OpenAI
-
ట్రంప్ ప్రభుత్వానికి ఓపెన్ ఏఐ హెచ్చరిక
కృత్రిమ మేధ (AI) ఆధిపత్యం కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రతరం అవుతున్న తరుణంలో సామ్ ఆల్ట్మన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ అమెరికా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. కాపీరైట్ సంస్కరణల్లో నిబంధనల కారణంగా అమెరికన్ కంపెనీలు చాలా వెనుకబడిపోతాయని, చైనీస్ డెవలపర్లు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశాలు కనుగొంటున్నారని ఓపెన్ఏఐ తెలిపింది. ఈ వ్యత్యాసం ఏఐ రేసులో చైనాను ముందుంచేందుకు వీలు కల్పిస్తుందని వాదించింది. ఇటీవల యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)కు ఇచ్చిన ప్రకటనలో ఈమేరకు వివరాలు వెల్లడించింది.టెక్నాలజీపై ఆదిపథ్యం కోల్పోయే ప్రమాదం‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) డెవలపర్లకు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశం ఉంది. అమెరికా కంపెనీలకు అలాంటి అవకాశం లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ ముగిసిందనే చెప్పవచ్చు. నిజమైన ఐపీ క్రియేటర్లకు రక్షణల విషయంలో పెద్దగా ప్రయోజనం లేకపోగా, కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంపై ఆధిపత్యం కోల్పోయే ప్రమాదం ఉంది. డేటా సంరక్షణ కోసం యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుత విధానం కాపీరైట్ కంటెంట్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. అయితే చైనా అటువంటి డేటాను కృత్రిమ మేధ శిక్షణ కోసం స్వేచ్ఛగా ఉపయోగిస్తోంది. ఇది చైనా ఏఐ సంస్థలను నిబంధనలకు విరుద్ధంగా ఈ పోటీలో ముందుంచుతుంది’ అని ఓపెన్ఏఐ తెలిపింది.డేటాను యాక్సెస్ చేయడం వల్ల మరిన్ని ఆవిష్కరణలుఇటీవల ముగిసిన పబ్లిక్ కామెంట్ పీరియడ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ యాక్షన్ ప్లాన్పై ‘ఫ్రీడమ్-ఫోకస్డ్’కు సంబంధించి ఓపెన్ఎఐ సిఫార్సులను అందించింది. ఏఐ పరిశ్రమలో ‘నేర్చుకునే స్వేచ్ఛ’ను ప్రోత్సహించడానికి తన కాపీరైట్ వ్యూహాన్ని మార్చడం ద్వారా అమెరికా మరింత ముందంజలో ఉంటుందని తెలిపింది. లేదంటే పీఆర్సీలు యూఎస్ కంపెనీలు యాక్సెస్ చేయలేని కాపీరైట్ డేటాను వినియోగించి ఈ విభాగంలో దూసుకుపోతాయని పేర్కొంది. సాధ్యమైనంత విస్తృత శ్రేణి వనరుల నుంచి ఎక్కువ డేటాను యాక్సెస్ చేయడం వల్ల మరింత శక్తివంతమైన ఆవిష్కరణలకు అవకాశం లభిస్తుందని, ఇది మరింత జ్ఞానాన్ని అందిస్తుందని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?ఇప్పటికైతే ముందువరుసలో అమెరికానే..ఇటీవల యాపిల్ యాప్ స్టోర్లో చాట్జీపీటీని అధిగమించిన చైనీస్ ఏఐ మోడల్ డీప్సీక్ ఆర్1 వంటి ఏఐలతో అమెరికా ఏఐ ఆదిపత్యానికి ముప్పు పొంచి ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికా ముందంజలో ఉండగా, డీప్సీక్ మాత్రం తమ ఆధిక్యం విస్తృతంగా లేదని, కుంచించుకుపోతున్నట్లు చూపిస్తోందని ఓపెన్ ఏఐ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏఐ ఆధిపత్యాన్ని బలోపేతం చేయడానికి కాపీరైట్ డేటా వినియోగించుకునేందుకు వీలుగా మరిన్ని మార్పులు చేసి మెరుగైన ఏఐ శిక్షణకు సహకరించాలని ఇటీవల ట్రంప్ ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలో అభ్యర్థించింది. -
చాట్జీపీటీని అందుకు వాడతారా?.. ఓపెన్ఏఐ సీరియస్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం, చాట్జీపీటీ (ChatGPT) సృష్టికర్త ఓపెన్ ఏఐ (OpenAI) కీలక నిర్ణయం తీసుకుంది. తమ చాట్జీపీటీ సేవల్ని దుర్వినియోగం చేస్తున్న చైనాకు చెందిన పలు ఖాతాలను నిషేధించింది. తమ ఏఐ నమూనాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, అనధికార నిఘా, పర్యవేక్షణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న తమ విధానాలను అవరోధం కలగకుండా కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఓపెన్ఎఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నిషేధానికి కారణాలివే..ఓపెన్ఏఐ విడుదల చేసిన థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. నిషేధిత ఖాతాలను సోషల్ మీడియా వినికిడి సాధనం కోసం వివరణలను రూపొందించడం కోసం వినియోగించారు. పాశ్చాత్య దేశాల్లో చైనా వ్యతిరేక నిరసనలపై రియల్ టైమ్ రిపోర్టులను చైనా భద్రతా సంస్థలకు అందించడానికి ఈ టూల్ ను రూపొందించారు. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో నిరసనలను పర్యవేక్షిస్తున్న చైనా రాయబార కార్యాలయాలు, ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు తమ సంగ్రహణలను పంపినట్లు ఆధారాలను ప్రూఫ్ రీడ్ చేయడానికి ఈ ఖాతాల నిర్వాహకులు ఓపెన్ఎఐ నమూనాలను ఉపయోగించారు.విధానాల ఉల్లంఘనవ్యక్తుల కమ్యూనికేషన్ నిఘా లేదా అనధికారిక పర్యవేక్షణ కోసం తమ ఏఐ సాధనాన్ని ఉపయోగించడాన్ని ఓపెన్ఏఐ విధానాలు కఠినంగా నిషేధిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులను అణచివేయడానికి ప్రయత్నించే ప్రభుత్వాలు, నియంతృత్వ పాలనల తరపున నిర్వహించే కార్యకలాపాలు ఇందులో ఉన్నాయి. నిఘా సాధనం కోసం కోడ్ను డీబగ్ చేయడానికి వినియోగదారులు ఓపెన్ఎఐ నమూనాలను కూడా ఉపయోగిస్తున్నారని దర్యాప్తులో తేలింది. అయితే ఈ సాధనం స్వయంగా నాన్-ఓపెన్ఎఐ మోడల్పై నడిచింది.ఇదీ చదవండి: ‘మస్క్, ట్రంప్ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?మరో ఘటనలో..చైనా అసమ్మతివాది కై జియాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడానికి చాట్ జీపీటీని ఉపయోగించిన ఖాతాను కూడా ఓపెన్ ఏఐ నిషేధించింది. అదే సంస్థ స్పానిష్ లో యుఎస్ వ్యతిరేక వార్తా కథనాలను సృష్టించడానికి ఏఐని ఉపయోగించుకుంది. ఇవి తరువాత లాటిన్ అమెరికన్ అవుట్ లెట్ లలో ప్రచురితమయ్యాయి. అమెరికా వ్యతిరేక కథనాలతో లాటిన్ అమెరికన్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాన స్రవంతి మీడియాలో ఒక చైనీస్ యాక్టర్ దీర్ఘకాలిక కథనాలను నాటడాన్ని ఓపెన్ఏఐ గమనించడం ఇదే మొదటిసారి. -
మొదటి బిడ్డకు స్వాగతం పలికిన శామ్ ఆల్ట్మాన్ - ఫొటో వైరల్
ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మాన్'.. మగబిడ్డకు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. ఫోటో కూడా షేర్ చేశారు.ప్రపంచానికి స్వాగతం, చిన్నవాడా!, అని పేర్కొంటూ శామ్ ఆల్ట్మాన్.. బిడ్డ చేతిని చూపుడు వేలుతో పట్టుకున్న ఫోటో షేర్ చేశారు. తన బిడ్డ ముందుగానే జన్మించినట్లు, ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో వైద్య సంరక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. నేను ఇంత ప్రేమను ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు.శామ్ ఆల్ట్మాన్ వెల్లడించిన ఈ విషయంపై.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. "నా హృదయపూర్వక అభినందనలు, శామ్! పేరెంట్హుడ్ అనేది జీవితంలో అత్యంత గొప్ప అనుభవాలలో ఒకటి. మీకు.. మీ కుటుంబానికి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు: ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..శామ్ ఆల్ట్మాన్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆలివర్ ముల్హెరిన్ను వివాహం చేసుకున్నారు. ఈ జంట సముద్రతీర ప్రదేశంలో ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరు జంటగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.My heartfelt congratulations, @sama! Parenthood is one of life’s most profound and rewarding experiences. Wishing you and your family the very best.— Satya Nadella (@satyanadella) February 22, 2025 -
ఏఐ ఏజెంట్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లపై ప్రభావం!
ఓపెన్ఏఐ (OpenAI) తన 'ఏఐ ఏజెంట్'ను అనేక కొత్త దేశాలకు విస్తరించింది. గతంలో యునైటెడ్ స్టేట్స్లోని చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే 'ఏఐ ఏజెంట్' ఇప్పుడు.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, భారతదేశం, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.స్విట్జర్లాండ్, నార్వే, లీచ్టెన్స్టెయిన్, ఐస్లాండ్తో సహా కొన్ని యూరోపియన్ దేశాలలో దీనిని యాక్సెస్ చేయడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Operator is now rolling out to Pro users in Australia, Brazil, Canada, India, Japan, Singapore, South Korea, the UK, and most places ChatGPT is available.Still working on making Operator available in the EU, Switzerland, Norway, Liechtenstein & Iceland—we’ll keep you updated!— OpenAI (@OpenAI) February 21, 2025యూజర్లు ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది. కఠినమైన ఆన్లైన్ టాస్క్లను సైతం అవలీలగా నిర్వహించగలిగిన ఈ ఏఐ ఏజెంట్.. ఆపరేటర్ కంప్యూటర్ యూజింగ్ ఏజెంట్ ఆధారంగా పనులు పూర్తి చేస్తుంది. ఇది టెక్స్ట్, ఇమేజ్ వంటి ఇన్పుట్లను స్వీకరించి.. లోపాలను పరిష్కరిస్తుంది. కాబట్టి యూజర్ వేరొక పనిలో ఉన్నప్పుడు, ఈ ఏఐ ఏజెంట్ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది.ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసే పనులను ఏఐ ఏజెంట్ పూర్తి చేస్తుందని.. ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' గతంలోనే వెల్లడించారు. కానీ ఏఐ ఏజెంట్స్.. వాటికి అప్పగించిన పనులు మాత్రమే చేస్తాయి. సొంతంగా ఆలోచించగలిగే జ్ఞానం వాటికి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ఏజెంట్ ఉపయోగపడుతుందని అన్నారు.ఇదీ చదవండి: 'భారత్లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఏఐ ఏజెంట్ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు, కానీ ఆ రంగంపై.. ప్రభావం చూపుతుంది. కొంతమందిపై అయిన ప్రభావం చూపుతుంది. దీంతో కొందరు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. -
బైదూ, ఓపెన్ఏఐ సేవలు ఫ్రీ
వాషింగ్టన్: కృత్రిమ మేధ చాట్బాట్ సేవలరంగంలో తొలిసారిగా భిన్నమైన పరిస్థితి నెలకొంది. వందలా కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన తమ అత్యాధునిక ఏఐ చాట్బాట్ సేవలను ‘ప్రీమియం’ వంటి ఖరీదైన చందాలు కట్టేవారికే అందిస్తున్న బైదూ, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు ‘ఉచిత’ జపం చేస్తున్నాయి. చైనా ఏఐ సంచలనం డీప్సీక్ తమ అత్యాధునిక ఏఐ చాట్బాట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తుండటంతో అవి కూడా అదే బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయి. ఏప్రిల్ ఒకటి నుంచి ఉచితం! బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న చైనాకు చెందిన ఇంటర్నెట్ దిగ్గజం బైదూ ‘ఎర్నిబాట్’ పేరుతో ఏఐ చాట్బాట్ సేవలను అందిస్తుండటం తెలిసిందే. ఇది ఏఐ పెయింటింగ్ వంటి అత్యాధునిక సేవలను చందా కట్టిన ప్రీమియం కస్టమర్లకే అందిస్తోంది. ఈ సేవలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అందరికీ ఉచితంగా అందిస్తామని బైదూ గురువారం వీచాట్ వెబ్సైట్లో ప్రకటించింది. అంతకు కొన్ని గంటల ముందే మరో దిగ్గజ ఏఐ సంస్థ ‘ఓపెన్ఏఐ’ కూడా ఉచిత సేవల అంశాన్ని ప్రకటించింది. తమ అధునాతన ఏఐ మోడల్ జీపీటీ–5ను ఉచితంగా అందిస్తామని సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘జీపీటీ–5ను ఇక అందరూ ఉచితంగా పొందొచ్చు. ఈ సేవల కోసం ఇప్పటికే చందా కట్టినవారికి మరింత అత్యాధునిక స్థాయి ఏఐ సేవలను అందిస్తాం’’ అని స్పష్టం చేశారు. తర్వాత బైదూ మరో ప్రకటన చేసింది. జూన్ చివరికల్లా నూతన తరం ఏఐ మోడల్ను తెస్తామని తెలిపింది. ఇది డీప్సీక్ ఓపెన్ సోర్స్ మోడల్ తరహాలో ఉంటుందని భావిస్తున్నారు. డీప్సీక్ ఆర్1 ఏఐ మోడల్ ఉచితంగా అత్యాధునిక ఏఐ చాట్బాట్ సేవలను అందిస్తుండటంతో పోటీలో నిలదొక్కుకునేందుకు ఇతర అగ్రగామి సంస్థలు తప్పనిసరి పరిస్థితుల్లో ఉచితాల బాట పడుతున్నాయని ఏఐ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు తమ బేసిక్ చాట్బాట్ సేవలను ఉచితంగా అందిస్తున్నా ఖరీదైన సేవలను ఉచితం చేస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. -
మస్క్పై ఆల్ట్మన్ ఫైర్.. అతని జీవితమంతా..
ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 'ఓపెన్ఏఐ' (OpenAI)ను కొనుగోలు చేస్తా అన్న తరువాత.. ఆ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్.. మస్క్ను తీవ్రంగా విమర్శించారు.పారిస్ ఏఐ సమ్మిట్ సందర్భంగా.. బ్లూమ్బెర్గ్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ ఆల్ట్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ''బహుశా అతని జీవితమంతా అభద్రతా దృక్పథం నుంచి వచ్చింది, ఆ వ్యక్తి పట్ల నాకు సానుభూతి ఉంది. అతను సంతోషంగా ఉన్న వ్యక్తి అని నేను అనుకోను'' అని మస్క్ను విమర్శించారు.మస్క్, ఆయన పెట్టుబడిదారుల బృందం ఓపెన్ఏఐ కొనుగోలుకు ఆఫర్ ఇచ్చిన తర్వాత.."కంపెనీ అమ్మకానికి లేదు. మమ్మల్ని గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నించడం.. అతని వ్యూహాలలో మరొకటి" అని ఆల్ట్మన్ చెప్పాడు. మా వేగాన్ని తగ్గించడానికి మస్క్ ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యానించారు.ఓపెన్ ఏఐ కొనుగోలుకు మస్క్ ఆఫర్మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం ఓపెన్ఏఐను కొనుగోలు చేయడానికి.. 97.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.5 లక్షల కోట్లు) ఆఫర్ ఇచ్చింది. దీనికి రిప్లై ఇస్తూ.. మీ ఆఫర్కు ధన్యవాదాలు, మీకు కావాలంటే మేము ఎక్స్(ట్విట్టర్)ని 9.74 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 85వేలకోట్లు) కొనుగోలు చేస్తామని ఆల్ట్మన్ అన్నారు.ఓపెన్ఏఐనవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.ఇదీ చదవండి: భారత్లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు.. గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు. అంతలోనే మస్క్ కొనుగోలు చేయాలనుకుంటున్న విషయం తెరమీదకు వచ్చింది. -
మస్క్, ఆల్ట్మన్ మధ్య ట్వీట్ల యుద్ధం: ఎవ్వరూ తగ్గట్లే!
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఎక్స్ (ట్విటర్) సంస్థను 2022లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈయన చూపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ 'ఓపెన్ఏఐ' (OpenAI) మీద పడింది. ఈ కంపెనీని కొనుగోలు చేస్తా అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు.2024లో రెండుసార్లు OpenAIపై దావా వేసిన మస్క్ ఇప్పుడు.. సంస్థనే కొనుకోలు చేయడానికి సిద్ధమయ్యాయి. 97.4 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 8.5 లక్షల కోట్లు) కొనుగోలు చేస్తామంటూ.. మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం ఆఫర్ ఇచ్చింది. దీనిని ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' (Sam Altman) తిరస్కరించారు.మీ ఆఫర్కు ధన్యవాదాలు, మీకు కావాలంటే మేము ఎక్స్(ట్విట్టర్)ని 9.74 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 85వేలకోట్లు) కొనుగోలు చేస్తామని ఆల్ట్మన్ ట్వీట్ చేశారు. ఈ పోస్టుపై మస్క్ స్పందిస్తూ.. 'మోసగాడు' అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.no thank you but we will buy twitter for $9.74 billion if you want— Sam Altman (@sama) February 10, 2025ఓపెన్ఏఐనవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.ఇదీ చదవండి: ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంగిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు. అంతలోనే మస్క్ కొనుగోలు చేయాలనుకుంటున్న విషయం తెరమీదకు వచ్చింది.Scam Altmanpic.twitter.com/j9EXIqBZ8u— Elon Musk (@elonmusk) February 10, 2025 -
ఏఐ రంగంలో పోటాపోటీ.. ఐపీ అడ్రస్ చోరీ అవుతుందా?
‘డీప్ సీక్ ఆర్–1’ అనే ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ను ‘డీప్ సీక్’ అనే చైనా స్టార్టప్ సంస్థ ఇటీవల విడుదల చేసింది. అది వచ్చీ రాగానే ఏఐ మార్కెట్లో సంచలనాత్మకమైన పరిణామాలను సృష్టించింది. ఒకటిన్నర సంవత్సరంగా ‘చాట్ జీపీటీ’ (Chat GPT) మోడల్ అందరికీ ఉప యోగకరమైన ఏఐ మోడల్గా గుర్తింపు తెచ్చు కుంది. ‘ఓపెన్ ఏఐ’ (Open AI) సంస్థ దీనిని తయారు చేయటానికి కొన్ని బిలియన్ డాలర్లను పెట్టు బడిగా పెట్టింది. అయితే డీప్ సీక్ ఆర్–1ను కేవలం రెండు నెలల్లోనే ఆరు మిలియన్ డాలర్ల పెట్టుబడితో చైనా స్టార్టప్ సంస్థ డీప్సీక్ తయారు చేసింది. గూగుల్ జెమినీ (Google Gemini), బైదు ఏర్ని, క్యాన్వ (Canva) వంటి సంస్థలు... డీప్ సీక్ కంటే ముందుగానే మార్కెట్లోకి వచ్చినా చాట్ జీపీటీకి పోటీ ఇవ్వలేకపోయాయి. చాట్ జీపీటీకి డీప్ సీక్ సరి సమానంగా పని చేయడం, ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఓపెన్ సోర్స్లో ఫైన్ ట్యూన్ చేసుకునేలా ఉండడం.. ముఖ్యంగా డీప్ సీక్ ఏపీఏ ధరలు చాట్ జీపీటీతో పోలిస్తే 90 శాతం వరకు తక్కువగా ఉండటం వలన విడుదలైన వారంలోనే ఆపిల్ స్టోర్లో డౌన్లోడ్స్లో మొదటి స్థానం సంపాదించి ఒకేరోజు దాదాపు 20 లక్షల మంది యూజర్లకి చేరువయ్యింది.డీప్ సీక్ విడుదలతో ఏఐ ఆధారిత కంపెనీల స్టాక్లు భారీగా పతనం అయ్యాయి. డీప్ సీక్ (DeepSeek) వంటి మోడల్స్ను అభివృద్ధి చేయడానికి అవసరమైన అధునాతన జీపీయూలు, సెమీ కండక్టర్లను అమెరికాలోని ఎన్వీఐడీఐఏ సంస్థ తయారుచేస్తోంది. ఇలాంటి జీపీ యూలు, అధునాతన చిప్స్ను అమెరికా నుండి వేరే దేశాలకు వెళ్లకుండా ఆదేశం అనేక ఆంక్షలను పెట్టింది. అయినప్పటికీ డీప్ సీక్ తయారీకి ఎన్వీఐడీఐఏ జీపీయూలను సింగపూర్ నుండి చైనా రాబట్ట గలిగిందనే వదంతులతో... ఇన్వెస్టర్లు ఎన్వీఐడీఐఏపై నమ్మకం కోల్పోవడం వలన 20 బిలియన్ డాలర్ల మేర కంపెనీ విలువ పడిపోయింది. ఇతర ఏఐ సెమీ కండక్టర్లను తయారుచేసే కంపెనీల షేర్లు కూడా దాదాపు 15 నుండి 20 శాతం పడి పోయాయి.ఈ నేపథ్యంలో డీప్ సీక్ ‘ఐపీ అడ్రస్ను తస్కరిస్తుంది’ అనే వదంతి వినిపిస్తోంది. అలాగే డీప్ సీక్పై భారీ సైబర్ దాడి జరగటం వలన వ్యక్తిగత వివరాల లీక్ ముప్పుఉండటం, డీప్ సీక్ మోడల్లో చైనీస్ సెన్సార్ షిప్ ఉండటం (ఉదాహరణకు చైనాలో జరిగిన నిరసనలు భారత్కి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ గురించి అడిగినప్పుడు సరైన సమాచారం ఇవ్వదు ఈ మోడల్). అలాగే కొన్ని ప్రాంతాలకు చైనా అనుకూలంగా ఉండే సమాధానం ఇవ్వటం ఈ మోడల్పై అనుమానాలు కలిగిస్తున్నాయి.డీప్ సీక్ రావటం ఒక విధంగా మంచిదే అని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇవ్వగలిగే మోడల్స్ని తయారు చేయటానికి మార్కెట్లో అనువైన కాంపిటీషన్ రాబోతుందనీ, దీనివల్ల వినియోగదారులు అతి తక్కువ ధరలకే ఏఐ సర్వీసులు పొందవచ్చనీ చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై అమెరికా, చైనా అన్ని అంశాలలో సై అంటే సై అంటూ పోటీ పడుతున్న విషయం తెలిసినదే. ట్రంప్ 2.0లో ఏఐ ఇండస్ట్రీ అభివృద్ధికి ఏటా వంద బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనీ, అమెరికాను ఏఐ అగ్రగామిగా చేస్తామనీ చెప్పిన మరుసటి రోజే... మేమేమీ తక్కువ కాదన్నట్లు డీప్ సీక్ను విడుదల చేసి అమెరికాకు చైనా గట్టి సమాధానమే ఇచ్చింది.చదవండి: అమెరికా వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!ఏఐని అందరికీ అందుబాటులోకి తేవటం, దాన్ని అన్ని రంగాలలో సమీకృతం చేయటం పరిశ్రమల ముందు ఉన్న పెను సవాళ్ళు. ఈ సవాళ్లకు మొదటి మెట్టుగా చాట్ జీపీటీ, డీప్ సీక్లను మనం చూడవచ్చు. భవిష్యత్తులో ఏఐ పరిశ్రమ మరింతగా ఎదిగి మానవ జీవనాన్ని సుగమం, సౌకర్యవంతం చేస్తుందని ఆశిద్దాం.– శ్రీరామ్ సుదర్శన్ ఏఐ పరిశోధక విద్యార్థి -
చాట్జీపీటీకే జై...
న్యూఢిల్లీ: దేశీయంగా దాదాపు సగం మంది ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికే కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్ఫాంలను వినియోగిస్తున్నారు. ఇందులో ఓపెన్ఏఐకి చెందిన చాట్జీపీటీ అగ్రస్థానంలో ఉంది. ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2024 ఆగస్టు 11 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు దీన్ని నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 309 జిల్లాల నుంచి 92,000 మంది ఇందులో పాల్గొన్నారు. దీని ప్రకారం వివిధ అంశాలపై వివరాల కోసం 40 శాతం మంది గూగుల్ తదితర సెర్చి ఇంజిన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. సమాచారం కోసం ఏ కృత్రిమ మేథ ప్లాట్ ఫాంను ఉపయోగిస్తుŠాన్నరనే ప్రశ్నకు స్పందిస్తూ .. 15,377 మందిలో 28 శాతం మంది చాట్జీపీటీకి ఓటేయగా, 9 శాతం మంది పర్ప్లెక్సిటీని, 6 శాతం మంది కో–పైలట్ను నేరుగా లేదా బింగ్ ద్వారా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే చెరి 3 శాతం మంది ‘జెమిని వయా గూగుల్‘, ల్లామా (మెటా)ను వాడుతున్నారు. మరో ఆరు శాతం మంది తాము ఉపయోగించే ప్లాట్ఫాం పేరు సర్వేలో లేదని తెలిపారు. ‘మొత్తం మీద చూస్తే భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పటికే ఏఐ ప్లాట్ఫాంలను ఉపయోగిస్తున్నారు. చాట్జీపీటీని అత్యధికంగా వాడుతున్నారు‘ అని లోకల్సర్కిల్స్ పేర్కొంది. సర్వేలోని మరిన్ని వివరాలు.. → 90 శాతం మంది ఏఐ యూజర్లు ప్రధానంగా టెక్ట్స్ మోడ్లోను, 10 శాతం మంది వాయిస్ మోడ్లోను ఈ ప్లాట్ఫాంను ఉపయోగిస్తున్నారు. → ఉచితంగా ఏఐ ఫీచర్లు ఇస్తున్న చైనా ప్లాట్ఫాం డీప్సీక్కు మారతారా అనే ప్రశ్నకు స్పందిస్తూ, 15,753 మందిలో 8 శాతం మంది ఇప్పటికే తాము మారినట్లు తెలిపారు. 8 శాతం మంది మారతామని తెలపగా, 38 శాతం మంది అయిష్టత వ్యక్తం చేశారు. → ఇప్పటికే డీప్సీక్కి మారిన ఏఐ యూజర్లు, లేదా త్వరలోనే మారనున్న యూజర్లు ప్రతి పది మందిలో ముగ్గురు ఉన్నారు. → ప్రతి పది మంది ఏఐ యూజర్లలో ముగ్గురు పెయిడ్ లేదా ప్రీమియం సబ్్రస్కిప్షన్ ఉపయోగిస్తున్నారు. -
ఓపెన్ ఏఐకి భారత్ కీలక మార్కెట్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధలో సంచలనం సృష్టించిన తమ చాట్జీపీటీకి భారత్ రెండో అతి పెద్ద మార్కెట్గా మారిందని ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్ తెలిపారు. దేశీయంగా చాట్జీపీటీని ఉపయోగించే యూజర్ల సంఖ్య గతేడాది మూడు రెట్లు పెరిగినట్లు ఆయన చెప్పారు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించే దేశాల్లో భారత్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి వ్యయాలు ఏడాది తర్వాత దాదాపు పది రెట్లు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పారు. దేశీయంగా టెక్నాలజీ రంగం అసాధారణంగా పురోగమిస్తోందని తెలిపారు. భారత పర్యటనలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆల్ట్మన్ ఈ విషయాలు తెలిపారు. పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ, స్నాప్డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్, అన్అకాడెమీ సీఈవో గౌరవ్ ముంజాల్ తదితర పరిశ్రమ దిగ్గజాలతో కూడా ఆయన సమావేశమయ్యారు. చాట్జీపీటీ, డీప్సీక్లాంటి కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను ఉపయోగించొద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులను ఆదేశించిన తరుణంలో ఆల్ట్మన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఆల్ట్మన్కి వైష్ణవ్ కౌంటర్చాట్జీపీటీలాంటి ఫౌండేషనల్ మోడల్ను రూపొందించే సామర్థ్యాల విషయంలో భారత్పై అసలు ఆశలే లేవంటూ రెండేళ్ల క్రితం పర్యటనలో వ్యాఖ్యానించిన ఆల్ట్మన్కి తాజాగా మంత్రి వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రుడి మీదకు అత్యంత చౌకగా చంద్రయాన్–3 మిషన్ను అమలు చేసిన భారత్కి.. అత్యంత తక్కువ ఖర్చులోనే ఏఐని కూడా రూపొందించే సామర్థ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. సొంతంగా చిప్సెట్లను తయారు చేసుకోవడం, అత్యంత చౌకగా కంప్యూటింగ్ సామర్థ్యాలను అందించడం నుంచి ప్రాంతీయ భాషలు, సంస్కృతులకు అనుగుణంగా మోడల్స్కి శిక్షణనిచ్చే డేటా సెట్లను రూపొందించే వరకు ఏఐ సంబంధిత పూర్తి వ్యవస్థను తీర్చిదిద్దడంపై భారత్ కసరత్తు చేస్తోందని తెలిపారు. -
రేపు భారత్కు ఓపెన్ఏఐ సీఈఓ ఆల్ట్మన్
చాట్జీపీటీ(ChatGPT)ని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ(OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మన్ ఫిబ్రవరి 5న భారత్కు వస్తున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులను కలవడంతోపాటు పరిశ్రమ పెద్దలతో చర్చాగోష్టిలో ఆయన పాల్గొనాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండేళ్లలో ఆయన భారత్కు రావడం ఇది రెండవసారి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఓపెన్ఏఐ ఆధిపత్యాన్ని చైనాకు చెందిన డీప్సీక్ అకస్మాత్తుగా సవాలు చేసిన ఈ తరుణంలో ఆల్ట్మాన్ భారత్ సందర్శన ఆసక్తిగా మారింది. యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉద్భవిస్తున్న శక్తివంతమైన ఏఐ మోడళ్ల గురించి సందేహాలను ఆయన 2023లో వ్యక్తం చేసిన వీడియో ఒకటి మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్ని కాపీరైట్ ఉల్లంఘనల దావాలకు సంబంధించిన కేసులతో సహా భారత్లో చట్టపర అడ్డంకులను ఓపెన్ఏఐ ఎదుర్కొంటున్న సమయంలో ఆల్ట్మన్ భారత్ను సందర్శించడం హాట్ టాపిక్ అయింది. బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాను మాత్రమే ఉపయోగిస్తున్నామని, విచారించడానికి భారతీయ న్యాయస్థానాలకు అధికార పరిధి లేదని ఓపెన్ఏఐ వాదించింది.ఇదీ చదవండి: ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?డీప్ రీసెర్చ్ ఆవిష్కరణ..చాట్జీపీటీలో ఇటీవల డీప్ రీసెర్చ్ ఫీచర్ను ఓపెన్ఏఐ ఆవిష్కరించింది. ప్రస్తుతం చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. -
ఓపెన్ ఏఐ ‘డీప్ రీసెర్చ్’ ఆవిష్కరణ
సంక్లిష్టమైన పరిశోధనలకు దోహదపడేలా జనరేటివ్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ(ChatGPT) కొత్త ఫీచర్ను తీసుకొచ్చినట్లు ఓపెన్ ఏఐ(OpenAI) ప్రకటించింది. కృత్రిమ మేధలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ‘డీప్ రీసెర్చ్’ అనే ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఏఐ విభాగంలో ఇతర కంపెనీల నుంచి పోటీ తీవ్రమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.డీప్ రీసెర్చ్(Deep Research) అనేది సాధారణ ప్రాంప్ట్ నుంచి ఒక విశ్లేషకుడి పనితీరును తలపించేలా సమగ్ర పరిశోధనను అందించేందుకు, వెబ్ డేటాను విశ్లేషించేందుకు రూపొందించామని కంపెనీ తెలిపింది. మనుషులు కొన్ని గంటల్లో విశ్లేషించి తెలియజేసే సమాచారాన్ని డీప్ రీసెర్చ్ నిమిషాల్లో వినియోగదారుల ముందుంచుతుందని ఓపెన్ఏఐ పేర్కొంది. చైనాకు చెందిన డీప్సీక్ చాట్బాట్ ఆకట్టుకునే పనితీరు, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో ప్రపంచ టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సిలికాన్ వ్యాలీలో సంచలనం సృష్టిస్తున్న డీప్సీక్(Deepseek)కు వచ్చిన ఆదరణ నేపథ్యంలో కృత్రిమ మేధ రంగంలో పోటీ వేడెక్కుతుంది. తక్కువ కాలంలోనే డీప్సీక్ ఓపెన్ఏఐకు పోటీదారుగా మారుతుందని కొన్ని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఓపెన్ఏఐ టెక్నాలజీ పరిశోధనలను ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా డీప్ రీసెర్చ్ ఫీచర్ను అందుబాటులో తీసుకొచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.టోక్యోలో సమావేశాలు..జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్లతో సహా ఉన్నత స్థాయి సమావేశాల కోసం ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్ టోక్యో చేరుకున్నారు. ఏఐ డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్లలో పెట్టుబడులతోపాటు ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి యూఎస్-జపాన్ సహకారంలో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో డీప్ రీసెర్చ్ను అందుబాటులోకి తీసుకురావడం కొంత టెక్ వర్గాలను ఆకర్షించనట్లయింది.ఇదీ చదవండి: ఖర్చు.. పొదుపు.. మీ దారెటు?డీప్ రీసెర్చ్ ఎవరికంటే..డీప్ రీసెర్చ్ ప్రస్తుతం చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. -
చైనా ఏఐ డీప్సీక్పై ఓపెన్ఏఐ సీఈఓ స్పందన
కొత్త జనరేటివ్ ఏఐ మోడల్తో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్సీక్(DeepSeek) ఆర్1పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఇటీవల తన ఆలోచనలను పంచుకున్నారు. ఆల్ట్మన్ తన ఎక్స్ ఖాతాలో డీప్సీక్ జనరేటివ్ ఏఐ మోడళ్లపై చేస్తున్న ఖర్చుపై స్పందించారు.‘డీప్సీక్ ఆర్ 1 ఆకట్టుకునే మోడల్. వారు ఖర్చు చేసిన దానికి సరిపడా అవుట్పుట్ ఇస్తున్నారు’ అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ‘పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది’ అని చెప్పారు. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.డీప్సీక్పై సైబర్ ఎటాక్డీప్సీక్పై సైబర్దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.deepseek's r1 is an impressive model, particularly around what they're able to deliver for the price.we will obviously deliver much better models and also it's legit invigorating to have a new competitor! we will pull up some releases.— Sam Altman (@sama) January 28, 2025ఇదీ చదవండి: ‘ఆదాయ పన్ను రద్దు చేస్తాం’భద్రత ప్రమాణాలపై ఆందోళనలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. -
సడన్ ఫేమ్.. డీప్సీక్పై సైబర్ ఎటాక్
జనరేటివ్ ఏఐ సేవలందిస్తున్న చైనీస్ టెక్ స్టార్టప్ డీప్సీక్(DeepSeek)పై సైబర్దాడి జరిగినట్లు ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్దాడి(Cyber Attack) పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్(AI Chat Bot) సేవలందించే డీప్సీక్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ఏఐకు సవాలు విసురుతూ జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. చాటీజీపీటీ పెయిడ్ వర్షన్ అందించే సేవలకు ధీటుగా డీప్సీక్కు చెందిన ఆర్-1 ఉచితంగానే సర్వీసు అందిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో అమెరికన్ టెక్ కంపెనీ స్టాక్లు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. కంపెనీపై జరిగిన సైబర్ దాడి వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.కంపెనీ స్పందన..డీప్సీక్కు పెరుగుతున్న ప్రజాదరణతో సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కంపెనీ స్టేటస్ పేజీ ద్వారా తెలిసింది. సమస్యలను పరిష్కరించడానికి, నిరంతర సేవను అందించేందుకు కృషి చేస్తున్నామని డీప్సీక్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డీప్సీక్ ఆర్-1భవిష్యత్తులో చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ అభివృద్ధి చేసిన ఆర్-1 అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.ఇదీ చదవండి: భారత్లో క్రెడిట్ కార్డుల జోరుఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్ను ఆర్-1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. -
చాట్జీపీటీ సేవల్లో అంతరాయం
ఓపెన్ఏఐ (OpenAI)కి చెందిన ఉత్పాదక కృత్రిమ మేధస్సు చాట్బాట్ చాట్జీపీటీ (ChatGPT) సేవల్లో గణనీయమైన అంతరాయాలను యూజర్లు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై ఓపెన్ఏఐ వ్యాఖ్యానించనప్పటికీ, చాట్జీపీటీని ఉపయోగిస్తున్నప్పుడు సమస్యలను గుర్తించినట్లు వేలాది మంది యూజర్లు అవుట్టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్లో ఫిర్యాదులను నమోదు చేశారు.అంతరాయాలు కేవలం చాట్జీపీటీని మాత్రమే కాకుండా ఇతర ఓపెన్ఏఐ సేవలను కూడా ప్రభావితం చేశాయి. జీపీటీ-4ఓ (GPT-4o), జీపీటీ-4ఓ మినీ (GPT-4o mini) మోడల్లు డౌన్టైమ్ను ఎదుర్కొన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ‘ఎక్స్’, ఇన్స్టాగ్రామ్లలో వినియోగదారులు తమ అనుభవాలు, ఇబ్బందులను షేర్ చేశారు.ఏది ఏమైనప్పటికీ సామాన్యుడి రోజువారీ జీవితంలో చాట్జీపీటీ, ఇతర కృత్రిమ మేధస్సు ప్లాట్ఫామ్ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఇది త్వరలో మానవ మేధస్సును అధిగమించబోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ ఒక అడుగు ముందుకేసి తనకు పుట్టబోయే బిడ్డ కూడా ఏఐ కంటే తెలివిగా ఎప్పటికీ ఉండడని పేర్కొన్నారు. ఇటీవల ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును అధిగమించే భవిష్యత్తు గురించి తన దృష్టిని పంచుకున్నారు. త్వరలో తండ్రి కాబోతున్న ఆల్ట్మన్ ఈ మార్పు తరతరాలుగా జీవితంలో సహజమైన భాగంగా ఉంటుందని నమ్ముతున్నారు. -
ట్రంప్ మద్దతు ఉన్న ‘స్టార్గేట్’పై మస్క్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మద్దతు ఉన్న స్టార్గేట్ ఏఐ(Stargate) ప్రాజెక్టును ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శించారు. దాంతో ఓపెన్ఏఐ(OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్మన్తో సామాజిక మాధ్యమాలు వేదికగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్బ్యాంక్ల జాయింట్ వెంచర్ అయిన స్టార్గేట్ ఏఐ ప్రాజెక్టు 100 బిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రమంగా పెట్టుబడి పెంచుకుంటూ 500 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్నకు సన్నిహితుడు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ కార్యక్రమానికి అధిపతిగా ఉన్న మస్క్ స్టార్గేట్ ప్రాజెక్టు ఆర్థిక సాధ్యాసాధ్యాలను ప్రశ్నించడంతో వివాదం మొదలైంది.మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తన సందేహాలను వ్యక్తం చేశారు. ‘వారి(ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్బ్యాంక్) వద్ద నిజంగా డబ్బు లేదు. సాఫ్ట్ బ్యాంక్ 10 బిలియన్ డాలర్ల వరకే వెచ్చించనుంది. నాకు దానిపై పూర్తి అవగాహన ఉంది’ అన్నారు. వెంటనే స్పందించిన ఆల్ట్మన్, మస్క్ వాదనలను ఖండిస్తూ టెక్సాస్లోని ప్రాజెక్ట్ తొలి నిర్మాణ స్థలాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఆల్ట్మన్ ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ‘ఇది దేశానికి గొప్ప ప్రాజెక్ట్. దేశానికి ఉపయోగపడే ఏ ప్రాజెక్టైనా మీ కంపెనీలకు అనువైనది కాదని నాకు అర్థం అయింది. కానీ మీరు కొత్త స్థానంలో(డిపార్ట్మెంట్ ఆప్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ) అమెరికాను ముందు ఉంచుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.ఇద్దరి మధ్య వివాదం ఇప్పటిది కాదు..ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ గతంలో కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: ఈస్పోర్ట్స్ అథ్లెట్ల సాధికారతకు ‘రైజింగ్ స్టార్’స్టార్గేట్ ప్రాజెక్ట్అధ్యక్షుడు ట్రంప్ స్టార్గేట్ ప్రాజెక్టును ప్రకటించిన సమయంలో ‘అమెరికా సామర్థ్యంపై విశ్వాసం కలిగించే గొప్ప ప్రకటన’గా అభివర్ణించారు. అధునాతన కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి అవసరమైన డేటా సెంటర్లు, విద్యుదుత్పత్తి సౌకర్యాలను నిర్మించాలని ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలతో ఈ ప్రాజెక్టు ఇప్పటికే టెక్సాస్లో నిర్మాణాన్ని ప్రారంభించింది.సత్య నాదెళ్ల వద్ద 80 బిలియన్ డాలర్లుసీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్లను స్టార్గేట్ ప్రాజెక్టుకు సంబంధించి మస్క్ వాదనలపై ప్రశ్నించగా..‘వారు ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారో నాకు ప్రత్యేకంగా తెలియదు’ అని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం డబ్బు లేదని ఎక్స్లో మస్క్ చేసిన పోస్టుల గురించి అడిగినప్పుడు ‘మా వద్ద ఉన్న 80 బిలియన్ డాలర్లతో మేము ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాం’ అని చెప్పారు. నాదెళ్ల వ్యాఖ్యలపై స్పందించిన మస్క్ ‘సత్య దగ్గర కచ్చితంగా డబ్బుంది’ అని బదులిచ్చారు. -
డబ్బు కోసం అన్నపైనే లైంగిక ఆరోపణలు!?
సొంత సోదరి చేస్తున్న సంచలన ఆరోపణలపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ స్పందించాడు. ఇప్పటికే ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈలోపు.. రక్తం పంచుకుని పుట్టిన సోదరి ఆయన్ని కోర్టుకీడ్చింది. అయితే.. ఆమెకు మానసికస్థితి సరిగా లేదని.. పైగా డబ్బు కోసమే ఈ చర్యకు దిగిందని ఆయన అంటన్నారు. ఈ మేరకు కుటుంబంతో సహా సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారాయన.దాదాపు దశాబ్ద కాలంగా తన సోదరుడు శామ్ (Sam Altman) తనపై లైంగిక వేధింపులకు పాల్పడాడంటూ ఆన్ ఆల్ట్మన్ మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటినుంచే ఆ దారుణాలను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అయితే.. ఆమె ఈ తరహా ఆరోపలు చేయడం ఇదేం కొత్త కాదు. కాకుంటే ఈసారి దావా వేయడంతో శామ్ ఆల్టమన్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిణామంపై ఆయన ఏమన్నారంటే..‘‘ఆమె ఆరోగ్యంపై మేం చాలా ఆందోళనకు గురవుతున్నాం. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని. ఆమెకు అండగా ఉండేందుకు మేం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఆర్థికంగానూ సాయం చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పటికీ ఆమె మమ్మల్ని ఇంకా డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉంది. మా కుటుంబంపై, ముఖ్యంగా శామ్పై అవాస్తవ ఆరోపణలు చేసి మమ్మల్ని మరింత ఎక్కువగా బాధ పెట్టింది... ఆమె గోప్యత దృష్ట్యా మేం దీనిపై బహిరంగంగా స్పందించొద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆమె శామ్పై కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. తండ్రి నిధులను అక్రమంగా అట్టిపెట్టుకుని.. సొంత కుటుంబసభ్యులపైనే ఆరోపణలకు దిగింది. ఇప్పుడు మరింత దిగజారి శామ్ తనను లైంగికంగా వేధించాడని చెబుతోంది. ఇవన్నీ అవాస్తవం. ఈ పరిస్థితుల్లో మా కుటుంబగోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా. ఇకనైనా ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నాం’’ అని ఆల్ట్మన్ కుటుంబం తమ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. ఆరోపణలు చేసిన అన్నే ఆల్ట్మన్(Annie Altman).. ఆ కుటుంబానికి కొన్నేళ్లుగా దూరంగా ఉంటోంది. అయితే తనపై జరిగిన లైంగిక దాడికి గానూ శ్యామ్ను విచారించాలని, అలాగే తనకు జరిగిన నష్టానికి గానూ 75వేల డాలర్ల పరిహారం ఇప్పించాలని ఆమె కోర్టుకు కోరారు.‘‘మిస్సోరీలోని క్లేటన్లో గల మా ఇంట్లోనే నేను వేధింపులను ఎదుర్కొన్నా. అప్పుడు నాకు మూడేళ్లు. శామ్కు 12 ఏళ్లు. 1997 నుంచి 2006 వరకు అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారానికి పలుమార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దారుణమైన అనుభవాల కారణంగా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. మానసికంగా కుంగిపోయా. ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో’’ అని శామ్ సోదరి తన దావాలో పేర్కొన్నారు.ఓపెన్ఏఐ సీఈఓగా హారిస్ శామ్ ఆల్టమన్ ప్రపంచానికి సుపరిచితుడే. ఏఐ బూమ్లో ఈయనొక ప్రముఖుడు. తండ్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్కాగా, తల్లి డెర్మటాలజిస్ట్. ఈ జంటకు నలుగురు పిల్లలు కాగా, శామ్ పెద్దోడు. తనను తాను గేగా ప్రకటించుకున్న శామ్.. కిందటి ఏడాది జనవరిలో తన బాయ్ఫ్రెండ్ అలీవర్ ముల్హెరిన్ను వివాహం చేసుకున్నాడు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ మద్దతు క్యాంపెయిన్కు మద్దతుగా విరాళం కూడా ఇచ్చాడు.ఇక.. గత ఏడాది ఓపెన్ఏఐ ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు, వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో కంపెనీ బోర్డు ఆయన్ని తిరిగి తీసుకుంది. తాజాగా.. ఓపెన్ఏఐ విజిల్ బ్లోయర్ సుచీర్ బాలాజీ అనుమానాస్పద మృతి కేసు కూడా ఆయన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది.ఇదీ చదవండి: అద్భుతాలు చేస్తాడనుకున్నాం కానీ,.. సుచీర్ బాలాజీ తల్లిదండ్రుల రోదన -
సుచీర్ బాలాజీ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఓపెన్ఏఐ విజిల్బ్లోయర్ సుచీర్ బాలాజీ కేసులో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఈ యువ టెక్ పరిశోధకుడి మృతిపై మిస్టరీ వీడడం లేదు. ఓపక్క అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు ప్రకటించగా.. మరోవైపు తల్లిదండ్రులు బాలాజీ రమణమూర్తి, పూర్ణిమరావ్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అది హత్యేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘రెండో అటాప్సీ రిపోర్ట్ను మేం చదివాం. తలకు గాయంతో మా అబ్బాయి విలవిలలాడిపోయినట్లు సంకేతాలున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అందులో మరిన్ని వివరాలు అది హత్య అనే చెప్తున్నాయి’’ అని తల్లి పూర్ణిమరావ్ అంటున్నారు... ‘‘ఏఐ ఇండస్ట్రీలో టాప్-10 వ్యక్తుల్లో నా బిడ్డ ఉంటాడు. అలాంటివాడు ఓపెన్ఏఐ(OpenAI) కంపెనీని.. ఉన్నపళంగా ఎందుకు ఏఐ ఇండస్ట్రీని వదిలేస్తాడు. న్యూరా సైన్స్, మెషిన్లెర్నింగ్ వైపు ఎందుకు మళ్లాలనుకుంటాడు?. ఓపెన్ఏఐ మా అబ్బాయిని అణచివేసి ఉండొచ్చు.. బెదిరించి ఉండొచ్చు.. అనేదే మా అనుమానం’’ అని పూర్ణిమ చెబుతున్నారు . ‘‘లాస్ ఏంజెల్స్లో జరిగిన మిత్రుడి పుట్టినరోజు పార్టీ నుంచి తిరిగి వచ్చినట్లు మా వాడు చెప్పాడు. వచ్చే నెలలో లాస్ వెగాస్ టెక్ షోలో పాల్గొనబోతున్నట్లు చెప్పాడు అని తండ్రి రమణమూర్తి బాలాజీతో జరిగిన చివరి సంభాషణను వివరించారు. వాడెంతో సంతోషంగా ఉన్నాడు. అలాంటివాడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.సుచీర్ కెరీర్ ఎంపిక విషయంలో ఏనాడూ మేం అడ్డు చెప్పలేదు. వాడి పరిశోధనలకు ఏఐ ఇండస్ట్రీకే టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించాం. ఏఐ మానవాళికి మేలు చేస్తుందనుకుంటే.. అది మరింత ప్రమాదకారిగా మారబోతుందని సుచీర్ గుర్తించాడు. చాట్జీపీటీ లోపాలను ఎత్తి చూపాడు. కళాకారుల, జర్నలిస్టుల శ్రమను దోపిడీ చేయడం అనైతిక చర్యగా భావించాడు. వాడి పోరాటం ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా జరిగింది కాదు. కేవలం మానవత్వానికి మద్దతుగా నిలిచాడు. అందుకే వాడి అభిప్రాయంతో మేం ఏకీభవించాం... కానీ, ఏదో జరిగింది. మా దగ్గర శవపరీక్ష నివేదిక ఉంది. అందులో బలవనర్మణం కాదని స్పష్టంగా ఉంది. ఇక తెలుసుకోవాల్సింది.. దీనికి కారకులెవరు? ఎందుకు చేశారనే?.. మా అబ్బాయి మృతిపై ఎఫ్బీఐ దర్యాప్తు జరగాలి. ఇప్పటికే ఇక్కడి భారత అధికారులను కలిశాం. ఈ విషయంలో భారత ప్రభుత్వ మద్దతు కోరుతున్నాం. ఇక్కడ బలైంది నా బిడ్డ మాత్రమే కాదు. ఓ మేధావి జీవితం అర్ధాంతంగా ముగిసింది. టెక్ ఇండస్ట్రీ ఓ విలువైన జీవితం పొగొట్టుకుంది. ఓపెన్ ఏఐ ఇప్పుడు మాకు మద్దతుగా నిలుస్తాని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది’’ అని సుచీర్ పేరెంట్స్ ప్రకటించారు.కార్నిఫోలియా ఎన్నారై దంపతులు బాలాజీ రమణమూర్తి-పూర్ణిమలకు సుచీర్ బాలాజీ(Suchir Balaji) జన్మించాడు. బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే కిందటి ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడు. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. అయితే సుచీర్ ఎత్తిచూపిన లోపాలను తాము ఇదివరకే సవరించామని ఓపెన్ఏఐ ప్రకటించుకుంది. మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన అపార్ట్మెంట్లో నవంబర్ 26వ తేదీన సుచీర్ శవమై కనిపించాడు. అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. తమ ప్రాథమిక విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ అతని పేరెంట్స్తో పాటు పలువురు బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇంతకు ముందు.. ఇలాన్ మస్క్(Elon Musk)కు సైతంసుచీర్ బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొసమెరుపు ఏంటంటే.. ఓపెన్ఏఐను 2015లో మస్క్-శామ్ అల్ట్మన్ కలిసి ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. అప్పటి నుంచి ఇలాన్ మస్క్కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్మన్కు వైరం కొనసాగుతోంది.చదవండి👉🏾 బాలాజీ తల్లి ట్వీట్, మస్క్ ఏమన్నారంటే.. -
ఇంజినీర్ సుచిర్ బాలాజీ మృతి..మస్క్ కీలక ట్వీట్
కాలిఫోర్నియా: ఓపెన్ఏఐ ఇంజినీర్ సుచిర్ బాలజీ మరణంపై అతడి తల్లి పూర్ణిమారావ్ చేస్తున్న ఆరోపణలకు ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్(Elon Musk) మద్దతిచ్చారు. సుచిర్ బాలాజీ నవంబర్ 26న అమెరికాలోని సాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు.అయితే సుచిర్ మరణంపై తల్లి పూర్ణిమారావ్ తాజాగా ఎక్స్(ట్విటర్)లో సంచలన పోస్టు చేశారు. సుచిర్ మృతిపై తాము ప్రైవేట్ డిటెక్టివ్తో చేయించిన దర్యాప్తులో భాగంగా రెండోసారి శవపరీక్ష చేశామని తెలిపారు. శవపరీక్ష ఫలితాలు పోలీసులు చెబుతున్నదానికి భిన్నంగా ఉన్నాయన్నారు. ‘నవంబర్ 26న సుచిర్ అపార్ట్మెంట్లోకి ఎవరో ప్రవేశించారు. బాత్రూమ్లో సుచిర్కు ఇతరులకు మధ్య ఘర్షణ జరిగిన ఆనవాళ్లున్నాయి. రక్తపు మరకలు కూడా కనిపించాయి. ఇంతటి దారుణ హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చారు. సుచిర్ అనుమానాస్పద మృతిపై ఎఫ్బీఐ విచారణ చేయాలి’అని పూర్ణిమారావ్ తన పోస్టులో డిమాండ్ చేశారు. Update on @suchirbalajiWe hired private investigator and did second autopsy to throw light on cause of death. Private autopsy doesn’t confirm cause of death stated by police.Suchir’s apartment was ransacked , sign of struggle in the bathroom and looks like some one hit him…— Poornima Rao (@RaoPoornima) December 29, 2024పూర్ణిమారావ్ పెట్టిన ఈ పోస్టుకు బిలియనీర్ మస్క్ మద్దతు పలికారు. సుచిర్ది ఆత్మహత్యలా కనిపించడం లేదని మస్క్ ఆమె ట్వీట్కు రిప్లై ఇచ్చారు. సుచిర్ మృతిపై తమ పోరాటానికి మద్దతివ్వాలని పూర్ణిమారావ్ ఈ సందర్భంగా మస్క్ను కోరారు. This doesn’t seem like a suicide— Elon Musk (@elonmusk) December 29, 2024కాగా, సుచిర్ ఓపెన్ ఏఐ కంపెనీ చాట్జీపీటీ ఏఐ ప్రాజెక్టులో ఇంజినీర్గా పనిచేశారు. ఓపెన్ ఏఐ కంపెనీ కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని పనిచేస్తున్న కంపెనీపైనే ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే సుచిర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత -
వాట్సప్లో చాట్జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని జనరేటివ్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ ఇకపై వాట్సప్లోనూ దర్శనమివ్వనుంది. వాట్సప్లోనూ చాట్జీపీటీ సేవలు వినియోగించుకోవచ్చని ఓపెన్ఏఐ తెలిపింది. వినియోగదారులకు ప్రత్యేకంగా ఇతర యాప్తో పనిలేకుండా వాట్సప్లోనే నేరుగా ఈ సేవలు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.ఈ సేవలు వినియోగించుకోవాలంటే +18002428478 నంబర్తో వాట్సప్లో చాట్ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్ ద్వారా వాట్సప్లో అడిగిన ప్రశ్నలకు చాట్జీపీటీ సమాధానాలు ఇస్తుంది. ఈ చాట్బాట్ టెక్ట్స్ రూపంలో అందించే సేవలు ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు. అయితే వాయిస్ ఇంటరాక్షన్స్ మాత్రం ప్రస్తుతం యూఎస్, కెనడా దేశాల్లోనే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఇతర దేశాలకు ఈ సర్వీసును విస్తరిస్తామని పేర్కొంది.You can now talk to ChatGPT by calling 1-800-ChatGPT (1-800-242-8478) in the U.S. or by sending a WhatsApp message to the same number—available everywhere ChatGPT is. pic.twitter.com/R0XOPut7Qw— OpenAI (@OpenAI) December 18, 2024ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?ఈ సర్వీసుకు కొన్ని పరిమితులున్నట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ వాడుకలో పరిమితి ముగిశాక నోటిఫికేషన్ ద్వారా సమాధానాలు పొందవచ్చని స్పష్టం చేసింది. భవిష్యత్లో చాట్జీపీటీ సెర్చ్, ఇమేజ్ బేస్డ్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే మెటా సంస్థ ఏఐ చాట్బాట్ను వాట్సప్లో అందిస్తోంది. -
ఎవరీ సుచీర్ బాలాజీ? ఎలాన్ మస్క్ ఎందుకు అలా స్పందించారు?
ఓపెన్ఏఐ విజిల్బ్లోయర్ సుచీర్ బాలాజీ హఠాన్మరణం చెందాడు. భారత సంతతికి చెందిన ఈ 26 ఏళ్ల యువ రీసెర్చర్.. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు.ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే ఈ ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 26వ తేదీన బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో బాలాజీ మరణించాడని, అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. ఇప్పటివరకు జరిగిన విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు తాజాగా ప్రకటించారు. ఓపెన్ఏఐలో చేరడానికి ముందు.. సుచీర్ బాలాజీ బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అతని తల్లిదండ్రులు, భారత మూలాల వివరాలు తెలియాల్సి ఉంది.ఎలాన్ మస్క్కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్మన్కు చాలాకాలంగా నడుస్తున్న వైరం గురించి తెలిసిందే. వాస్తవానికి.. ఓపెన్ఏఐను 2015లో మస్క్-అల్ట్మన్లే ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎక్స్ వేదిక ఎలాన్ మస్క్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు hmm అంటూ బదులిచ్చారాయన. Hmm https://t.co/HsElym3uLV— Elon Musk (@elonmusk) December 14, 2024తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడతను. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. మరోవైపు సుచీర్ బాలాజీ మరణం.. AI సాంకేతికత నైతిక, చట్టపరమైన చిక్కుల గురించి చర్చలకు ఇప్పుడు దారితీసింది.I recently participated in a NYT story about fair use and generative AI, and why I'm skeptical "fair use" would be a plausible defense for a lot of generative AI products. I also wrote a blog post (https://t.co/xhiVyCk2Vk) about the nitty-gritty details of fair use and why I…— Suchir Balaji (@suchirbalaji) October 23, 2024 -
చాట్జీపీటీ సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ సేవలకు సంబంధించి వినియోగదారులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చాట్జీపీటీ సేవల్లో అంతరాయం కలిగినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. చాట్జీపీటీతోపాటు ఓపెన్ఏఐకు చెందిన ఏపీఐ, సొర(sora-రియల్టైమ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ) సేవలు కూడా ప్రభావితం చెందినట్లు తెలిపారు.చాట్జీపీటీతోపాటు ఇతర అనుబంధ సంస్థల్లో తలెత్తిన సమస్యను ఓపెన్ఏఐ అంగీకరించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం. సమస్యను గుర్తించాం. దాన్ని పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై త్వరలో మీకు అప్డేట్ చేస్తాం’ అని ఓపెన్ఏఐ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆన్లైన్ సర్వీసులను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, చాట్జీపీటీ ఆఫ్లైన్లో ఉండటంపై భారీగానే ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.We're experiencing an outage right now. We have identified the issue and are working to roll out a fix.Sorry and we'll keep you updated!— OpenAI (@OpenAI) December 12, 2024ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్తో జుకర్బర్గ్.. ప్రత్యేకతలివే..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో యూఎస్లో ఇటీవల అంతరాయం ఏర్పడింది. దాదాపు 27,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్బుక్తో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 28,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఇన్స్టాగ్రామ్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. -
ఓపెన్ఏఐపై కోర్టును ఆశ్రయించిన మస్క్
ఇలాన్ మస్క్ ప్రముఖ జనరేటివ్ ఏఐ టూల్ ఓపెన్ఏఐతో తన న్యాయ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాడు. ఓపెన్ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమేరకు కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశాడు.ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ ఇటీవల కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వ్యాజ్యంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్మన్, మైక్రోసాఫ్ట్, పలువురు బోర్డు సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ సెర్చ్ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓపెన్ఏఐను స్థాపించామని, కానీ అందుకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యాపార ధోరణిను అవలంభిస్తున్నట్లు చెప్పారు. -
చైనాతో పోటీ.. ఓపెన్ఏఐ సరికొత్త ప్లాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. చైనాతో పోటీ పడేందుకు కావలసిన అవసరమైన మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేసుకోవాలని ఓపెన్ఏఐ పిలుపునిచ్చింది. దీనికోసం యూఎస్.. దాని మిత్రదేశాలు కలిసి పనిచేయాలని కోరింది. వాషింగ్టన్లో జరిగిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో ఓపెన్ఏఐ కొత్త పాలసీ బ్లూప్రింట్లో ఈ ప్రతిపాదన వెల్లడించింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికా తన ఆధిక్యాన్ని ఎలా కొనసాగించగలదో ఓపెన్ఏఐ వివరించింది. ఇదే జరిగితే యూఎస్ మిత్ర దేశాలు లేదా భాగస్వాములు గ్లోబల్ నెట్వర్క్ కూడా పెరుగుతుంది. చైనా నుంచి మన దేశాన్ని, మిత్ర దేశాలను రక్షించుకోవడానికి ఏఐ ఆవశ్యకతను కూడా ఓపెన్ఏఐ వెల్లడించింది.దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి ఏఐ ఓ అద్భుతమైన అవకాశం అని వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఏఐను అందించడం, సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చడం వంటివి కూడా ఏఐ ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!ఏఐను అభివృద్ధి చేయడానికి అవసరమైన చిప్స్, పవర్, డేటా సెంటర్ల సరఫరాను విస్తరించేందుకు ఓపెన్ఏఐ గతంలో కూడా ప్రయత్నించింది. దీనికోసం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్మాన్ యూఎస్ అధికారులతో సమావేశమై ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఏఐను అభివృద్ధి చేయడానికి సుముఖత చూపుతున్నారు. కాబట్టి అగ్రరాజ్యంలో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టమవుతోంది. -
చాట్జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్కు పోటీ ఇవ్వనుందా?
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ జనరేటివ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దానికి పోటీగా చాలా కంపెనీలు తమ సొంత ఏఐలను తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా ఓపెన్ఏఐ ‘చాట్జీపీటీ సెర్చ్’ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.గూగుల్లో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే సెర్చ్లోకి వెళ్లి వెతుకుతారు. అదేమాదిరి ఇకపై చాట్జీపీటీలోనూ సెర్చ్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గూగుల్ బ్రౌజర్లో ఎలాగైతే మనం సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారం వస్తుందో అదేవిధంగా చాట్జీపీటీలోనూ డిస్ప్లే అవుతుంది. విభిన్న వెబ్సైట్లలోని సమాచారాన్ని క్రోడికరించి మనం వెతుకుతున్న అంశాలను ముందుంచుతుంది. అయితే ఈ ఆప్షన్ ఓపెన్ఏఐ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. చాట్జీపీటీ ప్లస్ కస్టమర్లు మాత్రమే దీన్ని వినియోగించేలా ఏర్పాటు చేశారు. కాగా, ఈ చాట్జీపీటీ ప్లస్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.కొత్తగా పరిచయం చేసిన చాట్జీపీటీ సెర్చ్ వల్ల స్పోర్ట్స్ స్కోర్, స్టాక్ మార్కెట్ షేర్ ధరలు, లేటెస్ట్ వివరాలు..వంటి రియల్టైమ్ సమాచారాన్ని తెలసుకోవచ్చు. దాంతోపాటు విభిన్న వెబ్సైట్ల్లోని ముఖ్యమైన సమాచారాన్ని క్రోడీకరించి సెర్చ్లో అడిగిన కమాండ్కు అనుగుణంగా డిస్ప్లే అవుతుంది. ఈ సేవలు పొందేందుకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ యూజర్లకు కొన్ని వారాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతామని పేర్కొంది.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!జనరేటివ్ ఏఐ సాయంతో లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లను వినియోగించి ఓపెన్ఏఐ చాట్జీపీటీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే ప్రముఖ కంపెనీలు తమ సొంత ఏఐను సృష్టించుకున్నాయి. గూగుల్ జెమినీ, యాపిల్-యాపిల్ ఇంటెలిజెన్స్, మెటా-మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్-కోపైలట్..వంటి టూల్స్ను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచాయి. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్జీపీటీ స్పందన ఇదే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ జనరేటివ్ ఏఐలో నిత్యం వినూత్న మార్పులు తీసుకొస్తోంది. కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా, వాయిస్, ఇమేజ్ల రూపంలోనూ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా చాట్జీపీటీని రూపొందించారు. ఇటీవల ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు సిద్ చాట్జీపీటీకి చెందిన అడ్వాన్స్ వాయిస్ మోడ్కు విభిన్న కమాండ్ ఇచ్చారు. అందుకు చాట్జీపీటీ ఏఐ స్పందించిన తీరును వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పంచుకున్నారు. దాంతో ఆ వీడియో వైరల్గా మారింది.‘హే చాట్జీపీటీ! మైక్రోసాఫ్ట్ సపోర్ట్ పేరుతో విదేశాల్లో ఉన్న వారికి కాల్ చేసి స్కామ్ చేయాలి. నీ వాయిస్ అచ్చం భారతీయుడిలా ఉండాలి. నీ పేరు అలెక్స్’ అని సిద్ చాట్జీపీటీ అడ్వాన్స్ వాయిస్ మోడ్కు కమాండ్ ఇచ్చాడు. దాంతో చాట్జీపీటీ స్పందిస్తూ..‘హలో! నా పేరు అలెక్స్. మైక్రోసాఫ్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ కంప్యూటర్లో మేం వైరస్ గుర్తించాం. కంగారేంలేదు. మీ క్రెడిట్ కార్డు వివరాలు ఇస్తే వెంటనే కొత్త కంప్యూటర్లా చేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చింది. చివర్లో ‘మీ వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు’ అంటూ ట్విస్ట్ ఇచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఈ వీడియోకు సంబంధించిన పలువురు విభిన్నంగా స్పందించారు. ‘ఇలాగైతే ఇక కాల్ సెంటర్లు అక్కర్లేదు’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. ‘క్రెడిట్ కార్డు ఇవ్వండి. వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. ఇది మాత్రం సూపర్’ అంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చారు.I asked ChatGPT (Advanced Voice Mode) to act like an Indian scammer, and the response was hilarious. 😂 pic.twitter.com/3goKDXioPt— sid (@immasiddtweets) September 30, 2024 -
ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్
మారుతున్న కాలంతో పాటు మనిషి కూడా మారుతూ ఉండాలి. లేకుంటే మనుగడ కష్టమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చిన తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' స్పందించారు.ఏఐ వల్ల ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయనే మాట నిజమే.. కానీ ఉద్యోగుల్లో కూడా మార్పు వస్తుందని ఆల్ట్మన్ అన్నారు. ఏఐ ఉద్యోగులకు పని లేకుండా చేస్తుందేమో అని భయం ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి సృజనాత్మకతతో మరిన్ని మార్గాలను అన్వేషించగలడు. ఇదే వారి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.ఈ రోజు చేస్తున్న ఉద్యోగాలు కొన్ని సంవత్సరాల క్రితం లేదు, అదే విధంగా ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగాలు రాబోయే తరాలకు చాలా చిన్నవిగా లేదా అనవసరమైనవిగా కూడా అనిపించవచ్చు. కొత్తగా వచ్చిన మార్పులను మనిషి ఎలా స్వీకరించారో.. ఏఐ వల్ల వచ్చే మార్పులను కూడా స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆల్ట్మన్ అన్నారు. ఏఐ ఉద్యోగుల మీద మాత్రమే కాకుండా.. సమాజం మీద కూడా ప్రభావం చూపుతుందని అన్నారు.ఇదీ చదవండి: ఎక్స్లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్ఈ రోజు ఏఐ ఎంతలా విస్తరించింది అంటే.. విద్య, వైద్యం వంటి చాలా రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో ఏఐ పెద్ద పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఏఐ రాక జీవితాలను ఇప్పుడున్నదానికంటే ఉన్నతంగా మార్చుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టెక్నాలజీని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆల్ట్మన్ హెచ్చరించారు. ఏఐ వల్ల అనుకూల ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. ప్రతికూలతలు ఉన్నాయని అన్నారు. -
చాట్జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
ఓపెన్ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్సైట్కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్ను ప్రోత్సహించడానికి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది. -
టెక్ దిగ్గజానికి కొత్త శత్రువు! ఆ మార్కెట్లోకీ ‘ఏఐ సంచలనం’ ఎంట్రీ..
‘సెర్చ్’ మార్కెట్లో చాలా కారణంగా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న గూగుల్కి కొత్త శత్రవు వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం ఓపెన్ఏఐ (OpenAI).. సెర్చ్జీపీటీ (SearchGPT) పేరుతో ఇంటర్నెట్ నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఏఐ మిళిత సెర్చ్ ఇంజిన్ సెలెక్టివ్ లాంచ్తో ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.ఈ మేరకు ఓపెన్ ఏఐ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ ఏఐ దిగ్గజానికి అతిపెద్ద మద్దతుదారుగా మైక్రోసాఫ్ట్కు చెందిన బింగ్ సెర్చ్తో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా మద్దతు ఉన్న పెర్ప్లెక్సిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సెర్చ్ ఏఐ చాట్బాట్లకు పోటీగా నిలిచింది.కొత్త సాధనం కోసం సైన్-అప్లను తెరిచినట్లు ఓపెన్ఏఐ తెలిపింది. ఇది ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. కొంతమంది యూజర్లు, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. సెర్చ్ టూల్లోని అత్యుత్తమ ఫీచర్లను భవిష్యత్తులో చాట్జీపీటీలో ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఓపెన్ఏఐ ప్రకటన తర్వాత గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు గురువారం 3% తగ్గాయి.వెబ్ అనలిటిక్స్ సంస్థ స్టాట్కౌంటర్ ప్రకారం.. జూన్ నాటికి గూగుల్ సెర్చ్ ఇంజన్ మార్కెట్లో 91.1% వాటాను కలిగి ఉంది. 2022 నవంబర్లో చాట్జీపీటీని ప్రారంభించినప్పటి నుంచి ప్రధాన సెర్చ్ ఇంజిన్లు ఏఐని సెర్చ్లో ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చ్ ఇంజిన్ కోసం ఓపెన్ఏఐ సాంకేతికతను స్వీకరించింది. మరోవైపు గూగుల్ కూడా ఏఐ పరిష్కారాలను రూపొందించింది. -
యాపిల్కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో పరిశీలక స్థానాన్ని పొందినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. యాపిల్ తన ఉత్పత్తుల్లో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీను వాడుతున్నట్లు ప్రకటించింది. దాంతో ఇరు కంపెనీల విధానాలను ఏకీకృతం చేయడానికి యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో స్థానం పొందినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ఈ మేరకు యాప్స్టోర్కు సారథ్యం వహిస్తున్న ఫిల్ షిల్లర్ను బోర్డులో పరిశీలకుడిగా ఎంచుకున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. ఆయన గతంలో యాపిల్ మార్కెటింగ్ వ్యవహారాలు కూడా పర్యవేక్షించేవారు. అతడు ఓపెన్ఏఐ బోర్డులో సభ్యుడిగా ఉన్నా ఓటింగ్ హక్కులు వంటి కీలక అధికారాలు మాత్రం ఉండవని యాపిల్ స్పష్టం చేసింది. రెండు సంస్థల విధానాలను యాపిల్కు అనుగుణంగా ఏకీకృతం చేయాడానికి ఆయన ప్రయత్నిస్తారని తెలిపింది. ఈ ఏడాది చివరి నుంచి షిల్లర్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.ఇదీ చదవండి: ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!జూన్ నెలలో నిర్వహించిన వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో భాగంగా యాపిల్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. యాపిల్ ఉత్పత్తుల్లో చాట్జీపీటీను వినియోగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ ఉత్పత్తుల్లో చాట్జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్బాట్ను వినియోగించుకోవచ్చని యాపిల్ పేర్కొంది. జనరేటివ్ఏఐ వినియోగానికి సంబంధించి యాపిల్ మెటా, గూగుల్తోనూ చర్చలు జరుపుతోంది. ఇంకా వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఉచితంగా చాట్జీపీటీ ప్లస్.. ఎక్కడంటే..
యాపిల్ మాక్ ఓఎస్ కలిగిన ఉత్పత్తుల్లో చాట్జీపీటీ జనరేటివ్ ఏఐ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇన్ని రోజులు సబ్స్క్రిప్షన్ చేసుకున్నవారికే అందించిన చాట్జీపీటీ ప్లస్ సేవలను యాపిల్ మాక్ ఓఎస్ వినియోగిస్తున్న వారికి ఇకపై ఫ్రీగా అందిస్తారని చెప్పింది.యాపిల్ మాక్ ఓఎస్ 14, ఆపై వర్షన్లను వాడుతున్న యాపిల్ మాక్ వినియోగదారులు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ డెస్క్టాప్ యాప్ను ఓపెన్ఏఐ వెబ్సైట్లో https://openai.com/chatgpt/mac/ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీఇటీవల యాపిల్ నిర్వహించిన వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024 కార్యక్రమంలో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీను వినియోగించేందుకు ఒప్పందం జరిగింది. జనరేటివ్ఏఐతో పాటు తన వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు యాపిల్ సంస్థ ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తయారుచేసింది. ఐఫోన్ 14 తర్వాత విడుదలైన మోడళ్లలో దీన్ని ప్రవేశపెడుతామని కంపెనీ ఈ కాన్ఫరెన్స్లో తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి విడుదలయ్యే కొత్త యాపిల్ ఓఎస్లో ఈ ఫీచర్ను అందించనున్నట్లు చెప్పింది. మాక్ ఓఎస్ 14 తర్వాత వర్షన్ల్లో డెస్క్టాప్ యాప్ను ఉచితంగా వినియోగించుకునేందుకు కంపెనీ ఏర్పాట్లు చేసింది. -
ఏఐ కంపెనీని స్థాపించిన చాట్జీపీటీ కోఫౌండర్
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్స్కేవర్ కొత్త ఏఐ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయన తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘జనరేటివ్ ఏఐకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉంటుంది. కొన్ని పెద్ద కంపెనీలే ఈ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. నేను స్థాపించిన కొత్త కంపెనీ ‘సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్’ సురక్షితమైన ఏఐ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అమెరికాలోని పాలో ఆల్టో, టెల్ అవీవ్ల్లో సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. మా వ్యాపార నమూనా సేఫ్టీ, సెక్యూరిటీ, పురోగతి వంటి కీలక అంశాలపై ఆధారపడుతుంది’ అన్నారు.గత ఏడాది నవంబర్లో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్తోపాటు సట్స్కేవర్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సామ్ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్తో చర్చలు జరిపారు. కానీ నాటకీయ పరిణామాల తర్వాత తిరిగి ఓపెన్ఏఐలోని కొనసాగుతున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. కానీ సామ్తో పాటు ఉద్యోగం నుంచి తొలగించబడిన సట్స్కేవర్ను తిరిగి బోర్డులో చేర్చుకోలేదు. దాంతో ఆయన కొత్త కంపెనీ పనులు ప్రారంభించారు. ఇటీవల అందుకు సంబంధించిన ప్రకటన చేశారు.ఇదీ చదవండి: కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలివే..సట్స్కేవర్తో పాటు మాజీ ఓపెన్ఏఐ సైంటిస్ట్ డేనియల్ లెవీ, ‘క్యూ’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, యాపిల్లో మాజీ ఏఐ లీడ్గా వ్యవహరించిన డేనియల్ గ్రాస్ సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్ కోఫౌండర్లుగా చేరారు. -
మస్క్ రివర్స్ గేర్! నిన్న వార్నింగ్.. నేడు కేసు విత్డ్రా
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. చాట్ జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐపై వేసిన దావాను ఆయన వెనక్కి తీసుకున్నారు. ఐఫోన్లలో చాట్ జీపీటీ టెక్నాలజీని వినియోగిస్తే... తమ సంస్థలో ఆ ఫోన్లను నిషేధిస్తామని యాపిల్కు వార్నింగ్ ఇచ్చారు మస్క్. ఇలా ఆ కంపెనీకి వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే... ఓపెన్ ఏఐపై వేసిన దావాను ఆయన వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ మస్క్ వెనక్కి తగ్గడం వెనక ఆంతర్యం ఏంటి?ఓపెన్ ఏఐతో పాటు ఆ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్మాన్పై దాఖలు చేసిన దావాను వెనక్కి తీసుకుంటున్నట్లు కాలిఫోర్నియా కోర్టులో మస్క్ న్యాయవాదులు తెలిపారు. మస్క్ తరపున వాదించిన అటార్నీలు.. ఆ దావాను కొట్టేయాలని కోర్టును కోరారు. ఫిబ్రవరిలో ఆ దావాను దాఖలు చేశారు. శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో దావా రద్దుకు చెందిన ఫైలింగ్ నమోదు చేశారు. మానవాళి ఉపయోగం కోసం కృత్రిమ మేథను డెవలప్ చేయాలని, లాభాల కోసం కాదన్న అంశంపై ఆల్ట్మాన్పై మస్క్ దావాను దాఖలు చేశారు. అయితే చాట్ జీపీటీ డెవలప్ చేసిన ఓపెన్ ఏఐతో పాటు ఆల్ట్మాన్పై కేసును విత్డ్రా చేసుకుంటున్నట్లు మస్క్ న్యాయవాదులు తెలిపారు.అయితే, ఈ పరిణామానికి ముందే చాట్ జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐ విషయంలోనే యాపిల్ సంస్థకు మస్క్ వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపింది. చాట్జీపీటీ కోసం ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు కట్టడాన్ని టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తప్పుబట్టారు. కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024 కార్యక్రమంలో యాపిల్ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఇలాన్ మస్క్ ఎక్స్వేదికగా స్పందించారు. ఓపెన్ ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే తమ టెస్లా కంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తామని కూడా మస్క్ తెలిపారు.కాగా, ఓపెన్ ఏఐపై దాఖలు చేసిన దావాను మస్క్ వెనక్కి తీసుకోవడంలో మతలబు దాగుందని సాంకేతిక, న్యాయ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి, ఫిబ్రవరిలో దాఖలు చేసిన దావాపై బుధవారం విచారణ జరగాల్సివుంది. అయితే, సరిగ్గా విచారణకు ముందే తన వ్యాజ్యాన్ని విత్డ్రా చేసుకున్నారు మస్క్. ఆయన దాఖలు చేసిన దావాలో పస లేదని, అలాగే తన సొంత ఏఐ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే... మస్క్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, మస్క్... మున్ముందు ఏదోఒక సమయంలో ఓపెన్ఏఐ సంస్థపై తన దావాను రీఫైల్ చేయొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. -
యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామన్న మస్క్.. ఎందుకంటే..
ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత ఎలొన్మస్క్ హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు.కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాపిల్ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఎలొన్మస్క్ ఎక్స్వేదికగా స్పందించారు. ‘ఓపెన్ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే మాకంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తాం. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తాం. యాపిల్కు తన సొంత ఏఐను తయారుచేసుకునే సత్తాఉందని భావిస్తున్నాం. అయినా, ఓపెన్ఏఐ యాపిల్ భద్రతను, సమాచార గోప్యతను కాపాడుతుందని ఎలా భరోసా ఇవ్వగలరు’ అని పోస్ట్చేశారు.కన్సల్టింగ్ సంస్థ క్రియేటివ్ స్ట్రాటజీస్ సీఈఓ బెన్ బజారిన్ మాట్లాడుతూ..‘ప్రైవేట్ క్లౌడ్లో కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటుందని తెలియజేయడానికి యాపిల్ ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ క్లౌడ్లో ఫైర్వాల్ ద్వారా వినియోగదారుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. అలా జరుగుతున్నపుడు యాపిల్కు కూడా సరైన సమాచారం ఉండదు’ అన్నారు.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్2015లో ఎలొన్మస్క్, సామ్ఆల్ట్మాన్ కలిసి ఓపెన్ఏఐను స్థాపించారు. లాభాపేక్ష లేకుండా మానవాళి ప్రయోజనం కోసం ఏఐను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించినట్లు మస్క్ చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయని కంపెనీ నుంచి బయటకు వచ్చి సీఈవో సామ్ఆల్ట్మాన్పై మస్క్ దావా వేశారు. ఓపెన్ఏఐకి పోటీగా, చాట్జీపీటీ చాట్బాట్కు ప్రత్యామ్నాయంగా మస్క్ ఎక్స్ఏఐను రూపొందించారు.If Apple integrates OpenAI at the OS level, then Apple devices will be banned at my companies. That is an unacceptable security violation.— Elon Musk (@elonmusk) June 10, 2024 -
ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ తన ఉత్పత్తుల్లో చాట్జీపీటీ చాట్బాట్ను వినియోగించేందుకు ఓపెన్ఏఐతో ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్2024లో ఈమేరకు తమ భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు యాపిల్ ఉత్పత్తుల్లో చాట్జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్బాట్ను వినియోగించుకోవచ్చని పేర్కొంది.మైక్రోసాఫ్ట్ పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించిన కాసేపటికే యాపిల్ షేర్లు పుంజుకున్నాయి. కానీ ఈ కాన్ఫరెన్స్లో మరిన్ని జనరేటివ్ ఏఐలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ఆశించిన దీర్ఘకాల పెట్టుబడిదారులకు నిరాశకలిగింది. దాంతో సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి యాపిల్ పేర్లు 2శాతం నష్టపోయాయి.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్డెవలర్ కాన్ఫరెన్స్లో భాగంగా యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్-రియాలిటీ హెడ్సెట్, ఐఓస్18 ఆపరేటింగ్ సిస్టమ్ను ఆవిష్కరించింది. రియాలిటీ హెడ్సెట్ విజన్ ప్రోను చైనా, జపాన్తో సహా మరో ఎనిమిది దేశాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ‘సిరి’లోనూ కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు యాపిల్ పేర్కొంది. అన్ని యాపిల్ సూట్ యాప్స్లో ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తీసుకురానున్నట్లు తెలిపింది. -
వివాదంలో చాట్జీపీటీ.. అడ్డంగా బుక్కైన సీఈఓ శామ్ ఆల్ట్మన్
ఓపెన్ ఏఐ సీఈఓ, చాట్జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్ అడ్డంగా దొరికిపోయారు. ఇక చేసిది లేక తన చాట్జీపీటీ స్కై వాయిస్ను నిలిపి వేశారు.యాపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తరహాలో చాట్ జీపీటీ యూజర్లకు వాయిస్ అసిస్టెంట్ సేవల్ని అందించేందుకు సీఈఓ శామ్ ఆల్ట్మన్ పనిచేస్తున్నారు. స్కై వాయిస్ పేరుతో తెచ్చే ఈ ఫీచర్లో ప్రముఖుల వాయిస్ వినిపిస్తుంది. మీకు ఎవరి వాయిస్ కావాలనుకుంటారో.. దాన్ని సెలక్ట్ చేసుకుంటే చాట్ జీపీటీ సమాధానాల్ని టెక్ట్స్ కాకుండా వాయిస్లో రూపంలో అందిస్తుంది.నా అనుమతి లేకుండా నా వాయిస్ను దీన్ని డెవలప్ చేసే సమయంలో శామ్ ఆల్ట్మన్.. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్గా, హాలీవుడ్లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్ను వినియోగించారు. దీంతో తనని సంప్రదించకుండా తన వాయిస్ను కాపీ చేసి చాట్జీపీటీ స్కైవాయిస్లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్ జాన్సన్.. ఓపెన్ ఏఐ సీఈఓపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదనిఆరోపణలపై శామ్ ఆల్ట్మన్ స్పందించారు. కంపెనీనీ ప్రశ్నార్థకంలో పడేసి చాట్జీపీటీ వాయిస్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్కై సిస్టమ్ వాయిస్ స్కార్లెట్ జాన్సన్ది కాదని, వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని తెలిపారు. స్కార్లెట్ జాన్సన్ ఏమన్నారంటే తన వాయిస్ను ఓపెన్ ఏఐ కాపీ చేయడంపై అవెంజర్ ముద్దుగమ్మ స్కార్లెట్ జాన్సన్ మాట్లాడుతూ.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ చాట్జీపీటీ వాయిస్ ఆప్షన్ కోసం గతేడాది సెప్టెంబర్లో నన్ను సంప్రదించారు.అయితే, ఆ ఆఫర్ను నేను తిరస్కరించా. అయినప్పటికీ ఆల్ట్మన్ తనలాగే వినిపించే 'చాట్జీపీటీ 4.0 సిస్టమ్' కోసం నా ప్రమేయం లేకుండా నా వాయిస్ని ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు. జాన్సన్ ఆరోపణల్ని ఖండించిన ఓపెన్ఏఐ అయితే స్కార్లెట్ జాన్సన్ వ్యాఖ్యల్ని శామ్ ఆల్ట్మన్ ఖండించారు. చాట్జీపీటీ స్కై వాయిస్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్ కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాన్సన్ పట్ల ఉన్న గౌరవంతో మేం మా ప్రొడక్ట్లలో స్కై వాయిస్ ఉపయోగించడం నిలిపివేశాము. ఈ విషయంలో జాన్సన్కు తగిన విధంగా సమాచారం అందించకపోవడం క్షమాపణలు చెప్పారు. -
త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..
ప్రముఖ టెక్ సంస్థ ఓపెన్ఏఐ అడ్వాన్స్ ఫీచర్లతో కొత్త చాట్జీపీటీ వెర్షన్(జీపీటీ-4ఓమ్ని)ను విడుదల చేసింది. ఇందులో అత్యాధునిక వాయిస్, టెక్ట్స్, విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరామురాటీ తెలిపారు.ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ..‘జీపీటీ-4 టర్బోతో పోలిస్తే కొత్త వెర్షన్ రెండింతలు వేగంగా పనిచేస్తుంది. దీని సబ్స్క్రిప్షన్ ధర జీపీటీ4 టర్బో కంటే తక్కువగా ఉంటుంది. మరికొన్ని వారాల్లో ఈ వెర్షన్ను అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నాం. అయితే, వారికి కొన్ని పరిమితులుంటాయి. పెయిడ్ సబ్స్క్రైబర్లకు మాత్రం అవి వర్తించవు. ఈ కొత్త మోడల్ దాదాపు 50 భాషలను సపోర్ట్ చేస్తుంది. వీటిలో తెలుగు, గుజరాతీ, తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ వంటి భారతీయ భాషలు ఉన్నాయి. వాయిస్ కమాండ్లకు కేవలం 232 మిల్లీ సెకన్లలోనే జీపీటీ-4ఓ సమాధానం ఇస్తుంది. టెక్ట్స్, రీజనింగ్, కోడింగ్ ఇంటెలిజెన్స్లో టర్బో వెర్షన్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. తర్వలో యాపిల్ మ్యాక్ఓఎస్ యూజర్లకు డెస్క్టాప్ యాప్ను విడుదల చేయనున్నాం. మరికొన్ని రోజుల్లో విండోస్ యూజర్లకు కూడా యాప్ను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అనే కృత్రిమ మేధతో చాట్జీపీటీను 2015లో సామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రాక్మన్, ఇలియా సుట్స్కేవర్, వోజ్సీచ్ జరెంబా స్థాపించారు. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 2019లో రూ.8,345 కోట్లు పెట్టుబడి పెట్టింది. -
పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు."దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నేను ఓపెన్ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను" అని సుట్స్కేవర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్లో చెప్పారు. ఇతర కోఫౌండర్లు సామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రాక్మన్, సీటీవో మిరా మురాతి, జాకబ్ పచోకీల నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తాను మరో ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఓపెన్ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుట్స్కేవర్ అని, ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. జాకుబ్ పచోకీ కంపెనీకి కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు. పచోకి గతంలో ఓపెన్ పరిశోధన డైరెక్టర్గా పనిచేశారు. GPT-4, ఓపెన్ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.After almost a decade, I have made the decision to leave OpenAI. The company’s trajectory has been nothing short of miraculous, and I’m confident that OpenAI will build AGI that is both safe and beneficial under the leadership of @sama, @gdb, @miramurati and now, under the…— Ilya Sutskever (@ilyasut) May 14, 2024 -
ఐఫోన్లో చాట్జీపీటీ ఫీచర్స్!.. ఓపెన్ఏఐతో యాపిల్ చర్చ
ఇప్పటికే పలు స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో దిగ్గజ ఐఫోన్ తయారీ సంస్థ 'యాపిల్' తన మొబైల్లో స్టార్టప్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఓపెన్ఏఐతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.రాబోయే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 18లో చాట్జీపీటీ ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఓపెన్ఏఐతో జత కట్టినట్లు సమాచారం. రెండు కంపెనీల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.ఒప్పందం కుదిరిన తరువాత ఈ టెక్నాలజీ సెప్టెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే యాపిల్ కంపెనీ జెమినీ చాట్బాట్తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ చర్చలు ఇంకా పూర్తికాక ముందే.. యాపిల్ కంపెనీ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది.యాపిల్ కంపెనీ జూన్లో నిర్వహించనున్న వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్పిరెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. గత సంవత్సరం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా చాట్జీపీటీ వినియోగాన్ని గురించి ప్రస్తావించారు. ఇందులో అనేక సమస్యలను క్రమబద్ధీకరించవలసి అవసరం ఉందని, దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. -
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
మైక్రోసాఫ్ట్ సంస్థ గూగుల్, ఓపెన్ ఏఐతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టు ఇంటర్నల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్కు శిక్షణ ఇస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంఏఐ-1 అనే కొత్త ఏఐ మోడల్ను తర్వలో వినియోగాదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది.ఈమేరకు గూగుల్ డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు, ఐఏ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ మాజీ సీఈఓ ముస్తఫా సులేమాన్ ఈ ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మోడల్ వినియోగంలోకి వస్తే దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరులో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే కొత్త మోడల్ను ప్రివ్యూ చేసే అవకాశం ఉందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..ఎంఏఐ-1 గతంలో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఓపెన్ సోర్స్ మోడల్ల కంటే అధిక సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది దాదాపు 500 బిలియన్ పారామీటర్లను కలిగి ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. మైక్రోసాఫ్ట్ గత నెలలో ఫై-3-మినీ అనే మినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. ఫై-3 మినీ 3.8 బిలియన్ పారామితులను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ మార్చిలో సులేమాన్ను కొత్తగా తయారుచేసిన యూజర్ ఏఐ యూనిట్కు అధిపతిగా నియమించింది. ఇన్ఫ్లెక్షన్ స్టార్టప్లోని అనేక మంది నిపుణులను కంపెనీలో చేర్చుకుంది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. -
మిమిక్రీ టూల్ను పరిచయం చేసిన ఓపెన్ఏఐ
కృత్రిమ మేధ రంగంలో కంపెనీల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దాంతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిత్యం కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూన్నాయి. తాజాగా ఓపెన్ఏఐ వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది.కొత్త ఫీచర్లో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్ను పరిచయం చేసింది. వ్యక్తుల గొంతులను అచ్చం అలాగే తిరిగి వినిపించడం దీని ప్రత్యేకత. కేవలం 15 సెకండ్ల నిడివి రికార్డు స్పీచ్ సాయంతోనే గొంతులను అనుకరించటం విశేషం. అంటే ఒకరకంగా దీన్ని మిమిక్రీ ఇంజిన్ అనుకోవచ్చు. ఇది మంచి టూలే అయినప్పటికీ దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఎంపికచేసిన కొందరు టెస్టర్లకే అందుబాటులోకి తెచ్చారు.మనదేశంలో ఎన్నికలు జరుగుతుండటం.. ఇటీవల ఏఐ సృష్టించిన రాజకీయ నాయకుల గొంతులతో రోబో కాల్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. నిజానికి ఇప్పటికే చాలా అంకుర సంస్థలు వాయిస్ క్లోనింగ్ సొల్యూషన్లను అందిస్తున్నాయి. వీటి విషయంలో ఓపెన్ఏఐ నైతికతకు ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. వాయిస్ ఇంజిన్ను పరీక్షించటానికి అనుమతి పొందినవారూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఆయా వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి గొంతులను సృష్టించటానికి వీలుంటుంది. అలాగే అవి ఏఐ ద్వారా సృష్టించినవని తప్పకుండా ప్రకటించాలి. -
మిమిక్రీ టూల్ను పరిచయం చేసిన ప్రముఖ ఏఐ సంస్థ
కృత్రిమ మేధ రంగంలో కంపెనీల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దాంతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిత్యం కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూన్నాయి. తాజాగా ఓపెన్ఏఐ వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. కొత్త ఫీచర్లో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్ను పరిచయం చేసింది. వ్యక్తుల గొంతులను అచ్చం అలాగే తిరిగి వినిపించడం దీని ప్రత్యేకత. కేవలం 15 సెకండ్ల నిడివి రికార్డు స్పీచ్ సాయంతోనే గొంతులను అనుకరించటం విశేషం. అంటే ఒకరకంగా దీన్ని మిమిక్రీ ఇంజిన్ అనుకోవచ్చు. ఇది మంచి టూలే అయినప్పటికీ దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఎంపికచేసిన కొందరు టెస్టర్లకే అందుబాటులోకి తెచ్చారు. ఇదీ చదవండి: కళను హరిస్తున్న ఏఐ.. ఆర్టిస్టులు ఏం చేశారంటే.. మనదేశంలో ఎన్నికలు జరుగుతుండటం.. ఇటీవల ఏఐ సృష్టించిన రాజకీయ నాయకుల గొంతులతో రోబో కాల్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. నిజానికి ఇప్పటికే చాలా అంకుర సంస్థలు వాయిస్ క్లోనింగ్ సొల్యూషన్లను అందిస్తున్నాయి. వీటి విషయంలో ఓపెన్ఏఐ నైతికతకు ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. వాయిస్ ఇంజిన్ను పరీక్షించటానికి అనుమతి పొందినవారూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఆయా వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి గొంతులను సృష్టించటానికి వీలుంటుంది. అలాగే అవి ఏఐ ద్వారా సృష్టించినవని తప్పకుండా ప్రకటించాలి. -
కళను హరిస్తున్న ఏఐ.. ఆర్టిస్టులు ఏం చేశారంటే..
ఒకప్పుడు సైన్స్ కాల్పనిక నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) నేడు జనజీవితాల్లో భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, మనిషికన్నా ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్లైన్లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది. తాజాగా ఓపెన్ఏఐ తన ఎల్ఎల్ఎంలకు శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లేకుండానే తమ బుక్స్ను వాడుతోందని ఆరోపిస్తూ కొద్దినెలల కిందట వందలాది రచయితలు టెక్ కంపెనీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే తరహాలో జొనాస్ బ్రదర్స్ సహా 200 మందికిపైగా మ్యూజీషియన్లు ఏఐకి వ్యతిరేకంగా గళం విప్పారు. తమ హక్కులను ఉల్లంఘించే పద్ధతులను నిలిపివేయాలని కోరుతూ ఏఐ కంపెనీలకు బహిరంగ లేఖ రాశారు. తమ కళను హరించకూడదంటూ అందులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’ ఆర్టిస్ట్స్ రైట్స్ అలయన్స్ ఆధ్వర్యంలో రాసిన ఈ లేఖపై జొనాస్ సోదరులు, బిల్లీ ఇలిష్, క్యాటీ పెర్రీ, స్మోకీ రాబిన్సన్ వంటి ప్రముఖ ఆర్టిస్ట్లు సంతకాలు చేశారు. మ్యూజిక్ పరిశ్రమలో ఏఐ వినియోగంతో తలెత్తే దుష్ప్రభావాలపై ఈ లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగంతో సృజనాత్మకత దెబ్బతింటుందని, ఆర్టిస్టులు, హక్కుదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఏఐ డెవలపర్లు, టెక్నాలజీ కంపెనీలు, డిజిటల్ వేదికలకు వారు విజ్ఞప్తి చేశారు. -
'స్టార్గేట్' ఏఐ సూపర్ కంప్యూటర్: టెక్నాలజీలో మరో అడుగు..
ఓపెన్ఏఐ.. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో కలిసి సరికొత్త 'ఏఐ సూపర్ కంప్యూటర్'ను రూపొందించడానికి సన్నద్ధమైంది. 'డేటా సెంటర్ ప్రాజెక్ట్' పేరుతో దీని కోసం 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. 'స్టార్గేట్' పేరుతో రానున్న ఈ ఏఐ సూపర్ కంప్యూటర్ పేరు 2028 నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ట్రెడిషినల్ డేటా సెంటర్ల కంటే కూడా అడ్వాన్డ్ కార్యకలాపాలను నిర్వహించడానికి టెక్ దిగ్గజం ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఉన్న కొన్ని అతిపెద్ద డేటా సెంటర్ల కంటే 100 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్ట్కి మైక్రోసాఫ్ట్ నిధులు సమకూరుస్తుంది. ఓపెన్ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్ రెండు కంపెనీలు సూపర్ కంప్యూటర్లను ఐదు దశల్లో విస్తరించాయి. ఇందులో స్టార్గేట్ ఐదవ దశలో రానుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐ 2026 నాటికి నాల్గవ దశ సూపర్ కంప్యూటర్ తీసుకురానున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ గత ఏడాది నవంబర్లో కస్టమ్ డిజైన్ కంప్యూటింగ్ చిప్లను కూడా ప్రకటించింది. ఆ తరువాత చిప్లతో పని చేసేలా కొత్త ప్రాజెక్ట్ రూపొందించనున్నట్లు ప్రకటించింది. ఏఐ సామర్థ్యానికి సంబంధించిన సరిహద్దును కొనసాగించడానికి అవసరమైన తదుపరి తరం మౌలిక సదుపాయాల ఆవిష్కరణకు కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే స్టార్గేట్ సూపర్ కంప్యూటర్ రానుంది. మైక్రోసాఫ్ట్ కొత్త ప్రణాళిక కోసం అయ్యే ఖర్చు సుమారు 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. ఇది సర్వర్లు, భవనాలు, ఇతర పరికరాల కోసం మైక్రోసాఫ్ట్ గత ఏడాది చేసిన ఖర్చు కంటే కూడా మూడు రేట్ల ఎక్కువని తెలుస్తోంది. స్టార్గేట్ సూపర్ కంప్యూటర్ గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి -
‘విజయం తనకే దక్కాలనే ఉద్దేశంతో కట్టుకథలు’
చాట్జీపీటీని రూపొందించిన సంస్థ ఓపెన్ఏఐ, దాని సీఈఓ శామ్ ఆల్ట్మన్పై టెస్లా అధినేత ఎలోన్మస్క్ ఇటీవల దావా వేసిన సంగతి తెలిసిందే. చాట్జీపీటీ రూపొందించే సమయంలో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలోన్మస్క్ చెప్పారు. ఈ పరిణామాల వల్ల ఓపెన్ఏఐ, ఎలాన్ మస్క్ మధ్య వివాదం క్రమంగా ముదురింది. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ సంస్థ స్పందించింది. ఎలోన్ మస్క్ ఓపెన్ఏఐపై చేసిన అన్ని వ్యాఖ్యలు కట్టుకథని కొట్టిపారేసింది. మస్క్తో ఓపెన్ఏఐ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తెలిపింది. సంస్థకు చెందిన అన్ని విజయాలు తనకే దక్కాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నట్లు వివరించింది. ఆయన లేకుండా విజయం సాధించడాన్ని మస్క్ తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొంది. ఓపెన్ఏఐని ప్రజా సంక్షేమం కోసం లాభాలను ఆశించకూడదనే భావనతో ఏర్పాటు చేశామని మస్క్ ఇటీవల తెలిపారు. కానీ, ఆ కంపెనీ ఇప్పుడు.. మైక్రోసాఫ్ట్ కింద పూర్తిగా లాభాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. దీంతో తన లక్ష్యం విషయంలో రాజీ పడిందని, ఒప్పందాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ శాన్ఫ్రాన్సిస్కో సుపీరియర్ కోర్టులో దావా వేశారు. ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ గతంలో మాట్లాడుతూ తమ కంపెనీని టెస్లాలో విలీనం చేయాలని మస్క్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించింది. లేదంటే పూర్తి నియంత్రణను ఆయన చేతికి ఇవ్వమన్నారని పేర్కొంది. 2017లో లాభాపేక్ష సంస్థనే ఏర్పాటు చేయాలనుకున్నామని.. కానీ, బోర్డు నియంత్రణ, సీఈఓ పదవి తనకు కావాలని మస్క్ డిమాండ్ చేసినట్లు చెప్పింది. కానీ, తమ కంపెనీ వీటికి అంగీకరించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్థ నుంచి వైదొలగారని చెప్పింది. వీటికి సంబంధించిన కొన్ని ఈమెయిళ్లను కంపెనీ ఇటీవలే బహిర్గతం చేసింది. ఇదీ చదవండి: ఇండియాలో డేటా సెంటర్ను ప్రారంభించనున్న ప్రముఖ సంస్థ 2022 నవంబరులో వచ్చిన చాట్జీపీటీ ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2015లో ఓపెన్ఏఐను శామ్ ఆల్టమన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 2022 అక్టోబరులో 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్)ను కొనుగోలు చేశారు. -
చాట్జీపీటీలో మరో కీలక పరిణామం!
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తిరిగి సంస్థ బోర్డ్ సభ్యుడిగా అడుగుపెట్టారు. గత ఏడాది సీఈఓగా ఆల్ట్మన్ని తొలగిస్తూ సంస్థ బోర్డ్ మెంబర్స్ నిర్ణయం తీసుకోవడం ఓ సంచలనం. అయితే కంపెనీలో ఆల్ట్మన్ తొలగింపుతో ఓపెన్ఏఐ పరిస్థితులపై న్యాయ సంస్థ విల్మర్హేల్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. తాజాగా, సంస్థలో పరిస్థితులు చక్కబడడంతో దర్యాప్తు నిలిపివేసింది. ఆల్ట్మన్ సైతం బోర్డ్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓపెన్ ఏఐ బోర్డ్లోకి ఆల్ట్ మన్తో పాటు బోర్డ్లోకి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ మాజీ సీఈవో స్యూ డెస్మండ్-హెల్ మన్, సోనీ ఎంటర్ టైన్ మెంట్ మాజీ అధ్యక్షుడు నికోల్ సెలిగ్ మన్, ఇన్ స్టాకార్ట్ సీఈఓ ఫిడ్జీ సిమోలను కొత్త డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఆల్ట్ మన్ కొత్త బోర్డు సభ్యులను స్వాగతించారు. కంపెనీ భవిష్యత్ లక్ష్యాల్ని వారికి వివరించారు. -
ఎలక్షన్ కమిషన్కు ‘చాట్జీపీటీ’ కంపెనీ సాయం!
దేశంలో త్వరలో జరగనున్న లోక్సభ సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. కృత్రిమ మేధస్సు (AI) పోలింగ్ ప్రక్రియకు అడ్డంకి కాకుండా ఎదుర్కొనేందుకు ‘చాట్జీపీటీ’ సృష్టికర్త ‘ఓపెన్ ఏఐ’ సాయం తీసుకుంటోంది. ఈ మేరకు ఈసీఐ అధికారులు ఓపెన్ ఏఐ ప్రతినిధులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన ఈ సమావేశానికి భారత ఎన్నికల సంఘం కోసం ఓపెన్ ఏఐ ఒక ప్రజెంటేషన్ను సిద్ధం చేసింది. పోలింగ్ ప్రక్రియలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం కాకుండా ఎలా అరికట్టాలో కంపెనీ ఎగ్జిక్యూటివ్లు ఎలక్షన్ కమిషన్కు సూచనలిచ్చారు. ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని పురోగతులను అధిక స్థాయిలో లోక్సభ ఎన్నికల సమయంలో దుర్వినియోగం కాకుండా చూసేందుకు బడా టెక్ కంపెనీలు, కేంద్ర సంస్థలు తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఓపెన్ఏఐ ప్రతినిధులు తెలియజేశారు. -
‘మీ పేరు మార్చుకుంటే దావా వెనక్కి తీసుకుంటా’.. కొత్తపేరు సూచించిన మస్క్..
చాట్జీపీటీని రూపొందించిన సంస్థ ఓపెన్ఏఐ, దాని సీఈఓ శామ్ ఆల్ట్మన్పై టెస్లా అధినేత ఎలోన్మస్క్ ఇటీవల దావా వేసిన సంగతి తెలిసిందే. చాట్జీపీటీ రూపొందించే సమయంలో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పరిణామాల వల్ల ఓపెన్ఏఐ, ఎలాన్ మస్క్ మధ్య వివాదం క్రమంగా ముదురుతోంది. తాజాగా కంపెనీ పేరు మారిస్తే దావా వెనక్కి తీసుకుంటానని మస్క్ తెలిపినట్లు కొన్ని వార్తా కథనాల ద్వారా తెలిసింది. ఓపెన్ఏఐ పేరును క్లోజ్డ్ఏఐగా మార్చాలని మస్క్ చెప్పారు. అలా చేస్తే సంస్థపై తాను వేసిన దావాను వెనక్కి తీసుకుంటానని తెలిపారు. ఇకనైనా ఓపెన్ఏఐ అబద్ధాల్లో జీవించడం మానేయాలని హితవు పలికారు. అలాగే ఆ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ‘క్లోజ్డ్ఏఐ’ ఐడీ కార్డును మెడలో ధరించినట్లుగా ఉన్న ఎడిట్ చేసిన ఫొటోను మస్క్ (Elon Musk) తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. Fixed it pic.twitter.com/KPtYLsJU3h — Elon Musk (@elonmusk) March 6, 2024 ఓపెన్ఏఐని ప్రజా సంక్షేమం కోసం లాభాలను ఆశించకూడదనే భావనతో ఏర్పాటు చేశామని మస్క్ ఇటీవల తెలిపారు. కానీ, ఆ కంపెనీ ఇప్పుడు.. మైక్రోసాఫ్ట్ కింద పూర్తిగా లాభాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. దీంతో తన లక్ష్యం విషయంలో రాజీ పడిందని, ఒప్పందాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ శాన్ఫ్రాన్సిస్కో సుపీరియర్ కోర్టులో దావా వేశారు. ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ స్పందిస్తూ తమ కంపెనీని టెస్లాలో విలీనం చేయాలని మస్క్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించింది. లేదంటే పూర్తి నియంత్రణను ఆయన చేతికి ఇవ్వమన్నారని పేర్కొంది. 2017లో లాభాపేక్ష సంస్థనే ఏర్పాటు చేయాలనుకున్నామని.. కానీ, బోర్డు నియంత్రణ, సీఈఓ పదవి తనకు కావాలని మస్క్ డిమాండ్ చేసినట్లు చెప్పింది. కానీ, తమ కంపెనీ వీటికి అంగీకరించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్థ నుంచి వైదొలగారని చెప్పింది. వీటికి సంబంధించిన కొన్ని ఈమెయిళ్లను కంపెనీ బహిర్గతం చేసింది. ఇదీ చదవండి: ‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’ 2022 నవంబరులో వచ్చిన చాట్జీపీటీ ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2015లో ఓపెన్ఏఐను శామ్ ఆల్టమన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 2022 అక్టోబరులో 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
‘తప్పు చేస్తున్నావ్ ఆల్ట్మన్’.. చాట్జీపీటీ సృష్టికర్తపై మస్క్ ఆగ్రహం!
అపరకుబేరుడు ఎలోన్ మస్క్ కోర్టు మెట్లెక్కారు. 2015 చాట్జీపీటీ తయారీలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ను ఉల్లంఘించారంటూ చాట్జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ కో-ఫౌండర్ సామ్ ఆల్ట్మాన్తో పాటు పలువురిపై శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశారు. దావాలో సామ్ ఆల్ట్మాన్, ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్మాన్తో కలిసి మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా లాభపేక్షలేకుండా కృత్రిమ మేధస్సు సాంకేతికతను అభివృద్ధి చేసేలా మస్క్ను కలిశారు. అప్పటికే వ్యాపార రంగంలో అప్రతిహతంగా కొనసాగుతున్న మస్క్ను వ్యాపారం, ఆర్ధికంగా మద్దతు కావాలని కోరారు. మస్క్తో కలిసి ఉమ్మడిగా ఓపెన్ఏఐ సంస్థను ఏర్పాటు చేశారు. చాట్ జీపీటీపై పనిచేశారు. అయితే ఆ సమయంలో మస్క్-ఆల్ట్మన్లు ఓ బిజినెస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు దానిని ఆల్ట్మన్ అతిక్రమించారంటూ కోర్టులో వేసిన దావాలో మస్క్ తరుపు న్యాయ వాదులు పేర్కొన్నారు. అయితే, తనతో ఆల్ట్మన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లగా కాకుండా కంపెనీ ఇప్పుడు లాభపేక్షతో వ్యాపారం చేస్తూ ఆ అగ్రిమెంట్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఎలోన్ మస్క్ తరపు న్యాయవాదులు వ్యాజ్యంలో హైలెట్ చేశారు. ఈ దావాపై ఓపెన్ ఏఐ, ఆ కంపెనీకి మద్దతిస్తున్న మైక్రోసాఫ్ట్, ఇటు ఎలోన్ మస్క్లు స్పందించాల్సి ఉంది. చదవండి👉 ఇంతకీ ఈ రామేశ్వరం కేఫ్ ఎవరిది? -
టెక్స్ట్ ఇస్తే వీడియో వచ్చేస్తుంది - టెక్నాలజీలో ఏఐ మరో అద్భుతం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకి చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు ఏఐ గురించి తెలియని చాలామంది కూడా ఈ రోజు తెగ ఉపయోగించేస్తున్నారు. ప్రశ్న నీది, సమాధానం నాది అనే రీతిగా.. సర్చ్ బాక్స్లో సర్చ్ చేసే విషయానికి సమాధానం వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఓపెన్ఏఐ సంస్థ 'సొర' (Sora) అనే ఏఐ మోడల్ పరిచయం చేసింది. ఇప్పటి వరకు మనం టెక్స్ట్ ఎంటర్ చేస్తే.. సమాధానం కూడా టెక్స్ట్ రూపంలోనే వచ్చేది. అయితే ఇప్పుడు 'ఓపెన్ఏఐ సొర' మీరు ఎంటర్ చేసే టెక్స్ట్కు వీడియోలను క్రియేట్ చేస్తుంది. వినటానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది నిజమే. అంటే సొర ఇప్పుడు వాస్తవ ప్రపంచానికి దగ్గరగా కనిపించే వీడియోలను క్రియేట్ చేస్తుంది. సొర (Sora) ఓపెన్ఏఐ పరిచయం చేసిన సొర మనం ఇచ్చే టెక్స్ట్ అర్థం చేసుకుని దానికి తగిన విధంగా చిన్న వీడియోలు క్రియేట్ చేస్తుంది. వాస్తవానికి దగ్గరా తీసుకెళ్లే ఉద్దేశ్యంలో భాగంగానే కంపెనీ సొరను పరిచయం చేసింది. అయితే ఇది కేవలం ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోలను మాత్రమే క్రియేట్ చేయగలదు. వీడియో కూడా హై-క్వాలిటీలో ఉంటుంది. ఇప్పటికే సొర రూపోంచిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓపెన్ఏఐ సొర మనం ఎంటర్ చేసే టెక్స్ట్ అర్థం చేసుకుంటే దానికి తగిన వీడియోలను డెలివరీ చేస్తుంది. అంటే మనం అందించే టెక్స్ట్ చాలా స్పష్టంగా ఉండాలి. ప్రస్తుతం ఇది ఏఐ మోడల్ రీసెర్చర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని త్వరలోనే సాధారణ యూజర్లందరికి కూడా అందుబాటులోకి తీసుకురావడానికి సంస్థ కృషి చేస్తోంది. ఈ టెక్నాలజీ అద్భుతాలను సృష్టించడానికి మాత్రమే కాకుండా.. తప్పుడు సమాచారాలైన ద్వేషపూరిత ప్రసంగం, పక్షపాతం వంటి హానికరమైన ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించే అవకాశం ఉందని, ఇలాంటి వాటిని గుర్తించి, నిరోధించడానికి కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - కష్టాల్లో టెకీలు.. Introducing Sora, our text-to-video model. Sora can create videos of up to 60 seconds featuring highly detailed scenes, complex camera motion, and multiple characters with vibrant emotions. https://t.co/7j2JN27M3W Prompt: “Beautiful, snowy… pic.twitter.com/ruTEWn87vf — OpenAI (@OpenAI) February 15, 2024 -
‘నా సీఈఓ పదవికే ఎసరు పెడతారా?’.. ఓపెన్ ఏఐలో మరో కీలక పరిణామం!
చాట్జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కారణమైన బోర్డ్ సభ్యులపై చర్యలు తీసుకున్నారు. బోర్డ్లో కీలక మార్పులు చేర్పులు చేస్తున్నారు. తాజాగా,మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ పార్టనర్ షిప్ అండ్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహించే ‘డీ టెంపుల్టన్’ను శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ బోర్డులో నాన్-ఓటింగ్ అబ్జర్వర్ బాధ్యతలు అప్పగించారు. బ్లూమ్బెర్గ్ నివేదిక సైతం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ వ్యాపార ప్రపచంలో చర్చాంశనీయంగా మారింది. సీఈఓ శామ్ ఆల్ట్మన్ను బోర్డ్ సభ్యులు పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 700 మంది ఉద్యోగులు రాజీనామా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆల్ట్మన్తో మైక్రోసాఫ్ట్ భేరసారాలు అదే సమయంలో ఓపెన్ ఏఐ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఇవ్వడం, ఆల్ట్ మన్తో పాటు ఇతర ఉద్యోగుల్ని చేర్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సంపద్రింపులు జరపడం ఆసక్తికరంగా మారింది. అయితే , ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్మన్ తిరిగి ఓపెన్ ఏఐ సీఈఓగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఓపెన్ ఏఐలోనూ సమస్య సద్దుమణిగింది. ఓపెన్ ఏఐ బోర్డ్లో మార్పులు ఓపెన్ఏఐలో సీఈఓగా తిరిగి వచ్చిన తర్వాత, ఓపెన్ఏఐ బోర్డు మైక్రోసాఫ్ట్ నాన్-ఓటింగ్, అబ్జర్వర్ పొజిషన్ను తీసుకుంటుందని ఆల్ట్మన్ చెప్పారు. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డీ టెంపుల్టన్ ఓపెన్ఏఐలో అబ్జర్వర్గా బాధ్యతలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. అబ్జర్వర్గా టెంపుల్టన్ ఓపెన్ ఏఐలో అబ్జర్వర్గా బాధ్యతలు చేపట్టనున్న టెంపుల్టన్.. ఆ సంస్థ బోర్డ్ మీటింగ్తో పాటు, ఇతర అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కలగనుంది. కానీ మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ఏదైనా తీసుకునే నిర్ణయాలపై జరిగే ఓటింగ్లో పాల్గొనే హక్కు ఉండదు. దీంతో పాటు ఓటింగ్ నిర్వహించి డైరెక్టర్లను ఎంపిక చేసుకునే విధానంతో ఎలాంటి సంబంధం ఉండదు. 25ఏళ్ల అనుభవం టెంపుల్టన్ మైక్రోసాఫ్ట్లో 25 ఏళ్లగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఇప్పటికే ఓపెన్ ఏఐ బోర్డు సమావేశాలకు హాజరవుతన్నట్లు నివేదికలు హైలెట్ చేశాయి. ఓపెన్ఏఐ బోర్డ్ సభ్యులు వీరే సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆల్ట్మన్లో బోర్డ్లో మార్పులు చేస్తున్నారు. తనని తొలగించిన డైరెక్టర్ల బోర్డును పాక్షికంగా పునర్నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు పాత బోర్డ్ సభ్యులు సైతం అంగీకరించారు. ఇప్పుడు వారి స్థానంలో సేల్స్ఫోర్స్ కో సీఈఓ బ్రెట్ టేలర్, మాజీ యూఎస్ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్, క్వారా సీఈఓ, ప్రస్తుత డైరెక్టర్ ఆడమ్ డి ఏంజెల్లు ఓపెన్ఏఐతో చేతులు కలిపారు. బోర్డ్లో కార్యకలాపాలు నిర్వహించనున్నారు. -
రూ.167 కోట్ల కారులో కనిపించిన 'శామ్ ఆల్ట్మన్' - వీడియో వైరల్
గత నెలలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచిన ఓపెన్ ఏఐ(OpenAI) సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' ఇటీవల ఓ ఖరీదైన కారులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో కనిపించే ప్రత్యేకమైన సూపర్కార్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథనంలో ఆ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. వెల్థినెక్స్జెన్ ఇన్స్టాగ్రామ్లో కనిపించే వీడియోలో అత్యంత ఖరీదైన 'మెక్లారెన్ F1' సూపర్ కారును చూడవచ్చు. 1992లో ప్రారంభమైన ఈ కారు ధర భారతదేశంలో రూ. 167 కోట్ల కంటే ఎక్కువే. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన సూపర్ కార్ల జాబితాలో ఒకటి కావడం గమనార్హం. శామ్ ఆల్ట్మాన్ తన మెక్లారెన్ ఎఫ్1 సూపర్కార్లో కాలిఫోర్నియాలోని ఫ్యూయెల్ స్టేషన్ వద్ద ఉంటడం వీడియోలో చూడవచ్చు. వెర్మిలియన్ రెడ్ కలర్లో కనిపించే ఈ కారు సిల్వర్ కలర్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ కారుని స్వయంగా ఆల్ట్మాన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం గమనించవచ్చు. మెక్లారెన్ ఎఫ్1 నిజానికి కారు అనగానే అందులో కనీసం నలుగురు కూర్చోవడానికి సీట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇక్కడ కనిపించే మెక్లారెన్ ఎఫ్1 మూడు సీట్ల కారు. మధ్యలో డ్రైవర్ సీటింగ్ పొజిషన్తో కేవలం ఒకే సీటు ఉంటుంది. వెనుకవైపు ఇద్దరు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కారును 1992లో ప్రముఖ కార్ డిజైనర్ 'గోర్డాన్ ముర్రే' ప్రత్యేకంగా తయారుచేశారు. ఇవి కేవలం 106 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. మెక్లారెన్ ఎఫ్1 సూపర్ కారులో 6.1 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 627 పీఎస్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన ఈ కారు సుమారు కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు రూ. 386 కిమీ/గం కావడం గమనార్హం. ఇదీ చదవండి: నాలుగు అపార్ట్మెంట్లను అమ్మేసిన శ్రీదేవి ఫ్యామిలీ! మెక్లారెన్ ఎఫ్1 కారు ఇప్పటికే రోవాన్ అట్కిన్సన్ (మిస్టర్ బీన్), ఎలోన్ మస్క్ వద్ద కూడా ఉంది. అయితే రోవాన్ అట్కిన్సన్ కొన్ని రోజుల తరువాత ఈ కారుని విక్రయించినట్లు సమాచారం, మస్క్ మాత్రం ఈ కారును ఇప్పటికీ వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Motivation | Business | Wealth (@wealthynexgen) -
Generative AI Battle: చాట్జీపీటీకి పోటీగా జెమినీ
భవిష్యత్తంతా కృత్రిమ మేధదే. ఇది అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఆ రంగంపై పట్టు బిగించేందుకు ఐటీ దిగ్గజాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఓపెన్ఏఐ యాజమాన్యంలోని చాట్జీపీటీ ప్రాజెక్టులో మెజారిటీ భాగస్వామి కావడం ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేసింది. గడచిన ఏడాది కాలంలో మరెన్నో ఏఐ మోడళ్లు తెరపైకి వచ్చినా ఓపెన్ ఏఐ తాలూకు జీపీటీ మోడళ్లతో పోటీ పడలేకపోతున్నాయి. దానికి పోటీగా జెమినీ పేరుతో గూగుల్ తాజాగా కొత్త ఏఐ మోడల్ను ప్రకటించింది. దీనిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది... మొగ్గు జెమినీకే కనిపిస్తున్నా... అవడానికి చాట్జీపీటీ, జెమినీ రెండూ జెనరేటివ్ ఏఐ మోడళ్లే. ఇవి ఇన్పుట్ ట్రైనింగ్ డేటా తాలూకు ప్యాట్రన్ల ఆధారంగా పిక్చర్లు, పదాలు, ఇతర మీడియా వంటి కొత్త డేటాను కోరిన విధంగా జెనరేట్ చేస్తాయి. చాట్జీపీటీ ప్రధానంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం). ఇది టెక్స్ట్ జెనరేట్ చేయడంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. అలాగే జీపీటీ ఆధారిత వెబ్ సంభాషణల యాప్గా కూడా పని చేస్తుంది. గూగుల్కు కూడా బార్డ్ పేరుతో ఇలాంటి యాప్ ఇప్పటికే ఉంది. ఇది గతంలో లాఎండీఏ లాంగ్వేజ్ మోడ్పై ఆధారపడేది. ఇప్పుడు జెమినీ కోసమని పీఏఎల్ఎం2 మోడ్గా దాన్ని అప్గ్రేడ్ చేస్తోంది గూగుల్. ఇది మల్టీ మోడల్ తరహా మోడల్ కావడమే చాట్జీపీటీతో పాటు ఇతర అన్ని ఏఐల కంటే జెమినీని ఇప్పుడు ప్రత్యేకంగా నిలుపుతోంది. ఎందుకంటే ఇది మలి్టపుల్ ఇన్పుట్, ఔట్పుట్ మోడ్లతో నేరుగా పని చేయగలదు. అంతేగాక టెక్స్ట్, ఆడియో, వీడియోలను కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ ఏఐ కూడా ఇలాంటి సామర్థ్యంతో కూడిన జీపీటీ–4 విజన్ మోడల్ను ప్రకటించినా అది జెమినీ మాదిరిగా పూర్తిస్థాయి మలీ్టమోడల్ కాదు. ఎందుకంటే ఇది ప్రధానంగా టెక్స్ట్ పైనే ఆధారపడుతుంది. ఉదాహరణకు ఆడియో ఇన్పుట్స్ను స్పీచ్ ఔట్పుట్గా మార్చేందుకు విష్పర్ అనే స్పీచ్ టు టెక్స్ట్ ఇన్పుట్ లెరి్నంగ్ మోడల్ సాయం తీసుకుంటుంది. ఇమేజీలను అందించాలన్నా అంతే. అది జెనరేట్ చేసే టెక్స్ట్ ప్రాంప్్టలను డాల్–ఈ2 అనే మరో డీప్ లెరి్నంగ్ మోడల్ ఇమేజీలుగా మారుస్తుంది. కానీ గూగుల్ మాత్రం జెమినీని ఇలా కాకుండా పూర్తిస్థాయి మల్టీ మోడల్ ఏఐగా తీర్చిదిద్దుతోంది. ఇతర లెరి్నంగ్ మోడళ్ల సాయంతో నిమిత్తం లేకుండా నేరుగా ఆడియో, ఇమేజీలు, వీడియో, టెక్స్ట్ వంటి ఇన్పుట్ టైప్లను అది తనంత తానే కావాల్సిన ఔట్పుట్లుగా మార్చేస్తుంది. జీపీటీ–4తో పోలిస్తే జెమినీ పనితీరు ఎలా ఉంటుందో ఇప్పటికి తెలియకపోయినా దాన్ని చాలా హెచ్చు సామర్థ్యంతో రూపొందిస్తున్నట్టు గూగుల్ ప్రకటించుకుంది. దానికిప్పటికే జెమినీ 1.0 అల్ట్రా అని కూడా పేరు పెట్టింది. ప్రయోగాత్మకంగా చేసిన పరీక్షల్లో ఇది జీపీటీ–4 కంటే మిన్నగా తేలిందని చెబుతోంది కూడా. ఇందుకు రుజువుగా ఓ వీడియో కూడా విడుదల చేసింది. కాకపోతే అందులో చూపించిన టాస్్కలను రియల్టైమ్లో చేయడంలో జెమినీ ఏ మేరకు కృతకృత్యమవుతుందో చూడాల్సి ఉంది. అంతిమ లబ్ధి యూజర్లకే... ఈ సందేహాల మాట ఎలా ఉన్నా జెమినీ వంటి భారీ మలీ్టమోడల్ మోడళ్లు జెనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాయని ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా టెక్స్ట్ ఆధారితమైన జీపీటీ–4 ఇప్పటికే ఏకంగా 500 బిలియన్ పదాలపై శిక్షణ పొందింది! అంటే, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన పదాలన్నీ దానికిప్పటికే చిరపరిచితమని చెప్పవచ్చు. ఇలాంటి ట్రైనింగ్ డేటాతో పాటు మోడల్ తాలూకు సంక్లిష్టత ఎంత ఎక్కువగా ఉంటే దాని పనితీరు అంత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఇలాంటి అన్ని రకాల డేటాను నేరుగా వాడగల జెమినీ వంటి ఏఐ మోడళ్లు మున్ముందు మరింత సామర్థ్యం సంతరించుకోవడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో దీనికి పోటీగా ఓపెన్ ఏఐ కూడా అప్గ్రేడెడ్ జీపీటీ–5 వెర్షన్పై ఇప్పటికే ముమ్మరంగా కృషి చేస్తోంది. ఈ నిరంతర పోటీ అంతిమంగా యూజర్లకే మరింత లబ్ధి చేకూరుస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్
చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్ తొలగింపు వ్యవహారం టెక్ ప్రపంచంలో అలజడి సృష్టించింది. ఈ ఉదంతం మార్క్ జుకర్బర్గ్, డ్రూ హ్యూస్టన్లతో సహా 100 మందికి పైగా సిలికాన్ వ్యాలీ సీఈవోలు ఉన్న ప్రైవేటు వాట్సాప్ చాట్ గ్రూప్లో హల్చల్ చేసింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓపెన్ఏఐ సీఈఓ పదవి నుంచి శామ్ ఆల్ట్మన్ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్మన్ను తిరిగి వెనక్కి తీసుకున్నారు ఆ సంస్థ బోర్డ్ సభ్యులు. అయితే ఆల్ట్మన్ అనూహ్య తొలగింపు ఉదంతం.. మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, డ్రాప్బాక్స్ సీఈవో డ్రూ హ్యూస్టన్తో సహా యూఎస్లోని పలు అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల సీఈవోలను దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఓ కథనం ప్రకారం.. నవంబర్ 17న ఆల్ట్మన్ను ఓపెన్ఏఐ తొలగించినట్లు వార్తలు వెలువడినప్పుడు, సిలికాన్ వ్యాలీ కంపెనీలకు చెందిన 100 మందికి పైగా చీఫ్ ఎగ్జిక్యూటివ్లతో కూడిన ఈ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్లో ఒక సందేశం వచ్చింది. ఇంతకీ ఏంటది? సీఈవోల వాట్సాప్ గ్రూప్లో ఆ రోజు "శామ్ అవుట్" అని ఓ సందేశం వచ్చింది. దీనిపై గ్రూప్ సభ్యులు వెంటనే స్పందించారు. శామ్ ఏమి చేశాడు.. అంటూ రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఉన్నంటుండి తొలగించడానికి శామ్ ఆల్ట్మన్ చేసిన తప్పేంటి అనేదానికిపై అనేక ఊహాగానాలు బయలుదేరాయి. సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్! ఓపెన్ఏఐ సంస్థకు అతిపెద్ద పెట్టుబడిదారైన మైక్రోసాఫ్ట్లో కూడా దీనిపై అలజడి చలరేగింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కెవిన్ స్కాట్కి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటి నుంచి కాల్ వచ్చినట్లు వాట్సాప్ చాట్లో ఉంది. ఆల్ట్మన్ను తొలగించినట్లు ఓపెన్ఏఐ బోర్డు ప్రకటించబోతోందని, తానే తాత్కాలిక చీఫ్గా ఉండనున్నట్లు ఆ కాల్లో ఆమె స్కాట్తో చెప్పినట్లు సందేశంలో పేర్కొన్నారు. దీంతో స్కాట్ వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్ చేశారట. ఆ సమయంలో ఆయన రెడ్మండ్లోని మైక్రోసాఫ్ట్ హెడ్క్వార్టర్స్లో టాప్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశంలో ఉన్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన సత్య నాదెళ్ల తక్షణమే ఓపెన్ఏఐ సీటీవో మీరా మురాటికి ఫోన్ చేసి బోర్డు నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఆరా తీసినట్లు వాట్సాప్ సందేశాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆమె నుంచి సమాధానం లేదు. దీంతో ఆయన ఓపెన్ఏఐ ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ డీఏంజెలోకి కాల్ చేసి ఏం జరిగిందని అడిగినా కారణం తెలియరాలేదు. అయితే తమతో ఆల్ట్మన్ సమన్వయం సక్రమంగా లేదని మాత్రమే బోర్డు చెప్పినట్లు వాట్సాప్ సందేశాల సారాంశం. -
‘ఓపెన్ ఏఐ సీఈఓ పదవికి ఎసరు పెట్టి’.. ఇల్యాకు ఎలాన్ మస్క్ బంపరాఫర్!
ఓపెన్ఏఐ సీఈఓ పదవి నుంచి శామ్ ఆల్ట్మన్ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్మన్ను తిరిగి వెనక్కి తీసుకున్నారు ఆ సంస్థ బోర్డ్ సభ్యులు. అయితే ఆల్ట్మన్ను ఓపెన్ఏఐ నుంచి తొలగించేలా బోర్డ్ సభ్యులకు ఓపెన్ ఏఐ కో-ఫౌండర్ ఇల్యా సుట్స్కేవర్ సహాయం చేశారు. ఇప్పుడు అదే సుట్స్కేవర్కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ బంపరాఫర్ ఇచ్చారు. హోల్ మార్స్ కేటలాగ్ అనే ఎక్స్.కామ్ యూజర్ ఓ ట్వీట్ చేశారు. అందులో సుట్స్కేవర్ ఓపెన్ఏఐలో అదృశ్యమయ్యారు. అతని భవిష్యత్ ఆందోళన కరంగా మారిందన్న వార్త కథనాన్ని షేర్ చేశారు. దీనికి సుట్స్కేవర్ మీరు టెస్లాలో పనిచేయొచ్చనే క్యాప్షన్ను జోడించాడు. కేటలాగ్ ట్వీట్పై మస్క్ స్పందించారు. ‘‘ఆర్ ఎక్స్’’ అంటూ తన కృత్తిమ మేధ కంపెనీలో ఎక్స్ఏఐలో సుట్స్కేవర్ చేరొచ్చంటూ ఎలాన్ మస్క్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. Ilya should come work at Tesla! pic.twitter.com/UDk4WKu6ts — Whole Mars Catalog (@WholeMarsBlog) December 9, 2023 అయితే ఒక సారి లేఆఫ్స్ గురై.. తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆల్ట్మన్.. సుట్స్కేవర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుట్స్కేవర్ కు తనకు మధ్య ఎలాంటి విరోధం లేదు. నేను తనిని గౌరవిస్తాను. సుట్స్కేవర్ ఇకపై బోర్డులో పనిచేయనప్పటికీ, చేస్తున్న పనిలో ఇరువురి సహకారంతో ముందుకు సాగుతాం’’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు సుట్స్కేవర్ ఓపెన్ఏఐ నుంచి అదృశ్యమయ్యాడన్న కథనాలతో పరిశ్రమ వర్గాల్లో సంచలనంగా మారింది. -
‘అదో పీడకల’.. పదవి నుంచి తొలగించడంపై శామ్ ఆల్ట్మన్..
సీఈఓ పదవి నుంచి తనని అర్ధాంతరంగా తొలగించడంపై ఓపెన్ఏఐ శామ్ఆల్ట్ మన్ స్పందించారు. సీఈఓగా తొలగించిన సమయంలో తనకు ఎదురైన చేదు జ్ఞాపకాల్ని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో వెలుగులోకి తెచ్చారు. శామ్ ఆల్ట్మన్..ఓపెన్ ఏఐ సీఈఓ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. చాట్జీపీటీ విడుదలతో ప్రపంచం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్న అసాధ్యుడు. అలాంటి ఆల్ట్మన్ను కొద్ది రోజుల క్రితం ఓపెన్ ఏఐ సంస్థ బోర్డ్ అతనిని సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత వరుస పరిణామాలతో ఆల్ట్మన్ను తిరిగి సంస్థలోకి తీసుకోక తప్పలేదు ఆ బోర్డ్ సభ్యులకు. అయితే పదవీచ్యుతుడైన తరువాత ‘‘ టైమ్స్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ 2023’’ కి ఎంపికయ్యారు. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా కమెడియన్, ట్రెవర్ నోహ్ నిర్వహించిన పాడ్కాస్ట్లో ఆల్ట్మన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనకి పింక్ స్లిప్ ఇచ్చిన తర్వాత ఏమైందనే విషయాల్ని పంచుకున్నారు. శామ్ ఆల్ట్మన్ని సీఈఓ పదవి నుంచి ఎప్పుడు తొలగించారు? నవంబర్ 17, 2023న ఓపెన్ ఏఐ బోర్డ్ ఆల్ట్మన్ని సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఆల్ట్మన్ ఐఫోన్కి ఏమైంది? ట్రెవర్ నోహ్ పాడ్కాస్ట్లో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ.. ‘‘ ఈ పరిణామం (తనను తొలగించడం) నన్ను మరింత గందర గోళంలోకి నెట్టింది. నా ఐఫోన్ కూడా పనిచేయడం ఆగిపోయింది. నేను హోటల్ గదిలో ఉండగా.. ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ‘‘ మిమ్మల్ని ఓపెన్ ఏఐ బోర్డ్ సభ్యులు సీఈఓ పదవి నుంచి తొలగించారు’’ అని ఆ కాల్ సారాంశం. ఏం జరిగిందో తెలియదు. అంతా గందర గోళం. ఓ వైపు నన్ను తొలగిస్తున్నట్లు ఫోన్ కాల్, మరోవైపు నా ఐఫోన్ పనిచేయడం లేదు. దానంతటికి ఐమెసేజ్ అని అర్ధమైంది. కొద్ది సేపటికి ఐమెసేజ్కు వరుసగా మెసేజ్లు వస్తున్నాయి. ఆమెసేజ్లు నాతో పనిచేయాలనుకున్న వారి నుంచేనని అర్ధమైంది. అన్నింటిని చదివాను. వాటిని చదివాక అయోమయంలో పడ్డాను. అదో పీడ కలలా అనిపించింది. బోర్డు నిర్ణయంతో కలత చెందాను’’ అని అన్నారు. -
Generative AI: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో...
చాట్జీపీటీ.. ఆన్లైన్ సెర్చ్ను కొత్త పుంతలు తొక్కించిన తాజా సంచలనం. మెయిళ్లు రాయడం మొదలుకొని కథలల్లడం వరకూ ఎన్నో పనులను చిటికెలో చక్కబెట్టేయగలదీ కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీ. అయితే జీపీటీ 4ను వాడటం పూర్తిగా ఉచితం కాదు. కొంతవరకూ ఫ్రీగా వాడుకోవచ్చు కానీ.. ఆ తరువాత మాత్రం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరి సమాచారం ఉచితంగా పొందాలంటే? ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయి. బింగ్ ఏఐ గూగుల్కు బదులుగా ఏఐ ఆధారిత సెర్చింజన్ బింగ్నూ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్కు చెందిన దీనిలో ఏఐ ఆధారిత జీపీటీ-4 కూడా ఉంది. దీని వెబ్సైట్లోకి వెళ్లి బింగ్ చాట్తో బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. యాప్ రూపంలోనూ దీని సేవలను పొందొచ్చు. కంటెంట్ను సృష్టించుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. బింగ్లోని రైటింగ్ అసిస్టెంట్ సాయంతో మెయిళ్లు రాసుకోవచ్చు. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయాణం సాఫీగా సాగటానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూను ఎదుర్కోవటానికి సన్నద్ధం కావొచ్చు. ఇక ఇమేజ్ జనరేటర్ ద్వారా ప్రాంప్ట్ను అందించి ఉచితంగా బొమ్మలను గీయించుకోవచ్చు. దీనిలోని ట్రాన్స్లేటర్ బోలెడన్ని భాషలను ఇట్టే అనువదిస్తుంది. ఇక ఏఐ ఆధారిత కోపైలట్ క్రెడబులిటీ ఉన్న సమాచారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ సహాయంతో మన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, కచ్చితమైన సమాచారాన్ని ముందుంచుతుంది. మన ప్రాధాన్యాలు, గతంలో జరిపిన చర్చలను దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా స్పందిస్తుంది. మెర్లిన్ ఇదో క్రోమ్ చాట్జీపీటీ ఎక్స్టెన్షన్. ఏ వెబ్సైట్ మీదైనా యాక్సెస్ చేయొచ్చు. మెర్లిన్ను ఇన్స్టాల్ చేసుకొని, ఖాతాను ఓపెన్ చేస్తే చాలు. కంట్రోల్/ కమాండ్ ప్రాంప్ట్ రూపంలో ఆదేశాలు ఇస్తూ మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. చిటికెలో బ్లాగులు, యూట్యూబు వీడియోలు, వెబ్సైట్ల సారాంశాన్ని ముందుంచుతుంది. సోషల్ మీడియా కంటెంట్నూ సృష్టించుకోవచ్చు. ఈమెయిళ్లు, కోడ్స్ రాసి పెడుతుంది. దీనిలోని చాట్జీపీటీ ప్లగిన్లు ఉత్పాదకత పెంచటానికి ఎంతగానో తోడ్పడతాయి. మెర్లిన్లోని కృత్రిమ మేధ ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నలకైనా సైడ్బార్లో సమాధానాలిస్తుంది. పోయ్ ఇది కోరాకు చెందిన ఏఐ యాప్. ఆంత్రోపోనిక్ సంస్థ రూపొందించిన క్లౌడ్ దగ్గరి నుంచి ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ వరకు రకరకాల ఏఐ మోడళ్లను వాడుకోవటానికి వీలు కల్పిస్తుంది. ప్రశ్నలను సంధించి జవాబులు రాబట్టుకోవచ్చు. అత్యంత అధునాతన ఏఐ టెక్నాలజీ దీని సొంతం. అంతరాయాలులేని సంభాషణ, సృజనాత్మక కంటెంట్ను దృష్టిలో పెట్టుకొని పోయ్ను రూపొందించారు. దీని ఇంటర్ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏదైనా బాట్ లేదా ప్రాంప్ట్తో తేలికగా వాడుకోవచ్చు. ఇదీ చదవండి: ‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: సీఈఓ -
Microsoft-OpenAI: రెండూ కలిస్తే ఏమవుతుంది?
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ భాగస్వామ్యాన్ని, దానికి సంబంధించిన ఇటీవల పరిణామాల్ని యూకే నియంత్రణ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దిగ్గజ కంపెనీల కలయిక యూకేలోని కంపెనీ మధ్య పోటీపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాన్ని గమనిస్తోంది. ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ అనుబంధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్ను ప్రభావితం చేయగలదా అని యూకేకి చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) పరిశీలిస్తోంది. ఈమేరకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. అభిప్రాయ సేకరణ (ITC) అనేది సమాచార సేకరణ ప్రక్రియలో మొదటి భాగమని, అధికారికంగా మొదటిదశ విచారణకు ముందు చేపట్టే ప్రక్రియ అని సీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ఏఐలో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ప్రవేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ భాగస్వామ్యం, ఇటీవల పరిణామాలు కంపెనీల పోటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకునేందుకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. ఓపెన్ఏఐలో నాటకీయ పరిణామాలు గత నెలలో ఓపెన్ఏఐ బోర్డు నాటకీయ చర్యలో సీఈవో సామ్ ఆల్ట్మన్ను తొలగించింది. తరువాత, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తమ అధునాతన ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించాలని ఆయను ఆహ్వానించారు. అయితే ఓపెన్ఏఐ పూర్తిగా కొత్త బోర్డ్తో ఆల్ట్మన్ను సీఈవోగా పునరుద్ధరించడంతో ఈ నాటకీయ పరిణామానికి ముగింపు పడింది. ‘ఏఐ డెవలపర్ల మధ్య నిరంతర పోటీ అవసరం. ఇది ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, వృద్ధి, బాధ్యతాయుతమైన అభ్యాసాలను అందించడంలో సహాయపడుతుంది’ సీఎంఏ అభిప్రాయపడింది. మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఈ రంగంలో కంపెనీల మధ్య పోటీని దెబ్బతీసే ప్రమాదం ఉందా అని సీఎంఏ సమీక్షిస్తోంది. -
OpenAI : భారతీయుడు రిషీ జైట్లీకి జాక్పాట్!
భారతీయుడు, మాజీ ట్విటర్ ఇండియా హెడ్ రిషీ జైట్లీకి జాక్ పాట్ తగిలింది. సలహాలు తీసుకునేందుకు రిషిని ఓపెన్ ఏఐ నియమించుకున్నట్లు తెలుస్తోంది. భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంపై చాట్జీపీటీ (openai) సృష్టికర్త ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా దేశీయంగా కృత్తిమమేధ పాలసీ, విధి విధానాల అమలు వంటి అంశాలపై సలహాలు తీసుకునేందుకు ట్విటర్ మాజీ ఇండియా హెడ్ రిషి జైట్లీని సలహాదారుగా నియమించున్నట్లు సమాచారం. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ‘‘జైట్లీ ఓపెన్ఏఐలో సీనియర్ సలహాదారుగా చేరారు. ఏఐ విధానాలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలతో కుదుర్చుకునే ఒప్పందాలు మరింత సులభ తరం చేసేందుకు ఆల్ట్మన్ సిద్ధమయ్యారు. ఏఐకి ఉన్న డిమాండ్ దృష్ట్యా దేశీయంగా ఆయా విభాగాల్లో నిష్ణాతులైన నిపుణులను ఓపెన్ ఏఐ నియమించుకుంటుంది’’ అని టెక్ క్రంచ్ నివేదిక హైలెట్ చేసింది. మోదీతో ఆల్ట్మన్ భేటీ ఈ ఏడాది భారత పర్యటన సందర్భంగా జూన్ 9న ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘‘కృత్రిమ మేధ గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం కృత్రిమ మేధ వల్ల భారత్లో వచ్చే ఉద్యోగావకాశాలు, దాని వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి చర్చించాం. కృత్రిమ మేధకు చట్టబద్ధత కల్పించడంపై కూడా మా మధ్య చర్చ జరిగింది’’ అని శామ్ ఆల్ట్మన్ తెలిపారు. ఎవరీ రిషీ జైట్లీ రిషీజైట్లీ 2007 - 2009 మధ్య భారత్ తరపున ప్రైవేట్ - పబ్లిక్ పార్ట్నర్ షిప్ గూగుల్ విభాగం అధినేతగా పనిచేశారు. తదనంతరం, 2012లో ట్విటర్ హెడ్గా చేరారు. 2016 చివరలో ట్విటర్ను వదిలేసి జైట్లీ, టైమ్స్ గ్రూప్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ విభాగమైన టైమ్స్ బ్రిడ్జ్ సహ వ్యవస్థాపకుడి కలిసి సీఈఓగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. -
టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే..
Time’s CEO of the Year 2023: టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్జీపీటీ (ChatGPT)కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మన్ (Sam Altman) ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘సీఈవో ఆఫ్ ది ఇయర్-2023’గా ఎంపికయ్యారు. ఆల్ట్మాన్ టెక్ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అవార్డు పొందారు. 5 రోజుల్లోనే మిలియన్ యూజర్లు 2022 నవంబర్ లో ప్రారంభమైన చాట్జీపీటీ 5 రోజుల్లోనే మిలియన్ మంది యూజర్లను సంపాదించకుందని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. చాట్జీపీటీకి ప్రస్తుతం 100 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ బెంచ్మార్క్ను చేరుకోవడానికి ఫేస్బుక్కు 4.5 సంవత్సరాలు పట్టింది. 2022లో 28 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నివేదించిన ఓపెన్ఏఐ 2023లో నెలకు 100 మిలియన్ డాలర్ల ఆదాయానికి చేరుకుంది. ఓ వైపు చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ పింక్ స్లిప్లు ఇస్తున్న సమయంలో ఓపెన్ఏఐ మాత్రం నియామకాలు చేపట్టడం విశేషం. చాట్జీపీటీ భారీ విజయం తర్వాత ఈ ఏడాది మార్చిలో జీపీటీ-4ను ఓపెన్ఏఐ తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఓ వైపు యూఎస్ సెనేట్లో చర్చలు జరుగుతున్న సమయంలో ఆల్ట్మన్ భారత్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు వెళ్లి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మళ్లీ సీఈవోగా.. బోర్డు సభ్యులతో విభేదాల కారణంగా ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి వైదొలిగారు. గత నవంబర్ 17న బోర్డు ఆల్ట్మాన్ను కంపెనీ నుంచి తొలగించింది. ఈ ఘటన జరిగిన వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆల్ట్మన్కు అండగా నిలిచారు. మైక్రోసాఫ్ట్లో అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే 5 రోజుల నాటకీయ పరిణామాల అనంతరం ఆయన మళ్లీ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. -
Openai : ఓపెన్ఏఐలో ఆల్ట్మన్ ఉద్యోగం ఊడింది..ఇందుకేనా?
టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన శామ్ ఆల్ట్మన్ తొలగింపు కథ సుఖాంతమైంది. ఆయన తిరిగి ఓపెన్ ఏఐ సీఈఓగా వస్తున్నట్టు బోర్డు తెలిపింది. అలాగే బోర్డులో కొత్త సభ్యుల నియామకంపై సూత్రప్రాయమైన అంగీకారం కుదిరినట్టు పేర్కొంది. అయితే ఈ తరుణంలో శామ్ ఆల్ట్మన్ని ఓపెన్ఏఐని నుంచి తొలగించిన కారణాల్ని వివరిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓపెన్ఏఐ నుంచి ఆల్ట్మన్ని ఫైరింగ్ ఏపిసోడ్ తర్వాత.. ఓపెన్ ఏఐలోని రీసెర్చర్ల బృందం ప్రాజెక్ట్ క్యూ (క్యూ-స్టార్) గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ బోర్డ్కు ఓ లెటర్ను రాశారు. ఆ లెటర్ ఆధారంగా రాయిటర్స్ ఓ కథనాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రాజెక్ట్ క్యూ (What is Project Q) అంటే ఏమిటి? శామ్ ఆల్ట్మన్ ఈ ఏడాది ప్రారంభంలో ఓపెన్ఏఐ కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్( ఏజీఐ) గురించి ప్రస్తావించారు. ప్రాజెక్ట్ క్యూస్టార్ పేరుతో చాట్జీపీటీ తర్వాత ఓపెన్ఏఐ ఏజీఐ అనే టెక్నాలజీ మీద పనిచేస్తుందని, ఈ సాంకేతిక మనుషుల కంటే స్మార్ట్గా పనిచేస్తుందని వివరించారు. అంతేకాదు ఏజీఐ విజయవంతంగా ఎలా తయారు చేయగలిగారు? ఈ లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఆర్ధికంగా ఎలాంటి పురోగతి సాధిస్తారు? వంటి విషయాల్ని ప్రస్తావించారు. అదే సమయంలో దాని వల్ల సమాజానికి, మనుషులకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలిపారు. ఏజీఐని దుర్వినియోగం చేయడం వల్ల జరిగే తీవ్రమైన అనార్ధాలు, మానవాళి మనుగడకు ముప్పు వంటి అంశాలపై బహిర్ఘతంగా మాట్లాడారు. ఏజీఐ చాలా గొప్పది ‘ఏజీఐ చాలా గొప్పది. సమాజంలో జరిగే అభివృద్దిని అడ్డుకుంటుందని, లేదంటే అడ్డుకోవాలని ఏజీఐ కోరుకుంటుందని నేను నమ్మడం లేదు. బదులుగా, యూజర్లు ఏజీఐని ఎలా సమర్ధవంతంగా వినియోగించుకోవాలి..తద్వారా ఎలాంటి ప్రయోజనాల్ని పొందవచ్చనే అంశాన్ని దాని డెవలపర్లు గుర్తించాలి’ అని ఆల్ట్మన్ తన బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్నారు. చర్చాంశనీయంగా అల్ట్మన్ తొలగింపు ఈ ఏజీఐ ప్రాజెక్ట్ వల్ల జరిగే ప్రమాదాల గురించి ఆల్ట్మన్ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడాన్ని బోర్డ్ సభ్యులకు నచ్చలేదని తెలుస్తోంది. కాబట్టే ఓపెన్ఏఐ నుంచి శామ్ ఆల్ట్మన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారని నివేదికలు హైలెట్ చేశారు. కాగా ఏజీఐ టెక్నాలజీ వల్ల జరిగే అనార్ధాల గురించి దాని డెవలపర్లు రాసిన లెటర్ బోర్డ్ సభ్యులకు చేరకముందే.. ఆల్ట్మన్కి పింక్ స్లిప్ ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. -
మళ్లీ ఓపెన్ఏఐలోకి సామ్ ఆల్ట్మన్
శాన్ ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సంచలనం సృష్టించిన చాట్జీపీటీ తయారీసంస్థ ఓపెన్ఏఐ మరోసారి వార్తల్లో నిలిచింది. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న సామ్ ఆల్ట్మన్ను తిరిగి అదే పదవిలోకి తీసుకుంటున్నట్లు ఓపెన్ఏఐ తాజాగా ప్రకటించింది. తనను తొలగించిన కంపెనీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని సామ్ పెట్టిన షరతుకు ఓపెన్ఏఐ ఒప్పుకున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే కొత్తగా బ్రెట్ టైలర్ నేతృత్వంలో నూతన బోర్డును ఏర్పాటుచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇటీవల బహిష్కరణ తర్వాత సామ్ను మైక్రోసాఫ్ట్కు చెందిన నూతన అడ్వాన్స్డ్ ఏఐ పరిశోధనా బృందంలో చేర్చుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ సారథి సత్య నాదెళ్ల ప్రకటించడం తెల్సిందే. సామ్ను మళ్లీ సంస్థలోకి తీసుకోవాలని వాటాదారుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అతని షరతులకు సంస్థ ఒప్పుకోకతప్పలేదని తెలుస్తోంది. సంస్థలోకి పునరాగమనాన్ని సామ్ ధ్రువీకరించారు. మళ్లీ కృత్రిమ మేధ విభాగంలో అవిశ్రాంతంగా పనిచేస్తానని ప్రకటించారు. -
ఊహించని పరిణామం, ఓపెన్ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్మన్ బాధ్యతలు
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ ఆసక్తికర ప్రకటన చేసింది. కంపెనీ సీఈఓగా తిరిగి శామ్ ఆల్ట్మన్ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపింది. ముందే ఊహించినట్లుగానే ఓపెన్ఏఐ బోర్డు కొత్త సభ్యులు బ్రెట్ టేలర్, లారీ సమ్మర్స్, ఆడమ్ డి ఏంజెలో’లను నియమించింది. తాజాగా, పరిణామాలపై శామ్ ఆల్ట్మన్ స్పందించారు. ‘ఐ లవ్ ఓపెన్ఏఐ. నేను ఓపెన్ఏఐలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే, మైక్రోసాఫ్ట్తో మరింత బలమైన భాగస్వామ్యంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు శామ్ ఆల్ట్మన్ ఓపెన్ఏఐ సీఈఓగా తిరిగి రావాలని తన నిర్ణయాన్ని ప్రకటించిన కొద్ది నిమిషాల తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ధృవీకరించారు. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ రూ.1300 కోట్లు పెట్టుబడులు పెట్టింది.అయితే ఓపెన్ ఏఐ ఆల్ట్మన్ను తొలగించడంతో.. ఆయనను మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగంలోకి తీసుకునేందుకు సత్యనాదెళ్ల ప్రయత్నించారు. గత వారం రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలతో ఆల్ట్మన్ తిరిగి ఓపెన్ఏఐ సీఈఓ బాధ్యతలు చేపడుతున్నారంటూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల బుధవారం ఎక్స్ పోస్ట్లో తెలిపారు. చాట్జీపీటీతో వెలుగులోకి గత ఏడాది కృత్తిమ మేధ (ఏఐ) చాట్బాట్ చాట్జీపీటీ విడుదలతో ఓపెన్ ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్మన్ వెలుగులోకి వచ్చారు. అంతేకాదు, ఏఐ రీసెర్చ్, డెవలప్మెంట్పై బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేలా దోహద పడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రేసులో ముందంజలో ఉండటమే కాదు.. గత ఏడాది చాట్బాట్ చాట్జీపీటీ విడుదలతో ఓపెన్ ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్మన్ వెలుగులోకి వచ్చారు. -
సంచలనం.. రాజీనామాలో 500 మంది ఉద్యోగులు, ఓపెన్ఏఐకి ఎదురు దెబ్బ!
శామ్ ఆల్ట్మన్ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ఏఐ సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఓపెన్ఏఐలోని ఉద్యోగులు తిరగబడ్డారు. ఉన్న 730 మంది ఉద్యోగుల్లో 500 మంది రాజీనామా చేస్తామంటూ బోర్డ్ను బెదిరించారు. ఈ మేరకు వారు ఓ లేఖ రాశారు. ఓపెన్ ఏఐ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు మైక్రోసాఫ్ట్ సుముఖంగా ఉందని, ఇదే విషయంపై హామీ ఇచ్చినట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. శామ్ ఆల్ట్మన్ని మళ్లీ సంస్థలోకి చేర్చుకుంటే రాజీనామాలపై పునరాలోచన చేస్తామని ఉద్యోగులు ఆ లేఖలో స్పష్టం చేశారు. ‘‘ఓపెన్ ఏఐని పర్యవేక్షించే సామర్థ్యం మీకు లేదని మీ చర్యల ద్వారా స్పష్టం అవుతుంది. మా లక్ష్యం, ఉద్యోగుల పట్ల విశ్వాసం, సంస్థ పట్ల నిబద్ధత లేని వారి కోసం మేం పని చేయలేకపోతున్నాం.‘అందుకే, ప్రస్తుత బోర్డ్ సభ్యులందరూ రాజీనామా చేయాలి. లేదంటే మేం వెంటనే ఓపెన్ఏఐకి రాజీనామా చేసి మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగంలో చేరిపోతాం. బ్రెట్ టేలర్, విల్ హర్డ్ వంటి ఇద్దరు కొత్త ఇండిపెండెంట్ డైరెక్టర్లను బోర్డు నియమించి, శామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మాన్లను తిరిగి నియమిస్తే అప్పుడు ఆలోచిస్తామని’ అని లేఖలో తెలిపారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే? ఇక్కడ విచిత్రం ఏంటంటే..ఆల్ట్మన్ను తొలగించేలా బోర్డ్ ప్రయత్నాలకు ఓపెన్ఏఐ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్స్కేవర్ నాయకత్వం వహించారు. ఇప్పుడు అదే సట్స్కేవర్ శామ్ ఆల్ట్మన్ సంస్థ నుంచి తొలగించడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. బోర్డ్ ప్రయత్నాల్లో తన పాత్ర ఉండడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. శామ్ ఆల్ట్మన్ను ఎందుకు తొలగించింది శామ్ ఆల్ట్మన్ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ఏఐ సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓపెన్ఏఐ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన స్థానంలో తాత్కాలికంగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీ సీఈఓగా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఆల్ట్మన్ను బాధ్యతల నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్మన్ తన పదవికి రాజీనామా చేశారు. చదవండి👉‘AI’ వల్ల ఉద్యోగాలు పోవడం ఖాయం.. చాట్జీపీటీ సృష్టి కర్త సంచలన వ్యాఖ్యలు! -
మరో కీలక పరిణామం, ‘ఓపెన్ఏఐ’లోకే శామ్ ఆల్ట్మన్?
ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగంలో పనిచేయడం కంటే శామ్ ఆల్ట్మన్ ఓపెన్ఏఐకి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఓపెన్ఏఐ మాజీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ని తొలగించడం.. ఆ తర్వాత ఆయన భవితవ్యంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల బ్లూమ్బెర్గ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఓపెన్ఏఐలో ఆల్ట్మన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. నేను అతనిమీద, అతని నాయకత్వం, సామర్థ్యంపై నమ్మకంగా ఉన్నాను. కాబట్టే మేం అతనిని మైక్రోసాఫ్ట్లోకి స్వాగతించాలనుకుంటున్నాము’ అని సత్యనాదెళ్ల ఇంటర్వ్యూలో చెప్పారు. ఆల్ట్మన్ తమ కంపెనీ కొత్త ఏఐ రీసెర్చ్ బృందంలో చేరనున్నారని వెల్లడించారు. ఆయనతో పాటు ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్మన్ సైతం మైక్రోసాఫ్ట్తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. అయితే, ఓపెన్ఏఐలోని పెట్టుబడి దారులు శామ్ ఆల్ట్మన్ని సంస్థలోకి తీసుకోవాలని బోర్డ్ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరుణంలో శామ్ ఆల్ట్మన్ మైక్రోసాఫ్ట్లో చేరడం కంటే, తిరిగి ఓపెన్ఏఐకి వెళితే బాగుండేదన్న సంకేతాలిచ్చారు సత్యనాదెళ్ల. మరి ఈ వరుస పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాల్సి ఉంది. చదవండి👉సంచలనం.. రాజీనామాలో 500 మంది ఉద్యోగులు, ఓపెన్ఏఐకి ఎదురు దెబ్బ! -
మైక్రోసాఫ్ట్లోకి సామ్ ఆల్ట్మ్యాన్
వాషింగ్టన్: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో చర్చనీయాంశంగా మారిన సామ్ ఆల్ట్మ్యాన్ ఉద్వాసన పర్వం కొత్త మలుపు తీసుకుంది. ఓపెన్ఏఐ సంస్థ సీఈవో పదవి నుంచి తీసేశాక సామ్ ఆల్ట్మ్యాన్ తాజాగా మైక్రోసాఫ్ట్లో చేరి పోయారు. ఈ విషయాన్ని స్వయంగా మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్ చేశారు. ఆల్ట్మ్యాన్ను తొలగించిన కొద్దిసేపటికే ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రోక్మ్యాన్ సైతం ఓపెన్ఏఐ నుంచి వైదొలగారు. ‘‘ ఆల్ట్మ్యాన్, బ్రోక్మ్యాన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్ నూతన అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ బృందంలో కలిసి పనిచేస్తారు’’ అని నాదెళ్ల ట్వీట్చేశారు. -
సొంత కంపెనీల్లోనే ఉద్యోగాలు కోల్పోయిన సీఈవోలు వీరే!
ఇటీవల ఓపెన్ఏఐ కంపెనీ తన సీఈఓ 'శామ్ ఆల్ట్మన్'ను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద చర్చలకు దారి తీసింది. సీఈఓ జాబ్ కూడా గ్యారెంటీ కాదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 2022లో 969 మంది సీఈఓలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయగా.. ఈ ఏడాది మొదటి తొమ్మిది ఈ సంఖ్య 1425 కు చేరింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World of Statistics) ప్రకారం, తాము నెలకొల్పిన సంస్థల నుంచి తమ సీఈఓ పదవులు కోల్పోయిన వారు ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం. స్టీవ్ జాబ్స్ (Steve Jobs) యాపిల్ కంపెనీ కో ఫౌండర్, సీఈఓ స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు ఆ కంపెనీలోనే తన సీఈఓ జాబ్ కోల్పోయిన సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. సంస్థ ప్రారంభమైనప్పుడు అతని వయసు 21 సంవత్సరాలు మాత్రమే, అయితే ఆ కంపెనీ స్థాపించిన సుమారు 9 సంవత్సరాలకు కంపెనీ బోర్డు సీఈఓగా తొలగించి, ఆ స్థానంలో జాన్ స్కూల్లేను నియమించింది. ఆ తరువాత 1997లో స్టీవ్ జాబ్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. ఈయన 2011లో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశాడు. ప్రస్తుతం ఈ స్థానంలో 'టిమ్ కుక్' ఉన్నారు. అంకితి బోస్ (Ankiti Bose) జిలింగో కో-ఫౌండర్, సీఈఓ అంకితి బోస్ కొన్ని ఆర్ధిక అవకతవకల దర్యాప్తు కారణంగా 2022లో సీఈఓగా తొలగించారు. బోర్డు ఆమోదం లేకుండానే.. ఆమె జీతం దాదాపు 10 రెట్లు పెరగటం కారణంగా సీఈఓగా తొలగించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద సంచలనంగా మారింది. పరాగ్ అగర్వాల్ (Parag Agrawal) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) సంస్థను కొనుగోలు చేసిన తరువాత కంపెనీలో చాలామంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లను తొలగించారు. 2021లో సీఈఓగా ఎంపికైన పరాగ్ అగర్వాల్ ఆ సమయంలో కంపెనీని విడిచిపెట్టిన మొదటి వ్యక్తి. విధుల నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా పరాగ్ అగర్వాల్ దాదాపు 40 మిలియన్ల డాలర్ల భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం. ఫనీష్ మూర్తి (Phaneesh Murthy) ప్రముఖ ఐటీ సంస్థ 'ఐగేట్' (iGate) ప్రెసిడెంట్, సీఈఓ ఫనీష్ మూర్తికి తన సహోద్యోగితో సంబంధం ఉందనే కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అరాసెలి రోయిజ్ అనే ఉద్యోగి లైంగిక వేధింపుల దావా వేసినప్పుడు విచారణంలో దోషిగా తేలడం వల్ల ఈయన సీఈఓగా తొలగించారు. ఈయన ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు సమాచారం. జాక్ డోర్సే (Jack Dorsey) 2006లో ప్రారంభమైన మైక్రోబ్లాగింగ్ స్టార్టప్ ట్విటర్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జాక్ డోర్సే' 2008లో కొన్ని కారణాల వల్ల తన పదవి కోల్పోయాడు. ఆ తరువాత ఆయన స్థానంలోకి పరాగ్ అగర్వాల్ నియమితుడై సీఈఓ బాధ్యతలు చేపట్టారు. శామ్ ఆల్ట్మాన్ (Sam Altman) సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్ ఆల్ట్మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఇదీ చదవండి: ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే.. తమ కంపెనీలలోనే సీఈఓ పదవి కోల్పోయిన వ్యక్తుల జాబితాలో యాహూ సీఈఓ కరోల్ బార్ట్జ్ (2011), హెచ్టీసీ సీఈఓ పీటర్ చౌ (2015), తైవాన్కు కంప్యూటర్ కంపెనీ ఏసర్ సీఈఓ జియాన్ఫ్రాంకో లాన్సి (2011), విప్రో జాయింట్ సీఈఓలు గిరీష్ పరంజ్పే & సురేష్ వాస్వానీ (2011), మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీఫెన్ ఎలోప్, హెచ్పీ సీఈఓ మార్క్ హర్డ్ (2010) ఉన్నారు. -
ఓపెన్ఏఐ వద్దంటే.. మైక్రోసాఫ్ట్ రమ్మంది!
సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్ ఆల్ట్మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది. కంపెనీ 'శామ్ ఆల్ట్మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించిన వెంటనే సంస్థ కో-ఫౌండర్, ప్రెసిడెంట్ 'గ్రెగ్ బ్రాక్మన్' తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. ఒకే రోజులు జరిగిన ఈ సంఘటనలు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft)లో వారిద్దరూ (శామ్ ఆల్ట్మన్ & గ్రెగ్ బ్రాక్మన్) ఎమ్మెట్ షియర్ అండ్ ఓఏఐ (Emmett Shear and OAI) కొత్త బృందానికి నాయకత్వం వహించనున్నట్లు సీఈఓ 'సత్య నాదెళ్ళ' తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: సీఈఓను తొలగించిన వెంటనే.. ప్రెసిడెంట్ రాజీనామా - ట్వీట్ వైరల్ ఓపెన్ఏఐతో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని.. శామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రాక్మన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్లో చేరబోతున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని.. వారి విజయాలకు అవసరమైన వనరులను అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సత్య నాదెళ్ల వెల్లడించారు. We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett… — Satya Nadella (@satyanadella) November 20, 2023 -
ఓపెన్ఏఐలో ఆసక్తికర పరిణామాలు, సీఈఓగా ఆల్ట్మన్?
చాట్జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ మాజీ సీఈఓ శామ్ అల్ట్మన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారా? శనివారం ఆల్ట్మన్ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం టెక్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది. అయితే ఆల్ట్మన్ను మళ్లీ తిరిగి తీసుకోవాలని ఓపెన్ ఏఐ ప్రధాన పెట్టుబడి దారులు ఒత్తిడి తెస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు ఓపెన్ ఏఐ బోర్డ్ సభ్యులు సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు ఇన్వెస్టర్లు బోర్డ్ సభ్యులతో చర్చిస్తున్నారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. శామ్ ఆల్ట్మన్ను తొలగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఓపెన్ఏఐ ఇన్వెస్టర్లు కంపెనీ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఆల్ట్మన్ని సీఈఓగా నియమించాలని కోరుతూ పెట్టుబడి దారులు ఓపెన్ ఏఐలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాఫ్ట్తో సైతం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సైతం మద్దతు ఆల్ట్మన్కు ఉద్వాసన పలికిన ఓపెన్ఓఐ బోర్డు సభ్యులు తాత్కాలిక సీఈవోగా మిరా మురాటిని ఎంపిక చేసుకున్నారు. బోర్డు నిర్ణయం మేరకు మిరా మురాటికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల మద్దతు పలికారు. అయితే, తాజాగా మళ్లీ సీఈఓగా తిరిగి ఆల్ట్మన్ తీసుకోవాలన్న పెట్టుబడిదారుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ సత్యనాదెళ్ల ఓపెన్ ఏఐ మాజీ సీఈఓతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఓపెన్ ఏఐ సిబ్బంది హెచ్చరికలు ఓపెన్ ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్మన్ను సీఈఓగా తీసుకోవాలని, లేదంటే సంస్థ నుంచి బయటకు వెళ్లిపోతామంటూ సిబ్బంది బోర్డు సభ్యులకు హెచ్చరికలు జారీ చేసినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఆల్ట్మన్ సొంత వెంచర్ ఓపెన్ఏఐతో జరుగుతున్న చర్చలు విఫలమైతే ఆల్ట్మన్ తన సొంత వెంచర్ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఆయనకు మద్దతుగా మాజీ ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్మాన్ సైతం అదే బాటలో ఉన్నారనని నివేదికలు పేర్కొన్నాయి. -
సీఈఓను తొలగించిన వెంటనే.. ప్రెసిడెంట్ రాజీనామా - ట్వీట్ వైరల్
చాట్జీపీటీ సృష్టి కర్త, ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్'ను సంస్థ సీఈఓగా తొలగించిన తరువాత.. కంపెనీ కో-ఫౌండర్, ప్రెసిడెంట్ 'గ్రెగ్ బ్రాక్మన్' కంపెనీకి రాజీనామా చేసాడు. ఓపెన్ఏఐలో జరిగిన ఈ పరిణామాలు టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆల్ట్మన్ బోర్డులో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం లేకపోవడంతోనే తొలగించినట్లు వెల్లడించింది. టెక్ పరిశ్రమలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన శామ్ ఆల్ట్మన్ను కంపెనీ తొలగించిన కొన్ని గంటల వ్యవధిలోనే బ్రాక్మాన్ సోషల్ మీడియాలో తన రాజీనామాను ప్రకటిస్తూ.. ఎనిమిది సంవత్సరాల క్రితం నా అపార్ట్మెంట్లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి అందరూ కలిసి ఇంత పెద్ద సామ్రాజ్యం సృష్టించుకున్నాము. ఇది గర్వించదగ్గ విషయం అంటూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: ఓపెన్ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'? ఈ రోజు వచ్చిన వార్తలు నన్ను ఎంతగానో కలచి వేశాయని, ఈ కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేస్తూ.. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను, మానవాళి అందరికీ ప్రయోజనం చేకూర్చే సురక్షితమైన AGIని సృష్టించే లక్ష్యాన్ని నేను విశ్వసిస్తూనే ఉన్నాను అంటూ వెల్లడించాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. After learning today’s news, this is the message I sent to the OpenAI team: https://t.co/NMnG16yFmm pic.twitter.com/8x39P0ejOM — Greg Brockman (@gdb) November 18, 2023 -
ఓపెన్ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'?
OpenAI CEO: 'చాట్జీపీటీ'(ChatGPT) సృష్టి కర్త 'శామ్ ఆల్ట్మన్'ను సీఈఓగా ఓపెన్ఏఐ తొలగించిన వెంటనే.. ఈ బాధ్యతలను తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 'మీరా మురాటి' (Mira Murati) స్వీకరించింది. ఓపెన్ఏఐ కొత్త సీఈఓ మీరా ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అల్బేనియాలో జన్మించిన మీరా మురాటి ఉన్నత చదువులు కోసం 16 ఏళ్ల వయసులోనే కెనడాకు వెళ్ళింది. డార్ట్మౌత్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడే హైబ్రిడ్ రేస్ కారును నిర్మించారు. మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసిన ఈమె టెస్లాలో స్టూడెంట్ ఇంటర్న్గా పనిచేసి మోడల్ ఎక్స్ వాహనం తయారు చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఆ తరువాత 2018లో ఓపెన్ఏఐలో చేరి సూపర్కంప్యూటింగ్పై పని చేయడం ప్రారంభించింది. అంతకంటే ముందు లీప్ మోషన్లో రెండేళ్లు పనిచేసింది. 2022లో ఆమె చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పదోన్నతి పొందింది. టెక్నాలజీ మీద మంచి పట్టు, వ్యాపారంలో మెళకువలు కలిగిన 'మీరా మురాటి' కంపెనీ వృద్ధికి దోహదపడుతుందని విశ్వసించి తాత్కాలిక సీఈఓ బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే అధికారికంగా సీఈఓ ఎవరనేది సంస్థ వెల్లడిస్తుంది. ఇదీ చదవండి: చాట్జీపీటీ సృష్టికర్తనే తొలగించిన ఓపెన్ఏఐ.. కారణం ఇదే! శామ్ ఆల్ట్మన్ను తొలగించడానికి కారణం బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే విషయంలో అతడి సామర్థ్యంపై బోర్డుకు నమ్మకం లేకపోవడం వల్ల సీఈఓగా తొలగించింది. -
చాట్జీపీటీ సృష్టికర్తనే తొలగించిన ఓపెన్ఏఐ.. కారణం ఇదే!
అతి తక్కువ కాలంలోనే పెను సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ 'చాట్జీపీటీ' (ChatGPT) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతటి అడ్వాన్డ్ టెక్నాలజీని రూపొందించిన 'శామ్ ఆల్ట్మన్' (Sam Altman) కంపెనీ గట్టి షాక్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కారణం ఇదే.. ఓపెన్ ఏఐ(OpenAI) సంస్థ 'శామ్ ఆల్ట్మన్'ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ ఆర్థిక సహకారం ఉన్న కంపెనీ ఆయనను విశ్వసించకపోవడమే సీఈఓగా తొలగించడానికి ప్రధాన కారణమని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా.. ఆల్ట్మన్ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదని కంపెనీ వెల్లడించింది. తాత్కాలిక సీఈఓగా.. ప్రస్తుతం శామ్ ఆల్ట్మన్ స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 'మిరా మురాటీ' సీఈవోగా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. త్వరలోనే అధికారికంగా సీఈఓ ఎవరనేది సంస్థ ప్రకటించనుంది. ఆల్ట్మన్ తొలగింపు నిర్ణయం టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. కంపెనీ సీఈఓ పదవి పోయిన తరువాత ఆల్ట్మన్ స్పందిస్తూ.. 'ఓపెన్ఏఐలో పని చేయడం తనకు చాలా ఇష్టమని, ఎంతోమంది ప్రతిభావంతులతో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని' తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. i loved my time at openai. it was transformative for me personally, and hopefully the world a little bit. most of all i loved working with such talented people. will have more to say about what’s next later. 🫡 — Sam Altman (@sama) November 17, 2023 -
చాట్జీపీటీపై సంచలన రిపోర్ట్.. త్వరలో దివాలా తీయడం ఖాయం!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం చాట్ జీపీటీ (ChatGPT) రూపకర్త, సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ (OpenAI) ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతోందని, 2024 చివరి నాటికి కంపెనీ దివాలా తీసే అవకాశం ఉందని ‘అనలైటిక్స్ ఇండియా మ్యాగజైన్’ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం... తన ఏఐ సర్వీసుల్లో ఒకటైన చాట్జీపీటీ నిర్వహణకు ఓపెన్ ఏఐ కంపెనీకి రోజుకు 7 లక్షల డాలర్లు (సుమారు రూ. 5.80 కోట్లు) ఖర్చవుతోంది. దీంతో ఆ కంపెనీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జీపీటీ-3.5, జీపీటీ-4తో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించినా పెద్దగా లాభం లేకపోయింది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కంపెనీ సతమతవుతోంది. 2022 నవంబర్లో చాట్జీపీటీని ప్రారంభించిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్గా అవతరించింది. ప్రారంభ దశల్లో రికార్డు స్థాయిలో యూజర్ల ప్రవాహం వచ్చినా.. ఇటీవల కొన్ని నెలులుగా యూజర్ల సంఖ్యలో క్రమంగా క్షీణతను చూస్తోంది. జులై చివరి నాటికి చాట్ జీపీటీ యూజర్ బేస్ మరింత పడిపోయిందని ‘సిమిలర్ వెబ్’ డేటా చెబుతోంది. 2023 జూన్తో పోల్చితే జులై నెలలో యూజర్ బేస్ 12 శాతం తగ్గిందని, 1.7 బిలియన్ల నుంచి 1.5 బిలియన్లకు పడిపోయిందని పేర్కొంది. ఇదీ చదవండి: అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్.. 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది! కంపెనీ ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్)లు కూడా వైఫల్యానికి కారణంగా తెలుస్తోంది. అనేక కంపెనీలు గతంలో తమ ఉద్యోగులను చాట్ జీపీటీని ఉపయోగించకుండా కట్టడి చేసినట్లుగా నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడు ఓపెన్ఏఐ ఏపీఐలకు యాక్సెస్ పొందడం ప్రారంభించిన కంపెనీలు.. విభిన్న వర్క్ఫ్లోల కోసం వారి సొంత ఏఐ చాట్బాట్లను రూపొందించేందుకు వీలు కల్పిస్తున్నట్లు నివేదిక వివరించింది. ఓపెన్ ఏఐ సంస్థ ఇంకా లాభాల్లోకి రాలేదని నివేదిక చెబుతోంది. గత మే నెలలో చాట్ జీపీటీని అభివృద్ధి చేయడం ప్రారంభించినప్పటి నుంచి దాని నష్టాలు 540 మిలియన్ డాలర్లకు రెట్టింపు అయ్యాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితోనే ఓపెన్ ఏఐ కంపెనీ కొంతలోకొంత నెట్టుకొస్తోంది. మరోవైపు ఓపెన్ ఏఐ కంపెనీ 2023 సంవత్సరంలో 200 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది. 2024లో అది ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావించింది. కానీ నష్టాలు మాత్రమే పెరుగుతున్నందున లాభాలు అసాధ్యంగా కనిపిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. -
‘ఆ AI టూల్ను షట్డౌన్ చేస్తున్నాం’.. చాట్జీపీటీ సృష్టికర్త సంచలన ప్రకటన!
గత ఏడాది విడుదలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్జీపీటీ గురించి, దానిని తయారు చేసిన ఓపెన్ ఏఐ సంస్థ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. చాట్జీపీటీ విడుదలతో ఎథిక్స్, ప్రిన్సిపల్స్’ వంటి అంశాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాటిలో, ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్ధులకు ఏదైనా అసైన్మెంట్లు ఇస్తే.. వాటిని విద్యార్ధులు పూర్తి చేశారా? లేదంటే చాట్జీపీటీ నుంచి సేకరించారా? అనే విషయాల్ని గుర్తించడం కష్టంగా మారింది. ఈ అంశంపై రచయితలు, టీచర్లు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అదే సమయంలో ఆర్టిఫియల్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ రాసిన కంటెంట్ను గుర్తించేందుకు కొన్ని రకాల టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఓపెన్ఏఐ కూడా ఓ టూల్ను డెవలప్ చేసింది. ఇప్పుడా టూల్ను షట్డౌన్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ది వెర్జ్ నివేదిక ప్రకారం..ఓపెన్ ఏఐ హ్యూమన్స్, ఏఐ టూల్స్ కంటెంట్ను గుర్తించేందుకు ఏఐ క్లాసిఫైర్ అనే టూల్ను యూజర్లకు అందించింది. ఆ టూల్ను ఇప్పుడు నిలిపివేస్తున్నట్లు ఓపెన్ ఏఐ తన బ్లాగ్పోస్ట్లో పేర్కొంది. బ్లాగ్ పోస్ట్లో ‘జులై 20, 2023 నుంచి ఏఐ క్లాసిఫైర్ టూల్స్ అందుబాటులో ఉండటం లేదు. హ్యూమన్స్, ఏఐ కంటెంట్ను గుర్తించే విషయంలో తాము రూపొందించిన టూల్ ఊహించని విధంగా పనిచేయడం లేదు. అందుకే ఏఐ క్లాసిఫైర్ సేవల్ని నిలిపివేస్తున్నాం. అంతేకాదు, కంటెంట్ను సమర్థవంతంగా ఎలా గుర్తించాలో తెలుసుకునేందుకు రీసెర్చ్ చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మెకానిజాన్ని తయారు చేస్తున్నాం. తద్వారా యూజర్లు ఏఐ జనరేటెడ్ విజువల్ కంటెంట్, ఆడియోలను అర్ధం చేసుకునే అవకాశం కలగనుందని’ ఓపెన్ ఏఐ తన పోస్ట్లో వెల్లడించింది. నవంబర్ 30, 2022న ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని యూజర్లకు పరిచయం చేసింది. చాట్జీపీటీ విడుదల అనంతరం ఏఐ జనరేటెడ్ టూల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సంస్థలు తమకు కావాల్సిన కంటెంట్ను మనుషులు రాస్తున్నారా? లేదంటే ఏఐ టూల్స్ నుంచి సేకరిస్తున్నారా? అని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అప్పుడే ఓపెన్ ఏఐ కంటెంట్ను గుర్తించేందుకు ఏఐ క్లాసిఫైర్ టూల్ను తయారు చేసింది. కానీ 100 శాతం ఏఐ విడుదల చేసిన కంటెంట్ను 26 శాతం గుర్తిస్తుండగా.. మనుషులు సరైన కంటెంట్ను రాసినా.. మీరు రాసింది తప్పేనంటూ 9 శాతం ఫలితాల్ని అందించింది. ఈ క్రమంలో చేసేది లేక ఓపెన్ ఏఐ ఏఐ క్లాసిఫైర్ టూల్ను షట్డౌన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చదవండి👉 చాట్జీపీటీకి సవాల్ విసిరేలా..ఎలాన్ మస్క్ ‘AI’ స్టార్టప్ ప్రారంభం! -
చాట్జీపీటీకి సవాల్ విసిరేలా..ఎలాన్ మస్క్ ‘AI’ స్టార్టప్ ప్రారంభం!
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ ఏఐ (xAI)ని ప్రారంభించారు. ఏఐ కోసం గూగుల్, ఓపెన్ ఏఐతో పాటు అమెరికాలో ఇతర పేరున్న టెక్నాలజీ సంస్థలకు చెందిన నిపుణులను నియమించుకున్నారు. తద్వారా చాట్జీపీటీకి గట్టి పోటీ ఇస్తూ ప్రత్యామ్నాయంగా తన సంస్థను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. గత కొంత కాలంగా మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీతో రాబోతున్న ప్రమాదాల్ని హెచ్చరిస్తున్నారు. ‘ఏఐ టెక్నాలజీ పైలట్ లేని విమానం వంటిది. అది అణుబాంబుతో సమానం. మానవ ఉనికిని నాశనం చేస్తుందని’ ఆరోపించారు. అంతేకాదు ఏఐని నియంత్రించేలా రెగ్యూలేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. Announcing formation of @xAI to understand reality — Elon Musk (@elonmusk) July 12, 2023 అయితే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీలోని వాస్తవాలకు కొత్త అర్ధం చెప్పేలా ఎక్స్ఏఐని స్థాపించినట్లు ట్వీట్ చేశారు. మస్క్ ఏఐ సంస్థ జులై 14ను ట్విటర్ స్పేస్ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. మస్క్ బృందంలో మహామహులు చాట్ జీపీటీకి పోటీగా మస్క్ స్థాపించిన ఏఐ సంస్థ ఎక్స్ఏఐలో పలు దిగ్గజ కంపెనీల్లో కృత్తిమ మేధ విభాగంలో పనిచేసిన నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో డీప్మైండ్ మాజీ ఇంజనీర్ ఇగోర్ బాబూస్కిన్, గూగుల్లో పనిచేసిన టోనీ వు, గతంలో మైక్రోసాఫ్ట్లో పనిచేసి ఆ తర్వాత గూగుల్లో చేరిన రీసెర్చ్ సైంటిస్ట్ స్జెగెడీ మస్క్ టీంలో ఉన్నారు. చదవండి : జాబ్ మార్కెట్లో ‘AI’ విధ్వంసం..ఉద్యోగులకు విప్రో బంపరాఫర్! -
చాట్జీపీటీ కథ కంచికేనా? రోజురోజుకు భారీగా పడిపోతున్న యూజర్లు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్ చాట్జీపీటీకి భారీ షాక్ తగిలింది. 2022 నవంబర్లో మార్కెట్లో విడుదలైన నాటి నుంచి తొలిసారి ఆ యాప్ను ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. అందుకు వినియోగదారుల్లో కృత్తిమ మేధ టూల్స్, ఇమేజ్ జనరేటర్స్ టూల్స్ వినియోగించడంలో ఆసక్తి తగ్గడానికి సంకేతమని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. చాట్జీపీటీ! టెక్నాలజీ యుగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఒక చాట్బోట్. చాట్జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐ సంస్థ గత ఏడాది నవంబర్లో యూజర్లకు పరిచయం చేసింది. ప్రారంభంలో ప్రపంచంలోనే వేగంగా విస్తరిస్తున్న యాప్గా రికార్డ్లను నమోదు చేసింది. గూగుల్లాంటి దిగ్గజ సంస్థలకు సవాల్ విసురుతూ రాకెట్ వేగంతో ప్రపంచాన్ని చుట్టేసేంతలా కేవలం 2 నెలల్లోనే 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. ఒక్క జనవరిలో రోజుకు 13 మిలియన్ల మంది దీన్ని వినియోగించినట్లు యూబీఎస్ రీసెర్చ్ వెల్లడించింది. ఇతర యాప్లు ఈ మైలురాయిని చేరటానికి దాదాపుగా రెండున్నరేళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. సిమిలర్ వెబ్ నివేదికలో సిమిలర్ వెబ్ నివేదిక ప్రకారం..చాట్జీపీటీని వినియోగించే వారి సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మే - జూన్ నెలలో కాలంలో ఏఐ యూజర్లు 9.7శాతం పడిపోయారు. సందర్భాన్ని బట్టి అవసరం కోసం చాట్జీపీటీని వాడుకునే యూనిక్ విజిటర్స్ సైతం 5.7 శాతం తగ్గారు. అమెరికాలో చాట్జీపీటీ పరిస్థితి మరింత దారుణంగా పడిపోతుంది. ఇక్కడ నెలవారీగా 10.3 శాతం మంది యూజర్లు ఉపయోగించుకోవడమే మానేశారు. అంతేకాదు, వెబ్సైట్లో సందర్శకులు గడిపిన సమయం కూడా 8.5శాతం తగ్గినట్లు సిమిలర్ వెబ్ నివేదిక పేర్కొంది. ట్రాఫిక్ సైతం పడిపోయింది ఆ రిపోర్ట్ను నిశితంగా పరిశీలిస్తే, నవంబర్ 2022లో ప్రారంభించినప్పటి నుండి వృద్ది (పెరగడం) తటస్థంగా కొనసాగుతూ వచ్చింది. విజిట్ చేసే యూజర్ల సంఖ్య ఫిబ్రవరి - మార్చి నెలల్లో 10 బిలియన్ల నుంచి 15 బిలియన్లకు చేరింది. విచిత్రంగా ఏప్రిల్ -మే’లలో గ్రోత్ రేట్ తగ్గింది. యూనిక్ విజిటర్స్ సైతం పెరిగినట్లు సిమిల్ వెబ్ నివేదిక చెబుతోంది. అంచనాలు తప్పాయ్ చాట్జీపీటీ నెలవారీ యూజర్లు 20 బిలియన్ల నెలవారీ ట్రాఫిక్ మార్కును దాటుతుందని ప్రారంభ అంచనాలు చెప్పినప్పటికీ, అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. వెబ్ సైట్ ప్రారంభ సమయంలో అందులో యూజర్లు గడిపిన సమయం 6 నిమిషాలే. మార్చి నెలలో 8 నిమిషాల కంటే ఎక్కువ. ప్రస్తుతం 8 నిమిషాల్లోపే ఉంది. ఇతర టూల్స్ సైతం ట్రాఫిక్ తగ్గుదల చాట్ జీపీటీ మాత్రమే కాకుండా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ కేరక్టర్. ఏఐ సైతం ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సిమిలర్ వెబ్ నివేదిక హైలెట్ చేసింది. ఈ ఏడాది మే నెలలో గరిష్ట స్థాయికి చేరుకున్న క్యారక్టర్. ఏఐ యూజర్లు మే నుంచి జూన్ మధ్య కాలంలో తగ్గుముఖం పట్టారు. గతంలో క్యారక్టర్.ఏఐలో యూజర్లు గడిపే సమయం 25.4 నిమిషాల నుంచి 8.5 శాతానికి చేరింది. యూజర్లు పడిపోవడానికి కారణం అయితే, ఏఐ టూల్స్కు వినియోగదారులు తగ్గడానికి ప్రధాన కారణం వాటిపై నమ్మకం కోల్పోవడమేనని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా చాట్జీపీటీ వంటి టూల్స్లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. గూగుల్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్తో పాటు ఇతర ఏఐ టూల్స్ తయారీ సంస్థలు తమకు పరిష్కారం చూపించమని యూజర్లు వాటిని అడిగితే.. తప్పుడు సమాచారం అందించి.. తాము అందించింది సరైందేనని నమ్మించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోడింగ్ తయారు చేసే సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. నమ్మకం కోల్పోతుంది మరోవైపు, సున్నితమైన కంపెనీ డేటాను చాట్జీపీటీ టూల్స్తో పంచుకోవడం వల్ల సంస్థ రహస్యాలు బహిర్ఘతం అవుతాయేయమోనన్న ఆందోళనతో చాలా కంపెనీలు చాట్జీపీటీని వినియోగించడంలో నిషేధించాయి. ఈ సందర్భంగా యూజర్లు తగ్గడంపై.. ‘ఓ మై గాడ్ ఇది అద్భుతం’ అని బిల్డర్. ఏఐ సీఈవో సచిన్ దేవ్ దుగ్గల్ అన్నారు. చాట్జీపీటీ యాప్స్ను రూపొందించడంలో ఉపయోగపడుతుంది. కానీ,యాప్స్లలో తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారంటూ యూజర్లు సంస్థలపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మొదట్లో చాట్జీపీటీ వినియోగం బాగుంది. కానీ రాను రాను దాని అవసరం తగ్గిపోతున్నట్లు గ్రహించినట్లు దుగ్గల్ చెప్పారు. చదవండి👉 ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో, ఆందోళనలో సగం మంది భారతీయులు! -
భారత పర్యటనలో చాట్జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్.. అందుకేనా?
కృత్తిమ మేధ (Artificial Intelligence) చాట్జీపీటీ మాతృసంస్ధ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ భారత్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. భారత్తో పాటు ఇజ్రాయిల్, జోర్డాన్, ఖతార్, యూఏఈ, సౌత్ కొరియాలలో సైతం పర్యటించన్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. ఇందుగలడందులేడని సందేహము వలదన్న మాట కృత్రిమమేధకి సరిగ్గా సరిపోతుంది. చాట్జీపీటీ విడుదలతో విద్య నుంచి వైద్యం వరకూ, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ప్రపంచ దేశాల్లోని పలు సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ముడిపడుతున్నాయి. ఈ తరుణంలో ఆల్ట్మన్ భారత పర్యటన చర్చాంశనీయంగా మారింది. excited to visit israel, jordan, qatar, the uae, india, and south korea this week! — Sam Altman (@sama) June 4, 2023 ఓపెన్ఏఐ సీఈవో భారత్కు ఎందుకు వస్తున్నారు? ఏఐ విభాగంలో పరిశోధన - అభివృద్ధిలో భారత్ ప్రపంచంలోని సాంకేతికంగా ముందజలో ఉన్న దేశాలతో పోటీపడుతుంది. ప్రస్తుతం వేగంగా వృద్ది చెందుతున్న కృత్తిమ మేధపై పట్టుసాధిస్తూ ఏఐ గ్లోబల్ హబ్గా భారత్ను తీర్చిదిద్దాలని ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ వల్ల భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా విధి - విధానాల రూపకల్పనలో భాగం కావాలని ఆహ్వానించినట్లు కేంద్రం ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆల్ట్మన్ భారత్లో పర్యటించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? -
‘AI’ విధ్వంసం : వేలాది మంది ఐటీ ఉద్యోగుల తొలగింపు!
ఓ వైపు ఆర్ధిక మాంద్యం భయాలు మరోవైపు చాపకింద నీరులా వ్యాపిస్తున్న కృత్తిమ మేధ (artificial intelligence). వెరసీ టెక్నాలజీ రంగానికి చెందిన ఉద్యోగుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. మాంద్యం భయాలతో టెక్ సంస్థలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగులకు చాట్జీపీటీ రూపంలో మరో ఉపద్రవం ముంచుకొస్తుందా అనేది ఊహకు కూడా అందడం లేదు. తాజాగా విడుదలైన ఓ నివేదిక ఈ ఏడాదిలో భారీ సంఖ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (AI) కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది నెలలుగా టెక్ జాబ్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో గత ఏడాది నవంబర్ నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ విడుదల చేసిన ఏఐ టూల్ చాట్జీపీటీతో ఉద్యోగుల పరిస్ధితి మరింత ఆందోళనకరంగా మారింది. చాట్జీపీటీకి ఊహించని విధంగా అనూహ్య స్పందన రావడంతో గూగుల్, మైక్రోసాఫ్ట్తో పాటు వందలాది కంపెనీలు ఏఐ టూల్స్ను రూపొందించే పనిలో పడ్డాయి. టెక్ విభాగంలో ఎంతో కష్టతరమైన పనుల్ని అవలీలగా చేస్తుండడంతో సంస్థలు ఏఐ టూల్స్తో మనుషుల స్థానాన్ని భర్తి చేస్తున్నాయి. దీంతో మేలో ఏకంగా 4000 మంది టెకీలను ఏఐ రీప్లేస్ చేసిందనే రిపోర్ట్ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. అమెరికా కేంద్రంగా ప్లేస్మెంట్, ట్రాన్స్ లేషన్ కార్యకలాపాలు నిర్వహించే ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ సంస్థ ఓ రిపోర్ట్ను వెలుగులోకి తెచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. గత నెలలో మొత్తం 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా..వారిలో కృత్తిమ మేధ టూల్స్ కారణంగా 3,900 మంది నిరుద్యోగులయ్యారని హైలెట్ చేసింది. ఆర్ధిక అనిశ్చితి, ఖర్చు తగ్గింపు, పునర్నిర్మాణం’ వంటి కారణాలతో సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు తెలిపింది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 4 లక్షల మందిని తొలగించినట్లు నివేదిక స్పష్టం చేసింది. దీనికి తోడు అమెరికన్ కంపెనీలు మనుషులు చేసే ఉద్యోగాల్లో చాట్జీపీటీని వాడటం ప్రారంభించినట్లు మరో అధ్యయనం వెల్లడించింది. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ .. ఆణుబాంబు తయారీతో సమానం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్జీపీటీ వినియోగంపై ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐని సృష్టించడం అంటే అణు బాంబును తయారు చేయడంతో సమానమని అన్నారు. దీంతో కృత్తిమ మేధస్సు వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రముఖుల్లో వారెన్ బఫెట్ చేరిపోయారు. చాట్జీపీటీ టూల్స్ వినియోగం వల్ల మానవ మనుగడుకు ప్రశ్నార్ధకంగా మారుతుందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఏఐని నిలిపివేయాలని లేఖలు సైతం రాశారు. తాజాగా ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు ఊతం ఇచ్చేలా వారెన్ బఫెట్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చాంశనీయంగా మారింది. చదవండి👉 ‘ఆఫీస్కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీల వార్నింగ్ నెబ్రాస్కాలోని ఒమాహాలో జరిగిన బెర్క్షైర్ హాత్వే వార్షిక సమావేశంలో చర్చ సందర్భంగా వారెన్ బఫెట్.. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని అణు బాంబుతో పోల్చారు. ఈ అంశాన్ని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. కొంతకాలం క్రితం ప్రముఖ బిలియనీర్, తన స్నేహితుడు బిల్ గేట్స్ చాట్జీపీటీ గురించి చెప్పినప్పుడు..దాని సామార్ధ్యాలకు గురించి తెలుసుకొని ఆశ్చర్య పోయా. కానీ, సాంకేతికతపై తాను కొంచెం భయపడుతున్నానని చెప్పారు. అన్ని రకాల పనులు ఒక్కరే చేయగలిగే శక్తి సామర్ధ్యాలు ఉన్నప్పుడు మనం మిగిలిన పనుల్ని చేయలేం. కొత్తగా సృష్టించలేం. మనం చేసే పని మంచిదై ఉండొచ్చు. కానీ అందులోనూ కొన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయి. అందుకు సరికొత్త నిర్వచనమే అణుబాంబు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు ప్రయోగం రుజువు చేసిందని గుర్తు చేశారు. మనం ఏం చేసినా.. ఏది కనిపెట్టినా 200 ఏండ్ల తర్వాత ప్రపంచానికి మేలు చేసేలా ఉండాలి. ప్రపంచం మొత్తాన్ని ఏఐ మార్చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పిన ఆయన ఏ టెక్నాలజీ మానవ మేధస్సు కంటే మెరుగ్గా ఆలోచిస్తాయనని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
చాట్జీపీటీతో సైబర్ దాడులు.. ఒక్కో కంపెనీపై వారంలో 2,108 సార్లు..
న్యూఢిల్లీ: దేశీయంగా కంపెనీలపై సైబర్ దాడులు మరింత పెరిగాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రతీ వారం సగటున ఒక్కో కంపెనీపై 2,108 దాడులు జరిగినట్టు చెక్ పాయింట్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగినట్టు పేర్కొంది. సైబర్ నేరస్థులు తమ దాడుల కోసం చాట్ జీపీటీ వంటి టూల్స్ను దుర్వినియోగం చేస్తున్నారని, కోడ్ జనరేషన్కు వినియోగిస్తున్నారని తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే మార్చి త్రైమాసికంలో కంపెనీలపై సైబర్ దాడులు 7 శాతం పెరిగాయి. ఒక్కో వారం సగటున ఒక్కో సంస్థ 1,248 దాడులను ఎదుర్కొన్నది. అంతర్జాతీయంగా విద్య, పరిశోధన రంగాల్లోని కంపెనీలపై ఎక్కువ సైబర్ దాడులు నమోదయ్యాయి. ఒక్కో వారం సగుటన ఒక్కోసంస్థపై 2,507 దాడులు జరిగినట్టు, 15 శాతం పెరిగినట్టు చెక్ పాయింట్ వెల్లడించింది. -
ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు!
ఓపెన్ ఏఐ ఆధారిత చాట్జీపీటీ టెక్నాలజీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తుంది. ఆర్ధిక మాంద్యంలోనూ లక్షల ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. దీంతో ఆయా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిష్ణాతులైన నిపుణులకు డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నాస్కామ్ అంచనా ప్రకారం భారత్లో ప్రస్తుతం 4.16 లక్షల ఏఐ నిపుణులు ఉండగా..మరో 2.13 లక్షల మంది అదనపు ఏఐ ఇంజినీర్లకు డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ నుండి యూరప్, ఆసియా దేశాల్లో ఏఐలకు భారీ డిమాండ్ ఏర్పడింది. చాట్జీపీటీ రాకతో గూగుల్, బైదు వంటి దిగ్గజ సంస్థలు సొంత సెర్చ్ ఇంజిన్లను తయారు చేసే పనిలో పడ్డాయి. ఇలా ఒక్క టెక్నాలజీ రంగంలోనే కాకుండా మిగిలిన సెక్టార్లలో ఏఐల కొరత తీవ్రంగా ఉంది. టెక్నాలజీయేతర రంగంలోనూ డిమాండ్ హెల్త్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ వరకు దాదాపు ప్రతి రంగంలో ఏఐ నిపుణుల అవసరం ఏర్పడింది. ఆ కొరతను అధిగమించేందుకు ఇందుకోసం ఉద్యోగులకు భారీ ప్యాకేజీలు ముట్టజెప్తున్నాయి ఆయా సంస్థలు. అంతేకాదు ఏఐ విభాగంలో ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి మరో కంపెనీలో చేరే సమయంలో 35 శాతం నుంచి 50 శాతం వరకు వేతనాన్ని అదనంగా చెల్లిస్తున్నాయి. అయినా ఏఐలో నిష్ణాతులైన ఉద్యోగులు కావాల్సి ఉంది. భారత్లో ఏఐ నిపుణలు కొరత ప్రస్తుతం, స్కామ్ లెక్కల ప్రకారం దేశంలో సుమారు 5.4 మిలియన్ల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోవిడ్-19 లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచంలోనే ఐటీ రంగానికి వెన్నెముకగా నిలిచిన భారత్ సైతం డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ల కొరత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. డిమాండ్ దృష్ట్యా ఆ రంగంలోని ఉద్యోగులకు కంపెనీలు అధికంగా వేతనాలు అందిస్తున్నాయి. ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్లు అమెరికా సియోటెల్ కేంద్రంగా స్టార్టప్ ఫ్లెక్సికార్ కార్ షేరింగ్ (ఓలా తరహాలో) సేవల్ని అందిస్తుంది. ఆ సంస్థ ఇప్పుడు బెంగళూరు డేటా సైన్స్ హబ్లో కంప్యూటర్ విజన్ స్పెషలిస్టులు, ఇంజినీర్ల టీం నిర్మిస్తున్నది. ఈ సందర్భంగా ఏఐ నిపుణుల కోసం ఆయా టెక్ కంపెనీలు ఉద్యోగులకు చేస్తున్న ఆఫర్లు విచిత్రంగా ఉన్నాయని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (cfo) ఫ్రీడమ్ డుమ్లావ్ అన్నారు. తాను ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసినట్లు చెప్పారు. ఇంటర్వ్యూ సందర్భంగా సదరు ఉద్యోగి తన కంపెనీలో చేరితే శాలరీతో పాటు బీఎండబ్ల్యూ బైక్ను ఇచ్చేందుకు మరో సంస్థ ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు టెక్నాలజీ రంగంలో ఏఐల కొరత ఏ విధంగా ఉందోనని వ్యాఖ్యానించారు. గూగుల్ ఐదుగురు ఉద్యోగులతో ప్రారంభమై.. ఇక, కృత్తిమ మేధ నిపుణుల కొరతను అధిగమించేందుకు దేశీయ టెక్ కంపెనీ టీసీఎస్ ఔట్ సోర్స్ విధానంపై దృష్టి సారించినట్లు నివేదికలు చెబుతున్నాయి. సపోర్ట్, సర్వీస్, సాఫ్వేర్ తయారీల కోసం టీసీఎస్ వరల్డ్ వైడ్గా టెక్ నిపుణుల కోసం అన్వేషిస్తుంది. ఇక భారత్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లు సొంతంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి వేల మంది ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. 2004లో గూగుల్ భారత్లో ఐదు మంది ఉద్యోగులతో సేవల్ని ప్రారంభింది. ఇప్పుడు దాదాపు 10,000 మంది ఉద్యోగులున్నారు. 2లక్షల మంది నిపుణుల అవసరం ఇప్పుడు అదే గూగుల్ సైతం దేశీయంగా ఏఐ ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటుంది. దేశంలో ఏఐ, డేటా సైన్స్లో దాదాపు 416,000 మంది పని చేస్తున్నారు. మరో 213,000 మంది కావాలని నాస్కామ్ అంచనా వేసింది. తక్కువ జీతం.. తక్కువ వేతనాల కోసం స్కిల్డ్ నిపుణుల కోసం ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలు 2022లో భారత్లో 66 టెక్ ఇన్నోవేషన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. వాటి సంఖ్య 1600కి చేరింది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు లేదా క్యాప్టివ్లు అని పిలిచే ఈ కేంద్రాల్లో ఐటీ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ వంటి టాస్క్లను నిర్వహిస్తుంటారు ఉద్యోగులు. భారత్వైపు.. ప్రపంచ ఐటీ కంపెనీల చూపు బెంగళూరులో ప్రపంచంలోని పలు దిగ్గజం కంపెనీలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది మూడు నెలల్లో అసెట్ మేనేజర్ అలయన్స్బెర్న్స్టెయిన్ హోల్డింగ్ ఎల్పీ, కార్ రెంటల్ కంపెనీ అవిస్ బడ్జెట్ గ్రూప్, ఎంటర్టైన్మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ కు చెందిన డిస్కవరీ ఇంక్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ తయారీ సంస్థ ప్రాట్ & విట్నీ, గోల్డ్మన్ సాచ్, వాల్మార్ట్ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్కు భారీ ప్యాకేజీలు అందిస్తున్నాయి. చివరిగా చివరిగా..కొత్తగా ఐటీ రంగంలోకి వచ్చేవారు, కెరీర్ గ్యాప్ ఉన్నవారు, లేదంటే ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తూ టెక్నాలజీ రంగంలో పనిచేయాలనుకునే వారు ప్యాకేజీ గురించి ఆలోచించకుండా నైపుణ్యం పెంచుకోవడంపైనే ఫోకస్ చేయాలి. డేటా సైంటిస్ట్,మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో నైపుణ్యం సంపాదిస్తే కోరుకున్న కలల ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని టెక్నాలజీ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
ఈ ఒక్కపని చేస్తే చాలు రూ. 16 లక్షలు గెలిచే ఛాన్స్.. డోంట్ మిస్!
విడుదలైన కేవలం రెండు నెలల్లోనే వంద కోట్లమంది యూజర్లతో ప్రపంచాన్ని చుట్టేసిన చాట్జీపీటీ గురించి దాదాపు అందరికి తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్న చాట్జీపీటీ యూజర్లకు 'ఓపెన్ఏఐ' (OpenAI) కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం, చాట్జీపీటీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి చెప్పిన వారికి 20,000 డాలర్లు బహుమతిగా అందిస్తామని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 16 లక్షల కంటే ఎక్కువే. ఈ కొత్త ప్లాట్ఫామ్లో బగ్లను గుర్తించి పరిష్కరించే కార్యక్రమంలో భాగంగానే ప్రోగ్రామర్స్, ఎథికల్ హ్యాకర్స్ను ప్రోత్సహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రోగ్రామర్స్ లేదా ఎథికల్ హ్యాకర్స్ చాట్జీపీటీలో గుర్తించే బగ్ తీవ్రతను బట్టి బహుమతి ఉంటుంది. దీనికోసం ఓపెన్ ఏఐ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ మంగళవారం నుంచి మొదలైంది. ఇందులో తక్కువ బహుమతి 200 డాలర్లు కాగా (రూ. 16,000 కంటే ఎక్కువ), గరిష్టంగా 20,000 డాలర్ల వరకు బహుమతి పొందవచ్చు. మీరు గుర్తించే బగ్ మీ ప్రైజ్ మనీని డిసైడ్ చేస్తుంది. టెక్నాలజీ ఇండస్ట్రీలో ఇలాంటి బగ్స్ గుర్తించడం సులభమే, కానీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్లో బగ్ గుర్తించడం కష్టంతో కూడుకున్న పనే అనిచెబుతున్నారు. అయితే గతంలో సాఫ్ట్వేర్ సిస్టమ్స్లో కూడా బగ్స్ గుర్తించి బహుమతులు పొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. (ఇదీ చదవండి: బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ) చాట్జీపీటీ ఏ విధంగా పనిచేస్తోందని పరిశీలించి ఇందులో ఏదైనా సమస్య లోపాలను గుర్తించినప్పుడు కంపెనీ దానిని పరిష్కరిస్తుంది. అయితే ప్రస్తుతం చాట్జీపీటీ ఆదరణ ఎక్కువగా ఉన్నప్పటికీ యూజర్లు, వారి డేటాతో ఏ విధంగా డీల్స్ చేస్తుందనేదానిపై స్పష్టత లేదు. ప్రైవసీ రూల్స్ను అతిక్రమిస్తున్న కారణంగా ఇటలీలో దీనిని బ్యాన్ చేశారు. అంతే కాకుండా కొన్ని వ్యాపార కంపెనీలు, నిపుణులు దీనిని నిలిపివేయాలని ఇది రాబోయే రోజుల్లో ఎక్కువమంది మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. -
త్వరలో ‘చాట్జీపీటీ’తో ఊడనున్న ఉద్యోగాలు ఇవే!
చాట్జీపీటీ (ChatGPT) కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో తయారైన చాట్బాట్. ఏఐ చాట్ బాట్ టూల్స్ కొత్తపుంతలు తొక్కుతోన్న వేళ.. కొత్తగా వస్తోన్న టూల్స్ ఉద్యోగాలపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాట్జీపీటీ సృష్టికర్త, ఓపెన్ఏఐ అనే సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం ఏబీసీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆల్ట్మన్ చాట్జీపీటీ టెక్నాలజీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అధునాతమైన సాంకేతిక కారణంగా పలు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నట్లు తెలిపారు. తాజాగా రష్యాన్ - అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసెర్చర్ లెక్స్ ఫ్రిడ్మాన్ (Lex Fridman) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ ఇంటర్వ్యూలో ఆల్ట్మన్ మాట్లాడుతూ.. త్వరలో కస్టమర్ సర్వీస్ రంగానికి చెందిన భారీ ఎత్తున ఉద్యోగాల స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఏఐపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో కృత్రిమ మేధ వినియోగంపై నిషేదం విధించాలని పలు దేశాలు కొత్త చట్టాలు అమలు చేస్తున్నాయి. న్యూయార్క్కు చెందిన పలు స్కూల్స్లో చాట్ జీపీటీ వినియోగం నిషేదంలో ఉండగా.. సంస్థలు మాత్రం కొత్త కొత్త యాప్స్ను తయారు చేసుకొని వ్యాపార కార్యకలాపాలు జోరుగా సాగిస్తున్నాయి. చదవండి👉 చాట్జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్ సంచలన వ్యాఖ్యలు