obesity
-
ఓవర్ ఆయిల్ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?
ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఊబకాయం (obesity)పై మన దేశ ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మాట్లాడుతూ 10 శాతం వంట నూనెల వాడకం తగ్గించాలన్నారు. దీంతో ఆయిల్ వాడకం వల్ల లాభనష్టాల మాట మళ్లీ చర్చకి వచ్చింది. మనం ఎలాంటి నూనెలు వాడితే మంచిది? ఏ వయసువాళ్లు ఎంత నూనె వాడాలి? మహిళలు, పురుషులు వారి ఆరోగ్య రీత్యా వాడే నూనెలలో తేడాలుండాలా.. ఈ అంశాల గురించిన వివరణ. ప్రపంచంలో 250 కోట్ల మంది అధికబరువుతో ఉన్నారని, ఆహారంలో నూనెల వాడకం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతోందని మోదీ డబ్ల్యూహెచ్ఓ డేటాని ఉటంకిస్తూ రోజువారి ఆహారంలో తక్కువ నూనె వాడకం ప్రాముఖ్యతను వివరించారు.కుటుంబ బాధ్యతవంటల్లో నూనెని తగ్గిస్తే ఊబకాయం నుంచి బయటపడొచ్చు. వంటల్లో నూనె తగ్గించడాన్ని కుటుంబం పట్ల బాధ్యతగా తీసుకోవాలి. ఎక్కువ నూనె వాడితే గుండె సమస్యలు, షుగర్, బీపి వంటివి వస్తాయి. అలాంటి వాటి నుంచి తప్పించుకునేందుకు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసి హెల్దీగా, ఫిట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చు. ప్రమాదకరమైనవివంట నూనెల్లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం ఊబకాయానికి కారణమవుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. నూనెలోని కొవ్వు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులను పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. అధిక రక్త΄ోటు ప్రమాదం పెరుగుతుంది. చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?తగ్గించాలంటే... పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేయాలి. ఊబకాయం గురించి అవగాహన కల్పించడానికి మోదీ పదిమంది సెలబ్రిటీలను నామినేట్ చేశారు. వారిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, నటులు ఆర్.మాధవన్, దినేష్ లాల్ యాదవ్ నిరాహువా, మోహన్ లాల్, స్పోర్ట్స్ షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, గాయని శ్రేయా ఘోషల్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. అధికంగా తీసుకుంటే నష్టాలుగ్రాము నూనెలో 9 క్యాలరీలు ఉంటాయి. అధికంగా తీసుకుంటే శరీర బరువు పెరుగుతుంది. కొవ్వు అధికంగా కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు.ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న నూనెలు హాని చేస్తాయి.అసమతుల్యమైన నూనెలు తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.అధిక నూనె వాడకం ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.ఏ నూనెలు వాడాలి? సమతుల కొవ్వులు ఉండే నూనెలను వాడాలి. ముఖ్యంగా ప్రాసెసింగ్ తక్కువగా చేసిన (కోల్డ్ ప్రెస్డ్) నూనెలు ఆరోగ్యానికి మంచివి.సురక్షితమైన, ఆరోగ్యకరమైనవి: సన్ఫ్లవర్, వేరుశనగ, ఒమేగా, మొక్కజొన్న నూనె, ఆలివ్ ఆయిల్, అవిసె నూనె, కోల్డ్ ఫ్రెస్డ్ ఆయిల్లలో ప్రాసెసింగ్ తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువ. చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్తక్కువగా వాడవలసినవి: పామ్ ఆయిల్ (Palm oil) ) – అధికంగా ప్రాసెస్ అవుతుంది.వనస్పతి – ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువ స్నాక్స్ తయారీలో ఒకసారి ఉపయోగించినవి, తిరిగి వాడుతుంటారు. వీటి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. సరైన పరిమితిలో తగిన రకాల నూనెలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలే చేస్తుంది.నూనెలు మంచి క్యాలరీ సోర్స్గా పనిచేస్తాయి. వీటిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్) ఉంటాయి.ఒమేగా–3, ఒమేగా–6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.కొన్ని నూనెలలో విటమిన్–ఇ, కె, శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం, కేశాల ఆరోగ్యానికి మంచిది.కొవ్వులు శరీరంలోని వివిధ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైనవి.ఎవరు ఎంత ఆయిల్ పిల్లలు (6–19 ఏళ్లు) రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్) ఆడ–మగ ఇద్దరికీ. ముఖ్యంగా కొబ్బరి, ఆలివ్ ఆయిల్, కనోలా, నెయ్యి వంటి ఆరోగ్యకరమైన నూనెలు వాడాలి. 20 – 59 ఏళ్ల వరకు : రోజుకు 5 – 6 టీస్పూన్లు (25–30ఎం.ఎల్) ఆడ–మగ ఇద్దరికీ. ఆలివ్, కనోలా, అవకాడో, వేరుశనగ, సన్ఫ్లవర్, రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్. కొబ్బరినూనె, అవిసె నూనె రోజుకు60 ఏళ్ల.. అంతకు మించి...రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్.) ఆడ–మగ ఇద్దరికీ. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆలివ్, అవిసె, కనోలా నూనెలను వాడాలి. గర్భవతులు మాత్రం రోజూ 6–7 టీ స్పూన్ల ఆరోగ్యకరమైన నూనె వాడాలి. వాటిలో ఆలివ్, అవకాడో, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్స్ (ఒమెగా 3 ఉన్న నూనెలు) వాడాలి. -డా. జానకి, పోషకాహార నిపుణులు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆయిల్ -
ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీ
ఊబకాయం (Obesity)పై అవగాహన పెంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi) వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేశారు. ఆరోగ్య ముప్పును అరికట్టడానికి చర్యలు తీసు కోవాలని ప్రజలను ఉద్బోధించిన ప్రధాని తాజాగా ఊబకాయంపై పోరాటంలో సహాయం చేయడానికి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra), నటుడు మోహన్ లాల్ (Mohanlal)తోపాటు వివిధ రంగాలకు చెందిన 10 మందిని సోమవారం నామినేట్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉద్యమాన్ని విస్తరిస్తూ, ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని ఆయన వారిని కోరారు.As mentioned in yesterday’s #MannKiBaat, I would like to nominate the following people to help strengthen the fight against obesity and spread awareness on reducing edible oil consumption in food. I also request them to nominate 10 people each so that our movement gets bigger!… pic.twitter.com/bpzmgnXsp4— Narendra Modi (@narendramodi) February 24, 2025 దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని ఆదివారం జరిగిన మన్ కీ బాత్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రజలు ఆహారంలో తక్కువ నూనె వాడాలని, నూనె తీసుకోవడం 10 శాతం తగ్గించడంతోపాటు, ఈ చాలెంజ్ను మరో పది మందికి అందించాలని ఆదివారం తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని కోరారు. ప్రధానమంత్రి డబ్ల్యూహెచ్వో WHO డేటాను ఉటంకిస్తూ, 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ లెక్కలు చాలా తీవ్రమైనవని, ఇలాఎందుకు జరుగుతుందో మనమందరం ఆలోచించాలని పిలుపినిచ్చారు. అధిక బరువు లేదా ఊబకాయం అనేక రకాల సమస్యలు, వ్యాధులకు దారితీస్తుంది అని అన్నారు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఅలాగే దీనికి సంబంధించిన ఎక్స్లో ఒక పోస్ట్ను షేర్ చేశారు. ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహనను విస్తృతం చేసేందుకు తానుఈ క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఉద్యమం పెద్దదిగా మారడానికి ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని కూడా వారిని అభ్యర్థిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని నామినేట్ చేసిన ప్రముఖులుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహేంద్ర, ప్రముఖ నటుడు మోహన్లాల్ భోజ్పురి గాయకడు, నటుడు నిరాహువాహిందుస్తానీ, షూటింగ్ ఛాంపియన్ ఒలింపిక్ విజేత మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయ ఘోషల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి ఉన్నారు. ఈ పదిమంది ఎంతమందిని నామినేట్ చేస్తారో.. ఈ లిస్టులో ఎవరెవరు ఉంటారో చూద్దాం.! -
స్థూల భారతం.. మందుల మార్గం!
జీవన శైలిలో మార్పులు, శరీరానికి వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ వినియోగం పెరగడంతో.. మన దేశంలో స్థూలకాయుల సంఖ్య ఏటేటా మరింతగా పెరిగిపోతోంది. ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)’2022 ప్రకారం ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు 8 కోట్ల మంది ఇప్పటికే స్థూలకాయుల కేటగిరీలోకి చేరగా.. మరో 3 కోట్ల మంది వయోజనులు పొట్ట చుట్టూ అధిక కొవ్వు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్టు అంచనా. ఒబేసిటీ అత్యధికంగా ఉన్న టాప్–10 దేశాల జాబితాలోకి భారత్ కూడా చేరిపోయింది. దీంతో అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. ఇప్పటికే బరువు తగ్గించే పలు రకాల మందులు మార్కెట్లో ఉండగా.. మరికొన్ని ఔషధాలు మన మార్కెట్లోకి రానున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్మూడింతలు పెరిగిన మార్కెట్.. ఒబేసిటీ చికిత్సలో ఉపయోగించే ఔషధాలను జీఎల్పీ–1 (గ్లూకగాన్ తరహా పెప్టైడ్ రిసెప్టర్ ఎగోనిస్ట్స్)గా వ్యవహరిస్తారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని నియంత్రించే హార్మోన్లుగా పనిచేస్తాయి. పొట్ట నిండుగా ఉన్నట్లుగా మెదడుకు సంకేతాలు పంపించి, పొట్ట ఖాళీ అయ్యే ప్రక్రియను నెమ్మదింపజేసి, బరువు తగ్గించుకునేందుకు తోడ్పడతాయి. అంతర్జాతీయంగా యాంటీ–ఒబేసిటీ ఔషధాల అమ్మకాలు 2024లో సుమారు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా... 2035 నాటికి 105 బిలియన్ డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. మన దేశంలోనూ బరువు తగ్గించే మందులకు డిమాండ్ పెరుగుతోంది.2020 నవంబర్లో వీటి అమ్మకాలు రూ.137 కోట్లుగా ఉంటే.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరాయి. అంటే సుమారు 290 శాతం పెరిగింది. ఒబేసిటీ సర్జరీ సొసైటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం బరువు తగ్గేందుకు చేయించుకునే సర్జరీలు 2004లో సుమారు 200 మాత్రమేకాగా... 2019 నాటికి ఏకంగా 100 రెట్లు పెరిగి 20,000కు చేరుకున్నాయి. స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో హైపర్టెన్షన్, మధుమేహం, కాలేయ వ్యాధులు వంటి సమస్యలూ వస్తాయి. వీటి చికిత్సల్లో ఉపయోగించే ఔషధాలకూ డిమాండ్ పెరిగిపోతోంది.ఖరీదైన వ్యవహారంగా చికిత్స..యాంటీ–ఒబేసిటీ చికిత్స ఆషామాషీ వ్యవహారం కాదని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ఈ చికిత్సలకు నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చవుతుందని అంటున్నారు. ఈ ఔషధాలను దీర్ఘకాలంపాటు తీసుకుంటేనే ఫలితాలు కనిపిస్తాయని, మధ్యలో ఆపేస్తే అప్పటిదాకా చేసినదంతా వృథా అవుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు ఒకే మందు అందరికీ పనిచేయదని... శరీరతత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకం ఔషధం వాడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.ఇక యాంటీ ఒబేసిటీ మందులతో కొన్ని దుష్ఫలితాలకూడా వచ్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. కొన్నిరకాల ఔషధాలను దీర్ఘకాలం ఉపయోగిస్తే ఇతర దు్రష్పభావాలు తలెత్తవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. అయినా మన దేశంలో యాంటీ ఒబేసిటీ ఔషధాల వినియోగం పెరుగుతోంది. సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్, ఒర్లిస్టాట్, టిర్జెప్టైడ్ వంటి ఫార్ములాల ఆధారిత ఔషధాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.అంతర్జాతీయ కంపెనీల కన్ను.. భారత్లో బరువు తగ్గే మందులకు డిమాండ్ నెలకొనడంతో.. అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు మన దేశంపై దృష్టి పెడుతున్నాయి. డెన్మార్క్ కంపెనీ నొవో నోర్డిస్క్కు చెందిన ఓరల్ సెమాగ్లూటైడ్ ట్యాబ్లెట్ రైబెల్సస్ను 2022లో దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టగా.. అది 65 శాతం యాంటీ–ఒబేసిటీ మార్కెట్ను ఆక్రమించింది. దీంతో సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్లను కూడా భారత్లో ప్రవేశపెట్టేందుకు ఆ కంపెనీ కసరత్తు చేస్తోంది. వెగోవీ, ఒజెంపిక్ వంటి ఔషధాల వినియోగం కూడా మనదేశంలో భారీగానే ఉంటోంది. మరింత బాగా పనిచేస్తా యని పేరుండి.. మన దగ్గర విక్రయించని కొన్ని ఔషధాలను అనధికారిక మార్గాల్లో తెప్పించుకునే ధోరణి కూడా పెరుగుతోంది. ఇక అమెరికాకు చెందిన ఎలై లిల్లీ కంపెనీ సైతం టిర్జిప్టైడ్ ఆధారిత మౌంజారో ఔషధాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మన దేశీయ కంపెనీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. గ్లెన్మార్క్ ఇప్పటికే లిరాగ్లూటైడ్ జనరిక్ వెర్షన్ను ప్రవేశపెట్టగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా తదితర కంపెనీలు పేటెంట్ ముగిసిన జీఎల్పీ–1 ప్రత్యామ్నాయాల మీద పని చేస్తున్నాయి. సన్ ఫార్మా కూడా ఈ విభాగంలో కొత్త మాలిక్యూల్పై పరిశోధన చేస్తోంది. -
వంట నూనెని తీసుకోవడం తగ్గించండి..!: ప్రధాని మోదీ విజ్ఞప్తి
శారీరక శ్రమ లేకపోవడం, జంక్ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లు, జీవనశైలి తదితరాలే ఊబకాయం సమస్యకు కారణం అని అంతా చెబుతుంటారు. కానీ ప్రధాన కారణం వంట నూనె అట. సాక్షాత్తు ప్రధాని మోదీనే అన్నారు. ఆయన ఎందుకిలా పిలుపునిచ్చారు..? ఊబకాయం సమస్యకి వంటనూనె కారణమా..? తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.దయచేసి అందరూ ఇళ్లల్లో వంటనూనె వినియోగాన్ని తగ్గించండి ఇదే ఊబయకాయం రావడానికి ప్రధానం కారణం అంటూ పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. న్యూఢిల్లీలో జరిగిన 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వంటనూనె అధిక వినియోగమే ఊబకాయం సమస్యకు ప్రధాన కారణం అని అన్నారు. దేశంలోని అన్ని వయసుల వారు, ముఖ్యంగా యువత ఈ సమస్య బారినపడుతున్నారని అన్నారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ ఊబకాయం మధుమేహం, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదాన్ని పెంచుతోందన్నారు. రోజువారీగా వ్యాయమం చేయడం, సమతుల్య పోషకాహారంపై దృష్టిపెట్టడం తోపాటు నూనె తీసుకోవడం తగ్గించాలని ప్రజలకు సూచించారు మోదీ. "మన ఇళ్లల్లో నెల ప్రారంభంలో రేషన్ వస్తుంది. ఇప్పటి వరకు ప్రతినెల రెండు లీటర్ల వంట నూనె ఇంటి తీసుకొచ్చినవారు దానిని కనీసం 10%కి తగ్గించండి." అని కోరారు మోదీ. మరి దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. మణిపాల్ ఆస్పత్రిలోని డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ కుమార్ సైతం వంట నూనెని తగ్గించాలన్నారు. అధిక బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీసే కడుపు నిండిన అనుభూతిని కలిగించకుండా చేసేది వంటలో ఉపయోగించే అదనపు నూనె అని అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి నెలకు 600-700 ఎంఎల్ కంటే ఎక్కువ తినకూడదని చెప్పారు. అంటే రోజుకి సుమారు నాలుగు టీస్పూన్లకు మించి వాడకూడదని అన్నారు.మరో డాక్టర్ అనూప్ మిశ్రా మాట్లాడుతూ..సాధారణంగా ప్రజలు సిఫార్సు చేసిన నూనెకి మించి అధికంగా నూనెని వాడతారు. కొందరూ ఫ్రై చేసిన నూనెని తిరిగి వినియోగిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఆహార పదార్థాలు వేయించడానికి ఉపయోగించిన నూనెని తిరిగి ఉపయోగించడం వల్ల ట్రాన్స్-ఫ్యాట్స్ పెరుగుదలకు దారితీస్తుంది. ఇవి గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక నూట్రిషన్లు నూనె పరిమాణం తోపాటు నూనె నాణ్యత కూడా ముఖ్యమేనని అన్నారు. ముఖ్యంగా ఆవాల నూనె, వేరుశెనగ నూనె వంటకు చాలామంచివని చెప్పారు. అలాగే మిశ్రమ నూనెల కలయిక కూడా చాలామంచిదని చెప్పారు. ఉదాహారణకి వేరుశెనగ, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, బియ్యం ఊక నూనెల మిశ్రమంగా వాడటం కూడా మంచిదని అన్నారు. ఇక ఆర్థిక సర్వే 2023-2024 అనారోగ్యకరమైన ఆహారం,ఎక్కువగా కూర్చొనే అలవాట్లు మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొంది. అంతేగాదు ఇది దేశ ఆర్థిక సామర్థ్యానికి ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. శతాబ్దాలుగా మన భారతీయ సాంప్రదాయ ప్రకృతి, పర్యావరణానికి అనుకూలంగా ఆరోగ్యంగా, సామరస్యంగా ఎలా జీవించాలో చూపించాయి. దానికి అనుగుణంగా భారతీయ వ్యాపారాలు ఉండాలి. ప్రపంచ మార్కెట్ని ఉపయోగించుకోవడానికి బదులుగా నడిపించేలా భారతీయ వ్యాపారాలు ఉండాలి. అంటే ఆరోగ్యానికి పెద్దపీటవేసేలా సాగితే.. అన్ని విధాల శ్రేయస్కరం, ప్రగతి పథం కూడా అని అన్నారు ప్రధాని మోదీ. (చదవండి: -
అది ఒబెసిటీ కాదట..!15 ఏళ్ల తర్వాత..
ఇన్నాళ్లుగా అనుకున్నట్లుగా ఒబెసిటీ అంటే అది కాదట. దశాబ్దాలు అలానే తప్పుగా భావించమని తేల్చి చెప్పారు వైద్యులు. అసలు ఒబెసిటీ అంటే ఏంటో..అందుకు సంబంధించిన సరికొత్త మార్గదర్శకాలను అందించారు నిపుణులు. మరీ ఒబెసిటీ అంటే ఏంటంటే..దశాబ్దాలుగా వైద్యులు ఊబకాయాన్ని(obesity) కొలవడానికి బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)(body mass index (BMI))సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బీఎంఐ అనేది వ్యక్తి బరువును కిలోగ్రాముల్లోనూ, ఎత్తు చదరుపు మీటర్లలో భాగించగా వచ్చిన దాన్ని శరీర కొవ్వు కొలతగా నిర్వచించేవారు. దీంతో బీఎంఐ 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణించారు. అయితే కొందరిలో మాత్రం అధిక శరీర కొవ్వు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ 30 కంటే ఎక్కువ బీఎం ఉండదు. అలాంటప్పుడూ రాబోయే ఆరోగ్య ప్రమాదాలు గుర్తించలేమని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ప్రస్తుత జనాభా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. అలాంటప్పుడు కాలం చెల్లిన బీఎంఐలతో బరువు, ఎత్తు నిష్పత్తిలతో అంచనా వేస్తే సరిపోదని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ ఒబెసిటీకి సరికొత్త నిర్వచనాన్ని మార్గదర్శకాలను అందించింది. అవేంటంటే..ఊబకాయం అనే అధిక శరీర కొవ్వు. ఇది అనేక వ్యాధులకు కారణమయ్యే దీర్ఘకాలిక వ్యాధి. అలాగే ఇక్కడ బీఎంఐ అనేది శరీర కొవ్వును అతిగా లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. అంతే తప్స స్పష్టమైన అంచనా మాత్రం ఇవ్వదు. అందుకని ఈ ఊబకాయాన్ని దీర్ఘకాలిక వ్యాధికి సరిగ్గా సరిపోయేలా అనారోగ్య స్థితిగా నిర్వచించారు. ఇది అవయవాలు, కణజాలల పనితీరుపై నేరుగా ప్రభావం చూపే అధిక కొవ్వుగా పరిగణించారు. దీన్ని బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ లేదా డీఈఎక్స్ఏ స్కాన్లు వంటి ప్రత్యేక యంత్రాలతో కచ్చితంగా నిర్థారించగలమని అన్నారు. అయితే ఇవి ఖరీదైనవి కావడంతో క్లినిక్లలో అందుబాటులో లేవు. ఇక ఊబకాయం ఉన్నవారికి శరీరంలో కొవ్వు ఎక్కడ పేరుకుపోయిందనేది ముఖ్యమట. అంటే బొడ్డు చుట్టూ ఉంటే ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాలు బెల్లీఫ్యాట్(Belly Fat)ని తీవ్రమైన ఒబెసిటీ పరిగణించమని చెబుతోంది. అలాగే ఆయా వ్యక్తులకు మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది కూడా పరిగణలోనికి తీసుకోవాలట. కొత్త మార్గదర్శకాల్లో ఒబెసిటీని రెండు దశల్లో వర్గీకరించారు. దశ1: అవయవ పనితీరుపై లేదా సాధారణ రోజువారీ కార్యకలాపాలపై స్పష్టమైన ప్రభావాలు లేకుండా పెరిగిన కొవ్వు (BMI > 23 kg/m². ఈ దశ ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు చూపించకపోయినా..భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందట. దశ2: బీఎంఐ 23 కిలోలు/మీ2 కంటే ఎక్కువ ఉండి, పొట్ట చుట్టూ కొవ్వు, అధిక నడుము చుట్టుకొలత ఉంటే దీన్ని ఊబకాయంగా పరిగణిస్తారు. ఇది శారీరక అవయవ విధులను ప్రభావితం చేస్తుంది. టైప్2 డయాబెటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఈ మార్గదర్శకాలను అక్టోబర్ 2022 నుంచి జూన్ 2023 వరకు ఐదు సర్వేలు నిర్వహించి మరీ అందిచినట్లు నిపుణుల చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అందించిన ఈ మార్గదర్శకాలు ఆచరణాత్మకమైనవి, అలాగే ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి నివారించడానికి ఉపయోగపడతాయని చెప్పారు.(చదవండి: 32 ఏళ్లు ద్వీపంలో ఒంటరిగా బతికాడు! సడెన్గా జనాల్లోకి తీసుకురాగానే..) -
రక్తపోటు.. గుర్తించకపోతే స్ట్రోక్ ముప్పు
రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి జబ్బులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. ఈ సమస్యలు కిడ్నీ, మెదడు, గుండె సంబంధిత పెద్ద జబ్బులకు ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 4.58 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. వీరిలో 1.17 కోట్ల మంది రాష్ట్రాల ఆరోగ్య శాఖ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో మందులు, చికిత్సలు అందుకుంటున్నారు. రక్తపోటు.. హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు అమెరికాలోని 27,310 మంది పెద్దల ఆరోగ్య రికార్డులను 12 ఏళ్లకు పైగా పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల సగటు వయస్సు 65 ఏళ్లుగా ఉంది. – సాక్షి, అమరావతి10 కంటే ఎక్కువైతే 20% ప్రమాదం రక్తపోటు సగటు కంటే ఎక్కువయ్యే కొద్దీ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. రక్తపోటు సగటు కంటే 10 ఎంఎం హెచ్జీ ఎక్కువగా ఉన్న వారిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ప్రమాదం 31 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. 31 నుంచి 67 శాతం ఎక్కువ ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఐదేళ్లు అధిక రక్తపోటు సమస్యతో బాధపడిన వ్యక్తులు స్ట్రోక్ బారిన పడేందుకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించారు. ఆరు నుంచి 20 ఏళ్ల పాటు రక్తపోటు సమస్య ఉన్న వ్యక్తుల్లో 50 శాతం, రెండు దశాబ్ధాలుపైగానే సమస్యతో బాధపడే వ్యక్తుల్లో 67 శాతం ఎక్కువగా స్ట్రోక్కు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు రక్తపోటు సంబంధిత లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు, చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంచుకుంటే జీవితకాల వైకల్యం ముప్పు తప్పుతుందన్నారు. ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేకుండానే కొందరిలో రక్తపోటు చాప కింద నీరులా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తరచూ రక్త పోటు పరీక్షలు చేయించుకుంటూ, ఉండాల్సినదాని కంటే ఎక్కువ రికార్డు అయితే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలిలో మార్పు రావాలి ఆహారం, నిద్ర, జీవన శైలిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాయామాన్ని రోజువారి దినచర్యలో ఓ భాగం చేసుకోవాలి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఒత్తిడిని దరి చేరనివ్వకుండా చూసుకోవాలి. ప్రస్తుతం స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. – డాక్టర్ బి.విజయ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ -
ఉప్పెనలా ఊబకాయం
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన 3వ తరగతి విద్యార్థి 46 కిలోల బరువు ఉన్నాడు. జంక్ఫుడ్ అతిగా తినడంతోనే బరువెక్కినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మిగతా విద్యార్థులతో సమానంగా క్రీడల్లో పాల్గొనలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊబకాయం కారణంగా చలాకీతనం కోల్పోయాడని అంటున్నారు.రెండు వారాల క్రితం తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థి బస్సులో ప్రయాణిస్తూ.. పుట్టపర్తి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు సాయం చేసి.. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు నిర్ధారించారు. ఊబకాయమే సమస్యకు కారణమని వైద్యులు తేల్చారు. బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నారంటారు. కానీ అధిక భారం అలాగే కొనసాగితే వారికి వారే భారం కావడం ఖాయం. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమూ ఉంది. జీవనశైలిలో మార్పుల కారణంగా భవిష్యత్తులో ఊబకాయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాక్షి, పుట్టపర్తి: ఊబకాయం.. ప్రతి వందలో 20 మందిని తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య. శారీరక వ్యాయామం తగ్గటం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి విధానంతో ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఊబకాయులుగా మారుస్తోంది. బాల్యంలోనే ఊబకాయం వస్తే చలాకీతనం కోల్పోతారు. చిన్న వయసులోనే అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతారు. వయసుకు తగిన బరువు ఉంటే చాలని.. అధిక బరువు అనర్థాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయల్లో సమస్యలు ఇవే.. ∙ఊబకాయం ఉన్న పిల్లలు సహచరుల నుంచి తరచూ అవహేళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా డిప్రెషన్కు లోనయ్యే ప్రమాదం ఉంది. » ఊబకాయం ఉన్న పిల్లలు చలాకీతనం కోల్పోవడం కారణంగా క్రీడల్లో రాణించలేరు. కనీసం అవకాశాలు రావడం కూడా కష్టమే. » అందరితో పాటు వ్యాయామం చేయాలనుకున్నప్పటికీ.. కాసేపటికే అలసిపోతారు. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతారు. » మానసిక ఒత్తిడి కారణంగా చదువులో వెనుకబడే అవకాశం ఉంది. విద్యలో ఉన్నత స్థానాలకు వెళ్లడం కష్టమే. » టీనేజీలోకి వచ్చేసరికి మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఫలితంగా అందరిలో కలవకుండా ఒక్కరే ఉండేందుకు ఇష్టపడతారు. » ప్రీ డయాబెటిస్, హైపర్టెన్షన్ చిన్న వయసులోనే దరి చేరుతాయి. ఫలితంగా జీవితాంతం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన పరిస్థితి. » ఊబకాయం కారణంగా స్కిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా సోకే ప్రమాదం ఉంది. ఊబకాయం ఇలా..» జంక్ఫుడ్, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, పిజ్జా, బర్గర్, నూడిల్స్ తినడం కారణంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. » జంక్ఫుడ్ టేస్ట్ డిఫరెంట్గా ఉండటంతో ఎక్కువ మోతాదులో తీసుకుని బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. » కదలిక లేని జీవన విధానంతో బరువు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. బిజీ షెడ్యూల్లో చాలామంది నడవడం తగ్గించి వాహనాలను వినియోగిస్తున్నారు. » టీవీ, సెల్ఫోన్ చూస్తూ.. మోతాదుకు మించి భోజనం తినేస్తున్నారు. ఫలితంగా మనిషి సాధారణం కంటే బరువు పెరిగే అవకాశం ఉంది. » తల్లిదండ్రులు ఊబకాయులైనా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చాయి. జన్యుపరమైన కారణాల రీత్యా కూడా ఊబకాయం రావచ్చని అంటున్నారు.ఇలా చేస్తే మేలు.... » జంక్ఫుడ్ను వీలైనంత వరకు తగ్గించాలి » టీవీ, సెల్ఫోన్ చూసే సమయం తగ్గించాలి » క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి » తల్లిదండ్రులు శ్రద్ధతో పిల్లలతో వాయింగ్ చేయించాలి »ఊబకాయం ఉన్న పిల్లలను రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించాలి వ్యాయామం తప్పనిసరిఊబకాయం ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారంలో రెండు , మూడుసార్లు జంక్ఫుడ్ తింటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారం తినడమూ కారణంగా చెప్పవచ్చు. పిల్లల బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా వాకింగ్కు తీసుకెళ్లాలి. జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకర ఆహారం తీసుకునేలా చేయాలి. – డాక్టర్ ప్రతాప్, హిందూపురం జీవనశైలి మార్పులతో.. జంక్ ఫుడ్ బదులు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. నిత్యం వ్యాయామం చేయలేని వారు ఇతర మార్గాల్లో శారీరక బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవతలి వ్యక్తి అవహేళన చేసినప్పుడు డిప్రెషన్కు లోను కాకూడదు. పిల్లల బరువు తగ్గే విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం. జీవన శైలిలో మార్పులతో ఊబకాయం నుంచి బయట పడవచ్చు. – డాక్టర్ రాజశేఖర్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ -
హై రిస్క్ ప్రెగ్నెన్సీ?!
నేనిప్పుడు ప్రెగ్నెంట్ని. రెండో నెల. తొలి చూలు. బరువు 110 కేజీలు ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఊబకాయం ఉంది. డాక్టర్ను సంప్రదిస్తే బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అలా కాకుండా ఏమి చెయ్యాలి. కొన్ని మందులు రాశారు. అవి వాడొచ్చా? – మనీషా, బెంగళూరుకాళ్లల్లోని డీప్ వీన్స్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే చాన్స్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ)అంటారు. ఈ క్లాట్ కనుక రక్తనాళాల్లోకి వెళ్తే చాలా ప్రమాదం. ఇవి కొంతమందికి ఊపిరితిత్తులు, గుండెలోకీ మూవ్ అవుతుంటాయి. బ్లడ్ థిక్ కావడం వల్ల ఈ క్లాట్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొంతమందిలో ఇతరత్రా మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నెమ్మదిగా రక్తప్రసరణ జరుగుతుంది. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటే, రక్తం చిక్కనవుతుంది. జనరల్ సర్జరీ తర్వాత కూడా శరీరంలో ఈ ప్రోటీన్స్ పెరుగుతాయి. వీటన్నిటి దృష్ట్యా.. కొంతమందికి ప్రెగ్నెన్సీ తొలి వారల్లోనే బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వారికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అధిక బరువు అంటే, బాడీ మాస్ ఇండెక్స్ 35 లేదా అంతకంటే ఎక్కువ, వయసు 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, వ్యక్తిగతæ లేదా ఫ్యామిలీ హిస్టరీలో బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్ ఉన్నవారు, ఏపీఎల్ఏ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నవారు, సివియర్ వెరికోస్ వీన్స్ ఉన్నవారు, బెడ్ రెస్ట్లో ఉన్నవారికి ఈ రిస్క్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు కాలులో నొప్పి , వాపు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పి వంటివి ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా వెంటనే ఎమర్జెన్సీ డాక్టర్ని కలవాలి. లంగ్ స్కాన్, లోయర్ లింబ్ డాప్లర్ స్కాన్ ద్వారా క్లాట్స్ని కనిపెడ్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించి.. కాళ్లల్లో క్లాట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇంట్లో, ఆఫీసులో ఒకే చోట కూర్చోకుండా, గంటకు ఒకసారి అయిదు నిమిషాలు వాకింగ్ చేయాలి. మంచం మీద పడుకున్నప్పుడు కూడా మోకాళ్లు, కాళ్లు కదుపుతూ ఉండాలి. తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. రిస్క్ జోన్లోఉన్నవారికి వీటితో పాటు రిస్క్ అసెస్మెంట్ చేసి, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్రెషన్ స్టాకింగ్స్ లాంటివి కూడా బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ థిన్ కావడానికి ఏ్ఛp్చటజీn జీn్జ్ఛఛ్టిజీౌnటఅనేవి ఉంటాయి. డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తారు. డైలీ తీసుకోవాలి. వీటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. వీటి వలన బ్లడ్ క్లాట్ రిస్క్ బాగా తగ్గుతుంది. ఇవి గర్భస్థ శిశువుకేమీ ప్రమాదం కలిగించవు. -
ఊబకాయంతో గుండెకు ముప్పు
ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి... అన్ని వయసుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వెరసి కొన్ని అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇందులో ఊబకాయం కూడా ఆ కోవకు చెందినదే. వివిధ జబ్బులకు కారణమవుతున్న ఈ సమస్య మరణాల ముప్పును కూడా పెంచుతోంది. ఊబకాయుల్లో గుండె జబ్బుల మరణాలు గడచిన రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగినట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. 1999 నుంచి 2020 నాటికి ఊబకాయంతో ముడిపడి ఉన్న గుండె జబ్బుల మరణాల రేటు సుమారు 180 శాతం పెరిగినట్టు నిర్ధారించారు. పురుషుల మరణాల రేటులో పెరుగుదల అధ్యయనంలో భాగంగా ఊబకాయ సంబంధిత ఇస్కిమిక్ గుండె జబ్బుతో ముడిపడిన 2.26 లక్షల మరణాలపై పరిశోధన నిర్వహించారు. 1999లో ప్రతి లక్ష మంది పురుషుల్లో 2.1గా మరణాలు రేటు ఉన్నట్టు గుర్తించారు. ఇది 2020నాటికి 243 శాతం పెరిగి 7.2కు చేరుకున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా మహిళల్లో 1999లో ప్రతి లక్ష మందికి 1.6గా ఉన్న మరణాల రేటు... 131 శాతం పెరిగి 2020 నాటికి 3.7కు చేరుకుంది. అధ్యయనంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఇస్కిమిక్ హార్ట్ స్ట్రోక్కు ఊబకాయం తీవ్రమైన ప్రమాదకారిగా నిర్ధారించారు. బరువు పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బుల ప్రమాదం వృద్ధి చెందుతోందని అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ అలీనా మోహ్సిన్ తెలిపారు. ఏమిటీ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ గుండెకు రక్తం సరఫరాలో ఏర్పడే ఇబ్బందిని ‘ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్’ అంటారు. దీనికి పొగతాగడం, బీపీ, షుగర్, రక్తంలో కొలె్రస్టాల్, ఊబకాయం ప్రధాన కారణం. గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు కొన్ని రోజులకు గుండె కండరం క్రమేణా క్షీణిస్తూ... దెబ్బతింటుంది. ఈ డ్యామేజ్ శాశ్వతంగా అవ్వకముందే గుర్తించి వైద్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అరికట్టవచ్చు. యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులను వైద్యులు గుర్తిస్తారు. అడ్డంకులు ఉన్నట్లయితే అవసరమైన మేరకు చికిత్స చేయడం, స్టెంట్ వేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ]ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మృతికి గుండె జబ్బే కారణంప్రపంచవ్యాప్తంగా గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య రెట్టింపు అయ్యింది. దీంతో ప్రతి ముగ్గురు ఊబకాయుల్లో ఇద్దరి మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఊబకాయుల్లో గుండె వైఫల్యం, ఆకస్మిక గుండెపోటు, ధమనుల గోడల్లో కొవ్వు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టడం, గుండె కొట్టుకోవడంలో అసమతుల్యత ప్రమాదాలు ఉన్నట్టు ఆ సర్వేలో గుర్తించారు. సాధారణ బరువున్న వారితో పోలిస్తే ఊబకాయుల్లో టైప్–2 డయాబెటీస్ బారినపడే ప్రమాదం మూడు రెట్లు అధికమని పేర్కొన్నారు. 20–49 ఏళ్ల వయసున్న పురుషుల్లో 78 శాతం, మహిళల్లో 65 శాతం అధిక రక్తపోటుకు బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ) ఎక్కువగా ఉండటమే కారణమని గుర్తించారు. -
ఎత్తుకు తగ్గా బరువు ఉంటున్నారా..?
ఉండాల్సినదాని కంటే ఎక్కువ బరువు ఉండటం ఆరోగ్యానికి మేలు చేయదని అనేక మార్లు రుజువైంది. ఇటీవల ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో దాదాపు పదివేలమంది స్థూలకాయం ఉన్నవారితో పాటు సాధారణ బరువున్న మరో మూడు లక్షలమందిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది మరో మారు వాస్తవమని తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ‘లాస్’ అనే మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. బరువు పెరుగుతున్న కొద్దీ గుండెజబ్బులు, కేన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు వచ్చి అవి మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎవరి ఎత్తుకు తగినట్టు బరువును అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. (చదవండి: డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!) -
బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?
మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలకు మూలం ప్రకృతి. కానీ చాలావరకు ప్రకృతి సహజంగా లభించే మూలికల గురించి మొక్కల గురించి నేటి తరానికి అవగాహన కరువుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి వాటి గురించి తెలుసు కోవడం, అవగాహన పెంచుకోవడం, ఆచరించడం చాలా ముఖ్యం.అలాంటి వాటిల్లో ఒకటి అరటి పండు. అరటిపండులో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులోని పోషక గుణాలు పిల్లలకీ, పెద్దలకీ చాలా మేలు చేస్తాయి. ఒకవిధంగా అరటి చెట్టులో ప్రతీ భాగమూ విలువైనదే. అరటి ఆకులను భోజనం చేసేందుకు వాడతారు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో కార్తీక దీపాలను పెట్టేందుకు అరటి దొప్ప ఆధ్యాత్మికంగా చాలా విలువైంది. ఇక అరటి పువ్వుతో పలు రకాల వంటకాలు తయారు చేస్తారు. కానీ అరటి కాండంలోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం.అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ సి, కాపర్, ఐరన్, మాంగనీస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఇతర ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్కు చెక్ చెప్పవచ్చు.ఇందులో కేలరీలు తక్కువ. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వాడటం వల్ల దీర్ఘకాలంలో మలబద్ధకం , కపుడు అల్సర్లను నివారించడంలో ఉపయోపడుతుంది.ఈ జ్యూస్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది.కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నవారికి ఇది సంజీవని లాంటిదని చెప్పవచ్చు. ఇందులోని పొటాషియం , మెగ్నీషియం రాళ్లను నివారిస్తుంది.కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు కూడా మంచిది. గుండె జబ్బులను కూడా అడ్డుకుంటుంది. శరీరంలోని మలినాలు బయటికి పంపింస్తుంది. అధిక బరువు సమస్యకు కూడా చెక్పెడుతుంది.బరువు తగ్గడానికి ప్రతిరోజూ 25 గ్రా నుండి 40 గ్రా అరటి కాండం జ్యూస్ను తీసుకోవచ్చు.అరటి కాండం రసం శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తుంది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ నుంచి అసిడిటీ వరకూ చాలా సమస్యలు దూరమవుతాయి..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు కూడా పనిచేస్తుంది. శరీరంలోని ట్యాక్సిన్ని బయటికి పంపి మూత్ర నాళాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది.అరటి కాండం ఆకుపచ్చ పొరను తీసివేసి, లోపల కనిపించే తెల్లటి కాండాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, 15 నిమిషాలు ఉడకబెట్టి, రోజుకు రెండుసార్లు సేవించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చోట్ల తొట్టెల్లో అరటి కాండాన్ని ఊరబెట్టి, ఆ నీటిని వడపోసి ఔషధంగా వాడతారు. శుభ్రం చేసి కట్ చేస్తే మజ్జిగలో నానబెట్టి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవచ్చు.దక్షిణ థాయ్లాండ్లో, తీపి , పుల్లని కూరగాయల సూప్ లేదా కూరలో సన్నగా తరిగిన అరటి కాడను కలుపుతారు. సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా దుష్ప్రభావాలను కలిగి లేనప్పటికీ, అలెర్జీ, కడుపు నొప్పి, వాంతులు, అలర్జీ రావొచ్చు. ఒక్కోసారి లే కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగించే అవకాశంఉంది. అయితే, వ్యక్తి వైద్య చరిత్ర , అరటి కాండం పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా రూపంలో తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు మితంగా ఉండాలి. నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే .వైద్య నిపుణుడు, పోషకాహార నిపుణుడు లేదా డైటీషియన్ను సంప్రదించడం చాలా ముఖ్యం. -
టెక్కీ.. వెయిటెక్కీ
ఎక్కువ పనివేళలు టెకీలను ఊబకాయులుగా మారుస్తున్నాయా?! అనే సందేహానికి ‘అవును’ అనే సమాధానం సాఫ్ట్వేర్ రంగం నుంచి వస్తోంది. ఈ విషయంపైన ‘చైనీస్ ఇన్స్టాగ్రామ్ జియాహోంగ్షులో వా΄ోతున్న యువతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద’ని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడి చేసింది. టెకీ ఉద్యోగçస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు చెబుతున్న సూచన లు ΄ాటిద్దాం..చైనాలోని ఓయాంగ్ వెన్జింగ్ అనే 24 ఏళ్ల యువతి ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా గత ఏడాది కాలంలో 20 కేజీల బరువు పెరిగిందని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడించింది. ‘నా శారీరక, మానసిక ఆరోగ్యానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒక విపత్తుగా మారింది. ఎక్కువ పని గంటలు, మారుతూ ఉండే షిప్ట్ వేళల కారణంగా ఆహారం తీసుకోవడంలో అపసవ్యత చోటు చేసుకునేది. దీంతో ఏడాది కాలంలో 60 కేజీల నుంచి 80 కేజీల బరువు పెరిగాను. ఇలా అయితే నా ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో అని జూన్లో ఉద్యోగం మానేశాను. అప్పటి నుంచి నా ఆరోగ్యంలో మెరుగైన మార్పులు వచ్చాయి’ అని ఇన్స్టాలో ΄ోస్ట్ చేసింది ఓయాంగ్. ఆమె ఇప్పుడు ఫ్రీలాన్స్ వెయిట్లాస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. తన ఆహారంలో కూరగాయలు, ధాన్యాలు, ్ర΄ోటీన్లను చేర్చుతూ 6 కిలోల బరువు తగ్గానని తెలిపింది. ఓయాంగ్ అనుభవం చెప్పడంతో ఆమెలాంటి వ్యక్తులు తమ పని కష్టాలను పంచుకోవడానికి ముందుకు వచ్చారు. చైనాలోనే కాదు ఏ దేశంలోనైనా సాఫ్ట్వేర్ ప్రపంచంలో పనిచేసే టెకీలందరికీ ఇది వర్తిస్తుంది. మానసికమైన అలసట ‘పని ఒత్తిడి కారణంగా డిజర్ట్లను అతిగా తినడం వల్ల నెల రోజుల్లోనే 3 కిలోల బరువు పెరిగాను’ అని తన అనుభవాన్ని ఇన్స్టా ద్వారా పంచుకుంది మరో టెక్ ఉద్యోగిని 33 ఏళ్ల షాంఘై.. అతిగా ఆకలిఎక్కువ గంటలు పనిచేయడం అనేది పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణాలలో ఒకటి. ఈ పరిస్థితి సందడిగా ఉండే నగరాల్లో ఆందోళనకరమైన ధోరణిగా మారుతోంది. వర్క్ షిప్ట్ వల్ల సరైన నిద్ర వేళలు ఉండవు. దీంతో కార్టిజోల్ హార్మోన్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే మెలటోనిన్ తగ్గి΄ోతుంది. లేట్నైట్స్ మేల్కొని ఉండటం వల్ల ఆకలి పెరగడంతో ఫుడ్ తెప్పించుకుని తింటారు. దీంతో కదలికలు ఉండవు. ఇక వర్క్ఫ్రమ్ హోమ్ వచ్చాక పడుకొని వర్క్ చేసే వారున్నారు. దీంతో వారి శరీరంలో ఏ ఆర్గాన్ అయితే బలహీనంగా ఉంటుందో దానిపైన త్వరగా ప్రభావం పడుతుంది. తినే వేళలు సరి చేసుకోవాలిచైనాలో పని సంస్కృతి ముఖ్యంగా టెక్ పరిశ్రమలో వారానికి ఆరు రోజుల ΄ాటు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. న్యూట్రిషన్ విభాగానికి చెందిన డాక్టర్ జువో జియోక్సియా హెల్త్ టైమ్స్తో మాట్లాడుతూ ‘ఆలస్యంగా భోజనం చేయడం, అతిగా తినడం, నిద్రలేమి, ‘అధిక పని ఊబకాయానికి దారితీస్తుందని చె΄్పారు. ఈ సమస్యను అధిగమించాలంటే ఎక్కువ కూరగాయలు, తక్కువ మాంసాహారం తీసుకోవాలి. అంతేకాదు, తినే వేళలను సక్రమంగా ΄ాటించాలి. ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలిలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి’ అని సూచిస్తోంది. ఈ సమాచారం టెకీలందరికీ వర్తిస్తుంది.అరకేజీ ఫ్రూట్ –వెజ్ సలాడ్వయసులో ఉన్నప్పుడు పని, జీతం అన్నీ బాగానే అనిపిస్తాయి. అయితే, సరైన జీవన శైలి ΄ాటించక΄ోతే నలభై దాటిన దగ్గర నుంచి ప్రతి ఐదేళ్లకు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువ చూస్తుంటాం. లుక్ కోసం అవసరం లేని కాస్మటిక్ ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. లుక్ కాదు ఆరోగ్యమే ప్రధానమని గుర్తించాలి. పని ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్ ఔషధంలా పనిచేస్తుంది. ∙నిద్ర వేళలు సరిగ్గా చూసుకోవాలి. 6–8 గంటలు నిద్రకు కేటాయించుకోవాలి. ∙వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. ∙టైమ్కి ఆహారం తీసుకోవాలి. దీంతో΄ాటు ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్ రోజు వారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల కొవ్వు పెరగదు. అతిగా ఆకలి అవడం ఉండదు. – డాక్టర్ జానకి, ΄ోషకాహార నిపుణులు -
బెల్లీ ఫ్యాట్తో ఇబ్బంది పడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఉరుగుల పరుగుల జీవితం. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనకు తోడు, పొట్ట, పిరుదుల్లో బాగా కొవ్వు చేరడం, ఊబకాయం వెరసి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అన్నింటికంటే బెల్లీ ఫ్యాట్ అనేది తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. అధిక బరువు లేదా పొట్ట పెరగడానికి గల కారణాలను తెలుసుకుందాం!పౌష్టికాహారం లోపించడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఒకేచోట గంటలతరబడి కూర్చోడం, ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోని పని చేయడం వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. హార్మోన్లు, ఆహారం, వివిధ కారకాలు పొత్తికడుపు కొవ్వును ప్రభావితం చేస్తాయి. ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారాలు కాకుండా కొవ్వు, సుగర్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం. వీటన్నింటితోపాటు జీవనశైలి విషయంలో కొన్ని తప్పులు కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతున్నాయి.రోజులో అతి కీలకమైన అల్పాహారం మానేయడం ఒక కారణం. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మీ జీవక్రియ దెబ్బతింటుంది. మీ బరువు తగ్గాలంటే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. అల్పాహారం రాజులా , మధ్యాహ్న భోజనం యువరాజులా , రాత్రి భోజనం పేదలా తినాలి అనేది పెద్దల మాట.సమయానికి తినకపోవడం పెద్ద తప్పు అయితే, ఇష్టం వచ్చినట్టు ఉపవాసాలు ఉండటం మరో తప్పు. సమయం ప్రకారం తినడంతోపాటు ప్రొటీన్, ఫైబర్తో నిండిన ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. భోజనానికి, భోజనానికి మధ్యలో పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి భోజనంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు కాకుండా, ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి. దీంతో జీర్ణక్రియ సులభమవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. రాత్రి భోజనం చేసిన నిద్రకు ఉపక్రమించడం కూడా పొత్తికడుపు కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. రాత్రి భోజనం తరువాత కనీసం 10-20 నిమిషాల నడక అటు జీర్ణక్రియకు, ఇటు బరువు నియంత్రణకు సాయపడుతుంది.వీటన్నింటి కంటే ప్రధానమైంది. తగినంత నిద్ర పోవడం ఆరోగ్యానికి కీలకం. మనిషి రోజుకు 6-7 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర పోనివారు రోజువారీ ఎక్కువ కేలరీలు తీసుకుంటారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. సరిపడినన్ని నీళ్లు తాగడం కూడా చాలా కీలకం. అలాగే ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. వాకింగ్, జాకింగ్, యోగా లాంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే బెల్లీ ఫ్యాట్కు దూరంగా ఉండటమేకాకుండా, మంచి ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.నోట్: ఇవి కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. వేరే ఇతర అనారోగ్య కారణాలతో కూడా పొట్ట పెరిగే అవకాశం ఉంది. ఈ తేడాను గమనించి సరైన వైద్య పరీక్షలు చేయించుకొని, చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
ఆ ఒక్కటీ తప్ప.. ఉల్లితో చాలా ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ వంటకాల్లో కనిపించే వాటిల్లో చాలా ముఖ్యమైంది ఉల్లిపాయ. పసుపు, తెలుపు , ఎరుపు రంగుల్లో ప్రత్యేకమైన ఘాటైన రుచి, వాసనతో లభిస్తుంది. దాదాపు అన్ని కూరల్లో దీన్ని విరివిగా వాడతాం. అయితే పచ్చిగా తీసుకోవడం వల్ల కూడా ఉల్లితో చాలా ఔషధ ప్రయోజనాలున్నాయి. ‘ఉల్లి చేసిన మేలు తల్లి అయినా చేయదు’ అన్నట్టు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్య , షుగర్ తదితర సమస్యలకు చక్కటి పరిష్కారం ఉల్లి.ఇందులో క్రోమియం షుగర్ స్థాయిలనుఅదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుతుందిపచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి వాటికి సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బయోటిక్ గుణాలతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిదిఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా అధిక రక్తపోటు ముప్పు కూడా తగ్గుతుంది.జీర్ణక్రియలో పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు ఊతమిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ , హేమోరాయిడ్స్ వంటి వివిధ వ్యాధులను నివారిస్తుంది.వాపును తగ్గిస్తుందిక్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్ వ్యాధులకు ఉపశమనానికి అందిస్తుంది.ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందిఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాల్షియం శోషణను ప్రోత్సహించి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది.మెదడు పనితీరును పెంచుతుందిపచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలు మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ , ఏకాగ్రత పెరగడానికి దోహదపడతాయి.కేన్సర్ నివారణలోపచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ , యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ నివారణలో సాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ ,అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.చర్మ ఆరోగ్యానికి కూడా పచ్చి ఉల్లిపాయల్లోని అధికంగా లభించే యాంటీఆక్సిడెంట్లు ,విటమిన్ సీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. ముడతలు, వయసు మచ్చలు , పిగ్మెంటేషన్ స్థాయిలను తగ్గించి, ఆరోగ్యకరమైన , మెరిసే చర్మాన్ని అందిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందిపచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గడంలో తక్కువ కేలరీలు , అధిక ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అతిగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.నోట్: ఏదైనా మితంగా తీసుకోవడం ఉత్తమం. అధిక వినియోగం జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది. ప్రధానంగా పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన వస్తుందనిది గమనించాలి. -
అమ్మాయిల్లో తొలి పీరియడ్స్ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం
సాధారణంగా ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, తదితర కారణాల రీత్యా ఈ మధ్య కాలంలోనే చాలా చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలై పోతున్నాయి. అంటే దాదాపు 8-10 ఏళ్ల మధ్యే మెచ్యూర్ అవుతుండటాన్ని చూస్తున్నాం. అయితే తొలి ఋతుస్రావం, చిన్నతనంలోని స్థూలకాయంతో ముడిపడి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం, మొదటి పీరియడ్స్ వచ్చే సగటు వయస్సు 1950-1969 నుండి 2000-2005 వరకు జన్మించిన మహిళల్లో 12.5 సంవత్సరాల నుండి 11.9 సంవత్సరాలకు పడిపోయింది. అమెరికాలోని 70వేల మందికి పైగా యువతులపై ఈ పరిశోధన జరిగింది. అంతేకాదు చిన్నతనంలో రజస్వల కావడం హృదయ సంబంధ వ్యాధులు , కేన్సర్ వంటి ప్రతికూల ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్వర్క్ ఓపెన్లో ప్రచురితమైన ఈ అధ్యయనం, జాతులు , సామాజిక వర్గాలలో మహిళల్లో రుతుక్రమ పోకడలను గుర్తించిన తొలి అధ్యయంనంగా పరిశోధకులు పేర్కొన్నారు.ఋతు చక్రాలు సక్రమంగా ఉండేందుకు సమయం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. 1950- 1969 మధ్య జన్మించిన వారిలో 76 శాతంమందిలో తొలి పీరియడ్స్ తర్వాత రెండు సంవత్సరాలలోపు రెగ్యులర్ పీరియడ్స్కనిపించగా, 2000- 2005 మధ్య జన్మించిన 56 శాతం మహిళళ్లో మాత్రమే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చాయి. ప్రారంభ నెలసరి, దాని కారణాలను పరిశోధనలు కొనసాగించడం చాలా కీలకమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో పోస్ట్డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో , సంబంధిత రచయిత జిఫాన్ వాంగ్ తెలిపారు. -
ఒబెసిటీ ఇంత ప్రమాదకరమైనదా? పాపం ఆ వ్యక్తి..!
ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్తమైన జీవన విధానం, కల్తీ ఫుడ్ల కారణంగా టీనేజీ యువత ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తోంది. కనీసం పెళ్లీడు రాకమునుపే పెద్దవాళ్లలా కనిపించేంత భారీకాయంతో సతమతమవ్వుతున్నారు. అచ్చం అలాంటి సమస్యతోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి మరణించాడు. జస్ట్ 33 ఏళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒబెసిటీ ఇంత ప్రమాకమైనదే? లావుగా ఉంటే అంతే సంగతులా..!లావుగా ఉంటే లైఫ్ లాసే అని ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. బ్రిటన్ నివాసి జాసన్ హోల్డన్ యూకేలోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి. అతడి బరువు ఏకంగా 317 కిలోలు. అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి అగ్నిమాపక సిబ్బంది సహాయం తీసుకోవాలట. ఇక అతడు పడుకోవాలన్నా.. ప్రత్యేకంగా రూపొందించిన ఫర్నిచర్పై బెడ్పై నిద్రిస్తాడు. అతడికి అతిగా తినే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎంతలా ఉందంటే రోజువారీగా ఏకంగా పదివేలకు పైగా కేలరీలు తీసుకునేంత స్థాయిలో ఉంది. అతడి బ్రేక్ఫాస్ట్లో డోనార్ కబాబ్లు తీసుకుంటాడంటే..అతడు ఎంతలా తింటాడో చెప్పాల్సిన పనిలేదు. దీని కారణంగానే ఆరోగ్యం క్షీణించటం మొదలయ్యింది. దీంతో అతను కొన్నాళ్లుగా గదికే పరితం కాగా, క్రమేణ మంచానికే పరిమతమయ్యాడు. ఆ తర్వాత చలనశీలత దెబ్బతింది. మొదట అతడి శరీరంలో కిడ్నీ పనిచేయడం మానేసింది. అలా నెమ్మదిగా మిగతా అవయవాలు వైఫల్యం చెందడం ప్రారంభించడంతో 34వ ఏటాలోకి అడుగుపెట్టడానికి కొన్ని రోజుల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు గతేడాది ఒక ఇంటర్వ్యూలో తన సమయం అయిపోయిందని, తాను ఎన్నాళ్లో బతకనని చెప్పేశాడు కూడా. పైగా అలా కాకుండా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి 2020లో ప్రమాదవశాత్తు హోల్టన్ మూడవ అంతస్తు నుంచి పడిపోయాడు. పాపం అతడిని రక్షించటానికి ఏకంగా 30 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, క్రేన్ రంగంలోకి దిగి కాపాడారు. ఆ ఘటనను తలచుకుంటూ అది తన జీవితంలో అత్యంత బాధకరమైన ఘటనగా పేర్కొన్నాడు హోల్డన్. ఆ టైంలో తనను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి చాలా బాధపడడ్డానని అన్నాడు. హోల్డన్ మానసిక స్థితి ఎంతలా మారిపోయిందంటే.. లావుగా ఉండే వ్యక్తులను ఆధారం చేసుకుని తీసిన సినిమాలు సైతం అతడికి భయానక చిత్రాలుగా అనిపించాయి. కనీసం తన అమ్మను కూడా చూడొద్దని కన్నీటి పర్యంతమయ్యాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ అధిక బరువు కారణంగా ఎంతగా ఇబ్బంది పడ్డానేది నేరుగానే తెలుస్తోంది. అతను తరుచుగా ఈ బ్రిటన్ దేశంలో తానే అత్యంత లావుగా ఉన్నవ్యక్తిని అని బాధపడేవాడు. అతడి పోస్ట్మార్టం రిపోర్టులో కూడా అధిక బరువు కారణంగా అవయవాల వైఫల్యం చెంది మరణించినట్లు ఉంది. హోల్టన్ ఈ అధిక బరువు కారణంగా స్ట్రోక్లు, రక్త గడ్డకట్టడం వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అధిక బరువు అనేది ప్రాణాంతకమైన సమస్యే. నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తగ్గించుకునే యత్నం చేయకపోతే అంతే సంగతులని ఈ ఉదంతమే చెబుతోంది. అందువల్ల కొద్దిపాటి శారీరక శ్రమ, క్యాలరీల తక్కువ ఉన్న ప్రత్యామ్నాయ ఆహారంతో బరువుని అదుపులో ఉంచుకునే యత్నం చేయండి. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించండి.(చదవండి: సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?) -
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిమ్కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామంఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్ర్సైజ్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
దాల్చిన చెక్కతో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ నిజంగా తగ్గుతుందా?
సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క. శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి.దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది. నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు. -
కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావడం లేదా? ఇలా ట్రై చేయండి!
ఊబకాయం, లేదా ఒబెసిటీ అనేక రోగాలకు మూలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తు తాయి. అందుకే వయసు, ఎత్తుకు తగ్గట్టు బరువును, కొలెస్ట్రాల్ను నియంత్రించుకోవడం చాలా అవసరం. అయితే వెయిట్ లాజ్ జర్నీ అనుకున్నంత ఈజీకాదు. దీనికి పట్టుదల, జీవన శైలి మార్పులు, తగిన వ్యాయామం తప్పనిసరి. ఈ క్రమంలో చెడు కొలెస్ట్రాల్కి చెక్ చెప్పే కొన్ని సహజమైన జ్యూసెస్ గురించి తెలుసుకుందాం. కరివేపాకు: ప్రతి వంటలోనూ కరివేపాకును ఉపయోగించడం మనకు బాగా అలవాటు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్పెరగడానికి దోహదపడతాయి. ప్రతిరోజూ కరివేపాకు రాసం తాగడం వల్లన కొలెస్ట్రాల్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రసం తయారుచేసుకునే ముందు, ఆకులను శుభ్రంగా కడగాలి. చీడపీడలు లేని ఆకులను తీసుకోవాలి. కొత్తిమీర: వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడంలో కొత్తిమీర తరువాతే ఏదైనా. ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులను సలాడ్లో చేర్చుకోవచ్చు. కొత్తిమీర రసం రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది. నేరేడు ఆకులు : మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో నేరేడు పళ్లు, గింజలు బాగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచడంలో కూడా ఇది బేషుగ్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ ఆంథోసైనిన్ వంటి లక్షణాలు వీటిల్లో మెండుగా ఉన్నాయి. ఇదిసిరల్లోపేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పని చేస్తుంది. జామున్ ఆకులను శుభ్రంగా ఎండ బెట్టి పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు 1-2 సార్లు త్రాగవచ్చు. మెంతి ఆకులు: మెంతి కూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ను తగ్గించడానికి మెంతి ఆకులను తినవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. తులసి ఆకులు : తులసి పవిత్రమైందిగా భావిస్తాం. దీని ఆకులు, జలుబు, గొంతు నొప్పినివారణలో బాగా పనిచేస్తుంది. అలాఏగ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు చాలా ప్రయోజనకరం. జీవక్రియ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను శుభ్రంగా కడిగి తింటే నోటికి, ఒంటికి కూడా చాలా మంచిది. అలోవెరా: కలబందప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌందర్యపోషణలో, ఆరోగ్య రక్షణలోనూ ఇది చక్కటి ఔషధం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా గుజ్జును తీసుకుంటే కొలెస్ట్రాల్ మాయమైపోతుంది. శరీరంలోని ఇతర అనారోగ్యాలకు కూడా ఇది దివ్యౌషధం. పైన పేర్కొన్న వాటి అన్నింటిలో కావాలంటే కొత్తిగా తేనెను యాడ్ చేసుకోవచ్చు. నోట్: ఈ సూచనలు అన్నీ అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
లావొక్కింత మితిమీరె!
ప్రపంచం లావెక్కిపోతోంది. అన్ని దేశాల్లోనూ కలిపి స్థూలకాయుల సంఖ్య ఇప్పటికే అక్షరాలా 100 కోట్లు దాటేసింది! 1990 నుంచే వీరి సంఖ్యలో ఏకంగా నాలుగు రెట్ల పెరుగుదల నమోదైంది. మూడు దశాబ్దాల క్రితం దాకా పెద్దల్లోనే ఎక్కువగా కని్పంచిన ఊబకాయ సమస్య ఇప్పుడు చిన్నారుల్లో కూడా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లతో పాటు పౌష్టికాహార లోపం కూడా దీనికి ప్రధాన కారణమేనని తాజా అధ్యయనంలో తేలింది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికే వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 88 కోట్లు దాటింది. అలాగే టీనేజీ లోపు వయసు వారిలోనూ 16 కోట్ల పై చిలుకు ఊబకాయంతో బాధపడుతున్నారు. టోంగా, నౌరు, సమోవా తదితర దేశాల్లో మూడొంతులకు పైగా జనం ఊబకాయులేనట! 1990 నుంచి 2022 మధ్య పలు గణాంకాలు తదితరాల ఆధారంగా అధ్యయనం సాగింది. ఈ జాబితాలో అమెరికా కూడా పురుషుల్లో పదో స్థానంలో, మహిళల్లో 36వ స్థానంలో నిలిచింది. ఈ దేశాల్లో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లే సమస్యకు ప్రధాన కారణమని తేలినట్టు అధ్యయన బృంద సభ్యుడు ప్రొఫెసర్ మజీద్ ఎజాటి వెల్లడించారు. మరోవైపు తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్యలో 50 శాతం తగ్గదల నమోదైంది. కాకపోతే నిరుపేద దేశాలు, సమాజాల్లో ఇది ఇంకా ప్రబల సమస్యగానే ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్లోనూ ఊబకాయుల సంఖ్య 8 కోట్లు దాటినట్టు వెల్లడించింది. తక్షణం మేల్కొనాలి... ఒకప్పుడు ప్రధానంగా పెద్దవాళ్లలోనే కన్పించిన స్థూలకాయ సమస్య ఇప్పుడు స్కూలు వయసు చిన్నారుల్లోనూ ప్రబలమవుతుండటం చాలా ఆందోళనకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రయేసస్ అన్నారు. చిన్న వయసులోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరాన్ని తాజా సర్వే మరోసారి నొక్కిచెప్పిందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామాలు తదితరాలను జీవన శైలిలో భాగంగా మార్చుకోవడం తప్పనిసరన్నారు. పలు దేశాల్లో ప్రధానంగా పౌష్టికాహార లోపమే స్థూలకాయానికి దారి తీస్తోందని అధ్యయనంలో పాలుపంచుకున్న మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్కు చెందిన డాక్టర్ గుహా ప్రదీప అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, కొవిడ్ కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయని వివరించారు. ‘‘ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖరీదైన వ్యవహారంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా చాలా దేశాల్లో ప్రజలకు చాలీచాలని, నాసిరకం ఆహారం అందుతోంది’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా చేశారు... ► అధ్యయనంలో 1,500 మందికి పైగా రీసెర్చర్లు పాలుపంచుకున్నారు. ► ఎన్సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పేరిట వీరంతా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పని చేశారు. ► ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల నుంచి ఐదేళ్ల పైబడ్డ 22 కోట్ల మందికి పైగా ప్రజల ఎత్తు, బరువు తదితర శారీరక కొలతలను సేకరించారు. ► ఊబకాయాన్ని నిర్ధారించేందుకు బాడీ మాస్ ఇండెక్స్ను ఆధారంగా తీసుకున్నారు. గణాంకాలివీ... ► ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో 88 కోట్లు, టీనేజీ, ఆ లోపు వారిలో దాదాపు 16 కోట్ల మంది ఊబకాయులున్నారు. ► వయోజన ఊబకాయుల్లో 50 కోట్లకు పైగా పురుషులు కాగా 38 కోట్ల మంది స్త్రీలు. ► 1990లో వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య 20 కోట్ల లోపే ఉండేది. ► వారిలో స్త్రీలు 13 కోట్లు కాగా 7 కోట్ల మందికి పైగా పురుషులుండేవారు. భారత్లోనూ... భారత్ కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య బాగా పెరుగుతుందటం ఆందోళన కలిగిస్తోంది. వయోజన మహిళల్లో ఊబకాయులు 1990లో కేవలం 1.2 శాతముండగా 2022 నాటికి ఏకంగా 9.8 శాతానికి పెరిగారు. పురుష జనాభాలో ఊబకాయుల సంఖ్య 0.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద 2022 నాటికి దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 5–19 ఏళ్ల మధ్య వయసు్కన్న పిల్లల్లో దాదాపు 1.25 కోట్ల మంది ఊబకాయులేనని అధ్యయనంలో తేలింది. 75 లక్షలతో వీరిలో అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఊబకాయానికి విరుగుడీ మాత్ర!
స్లిమ్గా, ఫిట్గా ఉండాలని ఎవరు కోరుకోరు? కానీ తినే తిండిపై సరైన కంట్రోల్ లేకపోతే ఈజీగా బరువు పెరుగుతారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఎంత నోరు కట్టేసుకుందామనుకున్నా కళ్లముందు టేస్టీ వంటలు కనిపిస్తే తినకుండా ఉండటం కష్టమే. అందుకే ఏమీ తినకపోయినా తిన్న ఫీలింగ్ కలిగించే ట్యాబ్లెట్స్ను సైంటస్టులు తయారుచేశారు. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా, బరువును అదుపులో ఉంచుతుందట. ఏంటీ ట్యాబ్లెట్? ఎప్పుడు వేసుకోవాలి? అన్న ఇంట్రెస్టింగ్ విశేషాలు మీ కోసం.. సాధారణంగా మనం కడుపునిండా భోజనం చేశాక ఇక చాలు.. అనేలా మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇవి ఇన్సులిన్, సి-పెప్టైడ్, పైయ్, జిఎల్పి-1 వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో కడుపునిండిన ఫీలింగ్ కలిగి తినడం మానేస్తాం. అయితే ఇదే పద్దతిని కృత్రిమంగా చేసి ఆకలిని తగ్గించొచ్చు అంటున్నారు MIT సైంటిస్టులు. అదెలా అంటే.. తిన్న తర్వాత మామూలుగానే పొట్ట కాస్త ముందుకు సాగుతుంది. దీన్ని కృత్రిమంగా అనుభూతి పొందేలా వైబ్రేటింగ్ ఇన్జెస్టిబుల్ బయోఎలక్ట్రానిక్ స్టిమ్యులేటర్ (VIBES)అనే పిల్ను సైంటిస్టులు రూపొందించారు. తినడానికి ముందే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా కడుపునిండట్లుగా వైబ్రేషన్ కలుగుతుంది. ఇది ఆర్టిఫిషియల్గా మెదడుకు హార్మోన్లను పంపిస్తుంది. ఈ ప్రయోగాన్ని తొలుత పందుల్లో ప్రయోగించారు. ఆహారం తినడానికి 20 నిమిషాల ముందు వాటికి పిల్స్ ఇవ్వగా సాధారణం కంటే 40% తక్కువగా తిన్నాయని, బరువు కూడా నియంత్రణలో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఒబెసిటీకి బెస్ట్ ట్రీట్మెంట్లా పనిచేస్తోందని సీనియర్ సైంటస్ట్ గియోవన్నీ ట్రావెర్సో అభిప్రాయపడ్డారు. పిల్లో రూపొందించిన చిన్న సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీతో నడిచే వైబ్రేటింగ్ సిస్టమ్ ద్వారా భోజనానికి ముందు, ఆ తర్వాత ఆన్, ఆఫ్ చేసుకునే వెసలుబాటు కూడా ఉందని వివరించారు. -
2023లో జనం సెర్చ్చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే!
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఇటువంటి సందర్భంలో గడచిన కాలాన్ని ఒకసారి నెమరువేసుకోవడం సహజం. ఈ ఏడాది గూగుల్లో కొన్ని వ్యాధులకు సంబంధించిన వివరాల కోసం కొందరు వెదికారు. అలాగే ఈ వ్యాధుల నివారణకు ఇంటి చిట్కాల కోసం కూడా శోధించారు. వీటిలో కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీలపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2023లో చాలామంది గూగుల్లో సెర్చ్ చేసిన టాప్-5 వ్యాధులు లేమిటో వాటి నివారణకు ఉపయుక్తమయ్యే సులభ ఉపాయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక కొలెస్ట్రాల్ ఈ సంవత్సరం చాలామంది అధిక కొలెస్ట్రాల్ నివారణకు ఇంటి చిట్కాల కోసం చాలా శోధించారు. నిజానికి, కొలెస్ట్రాల్ పెరగడం అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ఈ కారణంగానే గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని గృహచిట్కాలు ధమనులలో పేరుకుపోయిన వ్యార్థాలను క్లియర్ చేసేందుకు దోహదపడతాయి. కొత్తిమీర నీరు, సెలెరీ టీ, ఫైబర్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు అధిక కొలెస్ట్రాల్ను నివారించడంలో ఉపయుక్తమవుతాయి. 2. మధుమేహం మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి. దీనితో చాలామంది సతమతమవుతున్నారు. ఈ వ్యాధి నివారణకు చక్కెరను తీసుకోకూడదు. మధుమేహం నివారణకు కొన్ని ఇంటి చిట్కాలు దోహదపడతాయి. ఓట్స్ తీసుకోవడం లాంటివి మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపకరిస్తాయి. అలాగే ఉసిరి రసం, మెంతులు తీసుకోవడం కూడా మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది. 3. అధిక యూరిక్ యాసిడ్ అధిక యూరిక్ యాసిడ్ సమస్య నివారణకు ఆనపకాయ రసం లేదా బార్లీ నీటిని తాగడం ఉత్తమం. నీరు, పీచు సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. 4. హై బీపీకి హోం రెమెడీ అధిక బీపీ నివారణకు చాలామంది గృహ వైద్యం కోసం గూగుల్లో శోధించారు. హైబీపీని అదుపులో ఉంచేందుకు తగినంత నీటిని తాగడం ఉత్తమం. అలాగే నిమ్మరసం, ఫెన్నెల్ టీ కూడా చక్కగా పనిచేస్తుంది. హైబీపీ నివారణకు ఈ ఎఫెక్టివ్ విధానాలను ప్రయత్నించవచ్చు. 5. ఊబకాయం ఊబకాయాన్ని తగ్గించడంలో కొన్ని హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. బొప్పాయి తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతే కాకుండా పసుపు కలిపిన నీరు తాగడం వల్ల కూడా ఊబకాయం అదుపులో ఉంటుంది. ఇది కూడా చదవండి: 2023లో కశ్మీర్ను ఎంతమంది సందర్శించారు? -
లైఫ్ స్టయిల్ మారుద్దాం..!
ఈ రోజుల్లో...ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం!? పిల్లలు ఎలా ఎదుగుతున్నారు? ఉరుకుల పరుగుల జీవనంలో ఇవన్నీ సహజమే అని వదిలేస్తే ..‘భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు’ అంటున్నారు లీ హెల్త్ డొమైన్ డైరెక్టర్ లీలారాణి. ఆరోగ్య విభాగంలో న్యూట్రాస్యు టికల్, ఫుడ్ సప్లిమెంట్ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిపై దృష్టిపెట్టే ఈ సంస్థ ద్వారా మన జీవనవిధానం వల్ల ఎదుర్కొనే సమస్యలకు మూలకారణాలేంటి అనే విషయంపై డేటా సేకరించడంతో పాటు, అవగాహనకు కృషి చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్, సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఏపీ చాంబర్స్, విశాఖపట్నం జోన్ చెయిర్ పర్సన్గానూ ఉన్న లీలారాణి మహిళలు, పిల్లల ఆరోగ్య సమస్యలపై డేటా వర్క్, బేసిక్ టెస్ట్లు చేస్తూ తెలుసుకుంటున్న కీలక విషయాలను ఇలా మన ముందుంచారు.. ‘‘ప్రస్తుత జీవన విధానం, తీసుకునే ఆహారం వల్ల పిల్లలకు ఎలాంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు స్కూళ్లవైపుగా డేటా సేకరించాలనుకున్నాం. ముందు 8–10 ఏళ్ల పిల్లలకు స్కూళ్లలో ఇటీవలప్రారంభించాం. ఊర్జాప్రాజెక్టులో భాగంగా బేసిక్ న్యూట్రిషన్ ఫోకస్డ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం. ఈ టెస్ట్ ద్వారా పిల్లల్లో .. ఆహారానికి సంబంధించిన సమస్యలు ఏమన్నాయి, తల్లిదండ్రులు– కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎంత సమయం గడుపుతున్నారు, శారీర చురుకుదనం, డిజిటల్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, నిద్ర సమస్యలు ఏంటి.. ఇలా కొన్నింటితో ఒక ప్రశ్నాపత్రం రూపొందించాం. పిల్లల దగ్గర సమాధానాలు తీసుకొని, వాటిలో ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాం. ఆంధ్రా, తెలంగాణలోని స్కూళ్లలో పెద్ద స్థాయిలో డేటా తీసుకోవాలని ప్రారంభించాం. ఇప్పుడైతే 200 మంది పిల్లలతో విశాఖపట్నంలో ఈ డేటా మొదలుపెట్టాం. 8–15 ఏళ్ల వయసులో .. పిల్లలతో కలిసి రోజువారి జీవనవిధానం గురించి చర్చించినప్పుడు ‘మా పేరెంట్స్ బిజీగా ఉంటారు. వాళ్లు డిజిటల్ మీడియాను చూస్తారు, మేమూ చూస్తాం.’ అని చెబుతున్నారు. ఈ వయసు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటమే కాకుండా, చురుకుగా ఉంటున్నారు. కారణం అడిగితే – ‘అమ్మనాన్నలను ఏదైనా విషయం గురించి అడిగితే చెప్పరు. అందుకని డిజిటల్లో షేర్ చేసుకొని తెలుసుకుంటాం’ అంటున్నారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు ఈ విధంగా పెంచుకుంటూ సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి స్కూళ్లలో ఎలాంటి గేమ్స్ ఉన్నాయి, ఇంటి బయట ఎలా ఉంటున్నారు,.. అనేది కూడా ఒక డేటా తీసుకుంటున్నాం. 8–15 ఏళ్ల లోపు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకపోవడం వల్ల వారు యంగేజ్కు వచ్చేసరికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాం. ఊబకాయమూ సమస్యే ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా ఉంది. డబ్యూహెచ్ఓ సూచించిన టెస్ట్లు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తించాం. వాటిలో శారీరక చురుకుదనం లోపించడమే ప్రధానంగా కారణంగా తెలుసుకున్నాం. బయట జంక్ ఫుడ్ నెలలో ఎన్ని సార్లు తీసుకుంటున్నారు అనేదానిపైన రిపోర్ట్ తయారుచేశాం. పిల్లల నుంచి సేకరించిన రిపోర్ట్ను ఆ స్కూళ్లకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్లో ‘మీ స్కూల్ కరిక్యులమ్లో చేర్చదగిన అంశాలు అని ఓ లిస్ట్ ఇస్తున్నాం. వాటిలో, చురుకుదనం పెంచే గేమ్స్తో పాటు న్యూట్రిషన్ కిచెన్, గార్డెనింగ్.. వంటివి ఒకప్రాక్టీస్గా చేయించాలని సూచిస్తున్నాం. ముందుగా 40 ఏళ్ల పైబడినవారితో.. రెండేళ్ల క్రితం ఒక కార్పోరేట్ సెక్టార్లో దాదాపు పది వేల మందికి (40 ఏళ్లు పైబడినవారికి) ఎన్జీవోలతో కలిసి బిఎమ్డి టెస్ట్ చేశాం. వీరిలో బోన్డెన్సిటీ తక్కువగా ఉండటమే కాకుండా, మానసిక ప్రవర్తనలు, నెగిటివ్ ఆలోచనలు, స్ట్రెస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్.. వంటివి దేని వల్ల వస్తున్నాయి అనేది తెలుసుకున్నాం. నిజానికి 60 ఏళ్ల పైబడి న వారి బోన్ డెన్సిటీ బాగుంది. కారణం, ఆ రోజుల్లో వారు చేసే శారీరక శ్రమయే కారణం. ఇప్పుడది తగ్గిపోయింది. పరిష్కారాలూ సూచిస్తున్నాం.. ఎక్కడైతే టెస్ట్లు చేశామో, వారి జీనవవిధానికి తగిన సూచనలూ చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఏవి అధికంగా వస్తున్నాయో తెలుసుకుని, వాటిని పరిష్కరించుకునే విధానాలను సూచిస్తున్నాం. చాలావరకు ఈ వయసు వారిలోనూ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సమస్యలు. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఈ సమస్య అధికంగా ఉంది. పని ప్రదేశంలో శరీర కదలికలు లేకపోడం, అక్కడి వాతావరణం, స్క్రీన్ నుంచి వచ్చే సమస్యలు, డిజిటల్ ఎక్స్పోజర్.. వీటన్నింటినీ ఒక్కొక్కరి నుంచి తీసుకొని వారికి తగిన సూచనలు ఇస్తూ వచ్చాం. సమస్యలు ఎక్కువ ఉన్నవారి బాల్య దశ గురించి అడిగితే మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. బాల్య దశ కీలకం పెద్దవాళ్లలో సమస్యలు గమనించినప్పుడు వారి బాల్య దశ కీలకమైందని గుర్తించాం. దీంతో పిల్లల్లోనే ముందుగా సమస్యను పరిష్కరిస్తే మంచిదని, పిల్లల్లో పరీక్షలు చేసినప్పుడు వారిలో బోన్డెన్సిటీ సమస్య కనిపించింది. దీని గురించి డాక్టర్లతో చర్చించినప్పుడు మూల కారణం ఏంటో తెలిసింది. ఒకప్పుడు గ్రామాల్లో పిల్లలు పరిగెత్తడం, గెంతడం, దుమకడం.. వంటివి చాలా సహజసిద్ధంగా జరిగిపోయేవి. వారి ఆటపాటల్లో శారీరక వ్యాయామం చాలా బాగుండేది. అది ఈ రోజుల్లో లేదు. క్రీడలు కూడా వృత్తిపరంగా ఉన్నవే తప్ప ఆనందించడానికి లేవు. ఒక స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీ రోజులో ఇన్ని గంటలు అవసరం అనేది గుర్తించి, చెప్పాలనుకున్నాం. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్యసమస్యలను భరించడం కన్నా ముందే జాగ్రత్తపడటం మంచిది. మధ్య తరగతే కీలకం మధ్యతరగతి, దానికి ఎగువన ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లోపం ఎక్కువ కనిపించింది. వారి ఎముక సామర్థ్యం బలంగా లేకపోతే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్యసమస్యలను ఎదుర్కోక తప్పదు. పిల్లలు ఎదిగే దశలో వారి ఆహారం, అలవాట్లు బాగుండేలా చూసుకోవాలి. ఈ విషయంలో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు బాగానే ఉన్నారు. ఈ అన్ని విషయాలపై ఇంకా చాలా డేటా సేకరించాల్సి ఉంది. ముందు మానసిక సమస్యలు అనుకోలేదు. కానీ, సైకలాజికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఉన్నవారితో సరైన ఇంటరాక్షన్స్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ డిజిటల్ మీడియాలో ఉండటం వల్ల కంటి సమస్యలు, కుటుంబంతో గ్యాప్ ఏర్పడం వంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలను అవగాహన చేసుకొని, మన జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని తెలియజేశారు. లీలారాణి. – నిర్మలారెడ్డి -
అమెరికాలో అలా .. ఆసియాలో ఇలా?
సాక్షి, హైదరాబాద్: మధుమేహంతో పాటు గుండెజబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా భారత్ ఇతర ఆసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. కానీ వ్యాధి సోకడం, లక్షణాల వంటివి ప్రాంతాన్ని బట్టి మారిపోతున్నాయి. మధుమేహాన్ని తీసుకుంటే టైప్ 2 మధుమేహం అమెరికా లాంటి దేశాల్లో ఊబకాయం ఉన్నవారిలో కన్పిస్తుంది. కానీ భారత్లాంటి కొన్ని దేశాల్లో బక్కపలుచగా ఉన్నప్పటికీ దీనిబారిన పడుతున్నారు. అందరిలోనూ జన్యువులు ఒకే రకంగా ఉన్నప్పటికీ జన్యువుల పైభాగంలో వాతావరణం, సూక్ష్మ పోషకాల లోపం వల్ల చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల కారణంగా ఈ తేడాలు చోటు చేసుకుంటున్నట్లు తేలింది. మరోవైపు వీటి కోసం తయారు చేసిన ఔషధాలు ఒక ప్రాంతంలో పనిచేస్తే మరొక ప్రాంతంలో పని చేయడం లేదు. మధుమేహంతో పాటు గుండె జబ్బులు, మానసిక సమస్యలకు పైన పేర్కొన్న తేడాలు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, అందరికీ సమర్ధంగా ఉపయోగపడే మందులు కనిపెట్టేలా, మానవజాతి ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఓ మహా ప్రయత్నం మొదలైంది. భారత్ సహా నాలుగు దేశాల్లోని 13 వేల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధి ముప్పును తగ్గించే ప్రాజెక్టుకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. డైవర్స్ ఎపిజెనిటిక్, ఎపిడిమియాలజీ పార్ట్ నర్షిప్ (డీప్) అని పిలుస్తున్న ఈ అంతర్జాతీయ ప్రాజెక్టులో ఇరవై పరిశోధక బృందాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై సంస్థలు భాగస్వాములు కానున్నాయి. ఇప్పటివరకు ‘యూరప్’ సమాచారమే ఆధారం ప్రజారోగ్యం విషయంలో ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలకు అత్యధికంగా యూరోపియన్ మూలాలున్న మానవుల నుంచి సేకరించిన సమాచారమే ఆధారం. అంటే ఆరోగ్య సమస్యల పరిశోధనల్లో ఇతర ప్రాంతాల వారి భాగస్వామ్యం చాలా తక్కువన్నమాట. అంతేకాకుండా జన్యుపరమైన, వాతావరణ సంబంధిత వైవిధ్యతను కూడా ఇప్పటివరకూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కొంచెం వివరంగా చెప్పాలంటే మన జన్యువులు, మనం ఉన్న వాతావరణం ప్రభావం.. మనకొచ్చే వ్యాధులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పటివరకూ స్పష్టంగా తెలియదన్నమాట. కాగా ‘డీప్’ప్రాజెక్టు ఈ లోటును భర్తీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల ఖర్చుతో ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. సీసీఎంబీ నేతృత్వంలో యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్,, ఎంఆర్సీ యూనిట్, ద గాంబియాలు ఇందులో పాల్గొననున్నాయి. అధ్యయనంలో భాగంగా కొన్ని వ్యాధులు కొన్ని ప్రాంతాల వారికి లేదా సమూహాలకు మాత్రమే ఎందుకు వస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనిద్వారా ఒక ప్రాంత ప్రజల కోసం తయారు చేసిన మందులు ఇతర ప్రాంతాల వారికీ సమర్థంగా ఉపయోగపడతాయా? లేదా? అన్నది స్పష్టమవుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ఆర్.గిరిరాజ్ ఛాందక్ తెలిపారు. సీసీఎంబీ ఎప్పుడో చెప్పింది... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) చాలాకాలంగా భారతీయుల జన్యు నిర్మాణంలోని తేడాలు.. టైప్–1, టైప్–2 మధుమేహం, క్లోమగ్రంథి వ్యాధులపై వాటి ప్రభావం గురించి పరిశోధనలు చేస్తోంది. విటమిన్ బీ–12, ఫొలేట్ తదితర సూక్ష్మ పోషకాలు, పర్యావరణాలు.. వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు కూడా సీసీఎంబీ నిరూపించింది. పర్యావరణం నుంచి అందే సంకేతాల ఆధారంగా డీఎన్ఏలో వచ్చే కొన్ని రకాల మార్పులు మనిషి ఆరోగ్యం, వ్యాధులకు కారణమవుతున్నట్టుగా కూడా సీసీఎంబీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. అంటే ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలన్నీ యూరోపియన్లపై ఆధారపడి జరిగినవి కావడంతో వారికి పనిచేసే మందులు, చికిత్స పద్ధతులు కచ్చితంగా మనకూ పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదన్నమాట. అలాగే మనకు పనిచేసే మందులు బ్రిటిష్ వారికి లేదా అమెరికన్లను అక్కరకు వస్తాయా? అన్నది కూడా ప్రశ్నార్థకమే అన్నమాట. భారతీయులకూ భాగస్వామ్యం జన్యువులు – జన్యువులకు మధ్య, జన్యువులకు పర్యావరణానికి మధ్య జరుగుతున్న కార్యకలాపాలు అర్థం చేసుకునేందుకు మధుమేహం, గుండెజబ్బుల వంటి అసాంక్రమిక వ్యాధులకూ వీటికి ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టులో భారతీయులను కూడా చేర్చుకోవడం ఎంతో ఆసక్తికరమైన అంశం. – డాక్టర్ ఆర్.గిరిరాజ్ ఛాందక్, ‘డీప్’ప్రాజెక్ట్ హెడ్ -
జిమ్ చేస్తున్నా బరువు తగ్గడం లేదు.. సర్జరీ చేయించుకోవచ్చా?
కొందరు ఎంత తిన్నా శరీరానికి కొవ్వు పట్టదు. జీరో సైజ్లోనే కనిపిస్తుంటారు. మరికొందరికేమో కొంచెం తిన్నా లావెక్కిపోతారు. ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది అన్ని వయసుల వారికి పెద్ద సమస్యలా మారింది. బరువు అదుపులో ఉంచుకునేందుకు గంటల తరబడి జిమ్లో వర్కవుట్స్ చేసినా, డైట్ కంట్రోల్ చేసినా ఏ మాత్రం రిజల్ట్ ఉండటం లేదు. ''నాకు 24 ఏళ్లు. నా హైట్ 5.2. బరువు 92 కిలోలు ఉన్నాను. యోగా, రెగ్యులర్గా జిమ్కి వెళుతున్నా, డైటింగ్ కూడా చేస్తున్నా. అయినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చా? భవిష్యత్లో ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా?'' మీ వయసు 24 కాబట్టి డైటింగ్, ఎక్సర్సైజెస్ కొంతవరకు బరువు తగ్గడానికి దోహద పడతాయి. మీరు చెప్పిన మీ ఎత్తు, బరువు వివరాలను బట్టి మీ బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 40 పైనే వస్తుంది. అంటే అధిక బరువు ఉన్నారని అర్థం. మార్బిడ్ ఒబేసిటీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్గా తీసుకోకండి. ప్రొఫెషనల్ జిమ్ ఇన్స్ట్రక్టర్, డైట్ కౌన్సెలర్ని కలవండి. ఒకసారి హార్మోన్స్, థైరాయిడ్, సుగర్ టెస్ట్లు చేసుకోండి. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా బరువు తగ్గించుకునే వీలు ఉంటుంది. బీఎమ్ఐ 40 దాటిన వారికి బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తాం. బీఎమ్ఐ 35 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా స్పెషలిస్ట్ని సంప్రదించిన తరువాతే మీకు ఏది సరిపోతుందో అంచనా వేస్తాను. మామూలుగా బేరియాట్రిక్ సర్జరీ అయిన 12– 18 నెలల తరువాత మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చెయ్యాలి. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో మొదట్లో పోషకాల లోపం తలెత్తుతుంది. వాటిని మల్టీ విటమిన్స్తో కవర్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా డైట్ని సూచించాల్సి ఉంటుంది. బీపీ, సుగర్ సమస్యలు తలెత్తకుండా టెస్ట్ చెయ్యాలి. బేరియాట్రిక్ సర్జరీ తరువాత ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఏ సమస్యలూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్లో తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, నెలలు నిండకుండానే ప్రసవమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఒబేసిటీతో ఉన్నప్పటి రిస్క్ కంటే ఈ రిస్క్ చాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మంచి స్పెషలిస్ట్ని కలిసిన తరువాత అన్ని విషయాలు అసెస్ చేసుకుని అప్పుడు బేరియాట్రిక్ సర్జన్ని కలిస్తే మంచిది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
విలయం.. యువ హృదయం!
విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన 40 ఏళ్ల యువకుడు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల ఓ రోజు ఉదయం ఛాతిలో నొప్పి అని చెప్పి కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు విడిచాడు. తీవ్రమైన గుండెనొప్పి కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తేల్చారు. విజయవాడ వన్టౌన్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఛాతిలో నొప్పి అని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో యువతలో గుండె పోటు మరణాలు ఎక్కువగా సంభవించడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. మరీముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. మారుతున్న జీవన శైలి, దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రౖమెన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగానే చిన్న వయస్సులో గుండె జబ్బుల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ని యంత్రించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాల్సిన అవసరముందంటున్నారు. అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించుకుని గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆకస్మిక మరణాలు గుండె ఆగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణా లకు వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు. ధూమపానం, మద్యపానం,ఊబకాయం, వ్యాయామం లేకపోవడం పోస్టు కోవిడ్ గుండె రక్తనాళాల్లో పూడికలు, గుండె కండరాలు ఉబ్బడం(మయోకార్డిటైస్) పల్మనరీ ఎంబోలిజం(గుండె నుంచి ఊపిరి తిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) ముందు జాగ్రత్తే మందు గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిళ్లకు దూరంగా ఉండటం నీరు ఎక్కువగా తీసుకోవడం యువతలో అధికమవుతున్నాయ్.. గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి వారిలో 80 శాతం మందికి గుండెపోటు రావడానికి పొగతాగడం, మద్యం తీసుకోవడం, ఒత్తిడే కారణాలు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్ వేస్తున్నాం. పోస్టు కోవిడ్ వారిలో కూడా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తపోటు, మధుమేహం ఉన్న వారు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా, మెడిటేషన్ను అలవర్చుకోవాలి. – డాక్టర్ బొర్రా విజయ్చైతన్య, కార్డియాలజిస్ట్ -
'ఒబెసిటీ'కి సరికొత్త పేరు..ఇక అలా పిలవొద్దని సూచన!
అధిక బరువు ఉంటే ఒబిసిటీ అని పిలిచేవారు కదా. ఇక నుంచి అలా పిలవకూడదట. ఎందకంటే ఆ పదమే పేషెంట్ సమస్యకు మరింత కారణమవుతుందని, అందువల్ల దానికి పేరు మార్చాలని ఆరోగ్య నిపుణులు నిర్ణయించారు. అధిక బరువు ఉన్నవాళ్లని సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిందే. పలువురుతో జరిపిన విస్తృత చర్చల అనంతరం అధికం బరువు సమస్యకు కొత్త పేరు పెట్టాలనే వాదన వినిపించింది. లావుగా ఉన్నవారికి వారు అలా ఉన్నదాని కంటే ఆ పేరే వారిని ఇబ్బందుల పాలు చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే అధిక బరువు సమస్యను మరోక పేరు పెట్టాని నిపుణలు భావించారు. పేరు మార్చాల్సినంత నీడ్.. 1950లలో స్వలింగ సంపర్కాన్ని సామాజిక వ్యక్తిత్వ భంగంగా భావించారు. ఆ తర్వాత అనేక నిరసనలు, వ్యతిరేకతలు గట్టిగా రావడంతో దాన్ని అపకీర్తిగా భావించడం మానేశారు. అదోక మానసిక రుగ్మతకు సంబంధించినదని అంగీకరించారు. అలానే ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. నిజాని నాన్ ఆల్కహాలిక్లకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అని పేరు మార్చాలనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో ఆ తర్వాత ఆ వ్యాధికి మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్" అని పేరు పెట్టారు.ఈ నేపథ్యంలోనే ఒబెసిటీ అనే పదం మార్చడం తప్పనిసరైంది. అదీగాక ఆయా పేషంట్లు ఆ పేరు కారణంగానే సమాజంలోనూ, కుటుంబ పరంగాను వివక్షకు గురవ్వుతున్నారు. కొత్తపేరు బీఎంఐకి మించి ఉండాలి అధిక బరువును బీఎంఐల ద్వారా నిర్ణయిస్తారు. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు ఇది కూడా సరిపోదు. ఇది కండర ద్రవ్యరాశిని లెక్కించదు, శరీర బరువు లేదా కొవ్వు కణజాలం (శరీర కొవ్వు) గురించి సరైన సమాచారం ఇవ్వదు. నిపుణులు సూచించిన కొత్తపేరు ఈ ఒబెసిటీని “అడిపోసిటీ ఆధారిత దీర్ఘకాలిక వ్యాధి” అని పిలవాలని సూచించారు ఆరోగ్య నిపుణులు. దీని పేరులోనే ఆ వ్యాధి ఏంటో అవగతమవుతుంది. జీవక్రియలు పనిచేయకపోవడమే ఈ వ్యాధి లక్షణం అని తెలుస్తుంది. ఈ పేరు కారణంగా సమాజ దృక్పథం మారి చులకనగా చూసే అవకాశం తగ్గుతుంది. అధిక బరవు సమస్య అనేది వ్యాధేనా.. అధిక బరవు అనేది శారీరక లేదా మానసిక వ్యవస్థలు సరిగా పనిచేయక పోవడం వల్ల ఎదురయ్యే సమస్య దీన్నిబట్టి ఆ సమస్యను వ్యాధిగా పరిగణించలేం. మొదట్లో అధిక బరువు హానికరం కాకపోవచ్చు. కొందరూ లావుగా ఉన్నా.. వారికి ఎలాంటి హెల్త్ సమస్యలు ఉత్పన్నం కావు. కొందరికి క్రమేణ అధిక బరువు వివిధ శారీరక సమస్యలకు దారితీస్తుంది. ఈ పేరు మార్పు కారణంగా ప్రజలకు ఆయా వ్యకుల పట్ల చులకన భావం, హేయభావం తగ్గి వారి సమస్యను అర్థం చేసుకునే యత్నం చేయగలుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: కార్యాలయాల్లో ఓన్లీ 'వై' బ్రైక్!ఏంటంటే ఇది!) -
ఒబెసిటీ, హైబీపీ ఎక్కువే.. పన్నీర్, జంక్ ఫుడ్, నాన్ వెజ్ వల్ల..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీవనశైలి వ్యాధుల సూచికల్లో తెలంగాణ పరిస్థితి అత్యంత పేలవంగా ఉందని తాజా అధ్యయనం తేల్చింది. అలాగే స్థూలకాయం, రక్తపోటు కేసుల సంఖ్య సైతం రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ‘మెటబాలిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్–ఇండియా డయాబెటిస్ (ఐసీఎంఆర్ ఐఎన్డీఐఏబీ) పేరిట లాన్సెట్ రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 25 శాతం మంది సెంట్రల్ ఒబేసిటీ, హైపర్టెన్షన్తో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా 2008 అక్టోబర్ 18 నుంచి 2020 డిసెంబర్ 17 మధ్య మొత్తం 1,13,043 మంది (గ్రామీణ ప్రాంతాల నుంచి 79,506 పట్టణ ప్రాంతాల నుంచి 33,537 మంది)పై నిర్వహించిన అధ్యయన ఫలితాలను లాన్సెట్ ఇటీవల ప్రచురించింది. ఊబకాయం కేసులలో తెలంగాణ రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మణిపూర్, మిజోరం, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హరియాణా, ఢిల్లీల సరసన నిలుస్తోంది. దీనికి కారణం ఉదర ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్కు మధ్య దగ్గరి సంబంధం ఉండటమేనని వైద్య నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం.. ప్రాసెస్డ్ ఫుడ్ తినడం.. లాన్సెట్ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజల్లో ఊబకాయం, రక్తపోటు, ట్రైగ్లిజరిడెమియా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ‘ఇది తక్కువస్థాయి శారీరక శ్రమతోపాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల పెరుగుతున్న సమస్య. ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న రోగులను ఇప్పుడు తరచుగా చూస్తున్నాం. ఇవి మెటబాలిక్ సిండ్రోమ్ సంకేతాలు. చికిత్స తీసుకోకుంటే గుండె, మూత్రపిండాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి’’ అని నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల వివరించారు. హైపర్ టెన్షన్... స్లీప్ అప్నియాలకూ దోహదం.. ‘పన్నీర్, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధికస్థాయి కొలస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. దీనికితోడు డెస్క్ జాబ్లు సెంట్రల్ ఒబేసిటీకి దారితీస్తున్నాయి. ఊబకాయంతో గుండె జబ్బులు, మధుమేహమే కాకుండా హైబీపీ, స్లీప్ యాప్నియా వంటి ఇతర జబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సమస్యలకు అధిక మద్యపానం కూడా ఒక ప్రధాన కారణం’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలవాట్లను కట్టడి చేస్తేనే.. పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు అధికంగా చేరడాన్నే సెంట్రల్ ఒబేసిటీగా పేర్కొంటారు. పెరిగిన విసరల్ ఫ్యాట్ పోర్టల్ బ్లడ్ సిస్టమ్ ద్వారా సరఫరా అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోని అదనపు కొవ్వు రక్తప్రవాహంలోకి కొవ్వు నిల్వలను విడుదల చేస్తుందన... ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపధ్యంలో వ్యాయామం, శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం తప్పనిసరని వారు సూచిస్తున్నారు. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్ @ 68
పేదరికాన్ని ఓల్డ్సిటీ చూపించింది. దాతృత్వాన్ని నాన్న వైద్యం నేర్పించింది. ఆరోగ్య భద్రతా లేమిని ఆదివాసీ జీవనం తెలిపింది. అందంగా జీవించడాన్ని బాల్య స్నేహం చెప్పింది. కొండంత సాహసాన్ని తనకు తానే చేసింది. డాక్టర్ శోభాదేవి రాసుకున్న రికార్డుల జాబితా ఇది. ‘‘నేను జర్నలిస్ట్ని కావాలనుకున్నాను. మా నాన్న నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. ఆయన మాటే నెగ్గింది. కానీ నా అచీవ్మెంట్స్తో తరచూ జర్నల్స్లో కనిపిస్తూ ఉండటం ద్వారా నేను సంతోషిస్తున్నాను’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. హైదరాబాద్, హిమాయత్ నగర్లో పుట్టి పెరిగి, వెస్ట్ మారేడ్పల్లిలో స్థిరపడిన శోభాదేవి ఒక గ్లోబల్ పర్సనాలిటీ. డయాబెటిస్ అండ్ ఒబేసిటీ స్పెషలిస్ట్గా ఆమె పదికి పైగా దేశాల్లో సెమినార్లలో పాల్గొని అధ్యయనాల పేపర్లు సమర్పించారు. కోవిడ్ సమయంలో రోజుకు పద్దెనిమిది గంటల సేపు ఆన్లైన్లో అందుబాటులో ఉంటూ సేవలందించిన ఈ డాక్టర్ తన పేషెంట్లను హాస్పిటల్ గడప తొక్కనివ్వకుండా ఆరోగ్యవంతులను చేశారు. అందుకు ప్రతిగా ఆమె డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు ముందు ఆ తర్వాత దేశవిదేశాల్లో ఆమె అందుకున్న పురస్కారాల సంఖ్య వందకు పైగానే. వెస్ట్ మారేడ్పల్లిలోని ఆమె ఇంట్లో రెండు గదులు మెమెంటోలతో నిండిపోయి ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు 8కె చేరుకుని మరో రికార్డు సృష్టించుకున్నారు. అది బేస్ క్యాంపుకు చేరిన రికార్డు మాత్రమే కాదు. 68వ ఏట ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించడం, మిసెస్ ఇండియా విజేత, అందాల పోటీ కిరీటధారి ఎవరెస్ట్ను అధిరోహించడం కూడా రికార్డులే. ప్రతి రోజునూ స్ఫూర్తిదాయకంగా మలుచుకోవడం ఒక కళ. ఆ కళ ఆమె చేతిలో ఉంది. ఇలాంటి సాహసాలు, సరదాలతోపాటు నల్లమల, భద్రాచలం, ఆసిఫాబాద్ జిల్లాల్లో నివసించే ఆదివాసీలకు ఆరోగ్య చైతన్యం కలిగించడం ఆమెలో మరో కోణం. ‘ఒక డాక్టర్గా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్వించడానికి ఎప్పుడూ ముందుంను. అది తండ్రి నేర్పిన విలువల నుంచి గ్రహించిన జీవితసారం’ అన్నారామె. వైవిధ్యభరితమైన తన జీవితప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు డాక్టర్ శోభాదేవి. నాన్న నేర్పిన విలువలు ‘‘మా నాన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా పని చేశారు. అమ్మ రోజరీ కాన్వెంట్ స్కూలో టీచర్. అలా నేను అదే స్కూల్లో చదివాను. నాన్న ఆసక్తి కొద్దీ హోమియోవైద్యం కోర్సు చేసి ఉచితంగా వైద్యం చేసేవారు. నన్ను మెడిసిన్ చదివించడం కూడా నాన్న ఇష్టమే. ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో నాకు బాలికల కేటగిరీలో రెండవ ర్యాంకు, జనరల్ కేటగిరీలో ఎనిమిదవ ర్యాంకు వచ్చింది. ఉస్మానియాలో ఎంబీబీఎస్ తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుంచి డయీబెటిస్లో పీజీ, యూకేలో ఒబేసిటీలో కోర్సు చేసి అక్కడ దాదాపు ఇరవై ఏళ్లు పని చేశాను. నాన్న కోసం తిరిగి ఇండియా వచ్చేసి హైదరాబాద్లో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. ఓల్డ్సిటీలో అడిగి మరీ పోస్టింగ్ వేయించుకున్నాను. పేదరికం ఎంత దారుణంగా ఉంటుందో కళ్లారా చూశాను. పేషెంట్లకు చాయ్, బన్నుకు డబ్బిచ్చి తినేసి రండి మందులు రాసిస్తానని పంపేదాన్ని. ‘భగవంతుడు మనల్ని చాలామంది కంటే మెరుగైన స్థానంలో ఉంచాడు. భగవంతుడిచ్చింది అంతా మన కోసమే కాదు, ఆకలితో ఉన్న వాళ్ల కోసం పని చేయాల్సిన బాధ్యతను కూడా ఇచ్చి ఈ భూమ్మీదకు పంపాడు. సమాజానికి తిరిగి మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి’ అని నాన్న ఎప్పుడూ చెప్పే మాట తరచూ గుర్తు వచ్చేది. ఆ ప్రభావంతోనే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వాళ్లకు సహాయం చేయడం చిన్నప్పుడే అలవాటైంది. ఆదివాసీల జీవనశైలి గురించి నాకు తెలిసింది బాగా పెద్దయిన తర్వాత మాత్రమే. అడవిలో నివసిస్తూ అక్కడ దొరికే ఆహారం తింటూ కడుపు నింపుకోవడమే వాళ్లకు తెలిసింది. సమతుల ఆహారం అంటే ఏమిటో తెలియదు. సీజన్లో వచ్చే జ్వరాల గురించి అవగాహన కూడా తక్కువే. వాళ్లకు ఆహారం గురించి ఆరోగ్యం చైతన్యవంతం చేయడంతోపాటు ఎసెన్షియల్ ఫుడ్ పౌడర్లు, వంటపాత్రలు, దుప్పట్లు ఇవ్వడం మొదలు పెట్టాం. అన్ని రకాల కాయగూరలను పండించుకోవడంలో శిక్షణ ఇచ్చాం. మనిషి జీవితంలో ఆహారం, ఆరోగ్యం ప్రధాన భూమిక పోషిస్తాయనే అవగాహన కల్పించగలిగాను. బాల్య స్నేహితురాలి చొరవ బ్యూటీ పాజంట్ అవతారం ఎత్తడానికి కారణం నా స్కూల్ ఫ్రెండ్ రేణుక. మా అబ్బాయిలిద్దరూ యూఎస్లో సెటిలయ్యారు. మా వారు 2015లో మాకు దూరమయ్యారు. ఇంత ఇంట్లో నేనొక్కర్తినే, ఎప్పుడూ ఏదో ఒక పనిలో నన్ను నేను నిమగ్నం చేసుకుంటూ నిబ్బరంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రేణుక ఆల్బమ్ చేయిస్తానని నా ఫొటోలు తీసుకుని వెళ్లి ‘2019 మిసెస్ తెలంగాణ’ పోటీలకు పంపించేసింది. ఆ తర్వాత నాకు అన్ని ఈవెంట్లలో పాల్గొనక తప్పలేదు. ఫైనల్స్ సమయంలో స్కాట్లాండ్లో ఒబేసిటీ మీద ఇంటర్నేషనల్ సెమినార్కి వెళ్లాను. ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఒకటే తిట్లు. చివరి నిమిషంలో వచ్చి ఫైనల్ రౌండ్ పూర్తి చేశాను. మిసెస్ ఇండియా పోటీలకు ఇలా ఒకదానితో ఒకటి ఓవర్లాప్ కాకుండా జాగ్రత్త పడ్డాను. మిసెస్ ఇండియా విజేత అయినప్పుడు 63 పూర్తయి 64లో ఉన్నాను. సక్సెస్ ఇచ్చే కిక్ని బాగా ఎంజాయ్ చేశాననే చెప్పాలి. నేనే ఉదాహరణ అప్పటి వరకు నేనందుకున్న పురస్కారాల సమయంలో స్ఫూర్తిదాయకమైన మహిళగా ప్రశంసిస్తుంటే నా అర్హతలకు మించిన గౌరవం ఇస్తున్నారేమో అనిపించేది. ఈ వయసులో నేను సాధించిన ఈ లక్ష్యం నన్ను సంతోషంలో ముంచెత్తుతోంది. ప్రాణం పోయినా ఫర్లేదనే సంసిద్ధతతో మొదలు పెడతాం, అవాంతరాలెదురవుతాయి, కానీ సాధించి తీరాలనే సంకల్ప శక్తితో ముందుకెళతాం. లక్ష్యాన్ని చేరిన తర్వాత కలిగే ఆత్మవిశ్వాసంతో కూడిన అతిశయం చాలా గొప్ప భావన. చైతన్యవంతంగా ముందడుగు వేయాలనుకునే మహిళలకు నేనొక ప్రత్యక్ష నిదర్శనం’’ అన్నారు డాక్టర్ శోభాదేవి. పర్వతం పెద్ద చాలెంజ్ ఎవరెస్ట్ బేస్క్యాంప్ ఆరోహణ ఆలోచన మెడిసిన్ క్లాస్మేట్స్తో న్యూజిలాండ్ టూర్లో వచ్చింది. అక్కడ గ్లేసియర్లు, ట్రెకింగ్ జోన్లు చూసినప్పుడు ఇదేపని మన దగ్గర ఎందుకు చేయకూడదు అనుకున్నాం. కానీ మన దగ్గర పర్వతారోహణ శిక్షణ కేంద్రాలుండవు. జిమ్, కేబీఆర్ పార్క్, సిటీలో క్రాస్ ఓవర్ బ్రిడ్జిలు, కర్నాటకలో నందిహిల్స్ నా శిక్షణ కేంద్రాలయ్యాయి. ఎవరెస్ట్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేసింది. డాక్టర్గా నా వృత్తికి నూటికి నూరుశాతం సేవలందించాల్సిన సమయం అది. నా పేషెంట్ల నంబర్ రాసుకోలేదు కానీ పేషెంట్లకు మందులు, ఇతర జాగ్రత్తలు, ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్లో రోజూ తెల్లవారు జామున రెండు– మూడు గంటల వరకు ఆన్లైన్లో టచ్లో ఉండేదాన్ని. ఆ తర్వాత నాకూ కోవిడ్ వచ్చింది, తగ్గింది. కానీ వెన్ను పట్టేయడం, ఫ్రోజన్ షోల్డర్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాలు బాధించాయి. వాటన్నింటినీ చాలెంజ్గా తీసుకుని బయటపడి పర్వతారోహణ చేశాను. మేనెల ఆరవ తేదీ హైదరాబాద్ నుంచి బయలేరి ఖాట్మండూకు వెళ్లాను. ఎనిమిదో తేదీన ‘లుక్లా’ నుంచి నడక మొదలు పెట్టి 15వ తేదీకి బేస్ క్యాంపులో ఎత్తైన శిఖరం ‘8కె’కి చేరాను. ఈ ట్రిప్లో నేను పర్వతారోహకులకు మార్గాన్ని సుగమం చేసే షెర్పాల దయనీయమైన జీవితాన్ని దగ్గరగా చూశాను. ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులు చేస్తుంటారు వాళ్లు. – వాకా మంజులారెడ్డి -
ఇంత బరువున్నావ్.. ఎక్కువ రోజులు బతకవ్.. దెబ్బకు 165 కిలోలు తగ్గాడు..
వాషింగ్టన్: బరువు విపరీతంగా పెరిగిపోయి సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తికి డాక్టర్లు చెప్పిన విషయం దిమ్మతిరిగేలా చేసింది. ఇలాగే ఉంటే 3-5 ఏళ్లకు మించి బతకవు, నీ టైం బాంబ్ కౌంట్ డైన్ స్టార్ట్ అయింది.. అనే మాట అతడి జీవితాన్ని మార్చేసింది. అమెరికా మిసిసిప్పికి చెందిన 42 ఏళ్ల ఈ వ్యక్తి పేరు నికోలస్ క్రాఫ్ట్. 2019లో ఇతని బరువు 294 కిలోలు. వైద్యులు షాకింగ్ విషయం చెప్పిన తర్వాత ఎలాగైనా బరువు తగ్గాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే డైట్ మొదలుపెట్టాడు. నెల రోజుల్లోనే 40 కిలోలు తగ్గాడు. దీంతో అతడి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అప్పటి నుంచి డైట్తో పాటు వ్యాయామం చేస్తూ 165 కిలోల బరువు తగ్గాడు క్రాఫ్ట్. ప్రస్తుతం ఇతని బరువు 129 కేజీలు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడటమే గాక ఆరోగ్యంగా తయారయ్యాడు. అయితే తాను డిప్రెషన్లోకి వెళ్లి అధికంగా తినడం వల్లే బరువు పెరిగినట్లు క్రాఫ్ట్ చెప్పుకొచ్చాడు. తనకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని పేర్కొన్నాడు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతోనే ఒత్తిడి నుంచి బయటపడి బరువు తగ్గినట్లు చెప్పకొచ్చాడు. 165 కిలోల బరువు తగ్గడంతో క్రాఫ్ చర్మమంతా వదులైంది. దీంతో నొప్పి వచ్చి అతను ఇబ్బందిపడుతున్నాడు. శస్త్రచికిత్స చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే దీనికి ఇన్సూరెన్స్ వర్తించదని, ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు. చదవండి: ఆమె పోరాడింది.. టాప్లెస్ సమానత్వం సాధించింది -
మధుమేహ భారతం! 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!
సమాజాన్ని దీర్ఘకాలిక వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మరణాల్లో 65 శాతం దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని... అధిక బరువు, ఊబకాయం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ప్రజల్లో 73 శాతం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తేల్చిచెప్పింది. ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధులపై ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సహా 21 సంస్థలు సర్వే చేశాయి. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల నుంచి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 10,659 మందిని (18–69 ఏళ్ల వయసు వారు) సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించాయి. తెలంగాణలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సర్వే చేసింది. సర్వే నివేదికపై పార్లమెంటు ఇటీవల చర్చించింది. దేశంలో దీర్ఘకాలిక వ్యాధులపై జరిగిన మొట్టమొదటి సర్వే ఇదేనని కేంద్రం తెలిపింది. – సాక్షి, హైదరాబాద్ సర్వేలో వెల్లడైన అంశాలు... ►2019లో దేశంలో దీర్ఘకాలిక జబ్బులతో 61 లక్షల మంది చనిపోయారు. అందులో షుగర్తో 1.70 లక్షల మంది మరణించారు. 1990తో పోలిస్తే దీర్ఘకాలిక వ్యాదులతో మరణించే వారి సంఖ్య రెట్టింపు అయింది. ►ధూమపానం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 15.5 శాతం ఎక్కువ. అధికంగా పొగతాగడం వల్ల కేన్సర్ ముప్పు సైతం 39 శాతం పెరుగుతుందని సర్వే తేల్చింది. ఉప్పుతో పెరుగుతున్న ముప్పు... ►సర్వేలో పాల్గొన్న వారిలో సగటు ఉప్పు వినియోగం 8 గ్రాములుగా వెల్లడైంది. అందులో పురుషుల్లో ఉప్పు సగటు వినియోగం 8.9 గ్రాములుకాగా, మహిళలు 7.1 గ్రాములు వాడుతున్నారు. పట్టణాల్లో 8.3 గ్రాములు, పల్లెల్లో 8 గ్రాముల మేర వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినదానికంటే దేశంలో రెట్టింపు ఉప్పు వినియోగం జరుగుతోంది. ‘పొగ’బారిన 33% మంది సర్వే ప్రకారం దేశంలో 32.8 శాతం మంది పొగతాగుతున్నారు. అందులో పురుషులు 51.2 శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం, పల్లెల్లో 36.8 శాతం పొగ తాగుతున్నారు. ►15.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. అందులో పురుషులు 28.3 శాతం, మహిళలు 2.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 14.2 శాతం, పల్లెల్లో 16.7 శాతం ఉన్నారు. అందులో అధిక మద్యం సేవించేవారు 5.9 శాతం మంది ఉన్నారు. అధిక మద్యం సేవించేవారిలో పురుషులు 10.9 శాతం, 0.5 శాతం మహిళలున్నారు. పట్టణాల్లో 10.7 శాతం, పల్లెల్లో 6.1 శాతం అధిక మద్యం సేవిస్తున్నారు. దేశంలో మద్యం వినియోగించే వారిలో 20–35 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నారు. వేధిస్తున్న ఊబకాయం... ►సర్వేలో పాల్గొన్న వారిలో 41.3 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో పురుషులు 30.9 శాతం మంది, మహిళలు 52.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 51.7 శాతం, గ్రామాల్లో 36.1 శాతం మంది చేయడంలేదు. ►26.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అందులో పురుషులు 23.3 శాతం, మహిళలు 29.3 శాతం ఉన్నారు. పట్టణాల్లో 42.5 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు, గ్రామాల్లో ఇది 18 శాతంగా ఉంది. పెరుగుతున్న బీపీ, షుగర్... ►28.5 శాతం మందిని బీపీ పట్టిపీడిస్తోంది. పురుషుల్లో 29.9 శాతం, మహిళల్లో 27 శాతం బీపీతో బాధపడుతున్నారు. ఇక పట్టణాల్లో 34 శాతం, గ్రామాల్లో 25.7 శాతం మంది బీపీతో ఉన్నారు. ►9.3 శాతం మంది షుగర్తో బాధపడుతున్నారు. అందులో పురుషుల్లో 8.5 శాతం, మహిళల్లో 10.2 శాతం షుగర్ ఉంది. పట్టణాల్లో 14.4 శాతం, గ్రామాల్లో 6.9 శాతంగా ఉంది. 2040 నాటికి ‘బరువు’మూడింతలు ►సర్వే అంచనాల ప్రకారం 2040 నాటికి అధిక బరువు బాధితుల సంఖ్య రెట్టింపు కానుంది. ఊబకాయం బాధితుల సంఖ్య మూడింతలు అవుతుంది. బీఎంఐ 25–30 మధ్య ఉంటే అధిక బరువు అంటారు. బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయం అంటారు. నడుము చుట్టుకొలత పురుషుల్లో 90 సెంటీమీటర్లు, మహిళల్లో 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే అధిక పొట్ట ఉన్నట్లు లెక్క. ►బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే అధికంగా ఉన్నట్లు. షుగర్ ఫాస్టింగ్ 126 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్లు లెక్క. వ్యాయామానికి విరామం... ►ఈ సర్వే ప్రకారం దేశంలో 98.4 శాతం మంది నిర్ణీత పరిమాణంలో కూరగాయలు, పండ్లు తీసుకోవడంలేదు. ►వారానికి కనీసం 150 నిమిషాలపాటు తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయి లేదా 75 నిమిషాలపాటు తీవ్రస్థాయిలో శారీరక శ్రమ చేయాలి. ఆ ప్రకారం శారీరక శ్రమ చేయనివారు 41.3 శాతం మంది ఉన్నారు. ప్రతి మూడు మరణాల్లో రెండు అవే... గత 30 ఏళ్లలో జీవనశైలి జబ్బుల ప్రభావం భారతీయుల్లో రెట్టింపైంది. దేశంలో ప్రస్తుతం సంభవించే ప్రతి 3 మరణాలలో రెండు వీటికి చెందినవే. తగిన శారీరక శ్రమ, బరువును అదుపులో ఉంచుకోవడం, తాజా కూరగాయలు, పండ్లు రోజుకు 400 గ్రాములకు తగ్గకుండా తీసుకోవడం ద్వారా ఈ జబ్బులను దూరం చేయవచ్చు. – డాక్టర్ హరిత, వైద్యురాలు, నిజామాబాద్ -
లావైపోతున్నారు! ముంచేస్తున్న ఆహారపు అలవాట్లు
ఊబకాయం.. ఇప్పుడు సాధారణమైపోయింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య పీడిస్తోంది. దీని ప్రభావం శరీరంలోని మిగతా అవయవాల మీద పడుతోంది. ఫలితంగా గుండె, కిడ్నీ, మధుమేహం వంటి వ్యాధులకు మూలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఊబకాయం నివారణకు జీవనశైలిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత ఆహారపు అలవాట్లు లావు కావడానికి ఒక కారణమైతే, సరైన వ్యాయామం లేకపోవడం మరో కారణమని జాతీయ ఆరోగ్య మిషన్ చేసిన సర్వేలో తేలింది. శ్రమగల జీవన విధానం, సమతులాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సర్వే స్పష్టం చేసింది. సాక్షి, చిత్తూరు రూరల్: ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం పెరిగిపోతోంది. దానికి తోడు వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అధిక బరువు ఉన్న వారిని గుండె జబ్బులతో పాటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, కీళ్ల సమస్యలు వెంటాడుతున్నాయి. ఊబకాయులు ఇటీవల అనేక దుష్ఫలితాలతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. కార్డియాలజీ రోగుల్లో 25 శాతం మంది ఊబకాయులే ఉంటున్నారు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిర్వహిస్తున్న నాన్ కమ్యూనికల్ డిసీజెస్ (ఎన్ఎసీడీ) సర్వేలో సైతం ఒబెసిటీ కారణంగా రక్త పోటు, మధుమేహం, గుండె జబ్బులు సోకుతున్నట్లు తేలింది. జిల్లాలో 17,54,254 మంది ఉండగా 12,99,758 మందిని ఎన్సీడీ సర్వే చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సర్వే 74.09శాతం పూర్తయింది. అయితే ఈ సర్వేలో బీపీతో బాధపడుతున్నవారు 1,96,772 మంది, మధుమేహంతో 1,96,957 మంది, రెండు ఉన్నవారు 17,675 మంది ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం ప్రజల ఆహార అలవాట్లు, జీవనశైలి, అధికబరువు వంటివి అని వైద్యులు చెబుతున్నారు. బరువుతో గుండె బలహీనత గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ఊబకాయులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కార్డియాలజీ ఓపీల సంఖ్య పెరుగుతోంది. రోజుకు జిల్లాలో 200 నుంచి 250 మంది వరకూ రోగులు వస్తున్నట్లు వైద్యులు లెక్కలు చెబుతున్నాయి. వారిలో 25 శాతం మంది అంటే 55 మంది ఊబకాయులే. వారిలో గుండె రక్తనాళాలు సన్నబడి బ్లాకులు ఏర్పడటం, గుండెపై తీవ్ర ఒత్తిడి, పల్మనరీ ఎంబోలిజమ్, పల్మనరీ హైపర్ టెన్షన్ వంటి సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు. రక్తనాళాల్లో బ్లాకులు ఉన్న వారికి వాటిని తొలగించి స్టెంట్లు వేస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఒబెసిటీ కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పడుతోంది. ఆ కారణంగా ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. దీంతో యూరిన్లో ప్రొటీన్లు లీకవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాళ్ల వాపులు రావడం, కిడ్నీలు పూర్తిగా పాడైన వారిని చూస్తున్నారు. ఊబకాయుల్లో వచ్చే మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న వారు డయాలసిస్ కోసం వస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిత్యం 50 నుంచి 65 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇతర వ్యాధులు ఒబెసిటీ వారిలో రక్తపోటు, మధుమేహం వలన వచ్చే దుష్ఫలితాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒబెసిటీ ఉన్న వారిలో పదిశాతం మందికి గాల్బ్లాడర్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఫ్యాటీ లివర్ ఏర్పడి, దీర్ఘకాలంలో తీవ్రమైన లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి. మోకీళ్లపై ప్రభావం చూపి, నాలుగు పదుల వయసులోనే మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తోంది. బరువు పెరగడానికి కారణాలు పట్టణాల నుంచి పల్లెల వరకు జంక్ఫుడ్ వినియోగం పెరిగింది. పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ఫుడ్, ఐస్క్రీమ్లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోని కొన్ని యాప్లద్వారా జంక్ఫుడ్ను ఆర్డర్ పెడితే క్షణాల్లో గుమ్మం ముందు డెలివరీ చేస్తున్నారు. దీనికి తోడు రెస్టారెంట్లలో విక్రయించే ఆహారాల్లో బిర్యానిదే మొదటిస్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండడం, వీటికి తోడు కూల్డ్రింక్లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మగవారితోపాటు అధికంగా మహిళలకు ఊబకాయం వచ్చేస్తోంది. ఇలా చేస్తే మేలు దేశంలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23.5 దాటిన వారందరినీ ఊబకాయులుగా భావిస్తారు. వారు బరువు తగ్గేందుకు శ్రమగల జీవన విధానం, సమతుల ఆహారం తీసుకుంటే సత్పలితాలు రాబట్టవచ్చు. బరువు తగ్గేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక విధానాలు ఉన్నాయి. దీర్ఘకాల విధానంలో వారానికి మూడు, నాలుగు గంటలు వ్యాయామం ద్వారా బరువు చేయడం తగ్గించుకోవచ్చు. స్వల్పకాలంలో రోజుకు వెయ్యి కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. బీఎంఐ27 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పద్ధతులను అనుసరించినా బరువు తగ్గకుంటే బీఎంఐ 30 శాతం దాటిన వారికి బేరియాట్రిక్ (మెటబాలిక్) సర్జరీలతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. బరువు తగ్గితే మంచిది ఊబకాయం ఉన్న మధుమేహులు తమ బరువులో ఐదు శాతం తగ్గించుకోగా తక్కువ మందులతో మెరుగైన వ్యాధి నియంత్రణా ఫలితాలు రాబట్టవచ్చు. హృద్రోగ సమస్యలను నివారించుకోవచ్చు. సమతుల ఆహారం, క్రమగల జీవన విధానం, జీవనశైలిలో మార్పులు పాటించడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఊబకాయుల్లో మధుమేహ నియంత్రణకు ఆధునిక మందులు అందుబాటులోకి వచ్చాయి. – డాక్టర్ అరుణ్కుమార్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
బొద్దు..వద్దమ్మా..! మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం
అందానికి, ఆకృతికి మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే జీవన శైలిలో వచ్చిన మార్పులతో మగువలు బొద్దుగా మారుతున్నారు. స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 29 శాతం మంది మహిళలు అధిక బరువుతో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్నూలు(హాస్పిటల్): ఇంటి పనితోపాటు పిల్లల బాధ్యత చూస్తూ మహిళలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వంట చేసే సమయం లేక కొందరు బయట నుంచి ఆహారాన్ని తెచ్చుకుని ఆరగిస్తున్నారు. కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత అంచనాల ప్రకారం 48 లక్షల జనాభా ఉంది. అందులో మహిళలు 23 లక్షలకు పైగా ఉన్నారు. వీరిలో 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు 16 లక్షల వరకు ఉన్నారు. మొత్తం మహిళా జనాభాలో 29 శాతం అంటే 6.67లక్షల దాకా స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నట్లు ఐదో జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడవుతోంది. పట్టణాల్లోనే అధికం.. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లోని మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 32.6 శాతం స్థూలకాయులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేసే వారు అధికం. దీంతో పల్లెల్లో ఊబకాయుల సంఖ్య తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలకు విరుద్దంగా పట్టణాల్లో పరిస్థితి ఉండడంతో లావైపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎక్కువ మంది ఇంటి పనిలో యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఒక వైపు కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దడం, మరోవైపు ఉద్యోగ బాధ్యతలతో కొందరు కొన్నిసార్లు ఒకపూట ఆహారం తీసుకోకపోవడం, తర్వాత తీసుకున్నా ఒకేసారి ఎక్కువ తినడం చేస్తున్నారు. ఫలితంగా వారిలో స్థూలకాయ సమస్య తలెత్తుతోంది. గృహిణిలైతే ఇంట్లో ఒక్కరే ఉండటం, అత్తా, తోడి కోడళ్లు ఉంటే వారితో పొసగకపోవడం వంటి కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా ఊబకాయం పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. జంక్ఫుడ్తో అసలు సమస్య కార్పొరేట్ కంపెనీలు నగరాల నుంచి పట్టణాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్ ఫుడ్, ఐస్క్రీమ్లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోనే జొమాటో, స్విగ్గీల ద్వారా జంక్ఫుడ్ను ఆర్డర్ పెట్టేసి మరీ తెప్పించుకుని తింటున్నారు. దీనికితోడు రెస్టారెంట్లలో విక్రయించి ఆహారాల్లో బిర్యానీదే మొదటి స్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండటం, వీటికితోడు కూల్డ్రింక్లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మహిళల్లో ఊబకాయం వచ్చేస్తోంది. క్యాన్సర్ వచ్చే అవకాశం సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. బరువు పెరిగితే గర్భాశయంలో నీటి బుడగలు వచ్చి సంతానలేమి సమస్య ఎదురవుతుంది. వీరికి భవిష్యత్లో టైప్–2 డయాబెటీస్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యకు హార్మోన్ మాత్రలు ఇవ్వడం వల్ల మరింత ఊబకాయం వస్తుంది. అధిక బరువు వల్ల బీపీ, షుగర్, గుండెజబ్బులు సైతం వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్లకు కూడా ఊబకాయం దారి తీస్తుంది. –డాక్టర్ కె. కావ్య, గైనకాలజిస్టు, కర్నూలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి తినే ఆహారానికి సరిపడా వ్యాయామం చేయకపోవడం వల్లే ఊబకాయం వస్తోంది. ఈ సమస్య నివారణకు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వేపుళ్లు, తీపి పదార్థాలు తగ్గించాలి. ఐస్క్రీమ్లు, జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్ మానేయాలి. ఇంట్లో వండిన ఆహారాన్నే తినేందుకు సుముఖత చూపాలి. ఆహారంలో అధికంగా కూరగాయలు, పండ్లు, నట్స్ ఉండేలా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు, కార్పొహైడ్రేట్లు తగ్గించుకోవాలి. వేళకు భోజనం చేయడం, నియమిత వ్యాయామం చేయడం, ప్రశాంతంగా ఉండడం వల్ల ఊబకాయాన్ని నియంత్రించుకోవచ్చు. –డాక్టర్ జి. రమాదేవి, పోషకాహార నిపుణురాలు, కర్నూలు వ్యాయామం తప్పనిసరి ఎంతైనా తిను...తిన్న దానిని అరిగించు అనేది నేటి తరం వైద్యుల మాట. కానీ తిన్న తర్వాత కూర్చోవడమే పనిగా చాలా మంది మహిళలు ఉంటున్నారు. తినడం ఆ తర్వాత మొబైల్, టీవీలు చూస్తూ కూర్చోవడం వల్ల ఊబకాయం పెరిగిపోతోంది. ఉదయం లేవగానే ఓ గంటపాటు వ్యాయామం చేసే ఓపిక చాలా మందిలో ఉండటం లేదు. కేవలం ఒకటి నుంచి నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే యోగాశ్రమాలు, జిమ్లు, వాకింగ్కు వెళ్లి శారీరక శ్రమ చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థినులకు ఆటలే ఉండటం లేదు. వీరే అధికంగా ఆహారాన్ని తింటూ ఎక్కువ సేపు తరగతుల్లో గడుపుతున్నారు. వీరిలోనూ సమస్య అధికమవుతోంది. ఇదీ చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
మహిళల్లో పెరుగుతున్న స్థూలకాయం
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధితో పాటు అనారోగ్య కారక జీవనశైలికీ మన నగరం కేంద్రంగా మారుతోంది. ఇక్కడి మహిళల్లో ఒబెసిటీకి కూడా చిరునామాగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఓ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఒబెసిటీకి నగరం రాజధానిగా నిలిచింది. దేశంలో 15 నుంచి 49 సంవత్సరాల వయసు పురుషుల కంటే స్త్రీలలో అధిక బరువు/ఊబకాయం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో పురుషుల (22.9%) కంటే మహిళలు (24%) ముందున్నారు. జాతీయ ఆరోగ్య సర్వే ఆధారంగా నగరం కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ నిర్వహించిన అధ్యయనం ఈ అంశాలను తేటతెల్లం చేసింది. పెరుగుదలలో మనం తక్కువే.. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అధ్యయనం ప్రకారం మహిళల్లో అధిక బరువు/ఊబకాయం డేటాను పోల్చినప్పుడు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఒబెసిటీ సంఖ్యలు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. మహిళలు, పురుషులిరువురి విషయంలోనూ ఉత్తర భారతం కంటే దక్షిణ భారతమే ముందంజలో ఉంది. పెరుగుదల ప్రకారం చూస్తే.. జాతీయ స్థాయిలో, ఊబకాయం 3.3% పెరగగా, దక్షిణాది రాష్ట్రాల్లో అంతకు మించి వేగంగా పెరుగుతోంది. ఈ విషయంలో 9.5%తో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా, వరుసగా 6.9%, 5.7%లతో కర్ణాటక, కేరళ దానిని అనుసరిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం 2%తో అత్యల్పంగా ఉండడం ఊరటనిచ్చే అంశం. రాష్ట్రంలో సిటీ టాప్... దేశవ్యాప్తంగా 120 జిల్లాలు, మన రాష్ట్రంలో 31 జిల్లాల్లో నిర్వహించిన అధ్యయనంలో.. మహిళల్లో ఊబకాయం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. మన జిల్లాలో 51% మంది ఊబకాయంతో బాధపడుతున్నారని తేలింది. అదే సమయంలో 14%తో అతి తక్కువ ఊబకాయులున్న కుమరంభీం ఆసిఫాబాద్ ఈ జాబితాలో అట్టడుగున ఉంది. అదే విధంగా గ్రామీణ ప్రాంత మహిళల కంటే పట్టణ మహిళలే ఎక్కువ ఊబకాయంతో బాధపడుతున్నారని, సంపన్న, నిరుపేద వర్గాలతో పోలిస్తే మధ్యతరగతి వర్గాలలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇందులోంచి గర్భిణులు, బాలింతలను మినహాయించారు. అందుబాటులోకి కొత్త పరిష్కారాలు ఓ వైపు ఒబెసిటీ బాధితులు పెరుగుతున్న కొద్దీ మరోవైపు కొత్త పరిష్కార మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. డైట్, వర్కవుట్స్ వంటి సహజమైన పద్ధతులను అనుసరించి బరువు తగ్గే విధానాలతో పాటు సర్జరీలు, మందులు, ఇంజెక్షన్లు వగైరా రోజుకోటి నగరంలో వెల్లువెత్తుతున్నాయి. ‘ఒబెసిటీ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి పరిష్కారాలు వీలైనంత సులువుగా ఇతరత్రా ఇబ్బందులు కలగించనివిగా ఉండాలని ఆధునిక మహిళలు కోరుకుంటున్నారు’ అని చెప్పారు వెయిట్లాస్కి ఉపకరించే క్యాప్సూల్ తరహా గ్యా్రస్టిక్ బెలూన్ని తాజాగా నగరంలో విడుదల చేసిన అల్యూరిన్ సంస్థ వ్యవస్థాపకులు డా.శంతను గౌర్. -
Payal Kothari: టీబీ.. డిప్రెషన్.. సమస్యలు అధిగమించి హెల్త్ కోచ్గా!
‘‘జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలు భవిష్యత్లో తమతోపాటు ఎంతోమంది జీవితాలను సరిదిద్దుకోవడానికి పాఠాలుగా మారతాయి. కష్టసమయాల్లో కిందపడి కెరటంలా పైకి లేచిన ప్రతిసారి మనకెదురయ్యే పరిష్కార మార్గాలు మన భవిష్యత్ను చక్కగా తీర్చిదిద్దుతాయి. నా జీవితంలో అది జరగబట్టే ఈ రోజు నేను సెలబ్రెటీ గట్ హెల్త్ కోచ్గా మారాను’’ అని చెబుతోంది పాయల్ కొఠారి. ముంబైకి చెందిన పాయల్ కొఠారి కోల్కతాలోని గుజరాతీ జైన్ కుటుంబంలో పుట్టింది. పాయల్కు రెండేళ్లు ఉన్నప్పుడు కుటుంబం ముంబైకి మకాం మార్చి అక్కడే స్థిరపడింది. అక్కడికి వచ్చిన కొద్దిరోజుల్లోనే పాయల్కు టీబీ వచ్చింది. చికిత్స తీసుకున్నాక నయమైంది కానీ జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింది. ఫలితంగా పోషకాహార లోపం ఏర్పడి, పదమూడేళ్లు వచ్చేవరకు బక్కపలుచగా ఉండేది తను. ఫెయిలవడంతో... ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ చదువులో చాలా చురుకుగా ఉండేది పాయల్. కానీ మన సులో ఎప్పుడూ తెలియని నిరాశ వెంటాడేది. ఇలా అనిపించిన ప్రతిసారి విపరీతంగా తింటుండేది. దీంతో తన బరువు అమాంతం పెరిగి ఒబెసిటీ వచ్చింది. ఉన్నట్టుండి బరువు పెరిగిన పాయల్ను మిగతా విద్యార్థులంతా హేళన చేస్తుండేవారు. వారి కామెంట్లను భరించలేని పాయల్ తీవ్ర నిరాశకు లోనై సరిగా చదవలేకపోయేది. దీంతో ఫెయిల్ అయ్యింది. ‘‘ఎవరేమి మాట్లాడినా పట్టించుకోకు, నీ పని నువ్వు చూసుకో’’ అని ఆమె తల్లి పదేపదే చెప్పడంతో డిప్రెషన్ నుంచి బయటపడింది. కాస్త పర్వాలేదు అనుకునేలోపు... మానసికంగా కాస్త పర్లేదు అనుకుంటుండగా..పదోతరగతి పూర్తై కాలేజీలో అడుగుపెట్టిన పాయల్ను పొట్ట ఆరోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీంతో అనేక మ్యాగజీన్లు చదివి తన కడుపు సమస్యకు డాక్టర్ దగ్గర చికిత్స తీసుకుంటూనే కిచిడి, పెరుగన్నం, పండ్లు, నెయ్యి, సూప్లు తీసుకుంటూ పేగుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచి పొట్ట, ఒబెసిటీ సమస్యలను తగ్గించి ఫిట్గా తయారైంది. డిగ్రీ పూర్తయ్యాక ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్ స్కూల్ అయిన న్యూయార్క్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంట్రాగేటివ్ న్యూట్రిషన్(ఐఐఎన్) లో క్లినికల్ న్యూట్రిషన్లో సర్టిఫికెట్ కోర్సులు చేసింది. పదిహేనేళ్ల తరువాత.. కోర్సు పూర్తయ్యాక పాయల్కు ఓ వ్యాపారవేత్తతో వివాహం జరగడంతో భర్తతో హాంగ్కాంగ్ వెళ్లిపోయింది. పదిహేనేళ్లపాటు గృహిణిగా ఉన్న పాయల్ భర్తకు వ్యాపారంలో నష్టం రావడంతో 2016లో ఇండియాకి తిరిగి వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో ఉంటోన్న పాయల్ను చూసిన కొంతమంది ‘‘అధిక బరువు నుంచి ఇంత ఫిట్గా ఎలా తయారయ్యావు? నీ చర్మం కూడా కాంతిమంతంగా ఉంది’’ మాకు కొన్ని టిప్స్ చెప్పు అని అడిగేవారు. దీంతో క్లినికల్ స్టడీ సర్టిఫికెట్ కోర్సు చేయడం, స్వయంగా తను కూడా ఒకప్పుడు ఒబెసిటీ బాధితురాలి నుంచి ఫిట్గా మారిన అనుభవంతో ‘గట్ హెల్త్ కోచ్’ గా మారాలనుకుంది. కోచ్గా పనిచేయడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా సాయపడవచ్చన్న ఉద్దేశ్యంతో వెంటనే గట్ చోచ్గా మారింది. ప్రారంభంలో చుట్టూ ఉన్నవాళ్లకు, ఆ తరువాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటిదాకా రెండు లక్షలమందికి కోచ్గా బాలీవుడ్ సెలబ్రెటీల నుంచి పెద్ద కంపెనీల సీఈఓల వరకు కోచ్గా పనిచేసింది. ఇలా ఇప్పటిదాకా రెండు లక్షలమందికి కోచ్గా పనిచేసి వారి ఆరోగ్యస్థితిగతులను మెరుగుపరిచింది. పెద్దవాళ్లకేగాక స్కూళ్లకు వెళ్లి పిల్లలకు మహిళా క్లబ్బులు, ఎన్జీవోలను సందర్శించి గట్ హెల్త్పై అవగాహన కల్పిస్తోంది. ద గట్ పేరిట బుక్ కూడా రాసింది. ఆన్లైన్ న్యూట్రిషన్ స్కూల్ ప్రారంభించి గట్ ఆరోగ్యం గురించి వివరించడంతోపాటు.. కాలేజీలు, యూనివర్శిటీల్లో సెమినార్లు నిర్వహిస్తోంది. వివిధ ఆర్టికల్స్ రాస్తూ ఫిట్నెస్ పట్ల అనేకమందిలో అవగాహన కల్పిస్తోంది. జాతీయ అంతర్జాతీయ న్యూట్రిషన్ సంస్థలతో కలిసి పనిచేస్తూ పదిమంది మెప్పూ పొందుతోంది పాయల్. చదవండి: Precision Oncology: ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా.. క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో.. -
దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయెజనాలెన్నో..!
ఒక రకరమైన ఇబ్బందికరమైన ఇనుము రుచితో ఉండే ఐరన్ ట్యాబ్లెట్లు వాడటం కంటే హాయిగా తినాలనిపించే రుచికరమైన దానిమ్మతో ఒంట్లో ఐరన్ మోతాదులు పెరుగుతాయి. అలా ఈ పండు రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తనాళాలనూ శుభ్రపరుస్తుంది. ఒంటికి మంచి ఆరోగ్యకరమైన రక్తం పట్టడం వల్ల మనిషి చురుగ్గానూ మారుతారు. ఇక ఇదే దానిమ్మ బరువు పెరగకుండా కూడా నివారిస్తుంది. ఇలా దానిమ్మతో బరువు తగ్గడానికి కారణం... ఇందులో ఉండే దాదాపు 7 గ్రాముల పీచు. ఇలా బరువు తగ్గించడం ద్వారా ఇది గుండెజబ్బులనూ నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ కె, విటమిన్ సీ వంటి విటమిన్ల వల్ల రోగనిరోధకSశక్తిని పెంపొందిస్తుంది. ఇందులోని పొటాషియమ్ రక్తపోటును అదుపులో పెడుతుంది. దాదాపు 25 గ్రాముల చక్కెర కారణంగా తక్షణం 144 క్యాలరీల శక్తి సమకూరుతుంది. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు ఉండటం అన్న అంశం కూడా వేగంగా బరువు తగ్గడానికి/పెరగకుండా నివారించడానికి తోడ్పడతాయి. అన్ని రకాల పండ్లూ ఆరోగ్యానికి మంచివే అయినా... ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను ఒక పండే ఇవ్వడం అన్నది చాలా కొద్ది పండ్ల విషయంలోనే ఉంటుంది. అందుకే రక్తహీనత తగ్గడం, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపరచుకోవడం, వ్యాధినిరోధకతను పెంచుకోవడం లాంటి బహుళ ప్రయోజనాలను పొందాలంటే దానిమ్మ పండు తినడం రుచికరమైన ఓ మంచి మార్గం. -
Health Tips: డైట్ సోడా తాగినా.. ప్రమాదంలో పడ్డట్లే! ప్రాణాంతక వ్యాధులు..
చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అందులోనూ సోడా ఉండే వాటిని ఎక్కువ మంది ఇష్టంగా తీసుకుంటారు. వేసవికాలం, చలికాలం అనే సంబంధం లేకుండా వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కలిగే ప్రయోజనాల కన్నా... ఆరోగ్య సమస్యలే ఎక్కువ. కూల్ డ్రింకులు, సోడాలు, చక్కెర పానీయాలు తాగడం వల్ల మధుమేహం,ఊబకాయం, కొవ్వు పెరిగి కాలేయం, మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొందరు సోడాకు బదులు డైట్ సోడా తాగితే ఆరోగ్యంపై అంతగా ప్రభావం ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ, మెటబాలిక్ సిండ్రోమ్, అలాగే స్ట్రోక్ ప్రమాదాలను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. మరి కొన్ని పరిశోధనల ప్రకారం, డైట్ సోడా వినియోగం కూడా ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. అదే విధంగా.. రసాయనాలు కలిసిన కూల్డ్రింకులు తాగితే, ఈ సమస్యలకు తోడు పేగుల్లో సమతుల్యత దెబ్బతిని, జీర్ణకోశ సమస్యలూ తలెత్తే ప్రమాదం లేకపోలేదు. చదవండి: Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల.. -
మొత్తానికి ఈజీ డైటింగ్ టెక్నిక్: ఈ వీడియో చూస్తే
సాక్షి, ముంబై: కొండలా పెరిగిన శరారీన్ని, బాన లాంటి పొట్టను తగ్గించుకోవడం అంత వీజీ కాదు. డైటింగ్లూ, జిమ్లూ అంటూ కసరత్తు చేయడం, ఎక్కడో ఒక చోట్ ఫెయిల్ అవ్వడం మనం చూస్తుంటాం. కొంతమందేమో ఎంత కడుపుమాడ్చుకున్నా.. వ్యాయామం చేస్తున్నా..ఒళ్లు మాత్రం తగ్గడం లేదంటూ నిరాశ చెందుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలంటే చక్కటి ప్రణాళిక, దానికి మించిన నిబద్ధత, ఒక్కోసారి మంచి ట్రైనర్ ఉండటం చాలా అవసరం. అలాగే వైద్యపరంగా ఎందుకు లావు అవుతున్నామనే విశ్లేషణ కూడా అంతే అవసరం. ఈ క్రమంలో వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఒక ఫన్నీ వీడియోను ట్వీట్ చేశారు. మొత్తానికి ఈజీ డైటింగ్ని మార్గాన్ని కనుగొన్నారు అంటూ ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఇలా చేస్తే.. మీరు కచ్చితంగా స్లిమ్ అవడం ఖాయం అంటూ నెటిజన్లు ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. Finally found a way to make dieting easier …..😀😀 pic.twitter.com/CzY6jvil8V — Harsh Goenka (@hvgoenka) June 26, 2022 -
ఈ జాకెట్స్తో బాడీ ఫిట్గా.. ధర వెయ్యి లోపే!
Body Shaper Fit Jacket: శరీరతత్వమో.. హార్మోన్ల అసమతుల్యమో, ప్రసవానంతరం వచ్చే సమస్యో.. ఇలా కారణం ఏదైనా చాలా మంది ఆడవాళ్లు వయసుతో సంబంధం లేకుండా స్థూలకాయంతో బాధపడుతుంటారు. శరీరంలో కొవ్వు పెరగడం వేరు.. కేవలం నడుము, పొట్ట భాగాల్లో కొవ్వు పేరుకోవడం వేరు. దాని వల్ల ముఖం ఎంత అందంగా ఉన్నా.. ఆకృతిపరంగా షేప్ లెస్గా కనిపిస్తుంటారు. దాంతో ఏ డ్రెస్ వేసుకున్నా ఒకేలా కనిపిస్తోంది. పొట్టేమో ఫ్లాట్గా.. నడుము దగ్గర సన్నగా .. భుజాలు నిటారుగా ఉంటే ఆ ఆకృతే వేరు కదా! అలాంటి ఫిగర్ను సొంతం చేసే జాకెట్టే(బాడీ షేపర్) ఇది. శరీర ఆకృతిపై ప్రత్యేక శ్రద్ధ చూపించే స్త్రీలకు ఇదో మంచి బహుమతి. 30% స్పాండెక్స్, 70% నైలాన్తో రూపొందిన ఈ షేప్వేర్ బాడీసూట్ టాప్ గ్రేడ్ ఫ్యాబ్రిక్ కావడంతో సులభంగా సాగుతుంది. మన్నుతుంది కూడా. ప్రసవానంతర రికవరీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని జంప్ సూట్ మాదిరిగా వేసుకోవాలి. సౌకర్యవంతంగా ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళడానికి వీలుగా జిప్ ఉంటుంది. దాంతో వేసుకున్న డ్రెస్ పూర్తిగా తొలగించాల్సిన పనిలేదు. ఫిట్టింగ్ టాప్స్, స్కర్ట్స్, జీన్స్, పొట్ట భాగం కనిపించని మోడర్న్ వేర్ ఏది వేసుకున్నా దీన్ని చక్కగా ధరించొచ్చు. ఇలాంటి మోడల్ జాకెట్స్ విషయంలో.. క్వాలిటీని బట్టి, అదనపు సౌలభ్యాలను బట్టి ధరలు మారుతుంటాయి. సాధారణమైన జాకెట్స్ వెయ్యి రూపాయాల్లోపు కూడా దొరుకుతాయి. ఈ జాకెట్స్తో బాడీని ఫిట్గా మార్చుకుంటే.. ఆకర్షణీయమైన రూపంతో పాటు ఆత్మవిశ్వాసమూ రెట్టింపవుతుంది. చదవండి: పొటాటో పోషణ -
మనిషి ఆరోగ్యానికి ఏ రకమైన బియ్యం మంచిది ??
-
బరువుగా పెంచకండి
కొంతమంది తల్లులు పిల్లల మీద ప్రేమతో వారు వద్దంటున్నా వినకుండా కొసరి కొసరి తినిపిస్తారు. తల్లులతోపాటు నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యల వంటి వారు కూడా లేకలేక పుట్టారనో, బోలెడంత మంది ఆడపిల్లల్లో ఒక్కగానొక్క మగపిల్లాడని లేదా అందరు మగపిల్లల మధ్య మహాలక్ష్మి లా ఒకే ఆడపిల్ల అనో అతిగా గారం చేసి వారికి అతిగా తినిపిస్తారు. దాంతో పిల్లలు విపరీతంగా బరువు పెరిగిపోతారు. బొద్దుగా ఉంటే ముద్దుగానే ఉంటారు కానీ, క్రమేణా ఆ బొద్దుతనం కాస్తా ఊబకాయంగా మారిపోతుంది. ఫలితంగా పెద్దయ్యేకొద్దీ రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. దేనినైనా చేతులు దాటకముందే పరిష్కరించుకోవాలి లేదంటే డాక్టర్ల దాకా వెళ్లాల్సి వస్తుంది. పిల్లలు బొద్దుగా ఉండటం కాదు... ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. లావుగా ఉండే పిల్లల ఆహారపుటలవాట్లలో, జీవనశైలి లో చిన్నచిన్న మార్పులు చేస్తే వారు ఆరోగ్యంగా పెరుగుతారు. దీనిపై అవగాహన కోసం... కొంతమంది పిల్లలు లావుగా ఉన్నప్పటికీ, టీనేజీకొచ్చేసరికి సన్నబడిపోతారు. కానీ ఒక్కోసారి అలా జరగకపోవచ్చు. ఒక పరిశోధన ప్రకారం 5.5 ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 60 శాతం మంది 20 ఏళ్ల వయస్సులో కూడా బరువు ఎక్కువే ఉన్నారు. రెండున్నర ఏళ్ల వయసులో బరువు ఎక్కువ ఉన్న పిల్లలలో 44 శాతం మంది 16 ఏళ్ల వయస్సులో కూడా ఎక్కువ బరువే ఉన్నారు. ఎందుకంటే, వయసు పెరిగిన కొద్దీ, కాస్తో కూస్తో లావెక్కడం సహజం. అలాగని చిన్నప్పుడు సన్నగా ఉన్నవారు పెద్దయ్యాక లావెక్కరని కాదు. చిన్నప్పటినుంచి ఉన్న బరువు అలాగే కొనసాగడం వల్ల వారు రకరకాలయిన ఇబ్బందులు పడతారు. స్కూల్లో, కాలేజీలో తోటిపిల్లలు వారికి పేర్లు పెడతారు. అదేవిధంగా తమకు నచ్చిన దుస్తులు ధరించలేరు. పిల్లలు టీనేజీలోకి వచ్చాక సామాజికంగా వారే తెలుసుకుని తాము తగ్గాలో పెరగాలో అనేది వారే డిసైడ్ చేసుకుంటే అది ఒక రకం కానీ, పెద్దల గారం మూలంగా బరువు పెరిగిన పిల్లలు పెద్దయ్యాక స్థూలకాయులుగా తయారు కాకుండా ఏం చేయాలో చూద్దాం. జంక్ ఫుడ్కు దూరంగా ఉంచాలి: చాక్లెట్లు, స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ఫుడ్స్ వంటివి అలవాటు చెయ్యకుండా ఉండడం అత్యవసరం. బరువు పెంచే లక్షణాలు వాటిలోనే అధికంగా ఉంటాయి. పైగా ఆయా పదార్థాల రుచిని పెంచడం కొరకు అజీనమోటో వంటి హానికర రసాయన పదార్థాలు కలుపుతారు. అవి పిల్లల శారీరక ఎదుగుదలతోపాటు మెదడులోని నరాల ఎదుగుదలను దెబ్బతీస్తాయి కాబట్టి అటువంటి వాటిని అతిగా ఇవ్వకుండా అప్పుడప్పుడు మాత్రమే తినిపించాలి. ఇక ఇంట్లో చేసిన ఆహారపదార్థాలలో కూడా రుచి కోసం విపరీతంగా నూనెపోసి చేసే వేపుడు కూరలు, మసాలాలు, నెయ్యితో తయారు చేసిన స్వీట్లు కూడా పరిమితికి మించి తినిపించకూడదు. అవి తినకుండా ఉండలేని స్థితికి తీసుకుని రాకూడదు. అంత అతిగా అలవాటు చెయ్యకూడదు. పిల్లలు స్కూల్కు వెళ్ళే సమయంలో స్నాక్స్ కావాలని మారాం చెయ్యడం సహజం. అటువంటి సందర్భాల్లో చాక్లెట్లు, చిప్స్ వంటి వాటి బదులు ఇంటిలో చేసిన పల్లీపట్టీలు, బెల్లం వేరుశనగ ఉండలు, మినప సున్నిఉండలు, నువ్వుల ఉండలు, ఇంట్లోనే చేసిన బూందీ, కారా వంటివి ఇవ్వడం ఉత్తమం. పిల్లలు ఏం తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి? జంక్ ఫుడ్ నుండి పిల్లలను ఎలా రక్షించుకోవాలి? బిడ్డకు ఊబకాయం వచ్చేసిన తరవాత తల్లిదండ్రులు చెయ్యగలింగింది ఎక్కువ ఉండదు. అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మన్యూనతాభావం: బిడ్డ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పనులు, మాటలకు దూరంగా ఉండటం ఉత్తమం. పొట్టమాడ్చకూడదు: పిల్లలు లావు అవుతున్నారు కదా అని ఒక్కసారిగా తిండి తగ్గించడానికి ప్రయత్నం చెయ్యకండి. ఆలా చేస్తే వారి పసిమనసుకు తప్పుడు సంకేతాలు వెళతాయి. మెల్లి మెల్లిగా తగ్గించాలి. తక్కువ క్యాలరీలుండే మరమరాలు, అటుకులు, పుచ్చకాయ, బొప్పాయి ముక్కలు వంటి వాటిని ఎక్కువ అలవాటు చెయ్యాలి. వ్యాయామం: శారీరక శ్రమను ప్రోత్సహించండి. వారి చేత గార్డెనింగ్ చేయించడం, చిన్న చిన్న దూరాలు నడిపించడం, లిఫ్ట్కు బదులుగా మెట్లెక్కేలా చేయడం వంటివి. మానసిక ఆరోగ్యం: బిడ్డ ఎక్కువ తినటానికి కారణం వత్తిడి, ఆందోళన, అభద్రతా భావం కావచ్చును. సందర్భాన్ని బట్టి నిపుణులను సంప్రదించండి. జీవనశైలి: ఏవైనా మార్పులు ఎల్లకాలం పాటించగలిగేలా ఉండాలి. రోజూ స్నానం చేసినట్లు, లేదా పళ్ళు తోముకున్నట్లు. మార్పులు జీవనశైలిలో భాగం కావాలి. అంతేకానీ, జబ్బుకన్నా మందు కష్టం కాకూడదు. నిరంతరం బరువు తగ్గటం లేదన్న భావనతో బాధ పడటం కన్నా ఊబకాయంతో బాధపడటం కొంతలో కొంత మేలు. -
Hyderabad: 50% మంది మహిళలకు ఒకే సమస్య.. కారణమదే అంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య 15వేల దాకా ఉంటుంది. కిడ్నీ సమస్యలున్నవారు లక్ష మంది దాకా ఉంటారని కేర్ ఆస్పత్రి వైద్యుడు డా.వంశీకృష్ణ చెబుతున్నారు. మొత్తం కిడ్నీ రోగుల్లో 40 శాతం మందికి అధిక రక్తపోటుతో కిడ్నీలపై దుష్ప్రభావం చూపుతుందంటున్నారాయ. దురదృష్టకర విషయమేంటంటే వీరిలో ఎవరికి తాము రక్తపోటు బాధితులమని తెలియకపోవడం. తాజాగా నగరానికి చెందిన 51 శాతం మంది మహిళలు అధిక బరువుతో లేదా తమ బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 25కేజీ/ఎమ్2 కన్నా ఎక్కువగా లేదా సమానమైన ఒబెసిటీతో బాధపడుతున్నారని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) వెల్లడించింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ కోసం ప్రచురించినదీ సారాంశం. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన వివరాలతో రూపొందించిన గణాంకాలివీ. దీనిలో నగరం అత్యధిక శాతం అధిక బరువున్న మహిళలతో ముందంజలో ఉండడం గమనార్హం. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అన్నీ ఉన్నా...ఆరోగ్యం? నిజానికి నగరంలో విద్యాధికులకు కొదవలేదు. వైద్య సౌకర్యాలకు కొరత లేదు. అయినప్పటికీ డయాబెటిస్ మొదలుకుని ఏ వ్యాధికి సంబంధించి చూసినా నగరంలోనే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నట్టు పలుమార్లు అధ్యయనాలు వెల్లడించాయి. శారీరక శ్రమ కరువైన జీవనశైలి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, సూర్య కాంతికి ఎక్కువగా తగలకపోవడం... వంటివి నగర మహిళల్ని అధిక బరువు దిశగా నడిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘కోవిడ్ నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి పద్ధతులు కొత్తగా వచ్చాయి. ఈ పరిణామం చాలా మందిని ఊబకాయులుగా మార్చింది. నగరాల్లో ఒత్తిడి స్థాయి ఎక్కువగా ఉండడం కూడా మరో కారణం’ అని న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్ అభిప్రాయపడ్డారు. వేగం.. నగర జీవననాదం.. నగర జీవనంలో ఉరుకులు పరుగులు సర్వసాధారణంగా మారాయి. రోజుకు 24 గంటలు ఉంటున్నా సరిపోవడం లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి. దీనికి మరోవైపు సోషల్ మీడియా సరికొత్త సోమరితత్వాన్ని మోసుకొస్తోంది. దీంతో ఆహారపు అలవాట్లు ఛిన్నా భిన్నమయ్యాయి. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు అన్నట్టుగా ఆహార విహారాలు మారడంతో అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. ‘మారుతున్న జీవన శైలిలో భాగంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరైన సమయానికి నిద్ర లేవకపోవడం, సరైన సమయంలో భోజనం చేయకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటివి నగరవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వ్యాయామం, ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం’ అని కిమ్స్ హాస్పిటల్స్కు చెందిన కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, డాక్టర్ వేదస్విరావు వెల్చల చెప్పారు. -
‘చిరు’కు రుచి మరిగి లావైపోయారు.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు..
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): శ్రీధర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. కరోనా సెకండ్ వేవ్లో కంపెనీ అతనికి ఇంటి నుంచే పని చేయాలని బాధ్యతలు అప్పజెప్పింది. ఆఫీసులో అటూ ఇటూ తిరుగుతూ పనిచేసే అతను ఇంట్లో ఒకేచోట గంటల తరబడి కూర్చోవడమే గాక కుటుంబసభ్యులు గంటకోసారి చేసి పెట్టే చిరుతిళ్లు తింటూ లావైపోయాడు. మొదట్లో 65 కిలోల బరువు ఉండే అతను ఇప్పుడు 85 కిలోలకు పెరిగాడు. దీంతో పెరిగిన బరువును తగ్గించేందుకు న్యూట్రిషన్ సెంటర్లవైపు పరుగులు తీస్తున్నాడు. ►నారాయణరెడ్డి కేంద్ర సంస్థలో పనిచేసి రెండేళ్ల క్రితమే రిటైరయ్యాడు. అతను రిటైరైనప్పటి నుంచి కోవిడ్ ప్రారంభమైంది. అప్పటి వరకు ప్రతిరోజూ ఉదయమే గంటసేపు వాకింగ్ చేసేవాడు. లాక్డౌన్, కోవిడ్ నిబంధనల మేరకు ఇంట్లోనే గడపాల్సి వచ్చి ంది. కోవిడ్ తగ్గుముఖం పట్టినా కుటుంబసభ్యులు అతన్ని బయటకు వెళ్లనీయలేదు. దీంతో సన్నగా 65 కిలోల బరువుండే అతను ఇప్పుడు 80 కిలోలకు చేరాడు. దీంతో అతనిలో బీపీ, షుగర్ స్థాయిలు బాగా పెరిగాయి. ఈ కారణంగా మందుల వాడకమూ పెరిగింది. బరువు తగ్గేందుకు ఇప్పుడు ట్రెడ్మిల్ కొనుగోలు చేసి ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నాడు. చదవండి: (Jayanthi Narayanan: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు) వీరిద్దరే కాదు కోవిడ్ కారణంగా బరువు పెరిగి ఇబ్బంది పడే వారి సంఖ్య జిల్లాలో వేలల్లో ఉంది. కోవిడ్ వైరస్ను ఒక్కటే తీసుకురాలేదు. దాంతో పాటు పరిస్థితుల ప్రభావం వల్ల మానవుల జీవనశైలినే మార్చేసింది. దీంతో ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోయాయి. బద్దకం పెరిగిపోయి ఊబకాయం అధికమైంది. దీంతో పాటు జీవనశైలి జబ్బులూ పెరిగిపోయాయి. వీటిని నియంత్రించేందుకు ఇప్పుడు ఆన్లైన్ యోగా క్లాసులు, ఇంట్లో ట్రెడ్మిల్ వాకింగ్లు గట్రా చేస్తూనే నోటిని కట్టడి చేస్తూ కడుపు కాల్చుకుంటున్నారు. జిల్లాలో 2020 మార్చి 28వ తేదీన తొలి కోవిడ్ కేసు నమోదైంది. దానికి నాలుగు రోజుల ముందు నుంచే దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలైంది. 20 నెలల క్రితం నాడు మొదలైన కోవిడ్ కేసుల సంఖ్య నేడు 1.25 లక్షల దాకా చేరుకున్నాయి. దీనిబారిన పడి 854 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ రోజూ ఒకటో, రెండో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మొదటి అల, రెండో అల పేరుతో దూసుకొచ్చిన కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఆంక్షలు ఫలితంగా చాలా మందికి శారీరక శ్రమ కరువైంది. వాకింగ్ చేయాలంటే మైదానాలు, పార్కులు మూతపడ్డాయి. వీధుల్లో నడవాలంటే మోకాళ్ల నొప్పులు వస్తాయని భయం. జిమ్కు వెళ్లాలన్నా వాటిపైనా ఆంక్షలు. ఇప్పుడిప్పుడే అవి తెరుచుకున్నా రోజుల తరబడి విశ్రాంతి తీసుకున్న మనసు బద్దకిస్తోంది. తెగించి జిమ్కు వెళ్లినా ఒకటి రెండు రోజులకే మళ్లీ మనసు విశ్రాంతినే కోరుకుంటోంది. దీనికితోడు కూర్చుని తినే కార్యక్రమం అధికం కావడంతో జిల్లాలో గతంలో ఉన్న వారితో పోలిస్తే అదనంగా 30 శాతం మంది స్థూలకాయులుగా మారారని వైద్యులు పేర్కొంటున్నారు. చదవండి: (కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా తగ్గుతాయి..) వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇబ్బందులు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారిలో 90 శాతం మందికి కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించారు. ఈ కారణంగా ఇంట్లోనే ఉండటంతో చిరుతిళ్లపై మనసు లాగడంతో వారికి వండిపెట్టేవారూ రెడీ అయ్యారు. ఈ కారణంగా అవసరం లేకపోయినా చిరుతిళ్లు తింటూ పనిచేసుకునే వారు అధికమయ్యారు. దీంతో చాలా మందికి శరీరంలో అవసరమైన దానికంటే అధికంగా కేలరీలు పెరిగి స్థూలకాయం వచ్చింది. మారిన ఆహారపు అలవాట్లు చాలా మందికి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. రెండేళ్ల క్రితం రోజుకు మూడు పూటలు తినేవారు కరోనా దెబ్బకు ఐదారు పూటలు (స్నాక్స్తో కలిపి) లాగించేశారు. అధిక శాతం ఇంట్లోనే ఉండటం, కోవిడ్ను ఎదుర్కోవాలంటే ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలనే వాదన ఒకటి రావడంతో చాలా మంది ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో శారీరక శ్రమను గాలికి వదిలేశారు. దీంతో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చదవండి: (సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు.. వీటిని ఎప్పుడైనా రుచి చూశారా?) ఊబకాయంతో నష్టాలు ఊబకాయం కారణంగా పది మందిలో తిరగాలంటే ఇబ్బంది. ఇతరులు సన్నగా, నాజూగ్గా ఉంటే వీరు చురుకుతనం తగ్గిపోయి బరువుగా అడుగులు వేయాల్సి వస్తుంది. అప్పటికే ఒంట్లో బీపీ, షుగర్లు ఉంటే వాటి స్థాయిలు మరింత పెరిగి మందుల డోసు కూడా అధికమైంది. దీనికితోడు అధిక బరువు కారణంగా కీళ్లనొప్పులు, ఆయాసం, గుండెజబ్బులు, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. కిడ్నీలపై భారం పడుతుంది ఊబకాయం వల్ల కిడ్నీ పనితనంపై భారం పెరిగే అవకాశం ఉంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 దాటితే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో పాటు స్మోకింగ్ అలవాటు ఉంటే రక్తనాళాలు కుచించుకుపోయి రక్తసరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో కిడ్నీ ఎక్కువగా పనిచేయడం వల్ల ప్రొటీన్స్ లీక్ అవుతాయి. ఈ కారణంగా కాళ్లవాపులు వస్తాయి. ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. –డాక్టర్ పీఎల్. వెంకటపక్కిరెడ్డి,నెఫ్రాలజిస్టు, కర్నూలు బరువు నియంత్రణా ముఖ్యమే కోవిడ్ అనంతరం ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఆహారం తీసుకోవడంలో వచ్చిన మార్పులే. అధిక బరువును ఆహార నియంత్రణతోనే తగ్గించుకోవాలి. ఈ మేరకు శరీరానికి అవసరమైన కేలరీలను వారి బరువు, వయస్సుకు తగినట్లుగా తీసుకోవాలి. రోజూ తగినంత వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్లు నీరు తాగాలి. ఇదే క్రమంలో తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఫాస్ట్ఫుడ్లు, జంక్ఫుడ్లు మానేయాలి. – డాక్టర్ జి.రమాదేవి, డైటీషియన్, కర్నూలు -
ఎప్పుడంటే అప్పుడు బరువు తగ్గిపోవచ్చా? నిజంగానే ఇదొక సవాలా?
సాక్షి, హైదరాబాద్: కేవలం అతిగా తినడం వల్లే ఊబకాయం రాదు. దీనికి అనేక కారణాలున్నాయి. అతి తక్కువ సమయంలో శరీర బరువు బాగా పెరగడం, ఊబకాయానికి దారి తీస్తుంది. హెరడిటరీ, శారీరక, పర్యావరణ అంశాలతో పాటు మనం తీసుకునే ఆహారం ముఖ్యం పాత్ర పోషిస్తాయి. అధిక బరువుతో అంద విహీనంగా కనపడుతున్నామనే ఒత్తిడి ఒక్కటే కాదు, గుండెజబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్, స్లీప్ ఆప్నియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే ఈ స్థూలకాయం, నివారణ మార్గాలపై కొన్ని అపోహలున్నాయి. నవంబరు 26 వరల్డ్ యాంటీ ఒబెసిటీ డే సందర్భంగా కొన్ని అపోహలు, వాస్తవాలు మీకోసం. (World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!) ఊబకాయం అనేది కేవలం కాస్మొటిక్ వ్యాధి మాత్రమేనా? కానే కాదు. లావుగానే ఉన్నామనే తీవ్ర ఆందోళన ఎంత తప్పో, కాస్త బొద్దుగా ముద్దుగా కనిపిస్తున్నామే తప్ప, దీనివలన పెద్దగా ఆరోగ్య సమస్యలు రావని అనుకోవడం కూడా భ్రమ. వాస్తవానికి, ఒబెసీటీకి కారణాలు అనేకం, అలాగే ఇది అనేక ఇతర వ్యాధులకు మూల కారణం. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకం కావచ్చు. ఈ విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఊబకాయం అనేది మామూలే, జీవనశైలి రుగ్మత మాత్రమే అనుకుంటే పొరపాటే. సీనియర్ బేరియాట్రిక్ సర్జన్ల తాజా లెక్కల ప్రకారం, ఊబకాయం ఇప్పుడు మల్టీఫ్యాక్టోరియల్ ఎటియాలజీతో కూడిన వ్యాధి. ఈ వ్యాధిని నిపుణుల పర్యవేక్షణలో వైద్యపరంగా వీలైనంత త్వరగా పరిష్కరించు కోవాలి. అంత సులువు కాదు..కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బరువు తగ్గవచ్చు. ఇది ఒక విధంగా అపోహ. నేను ఎంత తొందరగా బరువుపెరుగుతానో, అంతే వేగంగా బరువు తగ్గుతాను అని చాలామంది అనుకుంటారు. కొద్దిపాటి సంకల్పం, వ్యాయామం మాత్రమే చాలు అని భావిస్తారు చాలామంది. వాస్తవం మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఇది అందరికీ సాధ్యం కాదు. స్థూలకాయులకు ఆ అదనపు కిలోలను తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. ఒకసారి ఉండాల్సిన బరువుకంటే 25 కిలోలు పెరిగితే దీన్ని తగ్గించుకోవడం ఒక సవాల్ అని బెంగళూరులోని లివ్లైఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నిపుణుల అభిప్రాయం, వైద్య చికిత్స చాలా అవసరమని తెలిపారు. ఊబకాయం అనేది పట్టణాల్లోని ధనవంతులకే పరిమితమా? ఇది కూడా అపోహ మాత్రమే. భారతదేశంలోని మురికివాడల జనాభాలో 3 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఎందుకంటే పౌష్టికాహార లోపం కూడా ఊబకాయానికి పెద్ద కారణం. ఊబకాయం వల్ల ఐరన్, విటమిన్ డి-3 లోపం వంటి సమస్యలొస్తాయి. చిన్నపుడు లావుగా ఉండే పిల్లలు లావుగా ఉన్న పిల్లలు వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోతారా అంటే కాదు అంటున్నారు నిపుణులు. దాదాపు 80శాతం మంది ఊబకాయం ఉన్న పిల్లలు ఊబకాయులుగా పెరుగుతారని ఢిల్లీలోని మాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్, మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ చైర్మన్ డాక్టర్ ప్రదీప్ చౌబే వెల్లడించారు. అంతేకాదు వీరిలో మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులొచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. బాల్యంలో వచ్చే స్థూలకాయంపై అప్రమత్తంగా ఉండాలని, మొదటినుంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని, నియమాలను అలవాటు చేయాలని సూచించారు. ఇన్ఫెర్టిలిటీ సంతానలేమి ఊబకాయానికి కారణమవుతుంది. నిజానికి ఊబకాయం లేదా, అధిక బరువే ఇన్ఫెర్టిలిటీకి కారణం. యువతలో ప్రాథమిక వ్యంధత్వానికి అత్యంత సాధారణ కారణాలలో ఊబకాయం ఒకటని వైద్యనిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ థైరాయిడ్ తక్కువగా ఉండటం వల్ల ఊబకాయం వస్తుంది. కాబట్టి థైరాయిడ్ మందులు తీసుకుంటే చాలు అనుకుంటే ఇది కూడా ఒక మిత్. హైపో థైరాయిడిజంతో బాధపడుతున్న అందరూ ఊబకాయంతో బాధపడరు. అలాగే, ఏ వ్యక్తిలోనైనా స్థూలకాయానికి ఏకైక కారణం హైపోథైరాయిడిజమ్గా చెప్పలేం. హార్మోన్ల సమస్యలు ఇందుకు కారణం. వైద్యుల సలహాలేకుండా థైరాయిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం హానికరమైన ఆరోగ్య ప్రభావాలకు దారితీయవచ్చు. ఊబకాయం మనిషి శరీరాకృతిని ప్రభావితం చేయడం మాత్రమే కాదు ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అతి తక్కువ కాలంలో బరువు బాగా పెరగడంతో మధుమేహం, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అంతేకాదు తెలియకుండానే మూత్రపిండాల పనితీరును దెబ్బతిస్తుంది. శారీరక వ్యాయామం లేకపోవడం, వేళాపాళా లేకుండా భోజనం చేయడం, మద్యం, పొగతాగడం, ఒత్తిడి ఊబకాయానికి ముఖ్య కారణాలు. మారుతున్న జీవన శైలి, విచ్ఛలవిడిగా జంక్ ఫుడ్స్ వినియోగంతో బరువు పెరుగుతున్నారు. ప్రమాదాన్ని పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్య ఇంకా అధికమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం, కనీస వ్యాయామం, అవసరమైతే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అవసరమంటున్నారు. -
కందిరీగ నడుము కావాలా.. ఫ్యాటీ బెల్లీకి చెక్ చెప్పండిలా
సాక్షి, హైదరాబాద్: ఓవర్ వెయిట్, ఫ్యాటీ బెల్లీ ఇపుడివే చాలామందిని వేధిస్తున్నపెద్ద తలనొప్పి. మారుతున్న జీవన శైలి, కనీస వ్యాయామం లేకపోవడం, కంప్యూటర్కు అతుక్కుపోయే ఉద్యోగాలతో ఊబకాయానికి తోడు పొట్ట, నడుం చుట్టూ కొవ్వు పేరకుపోయి పెద్ద సమస్యగా మారిపోతోంది. దీంతో వయసుతో నిమిత్తంలేకుండా కుండలాగాపెరిగిన పొట్ట ముందుకొచ్చి మరీ వెక్కిరిస్తోంది. అంతేనా నచ్చిన డ్రెస్ వేసుకోవడానికి లేదు. బాడీషేప్ మారిపోయి అందవికారంగా ఉన్నామనే ఇన్ఫీరియారిటి. మరి ఈ సమస్యల్నింటికి పరిష్కారం ఏమిటో తెలియాలంటే.. స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉండాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. -
మీ బరువు సాధారణంగానే ఉన్నా.. పొట్ట పెద్దదిగా ఉంటే?
మీ శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ... మీ పొట్ట పెద్దగా బయటకు కనిపిస్తూ ఉంటే అది ఒకింత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోండి. మీరు మీ పొట్ట దగ్గర అంటే నడుము చుట్టుకొలతను ఓ టేప్ సహాయంతో తీసుకోండి. ఇలా కొలిచే క్రమంలో బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలని గుర్తుంచుకోండి. ఆ కొలతకూ, పిరుదుల మధ్య (హిప్)లో... గరిష్ఠమైన కొలత వచ్చే చోట టేప్తో మరోసారి కొలవండి. ఈ రెండు కొలతల నిష్పత్తిని లెక్కగట్టండి. అంటే నడుం కొలతని హిప్ కొలతతో భాగించాలన్నమాట. అది ఎప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. అలాగే పురుషుల విషయానికి వస్తే ఇది 0.90 కంటే తక్కువ రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది ఒకింత ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోండి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండె సమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి ఎక్కువగా శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్టను అంటే నడుము చుట్టుకొలతను తగ్గించుకోవడం అన్ని విధాలా మేలు. -
అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..
గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడాన్నికార్డియాక్ అరెస్ట్ అంటారు. నిజానికి ఇది ఒక రకంగా ప్రాణాంతకమైన గుండె సంబంధిత వ్యాధిగా చెప్పవచ్చు. అమెరికాలో సగానికిపైగా జనాభా దీని భారీన పడుతున్నట్టు అధ్యయనాలు వెల్లడించాయి. ఐతే దీని బారిన పడ్డవెంటనే చికిత్స అందిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు, ఎవరెవరు దీని బారినపడతారో, చికిత్స ఏవిధంగా తీసుకోవాలో తెలుసుకుందాం.. కార్డియాక్ అరెస్ట్కు కారణాలు ►వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ గుండెలో నాలుగు గదులు ఉంటాయి. దిగువ రెండు గదులను జఠరికలు, పై రెండు గదులను కర్ణికలు అంటారు. కొన్ని సందర్భాల్లో గుండె లయ తప్పడం వల్ల జఠరిక రక్తప్రరసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది కూడా. ఇది ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుంది. సాధారణంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కారణంగానే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ►కర్ణిక దడ ఎగువ గదుల్లో (కర్ణిక)ని అరిథ్మియా వల్ల కూడా గుండె కొట్టుకోవడం ఒక్కోసారి ఆగిపోతుంది. సినోట్రియల్ నోడ్ సరైన విద్యుత్ ప్రేరణలను పంపనప్పుడు కర్ణికల్లో దడ ప్రారంభమవుతుంది. ఫలితంగా జఠరికలు శరీరానికి సమర్ధవంతంగా రక్తాన్ని పంపవు. కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఎవరికి ఉంది? ►కరోనరీ హార్ట్ డిసీజ్తో బాధపడే వారిలో ఈ సమస్య సాధారణంగా తలెత్తుతుంది. ►గుండె పరిమాణం పెద్దదిగా ఉన్నవారిలోకూడా హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ►పుట్టుకతోనే గుండె జబ్బులు ఉన్న పిల్లల్లో కూడా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చు. ►గుండె విద్యుత్ వ్యవస్థతో సమస్యలు తలెత్తినా ఆకస్మిక మరణం సంభవిస్తుంది. ఈ కింది కారణాల వల్ల కూడా సంభవించవచ్చు.. ►ధూమపానం ►ఒకేచోట కూర్చుని పనిచేసే జీవనశైలి ►అధిక రక్త పోటు ►ఊబకాయం ►వంశపారంపర్య గుండె జబ్బులు ►45 కంటే ఎక్కువ వయస్సున్న పురుషులకు, 55 కంటే ఎక్కువ వయసున్న మహిళలకు ►పొటాషియం/మెగ్నీషియం స్థాయిలు తక్కువ ఉన్నవారిలో కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ►తలతిరుగుతుంది ►అలసటగా అనిపించడం ►వాంతి ►గుండెల్లో దడ ►ఛాతి నొప్పి ►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ►స్పృహ కోల్పోవడం ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణం నిలుపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అనే పరీక్ష చేసి, సత్వర చికిత్స అందించడం ద్వారా శరీరానికి రక్తం ప్రసరించేలా ప్రేరేపిస్తారు. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడవచ్చు. చదవండి: మత్స్యకారులకు దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద.. -
లావు ఉండటం మైనస్సే కాదు.. బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోండి
శరీరం పరిమాణం... ఆకృతిని బట్టి అందాన్ని కొలిచే జనరేషన్ ఇది. సన్నగా, నాజూకుగా ఉండే అమ్మాయిలనే అందగత్తెలుగా గుర్తించడం కామన్ అయింది. అలాంటిది లావుగా ఉన్నవారిని ఏ మాత్రం పట్టించుకోక పోగా, వారి మనసు గాయపడేలా కామెంట్లు చేస్తుంటారు. ప్లస్ సైజు అయితే ఏంటీ? సైజు గురించి పట్టించుకోకండి! అది అస్సలు మైనస్సే కాదు! ఒబేసిటిని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోండి! అంటోంది తన్వి గీతా రవిశంకర్. తన్వి లావుగా ఉన్నప్పటికీ నచ్చిన డ్రెస్లు వేసుకుంటూ ఫ్యాషన్ను ఎంజాయ్ చేస్తూ.. ఫ్యాటీ ఫ్యాషన్ వీడియోలను తన ఇన్స్ట్రాగామ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. డ్యాన్సర్, స్టైలిస్ట్, వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ అయిన తన్వి ముంబైలో పుట్టి పెరిగింది. చిన్నప్పటినుంచి బొద్దుగా ఉండే తన్విని అందరూ బాగానే ముద్దు చేసేవారు. ఆమెకు మొదటి నుంచి డ్యాన్స్ అంటే ఆసక్తి. మిగతా విద్యార్థుల కంటే తాన్వి బాగా డ్యాన్స్ చేస్తుందని టీచర్ కూడా చెప్పేవారు. దీంతో చిన్నతనం నుంచే తన్వికి తనపై తనకు ఒక నమ్మకం ఏర్పడింది. అంతేగాక తన శరీరం భారీగా ఉన్నప్పటికీ పన్నెండేళ్ల నుంచే ఫ్యాషన్గా ఉండడానికి ఇష్టపడేది. మొదట్లో ఇంజినీరింగ్ చదవాలనుకుంది. కానీ డాన్స్ అంటే మక్కువతో ఫైనలియర్లోనే ఇంజినీరింగ్ను వదిలేసి, ముంబైలో డ్యాన్స్ అకాడమీలో చేరి, డాన్స్ నేర్చుకుంది. దాంతోబాటు తనకు ఫ్యాషన్ మీద కూడా ఆసక్తి ఉన్న ఉండడంతో ఫ్యాషన్ డిగ్రీ చదివింది. అయితే అక్కడా ఆమె శరీరాకృతి గురించి కామెంట్లు తప్పేవి కాదు. అయితే, అవేమీ లెక్క చేయకుండా నచి్చన డ్రెస్లు వేసుకుంటూ, వాటిలోనే అందంగా కనిపిస్తూ ఆత్మవిశ్వాసంతో అందరి నోళ్లు మూయించింది. శరీరాన్ని చూసి చిన్నబుచ్చుకోవద్దు..దాన్ని సెలబ్రేట్ చేసుకోండని చెబుతోన్న తన్వి మాటలు భారీకాయులెందరికో స్ఫూర్తిదాయకం. ఆ మాటలు వినకండి.. కడుపునిండా తినకండి, నెయ్యి వేసుకోవద్దు, చిప్స్ తినొద్దు. ఇలాంటి మాటలు అస్సలు వినకండి. వీటిని విన్నారంటే ఆహారాన్ని ప్రసాదంలాగా తినాల్సి వస్తుంది. మా అమ్మ తరపున వాళ్లు సన్నగా ఉంటే, నాన్న తరపు వాళ్లు బొద్దుగా ఉండేవాళ్లు. నేను వాళ్ల కమ్యూనిటీలో చేరాను. చాలామంది లావుగా ఉన్నవాళ్లను చూసి వీళ్లు అతిగా తింటారు, శరీరానికి వ్యాయామం ఉండదు. బద్దకంగా తయారవుతారు అంటారు. అది నిజం కాదు. ఇన్స్టా స్టైలిస్ట్గా స్కూలు, కాలేజీలో ఎక్కడా నేను నా శరీరాన్ని గురించి సిగ్గుపడింది లేదు. లావుగా ఉన్నానని ఫీల్ అవ్వలేదు. అందుకే ఇన్స్ట్రాగామ్ అకౌంట్ను ఎంతో ధైర్యంగా క్రియేట్ చేసాను. ఇండియాలో దొరికే బ్రాండెడ్ డ్రెస్లు వేసుకుని ఇన్స్టాలో పోస్టు చేసేదాన్ని. జీన్స్, బికినీ, షార్ట్స్’, చీరలతోపాటు దాదాపు అన్నిరకాల డ్రెస్లు వేసుకుని ఫొటోలు అప్లోడ్ చేసేదాన్ని. అంతేగాక లిప్స్టిక్, ఐలైనర్, ఫౌండేషన్, షూస్, మ్యాచింగ్ జ్యూవెలరీ వేసుకునేదాన్ని. నా పోస్టులకు చాలా అభినందనలు వచ్చేవి. సెలబ్రేట్ చేసుకోండి! మీరు ఊబకాయం, అధిక బరువుతో ఉన్నారని ఇబ్బంది పడొద్దు. బరువు ఎక్కువగా ఉండడం వల్ల మీ శరీరంలో ఏదో లోపించిందని కాదు. సన్నగా ఉన్నవారిలాగే మీరు అన్ని చేయగలరు. ఫ్యాటీగా ఉన్నప్పటికీ ఫిట్గా, యాక్టివ్గా హెల్దీగా ఉండేందుకు ప్రయతి్నంచాలి. దీనివల్ల మిమ్మల్ని చులకన చేసి మాట్లాడే సమాజం కామెంట్ చేయడానికి ఆలోచిస్తుంది. లావుగా ఉన్న శరీరం గురించి ఫీల్ కాకుండా ప్రతిరోజూ ‘‘ఐయామ్ ఓకే, ఐయామ్ వర్త్ ఇట్’’ అని చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ వ్యక్తిత్వాన్ని రంగులమయం చేసుకుని డైలీ సెలబ్రేట్ చేసుకోండి. నిజంగా ఇలాంటి ప్రేరణ కలిగించే వారు ఉంటే ఎలా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నామనే భావన కలుగుతుంది. -
ఏం చేసినా బరువు తగ్గడం లేదా.. తప్పు మీది కాదు బ్యాక్టీరియాది
సియాటెల్/వాషింగ్టన్: ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతకీ ఫలించడం లేదా? కడుపు కట్టుకున్నా.. రకరకాల వ్యాయామాలు చేస్తున్నా.. ఎంతకీ బరువు తగ్గడం లేదా? అయితే తప్పు మీది కాకపోవచ్చు. మీ జీర్ణ వ్యవస్థలో తిష్టవేసుకున్న కొన్ని రకాల బ్యాక్టీరియా మీరు బరువు తగ్గకుండా అడ్డుకుంటూ ఉండవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రయత్నపూర్వకంగా బరువు తగ్గిన.. తగ్గని వారి పేవుల్లోని సూక్ష్మజీవులను పరిశీలించడం ద్వారా ఈ విషయం స్పష్టమైంది. అమెరికాలోని సియాటెల్ కేంద్రంగా పనిచేస్తున్న సిస్టమ్స్ బయాలజీ అనే సంస్థ ఇటీవల ఒక పరిశోధన నిర్వహించింది. బరువు తగ్గాలని నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్న సుమారు వంద మందితో ఈ పరిశోధన జరిగింది. వీరిలో 50 మంది ఆరు నుంచి పన్నెండు నెలల్లోపు శరీర బరువులో ఒక శాతం తగ్గిన వారు కాగా... మిగిలిన వారు ఏమాత్రం బరువు తగ్గనివారు. రక్తం, మలం, జన్యుపదార్థాలను క్షుణ్ణంగా విశ్లేషించినప్పుడు రెండు వర్గాల వారి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నట్లు గుర్తించారు. మన జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని పులియబెట్టడం ద్వారా జీర్ణం చేసేందుకు అనువుగా అభివృద్ధి చెందిందని, అదే సమయంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం కూడా బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్టియన్ డైనర్ తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారు పిండి పదార్థాలను శరీరం శోషించుకోగల చక్కెరలుగా మలచుకోవడంలో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటారన్నారు. బ్యాక్టీరియా పెరుగుదల మందగిస్తే తిన్న ఆహారంలోని పీచుపదార్థం పులిసేందుకు ముందుగానే చక్కెరలుగా మారిపోయి రక్తంలోకి చేరిపోతాయని, ఫలితంగా బరువు తగ్గడం అసాధ్యంగా మారుతుందని వివరించారు. ఊబకాయులు ఒకొక్కరికీ వేర్వేరు చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. -
Weight Loss: పాలతో అవిసె గింజలు, అరటిపండు కలిపి తింటే..
Rajgira: దాదాపు 10 నుంచి 12 గంటల విరామం తరువాత ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము. బ్రేక్ఫాస్ట్లో తీసుకునే పోషకాలు బరువును నియంత్రణలో ఉంచడంలోనూ, మధుమేహం, రక్తపీడనాన్ని అదుపులో ఉంచడంలోనూ తోడ్పడతాయి. అందువల్ల రాజ్గిరా లేదా రమదానా అని పిలిచే మిల్లెట్స్ను బ్రేక్ఫాస్ట్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు అందుతాయి. వీటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల రక్తపీడనం, రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. పాలతో గుమ్మడి గింజలు, అవిసె గింజలు, అరటిపండుతో కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు. ప్రోటీన్, పీచుపదార్థం అధికంగా ఉండడం వల్ల ఇవి తింటే కడుపునిండిన భావన కలుగుతుంది. దీంతో అధిక బరువు కూడా తగ్గుతుంది. చదవండి: ఆ సమయంలో ‘అలోవెరా’ అస్సలు వద్దు! Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!! -
పని చేస్తున్న చోటే తింటే చాలా ప్రమాదమట..!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో అందరూ వర్క్ ఫ్రం హోంకే పరిమతమయ్యరు. చాలామంది దీనికే అలవాటు పడిపోయారు. అయితే కొన్ని నెలలుగా ఆఫీసులు, పరిశ్రమలు మళ్లీ తెరవడంతో అందరూ ఆఫీసులకి వెళ్లడం మొదలైంది. ఇన్నాళ్లు వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంటి వాతవరణాన్ని ఆఫీస్ మాదిరిగాసెట్ చేసి పనులు చేసుకున్నారు. ఎప్పుడేతే బాస్లు ఆఫీస్లకు రమ్మని చెప్పారో అక్కడి వాతావరణానికి అలవాటుపడటానికీ, యథాస్థితికి రావడటానికీ చాలామంది ఇబ్బంది పడుతున్నారట. ఎందుకంటే మన ఇల్లు కాబట్టి మనకు నచ్చిన విధంగా, ఎలా కావల్సితే అలా ఉండేవాళ్లం.. తినేవాళ్లం. కానీ ఆఫీసులో అలా తినడానికి.. ఉండటానికి కుదరదు. క్యాంటీన్కు వెళ్లాల్సిందే. అయితే అలా వెళ్లడానికి బద్దకించి.. కొందరు కూర్చున్న దగ్గరే తింటున్నారట. కానీ ఇలా పని చేసే దగ్గరే తింటే అది మన ఆరోగ్యం మీద రకరకాల దుష్ప్రభావాలు చూపుతుందంటున్నారు నిపుణులు. ఆ దుష్ప్రభావాలు ఏంటంటే.. తెలియకుండానే ఎక్కువ తినేస్తాం.... వర్క్ ప్లేస్లో తినేటపుడు ఒక చేతిని కీబోర్డు పై ఉంచి.. మరొక చేత్తో స్పూన్ పట్టుకుని తినడం వల్ల ఎంత తింటున్నమో? ఏమి తింటున్నామో గమనించకుండా తినేస్తాం. దీని వల్ల ఎక్కువ కేలరీలు మన శరీరంలో చేరి ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. లేదా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. (చదవండి: మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్!) గబగబ తినేయడం.... వర్క్ హడావిడలో గబగబ తినేయడంతో మధ్య మధ్యలో గాలిని మింగేస్తాం, నీళ్లు తాగేస్తుంటాం. దీని వల్ల కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ ట్రబుల్ సమస్య ఎదురవుతుంది. అంతేకాదు ఒక్కోసారి అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమయానుగుణంగా తినడం...... సమయానుగుణంగా తినకపోవటం చాలా మంది చేసే అతి పెద్ద తప్పు. వర్క్ ఎక్కువగా ఉందనో లేక ఇతరత్ర కారణాల వల్ల చాలా మంది టైమ్కి తినరు. ఇది మన జీర్ణవ్యవస్థ మీద అత్యంత దుష్ప్రభావం చూపుతుంది. అంతేకాదు, ఎసిడిటీ, అల్సర్, వంటి రకరకాల వ్యాధుల భారిన పడే అవకాశాలు ఎక్కుగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరూ ఇంతలా కష్టపడి పనిచేసేది కుటుంబం కోసమే కదా. విరామం తీసుకుని నిదానంగా తింటే పని ఒత్తిడి నుంచి ఉపశమనం దొరికనట్టు ఉంటుందీ, మళ్లీ మరింత వేగంగా, ఉత్సహంగా పనిచేయగలిగే శక్తి లభిస్తోంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి బ్రేక్ తీసుకుని నిదానంగా, టైంకి బోజనం చేయడం వల్ల మానసికంగానూ, శారీరకంగానూ ఆరోగ్యగంగా ఉంటాం. అప్పుడే మనం, మన ఫ్యామీలీతో ఉల్లాసంగా గడపగలం. కాబట్టి క్యాంటీన్ ఏరియాకు వెళ్లి తినడం మేలు. (చదవండి: పట్టాలపై మతిస్థిమితం లేని మహిళను కాపాడిన పోలీస్) -
పురుషుల్లో కంటే మహిళల్లోనే ఉబకాయం పెరుగుతోంది..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళల్లో ఊబకాయం పెరిగిపోతోంది. పురుషుల్లో కన్నా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. నాలుగవ జాతీయ కుటుంబ సర్వేతో పోలిస్తే అయిదవ సర్వేలో మహిళల్లో ఈ సమస్య పెరిగింది. నాలుగవ సర్వేలో 33.2 శాతం మహిళల్లోనే ఉండగా ఆ తర్వాతి సర్వేకు వచ్చేసరికి ఇది 36.3 శాతానికి పెరిగింది. అయితే.. అదే సమయంలో పురుషుల్లో మాత్రం ఈ తీవ్రత 33.5 శాతం నుంచి 31.3 శాతానికి తగ్గింది. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్గా.. పట్టణాల్లోనే ఊబకాయులు ఎక్కువ నిజానికి వయస్సు, ఎత్తు ఆధారంగా ప్రతీ మనిషి ఎంత బరువు ఉండాలన్నది నిర్దేశిస్తారు. ఇలా నిర్దేశిత బరువు కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఊబకాయంగా గుర్తిస్తారు. ప్రధానంగా.. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లోని మహిళలు, పురుషుల్లోనే ఎక్కువ ఊబకాయం ఉన్నట్లు ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ మహిళల్లో 32.6 శాతం ఊబకాయ సమస్య ఉంది. అదే పురషుల విషయానికొస్తే.. పట్టణాల్లో 37.7 శాతం, పల్లెల్లో 28.0 శాతంగా ఉంది. ఒక్క కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల గతం కన్నా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగినట్లు సర్వే పేర్కొంది. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా.. కొబ్బరి ప్రయత్నించండి! అవగాహన లేకపోవడమే.. వ్యాయామంపై చాలామంది మహిళలకు అవగాహన తక్కువ. దీంతో పాటు బిడ్డలను కన్నాక వారిలో శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల లోపాలు వంటివి సమస్యలుగా మారతాయి. ఇలాంటి సమయంలో వారి శరీరంలో మార్పువచ్చి బరువు పెరుగుతుంటారు. దీన్ని అధిగమించాలంటే శారీరక వ్యాయామం చేయాల్సిందే. కొత్త తరం అమ్మాయిలు, మహిళలు వ్యాయామంపై అవగాహనతో ఉంటున్నారు. – డా. విద్యాసాగర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
బరువు తగ్గేందుకు భరోసా!
-
వయసు రెండేళ్లు, బరువు 45 కిలోలు, దీంతో...
న్యూఢిల్లీ: ఆ పాప వయసు కేవలం రెండు సంవత్సరాలు. కానీ బరువు మాత్రం ఏకంగా 45 కేజీలు. సాధారణంగా, ఆ వయస్సు పిల్లల బరువు 12-15 కిలోలు. కానీ ఖ్యాతి వర్షిణి ఊబకాయంతో తీవ్రంగా బాధపడుతూ, అడుగులు వేయలేకపోయేది. సరిగ్గా పడుకోవడమూ కష్టమైపోయింది. దీంతో ఆ పాపకి ఒంట్లోంచి కొవ్వుని బయటకు తీసే అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఢిల్లీలోని పత్పర్గంజ్లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు ఈ శస్త్ర చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. బేరియాట్రిక్ సర్జరీతో ఆకలి మందగించి తీసుకునే ఆహారం తగ్గిపోతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. ‘‘ఖ్యాతి వర్షిణి పుట్టినప్పుడు సాధారణంగానే రెండున్నర కేజీల బరువుంది.. కానీ ఆ తర్వాత చాలా త్వరగా బరువు పెరిగిపోయింది. 6 నెలలు వచ్చేసరికి 14 కేజీలు ఉన్న ఆ పాప రెండేళ్లకి 45 కేజీలకు చేరుకుంది. అధిక బరువు కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుండడంతో రిస్క్ తీసుకొని సర్జరీ చేయాల్సి వచ్చింది’’అని పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ మన్ ప్రీత్ సేథి వివరించారు. దేశంలో బరువు తగ్గించే శస్త్రచికిత్స చేయించుకున్న అతి పిన్నవయస్కురాలు ఖ్యాతియేనని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స జరిగిన ఐదు రోజుల తర్వాత, ఖ్యాతి పరిస్థితి బాగా మెరుగు పడిందని, ప్రధాన లక్షణాలలో ఒకటైన గురక పూర్తిగా ఆగిపోయిందని మత్తుమందు నిపుణుడు డాక్టర్ అరుణ్ పురి చెప్పారు. అలాగే ఊబకాయంతో బాధపడుతున్నఇతర పిల్లలకు భవిష్యత్తులో ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి మార్గం మరింత సుగమమైందని \చెప్పారు. -
లాక్డౌన్కు తిరిగిచ్చేయాలి.. లేకుంటే లావైపోతాం!
కరోనా వచ్చినప్పటి నుంచి లాక్డౌన్లు, వర్క్ ఫ్రం హోమ్లు మొదలయ్యాయి. బయట తిరగడం తగ్గిపోయింది. శరీరానికి అంతో ఇంతో ఎక్సర్సైజ్ ఆగిపోయింది. ఇది ఇలాగే ఓ ఐదేళ్లు కొనసాగితే ఏమవుతుందో తెలుసా?.. తెల్లగా పాలిపోయిన చర్మం నుంచి కోడిగుడ్డులాంటి షేప్లోని శరీరం వరకు చాలా మార్పులు జరుగుతాయట. ఓ ఫార్మా కంపెనీ, కొందరు డాక్టర్లు సర్వే చేసి ఈ అంచనాలు వేశారు. ఇప్పటికే అలాంటి పరిస్థితి మొదలైందనీ తేల్చేశారు. అసలు సమస్య ఏమిటో, ఎలా బయటపడాలో సూచించారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఇల్లు కదలక.. ఏడాదిన్నర ఓ మహిళ ఉదాహరణగా.. లాక్డౌన్, వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు, ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా ఉండిపోవడం వంటివి లైఫ్స్టైల్, అలవాట్లలో గణనీయ మా ర్పులు తెచ్చాయి. శరీరానికి వ్యాయామం తగ్గింది. ఉద్యోగాలు, వ్యాపారాలపై ఆందోళన పెరిగింది. శరీరానికి సూర్యరశ్మి తగలడమే గగనమైపోయింది. భవిష్యత్తులో వీటిన్నింటి ప్రభా వం ఎంతగా ఉందన్న దానిపై లాయ్డ్ ఫార్మసీ సంస్థ అధ్యయనం చేయించింది. తమకు అనుబంధంగా పనిచేస్తున్న వైద్యుల వద్దకు వచ్చిన పేషెంట్లు, వారి ఆరోగ్య సమస్యలు, వాటికి కారణాలను విశ్లేషించి నివేదికను రూపొందించింది. ఓ మహిళను ఉదాహరణగా తీసుకుని, ఎలా మారిపోవచ్చో అంచనా వేసింది. ఎలాంటి మార్పులు రావొచ్చు, దానికి ఏమేం కారణం కావొచ్చన్నది వివరించింది. ఆ నివేదిక ప్రకారం.. వచ్చే సమస్యలు.. సోఫాల్లో, బెడ్పై అడ్డదిడ్డంగా గంటలు గంటలు కూర్చోవడం పెరిగింది, నడక బాగా తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్నవాళ్లు గంటలకు గంటలు కదలకుండా కూర్చుండిపోతున్నారు. దీని వల్ల శరీర ఆకృతిలో మార్పు వస్తోంది. భుజాలు వంగిపోతున్నాయి (గూనితనం). బరువు పెరిగి ఊబకాయం వస్తోంది. పొట్ట, వెనుకభాగం పెరిగి.. శరీరం కోడిగుడ్డు ఆకారంలోకి వచ్చేస్తోంది. శరీరానికి తగినంత సూర్యరశ్మి సోకక చర్మం పాలిపోవడం, శరీరానికి డి విటమిన్ అందక ఎముకలు, దంతా లు, కండరాలు బలహీనం కావడం, రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో సమస్య ఎక్కువగా ఉంటోంది. ఇంటికే పరిమితమైన చాలా మంది సహజ కాంతి లేకుండా ఎక్కువ సమయం ఎలక్ట్రిక్ లైట్ల వెలుతురులో గడపడం, ఎక్కువ సేపు టీవీ చూడటం పెరిగింది. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు కోసమో.. సినిమాలు, సోషల్ మీడియా, ఇతర టైం పాస్ కోసమో కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ పైనో గడపుతున్నారు. దీనివల్ల కంటి చూపు దెబ్బతింటోంది. నిద్రలేమికి దారితీస్తోంది. ఇంటికే పరిమితమైన చాలా మంది సహజ కాంతి లేకుండా ఎక్కువ సమయం ఎలక్ట్రిక్ లైట్ల వెలుతురులో గడపడం, ఎక్కువ సేపు టీవీ చూడటం పెరిగింది. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు కోసమో.. సినిమాలు, సోషల్ మీడియా, ఇతర టైం పాస్ కోసమో కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ పైనో గడపుతున్నారు. దీనివల్ల కంటి చూపు దెబ్బతింటోంది. నిద్రలేమికి దారితీస్తోంది. ఉద్యోగం, వ్యాపారంలో దెబ్బతినవచ్చనే ఆందోళనకుతోడు ఇంతసేపూ ఇంట్లోనే ఉండటం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. వెంట్రుకలు రాలిపోయే సమస్య బాగా పెరిగింది. ఒత్తిడి కారణంగా నిద్రలో పళ్లునూరడం వంటి సమస్యతో దంతాలు అరగడం, దెబ్బతినడం ఎక్కువైంది. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య పెరిగింది. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వల్ల వ్యక్తుల్లో లైంగిక సామర్థ్యం దెబ్బతింటోంది. ఆల్కాహాల్, సిగరెట్లు వంటి అలవాట్లు పెరగడం సమస్యను మరింతగా పెంచుతోంది. డాక్టర్ల సలహాలు.. వారంలో ఐదు రోజులు రోజూ కనీసం అరగంటకుపైగా కఠినమైన వ్యాయామాలు చేయాలి. మరో గంట పాటు ఇంటి ఆవరణలోనో, వీలున్న చోటనో వాకింగ్ చేయాలి. టీవీ చూస్తూనో, ఫోన్తో గడుపుతూనో ఏదో ఒకటి తింటూ ఉండే అలవాటు మానుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సేపు ఒకేచోట కూర్చు ని ఉండకుండా.. మధ్యలో లేచి ఒకట్రెండు నిమిషాలు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. ఇంటి ఆవరణలోనో, డాబా మీదనో రోజూ పొద్దున పది, ఇరవై నిమిషాల పాటు చర్మానికి ఎండ తగిలేలా నిలబడాలి. అవసరమైతే వైద్యుల సూచనల మేరకు విటమిన్ డి మాత్రలు వేసుకోవాలి. కరోనా నుంచి కోలుకోవడానికి విటమిన్ డి చాలా తోడ్పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో పగలంతా కూడా బయటి నుంచి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. రెండు మీటర్ల కన్నా ఎక్కువ దూరం నుంచి టీవీ చూడాలి. ఫోన్, కంప్యూటర్లలో నైట్ మోడ్ ఆప్షన్ వాడుకోవాలి, బ్లూ లైట్ తక్కువగా వచ్చేలా చూసుకోవాలి. వీలైతే యాంటీ గ్లేర్ అద్దాల వంటివి అమర్చుకోవాలి. ప్రతి పది, ఇరవై నిమిషాలకు ఒకసారి కాసేపు స్క్రీన్ నుంచి దృష్టి మరల్చి దూరంగా ఉన్న వస్తువులపై దృష్టి సారించాలి. వీలైనంత వరకు మానసిక ఆందోళన తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. సమస్యల గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడితే డిప్రెషన్ (కుంగుబాటు)కు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాస్త శారీరక శ్రమ, వ్యాయామం వంటివి మంచి నిద్రకు, మానసిక సమస్యల నియంత్రణకు తోడ్పడుతాయి. ఇష్టమైన వారితో మాట్లాడటం, సంగీతం వినడం, హాబీలు వంటివాటి వైపు మనసు మళ్లించుకోవాలి. వీలైనంత వరకు మానసిక ఆందోళన తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. సమస్యల గురించి మరీ ఎక్కువగా ఆందోళన పడితే డిప్రెషన్ (కుంగుబాటు)కు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాస్త శారీరక శ్రమ, వ్యాయామం వంటివి మంచి నిద్రకు, మానసిక సమస్యల నియంత్రణకు తోడ్పడుతాయి. ఇష్టమైన వారితో మాట్లాడటం, సంగీతం వినడం, హాబీలు వంటివాటి వైపు మనసు మళ్లించుకోవాలి. తగినంతగా వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం, భాగస్వాముల తోడ్పాటు ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఆల్కాహాల్, సిగరెట్లు మానేయడం మంచిది. గుర్తించి, మార్చుకోవాల్సింది మనమే.. ఈ సమస్యలన్నీ వింటే.. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు, ఇంట్లోనే గడపడం మంచిది కాదా అన్న సందేహాలు వస్తాయి. అయితే లాక్డౌన్ వల్ల వచ్చిన మార్పులను.. తిరిగి లాక్డౌన్కు ఇచ్చేయాలని, లైఫ్స్టైల్ మార్పులను నియంత్రణలో ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘‘కరోనా ఆంక్షలు, లాక్డౌన్ల కారణంగా మనుషుల ప్రవర్తన, అలవాట్లలో చాలా పెద్ద మార్పు లు వచ్చాయి. మనుషుల్లో శారీరకంగా జడత్వం పెరిగింది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగడం వల్ల.. ఈ అలవాట్లు, ప్రవర్తన ఇలాగే ఎప్పటికీ ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ అలవాట్లు, ప్రవర్తన మంచివి కాదని గుర్తించి, సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టడం అత్యంత అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు..’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ కేరన్ సేయన్ స్పష్టం చేశారు. ఆఫీస్ తరహా సెటప్ ఉంటే బెటర్ వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు, ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్న వారు అలాగే కూర్చుని ఉండిపోకుండా.. మధ్యలో బ్రేక్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సోఫా, బెడ్ మీద కూర్చుని పనిచేయడం, క్లాసులు వినడం వంటివి చేయొద్దని.. ఆఫీసు/కాలేజీ తరహాలో కుర్చీ, టేబుల్ వంటి ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. -
బరువు తగ్గేందుకు పంటికి తాళం.. మరీ ఇంత క్రూరమా?
బరువు తగ్గటానికి చాలా మంది డైట్ కంట్రోల్ చేసుకుంటారు. కానీ స్వీట్లు లేదా మనకు ఇష్టమైన ఆహార పదార్థాలు కనిపిస్తే చాలు డైట్ను పక్కన పెట్టేస్తాం. ఆహారం తినకుండా నియంత్రించుకోలేని వారికోసం న్యూజిలాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధిపరిచారు. డైట్ నియంత్రించుకోవాలని అనుకునే వారి దంతాలకు ఈ పరికరాన్ని తగిలించుకుంటే చాలు మీరు చాలా నియంత్రణలో ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. డెంటల్ స్లిమ్ డైట్ కంట్రోల్ అని పిలిచే ఈ పరికరం దవడలోని పై దంతాలకు, కింది దంతాలను బోల్టు, అయస్కాంతం సాయంతో కలుపుతుంది. అప్పుడు నోటిని కేవలం 2 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే తెరవగలం. మాట్లాడటానికి లేదా గాలి పీల్చుకోవడానికి మాత్రమే వీలు కలుగుతుంది. దీంతో మనం ఏదైనా తినాలని భావించినా.. సాధ్యపడదు. పైగా ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకునే చాన్స్ ఉంటుంది. ఇలా డైట్ను నియంత్రించుకోవడం ద్వారా బరువు తగ్గించుకునేందుకు దోహదపడుతుందని యూనివర్సిటీ ప్రో–వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ పాల్ బ్రంటన్ వివరించారు. ఒక్కసారి బరువు తగ్గాక ఈ పరికరాన్ని డీ యాక్టివేట్ చేయొచ్చని పేర్కొన్నారు. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవని, చాలా చౌకగా లభిస్తుందని, బరువు తగ్గే శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని తెలిపారు. వీరు చెబుతున్నది బాగానే ఉన్నా.. ఈ పరికరం గురించి యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించగానే విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతటి క్రూరమైన ఆవిష్కరణ ఎక్కడా చూడలేదంటూ మండిపడుతున్నారు. -
WHO Health Policy: ఉప్పుతో ముప్పు తప్పదు!
సాక్షి, అమరావతి: ఉప్పు లేని పప్పేమిటని మనం అంటుంటే ఉప్పు తింటే కొంపకు తిప్పలేనని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా ఆరోగ్య విధానపత్రంలో స్పష్టం చేసింది. మోతాదుకు మించి ఉప్పు తింటే గుండెజబ్బులు, ఊబకాయం, లివర్, మూత్రపిండాల వ్యాధులొస్తాయని ప్రకటించింది. పలు దేశాల్లో ప్రయోగాల అనంతరం ఈ విషయాన్ని పేర్కొంది. ప్యాక్డ్ ఫుడ్స్లో సోడియం ఎక్కువే.. అనేక సంపన్న దేశాలతో పాటు అల్పాదాయ దేశాల్లోనూ ఆహారంలో సోడియం బెడద ఉంది. బ్రెడ్, చిప్స్, తృణ ధాన్యాలతో తయారు చేసే ప్యాక్డ్ ఆహార పదార్ధాలు, ప్యాకింగ్ రూపంలో ఉండే మాంసం, జున్ను సహా పాల ఉత్పత్తుల నుంచి ఉప్పు ఎక్కువగా వస్తోంది. ఉప్పుకు మరోపేరే సోడియం క్లోరైడ్.. ఉప్పు రసాయన నామం సోడియం క్లోరైడ్. శరీరంలోని నీటి పరిమాణాన్ని సోడియం నియంత్రించే ఖనిజం. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక సోడియం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, గ్యాస్ట్రిక్ కాన్సర్, లివర్ సిరోసిన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రజలకు అవగాహన కలిగించాలి.. ఉప్పు ముప్పును తగ్గించేలా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రజలు రోజుకు 5 గ్రాముల ఉప్పు (2 గ్రాముల సోడియంతో సమానం) తినాలని డబ్ల్యూహెచ్వో సిఫారసు చేసింది. 2025 నాటికి 30 శాతం ఉప్పును తగ్గించాలన్నది 2013లో ప్రపంచ దేశాలు పెట్టుకున్న లక్ష్యం. అయితే ఈ లక్ష్య సాధన దిశలో ప్రస్తుత ప్రపంచం లేనట్టుగా ఉందని ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి ఉప్పు వాడకాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది. షుగర్ వ్యాధి, గుండెజబ్బులు, కాలేయ వ్యాధులతో బాధ పడే వారే మన రాష్ట్రంలో ఎక్కువ. మనకు తెలియకుండానే మన పిల్లలకు చిప్స్, బ్రెడ్స్, కేకుల రూపంలో సోడియంను వంట్లోకి పంపిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతోనైనా ప్రజలు అప్రమత్తం కావాలి. మనం తినే అన్నం, కూరలలో కూడా ఎంతో ఉప్పు ఉంటుంది. అది సరిపోతుందని గమనించాలి. – డాక్టర్ విజయసారథి -
ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సమస్య ఒబెసిటీ. వ్యక్తుల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం వంటి అనేక కారణాలతో ఇప్పుడు ఇదొక జీవనశైలికి సంబంధించిన అంశంగా మారింది. అందరూ దీనిని కేవలం అధిక బరువుతోనే కొలుస్తుంటారు. అయితే ఇది అంతకు మించిన తీవ్రమైన పరిస్థితిగా పరిగణించి పూర్తి స్థాయి చికిత్స చేయాలి అంటున్నారు కేర్ ఆసుపత్రికి చెందిన డా.బిపిన్ సేథీ. రోజువారీ జీవనం మీద ఒబెసిటీ ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. హృద్రోగం, డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, కీళ్ల నొప్పులు.. ఇంకా అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాలతో పాటు కొన్ని రకాల కేన్సర్లకూ కారణమవుతుంది. కేవలం శారీరకమైనవే కాకుండా డిప్రెషన్, న్యూనతాభావం తదితర మానసిక సమస్యలకూ ఇది దోహదం చేస్తుంది. సరైన కారణం గుర్తించాలి ఒబెసిటీ విషయంలో వ్యక్తిగత బాధ్యతా రాహిత్యం, విల్పవర్ లోపించడం.. వంటివి చూపిస్తూ బాధితులపైనే పూర్తిగా నెపం వేస్తుంటారు. అలాగే కేవలం ఎక్కువ తినడం, వ్యాయామం లేకపోవడం వంటివి మాత్రమే ఒబెసిటీకి కారణం కావనేది అర్ధం చేసుకోవాలి. దీనికి జన్యుపరమైన సమస్యలతో పాటు పరిసరాలు, వాతావరణం, ప్రవర్తన... ఇవన్నీ కూడా కారణాల్లో ఉండొచ్చు.. ఒబెసిటీ కారణాల గురించి మనకు తక్కువ అవగాహన ఉంది. హార్మోనల్ కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా దీనిని సరైన రీతిలో అర్ధం చేసుకునే దశలోనే మనం ఉన్నాం. కాబట్టి త్వరపడి ఏదోఒక కారణాన్ని నిర్ధారించుకుని చికిత్స సరికాదు. చికిత్సకు నిర్ణీత వ్యవధి ఒబెసిటీ బాధితులు కూడా తామేదో హార్మోనల్ సమస్య అని భావిస్తూ సరైన క్రమపద్ధతిలో కాకుండా త్వరితంగా సమస్య నుంచి బయటపడే మార్గాలు వెతుకుతుంటారు. అది సరైంది కాదు ఈ సమస్య నుంచి కోలుకోవడానికి జీవిత కాలపు ఆరోగ్య నిపుణుల అవసరం ఉంటుంది. వ్యక్తులకు సంబంధించిన డైట్ మాత్రమే కాకుండా తినే ఆహారం, అలాగే వ్యాయామాలను పరిశీలించాల్సి ఉంది. నెగిటివ్ కేలరీ బ్యాలెన్స్తో పాటు ఇదొక దీర్ఘకాలికం కొనసాగాల్సిన ప్రక్రియ, అంతే తప్ప శరవేగంగా ఫలితాలను ఆశించడం, వెంటనే బరువు తగ్గాలని కోరుకోవడం, పెళ్లి వంటి వేడుకల కోసం హడావుడిగా సర్జరీ ప్లాన్స్ ఎంచుకోవడం వల్ల సరైన ఫలితం రాదు. తీవ్రతకు తగ్గ చికిత్స వ్యక్తిగత ఒబెసిటీ తీవ్రతపై ఆధారపడి దీనికి చికిత్స ఉండాలి. అలాగే వ్యక్తిగత ఆరోగ్య ప్రమాదాలు, మానసిక ప్రవర్తన శైలులు, మెటబాలిక్ క్యారెక్టరిస్టిక్స్లతో పాటు గతంలోని అధిక బరువు తగ్గించుకునే యత్నాలు వాటి ఫలితాలు కూడా దీనిలో పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తిగత చికిత్సా పద్ధతులు అనుసరిస్తూ మల్టీ లెవల్ ఒబెసిటీ మేనేజ్మెంట్ నెట్వర్క్తో సమన్వయంతో పనిచేస్తే లక్ష్యం చేరుకోవడానికి వీలవుతుంది. ఒబెసిటీ మేనేజ్మెంట్లో నైపుణ్యం కలిగిన బృందం పనిచేయాలి. చికిత్సలో భాగంగా అన్ని రకాల ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. రోగి జీవనశైలికి, ప్రాధామ్యాలకు నప్పేలా దీనిని డిజైన్ చేస్తారు. మందుల వాడకాన్ని సమీక్షించడం, మార్పు చేర్పులు, పోషకాల సహకారం, శారీరక కార్యకలాపాలు పెంచడం, కౌన్సిలింగ్, రోగికి నప్పేదైతే బేరియాట్రిక్ సర్జరీ.. వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. పలువురు భావిస్తున్నట్టు ఇది ఒంటరిగా పోరాడే పరిస్థితి కాదు. వైద్య నిపుణుల పర్యవేక్షణ సహకారం అవసరం. - డాక్టర్ బిపిన్సేథీ, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ -
హాయిగా కూర్చునే బరువు తగ్గొచ్చు..
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కొందరు ఆడవారికి ఇంటిపనితో పాటు ఆఫీస్ ఒత్తిడి పెరిగిపోవడం లేదా శరీరంపై శ్రద్ధ తగ్గడంతో బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతూ ఉంటుంది. వేళకు మంచి ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం అందకపోవడం.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం.. ఇలా పలు కారణాలతో.. పొట్ట, నడుము, పిరుదులు, చేతులు, తొడలు.. ఇలా చాలా భాగాల్లో కొవ్వు పేరుకుపోయి.. చూడటానికి షేప్లెస్గా మారిపోతుంటారు చాలా మంది. అతి తక్కువ సమయంలో స్లిమ్గా, నాజుగ్గా మారాలంటే ఈ బ్యాగ్లో చక్కగా ఓ కుర్చీ వేసుకుని కూర్చుంటే సరి. అదే ఈ పోర్టబుల్ పర్సనల్ స్టీమర్ ప్రత్యేకత. చిత్రంలోని మెషిన్తో పాటు ప్రత్యేకమైన టెంట్, ఒక చైర్(చిత్రంలో గమనించవచ్చు) లభిస్తాయి. టెంట్ ఓపెన్ చేస్తే.. గుడారంలా ఒక మనిషి పట్టేంత వైశాల్యంతో పెద్దగా ఓపెన్ అవుతుంది. అవసరం లేనప్పుడు మడిచి గుండ్రటి రింగ్లా చిన్న బ్యాగ్లో పట్టేవిధంగా మార్చేసుకోవచ్చు. (అచ్చం దోమలు రాకుండా వాడే నెట్ టెంట్ మాదిరి ఫోల్డ్ చేసుకోవచ్చు). టెంట్ వాటర్ ప్రూఫ్ కావడంతోపాటు వాటర్ లీక్ కాకుండా ప్రొటెక్టివ్గా ఉంటుంది. దీనికి రెండు వైపులా జిప్ ఉంటుంది. ఇక స్టీమర్లో ఉన్న వాటర్ ట్యాంక్లో వాటర్ పోసుకుని దాని ముందు భాగంలో ఉన్న డిస్ప్లేలో ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. దీన్ని రిమోట్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. స్టీమర్కి, టెంట్కి కనెక్షన్ ఉంటుంది. లోపలికి ఆవిరి వెళ్తూ.. బాడీ మొత్తానికి స్పా అవుతుంది. దీనిలో స్పా చేసుకుంటే బరువు తగ్గడంతో పాటు.. జాయింట్ పెయిన్స్ తగ్గడం, మజిల్స్ స్టిఫ్గా మారడం, మానసిక ఒత్తిడి తగ్గడం.. రక్తప్రసరణ బాగా జరగడం, ఎనర్జీలెవల్స్ పెరగడం, చర్మం కాంతిమంతంగా మారడం వంటి పలు ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఈ స్టీమర్తో పాటు అదనంగా 2 కనెక్షన్ పైప్స్, ఒక ఫస్ట్ఎయిడ్ బాక్స్, క్యారీ బ్యాగ్ లభిస్తాయి. దీని ధర సుమారు 90 డాలర్లు. అంటే సుమారు 6,600 రూపాయలు. -
అధిక బరువు: మృత్యుమార్గంలో పయనించడమే
వాషింగ్టన్: ఒక వ్యక్తి ఉండాల్సిన దాని కంటే అధికంగా బరువు పెరుగుతుంటే అది మృత్యుమార్గంలో ప్రయణించడమేనని యూఎస్కు చెందిన ‘ప్లాస్’ మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో సుమారు పదివేలమంది స్థూలకాయం ఉన్నవారితో పాటు మూడు లక్షలమందికి పైగా సాధారణ బరువున్న వారిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ జర్నల్లో పేర్కొన్నారు. ఒకవేళ నేరుగా బరువే మరణాలకు కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు. చదవండి: కూల్డ్రింక్స్ తాగితే.. శరీరం చల్లబడుతుందా? -
కూల్డ్రింక్స్తో శరీరం చల్లబడుతుందా?
చల్లని పానీయాలు వేసవిలో మంచి ఉపశమనం కలగజేస్తాయనే అపోహతో మనం కూల్డ్రింక్స్ తాగుతుంటాం. వాటిని తాగగానే దాహం తీరుతుందనే దురభిప్రాయంతో చాలామంది నీటికి బదులుగా తాగేస్తుంటారు. కానీ వాటిని తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని అధ్యయనాల్లో రుజువైంది. పిల్లల్లో వీటి వల్ల ఊబకాయం వస్తుంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా ఉంది. కూల్డ్రింక్స్లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ దంతాలపై ఉండే అనామిల్ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫారిక్ యాసిడ్తో క్యాల్షియం మెటబాలిజమ్ సైతం దెబ్బతిని, ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయనే పరిశోధనల నివేదికలు ఉన్నాయి. పైగా కూల్డ్రింక్స్ను నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాలు (ప్రిజర్వేటివ్స్) వల్ల పిల్లల్లో విపరీత ధోరణులు పెరిగి మానసిక అనారోగ్యాలకు దారితీస్తుందని తెలిసింది. -
ఒళ్లు కరిగించే మధుమేహ మాత్ర!
ఊబకాయులకు ఓ శుభవార్త. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒళ్లు తగ్గడం లేదన్న మీ బెంగ త్వరలోనే తీరబోతోంది. ఎందుకంటే మధుమేహానికి వాడే సెమాగ్లుటైడ్ అనే మందు శరీరాన్ని తగ్గించేందుకు భేషుగ్గా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకలిని నియంత్రించే వ్యవస్థను తన అధీనంలోకి తీసుకోవడం ద్వారా ఈ మందు పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మందును వాడిన ఊబకాయుల్లో 33 శాతం మంది బరువు తగ్గారు. అది కూడా వారి శరీర బరువులో 20 శాతం వరకు తగ్గుదల నమోదు కావడం విశేషం. ఈ ప్రయోగంలో పాల్గొన్న వారందరూ వారానికి ఒకసారి సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ తీసుకోవడమే కాకుండా బరువు తగ్గేందుకు సాధారణంగా ఆచరించే పద్ధతులన్నింటినీ కొనసాగించారు. సెమాగ్లుటైడ్ అనేది ఆకలి భావనను తగ్గిచేందుకు ప్రకృతిలో లభించే జీఎల్పీ–1 హార్మోన్ మాదిరిగా ఉంటుంది. 2017లో దీన్ని బరువు తగ్గించేందుకూ ఉపయోగించొచ్చా? అన్నది పరిశీలించి సానుకూల ఫలితాలు సాధించారు కూడా. అప్పట్లో 28 మంది ఊబకాయులకు ఈ మందు ఇవ్వగా, ఆకలి తగ్గిపోయిన కారణంగా 12 వారాల తర్వాత వీరి శరీర బరువు సగటున 5 కిలోల వరకు తగ్గింది. ప్రస్తుతం మూడో దశ మానవ ప్రయోగాలు జరుగుతున్నాయి. 16 దేశాల్లోని 129 ప్రాంతాల్లో 2 వేల మందిపై ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. మొత్తం 68 వారాల పాటు ఈ ప్రయోగాలు జరగ్గా కొంతమందికి వారానికి ఒకసారి సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్, మరి కొంతమందికి ఉత్తుత్తి ఇంజెక్షన్ ఇచ్చారు. ఉత్తుత్తి ఇంజెక్షన్ ఇచ్చిన వారు సగటున 2.6 కిలోల బరువు తగ్గగా, బాడీ మాస్ ఇండెక్స్ కూడా 0.92 వరకు తగ్గింది. సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ తీసుకున్న వారు సగటున 15.3 కిలోల బరువు తగ్గారు. బీఎంఐ తగ్గుదల 5.54గా నమోదైంది. గుండెజబ్బుకు కారణాలైన మధుమేహం, రక్తపోటు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. -
వీడని భయం.. ఊబకాయం
మితివీురిన ఆహారం, జంక్ ఫుడ్ల వల్ల శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి హాని చేసే ఒక వ్యాధినే ఊబకాయంగా పిలుస్తారు. దీనినే స్థూలకాయం అని కూడా అంటారు. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ధూమపాన వ్యసనం, ఒత్తిళ్లు, కొన్నిసార్లు వారసత్వం వల్ల కూడా దీనిబారిన పడొచ్చు. అంటే ఒక వ్యక్తి తన ఎత్తు, వయస్సుకు తగ్గట్లుగా ఉండాల్సిన బరువుకు మించితే దీనిని అనారోగ్య సమస్యగా గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం (గురక), కీళ్లకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన కేన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పనిభారం అధికం కావడంతో ఒత్తిడికి గురవుతుంటారు. ఊబకాయానికి తోడు ఆర్థిక సమస్యలు, నిద్రలేమి, సామర్థ్యానికి మించి పనిచేయడం వలన పలువురు రక్తపోటు బారిన పడుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు పెరగడం అంతిమంగా హృదయంపై ప్రభావం చూపనుంది. ఉదయం, సాయంత్రం వేళ కచ్చితంగా కొంత సమయం వ్యాయామం చేయాలని, చెమట పట్టేలా నడవడం, పరిగెత్తడం ద్వారా కొవ్వు కరిగించి బరువు తగ్గాలని వైద్యులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ ప్రభావం అధిక కేలరీలు కలిగి ఉండే ఆహారంగా చెప్పుకునే జంక్ఫుడ్ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతోంది. పెద్దల పరిస్థితీ అంతే. సాచ్యురేటెడ్ కొవ్వులు, ఉప్పు, పంచదార పాళ్లు మోతాదుకు మించి ఉండే చిరుతిళ్లు తినడం ప్రమాదకరం. అంటే బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేకులు, నూడిల్స్, చిప్స్, తీపి ఉండలు, పంచదార పెట్టిన సీరల్స్, ఫ్రైడ్, ఫాస్ట్ ఫుడ్, కార్బొనేటెడ్ డ్రింక్స్, రెడిమేడ్ కూల్ డ్రింక్స్ లాంటివి జంక్ ఫుడ్గానే చెప్పొచ్చు. ఇంకా మసలా చాట్, పకోడీలు, బజ్జీలు, టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్ డింగ్–డాంగ్స్ లాంటివి కూడా ఎక్కువ తీసుకోవద్దు. మోతాదుకు మించి తినొద్దు పిల్లలు టీవీ ముందు కూర్చొని చిరుతిళ్లు ఎక్కువగా తింటుంటారు. ఈ పద్ధతిని మాన్పించాలి. పెద్దలు వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలి. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఫైబర్ ఉన్న పదార్థాలు తినాలి. మాంసాహారం, ధూమపానం, మద్యపానం అలవాట్లు మానాలి. – డాక్టర్ భూక్యా నాగమణి, సుజాతనగర్ పీహెచ్సీ -
‘మేడ్ ఇన్ ఇండియా’ సైకిల్పై బ్రిటన్ ప్రధాని
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. కరోనాపై పోరులో భాగాంగా స్థూలకాయానికి (ఒబెసిటీ)కి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జీబీపీ 2 బిలియన్ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్ను ప్రారంభించిన బోరిస్.. దానిలో భాగంగా నాటింగ్హామ్లోని బీస్టన్ వద్ద ఉన్న హెరిటేజ్ సెంటర్లో సైకిల్ తొక్కారు. 56 ఏళ్ళ బోరిస్కి సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టమట. హెల్త్, ఫిట్నెస్ కోసం సైక్లింగ్ చాలా మంచిదని ఆయన అంటున్నారు. బ్రిటన్లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నవారిలో చాలామంది స్థూలకాయులేనని, మితిమీరిన శరీర బరువు వల్ల వారు మృత్యువాత పడుతున్నారని కొందరు నిపుణులు ఇటీవల తేల్చారు. దాంతో ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న ఉద్దేశంతో బిట్రన్ ప్రభుత్వం ఇప్పటికే ఆహార పదార్థలపై ఇచ్చే వన్ ప్లస్ వన్ ఆఫర్ను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా బోరిస్ ఈ సైక్లింగ్ డ్రైవ్ను ప్రారంభించారు. ప్రధాని తొక్కిన సైకిల్ ఇండియాకు చెందిన హీరో మోటార్స్ కంపెనీది. వికింగ్ ప్రో బైక్ పేరుతో ఆ సైకిల్ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మాంచెస్టర్లో సైకిల్ను డిజైన్ చేశారు. (ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక) సైకిల్ తొక్కడాన్ని ఇష్టపడే బోరిస్.. దేశంలో వేల కిలోమీటర్ల బైక్ లేన్లను ఆవిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు. కొత్త ఫిట్నెస్ స్ట్రాటజీలో భాగంగా ప్రభుత్వం సైకిల్ తొక్కేవారికి ప్రత్యేక లేన్ వేయనున్నట్లు తెలిపింది. అంతేకాక నిత్య జీవితంలో సైక్లింగ్ను ప్రొత్సాహించడానికి గాను రవాణా కేంద్రాలు, పట్టణం, నగర కేంద్రాలు, ప్రభుత్వ భవనాల వద్ద మరిన్ని సైకిల్ రాక్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇళ్లలో పార్కింగ్ స్థంల లేని వారి కోసం వీధుల్లో రాక్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సైక్లింగ్ వల్ల ఫిట్గా ఉండటమే కాక గాలి నాణ్యత మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరతాయన్నారు బోరిస్. (ఒక్క క్షణం.. అందరినీ పిచ్చోళ్లను చేశాడు) -
కరోనా, లాక్డౌన్ ఇచ్చిన బహుమానాలివే..
సాక్షి, హైదరాబాద్: మాయదారి కరోనా మనుషుల ఆరోగ్యాలను అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ సోకిన వారు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడతారని కొన్ని అధ్యయనాలు చెబుతుంటే... దీని బారినపడని వారూ పరోక్షంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఎయిమ్స్ ప్రొఫెసర్లు జరిపిన సర్వే వివరాలను ‘డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిన్డ్రోమ్ జర్నల్’ ప్రచురించింది. దీని ప్రకారం కరోనా, లాక్డౌన్ కారణంగా దేశానికి మధుమేహం, ఊబకాయం ముప్పు పొంచి ఉందని స్పష్టమవుతోంది. లాక్డౌన్ సమయంలో జనం ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడం, తగిన వ్యాయామం చేయకపోవడం, మితం లేని ఆహారం తీసుకున్న కారణంగా 40 శాతం మంది బరువు పెరిగారని తేలింది. వీరిలో 7 శాతం మంది డయాబెటిస్ (షుగర్) వ్యాధి బారినపడే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ సర్వేను వయసు, లింగం, బరువు, కుటుంబ చరిత్ర, వ్యాయామ పద్ధతుల ఆధారంగా శాస్త్రీయంగా నిర్వహించినట్టు జర్నల్లో పేర్కొన్నారు. జాగ్రత్త సుమా.. లాక్డౌన్ సమయంలో 38 శాతం మంది మాత్ర మే వారానికి మూడ్రోజుల పాటు 30–45 నిమిషాల సమయం వాకింగ్కు కేటాయించినట్టు చె ప్పారని సర్వే తెలిపింది. ఊబకాయం ఉన్న వారి కి కరోనా సోకితే మరణాల రేటు పెరిగే అవకాశం ఉందని, వెంటిలేటర్ చికిత్స వరకు వెళ్లే అవకాశం ఉందని గతంలో జరిపి న అధ్యయనాలు వెల్లడించాయని, ఇప్పు డు లాక్డౌన్ కారణంగా బరువు పెరిగిన వారు కరోనా సోకకుండా జాగ్రత్త గా ఉండాలని సర్వే హెచ్చరించింది. రక్త పరీక్షలు మేలు 30 ఏళ్లు దాటిన వారు రక్తంలో గ్లూకో జ్ పరీక్ష చేయించుకుంటే మేలని సర్వే సూచించింది. అసలు రక్త పరీక్షలు చేయించుకోని వారు, నియంత్రణలో లేని షుగర్ ఉన్నవా రు కరోనాకు గురయ్యే అవకాశం ఉందని కూడా తెలిపింది. బరువు పెరిగారు.. లాక్డౌన్ సమయంలో వంద మంది నాన్ డయాబెటిక్ రోగులను పరిశీలించగా అందులో 40 శాతం మంది బరువు పెరిగారు. 41 శాతం మంది బరువులో ఎలాంటి మార్పు లేకపోగా, 19 శాతం మంది బరువు తగ్గారు. 0.1–5 కిలోల బరువు పెరిగినవారు 40 శాతం ఉంటే, ఏకంగా 16 శాతం మంది. 2.1–5 కిలోల బరువు పెరిగారు. ఇక, వీరిలో 7 శాతం మందికి డయాబెటిస్ ముప్పు పొంచి ఉందని సర్వే వెల్లడించింది. లక్షణాలు ఇప్పుడే కనిపించవు బరువు పెరిగిన వారు డయాబెటిస్కు గురయ్యే అవకాశం ఎక్కువ. కనీసం 100లో 7% మందికి షుగర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వారికి ఆ లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో షు గర్ బారిన పడడం ఖాయం. – డాక్టర్ అనూప్ మిశ్రా, ఎయిమ్స్ ప్రొఫెసర్ -
పోలీసుల్లో చాలామందికి కరోనా ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: ‘పోలీసు సిబ్బందికి షిఫ్ట్లు..ప్రతి వారం వీక్లీ ఆఫ్లు’ – ఏళ్లుగా వినిపిస్తున్న ఈ మాటలు నీటి మూటలే అయ్యాయి. ఆ ప్రభావం ప్రస్తుతం నెలకొన్న ‘కరోనా ఫీవర్’పై తీవ్రంగా కనిపిస్తోంది. ఆరోగ్యవంతుల కంటే ఊబకాయం సహా ఇతర రుగ్మతలతో కూడిన వారికి కరోనాతో ముప్పు ఎక్కువని నిపుణులు, వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నమరణాలను పరిశీలిస్తే ఈ విషయం నిజమేనని స్పష్టమవుతోంది. పోలీసు విభాగాన్ని తీసుకుంటే గరిష్టంగా 30 శాతం మంది పూర్తి ఫిట్నెస్తో ఉండరు. అనేక మందికి ఊబకాయం, షుగర్, బీపీ, శ్వాసకోస సమస్యలు, హృద్రోగం తదితరాలలో ఇబ్బంది పడుతున్న వారే. ఇలాంటి పరిస్థితుల్లో నగర పోలీసు విభాగాన్ని కరోనా వైరస్ చుట్టేస్తుండటం పోలీసులతో పాటు వారి కుటుంబాలనూ కలవరపాటుకు గురిచేస్తోంది. సోమవారం నాటికి సిటీ పోలీసు విభాగంలో పాజిటివ్ కేసుల సంఖ్య 125 దాటింది. ఇప్పటి కరోనా పరిస్థితులు పక్కన పెట్టినా...పోలీసు సిబ్బందిలో ఈ రకమైన అనారోగ్యకర పరిస్థితి నెలకొనడానికి అనేక కారణాలున్నాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర శాఖలతో పోలిస్తే ఫిట్నెస్ అనేది పోలీసు వారికి అత్యంత కీలకమైన అంశం. ఎంపిక, శిక్షణ, విధి నిర్వహణ ఇలా అన్ని స్థాయిల్లోనూ ఇది పరిగణలోకి తీసుకుంటారు. ఎంపిక, శిక్షణ దశల్లో ఉన్న దారుఢ్యం ప్రస్తుతం 15 శాతం మందిలోనూ కనిపించట్లేదు. అప్పట్లో ఉన్న శ్రద్ధ, సమయం లేకపోవడంతో పాటు పనితీరు కూడా దీనికి దోహదం చేస్తోంది. 30 శాతం మందికీ వర్తించని బీఎంఐ... ఎంత ఎత్తు ఉన్న వ్యక్తి ఎంత బరువు ఉండాలనే దానికి సంబంధించి అంతర్జాతీయ గణన ఉంది. దీన్నే సాంకేతికంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అంటారు. పోలీసు విభాగంలో కానిస్టేబుల్గా దరఖాస్తు చేసుకునే వారు పురుషులైతే కనిష్టంగా 167.6 సెంమీ, మహిళలైతే 152.5 సెంమీ ఎత్తు ఉండాలి. (రిజర్వేషన్ ప్రకారం కొందరికి మినహాయింపులు ఉంటాయి.) దీని ప్రకారం చూస్తే 58.3–68.2 కేజీల మధ్య మాత్రమే బరువు కలిగి ఉండాలి. ఎంపికయ్యే వారి గరిష్ట ఎత్తు 182.8 సెంమీ (ఆరు అడుగులు) అనుకున్నా... 63.6–79.5 కేజీల మధ్య మాత్రమే ఉండటం బీఎంఐ ప్రకారం తప్పనిసరి. అయితే ప్రస్తుం నగర కమిషరేట్ పరిధిలో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిలో కనిష్టంగా 30 శాతం మంది కూడా బీఎంఐ ప్రకారం ఎత్తుకు తగ్గ బరువుతో ఫిట్గా ఉండరన్నది అధికారులే అంగీకరిస్తున్నా వాస్తవం. 60 శాతం మంది అధిక బరువు, మరో పది శాతం మంది ఒబేసిటీతో బాధపడుతుంటారని వారే చెప్తున్నారు. ఈ కారణంగానే అనేక మంది వివిధ రకాలైన రుగ్మతల పాలవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్థితికి కారణాలు అనేకం... పోలీసు ఉద్యోగం కోసం ఎంపికయ్యే, శిక్షణలో ఉన్నప్పుడు తీసుకున్నంత ఆరోగ్య శ్రద్ధ విధుల్లో చేరిన తరవాత తీసుకోకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోపక్క సమయం, సందర్భం లేకుండా బందోబస్తు, ఇతర విధులు నిర్వర్తించే సిబ్బందికి ఆహారం, నిద్ర సరైన సమయానికి సాధ్యం కావు. అన్ని రోజుల్లోనూ ఒకే సమయంలో తీసుకోవడం కూడా అసంభవమే. ఇది పొట్ట, ఊబకాయం పెరగడంతో పాటు అనేక ఇతర రుగ్మతలకూ మూలంగా మారుతోందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఇబ్బందులతో పాటు మహిళా సిబ్బంది విషయంలో మరికొన్ని కారణాలతో ఊబకాయం సమస్యకు లోనవుతున్నారు. పురుష కానిస్టేబుళ్లతో పోలిస్తే మహిళా కానిస్టేబుళ్లతోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని పోలీసులే చెప్తున్నారు. ట్రాఫిక్ విభాగంలో పని చేసే సిబ్బంది అనునిత్యం కాలుష్యం, దుమ్ము–ధూళి ప్రభావానికి లోనవుతూ ఉంటారు. ఈ కారణంగానే వీరికి శ్వాసకోస సంబంధ వ్యాధులతో పాటు బీపీ, షుగర్ వంటివి ఎక్కువగా వస్తున్నాయి. బందోబస్తులు మరో ‘భారం’ సిటీలో పని చేసే సిబ్బంది బందోబస్తులతో మరింత ‘భారం’గా మారుతున్నారు. నగరంలో పని చేసే వారిలో సగం కంటే ఎక్కువ మంది దాదాపు 160 నుంచి 180 రోజుల వరకు ఈ విధుల్లో గడపాల్సిందే. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయిస్తే ఒకే ప్రాంతంలో గంటల తరబడి కూర్చోవడం, ఎక్కువగా బయట తయారు చేసి, నూనె ఉత్పత్తులు తీసుకోవడం అనివార్యంగా మారుతోంది. ఈ కారణంగానే సిబ్బంది తమ బరువుపై అదుపు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వీటన్నింటికీ మించి ఇతర విభాగాలతో పోలిస్తే పోలీసులు చాలా తొందరగా, తేలిగ్గా దురలవాట్లకు బానిసలు అవుతుండటం కూడా ఒబెసిటీకి మరో కారణంగా కనిపిస్తోంది. అప్పటిలా కనిపించని డ్రిల్స్... పోలీసు విభాగంలో పని చేసే సిబ్బంది కచ్చితంగా ఫిట్నెస్తో ఉండాలన్న ఉద్దేశంతో డ్రిల్స్ను ప్రవేశపెట్టారు. గతంలో ఇవి పోలీసుస్టేషన్లు, డివిజన్ల వారికీ ప్రతి వారం జరిగేవి. ఇందులో భాగంగా దాదాపు మూడునాలుగు గంటల పాటు వ్యాయామం, ఇతర కసరత్తులు చేయించే వారు. అయితే ప్రస్తుతం బందోబస్తులు, ఇతర పనులకే సమయం చాలకపోవడంతో డ్రిల్స్ మూలనపడ్డాయి. ఎవరికి వారూ సొంతంగా చేసుకోవడానికీ అవకాశం చిక్కట్లేదు. మిలటరీ విభాగాల్లో ఉన్నట్లు పోలీసు సిబ్బందికి నిత్యం ఫిట్నెస్ పరీక్షలు, వ్యాయామాలు లేకపోవడం, ఉన్నతాధికారుల మాదిరి మిడ్ కెరియర్ శిక్షణలు కరవు కావడం వీరికి శాపంగా మారుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటీవలే పోలీసుస్టేషన్లలో జిమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిని వినియోగించుకునే సమయం సిబ్బందికి దొరకట్లేదు. షిఫ్ట్, వీక్లీ ఆఫ్ అమలు చేయాలి ‘ప్రస్తుతం సిటీలో రోజు రోజుకూ కరొన కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఆంక్షలు, కఠిన నిబంధనలు ప్రవేశపెట్టాలన్నా పోలీసుల సహకారం అత్యంత కీలకం. అయితే పోలీసు విభాగం అలాంటి పరీక్షల్ని ఎదుర్కొవడానికి సిద్ధంగా లేదు. సమయ పాలనతో పాటు సరైన నిద్ర, ఆహారం లేని విధులు నిర్వర్తించే పోలీసుల్లో ఫిట్నెస్ ప్రధాన సమస్యగా మారుతోంది. ముందుగా సిబ్బంది సంఖ్యను పెంచి, షిఫ్ట్ డ్యూటీలు, వీక్లీ ఆఫ్లు అమలు చేయాలి. ప్రధానంగా ప్రతి పోలీసులకూ కేవలం ఎనిమిది గంటలు మాత్రమే డ్యూటీ టైమ్గా స్పష్టం చేసి, అమలు చేయాలి. అలా చేస్తేనే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళనూ పోలీసు విభాగం సమర్థంగా ఎదుర్కోగలదు’.– పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారి -
కాకరతో 10 అద్భుత ప్రయోజనాలు..
కాకరకాయను తలచుకోగానో దీని చేదు స్వభావం ముందుగా కళ్ల ముందు కదలాడుతుంది. చేదుగా ఉంటే కాకరను ఎలా తింటాంరా బాబూ అని చాలా మంది దూరం పెడుతుంటారు. అయితే కొంతమందికి మాత్రం కాకరకాయ పిచ్చిపిచ్చిగా నచ్చుతుంది. రోజువారీ ఆహారం కాకరను తప్పనిసరిగా వినియోగిస్తారు. రుచికి చేదు అయినా ఆరోగ్యానికి అమృతం లాంటింది. ఎంతో మందికి కాకర వల్ల కలిగే ప్రయోజనాలు తెలియవు. దానిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఇక వదులుకోరు. కాకర ఆస్తమా, జలుబు, దగ్గు వంటి మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతవమైన ఔషధంగా పనిచేస్తుంది. కాకర జ్యూస్ తాగితే లివర్ సమస్యలు తగ్గుతాయి. న్యూట్రిషన్ విలువలు ► మొత్త కాలరీలు-16 ►ఆహార ఫైబర్ - 2.6 గ్రా ►కార్బోహైడ్రేట్లు - 3.4 గ్రా ►కొవ్వులు - 158 మి.గ్రా ►నీటి శాతం - 87.4 గ్రా ►ప్రోటీన్ - 930 మి.గ్రా అసలు మనిషి ఆరోగ్యానికి కాకరకాయ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంలో అనేక క్లినికల్ అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాలలో దీనిని తినడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని వెల్లడైంది. మనలో చాలా మంది కాకరను రుచి కారణంగా తినడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా, సమృద్ధిగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్న తర్వాత, మీరు బహుశా మీ ఆలోచనను మార్చుకోవచ్చు. దీనితో కడుపు నొప్పి, మధుమేహం, కాన్యర్, గుండె జబ్బులు వంటి సర్వ రోగాలకు నివారిణిగా పనిచేస్తుంది. ఎంతో మేలు చేస్తుంది. 1.మలబద్దకం, జీర్ణాశయం వ్యాధులు నివారణ కాకరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి వంటి పేగు రుగ్మతలను నయం చేయడమే కాకుండా, జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే పరాన్నజీవులను చంపడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇది యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.జీర్ణ ఎంజైమ్లను ప్రేరేపించడానికి, జీర్ణక్రియకు ఉపకరిస్తుంది.అధిక ఫైబర్ ఉంన్నందు వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాకరను వైద్యులు సిఫార్సు చేస్తారు. 2. డయాబెటిస్ కాకర డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది. డయాబెటిస్తో బాధపడుతున్న ఎవరికైనా దీనిని తరచుగా తీసుకోవాలని సూచిస్తారు. ఇందులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలతో కూడిన మూడు క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. అవి పాలీపెప్టైడ్-పి, వైసిన్, చరణి. ఇవి ఇన్సులిన్ లాంటి లక్షణాలు కలిగి రక్తంలో గ్లూకోజ్ విలువలను తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయని నిర్ధారణ జరిగింది. రక్తంలో షుగర్ లెవల్స్లను తగ్గించడంలో చురుకుగా పనిచేస్తాయి. అంతేకాక కాకరలో లెక్టిన్ ఉందని, ఇది ఆకలిని అణచివేయడం,పరిధీయ కణజాలాలపై పనిచేయడం ద్వారా శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ను తగ్గించడానికి సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ ఉదయం కాకర జ్యూస్ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మీ డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవచ్చు. దీనిలో పీచు లక్షణాలు అధికంగా కలిగిఉండడం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్ధకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది. 3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాకరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. మానవ శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఇది రోగనిరోధక కణాలు,తెల్ల రక్త కణాలు (డబ్ల్యూసీ) పెంచడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, అలెర్జీని నివారించడంలో సహాయపడుతుంది. కాకర కాయలు, ఆకులను నీటిలో ఉడకించి తీసుకోవడం వల్ల అంటు రోగాలు దరిచేరకుండా ఉంటాయి. 4. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది కాకరకు గల యాంటీమైక్రోబయల్, యాటీఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలోని చెత్తను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాక ఇది మీ కాలేయంలో స్థిరపడిన అన్ని రకాల మత్తులను తుడిచిపెట్టడానికి దోహదపడుతుంది. అందువల్ల ఇది అనేక కాలేయ సమస్యలను నయం చేస్తుంది. అలాగే మీ పేగును శుభ్రపరుస్తుంది. ఇది మూత్రాశయం సరైన పనితీరుకు సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు హ్యాంగోవర్ అయితే, చేదుకాయ రసం తీసుకోవడం వల్ల మన శరీరం నుంచి ఆల్కహాల్ మత్తును తగ్గించి చురుకుగా ఉంటారు. 5. క్యాన్సర్ నుండి రక్షింస్తుంది. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్కు ప్రధాన కారణం. అవి మన శరీరం పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. నిందుకు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ లేకుండా చూసుకోవాలి. ఫ్రీ రాడికల్స్.. ధూమపానం, కాలుష్యం,ఒత్తిడితో అధికంగా పెరుగుతుంది. కావున కారలో లైకోపీన్, లిగ్నన్స్, కెరోటినాయిడ్లు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో విటమిన్ ఎ, జియా-శాంథిన్,లుటిన్ ఉన్నాయి. ఇవి ప్రాధమిక యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. దీంతో చివరకి మన శరీరంలో కణితులు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. 6. కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ధమనులలో కొవ్వు ఫలకం ఏర్పడుతుంది, ఇది గుండె రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పనిచేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాకర చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పుష్టి ఆరోగ్యానికి తోడ్పడటానికి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. కాకరలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ గుండెపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. 7. అధిక బరువును తగ్గిస్తుంది. కాకరలో గొప్ప పోషకాలు ఉండటం వల్లగా బరువు తగ్గించే ఆహారంగా సహకరిస్తుంది. 100 గ్రాముల కాకరలో 16 కేలరీలు, 0.15 గ్రాముల కొవ్వు, 0.93 గ్రాముల ప్రోటీన్, 2.6 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటాయి. అందువల్ల, మన బరువుకు అదనపు పౌండ్లను జోడించకుండా తగ్గిస్తుంది. పోషకాలు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. జంక్, అనారోగ్యకరమైన స్నాక్స్ మీద ఆధారపడకుండా చేస్తుంది. కాకర రసం తాగడం ద్వారా ఉబకాయం తగ్గుముఖం పడుతుంది. కాకరలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మంచి ప్రోటీన్, ఫైబర్ ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి. 8. జుట్టుకు మెరుపు అందిస్తుంది. కాకర జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలో ప్రోటీన్, జింక్.విటమిన్ సి వంటి భాగాలు జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. జుట్టుకు కాకర జ్యూస్ను రాయడం వల్ల మూలాలు బలోపేతం అవుతాయి. స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు చికిత్స అందుతుంది. ఇది జుట్లును షైన్గా ఉండటంలో సహాయపడుతుంది. 9. చర్మాన్ని అందంగా చేస్తుంది మొటిమలు, మచ్చలు, చర్మ అంటు వ్యాదులను తొలగిస్తుంది. నిమ్మరసంతో కాకరను ప్రతిరోజు పరగడుపున 6 నెలలు తీసుకుంటే సరైన ఫలితాలు పొందుతారు. చర్మాన్ని ముడతలు లేకుండా ఉంచడంలో, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం సున్నితత్వానికి కారణమవుతుంది. ఇంకా సోరియాసిస్ , తామర చికిత్సకు సహాయపడుతుంది.సూర్యుడి నుంచి హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. 10. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది కంటి చూపు, కంటిశుక్లం వంటి దృష్టి సంబంధిత సమస్యలను నివారించడంలో కాకర సహాయపడుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ నిండి ఉంటాయి. ఇవి కళ్ళకు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాక కళ్ల కింద నల్లడి వలయాలను తగ్గించేందుకు మంచి నివారణగా ఉపకరిస్తుంది. -
కలుషితమైన గాలిని పీలిస్తే..
వాషింగ్టన్: కలుషితమైన గాలిని పీల్చడం ఒబెసిటీ (ఊబకాయం), డయాబెటిస్, జీర్ణాశయాంతర రుగ్మతలు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను పెంచుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురితమైంది. అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ నిపుణులు ఈ పరిశోధన నిర్వహించారు. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు సూర్మరశ్మికి గురైనప్పుడు ఓ ప్రమాదకరమైన వాయు కాలుష్య ఓజోన్ వీరు గుర్తించారు. ఈ గాలి, అందులో ఉండే కారకాలు ఊబకాయ వ్యాధికి కారణమవుతాయని వారు పేర్కొన్నారు. (చదవండి: వణికిపోతున్న అమెరికా..) ‘వాయు కాలుష్య కారకాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని గత అధ్యయనాలు వెల్లడించినట్లు మనకు తెలిసిందే’ అని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తాన్యా అల్డిరీట్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 88 లక్షల మంది ఈ వాయు కాలుష్య బారిన పడి మృతి చెందుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. శ్వాసకోశ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ కనబరిచినప్పటికీ.. వాయు కాలుష్యం రక్తంలో చక్కెరను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, అలాగే ఊబకాయం ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుందని తేలింది. (మరణాలు 5 వేలు.. కేసులు 1.34 లక్షలు) -
కిడ్స్కు.. కిడ్నీ గండం!
స్థూలకాయం, పోషకాహార లోపమే కారణం.. స్థూలకాయం, పోషకాహార లోపం, జన్యుపరమైన సమస్యలు, అనారోగ్యకరమైన ఆహారం, రసాయనాలతో నిండిన ఆహారం, శారీరక శ్రమ లోపించడం తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా కూల్డ్రింక్స్ వంటి వాటిని తాగేవారిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇంట్లో తినడానికి బదులు బయట పిజ్జాలు, బర్గర్లు, ఇతరత్రా ఫాస్ట్ఫుడ్ వంటివి తినడం వల్ల రక్తంలో క్రియాటిన్ పెరగడానికి కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. దేశంలో 10 నుంచి 19 ఏళ్ల వయస్సు వారిలో 4.9 శాతం మందికి బీపీ ఉండగా, తెలంగాణలో 6.7 శాతం మంది ఉండటం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే, అదీ బీపీ, షుగర్ అధికంగా ఉన్న వారిలోనే కనిపించే కిడ్నీ వ్యాధి ఇప్పుడు పిల్లలనూ వెంటాడుతోంది. 5 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలపై పంజా విసురుతోంది. 5 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లల్లో కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశమున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండగా, 10 నుంచి 19 ఏళ్ల వయసు వారిలో రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2016–18 సమగ్ర జాతీయ న్యూట్రిషన్ సర్వేను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో దాదాపు పావు శాతం పిల్లలకు కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అంటే ఆయా వయసు పిల్లల్లో ప్రతీ నలుగురిలో దాదాపు ఒకరికి కిడ్నీ వ్యాధి ప్రమాదం ఉన్నట్లు నివేదిక తెలిపింది. దీనిపై వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే యువతీ యువకుల భవిష్యత్ అంధకారం కానుందని హెచ్చరిస్తున్నారు. వారి రక్తంలో సీరం క్రియాటిన్ అధికం.. కేంద్రప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే ప్రకారం వివిధ వయçస్సు వారి ఆరోగ్య వివరాలను సేకరించింది. కిడ్నీ పనితీరును తనిఖీ చేయడానికి వైద్యులు సాధారణంగా బ్లడ్ క్రియాటిన్ స్థాయిని కొలుస్తారు. ఇది మూత్రపిండాల పనితీరును సూచిస్తుంది. సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 5 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లల్లో సరాసరి 7 శాతం మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నట్లు తేలింది. అందులో తెలంగాణలో 23.6 శాతం పిల్లల్లో అధికంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే 10 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లల్లో దేశవ్యాప్తంగా 6.6 శాతం మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నట్లు గుర్తించగా, తెలంగాణలో 24.3 శాతం మందికి అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు. దేశ సగటు కంటే మూడు నాలుగు రెట్ల వరకు క్రియాటిన్ అధికంగా ఉండటం మరింత ఆందోళన కలిగించే పరిణామం. అయితే సీరం క్రియాటిన్ అధికంగా ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ పరిస్థితికి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. మూత్రాశయ సమస్యలు లేదా పుట్టుకతో వచ్చే రుగ్మతల కారణంగా ఒక్కోసారి సీరన్ క్రియాటిన్ అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో కిడ్నీలు ఏర్పడకపోవడం, లేదా జన్యుపరమైన సమస్యలు, పర్యావరణం, కాలుష్యం వంటివి కారణాలుగా ఉంటున్నాయని చెబుతున్నారు. పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యలను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రారంభ దశలోనే గుర్తించడానికి వీలుంటుందని అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఇంత అధికంగా ఆయా వయసు పిల్లల్లో క్రియాటిన్ అధికంగా ఉండటానికి కారణాలపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. మాంసాహారుల్లోనే అధికం.. 10 నుంచి 19ఏళ్ల వయసున్న వారిలో బాలికల కంటే బాలురుల్లోనే అధికంగా క్రియాటిన్ సమస్యలున్నాయని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఈ వయసు పిల్లల్లో 8.3% మంది బాలురు, 4.9% మంది బాలికల్లో కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయని తెలిపింది. మాంసాహారుల్లోనే అధికంగా క్రియాటిన్ కని పిస్తోంది. దేశంలో మాంసాహారం తినే ఈ వయసు పిల్లల్లో 9% మందిలో సీరం క్రియాటిన్ అధికంగా ఉండగా, కేవలం గుడ్డు తినే వారిలో 6% ఉంది. శాకాహారుల్లో 5.4% మందిలోనే క్రియాటిన్ కనిపించి నట్లు నివేదిక తెలిపింది. మతపరంగా చూస్తే ఈ వయసు పిల్లల్లో అత్యధికంగా క్రిస్టియన్లలో 18.4% మందిలో క్రియాటిన్ ఎక్కువ గా ఉండగా, ముస్లింల్లో 11.2% ఉంది. హిందువుల్లో 5.6% ఉం డగా, సిక్కుల్లో 3.8% ఉన్నట్లు నిర్ధారించారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఈ వయసు గల వారిలో ఎస్సీల్లో 6.3%, ఎస్టీల్లో 7.2%, బీసీల్లో 5.1%, ఇతరుల్లో 9.2% క్రియాటిన్ ఉన్నట్లు నిర్ధారించారు. ఇదే వయసున్న పట్ట ణపిల్లల్లో 4.3% సీరం క్రియాటిన్ ఉండగా, గ్రామీణ ప్రాంత పిల్లల్లో అది 7.4‘% ఉండటం గమనార్హం. నిరుపేదలైన ఈ వయసు పిల్లల్లో 8.9 శాతం సీరం క్రియాటిన్ ఉండగా, పేదల్లో 7.4 శాతం, మధ్యతరగతి పిల్లల్లో 7.5 శాతం, ధనికుల్లో 5 శాతం, అత్యంత ధనికుల్లో 4.6 శాతం ఉన్నట్లు నివేదిక తెలిపింది. తల్లిదండ్రులు మేల్కొనాలి.. కేంద్ర సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలో కిడ్నీ సమస్యలు రావడానికి అవకాశాలెక్కువ. స్థూలకా యం, శారీరక శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాలతో ఈ ముప్పు వస్తుంది. ప్రస్తుత నివేదిక హెచ్చరికలాంటింది. పిల్లల తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోకుంటే మరింత ప్రమాదం జరగొచ్చు. – డాక్టర్ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్, హైదరాబాద్ ఆహారం, తాగునీటి లోపాల వల్లే..: అనారోగ్యకరమైన ఆహారం, శుద్ధమైన తాగునీరు లేకపోవడంతో కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. పోషకాహార లోపం రాష్ట్రంలో అధికం. ఇది కూడా ఓ కారణమే. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మిషన్ భగీరథ నీటితో కిడ్నీ వ్యాధులు తగ్గుతాయి. – డా.కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిజామాబాద్ -
మందులు కలిపితే కీళ్లనొప్పులు ఫట్?
ఆర్థరైటిస్ సమస్యకు సాల్క్ పరిశోధకులు ఓ వినూత్నమైన కొత్త చికిత్స పద్ధతిని కనుక్కున్నారు. మందులేసుకోవడం లేదా కీళ్లు మార్పించుకోవడం మాత్రమే ఇప్పటివరకూ ఉన్న కీళ్లనొప్పుల పరిష్కారాలు కాగా.. శక్తిమంతమైన రెండు కొత్త మందులను కలిపి వాడటం ద్వారా నొప్పులు తగ్గించడంతోపాటు కీళ్ల మధ్య ఉండే పదార్థాన్ని మళ్లీ పెరిగేలా చేయవచ్చునని వీరు చెబుతున్నారు. ఎలుకలతోపాటు మానవ కార్టిలేజ్ కణాలపై జరిగిన పరిశోధనలు ఇప్పటికే మంచి ఫలితాలిచ్చాయని ప్రొటీన్ అండ సెల్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. వయసు పెరిగే కొద్దీ కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి కణజాలం అరిగిపోయి నొప్పులు వస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. ఊబకాయం కూడా ఈ సమస్యకు కొంతవరకూ కారణమవుతోంది.ఆల్ఫా క్లోథో, టీజీఎఫ్ఆర్2 అనే రెండు రసాయన మూలకాలు ఈ సమస్యకు పరిష్కారం చూపగలవని ఇప్పటికే గుర్తించగా.. సాల్క్ పరిశోధకులు ఈ రెండింటిని కలిపి ఎలుకలపై ప్రయోగించారు. ఈ రెండు మందులు మృదులాస్థి కణాలు అరిగిపోకుండా చేస్తున్నట్లు గుర్తించారు. టీజీఎఫ్ఆర్2 కణాలు ముక్కలైపోకుండా అడ్డుకోవడమే కాకుండా.. వృద్ధి చెందేందుకు ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల ద్వారా తెలిసింది. ఆరు వారాల చికిత్స తరువాత ఈ రెండు మందులు కలిపి అందించిన ఎలుకల్లో కీళ్లనొప్పుల తాలూకూ లక్షణాలు గణనీయంగా తగ్గిపోయాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టినెజ్ రెడొండో తెలిపారు. -
పిల్లలు విపరీతంగా బరువు పెరుగుతున్నారా?
ఇటీవల పిల్లలు జంక్ఫుడ్ ఎక్కువగా తినడం వంటి అనారోగ్యకరమైన జీవనశైలితో అనర్థాలు తెచ్చుకుంటున్నారు. టీనేజ్లో ఉన్న సమయంలోనే పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పిల్లల్లో వారి ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో ముందుగా గమనించాలి. ముందుగా వారికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి. ►స్వీట్లు, సాఫ్ట్డ్రింక్స్, జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్డ్రింక్స్లోని ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్డ్రింక్స్కు పిల్లలను మరింత దూరం ఉంచడం మంచిది ►వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు ►పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు ►తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది ►పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనా పాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది ►పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. -
చిక్కటి పాలతో ఊబకాయం రాదు
టొరంటో: చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి చిక్కటి పాలకు మించినది మరేది లేదని మరోసారి రుజువైంది. ఈ మధ్య కాలంలో వెన్న, కొవ్వు తీసేసిన పాలు అమ్ముతూ, అదే ఆరోగ్యానికి మంచిదని, ఊబకాయం రాదని ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని కెనడాలో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. కొవ్వు తీసేసిన పాలు తాగిన వారి కంటే హోల్ మిల్క్ తాగిన పిల్లల్లో ఊబకాయం ప్రమాదం 40 శాతం తక్కువగా ఉన్నట్టుగా తేలింది. కెనడాలో సెయింట్ మైకేల్ ఆస్పత్రి పరిశోధకులు మొత్తం 28 అధ్యయనాలను విశ్లేషించి నివేదిక రూపొందించారు. ఈ వివరాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించారు. కెనడా పరిశోధకులు విశ్లేషించిన 28 అధ్యయనాల్లో కూడా వెన్న తీసేసిన పాలు తాగినంత మాత్రాన ఊబకాయం, అధిక బరువు ప్రమాదం ఉండదని రుజువు కాలేదు. అంతేకాదు, వాటిలో 18 అధ్యయనాలు చిక్కటి పాలు తాగిన వారిలో ఊబకాయం ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. రెండేళ్ల వయసు దాటాక తక్కువ కొవ్వున్న పాలు తాగితే పిల్లల్లో ఊబకాయం సమస్యలు ఉండవన్న అంతర్జాతీయ మార్గదర్శకాలను ఈ పరిశోధన సవాల్ చేసినట్టయింది. -
ఇక ఈ బీర్లకు చీర్స్ చెప్పాల్సిందే!
న్యూఢిల్లీ : ఇక ఎవరైనా మూడు బీర్లు, ఆరు గ్లాసులతో ఛీర్స్ చెప్పాల్సిందే. ఇంతకాలానికి శాస్త్రవేత్తలు బీరులో ఉన్న మంచి గుణాలను కనిపెట్టారు. బీరు తాగితే కొత్తగా బొజ్జలు రాకపోవడమే కాకుండా బొజ్జలు కరిగిపోయి మొత్తంగా స్థూలకాయం తగ్గుతుందట. పైగా సుఖంగా నిద్ర పడుతుందట. వీటిలో ఒకరకమైన బ్యాక్టీరియా, ఈస్ట్ మిశ్రమం ఉండడమే అందుకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అన్ని బీర్లలో ఈ గుణం ఉందో, లేదో తెలియదుగానీ బెల్జియంకు చెందిన హోగార్డెన్, వెస్ట్మల్లే ట్రిపల్, ఎట్ క్రైకెన్బియర్ బ్రాండ్ల బీర్లలో ఈ మంచి గుణాలు ఉన్నాయట. ఆ బీర్లు రెండుసార్లు, భూగర్భంలో ఉండగా ఒకసారి, సీసాలో మరోసారి బీరు పులియడం వల్ల వాటికి ఆ మంచి గుణాలు అబ్బాయట. భూగర్భంలో పులియడానికి ఒకరకమైన ఈస్ట్, సీసాలో పులియడానికి మరో రకమైన ఈస్ట్ను ఉత్పత్తిదారులు ఉపయోగిస్తున్నారని, ఈ రెండోసారి పులియడంతోనే బీరులో ఎక్కువగా ఆరోగ్య లక్షణాలు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటిలో కూడా లైట్ బీరుకన్నా స్ట్రాంగ్ బీరే మంచిదని, అలా అని ఎక్కువగా బీర్లు తాగమని తాను సిఫార్సు చేయడం లేదని ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీలో బ్యాక్టీరియా నిపుణుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎరిక్ క్లాసెన్ చెప్పారు. ‘ఎక్కువ ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ రకమైన బ్రాండ్లలో రోజొకటి తాగినా ఆరోగ్యానికి మంచిదే. ఈ రకాల బీరు బాటిళ్లలో 50 శాతానికిపైగా మంచి బ్యాక్టీరియా ఉంది’ ఆయన చెప్పారు. -
జంక్ ఫుడ్ మానేసి.. వైన్ పారేసి...
ఈ ఫొటోలో ఉన్న కొరి డిసిల్వా వయసు 40 ఏళ్లు. వాయువ్య ఇంగ్లాండ్లోని చెషి అనే ప్రాంతంలో ఉంటోంది. ఇద్దరు పిల్లల తల్లి. కాని తనకు తాను కొన్నాళ్లుగా నచ్చట్లేదు. అందుకు కారణం స్థూలకాయం. కొరి డిసిల్వాకు వెన్ను సర్జరీ జరిగింది. దాని వల్ల ఆమె ఎక్కువగా విశ్రాంతిలో ఉండాల్సి వచ్చేది. ‘డాక్టర్లు నన్ను జిమ్ వైపు పొరపాటున కూడా వెళ్లొద్దు అని చెప్పారు’ అంటుందామె. కదలక మెదలక ఉండేసరికి క్రమంగా ఆమె బరువు పెరిగింది. ఆఖరుకు అది 94 కిలోల వద్ద స్థిరపడింది. ‘నన్ను నేను చూసుకుంటే చాలా కష్టంగా అనిపించింది’ అని కొరి అంది. వెంటనే బరువు తగ్గాలనుకుంది. అయితే దానికి పూర్తి వ్యాయామం చేసే పరిస్థితి లేదు. మరి ఎలా తగ్గడం. కొరికి జంక్ ఫుడ్ ఇష్టం. రోజూ బయటి నుంచి ఆహారం రావాల్సిందే. లేకుంటే తానే వెళ్లి తినాల్సింది. ఆమె జంక్ ఫుడ్ ఖర్చు నెలకు దాదాపు లక్ష రూపాయలు. దానిని మానేయాలి అని మొదట ఆమె నిశ్చయించుకుంది. అలాగే ఆమెకు రోజూ రాత్రి పూట వైన్ తాగే అలవాటు ఉంది. దానిని కూడా మానేయాలని అనుకుంది. రెండూ కష్టమైన పనులే. కాని గట్టిగా చేయాలని నిశ్చయించుకుంది. ఇంట్లోనే వండుకున్న ఆహారం, పరిమిత వ్యాయామం, పాజిటివ్ ఆలోచనలు... ఇవన్నీ కొరి డిసిల్వా బరువును మెల్లగా తగ్గించడం మొదలెట్టాయి. 14 వారాల్లో ఆమె తగ్గిన బరువు ఎంత తెలుసా. అక్షరాలా 19 కిలోలు. ‘డబ్బు మిగిలింది. అరోగ్యమూ వచ్చింది. అందంగా తయారయ్యాను’ అని కొరి మురిసిపోతోంది. మనం ఎంత తింటున్నాం, ఏది తింటున్నాం చెక్ చేసుకుంటే కొన్ని మానేస్తే మరికొన్ని అదుపుచేస్తే అదనపు బరువు రాదని కొరి ఉదాహరణ అందంగా సలహా ఇస్తోంది. -
బరువు పెరుగుతుంటే – ఆయుష్షు తగ్గుతుంది
ఒంటి బరువు పెరుగుతున్న కొద్దీ జరిగే అనర్థాల గురించి అందరికీ తెలిసిందే. పెరిగే బరువు కారణంగా రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ వంటివి వచ్చే అవకాశాలు పెరిగి అది గుండెపోటుకూ, పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉందన్న విషయాలు మనం తరచూ చదువుతూనే ఉంటాం. ఇటీవల నిర్వహించిన మరికొన్ని అధ్యయనాల్లోనూ ఆ అనర్థాల గురించి మళ్లీ మళ్లీ తెలిసివచ్చింది. ఓ వ్యక్తి తాను ఉండాల్సినదాని కంటే ఎక్కువ బరువు పెరుగుతుంటే... అది మృత్యువును మరింత త్వరగా రమ్మని ఆహ్వానించడమేనని యూఎస్కు చెందిన ‘ప్లాస్’ మెడికల్ జర్నల్లోని విషయాలు చెబుతున్నాయి. స్థూలకాయంతో బాధపడుతున్న తొమ్మిది వేల ఐదొందల మంది వ్యక్తులతో పాటు పాటు మామూలు బరువే ఉన్న మూడు లక్షల మందికి పై చిలుకు సాధారణ వ్యక్తులపై దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాలను నిర్వహించారు. ఈ అధ్యయనాలన్నీ మూకుమ్మడిగా వెల్లడించిన విషయాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ అధ్యయనాల్లో తేలింది. బరువే మరణాలకు నేరుగా కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు. -
జంక్ ఫుడ్ తింటున్నారా.. బీ కేర్ఫుల్
సాక్షి, న్యూఢిల్లీ : బయటి ఆహారం కన్నా ఇంటి ఆహారం ఎంతో మేలని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల నేటి యాంత్రిక జీవితంలో పెద్దల మాటలను పెడ చెవిన పెట్టి ‘ఫాస్ట్ ఫుడ్స్’ను ఆశ్రయిస్తుంటాం, జంక్ ఫుడ్ను తింటుంటాం. వీటిలో ఎన్నో ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తాయని, వాటి వల్ల మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తి అంతరించడంతోపాటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులు వస్తాయని, సంతాన సాఫల్య లోపం ఏర్పడుతుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని ‘సైలెంట్ స్ప్రింగ్ ఇనిస్టిట్యూట్’కు చెందిన శాస్త్రవేత్తలు మనం బయట తినే జంక్ ఫుడ్లపై అధ్యయనం చేశారు. బయట దొరికే ఫుడ్లో కల్తీ నూనెలు ఉంటాయని, శుచీ శుభ్రం ఉండదని, అందుకని అవి ప్రమాదకరమని ఇంతకుముందు ఎంతో మంది పరిశోధకులు చెబుతూ వచ్చారు. తాజా అధ్యయనంలో కొత్త విషయాలు తెలిశాయి. ‘పీఎఫ్ఏఎస్’గా వ్యవహరించే మానవ తయారీ రసాయనాలు ఈ ఫాస్ట్ ఫుడ్లలో ఉన్నట్లు తేలింది. ప్యాకేజీల ద్వారా ఆహార పదార్థాల్లోకి ఇవి వస్తున్నాయని, అలాగే ఒవెన్లో తయారు చేసే పాప్ కార్న్లో కూడా ఈ రసాయనాలు దండిగా ఉన్నాయని వారి పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాలైన ప్యాకేజీ మెటీరియల్స్ను ఈ రసాయనాలను ఉపయోగించి తయారు చేయడమే వల్ల రసాయనాలు ఆహారపదార్థాల్లోకి రావడమే కాకుండా కలుషిత నీటి ద్వారా, పరిసరాల కలుషిత వాతావరణం ద్వారా ఈ రసాయనాలు ఆహార పదార్థాల్లోకి చేరుతున్నాయట. జంక్ ఆహార పదార్థాలు, వాటి ప్యాకింగ్లపై అధ్యయనం జరపడంతోపాటు ఇంటి వంటకాలు, బయటి వంటకాలు తింటున్న దాదాపు పదివేల మంది అమెరికన్ల వైద్య రికార్డులు పరిశీలించి రసాయనాల గురించి నిర్ధారణకు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కారణంగా ఇంటి వంటకాలే అన్ని విధాల శ్రేయస్కరమని పరిశోధకులు మరోసారి తేల్చారు. ఈ ప్రమాదకరమైన రసాయనాలు ఇంటిలోని ‘నాన్ స్టిక్’ వంట పాత్రల్లో, వాటర్ ప్రూఫ్ ఫాబ్రిక్ కోటింగ్స్లో కూడా ఉంటాయని, వంటకాల కోసం వాటిని ఉపయోగించకూడదని కూడా పరిశోధకలు తెలిపారు. ‘పీఎఫ్ఏఎస్’గా వ్యవహరించే ఈ రసాయనాలను 1930 దశకంలో పలు రకాల వస్తువుల తయారీ కోసం శాస్త్రవేత్తలు సృష్టించారు. -
ప్లీజ్ దయచేసి 'లావు' ఉండొద్దు
సాక్షి, గుంటూరు : ఆధునిక జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లతో నేడు పాఠశాల చదివే పిల్లవాడు మొదలుకొని యవకులు, పెద్దల వరకు అధిక బరువుతో(ఊబకాయం) బాధ పడుతున్నారు. ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ నివేదిక ప్రకారం 2030 నాటికి 250 మిలియన్ల మంది 5 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు ఊబకాయులుగా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2.8 మిలియన్స్ మంది ప్రజలు ఊబకాయం వల్ల చనిపోతున్నారు. పెరిగిన శరీరం తగ్గించుకోవటం కోసం చాలా మంది ఉదయానే లేచి రోడ్ల వెంబడి పరుగులు తీయటం, జిమ్లలో గంటల కొద్ది వ్యాయామం చేయటం, ఆస్పత్రుల చుట్టూ తిరగటం చేస్తున్నారు. స్థూలకాయంపై ప్రజలకు అవగాహన కల్పించి, దీని బారిన పడకుండా ఉండటం కోసం ఏటా అక్టోబర్ 11న ప్రపంచ స్థూలకాయ వ్యతిరేక దినోత్సం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఊబకాయం(ఒబెసిటీ) కారణాలు... నేడు ఊబకాయం సమస్య అధికమవుతోంది. ఈ సమస్య రోజురోజుకూ పెరగటానికి కారణం అధిక కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవటం, మితిమీరిన ఆహారం తినడం, శరీరానికి తగిన శారీరక శ్రమ లేకపోవటమే. వంశపారంపర్యంగా కొంత మందికి ఊబకాయం వస్తుంది. పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయి. జీవన విధానంలో తేడాల వల్ల అధిక బరువు వస్తుంది. పాఠశాలల పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న జనాభాలో మూడో వంతు మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు. ఊబకాయంతో రోగాలు... ఊబకాయం వల్ల పిల్లల్లో మధుమేహం వస్తుంది. రక్తపోటు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, లివర్, కీళ్ల నొప్పులు, గురక, నిద్ర సమస్యలు, పిల్లలు పుట్టకపోవటం తదితర వ్యాధులకు గురవుతారు. సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, తగిన శారీరక శ్రమ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఊబకాయం బారిన పడకుండా ఉండవచ్చు. ఆహారంలో కొవ్వును తగ్గించవచ్చు శరీరంలోని ఎలాంటి జబ్బులనైనా 70 శాతం ఆహారంతో తగ్గించవచ్చు. తినే ఆహారం కొంచెమైనా అందులో పోషక విలువలు ఉండాలి. ఎలాంటి పరికరాలను వినియోగించకుండానే పళ్ళరసాలు, కాయగూరల రసాలు, పళ్ళు, ఉడకబెట్టిన ఆహారం, ఉడకబెట్టని(రాఫుడ్) తీసుకుంటే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. వ్యాయామం ద్వారా 20 శాతం జబ్బులను, యోగాతో కొవ్వును కరిగించవచ్చు. – డాక్టర్ షేక్ హుస్సేన్, మెడికల్ ఆఫీసర్ -
ఆర్థరైటిస్ నివారణకు తేలిక మార్గాలు
ఒక వయసు దాటాక ఎముకలు అరిగిపోవడం సహజం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇలా ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ సమస్యను కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా నివారించుకోవచ్చు. అవేమిటో తెలుసుకోండి. చాలాకాలం పాటు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ►స్థూలకాయం వల్ల మీ ఒంటి బరువు ఎముకలపై పడి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ►మన శరీర కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కూర్చుని చేసే వృత్తుల్లో ఉండేవారు వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు చేయాలి. ►మరీ ఎక్కువగా కీళ్లు అరిగే అవకాశం ఉన్నవారు కీళ్లకు తగినంత విశ్రాంతి కల్పించాలి. వేగంగా పరుగెత్తే తరహా వ్యాయామాలు చేసేవారు తమ స్పోర్టింగ్ యాక్టివిటీస్ను తగ్గించాలి. దానికి బదులు వేగంగా నడవడం మంచిది. తమ ఒంటి బరువును గణనీయంగా తగ్గించే ఈదడం (స్విమ్మింగ్ ఎక్సర్సైజ్) ఇంకా మంచిది. ►కాళ్లు మడిచి, బాసిపట్లు వేసి కూర్చోవడం (స్క్వాటింగ్) మంచిది కాదు. వీలైనంత వరకు కుర్చీ లేదా బల్ల వంటి వాటి మీద కూర్చోవాలి. ►పాల వంటి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ►మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ►కీళ్లలో నొప్పి కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను తప్పక సంప్రదించాలి. -
ఫైబ్రాయిడ్స్ తిరగబెట్టకుండా నయం చేయవచ్చా?
నా వయసు 43 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – ఎమ్. రాధాబాయి, మిర్యాలగూడ గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నా సమస్యకు హోమియో వైద్యం ఉంటుందా? నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువై డాక్టర్ను సంప్రదించాను. ఆయన ఎమ్మారై తీసి డిస్క్ బల్జ్తో పాటు సయాటికా అంటున్నారు. నా సమస్యకు హోమియో వైద్యం ఉంటుందా? దయచేసి వివరంగా చెప్పండి. – వెంకటరామ్, తాడేపల్లిగూడెం సయాటికా అనే పదాన్ని రోజుల్లో వినని వారుండరు. ఈ వ్యాధి బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. సయాటికాను త్వరగా గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీలతో పాటు హోమియో సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యలను శాశ్వతంగా దూరం చేయవచ్చు. శరీరంలో అన్నిటికంటే పెద్దది, పొడవాటిది అయిన నరం పేరు సయాటికా. అది వీపు కింది భాగం నుంచి పిరుదుల మీదుగా కాలి వెనక భాగం మీదుగా కాలి మడమల వరకు వరకు వెళ్తుంది. ఈ నరం మీద వెన్నుపూసల ఒత్తిడి పడి, నరం నొక్కుకుపోవడం వల్ల కాలి వెనక భాగం తీవ్రమైన నొప్పికి గురవుతుంది. దీన్నే సయాటికా నొప్పి అంటారు. దీని కారణంగా తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం, మంటలు, నడకలో మార్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 62% మంది ఈ సమస్యతో విధులకు గైర్హాజరు అవుతుంటారు. కారణాలు : నర్వ్ కంప్రెషన్: నర్వ్ రూట్స్ ప్రెస్ కావడం వల్ల నొప్పి వస్తుంది. స్పైనల్ డిస్క్ హెర్నియేషన్: ఎల్4, ఎల్5 నరాల రూట్స్ ఒత్తిడికి గురై సరైన పొజిషన్స్లో ఒంగక పక్కకు జరిగి సయాటికా నొప్పి వస్తుంది. స్పైనల్ కెనాల్ స్టెనోసిస్: వెన్నుపూసల మధ్య ఒక సన్నటి కెనాల్ ఉండి, అందులో వెన్నుపాము నుంచి వచ్చే నరాల వ్యవస్థ ఉంటుంది. ఆ వెన్నుపూసల మధ్యనున్న నాళం (కెనాల్) సన్నబారడం వల్ల వెన్నుపాములోని నరాలు నొక్కుకుపోవడం వల్ల కూడా ఈ నొప్పి వస్తుంది. పెరిఫార్మిస్ సిండ్రోమ్ : దెబ్బలు, గాయాలు పెరిఫార్మిస్ అనే కండరం నర్వ్రూట్స్ను నొక్కుతుంది. దీనివల్ల కూడా సయాటికా నొప్పి వస్తుంది. శాక్రో ఇలియాక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్ : శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు పనిచేయనప్పుడు సయాటికా రావచ్చు. గర్భవతులకు, తమ ప్రెగ్నెన్సీ చివరి నెలలో పిండం బరువు పెరిగి నర్వ్రూట్స్ మీద ఒత్తిడి పడటం వల్ల సయాటికా నొప్పి వస్తుంది. పరీక్షలు : ఎక్స్రే తో పాటు ఎమ్మారై స్కాన్ సహాయంతో డిస్క్హార్నియేషన్, డిస్క్ప్రొలాప్స్ నిర్ధారణ చేయవచ్చు. ఏ నర్వ్రూట్ ఎక్కడ కంప్రెస్ అయ్యిందో తెలుసుకోవచ్చు. నొప్పి వస్తే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేసేవాళ్లు చాలామంది ఉంటారు. నొప్పిమాత్రలు తరచూ వేసుకోవడం వల్ల సైడ్ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, అసిడిటీ, అల్సర్ రావచ్చు. చికిత్స : సయాటికాకు రోగలక్షణాలు, మూలకారణాలను బట్టి హోమియో మందులను సూచిస్తారు. ఇప్పుడు ఇందుకోసం రస్టాక్స్, కిలోసింథ్, రోడోడెండ్రాన్, కాస్టికమ్ వంటి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన వైద్యనిపుణుల సర్యవేక్షణలో హోమియో మందులు వాడితే సయాటికా సమస్య శాశ్వతంగా నయమవుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ తిన్నవెంటనే కడుపునొప్పి... ఏమిటీ సమస్య? నా వయసు 43 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. – జి. సుధీర్బాబు, విజయవాడ ►మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. ►అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ►దీర్ఘకాల జ్వరాలు ►మానసిక ఆందోళన ►కుంగుబాటు ►ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్వాడటం ►జన్యుపరమైన కారణలు చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయిలెట్కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది.దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ►పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ►పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ►రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
వయసు 20.. బరువు 80..
యువత అంటే ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు.. అనే నిర్వచనం క్రమంగా మారుతోంది. వారిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. ప్రధానంగాకళాశాలలకు వెళ్లే వయసులో చాలామందిఊబకాయంతో బాధపడుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టడం తప్ప ఆటలకు దూరంగా ఉంటున్నారు. చిన్న వయసులోనే ఇది అధిక బరువు సమస్యకు దారి తీస్తోంది. నగర యువతలో దాదాపు 30 శాతం మంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యువతుల్లో ఈ సమస్య ఎక్కువ ఉందని చెబుతున్నారు. 16 నుంచిపాతికేళ్ల వయసున్న వారిలో గరిష్ట బరువు కంటే 8– 15 కిలోలు అధికంగా ఉన్నట్లు స్పష్టంచేస్తున్నారు. 20 సంవత్సరాలకే 80 కిలోలు ఉండటంతో పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అధిక కేలరీల ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం ఇతరేతర కారణాలతో స్థూలకాయం వస్తుందంటున్నారు. నగరంలోని యువతలో పెరుగుతున్న స్థూలకాయం, కారణాలు, పరిష్కారం తదితర అంశాలపై ‘సాక్షి’ కథనం. శారీరక శ్రమ లేక.. చాలామంది యువతీ యువకుల్లో శారీరక శ్రమ ఉండటం లేదు. స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక.. ఆటలకు దూరమవుతున్నారు. చాలా పాఠశాలలు, కళాశాలల్లో ఆటలకు ప్రాధాన్యం తగ్గుతోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. చదువుతోపాటు ఆటల వైపు పిల్లలను ప్రోత్సహించాలి. ఫలితంగా వారికి శారీరక శ్రమ అలవాటు అవుతుంది. యువతీ, యువకులు చదువుతోపాటు శారీరక శ్రమపై దృష్టి పెట్టాలి. నిత్యం గంటపాటు వ్యాయామం చేయాలి. చెమట వచ్చేలా ఏదైనా పని చేయవచ్చు. క్రికెట్, ఫుడ్బాల్, తాడాట, ఈత, తోట పని, వేగవంతమైన నడక ఇలా ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. మితమే హితం.. ఆహారం విషయంలో మితం పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తక్కువగా తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు నిత్యం 500 గ్రాములకు తక్కువ కాకుండా చూసుకోవాలి. ఉదయం అల్పాహారం ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఆకు కూరలు, కాయగూరలు, గుడ్డు, చేపలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట 8 గంటలలోపు భోజనం ముగించాలి. సమతుల ఆహారానికి ప్రాధాన్యమిస్తూ.. జంక్ఫుడ్స్కు దూరంగా ఉండాలని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. ఒకేచోట అతుక్కుపోతూ.. చాలామంది కూర్చున్న చోటు నుంచి కదలటానికి ఇష్టపడరు. కంప్యూటర్, సెల్ఫోన్, టీవీలకు గంటల తరబడి అతుక్కుపోతుంటారు. అక్కడే భోజనం కానిస్తుంటారు. చాలామంది ఇంట్లో పనులకు దూరంగా ఉంటున్నారు. ఇళ్లు ఊడవటం.. దుస్తులు ఉతకటం.. గార్డెనింగ్ లాంటి పనులను పని మనుషులకు అప్పగిస్తున్నారు. చిన్నచిన్న పనులు పిల్లలకు అప్పగించక పోవడం వల్ల వారిలో సోమరితనాన్ని పెంచి పోషించినట్లు అవుతోంది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్న చాలా ఇళ్లలో పిల్లల తిండిపై శ్రద్ధ ఉండటం లేదు. అమ్మానాన్నలతోపాటు పిల్లలకు బయట తిండే అలవాటవుతోంది. మసాలాలు, నూనెలతో కూడిన ఆహారం వల్ల తెలియకుండానే వారిలో అధిక బరువుకు దారి తీస్తోంది. రోడ్సైడ్ ఫుడ్తో.. రోడ్సైడ్ ఆహారంలో ఎక్కువ శాతం మసాలాలు, నూనెలు వాడుతుంటారు. తరచూ ఇదే ఆహారం తీసుకోవడంతో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఒకసారి బరువు పెరిగితే తగ్గించుకోవాలంటే కష్టం. స్థూలకాయం ఎన్నో రకాల శారీరక, మానసిక రుగ్మతలకు హేతువుగా గుర్తించాల్సిన అవసరముంది. వ్యక్తిగతంగా, కేరీర్ పరంగానూ ఇబ్బందే. యువతకు ఈ సమస్య మరింత నష్టం కలిగిస్తోంది. ఎలాంటి ఆహారం తింటున్నామో.. ఎంత తింటున్నామో.. అనే విషయంపై నిత్యం అవగాహనతో ఉండాలి. యుక్త వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలకు అధిక బరువు ప్రధాన కారణం. కొందరిలో ఇది తీవ్రమైన కుంగుబాటుకు దారి తీస్తుందని గుర్తించాలి. ఈ విషయంలో యువతీయువకులు తగినంత జాగ్రత్త వహించాలి.