తలు చేపట్టారు. భారీ కృష్ణబిలం మింగేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు బుల్లి కృష్ణబిలాలు పొరుగునే ఉండే నక్షత్రాలతో లంకె ఏర్పరచుకుంటాయని ఈ క్రమంలో భారీ స్థాయిలో ఎక్స్రే కిరణాలు వెలువడతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ఛక్ హేలీ తెలిపారు. అయితే పాలపుంత మధ్యలో ఉండే భారీ కృష్ణబిలం చాలా దూరంగా ఉంది కాబట్టి.. ఎక్స్ కిరణాలను చూడటం సాధ్యం కాదని చెప్పారు. అందువల్ల తాము చంద్ర వేధశాల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ఎక్స్రే కిరణాలను గుర్తించి భారీ కృష్ణబిలం చుట్టూ చిన్న సైజులో ఉన్నవి పదివేల వరకూ ఉన్నట్లు గుర్తించామని వివరించారు. -
కొవ్వుకోట్లు కరిగిస్తున్నారు
రాజశేఖర్.. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్.. వయసు 29.. మంచి జీతం.. అంతా బాగానే ఉంది.. పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఓ సంబంధం చూశారు.. పెళ్లి చూపులకెళ్లారు.. అయితే అక్కడ అమ్మాయికి రాజశేఖర్ నచ్చలేదు! కాస్త లావుగా ఉండటమే అందుకు కారణం. ఎలాగైనా లావు తగ్గా లన్న ఉద్దేశంతో రాజశేఖర్ ఒబేసిటీ ట్రీట్మెంట్కు వెళ్లాడు. ఇలా ఆయన ఒక్కరే కాదు.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో 14 శాతం మంది యువకులది ఇదే బాధ. ఒబేసిటీ కారణంగా వారంతా పెళ్లి చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్టు తాజాగా ఆరోగ్య సంస్థలు చేసిన అధ్యయనంలో బయటపడింది. సాక్షి, హైదరాబాద్ : స్థూలకాయం నగరవాసులకు పెద్ద ఇబ్బందినే తెచ్చిపెట్టింది. పెళ్లి జరగాలంటే బరువు తగ్గించుకోవాల్సిందేనని కండిషన్లు పెట్టే స్థాయికి చేరింది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో టెకీలు బరువు పెరిగిపోతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానిలో సుమారు 150 వరకు ఒబేసిటీ క్లినిక్లున్నాయి. ఒక్కో క్లినిక్కు నిత్యం 25 నుంచి 30 మంది వస్తున్నారు. ఈ లెక్కన 3,700 నుంచి 4,500 మంది వరకు ఒబేసిటీ చికిత్స కేంద్రాలను సంప్రదిస్తున్నారు. వీరిలో 65 శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉన్నారని, వారిలోనూ పెళ్లికి ముందు బరువు తగ్గించుకోవాలనుకునేవారే ఎక్కువగా ఉంటున్నారు. కొన్ని ప్రముఖ క్లినిక్లు వారం నుంచి పదిహేను రోజులు, నెల నుంచి రెండు నెలల పాటు ఉండే ట్రీట్మెంట్కు రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఏటా హైదరాబాద్లోనే ఒబేసిటీ ట్రీట్మెంట్కు బాధితులు రూ.243 నుంచి రూ.275 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్టు వెల్లడైంది. లావైపోతున్నారు.. ఒబేసిటీ సమస్య ఏటేటా పెరిగిపోతున్నట్టు 2015–16లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టిన ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’లో తేలింది. తెలంగాణలో 32 శాతం మంది మహిళలు, 29 శాతం మంది పురుషులు ఒబేసిటీతో బాధపడుతున్నట్టు ఈ అధ్యయనంలో స్పష్టమైంది. 2005–06లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన అధ్యయనంలో 17.7 శాతం మంది మహిళలు, 17.6 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నట్టు తేలింది. మా మరదలే అయినా చిన్నప్పట్నుంచి నాతో పాటు కలిసి పెరిగిన మా మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఎంఎస్ పూర్తిచేసి బెంగళూరులో పనిచేస్తున్నా. అయితే పెళ్లికి మరదలు ఒప్పుకోవడం లేదు. అదేంటని ప్రశ్నిస్తే.. లావుగా ఉన్నానని చెప్పింది. దీంతో ఓ హోమియోపతి ఒబేసిటీ సెంటర్కు వెళ్లి రూ.1.6 లక్షల ప్యాకేజీతో 4 నెలల కోర్సుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. – రవిశంకర్, నిజామాబాద్ ఇంటర్ నుంచి బరువు పెరిగా నేను వరంగల్లో ఇంటర్ చదువుతున్న సమయంలో బరువు పెరిగాను. ఇంజనీరింగ్, తర్వాత స్పెషలైజేషన్ కోర్సు పూర్తయ్యే సరికి 90 కేజీలకు చేరా. ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరా. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బరువు తగ్గేందుకు వారం క్రితమే మాదాపూర్లోని ఓ ఒబేసిటీ క్లినిక్ను సంప్రదించా. మూడు నెలల ట్రీట్మెంట్ కోర్సుకు రూ.1.2 లక్షలు తీసుకున్నారు. – శృతి, మాదాపూర్ -
సిగరెట్తో ఎముకలకు హాని ఇలా...
నా వయసు 45 ఏళ్లు. రోజుకు ఇరవై సిగరెట్ల వరకు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్ డి పాళ్లు కూడా తగ్గాయి. సిగరెట్ దుష్ప్రభావం ఎముకలపైన కూడా ఉంటుందా? – సుకుమార్, చెన్నై పొగతాగే అలవాటు అన్ని అవయవాల మాదిరిగానే ఎముకలపైనా దుష్ప్రభావం చూపుతుంది. సిగరెట్ల కారణంగా అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్ డి పాళ్లు తగ్గడం, ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకడం కూడా తగ్గడం జరుగుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్ వల్ల అనేక దుష్ప్రభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి... ∙పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్ ఆమర్పులు వచ్చి క్యాల్షియమ్ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్ హార్మోన్ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్ పాళ్లు తగ్గుతాయి. ∙పొగతాగే అలవాటు వల్ల విటమిన్ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. ∙శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ∙రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది. ∙పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ. ∙పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ప్రభావం చూపుతాయి. ∙ఎముకలలోని బంతిగిన్నె కీలుతో పాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి. ∙భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామికి ప్యాసివ్స్మోకింగ్ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ∙పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి. జంక్ఫుడ్ అలవాటును తప్పించడం ఎలా? మా బాబు వయసు పదమూడేళ్లు. ఇటీవల వాడు పిజ్జా, బర్గర్లను మాత్రమే ఇష్టపడుతున్నాడు. వాడి బరువు క్రమంగా పెరుగుతోంది. ఈమధ్య వాడు ఊబకాయంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మావాడి విషయంలో తగిన సలహా ఇవ్వండి. – నర్మద, హైదరాబాద్ మాస్మీడియా ద్వారా ఈమధ్య ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి డాక్టర్ల నుంచి ప్రజలకు ఎన్నో సూచనలు అందుతున్నాయి. కానీ ఇంకా చాలా మంది అంతగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటి ఆరోగ్య నియమాలను పాటించడం లేదు. దాంతో పిల్లల మీద, వాళ్ల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పిల్లలు టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. వ్యాయామాలు, ఆటల వంటి కార్యకలాపాలపై ఎక్కువ సమయం వెచ్చించడం లేదు. కౌమార బాలబాలికలు ఆహార నియమాలు సరిగా పాటించకపోగా... అనారోగ్యకరమైనవీ, పోషకాలు సరిగా లేనివి అయిన ఫాస్ట్ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంతో ఒబేసిటీ, ఆస్తమా వంటి శారీరక రుగ్మతలతో పాటు వాళ్ల వికాసం, మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోంది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపుకంటే ఎక్కువగా పిల్లలు దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన పడుతున్నట్లు ఓ అధ్యయనంలో తెలింది. పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లలు భవిష్యత్తులో స్థూలకాయం, హైబీపీ, హైకొలెస్ట్రాల్, టైప్–2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వాళ్లు చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోకపోవడం వల్ల పిల్లలను పైన పేర్కొన్న లైఫ్స్టైల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. మీరు మీ పిల్లలకు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఎక్కువగా తినేలా చూడండి. తాజా పండ్లు ఎక్కువగా అందేలా జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్లి ఆటలు ఎక్కువ ఆడేలా ప్రోత్సహించండి. టెలివిజన్, కంప్యూటర్, మొబైల్, ఐపాడ్ వంటి వాటితో ఎక్కువగా ఆడనివ్వకండి. రోజూ ఉదయం మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకునేలా చూడండి. బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలను చాలా పరిమితంగా అందేలా చూడండి. ఇవి మీ బాబు విషయంలో తప్పక అనుసరించాల్సిన జాగ్రత్తలు. ఓల్డేజ్లో మునుపటి ఫిట్నెస్ ఎలా? లైఫ్స్టయిల్ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. మొదట్నుంచీ హెల్దీపర్సన్ను. ఈమధ్యకాలం వరకు చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. అయితే ఇటీవల నా ఫిట్నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. మెట్లు ఎక్కే సమయంలో, బైక్ వరకు వెళ్లే టైమ్లో మునుపటిలా చురుగ్గా ఉండలేకపోతున్నాను. దాంతో నాకు ఈ ఫీలింగ్ వస్తోంది. నేను ఇదివరకటి ఫిట్నెస్ పొందడానికి ఏం చేయాలి? – పి. శ్రీనివాస్, విశాఖపట్నం మీ వయసు వారంతా కీలకమైన ఇలాంటి సమయంలో మునుపటి ఫిట్నెస్ను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా ప్రధానమైన అంశం. సాధారణంగా మీ వయసు వారిలో చాలామందికి డయాబెటిస్ లేదా హైబీపీ లాంటి వ్యాధులు ఉండటం మామూలే. అలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే తగిన పరీక్షలు చేయించుకొని, వాటికి తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఫిట్నెస్ను నిలుపుకోడానికి ఎంతగానో దోహదపడతాయి. వీటన్నింటిలోనూ వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఏ వయసువారైనప్పటికీ వ్యాయామంతో తగిన ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దాని వల్ల వయసుపైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినా... ఎముకల విరిగే అవకాశమూ తగ్గుతుంది. పైగా వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు... అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్ నుంచి సూచనలు పొందాలి. ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి డాక్టర్ నుంచి సలహా పొందడం అవసరం. పైగా వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్సైజ్కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయడం మేలు. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి. అంతేతప్ప నిస్సత్తువను పెంచకూడదు. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేయాలి. వెంటనే డాక్టర్ను కలిసి తగిన చికిత్సనూ, సలహాలు, సూచనలను పొందాలి. - డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
డాక్టర్ పంచతంత్రుడు...!
‘‘నాన్నా! ఏనుగులకు అంతంత ఒబెసిటీ ఉంటుంది కదా. వాటికి హార్ట్ ఎటాక్ రాదా?’’ అడిగాడు మా బుజ్జిగాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అంతలో వాళ్ల అమ్మ వచ్చింది. ‘‘మీరేమో వాణ్ణి డాక్టర్ను చేయాలంటారు. తొమ్మిదో క్లాసుకు వచ్చినా నాలెడ్జీ మాత్రం సున్న. వాడికి మొన్న బయాలజీ పరీక్షలో వచ్చిన పర్సెంటేజీ పద్నాలుగు. వాడి టీచరేమో మాటిమాటికీ పిలిచి మనల్ని తిడుతోంది. వాడు చదవడు... మీరు చదివించరు’’ అంటూ క్లాసు తీసుకుంటుంటే కాసేపు వాడికి బయాలజీ చెబుదామని నేను ట్రై చేశా. న్యూట్రిషన్ అనే లెసన్నుంచి వీడికి రకరకాల ప్రశ్నలిచ్చారు. రకరకాల టెక్నికల్ నేమ్స్తో ఆ లెసన్ సాగింది. ఆ పోషకాల పేర్లు గుర్తుపెట్టుకోవడం వీడికి సాధ్యపడలేదట. నాకున్న మిడిమిడి జ్ఞానం కొద్దీ వాడికేదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటే నాకూ ఆ టెక్నికల్ టర్మ్స్ అర్థం కాలేదు. దాంతో వాడికి కాస్త రిలాక్సేçషన్ ఇద్దామని అనుకున్నా. ‘‘ఒరేయ్ ఈ తిట్ల మూడ్లో నువ్వు లెసన్ చదువుకోలేవు. చదివినా అర్థం కాదు. కాబట్టి కాసేపు ఈ పుస్తకం చదువుకో’’ అంటూ వాడి చేతికి పంచతంత్రం ఇచ్చా. కథల పుస్తకం కావడంతో వాడూ దాన్ని శ్రద్ధగా చదువుతూ లీనమయ్యాడు. కొద్దిగా రిఫ్రెష్ అయ్యాక... బయాలజీ కూడా చదువుకున్నాడు. ఆ మర్నాడు ఉదయం నిద్రలేవగానే నా దగ్గరికి వచ్చాడు. ‘‘పంచతంత్రం చదివాక బయాలజీ ఇంకా బాగా అర్థమైంది నాన్నా’’ అన్నాడు. ‘‘ఎలారా?’’ అడిగా. వాడు కథలు కథలుగా నాకు చెప్పిన విషయాలివి. మొదటి చాప్టర్ గ్రీన్లాభం అప్పట్లో గజేంద్రుడనే ఏనుగుల రాజు తన మందతో గడ్డి మైదానాలలో య«థేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఏనుగులు అన్ని రకాల పదార్థాలూ తినేవి. ఏదిబడితే అది నోట్లోకి కుక్కడం, మెక్కడం వల్ల వాటికి పెద్ద పెద్ద ఊబకాయాలు వచ్చాయి. ఆ ఒబేసిటీ కారణంగా హఠాత్తుగా హార్ట్ఎటాకులూ గట్రా వచ్చి చాలా ఏనుగులు హరీమనేవి. వాటి కళేబరాలు పడి ఉన్న ప్రాంతంలో అది పూర్తిగా కుళ్లి శిథిలమయ్యేవరకూ గడ్డి కూడా మొలిచేది కాదు. ఇది చూసిన హరితవర్ణిత అనే గడ్డిమొక్క తీవ్రమైన విచారంలో మునిగిపోయింది. ఒకనాడు గజేంద్రుడు అడవిలో సంచరిస్తుండగా హరితవర్ణిత ఆ ఏనుగుల రాజును తన దగ్గరికి పిలిచి ఇలా అన్నది. ‘‘ఓ ఏనుగోత్తమా! మీరు ఏది బడితే అది తిని ఎక్కడబడితే అక్కడ గుటుక్కుమంటున్నారు. దాంతో మీ కళేబరం పడి ఉన్న ప్రాంతంలో చాలాకాలం పాటు గడ్డిమొలవకుండా పోతోంది. పైగా ఇటీవల ఇక్కడ భూసారమూ బాగా తగ్గుతోంది. ఈ రెండు అంశాలూ మా మనుగడకు అడ్డమవుతున్నాయి. కాబట్టి ఓ భారీకాయమా! ఇకపై అనారోగ్యకరమైనవి తినకండి. కేవలం ఆకుపచ్చటివి మాత్రమే తినండి. అప్పుడు మీరు పుష్కలంగా పెంట వేస్తారు. దాంతో నేల సారవంతమవుతుంది. మరింత గడ్డి, పచ్చటి మొక్కలు మొలుస్తాయి. అది మీకూ మాకూ మంచిది’’ అంది. ‘‘అవును ఇది నిజం. ఇది నిజం. మమ్మల్ని తొక్కేయకుండా మాకూ ఇలా మేలు చేయండి’’ అంటూ తోటకూరడూ, పాలకూరడూ, గోరుచిక్కుడు, పచ్చఅరిటుడు అనే ఇతర మొక్కార్భకులు ప్రాధేయపడ్డాయి. అప్పట్నుంచి ఆకులు అలములు మాత్రమే తినడం మొదలుపెట్టాయి. వాటి ఒబేసిటీ ఏమాత్రం తగ్గకున్నా హార్ట్ ఎటాక్ రావడం మాత్రం ఆగిపోయింది. వాటి పెంటతో ఆ గడ్డిమొక్కలూ, ఇతర వృక్షజాతులూ ఏపుగా ఎదగడం మొదలుపెట్టాయి. ఇలా పరస్పర మైత్రితో ఇరువర్గాలూ మిత్ర లాభం పొందాయి. రెండో చాప్టర్ హెల్త్ భేదం అప్పట్లో హైదరాపురం అనే నగరంలో సైబరావనం అనే అరణ్యం ఉండేది. అక్కడ నిత్యానందం, సత్యానందం అనే ఇద్దరు వ్యక్తులు తమ తమ పనులు చేసుకుంటూ హాయిగా జీవించేవారు. అయితే వారి పనుల్లో కష్టం చాలా ఎక్కువగా ఉండేది. ఒకనాడు సిస్టముడు, ల్యాపటాపుడు అనే ఇద్దరు సేవకులు వారి దగ్గరకు వచ్చారు. ‘‘మిత్రోత్తములారా... మీరెందుకు ఇంతగా కష్టపడుతూ మీ రెక్కల్లాగే మెదడునూ ముక్కలు చేసుకుంటున్నారు. మమ్మల్ని ఉపయోగించుకుంటే మీ పనులు ఎంత సులువవుతాయో చూడండి’’ అన్నారు. అప్పట్నుంచి ఆ సేవకుల సాయంతో నిత్యానందుడూ, సత్యానందుడూ పనులు వేగంగా చేసేవారు. అయితే పనివేగం పెరగడంతో ఆవలి మెరక అనే ప్రాంతం నుంచి మరింతమంది మరిన్ని పనుల్ని వారికి అప్పగించడం మొదలుపెట్టారు. ఆవలి–మెరక అనే ఆ ప్రాంతం పేరు కాస్త పెద్దగా ఉండటంతో దాన్ని సూక్ష్మంగా ఆమెరక... ఆమెరక అని కూడా పిలిచేవాళ్లు. అక్కడి నుంచి వచ్చి పడే పనితో సైబరావనంలోని చాలామందికి పనిభారం విపరీతంగా పెరిగింది. ఆ సమయంలో మన సత్యా– నిత్యానందులకు ఇద్దరు అపరిచితులు తారసపడి ఇలా అన్నారు. ‘‘ఓ మిత్రోత్తములారా... నా పేరు శ్వేతకాష్టుడు. ఇతడి పేరు స్వప్నచిత్తుడు. మాతో స్నేహం చేయండి. నన్ను పీల్చగానే చుట్టూ పొగలు కమ్మి అవి మబ్బుల్లా ఆవరిస్తాయి. మీరు ఆ మబ్బుల్లో తేలిపోయినంతగా తేలికవుతారు. ఇక స్వప్నచిత్తుడిని గ్రోలగానే ఒళ్లంతా తేలికై హాయిగా ఉంటుంది. తర్వాత కాసేపటికి మంచి నిద్రపడుతుంది. దాంతో మంచి మంచి స్వప్నాలు వచ్చేలా చేస్తాడు కాబట్టి మావాడికి స్వప్నచిత్తుడని పేరు. అయితే కాస్తంత మత్తునిస్తాడంటూ గిట్టనివాళ్లు వాణ్ని ఆడిపోసుకుంటారు. మత్తుతో చిత్తు చేస్తాడంటూ మత్తుచిత్తుడని దూషిస్తుంటారు. కానీ మేము ఎవరినీ చిత్తుచేయము. టెన్షనుడనే ఒక అసురుడి సంతతి అన్నిచోట్లా విస్తృతంగా విస్తరిస్తోంది. వారితోనే మాకు వైరం. మేము చిత్తుచేసేది టెన్షనాసురుడి సంతతివాళ్లను మాత్రమే’’ అంటూ తమ గొప్ప చెప్పుకున్నారు. సత్యానందుడు వారిని లెక్కచేయలేదు గానీ నిత్యానందుడు వారిని ఆదరించాడు. ‘‘వారు తమ దుష్టత్వం గురించి తామే చెప్పుకుంటున్నారు. ఇంత చెప్పాక కూడా వారితో స్నేహం సరికాదు. అలాంటి వారి నుంచి దూరంగా ఉండటమే మేలు’’ అంటూ సత్యానందుడు ఒక సలహా కూడా ఇచ్చాడు. అయితే నిత్యానందుడు ఆ సలహాను లెక్కచేయలేదు. వారితో స్నేహం మొదలుపెట్టాడు. ఒకరోజు నిత్యానందుడు అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో తోటి మిత్రులు అతడిని డాక్టరుడనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. విషయం గ్రహించిన డాక్టరుడు నవ్వి ఇలా అన్నాడు. ‘‘ఓ నిత్యానందుడా... నీ తోటి మిత్రుడైన సత్యానందుడు నీలాగే పనిచేస్తున్నాడు కదా. అయినా అతడు అనారోగ్యానికి గురికాలేదు. అది ఎందుకో అర్థంచేసుకో. శ్వేతకాష్టుడు, మత్తచిత్తులతో నీ స్నేహం ఇలాగే కొనసాగితే నువ్వూ త్వరలోనే ఆ అకాలకిక్కరుడిలా ప్రాణాలు వదిలేస్తావు’’ అన్నాడు. అప్పుడు నిత్యానందం ‘‘ఎవరా కిక్కరుడూ... ఏమా కథ?’’ అని అడిగాడు. అప్పుడు డాక్టరుడు నవ్వి... ‘‘అప్పట్లో మాధవాపురానికి పడమటగా పదిక్రోసుల దూరంలో గచ్చిబౌళ్యం అనే ప్రాంతం ఉంది. అక్కడ కిక్కరుడు అనే వ్యక్తి పనిచేస్తుండేవాడు. ఒత్తిడిలో తనకు తెలియకుండానే కుర్చీలను తంతుండటం, పళ్లుకొరుక్కోవడం, జుట్టుపీక్కోవడం ఇత్యాది పనులు చేస్తుండేవాడు. టెన్షన్లో చూసుకోకుండా దేన్ని పడితే దాన్ని తన్నుతూ ఉండటం వల్ల కొందరతణ్ణి ఎగతాళిగా టెన్షన్ కిక్కరుడు అని కూడా పిలిచేవాళ్లు. నీకంటే ముందు అతడు ఈ శ్వేతకాష్టుడూ, మత్తచిత్తులతో స్నేహం చేశాడు. శ్వేతకాష్టుడు తెల్లగా నిలువెత్తు రూపంలో అందంగానూ, మత్తచిత్తుడు బంగారువర్ణంతో మిలమిలలాడుతూ ద్రవరూపంలో కనిపించేవారు. అంత అందమైన రూపురేఖలున్నాయి గానీ నిజానికి వారు దుష్టులు. తమ వద్ద రహస్యంగా ఉన్న నికోటినుడు, కొలెస్టరుడు అనే రాక్షసుల సాయంతో ఇతరులను కబళిస్తుంటారు. ఆ దుష్టజనసాన్నిహిత్యంతోనే కిక్కరుడు చనిపోయాడు. కాలం తీరకముందే పోవడం వల్ల ఆ దురదృష్టవంతుణ్ణి అందరూ ‘అకాల బకెట్ కిక్కరుడు’ అని కూడా పిలుస్తున్నారు’’ అని డాక్టరుడు కథ ముగించాడు. దాంతో ఆరోగ్యంలో భేదం తెచ్చే దుష్టసాంగత్యాలకు దూరంగా ఉండి నిత్యానందుడు నూరేళ్లు ఆరోగ్యంగా బతికాడు. సంధి... అప్పట్లో మొక్కలూ – జంతువులు పరస్పరం విపరీతమైన ద్వేషంతో రగిలిపోయేవి. కోపంతో జంతువులు మొక్కలను విచ్చలవిడిగా తినేస్తుండేవి. ప్రతీకారంతో మొక్కలు తమ వద్ద ఉన్న కంటకాలు అనే ఆయుధాలతో జంతువులను బాధించేవి. ఈ పోరు ఇరువురికీ నష్టం చేస్తుందని తెలుసుకున్న మొక్కలు ఒకరోజు జంతువులను తమ దగ్గరికి పిలిచాయి. ‘‘ఓ పిచ్చి జంతువులారా! విచ్చలవిడిగా మమ్మల్ని మేయడం వల్ల మీకు నష్టమే తప్ప లాభం లేదు. నేడు మేము అంతరించిపోతే, రేపు ఆకలితో నకనకలాడుతూ మీరూ అంతరిస్తారు. ఒకప్పుడు మాకూ రవికిరణాలకు మధ్య తీవ్రమైన వైరం ఉండేది. వాటితో సంధి చేసుకొని మేం బాగుపడ్డాం. అదే దారిలో మీరూ–మేమూ సంధి చేసుకుందాం రండి’’ అని జంతువులకు సూచించాయి. ‘‘ఎవరా రవికిరణాలూ – ఏమా కథ’’ అడిగాయి జంతువులు. అప్పుడు రవికిరణాల వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాయి మొక్కలు. ‘‘అప్పట్లో మేం ఇలా పచ్చగా ఆకులతో ఉండేవాళ్లం కాదు. కింద ఉన్న కుళ్లు మీద పుట్టగొడుగుల్లా పెరిగేవాళ్లం. అంతరిక్షంలోని అరుణపురం అనే చోటి నుంచి రవికిరణాలు... కాంతిపుంజాలనే వాహనాలను ఎక్కి విహరించడానికి భూమ్మీదికి వచ్చేవి. మేం మా గొడుగులతో వాటిని అడ్డుకునేవాళ్లం. అవి తీక్షణత అనే ఆయుధాలను ధరించి మమ్మల్ని బాధిస్తుండేవి. ఆ ఆయుధాల తాకిడికి మేము కమిలి, ముడుచుకుపోయి మూర్ఛిల్లి మరణించేవాళ్లం. మేం మరణించాక కూడా కిరణాలు మమ్మల్ని వదిలేవి కావు. మమ్మల్ని పూర్తిగా ఎండేలా చేసేవి. ఒకనాడు మేమంతా కిరణాలతో చర్చలు జరిపాం. ‘‘అయ్యా... మీరు కారుణ్యాస్పదమైన కిరణోత్తములు. మమ్మల్ని ఎందుకిలా బాధిస్తున్నారు’’ అని అడిగాం. అప్పుడా కిరణాలు ‘ఓ మొక్కబాలకులారా! మేము అరుణపురం నుంచి ఏ గ్రహం మీదికి వెళ్లినా మాకెవరూ అడ్డురారు. కానీ భూగ్రహంలో మీరు గొడుగుల్లా విస్తరించి మమ్మల్ని అడ్డగిస్తున్నారు. మా గమ్యమైన నేలను తాకకుండా చేస్తున్నారు. అందుకే మేము మిమ్మల్ని కమిలిపోయేలా కబళిస్తున్నాం’ అన్నాయి. అప్పుడు మేమికపై వారిని పూర్తిగా అడ్డగించబోమని చెప్పాం. దాంతో ఆ రవి కిరణాలు కూడా కరుణించి ‘ఇకనుంచి మా ఎండతో మీ కండ పెరిగేలా చేస్తాం’ అని మాటిచ్చాయి. అప్పట్నుంచి మేం ఆకులను అభివృద్ధి చేసుకున్నాం. ఆకుకూ ఆకుకూ గ్యాప్ ఇస్తూ అవి గమ్యం చేరేలా చూస్తున్నాం. దాంతో కిరణాలు కూడా మాకు తమ శక్తిని ప్రసాదిస్తుంటాయి. ఆ శక్తిలోని వేడిమి సాయంతో మేం స్వయంపాకం చేసుకొని మా పాయసం మేమే వండుకు తింటుంటాం. అలా మా ఆహారం మేమే తయారు చేసుకుంటూ ఎండ సాయంతో కండపట్టడం మొదలుపెట్టాం. ఇదీ మా సంధి కథ. ఇలా సంధి చేసుకుంటే ఇరువురమూ లాభపడతాం’’ అని చెప్పాయి మొక్కలు. అంతేకాదు... జంతువుల గౌరవార్థం ఆమ్లజన్యం అనే శంఖాన్ని తీసి ‘ఇకపై దీన్ని మీరు ఊదుకోండి’ అని చెప్పాయి. అప్పుడు జంతువులు కూడా నిశ్చింతగా ఊపిరివదిలి అందులోంచి బొగ్గుపులుసు అనే రుచికరమైన పులుసు వంటకాన్ని మొక్కలకు ఇచ్చాయి. ఇచ్చి... ఇకపై మీ కిరణాహారంతో పాటు ఈ పులుసునూ కలుపుకొని ఫుల్మీల్స్ తినమని చెప్పాయి. ఆ ఆమ్లజన్యం శంఖాన్ని ఊదుకోవడం, ఈ బొగ్గుపులుసును జుర్రుకోవడం కష్టం కావడంతో అవి రెండూ వాయురూపంలోకి మారాయి. సంధి తర్వాత అటు మొక్కలూ, ఇటు జంతువులూ వాయురూపంలోని ఆ పదార్థాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుని విందు చేసుకుంటూ ఇప్పటికీ సుఖంగా జీవిస్తున్నాయి. ‘‘ఇప్పటివరకూ బాగానే లాగించావు. సంధి తర్వాత విగ్రహం. ఇక్కడ సైన్సులోని న్యూట్రిషన్ పాఠం ఎలా చెబుతావురా? కష్టం కదా?’’ నేనడిగాను. ‘‘అందుకే నాన్నా! విగ్రహం బదులుగా ఈ చాప్టర్ పేరు ‘నిగ్రహం’ అని పెడతా’’ అన్నాడు. ‘‘నిగ్రహమా? అంటే? అందులో ఏం చెబుతావు?’’ ‘‘హెల్త్ బాగుండాలంటే ఏమేమి తినకుండా నిగ్రహం పాటించాలో ఈ చాప్టర్లో డీల్ చేస్తామన్నమాట. ఉదాహరణకు తెల్లరంగులో ఉండే శ్వేతభూతాలైన ఉప్పు, పంచదార ఇక్కడి పాత్రధారులు. ఇక అలాగే కొవ్వాసురులు, మాంసాసురులు అనే అసురుల పాత్రలు ప్రవేశపెట్టి... అవి చాలా రుచికరమైన కామరూపం ధరించి మార్కెటవనంలో, కిచెనాలయంలో, భోజనంబల్ల పరిసరాల్లో తిరుగుతూ ఆహ్వానిస్తుంటాయని చెపుతాం. వాటిని చూసి కూడా నిగ్రహించుకున్నవాడు అన్ని విధాలా బాగుపడతాడన్న విషయాన్ని ‘నిగ్రహం’ చాప్టర్లో వివరిస్తాం అన్నమాట’’ ఎక్స్ప్లెయిన్ చేశాడు మా బుజ్జిగాడు. ఒక్క విషయం నాకు నిర్ద్వంద్వంగా తెలిసిపోయింది. పంచతంత్రం కేవలం కథలు జీవితాన్ని నేర్పించడానికే పరిమితం కాదు. సరిగ్గా అన్వయించుకోవాలేగానీ... ఎవ్వరికైనా చదువు నేర్పించగలవవి. అలనాటి రాజు కొడుకులకేనా? విష్ణుశర్మ కల్లోకి వచ్చి అపరమొద్దు అయిన మా బుజ్జిగాడికి బయాలజీ, హెల్త్, న్యూట్రిషన్, మెడికల్ సైన్స్ ఇలా ఏదైనా చెబుతాడు. పంచతంత్రం శ్రద్ధగా చదివితే... రేపు మావాడు డాక్టర్ కావడం ఖాయమని నిశ్చయంగా తేలిపోయింది. – యాసీన్ -
గ్రీన్ కాఫీతో స్థూలకాయానికి చెక్
గ్రీన్ టీ వాడకం మొదలై చాలా ఏళ్లే అయ్యింది. ఇటీవలి కాలంలో నెమ్మదిగా గ్రీన్ కాఫీ వాడకం ప్రపంచ వ్యాప్తంగా పుంజుకుంటోంది. గ్రీన్ కాఫీ తాగడం ఫ్యాషన్ మాత్రమే కాదు, దీన్ని తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ కాఫీ జుట్టును, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుందని, అంతేకాకుండా, స్థూలకాయాన్ని అదుపు చేసేందుకు బాగా దోహదపడుతుందని చెబుతున్నారు. గ్రీన్ కాఫీ గింజల్లో ‘కెల్ప్’ అనే రసాయనం అధిక మోతాదులో ఉంటుంది. ‘కెల్ప్’ శరీరంలోని అదనపు కొవ్వును త్వరగా కరిగించగలదని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. సాధారణంగా ‘కెల్ప్’ అనే ఈ పదార్థం సముద్రపు నాచులో ఎక్కువగా ఉంటుంది. ఇది గ్రీన్ కాఫీ గింజల్లో కూడా ఉండటంతో, దీనిని వినియోగించడం తేలికని నిపుణులు అంటున్నారు. అయితే, దీనికి ఆకలిని తగ్గించే లక్షణం కూడా ఉంది. అందువల్ల అతిగా వాడకుండా జాగ్రత్తపడాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. -
ఊబకాయానికి కారణమైన జన్యువును గుర్తించారు!
కొంతమంది ఎంత తిన్నా కొంచమైనా లావెక్కరు. ఇంకొందరు ఎన్నిపాట్లు పడ్డా అంగుళమైనా తగ్గరు. దీనికి కారణమేమిటి? ఓ జన్యువు అంటున్నారు డ్యూక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త వాన్ బెన్నెట్ అంటున్నారు. శరీర కండరాలు అన్నింటిలో ఉండే అన్కైరిన్ –బీ అనే జన్యువు వల్ల కొంతమంది ఊబకాయులుగా తయారవుతూంటారని ఆయన తన తాజా పరిశోధన వ్యాసంలో వివరించారు. ఈ జన్యువును దాదాపు 30 ఏళ్ల క్రితమే గుర్తించారు. దీంట్లో వచ్చే మార్పులు అనేక వ్యాధులకు కారణమని తెలుసు. అయితే ఇటీవల వాన్ బృందంలోని శాస్త్రవేత్త ఒకరు ఇలాంటి జన్యువే ఉన్న ఎలుకలు మిగిలిన వాటికంటే లావుగా ఉండటాన్ని గుర్తించడంతో ఊబకాయంలో దీని పాత్రపై పరిశోధనలు మొదలయ్యాయి. మానవుల్లోని అన్కైరిన్– బీ జన్యువును ఎలుకల్లోకి జొప్పించి చూసినప్పుడు అవి కూడా లావెక్కడాన్ని గమనించిన వాన్ ఊబకాయానికి ఇది ఒక కారణమై ఉంటుందన్న అంచనాకు వచ్చారు. ఈ జన్యువు లేకపోతే కణాల్లోకి ప్రవేశించే కొవ్వును నియంత్రించే గ్లట్ 4 అనే ప్రొటీన్ మాయమవుతోందని, అలాగే అన్కైరిన్ –బీలో కొన్ని మార్పులు చేస్తే కణాల్లోకి ప్రవేశించే గ్లూకోజ్ గణనీయంగా పెరుగుతున్నట్లు తాము గుర్తించామని వాన్ తెలిపారు. యూరోప్ జనాభాలో 1.4 శాతం మంది, యూరపియన్ అమెరికన్స్లో 8.4 శాతం మందిలో ఊబకాయాన్ని కలిగించే అన్కైరిన్ – బీ జన్యుమార్పులు ఉన్నాయని వాన్ తెలిపారు. ఈజన్యువును గుర్తించడం వల్ల భవిష్యత్తులో ఊబకాయాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మరింత స్పష్టత వస్తుందని అంచనా. -
16 ఏళ్లు.. 160 కేజీలు.!
సాక్షి, విజయనగరం: పుట్టినపుడు బొద్దుగా ఉన్న కొడుకు చూసి మురిసిపోయింది ఆ తల్లి. ఐదేళ్ల వయసు వచ్చేసరికి కాస్త లావుగా ఉంటే పుష్టిగా ఉన్నాడనుకుంది. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఏకంగా 160 కేజీలయ్యాడు. ప్రస్తుతం ఆతల్లి ఇదేదో కొంపముంచేలా ఉందని తల్లడిపోతోంది. తన కొడుకును కాపాడాలని అందరినీ వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరంకు చెందిన నారాయణ, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కొడుకులు. ఇందులో పెద్ద కుమారుడు పవన్ పుట్టినప్పటి నుంచి బొద్దుగా ఉండేవాడు. కాలక్రమేనా పవన్ బరువు పెరుగుతున్నాడు. దీంతో రాజేశ్వరి వైద్యులకు చూపించడంతో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. తన భర్త ఐదేళ్ల కింద స్థూలకాయం కారణంగా గుండెపోటుతో చనిపోయాడు. ప్రస్తుతం పవన్ వయసు 16 ఏళ్లు. బరువు ఏకంగా 160 కిలోలు. భారీ కాయంతో పవన్ కుర్చొలేక, నిలబడలేక పోతున్నాడు. ఇప్పుడు వైద్యం కోసం తీసుకెళ్తే ‘మోర్ బిడ్ ఒబిసిటీ’తో బాధపడుతున్నాడని, వెంటనే గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెబుతున్నారు. లేకపోతే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. దీంతో హైదరాబాద్లోని నిజాం ఆసుపత్రికి సంప్రదిస్తే రూ. 2.50 లక్షలు ఖర్చు అవుతుందని, ఆర్థిక సాయం అందించి నా బిడ్డని కాపాడండి అంటూ రాజేశ్వరి అందరినీ వేడుకుంటోంది. -
లావెక్కుతున్నావు తెలుగోడా!
సాక్షి, హైదరాబాద్: బొద్దుగా ఉంటే ముద్దు... అనేది పాత మాట. చక్కనమ్మ ఎంత చిక్కినా అందమే అనేది కొత్త మాట... ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఇప్పుడు ఎక్కువ మంది బరువు తగ్గించే పనిలో నిమగ్నమవుతున్నారు. మెజారిటీ పరిస్థితి మాత్రం మరో విధంగా ఉంది. దేశ వ్యాప్తంగా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు ఎక్కువవుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అందరి శరీరాల్ని మార్చేస్తున్నాయి. పురుషులు, మహిళలు తేడా లేకుండా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ మంది బాధితులున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో పరిస్థితి ఒకింత ఆందోళనకరంగానే ఉంది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల్లో బరువు పెరుగుతున్న అంశాలపై సర్వే నిర్వహించారు. నగరాలు/పట్టణాలు, గ్రామాల్లోని వారిని ఎంపిక చేసి వివరాలు నమోదు చేసింది. దేశంలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఏకంగా మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలోని 28.1 శాతం మంది మహిళలు, 24.2 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పట్టణాల్లో నివసించే మహిళలలో 39.5 శాతం మంది, పురుషులలో 31 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నవారే. గ్రామీణ మహిళల్లో ఈ సమస్యతో బాధపడుతున్న వారు 18.5 శాతం మంది ఉండగా, పురుషులు 14 శాతం మంది ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో అధిక బరువు సమస్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. అధిక బరువు సమస్య ఆంధ్రప్రదేశ్లోనూ ఇంకా ఎక్కువగానే ఉంది. ఆ రాష్ట్రంలోని పట్టణాల్లోని 45.6 శాతం మంది మహిళలు, 44.4 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. జీవనశైలే ప్రధాన కారణం... ఆహార అలవాట్లు, జీవన శైలిలో మార్పులే.. శరీర బరువు పెరుగుదలకు కారణాలవుతున్నాయని కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. శారీరక శ్రమలేని వృత్తిలోకి ఎక్కువ మంది వస్తుండడం కూడా దీనికి ప్రధాన కారణం. ‘చిన్నప్పటి నుంచి ఆటలకు దూరంగా ఉండడంతో కొత్త తరంలో ఎక్కువ మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో ఒకప్పటిలాగా తక్కువ ఆహారం తీసుకునే పరిస్థితి మారింది. రెడిమేడ్గా ఉండే ఆధునిక ఆహార పదార్థాలు అందుబాటులో ఉండడంతో రోజులో ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారు. ఇవన్నీ అధిక బరువుకు కారణమవుతున్నాయి’అని పిల్లల వైద్య నిపుణులు ఎం.శేషుమాధవ్ తెలిపారు. -
స్థూల కాయానికి విరుగుడుగా విషమా?
స్థూలకాయం మానవాళిని చిరకాలంగా చిరాకుపెడుతున్న సమస్య. ఇప్పుడంటే శస్త్రచికిత్స చేసి, ఒంట్లోని కొవ్వును తీసేయడం వంటి పద్ధతులు పుట్టుకొచ్చాయి గాని, ఇదివరకటి కాలంలో స్థూలకాయులు రకరకాల చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు. అలాంటి పద్ధతుల్లో కొన్ని ప్రాణాంతకంగా కూడా ఉండేవి. వైద్యశాస్త్రం ఆధునికత సంతరించుకుంటున్న పంతొమ్మిదో శతాబ్దిలో స్థూలకాయానికి విరుగుడుగా పాషాణం (ఆర్సెనిక్) కలిపి తయారు చేసిన మాత్రలను, ఇతర ఔషధాలను విరివిగా వాడేవారు. ఆర్సెనిక్ వల్ల జీవక్రియ వేగం పెరిగి ఒంట్లో అదనపు కొవ్వు త్వరగా కరిగిపోతుందని వెర్రిగా నమ్మేవారు. కొందరు తయారీదారులు తమ ఔషధాల్లో ఆర్సెనిక్ కలిపినట్టు బాహాటంగానే చెప్పుకొని మరీ ప్రకటనలు కూడా ఇచ్చేవారు. ఇంకొందరు ఆర్సెనిక్ కలిపిన విషయాన్ని మరుగునపెట్టి ఆర్సెనిక్తో తయారు చేసిన ఔషధాలను అంటగట్టేవారు. ఆర్సెనిక్ వల్ల ఒంట్లో కొవ్వు కరగడం ఎలా ఉన్నా, అంతకంటే ముందే ప్రాణాలు హరించుకుపోతాయనేది వాస్తవం. పంతొమ్మిదో శతాబ్ది వైద్యులకు ఈ సంగతి తెలియదంటే నమ్మలేం. ఎందుకంటే అంతకు శతాబ్దాలకు ముందే ఆర్సెనిక్ను శత్రువులను కడతేర్చేందుకు విషప్రయోగాలలో ఉపయోగించేవారు. ఆర్సెనిక్ ఎంత భయంకరమైన విషం అంటే అది చాలా వేగంగా ప్రాణాలు తీస్తుంది. అయినా అప్పటి మోసకారులు దీన్ని ఔషధం అంటూ అమ్మారు. -
ఎండిన పొట్టలు.. బాగా నిండిన పొట్టలు!
ఒక పొట్ట.. రెండు సమస్యలు.. ఒక దేశం.. రెండు పరస్పర విరుద్ధ పరిస్థితులు.. ఓవైపు పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది.. అదే సమయంలో అధిక బరువుతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.. జంక్ఫుడ్ అనేసరికి అమెరికన్లు వాళ్లు ఎక్కువగా తింటారు.. అందుకే వారంతా లావుగా ఉంటారు.. అని అనుకుంటుంటాం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే మన దేశంలో ఊబకాయంతో బాధపడే చిన్నారుల సంఖ్య అమెరికాను దాటిపోయిందట. ఈ జాబితాలో చైనా తొలిస్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య దాదాపు రెట్టింపైంది. లాన్సెట్ జర్నల్ తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 1975–2016 మధ్య 200 దేశాల్లో బీఎంఐ(బాడీ మాస్ ఇండెక్స్) ట్రెండ్స్పై ఈ సర్వే నిర్వహించారు. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఊబకాయంతో బాధపడే బాలికల సంఖ్య గత 40 ఏళ్ల కాలంలో 50 లక్షల నుంచి 5 కోట్లకు పెరిగింది. ఇదే వయసు కలిగిన బాలుర సంఖ్య 60 లక్షల నుంచి 7.4 కోట్లకు చేరింది. ఇక పోషకాహారలోపాన్ని ఊబకాయంతో పోల్చి చూస్తే పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. అటు పోషకాహారలోపం.. ఇటు ఊబకాయం దేశంపై దాదాపు సమానస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. పోషకాహార లోపం కలిగిన వారి సంఖ్య గత పదేళ్లలో మూడింట ఒక వంతు శాతం తగ్గినా.. ఇప్పటికీ దేశంలో నిర్దేశిత బరువు కంటే తక్కువ ఉన్న, వయసుకు తగ్గ ఎత్తు లేని, పోషకాహార లోపం కలిగిన చిన్నారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఏ ఇతర దేశాలతో పోల్చి చూసినా ఈ సంఖ్య ఎక్కువే. అయితే, నిరుపేద ఆఫ్రికా దేశాల కంటే ఈ విషయంలో భారత్ వెనకబడి ఉండటానికి అధిక జనాభానే కారణం. మనకంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు కూడా ప్రజలకు ఆరోగ్యకరమైన, స్థిరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. ఈ విషయంలో మనం వెనుకబడి ఉండటం గమనార్హం. దేశంలో ఊబకాయం కలిగి ఉన్న వారి సంఖ్య ఎక్కువున్న జిల్లాలు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. పోషకాహారలోపం ఉన్నవారు ఎక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య మధ్య భారతంలో అధికం. ఒబేసిటీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంటే.. పోషకాహారలోపం ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు కారణమవుతోంది. -
ప్రతిరోజు ఒక సిగరెట్ ప్యాకెట్ కాల్చితే..
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఓ వ్యక్తి చదువుకు ఆయుష్షుకు లంకె ఉంటుందా? ఎన్ని సంవత్సరాలు ఎక్కువగా చదువుకుంటే అన్నేళ్లు వారి ఆయుష్షు కూడా పెరుగుతుందా? బరువు పెరిగితే జీవిత కాలం తగ్గుతుందా? ఈ ప్రశ్నలకు పరిశోధకులు అవుననే సమాధానం చెబుతున్నారు. పాఠశాల విద్య అనంతరం ఎన్నేళ్ల పాటు చదువును కొనసాగిస్తారో అన్ని రోజులు ఆయుష్షు పెరిగే అవకాశాలు ఉన్నాయని స్కాట్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ అషర్ ఇన్స్టిట్యూట్ వారు తేల్చారు. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, ఐరోపాల్లో 6 లక్షల కంటే ఎక్కువ మందికి సంబంధించిన జన్యువుల సమాచారాన్ని సేకరించి వారు ఈ పరిశోధనలు చేశారు. ఎక్కువ చదవడం వల్ల ఆయుష్షును పెంచుకోవచ్చని పరిశోధకులంటున్నారు. ఊబకాయం..ఆయుష్షుకు ముప్పు ఊబకాయుల బరువుపైనే వారి ఆయుష్షు ఆధారపడి ఉంటుందనీ, 1980లతో పోల్చితే ఒబెసిటీ సమస్య మూడు రెట్లు ఎక్కువైందని పరిశోధనల్లో తేలింది. సాధారణం కంటే అధిక బరువున్న వారికి...అదనంగా ఉన్న ఒక్కో కేజీకి రెండు నెలల చొప్పున ఆయుక్షీణత ప్రమాదం ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి, వ్యాధులు వంటి వాటిపై జన్యువులు పోషించేపాత్రపై ఈ పరిశీలనను నిర్వహించారు. అధ్యయనంలో పాల్గొన్నవారి జన్యు సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. మనుషుల జన్యువుల్లో సగం వరకు తల్లిదండ్రులతో ముడిపడి ఉంటాయి. ఆయుర్దాయంపై వివిధ రకాల జన్యువులు చూపే ప్రభావాన్ని వారు అంచనా వేశారు. జీవనశైలిని చాలా వరకు ఈ జన్యువులే ప్రభావితం చేస్తున్నాయని కనుగొన్న పరిశోధకులు...మద్యసేవనం, ఇతర దురలవాట్ల ప్రభావం ఆయుష్షుపై ఏ మేరకు పడుతుందనే దానిపై అధ్యయనం సాగించారు. ‘ఏయే రకాల ప్రవర్తనలు, అలవాట్లు, రోగాలు ఆయుష్షు పెరగడానికి, తరగడానికి కారణమవుతున్నాయనేది విశ్లేషించడానికి పెద్దమొత్తంలో అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల జన్యువుల సమాచారం ఉపయోగపడింది’ అని ఉషర్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ జిమ్ విల్సన్ చెబుతున్నారు. ‘ఆయుష్షుపై జీవనశైలి చూపే ప్రభావంపై మా అధ్యయనం దృష్టిని కేంద్రీకరించింది’ అని డాక్టర్ పీటర్ జోషి పేర్కొన్నారు. అధ్యయనంలో తేలినవి ► ప్రతిరోజు ఒక సిగరెట్ ప్యాకెట్ కాల్చేవారి జీవితకాలం మొత్తంగా ఏడేళ్లపాటు తగ్గిపోతుంది. అయితే ఇప్పటినుంచైనా సిగరెట్ కాల్చడం మానేసేవారు ప్రమాదాన్ని తప్పించుకుని, అసలు పొగతాగని వారితో సమానంగా జీవించవచ్చు. ► అధిక బరువున్న వారు ఒక కిలో బరువును తగ్గించుకుంటే జీవితకాలాన్ని రెండు నెలలు పొడిగించుకోవచ్చు. ► స్కూలు చదువు తర్వాత ఎన్ని ఎక్కువ సంవత్సరాలు చదువుకుంటే అన్ని ఎక్కువ ఏళ్లు జీవిస్తారు. ► శరీరంలో అధిక కొవ్వుతో పాటు, చక్కెరవ్యాధితో ముడిపడిన ఆయా అంశాలు జీవితకాలంపై దుష్ప్రభావం చూపుతాయి. ► రక్తంలో అధిక కొలెస్ట్రాల్కు కారణమయ్యే జన్యువు కారణంగా ఎనిమిది నెలల మేర ఆయుష్షు తగ్గిపోతుంది. -
ఆసన్నం
డంబెల్ షేప్–2 గత వారం విభిన్న రకాల శరీరపు తీరుతెన్నులను బట్టి ఒబేసిటీ ని 3 రకాలుగా విభజిస్తారని తెలుసుకున్నాం. పొట్టకన్నా పిరుదులు, తొడలు, భుజాలు బాగా లావుగా ఉంటే డంబెల్ ఒబేసిటీ అంటారని, ఆ డంబెల్ ఒబేసిటీ సమస్యకు పరిష్కారంగా కొన్ని ఆసనాలను, అవి చేసే విధానాన్ని వివరించడం జరిగింది. అదే క్రమంలో డంబెల్ షేప్ సమస్య నుంచి బయట పడేందుకు ఉపకరించే మరికొన్ని ఆసనాలు, అవి వేసే విధానాన్ని ఈ వారం కూడా అందిస్తున్నాం. 1.చక్రాసన వెల్లకిలా పడుకుని కాళ్లు రెండూ మడచి పాదాలు– మడమలను పిరుదుల దగ్గరగా తీసుకొని మోకాళ్లు పైకి నిలబెట్టాలి. తలకి ఇరువైపులా అరచేతులు నేల మీద ఉంచి (చేతి వేళ్లు లోపలి వైపునకు ఉంటాయి) శ్వాస తీసుకుంటూ అరచేతులూ, అరిపాదాలు భూమికి బలంగా నొక్కుతూ శరీరాన్ని పైకి లేపాలి. రెండు లేదా మూడు శ్వాసల తరువాత శ్వాస వదులుతూ నెమ్మదిగా శరీరాన్ని కిందకు తీసుకురావాలి. కాళ్లను స్ట్రెచ్ చేసి చేతులు శరీరం పక్కన ఉంచి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఒక వేళ పూర్తి స్థితిలో చేయలేకపోతే... స్టెప్–1 ముందుగా భుజాలు భూమి మీదనే ఉంచి పిరుదులను పైకి లేపాలి. శ్వాస వదులుతూ ïపిరుదులను భూమి మీద ఉంచాలి. స్టెప్–2 మళ్లీ స్టెప్ 1 లోకి వచ్చి, ఈ సారి తలను (మాడు భాగాన్ని) నేలమీద ఉంచి అరచేతులు భూమి మీద ఉంచి భుజాలను కూడా పైకి లేపి రెండు మూడు సాధారణ శ్వాసల అనంతరం శ్వాస వదులుతూ ముందు భుజాలను తరువాత సీటు భాగాన్ని నేల మీదకు తీసుకురావాలి. స్టెప్–3 ఇంకా పూర్తి స్థాయిలో చేయాలనుకుంటే స్టెప్ 2లో నుంచి, చేతుల మీద భారం ఉంచుతూ తలను భుజాలను పూర్తిగా పైకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి స్థితిలోకి వచ్చిన తరువాత శరీరం మొత్తాన్ని చేతుల మీద తేలికగా నిలుపగల స్థితి ఉన్నట్లయితే కుడి కాలుని పైకి లేపి పాదాన్ని కాలివేళ్లను పైకి స్ట్రెచ్ చేసి ఉంచవచ్చు. తరువాత కుడి కాలుని కిందకు తీసుకువచ్చి తిరిగి ఎడమకాలుని పైకి తీసుకువెళ్లవచ్చు. జాగ్రత్తలు: ఇది కొంచెం ముందస్తు భంగిమ (అడ్వాన్స్డ్ పోశ్చర్) కాబట్టి ఊబకాయం ఉన్నవారు శరీరాన్ని పైకి లేపాల్సి వచ్చినప్పుడు భుజాలు, చేతి మణికట్టు బలంగా ఉన్నట్లయితే తేలికగా చేయవచ్చు. మణికట్టు ఏమాత్రం బలహీనంగా ఉన్నా పూర్తి స్థాయిలో చేయకుండా స్టెప్ 1 లేదా స్టెప్ 2 వరకూ చేయడం మంచిది. 2. వీరాసన విడదీసి ఉంచిన పాదాల మధ్యలో కూర్చున్న తరువాత వెనుకకు ఒరిగి, రెండు మోచేతులూ భూమి మీద ఆనించి, రెండు అరచేతులూ సీటు పక్కన భూమి మీద ఉంచి భూమికి నొక్కుతూ, వీపు భాగాలని తరువాత మెడ భాగాలని ఆ తరువాత తల భాగాన్ని భూమి మీద ఉంచి, చేతులు రెండూ వెనుకకు స్ట్రెచ్ చేసి ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆసనం పూర్తి స్థితిలో వీపుపై భాగాలే కాకుండా వీపు మధ్య భాగం, కింద భాగం కూడా భూమి మీద ఆనించి ఉంచే ప్రయత్నం చేయాలి. మోకాళ్లు రెండూ దూరంగా కాకుండా వీలైనంత వరకు కలిపి ఉంచే ప్రయత్నం చేయాలి. అలాగే మోకాళ్లు గాలిలోకి లేవకుండా పూర్తిగా భూమి మీదనే ఆనించి ఉంచే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తలు: మోకాలు సమస్య ఉన్నవారు ఎంతవరకు సాధ్యపడితే అంతవరకే చేయాలి. 3. వీరభద్రాసనం త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసన తరువాత చేసే ఆసనం ఈ వీరభద్రాసనం. రెండు కాళ్ళమధ్య వీలైనంత దూరం ఉంచి, కుడిపాదాన్ని ముందు వైపునకు, ఎడమపాదాన్ని పక్కకు ఉంచి, కుడి మోకాలును ముందుకు వంచి, కుడి మోకాలు నుంచి కుడి తొడ కీలుభాగం వరకు 90 డిగ్రీల కోణంలో ఉండేటట్లు చూసుకోవాలి. చేతులు రెండూ 180 డిగ్రీల కోణంలో ఉంచాలి. శరీర బరువును ఎడమపాదం మీదకు షిఫ్ట్ అయ్యేటట్లుగా శరీరాన్ని కొంచెం వెనుకకు ఏటవాలుగా ఉంచితే కుడి మోకాలు మీద లోడ్ పడదు. శ్వాసతీసుకుంటూ పూర్తి ఆసనస్థితిలోకి వచ్చి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ చేతులు రెండూ క్రిందకు, కుడి మోకాలు స్ట్రెయిట్గా తీసుకురావాలి. ఇదేవిధంగా రెండవవైపు కూడా చేయాలి. 4. ఏకపాద ప్రసారిత మార్జాలాసనం రెండు అరచేతులు ముందువైపు నేల మీద ఉంచాలి. రెండు మోకాళ్ళు మధ్య 1 లేదా ఒకటిన్నర అడుగుల దూరం ఉంచి మార్జాలాసనంలో నడుమును రిలాక్స్ చేస్తూ, నెమ్మదిగా కుడి మోచేయి, ముంజేయి, అరచేయి నేలమీద ఉంచి శ్వాస తీసుకుంటూ ఎడమకాలును బాగా స్ట్రెచ్ చేసి శ్వాస వదులుతూ ఎడమకాలును కుడివైపు పక్కకు పడేసి నడుము భాగాల్లో ట్విస్ట్ ఫీల్ అవుతూ తొడ కీలును బాగా ఓపెన్ అయ్యేటట్లుగా రిలాక్స్ చెయ్యాలి. శ్వాస తీసుకుంటూ ఎడమకాలును మళ్ళీ స్ట్రెచ్ చేసి ఎడమ మోకాలు కిందకు తీసుకువచ్చి మళ్ళీ మార్జాలాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఇదేవిధంగా రెండవవైపు కూడా చేయాలి. డంబెల్ షేప్ నుంచి విముక్తి పొందే క్రమంలో వేయాల్సిన ఆసనాల క్రమం... 1) పరివృత్త త్రికోణాసనం 2) వీరభద్రాసనం వేరియంట్ 3) ఏకపాద ప్రసారిత మార్జాలాసనం 4) ఎల్బో ప్లాంక్ 5) ఏకపాద అధోముఖ శ్వానాసనం 6) కోణాసనం 7) ఏకపాద కపోతాసనం 8)వీరాసనం 9) చక్రాసనం – సమన్వయం: ఎస్. సత్యబాబు ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
స్లిమ్ టైమ్
డంబెల్ షేప్ ఎత్తుని బట్టి శరీరపు బరువు ఉండాల్సిన దానికన్నా 20% ఎక్కువ ఉన్నట్లయితే ఒబేసిటీగా పరిగణించవచ్చు.. శరీర ఆకృతిని బట్టి ఒబెసిటీని ఇలా విభజించవచ్చు. 1) కేవలం పొట్ట మాత్రమే లావుగా ఉండి మిగిలిన శరీరం మొత్తం ఇంచు మించు సమంగానే ఉన్నట్లయితే దానిని పాట్ బెల్లీ ఒబేసిటీ అంటారు. 2) శరీరం మొత్తం పైనుండి కిందకు పూర్తిగా స్థూలంగా ఉన్నట్లయితే దానిని సిలిండ్రికల్ ఒబేసిటీ అంటారు. 3)పొట్ట కన్నా పిరుదులు, తొడలు, భుజాలు బాగా లావుగా ఉంటే డంబ్బెల్ ఒబేసిటీ అంటారు.ఆ డంబెల్ ఒబెసిటీ సమస్యకు పరిష్కారం ఈ ఆసనాలు... ►డమ్బెల్ ఒబేసిటీ తగ్గడానికి నిలబడి చేసే ఉత్కటాసనం, త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసనం, పార్శ్వకోణాసనం, వీరభద్రాసనం (ఆల్ వేరియంట్స్), గరుడాసనం, ఆల్ ప్లాంక్ పోశ్చర్స్, అంటే చతురంగ దండాసనం, పర్వతాసనం ఉపకరిస్తాయి. ►కూర్చొని చేసేవాటిలో – కోణాసనం, పద్మాసనం, భరద్వాజాసనం, వజ్రాసనం, వీరాసనం, సుప్త వజ్రాసనం, కపోతాసనం, గోముఖాసనం, ఉష్ట్రాసనం మంచి ఫలితాలనిస్తాయి. ►బోర్లాపడుకుని చేసేవాటిలో – శలభాసనం, సర్పాసనం, భుజంగాసనం, ధనురాసనం సాధన చేయవచ్చు. ► వెల్లకిలా పడుకుని చేసే వాటిలో చక్రాసనం చక్కటి ఫలితాన్నిస్తుంది. ► బరువు తగ్గడానికి ఈ ఆసనాలు బాగా పనికివస్తాయి. ప్రాణాయామాల్లో భస్త్రిక కపాలభాతి, అగ్నిసార, ఉడ్డియాన్, నౌలి బాగా ఉపకరిస్తాయి. 1) పరివృత్త త్రికోణాసన ఎడమ పాదం ముందుకు, కుడిపాదం పక్కకు, రెండు కాళ్ల మధ్య వీలైనంత దూరం, చేతులు రెండూ 180 డిగ్రీల కోణంలో పక్కలకు ఉంచి శ్వాస వదులుతూ కుడిచేయి కిందకు ఎడమపాదం పక్కకు, ఎడమచేయి పైకి నిటారుగా ఉంచాలి. రెండు చేతులు 180 డిగ్రీల కోణంలో ఉండేటట్లు చూసుకోవాలి. మోకాలి సమస్య ఉన్నా ఔ1 నుంచి ఔ5 లో ప్రాబ్లమ్ ఉన్నా, పించ్ నర్వ్ సయాటికా సమస్య ఉన్నా ఎడమ మోకాలిని సౌకర్యవంతంగా ఉండేటట్లు కొంత వరకే బెండ్ చేయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి నిలబడిన స్థితిలోకి రావాలి. ఇదే విధంగా వ్యతిరేక దిశలో కూడా చేయాలి. 2) కోణాసన కూర్చున్న స్థితిలో కాళ్ళు రెండూ ముందుకు సాగదీసి చేతులు రెండూ వెనుకగా శరీరానికి ఇరువైపులా ఉంచి అరచేతులు వెనుకవైపుకు చూసే విధంగా ఉంచి శ్వాసతీసుకుంటూ సీటు భాగాన్ని నెమ్మదిగా పైకి లేపుతూ శరీరం మొత్తం ఏటవాలు రేఖలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఒకవేళ అరచేతులు చేతివేళ్ళ డైరెక్షన్స్ వెనుకకు ఉంచడం కష్టం అన్పిస్తే లోపల ముందువైపు దిశగా కూడా ఉంచవచ్చు. 5 లేదా 10 శ్వాసల కాలం ఉంటూ శ్వాస వదలిన ప్రతిసారి పొట్టను బాగా లోపలకు లాగుతూ ఉండాలి. శ్వాస వదులుతూ నడుము కిందకు తీసుకురావాలి. ఇలా ఐదు లేదా పది సార్లు చేయాలి. 3) ఏకపాద కపోతాసన భరద్వాజాసనంలో రెండు కాళ్ళు ఎడమవైపుకి మడిచి శరీరాన్ని కుడివైపుకి నడుమును కుడివైపుకి ట్విస్ట్ చేస్తూ వెనుకకు కుడి భుజం మీదుగా చేసే ప్రయత్నం. ఈ సిరీస్లో చేసే ఆసనం కపోతాసనం. కుడిమోకాలు ముందుకు ఫేస్ చేస్తూ ఎడమ మోకాలు వెనుకకు ఫేస్ చేస్తూ ఎడమపాదాన్ని పైకి లేపి కుడిచేత్తో ఎడమపాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. పట్టుకున్న తరువాత ఆ పాదాన్ని నడుముకు లేదా వీపు భాగానికి బాగా దగ్గరగా ఆనించే ప్రయత్నం చేయాలి. ఇలా ఆనించగలిగిన వాళ్ళు పాదం పక్కకి పడిపోకుండా ఎడమ చేతి మధ్యలో లాక్ చేయాలి. ఈ స్థితి నుంచి గోముఖాసనంలో మాదిరి కుడి చేతిని పైకి తీసుకువెళ్ళి వేళ్లను లాక్ చేయాలి. శ్వాసతీసుకుంటూ ఆసనంలోకి రావాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదిలేస్తూ వెనుకకు వచ్చి ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. చేయలేనివారు ఎంతవరకు వస్తే అంతవరకు చేయవచ్చు. - సమన్వయం: ఎస్. సత్యబాబు, - ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ ,యోగా ఫౌండేషన్ -
కొండలా కొవ్వు ఉంది ఎంతకూ తగ్గనంది
ఊబకాయం తగ్గించుకోవడానికి సర్జరీలను ఆశ్రయిస్తున్న సిటీజనం - హైదరాబాద్లో ఏటా 800లకు పైగా సర్జరీలు - ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ - నగర పిల్లల్లో 13%.. పెద్దల్లో 12% మందికి ఊబకాయం పిజ్జాలు, పాస్తాలు... అర్ధరాత్రి ‘కిక్కు’నిస్తున్న విందులు, వినోదాలు... ఆహారపు అలవాట్లు మారి... శారీరక వ్యాయామం తగ్గి... సిటీజనులకు కొండలా కొవ్వు పేరుకుపోతోంది. క్షణం తీరికలేని జీవనశైలితో అధిక బరువు పెద్ద సమస్యగా మారింది. ఇందుకు పెద్దలే కాదు... పిల్లలూ మినహాయింపు కాదు! 13% మంది బడికి వెళ్లే పిల్లలు... 12% మంది పెద్దలు ఊబ కాయంతో తంటాలు పడుతున్నారు. ఫలి తంగా.. చిటికెలో కొవ్వు కరిగించుకొనేందుకు సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. ఈ సర్జరీలకూ నగరమే ప్రధాన కేంద్రంగా మారడం విశేషం. సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఏటా ఆరు వేలకు పైగా కొవ్వు కరిగించే సర్జరీలు చేస్తుంటే.. వీటిల్లో అత్యధికంగా హైదరాబాద్లోనే 800కు పైగా జరుగు తున్నాయి. దేశంలోనే మరెక్కడా లేని వైద్య నిపుణులు, సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండ టం.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర మెట్రో నగరాలతో పోలిస్తే వైద్య ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల దేశీయులే కాకుండా విదేశీయులూ ఇక్కడికి వస్తున్నారు. ఢిల్లీలో నెలకు 50, ముంబైలో 40 కొవ్వు కరిగించే సర్జరీలు జరుగుతుంటే.. గ్రేటర్లో 70 జరుగుతున్నాయి. రోజుకు 1400 కేలరీలు చాలు.. శరీరానికి అవసరమైన దానికంటే అధిక ఆహారం తీసుకోవడం, దాని ద్వారా లభించిన కేలరీలు ఖర్చు అయ్యే స్థాయిలో శారీరక శ్రమ చేయక పోవడం, పాశ్చాత్య దేశాల అలవాట్లను అందిపుచ్చుకోవడం... కారణమేదైనా సంపదతో పాటే సౌకర్యాలు, ఆహార లభ్యత పెరిగి ఊబకాయానికి దారితీస్తోంది. ప్రాసెస్డ్ ఫుడ్డు, పిజ్జాలు, బర్గర్లు ఒకసారి తింటే చాలు... రోజుకు సరిపడే కేలరీలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఖర్చుకాకపోతే లోపల నిల్వ ఉండి బరువు పెరుగుదలకు కారణం అవుతాయి. రోజంతా కష్టించే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులకు రోజుకు సగటున 2,300–2,500 కేలరీల శక్తి అవసరం. శారీరక శ్రమ అంతగా లేని వారికి 1,400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. కానీ టిఫిన్లు, భోజనంతో పాటు ఫాస్ట్ఫుడ్స్ కూడా తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు పేరుకుపోతున్నాయి. ఏటా అదనంగా 90 వేల కేలరీలు తీసుకుంటే 5 కేజీల చొప్పున, నాలుగైదేళ్లలో 20 కేజీలకు పైగా బరువు పెరుగుతారు. పరోక్షంగా ఇది మధుమేహం, గుండె పోటు, మోకాలి నొప్పులు, హైపర్టెన్షన్, మహిళల్లో సంతానలేమి, రొమ్ము కేన్సర్కు కారణం అవుతుంది. లైపోసక్షన్తో సత్వర ఫలితాలు ఇంజక్షన్ సహాయంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించే పద్ధతిని లైపోసక్షన్ సర్జరీ అంటారు. ఫలితం చాలా త్వరగా ఉంటుంది. సినీ తారలు ఎక్కువగా దీన్ని ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల చికిత్స తర్వాత.. కొవ్వును తీసేసిన ఖాళీ ప్రదేశంలోకి నీరు చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక జీర్ణకోశం సైజును తగ్గించి క్రమంగా బరువును తగ్గించే ప్రక్రియను బేరియాట్రిక్ సర్జరీ అంటారు. ఇది 2007లో హైదరాబాద్లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. రోజువారీ వ్యాయామం, ఆహార నియంత్రణతో నెమ్మదిగా బరువును తగ్గిస్తారు. తొమ్మిది మాసాల్లో 60–70 శాతం కొవ్వు దానంతట అదే శరీరంలో కరిగిపోతుంది. సాధ్యమైనంత వరకు బరువు పెరగకుండా చూసుకోవాలి. రోజూ అరగంటైనా వ్యాయామం చేయాలి. పరిమితికి మించి ఆహారం తీసుకోకూడదు. ఈ సర్జరీలు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. – డాక్టర్ జి.సురేష్చంద్రహరి, బేరియాట్రిక్ సర్జన్, సిటిజన్స్ హాస్పిటల్ 1 నెలలో 30 కేజీలు తగ్గా నేను 128 కేజీల బరువుండేవాడిని. అధిక బరువు వల్ల కనీసం నాలుగు అడుగుల దూరం కూడా నడవలేక పోయాను. కూర్చోలేక... నిలుచోలేక బాధపడ్డాను. శ్వాస కూడా కష్టమైంది. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత 30 రోజుల్లోనే 30 కేజీలు తగ్గాను. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు. – సందీప్, బోయినపల్లి 27 రోజుల్లో 25 కేజీలు... సర్జరీకి ముందు నా బరువు 177 కేజీలు. ప్రస్తుతం 152 కేజీలకు తగ్గింది. 27 రోజుల్లో 25 కేజీలు తగ్గాను. ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉంది. – ఆదిల్, చందానగర్ అధిక బరువు ఇలా నిర్ధారిస్తారు... ► బాడీమాస్ ఇండెక్స్ (బరువు కిలోలు/ఎత్తు మీటర్లలో) ► 18–23 వరకు ఉండటం ఉత్తమం ► 20 లోపు ఉంటే తక్కువ బరువు ఉన్నట్లు ► 20–25 మధ్య ఉంటే సరైన బరువు ఉన్నట్లు లెక్క ► 25–30 మధ్య ఉంటే అధిక బరువు ► 30–40 మధ్య ఉంటే ఊబకాయం ► 40 కన్నా ఎక్కువ ఉంటే ‘మార్పిడ్ ఒబేసీ’ అంటారు. -
ఒంటరితనం ప్రమాదమే!
వాషింగ్టన్: ఊబకాయం కంటే ఒంటరితనమే చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో వెల్లడైంది.ఊబకాయం కంటే ఒంటరితనం వల్ల అనారోగ్య సమస్యలతోపాటు తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు రెండు ప్రత్యేక బృందాలపై బ్రిగామ్ యంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించి తెలిపారు. ఒంటరితనంలో జీవించే దాదాపు 3.4 లక్షల మందిని, సమాజంతో కలసి జీవించే 3 లక్షల మందిపై పరిశోధన నిర్వహించారు. ఒంటరితనంతో జీవించే వారి కంటే సమాజంతో కలసిపోయి బతికేవారిలో 50 శాతం మంది ఆలస్యంగా మరణిస్తున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు వర్సిటీకి చెందిన జూలియన్ హోల్ట్ లూస్టడ్ వెల్లడించారు. ఒంటరితనంతో జీవించే వారికి అనారోగ్య సమస్యలు రావడంతోపాటు మరణం కూడా ముందుగానే సంభవిస్తోందని చెప్పారు. సామాజిక సంబంధాలు మెరుగుపరచుకోవడం ద్వారా దీనిని అరికట్టగలమని భావిస్తున్నట్లు చెప్పారు. -
అంతసేపు కూర్చుంటే... టైంబాంబే!
ఊరికే అటూ ఇటూ పరుగెత్తకుండా నిమ్మళంగా కూర్చోరా ఒకప్పుడు బామ్మా... ఆ తర్వాత నాన్నా మనకు చెప్పిన విషయం. మా అమ్మాయికేమండీ! హ్యాపీగా వెళ్లి కడుపులో చల్లకదలకుండా ఏసీ రూములో కూర్చొని ఉద్యోగం చేస్తుంది.. ఈ మాట అమ్మ పదిమందికీ చెప్పడం ఒకప్పుడు ముచ్చటగా అనిపించేది. ఇప్పుడు ఆ కూర్చోవడమే ఆరోగ్యాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. జాగ్రత్త పడండి... అదర్వైజ్... యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ టైంబాంబ్! పనిచేసే తీరుతెన్నులు మారాయి. వృత్తులేవైనా వాటిల్లో కూర్చొని చేసేవే ఎక్కువ. కూర్చొని చేసే వృత్తులు గతంలోనూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కంప్యూటర్ ఆవిర్భావం తర్వాత పని అంటే కుర్చీకి అంటిపెట్టుకోవడంగా మారిపోయింది. ఒళ్లు కదులుతూ పనిచేయాల్సిన యువత కదలకుండా కుర్చీకి అతుక్కుపోతున్నారు. ఆరోగ్యాన్ని చిత్తుచేసుకుంటున్నారు. ఆసనంపై అనర్థాల ముళ్లు కుర్చీలకు అంటిపెట్టుకుని పనిచేస్తుండటం వల్ల వచ్చే సమస్యల్లో మొదటిది స్థూలకాయం. అది అనేక ఇతర వ్యాధులకు దారితీసే ప్రాథమిక వ్యాధి. ఆ కారణంగా రక్తపు ఒత్తిడి పెరగడంతో అధిక రక్తపోటు వస్తుంది. అది డయాబెటిస్ అనే ముప్పును తెచ్చే అంశం కూడా. (అంటే రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట). దీనికి స్మోకింగ్ తోడైతే గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వస్తాయి. ఇక అదేపనిగా కూర్చోవడం వల్ల వచ్చే సమస్య... కాలి రక్తనాళాల్లో కదలికలు తగ్గడం వల్ల అక్కడ రక్తం గడ్డకట్టే అవకాశాలుంటాయి. కాలి రక్తనాళాల కవాటాలు బలహీనం అవుతాయి. దాంతో అక్కడ గడ్డకట్టిన బ్లడ్క్లాట్స్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. దీనిని పల్మునరీ ఎంబాలిజం అంటారు. ఇది ప్రమాదకరమైన పరిణామం. అతిగా కూర్చోవడం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలు (స్లీప్ డిజార్డర్స్) వస్తాయి. వీటిల్లో ప్రధానంగా నిద్రపట్టకుండా ఉండే రుగ్మత ఇన్సామ్నియా, మాటిమాటికీ నిద్రాభంగం అయ్యే డిస్టర్బ్డ్ స్లీప్ పాటర్న్స్, గురకతో ఆక్సిజన్ అందని స్లీప్ ఆప్నియా వంటి వ్యాధులు వస్తాయి. వీటి కారణంగా మెదడుకు, గుండెకు తగినంత రక్తం అందక అది గుండెపోటు లేదా పక్షవాతం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. అలాగే కూర్చొని పనిచేసే కంప్యూటర్ ఆధారిత ఉద్యోగుల్లో కేవలం వేళ్లకదలికలు మాత్రమే ఉంటాయి. ఫలితంగా కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ వంటివి రావచ్చు. మణికట్టు వద్ద ఉండే ఎముకలన్నీ ఒక వృత్తాకారం ఏర్పడేలా అమరి ఉండి... వాటి మధ్య నుంచి నరాలు అరచేతిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి... మణికట్టు ఎముకల అమరికను టన్నెల్గా పేర్కొనడం వల్ల దీన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. ఇందులో నరాలను ఎముకలు నొక్కేచడం వల్ల అరచేతి నొప్పులు, వేళ్లకు రక్తం అందక తిమ్మిర్లు పట్టడం వంటి పరిణామాలూ రావచ్చు. అదేపనిగా కూర్చోవడం వల్ల నడుము నుంచి కాళ్ల వరకు వెళ్లే అతిపెద్ద నరం అయిన సయాటికా నొక్కుకుపోయి సయాటికా వ్యాధికి దారితీయవచ్చు. అలాగే మెడనొప్పులూ వస్తాయి. కంప్యూటర్ స్క్రీన్ను అదేపనిగా చూస్తుండటం వల్ల కంటిలోని తేమ తగ్గి కంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు... మానసిక సమస్యలైన యాంగై్జటీ, డిప్రెషన్, ఆత్మహత్యాధోరణులు (సూయిసైడల్ టెండెన్సీస్) కనిపించవచ్చు. తేలిగ్గా మాదకద్రవ్యాలకు అలవాటు పడటం (డ్రగ్ అబ్యూజ్), స్మోకింగ్, ఆల్కహాల్కు అలవాటు పడటం వంటి సమస్యలు సైతం కొందరిలో కనిపిస్తాయి. ఇక సామాజిక సమస్యలూ, వైవాహిక బంధంలో ఇబ్బందులు సైతం మామూలే. అధిగమించడం ఇలా... కూర్చొని పనిచేసే ఉద్యోగాల వల్ల వచ్చే ఆరోగ్య అనర్థాలను అధిగమించడానికి అనుసరించాల్సిన సూచనలివి... మంచి పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. అంటే అన్ని రకాల పోషకాలతోపాటు విటమిన్లు, మినరల్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆహారంలో ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ►జంక్ఫుడ్, వేపుళ్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు. ►ఆల్కహాల్నుంచి పూర్తిగా దూరంగా ఉండటమే మేలు. ►నిద్రపోవడానికి రెండు గంటల ముందే రాత్రిభోజనం పూర్తి చేయాలి. నిద్రకు కనీసం మూడు గంటల ముందునుంచే కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ►నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు నుంచి కంప్యూటర్లు, ట్యాబ్స్, మొబైల్ఫోన్స్, టీవీ వంటి అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉపయోగం నుంచి దూరంగా ఉండాలి. ►రోజూ క్రమం తప్పకుండా ధ్యానం, యోగా వంటివి చేయడం మంచిదే. ►ఇక ఆఫీస్లో కంప్యూటర్ ముందు పనిచేసేవారు ప్రతి రెండు గంటలకొకసారి కనీసం పది నిమిషాలు బ్రేక్ తీసుకొని అటు ఇటు నడవాలి. ►ఆఫీస్లో ఉండే జిమ్, రిలాక్సేషన్ రూమ్స్, యోగా హాల్స్ వంటి వాటిని స్మార్ట్గా ఉపయోగించుకొని దీర్ఘకాలం పాటు కూర్చొని ఉండటం వల్ల కలిగే అనర్థాలను అధిగమించవచ్చు. సామాజిక అంశాల వద్ద వస్తే... అందరితోనూ కలుపుగోలుగా ఉండటం, మిత్రులతో అరమరికలు లేకుండా హాయిగా నవ్వుతూ మాట్లాడటం, సామాజిక వేడుకల్లో పాల్గొనడం అన్ని విధాలా మంచిది. అలాగే మంచి కుటుంబ బంధాలు, పటిష్టమైన వైవాహిక బంధం చాలా ఒత్తిళ్ల నుంచి దూరం చేసి ఆరోగ్యాన్ని పెంచుతుంది. సామాజిక సేవలో పాల్గొనడం వల్ల నలుగురికి మంచి చేయడం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. వీటివల్ల మన జీవితానికి సార్థకత చేకూరిన భావన కలుగుతుంది. అదేంతో మానసికతృప్తిని కలగజేస్తుంది. ఫలితంగా మనసు ఆనందంగా ఉండటం వల్ల మనిషి ఉల్లాసంగా ఉంటాడు. అది ఆరోగ్యానికి దోహదం చేసే అంశం. ఈ అన్ని కార్యకలాపాల వల్ల శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం కలిగి మనుషులు దృఢంగా మారుతారు. వ్యాధుల పట్ల నిరోధకత పెరుగుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామాలన్నింటి కంటే వేగంగా నడక సాగించే ‘బ్రిస్క్ వాకింగ్’ మేలు. దీన్ని రోజుకు 30 నిమిషాల పాటు ఆగకుండా కొనసాగించాలి. అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఒకటుంది. నిజానికి ఇటీవల సాఫ్ట్వేర్తో శారీరక శ్రమ తగ్గడం వల్ల దాన్ని పూరించడానికి యువత జిమ్ పట్ల ఆకర్షితులు కావడం కూడా పెరుగుతోంది. ఇది మంచి పరిణామమే అయినా అతి సర్వత్ర వర్జయేత్ అనే సూక్తి వ్యాయామానికీ వర్తిస్తుంది. అతిగా వ్యామాయం చేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అతిగా వ్యాయామం చేసే వారిలో ఆ ఎక్సర్సైజ్ ఒత్తిడిని తొలుత తీసుకొనే అవయవం గుండె. అతి వ్యాయామంతో పడే ఒత్తిడిని భరించేలాగా గుండె తనను తాను తీర్చిదిద్దుకుంటుంది. అలా అన్ని కణాలకూ మరింత రక్తం అందేలా స్పందించే క్రమంలో గుండె పరిమాణం పెరుగుతుంది. దాంతో ఇలా అతిగా వ్యాయామం చేసే వారిలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇటీవల వ్యాయామం చేస్తూ కుప్పకూలిన కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే గుండె ఆగగానే దాన్ని తిరిగి పని చేసేలా చేసే ప్రథమ చికిత్స చేయగల కార్డియో పల్మునరీ రిససియేషన్ (సీపీఆర్) నిపుణులను జిమ్లలో నియమించడం అవసరం. జిమ్లలో చేరేవారి ఆరోగ్య చరిత్ర తెలుసుకుని వారికి తగిన ఆరోగ్య పరీక్షలు చేశాకే చేర్చుకొని, వారు చేయదగ్గ వ్యాయామాలే చేయించడం తప్పనిసరి. వ్యక్తిగత క్రమశిక్షణతోనూ, మన పరిమితులను గుర్తెరగడం ద్వారా, మంచి సంతృప్త భావనతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉండటం, జీవితంలో తృప్తిని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ఉండటం ద్వారా ఈ కూర్చొని చేసే వృత్తులతో వచ్చే అనర్థాలను చాలావరకు అధిగమించవచ్చు. నియమితవేళలు తప్పడమే అనారోగ్య హేతువు... కాలం ఎరగకుండా గంటల కొద్దీ కూర్చోవడం వల్ల ఒళ్లు ఏమాత్రం కదలకుండా ఉంటుంది. దాంతో శారీరక శ్రమ ఎంతమాత్రమూ ఉండటం లేదు. పైగా ఇటీవల షిఫ్టుల్లో పనిచేసే వృత్తుల కారణంగా తిండి, నిద్ర, వ్యాయామం... వాటి సమయ సందర్భాలూ, సామాజిక వ్యవహారాలు... వీటన్నింటిలోనూ నియమబద్ధత కొరవడింది. వేళకు భోజనాలు చేయడం వెనకబడింది. తిండి, నిద్రలు నియతి తప్పాయి. దాంతో మెదడులోని ‘బయలాజికల్ క్లాక్’లోని వేళలూ గతి తప్పాయి. ఫలితంగా ఆరోగ్యం అస్తవ్యస్తమవుతోంది. పైగా ఇటీవలి కంప్యూటర్ ఆధారిత వృత్తులో సహజంగా ఉండే ఒత్తిడికి తోడు ఇటీవల వారి ఉద్యోగాల్లోని అభద్రత... అగ్నికి తోడైన ఆజ్యంలా ఆరోగ్యాన్ని కాల్చేస్తోంది. వృత్తుల్లో లాగే... అనారోగ్యాల పరిణామక్రమమిది... వృత్తులో వచ్చిన మార్పులకు అనుగుణంగానే అనారోగ్య కారకాల్లోనూ, వ్యాధుల మార్పులోనూ ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాల ముందు అనారోగ్యం అంటే ఏదైనా అంటువ్యాధి రావడమో, మూకుమ్మడిగా ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయేలా మహమ్మారులు ప్రబలటమో జరిగేది. కానీ ఇప్పుడు అలాంటి కమ్యూనికబుల్ డిసీజ్ల స్థానంలో నాన్కమ్యూనికబుల్ డిసీజ్లు వచ్చి చేరాయి. ఇదీ వృత్తులకు అనుగుణంగా వ్యాధుల్లో చోటు చేసుకున్న పరిణామక్రమం. అంటే గతంలోలాగా కలరా, టీబీ, మశూచికం వంటి వ్యాధుల స్థానాలను హైబీపీ, హైకొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బులు, ఊబకాయం వంటి ఆధునిక వ్యాధులని పిలిచే నాన్కమ్యూనికబుల్ వ్యాధులు సమాజంలోకి వచ్చి చేరాయి. పైగా రెండు మూడు దశాబ్దాల కిందట ఈ నాన్కమ్యూనికబుల్ డిసీజెస్తో తొలుత అరుదుగానూ, ఆ తర్వాత అడపాదడపా డాక్టర్ దగ్గరకు వచ్చేవారు. అయితే ఇటీవల ఈ జబ్బులతో వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ. అందునా గతంలో 40 ఏళ్లకు పైబడ్డ వారిలోనే ఈ జబ్బులు కనిపించేవి. కానీ ఈ కంప్యూటర్ ఆధారిత వృత్తుల కారణంగా ఇటీవల పాతికేళ్ల నుంచి 30 ఏళ్ల యుక్తయవస్కుల్లోనూ ఈ జబ్బులు కనిపిస్తున్నాయి. మన దేశానికే కాదు... ప్రపంచానికీ నష్టం ప్రపంచవ్యాప్తంగా మరే దేశంలోనూ లేని ఒక అద్భుతమైన వనరు మన దేశానికే సొంతం. అదేమిటంటే... మన దేశంలోని 70 శాతం కంటే ఎక్కువ జనాభా 35 ఏళ్ల వయసులోపు వారే. ఇంతటి యువ జనాభా ఇక్కడ ఉన్న కారణంగా అది ప్రపంచంలోని మానవవనరుల అవసరాన్ని తీర్చుతోంది. అందుకే మన గ్లోబ్ మీద 218 దేశాలున్నా... అందులోని 185 దేశాల్లో మన దేశపు యువత ప్రపంచ మానవవనరుగా అందరికీ అందుబాటులో ఉంది. ఇది మనకు ఉన్న అద్భుత వరదాయకమైన వనరు. వరప్రదాయమైన ఈ మానవవనరును జనాభానిపుణుల పరిభాషలో ‘డెమొగ్రాఫిక్ డివిడెండ్’ అని వ్యవహరిస్తుంటారు. అయితే ఈ ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ ప్రయోజనం మనకు దక్కకపోయే ప్రమాదం చాలా ఉంది. కారణం కూర్చొని చేసే వ్యాధులు. వాటి కారణంగా ప్రబలుతున్న నాన్ కమ్యూనికబుల్ వ్యాధులైన హైబీపీ, డయాబెటిస్, హార్ట్ఎటాక్, పక్షవాతం వంటివి. అవి అకస్మాత్తుగా మనిషిని చుట్టుముట్టేసి అతడి ఉత్పాదకతను దెబ్బతీస్తున్నాయి. అంతేకాదు... ఆర్థికభారంగా పరిణమించి కుటుంబాలను కుదేలయ్యేలా చేస్తున్నాయి. ఆ డిసీజ్ బర్డెన్ సమాజానికీ చివరకు దేశానికీ భారంగా పరిణమిస్తోంది. ఇక ఈ కూర్చొని చేసే ఉద్యోగాల కారణంగా ఇప్పుడున్న వ్యాధిగ్రస్తమైన నాన్కమ్యూనికల్ డిసీజ్ల భారం అదేపనిగా కొనసాగితే ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ ప్రయోజనాలను మనం పొందేలోపే ఇప్పటి యువతరం అంతా వృద్ధాప్యదశకు చేరుకొని... ప్రస్తుత జపాన్లోలాగే మనదగ్గర కూడా వృద్ధతరం జనాభా పెరిగి పోయే ప్రమాదం ఉంది. ఇలా చూస్తే ఇది సమాజాన్నంతటినీ వ్యాధిగ్రస్తం చేసే సమస్య. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం అవసరం. డాక్టర్ పి. కృష్ణంరాజు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
బరువు పెరుగుతున్న అమెరికా
న్యూయార్క్: ప్రపంచంలో దాదాపు 200 కోట్ల మంది పెద్దలు, పిల్లలు ఎక్కువ బరువు లేదా స్థూలకాయంతో బాధ పడుతున్నారు. అంటే ప్రపంచ జనాభాలో మూడింట ఒకవంతు మంది అధిక బరువుతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, అందులో అమెరికా ప్రజలే అన్ని దేశాల కన్నా ముందున్నారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. పట్టణీకరణ, సరైన పోషకపదార్థాలు లేని ఆహారం తీసుకోవడం, వ్యాయామం లోపించడం ఇందుకు కారణాలని అధ్యయనం తేల్చింది. మొత్తం ప్రపంచ జనాభా దాదాపు 710 కోట్ల మందికాగా, వారిలో 220 మంది, అంటే వారిలో పిల్లలు ఐదుశాతం, పెద్దలు 12 శాతం అధిక బరువుతో బాధ పడుతున్నారు. అమెరికాలో 13 శాతం పిల్లలు, 35 శాతం పెద్ద వాళ్లు అధిక బరువుతో బాధ పడుతున్నారు. ఈ అధిక బరువు కారణంగా కార్డియో వాస్కులర్ వ్యాధులు వచ్చి ఎక్కువ మంది పిన్న వయస్సులో చనిపోతున్నారు. అధిక బరువుతో బాధ పడుతున్న వారిలో 40 శాతం మంది అకాల మత్యువాత పడుతున్నారని వాషింఘ్టన్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ క్రిస్టఫర్ ముర్రే తెలిపారు. స్థూలకాయం కారణంగా వారికి గుండె జబ్బులతోపాటు మధుమేహం, క్యాన్సర్ వస్తున్నాయని ఆయన తెలిపారు. అన్ని వయస్సుల గ్రూపుల్లోనూ మగవాళ్లకన్నా ఆడవాళ్లే ఎక్కువ బరువు పెరగుతున్నారు. జనాభా పరంగా చూసినట్లయితే చైనా, ఆ తర్వాత భారత దేశాలు అధిక బరువుతో బాధ పడుతున్నాయి. చైనాలో 1.53 కోట్ల మంది పిల్లలు, భారత్లో 1.44 కోట్ల మంది పిల్లలు అధిక బరువుతో బాధ పడుతున్నారు. బంగ్లాదేశ్, వియత్నాంలలో ఒక్క శాతం మంది మాత్రమే అధిక బరువుతో బాధ పడుతున్నారు. -
కడుపు కోత
బేరియాట్రిక్ సర్జరీ... బాగా లావుగా ఉన్న వాళ్లకు,ఆ స్థూలకాయం వల్ల ప్రాణహాని ఉన్నవాళ్లకు చేసే శస్త్రచికిత్సా విధానం. అందంగా ఉండటానికి చేయించుకునే చికిత్స కానే కాదిది. ఈ బేరియాట్రిక్ సర్జరీల్లో ప్రధానమైనవి కడుపు సైజ్ను కుదించే సర్జరీ, కడుపు– పేగును బైపాస్ చేసే సర్జరీ.ఆకలి తగ్గడం వల్ల, కడుపులో చోటు లేకపోవడం వల్ల, ఈ శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు చాలా మితంగానే తినగలరు. ఇక్కడివరకూ బాగానే ఉంది. లావు ఉన్న వారు ఈ పేగు, కడుపు కోతలతో జాగ్రత్త పడకపోతే, కడుపుకోత తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.ఈ కడుపుకోతల వల్ల అరుదుగానైనా కలిగే కొన్ని అనర్థాల గురించి కూడాడాక్టర్లు చెబుతున్నారు.ఈ శస్త్రచికిత్సలతో ఉన్న ప్రయోజనాలు, ప్రమాదాల గురించి అవగాహన కోసం ఈ ప్రత్యేక కథనం. మీరు లావా?... అయితే ఎంత? ఒక వ్యక్తి స్థూలకాయుడా, కాదా అని నిర్ధారణ చేయడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ) అనే ప్రమాణాన్ని ఎంచుకుంటాం. దీన్ని కొలిచే పద్ధతి ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాములలో కొలవాలి. ఆ విలువను తన ఎత్తు (మీటర్లలో) స్క్వేర్తో భాగించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 120 కిలోలు. అతడి ఎత్తు 1.7 మీటర్లు. అప్పుడు అతడి బీఎమ్ఐ విలువ... 120/1.7 ్ఠ 1.7 = 41.52 కేజీ/మీ2. విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల బీఎమ్ఐ విలువల ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గీకరణ విదేశీయులకు, భారతీయులకు వేరువేరుగా ఉంటుంది. భారతీయులలో స్థూలకాయం ఎంతంటే... భారతీయుల్లో బీఎమ్ఐ విలువ 25 – ఆపైన ఉంటే స్థూలకాయం ఉన్నట్లే. ఒకవేళ ఈ విలువ 30 – ఆ పైన ఉంటే తీవ్ర స్థూలకాయం ఉన్నట్టుగా పరిగణించాలి. స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి బీఎమ్ఐతో పాటు నడుము చుట్టుకొలత, నడుమూ–హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మొదలైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నడుము చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లు. ఇక నడుమూ–హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి. సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి శరీరంలో ఎంత కొవ్వు నిలువ ఉండాలనే అంశాన్ని (సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్ను) అనేక హార్మోన్లు నిర్ణయిస్తాయి. ఇందులో జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్లయిన గ్రెలిన్, జీఎల్పీ–1 అనేవి ప్రధానమైనవి. ఈ సెట్ పాయింట్ అనేది మన మనసు అధీనంలో ఉండదు. గ్రెలిన్ జీర్ణాశయం పైభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. ‘జీఎల్పీ–1’ అనే హార్మోన్ చిన్న పేగు చివరిభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కొంతమంది తక్కువగా తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. ఇంకొంతమంది ఎక్కువగా తింటున్నప్పటికీ సన్నగానే ఉంటారు. దీనికి కారణం... లావుగా ఉన్నవారిలో కొవ్వు సెట్పాయింట్ ఎక్కువగానూ, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్పాయింట్ తక్కువగానూ ఉంటుందన్నమాట. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కొవ్వు సెట్పాయింట్ పెరుగుతుంది. ఇది ఒకసారి పెరిగితే మళ్లీ అంత తేలికగా తగ్గదు. బరువు తగ్గించుకోడానికి మార్గాలు... అధిక బరువు (బీఎమ్ఐ 23 – 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్ఐ 25 – 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్), ఆహారంలో కొవ్వు పాళ్లు తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వేళకు తినడం, తక్కువ మోతాదుల్లో తినడం, చిరుతిండ్లకూ, కూల్డ్రింక్స్కూ, ఆల్కహాల్కూ దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువు తగ్గించుకోవచ్చు. ఇది అధిక బరువు ఉన్నవారికే గాక... అందరికీ బరువును అదుపులో ఉంచుకోడానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ప్రక్రియ. విజ్ఞతతో వ్యవహరించండి స్థూలకాయులలో నూటికి 50 మందిలో లైఫ్ రిస్క్ ఉంటుంది. వంద మందికి బేరియాట్రిక్ ఆపరేషన్స్ చేస్తే 99 మంది బతికి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు కేవలం ఒక్క శాతం మాత్రమే. దుష్ప్రభావాలను భూతద్దంలో చూస్తే ఆపరేషన్ అవసరమైన వారు కూడా భయపడి ఆపరేషన్ చేయించుకోకుండా ప్రాణం మీదికి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. బీఎమ్ఐ 30 ఆ పైన ఉంటే... బీఎమ్ఐ 30 లేదా ఆ పైన ఉంటే (అంటే తీవ్ర స్థూలకాయానికి చేరితే) కేవలం ఆహార నియమాలు, వ్యాయామం వంటి ప్రక్రియల ద్వారా బరువు తగ్గడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి వారిలో నూటికి నలుగురు మాత్రమే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో బరువు తగ్గగలరు. మిగతా 96 మంది బరువు తగ్గడంలో విఫలమౌతారు. బీఎమ్ఐ 30 – ఆపైన ఉంటే డైటింగ్, వ్యాయామాలను మొదలుపెట్టిన వెంటనే కొవ్వు సెట్ పాయింట్ను నియంత్రించే హార్మోన్లు శరీరంలో ప్రతికూల మార్పులను తీసుకొస్తాయి. ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ పెరుగుతుంది, ఆకలిని తగ్గించే జీఎల్పీ–1 హార్మోన్ తగ్గుతుంది. కాబట్టి ఆకలి పెరుగుతుంది. మెటబాలిజం తగ్గుతుంది. చివరికి ఆకలికి తట్టుకోలేక ఎక్కువగా తినేస్తారు. అందువల్ల తిరిగి బరువు పెరుగుతారు. మరి పరిష్కారం ఏమిటి...? డైటింగ్, వ్యాయామాల ప్రభావం కొవ్వు సెట్ పాయింట్ మీద అంతంత మాత్రమే. అందువల్ల బీఎమ్ఐ 30 – ఆపైన ఉన్నవారిలో... ఈ ప్రక్రియలు శాశ్వతంగా బరువును తగ్గించలేవు. బరువును నియంత్రించడానికి మందులు ఉన్నప్పటికీ వాటి పాత్ర పరిమితం. ఒకవేళ వాటిని వాడినా... ఆపివేయగానే తిరిగి బరువు పెరుగుతారు. కాబట్టి శాశ్వతంగా బరువు తగ్గడానికీ, స్థూలకాయంతో వచ్చే అనర్థాలైన గుండెపోటు, డయాబెటిస్, అధికరక్తపోటు వంటి వాటిని తగ్గించుకుని, ఆయుఃప్రమాణాన్ని పెంచుకోడానికి అనువైన మార్గం బేరియాట్రిక్ సర్జరీ. అయితే బేరియాట్రిక్ సర్జరీలను అందరికీ చేయరు. భారతీయులలో బీఎమ్ఐ 30 – ఆ పైన ఉండి, షుగర్ లాంటి జబ్బులు ఉంటే వారికి బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. షుగర్ లాంటి ఇతర జబ్బులేమీ లేకపోయినా బీఎమ్ఐ 35 – ఆ పైన ఉంటే... బేరియాట్రిక్ సర్జరీ చేయవచ్చు. ఈ పరిమితులను ఇంటర్నేషనల్∙డయాబెటిస్ ఆర్గనైజేషన్స్... ఏషియన్స్లో 32.5, 37.5గా నిర్ణయించారు. (విదేశీయుల్లో ఈ పరిమితులు 35 మరియు 40). గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఒంటి బరువు వారి ప్రాణాలకు ముప్పు తెస్తుందనుకున్నప్పుడే బేరియాట్రిక్ సర్జరీకి అర్హులవుతారు. బేరియాట్రిక్విధానాలలో రకాలు బేరియాట్రిక్ విధానాల్లో అసలు శస్త్రచికిత్స లేకుండా చేసే ‘గ్యాస్ట్రిక్ బెలూన్’ ప్రక్రియ మొదలుకొని... చిన్న గాట్లతో, లాపరోస్కోపీ విధానంలో చేసేశస్త్రచికిత్సల వరకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ట్రిక్ బెలూన్ ప్రక్రియ... గ్యాస్ట్రిక్ బెలూన్... ఎండోస్కోపిక్ ప్రక్రియ. బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయడానికి వీలు లేనివారిలో ఈ విధానాన్ని అవలంబిస్తారు. ఒక మోస్తరు స్థూలకాయ సమస్య ఉన్నవారిలో, శస్త్రచికిత్సల పట్ల విముఖత ఉన్నవారిలో, టీనేజర్లలో, పెళ్లికాని యువతులలో కూడ ఈ విధానాన్ని పరిగణించవచ్చు.ఇటీవల మృతిచెందిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు నిర్వహించిన చికిత్స ప్రక్రియ ఇది. ఈ పద్ధతిలో బెలూన్ను అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి ప్రవేశపెడతారు. ఇందులో ఆర్బెరా బెలూన్, ఓబెలాన్ బెలూన్లను జీర్ణాశయంలో ఆర్నెల్ల పాటు ఉంచుతారు. అదే స్పాట్జ్–3 అడ్జెస్టబుల్ బెలూన్ను అయితే ఏడాది కాలం పాటు ఉంచుతారు. మిథిలిన్ బ్లూ అనే నీలం రంగు మందును కలిపిన సెలైన్తో బెలూన్ను నింపుతారు. మామూలుగా గాలి నింపిన బెలూన్ లాగా ఇది పేలిపోయే అవకాశం ఉండదు. ఈ బెలూన్ నేరుగా బరువును తగ్గించదు. దీన్ని జీర్ణాశయంలో ఉంచటం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. అలా ఇది భోజనం ఎక్కువ మోతాదులో తీసుకోకుండా కట్టడి చేస్తుంది. అంతేగానీ దీని వల్ల కొవ్వు సెట్ పాయింట్లో ఎలాంటి మార్పులూ రావు. ఉంచాల్సిన వ్యవధి తర్వాత ఈ బెలూన్ను తొలగిస్తారు. అయితే ఈ వ్యవధిలో ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం లాంటి ఇతర బరువు తగ్గే ప్రక్రియలను పాటించాల్సి ఉంటుంది. బెలూన్ తీసిన తర్వాత తగ్గిన బరువు తిరిగి పెరగకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం తప్పనిసరి. అయితే నూటికి 80 మంది ఇవి పాటించకపోవడం వల్ల తిరిగి బరువు పెరిగిపోతారు. ఇలా తిరిగి బరువు పెరిగిన వారికి బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు తప్పకపోవచ్చు. ఫిట్నెస్ సమస్యల వల్ల బేరియాట్రిక్ సర్జరీలకు అర్హులు కాని వారికి బెలూన్ అమర్చి, కొంత బరువును తగ్గించాక అవసరాన్ని బట్టి బేరియాట్రిక్ సర్జరీలను చేస్తారు. అంటే ఇలాంటివారిలో బెలూన్ ప్రక్రియ బేరియాట్రిక్ సర్జరీకి ముందు ఒక వారధిగా మాత్రమే ఉపయోగపడుతుంది. వ్యవధిని మించి బెలూన్ను జీర్ణాశయంలో ఉంచితే నెమ్మదిగా అది లీక్ అయి, బెలూన్ పేగుల్లోకి జారి అడ్డం పడే అవకాశం ఉంటుంది. లీక్ కావడం మొదలైన వెంటనే మూత్రం నీలం రంగులోకి మారుతుంది. ఇలా మనకు బెలూన్ లీక్ అవుతున్నట్లు తెలుస్తుంది. వెంటనే బెలూన్ తీయించేసుకుంటే ఇతర సమస్యలు రావు. బేరియాట్రిక్ శస్త్రచికిత్సల తర్వాత బరువు తగ్గడానికి అసలు కారణం... బేరియాట్రిక్ సర్జరీలలో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, డియోడినల్ స్విచ్ వంటి అనేక ప్రక్రియలు ఉన్నాయి. వీటిని లాపరోస్కోపీ విధానంలో చేస్తారు. బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్న వారు ఆహారం ఎక్కువగా తినలేరు. కొన్ని బేరియాట్రిక్ సర్జరీల తర్వాత ఆహారం శరీరంలోకి ఇంకిపోయే ప్రక్రియ మందగిస్తుంది. నిజానికి ఈ రెండు కారణాల వల్లనే బరువు తగ్గుతారని అందరూ అనుకుంటారు. వాస్తవానికి బేరియాట్రిక్ ఆపరేషన్ల తర్వాత బరువు తగ్గడానికి అసలు కారణం... హార్మోన్లలో మార్పుల వల్ల (ఆకలిని పెంచే గ్రెలిన్ తగ్గడం, ఆకలిని తగ్గించే జీఎల్పీ–1 పెరగడం) ‘కొవ్వు సెట్ పాయింట్’ తగ్గడమే. ఈ సర్జరీల తర్వాత ఆకలి తగ్గుతుంది, మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. బేరియాట్రిక్ సర్జరీల వల్ల ఇతర ప్రయోజనాలు బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్న వారు బరువు తగ్గడమే కాకుండా డయాబెటిస్ (షుగర్), హైబీపీ వంటి సమస్యలనుంచి బయటపడే అవకాశం ఉంది. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీతో పోలిస్తే గ్రాస్ట్రిక్ బైపాస్, డియోడినల్ స్విచ్ వంటి పేగు బైపాస్ పద్ధతులలో హార్మోన్లలో మార్పులు ఎక్కువ. డయాబెటిస్ను నయం చేయడానికి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విత్ లూప్ డియోడినో–జెజునల్ బైపాస్, సింగిల్ అనాస్టమోసిస్ స్లీవ్ ఇలియల్ బైపాస్ మొదలైన ఆధునిక బేరియాట్రిక్ సర్జరీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ నూతన శస్త్రచికిత్సలను రీసెర్చ్లో భాగంగా మాత్రమే చేస్తున్నారు. స్థూలకాయం లేకపోయినా డయాబెటిస్ తీవ్రంగా ఉన్నవారికి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ విత్ డియోడినో–ఇలియల్ ఇంటర్–పొజిషన్ అనే మెటబాలిక్ సర్జరీ అందుబాటులో ఉంది. బేరియాట్రిక్ సర్జరీలతో దుష్ప్రభావాలు బేరియాట్రిక్ సర్జరీతో సాధారణంగా ఎలాంటి ప్రమాదాలు ఉండవు. తమ బరువే తమకు ముప్పుగా పరిణమించేంత ఎక్కువ బరువు ఉన్నవారికి బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు చేయకపోతేనే ప్రమాదం కాబట్టి వీటిని చేస్తారు. అయితే సాధారణ శస్త్రచికిత్సల్లో ఉండే రిస్క్లే వీటిలోనూ ఉంటాయి. ఈ ప్రమాదాల్లో కొన్ని... కొన్ని సందర్భాల్లో రక్తస్రావం అయ్యేందుకు అవకాశం ఉంది. కత్తిరించిన జీర్ణాశయం, పేగులు సరిగ్గా అతుక్కోకుండా లీకయ్యే ప్రమాదం అరుదుగా జరగవచ్చు. కానీ హైఎండ్ సాంకేతిక పరిజ్ఞానం, హైడెఫినిషన్ కెమెరాలు, అడ్వాన్స్డ్ వెసెల్ సీలింగ్ సిస్టమ్స్, హై క్వాలిటీ స్టాప్లర్లతో నిపుణులైన సర్జన్లు ఈ శస్త్రచికిత్సలు చేయడం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం చాలా అరుదు. ఆపరేషన్ అయిన మొదటి కొన్ని వారాల్లో కాళ్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం కొందరిలో ఉంటుంది. దీన్ని అడ్డుకునే మందులు (యాంటీకోయాగ్యులెంట్స్), పరికరాలు (నూమాటిక్ కంప్రెషన్ స్టాకింగ్స్) ఉపయోగించి ఈ సమస్యను నివారించవచ్చు. బరువు వేగంగా తగ్గినందువల్ల జుట్టురాలడం, అప్పటివరకు సాగిన చర్మం ముడతలు పడటం వంటి చిన్నపాటి సమస్యలు రావచ్చు. బరువు తగ్గడం ఆగిన కొంతకాలానికి ఈ సమస్యలు సర్దుకుంటాయి. బేరియాట్రిక్ శస్త్రచికిత్సల తర్వాత తొలినాళ్లలో విటమిన్లు, ఖనిజలవణాల లోపాలు రావచ్చు. అయితే వీటిని విటమిన్లు, మినరల్స్ సప్లిమెంట్ల ద్వారా అధిగమించవచ్చు. డాక్టర్ వి. అమర్ చీఫ్ కన్సల్టెంట్ మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, కాంటినెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఫిట్నెస్ పెంచే మందులు వస్తున్నాయ్
లాస్ ఏంజిలెస్: వ్యాయామం వల్ల కలిగే లాభాలతో పాటు వృద్ధులు, డయాబెటిక్ రోగుల ఫిట్నెస్ను మెరుగుపరిచే మందును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అసలు ఓపికగా ఎలా పని చేయాగలం, వ్యాయామానికి ఔషధాలు ప్రత్యామ్నాయం కాగలవా అనే అంశాలపై యూఎస్లోని సాల్క్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు పరిశోధన చేశారు. ముందుగా ఎలుకలను రెండు గ్రూపులుగా చేసి త్రెడ్మిల్పై 8వారాలు పరిగెత్తించారు. ఇందులో సాధారణ ఎలుకలు 160నిమిషాలు పరిగెత్తగా, జీడబ్ల్యూ1516 రసాయనం ఇచ్చిన ఎలుకలు 270 నిమిషాలు పరిగెత్తాయి. రసాయనం ఇచ్చిన ఎలుకల కండరాలల్లో ఎటువంటి మార్పులకు లోనుకాకపోవటంతో పాటు కొవ్వు ఎక్కువ కరగటం, బరువు పెరుగుదల నిరోధం, ఇన్సులిన్తో ఎక్కువ చర్య జరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధన ద్వారా ఎటువంటి శారీరక శ్రమ లేకుండానే ఓపికను పెంచటంతో పాటు టైప్–2 డయాబెటిస్, హృద్యోగులతో బాధపడే వారిని మందుల ద్వారా నయం చేసే అవకాశం ఉందని రోనాల్డ్ ఇవాన్స్ తెలిపారు. -
స్థూలకాయానికి సహజసిద్ధ ఔషధం
కొచ్చి: స్థూలకాయం, డిస్లీపిడీమియా (రక్తంలో లిపిడ్ల సంఖ్య పెరగడం) వ్యాధులకు శాస్త్రవేత్తలు సముద్ర కలుపు మొక్కల నుంచి సహజ సిద్ధ విరుగుడును కనుగొన్నారు. కాడల్మిన్ టీఎంఏసీఈ (కాడల్మిన్ టీఎం యాంటీపర్కొలెస్టరొలేమిక్ ఎక్స్ట్రాక్ట్)గా పిలిచే ఇది వంద శాతం సహజసిద్ధ సముద్ర బయోయాక్టివ్ పదార్థాల నుంచి తయారైన ఏకైక ఔషధమని కొచ్చిలోని కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ వెల్లడించింది. సంస్థ ఏర్పడి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా శనివారం ఈ ఔషధాన్ని విడుదల చేస్తారు. భారత సముద్ర తీరాల్లో విరివిగా లభించే, ఔషధ గుణాలున్న కలుపు మొక్కల నుంచి దీన్ని తయారుచేశారు. దీన్ని 400 ఎంజీ మాత్రల్లో తెస్తామని, ఎలాంటి దుష్ప్రభావాలు లేవని పరీక్షల్లో తేలిందని శాస్త్రవ్తేలు చెప్పారు. -
10 నిమిషాలకే.. 20 కేజీలు తగ్గాడు
బరువు తగ్గాలంటే ఎంతో తీవ్రంగా కష్టపడాలని చాలా మంది చెబుతుంటారు. కానీ అందుకు భిన్నంగా కేవలం రోజుకు 10 నిమిషాలు మాత్రమే వ్యాయామం చేసి 20 కేజీల బరువు తగ్గించుకున్నట్లు పాతికేళ్ల అమెరికన్ పాప్ సింగర్ ఎడ్ షీరాన్ తెలిపారు. రోజూ పది నిమిషాల పాటు వ్యాయామాన్ని క్రమం తప్పకుండా పాటించడమే ఇందులో ఉన్న రహస్యమని ఆయన చెప్పారు. మధ్యమధ్యలో మానేస్తూ రోజుకు గంటలు గంటలు చేయడం కంటే, ప్రతిరోజూ తప్పనిసరిగా పది నిమిషాలు చేస్తే ఫలితం వచ్చిందన్నాడు. పిజ్జాలు, బీర్లకు దూరంగా ఉండటం కూడా ఒక ముఖ్యవిషయమని వెల్లడించారు. పది నిమిషాల్లోనే మంచి ఫలితం ఇచ్చే హై ఇంటెన్సిటీ వర్కవుట్లను తన ప్రియురాలు చెర్రి సీబోర్న్ సూచించిందని తెలిపాడు. బరువు తగ్గిన తరువాత తన దుస్తులు అన్ని లూజైపోయాయాని ముసిముసి నవ్వులతో తెలిపాడు. -
వెయిట్ చేయకండి!
► స్థూలకాయం మీద వెంటనే యుద్ధం ప్రకటించండి. ► బరువు పెరిగితే జీవితం కరువే! ► లేటు చేస్తే... వేటు తప్పదు! ► ఆరోగ్యకరమైన జీవితానికి వెంటనే ఓటు వేయండి. స్థూలకాయం అంటే...? ఆరోగ్యకరమైన శరీరంలో జీవక్రియల కోసం నిత్యం అనేక పోషకాలు దహనం అవుతూ ఉంటాయి. ఇలా జీవక్రియల కోసం దహనం కాని పోషకాలు కొవ్వు రూపాన్ని సంతరించుకుని శరీరంలోని వేర్వేరు భాగాల్లో పోగుపడుతుంటాయి. ఇలా శరీరంలోని వేర్వేరు భాగాలు కొవ్వులను అనారోగ్యకరమైన రీతిలో నింపుకోవడం వల్ల శరీరం లావుగా మారడం, బరువు పెరగడం జరుగుతుంది. స్థూలకాయాన్ని కొలవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎంఐ) అనే కొలత ప్రమాణంగా ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అంటే... ఒకరి తాలూకు ఎత్తును మీటర్లలో తీసుకుని దాన్ని రెట్టింపు చేసి దానితో ఆ వ్యక్తి తాలూకు బరువును (కిలోల్లో) భాగించాలి. ఆ వచ్చినదే – బీఎంఐ. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 70 కిలోలై, అతడి ఎత్తు 1.7 మీటర్లు అనుకోండి. అప్పుడతడి బీఎంఐ = 70 కిలోలు / 1.7 మీ. ్ఠ 1.7 మీ. ఇలా వచ్చిన కొలతను బీఎంఐకు ఉన్న రకరకాల ప్రమాణాలతో పోల్చి చూసి, అతడు స్థూలకాయుడా, కాదా అన్నది నిర్ణయిస్తారు. ఈ ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించింది. పై విధంగా వేసిన లెక్కలో వచ్చిన విలువను బట్టి ఓ వ్యక్తి ఏ మేరకు స్థూలకాయుడు, స్థూలకాయం వల్ల కలిగే అనర్థం ఎలాంటిది అనే వివరాల పట్ల ఒక అంచనాకు వస్తారు నిపుణులు. ఆ వర్గీకరణ ఇలా... స్థూలకాయానికి కారణాలు జన్యుపరమైనవి: కొందరిలో జన్యుపరమైన కారణాలతోనే హార్మోన్ల పనితీరు అధికమై దేహం అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీలను తీసుకుంటుంది. ఇలా తీసుకున్న క్యాలరీలు మండించకపోవడం వల్ల కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుపోతుంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం: తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆహారం ద్వారా దేహానికి అందిన క్యాలరీలు నిల్వ చేరిపోతాయి. కూర్చుని పని చేసే వృత్తుల్లోని వారికి క్యాలరీలు నిత్యం నిల్వ చేరుతూ ఉంటాయి. దీనివల్ల స్థూలకాయం పెరుగుతుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: ఈ రోజుల్లో చాలామందిలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చోటుచేసుకుంటున్నాయి. ఉదాహరణకు అత్యధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని రాత్రి వేళల్లో తీసుకోవడం, అత్యధిక క్యాలరీలు ఉన్న పానీయాలను తాగడం... వంటివి. గర్భధారణ: సాధారణంగా గర్భధారణ జరిగిన మహిళ కొద్దిగా బరువు పెరగడం సాధారణం. అయితే కొందరు మహిళలు బిడ్డ పుట్టాక కూడా పెరిగిన బరువును కోల్పోరు. ఈ బరువు శాశ్వతంగా ఉండిపోతుంటుంది. ఇది అనర్థాలకు కారణం కావచ్చు. నిద్రలేమి: సాధారణంగా ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో హార్మోన్లలో మార్పులు వచ్చి వారి ఆకలి తీరుతెన్నుల్లోనూ మార్పులు వస్తాయి. దీనివల్ల వారు కార్బోహైడ్రేట్ ఆహారాలకు అలవాటు పడుతుంటారు. అది బరువు పెరగడానికి కారణమవుతుంటుంది. కొన్ని రకాల మందులు: కొందరిలో మరేదో అనారోగ్యానికి వాడుతున్న మందులు స్థూలకాయానికి కారణమవుతుంటాయి. ఉదాహరణకు యాంటీ డిప్రెసెంట్ మందులు, ఫిట్స్ మందులు, డయాబెటిస్ మందులు, మానసిక వ్యాధులకు మందులు, స్టెరాయిడ్స్, బీటాబ్లాకర్స్ వాడేవారిలో స్థూలకాయం రావచ్చు. కొన్ని రకాల వ్యాధులు: ప్రెడర్–విల్లీ సిండ్రోమ్, కుషింగ్స్ సిండ్రోమ్, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు కూడా స్థూలకాయానికి కారణమవుతుంటాయి. బరువు తగ్గడానికి ట్రీట్మెంట్: జీవనశైలి మార్పుతో చాలా మందిలో స్థూలకాయం అదుపులోకి వస్తుంది. కొందరిలో ఈ మార్పు సాధ్యం కాకపోవచ్చు. స్థూలకాయానికి కారణం మరేదైనా అనారోగ్యం, వాటికి వాడుతున్న మందులు అయినప్పుడు పేషెంట్ కండిషన్ను బట్టి మందులు, వైద్య ప్రక్రియల ద్వారా బరువును నియంత్రించాల్సి ఉంటుంది. అందులో... ⇒ ఆ సమస్యను అధిగమించే రీతిలో రోగి ఆహారంలో మార్పులు చేస్తూ, రోగికి తగినంత శారీరక శ్రమ ఉండేలా వ్యాయామాలను నిర్ణయించడం. ⇒ఈటింగ్ డిజార్డర్ ఉంటే దాన్ని తగ్గించడానికి అవసరమైన మందులు వాడటం. స్థూలకాయాన్ని తగ్గించడానికి శస్త్రచికిత్సే ఎప్పుడు తప్పదంటే... స్థూలకాయం ప్రాణాపాయానికి దారితీసే స్థాయికి చేరినప్పుడు... శస్త్రచికిత్స ద్వారా బరువు తగ్గించడమే ప్రత్యామ్నాయం అవుతుంటుంది. అయితే ఇది అందరి విషయంలో జరగదు. ⇒ రోగి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 40 కంటే ఎక్కువగా ఉండటం. ⇒ఒక వ్యక్తి ఉండాల్సిన ఆరోగ్యకరమైన బరువు కంటే... (పురుషుడైతే సాధారణంగా ఉండాల్సిన బరువు కంటే 45 కిలోలు ఎక్కువ ఉండటం / స్త్రీ అయితే సాధారణ బరువు కంటే 35 కిలోలు) అధికంగా ఉండటం. ⇒బీఎంఐ విలువ 35 – 40 మధ్యన ఉండి, స్థూలకాయం వల్ల వచ్చే టైప్–2 డయాబెటిస్, నిద్రలో గురకపెట్టడం (స్లీప్ ఆప్నియా), గుండెజబ్బులు వంటి ఇతర సమస్యలు కలిగి ఉండటం... ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స కొంత ఉపశమనం కలగవచ్చు. బిఎంఐ 40 దాటితే ఇతర అనారోగ్యాలేవీ లేకపోయినా సరే స్థూలకాయం కారణంగా వచ్చే అనర్థాలను నివారించడానికి బేరియాట్రిక్ వంటి శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. మెడికల్ మేనేజ్మెంట్ బరువు తగ్గడానికి వ్యాయామం, ఆహార నియంత్రణతోపాటు మందులతో వైద్య చికిత్స చేయడమూ అవసరమే. ఇది స్థూలకాయం స్థాయిని బట్టి ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్లో ఎంజైమ్ థెరపీ ద్వారా జీర్ణక్రియకు దోహదం చేసే ఎంజైమ్ల పని తీరును నియంత్రించడం, మెదడుకు అందే సంకేతాలను క్రమబద్ధీకరించడం వంటివి ఉంటాయి. స్థూలకాయంతో పాటు డయాబెటిస్ ఉన్న వారికి బరువు తగ్గడానికి కొన్ని ఇంజక్షన్లు కూడా మంచి ఫలితాన్నిస్తాయి. బరువు తగ్గడానికి అనువైన మార్గాలు ఆరోగ్యకరమైన జీవన శైలి: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వేళ తప్పకుండా భోజనం చేయడం, వ్యాయామం వంటి మార్గాలతో సహజంగా బరువు తగ్గే ప్రణాళికలు రూపొందించుకోవడం. ఇందులో భాగంగా డాక్టర్ సూచనలు, సలహాలను తప్పక పాటిస్తుండటం చాలా అవసరం. దేహం మీద అవగాహనను పెంచుకుంటూ తమ గురించి తాము తెలుసుకుంటుండాలి. సామాజిక సంబంధాలను కొనసాగించడానికి విందు ఆహ్వానాలను మన్నించాల్సిందే. అయితే ఆహారం తీసుకునే మోతాదులో విచక్షణ పాటిస్తూ, మంచి ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు వివరాలను నమోదు చేసుకోవాలి. అనర్థాలు స్థూలకాయం పరిమితికి మించి పెరిగితే, దాని వల్ల వచ్చే అనర్థాలెన్నో. మొదటి ఇబ్బంది నడకతోనే మొదలు. నడుస్తున్నప్పుడుæదేహభారాన్ని మోయడం దేహానికే కష్టమవుతుంది. అధిక బరువు వల్ల శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవచ్చు. స్థూలకాయం దీర్ఘకాలంగా కొనసాగితే డయాబెటిస్, అధిక రక్తపోటు, స్లీప్ ఆప్నియా, గుండె జబ్బులు, గాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), గాల్స్టోన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దారి తీయవచ్చు. బరువు పెరగనివ్వని ఆహారం తీసుకోవాల్సిన ఆహారం బరువు తగ్గడం అంటే కడుపు మాడ్చుకోవడం కాదు... కడుపు నిండా తింటూనే లావెక్కకుండా చూసుకోవడం. బరువు తగ్గడం అంటే నోరు కట్టుకోవడం కాదు... నోటికి రుచికరమైన ఆహారం తింటూనే స్థూలకాయం రాకుండా చూసుకోవడం. ఈసారి కాస్త తెలివినీ... ఆ తర్వాత నోటినీ ఉపయోగించండి... మీరు ఊబకాయానికి దూరం. అదెలాగో తెలుసుకోండి! శాకాహారం: ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు, ఇతర కాయగూరల్లో పోషకాలూ ఎక్కువ పాళ్లలో ఉంటాయి. అలాగే కాయగూరల్లో నీటిపాళ్లు ఎక్కువగా ఉండేవి తింటే పోషకాలు భర్తీ అవడమే కాకుండా... వాటిలోని నీటి పాళ్లు త్వరగా కడుపు నింపేలా చేస్తుంది. అందుకే పోషకాలు పుష్కలంగా అందడంతో పాటు కడుపు త్వరగా నిండిపోవడం, దాంతో తృప్తి వెంటనే కలగడం జరుగుతాయి. అదే మసాలాలతో నిండి ఉండే మాంసాహారాల విషయంలో మసాలా రుచులతో మరింత ఆహారం కడుపులోకి వెళ్లేలా ఆ రుచులు ప్రేరేపిస్తాయి. అందుకే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, కూరగాయల వంటి శాకాహారం బరువు తగ్గడానికీ, ఒంటిని తేలిక పరచుకోడానికీ ఉపకరిస్తుంది. కోడిగుడ్లు: ఉడికించిన కోడిగుడ్లు తినండి. మీకు తెలుసా... ఒకటి లేదా రెండు గుడ్లు తినగానే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇది మొదటి ప్రయోజనం. ఇక రెండోది... గుడ్డులో ల్యూసిన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఉంది. ఇది బరువు తగ్గడానికి నేరుగా ఉపయోగపడుతుంది. ఈ రెండు అంశాలనూ మీరు క్యాష్ చేసుకోవాలి. క్యాష్ బరువు మీ దగ్గరే. కొవ్వు బరువే పరార్. న్యూట్రిషనిస్టులు కోడిగుడ్డు అన్నారు కదా అని ఆమ్లెట్ జోలికి మాత్రం పోకండి. వైట్ మీట్: మాంసాహారం మీకు ఇష్టమా? తింటే బరువు పెరుగుతారని భయమా? మాంసాహారం తినండి. బరువు తగ్గండి. దీనికి చేయాల్సిందల్లా చేపలు తినడమే. చేప మాంసంలో క్యాలరీలు తక్కువ. రుచి ఎక్కువ. కొవ్వులు దాదాపు జీరో. పరిశోధనలు చెబుతున్నదేమిటంటే... వైట్మీట్ అంటే చేపలు తినేవారు చాలాకాలం ఆరోగ్యంగా బతుకుతారు. అందుకే వారంలో కనీసం నాలుగుసార్లు చేపలు తినాలన్నది న్యూట్రిషనిస్టుల సిఫార్సు. అయితే చేపలను ఉడికించి తినాలి. వేపుడుగా కాదు. ఆలివ్ నూనె: ఎవ్వరైనా ఆరోగ్య సూత్రాలు చెప్పేవారు సూచించేది ఒకటే. ఆయిల్ తక్కువగా తినమని. మీరు ఎలాగోలా ఆలివ్ ఆయిల్ అలవాటు చేసుకున్నారనుకోండి. ఇక ఆయిల్ గురించి బుర్ర స్పాయిల్ చేసుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇందులో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. అవి మంచి కొలెస్ట్రాల్ను తగ్గించకుండా, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. దాంతో గుండె పదిలం. ∙దానిమ్మ: దానిమ్మ గింజల వల్ల శరీరంలో కొవ్వును నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. దీనికి తోడు ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన రక్తనాళాల్లోని అడ్డును తొలగిస్తాయి. పండులో ఉన్న పీచు వల్ల కాసిన్ని గింజలు తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్. ఈ అంశాలన్నీ కలిసి దీన్ని కాస్త ఎక్కువే తిన్నా బరువు పెరగనివ్వవు. గుండె ఆరోగ్యాన్ని తరగనివ్వవు. పెరిగేదల్లా ఆరోగ్యమే. సూప్: సూప్ తాగే అలవాటు మనందరిలో ఇటీవల పెరిగింది. ఇటీవల పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... ప్రధాన ఆహారం ముందుగా సూప్ తాగితే... వారు ఏడాదిలో పెరగాల్సిన బరువులో ఏడు కిలోలు కోల్పోతారట. అందుకే సూప్ తాగండి. అయితే టొమాటో లాంటి వెజిటబుల్ సూప్ అయితే బెటర్ అంటున్నారు న్యూట్రిషనిస్టులు. డైలీ రొటీన్ ఇలా! ఏ టైమ్లో ఏం చేయాలంటే..? అగ్రస్థానం భాగ్యనగరానిదే!! హైదరాబాద్ నగరంలో మహిళల్లో పెరుగుతున్న బరువు మీద ఒక సర్వే నిర్వహించారు. ఇందుకోసం 830 మంది మహిళలను ఒక శాంపిల్గా స్వీకరించారు. ఇందులో 47.9% మంది మహిళలు స్థూలకాయులని తేలింది. భారతదేశంలోని మెట్రోమహానగరాలన్నింటిలోనూ స్థూలకాయం ఉన్న మహిళల సంఖ్యలో హైదరాబాద్ మొదటిది. దాదాపు సగం మంది మహిళలు స్థూలకాయంతో ఉండటం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం. స్థూలకాయాన్ని నియంత్రించి సాధారణ బరువుకు రావాలంటే రోజుకు 800 కిలో కేలరీలు అందే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. డైటీషియన్లు సూచిస్తున్న ఈ డైట్ ప్లాన్ను ఇతర అనారోగ్యాలేవీ లేకుండా స్థూలకాయం మాత్రమే ఉన్నవాళ్లు పాటించవచ్చు. అయితే హై బీపీ, డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు ఉన్న వాళ్లు డాక్టర్ సూచన మేరకు ఎవరికి తగిన డైట్ ప్లాన్ను వాళ్లు అనుసరించాల్సి ఉంటుంది. ఈ డైట్ ప్లాన్ను పాటించినప్పటికీ దేహానికి వ్యాయామం లేకపోతే స్థూలకాయం అదుపులోకి రావడం కష్టమేనంటారు వ్యాయామ నిపుణులు. కాబట్టి నడకతోపాటు వెయిట్లిఫ్ట్ వంటి వ్యాయామాలు చేసినప్పుడే దేహం బరువూ తగ్గుతుంది. కండరాలూ శక్తిమంతంగా ఉంటాయి. డా.ఎమ్. గోవర్థన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
చలికాలం అమ్మోకీళ్లు
కంట్లో నీళ్లు ఆరంభం నుంచీ వ్యాయామం లేకపోవడం, సరైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఒత్తిడి అధికమవ్వడం, అధిక బరువు / స్థూలకాయం, మహిళల్లో అయితే హార్మోన్ల ప్రభావం... ఈ అంశాలన్నీ కీళ్ల ఆరోగ్యానికి ప్రతికూలంగా పనిచేసేవేనని చెప్పుకోవచ్చు. కీళ్ల సమస్యలు... వందలాది రకాలు! నొప్పితో బయటపడే కీళ్ల వ్యాధులలో ప్రధానంగా కొన్ని వందల రకాల సమస్యలు ఉంటాయి. అయితే కీళ్లకు సంబంధించి ప్రధానంగా... కీళ్ల అరుగుదల, కీళ్ల వాతం వంటివి మనం తరచూ చూసే సమస్యలు. ఇవి నిత్యం మన సమాజంలో కనిపిస్తుంటాయి. కీళ్ల అరుగుదల (ఆస్టియో ఆర్థరైటిస్) అనే సమస్య సాధారణంగా వయసు పైబడినవారిలో కనిపిస్తుంది. కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఎవరిలోనైనా కనిపించే సమస్య. అయితే ముఖ్యంగా స్త్రీలలో ఇటీవల చిన్న వయసులోనే ఇది బయటపడుతుంది. ఇక వయసు పైబడుతున్న కొద్దీ, ఆహారపుటలవాట్లు మారుతున్న కొద్దీ, సొరియాసిస్ వంటి చర్మ సంబంధమైన వ్యాధులు సోకినప్పుడు, మహిళల్లో హార్మోన్లకు సంబంధించిన తేడాలు వచ్చినప్పుడు... అవన్నీ కీళ్ల మీద ప్రభావం చూపుతాయి. రకరకాల కీళ్ల సమస్యలకూ, కీళ్లనొప్పులకు కారణమవుతాయి. ఉదాహరణకు గౌటీ ఆర్థరైటిస్ అన్నది మాంసాహారం ఎక్కువగా తీసుకునే వారిలో, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉండేవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలా జరిగితే అనుమానించాల్సిందే..! శరీరంలోని ఏ కీలు అయినా కొన్ని నెలలుగా తీవ్రమైన నొప్పితో బాధపెడుతూ, అక్కడి కదలికలు కష్టంగా మారినప్పుడు... కాలం గడుస్తున్న కొద్దీ సమస్య తీవ్రతరమవుతున్నప్పుడు కీళ్లకు సంబంధించిన సమస్య ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. కీళ్ల అరుగుదల వల్ల మన శరీర బరువును మోసే పెద్ద జాయింట్స్పై ప్రభావం చూపుతుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇక సమస్య వల్ల చిన్న కీళ్లు ప్రభావితమైతే క్రమంగా ఆ దుష్ప్రభావం పెద్దకీళ్లకు విస్తరిస్తుంది. ఈ సమస్యను ‘రుమాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. దీన్నే ‘కీళ్ల వాతం’గా పేర్కొనవచ్చు. సమస్య నిర్ధారణ ఇలా... రోగి వయసు, వారిలో కనిపిస్తున్న లక్షణాలను పరిగణనలోకి తీసుకొని అది ఏ రకమైన కీళ్ల సమస్య కావచ్చు అన్న అంశాన్ని నిపుణులు నిర్ధారిస్తారు. కొన్ని కండిషన్స్ను అనుమానిస్తారు. వాటి నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేస్తారు. కీళ్ల అరుగుదల సమస్య నిర్ధారణ కోసం ఎక్స్–రే తీయించడం, అలాగే కీళ్ల వాతం లేదా ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్తో తలెత్తే జాయింట్ పెయిన్స్ను నిర్ధారణ చేయడానికి ఆర్.ఏ ఫ్యాక్టర్, యాంటీ సీసీపీ, ఈఎస్ఆర్, సీఆర్పీ (సీ–రియాక్టివ్ ప్రోటీన్), ఏఎన్ఏ, హెచ్ఎల్యే–బి27 వంటి రక్త పరీక్షలు అవసరమవుతాయి. నివారణలు – జాగ్రత్తలు కీళ్లనొప్పులు తొలి దశలో ఉండి... అవి మరింత ముదరకుండా చూసుకోవాలన్నా లేదా కీళ్లనొప్పులను సాధ్యమైనంత ఆలస్యం చేయాలనుకున్నా... మోకాళ్లు మడిచి బాసింపట్టు వేయకుండా ఉండటం, చక్లంముక్లం వేసుకోకుండా ఉండటం, కింద కూర్చోకుండా కుర్చీ మీదనే కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోవడం, వెస్ట్రన్ టాయ్లెట్ను వాడటం, కుదిరినంతవరకు టైబుల్పైనే భోజనం చేయడం, చిన్న చిన్న నొప్పులను తగ్గించుకునే విధంగా ఫిజియోథెరపీ చేయడం, కొన్ని మందులు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఎన్నో నొప్పులను తేలిగ్గానే నివారించుకోవచ్చు. నయం చేసుకోవచ్చు. పెరగకుండా చూసుకోవచ్చు. అవసరాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు క్యాల్షియమ్, విటమిన్–డి సప్లిమెంట్లు, రోజ్హిప్ టాబ్లెట్లు వాడితే మరికొన్ని కీళ్ల సంబంధమైన సమస్యలకు మంచి ఉపశమనం దొరుకుతుంది. నొప్పి తీవ్రతను బట్టి పెయిన్ కిల్లర్స్, జాయింట్లలో సైనో వియల్ ఫ్లూయిడ్ సప్లిమెంట్స్ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం అవసరం పడవచ్చు. కీళ్లనొప్పులు, కీళ్లు బిగుసుకుపోయినట్లుగా ఉండటం (జాయింట్ స్టిఫ్నెస్) వంటి సమస్య ఎక్కువవుతూ చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తే... వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రతించాలి. అప్పుడు వారు తగిన పరీక్షలు చేసి, ఇక చివర ప్రత్యామ్నాయంగా... కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు (జాయింట్ రీ–ప్లేస్మెంట్ సర్జరీ)లను సూచిస్తారు. ఇది మరీ ఆలస్యం కూడా చేయకూడదు. ఎందుకంటే ఇలా సర్జరీని ఆలస్యం చేయడం వల్ల ఒక్కోసారి ఆ కీళ్లు మరింతగా అరిగిపోయి రీ–ప్లేస్మెంట్ ప్రక్రియ క్లిష్టతరంగా మారే అవకాశం ఉంది. చలికాలంలో కీళ్లనొప్పులను తగ్గించుకునేదెలా? చలికాలంలో మన కండరాలు బిగుసుకుపోవడం వల్ల మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి రక్తసరఫరా ఎక్కువవుతుంది. ఫలితంగా కీళ్ల ఇంకా ఎక్కువగా నొప్పి కలుగుతుంది. ఈ తీవ్రతను తగ్గించడం కోసం ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించాలి. దాని వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ► కీళ్లను వెచ్చగా ఉంచేందుకు వార్మ్ క్లోతింగ్తో పాటు చేతులకు గ్లోవ్స్, మోకాళ్ల నొప్పులను తగ్గించడానికి ‘నీ క్యాప్’ వేసుకోవడం మంచిది. ► వింటర్లో నీళ్లు తాగడం తగ్గిపోతుంది. దాంతో డీ హైడ్రేషన్ కారణంగా నొప్పులు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ సీజన్లో ద్రవాహారం ఎక్కువగా తీసుకోవడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ► కాల్షియమ్, విటమిన్–డి సప్లిమెంట్లతో పాటు, వాపుని తగ్గించే ఒమెగా–3, ఒమెగా–6, ఒమెగా–9 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ను ఆహారంలో తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. ► తరచూ ఒంటిని సాగదీస్తున్నట్లుగా ఒళ్లు విరుచుకోవడం (స్ట్రెచింగ్) చేస్తుండటం వల్ల నొప్పులు తగ్గుతాయి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, అవసరమైతే నొప్పిగా ఉన్న కీళ్లను ఉప్పు (కళ్ళుప్పు) వేసిన గోరు వెచ్చటి నీళ్లలో కాసేపు మునిగి ఉండేలా చూడటం మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ► చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండి క్రాస్ ట్రైనర్, స్టేషనరీ సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ► జాయింట్స్ దగ్గర వాపు ఉంటే ఐస్ ప్యాక్ పెట్టడం మంచి ఉపశమనాన్నిస్తుంది. ► కండరాలు రిలాక్స్ కావాలంటే గోరువెచ్చటి నువ్వుల నూనెతో తేలిగ్గా మసాజ్ చేసుకోవడం కూడా మంచి ఉపశమనాన్నిస్తుంది. ► బరువు పెరగకుండా ఉండేందుకు ఒంటికి అవసరమైన అన్ని పోషకాలూ అందేలా సమతుల ఆహారం తీసుకోవడం అన్నది కీళ్లకూ మేలు చేస్తుంది. ► అవసరమైతే డాక్టర్ సలహా మేరకు మాత్రమే పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్ఏఐడీ ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా కీళ్లనొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యంగా ఉండేవారికి చలికాలం ఆహ్లాదకరంగానే ఉంటుంది. కానీ కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ భయాలు అధికమవుతాయి.æవారి సమస్యలు చలిపెరిగే కొద్ది తీవ్రమవుతుంటాయి కాబట్టే వారికి ఆ ఆందోళన. కీళ్లనొప్పులతో బాధపడేవారు చలికాలంలో లేదా చల్లటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు శారీరక, కీళ్ల కదలికలతో వచ్చే నొప్పుల వల్ల తాము అనుకున్నవిధంగా ప్రకృతిని ఆస్వాదించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఒకప్పుడు 70 ఏళ్లకు పైబడిన వారికి జాయింట్ పెయిన్స్ కారణంగా బాధలకు గురయ్యేవారు. అయితే ఇటీవల కేవలం నలభై ఏళ్ళ వయసులోనే నాలుగు అడుగులు వేయలేక బాధపడేవారినీ చాలా మందినే చూస్తుంటాం. అలాంటి వారంతా ఈ సీజన్లో వచ్చే తమ కీళ్ల నొప్పులకు కారణాలనూ, తగ్గించుకునేందుకు మార్గాలనూ తెలుసుకోవడం కోసమే ఈ కథనం. డాక్టర్ దశరథ రామారెడ్డి తేతలి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే అంతేనట!
న్యూఢిల్లీ: ప్రజల జీవన విధానం కారణంగా ఆహార ఆలవాట్లలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బిజీ బిజీ జీవితంలో వ్యాయామం చేయడానికి కూడా తీరికలేనంతగా అలసిపోతున్నారు. దీనికి తో్డు ఫాస్ట్ ఫుడ్ కు అలవాటుపడటం కూడా ఊబకాయానికి దారి తీస్తోంది. ముఖ్యంగా రాత్రి ఎనిమిదిలేదా ఆరుగంటల విరామం తర్వాత ఆహారం శరీర బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు సూచిస్తున్న అయిదు చిట్కాలు. 1. బ్రేక్ ఫాస్ట్ ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. సాధారణంగా పని ఒత్తిడిలో పడి ఉదయం పూట అల్పాహారం సంగతి పక్కన పెడతాం. కానీ రోజులో మనం తీసుకునే అతి ముఖ్యమైన ఆహారాన్ని తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయకూడదు. శరీర మెటబాలిజం నియంత్రణకు ఉదయం ఆహారంచాలా కీలకమైందని సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. 2. ఆహారం ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారంపై, కాలరీలపై దృష్టిపెట్టాలి. తక్కువ శాతం సుగర్, కొవ్వు ఉన్నపదార్దాలను తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా.. కొంచెం కొంచెం గా తీసుకో్వడం ద్వారా ఊబకాయాన్ని నియంత్రించవ్చని సలహా ఇస్తున్నారు. 3.ప్రతిరోజు అరగంట వ్యాయామం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఒబెసిటీ ద్వారా వచ్చిప్రమాదకరమైన వ్యాధులనుంచి బయటపడవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, గుండె జబ్బు నిరోధించవచ్చు. దీనితోపాటు అధిక రక్తపోటు, ఒత్తిడిలనుంచి కూడా ఇది సహాయం చేస్తుంది. ముఖ్యంగా నడుము, పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించుకోవడానికి వ్యాయామం అవసరం. 4. నిద్ర కంటి నిండా నిద్రకూడా శరీర బరువు నియంత్రణలో చాలా కీలకమైంది. నిద్ర లేమి అధిక బరువుకు దారి తీస్తుంది. రోజువారీ తగినంత నిద్ర శరీరానికి కావాలి. నిద్ర లేమితో బాధపడుతున్న వారు త్వరగా ఆలసిపోతారు. వ్యాయామం చేయలేనంత నీరసం ఆవహిస్తుంది. సో..రోజూ సరియైన నిద్రపోవడం అవసరం. 5. డాక్టర్ల సలహా వీటన్నింటికి మరో ముఖ్యమైన విషంయ అధిక బరువుతో బాధపడుతున్నపుడు డాక్టర్ ను సంప్రదించిన సరియైన చికిత్స తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి అపోహలు భయాలు, లేకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా అవసరమని పేర్కొంటున్నారు. -
క్యాజువల్గా చెక్ చేసినప్పుడు తెలుస్తుంది
పిల్లల్లో... వయసు పైబడ్డవారిలో, పెద్దవారిలో హైబీపీ ఉన్నట్లు వినడం సాధారణమే. అయితే మారిన జీవనశైలితో ఇటీవల చిన్నపిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. పిల్లల్లో హైబీపీ కండిషన్ రెండు విధాలుగా ఉండవచ్చు. మొదటిదాన్ని ప్రైమరీ హైపర్టెన్షన్ అంటారు. ఇలా హైపర్టెన్షన్ పెరగడానికి నిర్దిష్టమైన కారణమేమీటో తెలియనప్పుడు దాన్ని ప్రైమరీ అంటారు. ఇక బీపీ పెరగడానికి నిర్దిష్టమైన కారణం ఉన్న కండిషన్ను సెకండరీ హైపర్టెన్షన్ అంటారు. బీపీ రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. పిల్లలకు స్థూలకాయం ఉండటం, క్యాల్షియమ్ జీవక్రియల్లో మార్పులు, కుటుంబ చరిత్రలో ఎవరికైనా బీపీ ఉండటం, రెనిన్ హార్మోన్లో మార్పుల వంటివి ప్రైమరీ హైపర్టెన్షన్కు కారణం కావచ్చు. అయితే పిల్లల్లో హైపర్టెన్షన్ ఉంటే 95% నుంచి 99% మందిలో సెకండరీ హైపర్టెన్షనే అయి ఉండవచ్చు. అంటే ఇతర అవయవ సంబంధమైన వ్యాధులు (ఉదాహరణకు మూత్రపిండాల సమస్య, ఇతర మందులు, విషపదార్థాలుతీసుకోవడం, మెదడుకు సంబంధించిన రుగ్మతలు, గుండెజబ్బులు, గ్రంథులకు సంబంధించిన సమస్యలు, రక్తనాళాల సమస్యలు) ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో బీపీ ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో బీపీ ఉందని నిర్ధరించడం చాలా జాగరూకతతో చేయాలి. సరైన ఉపకరణాలతో, సరైన పద్ధతిలో, ఒకటి రెండుసార్లు పరీక్ష చేసి సెంటైల్ చార్ట్ (బీపీ కొలతలను బట్టి ఏది ఎంత తీవ్రమైనతో తెలిపే చార్ట్) ప్రకారం సరిగ్గా నిర్ధారణ చేయడం చాలా ప్రధానం. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారి పిల్లల విషయంలో మరింత నిశితంగా పరీక్ష చేయాలి. మూడేళ్లు దాటిన పిల్లలకు బీపీ తప్పనిసరిగా చూడాలి. సెంటైల్ చార్ట్లో 90వ పర్సంటైల్ ఉంటే బీపీ ఉన్నట్లు కాదు. అయితే ఈ రీడింగ్ వచ్చిన పిల్లలకు తప్పనిసరిగా ప్రతి ఆరునెలలకు ఒకసారి పరీక్ష చేయించాలి. రీడింగ్ 95-99 ఉంటే ఆ పిల్లలకు హైపర్టెన్షన్ స్టేజ్-1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్-2గా పరిగణించవచ్చు. ఈ తీవ్రతలను బట్టి అంటే... స్టేజ్-1, స్టేజ్-2లను పరిగణనలోకి తీసుకునే ఏ తీవ్రత ఉన్న పిల్లలకు ఎలాంటి చికిత్స అన్నది నిర్ధారణ చేస్తారు. సాధారణంగా స్కూల్లో ఎన్సీసీ, స్పోర్ట్స్ వంటి వాటిల్లో పాల్గొనే పిల్లలను వైద్యులు పరీక్షించినప్పుడే వాళ్లలో బీపీ ఉన్నట్లు గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా పిల్లల్లో హైబీపీ ఉన్నా దాని లక్షణాలు పెద్దగా బయటకు కనిపించకపోవచ్చు. బీపీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలతో అది బయటపడుతుంది. అవి... పెరుగుదలలో మార్పులు, తరచూ తలనొప్పి రావడం, కళ్లు తిరగడం, రక్తస్రావం, కంటిచూపులో మార్పులు, ఫిట్స్ రావడం, పిల్లలు చికాకుగా ఉండటం వంటి కొన్ని లక్షణాలను బీపీ ఎక్కుగా ఉన్న పిల్లల్లో చూడవచ్చు. ఇక నిర్దిష్ట కారణం (సెకండరీ కాజెస్)తో వచ్చే హైపర్టెన్షన్లో బీపీ వచ్చిన కారణాన్ని గుర్తించి దానికి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ప్రైమరీ హైపర్టెన్షన్ నివారణకు... స్థూలకాయం (ఒబేసిటీ) తగ్గేలా చూడటం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించడం నూనె పదార్థాలు, ఉప్పు తగ్గించడం ఏరోబిక్స్ వంటి ఆటల్లో పిల్లలు పాల్గొనేలా చూడటం...ఈ జాగ్రత్తలతో చాలావరకు తగ్గించవచ్చు. స్టేజ్-1లో ఉన్న పిల్లలకు సైతం మందులు లేకుండానే పైన పేర్కొన్న జాగ్రత్తలతో నివారించడం సాధ్యమే. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
రెండు గ్లాసుల నీళ్లతో బరువు తగ్గొచ్చు!
లండన్: భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం ద్వారా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. భోజనానికి ముందే నీరు తాగడంతో కడుపు నిండిన అనుభూతి పొందుతారని, ఆహారం తక్కువగా తింటారని తద్వారా బరువు తగ్గుతారని తేలింది. ఈ మేరకు బర్మింగ్హామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రాథమిక ఆధారాలతో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా భోజనానికి ముందు నీరు తాగేవారు మూడు నెలల్లోనే 4 కిలోల బరువు తగ్గుతారని ఈ అధ్యయనంలో తేలినట్లు లండన్కి చెందిన ‘ఒబెసిటి’ జర్నల్ ప్రచురించింది. దీని ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా బరువు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం 5–17 ఏళ్ల వయస్సున్న 268 మిలియన్ల పిల్లలు 2025 వరకు అధిక బరువుతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటి ఫెడరేషన్ హెచ్చరించింది. వీరిలో 98 మిలియన్ల మంది స్థూలకాయం బారిన పడే అవకాశముందని తెలిపింది. అయితే 2014లో ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారిలో 1.9 బిలియన్ల మంది అధిక బరువు కలిగి ఉన్నారని, వీరిలో 600 మిలియన్ల మంది స్థూలకాయులున్నారని వెల్లడించింది. -
భోజనానికి ముందు రెండు గ్లాసుల నీళ్లు!
లండన్: భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం ద్వారా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. భోజనానికి ముందే నీరు తాగడంతో కడుపు నిండిన అనుభూతి పొందుతారని, ఆహారం తక్కువగా తింటారని తద్వారా బరువు తగ్గుతారని తేలింది. ఈ మేరకు బర్మింగ్హామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ప్రాథమిక ఆధారాలతో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా భోజనానికి ముందు నీరు తాగేవారు మూడు నెలల్లోనే 4 కిలోల బరువు తగ్గుతారని ఈ అధ్యయనంలో తేలినట్లు లండన్కి చెందిన ‘ఒబెసిటి’ జర్నల్ ప్రచురించింది. దీని ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా బరువు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం 5-17 ఏళ్ల వయస్సున్న 268 మిలియన్ల పిల్లలు 2025 వరకు అధిక బరువుతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్ ఒబెసిటి ఫెడరేషన్ హెచ్చరించింది. వీరిలో 98 మిలియన్ల మంది స్థూలకాయం బారిన పడే అవకాశముందని తెలిపింది. అయితే 2014లో ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారిలో 1.9 బిలియన్ల మంది అధిక బరువు కలిగి ఉన్నారని, వీరిలో 600 మిలియన్ల మంది స్థూలకాయులున్నారని వెల్లడించింది. -
బర్గర్లు ఎందుకు బ్యాడ్ ఫుడ్ అంటే..!
బర్గర్లు, పిజ్జాలు ఆరోగ్యానికి అంత మేలు చేయవని అందరూ చెబుతుంటారు. పైగా పెరిగే పిల్లల్లో స్థూలకాయం వంటివి తెచ్చి వాళ్ల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తాయని అంటుంటారు. అయితే దీనికి కొన్ని నిర్దిష్టమైన నిదర్శనాలు ఇస్తున్నారు పరిశోధకులు. యునెటైడ్ కింగ్డమ్కు చెందిన శ్వాన్సీ యూనివర్సిటీ నిపుణులు కొన్ని తాజా అధ్యయనాల ఆధారంగా బర్గర్ల వంటివి ఎందుకు చేటు చేస్తాయో వివరిస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం... అత్యంత సూక్ష్మమైన కణాలలో కార్బన్ డయాక్సైడ్ వంటి కలుషితమైన పదార్థాల నుంచి తమను తాము శుభ్రం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ కాలుష్యాలను విజయవంతంగా హరించే ఆహార పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారన్న ది తెలిసిందే. బర్గర్లు ఇతర జంక్ఫుడ్స్లో ఈ యాంటీఆక్సిడెంట్స్ పాళ్లు గణనీయంగా తగ్గుతుంటాయి. అంతేకాదు ప్రాసెస్ చేసిన ప్రతి ఆహారంలోనూ అవి తగ్గుతూ పోతుంటాయి. దాంతో కణానికి తమను తాము శుభ్రం చేసుకునే సామర్థం అందకుండా పోతుంటుంది. ఫలితంగా కణం మరింత కాలుష్యభరితం అవుతుంటుంది. అలా కాలుష్యభరితం కావడమే క్యాన్సర్కు దోహదం చేస్తుందని వివరిస్తున్నారు ఆ పరిశోధనల్లో పాలుపంచుకున్న నిపుణుడు డాక్టర్ హసన్ హబౌబీ. -
ఒకడొచ్చి కత్తి చూపించి గణేష్ చందా అడిగాడు
హ్యూమర్ ప్లస్ వినాయక యాత్రా స్పెషల్ ‘‘మూషి బంగారం’’... డ్రైవర్ని బుజ్జగించాలనుకున్నప్పుడు వినాయకుడు ఇలాగే పిలుస్తాడు.‘‘కొండని తవ్వి ఎలకని పట్టకండి. కాలం మారింది. అయినా వుండ్రాళ్లు తినితిని ఒబెసిటీకి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యారు. ఏనుగుని మోసిమోసి ఎలుకని కాస్త చిట్టెలుకనయ్యాను. నా శ్రమని కూడా ఎవరూ గుర్తించడం లేదు. మిమ్మల్ని మోయడం గ్రాఫిక్స్ అనుకుంటున్నారు’’. ‘‘డ్రైవర్కి మరీ ఇంత వోవర్ పనికిరాదు.’’ ‘‘వోవర్ డ్యూటీ నావల్ల కాదు. క్యాబ్ బుక్ చేయండి. నేను కూడా మీతోపాటు వస్తాను.’’ కైలాసంలో చలి ఎక్కువై వినాయకుడికి భూలోకం చూడాలని కోరిక పుట్టింది. లైవ్ వెహికిల్ మూషికానికి వాట్సప్ మెసేజ్ పెట్టాడు.‘‘ఎర్న్డ్ లీవ్లో ఉన్నాను’’ అని రిప్లయ్ వచ్చింది. ‘‘లీవ్ క్యాన్సిల్. దిసీజ్ గణేష్ ఆర్డర్’’ ‘‘ఆర్డర్లు ఎక్కువైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది. మా వాహన సంఘం అధ్యక్షుడు ఆదిశేషుడు గారికి కంప్లయింట్ చేస్తా. ఆయన పడగ విప్పి కోర్టులో వాదిస్తాడు.’’ ‘‘వైకుంఠ చట్టాలు కైలాసంలో పనికిరావు. ఇక్కడ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’’. ‘‘నేను చీమని కాను ఎలకని. అయినా నందీశ్వరుడే ఈమధ్య రంకెలేసి శివయ్య మీద స్ట్రయిక్ చేశాడు. ఈశ్వరుడంతటివాడే నడవలేక టూర్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. కింద మంచు, నెత్తిన గంగ... పెద్దాయనే తడిసి ముద్దవుతున్నాడు. ‘‘మూషి బంగారం’’... డ్రైవర్ని బుజ్జగించాలనుకున్నప్పుడు వినాయకుడు ఇలాగే పిలుస్తాడు. ‘‘కొండని తవ్వి ఎలకని పట్టకండి. కాలం మారింది. అయినా వుండ్రాళ్లు తినితిని ఒబెసిటీకి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యారు. ఏనుగుని మోసిమోసి ఎలుకని కాస్త చిట్టెలుకనయ్యాను. నా శ్రమని కూడా ఎవరూ గుర్తించడం లేదు. మిమ్మల్ని మోయడం గ్రాఫిక్స్ అనుకుంటున్నారు’’. ‘‘డ్రైవర్కి మరీ ఇంత వోవర్ పనికిరాదు.’’ ‘‘వోవర్ డ్యూటీ నావల్ల కాదు. క్యాబ్ బుక్ చేయండి. నేను కూడా మీతోపాటు వస్తాను.’’ ‘‘కైలాసానికి క్యాబ్ వస్తుందా?’’ ‘‘లాభం వస్తుందనుకుంటే నరకానికి కూడా వచ్చి యముడి దున్నపోతుని కూడా రిప్లేస్ చేస్తారు. గ్లోబలైజేషన్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తప్ప ఇక దేనికీ అకౌంటబులిటీ వుండదు.’’ కుబేరుడి దగ్గర రోజువారీ వడ్డీకి అప్పు తీసుకుని క్యాబ్ బుక్ చేశాడు వినాయకుడు. ‘‘ఇన్టైంలో అప్పు తీర్చకపోతే తొండం, ఏకదంతం రెండూ లాక్కెళతా’’ అని హెచ్చరించి మరీ ఇచ్చాడు కుబేరుడు. ఎలుక ఫుల్ సూట్లో వినాయకుడి దగ్గర ప్రత్యక్షమైంది. ‘‘ఈ డ్రస్సేంటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు వినాయకుడు. ‘‘డ్రస్సుని బట్టి మన అడ్రస్ని అంచనా వేస్తారు. సూట్ని, సూట్కేస్ని గౌరవించే కాలమిది. గ్రాస్ గురించి తప్ప, మీకు గ్రాస్ రూట్స్ తెలియవు కదా’’ క్యాబ్వాడు వచ్చాడు. ‘‘ఇంత తొందరగా ఎలా వచ్చావ్?’’ అడిగాడు వినాయకుడు. ‘‘పక్కనే వైకుంఠంలో డ్రాప్ వుండింది సార్. విష్ణువు గారిని తిరుపతి నుంచి పికప్ చేసుకొచ్చా’’ చెప్పాడు డ్రయివర్.‘‘గరుడ సర్వీస్ వుందిగా?’’ ‘‘పొల్యూషన్ ఎక్కువై ముక్కుల్లో ఎలర్జీ వచ్చింది. పొడుగాటి ముక్కులుంటే ఇదే సమస్య’’ చెప్పింది మూషికం. ‘‘దేవుళ్ళకి కూడా సమస్యలొస్తాయా?’’ అడిగాడు వినాయకుడు. ‘‘మనుషులు తమ సమస్యలు చెప్పుకుని చెప్పుకుని దేవుళ్ళని కూడా సమస్యలపాలు చేశారు. ఈమధ్య బ్రహ్మకి తలపోటు ఎక్కువై ఒక తలకి అల్జిమర్స్ వ్యాధి వచ్చింది. దాంతో ఆయన మనుషుల్ని జంతువుల్ని కలగలిపి తయారుచేసేశాడు. కాంబినేషన్ మిస్ కావడం వల్ల మనిషే సాటి మనిషిని జంతువులాగా పీక్కు తింటున్నాడు’’ వివరించింది మూషికం. ‘‘అయినా అందరూ ఆయన్ని చూడడానికి తిరుపతికెళితే, విష్ణువు ఎవర్ని చూడడానికి తిరుపతికెళ్లాడు’’? ‘‘సార్ని అక్కడెవరూ గుర్తుపట్టలేదు. ఆయన విగ్రహాన్ని చూడడానికి తోసుకుని తొక్కుకున్నారు గానీ, సాక్షాత్తూ ఆయనే ఎదురై పలకరించినా ఎవరూ పట్టించుకోలేదు. హర్టయ్యి వెంటనే క్యాబ్ ఎక్కేశారు’’ చెప్పాడు క్యాబ్ డ్రైవర్. ‘‘వాళ్ళంతే, మీ బొమ్మ కనిపిస్తే దండం పెడతారు. మీరే కనిపిస్తే వేషం అనుకుంటారు’’ చెప్పింది మూషికం. జిపిఎస్ ప్రకారం భూలోకంలో దింపాడు డ్రైవర్. ఎక్కడ చూసినా తన విగ్రహాలే కనిపించేసరికి వినాయకుడికి సంతోషమేసింది. ఇంతలో జనం పాలగ్లాసులతో పోలోమంటూ పరిగెత్తుతూ కనిపించారు. ‘‘వినాయకుడి విగ్రహం పాలు తాగుతూ వుందని పరిగెత్తుతున్నారు. మీరు అడిగి చూడండి. ఒక చుక్క కూడా ఇవ్వరు’’ చెప్పింది మూషికం. ఒకరిద్దరిని ఆపి వినాయకుడు అడిగి చూశాడు. పట్టించుకోకుండా విగ్రహాల వైపు పారిపోయారు. వినాయకుడు చిన్నబుచ్చుకున్నాడు. ‘‘దేవుడు రాయే తప్ప మనిషి కాదని వాళ్ళ నమ్మకం’’ చెప్పింది మూషికం. ఇంతలో ఒక పిల్లి కనిపించి ఎలుకతో షేక్హ్యాండ్ తీసుకుని వెళ్లింది. ‘‘ప్రపంచీకరణ అంటే శత్రువులు చేతులు కలుపుకోవడం, మిత్రులు కత్తులు దూసుకోవడమే. పిల్లికి ఎలుకకి మధ్య అమెరికా వాళ్లు స్నేహ ఒడంబడికని కుదిర్చారు’’ చెప్పింది మూషికం. ‘‘అమెరికా అంటే?’’ ‘‘మీకు తెలియకుండా మిమ్మల్ని అమ్మడం.’’ ‘‘నీకింత నాలెడ్జి ఎలా వచ్చింది?’’ ‘‘క్యాట్ కోర్స్ చదివాను’’ ఒక రాజకీయ నాయకుడు కనిపించి వినాయకుడికి దండం పెట్టాడు. ‘‘షూటర్ కంటే నేను ఓటరుకే ఎక్కువ భయపడతా. మీ ఓటు నాకే’’ అన్నాడు. ‘‘నేను వినాయకుణ్ణి’’ ‘‘నేను నాయకుడ్ని. వి అంటే మీ ఇంటిపేరా?’’ ‘‘వీడు అజ్ఞానిలాగున్నాడు’’ మూషికంతో అన్నాడు వినాయకుడు. ‘‘అందుకే రాజకీయాల్లో ఉన్నాడు’’ ఒకచోట సినిమా షూటింగ్ జరుగుతూ కనిపించింది. ‘‘మూషికా, నాకు ఎప్పట్నుంచో సినిమాల్లో నటించాలని కోరిక’’ ‘‘సినిమాల్లోకంటే బయటే జనం బాగా నటిస్తున్నారు. అలా నడుస్తూ వెళితే బోలెడు సినిమాలు చూడొచ్చు.’’ ‘‘వినాయకుడు నేరుగా డెరైక్టర్ దగ్గరికెళ్లి వేషమడిగాడు. ‘‘మనుషులంతా మారువేషాలతో జీవిస్తున్న ఈరోజుల్లో వేషం అడిగావంటే నీకు ఆవేశం ఎక్కువని అర్థమైంది. మేకప్ లేకుండా వేస్తే వేషమిస్తా’’ అన్నాడు డెరైక్టర్. ‘‘ఇది మేకప్ కాదు, నాచురల్’’ ‘‘నాచురాలిటీ, తెలుగు సినిమా రెండూ వేర్వేరు విషయాలు. మాకింకా అంత మెచ్యూరిటీ రాలేదు.’’ వినాయకుడు, మూషికం నడుస్తూ వెళుతూ వుంటే ఒకాయన లాప్టాప్ చూస్తూ తనలో తాను గొణుక్కుంటూ కనిపించాడు ‘‘ఆయన జోలికెళ్లకండి. అతను కవి. కాశ్మీర్లో బుల్లెట్లు పెల్లెట్లు గురితప్పుతాయేమో కానీ ఆయన అక్షరాలు విసిరితే గురి తప్పవు. గరళాన్ని మింగిన మీ డాడీ శివయ్యే, కవి కనిపిస్తే చాలు పులి చర్మం సర్దుకుని, త్రిశూలం చంకన పెట్టుకుని నందికి కూడా చెప్పకుండా పారిపోతాడు. పార్వతి మేడం గూగుల్ సెర్చ్లో వెతికివెతికి పట్టుకుంటారు’’ వినాయకుడి చెవులు వణికాయి. దారిలో మొగుడు పెళ్లాం గొడవపడుతూ కనిపించారు. ‘‘సంసారమనేది గొడవల పడవ. మునిగినప్పుడు తేలిందనుకుంటాం. తేలినప్పుడు మునిగిందనుకుంటాం’’ అన్నాడు వినాయకుడు. ‘‘పంచ్ వేశారా స్వామీ’’ అడిగింది ఆశ్చర్యంగా మూషికం. ‘‘చిన్నప్పటినుంచి పంచె కట్టినవాణ్ణి. ఆమాత్రం పంచ్ వేయలేనా?’’ ఇంతలో ఒకడొచ్చి కత్తి చూపించి గణేష్ చందా అడిగాడు. అక్కడ్నుంచి ఇద్దరు పారిపోయి క్యాబ్ బుక్ చేసుకుని కైలాసం చేరారు. కుబేరుడి రికవరీ ఏజెంట్లు వచ్చి వడ్డీ కట్టమన్నారు. ‘‘ఓనర్కి మించిన తెలివితేటలు డ్రైవర్కి వుంటే డేంజర్. వడ్డీ కట్టేవరకూ ష్యూరిటీగా మూషికాన్ని తీసుకెళ్ళండి’’ అన్నాడు వినాయకుడు. ‘‘అన్యాయం’’ అని అరిచింది ఎలుక. ‘‘జూనియర్ ఆర్టిస్ట్ ఎక్కువ డైలాగులు చెప్పకూడదు. ఏనుగు ముందు ఎలుక ఎలుకలాగే వుండాలి.’’ ‘‘ఒక్క ట్రిప్పుకే మీకు భూలోకం బుద్ధులు వచ్చాయి’’ అని ఆక్రోశించింది మూషికం. - జి.ఆర్. మహర్షి -
'యువతకు దానిపై అవగాహన లేదు'
ఢిల్లీ: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు యువతను ఒబెసిటీ(స్థూలకాయత్వం) వైపు మళ్లిస్తున్నాయి. అయితే స్థూలకాయత్వం బారిన పడుతున్న యువత దాని దుష్పరిణామాల గురించి తెలుసుకోవడం కాదుకదా.. కనీసం తాము స్థూలకాయులం అని కూడా అంగీకరించే స్థితిలో ఉండటం లేదని తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలలోని 20 నుంచి 45 ఏళ్ల మధ్యగల సుమారు 1000 మందిపై జరిపిన పరిశీలనలో 80 శాతం మంది ఉండాల్సినదానికన్నా అధిక బరువు ఉన్నారు. అయితే వీరిలో కేవలం 20 శాతం మంది మాత్రమే తాము స్థూలకాయులం అని అంగీకరిస్తున్నారు. యువతకు ఒబెసిటీపై అవగాహనలేకపోవడం వల్ల వారు తీసుకునే ముందుజాగ్రత్తలు తగ్గుతాయని మ్యాక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ డాక్టర్ ప్రదీప్ చౌదరి వెల్లడించారు. సర్వేలో పాల్గొన్నవారిలో సుమారు 70 శాతం మందికి ఒబెసిటీతో హైపర్టెన్షన్, డయాబెటిస్ ముప్పు ఉంటుందనే విషయం తెలియదని తేలిందన్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఆల్కహాల్ యువతను స్థూలకాయులుగా మార్చుతున్నాయని వెల్లడించారు. -
స్థూలకాయంతో మరిన్ని కేన్సర్లు
వాషింగ్టన్: ఊబకాయంతో బాధపడుతున్నవారికి దుర్వార్త. అధిక బరువుతో ఇబ్బందిపడేవారికి ఇప్పటికే ఉన్న బాధలు చాలవన్నట్టు.. మరిన్ని కేన్సర్లు వచ్చే అవకాశముందని ఓ అధ్యయనం చెబుతోంది. పొట్ట, కాలేయం, పిత్తాశయం, క్లోమం, అండాశయం, మెనింగియోమా (ఒక రకం మెదడు కేన్సర్), థైరాయిడ్, రక్త కేన్సర్లు స్థూలకాయుల్ని బాధించే అవకాశం ఉంది. దీంతో గతంలో అనుకున్నదాని కంటే స్థూలకాయం మరింత ప్రమాదకరమని అధ్యయనకర్తలు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఏజెన్సీ ఫర్ కేన్సర్ రీసెర్చ్ (ఐఏఆర్సీ) పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అధిక బరువు, కేన్సర్ ముప్పునకు సంబంధించి దాదాపు వెయ్యికి పైగా అధ్యయనాలను పరిశీలించిన తర్వాత అధ్యయన కర్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 64 కోట్లమంది పెద్దలు, 11 కోట్ల చిన్నారులు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన గ్రాహం కాల్డిజ్ చెప్పారు. ‘‘స్థూలకాయం మనం ఊహించిన దానికంటే ప్రమాదకరమైనది. కొత్త కొత్త కేన్సర్లు దీనివల్లే పుట్టుకొస్తున్నాయి’’ అన్నారీయన. -
డైటింగ్ చేసినా బరువు పెరుగుతారు!
సిడ్నీ: సాధారణంగా శరీర బరువు తగ్గడానికి డైటింగ్(తినే ఆహారాన్ని తగ్గించడం) చేస్తుంటారు. అయితే, డైటింగ్ చేయడంలో సరైన పద్ధతులను పాటించకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. డైటింగ్ చేసేవారిలో వ్యాధి నిరోధక కణాల పనితీరు తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్కు చెందిన పరిశోధకులు అబిగెయిల్ పొల్లాక్ పలు పరిశోధనలు నిర్వహించారు. సరైన పద్ధతిలో డైటింగ్ చేయని వారిలో సంతృప్త కొవ్వులను శరీరం అత్యధికంగా గ్రహించుకుంటుందని ఫలితంగా శరీరం బరువు పెరుగుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. ముఖ్యంగా టి-లింఫోైసైట్లు కొవ్వులను ఎక్కువగా గ్రహించుకోవడమే దీనికి కారణం. ‘దీనికి కారణాలు తెలుసుకునేందుకు ఎలుకలపై అధ్యయనం నిర్వహించాం. దాదాపు 9 నెలలపాటు వీటికి సంతృప్త కొవ్వులను అందజేశాం. డైటింగ్ సమయాల్లో తేడా వస్తే కొవ్వు నిలిచిపోయి బరువు పెరగడం గమనించామ’ ని పొల్లాక్ వెల్లడించారు. -
ప్రీస్కూల్ ఊబకాయంతో ఖర్చు మోతెక్కుతోంది!
సిడ్నీ: ఊబకాయం.. పెద్దలకే కాదు ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా పెద్ద సమస్యగా మారింది. అయితే ఐదేళ్లలోపే పిల్లలు ఊబకాయం బారిన పడితే వారి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు దాదాపు 60 శాతం పెరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ప్రీ స్కూల్ పిల్లల్లో ఊబకాయం వల్ల శ్వాస సమస్యలు(చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినవి) తలెత్తుతాయని, దీంతో చికిత్స నిమిత్తం తరచూ వారిని ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు తెలిపారు. ఐదేళ్లలోపే ఊబకాయం బారిన పడిన దాదాపు 350 మంది పిల్లలపై పరిశోధన చేశారు. ఆ చిన్నారులకు ఇచ్చే మందులు, వ్యాధి పరీక్షల గురించి తెలుసుకోవడానికి పిల్లల వైద్యులను రీసెర్చర్స్ కలిశారు. వారిని కొన్ని ప్రశ్నలు అడిగి కొంత సమాచారం సేకరించారు. వీటి ఆధారంగా సేకరించిన సమాచారం ప్రకారం... ఐదేళ్ల పైబడిన వారితో పోలిస్తే ప్రీ స్కూల్ వయసు(ఇంకా స్కూళ్లో చేరని, చేరి కొన్ని నెలలు మాత్రమే అయిన) పిల్లల ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఎక్కువగా ఉందని నిర్ధారించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో దాదాపు 6.9 శాతం మంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అల్సన్ హేస్ తెలిపారు. -
రోజుకు 75 గ్రాములకు మించి మాంసం తినరాదు
పాఠశాలల్లో విద్యార్థుల స్థూలకాయానికి టీచర్లే బాధ్యత వహించాలంటూ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసిన చైనా అధికార యంత్రాంగం ఇప్పుడు మరో వివాదాస్పద ఉత్తర్వులను జారీ చేసింది. చైనా ప్రజలు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు రోజుకు 45 -75 గ్రాముల లోపలే మాంసాహారాన్ని తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం చైనా పౌరుడు సగటున దీనికి ఇంతకన్నా రెట్టింపు మాంసాహారాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించమని ఆదేశించింది. చైనా ‘నేషనల్ సెంటర్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్’ డైరెక్టర్ జనరల్ లీ జున్ఫెంగ్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను వాతావరణ పరిరక్షణ కార్యకర్తలతో పాటు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్, డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సమర్థించారు. ముఖ్యంగా గోమాంసం, గొర్రె మాంసాన్ని గణనీయంగా తగ్గించాలని తమ సంస్థ భావిస్తున్నట్లు జున్ఫెంగ్ తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం వల్ల చైనా పౌరుల్లో మాంసం వినియోగం 40 నుంచి 50 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచం మొత్తం మీద ప్రజలు వినియోగిస్తున్న మాంసంలో 28 శాతం మాంసాన్ని ఒక్క చైనానే వినియోగించడం గమనార్హం. మాంసానికి బదులుగా శాకాహారాన్ని తీసుకోవడం వల్ల వాతావరణంపై మాంసం ఉద్గారాలు 29 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గుతాయని ఓ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే తెలియజేస్తోంది. చైనాలో ఆవులు, గొర్రెల వల్ల ఏటా పదికోట్ల టన్నుల మిథేన్ గ్యాస్ కూడా విడుదలవుతుందని సర్వేలో అంచనా వేశారు. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ అంచనాల ప్రకారం చైనాలో 2014 సంవత్సరంలో పంది మాంసం 57,171 టన్నులు, కోడి మాంసం 18,087 టన్నులు, గోమాంసం 7,242 టన్నులు, గొర్రె మాంసం 4,449 టన్నులు ఆహారంగా తీసుకున్నారు. చైనా ప్రజలు ల్యాబుల్లో తయారుచేసే కృత్రిమ మాంసానికి మళ్లితే మంచిదని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ప్రొఫెసర్ మార్క్ పోస్ట్ సూచించారు. మాంసం తినడం వల్ల వచ్చే సమస్యలేమిటో తనకు బాగా తెలుసని, అయితే తాను కూడా మాంసం తినకుండా ఉండలేనని, అందుకనే ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తున్నానని ఆయన చెప్పారు. -
విద్యార్థుల్లో ఒబేసిటీకి టీచర్లే బాధ్యులు
బీజింగ్: అమెరికా తర్వాత పిల్లల్లో స్థూలకాయ సమస్యను ఎక్కువ ఎదుర్కొంటున్న దేశం చైనా. అందులోను ముఖ్యంగా బీజింగ్ నగరంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీన్ని అరికట్టడం కోసం ‘బీజింగ్ సెంటర్ ఫర్ డిసీస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (బీసీడీపీసీ)’ ఓ సరికొత్త స్కీమ్ను ప్రారంభించింది. పిల్లల్లో స్థూలకాయ సమస్యను అరికట్టే బాధ్యతను నగరంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల టీచర్లకు అప్పగించింది. పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్లో భాగంగా పిల్లలకు క్రమంతప్పకుండా శారీరక వ్యాయామం చేయించాలని, ఆటలు ఆడించాలని ఆదేశించింది. ఎప్పటికప్పుడు పాఠశాలల్లోని పిల్లల బరువును బేరీజు వేస్తూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటామని, పిల్లల బరువు పెరగకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పాఠశాలల్లో ఉన్నంతసేపు పిల్లలు అతిగా తినకుండా నియంత్రించడంతోపాటు అవసరమైన వ్యాయామాలు చేయిస్తామని, ఇంటికెళ్లాక ఎవరు వారిని నియంత్రిస్తారని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పిల్లలో ఇంటికెళ్లాకే మాంసం లాంటి అధిక కొవ్వున్న పదార్థాలు తింటారని, ఐస్క్రీమ్లు, చాక్లెట్లు, కుకీలు, కేక్స్, చిప్స్ తింటారని, శీతల పానీయాలు సేవిస్తారని, అలాంటప్పుడు తాము వారి అలవాట్లకు ఎలా బాధ్యత వహిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా బాధ్యత తమదేనంటూ బీజింగ్ పరిధిలోని 16 జిల్లాల పాఠశాలలకు బీసీడీపీసీ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది బీజింగ్ పాఠశాల పిల్లల్లో స్థూలకాయ సమస్య 15.6 శాతానికి పెరగడమే ఈ ఉత్తర్వులకు కారణం. అంతకుముందు ఏడాది కన్నా ఈ సమస్య 5.6 శాతం పెరిగింది. చైనా ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పెరుగుతుండడం, మొన్నటి వరకు ఒకే సంతానం నిబంధనను కచ్చితంగా అమలు చేయడం వల్ల పిల్లల్లో స్థూలకాయ సమస్య పెరిగిందని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆశ్చర్యంగా పేద వర్గాలకు చెందిన పిల్లల్లో కూడా ఈ సమస్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. చైనా బాలల్లో స్థూలకాయ సమస్య 23 శాతం ఉండగా, బాలికల్లో 14 శాతం ఉందని, అదే అమెరికాలోని బాలబాలికల్లో ఈ సమస్య 17 శాతం ఉందని వాషింఘ్టన్ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. స్థూలకాయం సమస్య చైనాలో కేవలం పిల్లలకే పరిమితం కాలేదని, మొత్తం చైనాలో నాలుగున్నర కోట్ల మంది పెద్దవాళ్లు కూడా స్థూలకాయం సమస్యతో బాధ పడుతున్నారని, 30 కోట్ల మంది మోతాదుకు మించి బరువున్నారని యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. మరి వారి సమస్యను చైనా ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.