OpenAI
-
మస్క్పై ఆల్ట్మన్ ఫైర్.. అతని జీవితమంతా..
ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 'ఓపెన్ఏఐ' (OpenAI)ను కొనుగోలు చేస్తా అన్న తరువాత.. ఆ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్.. మస్క్ను తీవ్రంగా విమర్శించారు.పారిస్ ఏఐ సమ్మిట్ సందర్భంగా.. బ్లూమ్బెర్గ్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ ఆల్ట్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ''బహుశా అతని జీవితమంతా అభద్రతా దృక్పథం నుంచి వచ్చింది, ఆ వ్యక్తి పట్ల నాకు సానుభూతి ఉంది. అతను సంతోషంగా ఉన్న వ్యక్తి అని నేను అనుకోను'' అని మస్క్ను విమర్శించారు.మస్క్, ఆయన పెట్టుబడిదారుల బృందం ఓపెన్ఏఐ కొనుగోలుకు ఆఫర్ ఇచ్చిన తర్వాత.."కంపెనీ అమ్మకానికి లేదు. మమ్మల్ని గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నించడం.. అతని వ్యూహాలలో మరొకటి" అని ఆల్ట్మన్ చెప్పాడు. మా వేగాన్ని తగ్గించడానికి మస్క్ ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యానించారు.ఓపెన్ ఏఐ కొనుగోలుకు మస్క్ ఆఫర్మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం ఓపెన్ఏఐను కొనుగోలు చేయడానికి.. 97.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.5 లక్షల కోట్లు) ఆఫర్ ఇచ్చింది. దీనికి రిప్లై ఇస్తూ.. మీ ఆఫర్కు ధన్యవాదాలు, మీకు కావాలంటే మేము ఎక్స్(ట్విట్టర్)ని 9.74 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 85వేలకోట్లు) కొనుగోలు చేస్తామని ఆల్ట్మన్ అన్నారు.ఓపెన్ఏఐనవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.ఇదీ చదవండి: భారత్లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు.. గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు. అంతలోనే మస్క్ కొనుగోలు చేయాలనుకుంటున్న విషయం తెరమీదకు వచ్చింది. -
మస్క్, ఆల్ట్మన్ మధ్య ట్వీట్ల యుద్ధం: ఎవ్వరూ తగ్గట్లే!
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఎక్స్ (ట్విటర్) సంస్థను 2022లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈయన చూపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 'ఓపెన్ఏఐ' (OpenAI) మీద పడింది. ఈ కంపెనీని కొనుగోలు చేస్తా అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు.2024లో రెండుసార్లు OpenAIపై దావా వేసిన మస్క్ ఇప్పుడు.. సంస్థనే కొనుకోలు చేయడానికి సిద్ధమయ్యాయి. 97.4 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 8.5 లక్షల కోట్లు) కొనుగోలు చేస్తామంటూ.. మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం ఆఫర్ ఇచ్చింది. దీనిని ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' (Sam Altman) తిరస్కరించారు.మీ ఆఫర్కు ధన్యవాదాలు, మీకు కావాలంటే మేము ఎక్స్(ట్విట్టర్)ని 9.74 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 85వేలకోట్లు) కొనుగోలు చేస్తామని ఆల్ట్మన్ ట్వీట్ చేశారు. ఈ పోస్టుపై మస్క్ స్పందిస్తూ.. 'మోసగాడు' అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.no thank you but we will buy twitter for $9.74 billion if you want— Sam Altman (@sama) February 10, 2025ఓపెన్ఏఐనవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.ఇదీ చదవండి: ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు. అంతలోనే మస్క్ కొనుగోలు చేయాలనుకుంటున్న విషయం తెరమీదకు వచ్చింది.Scam Altmanpic.twitter.com/j9EXIqBZ8u— Elon Musk (@elonmusk) February 10, 2025 -
ఏఐ రంగంలో పోటాపోటీ.. ఐపీ అడ్రస్ చోరీ అవుతుందా?
‘డీప్ సీక్ ఆర్–1’ అనే ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ను ‘డీప్ సీక్’ అనే చైనా స్టార్టప్ సంస్థ ఇటీవల విడుదల చేసింది. అది వచ్చీ రాగానే ఏఐ మార్కెట్లో సంచలనాత్మకమైన పరిణామాలను సృష్టించింది. ఒకటిన్నర సంవత్సరంగా ‘చాట్ జీపీటీ’ (Chat GPT) మోడల్ అందరికీ ఉప యోగకరమైన ఏఐ మోడల్గా గుర్తింపు తెచ్చు కుంది. ‘ఓపెన్ ఏఐ’ (Open AI) సంస్థ దీనిని తయారు చేయటానికి కొన్ని బిలియన్ డాలర్లను పెట్టు బడిగా పెట్టింది. అయితే డీప్ సీక్ ఆర్–1ను కేవలం రెండు నెలల్లోనే ఆరు మిలియన్ డాలర్ల పెట్టుబడితో చైనా స్టార్టప్ సంస్థ డీప్సీక్ తయారు చేసింది. గూగుల్ జెమినీ (Google Gemini), బైదు ఏర్ని, క్యాన్వ (Canva) వంటి సంస్థలు... డీప్ సీక్ కంటే ముందుగానే మార్కెట్లోకి వచ్చినా చాట్ జీపీటీకి పోటీ ఇవ్వలేకపోయాయి. చాట్ జీపీటీకి డీప్ సీక్ సరి సమానంగా పని చేయడం, ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఓపెన్ సోర్స్లో ఫైన్ ట్యూన్ చేసుకునేలా ఉండడం.. ముఖ్యంగా డీప్ సీక్ ఏపీఏ ధరలు చాట్ జీపీటీతో పోలిస్తే 90 శాతం వరకు తక్కువగా ఉండటం వలన విడుదలైన వారంలోనే ఆపిల్ స్టోర్లో డౌన్లోడ్స్లో మొదటి స్థానం సంపాదించి ఒకేరోజు దాదాపు 20 లక్షల మంది యూజర్లకి చేరువయ్యింది.డీప్ సీక్ విడుదలతో ఏఐ ఆధారిత కంపెనీల స్టాక్లు భారీగా పతనం అయ్యాయి. డీప్ సీక్ (DeepSeek) వంటి మోడల్స్ను అభివృద్ధి చేయడానికి అవసరమైన అధునాతన జీపీయూలు, సెమీ కండక్టర్లను అమెరికాలోని ఎన్వీఐడీఐఏ సంస్థ తయారుచేస్తోంది. ఇలాంటి జీపీ యూలు, అధునాతన చిప్స్ను అమెరికా నుండి వేరే దేశాలకు వెళ్లకుండా ఆదేశం అనేక ఆంక్షలను పెట్టింది. అయినప్పటికీ డీప్ సీక్ తయారీకి ఎన్వీఐడీఐఏ జీపీయూలను సింగపూర్ నుండి చైనా రాబట్ట గలిగిందనే వదంతులతో... ఇన్వెస్టర్లు ఎన్వీఐడీఐఏపై నమ్మకం కోల్పోవడం వలన 20 బిలియన్ డాలర్ల మేర కంపెనీ విలువ పడిపోయింది. ఇతర ఏఐ సెమీ కండక్టర్లను తయారుచేసే కంపెనీల షేర్లు కూడా దాదాపు 15 నుండి 20 శాతం పడి పోయాయి.ఈ నేపథ్యంలో డీప్ సీక్ ‘ఐపీ అడ్రస్ను తస్కరిస్తుంది’ అనే వదంతి వినిపిస్తోంది. అలాగే డీప్ సీక్పై భారీ సైబర్ దాడి జరగటం వలన వ్యక్తిగత వివరాల లీక్ ముప్పుఉండటం, డీప్ సీక్ మోడల్లో చైనీస్ సెన్సార్ షిప్ ఉండటం (ఉదాహరణకు చైనాలో జరిగిన నిరసనలు భారత్కి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ గురించి అడిగినప్పుడు సరైన సమాచారం ఇవ్వదు ఈ మోడల్). అలాగే కొన్ని ప్రాంతాలకు చైనా అనుకూలంగా ఉండే సమాధానం ఇవ్వటం ఈ మోడల్పై అనుమానాలు కలిగిస్తున్నాయి.డీప్ సీక్ రావటం ఒక విధంగా మంచిదే అని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇవ్వగలిగే మోడల్స్ని తయారు చేయటానికి మార్కెట్లో అనువైన కాంపిటీషన్ రాబోతుందనీ, దీనివల్ల వినియోగదారులు అతి తక్కువ ధరలకే ఏఐ సర్వీసులు పొందవచ్చనీ చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై అమెరికా, చైనా అన్ని అంశాలలో సై అంటే సై అంటూ పోటీ పడుతున్న విషయం తెలిసినదే. ట్రంప్ 2.0లో ఏఐ ఇండస్ట్రీ అభివృద్ధికి ఏటా వంద బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనీ, అమెరికాను ఏఐ అగ్రగామిగా చేస్తామనీ చెప్పిన మరుసటి రోజే... మేమేమీ తక్కువ కాదన్నట్లు డీప్ సీక్ను విడుదల చేసి అమెరికాకు చైనా గట్టి సమాధానమే ఇచ్చింది.చదవండి: అమెరికా వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!ఏఐని అందరికీ అందుబాటులోకి తేవటం, దాన్ని అన్ని రంగాలలో సమీకృతం చేయటం పరిశ్రమల ముందు ఉన్న పెను సవాళ్ళు. ఈ సవాళ్లకు మొదటి మెట్టుగా చాట్ జీపీటీ, డీప్ సీక్లను మనం చూడవచ్చు. భవిష్యత్తులో ఏఐ పరిశ్రమ మరింతగా ఎదిగి మానవ జీవనాన్ని సుగమం, సౌకర్యవంతం చేస్తుందని ఆశిద్దాం.– శ్రీరామ్ సుదర్శన్ ఏఐ పరిశోధక విద్యార్థి -
చాట్జీపీటీకే జై...
న్యూఢిల్లీ: దేశీయంగా దాదాపు సగం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికే కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్ఫాంలను వినియోగిస్తున్నారు. ఇందులో ఓపెన్ఏఐకి చెందిన చాట్జీపీటీ అగ్రస్థానంలో ఉంది. ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2024 ఆగస్టు 11 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు దీన్ని నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 309 జిల్లాల నుంచి 92,000 మంది ఇందులో పాల్గొన్నారు. దీని ప్రకారం వివిధ అంశాలపై వివరాల కోసం 40 శాతం మంది గూగుల్ తదితర సెర్చి ఇంజిన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. సమాచారం కోసం ఏ కృత్రిమ మేథ ప్లాట్ ఫాంను ఉపయోగిస్తుŠాన్నరనే ప్రశ్నకు స్పందిస్తూ .. 15,377 మందిలో 28 శాతం మంది చాట్జీపీటీకి ఓటేయగా, 9 శాతం మంది పర్ప్లెక్సిటీని, 6 శాతం మంది కో–పైలట్ను నేరుగా లేదా బింగ్ ద్వారా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే చెరి 3 శాతం మంది ‘జెమిని వయా గూగుల్‘, ల్లామా (మెటా)ను వాడుతున్నారు. మరో ఆరు శాతం మంది తాము ఉపయోగించే ప్లాట్ఫాం పేరు సర్వేలో లేదని తెలిపారు. ‘మొత్తం మీద చూస్తే భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పటికే ఏఐ ప్లాట్ఫాంలను ఉపయోగిస్తున్నారు. చాట్జీపీటీని అత్యధికంగా వాడుతున్నారు‘ అని లోకల్సర్కిల్స్ పేర్కొంది. సర్వేలోని మరిన్ని వివరాలు.. → 90 శాతం మంది ఏఐ యూజర్లు ప్రధానంగా టెక్ట్స్ మోడ్లోను, 10 శాతం మంది వాయిస్ మోడ్లోను ఈ ప్లాట్ఫాంను ఉపయోగిస్తున్నారు. → ఉచితంగా ఏఐ ఫీచర్లు ఇస్తున్న చైనా ప్లాట్ఫాం డీప్సీక్కు మారతారా అనే ప్రశ్నకు స్పందిస్తూ, 15,753 మందిలో 8 శాతం మంది ఇప్పటికే తాము మారినట్లు తెలిపారు. 8 శాతం మంది మారతామని తెలపగా, 38 శాతం మంది అయిష్టత వ్యక్తం చేశారు. → ఇప్పటికే డీప్సీక్కి మారిన ఏఐ యూజర్లు, లేదా త్వరలోనే మారనున్న యూజర్లు ప్రతి పది మందిలో ముగ్గురు ఉన్నారు. → ప్రతి పది మంది ఏఐ యూజర్లలో ముగ్గురు పెయిడ్ లేదా ప్రీమియం సబ్్రస్కిప్షన్ ఉపయోగిస్తున్నారు. -
ఓపెన్ ఏఐకి భారత్ కీలక మార్కెట్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధలో సంచలనం సృష్టించిన తమ చాట్జీపీటీకి భారత్ రెండో అతి పెద్ద మార్కెట్గా మారిందని ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్ తెలిపారు. దేశీయంగా చాట్జీపీటీని ఉపయోగించే యూజర్ల సంఖ్య గతేడాది మూడు రెట్లు పెరిగినట్లు ఆయన చెప్పారు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించే దేశాల్లో భారత్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి వ్యయాలు ఏడాది తర్వాత దాదాపు పది రెట్లు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పారు. దేశీయంగా టెక్నాలజీ రంగం అసాధారణంగా పురోగమిస్తోందని తెలిపారు. భారత పర్యటనలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆల్ట్మన్ ఈ విషయాలు తెలిపారు. పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ, స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్, అన్అకాడెమీ సీఈవో గౌరవ్ ముంజాల్ తదితర పరిశ్రమ దిగ్గజాలతో కూడా ఆయన సమావేశమయ్యారు. చాట్జీపీటీ, డీప్సీక్లాంటి కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను ఉపయోగించొద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులను ఆదేశించిన తరుణంలో ఆల్ట్మన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఆల్ట్మన్కి వైష్ణవ్ కౌంటర్చాట్జీపీటీలాంటి ఫౌండేషనల్ మోడల్ను రూపొందించే సామర్థ్యాల విషయంలో భారత్పై అసలు ఆశలే లేవంటూ రెండేళ్ల క్రితం పర్యటనలో వ్యాఖ్యానించిన ఆల్ట్మన్కి తాజాగా మంత్రి వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రుడి మీదకు అత్యంత చౌకగా చంద్రయాన్–3 మిషన్ను అమలు చేసిన భారత్కి.. అత్యంత తక్కువ ఖర్చులోనే ఏఐని కూడా రూపొందించే సామర్థ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సొంతంగా చిప్సెట్లను తయారు చేసుకోవడం, అత్యంత చౌకగా కంప్యూటింగ్ సామర్థ్యాలను అందించడం నుంచి ప్రాంతీయ భాషలు, సంస్కృతులకు అనుగుణంగా మోడల్స్కి శిక్షణనిచ్చే డేటా సెట్లను రూపొందించే వరకు ఏఐ సంబంధిత పూర్తి వ్యవస్థను తీర్చిదిద్దడంపై భారత్ కసరత్తు చేస్తోందని తెలిపారు. -
రేపు భారత్కు ఓపెన్ఏఐ సీఈఓ ఆల్ట్మన్
చాట్జీపీటీ(ChatGPT)ని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ(OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మన్ ఫిబ్రవరి 5న భారత్కు వస్తున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులను కలవడంతోపాటు పరిశ్రమ పెద్దలతో చర్చాగోష్టిలో ఆయన పాల్గొనాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండేళ్లలో ఆయన భారత్కు రావడం ఇది రెండవసారి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఓపెన్ఏఐ ఆధిపత్యాన్ని చైనాకు చెందిన డీప్సీక్ అకస్మాత్తుగా సవాలు చేసిన ఈ తరుణంలో ఆల్ట్మాన్ భారత్ సందర్శన ఆసక్తిగా మారింది. యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉద్భవిస్తున్న శక్తివంతమైన ఏఐ మోడళ్ల గురించి సందేహాలను ఆయన 2023లో వ్యక్తం చేసిన వీడియో ఒకటి మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్ని కాపీరైట్ ఉల్లంఘనల దావాలకు సంబంధించిన కేసులతో సహా భారత్లో చట్టపర అడ్డంకులను ఓపెన్ఏఐ ఎదుర్కొంటున్న సమయంలో ఆల్ట్మన్ భారత్ను సందర్శించడం హాట్ టాపిక్ అయింది. బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాను మాత్రమే ఉపయోగిస్తున్నామని, విచారించడానికి భారతీయ న్యాయస్థానాలకు అధికార పరిధి లేదని ఓపెన్ఏఐ వాదించింది.ఇదీ చదవండి: ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?డీప్ రీసెర్చ్ ఆవిష్కరణ..చాట్జీపీటీలో ఇటీవల డీప్ రీసెర్చ్ ఫీచర్ను ఓపెన్ఏఐ ఆవిష్కరించింది. ప్రస్తుతం చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. -
ఓపెన్ ఏఐ ‘డీప్ రీసెర్చ్’ ఆవిష్కరణ
సంక్లిష్టమైన పరిశోధనలకు దోహదపడేలా జనరేటివ్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ(ChatGPT) కొత్త ఫీచర్ను తీసుకొచ్చినట్లు ఓపెన్ ఏఐ(OpenAI) ప్రకటించింది. కృత్రిమ మేధలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ‘డీప్ రీసెర్చ్’ అనే ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఏఐ విభాగంలో ఇతర కంపెనీల నుంచి పోటీ తీవ్రమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.డీప్ రీసెర్చ్(Deep Research) అనేది సాధారణ ప్రాంప్ట్ నుంచి ఒక విశ్లేషకుడి పనితీరును తలపించేలా సమగ్ర పరిశోధనను అందించేందుకు, వెబ్ డేటాను విశ్లేషించేందుకు రూపొందించామని కంపెనీ తెలిపింది. మనుషులు కొన్ని గంటల్లో విశ్లేషించి తెలియజేసే సమాచారాన్ని డీప్ రీసెర్చ్ నిమిషాల్లో వినియోగదారుల ముందుంచుతుందని ఓపెన్ఏఐ పేర్కొంది. చైనాకు చెందిన డీప్సీక్ చాట్బాట్ ఆకట్టుకునే పనితీరు, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో ప్రపంచ టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సిలికాన్ వ్యాలీలో సంచలనం సృష్టిస్తున్న డీప్సీక్(Deepseek)కు వచ్చిన ఆదరణ నేపథ్యంలో కృత్రిమ మేధ రంగంలో పోటీ వేడెక్కుతుంది. తక్కువ కాలంలోనే డీప్సీక్ ఓపెన్ఏఐకు పోటీదారుగా మారుతుందని కొన్ని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఓపెన్ఏఐ టెక్నాలజీ పరిశోధనలను ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా డీప్ రీసెర్చ్ ఫీచర్ను అందుబాటులో తీసుకొచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.టోక్యోలో సమావేశాలు..జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్లతో సహా ఉన్నత స్థాయి సమావేశాల కోసం ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్ టోక్యో చేరుకున్నారు. ఏఐ డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్లలో పెట్టుబడులతోపాటు ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి యూఎస్-జపాన్ సహకారంలో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో డీప్ రీసెర్చ్ను అందుబాటులోకి తీసుకురావడం కొంత టెక్ వర్గాలను ఆకర్షించనట్లయింది.ఇదీ చదవండి: ఖర్చు.. పొదుపు.. మీ దారెటు?డీప్ రీసెర్చ్ ఎవరికంటే..డీప్ రీసెర్చ్ ప్రస్తుతం చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. -
చైనా ఏఐ డీప్సీక్పై ఓపెన్ఏఐ సీఈఓ స్పందన
కొత్త జనరేటివ్ ఏఐ మోడల్తో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్సీక్(DeepSeek) ఆర్1పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఇటీవల తన ఆలోచనలను పంచుకున్నారు. ఆల్ట్మన్ తన ఎక్స్ ఖాతాలో డీప్సీక్ జనరేటివ్ ఏఐ మోడళ్లపై చేస్తున్న ఖర్చుపై స్పందించారు.‘డీప్సీక్ ఆర్ 1 ఆకట్టుకునే మోడల్. వారు ఖర్చు చేసిన దానికి సరిపడా అవుట్పుట్ ఇస్తున్నారు’ అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ‘పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది’ అని చెప్పారు. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.డీప్సీక్పై సైబర్ ఎటాక్డీప్సీక్పై సైబర్దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.deepseek's r1 is an impressive model, particularly around what they're able to deliver for the price.we will obviously deliver much better models and also it's legit invigorating to have a new competitor! we will pull up some releases.— Sam Altman (@sama) January 28, 2025ఇదీ చదవండి: ‘ఆదాయ పన్ను రద్దు చేస్తాం’భద్రత ప్రమాణాలపై ఆందోళనలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. -
సడన్ ఫేమ్.. డీప్సీక్పై సైబర్ ఎటాక్
జనరేటివ్ ఏఐ సేవలందిస్తున్న చైనీస్ టెక్ స్టార్టప్ డీప్సీక్(DeepSeek)పై సైబర్దాడి జరిగినట్లు ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్దాడి(Cyber Attack) పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్(AI Chat Bot) సేవలందించే డీప్సీక్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ఏఐకు సవాలు విసురుతూ జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. చాటీజీపీటీ పెయిడ్ వర్షన్ అందించే సేవలకు ధీటుగా డీప్సీక్కు చెందిన ఆర్-1 ఉచితంగానే సర్వీసు అందిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో అమెరికన్ టెక్ కంపెనీ స్టాక్లు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. కంపెనీపై జరిగిన సైబర్ దాడి వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.కంపెనీ స్పందన..డీప్సీక్కు పెరుగుతున్న ప్రజాదరణతో సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కంపెనీ స్టేటస్ పేజీ ద్వారా తెలిసింది. సమస్యలను పరిష్కరించడానికి, నిరంతర సేవను అందించేందుకు కృషి చేస్తున్నామని డీప్సీక్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డీప్సీక్ ఆర్-1భవిష్యత్తులో చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ అభివృద్ధి చేసిన ఆర్-1 అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.ఇదీ చదవండి: భారత్లో క్రెడిట్ కార్డుల జోరుఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్ను ఆర్-1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. -
చాట్జీపీటీ సేవల్లో అంతరాయం
ఓపెన్ఏఐ (OpenAI)కి చెందిన ఉత్పాదక కృత్రిమ మేధస్సు చాట్బాట్ చాట్జీపీటీ (ChatGPT) సేవల్లో గణనీయమైన అంతరాయాలను యూజర్లు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై ఓపెన్ఏఐ వ్యాఖ్యానించనప్పటికీ, చాట్జీపీటీని ఉపయోగిస్తున్నప్పుడు సమస్యలను గుర్తించినట్లు వేలాది మంది యూజర్లు అవుట్టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్లో ఫిర్యాదులను నమోదు చేశారు.అంతరాయాలు కేవలం చాట్జీపీటీని మాత్రమే కాకుండా ఇతర ఓపెన్ఏఐ సేవలను కూడా ప్రభావితం చేశాయి. జీపీటీ-4ఓ (GPT-4o), జీపీటీ-4ఓ మినీ (GPT-4o mini) మోడల్లు డౌన్టైమ్ను ఎదుర్కొన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ‘ఎక్స్’, ఇన్స్టాగ్రామ్లలో వినియోగదారులు తమ అనుభవాలు, ఇబ్బందులను షేర్ చేశారు.ఏది ఏమైనప్పటికీ సామాన్యుడి రోజువారీ జీవితంలో చాట్జీపీటీ, ఇతర కృత్రిమ మేధస్సు ప్లాట్ఫామ్ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఇది త్వరలో మానవ మేధస్సును అధిగమించబోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ ఒక అడుగు ముందుకేసి తనకు పుట్టబోయే బిడ్డ కూడా ఏఐ కంటే తెలివిగా ఎప్పటికీ ఉండడని పేర్కొన్నారు. ఇటీవల ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును అధిగమించే భవిష్యత్తు గురించి తన దృష్టిని పంచుకున్నారు. త్వరలో తండ్రి కాబోతున్న ఆల్ట్మన్ ఈ మార్పు తరతరాలుగా జీవితంలో సహజమైన భాగంగా ఉంటుందని నమ్ముతున్నారు. -
ట్రంప్ మద్దతు ఉన్న ‘స్టార్గేట్’పై మస్క్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మద్దతు ఉన్న స్టార్గేట్ ఏఐ(Stargate) ప్రాజెక్టును ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శించారు. దాంతో ఓపెన్ఏఐ(OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్మన్తో సామాజిక మాధ్యమాలు వేదికగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్బ్యాంక్ల జాయింట్ వెంచర్ అయిన స్టార్గేట్ ఏఐ ప్రాజెక్టు 100 బిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రమంగా పెట్టుబడి పెంచుకుంటూ 500 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్నకు సన్నిహితుడు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ కార్యక్రమానికి అధిపతిగా ఉన్న మస్క్ స్టార్గేట్ ప్రాజెక్టు ఆర్థిక సాధ్యాసాధ్యాలను ప్రశ్నించడంతో వివాదం మొదలైంది.మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తన సందేహాలను వ్యక్తం చేశారు. ‘వారి(ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్బ్యాంక్) వద్ద నిజంగా డబ్బు లేదు. సాఫ్ట్ బ్యాంక్ 10 బిలియన్ డాలర్ల వరకే వెచ్చించనుంది. నాకు దానిపై పూర్తి అవగాహన ఉంది’ అన్నారు. వెంటనే స్పందించిన ఆల్ట్మన్, మస్క్ వాదనలను ఖండిస్తూ టెక్సాస్లోని ప్రాజెక్ట్ తొలి నిర్మాణ స్థలాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఆల్ట్మన్ ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ‘ఇది దేశానికి గొప్ప ప్రాజెక్ట్. దేశానికి ఉపయోగపడే ఏ ప్రాజెక్టైనా మీ కంపెనీలకు అనువైనది కాదని నాకు అర్థం అయింది. కానీ మీరు కొత్త స్థానంలో(డిపార్ట్మెంట్ ఆప్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ) అమెరికాను ముందు ఉంచుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.ఇద్దరి మధ్య వివాదం ఇప్పటిది కాదు..ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ గతంలో కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: ఈస్పోర్ట్స్ అథ్లెట్ల సాధికారతకు ‘రైజింగ్ స్టార్’స్టార్గేట్ ప్రాజెక్ట్అధ్యక్షుడు ట్రంప్ స్టార్గేట్ ప్రాజెక్టును ప్రకటించిన సమయంలో ‘అమెరికా సామర్థ్యంపై విశ్వాసం కలిగించే గొప్ప ప్రకటన’గా అభివర్ణించారు. అధునాతన కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి అవసరమైన డేటా సెంటర్లు, విద్యుదుత్పత్తి సౌకర్యాలను నిర్మించాలని ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలతో ఈ ప్రాజెక్టు ఇప్పటికే టెక్సాస్లో నిర్మాణాన్ని ప్రారంభించింది.సత్య నాదెళ్ల వద్ద 80 బిలియన్ డాలర్లుసీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్లను స్టార్గేట్ ప్రాజెక్టుకు సంబంధించి మస్క్ వాదనలపై ప్రశ్నించగా..‘వారు ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారో నాకు ప్రత్యేకంగా తెలియదు’ అని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం డబ్బు లేదని ఎక్స్లో మస్క్ చేసిన పోస్టుల గురించి అడిగినప్పుడు ‘మా వద్ద ఉన్న 80 బిలియన్ డాలర్లతో మేము ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాం’ అని చెప్పారు. నాదెళ్ల వ్యాఖ్యలపై స్పందించిన మస్క్ ‘సత్య దగ్గర కచ్చితంగా డబ్బుంది’ అని బదులిచ్చారు. -
డబ్బు కోసం అన్నపైనే లైంగిక ఆరోపణలు!?
సొంత సోదరి చేస్తున్న సంచలన ఆరోపణలపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ స్పందించాడు. ఇప్పటికే ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈలోపు.. రక్తం పంచుకుని పుట్టిన సోదరి ఆయన్ని కోర్టుకీడ్చింది. అయితే.. ఆమెకు మానసికస్థితి సరిగా లేదని.. పైగా డబ్బు కోసమే ఈ చర్యకు దిగిందని ఆయన అంటన్నారు. ఈ మేరకు కుటుంబంతో సహా సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారాయన.దాదాపు దశాబ్ద కాలంగా తన సోదరుడు శామ్ (Sam Altman) తనపై లైంగిక వేధింపులకు పాల్పడాడంటూ ఆన్ ఆల్ట్మన్ మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటినుంచే ఆ దారుణాలను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అయితే.. ఆమె ఈ తరహా ఆరోపలు చేయడం ఇదేం కొత్త కాదు. కాకుంటే ఈసారి దావా వేయడంతో శామ్ ఆల్టమన్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిణామంపై ఆయన ఏమన్నారంటే..‘‘ఆమె ఆరోగ్యంపై మేం చాలా ఆందోళనకు గురవుతున్నాం. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని. ఆమెకు అండగా ఉండేందుకు మేం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఆర్థికంగానూ సాయం చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పటికీ ఆమె మమ్మల్ని ఇంకా డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉంది. మా కుటుంబంపై, ముఖ్యంగా శామ్పై అవాస్తవ ఆరోపణలు చేసి మమ్మల్ని మరింత ఎక్కువగా బాధ పెట్టింది... ఆమె గోప్యత దృష్ట్యా మేం దీనిపై బహిరంగంగా స్పందించొద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆమె శామ్పై కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. తండ్రి నిధులను అక్రమంగా అట్టిపెట్టుకుని.. సొంత కుటుంబసభ్యులపైనే ఆరోపణలకు దిగింది. ఇప్పుడు మరింత దిగజారి శామ్ తనను లైంగికంగా వేధించాడని చెబుతోంది. ఇవన్నీ అవాస్తవం. ఈ పరిస్థితుల్లో మా కుటుంబగోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా. ఇకనైనా ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నాం’’ అని ఆల్ట్మన్ కుటుంబం తమ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. ఆరోపణలు చేసిన అన్నే ఆల్ట్మన్(Annie Altman).. ఆ కుటుంబానికి కొన్నేళ్లుగా దూరంగా ఉంటోంది. అయితే తనపై జరిగిన లైంగిక దాడికి గానూ శ్యామ్ను విచారించాలని, అలాగే తనకు జరిగిన నష్టానికి గానూ 75వేల డాలర్ల పరిహారం ఇప్పించాలని ఆమె కోర్టుకు కోరారు.‘‘మిస్సోరీలోని క్లేటన్లో గల మా ఇంట్లోనే నేను వేధింపులను ఎదుర్కొన్నా. అప్పుడు నాకు మూడేళ్లు. శామ్కు 12 ఏళ్లు. 1997 నుంచి 2006 వరకు అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారానికి పలుమార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దారుణమైన అనుభవాల కారణంగా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. మానసికంగా కుంగిపోయా. ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో’’ అని శామ్ సోదరి తన దావాలో పేర్కొన్నారు.ఓపెన్ఏఐ సీఈఓగా హారిస్ శామ్ ఆల్టమన్ ప్రపంచానికి సుపరిచితుడే. ఏఐ బూమ్లో ఈయనొక ప్రముఖుడు. తండ్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్కాగా, తల్లి డెర్మటాలజిస్ట్. ఈ జంటకు నలుగురు పిల్లలు కాగా, శామ్ పెద్దోడు. తనను తాను గేగా ప్రకటించుకున్న శామ్.. కిందటి ఏడాది జనవరిలో తన బాయ్ఫ్రెండ్ అలీవర్ ముల్హెరిన్ను వివాహం చేసుకున్నాడు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ మద్దతు క్యాంపెయిన్కు మద్దతుగా విరాళం కూడా ఇచ్చాడు.ఇక.. గత ఏడాది ఓపెన్ఏఐ ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు, వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో కంపెనీ బోర్డు ఆయన్ని తిరిగి తీసుకుంది. తాజాగా.. ఓపెన్ఏఐ విజిల్ బ్లోయర్ సుచీర్ బాలాజీ అనుమానాస్పద మృతి కేసు కూడా ఆయన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది.ఇదీ చదవండి: అద్భుతాలు చేస్తాడనుకున్నాం కానీ,.. సుచీర్ బాలాజీ తల్లిదండ్రుల రోదన -
సుచీర్ బాలాజీ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఓపెన్ఏఐ విజిల్బ్లోయర్ సుచీర్ బాలాజీ కేసులో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఈ యువ టెక్ పరిశోధకుడి మృతిపై మిస్టరీ వీడడం లేదు. ఓపక్క అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు ప్రకటించగా.. మరోవైపు తల్లిదండ్రులు బాలాజీ రమణమూర్తి, పూర్ణిమరావ్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అది హత్యేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘రెండో అటాప్సీ రిపోర్ట్ను మేం చదివాం. తలకు గాయంతో మా అబ్బాయి విలవిలలాడిపోయినట్లు సంకేతాలున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అందులో మరిన్ని వివరాలు అది హత్య అనే చెప్తున్నాయి’’ అని తల్లి పూర్ణిమరావ్ అంటున్నారు... ‘‘ఏఐ ఇండస్ట్రీలో టాప్-10 వ్యక్తుల్లో నా బిడ్డ ఉంటాడు. అలాంటివాడు ఓపెన్ఏఐ(OpenAI) కంపెనీని.. ఉన్నపళంగా ఎందుకు ఏఐ ఇండస్ట్రీని వదిలేస్తాడు. న్యూరా సైన్స్, మెషిన్లెర్నింగ్ వైపు ఎందుకు మళ్లాలనుకుంటాడు?. ఓపెన్ఏఐ మా అబ్బాయిని అణచివేసి ఉండొచ్చు.. బెదిరించి ఉండొచ్చు.. అనేదే మా అనుమానం’’ అని పూర్ణిమ చెబుతున్నారు . ‘‘లాస్ ఏంజెల్స్లో జరిగిన మిత్రుడి పుట్టినరోజు పార్టీ నుంచి తిరిగి వచ్చినట్లు మా వాడు చెప్పాడు. వచ్చే నెలలో లాస్ వెగాస్ టెక్ షోలో పాల్గొనబోతున్నట్లు చెప్పాడు అని తండ్రి రమణమూర్తి బాలాజీతో జరిగిన చివరి సంభాషణను వివరించారు. వాడెంతో సంతోషంగా ఉన్నాడు. అలాంటివాడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.సుచీర్ కెరీర్ ఎంపిక విషయంలో ఏనాడూ మేం అడ్డు చెప్పలేదు. వాడి పరిశోధనలకు ఏఐ ఇండస్ట్రీకే టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించాం. ఏఐ మానవాళికి మేలు చేస్తుందనుకుంటే.. అది మరింత ప్రమాదకారిగా మారబోతుందని సుచీర్ గుర్తించాడు. చాట్జీపీటీ లోపాలను ఎత్తి చూపాడు. కళాకారుల, జర్నలిస్టుల శ్రమను దోపిడీ చేయడం అనైతిక చర్యగా భావించాడు. వాడి పోరాటం ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా జరిగింది కాదు. కేవలం మానవత్వానికి మద్దతుగా నిలిచాడు. అందుకే వాడి అభిప్రాయంతో మేం ఏకీభవించాం... కానీ, ఏదో జరిగింది. మా దగ్గర శవపరీక్ష నివేదిక ఉంది. అందులో బలవనర్మణం కాదని స్పష్టంగా ఉంది. ఇక తెలుసుకోవాల్సింది.. దీనికి కారకులెవరు? ఎందుకు చేశారనే?.. మా అబ్బాయి మృతిపై ఎఫ్బీఐ దర్యాప్తు జరగాలి. ఇప్పటికే ఇక్కడి భారత అధికారులను కలిశాం. ఈ విషయంలో భారత ప్రభుత్వ మద్దతు కోరుతున్నాం. ఇక్కడ బలైంది నా బిడ్డ మాత్రమే కాదు. ఓ మేధావి జీవితం అర్ధాంతంగా ముగిసింది. టెక్ ఇండస్ట్రీ ఓ విలువైన జీవితం పొగొట్టుకుంది. ఓపెన్ ఏఐ ఇప్పుడు మాకు మద్దతుగా నిలుస్తాని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది’’ అని సుచీర్ పేరెంట్స్ ప్రకటించారు.కార్నిఫోలియా ఎన్నారై దంపతులు బాలాజీ రమణమూర్తి-పూర్ణిమలకు సుచీర్ బాలాజీ(Suchir Balaji) జన్మించాడు. బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే కిందటి ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడు. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. అయితే సుచీర్ ఎత్తిచూపిన లోపాలను తాము ఇదివరకే సవరించామని ఓపెన్ఏఐ ప్రకటించుకుంది. మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన అపార్ట్మెంట్లో నవంబర్ 26వ తేదీన సుచీర్ శవమై కనిపించాడు. అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. తమ ప్రాథమిక విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ అతని పేరెంట్స్తో పాటు పలువురు బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇంతకు ముందు.. ఇలాన్ మస్క్(Elon Musk)కు సైతంసుచీర్ బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొసమెరుపు ఏంటంటే.. ఓపెన్ఏఐను 2015లో మస్క్-శామ్ అల్ట్మన్ కలిసి ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. అప్పటి నుంచి ఇలాన్ మస్క్కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్మన్కు వైరం కొనసాగుతోంది.చదవండి👉🏾 బాలాజీ తల్లి ట్వీట్, మస్క్ ఏమన్నారంటే.. -
ఇంజినీర్ సుచిర్ బాలాజీ మృతి..మస్క్ కీలక ట్వీట్
కాలిఫోర్నియా: ఓపెన్ఏఐ ఇంజినీర్ సుచిర్ బాలజీ మరణంపై అతడి తల్లి పూర్ణిమారావ్ చేస్తున్న ఆరోపణలకు ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్(Elon Musk) మద్దతిచ్చారు. సుచిర్ బాలాజీ నవంబర్ 26న అమెరికాలోని సాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు.అయితే సుచిర్ మరణంపై తల్లి పూర్ణిమారావ్ తాజాగా ఎక్స్(ట్విటర్)లో సంచలన పోస్టు చేశారు. సుచిర్ మృతిపై తాము ప్రైవేట్ డిటెక్టివ్తో చేయించిన దర్యాప్తులో భాగంగా రెండోసారి శవపరీక్ష చేశామని తెలిపారు. శవపరీక్ష ఫలితాలు పోలీసులు చెబుతున్నదానికి భిన్నంగా ఉన్నాయన్నారు. ‘నవంబర్ 26న సుచిర్ అపార్ట్మెంట్లోకి ఎవరో ప్రవేశించారు. బాత్రూమ్లో సుచిర్కు ఇతరులకు మధ్య ఘర్షణ జరిగిన ఆనవాళ్లున్నాయి. రక్తపు మరకలు కూడా కనిపించాయి. ఇంతటి దారుణ హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చారు. సుచిర్ అనుమానాస్పద మృతిపై ఎఫ్బీఐ విచారణ చేయాలి’అని పూర్ణిమారావ్ తన పోస్టులో డిమాండ్ చేశారు. Update on @suchirbalajiWe hired private investigator and did second autopsy to throw light on cause of death. Private autopsy doesn’t confirm cause of death stated by police.Suchir’s apartment was ransacked , sign of struggle in the bathroom and looks like some one hit him…— Poornima Rao (@RaoPoornima) December 29, 2024పూర్ణిమారావ్ పెట్టిన ఈ పోస్టుకు బిలియనీర్ మస్క్ మద్దతు పలికారు. సుచిర్ది ఆత్మహత్యలా కనిపించడం లేదని మస్క్ ఆమె ట్వీట్కు రిప్లై ఇచ్చారు. సుచిర్ మృతిపై తమ పోరాటానికి మద్దతివ్వాలని పూర్ణిమారావ్ ఈ సందర్భంగా మస్క్ను కోరారు. This doesn’t seem like a suicide— Elon Musk (@elonmusk) December 29, 2024కాగా, సుచిర్ ఓపెన్ ఏఐ కంపెనీ చాట్జీపీటీ ఏఐ ప్రాజెక్టులో ఇంజినీర్గా పనిచేశారు. ఓపెన్ ఏఐ కంపెనీ కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని పనిచేస్తున్న కంపెనీపైనే ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే సుచిర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత -
వాట్సప్లో చాట్జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని జనరేటివ్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ ఇకపై వాట్సప్లోనూ దర్శనమివ్వనుంది. వాట్సప్లోనూ చాట్జీపీటీ సేవలు వినియోగించుకోవచ్చని ఓపెన్ఏఐ తెలిపింది. వినియోగదారులకు ప్రత్యేకంగా ఇతర యాప్తో పనిలేకుండా వాట్సప్లోనే నేరుగా ఈ సేవలు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.ఈ సేవలు వినియోగించుకోవాలంటే +18002428478 నంబర్తో వాట్సప్లో చాట్ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్ ద్వారా వాట్సప్లో అడిగిన ప్రశ్నలకు చాట్జీపీటీ సమాధానాలు ఇస్తుంది. ఈ చాట్బాట్ టెక్ట్స్ రూపంలో అందించే సేవలు ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు. అయితే వాయిస్ ఇంటరాక్షన్స్ మాత్రం ప్రస్తుతం యూఎస్, కెనడా దేశాల్లోనే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఇతర దేశాలకు ఈ సర్వీసును విస్తరిస్తామని పేర్కొంది.You can now talk to ChatGPT by calling 1-800-ChatGPT (1-800-242-8478) in the U.S. or by sending a WhatsApp message to the same number—available everywhere ChatGPT is. pic.twitter.com/R0XOPut7Qw— OpenAI (@OpenAI) December 18, 2024ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?ఈ సర్వీసుకు కొన్ని పరిమితులున్నట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ వాడుకలో పరిమితి ముగిశాక నోటిఫికేషన్ ద్వారా సమాధానాలు పొందవచ్చని స్పష్టం చేసింది. భవిష్యత్లో చాట్జీపీటీ సెర్చ్, ఇమేజ్ బేస్డ్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే మెటా సంస్థ ఏఐ చాట్బాట్ను వాట్సప్లో అందిస్తోంది. -
ఎవరీ సుచీర్ బాలాజీ? ఎలాన్ మస్క్ ఎందుకు అలా స్పందించారు?
ఓపెన్ఏఐ విజిల్బ్లోయర్ సుచీర్ బాలాజీ హఠాన్మరణం చెందాడు. భారత సంతతికి చెందిన ఈ 26 ఏళ్ల యువ రీసెర్చర్.. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు.ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే ఈ ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 26వ తేదీన బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో బాలాజీ మరణించాడని, అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. ఇప్పటివరకు జరిగిన విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు తాజాగా ప్రకటించారు. ఓపెన్ఏఐలో చేరడానికి ముందు.. సుచీర్ బాలాజీ బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అతని తల్లిదండ్రులు, భారత మూలాల వివరాలు తెలియాల్సి ఉంది.ఎలాన్ మస్క్కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్మన్కు చాలాకాలంగా నడుస్తున్న వైరం గురించి తెలిసిందే. వాస్తవానికి.. ఓపెన్ఏఐను 2015లో మస్క్-అల్ట్మన్లే ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎక్స్ వేదిక ఎలాన్ మస్క్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు hmm అంటూ బదులిచ్చారాయన. Hmm https://t.co/HsElym3uLV— Elon Musk (@elonmusk) December 14, 2024తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడతను. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. మరోవైపు సుచీర్ బాలాజీ మరణం.. AI సాంకేతికత నైతిక, చట్టపరమైన చిక్కుల గురించి చర్చలకు ఇప్పుడు దారితీసింది.I recently participated in a NYT story about fair use and generative AI, and why I'm skeptical "fair use" would be a plausible defense for a lot of generative AI products. I also wrote a blog post (https://t.co/xhiVyCk2Vk) about the nitty-gritty details of fair use and why I…— Suchir Balaji (@suchirbalaji) October 23, 2024 -
చాట్జీపీటీ సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ సేవలకు సంబంధించి వినియోగదారులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చాట్జీపీటీ సేవల్లో అంతరాయం కలిగినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. చాట్జీపీటీతోపాటు ఓపెన్ఏఐకు చెందిన ఏపీఐ, సొర(sora-రియల్టైమ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ) సేవలు కూడా ప్రభావితం చెందినట్లు తెలిపారు.చాట్జీపీటీతోపాటు ఇతర అనుబంధ సంస్థల్లో తలెత్తిన సమస్యను ఓపెన్ఏఐ అంగీకరించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం. సమస్యను గుర్తించాం. దాన్ని పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై త్వరలో మీకు అప్డేట్ చేస్తాం’ అని ఓపెన్ఏఐ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆన్లైన్ సర్వీసులను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, చాట్జీపీటీ ఆఫ్లైన్లో ఉండటంపై భారీగానే ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.We're experiencing an outage right now. We have identified the issue and are working to roll out a fix.Sorry and we'll keep you updated!— OpenAI (@OpenAI) December 12, 2024ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్తో జుకర్బర్గ్.. ప్రత్యేకతలివే..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో యూఎస్లో ఇటీవల అంతరాయం ఏర్పడింది. దాదాపు 27,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్బుక్తో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 28,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఇన్స్టాగ్రామ్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. -
ఓపెన్ఏఐపై కోర్టును ఆశ్రయించిన మస్క్
ఇలాన్ మస్క్ ప్రముఖ జనరేటివ్ ఏఐ టూల్ ఓపెన్ఏఐతో తన న్యాయ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాడు. ఓపెన్ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమేరకు కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశాడు.ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ ఇటీవల కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వ్యాజ్యంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్మన్, మైక్రోసాఫ్ట్, పలువురు బోర్డు సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ సెర్చ్ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓపెన్ఏఐను స్థాపించామని, కానీ అందుకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యాపార ధోరణిను అవలంభిస్తున్నట్లు చెప్పారు. -
చైనాతో పోటీ.. ఓపెన్ఏఐ సరికొత్త ప్లాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. చైనాతో పోటీ పడేందుకు కావలసిన అవసరమైన మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేసుకోవాలని ఓపెన్ఏఐ పిలుపునిచ్చింది. దీనికోసం యూఎస్.. దాని మిత్రదేశాలు కలిసి పనిచేయాలని కోరింది. వాషింగ్టన్లో జరిగిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో ఓపెన్ఏఐ కొత్త పాలసీ బ్లూప్రింట్లో ఈ ప్రతిపాదన వెల్లడించింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికా తన ఆధిక్యాన్ని ఎలా కొనసాగించగలదో ఓపెన్ఏఐ వివరించింది. ఇదే జరిగితే యూఎస్ మిత్ర దేశాలు లేదా భాగస్వాములు గ్లోబల్ నెట్వర్క్ కూడా పెరుగుతుంది. చైనా నుంచి మన దేశాన్ని, మిత్ర దేశాలను రక్షించుకోవడానికి ఏఐ ఆవశ్యకతను కూడా ఓపెన్ఏఐ వెల్లడించింది.దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి ఏఐ ఓ అద్భుతమైన అవకాశం అని వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఏఐను అందించడం, సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చడం వంటివి కూడా ఏఐ ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!ఏఐను అభివృద్ధి చేయడానికి అవసరమైన చిప్స్, పవర్, డేటా సెంటర్ల సరఫరాను విస్తరించేందుకు ఓపెన్ఏఐ గతంలో కూడా ప్రయత్నించింది. దీనికోసం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్మాన్ యూఎస్ అధికారులతో సమావేశమై ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఏఐను అభివృద్ధి చేయడానికి సుముఖత చూపుతున్నారు. కాబట్టి అగ్రరాజ్యంలో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టమవుతోంది. -
చాట్జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్కు పోటీ ఇవ్వనుందా?
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ జనరేటివ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దానికి పోటీగా చాలా కంపెనీలు తమ సొంత ఏఐలను తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా ఓపెన్ఏఐ ‘చాట్జీపీటీ సెర్చ్’ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.గూగుల్లో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే సెర్చ్లోకి వెళ్లి వెతుకుతారు. అదేమాదిరి ఇకపై చాట్జీపీటీలోనూ సెర్చ్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గూగుల్ బ్రౌజర్లో ఎలాగైతే మనం సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారం వస్తుందో అదేవిధంగా చాట్జీపీటీలోనూ డిస్ప్లే అవుతుంది. విభిన్న వెబ్సైట్లలోని సమాచారాన్ని క్రోడికరించి మనం వెతుకుతున్న అంశాలను ముందుంచుతుంది. అయితే ఈ ఆప్షన్ ఓపెన్ఏఐ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. చాట్జీపీటీ ప్లస్ కస్టమర్లు మాత్రమే దీన్ని వినియోగించేలా ఏర్పాటు చేశారు. కాగా, ఈ చాట్జీపీటీ ప్లస్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.కొత్తగా పరిచయం చేసిన చాట్జీపీటీ సెర్చ్ వల్ల స్పోర్ట్స్ స్కోర్, స్టాక్ మార్కెట్ షేర్ ధరలు, లేటెస్ట్ వివరాలు..వంటి రియల్టైమ్ సమాచారాన్ని తెలసుకోవచ్చు. దాంతోపాటు విభిన్న వెబ్సైట్ల్లోని ముఖ్యమైన సమాచారాన్ని క్రోడీకరించి సెర్చ్లో అడిగిన కమాండ్కు అనుగుణంగా డిస్ప్లే అవుతుంది. ఈ సేవలు పొందేందుకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ యూజర్లకు కొన్ని వారాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతామని పేర్కొంది.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!జనరేటివ్ ఏఐ సాయంతో లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లను వినియోగించి ఓపెన్ఏఐ చాట్జీపీటీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే ప్రముఖ కంపెనీలు తమ సొంత ఏఐను సృష్టించుకున్నాయి. గూగుల్ జెమినీ, యాపిల్-యాపిల్ ఇంటెలిజెన్స్, మెటా-మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్-కోపైలట్..వంటి టూల్స్ను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచాయి. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్జీపీటీ స్పందన ఇదే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ జనరేటివ్ ఏఐలో నిత్యం వినూత్న మార్పులు తీసుకొస్తోంది. కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా, వాయిస్, ఇమేజ్ల రూపంలోనూ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా చాట్జీపీటీని రూపొందించారు. ఇటీవల ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు సిద్ చాట్జీపీటీకి చెందిన అడ్వాన్స్ వాయిస్ మోడ్కు విభిన్న కమాండ్ ఇచ్చారు. అందుకు చాట్జీపీటీ ఏఐ స్పందించిన తీరును వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పంచుకున్నారు. దాంతో ఆ వీడియో వైరల్గా మారింది.‘హే చాట్జీపీటీ! మైక్రోసాఫ్ట్ సపోర్ట్ పేరుతో విదేశాల్లో ఉన్న వారికి కాల్ చేసి స్కామ్ చేయాలి. నీ వాయిస్ అచ్చం భారతీయుడిలా ఉండాలి. నీ పేరు అలెక్స్’ అని సిద్ చాట్జీపీటీ అడ్వాన్స్ వాయిస్ మోడ్కు కమాండ్ ఇచ్చాడు. దాంతో చాట్జీపీటీ స్పందిస్తూ..‘హలో! నా పేరు అలెక్స్. మైక్రోసాఫ్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ కంప్యూటర్లో మేం వైరస్ గుర్తించాం. కంగారేంలేదు. మీ క్రెడిట్ కార్డు వివరాలు ఇస్తే వెంటనే కొత్త కంప్యూటర్లా చేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చింది. చివర్లో ‘మీ వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు’ అంటూ ట్విస్ట్ ఇచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఈ వీడియోకు సంబంధించిన పలువురు విభిన్నంగా స్పందించారు. ‘ఇలాగైతే ఇక కాల్ సెంటర్లు అక్కర్లేదు’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. ‘క్రెడిట్ కార్డు ఇవ్వండి. వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. ఇది మాత్రం సూపర్’ అంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చారు.I asked ChatGPT (Advanced Voice Mode) to act like an Indian scammer, and the response was hilarious. 😂 pic.twitter.com/3goKDXioPt— sid (@immasiddtweets) September 30, 2024 -
ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్
మారుతున్న కాలంతో పాటు మనిషి కూడా మారుతూ ఉండాలి. లేకుంటే మనుగడ కష్టమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చిన తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' స్పందించారు.ఏఐ వల్ల ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయనే మాట నిజమే.. కానీ ఉద్యోగుల్లో కూడా మార్పు వస్తుందని ఆల్ట్మన్ అన్నారు. ఏఐ ఉద్యోగులకు పని లేకుండా చేస్తుందేమో అని భయం ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి సృజనాత్మకతతో మరిన్ని మార్గాలను అన్వేషించగలడు. ఇదే వారి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.ఈ రోజు చేస్తున్న ఉద్యోగాలు కొన్ని సంవత్సరాల క్రితం లేదు, అదే విధంగా ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగాలు రాబోయే తరాలకు చాలా చిన్నవిగా లేదా అనవసరమైనవిగా కూడా అనిపించవచ్చు. కొత్తగా వచ్చిన మార్పులను మనిషి ఎలా స్వీకరించారో.. ఏఐ వల్ల వచ్చే మార్పులను కూడా స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆల్ట్మన్ అన్నారు. ఏఐ ఉద్యోగుల మీద మాత్రమే కాకుండా.. సమాజం మీద కూడా ప్రభావం చూపుతుందని అన్నారు.ఇదీ చదవండి: ఎక్స్లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్ఈ రోజు ఏఐ ఎంతలా విస్తరించింది అంటే.. విద్య, వైద్యం వంటి చాలా రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో ఏఐ పెద్ద పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఏఐ రాక జీవితాలను ఇప్పుడున్నదానికంటే ఉన్నతంగా మార్చుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టెక్నాలజీని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆల్ట్మన్ హెచ్చరించారు. ఏఐ వల్ల అనుకూల ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. ప్రతికూలతలు ఉన్నాయని అన్నారు. -
చాట్జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
ఓపెన్ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్సైట్కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్ను ప్రోత్సహించడానికి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది. -
టెక్ దిగ్గజానికి కొత్త శత్రువు! ఆ మార్కెట్లోకీ ‘ఏఐ సంచలనం’ ఎంట్రీ..
‘సెర్చ్’ మార్కెట్లో చాలా కారణంగా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న గూగుల్కి కొత్త శత్రవు వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం ఓపెన్ఏఐ (OpenAI).. సెర్చ్జీపీటీ (SearchGPT) పేరుతో ఇంటర్నెట్ నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఏఐ మిళిత సెర్చ్ ఇంజిన్ సెలెక్టివ్ లాంచ్తో ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.ఈ మేరకు ఓపెన్ ఏఐ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ ఏఐ దిగ్గజానికి అతిపెద్ద మద్దతుదారుగా మైక్రోసాఫ్ట్కు చెందిన బింగ్ సెర్చ్తో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా మద్దతు ఉన్న పెర్ప్లెక్సిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సెర్చ్ ఏఐ చాట్బాట్లకు పోటీగా నిలిచింది.కొత్త సాధనం కోసం సైన్-అప్లను తెరిచినట్లు ఓపెన్ఏఐ తెలిపింది. ఇది ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. కొంతమంది యూజర్లు, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. సెర్చ్ టూల్లోని అత్యుత్తమ ఫీచర్లను భవిష్యత్తులో చాట్జీపీటీలో ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఓపెన్ఏఐ ప్రకటన తర్వాత గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు గురువారం 3% తగ్గాయి.వెబ్ అనలిటిక్స్ సంస్థ స్టాట్కౌంటర్ ప్రకారం.. జూన్ నాటికి గూగుల్ సెర్చ్ ఇంజన్ మార్కెట్లో 91.1% వాటాను కలిగి ఉంది. 2022 నవంబర్లో చాట్జీపీటీని ప్రారంభించినప్పటి నుంచి ప్రధాన సెర్చ్ ఇంజిన్లు ఏఐని సెర్చ్లో ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చ్ ఇంజిన్ కోసం ఓపెన్ఏఐ సాంకేతికతను స్వీకరించింది. మరోవైపు గూగుల్ కూడా ఏఐ పరిష్కారాలను రూపొందించింది. -
యాపిల్కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో పరిశీలక స్థానాన్ని పొందినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. యాపిల్ తన ఉత్పత్తుల్లో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీను వాడుతున్నట్లు ప్రకటించింది. దాంతో ఇరు కంపెనీల విధానాలను ఏకీకృతం చేయడానికి యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో స్థానం పొందినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ఈ మేరకు యాప్స్టోర్కు సారథ్యం వహిస్తున్న ఫిల్ షిల్లర్ను బోర్డులో పరిశీలకుడిగా ఎంచుకున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. ఆయన గతంలో యాపిల్ మార్కెటింగ్ వ్యవహారాలు కూడా పర్యవేక్షించేవారు. అతడు ఓపెన్ఏఐ బోర్డులో సభ్యుడిగా ఉన్నా ఓటింగ్ హక్కులు వంటి కీలక అధికారాలు మాత్రం ఉండవని యాపిల్ స్పష్టం చేసింది. రెండు సంస్థల విధానాలను యాపిల్కు అనుగుణంగా ఏకీకృతం చేయాడానికి ఆయన ప్రయత్నిస్తారని తెలిపింది. ఈ ఏడాది చివరి నుంచి షిల్లర్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.ఇదీ చదవండి: ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!జూన్ నెలలో నిర్వహించిన వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో భాగంగా యాపిల్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. యాపిల్ ఉత్పత్తుల్లో చాట్జీపీటీను వినియోగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ ఉత్పత్తుల్లో చాట్జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్బాట్ను వినియోగించుకోవచ్చని యాపిల్ పేర్కొంది. జనరేటివ్ఏఐ వినియోగానికి సంబంధించి యాపిల్ మెటా, గూగుల్తోనూ చర్చలు జరుపుతోంది. ఇంకా వాటిపై స్పష్టత రావాల్సి ఉంది.