poetry
-
World Poetry Day 2025 : పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే!
ప్రపంచ కవితా దినోత్సవం (World Poetry Day) మనసుల్లోతుల్లో దాగివున్న భావాన్ని, అనుభవాన్ని, బాధను, లోతైన గాథల్ని వ్యక్తికరించేందుకు అనుసరించే ఒక ప్రక్రియ కవిత. హృదయాంతరాలలోని భావాలను అర్థవంతంగా, స్ఫూర్తివంతంగా ప్రకటించే సామర్థ్యం కొందరికి మాత్రమే లభించే వరం. సాంస్కృతిక ,భాషా వ్యక్తీకరణ రూపాలలో ఒకటైన ఈ ప్రపంచ కవితా దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకోవడం ఆనవాయితీ. 1999లో పారిస్లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని మొదలు పెట్టింది. 1999లో పారిస్లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో UNESCO (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఆమోదించారు. భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సాంస్కృతిక మార్పిడి, . సృజనాత్మకతను ప్రోత్సహించడం కవిత్వం అంతరించిపోతున్న భాషలతో సహా భాషల గొప్పతనాన్ని చాటుకోవడం, సమాజాలకు స్వరాన్ని అందివ్వడం దీని ఉద్దేశం. విభిన్న సంస్కృతుల నుండి కవితలను పంచుకోవడం ద్వారా ఇతర ప్రజా సమూహాల అనుభవాలు, దృక్కోణాలపై అంతర్దృష్టులను పొందుతారు, సానుభూతి మరియు అవగాహనను పెంపొందిస్తారు.ప్రపంచ కవితా దినోత్సవం సందర్బంగా కొంతమంది మహిళా కవయిత్రుల కవితలను చూద్దాం. సమాజంలోని పురుషాహంకార ధోరణిని నిరసిస్తూ, ఆ భావజాలాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది స్త్రీవాద కవిత్వం. స్త్రీల భావాలను, బాధలను, స్త్రీలు మాత్రమే ప్రభావవంతంగా ఆవిష్కరింగలరు అనేదానికి అక్షర సత్యాలుగా అనేక కవితలు తెలుగు కవితా ప్రపంచంలో ప్రభంజనం సృష్టించాయి. స్త్రీ స్వేచ్ఛ, సాధికారత అన్ని రంగాల్లో సమాన హక్కులతో పాటు సంతానోత్పత్తి , మాతృత్వం మాటున దాగివున్న పురుషాధిక్యాన్నిచాటి చెప్పిందీ కవిత్వం.ఇందులో సావిత్రి, బందిపోట్లు కవిత మొదలు ఘంటశాల నిర్మల, కొండేపూడి నిర్మల, జయప్రభ, ఓల్గా, సావిత్రి, మందరపు హైమవతి, రజియా బేగం, పాటిబండ్ల రజని, బి. పద్మావతి, కె. గీత, ఎస్. జయ, శిలాలోలిత, విమల ఇలా ఎంతోమంది తమ కవితలను ఆవిష్కరించారు.తొలి స్త్రీవాద కవితగా 1972లో ఓల్గా రాసిన ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే కవితను విమర్శకులు గుర్తించారు. ‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులుగారన్నప్పుడు భయమేసింది, ‘ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరమొచ్చినా సెలవు ఇవ్వడ’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది.ఇంకా ‘అయ్యో! పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు’ అన్న పాటిబండ్ల రజనీ కవితతో పాటు, ‘లేబర్ రూం* రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ, కలపను చెక్కుతున్న రంపం కింద పొట్టులా ఉండచుట్టుకున్న బాధ. ఇది ప్రసవ వేదన కవితగా మారిన వైనం. ఇంకా పైటను తగలెయ్యాలి, చూపులు, అబార్షన్ స్టేట్మెంట్, సర్పపరష్వంగం, రాజీవనాలు, కాల్గళ్స్ మొనోలాగ్, గుక్క పట్టిన బాల్యం, కట్టుకొయ్య, గృహమేకదా స్వర్గ సీమ, దాంపత్యం, నిషిద్ధాక్షరి, నీలి కవితలే రాస్తాం, విమల సౌందర్యాత్మకహింస లాంటివి ఈ కోవలో ప్రముఖంగా ఉంటాయి.ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మరో కవితమనసుకు అలసటతో చెమట పట్టినపుడోదేహంలోని నెత్తురు మరిగినపుడోగొంతు అక్షరాల సాయం తీసుకుంటుందివేదన కళగా మారిసృజనాత్మకతనులేపనంగా అద్దుకుంటుందిశిశిరాలు వెంటపడిఅదేపనిగా తరుముతున్నప్పుడువసంతం కోసం చేసే తపస్సుపెనవేసుకున్న శీతగాలి ఖాళీతనపు భావాగ్నిని అల్లుకున్నపుడుతుపాన్లతో చైతన్య పరిచేదిచందమామ మాగన్నుగా నిద్రిస్తున్నపుడుకళ్ళు మూసుకున్న ప్రపంచాన్నివేకువ గీతాలై నిద్రలేపేదిఎప్పటికీ కాలని, విడగొట్టినా చీలనిఅనంతం నిండా వ్యాపించినఅక్షయం కాని అక్షర సముదాయంఒకానొక మహావాక్యమైఅద్వితీయ కావ్యమై నిలుస్తుంది.– ర్యాలి ప్రసాద్ -
‘సామాజిక’ సాహిత్యం
సాక్షి, అమరావతి: ‘వడగాడ్పు నా జీవితం.. వెన్నెల నా కవిత్వం’ అన్నారు గుర్రం జాషువా. ఆకలి కవిత్వం.. ఆలోచనే కవిత్వం.. కదిలించే ఘటనలు.. కవ్వించే ప్రతినలు.. కవితకు ప్రాతిపదికలు అంటూ కవిత్వం స్వరూపాన్ని వివరించారు శ్రీశ్రీ. రచనలతో సంస్కృతి, సంప్రదాయాల సంపదను, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కవుల పాత్ర గొప్పది. వారు సాహిత్యానికి, తద్వారా సమాజ ఉన్నతికి చేస్తున్న కృషి వెలకట్టలేనిది. వారి కవిత్వానికి గుర్తింపునిస్తూ ఏటా మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సామాజిక మాధ్యమాల ద్వారా సాహిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది. పడిలేచిన కెరటం: కాలంతో పాటు సాహిత్యకారులకు ఆదరణ కరువైంది. కరోనా మహమ్మారి ఈ పరిస్థితిలో కాస్త మార్పు తెచి్చంది. సామాజిక మాధ్యమాల ద్వారా రచయితలకు తిరిగి పూర్వ వైభవం వస్తోంది. అక్షర జ్ఞాన ప్రదర్శనకు అనువైన వేదికలు కల్పించే సాహిత్య సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. సామాజిక వేదికల ద్వారా దేశ విదేశాలను ఏకం చేస్తూ సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనుభవజు్ఞల నుంచి అప్పుడే అడుగులు వేస్తున్న వారికీ ఇక్కడ గుర్తింపు దక్కుతోంది. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలనే ఇతివృత్తంగా కవితలు, కథల పోటీలు నిర్వహిస్తుంటే, గెలుపొందిన వారితో పాటు పాల్గొన్న వారికీ ప్రోత్సాహక బహుమతులు, పురస్కారాలు లభిస్తున్నాయి. దీంతో యువతరంలోనూ క్రమంగా సాహిత్య రచనా కాంక్ష పెరుగుతోంది. ఎన్నో మార్గాలు : అభ్యుదయ కవిత్వం, భావ కవిత్వం, కాల్పనిక కవిత్వం అంటూ ఎవరు ఏం రాసినా పూర్వం పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురిస్తేగానీ ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటయ్యాయి. ప్రతిలిపి, పాకెట్ ఎఫ్ఎం, పాకెట్ నవల్ వంటి ఆన్లైన్ యాప్లో కథలు, కవితలు వినడం, చదడం వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.కవులు పెరిగారు సోషల్ మీడియా వేదికగా సాహిత్యానికి పెద్ద ప్లాట్ఫాం ఏర్పడింది. కరోనా తర్వాత ఆన్లైన్ వేదికలు రావడంతో ఎంతోమంది కవులు మారారు. కవులకు సరైన సాహిత్య మార్గ నిర్దేశకం అవసరం. అందుకే ప్రత్యేక వేదికలు కల్పిస్తున్నాం. – కత్తిమండ ప్రతాప్, రచయిత, శ్రీశ్రీ కళా వేదిక నిర్వాహకుడు సామాన్యులకు అర్థం అవుతోంది ఒకప్పుడు కవిత్వం రాసేవారిని వెతకాల్సి వచ్చేది. కరోనా తరువాత ప్రతి వంద మందిలో 10 మంది కవులు ఉంటున్నారు. ఏ కాలంలోనూ ఇంతమంది కవులు లేరు. – నిమ్మగడ్డ కార్తీక్, రచయిత, తపస్వి మనోహరం సాహిత్య వేదిక నిర్వాహకుడు -
Poetry: నిద్ర పూవు
రోజూ కురిసే చీకటికికంటి పాదులో పూచేనిద్ర పూవు వరం.దాని సమీరాలకిసకల అవయవాల పరవశమేఅలసటకు ఔషధం.పగలంతా అలసిన మనసురాత్రి చిటికిన వేలుపట్టుకుని,కల ఇంటికెళ్ళి తలుపుకొట్టి,కునుకు పరుపుపైఎదురుచూసే నిద్ర పూవునుమత్తుగా తురుముకోవడం భాగ్యం.పడక వీధిలో పరిగెత్తే ఆలోచనలనుమనసు మడతల్లో కళ్ళు నలుపుకునే సంగతులనుకళ్ళు తన కౌగిట్లో పిలుచుకునిచేసే మర్యాదలోతీర్చుకునే సేదకుపొందే తాజాదనం అదృష్టం.దీర్ఘ మైకంలోనూవేకువ పొలిమేర దాకా వచ్చివీడ్కోలు పలికే నిద్ర పూవుఓ ఆరోగ్య ప్రదాత,ఓ ఆనంద నౌక,ఓ అఖండ తేజం! -
పరమ యోగి..
రాలిపడిన పూవుల గాయాలరహస్యాలను శోధించే తోటమాలివి నీవు...దుర్గంధంతో జ్వలించే కీకారణ్యాన్ని జయించి చావు తావులను పసిగట్టే సత్యాన్వేషివి నీవు...పార్థివ దేహ గర్భగుడిలో సంచరించిమృత్యువు మూలతత్త్వాన్నిఅపర నారాయణులకుప్రవచించే పరమ యోగి నీవు...కరకు కత్తులు చేసిన రక్త సంతకాలతోనిర్జీవ గాత్రం నిండా ఘనీభవించిన గాయాలను, కామ తృష్ణ పరమ హింసలో ఛిద్రమైన శుక్త ఖండాలను,ఆచూకీ తెలియనిఉక్కు పాదాలకింద నలిగినఅనాథ కళేబరాలనువేయి చూపులతో దర్శించిమరణమూల్యాంకనం చేస్తావు..కుష్ఠురోగిని ఇష్ట దైవంగా కొలిచిన మహాతల్లిలా కుళ్లిన శవాలను ప్రాణమిత్రుల వలెపరామర్శిస్తావు...శవాల మీద విసిరిన చిల్లరను మూటగట్టుకోవడం చాలా సులభం!కానీ మూటగట్టిన శవాల్లోకినిర్భయంగా తొంగి చూడటమే కష్టం!వస్తువులతో కాపురం చేసే ప్రబుద్ధులుబతికి ఉన్న మనుషులను శవాలుగా చూస్తుంటే, శవాలను కూడా మనుషులుగా ప్రేమించే కరుణా జలపాతం నీవుమూర్తీభవించిన సాహసం నీవు స్ఫూర్తీభవించిన దివ్య సేవానిరతి నీవు.కన్నీటి ఎడారుల సాక్షిగామార్చురీ మైదానంలో నిర్విరామంగామహా యజ్ఞం నిర్వహించినమేరే ప్యారే సలీం భాయ్!పవిత్రమైన నీ చేతులనునాకిప్పుడు ముద్దాడాలనిపిస్తోంది! – కోయి కోటేశ్వరరావు, 9440480274 -
ఆమె ఎవరంటే...!?
ఆమె ఎవరని అడుగుతారేమో ఏమని చెప్పాలి!?ఆమె అక్షరం అని చెప్పనా..కష్ట జీవుల కన్నీటి వ్యథ అనాలా..ఆమె ఓ ధిక్కార స్వరం అని చెప్పనా!?ఏమని చెప్పాలి?అణిచివేతల సాచివేతల రాజ్యంలో ఆమె ఓ పోరాట జ్వాల..చీకటి కొనల మీద చిక్కటి వెలుగు తాను..ఆమె ఎవరని అడుగుతారేమో!ఆమె అన్నార్తులఆకలి కేకల పోరు నాదమని..గొంతు లేని ప్రజల గొంతుకని..ఆమె అక్షరం తెలియని వాళ్లఅడుగు జాడల్లో అక్షర దివిటని..ఆమె ప్రజా పోరు దారుల్లోఓ అడుగు జాడని చెప్పగలను..ఆమె గొంతు ఎందుకునొక్కుతున్నారని అడిగితే మాత్రం ఆమె శోషితుల పక్షమై నిల్చినందుకు..ఆమె పౌర హక్కులు అడిగినందుకు..ఆమె స్త్రీ సమానత్వం కోరినందుకు..ఆమె జాతి విముక్తి నినదించినందుకు..ఆమె స్వేచ్ఛను కోరినందుకే కదా!రాజ్య ద్రోహం అనే రాజ్య బహుమానం!! – వంగల సంతోష్ (అరుంధతీ రాయ్పై పెట్టిన కేసును ఖండిస్తూ)ఇవి చదవండి: సింగరేణి వివాదం.. కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు -
సాహితీ విస్తరిలో అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం”
వరద కాలం, కవన కుతూహలం అనేవి అబ్బూరి రాజేశ్వరరావు గారి సాహితీ కాలమ్స్. అబ్బూరి గారి నడకతో, శైలితో దీటుగా నడిచిన తెలుగు సాహితీ కబుర్ల రస గుళికలు అత్యంత పరమ అరుదు. సాహిత్య విస్తరి ముందు కూచున్న వారి భోజనం అబ్బూరి కాలమ్స్ చదవకుండా ఎప్పటికీ పూర్తి కానే కాదు.అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం” నుండి చిన్న ముక్క.వెంకటశాస్త్రి గారంటే శ్రీశ్రీకి అపార గౌరవభక్తులుండేవి. శాస్త్రి గారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేఁవి” టన్నాడు. అప్పటికే వయోవృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రిగారు మందహాసం చేసి “నేను కవి నేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరబాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రిగారు నవ్వారు. “కవిత్వం అంటే ఏదికాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం… మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను”. శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్త్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపలినుంచి పిలిచారు. మేము లేచాం. శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు. -“నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏఁవిటో… అంత సులభఁవటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో. నీకు నేనూ నాకు నువ్వూ తప్ప…అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు.-అన్వర్ సాక్షి -
‘ముకుంద’ కవితా రూపం
తెలుగు వర్తమాన వచన కవులలో నాకు మిక్కిలి ఇష్టమైన ముగ్గురు నలుగురు కవులలో యల్లపు ముకుంద రామారావు ఒకరు. మా గురువర్యులు ఆచార్య పింగళి లక్ష్మికాంతం సాహిత్య విమర్శ పాఠం చెపుతూ ‘కవిత్వము – వేదాంతము ఒకే కొమ్మకు పూచిన రెండు పువ్వులు’ అన్నారు. ఈ రెండు పువ్వుల సౌరభాలను మేళవించి, సారమతితో మంచి కవిత్వం చెప్పిన వారిలో ముకుంద రామారావు మొట్టమొదటి వారు. వృత్తిరీత్యా కంప్యూ టర్ ఇంజనీరు అయిన ముకుంద రామారావు ప్రవృత్తి రీత్యా మూర్తీభవించిన కవి. రామారావు 1995 నుండి 2017 వరకు 22 ఏళ్ల కాలంలో స్వీయ కవితా సంపుటాలను మాత్రమే ప్రచురించారు. రామారావు ఏ కవిత అయినా సరే సంక్షిప్తంగా, అనుభూతి సాంద్రంగా, ఆత్మీయతానుబంధంతో కూడి ఉంటుంది. ప్రకృతిలోనూ, మానవ జీవితంలోనూ దాగి ఉన్న సృష్టి రహస్యాన్ని వెదుకుతూ ఉంటుంది. తమ పెద్దమ్మాయికి పెండ్లి చేసి అత్తగారింటికి పంపిన తర్వాత ఆమె కోసం బెంగపెట్టుకొని ‘వలసపోయిన మందహాసం’ అనే మొట్టమొదటి కవిత వ్రాశారు రామా రావు. ఆ కవితకు ఎంతో పేరు వచ్చింది. 1995లో ఇదే శీర్షికతో మొదటి కవితా సంపుటిని వెలువరించారు. అక్కడి నుండి ఆయన కవితా దిగ్విజయ యాత్ర కొనసాగింది. ‘మరో మజిలీకి ముందు’ కవితా సంపుటికి ప్రముఖ కవి ఇస్మాయిల్ ‘కవిత్వ మజిలీ కథలు’ అనే పేరుతో చాలా గొప్ప పీఠిక వ్రాశారు. అందులో ‘ముకుంద రామారావు కవితల్లో సున్ని తమైన హృదయం అనుభవ ప్రకంపనలకు స్పందించే తీరు కనిపిస్తుంది. ఇక్కడ మనతో మాట్లాడేది హృదయం, హేతువు కాదు...’ అని రాశారు. ‘ఎవరున్నా లేకున్నా’ కవితా సంపుటికి ప్రముఖ కవి, అను వాదకుడు అయిన దీవి సుబ్బారావు తాను రాసిన పీఠికలో ‘ముకుంద రామారావు గారి వ్యక్తిత్వం నుండి కవిత్వాన్ని విడదీసి చూడలేము... ఇలాంటి కవిత్వాన్ని చెప్పడానికి మనిషి తాత్త్వికుడై ఉండాలి. చుట్టూరా ఉన్న మనుషుల్ని ప్రేమించ గలిగిన వాడై ఉండాలి. ముకుంద రామారావు గారు ఆ కోవకు చెందినవారు’ అని రాశారు. ‘నిశ్శబ్దం నీడల్లో’ కవితా సంపుటిలో శరీరంలోని ప్రాణాన్ని ఒక దీపంతో పోల్చుతూ ‘దేహ దీపం’ అనే ఆ చిన్న కవిత వ్రాశారు–‘దళసరి చర్మం / ఎముకల గూడు / రహస్య స్థావరంలో / దేహ దీపం! / ఎంతోకొంత వెలిగి / ఆరిపోతుందో / ఎగిరి పోతుందో / ఎవరికెరుక? / ఆపలేక / అందుకోలేక / జీవితాంతం ఆరాటం!!‘ స్వీయ అనువాద రచనలు రామారావు సాహిత్య కృషిలో ముఖ్యమైనవి. దీనిలో మొత్తం 14 గ్రంథాలున్నాయి. వీటిలో మొదటి అయిదు పుస్తకాలు ఈ ప్రపంచ సృష్టికి మూల భూతములయిన పంచభూతాల పేర్లతో వెలువడ్డాయి. ‘ఆకాశం – గాలి – నేల – కాంతి – నీరు‘ అనే వరుసలో తమ అనువాద గ్రంథాలను వెలువరించారు. ‘అదే నీరు’ పీఠికలో తనలో దాగివున్న పంచభూతాలను తెలియజేస్తూ, ఒక చక్కటి కవిత వ్రాశారు. ‘అవును/సూర్యుడు వస్తుంటాడు పోతుంటాడు –/ఆకాశం అదే!/ అలలు వస్తుంటాయి పోతుంటాయి –/సముద్రం అదే!/సముద్రం నువ్వయితే –/నీటిలో మునిగి ఈదాలనుకునే చేపని నేను!’ అని సాగే ఇంత గొప్ప కవితను ఈ మధ్యకాలంలో నేను చదవలేదు. దీనిని చదివిన నేను ‘ఈ కవితలో కలసిపోతిని, కరిగిపోతిని, కాన రాకే కదిలి పోతిని!’ – ప్రొ‘‘ తంగిరాల వెంకట సుబ్బారావు, సాహితీవేత్త (అజో–విభొ కందాళం వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం నేడు విశాఖలో ముకుంద రామారావు అందుకుంటున్న సందర్భంగా) -
దీర్ఘ కవితల నుండి దీర్ఘ కావ్యం దాకా...
‘తెలంగాణ కవులు సోక్రటీస్ వారసులు.’ – (జూలూరు పథం: పుట 43) తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ రాస్తే దీర్ఘకవితే రాస్తారు అని రూఢి అయ్యింది. ‘ఎలియాస్’, ‘పాదముద్ర’, ‘చెకిముకిరాయి’, ‘నాలుగో కన్ను’ నుండి దాదాపు 20 దీర్ఘ కవితలు రాసిన కవి గౌరీశంకర్. వాటి పరిణతి రూపంగా ఇప్పుడు ‘జూలూరు పథం’ వచన మహాకావ్యం రాశారు. ఇది 200 పుటల కావ్యం. ఇది ‘తెలంగాణ’ (కుందుర్తి),‘ నా దేశం నా ప్రజలు’ (శేషేంద్ర), ‘కొయ్యగుర్రం’ (నగ్నముని), ‘ఆసుపత్రి గీతం’ (కె. శివారెడ్డి), ‘విశ్వంభర’ (సినారె), ‘జలగీతం’ (ఎన్. గోపి) వంటి వచన మహాకావ్యాల కోవకు చెందిన కావ్యం. ‘జూలూరు పథం’ కావ్య విశిష్టత కేవలం దీర్ఘ కావ్యం కావడమే కాదు, అది ఆయన స్వీయ చరిత్రాత్మక కావ్యం. గుర్రం జాషువ తన జీవితాన్ని ‘నా కథ’ అని పద్యకావ్యంగా రాశారు. శీలా వీర్రాజు తన జీవితాన్ని ‘పడుగు పేకల మధ్య జీవితం’ అన్న వచన కావ్యంగా రాశారు. ఆ తానులో గౌరీశంకర్ తన జీవితాన్ని వచన కావ్యంగా రాశారు. ఇది కేవలం గౌరీశంకర్ సొంతగోల వర్ణనకే పరిమితమైన కావ్యం కాదు. ఇందులో ఆయన జీవిత చిత్రణ కొంతభాగమే. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజాయుద్ధ వర్ణనే ‘జూలూరు పథం’గా రూపుదిద్దుకొంది. తెలంగాణ తన నేలలో తాను పరాయీకరణకు గురై ఇతర ప్రాంతాల దోపిడీకి గురై తనను తాను విముక్తం చేసుకొని, తన రాష్ట్రం తాను ఏర్పాటు చేసుకున్న క్రమానికి ఈ కావ్యం విమర్శనాత్మక కళాత్మక ప్రతిబింబం. ‘తెలంగాణలో ఒక్కొక్కరు ఒక మహాకావ్యం’ అని తెలంగాణ ఔన్నత్యాన్ని నిర్వచించారు గౌరీశంకర్. కవి, కవిత్వం అంటే ఏమిటో వర్ణించి, తెలంగాణ కవుల సౌందర్యాన్ని నోరారా వర్ణించి తన జీవితాన్ని క్లుప్తంగా పరిచయం చేశారు మొదట. ‘జై తెలంగాణ అంటే నా జన్మ ధన్యమైంది’ అని పులకరించి పోతారు కవి. జై తెలంగాణ అంటేనే భార్య మెడలో తాళి కడతానన్న వరుని సంఘటనను పరిచయం చేశారు. 1956 అక్టోబర్ 31న అర్ధరాత్రి జరిగింది కొత్త ఆధిపత్యమని, కొత్త ఆక్రమణ అని నిర్వచించి దాని ముద్దుపేరు ‘సమైక్యత’ అని తన కంఠాన్ని స్పష్టంగా వినిపించారు. తెలంగాణ ఆహారం, తెలంగాణ సంస్కృతి ఈ కావ్యంలో కావ్య గౌరవం పొందాయి. తనను కవిగా, ఉద్యమకారునిగా నిలబెట్టిన తెలంగాణ గడ్డను గౌరీశంకర్ కృతజ్ఞతతో కీర్తించారు. కవిగా కవిత్వ శక్తి తెలిసిన గౌరీశంకర్, కవిత్వం ఏమి సాధిస్తుందంటే ‘ఒక రాష్ట్రాన్ని సాధించి పెడ్తది’ అన్నారు. తెలంగాణ రాష్ట్రోద్యమంలో కళారంగం నిర్దేశించిన చారిత్రక పాత్రను కవి గర్వంగా వర్ణించారు. ‘తెలంగాణ కవులు విముక్తి పోరు వారసులు’ అని నిర్వచించారు. తెలంగాణ రాష్ట్రోద్యమం విజయం సాధించడాన్ని ‘యుద్ధమిప్పుడు గెలిచిన కల’ అని పరవశించి చెప్పారు. గౌరీశంకర్ కవిత్వం ఒక ఉప్పెనలాగా ఉంటుంది. ఆవేశం, ఆవేదన, ఆగ్రహం ముప్పేట దాడితో ఆయన కవిత్వం నడుస్తుంది. మార్క్సిజం, అంబేడ్కరిజం సమన్వయ సిద్ధాంతంగా సాగుతున్న తీరును కవిత్వీకరించారు. ఆయన నడి గూడెం వడ్లబజారు నుంచి ప్రారంభించి అస్తిత్వ సాహిత్య ఉద్యమ జెండాలను పట్టుకుని తెలంగాణ నడిబొడ్డు నడిగడ్డ దాకా దీర్ఘకవితల్ని నడిపించాడు. తెలుగు సాహిత్యంలో దీర్ఘకవితల పథం ‘జూలూరు పథం.’ వ్యాసకర్త సాహితీ విమర్శకులు (రేపు హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘జూలూరు పథం’ ఆవిష్కరణ) -
వ్యక్తిగత విషయాలపై ఇంత విషమా..!
జగిత్యాలటౌన్: ‘తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. ఆడబిడ్డనైన నన్ను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్న మాటలు మీ ఆడబిడ్డలను అంటే మీకు సమ్మతమేనా..? నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి నన్ను ఏమన్నా ఒప్పుకుందా మా..? తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను అనుమతిద్దామా..? ’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో ప్రశ్నించారు. ఈ మేరకు కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్లో తాను ఓడిపోయాక, గెలిచిన వారికి పనిచేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నానని, గెలిచిన వ్యక్తి బాధ్యతలు విస్మరించి ఇష్టమొచ్చినట్లు వ్యక్తి గతంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా.. మీ అన్న చచ్చిపోతే పది లక్షలిస్తా.. మీ నాన్న ఇట్లా..’ అంటూ అర్వింద్ మాట్లాడటం.. ఇటువంటి భాషను ప్రయోగించడం ఎంతవరకు కరెక్టో ప్రజలు ఆలోచించాలని కవిత విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రాపాలకులపై మన నేతలు ఇలా అమర్యా దగా మాట్లాడలేదని గుర్తుచేశా రు. అలాంటి మర్యాదకరమైన రాజకీయాలు ఇప్పుడూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. కక్షలకు తెలంగాణలో తావులేదని స్పష్టం చేశారు. ఇలా అడ్డగోలుగా మాట్లాడేవాళ్లు ఉంటారనే అడబిడ్డలను ఉద్యోగాలకు పంపించడానికి తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి ఉందన్నారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చే ఆడబిడ్డలకు ఏం సందేశం ఇస్తున్నట్లని ప్రశ్నించారు. -
మై డియర్ కోహినూర్...
దిలీప్ కుమార్–సైరాభాను వేరు వేరు పేర్లు కావు. ఒకే నామం. వారిది ఆదర్శ దాంపత్య బంధం. దిలీప్ సాబ్–సైరాభానుల ఆన్–స్క్రీన్, ఆఫ్–స్క్రీన్ కెమిస్ట్రీ ‘ఆహా’ అనిపిస్తుంది. 78 ఏళ్ల వయసులో సైరాభాను తన డెబ్యూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో నెటిజనుల దృష్టిని ఆకట్టుకుంది. తొలి పోస్ట్లో భర్తను జ్ఞాపకం చేసుకొని, అతడికి ఇష్టమైన ఉర్దూ ద్విపదలను ఉటంకించింది. ఈ పోస్ట్కు నెటిజనులు ‘వహ్వా’ అంటున్నారు. ‘నేను సాహెబ్ అని ఎప్పుడూ పిలుచుకునే వ్యక్తి ఈరోజుకీ నాతోనే ఉన్నాడు. నాతోపాటే నడుస్తున్నాడు’ అంటూ దిలీప్ కుమార్ వర్థంతి సందర్భంగా తన మనసులోని మాట రాసింది. ఆమె పోస్ట్ చేసిన దిలీప్ కుమార్కు నచ్చిన కవితాపంక్తులు... ‘నాకు ప్రియమైన వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. నా ప్రపంచం నిశ్చలనంగా మారిపోయింది. మేలుకోవాల్సిందిగా అతడిని ప్రార్థిస్తున్నాను. అతడి మెలకువతో నా ప్రపంచం మళ్లీ చలనశీలం అవుతుంది’ -
నూరేళ్లుగా ఫలవంతం
ఇరవయ్యో శతాబ్దపు అత్యంత ప్రాధాన్యం కలిగిన కవితల్లో ఒకటని పేరొందిన ‘ద వేస్ట్ లాండ్’కు ఇది శతాబ్ది సంవత్సరం. టి.ఎస్. ఎలియట్ ఆంగ్లంలో రాసిన ఈ 434 పంక్తుల దీర్ఘ కవిత 1922 అక్టోబరు, నవంబరుల్లో ప్రచురితమైంది. డిసెంబరులో మొదటిసారి పుస్తక రూపంలో వచ్చింది. కవిత ఉల్లేఖనం(ఎపిగ్రాఫ్) గ్రీకు భాషలో ఇలా మొదలవుతుంది: ‘‘సిబిల్! నీకేం కావాలి?’’ ‘‘నాకు చచ్చిపోవాలని ఉంది.’’ బ్రిటిష్ గాథల్లో ‘హోలీ గ్రెయిల్’(పవిత్ర పాత్ర)ను సంరక్షించడానికి నియుక్తుడైన సుదీర్ఘ బ్రిటన్ రాజుల పరంపరలో చివరివాడు ఫిషర్ కింగ్. కానీ ఆయన కాలికి అయిన గాయం వల్ల నడవలేకపోతాడు, గుర్రం అధిరోహించలేకపోతాడు, తన విధులు నిర్వర్తించలేకపోతాడు. దానివల్ల ఆయన భూములు బంజరుగా మారిపోతాయి. దాన్ని ఆధునిక కాలానికి ప్రతీకగా చేస్తూ, మొదటి ప్రపంచయుద్ధం, స్పానిష్ ఫ్లూల వల్ల లక్షలాది మందిని పోగొట్టుకున్న యూరప్ ఖండాన్ని కూడా ఎలియట్ ఒక ‘బంజరు నేల’గా చూశాడు. అక్కడ సూర్యుడు కఠినంగా ఉంటాడు. మోడువారిన చెట్లు ఏ నీడా ఇవ్వవు. చిమ్మెటలు ఏ పాటా పాడవు. జలధారలు ఎటూ పరుగులిడవు. అమెరికాలోని ‘బోస్టన్ బ్రాహ్మణ’ కుటుంబంలో జన్మించి, ఇంగ్లండ్లో స్థిరపడిన ఎలియట్ (1888–1965) ఈ కవిత రాయడానికి ముందు నెర్వస్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. వైద్యులు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగానికి మూడు నెలల సెలవుపెట్టి, భార్య వివియన్తో కలిసి ఇంగ్లండ్లోని కెంట్ తీరానికి వెళ్లాడు. అయినా ఆలోచనలు సలపడం మానలేదు. ఇంటా, బయటా దుఃఖం వ్యాపించివుంది. సమాజం ముక్కలైంది. ఆధ్యాత్మిక దర్శిని లేదు. గత సాంస్కృతిక వైభవం లేదు. ప్రేమ, సాన్నిహిత్యం కేవలం భౌతికమైనవిగా మారిపోయాయి. శృంగారం కూడా అత్యాచారానికి దాదాపు సమానం. అంతకుముందు బతికి ఉన్నవాడు చచ్చి పోయాడు. ఇప్పుడు బతికి ఉన్నవాళ్లం నెమ్మదిగా చచ్చిపోతున్నాం. ‘‘పాశ్చాత్య సంస్కృతికి చచ్చి పోవలసిన సమయం వచ్చింది. దానికి చావు కావాలి. దానికి కొత్త బతుకు కావాలి. ఈ చావు బతుకుల మధ్య ఉన్న పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆవేదన ఎలియట్ కవితలో ప్రధాన విషయం’’ అంటారు సూరపరాజు రాధాకృష్ణమూర్తి. ఐదు విభాగాలుగా ఉండే ఈ కవితకు తుదిరూపం ఇవ్వడానికి చాలాముందు నుంచే ఎలియట్ మనసులో దీనిగురించిన మథనం జరుగుతోంది. ఆధునిక కవిత్వానికి జీవం పోసినదిగా చెప్పే ఈ కవిత మీటర్ను పాటిస్తూనూ, అది లేకుండానూ సాగుతుంది. తొలిప్రతిని స్నేహితుడైన మరో కవి, సంపాదకుడు ఎజ్రా పౌండ్కు పంపగానే, చాలా మార్పులు చెబుతూనే, ‘ఇది ప్రపంచాన్ని ప్రభా వితం చేయబోయే కవిత’ అని సరిగ్గానే గుర్తించాడు. ఏప్రిల్ అత్యంత క్రూరమైన నెల, మృత నేల లైలాక్స్ను పూస్తోంది, స్మృతులనూ కోర్కెలనూ కలుపుతోంది... గతేడాది నీ ఉద్యానంలో నువ్వు నాటిన ఆ శవం మొలకెత్తడం మొదలైందా?... ‘ద వేస్ట్ లాండ్’ కవిత అస్పష్టంగా ఉంటుంది. తర్కాన్ని అతిక్రమిస్తుంది. సహజ ఆలోచనా విధానాన్ని ధ్వంసం చేస్తుంది. ముఖ్యంగా అనేక భాషల సాహిత్యాల్లోని వాక్యాలను యథాతథంగా ఉపయోగించాడు ఎలియట్. బైబిల్, బృహదారణ్యక ఉపనిషత్తు, బౌద్ధ సాహిత్యంతో పాటు హోమర్, సోఫోక్లిస్, డాంటే, షేక్స్పియర్, మిల్టన్, హెర్మన్ హెస్, బాదలేర్ లాంటి పదుల కొద్దీ కవుల పంక్తులు ఇందులో కనిపిస్తాయి. పాఠకుడు కూడా కవి అంత చదువరి కావాలని డిమాండ్ చేస్తుంది ఈ కవిత. కానీ ‘నిజమైన కవిత్వం అర్థం కాకముందే అనుభూతమవుతుంది’ అన్నాడు ఎలియట్. ఇది ఆయన కవితకు కూడా వర్తిస్తుందన్నట్టుగా, అర్థం చేసుకోవడం ఆపితే అర్థం అవుతుందన్నాడు ఐఏ రిచర్డ్స్. దాన్ని భావ సంగీతం అన్నాడు. సంధ్యవేళ పగుళ్లూ, రిపేర్లూ, పేలుళ్లూ! టవర్లు కూలుతున్నాయి. జెరూసలేం, ఏథెన్స్, అలెగ్జాండ్రియా, వియన్నా, లండన్. అన్నీ అవాస్తవికం. లండన్ బ్రిడ్జి మీద జనాలు ప్రవహిస్తు న్నారు. ఇందులో ఎంతమంది విడిపడి, వేరుపడిపోయారో! వాళ్ల పాదాల మీదే చూపు నిలిపి నడు స్తున్నారు. మృతజీవుల్లా సంచరిస్తున్నారు. లండన్ బ్రిడ్జి కూలిపోతోంది, కూలిపోతోంది. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... అన్నట్టూ, నీ పక్కన ప్రతిసారీ నడుస్తున్న ఆ మూడో మనిషి ఎవరు? నేను లెక్కపెట్టినప్పుడు కేవలం నువ్వు, నేను, పక్కపక్కన, కానీ నేను ముందటి తెల్లటి దోవకేసి చూసినప్పుడు, ఎప్పుడూ ఎవరో ఒకరు నీ పక్కన నడుస్తున్నారు. ద. ద. ద. దత్త. దయత్వం. దామ్యత. ఇవ్వడం. దయచూపడం. నియంత్రణ. శాంతిః శాంతిః శాంతిః ఎలియట్ను ఆధునికతకు ఆద్యుడని అంటారు. ఇది ఎలియట్ యుగం అన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఆయన్ని 1948లో వరించింది. అయితే, విమర్శలు లేవని కాదు. ఎలియట్ను కవే కాదన్నవాళ్లు ఉన్నారు. ఆయన్ని దేవుణ్ణి చేసి పడేశారని విసుక్కున్నారు. ‘ద వేస్ట్ లాండ్’ను అతుకుల బొంత కవిత అన్నారు. గుప్పెడు కవిత్వానికి బారెడు వివరాలు అవసరమైన దీన్ని చదవడం దుర్భరం అని చెప్పే రాబర్ట్ ఎరిక్ షూమేకర్ లాంటి ఆధునిక విమర్శకులూ లేకపోలేదు. కానీ ఈ కవిత గురించి ఎవరో ఒకరు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. వందేళ్లుగా అది చదవాల్సిన కవితగానో, చదివి పక్కన పెట్టాల్సిన కవితగానో సాహిత్య ప్రియుల జాబితాలో ఉంటూనే ఉంది. కవి అనేవాడు తనను తాను ఆత్మార్పణం చేసుకుని, తాను అన్నవాడు లేకుండాపోయి రాయాలన్న ఎలియట్ స్ఫూర్తితో మాత్రం ఎవరికీ పెద్దగా విభేదం లేదు. ఇదీ చదవండి: మాంద్యం ముప్పు ఎవరికి? -
రాధిక మంగిపూడి నూతన కవితా సంపుటి ఆవిష్కరణ
సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన కవితా సంపుటి "నవ కవితాకదంబం" వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వేడుకల సభలో, హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సభలో గౌరవ అతిథులుగా పాల్గొన్న సినీనటి జమున రమణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, మాజీ కేంద్రమంత్రి టీ సుబ్బరామిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా.గురవారెడ్డి, పలు విదేశీ తెలుగు సంస్థల ప్రతినిధులు రాధికను అభినందించారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ ప్రచురించిన ఈ పుస్తకం తొలిప్రతిని శుభోదయం గ్రూప్స్ ఛైర్మన్ డా. కే. లక్ష్మీప్రసాద్ అందుకున్నారు. ప్రముఖ సినీ కవులు సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, ఆచార్య ఎన్ గోపి, డా. తెన్నేటి సుధా దేవి ఈ పుస్తకానికి ముందుమాట అందించగా, ప్రచురణకర్తగా డా. వంశీ రామరాజు రాధికను అభినందించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తదితరులు రాధికకు అభినందనలు తెలిపారు. "ఎందరో సినీ దిగ్గజాలు, ప్రముఖ రచయితల సమక్షంలో వెంకయ్యనాయుడు గారు తన పుస్తకం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని," రాధిక నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
అంతర్జాతీయ స్థాయిలో బాలల కథ, కవితల పోటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు కథా, కవితల పోటీని నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 16 ఏళ్ల లోపు వయసున్న తెలుగు పిల్లలందరూ ఈ పోటీకి అర్హులని పేర్కొన్నారు. కథలు, కవితలు దేశభక్తి, భారత స్వాతంత్య్ర ఉద్యమం, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, భారతదేశ ఘన చరిత్రపై ఉండాలని సూచించారు. స్వీయ రచనలు ఈ పోటీకి మాత్రమే రాసినవై ఉండాలని, వాట్సాప్, వెబ్సైట్స్, పత్రికల్లో మరెక్కడా ప్రచురించినవి ఉండకూడదని స్పష్టంచేశారు. కవితలు 20 పంక్తులకు మించి ఉండకూడదని, కథ చేతిరాత 3 పుటలకు మించి ఉండకూడదని, ప్రింటింగ్లో ఏ4 సైజులో మాత్రమే అంటే సింగిల్ సైడ్ పేజీలో కథ, చేతిరాత బాగాలేని వారు డి.టి.పి కానీ లేదా ఇతరులతో అందంగా రాయించి పంపాలన్నారు. అలాగే కథ, కవిత పిల్లల సొంతమని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ హామీ పత్రాన్ని తప్పనిసరిగా జతచేయాలని పేర్కొన్నారు. విద్యార్థి పేరు, తరగతి, ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం, సెల్ఫోన్ నంబర్ ఉండాలని, పోస్ట్ ద్వారా గానీ మెయిల్ ద్వారా గానీ కథలు, కవితలను.. ఆవుల చక్రపాణి యాదవ్, తెలుగు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉర్దూ, గడియారం హాస్పిటల్ పక్కన కర్నూలు–518001 అనే చిరునామాకు ఆగస్టు 8 లోపు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 9963350973 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ప్రథమ బహుమతి కింద రూ.5,000, ద్వితీయ బహుమతి రూ.3,000, తృతీయ బహుమతి రూ.2,000.. మూడు ప్రోత్సాహ బహుమతులు ఒక్కొక్కరికి రూ.వేయి చొప్పున అందిస్తామని గజల్ శ్రీనివాస్ ప్రకటించారు. -
రెహ్మాన్ జయంతి: కవితల పోటీలు నిర్వహించిన లింగుస్వామి
దివంగత ప్రఖ్యాత కవి అబ్దుల్ రెహ్మాన్ తనకు గురువులాంటి వారని దర్శకుడు లింగుస్వామి అన్నారు. రెహ్మాన్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకునే విధంగా లింగుస్వామి కవితల పోటీలు నిర్వహించారు. ప్రథమ బహుమతికి రూ.25 వేలు, ద్వితీయ బహుమతికి రూ.15 వేలు, తృతీయ బహుమతికి రూ.10 వేలుతో పాటు మరో 50 మందికి తలా వెయ్యి రూపాయలు నగదును అందించారు. హైకూ కవిదై- 2022 పేరుతో స్థానిక కస్తూరి రంగన్ రోడ్డులోని రష్యా కల్చరల్ హాలులో జరిగిన ఈ వేడుకలో పార్లమెంట్ సభ్యురాలు కనిమొళి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందించి (53 మంది రాసిన కవితలతో ముద్రించిన) హైకూ కవిదై - 2022 బుక్ను ఆవిష్కరించారు. అనంతరం లింగుస్వామి మాట్లాడుతూ ఇకపై ఏటా ఆయన పేరుతో కవితల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. చదవండి: నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్లాక్.. వీడియో వైరల్ ‘చింగారీ’ సాంగ్ ఫేం వలూశా డిసూజా గురించి ఈ విషయాలు తెలుసా? -
ఏడో తరగతిలో అలా చేయడం.. అదే తొలిసారి, చివరిసారి: దీపికా పదుకొణె
Deepika Padukone Shares Poetry She Wrote In 7th Class: బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్లలో దీపికా పదుకొణె ఒకరు. హావాభావాలు, విభిన్నమైన డైలాగ్ డెలివరీతో నటనలో తనదైన ముద్ర వేసుకుంది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె కుమార్తెగా వెండితెరకు పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్గా 'ఓం శాంతి ఓం' సినిమాతో బీటౌన్ ప్రేక్షకులను అలరించింది. త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు జోడిగా 'ప్రాజెక్ట్ కె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. సినిమాలతో బిజీగా ఉండే దీపికా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా దీపికా పదుకొణె తన ఇన్స్టా హ్యాండిల్లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'నేను తొలిసారి, అలాగే చివరిసారిగా రాసిన కవిత. అప్పుడు నేను ఏడో తరగతిలో ఉన్నాను. నాకు 12 ఏళ్లు. మా టీచర్లు మమ్మల్ని రెండు పదాలతో (ఐ యామ్) ఏదైనా కవిత రాయమన్నారు. నేను అవే పదాలతో టైటిల్ పెట్టి కవిత రాశాను. అలా కవిత రాయడం మళ్లీ ఎప్పుడూ జరగలేదు.' అని దీపికా తన కవిత చరిత్ర గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపికా షారుఖ్ ఖాన్తో 'పఠాన్' సినిమాలో నటిస్తోంది. దీపికా పదుకొణె-షారుఖ్ ఖాన్ జంటగా నటించడం ఇది నాలుగోసారి. ఇప్పటివరకు ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలలో వీరు కలిసి నటించారు. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
తీరని దాహం
History Of Poetry: మనకు చిన్నప్పటి నుంచే కవిత్వంతో పరిచయం ఏర్పడుతుంది. తల్లులు పాడే లాలిపాటల్లో సంగీత మాధుర్యమే కాదు, కవన మర్మమూ ఉంటుంది. బుడిబుడి అడుగుల వయసులో బడిలోకి అడుగుపెట్టాక, అక్కడ చెప్పే నీతిపద్యాలు కవిత్వం కాక మరేమిటి? వాల్మీకిని పూజిస్తారు, కాళిదాసును కొలుస్తారు, వేమనను పొగుడుతారు, గురజాడను గురువులా ఆరాధిస్తారు, శ్రీశ్రీని నెత్తినెత్తుకుని మరీ ఊరేగుతారు. తమ ఇళ్లలోని కుర్రాళ్లెవరైనా కవిత్వం గిలికితే మాత్రం కసురుకుంటారు, చిన్నబుచ్చుతారు. ‘కవిత్వమూ కాకరకాయలూ కూడు పెడతాయా? గుడ్డ పెడతాయా? ఎందుకొచ్చిన వెర్రిమొర్రి రాతలు’ అంటూ కవిత్వం రాసే కుర్రకారును ఈసడించుకునే మర్యాదస్తుల మంచిలోకం మనది. ఆరంభ దశల్లో నానా రకాల దూషణ తిరస్కారాదులను తట్టుకుని, కవిత్వంలో స్థితప్రజ్ఞతో ముందుకుసాగే ధీరులే కవియోధులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఆటుపోట్లను తాళలేని అర్భకులు అదే చరిత్రలో ఆనవాలైనా లేకుండా కొట్టుకుపోతారు. కవిత్వంలో కాకలుతీరినా, దక్కాల్సిన గుర్తింపు దక్కని కవిపుంగవులూ తక్కువేమీ కాదు. అసలు కవిత్వం ఎందుకు? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం దుస్సాధ్యం. ‘సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?/ చంద్రికలనేల వెదజల్లు చందమామ?/ ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?/ ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’ అన్నాడు కృష్ణశాస్త్రి. ప్రకృతి« సహజ ధర్మాలు కొన్ని ఉంటాయి. ‘ఎందుకు?’ అని ప్రశ్నించినంత తేలికగా వాటికి సహేతుకంగా సమాధానం చెప్పడం కుదరదు. కవిత్వం కూడా కవికి సహజధర్మం. సత్కవుల ఘనతను కీర్తించడమూ, కుకవులను నిందించడమూ ఒకానొక కాలంలో కవిత్వ సంప్రదాయంగా ఉండేది. ఇప్పుడైతే కవులుగా చలామణీ అవుతున్న అకవులను కనీసం విమర్శించే పరిస్థితులు కూడా సాహితీలోకంలో లేవు. ఇంగ్లిష్ కవివరేణ్యుడు షెల్లీ తన ‘ఎ డిఫెన్స్ ఆఫ్ పొయెట్రీ’ వ్యాసంలో ‘కవులు ఈ ప్రపంచానికి ఎన్నికవని శాసనకర్తలు’ అన్నాడు. ఆయన కవులను బాగానే వెనకేసుకొచ్చాడు. కవుల గురించి షెల్లీ వకాల్తా పుచ్చుకున్నాడు సరే, మరి కవిత్వం గొప్పదనమేమిటి? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. బహుశా అలాంటి వారికి సమాధానంగానే కాబోలు గ్రీకు తత్త్వవేత్త ప్లేటో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలోనే ‘చరిత్ర కంటే కవిత్వమే పరమసత్యానికి చేరువగా ఉంటుంది’ అని తేల్చిచెప్పాడు. ‘ప్రపంచమొక పద్మవ్యూహం/ కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. అలవాటు పడితే ఒకపట్టాన తీరని దాహమది! ఒకసారి కవిత్వంలో మునిగాక ఒడ్డున పడటం అంత తేలిక కాదు. మునకీతలు కొడుతూ ముందుకు సాగాల్సిందే! కొందరు బాల్యంలోనే కవిత్వంలో పడతారు. ఇంకొందరు యౌవనావస్థలో కవిత్వంలో పడతారు. కవిత్వంలో పడ్డవారు కవిత్వాన్ని తమ ప్రియతముల కంటే గాఢంగా ప్రేమిస్తారు. ‘వాణి నా రాణి’ అన్నాడు పిల్లలమర్రి పినవీరభద్రుడు. పదిహేనో శతాబ్దిలో ఆయన ఆ మాట అంటే, ఆనాటి జనాలు ముక్కున వేలేసుకున్నారు. ఇరవయ్యో శతాబ్ది ‘అహంభావ’కవి పఠాభి ‘కైత నా దయిత’ అంటే జనాలు పెద్దగా ఆశ్చర్యపడిపోలేదు. ఇన్ని శతాబ్దాల వ్యవధిలో కవిత్వంలోనూ మార్పులు వచ్చాయి, కవుల్లోనూ మార్పులు వచ్చాయి, కవిత్వాన్ని అర్థం చేసుకుని, ఆస్వాదించే పాఠకుల్లోనూ మార్పులు వచ్చాయి. ఎన్ని మార్పులు వచ్చినా, కవిత్వానికి గల మౌలిక లక్షణం ఒక్కటే! దాని గురించే– ‘కవిత్వం ఒక ఆల్కెమీ/ దాని రహస్యం కవికే తెలుసును/ కాళిదాసుకు తెలుసు/ పెద్దన్నకి తెలుసు/ కృష్ణశాస్త్రికి తెలుసు/ శ్రీశ్రీకి తెలుసు’ అన్నాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఈ మర్మం కనిపెట్టిన తిలక్కి మాత్రం కవిత్వంలోని ఆల్కెమీ తెలీదనుకోగలమా? తిలక్కి కూడా కవిత్వ రహస్యం తెలుసు. అందుకే ఆయన ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు/ నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు/ నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అనగలిగాడు. కవిత్వం గురించి చాలా చరిత్రే ఉంది. చరిత్రలో కవిత్వానికి తనదైన పాత్ర ఉంది. అయితే, చరిత్ర కంటే ఘనమైనది కవిత్వమేనంటాడు గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్. ‘చరిత్ర కంటే కవిత్వం మెరుగైనది, మరింత తాత్తికమైనది. కవిత్వం విశ్వజనీనమైన విషయాన్ని వెల్లడిస్తుంది. చరిత్ర నిర్దిష్టమైన విషయాన్నే వెల్లడిస్తుంది’ అన్నాడాయన. ఎంతైనా ప్లేటో శిష్యుడు కదా! చాలామంది కవులు ‘కృత్యాద్యవస్థ’ను ఎదుర్కోవడం కద్దు. ఈ అవస్థ ఆదిలోనే కాదు, అంతంలోనూ ఉంటుందంటారు కొందరు. కవిత రాయడం మొదలుపెట్టిన ఏ కవీ తన కవితను ముగించడు, దానిని అర్ధాంతరంగా వదిలేస్తాడనే అభిప్రాయమూ ఉంది. ‘ఒక కవిత ఎన్నటికీ పూర్తి కాదు, అర్ధాంతరంగా విడిచిపెట్టబడుతుందంతే!’ అంటాడు ఫ్రెంచ్ కవి పాల్ వాలెరీ. కవిత్వానికీ సత్యానికీ అవినాభావ సంబంధం ఉంది. అలాగని కవిత్వం నిండా సత్యవాక్కులే ఉంటాయనుకోవడానికి లేదు. కవిత్వం ధ్వనిప్రధానమైన కళ. స్తుతినింద, నిందాస్తుతి, శ్లేషలాంటి నానా అలంకార ప్రయోగాలు ఉంటాయి. ‘కన్నొక్కటి మిగిలెగాని కంతుడు గావే’నని ఒక కవి నేర్పుగా ఎత్తిపొడిస్తే, తనను పొగిడాడనుకొని మురిసిపోయాడు మతిలేని మారాజొకడు. ఒక్కొక్కసారి కవి మాటలు అబద్ధాల్లా కూడా అనిపించవచ్చు. అది కవి పొరపాటు కాదు. ‘ఎల్లప్పుడూ నిజాలే చెప్పే అబద్ధాలకోరు కవి’ అన్నాడు ఇంగ్లిష్ కవి జీన్ కాంక్టో. అదీ సంగతి! -
ఆయన కవిత్వం... భారతీయాత్మ స్వరూపం
‘‘మామిడి కొమ్మ మీద కల మంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మ్రొక్కి యీ యభినవ స్వరకల్పన కుద్యమిం చితిన్’’ అంటూ గత శతాబ్దంలో తెలుగులో ఆధునిక కవిత్వానికి ప్రారంభ కుడైన వాడు రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు తన సమస్త వాఙ్మయం ద్వారా భారతీయ సంస్కృతి స్వరూప స్వభావాలను సమకాలీన జనానికి పునః సాక్షాత్కరింప జేసి వాటి విలువల పరిరక్షణకు సంకల్పించినారు. మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద చేసిన విద్యాభ్యాసం ప్రాచీన వాఙ్మయంలోని మౌలిక విషయాల అవగాహనకు తోడ్పడినది. వేదాధ్యయన అధ్యాప నలకు పుట్టిల్లు అయిన ‘వెదుళ్ళపల్లి’లోని ఆయన జీవనం వేదోపనిషత్తుల యందు ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగించినది. ఆధునిక కవులకు ‘మ్యానిఫెస్టో’గా రచించిన ‘రమ్యా లోకం’ లక్షణ గ్రంథంలో– ‘‘క్రొత్త నీరు తొల్కరి యేళ్ళ క్రుమ్మి పాఱ/ప్రాతనీరు కలంగుట బ్రమ్ముకాదు’’అని అంటారు. కాలానుగుణమైన మార్పును ఆహ్వానించవలసిందే అంటారు. ఆధునికతా పరివేషంలో నూతన అభివ్యక్తి కోసం మార్పును ఆహ్వానించిన రాయప్రోలు సంప్రదాయ సంస్కృతులను మాత్రం వదలి పెట్టలేదు. తన కవిత్వం ద్వారా రాయప్రోలు ప్రతిపాదించిన సంస్కృతీపరమైన అంశాలను మనం ఇట్లా గమనించవచ్చును – ‘‘ఏ దేశమేగిన ఎందు కాలిడినా / ఏ పీఠ మెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని / నిలుపరా నీ జాతి నిండు గౌరవమును’’అంటూ మాతృ దేశా రాధనం వ్యక్తి సంస్కృతికి నిదర్శనమని చాటినారు. అట్లే ‘‘తమ్ముడా! చెల్లెలా!’’ అంటూ సోదర సోదరీ భావంతో దేశీయమైన, జాతీయమైన సాంస్కృతిక వార సత్వాన్ని ప్రబోధించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాను తెలుగువాడిగా పుట్టడమే ఒక అదృష్టంగా భావించా డాయన. ‘‘ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు / పూజ సల్పి తినో యిందు పుట్టినాడ! కలదయేని పునర్జన్మ కలుగా గాక / మధు మధు రంబయిన తెన్గు మాతృభాష.’’ ప్రతి మనిషీ భాషా తపస్సు చేయడం ద్వారా మాతృ భావనకు పునాది వేయమంటా రాయన. భాషలు వేరైనా మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయుల సాంస్కృతిక విధానం ఒక్క టేనన్నది రాయప్రోలు ఉద్దేశ్యం. అందుకే మాతృ భాషలో ఇతర భాషా పదాలు వచ్చి చేరడమన్నది ఆ భాష గొప్పదనానికి నిదర్శన మంటాడు. భారతీయ సమాజంలో కుటుంబ సంబంధాలను, మానవీయ సంబంధాలను అంటి పెట్టుకొని ఉన్న సంస్కృతి ఆధు నిక కాలంలో ప్రేమ రాహిత్యం వల్ల సంక్షోభంలో పడిపోయిందన్న ఆవేదనను రాయప్రోలు తన ‘రూపనవనీతం’లో ఇలా వ్యక్తం చేసినారు – ‘‘మానవ గాత్రమునకు మాన్పరాని గాయములు తగిలి నవి చైతన్యమంతా అనిష్టముష్టి ఘాతాలతో కాయలు కాసినవి. ప్రేమ ప్రవహింపక గడ్డలు కట్టింది... నైతిక చక్రము సవ్యాప సవ్య మార్గములు తెలియకుండా త్రిప్పినందువల్ల, ఒడుదొడు కులతో మిట్టపల్లాలతో కుంటుతుంది. గమ్యం కానరాకుండా చాటయింది.’’ ‘‘పరమ ధర్మార్థమైన దాంపత్య భక్తి’’ అనే పద్యంలో ప్రేమ అన్నది ఒక అఖండమైన పదార్థంగా అది భక్తి, రక్తి, సక్తి అని మూడు విధాలుగా అభివ్యక్త మవుతున్నదని ప్రకటించినాడు. ఈ మూడింటినీ భారతీయ సంస్కృతిలోని ప్రధానమైన అంశాలుగా వ్యాఖ్యానించవలసి ఉన్నది. ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతికి అత్యున్నత గౌరవం లభించడానికి కారణం మన కుటుంబ వ్యవస్థ. మానవ సంస్కృతి వికాసానికి మూలమైన స్త్రీ – పురుష సంబంధాలను రాయప్రోలు తన కావ్యాలలోనూ, లక్షణ గ్రంథాలలోనూ ‘నరనారీ సంబంధం’ పేరుతో విశ్లేషించినారు. మానవులందరూ స్త్రీ పురుష భేదం చేత మౌలికంగా రెండే రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల పరస్పర సంబంధం మీదనే మానవ జీవితం, మానవ సమాజం అభివృద్ధి మార్గంలో విస్తరిస్తాయని అంటారు. ఇట్లే రాయప్రోలు సాహిత్యపరంగా రసభావనను గురించి చెప్పిన నిర్వచనము గానీ, సమాజపరంగా ఆయన ప్రతిపాదించిన నూతన సిద్ధాంతము శాంతం, శివం, సుందరం అన్నది కానీ భారతీయ సంస్కృతిలోని ప్రధాన లక్ష్యాన్ని ఆవరించుకొని చెప్పినవే. భారతీయ సంస్కృతీ సారమైన శాంతం, శివం, సుందరం అన్నవి మూడు వన్నెల జెండా వంటివనీ, ప్రతి ఒక్కరూ వాటిననుసరించి శిరసావహించి భారతీయ సంస్కృతికి గౌరవ వందనం చేయ వలసిందేనని ప్రబోధించినాడు. వ్యాసకర్త మాజీ సంచాలకులు తెలుగు అకాడమి ‘ 93901 13169 -
అతడూ ఆమె: ‘ఒసేయ్..నా కళ్లజోడు తెచ్చివ్వు’!
అప్పుడు..అతడూ ఆమె మధ్య కమ్ముకున్న మంచుతెరల్ని ఒక్కొక్కటిగా భానుడి చూపులు చీలుస్తున్న దృశ్య సమయం ఒత్తిళ్లను పొత్తిళ్లలోనే దాచేసే ఉడుకు నెత్తురు వురుకుళ్ల నడుమ ఉత్తేజం అణువణువూ దాగుంది క్రతువులన్నీ ఋతువుల్లా మారిపోతూ కాలచక్రం వెంటే కలిసి ప్రయాణం ప్రతీ అడుగూ జోరుగా హుషారుగా.. ఏ చెక్లకూ ఏ చిక్కులకూ వంగని నిటారు వెన్నుపూసలు ఒకానొక ప్రేమ వాక్యానికి ఆసాంతం సాగిలబడుతున్నాయి ఇరుగు పొరుగు సమాజం కొన్ని తలకాయలు ఎన్నో కళ్లు అసంబద్ధ కుత్సిత కావ్యాన్ని రచించుకుంటూ వున్నాయి ఎన్నో అవాంతరాలు... నిశీధిలో విచ్చుకునే తలపులు... చల్లని చలి తాకిళ్లకు హృది తలుపుల్ని పదే పదే తెరుస్తూ.. సాహచర్యాన్ని స్వాగతిస్తోంది ఓ నిశ్శబ్ద యుద్ధం అన్ని చిక్కు ముళ్లను విప్పేస్తూ మరో ఉదయాన్ని ఆవిష్కరిస్తోంది..! ∙∙ ఇప్పుడు.. ఆమె అతడు మధ్య వాలు కుర్చీలో కూలబడ్డ వృద్ధదేహం అటూ ఇటూ ఊగిసలాడుతున్న నిద్రమత్తు బతుకంతా అలసిన మనసులు సేద తీరటానికి ఎన్ని చీకట్లయినా ఎన్ని వెలుతుర్లయినా సరిపోని త్రిశంకుస్వర్గం ఆత్మీయ ఆలింగనాలకు వీలుకాని కాలం ఇరువురి మధ్య ఎన్ని నిప్పుల్ని కుమ్మరిస్తోందో వెచ్చని ఘాతాలతో మనసంతా చిల్లుపడ్డ కుండవుతోంది అయినా.. వణికిస్తున్న చిక్కని చలిలో అతని పంజరం చైతన్యాన్ని కప్పుకుని కదుల్తోంది కాలం వెంట నెమ్మది నెమ్మదిగా.. ఆమె చెయ్యి పొగలుగక్కే వేడి వేడి టీ కప్పును అందిస్తోంది ఒక్క గుటకేస్తూ వేయి నిట్టూర్పులను వొదిలేసి మనిషితనం లోపించి మసకబారిన ఈ మాయదారి లోకాన్ని చీల్చి చెండాడాలనీ కళ్లల్లో కత్తుల్ని విత్తుకుంటూ.. ఆయన ఉదయాన్నే బిగ్గరగా అరుస్తాడు ‘ఒసేయ్..నా కళ్లజోడు తెచ్చివ్వు’! -డా.కటుకోఝ్వల రమేష్ మౌనస్పర్శ ఊహలెప్పుడూ సమాంతరంగా ఉండవు గతంలోంచి వర్తమానంలోకి ఎగసిపడుతూనే ఉంటాయి కాలం మండే నిప్పుకణమై కళ్ళ ముందు బద్దలవుతుంటే ఊహలు ఉప్పెనలుగా ఎగసి పడుతుంటాయి ఉప్పొంగే బతుకు శ్వాస ఎప్పుడూ ఒకే సరళరేఖ మీద ప్రయాణిస్తుంటాయి తడబడిన పాదముద్రల్ని సరిచేస్తూ కొత్త దారుల వెంట ప్రయాణిస్తుంటే గాఢ నిద్రలో సైతం మెలకువ ఉదయాలే కళ్ళ ముందు మెదులుతుంటాయి మనుషులెక్కడుంటారో అక్కడే నా ఉనికిస్పర్శ కొత్త ఊహల్ని తట్టిలేపుతుంటాయి జీవితంలో యుద్ధం మొదలైనప్పట్నుంచీ ఇదే వరుస బారులు తీరిన అడుగులు మంద్ర మంద్రంగా తెరలు తెరలుగా అరల పొరలుగా అడుగుల్ని కప్పేస్తున్న వేళ గతం ఆశతో వర్తమానంలోంచి భవిష్యత్తులోకి తొంగి చూస్తుంది -∙మానాపురం రాజా చంద్రశేఖర్ -
కవిత యువత
‘శీతకాలం కోత పెట్టగ కొరడు కట్టీ ఆకలేసీ కేకలేశానే’ అని రాశాడు శ్రీశ్రీ. ‘జయభేరి’ పేరుతో ‘మహాప్రస్థానం’లో ఉన్న ఆ కవిత రాసే సమయానికి శ్రీశ్రీకి 23 ఏళ్లు. ‘పద్దెనిమిదేళ్లు దాటేస్తున్నాను. ఇంకా ఒక మంచి కవిత రాయలేదే’ అని బాధ పడతాడు మహాకవి జాన్ మిల్టన్. అతడు తన మాగ్నమ్ ఓపస్ ‘ప్యారడైజ్ లాస్ట్’ ప్రచురించే సమయానికి అరవై ఏళ్లు రాక తప్పలేదు. ‘సర్రియలిజం’ను సాహిత్యంలో ప్రవేశపెట్టిన ఝంఝామారుత ఫ్రెంచ్ కవి ఆర్థర్ రాంబో టీనేజ్లోనే రాయవలసిందంతా రాసేసి 20వ ఏటకు రిటైర్ అయిపోయాడు. అంటే 20 తర్వాత రాయాల్సింది ఏమీ లేదని అనుకున్నాడు. 80 ఏళ్ల వరకూ జీవించిన ఇంగ్లిష్ కవి విలియమ్ వర్డ్స్వర్త్ లేటు వయసులో అమెరికా వెళితే కుర్రవాళ్లు అతని పద్యాలను చదవడం మొదలుపెట్టారట. వర్డ్స్వర్త్ వారిని ఆపి ‘ఈ మధ్య రాసినవి చదవొద్దు. నా తొలి రోజుల్లో రాసినవి చదవండి. అవే నాకు ఇష్టం’ అన్నాడట. కవిత్వానికి యువరక్తానికి గట్టి సంబంధం ఉంది. ఒంట్లో కండరాలు గట్టిపడి, నరాల్లో నెత్తురు ఉత్సాహంగా దౌడు తీస్తూ, కళ్లు చురుగ్గా చూస్తూ, గుండె సరైన కారణాలకు కొట్టుకుంటూ, స్పందించే సమయాలలో నాలుక పిడచగడుతూ ఉంటే గనక బహుశా కవిత్వమే వస్తుంది. టి.ఎస్. ఇలియట్ మాస్టర్ పీస్ ‘ది వేస్ట్ ల్యాండ్’ పాతికేళ్ల లోపలే రాసినా, జాన్ కీట్స్ అత్యుత్తమమైన కవిత్వమంతా పాతికేళ్ల లోపే రాసి మరణించినా వయసు తాలూకు తాజా స్పందన కవిత్వంలో ప్రవహించడమే కారణం. ‘నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితిని’ అని శ్రీనాథుడు రాసుకోవడం వల్లే అతడు చేసిన కవన కృషి మనకు తెలిసింది. ‘ఎమోషనల్ ఫెర్వర్ ఉన్నంత కాలం మంచి కవిత్వం వస్తుంది’ అంటాడో పాశ్చాత్య కవి. యవ్వనంలో ఉండే దూకుడు, నిలదీత, ఆగ్రహం, తిరుగుబాటు, అరాచకత్వం, బేఫర్వా, అమరత్వ అభిలాష... కవికి భావోద్వేగాల ఆవేశాన్ని ఇస్తాయి. కవిత్వం ఉబుకుతుంది. ధార అవుతుంది. స్వచ్ఛదనం దానికి సజీవత్వం ఇస్తుంది. తెలుగులో భావ, అభ్యుదయ, విప్లవ కవులు, ఆ తర్వాత స్త్రీవాద, దళిత, మైనారిటీ, బహుజన కవులు ఐతే ఆ ఉద్యమాల యవ్వనంలో లేదా తాము యవ్వనవంతులుగా ఉన్నప్పుడో రాసిన కవిత్వంలోని పదును, వాక్యం తాకి చూస్తే చీరుకునే వాదర ఆ తర్వాతి స్థిర పంక్తులలో కనిపించవు. ఈ ఒక్క గుణం చేతనే కవిత్వం ఎప్పటికప్పుడు యువ మునివేళ్లను వెతుక్కుంటూ వెళ్లి ప్రతి తరంలోనూ మరుజన్మ పొందుతూ ఉంటుంది. ‘వత్తి జేసి నూనె బోసి బతుకును వెల్గించినందుకు కొడుకు ఈ అమ్మదీపాన్ని గాలికి పెట్టి పోయిండు’ అని రాస్తాడు తగుళ్ల గోపాల్. మహబూబ్ నగర్ నుంచి కవిత్వం రాస్తున్న ఇతడు ‘దండ కడియం’ పేరుతో కవిత్వం వెలువరించాడు. ‘టేబుల్పై ఎన్ని కూరలున్నా మాటల్ని కలుపుకుని తిన్నప్పుడే కడుపు నిండా తిన్నట్టుంటుంది’ అంటాడు ‘నాలుగు గిన్నెల కూడలి’ కవితలో. మరో కవి పల్లిపట్టు నాగరాజు ‘దూడ మూతి వాసన’ కవితలో ‘మనలా మనుషులైతే కులం వాసనో మతం వాసనో వచ్చేదేమో కసువు తినే బిడ్డలు కదా... కవుడూ కుచ్చడం తెలీని మూగజీవాల ప్రేమ వాసన’ అని రాస్తాడు. ఇతనిది చిత్తూరు జిల్లా. ‘యాలై పూడ్సింది’ ఇతని పుస్తకం. ‘ఇవ్వాళంతా వాన కురిసింది. నువ్వు లాలనగా తాకినట్టు గాలి. నువ్వు కోపంతో తోసినట్టు వరద. నువ్వు నిదానంగా కూర్చున్నట్టు ఊరు’ అని రాస్తాడు నంద కిశోర్ తన కవిత్వ పుస్తకం ‘యథేచ్ఛ’లో. ఇతనిది వరంగల్. మొన్న ప్రకటించిన ‘సాహిత్య అకాడెమీ యువ పురస్కారం– 2021’కి తుది పోటీలో నిలిచిన ఎనిమిది పుస్తకాలూ కవిత్వానివే కావడం చూస్తే కవిత్వం యువ కవులను అంటి పెట్టుకునే ఉన్నది అనిపిస్తుంది. గత యాభై ఏళ్లలో అక్షరాస్యత తాకిన వర్గాల నుంచి, గత రెండు మూడు దశాబ్దాలలో తాగునీరు, సాగునీరు చూసిన పల్లెల నుంచి వస్తున్న ఇటీవలి కవులు తమ ప్రాంతాల, నేపథ్యాల, జీవనాల గాథలు గాఢంగా కవిత్వంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో నిర్మితమైన ఉపగ్రహాలు అడవుల గర్భంలో దాగున్న ఖనిజాలను లొకేట్ చేస్తాయి... ఆదివాసీ నవ్వు పువ్వులను చిదిమేస్తాయి’ అని రాస్తాడు సురేంద్రదేవ్ చెల్లి తన ‘నడిచే దారి’ పుస్తకంలో. ఇతనిది యానాం. తండ హరీష్ గౌడ్, బండారి రాజ్కుమార్, రమేశ్ కార్తిక్ నాయక్, జాని తక్కెడ శిల... వీరంతా ఈ పురస్కారం కోసం చివరి పట్టికలో నిలిచినవారిలో ఉన్నారు. పోటాపోటీగా ఢీకొన్నారు. యువ సాహిత్యకారులను ప్రోత్సహించడానికి అకాడెమీ ‘యువ పురస్కారం’ ప్రకటించిన గత కొన్నేళ్ల నుంచి యువతీ యువకులు ఉత్సాహంగా చేయదగ్గ కృషి చేస్తున్నారన్నది వాస్తవం. చిన్న వయసులో గుర్తింపు దక్కితే పొంగిపోతున్నారన్నదీ వాస్తవం. అయితే ఆ తర్వాతి కొనసాగింపు గురించే కొందరికి చింత ఉన్నది. చిన్న వయసులో ఎక్కువ గుర్తింపు వస్తే సృజన క్షుద్బాధ తీరి ఒడ్డున కూర్చుంటారని హెచ్చరించే పెద్దలు ఉన్నారు. ఇప్పటివరకూ యువ పురస్కారం పొందిన వారు ఆ పురస్కారం పొందాక ఏ మేరకు కృషిని హెచ్చింపు చేసుకున్నారో పరిశీలించుకోవాల్సి ఉంది. పెద్ద గీత గీయాల్సి ఉంది. యువకులే భావి సాహిత్య నిర్మాతలు. ఆశలు వారిపైనే! కాకపోతే ప్రవాహాన్ని వీడ వద్దని, తెడ్డు వదల వద్దని, ఈత వచ్చేసిందని పొగడ్తల సుడిలో దూకేయవద్దని హితవు!! యువ కవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
Sirivennela Sitarama Sastry Demise: పాట విశ్రమించింది..
పదహారు కళల పౌర్ణమి వంటి పాట కటిక నలుపు అమావాస్యకు ఒరిగిపోయింది. పద నాడులకు ప్రాణ స్పందననొసగిన పల్లవి అసంపూర్ణ చరణాలను మిగిల్చి వెళ్లిపోయింది. చలువ వెన్నెలలో మునిగి అలల మువ్వలను కూర్చి ఒక కలం గగనపు విరితోటలోని గోగుపూలు తెస్తానని వీధి మలుపు తిరిగిపోయింది. కవిని చిరాయువుగా జీవించమని ఆనతినివ్వని ఆది భిక్షువును ఏమి అడగాలో తెలియక ఒక గీతం అటుగా అంతర్థానమయ్యింది. తెలుగువారి కంట కుంభవృష్టి మిగిల్చి ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అనే పేరు తెలిమంచులా కరిగిపోయింది. తెలుగువారి ఆఖరు పండిత సినీ కవి సువర్ణ చరిత్ర తుది పుట మడిచింది. ‘అమ్మలాల.. పైడి కొమ్మలాల.. వీడు ఏమయాడె.. జాడ లేదియాల’... అయ్యో... కట్ట వలసిన పాట వరుస హార్మోనియం మెట్ల మీద పడి భోరున విలపిస్తూ ఉంది. -
అక్షర పాలకులు
రాజ్యాలు, వైభవాలు ఉన్నాయి కదా అని పొద్దంతా విలాసాల్లో మునిగి తేలితే గొప్పేముంది? జనం పది కాలాల పాటు గుర్తుంచుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి ఆలోచనే కొందరు పాలకులకు చరిత్రలో ప్రత్యేక పేజీలను కేటాయించింది. రాచరికాలు కావచ్చు, ప్రజాస్వామిక వ్యవస్థ కావచ్చు... పాలనా దక్షత ఒక్కటే ఉంటే పాలకుడిగానే మిగిలిపోతారు. పాలనతో పాటు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే ప్రత్యేకంగా వెలిగిపోతారు. చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు ప్రజారంజకంగా పాలించారు. కొందరు ప్రజాకంటక పాలన అందించి కాలగర్భంలో కలిసిపోయారు. చాలా కొద్దిమంది మాత్రం మంచి పాలన అందించడంతో పాటు ‘కూసింత కలాపోసన’ చేసి శభాష్ అనిపించుకున్నారు. అటువంటి సాహితీ పాలకుల్లో అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలే! ప్రజాసంక్షేమ పాలనకు పెట్టింది పేరు అయిన కృష్ణదేవరాయల హయాంలో సాహిత్యానికి పట్టం కట్టారు. ‘భువన విజయం’ పేరుతో అష్ట దిగ్గజ కవులను కొలువు తీర్చిన కృష్ణదేవరాయలు వారికి ఏమాత్రం తీసిపోకుండా తానూ పాండిత్యాన్ని ప్రదర్శించాడు. తెలుగు, కన్నడ, తుళు, తమిళ భాషలతో పాటు సంస్కృతంలోనూ రాయలు పండితుడు. సంస్కృతంలో జాంబవతీ కల్యాణం, మదాలస చరితం, రసమంజరి వంటి గ్రంథాలు రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద అను గోదాదేవి కథ అన్న అద్భుత కావ్యాన్ని జాతికి కానుకగా ఇచ్చాడు. భారత దేశపు చివరి చక్రవర్తిగా నిలిచిపోయిన మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ అద్భుతమైన సూఫీ కవి. ఉర్దూభాషా పండితుడైన బహదూర్ షా కలం పేరు జఫర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మీర్జా గాలిబ్, ఇబ్రహీం జౌఖ్... బహదూర్ షా ఆస్థానంలోని కవులే. బ్రిటిష్ పాలకులు తనను బర్మాలో నిర్బంధించినప్పుడు, తన నిస్సహాయతను దృష్టిలో ఉంచుకుని బహదూర్ షా రాసిన ‘నా కిసీకీ ఆంఖోం కా నూర్ హూం’ అనే గజల్ ఇప్పటికీ కచ్చేరీలలో మార్మోగుతూ ఉంటుంది. బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించిన విన్స్టన్ చర్చిల్ అద్భుతమైన రచయిత. సైద్ధాంతికంగా చర్చిల్ను ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు; ఆయన రచనల్లోని ఆలోచనలనూ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన శైలిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు. రెండో ప్రపంచ యుద్ధ కాలానికి సంబంధించి ఎన్నో కీలక ఘట్టాలను అక్షరబద్ధం చేసిన చర్చిల్ తిరుగులేని చమత్కారి కూడా! బ్రిటన్ను పాలించిన ప్రధానులందరిలోకీ సమర్థుడిగా పేరు తెచ్చుకున్న చర్చిల్ రచయితగా నోబెల్ బహుమతి పొందడం గమనార్హం. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సాహితీ పిపాసి. ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను రాసిన నెహ్రూను ‘పొయట్ ఎట్ హార్ట్’ అని ప్రముఖ రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు కీర్తించారు. ఆ ఒక్కముక్క చాలదూ... నెహ్రూ మంచి రచయిత అనడానికి! చైనాను సుదీర్ఘ కాలం పాలించిన మావో జెడాంగ్ కవులు మెచ్చిన రొమాంటిక్ పొయెట్. వియత్నాం విప్లవ యోధుడు హోచిమన్ కవిత్వం అత్యంత సహజంగా ఉంటుందని పండితులే మెచ్చుకున్నారు. భారత ప్రధానుల్లో నెహ్రూ తర్వాత పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయ్ సాహితీ స్రష్టలే. భావోద్వేగాలు, భావావేశాలు కలగలిసిన వాజ్పేయ్ కవితలు కదం తొక్కిస్తాయి. అలాగని పీవీ తక్కువ వాడేమీ కాదు. పండితులకే కొరకరాని విశ్వనాథ ‘వేయిపడగల’ను హిందీలోకి అనువదించిన మేధావి. ఒడిశా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం ఉన్నత పదవుల్లో వెలిగిన గిరిధర్ గమాంగ్ సకల కళావల్లభుడే. గిరిజన సంగీతం గొప్పతనాన్ని యావత్ లోకానికీ చాటి చెప్పాలన్న కసితో దశాబ్దాల తరబడి కృషి చేసిన గమాంగ్ స్వతహాగా అద్భుత సంగీతకారుడు. రక రకాల గిరిజన సంగీత వాద్య పరికరాలు వాయించడంలో పండితుడు. ఒరియాలో మంచి కవి. హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన మఖ్దూమ్ మొహియుద్దీన్ నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతోపాటు, అనంతరం ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. విశ్వ విఖ్యాత రచయిత జార్జ్ బెర్నార్డ్ షా రాసిన ఓ నాటకాన్ని మఖ్దూమ్ ఉర్దూలోకి అనువదించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సమక్షంలో ఈ నాటకాన్ని హైదరాబాద్లో ప్రదర్శించారు. నాటకం ఆద్యంతం ఆసక్తిగా వీక్షించిన రవీంద్రుడు ఆనందం పట్టలేక వేదికపైనున్న మఖ్దూమ్ను కౌగలించుకున్నాడు. మఖ్దూమ్ రచనలను ప్రముఖ రచయిత గజ్జెల మల్లారెడ్డి తెలుగులోకి అనువదించారు. ఒకప్పుడు మంచి సాహిత్యాన్ని అందించిన పాలకులు ఉండేవారు. ప్రపంచం అసూయతో రగిలిపోయేంత పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఇçప్పుడు అటువంటి అక్షర పాలకులు లేరు. మంచి కవిత్వమో, కథో రాయడం మాట దేవుడెరుగు... నేడు పలువురు పాలకులకు మంచి పుస్తకం ఇస్తే కనీసం చదవలేని దుఃస్థితి. మళ్లీ నిరుటి మెరుపులు కొత్త వెలుగులు కాయిస్తాయనీ, నిరుడు మురిపించిన హిమసమూహాలు చల్లటి కబురందిస్తాయనీ ఆశిద్దాం. గతం వలె మళ్లీ సాహితీ కుసుమాలు వికసిస్తాయని కాంక్షిద్దాం. -
నిరంతర జనకవిత్వ సృజన శిఖరం
మహాత్మా పూలే, అంబేడ్కర్, పెరియార్, వేమన, పోతులూరి వీరబ్రహ్మం, త్రిపురనేని రామస్వామి చౌదరి, జాషువా వంటి సంస్కర్తల దారిలో... వర్తమాన సాహిత్యాన్ని, చరిత్రను సుసంపన్నం చేస్తున్న మహాకవి కత్తి పద్మారావు. గత ఐదు దశాబ్దాలుగా కఠోర అధ్యయనం, పరిశోధన, ఆచరణతో ముందుకు సాగుతున్నారు. ఒక సమగ్ర సామాజిక మార్పు కోసం తన రచనలను, ఆచరణను అంకితం చేశారు. తన జాతి జనుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని అపారంగా రచించారు. అమ్మ చెప్పిన మాటతో కులం పునాదుల్ని వెలికితీసి అనేకానేక వివక్షలను, ఆధిపత్యాలను సమాధి చేస్తున్నారు. వేలాదిమంది పీడితులకు తన అక్షర సైన్యంతో ధైర్యమై నిలిచారు. ‘కులం పునాదుల మీద ఒక జాతినీ, ఒక నీతినీ నిర్మించలేరన్న’ అంబేడ్కర్ సత్య వాక్కు కత్తి పద్మారావు కవితా ఝరి. ‘సత్యవాక్యంబెవ్వడుల్లంఘింపడో వాడేపో నరుడిద్ధరా మండలిన్’ అనే జాషువా మహాకవి మాట కత్తి పద్మారావు గారి కవిత్వానికి ఊపిరి. పద్మారావు జీవితంలో కులజీవన విధానం లేదు. ఆయన కులనిర్మూలన వాది. క్లాసులో చెప్పే పాఠాలకు మించి వేలాది సభల్లో, విశ్వవిద్యాలయాల్లో మాట్లాడిన మహోపాధ్యాయుడు. ‘అణగారిన ప్రజల మూగభాషను నా కవిత్వం ఉక్కు నాలుకతో సంభాషిస్తుంది అంటూ దళితులకు సామాజికంగా, సాంస్కృతికంగా తాత్వికంగా నాయకత్వం వహిస్తున్నారు. ‘మళ్లీ మళ్లీ కవిగానే పుడతా’నంటున్న కవిత్వ శ్వాస అతడు. ‘దళిత కవితా దిక్సూచి అతడు. ‘పక్షి గమనం నాకు ఆదర్శం, ప్రకృతి సౌందర్యం నాకు స్ఫూర్తి, మనిషిలోని వైరుధ్యం నా తర్కం, సమన్వయం నా దర్శనం’ అంటున్న నల్ల సముద్రం అతడు. సజీవ వాస్తవిక మానవ సంఘర్షణల మహాకావ్యం ‘అస్పృశ్యుని యుద్ధ గాథ’ కత్తి పద్మారావు. తీవ్రమైన కులవివక్షకు గురైన పనికులాల పక్షం వహించిన ప్రజాకవి. ‘నా తర్కం చార్వాకం, నా తత్వం బౌద్ధం, నా ఆయుధం అంబేడ్కరిజం’ అంటూ పీడక శక్తులపై కలాన్ని కత్తిగా దూసిన యుగ కవి కత్తి పద్మారావు. కడుపు నిండా ఆకలిని, గుండెల నిండా అవమానాలను, బతుకు నిండా కష్టాలను నింపుకున్న నిరుపేద కుటుంబం లోంచి వచ్చిన పద్మారావు... అగాథపు అంచుల్లో ఉన్న జనాన్ని కవిత్వ వస్తువులు చేసి వారికి సాహితీ గౌరవం కల్పించారు. దళిత జీవితంలోని సౌందర్యాన్ని, తాత్వికతని పద్మారావు అద్భుతంగా అక్షీకరించారు. అందుకే తరతరాల నిరంతర జనకవిత్వ సృజన శిఖరంగా నిలిచారు. పిడికెడు ప్రేమకోసం, మానవ స్వేచ్ఛా సమానతల కోసం దీపధారిగా నిలిచారు. మహాకవి గుర్రం జాషువా మహాసభలు ముంబైలో జరిగినప్పుడు ముఖ్యఅతిథిగా పాల్గొని జాషువా కవిత్వ గొప్పతనాన్ని వినిపించారు. తన ‘సాంఘిక విప్లవ చరిత్ర’లో కూడా జాషువా సాహిత్య ప్రస్థానం గురించి పేర్కొన్నారు. ‘దళిత సాహిత్యవాదం – జాషువా’ (1995),‘జాషువా సామాజిక తత్త్వం’ (1996), ‘మహాకవి జాషువా–సామాజిక విప్లవం’(2007) అనే మూడు బృహత్ గ్రంథాల ద్వారా తెలుగు సాహిత్యానికి జాషువా సామాజిక, సాహిత్య దర్శనాన్ని అందించారు. జాషువా కవితా శిల్పం, ఆర్ద్రత, మానవతా దృక్పథం, విశ్వజనీన తత్వం అనేవి తన నుండి ఈ నాటి దళిత బహుజన కవులందరికీ ఆదర్శం అంటారు. ‘కులం పునాదులు’ మీంచి ‘నల్లకలువ’లు, ‘నీలికేక’లు, ‘భూమిభాష’లు, ‘ముళ్ళకిరీటం’లు, ‘కట్టెలమోపు’లు, ‘ఆత్మగౌరవ స్వరం’లు, ‘అస్పృశ్యుని యుద్ధగాథ’లును చరిత్రకు అందించినవారు. పునర్నిర్మాణానికీ, ప్రత్యామ్నాయ సంస్కృతీ విధానానికీ దారులు వేసిన 95 గ్రంథాలు వెలువరించారు. తెలుగు రాష్ట్రాలలో అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ విశేషంగా తన ఉపన్యాసాలతో రాబోయే తరాలను చైతన్యపరిచారు. ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’ వంటి పలు జాషువా రచనల మీద గొప్ప కృషి చేసారు. కత్తి పద్మారావు సామాజిక జీవితంలో రాజకీయ పార్శ్వం ఉంది. దళిత బహుజనుల్ని చైతన్యవంతుల్ని చేయడంలో అద్వితీయ పాత్ర వుంది. వక్తృత్వ పోటీలు, నాటకాలు, బుర్రకథలు పాటలు రాయడం, నాటకాలు రాసి తనే పాత్ర పోషించి ప్రదర్శించడం శాంతినగర్ లూథరిన్ చర్చ్ సండే స్కూల్లో చిన్నప్పుడే అలవడినాయి. భారతీయ అలంకార శాస్త్రాలు, గ్రీకు అలంకార శాస్త్రాలు, పాశ్చాత్య ఆధునిక ఈస్థటిక్స్, మనస్తత్వ శాస్త్రాలు, భాషా శాస్త్రాలు అధ్యయనం విస్తృతంగా చేశారు. వాల్మీకి, కాళిదాసు మొదలు ఖలీల్ జిబ్రాన్, షెల్లీ వర్డ్సవర్త్, జాన్ మిల్టన్, జిడ్డు కృషమూర్తి తదితరుల ప్రకృతి వర్ణాలను అధిగమించి ఆధునిక మానవునిలోని ప్రకృతి స్పృహని నూతనంగా తన రచనల్లో నింపారు. ‘అమృత నిష్యంతనమైన వాక్కులు నాకు నా తల్లి ప్రసాదించింది. ఔషధపు కట్టలు కట్టే వైద్యశాస్త్రం నా అక్షరాల్లో ఉందంటూ’ తన తల్లి ప్రభావం తనపై ఎలా అణువణువునా నిండి ఉందో అనేక కవితల్లో చెప్పారు. ‘నీ జోలపాటే ప్రపంచ సాహిత్యానికి పల్లవి’ అంటూ అడుగడుగునా వాళ్ళమ్మను గుర్తుచేసుకుంటారు పద్మారావు. ‘శిల్పమూ నీవే, చిత్రమూ నీవే, చిరునవ్వూ నీవే, ప్రళయాగ్నివీ నీవే. నువ్వు నవ్వితే భూమి పులకరిస్తుంది. నువ్వు కరిగితే సముద్రానివి. నువ్వు మండితే అగ్ని గోళానివి’ అంటూ వాళ్ళ అమ్మను కవిత్వీకరిస్తారు. ‘పొద్దున్నే చల్ల చారుతో, చద్ది బువ్వ కలిపి ఎర్రగారపు పచ్చడి నంజు పెడితే శాస్త్రవేత్తలా కనిపించింది అమ్మ’ అంటారు. డా. కత్తిపద్మారావు నిరంతర సాహితీ కృషిలో వారి సహచరి స్వర్ణకుమారి సహకారం విశేషమైనది. వెనుతిరగని నది మాటలా, నిర్మలమైన పాటల ఆకాశంలా, పవిత్రమైన నిప్పుల నినాదంలా, స్వచ్ఛమైన నీటి చెలమలా, అచ్చమైన తల్లి గాలి ప్రేమలా, భూమితల్లి జోలలా అతడు ప్రజలకవి. అతనిది ప్రజాకవిత్వం. ఇటీవలే ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి లోకనాయక్ ఫాండేషన్, విశాఖపట్నం వారు స్వర్గీయ ఎన్.టి.రామారావు, స్వర్గీయ హరివంశరాయ్ బచ్చన్ స్మృత్యర్థం ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం ‘అస్పృశ్యుని యుద్ధగాథ’కు గానూ రెండు లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని కత్తిపద్మారావు అందుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం ద్వారా ఆయనపై బాధ్యత మరింత పెరిగినట్లు అయింది. -శిఖా–ఆకాష్ వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి కృష్ణాజిల్లా అభ్యుదయ రచయితల సంఘం మొబైల్: 93815 22247 (నవంబర్ 1న డా.కత్తి పద్మారావు, ఏపీ ప్రభుత్వ ‘వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారా’న్ని అందుకుంటున్న సందర్భంగా) -
పచ్చ నెత్తుటి మరక...
వూరు చేరాలంటే ముందు నిన్నే ముద్దాడాలి! చూట్టానికి జుట్టంతా విరబోసుకున్న రాకాసిలానే కనిపిస్తావ్ కానీ నువ్వో నిశ్చల తాపసివి! నా గురించో... వూరి గురించో... శివసత్తిలా సిగమూగుతూ అందమైన తలపోతేదో చేస్తూనే వుంటావ్– నువ్విప్పుడు జ్ఞాపకమయ్యేంతలా వలసపోయాను కానీ వేలాడి వూగిన వూడల జాడలు ఈ నా మునివేళ్లకి తగుల్తూనే వుంటాయ్, నేనే చోటున్నా సరే! పొలిమేర ఖిల్లాలా వుంటావ్ యెన్నెన్ని శకలాలో నీలో... వూయలూగిన బాల్యాన్ని దోసిట్లోకి నింపుకునేంతగా– దూపగొన్న గొంతు... మర్రితాడు రుచిని మర్రాకులోకి వొంపుకుంటే చాలు; దిగులు ముంతను బొట్టు బొట్టుగా దింపుకోవచ్చు. ఆకు ఆకులో లాలించే పచ్చ సముద్రమే వుంది; గుండెల్లోకి తోడుకునేంత తావే లేదు కాకపోతే! దేన్నీ యెదగనీయవనే అపనింద మోస్తూనే... యెండా... వానా... గొడుగై కాసిన లోగిట్లోంచి డొప్పలిచ్చింది నాకే కాదు; వూరు వూరంతటికీ. కాయో... పండో... పువ్వో... కాదు, పచ్చని కంచమై... పండగ్గానో? పబ్బంగానో? పత్ర సందేశంగా వచ్చేస్తావ్ కదా! చివరికి చిరిగిన విస్తరాకై... యే చిరునామాకూ చిక్కకుండా తప్పిపోతావ్! అచ్చంగా నాలోని నేను తప్పిపోయినట్టు!! వేలి కొసల్లో ఎడార్లు మొలిచాక... ప్రతీ చదరపు అడుగూ లెక్కలోకొస్తుంది; ప్రతీ క్షణం... డాలర్ డేగై యెగిరొచ్చి ఎడం భుజమ్మీద వాలాక... విధ్వంసక ప్రగతి నమూనా విసిరి పారేస్తుంది నిన్ను పెనుగులాడిన వూడలతో సహా! పూదోటలు... మియావాకీలు... కొత్తగా యేం అలికినా... తులసికోట లేని ముంగిల్లా... వూరి గుమ్మం బోసిపోయింది. కూలదోసిన పచ్చ గుడారం జ్ఞాపకాలు మాత్రం... ఉరితాళ్ళలా వేలాడుతున్నాయ్! -బోగ బాలసుబ్రహ్మణ్యం ► వంతెన పైన నేను నడుస్తుంటాను వంతెన మీద ఏకాంతంగా ఎటూతేల్చుకోలేని సందేహాలతో. ఎవరూ ఏంచెప్పొద్దు. వంతెన దాటేముందు నా అవయవాలన్నీ అదృశ్యమై మెదడు మాత్రమే జీవించివుంటుంది. నేనెవరికీ గుర్తుండను. దూరంగా రైలు సైరను వినిపిస్తుంది. పిచ్చిగా నగరంవైపే చూస్తుంటాను. నా ముఖం లోని మడతలు ఎన్నో కథలు చెప్పే వుంటాయి. చాలా దూరం వచ్చేశాను. నాకు నేను అర్థం కాకుండా! క్షమించు! నేను నిన్ను హత్తుకోవాలి. ఈ మాయా నిశ్శబ్దాన్ని ఛేదించాలి. కొత్త రుచుల వెతుకులాటలో సమస్త అడవులగుండా, మైదానాల మీదుగా ప్రయాణిద్దాం. అక్కడ రెండు గ్లాసులు మనల్ని ఆహ్వానిస్తున్నాయ్. ఎర్రజీరల గద్ద కళ్లతో! -ఏటూరి నాగేంద్రరావు ► మేలిమి పద్యం నిను వేగించును నిత్యదుఃఖమను వహ్నీజ్వాల, తతాతపసం జనితంబైన మహానుభూతి యొక డాచ్ఛాదంబుగా నీవు సా గిన త్రోవల్ జగతీ చరిత్రగతి సాగెన్ క్రొత్త యధ్యాయమై మును లేకున్నది, నేడు రాని దొక డొప్పున్ నీ మహాలక్ష్యమై! (కుందుర్తి ‘వీథిమానిసి’ ఖండిక నుంచి) ఏడులోకాల కనుసన్న నేలువాడు ఇరుకు చీకటిగుడిలోన మరిగినాడు నాకు లేనట్టి దేవుడు లోకములకు లేడు, లేడింక, పిలిచినా, రాడు రాడు. (శంకరంబాడి సుందరాచారి ‘నైవేద్యము’ నుంచి) రేయినలసిన కనులకు రెప్పవేసి లోకచిత్రంబు మూయగల్గుదునె గాని, లోన చెలరేగు నల్లకల్లోలమునకు కనులుమూసి నిద్రింపజాలను క్షణంబు. (పాలగుమ్మి పద్మరాజు ‘లోన – బయట’ ఖండిక నుంచి) పేదల రక్తమాంసముల బెంపు వహించి దయా సుధా రసా స్వాద దరిద్రులైన ధనవంతుల పెద్దరికమ్ముకై మతో న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన రాతి బొమ్మలం దూదరపోవు పాడు బ్రదుకొక్క నిమేషము సైప నాయెదన్! (వేదుల సత్యనారాయణశాస్త్రి ‘కాంక్ష’ ఖండిక నుంచి) -
అమ్మా నేను మా కుట్టు మిషను
చిరిగిన జేబుని కుట్టడమే కాదు ఖాళీ జేబులో పైసలొచ్చి పడడం దానివలనే! కత్తెర కావాలన్నా దారం కావాలన్నా సూది కావాలన్నా మిషను సరుగునుండి దర్జాగా తీసుకునే హక్కు నాది! చిన్నపుడు.. డస్టర్లు కుట్టిపెట్టి సూదీదారాలు అప్పిచ్చి బడిలో నా విలువని పెంచిన మాట వాస్తవమే ఆడుకునేప్పుడు.. దానిని ఆటవస్తువు చేసుకునేవాణ్ని అన్నం తినేప్పుడు.. దానిని డైనింగ్ టేబుల్గా మార్చుకునేవాణ్ని కావాలని తన్నినపుడో కోపంలో నెట్టినపుడో అమ్మ మందలించేది అవును నిజమే కదా దాని వలనే ఎంతోమంది పరిచయమై..స్నేహితులై..బంధువులైనారు! పాపాయి నుండి అమ్మాయివరకూ ఎంతమందికి అదనపు అందాన్ని జోడించిందో తెలుసా? పుట్టినరోజుల నుండి పెళ్లిరోజుల వరకూ ఎన్ని శుభకార్యాలను జరిపించిందో తెలుసా? మా అమ్మ తన మిషనుతో అద్భుతన్నే సృష్టిస్తుంది బహుశా నల్లని ఆకాశానికి నక్షత్రాలు అతికి చందమామను కుట్టింది మా అమ్మేనేమో! అమ్మ శక్తితో నడిచిన ఒంటి చక్రపు కుట్టు మిషన్ మా కుటుంబాన్ని ఎంతోకొంత ముందుకు తీసుకువెళ్లింది అన్నది యదార్ధమే.! ఎన్నో ఏళ్ళు ఆసరా అయిన కుట్టుమిషను ఇపుడు కొంచెం పాతదై మూలకు చేరింది కానీ.. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు అని ఎవరైనా అడిగితే మాత్రం తడుముకోకుండా మా కుట్టుమిషన్ని కూడా కలిపే సమాధానం చెబుతాం మేము. - దొరబాబు మొఖమాట్ల -
ఎంత చదివినా 'తన్వి' తీరదు!
పదేళ్ల పిల్లలు ఏం చేస్తారు? ఆడుతూ పాడుతూ..స్కూల్లో చెప్పిన పాఠాలను వల్లేవేస్తూ ఉంటారు. ఇది ఒకప్పటి మాట. టెక్నాలజీతో ఆడుతూ పాడుతూ ఆన్లైన్ గేమ్లతో బిజీగా ఉంటున్నారు నేటితరం పిల్లలు. ఐదోతరగతి చదువుతున్న వోరుగంటి తన్వి మాత్రం కవితలు రాస్తూ ఏకంగా ఒక బుక్ను çప్రచురించింది. ఎంత చదివినా తన్వి తీరనంతగా అందరినీ ఔరా అనిపిస్తోంది. లాక్డౌన్ కాలంలో ఎక్కడివారు అక్కడే ఇళ్లలో ఉండిపోవలసి రావడంతో తమకు దొరికిన సమయాన్ని చాలా మంది రకరకాలుగా సద్వినియోగం చేసుకున్నారు. పదేళ్ల చిన్నారి తన్వి కూడా ఎవరికీ తీసిపోలేదు. తనకొచ్చిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చింది. చక్కటి కవితలుగా మార్చింది. ఇలా రాసిన కవితలను ‘ఫ్రం ది ఇన్సైడ్–ద ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పొయెట్’ పేరిట పుస్తకం విడుదల చేసింది. దీంతో అమెరికాలో అతిపిన్న రచయితల జాబితాలో నిలిచింది. మార్చి15న విడుదలైన ఈ బుక్ ప్రస్తుతం ఆన్లైన్ వేదికపై ఫైవ్స్టార్ రేటింగ్తో దూసుకుపోతోంది. ప్రపంచమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో అందరూ అనుభవించిన, ఎదుర్కొంటున్న సమస్యలు, చేస్తున్న ఆలోచనలు, కష్టాలను కవితల రూపంలో వివరిస్తోంది. ముఖ్యంగా భావోద్వేగాలు, బాధ, కోపం, విచారం, ఒంటరితనం, ఇష్టమైన వారిని కోల్పోవడం, లాక్డౌన్తో స్వేచ్ఛను కోల్పోవడం వంటి అనేక అంశాలను పుస్తకంలో తన్వి ప్రస్తావించింది. అంతేకాకుండా ప్రకృతిపట్ల మనం చూపాల్సిన ప్రేమ బాధ్యత, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు, మర్చిపోలేని బంధాలు... వంటివాటన్నిటì నీ కవితల ద్వారా వివరించింది. హ్యారీపోటర్ సీరిస్లను ఇష్టపడే తన్విని కవితలు రాయాలనే అభిరుచే రచయితగా మార్చిందని చెబుతోంది. పదేళ్ల వయసులో బుక్ రాసిన తన్వి భారత సంతతికి చెందిన అమ్మాయి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్కు చెందిన మహేందర్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతుల ఏకైక సంతానమే తన్వి వోరుగంటి. ఐదోతరగతి చదువుతోన్న తన్వి వయసులో మాత్రమే చిన్నది. ఆలోచనల్లో ఒక రచయిత అంత వయసు తనది. అందుకే అందరు పిల్లల్లా వేసవి సెలవల్లో ఆడుకోలేదు తన్వి. తనకి ఎంతో ఇష్టమైన కవితలు రాస్తూ కాలం గడిపేది. అలా తాను రాసుకున్న కవితలన్నింటికి ఒక పుస్తకరూపం ఇవ్వడంతో అమెరికా లో యంగెస్ట్ రచయితల సరసన పదేళ్ల తన్వి నిలవడం విశేషం. తన్వి మాటల్లోనే విందాం...‘‘నాపేరు తన్వి వోరుగంటి. నేను అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని చాడ్లర్ నగరంలో అమ్మానాన్నలతో ఉంటున్నాను. మా స్వస్థలం కరీంనగర్ అయినప్పటికీ నాన్న మహేందర్ రెడ్డి ఇంటెల్లో హార్డ్వేర్ ఇంజినీర్గా, అమ్మ దీపిక సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండడంతో నేను ఇక్కడే పుట్టాను. రెండేళ్లకోసారి మాత్రమే ఇండియా వచ్చి తాతయ్య దగ్గర ఒక నెలరోజులు గడుపుతాము. నా కవితల ప్రస్థానం గతేడాది వేసవికాలం సెలవుల్లో మొదలైంది. సమ్మర్ హాలిడేస్లో టైమ్పాస్ కోసం కవితలు రాయం మొదలు పెట్టాను. అలా రాస్తూ రాస్తుండగానే నేను కవితలు రాస్తున్న విషయం అమ్మానాన్నలకు తెలియడంతో వారు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. అంతేగాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా స్కూల్ టీచర్ల ప్రోత్సాహం తో నేను మరిన్ని కవితలు రాయగలిగాను. వారి సహకారంతో ఆ కవితలకు పుస్తకరూపం తీసుకు రాగలిగాను. అయితే పుస్తక ప్రచురణ ఏమంత సులభం కాలేదు. చాలా సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చింది. నామీద నాకు పూర్తిస్థాయిలో విశ్వాసం లేకపోవడం వల్ల బుక్ ముద్రించడానికి అర్హురాలినేనా అనిపించేది. పుస్తకాన్ని ముద్రించడానికి నా రచన సరిపోతుందా అనిపించేది. ఇలా ఎన్నో ఆలోచనలు, సందిగ్ధతల నడుమ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ.. తల్లిదండ్రుల సహకారంతో బుక్ పబ్లిష్ చేసాను. అయితే అందరూ అర్థం చేసుకునేలా అర్థవంతమైన కవిత్వం రాశానని మాత్రం చెప్పగలను’’ అని చెప్పింది ఆరిందలా. ‘‘కొత్తగా కవితలు రాయాలనుకుంటున్నవారు ముందుగా మిమ్మల్ని మీరు బాగా నమ్మండి. ఎప్పటికప్పుడు మీకు మీరే నేను చేయగలను అని చెప్పుకుంటూ ఉండాలి. అనుకున్న లక్ష్యాన్నీ చేరేందుకు కష్టపడాలి’’అని చెప్పింది. పిల్లలు, పెద్దల కోసం భవిష్యత్ లో రియలిస్టిక్ ఫిక్షన్ నావెల్స్ రాయాలనుకుంటున్నట్లు తన్వి వివరించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. ‘‘నా మనవరాలు చిన్నవయసులో కవితలు రాసి బుక్ పబ్లిష్ చేసే స్థాయికి ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. తన్వి అమెరికాలో పుట్టినప్పటికీ ఏడాదికోసారి ఇండియా రావడాన్ని ఎంతో ఇష్టపడుతుంది. చిన్నప్పటి నుంచి తను చాలా కామ్గా ఉండే తత్వం. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేది. ఎప్పుడూ ఆలోచిస్తూ తనకు నచ్చిన వాటిని చిన్న నోట్బుక్లో రాసి పెట్టుకునేది. రీడింగ్, రైటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టం. స్కూల్లో టీచర్ల ప్రోత్సాహంతో మంచి వకాబులరీ నేర్చుకుంది. మా ఫ్యామిలీలో రచయితలు ఎవరూ లేరు. ఈ లోటును తన్వి తీర్చింది. తను ఇలానే మంచి మంచి రచనలు చేస్తూ..మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను. తన స్టడీస్తోపాటు రచయితల ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’’ –తన్వి తాతయ్య వోరుగంటి హనుమంత రెడ్డి, (కరీంనగర్ డెయిరీ అడ్వైజర్) -
కవితల పండుగ: ఫేమస్ కవితలు చూసేద్దామా!
‘ప్రపంచమొక పద్మవ్యూహం/ కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు శ్రీశ్రీ. కవిత్వం గురించి ఎంత చెప్పుకున్నా కవితాభిమానులకు తీరే దాహం కాదది. కవిత్వం ఒక వాక్కళ. బహుశ వాక్కు పుట్టినప్పుడే కవిత్వమూ పుట్టి ఉంటుంది. కవిత్వం ఒక చిత్కళ. కవిత్వంలేని భాష లేదు, కవిత్వానికి అందని భావమూ లేదు. కవిత్వం గురించి సవివరంగా చెప్పుకోవాలంటే ఎన్ని ఉద్గ్రంథాలైనా చాలవు. కవిత్వాన్ని సంక్షిప్తంగా చవిచూపడానికి ఒక్క పదునైన వాక్యమైనా సరిపోతుంది. కవిత్వం గురించి ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే, నేడు (మార్చి 21న) ప్రపంచ కవితా దినోత్సవం. కవిత్వానికి గల సమస్త పార్శవాలనూ స్పృశించడం సాధ్యమయ్యే పనికాదు గాని, ఈ సందర్భంగా ఆధునిక తెలుగు కవుల చమత్కారాల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆద్యులలో ఒకరు కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కర్త అయిన కందుకూరి తన కాలంలోని సాంఘిక దురాచారాలను ఖండించడానికి తన కలానికి పదునుపెట్టారు. సమాజంలోని పెద్దమనుషుల దుర్మార్గాలపై వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెట్టారు. కందుకూరి రాసిన ప్రహసనాలు ఆయన చమత్కార ధోరణికి అద్దం పడతాయి. కందుకూరి ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’ అనే ప్రహసనప్రాయమైన నవల రాశారు. అందులో ఆడుమళయాళాన్ని గురించి వర్ణనలో ఆయన హాస్యం గిలిగింతలు పెట్టిస్తుంది. ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’లోని ‘ఆడుమళయాళం’ పూర్తిగా మహిళల రాజ్యం. అక్కడివారు ‘పత్నీవ్రత ధర్మబోధిని’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలోని నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటారు. వాటిలో మచ్చుకొకటి... ‘పురుషుండు గార్దభమునున్ స్థిరమగు దండనము లేక చెడిపోదురిలన్ గరుణ దలంపక నెలకొక పరిౖయెనం గొట్టవలయు పత్ని పురుషునన్’ ఇదంతా ఇప్పటితరం పాఠకులకు ‘జంబలకిడి పంబ’ సినిమాను తలపిస్తుంది. కందుకూరి ప్రహసనాల్లో ‘కలిపురుష శనైశ్చరవిలాసం’ ఒకటి. అందులో మద్యానికి ఎంగిలి లేదంటూ వ్యంగ్యంగా చెప్పిన పద్యం... ‘పొగచుట్టకు సతిమోవికి అగణితముగ మద్యమునకు అమృతమునకున్ తగ నుచ్చిష్టము లేదని ఖగవాహను తోడ కాలకంఠుడు బలికెన్’ గురజాడ అప్పారావు తన ‘కన్యాశుల్కం’ నాటకంలో ఇదే పద్యాన్ని వెంకటేశం నోట పలికిస్తారు. అంతేకాదు, ఇదే పద్యాన్ని అనుకరిస్తూ, గిరీశం పాత్రతో ఇలా చెప్పిస్తారు: ‘‘ఖగపతి యమృతము తేగా భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ పొగచుటై్ట జన్మించెను పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’’ ‘కన్యాశుల్కం’ నాటకం ఆద్యంతం హాస్యభరితంగానే సాగుతూ, ఆనాటి సమాజంలోని దురాగతాలను కళ్లకు కడుతుంది. హాస్యానికి మారుపేరైన కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రహసనాలు కూడా రాశారు. ఆయన రాసిన ‘అద్భుత కవిత్వ ప్రహసనం’లో ప్రాచీన కవిత్వం పాషాణమని, నవీన కవిత్వం గొప్పదని గురువుతో చెబుతారు శిష్యులు. వారు వెలగబెట్టిన నవీన కవిత్వానికి ఒక మచ్చుతునక... ‘తోటకూర తెచ్చి దొడ్డిలోన తరిగి కుండలోన బెట్టి కుదమగాను కింద మంటబెట్ట ఉడకకేం జేస్తుంది దాని కడుపు కాల ధరణిలోన’ ఇక చిలకమర్తివారు రాసిన పకోడి పద్యాలు సుప్రసిద్ధాలు. అయితే, తిరుపతి వేంకట కవులు కూడా పకోడిపై ఒక చమత్కార పద్యం చెప్పారు. కరకరలాడే ఆ పద్యం ఇదీ: ‘కరకరలాడు కొంచెమగు కారము గల్గు బలాండు వాసనా హరమగు గొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా దరమున బల్కుచుందు రదితాదృశమే యగునంచు దోచెడిన్’ ఇలాంటివన్నీ ఆధునిక సాహిత్యం తొలినాళ్లలోని చమత్కారాలకు ఉదాహరణలు. ‘మహాప్రస్థానం’తో శ్రీశ్రీ కవనరంగంలో కదం తొక్కడం ప్రారంభించాక కొత్త ఊపు వచ్చింది. విప్లవకవిగా ముద్రపడిన శ్రీశ్రీ ‘సిప్రాలి’లో చమత్కార కవిత్వంతో పాటు పేరడీ గారడీలూ చేశాడు. ‘సిరిసిరిమువ్వ’ మకుటంతో కంద పద్యాలు, ‘ప్రాసక్రీడలు’, ‘లిమరిక్కుల’తో కలిపి ‘సిప్రాలి’గా తీసుకొచ్చిన పుస్తకంలో శ్రీశ్రీ కవితా చమత్కారం పూర్తిస్థాయిలో కనిపిస్తుంది. ‘పంచపదుల్లో’ శ్రీశ్రీ కవితా హాస్యం చూడండి... ఇవి నిజంగా ‘పంచ్’పదులు. ‘అరవ్వాడి దోసై మీద తోచించి వ్రాశై ఏవో విట్లు వేశై ఏవో ఫీట్లు చేశై తర్వాత చూసుకుందాం ప్రాసై...’ ‘పెరిగితే వ్యాపార దృష్టి మరిగితే లాభాల సృష్టి దొరికితే అమెరికా ముష్టి మిగిలేది విగ్రహపుష్టి నైవేద్య నష్టి!’ ఆరుద్ర ‘కూనలమ్మ పదాలు’, ‘ఇంటింటి పజ్యాలు’లో చమత్కారమే ప్రధానంగా కనిపిస్తుంది. ఆరుద్ర చమత్కారానికి ఓ రెండు మచ్చు తునకలు ‘కోర్టుకెక్కిన వాడు కొండనెక్కిన వాడు వడివడిగ దిగిరాడు ఓ కూనలమ్మా!’ ‘బ్రూటుకేసిన ఓటు బురదలో గిరవాటు కడకు తెచ్చును చేటు ఓ కూనలమ్మా!’ పేరడీ గారడీలు ‘మహాప్రస్థానం’లో శ్రీశ్రీ ‘నవకవిత’ శీర్షికన... ‘‘సిందూరం, రక్తచందనం బందూకం, సంధ్యారాగం పులిచంపిన లేడినెత్తురూ ఎగరేసిన ఎర్రనిజెండా రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక కావాలోయ్ నవకవనానికి...’’ అంటూ ఉద్వేగభరితంగా రాసిన కవితకు ‘జరుక్ శాస్త్రి’గా ప్రసిద్ధుడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఇలా పేరడీ రాశారు. ‘‘మాగాయీ కందిపచ్చడీ ఆవకాయ, పెసరప్పడమూ తెగిపోయిన పాతచెప్పులూ పిచ్చాడి ప్రలాపం, కోపం వైజాగులో కారా కిల్లీ సామానోయ్ సరదాపాటకు...’’ శ్రీశ్రీ ఒరిజినల్ కవిత ఎంత ఉద్వేగం కలిగిస్తుందో, జరుక్ శాస్త్రి పేరడీ కవిత అంతకు మించి నవ్వులు పూయిస్తుంది. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితలకు జరుక్ శాస్త్రితో పాటు మాచిరాజు దేవీప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి వారెందరో పేరడీలు రాశారు. మహాప్రస్థానంలో శ్రీశ్రీ ‘పొలాలనన్నీ హలాల దున్నీ ఇలాతలంలో హేమం పండగ జగానికంతా సౌఖ్యం నిండగ...’ అంటూ రాసిన కవితకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఇలా పేరడీ రాశారు: ‘అవాకులన్నీ చవాకులన్నీ మహారచనలై మహిలో నిండగ ఎగబడి చదివే పాఠకులుండగ విరామమెరుగక పరిశ్రమిస్తూ అహోరాత్రులూ అవే రచిస్తూ ప్రసిద్ధికెక్కే కవి పుంగవులకు వారికి జరిపే సమ్మానాలకు బిరుదుల మాలకు దుశ్శాలువలకు కరతాళాలకు ఖరీదు లేదోయ్...’ పేరడీ కవులు కొందరు ప్రాచీన పద్యాలకు సైతం పేరడీలు రాశారు. పోతన భాగవతంలో రాసిన ‘వారిజాక్షులందు వైవాహికములందు’ అనే శుక్రనీతి పద్యానికి డాక్టర్ వెలుదండి నిత్యానందరావు పేరడీ పద్యం చూడండి... ‘పదవి వచ్చు వేళ పదవి పోయెడు వేళ ప్రాణమైన పదవి భంగమందు కూడబెట్టినట్టి కోట్ల రక్షణమందు బొంగకవచ్చు నఘము పొందడధిప’ పోతన భాగవత పద్యాలకు పేరడీలు రాసిన వారిలో పులికొండ సుబ్బాచారి ఒకరు. ‘కలడు కలండనువాడు కలడో లేడో..’ అనే పద్యానికి ఆయన రాసిన పేరడీ ఇది: ‘కలదందురు మంజీరలొ కలదందురు గండిపేట కాలువలందున్ కలదందురు పంపులలో కలదు కలందనెడు నీరు కలదో లేదో!’ శ్రీశ్రీకి గురుతుల్యుడైన అబ్బూరి రామకృష్ణారావు కూడా పోతనను పేరడీ చేశారు. భాగవతంలో పోతన రాసిన ‘అరయన్ శంతనుపుత్రునిపై విదురుపై నక్రూరుపై కుబ్జపై...’ అనే పద్యానికి అబ్బూరి వారి పేరడీ ఇదీ... ‘వడపై, నావడపై, పకోడిపయి, హల్వాతుంటిపై, బూందియాం పొడిపై, నుప్పిడిపై, రవిడ్డిలిపయిన్, బోండాపయిన్, సేమియా సుడిపై చారు భవత్కృపారసము నిచ్చో కొంతరానిమ్ము నే నుడుకుం గాఫిని ఒక్కచుక్క గొనవే! ఓ కుంభదంభోదరా!’ శ్రీశ్రీ కవితలకు పేరడీలు రావడం ఒక ఎత్తయితే, శ్రీశ్రీ తానే స్వయంగా పేరడీ గారడీలు చేయడం విశేషం. శ్రీశ్రీ తన ‘సిప్రాలి’లో సుమతీ శతకంలోని ‘ఏరకుమీ కసుగాయలు...’ పద్యానికి చేసిన పేరడీ... ‘కోయకుమీ సొరకాయలు వ్రాయకుమీ నవలలని అవాకులు చెవాకుల్ డాయకుమీ అరవ ఫిలిం చేయకుమీ చేబదుళ్లు సిరిసిరిమువ్వా!’ వేమన పద్యాలకైతే పేరడీలు కొల్లలుగా వచ్చాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రసిద్ధులే కాకుండా, కొందరు అజ్ఞాత కవులు కూడా వేమన పద్యాలకు చమత్కారభరితమైన పేరడీలు రాశారు. వేమన పద్యాలకు కొన్ని ఆధునిక పేరడీలు చూడండి... ‘కల్లు సారా బ్రాండి కడుపార త్రాగరా జంకు గొంకు లేక పొంకముగను ఏది దొరకనపుడు ఎండ్రిను ద్రాగరా విశ్వదాభిరామ! వినుర వేమ! ‘గంగిగోవు పాలు గంటెడే చాలునా కడివెడేడ దొరుకు ఖరముపాలు భక్తి కలుగు కూడు పట్టెడే చాలునా విశ్వదాభిరామ! వినుర వేమ!’ ఈ రెండూ వేమన పద్యాలకు అజ్ఞాత కవుల పేరడీలు. వేమనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరడీ మచ్చుకొకటి... ‘వేదవిద్య నాటి వెలుగెల్ల నశియించె గారె బూరె పప్పుచారె మిగిలె బుర్ర కరిగి బొర్రగా మారెరా విశ్వదాభిరామ వినురవేమ’ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక అజ్ఞాతకవి నీచుల రాజ్యం వచ్చినందుకు బాధపడుతూ వ్యంగ్యంగా చెప్పిన ఈ పద్యాలు నవ్వులు పూయించక మానదు... దాదాపు ఉర్దూలోనే రాసిన ఈ పద్య సంభాషణనుు చూడండి... ‘లుచ్ఛా జమాన ఆయా అచ్ఛోంకో హాథ్ దేన హర్ ఏక్ సీకా అచ్ఛా జమాన ఫిర్ కబ్ వచ్చేనా చెప్పవయ్య వల్లీసాబూ!’ (నీచుల రాజ్యం వచ్చింది. మంచివాళ్లకు చెయ్యిచ్చే పద్ధతిని ప్రతివాడూ నేర్చాడు. మళ్లీ మంచికాలం ఎప్పుడొస్తుందోయ్ వలీ సాహెబు) అని అడిగితే, ‘బందేనవాజ్ బుజురుగ్ జిందాహై ఆజ్తో న జీతే హం ఖుదా బందాహి జానె వహసబ్ గందరగోళం జమాన ఖాజాసాబూ! (చేసిన మంచి పనుల వల్ల దేశసేవకులు, పుణ్యపురుషులు అలా ఉన్నారు. మనం అలా జీవించలేం. ఇప్పటికీ భగవద్భక్తుడు సేవకుడే ఈ విషయాలను తెలుసుకోవాలి. అయినా ఖాజా సాహెబూ! ఇప్పుడంతా గందరగోళం కాలం వచ్చింది కదా) అని బదులిచ్చాడు. తెలుగు కవిత్వంలో ఇలాంటి చమత్కారాలు కోకొల్లలు. ఆధునిక కవులలో వికటకవులుగా, హాస్యకవులుగా పేరుపొందిన వారు మాత్రమే కాదు, సంప్రదాయకవులుగా, భావకవులుగా, విప్లవకవులుగా ముద్రపడినవారు సైతం తమ కవిత్వంలో చమత్కారాలూ మిరియాలూ తగుపాళ్లలో నూరారు. స్థలాభావం కారణంగా ఇక్కడ ప్రస్తావించలేకపోయిన కవులలో కూడా ఎందరో మరెందరో పాఠకులకు చవులూరించే కవితలు చెప్పి భళాభళి అనిపించారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అందుకోండి ఈ కవనవ్వుల నజరానాలు. ఆధునిక చాటువులు స్వతంత్ర కావ్యాలు రచించి ప్రసిద్ధులైన ఆధునిక కవులు కొన్ని సందర్భాలలో హాస్యరసభరితమైన చమత్కార చాటువులు చెప్పారు. వాటిలో కొన్ని... ‘శివతాండవం’తో ప్రసిద్ధులైన పుట్టపర్తి నారాయణాచార్యులు శ్రీనాథుడికి తీసిపోని రీతిలో చెప్పిన చిలిపి చాటువుల్లో మచ్చుకొకటి... ‘గజగమన గాదు ఇయ్యది గజసదృశ శరీర సీటు కంతయు తానై అజగరమై కూర్చున్నది గజిబిజిౖయె పోయె మనసు కన్నులు గూడన్’ ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి స్వతంత్ర కావ్యాల్లో హాస్యం తక్కువగానే ఉన్నా, ఆయన సందర్భోచితంగా సంధించిన చమత్కార చాటువులు లేకపోలేదు. ఆయన చెప్పిన ఒక చమత్కార పద్యం... ‘చదువురాని వేళ ‘చంకరుండ’న్నాడు చదువుకొనెడి వేళ ‘సంకరుండ’నె చదువు ముదిరిపోయి షంకరుండనెనయా స్నిగ్ధ మధురహాస! శ్రీనివాస! మిశ్రభాషా కవనవినోదం ఆధునిక కవుల్లో ఇంగ్లిషు, ఉర్దూ భాషలను తెలుగుతో కలగలిపి మిశ్రభాషా కవిత్వం చెప్పి నవ్వులు పూయించిన వారు ఉన్నారు. బ్రిటిష్ పాలనలోని ఆంధ్ర ప్రాంతంలోని కవులు తెలుగు పద్యాల్లో యథేచ్ఛగా ఇంగ్లిషును వాడుకుంటే, నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంత కవులు తమ ఉర్దూ పాటవాన్ని ప్రదర్శించారు. మిశ్రభాషా కవనవినోదానికి కొన్ని ఉదాహరణలు... సామాజిక దురాచారాలను నిరసిస్తూ్త నాటకాలు రాసిన ప్రముఖులలో కాళ్లకూరి నారాయణరావు ఒకరు. మధుపానాసక్తత మితిమీరిన ఆధునిక జీవనశైలిని వెటకరిస్తూ ‘మధుసేవ’ నాటకంలో ఆయన హాస్యస్ఫూర్తికి ఉదాహరణగా నిలిచే పద్యం... ‘మార్నింగు కాగానె మంచము లీవింగు మొఖము వాషింగు చక్కగ సిటింగు కార్కు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు గడగడ డ్రింకింగు గ్లాసులు గ్రంబులింగు భార్యతో ఫైటింగు బయటకు మార్చింగు క్లబ్బును రీచింగు గాంబులింగు విత్తము లూసింగు చిత్తము రేవింగు వెంటనే డ్రింకింగు వేవరింగు మరల మరల రిపీటింగు మట్టరింగు బసకు స్టార్టింగు జేబులు ప్లండరింగు దారిపొడుగున డాన్సింగు థండరింగు సారె సారెకు రోలింగు స్రంబలింగు’ నవ్వులను విశ్లేషించి వివరించిన హాస్యరచయిత భమిడిపాటి కామేశ్వరరావు కూడా తెలుగులో ఇంగ్లిషును రంగరించి... ‘ది స్కై ఈజ్ మబ్బీ... ది రోడ్ ఈజ్ దుమ్మీ మై హెడ్ ఈజ్ దిమ్మీ...’ అంటూ కవిత చెప్పారు. -
సిగలో అవి విరులో...
‘ఊహ తెలిశాక నేను చదివిన తొలి కవిత– నీ పేరు’ అంటాడు వినీత్ టబూతో ‘ప్రేమికుల దేశం’లో. ‘చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన’ అంటాడు ‘చెల్లెలి కాపురం’లో శోభన్బాబు. ‘మరుమల్లెల కన్నా తెల్లనిది’ అని ఇదే శోభన్బాబు ‘మల్లెపూవు’లో కవిత్వం రాస్తాడు. ‘సిగలో అవి విరులో’ అని అక్కినేని జయసుధలోనే తన ఊహాసుందరిని వెతుక్కుంటాడు ‘మేఘసందేశం’లో. ‘రానీ రానీ వస్తే రానీ కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్’ అని తానే శ్రీశ్రీగా అవతరిస్తాడు కమలహాసన్ ‘ఆకలి రాజ్యం’లో. ఢిష్యూం ఢిష్యూం హీరోలకు కవిత్వం చుక్కెదురే. కాని కొన్ని సినిమాలలో వారి వల్ల కవిత్వం మెరిసింది. ‘నేడు ప్రపంచ కవితా దినోత్సవం’ సందర్భంగా సినిమాల్లో కవులపై సండే స్పెషల్... ‘సాగర సంగమం’లో కమలహాసన్ గొప్ప డాన్సర్. కాలక్షేపానికి కల్చరర్ రిపోర్టర్గా చేస్తూ శైలజ డాన్స్ని విమర్శించాడని అతణ్ణి అవమానిస్తారు. దానిని ఎంత భరించాలో అంత భరిస్తాడు. కాని చాలక అతడి స్నేహితుడైన శరత్బాబును ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. అది మాత్రం భరించలేకపోతాడు. శరత్ బాబు అదే పేపర్లో ప్రూఫ్రీడర్. కాని అతడు ఒక గొప్ప కవి. ‘ఒక మహా కవికి ప్రూఫ్రీడర్ ఉద్యోగం ఇవ్వడమే కాక మళ్లీ ఉద్యోగంలో నుంచి తీసేస్తారా’ అని పత్రికాఫీసుకు వెళ్లి నానా రభసా చేస్తాడు. ‘టూ మిస్టేక్స్.. టూ మిస్టేక్స్’ అని రొప్పుతాడు. నిజమే. కవి అరుదు. కవి గౌరవం ఇవ్వవలసినవాడు. కవి సగటు మనిషి కంటే ఒక మెట్టు ఉన్నతుడు. అతడు కవిత్వం పలుకుతాడు. మనిషికి అవసరమైనది ఆహ్లాదపరిచేది అందులో ఏదో ఉంటుంది. అందుకే అతడు ఉన్నతుడు. పద్యమే... అది మన సొంతం ప్రపంచమంతా కవిత్వం ఉంది. తెలుగు వారికి పద్యం ఉంది. పదం ఉంది. వాగ్గేయకారులు ఉన్నారు. అందుకే సామాన్యులకు వచనం రాసేవారు, నాటకం రాసేవారు, నవలలు రాసే వారు ఎక్కువగా తెలియదు. ‘కై’గట్టేవాళ్లే తెలుస్తారు. తెలిశారు. ‘వాడు కైగడతాడురా’ అంటారు. బడికి వెళ్లి చదువుకోనివారికి కూడా ఒక వేమన పద్యం తెలుసు. పోతన భాగవతం తెలుసు. అందుకే కవికి ఆ దర్జా ఆ హోదా. తెలుగు సినిమా ఆ విషయాన్ని కనిపెట్టకుండా ఎలా ఉంటుంది. అందుకే కవులే కథా నాయకులుగా సినిమాలు వచ్చాయి. చిత్తూరు వి.నాగయ్య మనకు తెలుగు తెర మీద కవిని చూపించారు. ‘యోగి వేమన’ ఆయనే. ‘భక్త పోతన’ ఆయనే. రెంటికీ కె.వి.రెడ్డి దర్శకత్వం వహించారు. ఒక కవి అచ్చతెనుగులో మరో కవి గ్రాంథిక తెనుగులో కవిత్వం చెప్పి తెలుగువారి సారస్వతానికి లంకెల బిందెలు ఇచ్చి వెళ్లారు. వెండితెర అది నిక్షిప్తం చేసింది. కవి అంటే అక్కినేనే కత్తి పట్టుకునే ఎన్.టి.రామారావు ఘంటం పట్టుకుంటే బాగోదని నిర్మాత దర్శకులు అనుకున్నారో ఏమో అక్కినేనిని కవిని చేశారు. ‘మహాకవి కాళిదాసు’లో అక్కినేని కాళిదాసుగా అద్భుతమైన నటనను ప్రదర్శిస్తారు. ‘మాణిక్యవీణాం ముఫలాల యంతి’ అని సరస్వతి కటాక్షం తర్వాత తన్మయత్వంతో ఆయన చేసే స్తోత్రం పులకింప చేస్తుంది. అక్కినేనికే ఆ తర్వాత ‘తెనాలి రామకృష్ణ’ కవి పాత్ర పోషించే గొప్ప అవకాశం దొరికింది. ఈ వికటకవి తెలుగువారికి ప్రీతిపాత్రుడు. సినిమాని అందుకే హిట్ చేశారు. ఎన్.టి.ఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా అక్కినేని ఆదరించడం, ఆయన అల్లరికి అదిరిపోవడం ఈ సినిమాలో చూశాం. అక్కినేనికి భక్తికవుల పాత్రలు దొరికాయి. ‘భక్త జయదేవ’, ‘భక్త తుకారాం’, ‘మహాకవి క్షేత్రయ్య’ ఇవన్నీ ఆయనకు దొరికిన అదృష్టపాత్రలే అనుకోవాలి. నాగార్జున అన్నమయ్యలో ‘భక్త కబీర్’గా కూడా ఆయన నటించారు. కబీర్ మహాకవి కదా. శ్రీనాథ కవిసార్వభౌమ అయితే ఎన్.టి.ఆర్కు మాత్రం శ్రీనాథ కవి సార్వభౌముడి పాత్ర పోషించాలని ఉండిపోయింది. ఆయన ‘బ్రహ్మంగారి’ పాత్ర పోషించినా ఆయన కవితాత్మకంగా భవిష్యత్తు చెప్పినా అది కాలజ్ఞానంగా జనం చెప్పుకున్నారు తప్ప కవిత్వంగా కాదు. కనుక తెలుగువారి ఘన కవి శ్రీనాథుడిని వెండి తెర మీద చూపడానికి ఎన్.టి.ఆర్ ఏకంగా బాపు, రమణలను రంగంలోకి దించారు. ఎంతో ఇష్టపడి కష్టపడి నటించారు. అయితే మునపటి దర్శక నిర్మాతల అంచనాయే కరెక్టు. ఎన్టిఆర్ను కవిగా ప్రేక్షకులు పెద్దగా మెచ్చలేకపోయారు. చరణ కింకిణులు సాంఘిక సినిమాలు వచ్చేసరికి కవిగా శోభన్బాబుకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ‘చెల్లెలి కాపురం’లో నిజ కవి సి.నారాయణరెడ్డి సహాయంతో తెర మీద ఆయన చెలరేగిపోయారు. ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన’ అని ఆయన పాడే పాట నేటికీ హిట్. ‘ప్యాసా’ రీమేక్గా తెలుగులో ‘మల్లెపువ్వు’ సినిమా తీస్తే హిందీలో గురుదత్ వేసిన పాత్ర శోభన్బాబుకు దక్కింది. ఆ పాత్రను ఆయన హుందాగా చేసి సినిమా హిట్ కావడానికి కారకుడయ్యాడు. ‘మరుమల్లెల కన్నా తీయనిది’, ‘ఎవరికి తెలుసు చితికిన మనసు’, ‘చిన్నమాటా ఒక చిన్నమాటా’ పాటలన్నీ అందులోవే. ఆకలేసి కేకలేసి ‘ఆకలేసి కేకలేశాను’ అన్నాడు శ్రీశ్రీ. ఆకలేసిన కుర్రకారు తన ఆగ్రహన్ని, ఆక్రందనను శ్రీశ్రీ కవితల ద్వారానే వ్యక్తం చేశారు. అలా చేయని వారిని ‘కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’ అని హేళన చేశారు. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమలహాసన్ ప్రతి ముఖ్యమైన సందర్భంలో శ్రీశ్రీని తలుచుకుంటాడు. ‘పతితులారా భ్రష్టులారా బాధాసర్పదష్టులారా ఏడవకండేడవకండి’ అని పొయెట్రీ చెబుతాడు. ఆకలికి తాళలేక శ్రీశ్రీ పుస్తకాలు అమ్ముతాడు. ‘విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు విలువ 3 రూపాయలు’ అని కన్నీరు కారుస్తాడు. ఒక నిజ కవి సినిమాలో నిజ కవిగా వ్యక్తీకరణ కావడం ఈ సినిమాతోనే మొదలు ఆఖరు. ప్రేమ కవిత్వం ఊహాసుందరిని ఊహించుకుని కవిత్వం చెప్పే తెలుగు హీరోలు కూడా ఉన్నారు. ‘సువర్ణ సుందరి’లో చంద్రమోహన్, ‘మేఘ సందేశం’లో నాగేశ్వరరావు ఇలా కనిపిస్తారు. మేఘసందేశంలో భార్యను తన ఊహా సుందరిగా మలుచుకోవడానికి అక్కినేని చూసినా ఆమెకు అదంతా తెలియదు. ఆ ఆర్తిని జయప్రద తీర్చాల్సి వస్తుంది. ‘సంకీర్తన’లో నాగార్జున కవిగా కనిపిస్తాడు. ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలో కవిత్వం కనిపిస్తుంది. మణిరత్నం ‘ఇద్దరు’, ‘అమృత’ సినిమాలలో కవిత్వం విస్తృతంగా ఉంటుంది. ‘ప్రేమదేశం’లో కవిత్వాన్ని చెప్పే ఆస్వాదించే కుర్రాళ్లను చూపిస్తాడు దర్శకుడు. కొత్తతరం హీరోలు ఈ కవిత్వానికి దూరంగా ఉన్నారు. జీవితంలో అయినా సినిమాల్లో అయినా పొయెట్రీ మిస్ కావడం వెలితి. కవిత్వం వర్థిల్లాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
రెప్ప వేయని రాత్రి
ఒకటా రెండా? ఎన్ని యుగాలు నడిచిపోలేదు సూర్యుడి చిటికెనవేలు పట్టుకొని రాత్రైతే చంద్రదీపం వెలిగించుకొని వర్తమానం నుంచి చరిత్ర గుమ్మం వరకు. ఒకరా, ఇద్దరా? ఎందరెందరు విడిచిపోలేదు పంచభూతాలల్లిన మాంసపంజరాన్ని మానవతా వాదాన్ని తలకెత్తుకున్న వాళ్లు. మనం మానవులం అని నిరూపించుకున్నవాళ్లు మంచిని పెంచి, వంచించిన వాళ్లని కాలరాసి తడిలేని హృదయాల తలుపులు తడుతూ తమని తాము దీపాలుగా వెలింగిచుకున్న వాళ్లంతా చివరికి చీకటిపాలైన ఉదంతాలన్నీ చరిత్ర పుటల్లో మురిగిపోతున్నాయి. ఇప్పుడు మనుషులు మనుషుల్లా లేరు పడగల్ని తలపుట్టల్లో దాచుకొని పెదవులపై వెన్నెల పండగలు జరుపుకుంటూ లోలోపల అగ్ని పర్వతాలై బద్దలై పోతున్నారు. వాతావరణంతో పాటు కలుషితమై పోతూ జనారోగ్యంపై రోగాలదోమలై వాలిపోతున్నారు. రేపటి వసంతానికి పట్టిన చీడపురుగులై కులాల సంతల్లో పాయలై ప్రవహిస్తున్నారు. ప్రతి వొక్కడు తన అజెండాతో ఓ జెండా మోస్తూ ఐకమత్యానికి పురిటిరోగమై ప్రవభవిస్తున్నాడు. రేపటి సూర్యుడి కోసం నిరీక్షించే నేత్రాలు మాత్రం ఆకాశం చిట్టచివ్వరి తెర వరకూ చూపులుసారిస్తూ విశ్వనరుడి ఆవిర్భావం కోసం రాత్రి రెప్పవేయటం లేదు. - ఈత కోట సుబ్బారావు -
అంగడి
అప్పుటికి అడివి మా సేతుల్లో ఉండీది! ఓ కాటా ... ఓ జంగిడితో ... అతగాడొచ్చేడు. నయవంచన కళ్ల నులకమంచం మీద జంగిడి పరిచీ ... అంగడన్నాడు. కాటా ధర్మం తప్పదన్నాడు. కళ్లు మూసుకొని నమ్మాలన్నాడు. కళ్లు మూసుకున్నాం. కాటా అడివిని తూకమేసింది. తీరా కళ్లు తెరిచేసరికి యింకేముంది? అడివి అతగాడి సేతుల్లో కెలిపోయింది! అంగట్లో జంగిడి మాకు మిగిలింది!! ♦సిరికి స్వామినాయుడు -
ఇంకేం లేదు..
అగుపించని ఆవలి పార్శ్వం ఊహే కాని ఉనికి కాదు ఈత తెలిసినా ఒడ్డు దొరకదు రాలిపడ్డ కలలు పడవ లేకనే పయనమైపోతాయి ఆనవాళ్లు దొరకని వెలుతురు గాయాలతో దేహాత్మలు పోటెత్తే ప్రవాహాలవడం మూడో కంటికి తెలియదు శూన్య ముఖానికి వేలాడుతున్న తనలో తాను లేనితనాన్ని రెప్పవాల్చని రేయి ఇట్టే పసిగడుతుంది రోజుకో రంగు పులమలేని నిస్సహాయత మోదుగ స్రావాల గుట్టు విప్పదు తడిసి మోపెడైన గుండె యుద్ధమంటేనే గాయమని గుర్తుచేయదు నిర్మలమైన నవ్వు లోతైన నిజాయితీ నీడలు లేని నిజాలు కాలేవని తేలిపోయాక కొనసాగింపు మాధ్యమం మసక బారిపోతుంది జీవితాన్ని కావలించుకున్న చేతుల బిగి సడలిపోయాక విషాదం విశాలంగా విస్తరిస్తుంది గూడు చెదరిన దృశ్యాన్ని అభావంగా చూసిన గుడ్డి లోకం అసంపూర్ణ వాక్యానిది హత్యా? ఆత్మహత్యా? అన్న చర్చ మొదలెడుతుంది ♦శారద ఆవాల -
పిట్ట కథ
వెలుతురు వెళ్లిపోయే వేళలో గోడని తడుముతూ గాయాల్ని లెక్కేస్తున్నాను అటూ ఇటూ చూస్తూ ఎటూ దూకలేక పిల్లి గోడంతా ద్వేషపు జీర చేయంతా నెత్తుటి వాసన యుద్ధాల్ని లెక్కేస్తూ రేపటిని లెక్కగడుతుంటే చిటికెడు రేపటిని మోసుకొచ్చి వాలిందో పిట్ట మనుషులు పిట్టకథలు చెప్పుకుంటున్నట్టే పిట్టలు మనుషుల కథలు చెప్పుకుంటాయంది నాకూ చెప్పింది ఇది తెలిసిన కథనే, తెలిసిన ప్రశ్నలే తెలియనట్టు నటిస్తూ నడుస్తున్నామంతే చెప్పుకుంటున్న అబద్ధాల్ని ముక్కుతో పొడుస్తూ గోడల్నీ, గాయాల్నీ మనిషి కథగా విడిచింది చిటికెడు గుండెలో అశోకుని కన్నీటి బొట్లనీ అక్కడే ఆరిన గొంతుల తడినీ తనువంతా నెత్తురైన నేల శ్వాసనీ గుమ్మరించింది మంచుకొండల్లోనూ, ఇసుకనేలల్లోనూ మనిషి నిండని చోట తుపాకీలు గీసిన గీతల గూర్చీ చెప్పింది రాళ్లు విసిరే చేతులూ గింజలు పరిచే గుండెలూ తుపాకీల గీతలకు ఇరువైపులా వున్నప్పుడు అది ఏ విభజనకు సంకేతం! సమాధానం వెతుక్కోమంటూ పగుళ్లలో పొడుస్తూ చెప్పింది పోతూ పోతూ ఆకలి కోసం కాని పోరు అసలు యుద్ధమెలా అవుతుందంటూ ఎగిరిపోయింది అటూ ఇటూ కాకుండా నింగినే చూస్తుంది పిల్లి బహుశా పక్షవ్వాలన్న కల పుట్టిందేమో - శ్రీ వశిష్ఠ సోమేపల్లి -
దిగులు తాడు
ఏదీ నన్ను వంచలేదు తుంగ తీసువాణ్ణి గదా తొలి బోధకుణ్ణి గదా బహుశా తొలి కార్మికుణ్ణి కూడా అనంత కరుణామూర్తిని ఏదీ నన్ను చంపలేదు చచ్చిన ప్రతిసారి బతుకుతున్నవాణ్ణి ఈ పక్క నుంచి చనిపోతున్నా ఆ పక్క నుంచి బతుకుతున్నవాణ్ణి పదంతస్తుల భవనాలకు కిందకీ పైకీ దిగుతూ ఎక్కుతూ రంగులేసేవాణ్ణి సున్నం రాసేవాణ్ణి చూసేవాళ్లనుకుంటారు ప్రాణాధారమైన తాడు వేళాడుతున్న తాడు తెగితే తెగితే పవన మాలికల మీద ఊగుతాను ఒంటికి ఇంటికి పద్యానికి రంగులేసేవాణ్ణి పాచిపట్టిన మనుషులకు లోన బయటా సున్నం వేసేవాణ్ణి రేపటి నుంచి కొత్త రూపం సరికొత్త స్వరూపం మొదటి రూపం ఒక రకంగా తుది రూపం ఒక రకంగా సున్నం బక్కెట్ పొడుగాటి కుంచె కర్ర అంతే వెదురువనాలు వూగుతాయి ఏటిఒడ్లు కదులుతాయి తెల్లవారటంలోనే పొద్దుగూకటం పొద్దుగూకటంలోనే తెల్లవారటం ఎవరో పొద్దున్నే తూర్పుదిక్కుకు జేగురు రంగు పూసాడు నాతోపాటూ సూర్యుడూ ఎక్కుతాడు దిగుతాడు కాని దిగులు తాడు ఒక్కటి వేళాడుతుంటుంది అన్ని వేళలా– - కె.శివారెడ్డి -
నాట్స్ కవితల పోటీ పురస్కార విజేతలు
డల్లాస్ : భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "నా దేశం-నా జెండా" అనే అంశంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) నిర్వహించిన కవితల పోటీకి అనూహ్య స్పందన లభించింది. నాట్స్ మొదటి సారిగా నిర్వహించిన ఈ కవితాస్పర్థలో ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు కవులు పాల్గొన్నారు. 913కి పైగా అందిన కవితల్లోంచి 9 మందిని విజేతలుగా ఎంపిక చేసి, వారితో కవి సమ్మేళనం నిర్వహించిన అనంతరం ఎవరు ఏ పురస్కారాన్ని అందుకున్నారో ప్రకటించామని ఈ కార్యక్రమ నిర్వాహకులు డా.సూర్యం గంటి తెలిపారు. నాట్స్ నూతన అధ్యక్షులు శేఖర్ అన్నె, నిర్వాహకులు డా సూర్యం గంటి, డా. ఆళ్ల శ్రీనివాస రెడ్డి విజేతలను ప్రకటించారు. విజేతలు.. వారి బహుమతులు సర్వోత్తమ పురస్కారం: రూ 20,000/-: దోర్నాథుల సిద్ధార్థ ఉత్తమ పురస్కారం: రూ 15,000/-: వంగర పరమేశ్వర రావు విశిష్ట పురస్కారం: రూ 10,000/-: నూజిళ్ల శ్రీనివాస్ విశేష పురస్కారం: రూ 5,000/-: కిరణ్ విభావరి గౌరవ పురస్కారం-1: రూ. 2000/- : వినీల్ కాంతి కుమార్ (శతఘ్ని) గౌరవ పురస్కారం-2: రూ. 2000/- : శిరీష మణిపురి గౌరవ పురస్కారం-3: రూ. 2000/- : జోగు అంజయ్య గౌరవ పురస్కారం-4: రూ. 2000/- : అల్లాడి వేణు గోపాల్ గౌరవ పురస్కారం-5: రూ. 2000/- : చెరుకూరి రాజశేఖర్ "పురస్కారాలు గెలుపొందిన తొమ్మిది మంది కవులూ సినీ కవులైన చంద్రబోసు, భాస్కర భట్ల, సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రితో కవితా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 14 సాయంత్రం తెలుగువారు అభివృద్ధి చేసిన ఆన్లైన వీడియో ప్లాట్ఫాం https://nristreams.tv/NATS-live/ లోనూ నాట్స్ యూట్యూబ్ ఛానల్లోనూ, సామాజిక మాధ్యమంలోనూ ప్రసారం చేశామని, దీన్ని అధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారని సంచాలకులు రాజశేఖర్ అల్లాడ తెలిపారు. మొదటి సారిగా ఈ ప్రయత్నం చేశాం. అనుకున్నదాని కంటే గొప్ప స్పందన లభించిందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. "భాషే రమ్యం- సేవే గమ్యం మా నాట్స్ నినాదం. ఆ దిశలో భాష విషయంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. కవితల పోటీలలో పురస్కారాలు గెలుచుకున్న విజేతలకు శుభాకాంక్షలు. ఇంకా మరిన్ని కవితలు మరింత గొప్పగా వ్రాయాలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన చంద్రబోసు గారికి, సిరాశ్రీ గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, భాస్కరభట్ల గారికి కృతజ్ఞతలు" అని నాట్స్ నూతన అధ్యక్షులు శేఖర్ అన్నె చెప్పుకొచ్చారు. (500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం) "ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలనే ఉత్సాహం నాట్స్ కి కలుగుతోంది. దీనికి కారణభూతమైన అశేషమైన కవులకు, కవయిత్రులకు మా కృతజ్ఞతలు. తెలుగు భాషకు చేస్తున్న సేవలో మీ ప్రోత్సాహం శిరోధార్యం", అని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని తెలిపారు. యాప్లో ప్రసారమైన ఆన్లైన్ కవి సమ్మేళన కార్యక్రమంలో చివరిగా సినీ కవులు కూడా తమ దేశభక్తి కవితలను చదివి వినిపించారు. "విశేషమేమిటంటే జూమ్లో కాకుండా పూర్తిగా తెలుగువారి చేత తయారు చేయబడిన NRI STREAMS CONNECT APP ద్వారా ఈ ఆన్లైన్ కవి సమ్మేళనాన్ని నిర్వహించడం మరింత ఔచిత్యంగా అనిపిస్తోంది" అని సినీ కవి చంద్రబోస్ అన్నారు. ఆ కార్యక్రమాన్ని ఈ లింకుల్లో చూడవచ్చు: https://nristreams.tv/NATS-live/ అండ్ https://www.youtube.com/watch?v=yWoDY7queO0 -
గడ్డి అంచున
చాన్నాళ్లయింది నిన్ను చూసి నువ్వలా ఎదురుచూస్తూనే వున్నావా గాలి వీచినప్పుడల్లా నవ్వుతూనే వున్నావా నీ సమాధి మీద మొలిచిన మొక్కకు కాసిన పూల కళ్లలో నుంచి కలలు కనే నేలనిద్రలో నుంచి లేతాకు పచ్చలో నుంచి ∙∙ నాటుకున్నాను కదా పగిలిన నా ప్రాణవిత్తువి తలకిందులుగా తలపులు కలుస్తాయిగా మట్టితీగల ఆత్మల్లో నీ చింతనా చితాభస్మం రాసుకొని సాగుతానిక సమాధి ముందర తడిచిన గడ్డి అంచున నిలిచిన లోకాన - పి.శ్రీనివాస్ గౌడ్ -
కవి మనసు ఖాళీగా ఉండదు
‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను...’ (‘ఠాగూర్’ సినిమా) పాటతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న రచయిత సుద్దాల అశోక్తేజ. ఇటీవల ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకొచ్చాయి. వాటి గురించి అశో క్తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య మీడియాలో నేను పోయానని ఒకరు, విషమంగా ఉన్నానని మరొకరు మాట్లాడుతున్నారు. అవన్నీ పుకార్లే. నాకు ఆపరేషన్ జరిగి దాదాపు 47 రోజులైంది. చక్కగా కోలుకుంటున్నాను. నేను బావుండాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి మామూలు మనిషి అవ్వాలని ఎంతోమంది స్నేహితులు, బంధువులు కోరుకున్నారు. అనారోగ్యం శరీరానికే కానీ, కవి మనసుకు కాదు. అది ఖాళీగా ఉండలేదు. అందుకే నేను ఈ అనారోగ్యం, కరోనా టైమ్లో కూడా రాస్తూనే ఉన్నాను. గతంలో నేను ‘శ్రమకావ్యం’ అని రాశాను. ఇప్పుడు ‘అరణ్య కావ్యం’ రాస్తున్నా. 70 నుండి 80 అధ్యాయాలు ఉండే పెద్ద కవిత ఇది. దాని పేరు ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’. అడవి వల్ల ప్రపంచానికి ఎంత మేలు జరిగింది? అలాంటి అడవిని ఎన్ని రకాలుగా హింసించారు? అనే విషయాలను ప్రస్తావిస్తూ అడవి తన గోడు వెళ్లబోసుకుంటుంది. అడవి హింసించబడటం వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఆçస్పత్రిలో చేరకముందు, ఆపరేషన్ అయిన మూడో రోజు నుండే నేను ఈ కవితను రాస్తూ బిజీగా ఉన్నాను. ఇవికాకుండా నూతన నటీనటులతో వస్తున్న ‘సతి’ అనే సినిమాకి పాట రాశాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాపై ఏమైనా రూమర్స్ వస్తే నమ్మొద్దని అందరికీ తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు. -
ఏ వరమూ ఆశించని కఠోర తపస్వి
సైదాచారి తన కవిత్వంలో పలవరించిన స్త్రీ ప్రతి పురుషుడి లోపల ఉండే మహిళా ప్రతీక. తాను కోరుకునే ఆమెను తానే సృష్టించుకుని ఆమెతో దగ్గరితనాన్నీ దూరపుతనాన్నీ చిత్రించుకున్నాడు. స్మృతి రాత నరకం. లేనిమనిషి గురించి ఉన్నప్పటి ఆత్మీయ ఉనికిని ఉన్నట్టుగానే అనుభవించే స్థితిని ఉన్నారన్న అనుభూతిలోంచే చూడాల్సిరావడం కచ్చితంగా నరకమే. యుగయుగాలు గుర్తుండిపోవాలన్న ధ్యేయంతోనే ఎవరైనా జీవితాంతం జీవించాలి. సైదాచారిది ప్రయత్నపూర్వం కాదు కానీ గుర్తుండిపోవడాన్ని మాత్రం సాధించేశాడు. నిజం చెప్పాలంటే ఇంకా గాఢంగా గుర్తుండిపోవాల్సిన సైదాచారి కవిత్వాన్ని అర్హమైన మోతాదులో సాహిత్యలోకం గుర్తించలేదు. సైదాచారిని మొదటిసారి చూసినపుడు ఇతని ముఖంలో నవ్వు ఎందుకో అమరదు అనిపించింది. ముఖనిర్మాణంలోనే ఆ అమరని లక్షణం ఉండి ఉండాలి లేదా జీవితంలో మోయలేనంత విషాదాన్ని దిగమింగుతూ కూడా చేసే నవ్వే ప్రయత్నం వల్ల అలా అనిపిస్తూ ఉండి ఉండాలి అనుకుని తననే ఓసారి అడిగేశా. అదే అమరని నవ్వులాంటిది వదిలి సమాధానం దాటేశాడు. సైదాచారి కవిత్వం నాకు నచ్చడానికీ, కవిగా సైదాచారి మీద నాకు ఇష్టం ఉండటానికీ నాకు నా మీద ఉన్న ప్రేమే కారణం. నేను ఎలా కవిత్వం రాస్తానో, నేను ఎలా రాయాలనుకుంటానో అదే అలవరుసలపై సైదాచారి కూడా రాయడం ప్రధాన కారణం. కవుల కవిత్వ పరికరాలైన నిత్య పదజాలాన్ని విసర్జించడం, అలతి అలతి మాటలతో కవితను మార్దవంగా మార్చే మోసానికి దూరంగా ఉండడం, ఇతివృత్తం ఎంపికలో నీళ్లు నమలకపోవడం, స్త్రీ చుట్టూ అల్లుకున్న తనదైన మోహాన్ని వ్యక్తీకరించడానికి శషభిషలు పడకపోవడం, కవితా నిర్మాణానికి సంబంధించి గత నియమాలను ఎడాపెడా కూల్చిపారేయడం, కవిత్వ ప్రకటనానంతర పరిణామాల లాభనష్టాలను బేరీజు వేసుకుని కవిత్వాన్ని తయారుచేసే దృష్టి లేకపోవడం సైదాచారిలో ఉన్న నా లక్షణాలు కావడంతో అయిల కవిత్వమంటే నాకు ఇష్టంగా ఉండేది. సైదాచారిలో బాగా నచ్చే ఇంకో లక్షణం అర్థం కావడం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించకపోవడం. చాలా సందర్భాల్లో కవితను అలా కలవరిస్తూ వెళ్లిపోతాడే తప్ప ఎక్కడా ప్రయత్నపూర్వక నిర్మాణ తాపత్రయం ఉండదు. ప్రతి జీవితంలో ఉండే వైఫల్యాలు, ప్రేమరాహిత్యం, బతుకు లోపలి ఎత్తుపల్లాలు ఎగుడు దిగుళ్లు, చేతకానితనాలు, రొడ్డకొట్టుడు తనాలకు సంబంధించిన లోతులన్నింటినీ తన కవిత్వంలో స్పృశించాడు సైదాచారి. సైదాచారికి రావల్సినంత గుర్తింపు రాలేదని నేను ఆందోళన వ్యక్తం చేశాను కానీ నిజానికి సైదాచారి ఎప్పుడూ గుర్తింపును దురాశించలేదు. అయితే గుర్తింపుకు సంబంధించి సైదాచారి గత కవులెవరూ సాధించలేని ఒక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సమకాలీనులు మెచ్చరే అన్న నానుడిని సైదాచారి అబద్ధం చేశాడు. కవి మిత్రులందరూ అయిల కవిత్వాన్ని మనస్ఫూర్తిగా హత్తుకున్నారు. ఇది ఈ కాలపు అరుదైన పరిణామం. విమర్శకులు తమ సౌలభ్యం కోసం కొన్ని వృత్తాలు గీసీ, బరులు నిర్మించీ వాటిలో కవులను ఇరికించేస్తారు. సాహిత్య ప్రపంచం తనదైన అవగాహనతో కవిని అంచనా వేసుకోకుండా వీళ్లు ముందే కొన్ని తప్పుడు క్లూలిచ్చి సమాధానాలను నిర్ధారించి తమకు తాము మార్కులేసుకుంటారు. సైదాచారి మోహపథంలో ఏకాంత పాంథుడిలా ప్రేమాన్వేషణ సాగించాడనీ, దేహ ప్రకటన సైదాచారి మాతృభాష అనీ, స్త్రీని ఆవాహన చేసుకునేందుకు కవితాయాగశాలలో మోహహోమాలు ఆచరించాడనీ ముద్దరలేసి అతన్ని వ్యక్తి విముఖుడై వాంఛాగ్ని శిఖలలో దగ్ధమైన కవిగా టాగ్ తగిలించీ బంధించేశారు కానీ అతను రాసిన మోహేతర కవితలే నిజానికి ఎక్కువ బలమైనవి. కులవృత్తి మీది ద్వేష ప్రేమ, మరణ చాపల్యం, సొంతనేల మీది మమకారం, గతతరపు గురుతులూ ప్రేమలూ సైదాచారి కవితలకు ప్రధానమైన ముడిసరుకులు. సైదాచారి తన కవిత్వంలో పలవరించిన స్త్రీ ప్రతి పురుషుడి లోపల ఉండే మహిళా ప్రతీక. తాను కోరుకునే తాను ఆకాంక్షించే ఆమెను తానే సృష్టించుకుని సైదాచారి ఆమెతో దగ్గరితనాన్నీ దూరపుతనాన్నీ చిత్రించుకున్నాడు. సైదాచారి ఆమెలకు చిరునామాలూ ఊళ్లూ పేర్లూ లేవనుకుంటాను. సింప్లీ హీ ఈజ్ ఏ గర్లీ మాన్. అందుకే అమ్మ నన్ను కనిందో, అమ్మను నేను కన్నానో అంటాడు.అతనిది కేవలం రెండు సంకలనాల పిన్నవయసు. అతనిది ఏ వరమూ ఆశించని కఠోర తపస్సు. ఎ పొయెట్ ఈజ్ నాట్ డెడ్ వైల్ హిజ్ నేమ్ ఈజ్ స్టిల్ స్పోకెన్. - ప్రసేన్ -
ఇల్లంటే ఇంత బాగుంటుందా!
పని భారమంతా ఆమె మీద వేసేసి పేపరుతోనో టీవీతోనో కాలక్షేపం చేసేవాణ్ని వండివార్చిన వాటికి వంకలు పెడుతూ చాటుగా కళ్లొత్తుకుంటున్న ఆమెను చూసి సంతృప్తిపడేవాణ్ని కాలర్ మీద మరకలు వదలలేదనో ఖాళీగా తిని కూర్చుంటున్నావనో చిటపటలాడేవాణ్ని ప్రపంచ భారమంతా నేనే మోస్తున్నట్టు ఇంట్లో చేసేది పనే కాదని తీర్మానించేవాణ్ని తపస్సు చేస్తున్న మౌనమునిలా శీర్షాసనమేసి మధ్యలో మాట్లాడితే నీకు మాట్లాడ్డమే రాదని చిన్నబుచ్చేవాణ్ని స్వీయ నిర్బంధం మొదలయింది కొంచెం కొంచెంగా ‘ఇగో’ ఎగిరిపోసాగింది ఇల్లంటే నిలబెట్టిన ఇటుకలు కాదని అంతకు మించిన మరేదో బంధమనే స్పృహ కలిగింది ఇన్నాళ్ళూ గుండెల్ని ఛిద్రం చేసిన చూపుల్ని గోడ మేకులకు తగిలించేసి పెదవుల మీదకి కాస్త చిరునవ్వును అరువు తెచ్చుకున్నాను ఎండిన బట్టలు మడతపెడుతూనో దుమ్ముతో నిండిన అరల్ని దులిపి తుడుస్తూనో మనసుకి హాయిగా చేతిపనికి సాయంగా మారాను మొదట్లో ఏదో శంక, ఆపైన కాసింత విస్మయం గుండెల్లోని తడి నీటిపొరలుగా ఆమె కళ్ళల్లోకి చేరింది ఇప్పుడు తనే – నేను, నేనే –తనుగా ఇద్దరమూ ఒకరికొకరుగా అనుబంధాల పూలతీగలుగా అల్లుకుపోతున్నప్పుడు ప్రేమతోనో ప్రశంసతోనో నా వైపు చూస్తుంటే అనిపించింది నిజంగా ఇల్లంటే ఇంత బాగుంటుందా అని! - డా‘‘ జడా సుబ్బారావు -
అప్పట్లో సచిన్, ఇప్పుడు విరాట్: సత్య నాదెళ్ల
న్యూఢిల్లీ: చాలా మంది భారతీయుల్లాగే సత్య నాదెళ్లకు క్రికెట్ అంటే ప్రేమే. కంప్యూటర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు సీఈఓగా వ్యహరిస్తున్న నాదెళ్లకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదో మీరు ఊహించగలరా ? లెక్కలు, లేదా సైన్స్ అని ఊహిస్తే, మీరు పప్పులో కాలేసినట్లే. ఆయనకు ఇష్టమైన సబ్జెక్ట్.. చరిత్ర. ఇక కోడింగ్.. కవిత్వం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరితో పిచ్చాపాటిగా జరిపిన సంభాషణలో ఆసక్తికరమైన విషయాలను సత్య నాదెళ్ల వెల్లడించారు. ఎక్కడ ఉన్నా, మదిలో అదే...! సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలో ఎవర్ని ఎన్నుకుంటారని అనంత్ అడుగగా, అప్పట్లో సచిన్ టెండూల్కర్ అని, ఇప్పుడైతే విరాట్ కోహ్లి అని సత్య నాదెళ్ల బదులిచ్చారు. తన పుస్తకం హిట్ రిఫ్రెష్లో క్రికెట్ ఆట తన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆయన పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా, తన మదిలో క్రికెడ్ క్రీడ మెదులుతూనే ఉంటుందని వివరించారు. కోడింగ్ కవిత్వం లాంటిదేనని పేర్కొన్నారు. -
హైకూలు
తెలుగు పాఠకులకు హైకూలను పరిచయం చేసిన కవి, ఇస్మాయిల్ (1928–2003). ఆయన్ని తలచుకోగానే ఒక నిశ్శబ్దం ఆవరిస్తుంది. చిలుకలు వాలిన చెట్టు, చెట్టు నా ఆదర్శం, రాత్రి వచ్చిన రహస్యపు వాన, పల్లెలో మా పాత ఇల్లు ఆయన కవితా సంపుటాలు. కవిత్వంలో నిశ్శబ్దం, కరుణ ముఖ్యం ఆయన విమర్శా వ్యాసాలు. హైకూల పుస్తకం, కప్పల నిశ్శబ్దం. కీచురాయి చప్పుడుతో గదంతా నిండిపోయింది. గదిలో నాకు చోటు లేదు. కొండ మీది కర్రి మబ్బూ దండెం మీది కాకీ రెక్కలు తెగ దులుపుకుంటున్నాయి. కోడిపుంజుల్ని కోసుకు తినేశారు మా ఊరివాళ్లు. ఇక తెల్లారకట్ట రైలు మిగిలింది. తలకి మబ్బూ కాళ్లకి సరస్సూ తొడుక్కోకపోతే కొండ కొండే కాదు. దారి పొడుగుతూ రైలు చక్రాలు నీ పేరే ఉచ్చరించాయి. లాంతరు వెలుతుర్లో పాప చదువుకుంటోంది ఎవరు ఎవర్ని వెలిగిస్తున్నారు? ఈ బాట మీద ఎవ్వరూ నడవగా చూడలేదు. ఇదిక్కడికి ఎలా వచ్చింది? బోటుని దాని నీడకి కట్టేసి పడవ సరంగు ఎటో పోయాడు. ఈ చెట్టు కింద రోజూ నిలబడతాను. చెట్టుకి నా పేరు తెలుసా? నేను దాని పేరడిగానా? అర్ధరాత్రివేళ కప్పల నిశ్శబ్దానికి హఠాత్తుగా మెలకువొచ్చింది. -ఇస్మాయిల్ -
ఆమెన్!
‘ఉన్నవి రెండు కాలాలు. ఆమెని ప్రేమించిన కాలం. ప్రేమించకుండా ఉండలేని కాలం’ అనే నందకిశోర్ రెండో కవితాసంపుటి ‘యథేచ్ఛ’ డిసెంబర్ 2017లో వచ్చింది (మొదటి సంపుటి ‘నీలాగే ఒకడుండేవాడు!’). ప్రచురణ: వాకిలి. అందులోంచి ఒక కవిత: భూమి దప్పిక తీర్చేందుకు ఆకాశం గొంతుకోసినవాడు దేవుడు చిక్కటి రాత్రి మొహమ్మీద చుక్కల దిష్టి పెట్టినవాడు దేవుడు కళ్లు తెరవని పసికందుని చంపి నిద్రపోగలవాడు దేవుడు అస్సలు స్పృహ తెలియకుండా అడవి చుట్టూ పంజరమల్లినవాడు దేవుడు -నందకిశోర్ -
ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే నా కవిత్వం
కవిత్వం అన్ని సందర్భాలకీ, సన్నివేశాలకీ, సమయాలకూ వర్తించే ధిక్కారం. కనీ కనిపించని, వినీ వినిపించనీ వేదన, సంవేదన. ‘"But I am the man/ And I'll be there/ And I may cause the lips of those who are asleep to speak/ And I may make my notebooks into sheaves of grass/ And I may write my own eponymous epitaph/ Instructing the horsemen to pass/ I am a tear of the sun' A° Lawrence Ferlinghetti అన్నట్టు– ఉషోదయ వేళ తుషార బిందువుల్లో సొగసుగానూ, అపరాహ్ణం వేళ గాలికి ఊగుతూ జ్ఞాపకాలు తలపోసుకుంటున్నట్టుగానూ, సంధ్యవేళ నలుగురి పాదాల కిందా నలిగి అసహనంగానూ, తెంపబోతే గీసుకుని చేతిలో నెత్తురు చిమ్మే గడ్డిపోచల్లాగే పలు విధముల నా కవిత్వం కన్నీరై దౌడు తీస్తూంటుంది. అందరూ ఎందుకిలా ఉన్నారు, లక్ష్యం ఒకటే అయినా మార్గాలెందుకు కలవడం లేదు, తరాలు గడిచిపోతున్నా వారు తలకెత్తుకోగలిగిందేపాటి, ఎవరిది నిర్లక్ష్యం, ఎందుకొచ్చిన అలసత్వం... ఒక్కటేమిటి; ఒక రకంగా చెప్పాలంటే నాకేమీ తెలీదేమోనని చిట్టడవిలో చొరవగా చొరబడిపోయిన కవిని నేనేమో? ఆ సందిగ్ధమే నా కవితా పాదాల్లోని అక్షరాలను దగ్ధం చేస్తుంది, ధగద్ధగాయమానమూ చేస్తుందేమో. నా వరకూ నేనేంటో, నా గుండె చప్పుడేంటో, నా కన్నీరేంటో, నా కలలేంటో, బిగుసుకునే పిడికిళ్లేంటో, విచ్చుకోబోయి ఒరిగిపోయిన స్వప్నాలేంటో, నాలో లీనమయ్యే ప్రపంచమేంటో, నా చుట్టూ సంచరించే సంగీతమేంటో, నా కంటికి కానరాని, మనోసీమకు అందని దుర్భిణీలో ప్రతిఫలించే అగాథమేంటో... ఏంటో, ఏంటేంటో– అదే నా కవిత్వం. అతీతమేమీ కాదు, అందరిలాంటిదే కవి జీవితమూ. లోభాలూ, మోహాలూ, ఆశలూ, ఆరాటాలూ, ఉద్యోగాలూ, ఉపాధీ, భార్యా, పిల్లలూ, సంసారం, కావల్సినన్ని కష్టాలు, కాసిన్ని కన్నీళ్లు, దోసెడు చిరునగవులు, అప్పుడప్పుడు ఆకాశంపై ఎక్కుపెట్టే ఇంద్ర ధనస్సులూ... వీటన్నిటి మధ్య నుంచి ఆశయాలకీ, ఆచరణలకీ దూరంగా లాక్కెళ్లిపోతున్న సామాజిక పరిస్థితులు, అయినా ఎండమావులనీ, పగటి కలల్నీ నిజం చేయాలన్న మొండి పట్టుదలతో ముందుకు ఉరికితే, ఒరిగితే– మోకాలు పగిలి, పెదవి చిట్లితే... వెక్కిరించే పెదవుల మధ్య, వెనక్కి తిరిగి చూడని కళ్ల మధ్య నాకు చేయిచ్చి, ఆసరాగా నిలిచిందీ, నిలబెట్టిందీ కవిత్వమే. రెండు దశాబ్దాలు పైబడిన కవితాన్వేషణలో తొలిసారి ‘ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’ నుంచి ఇప్పుడు ఇలా ఈ ‘దుర్గాపురం రోడ్’ మీదకు వచ్చి సంపుటిగా విచ్చుకోవడానికి ఇరవై ఏళ్లు పట్టినా, నిద్దట్లో పసివాడు అమ్మను హత్తుకున్నట్టు నేనెప్పుడూ కవిత్వం వేలిని విడిచిందీ లేదు. ‘్గౌu ఠీజీ ∙ ౌఠ్ఛి ్చజ్చజీn ్టజ్ఛి ట్టట్చnజ్ఛట ఠీజిౌ ఠ్చీటyౌuటట్ఛ జ’ అని ఈ్ఛట్ఛజు గ్చి ఛి్టౌ్ట అన్నట్టు నాతో నేను, కవిత్వంతో నేను– నిరంతరం ఓ సంక్లిష్ట మథనమే. -దేశరాజు -
పడమటి గాలిపాట
ఇంగ్లీషు కవులు అలంకారాలు, శబ్ద వైచిత్రి కన్నా భావుకతకు, తాత్వికతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. వారు శృంగార వర్ణనలను మితంగా, హద్దు మీరక చిత్రించారు. వారు అంతర్ముఖులై ఎక్కువగా ఏకాంతాన్ని ఆరాధించారు. జీవితంలోని అమానవీయత వారిని కలవరపెట్టింది. వ్యక్తి స్వేచ్ఛకు, భావ స్వాతంత్య్రానికి పట్టం గట్టారు. క్రీ.శ. 4వ శతాబ్దంలో రోమ్లను బ్రిటన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఆంగ్లో–శాగ్జన్లు, జర్మనీ నుంచి బ్రిటన్పై దండయాత్ర చేసి ఆక్రమించుకొన్నారు. అంతకుముందే వున్న కెల్టులను ఓడించి దూరంగా తరిమివేసారు. ఇప్పటికీ స్కాట్లాండు, వేల్సు, ఐర్లాండులలో కెల్టిక్ భాష సజీవంగా వుంది. ఆంగ్లో–శాగ్జన్లలో భాగమైన ఏంగిల్స్ (Ballads) అనే వారి భాష నుంచి పరిణామం చెంది ఆధునిక ఇంగ్లీషుభాష ఆవిర్భవించింది. కాని చాలా కాలంవరకు ఇంగ్లీషులో లిఖిత కావ్యాలు లేవు. మౌఖికంగా బాలడీర్స్ అనే వాళ్లు వీరగాథలూ, భక్తిగీతాలూ పాడుతూ ఆ పాటల్ని ప్రచారం చేసేవారు. ఆ పాటల్లో (ఆ్చ ్చఛీట) కొన్ని ఇంకా మిగిలివున్నవి. కానీ ప్రాచీన ఇంగ్లీషు భాషకీ, ఆధునిక భాషకీ చాలా తేడాలున్నాయి. 11వ శతాబ్దిలో ఫ్రాన్సు నుంచి జర్మన్లు దండెత్తి బ్రిటన్ని ఆక్రమించాక ఫ్రెంచి భాషే రాజభాషగా, అధికార భాషగా చలామణి అయింది. తర్వాత క్రమంగా ఆంగ్లభాష ఉపయోగించబడుతూ, అందులో కావ్యాలు కూడా వెలువడనారంభించాయి. మనం సంస్కృతంలో వాల్మీకిని, తెలుగులో నన్నయని ఎలా ఆదికవులుగా పరిగణిస్తామో, అదే విధంగా ఇంగ్లీషులో ఆదికవిగా ‘ఛాసర్’ని పరిగణిస్తారు. ఆయన రచనల్లో ముఖ్యమైనది కాంటర్బరీ టేల్స్. కొందరు యాత్రికులు కలుసుకొని, ఒక్కొక్కరు చెప్పిన కథలనే ఛాసర్ పద్యరూపంలో వ్రాశాడు. ఛాసర్ జీవితకాలం క్రీ.శ. 1340–1400. ఈయన తర్వాత కొందరు కవితలు, వచనం వ్రాసిన వారు వున్నారు. 15, 16 శతాబ్దాలలో అచ్చుయంత్రం కనిపెట్టడం వల్ల పుస్తకాలకి ఎక్కువ ప్రచారం కలిగి, రచయితల సంఖ్య కూడా పెరిగింది. ఛాసర్ తర్వాత ముఖ్యుడైన కవి ఎడ్మండ్ స్పెన్సర్ (1552–99). ఈ కాలాన్ని ఎలిజబెతన్ పీరియడ్ అంటారు. 1వ ఎలిజబెత్ రాణి పాలించిన కాలం. స్పెన్సర్ రాసిన రాణిని పొగుడుతూ వ్రాసిన కావ్యం ద ఫెయిరీ క్వీన్. ఈ కాలంలో ముఖ్యుడైన షేక్స్పియర్ జగత్ప్రసిద్ధుడు. అనేక గొప్ప నాటకాలే కాకుండా, సానెట్స్ వంటి కవితలు కూడా రచించాడు. ఆయన నాటకాల్లో సంభాషణలు కూడా మన పద్యనాటకాల్లాగా రాగయుక్తంగా చదివేందుకు పనికివస్తాయి. మరొక కవి క్రిస్టఫర్ మార్లో. ఈ కాలపు కవిత్వంలో ముఖ్యాంశాలు, యూరోపియన్ సంప్రదాయాన్ని, కవి సమయాల్ని అనుసరించడం. క్లాసిక్స్ని అనుసరించి, కథా వస్తువుగా స్వీకరించడం. నాటకాలని కూడా పద్యాలలాగ రచించడం. మధ్యలో కొంతకాలం జరిగాక మిల్టన్ అనే గొప్పకవి ఉద్భవించాడు(17వ శతాబ్ది). ఇతడు రాజరికాన్ని వ్యతిరేకించాడు. అంధుడు. పారడైజ్ లాస్ట్ అనే గొప్ప ఇతిహాసాన్ని రచించాడు. అందులో కథావస్తువు దేవునికీ సైతానుకీ సంఘర్షణ, సైతాను పాతాళలోకానికి బహిష్కరించబడటం. తర్వాత అగస్టన్ కాలం అనబడే 18వ శతాబ్దంలో అలెగ్జాండర్ పోప్, జాన్ డ్రైడన్ ముఖ్య కవులు. వీరికి ప్రాచీన ప్రపంచమంటే మక్కువ. వీరి తర్వాత కవులు ఎక్కువగా ప్రకృతిని ఆరాధించారు. పల్లెటూళ్ల గురించి, ప్రకృతి సౌందర్యం గురించి కవితలు అల్లారు. వీరిలో గోల్డ్స్మిత్, థామస్ గ్రే, రాబర్ట్ బర్న్స్ ముఖ్యులు. 19వ శతాబ్దం ప్రథమభాగంలో చెప్పుకోవలసినది రొమాంటిక్ యుగం. ఇక్కడ రొమాన్స్ అంటే శృంగారమని కాదు. భావుకత, కాల్పనికత అని అర్థం చేసుకోవలసి వుంటుంది. ప్రకృతి కవుల్లో వర్డ్స్వర్త్ పేర్కొనదగినవాడు. రొమాంటిక్ కవులలో షెల్లీ, కీట్స్, బైరన్లను పేర్కొంటారు. వీరు మొదట్లో ఫ్రెంచి విప్లవం ప్రభావానికి లోనైనా అందులో జరిగిన హింసాకాండ, దౌర్జన్యాల వల్ల తర్వాత విముఖులయ్యారు. వీరిపై అమెరికన్ స్వాతంత్య్ర యుద్ధ ప్రభావం కూడా ఉంది. మన భావకవులను షెల్సీ, కీట్సు ప్రభావితం చేసిన విషయం విదితమే. రొమాంటిక్ ఉద్యమం వ్యక్తిగత సృజనాత్మకతను, సామాన్య మానవుని భావాలను, ప్రకృతి రామణీయకతను ప్రోత్సహించింది. అదే సమయంలో రాబర్ట్ బ్రౌనింగ్ వంటివారు క్లాసికల్ ధోరణిని కూడా అనుసరించారు. తర్వాత విక్టోరియా మహారాణి పాలనలో బ్రిటన్ సామ్రాజ్యం అత్యున్నత దశకు చేరుకున్నది. క్రీ.శ.1850 నుండి 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయే వరకూ విక్టోరియన్ యుగంగానే పరిగణిస్తారు. ఈ కాలానికి ప్రతినిధులుగా టెన్నిసన్, రుడ్లార్డ్ కిప్లింగ్లను భావిస్తారు. శాస్త్ర విజ్ఞానం, అనేక నూత్న పరికరాల్ని కనిపెట్టడం, పారిశ్రామిక విప్లవం వీటిలో బ్రిటన్ అగ్రస్థానం వహించిన కాలం. ఐనా కొందరు కవులు క్రిక్కిరిసిన నగరాలు, మురికి వాడలు, రణగొణ ధ్వనులు, ఆధ్యాత్మికత కంటే భౌతిక దృక్పథం, ధనార్జన మీద దురాశ మున్నగు వాటివల్ల యీ కాలంలో వైముఖ్యాన్ని ప్రదర్శిస్తూ, ప్రకృతిని కీర్తిస్తూ కవితలు వ్రాశారు. టెన్నిసన్తో బాటు బ్రౌనింగ్, అతడి భార్య ఎలిజబెత్ బ్రౌనింగ్, మాథ్యూ అర్నాల్డ్ ఇప్పటి ముఖ్య కవులు. కాని క్రమంగా కవిత్వానికి ప్రాముఖ్యం తగ్గి, నవల, నాటకం, జర్నలిజం వంటి ప్రక్రియలకి ప్రాధాన్యం పెరిగింది. కాని 20వ శతాబ్ది ప్రారంభంలో కొందరు మంచి కవిత్వాన్ని అందించిన వారు ఉన్నారు. స్విన్బర్న్, యేట్స్, రాబర్ట్ గ్రేవ్స్, డి.హెచ్.లారెన్స్, రూపర్ట్ బ్రూక్స్, వాల్టర్ డీలా మారి వంటివారు, థామస్ హార్డీ, బ్రోంటీ సోదరీమణులు నవలలకి ప్రసిద్ధి చెందినా, ఆధునిక దృక్పథంతో కొన్ని కవితలు కూడా రచించారు. క్రీ.శ. 1914–40 వరకు యుద్ధాల్లో జరిగిన విపరీతమైన జననష్టం, ఆస్తినష్టం ప్రజల్లో అశాంతిని కలిగించింది. యుద్ధాల మధ్యకాలంలో కూడా విప్లవాలు, తిరుగుబాట్లు, ఆర్థిక మాంద్యం, కరువు కాటకాలు, నిరుద్యోగం, భీతావహమైన వాతావరణం– వీటివల్ల నిరాశ, నిస్పృహ, ఆధునిక నాగరికత పైనే వైముఖ్యం, అపనమ్మకం– ఇవన్నీ కవులపైన కూడా ప్రభావాన్ని చూపించాయి. టి.ఎస్.ఇలియట్ వంటి వారు వేస్ట్ లాండ్ వంటి రచనలలో యీ దృక్పథాన్ని ప్రతిఫలింపజేశారు. అధివాస్తవికత (సర్రియలిజం) వంటి కొత్త ఉద్యమాలు బయలుదేరాయి. ఫాసిజం వంటి నియంతృత్వాన్ని సమర్థించేవారు కూడా ఇంకొక ప్రక్క బయలుదేరారు. ఎజ్రా పౌండ్, ఆడెన్, స్పెండర్ వంటివారు. కొందరు సోషలిస్టు పరిష్కారాల వైపు, రష్యాలో జరిగిన బోల్షివిక్ విప్లవం వైపు మొగ్గు చూపారు. సంప్రదాయ కవిత్వం కన్నా, వచన కవిత్వాన్ని ఎక్కువగా అనుసరించారు. ఒక చిన్న తెగకు భాషగా ఒక మారుమూల ద్వీపంలోని భాషగా వున్న ఇంగ్లీషు వెయ్యి సంవత్సరాల్లో అనేక చారిత్రక పరిణామాల వల్ల ఇప్పుడు అపారమైన సాహిత్యం కల అంతర్జాతీయ భాషగా మారింది. శాస్త్రీయ విజ్ఞాన ప్రగతికి, పారిశ్రామికీకరణకు అవసరమైన గ్రీకు, లాటిన్ వంటి ప్రాచీన భాషల నుండి అసంఖ్యాకంగా పేర్లు, పదాలు తనలో ఇంగ్లీషు ఇముడ్చుకుంది. కాలక్రమాన అనేక యితర భాషల నుండి కూడా పదాలను చేర్చుకొని అంతర్జాతీయ భాష ఐనది. ఇంగ్లీషు కవులు అలంకారాలు, శబ్ద వైచిత్రి కన్నా భావుకతకు, తాత్వికతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. వారు శృంగార వర్ణనలను చాలా మితంగా, హద్దు మీరక చిత్రించారు. మొదట్లో వారిపై గ్రీకు, లాటిన్ సంప్రదాయాల ప్రభావం ఎక్కువగా ఉంది. తర్వాత సహజత్వానికీ, ప్రకృతికీ ప్రాధాన్యత పెరిగింది. కవుల్లో చాలామంది మీద క్రైస్తవ మత ప్రభావం, ఆధ్యాత్మిక తత్వం ఉంది. ‘రవి అస్తమించని’ సామ్రాజ్యాన్ని బ్రిటన్ పాలించినా ఆ అతిశయం కిప్లింగ్, టెన్నిసన్ వంటి కొందరి మీద మినహా అంతగా కనిపించదు. అంతర్ముఖులై ఎక్కువగా ఏకాంతాన్ని ఆరాధించారు. జీవితంలోని అమానవీయత వారిని కలవరపెట్టింది. వ్యక్తి స్వేచ్ఛకు, భావ స్వాతంత్య్రానికి పట్టం గట్టారు. ఇప్పుడు ఇంగ్లీషు సాహిత్యం, కవిత్వం అంటే ఇంగ్లండు దేశంలో వెలువడేది మాత్రమే కాదు. బ్రిటీష్ దీవులతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండీ వెలువడుతున్న ఆంగ్లభాషా సాహిత్యమని అర్థం. ముఖ్యంగా అమెరికా, కెనడా, కరేబియన్ దీవులు, ఆఫ్రికాలో నైజీరియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో వెలువడుతున్న ఆంగ్లభాషా సాహిత్యాన్ని చేర్చాలి. అంతే కాదు, భారత ఉపఖండంలో ఇంగ్లీషు భాషలో వెలువడే సాహిత్యమంతా యీ కోవకే చెందుతుంది. డాక్టర్ ముద్దు వెంకటరమణారావు (వ్యాసకర్త, సుప్రసిద్ధ ఆంగ్ల కవితలకు తెలుగు అనువాదం ‘పడమటి గాలిపాట’ వెలువరించారు.) -
అద్భుతం.. ఆంగ్ల కవిత్వం
సాక్షి, గుంటూరు: సామాజిక సమస్యలపై యువతరం దృష్టి సారించాలని జేకేసీ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. గుంటూరులోని జేకేసీ కళాశాల ఆడిటోరియంలో గుంటూరు 12వ అంతర్జాతీయ ఆంగ్ల కవితోత్సవం (జీఐపీఎఫ్) గురువారం ఘనంగా ప్రారంభమైంది. కళాశాల ఆంగ్ల అధ్యాపకుడు పరుచూరి గోపీచంద్, పంచుమర్తి నాగసుశీల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న కవితోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు కవిత రచనా నైపుణ్యాలను అలవర్చుకుని, కవులు, కవయిత్రులుగా ఎదగాలని సూచించారు. కవితా రచన ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు తమ వంతు కృíషి చేయాలని చెప్పారు. సామాజిక సమస్యలకు కవితలను అస్త్రంగా మలచుకుని పరిష్కార మార్గాలను చూపి సమాజంలో చైతన్య తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రస్తుత యువతరం కవిత రచనా నైపుణ్యాలను అలవర్చుకుని భావితరాలకు వారసత్వంగా అందించాలని పిలుపునిచ్చారు. గత 12 ఏళ్లుగా అంతర్జాతీయంగా కవులును ఒక చోటకు చేర్చి నిర్వహిస్తున్న కవితోత్సవం కళాశాల కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేస్తోందని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు పరుచూరి గోపీచంద్, పంచుమర్తి నాగసుశీల మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, శ్రీలంక, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికా, పోలాండ్ తదితర దేశాల నుంచి 190 మంది కవులు తమ సంకలనాలను అందించారని చెప్పారు. ప్రతి ఏటా తమ ఆంగ్ల శాఖ ఆధ్వర్యంలో తెలుగు, ఆంగ్ల భాషల్లో అంతర్జాతీయ కవితోత్సవాలను జరిపేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రపంచ శాంతి కోరుతూ హృదయాలను కదిలించి శాంతి వైపు మళ్లించే ఉద్ధేశ్యంతో అంతర్జాతీయ కవితోత్సవాన్ని 2008 నుంచి ప్రతి యేటా నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచ శాంతి, స్త్రీ సమానత్వం, పర్యావరణం, మానవతా విలువలు, గిరిజన జీవన విధానం అంశాలపై దేశ, విదేశాలకు చెందిన 190 మంది ప్రముఖ కవులు, కవయిత్రులు రచించిన పద్యాలతో ఎంపిక చేసి ముద్రించిన సంకలనాన్ని ఆవిష్కరించినట్లు వివరించారు. రెండు రోజుల పాటు జరిగే కవితోత్సవంలో తమ పద్యాలను వినిపిస్తారని తెలిపారు. ఈసందర్భంగా దేశంతో పాటు విదేశాల నుంచి తరలివచ్చిన ఆయా కవులు, కవయిత్రులు ఆంగ్లంలో రచించిన కవితలతో సంకలనం చేసిన ‘‘ది వాస్’’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా మంగుళూరులోని ఏజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీఆర్ కృష్ణ కార్యక్రమ నిర్వాహకుడు గోపీచంద్, నాగసుశీలను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల పాలకమండలి గౌరవాధ్యక్షుడు డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య, ఢిల్లీలోని ఆదర్శ్ ప్రెస్ నిర్వాహకుడు సుదర్శన్, ప్రముఖ గుండె శస్త్ర చికిత్స వైద్య నిపుణుడు డాక్టర్ లంకా శివరామ్ ప్రసాద్, కళాశాల పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్సార్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.నాగేశ్వరరావు, వాకాటి శిరీష్కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కవితలు.. చిత్రాలు నేను తెలుగు అమ్మాయినే. మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. వివాహానంతరం భువనేశ్వర్లో స్థిరపడ్డాను. గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నెలకొల్పి విద్యాసంస్థను నిర్వహిస్తున్నాను. మహిళలపై జరుగుతున్న దాడులు, గృహ హింసకు వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్య పరుస్తున్నాను. ఇందుకు కవితలతో పాటు చిత్రలేఖన, నృత్య విభాగాల్లో ప్రతిభ చాటుతున్నాను. నేను గీసిన ప్రతి చిత్రానికి ఒక కవిత రచించడంతో పాటు, ప్రతి కవితకు అద్ధం పట్టేలా ఒక చిత్రాన్ని గీస్తాను. ‘‘రక్తపు మడుగులో శాంతి కపోతం’’, ‘‘సిజ్లింగ్ వర్సెస్ డిజ్లింగ్ కలర్స్’’ అనే కవితా పుస్తకాలను గతేడాది ఇదే వేదికపై ఆవిష్కరించాను. - గాయత్రి మావూరు, భువనేశ్వర్ 12 ఏళ్లుగా నిరంతరాయంగా కవితోత్సవం ప్రపంచ శాంతి లక్ష్యంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు, మహిళపై దాడులు, పర్యావరణం వంటి అంశాలపై కవితా రచనలను ఆహ్వానిస్తూ గత 12 ఏళ్లుగా నిరంతరాయంగా కవితోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన కవులు, కవయిత్రులను ఒక వేదికపైకి చేర్చి వారి ఆలోచనలు, భావాలను పరస్పరం పంచుకోవడం ద్వారా సామాజిక సమస్యలపై మరింతగా కవితాస్త్రాలను సంధించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాం. – పరుచూరి గోపీచంద్, కార్యక్రమ నిర్వాహకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ‘సైగన్’ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రెనాటా సైగన్ అంతర్జాతీయ కవితోత్పవంలో పాల్గొనేందుకు పోలెండ్ దేశం నుంచి తొలిసారిగా గుంటూరు వచ్చారు. నటనతో పాటు కవయిత్రిగా, గ్రాఫిక్ డిజైనర్, ఫొటోగ్రాఫర్, జర్నలిస్ట్గా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. కవితోవ్సంలో పాల్గొనేందుకు గుంటూరు రావడం ఆనందంగా ఉందని, ఇక్కడి ఆతిధ్యం బాగుందని ఆమె చెప్పారు. ఆమె రచించిన కవితలు ఇంగ్లిష్, రష్యన్, బల్గేరియా, టర్కిష్, బెలారూసియన్, ఇటాలియన్, తెలుగు భాషల్లోకి అనువాదమయ్యాయి. స్పేస్ ఇంజినీరింగ్ చదువుతూ.. రచనలవైపు పోలాండ్కు చెందిన ఆగ్నిస్కా జర్నికో స్పేస్ ఇంజినీరింగ్ చదువుతూ తన తల్లి ఇజబెల్లా జుబ్కో బాటలో కవితా రచన చేయడం ప్రారంభించారు. గిటార్ వాయిద్యంపై శిక్షణ పొందుతూ అంతర్జాతీయస్థాయి పోటీలో ప్రతిభ చాటింది. కవితా రచనతో సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యంతో ముందుకెళుతున్నానని చెబుతోంది. పోలిష్ రైటర్స్ యూనియన్ సభ్యురాలు ‘ఇబజెల్లా’ పోలాండ్కు చెందిన ఇజబెల్లా జుబ్కో జగియోలొనైన్ యూనివర్శిటీలో అధ్యాపకురాలిగా పని చేస్తూ కవితా రచన హాబీగా మలచుకున్నారు. పోలిష్ రైటర్స్ యూనియన్లో సభ్యురాలిగా చురుకైన పాత్ర పోషిస్తూ సాహిత్య రచనలో నిమగ్నమయ్యారు. సాహిత్యంలో ప్రతిభ చూపినందుకు పలు అవార్డులను అందుకున్నారు. -
ప్రముఖ రచయిత్రి కెబి లక్ష్మి అస్తమయం
-
గోదావరి సీమపై ముళ్ళపూడి సంతకం
ముళ్లపూడి వెంకటరమణ.. ఈ పేరు తెలియని ఆంధ్రుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ పేరు స్ఫురణకు వచ్చిన వెంటనే బుడుగు గుర్తొస్తాడు.. ఆ వెంటనే ఆయన కలం నుంచి జనించిన పాత్రలు ఇంకొన్ని కళ్లముందు కదలాడతాయి. ఆ పాత్రల నైజాలు గుర్తొచ్చి పెదవులపై చిరునవ్వు కదలాడని పాఠకులు ఉండరనేది నిర్వివాదాంశం. సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి) : ముళ్లపూడి వెంకటరమణ 1931లో ధవళేశ్వరంలో జన్మించారు. ఊహ తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయారాయన. ధవళేశ్వరం ఆనకట్టలో తండ్రి క్యాష్ కీపర్. తండ్రి గతించాక, ఉదరపోషణార్థం తల్లి ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి మకాం మార్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. తల్లి విస్తరాకులు (అడ్డాకులు) కుట్టి కిరాణా దుకాణానికి అమ్మిన రోజులు, ప్రింటింగ్ ప్రెస్లో కంపోజింగ్ చేసిన రోజులు ఉన్నాయి. ‘మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ. జీవితం రీత్యా ఫ్రెండు, గురువు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు, తెచ్చుటలో కన్నా, ఇచ్చుటలో ఉన్నహాయిని చూపిన దైవం’ అని తన స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిలో రాసుకున్నారు రమణ. మద్రాసు వెళ్లాక, మధ్యలో రెండేళ్లు రాజమహేంద్రవరం, ఇన్నీసుపేటలోని వీరేశలింగం ఆస్తిక పాఠశాలలో సెకెండ్ ఫారం, థర్డు ఫారం (ఆధునిక పరిభాషలో 7, 8 తరగతులు) చదివినా, తుది శ్వాస వదిలేవరకు ముళ్లపూడి కావేరి నీళ్లనే సేవించారు. అయితే, ఆయన ధ్యాస, శ్వాస, యాస గోదావరి మాండలికమే. ఆయన రచనల్లో కనిపించే బుడుగు, సీగాన పెసూనాంబ, రెండు జెళ్లసీత, అప్పారావు, లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడు (అంటే మొగుడు లావని కాదు, పిన్నగారే లావు).. అందరూ గోదావరి మాండలికమే మాట్లాడారు. సినిమాల్లో ఆమ్యామ్యా రామలింగాలు, ‘తీతా’లు (తీసేసిన తాసిల్దార్లు) అచ్చంగా ఇక్కడి మనుషులే! గోదావరి ‘మా ఫిలిం స్టూడియో’ అని ప్రకటించుకున్న ముళ్లపూడి నేస్తం బాపుతో కలసి తీసిన సినిమాలు అన్నీ ఆ గోదారమ్మ ఒడిలోనే పురుడు పోసుకున్నాయి. సినీ రచన చేయడానికి గోదావరిపై లాంచి మాట్లాడుకుని, భద్రాద్రి రాముడి దర్శనం చేసుకోవడానికి వెడుతూ ఆ రచన పూర్తి చేసేవారు. పాత్రికేయుడిగా ఉద్యోగపర్వం ప్రారంభం ఎస్సెస్సెల్సీ వరకు చదివిన రమణ నాటి అగ్రశ్రేణి పత్రిక ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగరంగ ప్రవేశం చేశారు. ఆయనలో రచయిత అదే సమయంలో కన్ను తెరిచాడు. వందలాది కథలు, రాజకీయ భేతాళ పంచవింశతి లాంటి రాజకీయ వ్యంగ్యాస్త్రాల రచనలు, విక్రమార్కుడి మార్కు సింహాసనం వంటి సినీరంగ ధోరణులపై విసుర్లు, ఋణానందలహరితో అప్పారావు పాత్రను పరిచయం చేయడం, చిచ్చరపిడుగులాంటి బుడుగు రచన.. అన్నీ ఈ దశలోనే జరిగాయి. సినీరంగానికి మలుపు.. ఆంధ్రపత్రికలో సినిమా వార్తలు రాస్తున్న సమయంలో రమణ సమీక్షలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు రమణ సినీ సమీక్షలను ఆసక్తికరంగా చదివేవారు. సినీ నిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న దాగుడు మూతలు సినిమాకు రచన చేయమని ముళ్లపూడిని కోరారు. చాలాకాలం తప్పించుకు తిరిగిన రమణ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే, దాగుడుమూతలు షూటింగ్ కారణాంతరాల వల్ల లేటు కావడంతో, డూండీ ఎన్టీ రామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీ రచన అయింది. రెండో సినిమా కూడా ఎనీఆ్టర్ నటించిన గుడిగంటలు, మూడో సినిమా అక్కినేని నటించిన క్లాసిక్ మూగమనసులు.. మూడూ సూపర్ హిట్ సినిమాలే కావడంతో రమణ సినీ జీవితం ఊపందుకుంది. సొంతంగా సినిమాలు కూడా నిర్మించారు. సాక్షి, బంగారుపిచుక, బుద్ధిమంతుడు, అందాలరాముడు, గోరంతదీపం, ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, పెళ్ళి పుస్తకం.. కొన్ని హిట్లు మరికొన్ని ఫట్లు అయినా, రెంటినీ సమానంగా భావించే స్థితప్రజ్ఞుడు ఆయన.. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కోరికపై విద్యార్థులకు వీడియో పాఠాలు తీశారు. రామాయణాన్ని అమితంగా ప్రేమించే రమణ చివరి రచన కూడా శ్రీరామరాజ్యం కావడం, ఆయన జీవితకాల నేస్తం బాపు తుది క్షణంలో ఆయన పక్కనే ఉండడం చెప్పుకో తగ్గ అంశాలు. 2011 ఫిబ్రవరి 24న చెన్నయ్లో రమణ కన్ను మూశారు. పుట్టిన గడ్డతో రమణ చివరివరకు ఎందరో ప్రముఖులతో అనుబంధాలు పంచుకున్నారు. మచ్చుకు కొందరి అంతరంగాలు పరికిద్దామా.. ముళ్లపూడి వెంకట రమణ చదువుకున్న పాఠశాలలో, ఆయన 88వ జయంత్యుత్సవం శుక్రవారం ఉదయం 10 గంటలకు కళాగౌతమి, తెలుగు సారస్వత పరిషత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈనాటికీ బాపు, రమణల కుటుంబాలతో అనుబంధాలు ‘హాస్యమందు అరుణ– అందె వేసిన కరుణ–బుడుగు వెంకట రమణ–ఓ కూనలమ్మా! అని ఆరుద్ర రమణని గురించి తన కవితలో పేర్కొన్నారు. బాపు, రమణలతో నాకు పరిచయం కలగడం, వారి కుటుంబాలతో నేటికీ సంబంధ బాంధవ్యాలు ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. ఓ సారి ఆయన పుట్టినరోజుకు శుభాకాంక్షలు గీసి పంపితే, ఆయన జవాబు రాస్తూ, బాపు సంతకం కూడా ఆయనే చేసి, ఆథరైజ్డు ఫోర్జరీ అని రాశారు! అన్నట్టు ఋణానందలహరిలో ఆయన కథానాయకుడి పేరు (అప్పారావు), నా పేరు ఒక్కటే కావడం ఆదో విచిత్రం! – ఎంవీ అప్పారావు (సురేఖ) కార్టూనిస్టు నన్ను ‘కందుల హాయీ’ అనే వారు. బాపు అనారోగ్యానికి వైద్య నిమిత్తం ముళ్లపూడి రాజమహేంద్రవరం వచ్చారు. ఆయనకు సుమారు రెండు దశాబ్దాలుగా షుగరు వ్యాధి ఉండేది. సహవైద్యులు నా పేరు సూచించారు. మా ఇద్దరి మధ్య కేవలం డాక్టరు, పేషంట్ల సంబంధంగా ఉండేది కాదు. నాకు ఆయన పుస్తకాలు పంపేవారు. ఫోనులో తరచూ మాట్లాడుకునేవాళ్లం. ఓ సారి నా మీద ఇలా కవిత రాసి పంపారు.. ‘మందొద్దంటూ చాల, ప–సందులు మింగించి, నన్ను సరిజేసి, తిరిగీ మందును పసందును చేసిన కందుల ‘శ్రీహాయిగార్కి’ వందన శతముల్’ – రమణ (మే 2006) ఎప్పుడైనా విమానాశ్రయానికి ఆయన్ను తీసుకురావడానికి వెడితే, ఆయన ఓ మూల కుర్చీలో కూర్చుని ఉండేవారు. బాపులాగా నాకు కూడా ‘జనగండం’ ఉందని చమత్కరించేవారు. – డాక్టర్ కందుల సాయి, డయాబెటిక్ కేర్, రాజమహేంద్రవరం -
‘సాహిత్యం’లో రాణిస్తున్న రమాదేవి
చెన్నూర్: పట్టణానికి చెందిన బొల్లంపల్లి రమాదేవి కవితలు,రచనలు చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకుంటూ పలువురి మన్ననలు పొందారు. హృదయ స్పందన అనే కవిత పుస్తకాన్ని రచించి అందరి మనసులను దోచుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర నలుమూలలో నిర్వహించిన కవి సమ్మేళనాల్లో పాల్గొని ఎన్నో అవార్డులు అందుకుంది. జాతీయ సాహితీ పురస్కారం అందుకోవడమే తన లక్ష్యంగా సాహిత్య రంగాల్లో ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు రమాదేవి పాల్గొన్న కవి సమ్మేళనాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. రమాదేవి ప్రస్థానం రమాదేవి స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని. దేవరకొండ కమలాదేవి, యాదగిరిలకు జన్మించింది. చెన్నూర్కు చెందిన బొల్లంపల్లి పున్నంచంద్తో వివాహమైంది. ఏంఏ తెలుగు, బీఎడ్, సోషీయాలజీ పూర్తి చేసింది. ప్రస్తుతం చెన్నూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. రాష్ట్రస్థాయి పురస్కారం మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాలలోని తెలంగాణ భాషా సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో రమాదేవికి రాష్ట్రస్థాయి ఎంవీ నరసింహారెడ్డి పురస్కారం అందజేశారు. రాష్ట్ర స్థాయి పురస్కారం లభించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. సన్మానాలు, సత్కారాలు రామగుండం నగరపాలక సంస్థ 2016లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రశంసపత్రం, అవార్డు తెలంగాణ రైతు హార్వేస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి కవిత అవార్డు సహస్ర కవి సమ్మేళనంలో ప్రపంచ రికార్డు స్థాయిలో నిర్వహించిన పోటీల్లో సన్మానం ఉదయ కళానిధి సంస్థ ఆధ్వర్యంలో యాదాద్రి శిల్పకళా వైభవం పేరుతో నిర్వహించిన కవి సమ్మేళనంలో సన్మానం, ప్రశంస పత్రం 1116 మంది కవులతో ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్లో ప్రశంస పత్రం 2018 ఆగష్టు 15న చెన్నూర్లో నీర్ల మధునయ్య జయంతి వేడుకల్లో సాహిత్య పురస్కారం జాతీయ స్థాయిలో గుర్తింపే నా లక్ష్యం సాహిత్య రంగాభివృద్ధికి నావంతు కృషి చేస్తా. దిగజారిపోతున్న నైతికత విలువలను కాపాడే విధంగా సాహిత్యం ఉండాలన్నదే నా ఉద్దేశం. అవార్డు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలుతో అనేవి ప్రతిభకు గుర్తింపుగా వస్తూ ఉంటాయి. సన్మానాలతో అగిపోకుండా నా రచనలు నిరంతర సాగిస్తా. జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించడమే నా ముందున్న లక్ష్యం. – బొల్లంపల్లి రమాదేవి, కవి రచయిత, చెన్నూర్ -
సాహిత్యంతో స్ఫూర్తి నింపుతున్న ‘భారతి’
బోధన్: పట్టణ కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, శరీర, అవయవదానం సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రముఖ రచయిత్రి కాట్రగడ్డ భారతి విభిన్నమైన సామాజిక అంశాలపై అక్షరాలను అస్త్రంగా మలుచుకుని కవితలు, పాటలు రాస్తూ, ప్రజల్లో చైతన్యస్ఫూర్తిని నింపే కార్యరంగాన్ని ఎంచుకుని ముందుకెళ్తున్నారు. సాహితీ రంగంలో తనదైన శైలిలో రచనలు చేస్తూ రాణిస్తున్నారు. భారతి రచనలు తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా శరీర, అవయదానం ప్రాముఖ్యత అంశంపై 140 పైగా స్వీయ రచనలు (కవిత) రాసి సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ సహకారంలో ‘వెన్నెల పుష్పాలు’ కవిత సంకలనం పుస్తకాన్ని ముద్రించారు. 2016 జనవరి 3న హైదరాబాద్లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్, ఢిల్లీకి చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి దిలీప్కుమార్, సావిత్రిబాయి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధుల చేతుల మీదుగా కవిత సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. శరీర, అవయవదానం అంశంతో పాటు మాతృభాష ప్రాముఖ్యత, పరిరక్షణ, సామాజిక సమస్యలు, మహిళల సమస్యలపై అనేక కవితలు రాసి ‘కనుత కొలను’ అనే కవిత సంకలనాన్ని ముద్రించి ఆవిష్కరించారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, శరీర, అవయదానం సంఘం వ్యవస్థాపకురాలు గుడూరి సీతామహాలక్ష్మి ఉద్యమస్ఫూర్తితో కాట్రగడ్డ భారతి స్పందించి శరీర, అవయవదానం ఉద్యమం భుజాన వేసుకుని రచనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె బోధన్ మండలంలోని సంగం జెడ్పీహెచ్ఎస్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు. తెలుగు, ఇంగ్లిష్ బాషల్లో ఎంఏ పూర్తి చేశారు. మంచి వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. మాతృభాష తెలుగుపై అపారమైన మమకారం, ఆసక్తి ఆమెలో కనిపిస్తాయి. ఇటీవల 2019 జనవరి 3న విశాఖపట్నంలో జరిగిన సావిత్రి బాయి పూలే జయంతి వేడుకల్లో తాజాగా శరీర, అవయవదానం ప్రాముఖ్యతపై ఆమె స్వీయరచనలు నాలుగు పాటలు, 13 కవితలతో సీడీ క్యాసెట్ను రూపొందించి ఆవిష్కరించారు. -
రచనల్లో రాణిస్తున్న నమిలికొండ సునీత
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణంలో స్థిరనివాసమున్న డాక్టర్ నమిలికొండ సునీత ఉపాధ్యాయురాలిగా, కవి, రచయితగా రాణిస్తూ ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు పొందారు. వివిధ అంశాలపై 20కి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రాలను సమర్పించారు. 2000 సంవత్సరంలో డాక్టర్ సినారే చేతుల మీదుగా శ్రీకిరణ్ సాహితీ సంస్థ ప్రతిభామూర్తి పురస్కారం, 2018 సంవత్సరానికి గాను కిన్నెర ఆర్ట్స్ థియేటర్ రాష్ట్రస్థాయి ద్వా.నా.శాస్త్రి సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఎన్నో రేడియో ప్రసంగాలు, ప్రభాత కిరణాలు, వరంగల్ జిల్లా పత్రికలు–సాహిత్య కృషి, వ్యాసాలు, కవితలు, గేయాలు, పద్యాలు, లేఖా రచనలు, కథానికలు, ఆయా దినపత్రికలు, మాస పత్రికల్లో వ్యాసాలు రాశారు. అన్ని రంగాల్లోరాణిస్తున్నా.. గగనతలంలో విజయ కేతనం నిలపగలిగిన మహిళా అవనిపై సాధికారత సాధించలేక ఆకాశపుష్పంగా మిగిలిపోతుంది. పెళ్లి పేరుతో సర్దుబాటు, తరాలు మారిన తరుణుల తలరాతలు మారలేదనేది నిష్ఠుర సత్యం. అయినా పోటీ ప్రపంచంలో నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ కుటుంబ శ్రేయస్సే తన ధేయ్యంగా భావిభారత వారసురాలిగా దేశప్రగతిలో ప్రాత ధారిగా, ప్రపంచానికే ఆదర్శమూర్తులుగా నిలుస్తున్నారు. – డాక్టర్ నమిలికొండ సునీత, రచయిత్రి -
కార్పొరేటర్ గారి కవిత్వసభ
‘కవిరత్న’ కత్తుల భద్రయ్య ఎవరి కవిత్వమూ చదవడు. తనది కవిత్వం కాదంటే ఒప్పుకోడు. ‘నన్ను కవి కాదన్నవాడిని కత్తితో పొడుస్తా’ టైపన్నమాట. ఇలాంటి భద్రయ్యకు ఒక ఆదివారం పూట పుస్తకం వేయాలనే ఆలోచన వచ్చింది.తన మిత్రుడు నూకేశ్వర్రావును ఇంటికి పిలిచి, వేడి వేడి చాయ్ పోసి తన మనసులో మాట చెప్పాడు.‘‘భద్రయ్యగారూ...ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. తక్షణం పుస్తకం వేయాల్సిందే’’ అని చాలా గట్టిగా చెప్పాడు నూకేశ్వర్రావు.‘‘అంతేనంటావా!’’ అన్నాడు ఆనందంగా భద్రయ్య.‘‘ముమ్మాటికీ అంతే...’’ అన్నాడు నూకేశ్వర్రావు అంతకంటే ఆనందంగా.వారం తిరిగేలోపే కత్తుల భద్రయ్య కవిత్వం 172 పేజీల పుస్తకంగా వచ్చింది.(గమనిక: ఈ పుస్తకంలో 20 పేజీలు మాత్రమే కవిత్వం....మిగిలిన పేజీలన్నీ ముందుమాటలే) నూకేశ్వర్రావుని ఇంటికి పిలిచి చాయ్ పోసి...‘‘పుస్తకం ఎలా ఉంది?’’ అని అడిగాడు భద్రయ్య.‘‘ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కొన్ని వందల పుస్తకాలు చూసుంటాను. కానీ ఇంత అందమైన పుస్తకాన్ని చూడలేదంటే నమ్మండి. పుస్తకం వేయడం కూడా ఒక కళ...’’ అంటూ సైకిల్ పంపుతో గ్యాస్ కొట్టడం మొదలుపెట్టాడు నూకేశ్వర్రావు. పొగడ్తలతో భద్రయ్య పొట్ట ఉబ్బిపోయింది.∙∙ రెండో రోజు కూడా టీ టైమ్కు వచ్చాడు నూకేశ్వర్రావు.టీ చప్పరిస్తూ...‘‘పుస్తకాన్ని సైలెంట్గా రిలీజ్ చేయవద్దండి. భారీ ఎత్తున ప్లాన్ చేయాలి’’ సలహా ఇచ్చాడు నూకేశ్వర్రావు.‘‘అలాగే చేద్దాం’’ అన్నాడు భద్రయ్య.సిటీలో పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేశారు.‘‘ఏమయ్యా హాలు చూస్తే ఇంతపెద్దగా ఉంది. అంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తారు?’’ అడిగాడు భద్రయ్య.‘‘మామూలుగానైతే పుస్తకావిష్కరణ సభల్లో స్టేజీ మీద కంటే స్టేజీ కిందే తక్కువ జనాలు ఉంటారు’’ అన్నాడు నూకేశ్వర్రావు.‘‘మరి ఎలా?’’ అడిగాడు భద్రయ్య.‘‘నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది...’’ అన్నాడు నూకేశ్వర్రావు.‘‘ఏమిటోయ్ అది?’’ ఆసక్తిగా అడిగాడు భద్రయ్య.‘‘ఏమిలేదండి...పుస్తక ఆవిష్కరణ సభకు ఆహ్వానించే కార్డులో ‘ముఖ్యగమనిక: సభ అనంతరం లక్కీడ్రా ఉంటుంది. మొదటి ముగ్గురు విజేతలకు మిక్సీ, రాకెన్కేక్ జీన్ప్యాంట్, ఎనిమిది వందల రూపాయల విలువైన జియో ఫోన్ ప్రదానం చేయబడుతుంది’ అని ప్రచురిస్తే సరిపోతుంది’’ విలువైన సలహా ఇచ్చాడు నూకేశ్వర్రావు. ‘‘అలాగే’’ అన్నాడు భద్రయ్య.∙∙ ఆరోజు కత్తులవారి పుస్తకావిష్కరణ సభ. ఖైరతాబాద్లోని ‘కర్మ’ ఫంక్షన్హాల్ కిక్కిరిసిపోయిఉంది. హాల్లో ఎంతమంది ఉన్నారో, బయట అంతమంది ఉన్నారు.మేఘాలయ నుంచి భద్రయ్య ఫేస్బుక్ ఫ్రెండ్ జేమ్స్ పాంగ్సాంగ్ కొంగల్ వక్తల్లో ఒకడిగా వచ్చాడు. అతడు మాట్లాడుతూ ఇలా అన్నాడు...‘‘న భూతో న భవిష్యతీ...అంటారు కదా, అలా ఉంది సభ. మా స్టేట్లో ఎంతపెద్ద సాహిత్యసభకైనా పాతికమంది వస్తే మహాగొప్ప. అలాంటిది ఇక్కడ వందలాది మందిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందో చెప్పలేను. ప్రజలకు సాహిత్యం అంటే ఇంత అభిమానం ఉందని ఇప్పుడే తెలిసింది. ప్రజల అభిరుచికి పాదాభివందనం చేస్తున్నాను’’ అని మాట్లాడి కూర్చున్నాడు పాంగ్సాంగ్ కొంగల్.ఆతరువాత...‘‘మా గల్లీ కార్పొరేటర్ మల్లేశంగారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం’’ అని పిలిచాడు సభానిర్వాహకుడు నూకేశ్వర్రావు.అంతే...పెద్దగా నినాదాలు!‘మల్లేశన్న నాయకత్వం వర్థిల్లాలి’‘మల్లెపువ్వు తెలుపు...మల్లేశన్న గెలుపు’కార్పొరెటర్ మల్లేశం పెళ్లికి వెళ్లినా, చావుకు వెళ్లినా....ఎక్కడికి వెళ్లినా చుట్టూ పదిమంది ఉండాల్సిందే. ఆ పదిమంది...ఛాన్స్ దొరికితే చాలు....ఇలా నినాదాలు ఇస్తుంటారు.మల్లేశం స్టేజీ ఎక్కి మైక్ అందుకున్నాడు.‘‘ఎంత కార్పొరెటర్ అయితే మాత్రం వీడికి కవిత్వం గురించి ఏంతెలుసు!’’ తమలో తాము నిశ్శబ్దంగా గొణుక్కున్నారు. తనకు తెలియని సబ్జెక్ట్ గురించి ఈ కార్పొరేటర్ ఏంమాట్లాడతాడో అనే ఆసక్తి సభికుల్లో నిండిపోయింది.ఆయన ఇలా మాట్లాడారు...‘‘ఈ పుస్తకం రాసినాయిన మనకు జిగ్రీదోస్తు. జాన్జబ్బ. వీళ్ల నాయిన, మా నాయిన ఒకటే బడిల సదువుకున్నరు. కార్పొరేషన్ ఎలక్షన్ల టైమ్లో ‘పెదనాయినా...నీ ఓటు నాకే’ అని అడిగితే...‘నువ్వు అడగాల్నార బద్మాష్...నీకు దప్ప ఎవరకు ఏస్తా!’ అన్నడు. ఆ మంచిమనిషి తమ్ముని కొడుకే ఈ కవి.భద్రన్నకు భరోసా ఇస్తున్న...కంపల్సరిగా మన గవర్నమెంట్ వస్తది. అందరికి న్యాయం జరుగుతది.జరగకపోతే ఊరుకునేది లేదు.నడి బజార్లకొస్తం.న్యాయం జరిగే వరకు ఫైట్ చేస్తాం.ఇవ్వాళ అన్న బుక్కు ఎందుకు రాసిండు? అని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను.తన కోసమా!తన పిల్లల కోసమా!కానే కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.మన భద్రన్న ప్రజలు భద్రంగా ఉండాలని ఈ పుస్తకం రాసిండు. అంతేగానీ...తన స్వార్థం కోసం ఈ పుస్తకం రాయలేదని మరోసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను’’స్పీచ్ పూర్తయ్యిందో లేదో మళ్లీ నినాదాలు...‘మల్లెపువ్వు తెలుపు...మల్లేశన్న గెలుపు’బాటమ్ లైన్: విమానాలే కాదు సభలు కూడా హైజాక్ అవుతాయి. యాకుబ్ పాషా -
చల్లారని నెగళ్లు
చెట్టు గురించో, పిట్ట గురించో రాసినంత తేలిక కాదు–చెట్టు వేళ్ల విస్తృతి గురించీ, పిట్ట రెక్కల శక్తి రహస్యం గురించీ రాయడం. అటువంటి తేలిక కాని పనినే తలకెత్తుకున్నారు అరవై ఏళ్ల క్రితం వరవరరావు. డజను వరకూ సంకలనాలు, వెయ్యి పేజీల పైబడి పరుచుకున్న అక్షరాలు.. రగిలించిన చైతన్యం, ఎక్కుపెట్టిన ప్రశ్నలు ఆయనకు సముచిత గౌరవాన్నే ఇచ్చి, కటకటాల వెనక్కు నెట్టాయి. కవిత్వం రాయకుండా ఉండలేక రాసినవి కావు ఈ కవితలు, రాయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, నొప్పిప డుతూ రాసినవి. అభిప్రాయాల్లో నిర్దిష్టత మాత్రమే కాదు, భావ వ్యక్తీకరణలోని కవి తాంశ కూడా పఠితులను విలవిలలాడేలా చేయడం వరవరరావు కవిత్వం ప్రత్యేకత. సిద్ధాంతాలను జీవితంలోకి ఇంకించుకుని సంఘంకోసం తపనతో వ్యక్తీకరించడం కేవలం ఆయనకే సాధ్యం. ఎవరైనా ఆరు దశాబ్దాల అసలు సిసలు చరిత్రను అధ్యయనం చేయాలనుకుంటే వివి కవితలన్నీ మైలురాళ్లుగా నిలుస్తాయి. ఒక్కో కవితా.. రాజ్యం చేసిన ఒక్కొక్క తప్పును వేలెత్తి చూపుతుంది. ప్రతి అక్షరం.. రాజ్యహింసలో ఒరిగిన కన్నీటి బిందువుల ఆవేదనను ప్రతిబింబిస్తుంది. వీవీ అనుభవించినంత జైలు జీవితాన్ని బహుశా ప్రపంచంలో మరే కవీ అనుభవించి ఉండడు. ఎంతో విస్తృతమైన సామాజిక కార్యాచరణలో తలమునకలుగా ఉండి, ఇంత కవిత్వాన్ని సృజించడం మాటలు కాదు. ‘విప్లవ కవిత్వమంటే..’ అంటూ రొడ్డకొట్టుడు విమర్శకులు తొలి నాళ్ల నుంచీ నోళ్లు నెప్పెట్టేలా వాగుతూనే ఉన్నారు. ‘నెత్తురంటిన చేతుల్ని గురించి/నెత్తీనోరూ బాదుకొని మొత్తుకోవాలి తప్ప/కొత్త కాగితం వాసనో/అచ్చు వాసనో వేసే/అస్పష్ట కవిత్వం పక్కన/నీ ఫొటో తప్ప నిర్దిష్టంగా పోల్చుకునేదేమీ ఉండదు’అని ఎప్పటికప్పుడు ఆయన స్పష్టంగా సమాధానమిస్తూనే ఉన్నారు. జీవితానికీ, కార్యాచరణకీ, కవిత్వానికీ మధ్య వ్యత్యాసం లేశమాత్రమైనా లేకపోవడం వల్లే ఆయన అక్షరాలు నిప్పుల కొలిమి మీద కవాతులా కణకణమండుతూంటాయి. కవి నిర్బంధంలో ఉన్నప్పుడు అతని కవిత్వాన్ని గానం చేయాల్సి రావడం ఒక ఆవేదనాపూరిత సందర్భమే కాదు, రాజ్య వైఖరికి నిదర్శనం. ఓసారి ఆ కవిత్వాన్ని పునశ్చరణ చేసుకోవడం, ఆ కవిని ఆవాహన చేసుకోవడం అక్షరాల్ని ప్రేమించే ప్రతి ఒక్కరి విధి. నెగళ్లు చల్లారకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత. – దేశరాజు (నేడు పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మహబూబ్నగర్ రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాలులో ఉదయం పది గంటల నుంచి ‘విప్లవ కవి వరవరరావు కవిత్వంతో ఒక రోజు’ సాహిత్య సభ సందర్భంగా..) -
తోట రాసుకున్న కమ్మని కవితలే ఈ పూలట!
కళను గుండెకు హత్తుకున్న సినిమాలోని దృశ్యాలు ఇవి.కవిత్వం పైరగాలితో కలిసి గజ్జెకట్టిన ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం.. పచ్చని పొలాల దగ్గర కూర్చొని రాసుకుంటున్నాడు కాశీ.అక్కడికి కీర్తన వచ్చింది.‘‘నేను కొన్ని స్వరాలు రాశాను. నువ్వు నాట్యం చేయాలి’’ అన్నాడు కీర్తనను చూస్తూ.‘‘ఏ రాగం?’’ అని అడిగింది ఆమెచిలిపిగా.‘‘అనురాగం’’ అన్నాడు అంతకంటే చిలిపిగా.‘‘తెలిసో తెలియకో ఏదో రాసుకుంటే రాగం అడుగుతావా?’’ అంటూనే స్వరాలవీణ మీటాడు కాశీ.పచ్చని పంటపొలాలు ప్రేక్షకులయ్యాయి. గాలికి తలలు ఊపుతూ బ్రహ్మాండం అంటున్నాయి.‘‘వండర్ఫుల్. బ్యూటిఫుల్. ఈ ఏకాంత ప్రదేశంలో మీ నాట్యం చాలా బాగుంది. గోదావరి ప్రవాహంలాస్పాంటేనియస్ ఉంది’’ అన్నాడు అతడు.అతడు కాశీ కాదు...శ్రావణ్!శ్రావణ్ గొప్ప చిత్రకారుడు.కళ ఉన్న వాళ్లను నెత్తిన మోసే మంచివాడు.‘‘ఈవిడ కీర్తన. పరమేశ్వరశాస్త్రిగారి అమ్మాయి’’ అని ఒకవైపు కీర్తనను పరిచయం చేస్తూనే ‘‘నా పేరు కాశీ’’ అని పరిచయం చేసుకున్నాడు.కొన్ని మాటలైన తరువాత ‘‘కమాన్ లెట్స్ గో. రండి’’ అని తన ఇంటికి ఆ ఇద్దరిని తీసుకెళ్లాడు శ్రావణ్.‘‘దిసీజ్ మై వరల్డ్. నేను అమెరికాలో ఉండగా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద వ్యాసాలు రాశాను’’ అని చెప్పుకొని పోతున్నాడు శ్రావణ్. గోడకు ఉన్న శ్రావణ్ చిత్రాలను చూస్తూ, ఆ తన్మయంలో...‘‘రంగుల కవితల్లాగా ఉన్నాయి’’ అన్నాడు కాశీ.‘‘మీకు పోయెట్రీ అంటే ఇష్టమా?’’ కాశీ మాటల ధోరణిని గమనిస్తూ అడిగాడు శ్రావణ్.‘‘ఇష్టమా? ప్రాణం! ఇవి చూడండి’’ అంటూ కాశీ చేతులోని కాగితాలను శ్రావణ్కు ఇచ్చింది కీర్తన.‘వానవేణి తోటినీలవీణ మీటినీలినింగి పాటే ఈ చేలట!కాళిదాసులాంటిఈ తోట రాసుకున్నకమ్మని కవితలే ఈ పూలట!’‘‘ఫెంటాస్టిక్...కవి జీవితాన్ని రెండు ముక్కల్లో చెప్పారు. యస్, కళాకారుడికి కావల్సింది ఇన్స్పిరేషన్ ప్లస్ అభినందన’’ అని పులకరించిపోయాడు శ్రావణ్.‘‘కాశీ ప్రతి పలుకులో కవిత్వం ఉంటుంది.కానీ అది తానొక్కడికే పరిమితం’’ అన్నది కీర్తన.‘‘ఇట్స్ ఏ క్రైమ్. ప్రపంచం కవిని గుర్తించకపోవడం ఎంత నేరమో... కవి ప్రపంచాన్ని పట్టించుకోకపోవడం అంతే నేరం’’ హితబోధలాంటిది చేశాడు శ్రావణ్.‘‘ఏదో ఆవేశం వచ్చినప్పుడు గుండె గొంతుకలో పుట్టిన మాటే పాటైపోతుంది. దానికి ప్రేరణ ఇస్తుంది కీర్తన’’ అని తనను తాను తగ్గించుకున్నాడు కాశీ.‘‘ఈజ్ ఇట్. డిఫెనిట్గా అలాంటి ఎంకరేజ్మెంట్ ఉండాలి. నాకు అలాంటి తోడు లేకపోవడం వల్లే ఇన్నాళ్లు నా ఘోషను కన్నీటిరంగుల్లో కలిపి కాన్వాస్ ఎక్కించాను’’ మనసులో మాట చెప్పాడు శ్రావణ్. సముద్రపు ఒడ్డున ఆశ్రమంలాంటి ఇల్లు అది.‘‘అమ్మా’’ అంటూ ఇంట్లోకి వచ్చాడు కాశీ.అమ్మ పలక లేదు. అలిగింది!‘‘ఇప్పుడు సముద్రం కూడా నీలాగే గంభీరంగా ఉంటే నవ్వు గుర్తొచ్చి వచ్చేశాను.కొంతసేపటికి నీలాగే తాడంత పైకి లేచి వెంటనే తగ్గిపోయింది. గంగమ్మ తల్లికి కోపం వస్తే దండం పెడితే తగ్గిపోతుంది. మరి మా అమ్మకో!’’ అని అమ్మను ఐసు చేసే ప్రయత్నం చేశాడు కాశీ.‘‘అన్నం పెడతావా! నువ్వు తిన్నావా?’’ అని అడిగాడు.‘‘ఆ...కడుపు నిండిపోయింది’’ అంటూ అలకను కంటిన్యూ చేసింది ఆ తల్లి.‘‘నువ్వు తినలేదని నాకు తెలుసులే. నేనొక్కడినే తినేస్తా. అయినా నీ కోపం ఎంతసేపు’’ అంటూ అటు వెళ్లి తినడం మొదలుపెట్టాడు.రాగం తీస్తున్నప్పుడు గొంతుకేదో అడ్డం పడి దగ్గాడు.అంతే...ఆ తల్లి కొడుకు దగ్గరికి పరుగెత్తుకు వచ్చింది.‘‘గొంతుకు అడ్డం పడితే ప్రమాదం రా. ఇదిగో నీళ్లు తాగు’’ అని గ్లాసు చేతికి ఇచ్చింది.‘‘తల్లివి నువ్వుండగా ఆ యముడు కూడా అడ్డం పడలేడు’’ అని నవ్వాడు కాశీ. యముడు అమ్మను తీసుకెళ్లాడు.‘‘అమ్మనే కాదు నా జీవితాన్నే తీసుకెళ్లాడు’’ అని దుఃఖంలో మునిగిపోయాడు కాశీ.పక్కన కూర్చొని ధైర్యం చెబుతున్నాడు శ్రావణ్...‘‘చూడు కాశీ... జీవితం అశాశ్వతం.అంతా ఒకప్పుడు పోవాల్సిందే అనే చెత్త ఫిలాసఫీని నేను మాట్లాడను. ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. నువ్వు ఒక కళాకారుడివి. నీ బాధనంతా ఆర్ట్లో ట్రాన్స్ఫార్మ్ చేసి ప్రజలకు వినిపించు.వాళ్లనిస్పందింపజెయ్. నీ రాతలు తమకు అర్థం కాకపోయినా ఆ రాతలన్నీ గొప్పవని, నవ్వు గొప్పవాడివవుతావని నీ తల్లి కలలు కన్నది. ఆ కలను నిజం చెయ్’’కాశీలో ఎలాంటి చలనం లేదు.మౌనం, నిర్లిప్తత, కొండంత నిరాశ.... అతడి పక్కన పీఠ వేసుకొని కూర్చున్నాయి.దూరంగా పిల్లలు సముద్రమంత సంతోషాన్ని కళ్లలో నింపుకొని ఇసుకలో ఆడుకుంటున్నారు.‘‘వాళ్లను చూస్తే నాకు ఆనందంగా ఉంది. ఎప్పుడూ సముద్రంలా సంతోషంగా ఉండాలి’’ కాశీలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు శ్రావణ్.అప్పుడు కాశీ ఇలా అన్నాడు:‘‘సముద్రం ఎప్పుడూ ఉప్పొంగుతుంది. కానీ అది సంతోషమో, విషాదమో తెలుసుకోవడం కష్టం’’ -
నా కవిత్వం ఒక్క రూపాయికి అమ్మేశారా!!
‘‘బాబాయ్... బాబాయ్’’ అని అరుచుకుంటూ అతడి వెనకాల పరుగెత్తుకుంటూ వస్తున్నాడు అబ్బాయ్. ఆయన కళ్లు పీక్కుపోయి ఉన్నాయి. దుస్తులు దుమ్ముకొట్టుకుపోయాయి. ఎన్ని రోజులవుతుందో తిండి తిని! ‘‘నాయనా వేణూ..’’ అంటూ పరుగెత్తుకు వచ్చింది అమ్మ. ఆమె కళ్లలో శోకనది కట్టలు తెంచుకుంది... ‘‘బాబూ వేణూ... ఏమిట్రా ఇది! ఇన్నాళ్లు ఎక్కడికెళ్లావు? ఏమైపోయావు? ఇల్లు వదిలి పెట్టి ఎన్నాళ్లు ఇలా తిరుగుతావు?’’ ‘‘ఇల్లు వదిలి పెట్టినందుకు కాదమ్మా....తల్లిని వదిలి పెట్టినందుకు బాధ’’ కన్నీళ్లను దిగమింగుతూ అన్నాడు వేణు. ‘‘ఆ బాధ నీకేమాత్రం ఉన్నా ఒక్కసారి వచ్చి కనబడక పోతావా’’ కొడుకు కళ్లలోకి చూస్తూ అడిగింది తల్లి. ‘‘ఏ ముఖం పెట్టుకొని కనబడమంటావు అమ్మా! చేయడానికి ఉద్యోగం లేదు. చేతిలో చిల్లి గవ్వలేదు’’ శూన్యంలోకి చూస్తూ అన్నాడు వేణు. ‘‘తల్లికి కావల్సింది నీ సంపాదన కాదురా. నీ క్షేమం. సరేలే... పద ఇంటికి పోదాం’’ అని కొడుకు చేయి పట్టుకుంది తల్లి. ‘‘ఇంటికా!’’ ఒక్క క్షణం వెనకడుగు వేశాడు వేణు. ‘‘అన్నం తిని ఎన్నాళ్లయిందో’’ కొడుకు కడుపు వైపు చూస్తూ అన్నది అమ్మ. అందుకే అంటారు కదా... అమ్మ జేబు చూడదు... కాలే కడుపు చూస్తుందని! తన ఆకలిని అబద్ధంతో కప్పిపెట్టాలనుకొని... ‘‘నేను బాగానే తింటున్నానమ్మా’’ అన్నాడు\వేణు. ‘‘ఆ ముఖం చూస్తూనే తెలుస్తుందిరా... పదపదా’’ అని బలవంతంగా కొడుకును ఇంటికి తీసుకెళ్లింది అమ్మ. ఇంట్లో... ‘‘బాబూ! నీకు అర్షలు అంటే ఇష్టంగా. అన్నం ఉడికేలోపు ఇవి తిను’’అమ్మ చేతుల్లో నుంచి అర్షలు తీసుకొని తినబొయ్యాడో లేదో... లోపలి నుంచి అన్నల వెటకారాలు మొదలయ్యాయి... ‘‘తమ్ముడూ వేణు! అర్షలు తింటున్నావా! తిను. బాగా తిను. అర్షలతో పాటు అమ్మ ప్రేమ కూడా బాగా తినమ్మా. ఒరేయ్ ధనూ... పెట్టే వాళ్లకు లేకపోయినా తినేవాళ్లకయినా ఉండాలి బుద్ది’’ ఈమాటలు విని ఆ అమ్మ తట్టుకోలేకపోయింది. ‘‘మీరు మనుషులా రాక్షసులా? విరోధి అయినా ఆకలి అంటూ వస్తే ఇంత అన్నం పెడతామే. మీ తోబుట్టినవాడు, మీ కంటే చిన్నవాడు ఇన్నాళ్లకు ఇంటికొస్తే రెండు అర్ష ముక్కలు పెట్టానని మీ ఇష్టం వచ్చినట్లు వాగుతారా’’ అని ఆ కొడుకుపై మండి పడింది.‘‘తేరగా తినడానికి ఇది ధర్మసత్రం కాదు’’ అని సన్నాయి నొక్కులు నొక్కింది కోడలు. ‘‘అయినా వాడికి కాళ్లు లేవా చేతులు లేవా? కష్టపడి సంపాదించి కడుపు నిండా తినవచ్చు కదా. ఎవరొద్దాన్నారు?’’ అని తమ్ముడిపై విరుచుకుపడ్డాడు అన్న.‘‘అసలు వాడికి తిండి ఎందుకన్నయ్యా.కవిత్వం వెలగబెడుతున్నాడు కదా. దాన్నే తిని బ్రతకమను’’ అని వెటకారం చేశాడు చిన్న అన్నయ్య.మరో వైపు వేణు ఏదో వెదుకుతున్నాడు.‘‘వదినా! ఇక్కడ నాది ఒక ఫైలు ఉండాలి’’ అని వదినను అడిగాడు. మళ్లీ అందుకున్నాడు అన్నయ్య...‘‘ఆడవాళ్లను అడుగుతావేరా, నన్ను అడుగు చెబుతాను. అక్కడ ఉన్న ఫైలు, చెత్తకాగితాలు ఒక్క రూపాయికి అమ్మేశాను’’‘‘ఏమిటీ నా గేయాలను అమ్మేశారా! నా కవిత్వం ఒక్క రూపాయికి అమ్మేశారా!!’’ బాధను అణుచుకుంటూ అడిగాడు వేణు.‘‘అవును. ఆ కిరాణం కొట్టు సుబ్బయ్య మంచోడు కనుక ఆ రూపాయి అయినా ఇచ్చాడు’’ వెటకారపు కారాన్ని కళ్లలో చల్లాడు చిన్న అన్నయ్య.‘‘వాటి విలువ మీలాంటి మూర్ఖులకేం తెలుస్తుంది!’’ ఆవేశంగా అన్నాడు వేణు.అంతే అన్నయ్యల కోపం ఆకాశాన్ని అంటింది.‘‘ఏమన్నావ్ మేము మూర్ఖులమా! ఏరా ఆ కాగితాలతో పాటు నిన్ను కూడా ఆ చెత్త కుప్పలో తోస్తే కాని నీ రోగం కుదరదు. పదా పదా’’ అని మెడపట్టి తమ్ముడిని ఇంటి నుంచి గెంటేశారు. ప్రముఖ పత్రికాధిపతి ప్రసాద్ తన ఇంట్లో ఆరోజు కవి సమ్మేళనం ఏర్పాటు చేశాడు.వచ్చిన అతిథులను ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాడు ప్రసాద్.‘‘నమస్కారం ప్రసాద్గారు. ఈరోజు కవిసమ్మేళనం ఏర్పాటు చేశారట కదా అందుకే స్పెషల్గా వచ్చాను. అన్నట్లు ఈ వార్త మీ దాకా రాలేదా? అరే, ఊరంతా చెప్పుకుంటున్నారే. ఈమధ్య నేను కవిత్వంరాస్తున్నాను’’ అని గర్వంగా అన్నాడు సూటుబూటులో వచ్చినయాక్టర్ రావు.‘దేవుడా! నువ్వు కూడా కవిత్వం రాస్తున్నావా!’ అన్నాయి ఆయన కళ్లు.నోరు మాత్రం...‘‘ఓహో అలాగా. గుడ్’’ అన్నది.అక్కడ కూర్చున్న ఇద్దరు సాహితీ దిగ్గజాలకు ఈ రావును పరిచయం చేస్తూ...‘‘వీరు యాక్టర్రావు గారు, నటించడం మానేసి కవిత్వం మొదలుపెట్టారు. వీరు వేటూరిగారు, వారు ఆరుద్రగారు’’ అన్నాడు.‘‘ఏమిటి మీకా పిచ్చిపట్టుకుందా?’’ గెడ్డంతో నవ్వుతూ అడిగారుఆరుద్ర.‘‘మీ కవులు రాసిన నాటకాలు వేసి వేసి చివరికి ఆ జబ్బు నాకంటుకుంది’’ అన్నాడు యాక్టర్ రావు.‘‘అంటుకుందా! జబ్బుకు సరిౖయెన ప్రాస సబ్బు. సబ్బు కొనుక్కోండి’’ అని యాక్టర్రావుకిసలహా ఇచ్చారు ఆరుద్ర.రావు పెద్దగా నవ్వి...‘‘అంత్యప్రాస! అందుకే మిమ్మల్ని ఆరుద్ర అన్నారు’’‘‘ఆరుద్ర గారు మీరొక కవిత చెప్పాలి’’ అడిగారు అభిమానులు.అప్పుడు ఆయన ఇలా చెప్పారు.‘కవిత కోసమే నేను పుట్టాను.క్రాంతి కోసమే కలం పట్టాను.ఎండమావులు చెరిపిపండువెన్నెల నిలిపిగుండెవాకిలి తలుపు తట్టాను కవిత కోసమే నేను పుట్టాను’ -
శభాష్ రాజేశ్వరి
సాక్షి, సరిసిల్ల: చేతులు పని చేయకున్నా ఆమె చెరగని ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కాలుతోనే కవిత్వాన్నిరాస్తూ.. శభాష్ అనిపించుకుంటుంది. సిరిసిల్ల సాయినగర్కు చెందిన బూర రాజేశ్వరి దివ్యాంగురాలు. ఎన్నికల నేపథ్యంలో రాజేశ్వరి కాలుతో అక్షరాలను లిఖించి.. మంగళవారం ‘సాక్షి’కి పంపించారు. నోటు మాటున ఓటేయకు.. ప్రజాస్వామ్యాన్ని కాటేయకు.. విక్రమార్కునిలా ఓటు వెయ్యి.. అక్రమార్కుల తాట తియ్యి.. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు. ఏ పాటి వాడో చూడు.. ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు.. ఇప్పటి దాక ఏం చేశాడో చూడు.. పెట్టుకొనే టోపి కాదు.. పెట్టిన టోపి చూడు.. -
పోయెమ్ రాశాక ప్రశాంతంగా అనిపిస్తుంది
‘విత్ హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ మార్బుల్స్/ హెడ్ ఫిల్డ్ విత్ డ్రీమ్స్’ అనే భావ కవితాత్మక వాక్యాలున్న ‘చైల్డ్హుడ్ డ్రీమ్స్’ అనే కవితతో ప్రారంభమయ్యే ‘వైల్డ్ వింగ్స్’.. ఓ అచ్చ తెలుగు అమ్మాయి రచించిన ఆంగ్ల పద్య కావ్యం! ఇటీవల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన స్రష్ట వాణి కొల్లి ‘సాక్షి’తో తన మనోభావాలు పంచుకున్నారు. ∙మొదటి కవిత ఎప్పుడు రాశారు? స్కూల్లో చదువుతున్నప్పుడు ఇచ్చిన అసైన్మెంట్కి కొత్తగా ఉంటుందని హిందీలో మొదట పద్యం రాశాను. అప్పుడు నా వయసు పదమూడు సంవత్సరాలు. ఆ తరవాత మరో అసైన్మెంట్లో వ్యవసాయ సంబంధితంగా ‘ఫార్మర్’ అనే పద్యం రాసి, మా ఇంగ్లిషు టీచర్కి చూపించాను. ఆవిడ చిన్న చిన్న మార్పులు చేయమని సూచన ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతోనే çకవిత్వం రాయడం ప్రారంభించాను. ∙చదువుకు రచన అడ్డు కాలేదా? ఇంటర్మీడియెట్ చదువుతున్న రెండు సంవత్సరాలు ఒక్క పద్యం కూడా రాయలేకపోయాను. ఆ రెండేళ్లు ఏదో మిస్సింగ్ అనిపించింది. ఇంటర్లో సెంట్ పర్సెంట్తో పరీక్షలు ప్యాసయ్యాక మళ్లీ కవిత్వం రాయడం ప్రారంభించాను. ఇన్నాళ్ల విరామాన్ని మరచిపోయేలా మూడు నెలల కాలంలో దాదాపు 50 దాకా కవితలు రచించాను. అన్ని కవితలకూ మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం బీబీఏ ఎల్ఎల్బీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ∙కవిత్వం రాయడానికి మీకు ప్రేరణ ఎవరు? నాకు ఖలీల్ జిబ్రాన్ రచనలంటే చాలా ఇష్టం. ఆయన నా అభిమాన రచయిత. అప్పుడప్పుడు టాగూర్ని చదువుతాను. షేక్స్పియర్ రచించిన హామ్లెట్ చదివాను. ‘మ్యాక్బత్’ నాటకంలో మ్యాక్బత్ వేషం వేయడం కోసం ఆ పాత్ర గురించి మొత్తం ^è దివాను. అర్థం కాని చోట వేరే వాళ్లను అడిగి చెప్పించుకున్నాను. ∙మీ కవిత్వానికి ప్రేరణ ఏమిటి? ఒక్కో పోయమ్ వెనకాల ఒక్కో చరిత్ర ఉంది. చిన్నప్పుడు ఎవరినైనా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగితే, నేను డాక్టరు, నేను ఇంజనీరు ఇలా చెబుతారు. నేను రోజుకోరకం చెప్పేదాన్ని. బాల్యం అంతా కలలు కంటూనే ఉంటాం. అలా రాసినదే ‘చైల్డ్ హుడ్ డ్రీమ్స్’. సీఎస్ లూయిస్ రచించిన నార్నియా అనే సిరీస్ చదివి బయటకు రాలేకపోయాను. దాని నుంచి ‘ఒన్ వింటర్ నైట్’ రాశాను. కాలేజీ నుంచి ఇంటికి వచ్చే దారిలో రకరకాల రంగురంగుల పూలు చూసేదాన్ని. వాటి నుంచి వచ్చినదే ‘ఫ్లవర్’. నా గదిలో కూర్చుని కిటికీలో నుంచి గదిలోకి వెలుగు రావడం చూసి, ‘లైట్’ పద్యం రాశాను. ప్రతి పోయెమ్ పక్కన వేసిన బొమ్మ నా ఆలోచనకు అనుగుణంగా చేసినదే. ‘బ్రేవ్’ పోయెమ్ నాకు నేను చెప్పుకున్నట్లుగా రాసుకున్నాను. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలనుకుంటాను. ∙ఒక్కో కవిత రాయడానికి ఎంత సమయం పడుతుంది? మనసులోకి ఆలోచన రాగానే భావాలు రాసుకుంటాను. తరవాత దానిని ఫ్రేమ్ చేసుకుంటాను. మొత్తం పూర్తయ్యాక ముందుగా అమ్మకి వినిపిస్తాను. ఆవిడకు బాగున్నా బాగుండకపోయినా బాగానే ఉంది అంటుంది. నా ఐడియాని ప్రొజెక్ట్ చేసేది నాన్న. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను. వీకెండ్స్లో చిరాకుగా అనిపిస్తే, పోయెమ్ రాశాక ప్రశాంతంగా అనిపిస్తుంది. కవిత్వం రాయడం నా జీవితంలో భాగంగా మారిపోయింది. ∙మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వర్తమాన రాజకీయాల మీద వ్యాసాలు రాస్తున్నాను. లాగే కరెంట్ టాపిక్స్ మీద కూడా రాస్తున్నాను. ‘ట్రిపుల్ తలాక్’ గురించి రాసిన ఆర్టికల్ను ఫేస్బుక్లో ఏడువేల మంది షేర్ చేశారు. నేషనల్ సెమినార్లో ఆర్టికల్స్ ప్రజెంట్ చేశాను. నా తరవాతి పుస్తకం ఈ ఆర్టికల్స్ మీదే. ∙మీ కుటుంబం గురించి... నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. నాన్న అరవింద్ కొల్లి జర్నలిస్టు, అమ్మ ఆశ హౌస్ వైఫ్. ప్రస్తుతం బెంగళూరు రేవా యూనివర్సిటీలో చదువుతున్నాను. వాస్తవానికి ఇంగ్లిషు లిటరేచర్ చేద్దామనుకున్నాను. కాని లా డిగ్రీలో నాకు టైమ్ స్పేస్ కనిపించింది. మా యూనివర్సిటీ వారు నా పుస్తకాన్ని స్టూడెంట్స్ సమక్షంలో రిలీజ్æ చేస్తానన్నారు. భవిష్యత్తులో షార్ట్ స్టోరీస్, నవలలు కూడా రాయాలనుకుంటున్నాను. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
వాజ్పేయి కవితలు
-
ఒక శతాబ్దాన్ని పూడ్చేశాం
నా ఆచార్యా నువ్వులేని సమయంలో నిన్ను తలచుకుంటున్నాను నేను చందమామని సాహితీ వెలుగునిచ్చిన సూరీడివి నీవే! నువ్వు విచిత్రాల చిత్రం చిత్రాల విచిత్రం నీ అడుగుజాడలను కలిపితే ఒక బాటే ఏర్పడుతుంది నీ మాటలను కలిపితేరము ఒక భాషే ఏర్పడుతుంది నీ విజయాలను కలిపితే ఒక చరిత్ర ఏర్పడుతుంది నీ అపజయాలను కలిపితే కొన్ని వేదాలు ఏర్పడతాయి ఎంత ఘనత – నీది ఎంత ఘనత నీ శ్రమలజాబితా పొడవు చూసి కొండలు బెణుకుతాయి నీతో పరుగిడి అలసి గాలి మూర్చబోయింది. వేసవి ఋతువుల్లో నువ్వు వాడవాడలా ఎలా ఎండని మోసావు? నేలకి నీడేది చెట్టు ఎండ మోయకుంటే? ఈ జాతికి నీడేది నువ్వు ఎండ మోయకుంటే? రాజకీయాన్ని తీసేసినా నువ్వు సాహిత్యమై మిగులుతావు సాహిత్యాన్ని తీసేసినా అధ్యక్షుడవై నిలుస్తావు నిన్ను నేటి తరం స్తుతిస్తుంది ఏడు తరాలు నెమరువేస్తాయి నిన్ను సమకాలీనం కొన్నివేళల మరిచిపోవచ్చు భవిష్యత్తు ఎన్నడు మరవబోదు తమిళులు కొందరు మరిచిపోవచ్చు తమిళం ఎన్నడు మరవబోదు కొండలను గులకరాళ్ళుగా గులకరాళ్ళను ఇసుక రేణువులుగా మార్చగల కాలమనే చెదలపుట్టకూడా నీ కీర్తిని తాకబోదు నిన్ను ద్రావిడ ఉద్యమ అశ్వమన్నారు ఒక సవరణ – తనమీద ఎవర్నీ అధిరోహించనీయని అసాధ్యమైన అశ్వం నీవు పక్షుల విహారం అడవి అభివృద్ధి అంటారు నీ విహారం దేశాభివృద్ధి నిన్న సంధ్యవేళ ఒక సాగరతీరాన మా శతాబ్దాన్ని పాతిపెట్టాము వేచియుంటాము అది ఒక యుగమై మొలకెత్తేందుకు. ‘కవిరారాజు’ వైరముత్తు తెలుగు అనువాదం: అవినేని భాస్కర్ -
గుల్జార్ ఆకుపచ్చ కవితలు
ముసాఫిర్ హూన్ యారో నా ఘర్ హయ్ నా టిఖానా నాలుగు దశాబ్దాల క్రితం నాటి ‘పరిచయ్’ సినిమాలోని పాటతో గుల్జార్తో కవిగా దర్శకుడిగా తొలి కరచాలనం. నేను ఇంటర్ చదువుతున్న రోజులవి. బినాకా గీత్ మాల వింటూ గడుపుతున్న రోజులు. చదువులూ పరీక్షలూ అన్నీ వెన్నంటే ఉన్నప్పటికీ ఎక్కడో ఒంటరితనం లోపల వెంటాడేది. ఆ ఒంటరితనమే మొదట హిందీ పాటల వైపునకు లాగింది. అప్పుడే వచ్చిన ‘ఆనంద్’ సినిమా నా జీవితంపై గొప్ప ప్రభావం చూపించింది. ‘బాబూమొషై జిందగీ బడీ హోని చాహీయే, లంబీ నహీ’ ‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ’ ‘మౌత్ తో ఏక్ పల్ హై’ లాంటి గుల్జార్ మాటలు ఇప్పటికీ హాంట్ చేస్తూనే వుంటాయి. (జీవితం ఉన్నతమైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు; బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను; మరణం ఒక క్షణమే). అట్లా గుల్జార్తో మొదలయిన ప్రయాణం కోషిశ్, ఆంధీ, ఖుష్బూ, ఇజాజత్... ఇలా అనేక సినిమాలతో సాగుతూ వచ్చింది. అది సినిమాలతో ఆగలేదు, ఆయన కవిత్వం వైపు మరలింది. ‘కొంచెం నవ్వించి మరికొంచెం ఏడిపించి ఈ ‘క్షణం’ కూడా వెళ్ళిపోతుంది’ ‘తూఫాను వెళ్ళిపోవడం కోసం ఎదురు చూడ్డం కాదు జీవితమంటే వర్షంలో నృత్యం చేయడాన్ని నేర్చుకోవడమే జీవితం’ ఇట్లా ఇన్నో పంక్తులు ఎవరినయినా పట్టేస్తాయి. ఆయన గజల్స్, కవితల అనువాదాలు ఫాలో అవుతూ వచ్చాను. అట్లా ‘గ్రీన్ పొయెమ్స్’తో థ్రిల్ అయ్యాను. గుల్జార్ కవిత్వంలో సహజంగా వున్న సున్నితత్వమూ, సరళత్వమూ, సూటితనమూ ఈ కవితల్లో నిండుగా వున్నాయి. ప్రకృతి, నదులు, అడవులు, పర్వతాలు, మంచు, వర్షం, మబ్బులు, ఆకాశం, భూమి, అంతరిక్షం అన్నీ కవితా వస్తువులై నిలిచాయి. అందులోని కవితల్ని మన వాళ్ళతో పంచుకోవాలనిపించింది. మెల్లిగా అనువాదం చేయడం ఆరంభించాను. అనువాదం చేస్తున్నాను, పుస్తకం వేయడానికి అనుమతిస్తారా అని గుల్జా్జర్కి మెయిల్ రాశాను. వెంటనే జవాబు వచ్చింది, మీ పరిచయం మీ రచనల వివరాలు పంపండి అని. నా పుస్తకాలు కొన్ని పంపించాను. మూడో రోజుకు మళ్ళీ జవాబు వచ్చింది. అనువాదం చేయండి కాని నాకు ఒక కాపీ పంపండి అని. దాంతో మరింత ఉత్సాహంగా అనువాదం పూర్తయింది. గ్రీన్ పొయెమ్స్ మూలం హిందీ. ఆ కవితల్ని పవన్ వర్మ ఇంగ్లిష్లోకి చేశారు. పవన్ వర్మ మౌలికంగా కవి. ఐ.ఎఫ్.ఎస్. అధికారి అయిన ఈయన రాజ్యసభ సభ్యుడు కూడా. గుల్జార్ మూలం హిందీ నుంచి తెలుగులోకి తేవడంలో ఈ ఇంగ్లిష్ అనువాదం ఎంతో తోడ్పడింది. -వారాల ఆనంద్ మిమ్మల్ని బాగా కదిలించి, మీలో ప్రతిధ్వనించే పుస్తకం గురించి మాతో పంచుకోండి. గుల్జార్ -
జన జ్వాలాదీప్తి
మన తరిమెల నాగిరెడ్డి – మానవతా మూర్తి మనందరి స్ఫూర్తి జగమెరిగిన నాగిరెడ్డి – జగజగీయమూర్తి/ కీర్తి జన జ్వాలాదీప్తి అరుణారుణ వజ్రఖచిత ఖడ్గధితర నాగిరెడ్డి అణువణువున కరిగె దయా కరుణధార నాగిరెడ్డి క్షణం – క్షణం అనుక్షణం – రణరంగంలాగా కదిలినాడు దినం – దినం జీవితాన్ని – పణం పెట్టి నిలిచినాడు జననం – మరణం – మధ్యన జనం కొరకు బతికినాడు ‘‘మన‘‘ తెల్లవాడు – నల్లవాడు ఇద్దరి పరిపాలనలో రాజద్రోహి ముద్రపడిన మాతృభూమి ప్రేమికుడు జీవితమే భారతీయ కమ్యూనిస్టు చరిత్రగా విప్లవజెండా పట్టిన అనంతమహాత్ముడతడు కటకటాల జైలులోన మల్లెలు పూయించినాడు స్నేహం – స్వేచ్ఛా– విప్లవ కపోతమై బతికినాడు బావమరిది – ముఖ్యమంత్రి పీఠంపై ఉంటేనేం కడదాకా తనది ప్రజా హృదయ పీఠమన్నాడు వర్గ శత్రువుల వైపున – కన్న తండ్రి ఉన్నా సరే ‘ఖబడ్దార్’ అని చెప్పిన కమ్యూనిస్టు నిబద్ధుడు బాతాఖాని షాపని – అసెంబ్లీని వదిలిపెట్టి ఆఖరి ఊపిరిదాకా ఆగని రణ యాత్రికుడు స్పష్టత – సమకాలీనత– నిజాయితీ – దూరదృష్టి సమరూపుడే నాయకుడని ఆచరణలో చూపినాడు ‘‘మన‘‘ విదేశీ అప్పులను తెచ్చి – స్వదేశీ పత్రికలలోన సదా పోజుకొట్టే ముఖ్యమంత్రి – ప్రధానమంత్రులను ఎన్నాళ్లీ – భారతాన్ని తాకట్టులో పెడతారని ఏనాడో ప్రశ్నించిన ఎరుపెక్కిన కాలజ్ఞాని మార్క్స్ చెప్పే సమసమాజ భావనకై పోరాడే కమ్యూనిస్టులెప్పుడు జాతి వ్యతిరేకులు కాదంటూ విదేశీయ కంపెనీల – ప్రపంచబ్యాంకు దళారుల ఆజ్ఞలకు తలవంచిన – నాటి – నేటి పాలకులే భారత జాతీయతకు విఘాతకులు అన్నాడు మిత – అతి – అవకాశవాదాలకు ఎదురునిల్చి పూలను – రాలను ప్రేమగా అందుకున్న స్థితప్రజ్ఞుడు ప్రజానేత ‘‘మన‘‘ చీలినారు కమ్యూనిస్టు వీరులని స్వార్థపరులు తమ చంకలు గుద్దుకొని గద్దెలపై వుండనిండి ఏదో ఒక రోజు – మన కమ్యూనిస్టు పార్టీలు ఏకమై ఎర్రజెండ ఎగరేస్తాయన్నాడు మార్క్సిజాన్ని మన దేశపు ప్రజల సంస్కృతులతోని కలగలిసిన నాడె ప్రజలు కలిసొస్తారన్నాడు నిజం – కమ్యూనిజం – భువిని పాలించుట తథ్యమన్నాడు కమ్యూనిస్టు విశ్వరూప కదన గీత పలికినాడు ‘‘మన‘‘ (నేడు తరిమెల నాగిరెడ్డి 42వ వర్ధంతి సందర్భంగా) – సుద్దాల అశోక్తేజ ప్రముఖ కవి, గీత రచయిత -
ప్రేమ కోసం వెతికా.. చివరికి...
సినీ నటి రేణూ దేశాయ్ ఆ మధ్య రెండో వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో.. ఆమె అదే స్థాయిలో సమాధానమిచ్చారు. ‘ జీవిత భాగస్వామి కోసం వెతికితే తప్పేంటి. పిల్లల్ని చూసుకోవడానికి నాకూ ఓ తోడు అవసరం’ అంటూ స్పష్టం చేశారు. అయితే ఆ విషయంలో ఆమె ఓ ఫోటోతో హింట్ ఇచ్చారన్న చర్చ మొదలైంది. ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో ఆమె షేర్ చేశారు. పైగా దానికింద ఆమె ఓ కవిత కూడా రాశారు... ‘నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా. ఆ ప్రయాణంలో ప్రేమ అనేది ఓ అనుభూతి అన్న సంగతినే మర్చిపోయా. ‘నీలో నా ప్రేమ దొరికింది’ అంటూ ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వర్ణించారు. ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అంటూ ఆమె కవితలో తన భావాల్ని రాశారు. దీంతో ఆమెకు కావాల్సిన తోడు దొరికిందా? ఆమె కాబోయే భర్తే అతనేనా? అన్న చర్చ మొదలైంది. మరోవైపు చాలా మంది ఈ కోణంలోనే కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రేణూ దేశాయ్ మాత్రం స్పందించలేదు. -
ఫిడేలు రాగాల డజన్
తెలుగు కవిత్వం ఫ్యూడల్ సంప్రదాయ శృంఖలాలు తెంచుకొని, వస్తువులో, వైచిత్రిలో, ఛందస్సులో, అనుభూతి వ్యక్తీకరణలో కొంగొత్త మార్పులను స్వాగతించింది. ఇరవయ్యవ శతాబ్ది ప్రథమార్థం ఇందుకు నాంది పలికింది. కవితాసరళిలో విప్లవాత్మకమైన సంస్కరణలు పెల్లుబికాయి. 1939లో పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) మీటిన ఫిడేలు రాగాల డజన్ పెనుతరంగ ధ్వనినే సృష్టించింది. ఏ రకమైన కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు ఖాతరు చేయకుండా కొత్త పంథాకు హారతి పట్టాడు పఠాభి. జన వ్యవహారానికి దూరంగా ఉన్న కృత్రిమ గ్రాంథికాన్నిS ఎగతాళి చేసేటట్టు భాషలో, భావనలో సరికొత్త ప్రయోగాలు చేశాడు. పండితులకే పరిమితమైన ఛందస్సుపై తిరుగుబాటు బావుటా ఎగరేశాడు. ‘నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో పద్యాల నడుముల్ విరగదంతాను చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని చాల దండిస్తాను అనుసరిస్తాను నవీన పంథా, కాని భావ కవిని మాత్రము కాను, నే నహంభావ కవిని’ అంటాడు పఠాభి. ‘ప్రాచ్య దిశ సూర్య చక్రం రక్తవర్ణంలో కన్బట్టింది, ప్రభాత రేజరు నిసి నల్లని చీకట్ల గడ్డంబును షేవ్ జేయన్ పడిన కత్తిగాటట్టుల’ అన్న కవితలో చీకట్లను గడ్డంతో పోలుస్తాడు. దాన్ని ప్రభాత రేజరుతో గీసుకుంటుంటే పడిన కత్తిగాటులా ఉన్నాడు సూర్యుడని వర్ణించిన తీరులో అత్యంత నవ్యత కనిపిస్తుంది. ఇలా ఈ పుస్తకంలోని ఖండికలన్నీ చమత్కారంతో నిండి ఉంటాయి. పాశ్చాత్య కవితా ధోరణులు, సర్రియిలిజం ప్రభావం పఠాభిపై విపరీతంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. పుస్తకానికి పెట్టిన పేరులో కూడా నవ్యత్వం ఉంది. ‘ఫిడేలు రాగాల డజన్’లో 12 ఖండికలున్నాయి. అంచేతనే ఈ పేరు! అభ్యుదయ కవిత్వ చైతన్యం విస్తరించిన తరువాత, ముందు యుగం దూతలైన పఠాభి తరహా కవులు భావ కవిత్వాన్ని దాదాపు పాతిపెట్టినంత పని చేశారు. పఠాభి ప్రభావంలోనే చాలామంది నవ యువ కవులు ఈ తరహా కవితా విన్యాసంలో రచనలు చేయడం కొసమెరుపు. వాండ్రంగి కొండలరావు -
కవితల మహ్మద్ రఫీ!
బొంరాస్పేట: అమ్మ ప్రేమ నిరంతరంఆకాశంలో మెరుపు అమ్మ కోసం..ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోలేక‘పిచ్చి’తనంతో బలవంతపు మరణాలు..అభంశుభం తెలియని బాలికలపైపైశాచిక దాడులు కసాయి సాక్షాలు..చంకన పిల్ల వయస్సులో ఉన్న చిన్నారులుకీచక, నీచ బుద్ధిహీనులు అమానవీయ మరకలు..కన్నవారికి శోకాలు.. సమాజానికి కలంకాలు భావితరాలకు ఇవేనా గుణపాఠాలుబంగారు భవితకు ఎవరువేయాలి బాటలు? ఈ కవితలు బడికి దూరమై చికెన్సెంటర్ నిర్వహిస్తున్న ఓ ముస్లిం యువకుడి కలం నుంచి జాలువారుతున్న తెలుగు కవితా కుసుమాల మాల. పరిగి మండలం గుముడాలకు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మహ్మద్రఫీ పదో తరగతి వరకు చదివి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పదో తరగతివరకు చదివి మానేశాడు. కుటుంబ పోషణకు మండల పరిధిలోని తుంకిమెట్లలో ఐదేళ్లుగా చికెన్ సెంటర్ నడుపుతున్నారు. సందేశాత్మక కవితలతో.. చికెన్ సెంటర్లో గిరాకీ లేనప్పుడు కాలక్షేపం కోసం కవితలు రాయడం రఫీకి హాబీగా మారింది. మనసుకు తోచినట్లు అంశాలను ఎంచుకొని అలవోకగా ప్రేమ, సందేశాత్మక కవితలు రాయడం కొనసాగిస్తున్నారు. ‘నీవు నవ్వితే చాలునెలవంక సిగ్గుపడుతది. నీనడక చూసిహంస అసూయ పడుతది. నడుము నాట్యంతోనెమలి పురి పూరుగుడిసైతది. అంటూ అలవోకగా కవితలు అల్లడంలో రఫీ అందెవేసిన చెయ్యి. హిందీ ప్రముఖ గాయకుడు మహ్మద్రఫీ, బాలుపాడిన పాటలంటే ఈ కవితల రఫీ చెవికోసుకుంటాడు. చిన్ననాటి నుంచి కవితల పట్ల ఉన్న ఆసక్తితో సునాయసంగా, సహజంగా రాయాలేగాని కృత్రిమ కవితలు రాయలేనని చెబుతున్నాడు రఫీ. షార్ట్ ఫిలిం తీయాలనుకున్నా నా కవితలు చదివినవారు విన్నవారు చాలా బాగున్నాయని అంటున్నారు. పుస్తక రూపంలో, ఫొటో ఆల్బం చేయించాను. నాకవితలతో ఏఒక్కరు మారినా నాకు సంతృప్తి మిగిలిస్తుంది. సోషల్ మీడియాలో సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ చేయాలి ఉంది. త్వరలో షార్ట్ ఫిలిం తీసే ప్రయత్నాలు చేస్తున్నా. నేనే కథ రాశాను. షూటింగ్కు సిద్ధంగా ఉంది.– మహ్మద్రఫీ -
పోలీస్ కవి
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణానికి చెందిన కాశిబోయిన ప్రసాద్ బాల్యం నుంచి కవితలు రాస్తున్నాడు. అతని ప్రతిభను గమనించిన ఉపాధ్యాయులు మరింత ప్రోత్సహించారు. దీంతో సృజనకు పదును పెట్టి ఎన్నో కవితలను రాశాడు. ఆశువుగా కూడా కవితలను చెప్పగలడు. ప్రస్తుతం ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు కవితలు రాస్తూ రాణిస్తున్నాడు. వరల్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. అనేక బిరుదులు, సత్కారాలు అందుకున్నాడు. సేవకార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. తాను చదువుకున్న గౌరిదేవిపేట పాఠశాలలో ప్రతి ఏడాది 10వ తరగతిలో ప్ర£ýథమస్థానాన్ని సాధించిన వారికి గోల్డ్ మెడల్తో పాటు రూ.వెయ్యి నగదు, ద్వితీయ స్థానం సాధించిన వారికి సిల్వర్ మెడల్తో పాటు రూ.వెయ్యి నగదును అందిస్తున్నాడు. జనవరి 26న ఇద్దరు గురువులను, ఒక విద్యార్థిని సన్మానించడంతో పాటు రూ.20వేలు విలువ చేసే క్రీడా సామగ్రి, పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నాడు. గత పదేళ్లుగా విద్యార్థులకు 8వందల టీ షర్టులను అందించాడు. చర్చిలకు, పాఠశాలలకు, అనాథ ఆశ్రమాలకు గడియారాలను అందజేస్తున్నాడు. బడిమానేసిన ఆకతాయిగా తిరుగుతున్న గిరిజన పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారం పొందాడు. 2010లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా పాల్గొని సత్కారం పొందాడు. 2008లో కరీంనగర్ ఎస్పీ నుంచి ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నాడు. -
అఖిల భారత కవితోత్సవానికి నిఖిలేశ్వర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కవితా దినోత్సవాన్ని (వరల్డ్ పొయెట్రీ డే) పురస్కరించుకొని బుధవారం ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీలో అఖిల భారత కవితోత్సవం నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ అధ్యక్షతన జరిగిన ఉత్సవంలో 22 భాషల కవులు తమ కవిత్వాలను వినిపించారు. తెలుగు నుంచి హైదరాబాద్కు చెందిన కవి నిఖిలేశ్వర్ పాల్గొన్నారు. విశ్వ సంస్కృతిలో కవిత్వం ఒక భాగమని, దేశంలో మానవ సంస్కృతి అంతరాత్మగా కవిత్వం వెలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. -
తెలుగులోనూ రేణు దేశాయ్ కవితలు
ఇటీవల మీడియాలో తరుచూ కనిపిస్తున్న రేణుదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యం పవన్ తో తన రిలేషన్, విడాకులకు దారితీసిన పరిస్థితులు, రెండో పెళ్లి లాంటి విషయాలతో పలు వివాదాలకు కేంద్రబిందువయ్యారు. తరుచూ మీడియాతో మాట్లాడుతున్న రేణు హాబీగా తాను రాసుకున్న కవితలకు పుస్తక రూపం ఇవ్వనున్నట్టుగా తెలిపారు. తాజాగా ఈ కవితలను తెలుగులోకి అనువదిస్తున్నట్టుగా తన సోషల్ మీడియా పేజ్ లో తెలిపారు. తన ఫేస్ బుక్ పేజ్ లో తన కవితను ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ పోస్ట్ చేసిన రేణు, ప్రముఖ కవి ప్రసాదమూర్తి గారు తన కవితలను తెలుగులోకి అనువదిస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే తెలుగు అనువాదం పూర్తయిన ఈ పుస్తకానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. త్వరలోనే పూర్తి వివరాలతో పాటు బుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. Coming very soon 😊 Prasadmurthy garu has done the Telugu translation so beautifully 🙃💕 pic.twitter.com/lyb0nJ4iOg — renu (@renuudesai) 15 November 2017 -
కవిత్వాన్ని శ్వాసించిన కాలాత్మ
సందర్భం ‘‘సంప్రదాయం, వైయక్తిక ప్రతిభ’’ అనేది ఎలా కాల ప్రవాహంలో కవులు నడిచే దారో, అది ఎలా 20వ శతాబ్దంలో 1940–50ల నాటికే, ఎప్పటికన్నా ప్రజల పక్షాన ఉన్నదో చెప్పిన రొమాంటిక్ ఉద్యమ పారంగతుడు కృష్ణశాస్త్రి. కళింగ కడలి యాన గాలి పాటగా, ‘‘ఆకులందున అణిగి మణిగి కవిత కోయిల పలకవలెనోయి’’ అని గురజాడ రాసిన పుష్కర కాలానికే, ‘‘ఆకులో ఆకునై, పూవులో పూవునై, ఈ అడవి దాగి పోనా, ఎటులైన ఇచట నేనాగి పోనా’’ అంటూ, అడవులను అనుమతులు అడుగుతూ, తన తృష్ణానంత కృష్ణ పక్షపు ఒక్క రెక్క తోనే పిట్టగా ఎగిరి వస్తానని కబుర్లు పంపుతూ, గురజాడకు గురువందనం చేసి, ఈ కవిత్వ మంత్ర దండం అందుకున్న ‘‘అనంతాంబరపు నీలి నీడ’’ పేరు కృష్ణశాస్త్రి. ఉద్యోగం భావకవి. ఊహాలోకంలో ఊరు దేవులపల్లి అనే దేవతల పల్లె. పుట్టింది పిఠాపురం దరి సంస్థాన ఏలుబడిలోని చంద్రం పాలెం. తాను రాసిన వంద కవితల లోపున 3 సంపుటాల అక్షర రమ్యతా, అభివ్యక్తి సంపన్న లలితత్వం, ప్రతి రచనలో పొదిగిన తన ముద్రా, ఇవీ ఒక వ్యక్తిని ఒక కవి చేసిన సామగ్రి. ‘‘నా నివాసమ్ము తొలుత మధుర సుషమా సుధాగాన మంజు వాటి, ఏనొక వియోగ గీతిక’’ అంటూ, వెర్రెత్తిన ప్రేమ గంగలా చిందులేసి, గండ భేరుండంలా ఎదిగే లక్షణాలున్న శ్రీరంగం శ్రీని వాసరావు అనే కుర్రవాడిని, తన ప్రభావంలోకి లాక్కున్న కవిత్వ కృష్ణ బిలం కృష్ణశాస్త్రి. కవి అజేయత్వాన్ని విశ్వసించిన కాలాత్మ కృష్ణశాస్త్రి. కవిత్వ చిరాయుష్షు రహస్యం మనకు ఈ మూడు సంపుటాల కవితల్లో స్పష్టం కాదు. తన కవితల్లో ఆకు పచ్చ గుబురులు, పొగమంచులు, పూల తివాచీలూ, మబ్బు జలతారుల మధ్య ఉండే ఒక కవి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, బైరన్ వలె గిరజాలు పెంచుకు తిరిగే యువ కవిత్వోల్లాసి, 1925కు ముందరే ఈయన ‘‘కృష్ణపక్షము’’ రచన పూర్తయింది. 1924లో రాసినది, (అప్పట్లో ‘‘సఖి’’ పత్రిక రుధోరోద్గారి సంచిక 1923–24 లో ప్రచురితం అన్న వివరణతో ఉన్న వ్యాసం) ‘‘మా ప్రణయ లేఖల కథ’’ ఏ యువకవి కూడా తన తొలి సంపుటికి ఇవ్వని విశేష వివరణ. ఇక ముందర రాబోయే రచనలు ప్రవాసమూ, ఊర్వశి, వీటి ప్రస్తావనలు కూడా ఈ వ్యాసంలో ఉన్నాయి. 1956లో కృష్ణశాస్త్రి మదరాసు రేడియోలో ప్రొడ్యూసర్గా ఉద్యోగంలో చేరారు. చేసిన ప్రసంగ వ్యాసాల్లో ఒకచోట, ఊహాశక్తి కవిత్వ పింఛంగా విప్పారాలి, వర్ధిల్లాలి అంటే సాంస్కృతికత, కాల్పనికత, వాస్తవికత, పోటాపోటీగా సమతూకంలో రాణించాలని సూత్రీకరించారు. 1922 సేక్రెడ్ వుడ్ వ్యాసాల్లో టి.ఎస్. ఇలియట్ ‘‘ట్రెడిషన్ అండ్ ఇండివిడ్యుయల్ టాలెంట్’’ అని రాసింది ఒక కవిపై పూర్వ కవుల ప్రభావాల గురించిన ఒక ప్రామాణిక పరిశీలన. ఇరవయ్యో శతాబ్దపు పాశ్చాత్య సాహిత్య రచనల్లో చాలా ముఖ్యమైనదితను రాసిన వంద లోపు కవితలు రాయడానికి కృష్ణశాస్త్రి ఎంత చదువుకుని ఉండాలో, అటుపై తాను ఎలా తన దృష్టి దృఢత్వాన్ని పెంపొందించుకుంటూ వెళ్లారో చెప్పేదే, ‘‘కవి– ప్రజ’’ అన్న వ్యాసం. ప్రజలదే ఉమ్మడి బహుళ వారసత్వం, ఇది కవుల ద్వారా దఖలు పడుతుంది, అన్న అవగాహన ఏర్పడ్డ శాస్త్రి గారు ఆధునికతకు గుండె చప్పుడు అని తెలుపుతుంది. ఆంగ్లంలో దీన్ని అందిస్తే, ఇలియట్ కన్నా ఒక కోణం ముందుకు వెళ్ళి, ‘‘సంప్రదాయం, వైయక్తిక ప్రతిభ’’ అనేది ఎలా కాల ప్రవాహంలో కవులు నడిచే దారో, అది ఎలా ఈ ఇరవయ్యో శతాబ్దంలో 1940–50ల నాటికే, ఎప్పటికన్నా ప్రజల పక్షాన ఉన్నదో చెప్పిన రొమాంటిక్ ఉద్యమ పారంగతుడు కృష్ణశాస్త్రి. ‘‘ఏ అసంఖ్యాక ప్రజలతో ఈ రోజుల్లో మనకి మరీ సన్నిహిత సంబంధం ఏర్పడుతుందో, ఆ ప్రజలలో నిలిచి ఉన్న సంప్రదాయాలతో కవికి పరిచయం లేకపోతే, అతని కంఠ స్వరం ప్రజలు ఆప్తమైనదిగా పోల్చుకోలేరు. అతని మాటలు పరాయి భాష లాగా ఉంటాయి. కనుక ప్రజలతో సన్నిహిత సంబంధం కవికి ఉండాలంటే, వాళ్ళ కలిమి లేములూ, కష్టనిష్టూ రాలే కాక వాళ్ళు నిలబడి ఉన్న జాతి సంప్రదాయాలు కూడా అతగాడు వివేచనతో, చనువుతో, గౌరవంతో ఎరిగి ఉండాలి’’ అన్నారు 1948లో కృష్ణశాస్త్రి. అప్పటికి ఇంకా మహాప్రస్థానం అచ్చు కాలేదు. (అచ్చయింది 1950లో). ఆయన స్థిర పడలేదు, స్థిమిత పడలేదు., పైపెచ్చు ఆ రెండూ అంటే తనకు వెగటు అని చెప్పిన కాలుండబట్టని, మనసు ఊరుకోని కళ , జీవి తాల అద్వైతి కృష్ణశాస్త్రి. వీరేశలింగం గురించి రాసినా, రావి చెట్టు గురించి రాసినా, ఒక ప్రాచీన ప్రసంగావేశం వారి మాటల్లో, రాతల్లో.. తూరుపు, పడమర తేడా లేకుండా సమస్త కవిగణాల విషయమై, వారు కీర్తించిన ప్రకృతి, ప్రజల విషయంలో, మంచి మాటలే చెప్పిన కవి శిరోమణి, మానవేతిహాసంలో, అన్వేషణలో దుఃఖాలు మీదు కట్టి , ఒక అమూర్త ఊర్వశిని అవతరింపచేసుకున్న అరుదైన కవి. కవి అన్న మాటకు పర్యాయపదం లేదని చెప్పిన ద్రష్ట, సత్యం జ్ఞానులది కాగా, శివం కార్యోత్సాహులది కాగా, సుందరం మాత్రం కవుల కరతలామలక కళ అని ఉద్ఘోషించిన కాలాత్మ కృష్ణశాస్త్రి గారిని ఇంకా మనం పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టలేదు. వారి రచనల అయిదో సంపుటి, కృష్ణశాస్త్రి వ్యాసాలకు ముందు మాటలో ‘‘ఇది ఇక్షుసముద్రం, ఆస్వాదిద్దాము రండి’’ అని ఆహ్వానించారు శ్రీ శ్రీ. ఈ నూట ఇరవయ్యో జయంతి నుంచి ఆ పని చేద్దాము. రామతీర్థ వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత మొబైల్ : 98492 00385 -
బతుకే ఓ పోరాట పాట
జీవితం ప్రకృతి నుండి పాట నుండి విడదీసి చూడలేమని నేను ఎన్నోసార్లు గొంతు చించుకుని నినదిస్తే అది ఏదో నా పాటల గొడవనుకున్నారు నిజమే అనుకొన్నా నేను మర్చిపోయాను ముచ్చర్ల సత్తెన్న బతుకు కథ సదివితే బతుకే ఓ పోరాటం ఓటమి గెలుపుల పయనం ఏటికి ఎదురీదడం ప్రకృతి నేర్పిన సత్యం, సత్యం, సత్యం మా సత్తెన్న బతుకు పాటల బతుకు ఉత్తుత్త నీటి పాటలు, చప్పట్ల పాటలు కావు అవి జ్ఞాన పాటలు, విజ్ఞాన బాటలు రాజును, రాజ్యాన్ని ప్రశ్నించే పాటలు ప్రశ్నించే వరకే ఊరుకోడు ఆ ప్రశ్నలకు తానే పరిష్కరించే మార్గాలను అన్వేషిస్తాడు ఒక ఆచరణ కార్యక్రమం రూపొందిస్తాడు కార్యక్రమానికి ఒక నిర్మాణరూపం పొందిస్తాడు ఆ నిర్మాణంలో భాగమవుతాడు నడిపించే నాయకుడవుతాడు రాజకీయంగా పరిష్కరించే ఓ రాజనీతిజ్ఞుడవుతాడు అప్పుడు మేము పాటల కవులం సత్యాన్ని శోధించి, ప్రశ్నించి, ఆచరించి అక్షరానికి అమరత్వాన్ని సమకూర్చుతామంటాడు రాజును, రాజ్యాన్ని ప్రశ్నించేవాడే ఆ కాలం వాగ్గేయకారుడని నిరూపిస్తాడు ముచ్చర్ల సత్తెన్న/ ధిక్కార కెరటం రూపమై, దీపమై/ వెలుగుతూ, ఆరిపోతూ ఆరిపోతూ, వెలుగుతూ/ కొనసాగిపోతాడు మనం ముచ్చర్ల సత్తెన్న అడుగులో అడుగై/ నడకలో నడకై ఆయన బాటలో/ సాగిపోదాం గద్దర్ రెండు పక్షులూ ఒక జీవితం ‘పగలే శూన్యాన్ని తిడుతూ కూర్చునే భర్త పరిస్థితిని తలుచుకొని ఆమె తన తల్లిగారింటిలో ఇలా అనుకుంటుంది ఇప్పుడు గుర్తుకొస్తుందా వెలుతురుతోనే ఇల్లు వెలగదని ఇక అతడికి ఈ రాత్రేం కానుందో’ కొత్తగా జీవితంలోకి ప్రవేశించిన ఇరువురు స్త్రీ–పురుషులు తమలో తాము, తమతో తాము చేసుకునే సంభాషణల్లాగా రాసిన కవిత్వం ‘రెండు పక్షులూ ఒక జీవితం’. దీన్ని మొదట ఫేస్బుక్ వేదికగా మూడు నెలల పాటు ధారావాహికగా రాశారు బూర్ల. ‘దంపతుల మధ్య లోపిస్తున్న అవగాహనను సరిచేయడానికి సున్నిత సరస సంభాషణే ఔషధం’ అన్న ఎరుక దీనికి మూలకందం. కవి: బూర్ల వేంకటేశ్వర్లు; పేజీలు: 94; వెల: 100; ప్రచురణ: సాహితీ సోపతి; ప్రతులకు: బి.సంతోష, 2–10–1524/10, ఫ్లాట్ నం: 403, వెంకటేశ్వర టవర్, జ్యోతినగర్, కరీంనగర్–505001. ఫోన్: 9491598040 సోహం యింకా వుపయోగించని శంఖం వుంది చేతిలో వంచని తల వుంది గుండె వుందిరా నడచిన దారి వుంది వెలుగుతూ విచ్చుకొనే లక్ష రక్త కణాలున్న దేహం వుంది కాంక్షతో లోనికి లోనికి లోనికి చూచుకొనే అద్దం వుంది మెరుస్తూ నిరంతరం ప్రవహించే నది లాంటి దుఃఖం వుంది కదా నీతో నువ్వు నిశ్శబ్దించే స్వప్నం వుంది కురుస్తూ యింకా తెరవని మరణం వుంది కదా మోహంతో దాము -
కవిత
అక్కడే... చెప్పిన మాట వినకుండా చెట్టాపట్టాలేసుకు పోతుంది అచ్చంగా నీదే అయిన దేహం నిన్ను విడిచి మనిషికో మాట గుండెకి ఒక దెబ్బ పెడ చెవికే హెచ్చరిక పిచ్చి పెదవుల ప్రేలాపనలు గాలికి మాత్రమే ఉక్కబోత! ఉద్వేగాలకు కళ్లెం వేసి నిభాయించుకోవాలి అంతరాత్మని ముఖకవళికలని పెన్సిల్తో దిద్దేస్తే నవ్వులు ముద్దమందారంలా పూస్తాయి జీర్ణించుకున్న వాస్తవాల్ని నిట్టూర్పుల్లో వదిలేసి ఒక్కక్షణం కళ్ళుమూసుకుంటే, స్వప్నాలు రెప్పలమీద వాలతాయి అడుగులకు నమ్మకాన్ని పరచుకుంటూ తప్పిపోవచ్చు అక్కడే మళ్ళా పునర్నిర్మించుకున్న ఎల్లల్లో కట్టుకున్న తోటల పరిమళాన్ని వెతికి పట్టుకోడానికి... మందిలో ఒంటరిగానే ఉన్నా, ఎంతో కొంత దొరికించుకోడానికి... రాళ్ళబండి శశిశ్రీ 7416399396 అనువాద కవిత బుద్ధారాధన యుద్ధ భేరీ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి సైనికులు మృత్యుదేవత యముని ప్రసన్నత కోసం తరలి వెళ్తున్నారు. వారి యుద్ధ దుస్తులు భీతి గొల్పుతున్నాయి. వారు పళ్లు పటపటా కొరుకుతున్నారు. క్రౌర్యోజ్వల జ్వాలలతో అవిశ్రాంతంగా వున్నారు. అలాగే, దయా సముద్రుడు శాక్యముని ఆశీస్సులూ పొందగోరుతున్నారు. కయ్యానికి కాలుదువ్వే రీతిలోనే బుద్ధ దేవాలయం వైపు కవాతు చేస్తున్నారు. బాకాలూ ఢంకాలూ మహోగ్రంగా మ్రోగుతున్నాయి. భూగోళమే భయంతో ప్రకంపిస్తున్నది. సమర ఘోషలోనే వారిలా వేడుకున్నారు: మానవ బంధాల్ని ముక్కలు చేస్తూ నివాస గృహాల నుండి ఆర్తనాదాలు మారుమ్రోగాలి. ఆకాశమే వైశ్వానర కీలల్ని వర్షించి జనావాసాలు భస్మీపటలం కావాలి. విజ్ఞాన నిలయాలు వినాశనం కావాలి. అందుకోసమే వారు అనుకంపమూర్తి తథాగతుని దర్పంగా పూజిస్తున్నారు. బాకాలూ ఢంకాలూ మహోగ్రంగా మ్రోగుతున్నాయి. భూగోళమే భయంతో ప్రకంపిస్తున్నది. విజయ దుందుభుల అనుస్వరంలో శవాలు గణించబడుగాక! స్త్రీ బాల వృద్ధుల చిధ్రదేహాలు ఆహ్లాద నృత్యాన్ని ప్రేరేపించుగాక! (1937లో యీ గేయానికి రవీంద్రుడు స్వయంగా రాసుకున్న పాదలేఖనం యిలా వున్నది: ‘‘ఒక జపనీయ పత్రికలో జనం విజయాన్ని కాంక్షిస్తూ బుద్ధ దేవాలయానికి వెళ్తున్నట్టు చదివాను. వారు తమ భీకరాయుధాల్ని చైనీయులకూ, ప్రార్థనా బాణాల్ని బుద్ధ భగవానుడికీ గురి పెడుతున్నారు’’.) మూలం: రవీంద్రనాథ్ టాగూర్ తెలుగు: టి.షణ్ముఖరావు 9949348238 -
నయనతార హాబీస్ ఇవే..!
స్టార్ హీరోయిన్ గా దక్షిణాదిలో సూపర్ స్టార్ ఇమేజ్ అందుకున్న నయనతార, తనలోని మరో టాలెంట్ గురించి బయటపెట్టింది. తన తాజా చిత్రం అరమ్ ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నయనతార పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా ఉండే ఈ బ్యూటీ ఖాళీ సమయం దొరికితే కవితలు రాస్తుందట. నయన్ తన వ్యక్తిగత విషయాలను ఎవరితో పెద్దగా షేర్ చేసుకోదు. అందుకే తనకు అత్యంత సన్నిహితులకు మాత్రమే నయన్ మంచి రచయిత కూడా అన్న విషయం తెలుసు. అయితే కవితలు రాయటం తన హాబీ అన్న నయన్ భవిష్యత్తు తన రచనలను పుస్తకరూపంలోకి తీసుకువచ్చే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించలేదు. అంతేకాదు తన కవితలు ఇంతవరకు ఎవరికీ చూపించలేదట. కేవలం కలం మాత్రమే కాదు మరింత ఖాళీగా ఉంటే కొత్త కొత్త వంటలు కూడా ట్రై చేస్తుందట ఈ బ్యూటీ. -
కవితలు
గాలి దిగులుగా కదలక ముడుచుకుంది ఆకాశం కూలి వర్షం కురుస్తూనే వుంది ఆగకుండా పూలన్నీ వికసించి, ఇక తలలు వాల్చి, రాలేందుకు ఎదురుచూస్తున్నాయి తూనీగ రెక్కలపై మోస్తున్న గడచిన జ్ఞాపకాలు కరిగిపోతున్నాయి ఇంకా మేల్కొనని కలలు కూడా నెమ్మదిగా మరణించాయి సన్నటి నొప్పేదో పాత గాయాల్ని రేపుతూ జరజరా పాకుతోంది ఎన్నెన్నెటికో పగిలిపోయిన మనసు మాత్రం నవ్వుతుంది మెత్తగా ఎందుకో మళ్లీ గుర్తుకొస్తాయి ఇసుక ఎడారులలో తుపాను గాలి పాడే వాయులీన గానాలు తగలబడుతున్న సముద్రాలు నారింజ రంగు చేతులు చాచి చేసిన నృత్యాలు అడవులు నేలకూలుతూ చేసిన ఆర్తనాదాలు వెన్నెలను మింగి, ఆనాటి రాత్రి, కొండచిలువలా బద్దకంగా నిదరోవడం ఎందుకో మళ్లీ గుర్తుకొస్తుంది పూలు సుతిమెత్తగా విచ్చుకుంటున్న చప్పుడు జోలపాడే వేళ అలలుగా కదులుతున్న మేఘాల శిఖరాగ్రాలపైన, లోయలలోనా బాధలను, దుఃఖాలను పోగొట్టే చిరునవ్వుల వెలుగు రవ్వలు ఏవో తళుక్కున మెరుస్తూ, అందుకొమ్మని కవ్విస్తాయి అనేక ఏళ్లుగా మిగిలిన, ఏదో ఇంకా దొరకని దేనికోసమో ఎక్కడెక్కడో వెతికిన దివారాత్రులు ఇహ ముగిసినట్లనిపిస్తుందొక ఘడియ సరిగ్గా అప్పుడెప్పుడో జరిగినట్లు పూలు, ఆకులు అన్నీ రాలిపోయి, మంచు గడ్డకట్టిన దినాలలో పసిపిల్లల లేత పాదాలు నడిచిన మేరా ఆ జాడలలో గరికపూలు తలయెత్తి వెర్రిగా నవ్వినట్లు రంగురంగుల పూలు తిరిగి అంతటా మొగ్గలేస్తాయి నెమ్మనెమ్మదిగా. చల్లటి మంచు అప్పుడిక మెల్లగా కరుగుతుంది. పసరు వాసనలతో గాలి రివ్వున వీస్తుంది నలుదిక్కులా తొలకరి జల్లులలో తడిసిన కలల విత్తనాలు మొలకెత్తి చిగురిస్తాయి పూలు మళ్లీ వికసించే వేళ లోకానికి ఎలాగోలా తెలిసిపోతుంది విమల చరాచర నీడల చేతులతో ఎత్తుకుని ముద్దాడుతావు పిల్లల మీద రెప్పలతో దరువేస్తూ లోతులు చూస్తావు నీతో సుఖించి, నిద్రించి వేకువనే ఉడాయించే చీకటి చెలికాండ్రను సాగనంపి బిడ్డల తల్లివవుతావు నెత్తిన కొంగుతో పరుగెత్తుకొచ్చి నీ పాదాల వద్ద ముడుచుక్కూచుంటుంది నేల దారుల చద్ది మూటవు నీ దెప్పుడూ పరిమళ భాష నువ్వొదిలే పుక్కిలి మల్లెల ముల్లె నీ ఊపిరి ఉద్యాన వనం చక్రవర్తి నెత్తుటి చేతులు కడిగిన నీటితో పుట్టావు తిరగబడి శిరసులిచ్చినవారి చరిత్రను గానం చేస్తావు కదలవు, కదిలిస్తావు నిజం -
కవిత్వమే మతం అయిన సందర్భం
మతం నుంచి కవిత్వం రావడం,మతం కోసం కవితా రచన జరగడం ఉన్నదే. కానీ కవిత్వం మతంగా పరిణమించడం ఒక్క లావ్ ట్సూ ద్వారానే జరిగింది. ఒక్క టాఔ ఇజం విషయంలోనే జరిగింది. కవిత్వం, తత్వం అయి మతం అయింది చైనా కవి లావ్ ట్సూ (LAO&TZU ) కర్తృత్వంలో. ఆయన రాసిన 81 కవితలు టాఔ ఇజం అన్న మతానికి ప్రాతిపదిక అయినాయి. ప్రపంచంలో ఇలాంటి ఘటన ఇదే! మతం నుంచి కవిత్వం రావడం, మతం కోసం కవితా రచన జరగడం ఉన్నదే. కానీ కవిత్వం మతంగా పరిణమించడం ఒక్క లావ్ ట్సూ ద్వారానే జరిగింది. ఒక్క టాఔ ఇజం విషయంలోనే జరిగింది. ఆశ్చర్యకరమైన పరిణామం ఇది! ప్రపంచంలోని మహోన్నతమైన కవులలో చైనా దేశపు కవి లావ్ ట్సూ ఒకరు. లావ్ ట్సూ జననం, జీవితం, మరణంలపై సరైన వివరాలు లేవు. ఆయన క్రీ.పూ. 6వ శతాబ్ది వారని విశ్వసిస్తున్నారు. అందులోనూ సందిగ్ధతే. క్రీ.పూ. 604–517 కాలం వారనీ, క్రీ.పూ. 551–479 కాలం వారనీ వేరు వేరు వాదనలు ఉన్నాయి. చైనాలో చౌ అనే ప్రదేశంలో ఒక రాజాస్థానంలో పురాతన దస్తావేజుల సంరక్షకులుగా ఆయన పనిచేసేవారనీ, ఒక దశలో అక్కడి పరిస్థితులు నచ్చక ఊరు వదిలి వెళ్లిపోతూండగా ఊరి పొలిమేరలో కాపలాదారులు పట్టుకున్నారనీ, ఆ పట్టుకున్న కాపలాదారులలో ఒకతనికి ఆయన తన జ్ఞానాన్ని కొన్ని కవితలలో చెప్పారనీ, అందుకు బదులుగా ఆ కాపలాదారు ఆయన్ను వదిలేశాడనీ, ఆయన ఎద్దునెక్కి ఎటో వెళ్లిపోయారనీ కథనం. లావ్ ట్సూ ఎద్దుపై కూర్చుని ఉన్న చిత్రం ప్రచారంలో ఉంది. ఆయన పొలిమేర దాటుతూండగా పట్టుకున్న కాపలాదారులలో ఒకతను ఆయన స్నేహితుడనీ, అతని పేరు యిన్–హ్సి అనీ, ఆ 81 కవితలూ అతని కోసం రాసిచ్చారనీ మరో కథనం. లావ్ ట్సూ రాసిచ్చిన 81 కవితలు ‘టాఔ– టీ – చింగ్’ అయినాయి. అదే ‘టాఔ ఇజం’ అన్న మతానికి అధారం అయింది. ఆ 81 కవితలలోని భాషా సంక్షిప్తత, కవిత్వం తరువాతి కాలంలో ప్రపంచ సాహిత్యంలో ఒక సంచలనాన్ని సృష్టించాయి. టాఔ– టీ – చింగ్ ను ‘డాఔ–డీ జింగ్’ అని కూడా అంటారు. ఈ టాఔ– టీ – చింగ్కు చెప్పబడిన అర్థాలలో కూడా తేడాలు కనిపిస్తున్నాయి. ‘మార్గం దాని శక్తి’ అనే అర్థం కొంత కాలం వాడుకలో ఉండేది. కానీ ‘తత్త్వం దాని ఆచరణపై గ్రంథం’ అనే అర్థం తరువాతి కాలంలో వ్యాప్తిలోకి వచ్చింది. అసలు లావ్ ట్సూ అంటే ‘సిద్ధ గురువు’ (old master) అని అర్థమట. ఆ పేరుగల వ్యక్తే లేడన్న వాదన కూడా ఉంది. టాఔ– టీ – చింగ్ కు రకరకాలైన అర్థాలు, భాష్యాలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో వంగ్ పి, హొ షంగ్ కుంగ్, హన్ షన్–టీ–చింగ్ ప్రభృతుల భాష్యాలు ముఖ్యమైనవి. ఆ 81 కవితల టాఔ– టీ – చింగ్ ఒక పవిత్ర గ్రంథంగా పరిణమించింది. ఇది 2 పుస్తకాలుగా ఉంది. పుస్తకం 1, పుస్తకం 2 అని. ఆ 81 కవితలనూ 81 అధ్యాయాలుగా చూపించారు. వాటిని ఇంగ్లిష్లో కొందరు వచనంగా, కొందరు కవితలుగా అనువదించారు. తత్త్వాన్ని (టాఔ) ప్రకటించే విధానం శాశ్వతమైనది కాదు దానికి ఇవ్వబడిన పేరూ శాశ్వతమైనది కాదు కోరికల నుంచి స్వేచ్ఛను పొందు, మర్మం విడిపోతుంది కోరికలలో చిక్కుకుపోతే వ్యక్తీకరణ మాత్రమే కనిపిస్తుంది లావ్ ట్సూ ‘టాఔ’ అంటూ చెబుతున్నది మనం ‘సర్వాంతర్యామి’ అనే పదానికి పర్యాయపదంగా కనిపిస్తోంది. ఓ కవితలో – ‘టాఔ అనంతం, శాశ్వతం ఎందుకది శాశ్వతం? అది పుట్టలేదు కనుక అది మరణించదు– అది ఎందుకు అనంతం? దానికి కోరికలు లేవు అది అందరి కోసమూ ఉన్నది’ – అని చెబుతారు లావ్ ట్సూ. ఉపమాలంకారాన్ని చాలా చక్కగా వాడతారు లావ్ ట్సూ. ఓ కవితలో మంచితనాన్ని నీటితో పోలుస్తారు. ‘ఇతరులతో నిన్ను పోల్చుకోకు, ఇతరులతో పోటీ పడకు, అందరూ నిన్ను గౌరవిస్తారు’ అని సగటు మనిషికి సందేశమిస్తారు. భగవద్గీతలో కనిపించే నిష్కామ కర్మ ప్రస్తావన టాఔ– టీ – చింగ్ లోనూ కనిపిస్తోంది. ‘ఎదురు చూపుతో సంబంధం లేకుండా పని చెయ్యడం మహోన్నతమైనది’ అనీ, ‘నీ పని చెయ్యి, ఆపై వదిలెయ్యి’ అనీ చెబుతారు లావ్ ట్సూ. ఒక భావాన్ని ఎంత గొప్పగా చెప్పొచ్చో, ఎలా కవిత్వంగా మలచొచ్చో ఈ పంక్తుల ద్వారా తెలుసుకోవచ్చు. ‘బంకమట్టితో మనం కుండను చేస్తాం దాని లోపల ఖాళీగానే ఉంటుంది ఆ ఖాళీనే మనకు కావలసిన నీళ్లను మోస్తుంది’ ఓ కవితలో ‘ఓటమి ఎంత అపాయకరమైనదో– విజయమూ అంత అపాయకరమైనదే’ అంటారు లావ్ ట్సూ. ‘భగవంతుడు(టాఔ) గొప్పవాడు విశ్వం గొప్పది భూమి గొప్పది మనిషి గొప్పవాడు’– అంటారు మరో కవితలో. ‘నిజమైన పూర్ణత్వం ఏమీ లేనట్లుగానే ఉంటుంది అయినా అందులో సంపూర్ణమైన ఉనికి ఉంటుంది’– అన్న లావ్ ట్సూ వాక్యాలు ‘పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణామాదాయ పూర్ణమేవావశిష్యతే’ శ్లోకాన్ని గుర్తుచేస్తాయి. ‘నీ తలుపు తెరవకుండా నీ హృదయాన్ని ప్రపంచం కోసం తెరవగలవు నీ కిటికీ వైపు చూడకుండా బ్రహ్మ తత్వాన్ని నువ్వు చూడగలవు’ అని ఒక కవితలో అంటారు. ‘నీ స్వీయ కాంతిని ఉపయోగించు ఆపై కాంతి యొక్క మూలాన్ని చేరుకో’ అంటారు మరోచోట. ఇక్కడ ‘స్వీయ కాంతి’ అనడం ఆది శంకరాచార్యులు ‘స్వస్య యుక్త్యాః’ అంటే ‘నీ యుక్తి చేత’ అనడాన్ని తలపిస్తోంది. వేమన పద్యాల్లాగా వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేవి కొన్ని లావ్ ట్సూ కవితల్లో ఉన్నాయి. ‘చిన్న చిన్న చర్యలతో గొప్ప పనులను పూర్తిచెయ్యి’, ‘ఓటమి ఓ అవకాశం’, ‘కష్టాలతో తలపడు’, ‘నువ్వు ప్రజల్ని పాలించాలంటే నువ్వు వాళ్లకన్నా కింద ఉండాలి, నువ్వు ప్రజలకు నాయకత్వం వహించాలంటే నువ్వు వాళ్లను అనుసరించడం నేర్చుకోవాలి’– వంటివి. వ్యక్తిత్వ వికాసానికి లావ్ ట్సూ కవితలు తోడ్పడతాయి అనే కోణంలో కూడా ఆయన కవితలకు భాష్యం చెబుతూ ఇంగ్లిష్లో పుస్తకాలొచ్చాయి. మతం గురించి లావ్ట్సూ– ‘నేను మతాన్ని వెళ్లిపోనిస్తాను ఆపై ప్రజలు నిర్మలమౌతారు’ అంటారు. ఒక చోట ‘నిజమైన మాటలు విపరీతార్థాలుగా అనిపిస్తాయి. నిజమైన మాటలు వాగ్ధా్దటితో ఉండవు. వాగ్ధాటితో ఉండేవి నిజమైన మాటలు కావు’ అంటారు. రోచిష్మాన్ 09444012279 -
కవిత్వంపై కవిత్వం లాంటి పుస్తకం
కవిత్వంలో నేను – మరికొన్ని వ్యాసాలు; రచన: విన్నకోట రవిశంకర్; పేజీలు: 288; వెల: 150; ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా; ప్రతులకు: జె.వి.పబ్లిషర్స్, నవోదయా బుక్ హౌజ్ విన్నకోట రవిశంకర్ తెలుగు కవిత్వంలో బాగా విన్న పేరే. ‘కుండీలో మర్రిచెట్టు’, ‘వేసవి వాన’, ‘రెండో పాత్ర’ సంకలనాలతో తనదైన ముద్ర వేసినవాడు. కవిత్వ రచనలో భాగంగా తన అనుభవాలనుంచి తను గ్రహించిన విషయాలు, ఇతర కవుల రచనలను చదివే సమయంలో తను గమనించిన వివరాలను అనేక వ్యాసాలుగా రాశాడు. అలా గత 18 సంవత్సరాలుగా వివిధ అంతర్జాల పత్రికలలో రాసిన వ్యాసాలు, సమీక్షలు, మరికొన్ని ప్రసంగ పాఠాలతో కూర్చిన సంకలనం ‘కవిత్వంలో నేను’. ఇస్మాయిల్ అభిమానిగా, ఆరాధకుడిగా రవిశంకర్కు కవిత్వం పట్ల, కవుల పట్ల కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. సరళత, నిరాడంబరత, స్పష్టత, గాఢతలను మంచి కవిత్వానికి మూలసూత్రాలుగా భావిస్తాడు. కవులకు పొయెటిక్ ఈగో లేకపోవడాన్ని అనగా కవి పాఠకుని కంటే ఒక ఉన్నతాసనం మీద ఉండి ప్రవచించటం కాకుండా వారిలో ఒకనిగా వారి కష్టాలు, సుఖాల గురించిన స్పందనలందించటాన్ని అభిమానిస్తాడు. ఏ కవి గురించి మాట్లాడ్తున్నా, ఎవరి కవిత్వాన్ని విశ్లేషిస్తున్నా పుస్తకంలోని వ్యాసాలన్నింటా ఇదే అంతస్సూత్రంగా ఆవరించి వుంటుంది. ‘కొన్ని సందర్భాల్లో కవిత రాయకపోవడం కన్నా రాయటమే ఒక రకమైన ఇన్సెన్సిటివిటీని సూచిస్తుంది’ అన్నప్పుడూ, ‘మరణించినవారిని ఇంటికి చేర్చకముందే మన కవులు పద్యం మొదలు పెడుతున్నారా, అంత్యక్రియలు పూర్తి కాకుండానే అంత్యప్రాసల కోసం వెతుకుతున్నారా అని నాకు అనుమానం కలుగుతుంది’ అన్నప్పుడూ అది మనకూ నిజంగానే తోస్తుంది. మంచి కవిత్వాన్ని చదవాలి, మళ్ళీమళ్ళీ మననం చేసుకోవాలి, విశ్లేషణ బహానాతో దాన్ని మరో నలుగురికి చేరవేయాలి, తద్వారా మంచి కవిత్వం కొనసాగింపునకు మనకు తోచిన బాట వెయ్యాలి అనే తపన పుస్తకంలో సుస్పష్టం. అలా తనకు నచ్చిన కవిత్వాన్ని పాఠకులతో పంచుకునే క్రమంలో ఇస్మాయిల్, ఆశారాజు, శిఖామణి, సిద్ధార్థ, శ్రీకాంత్, బి.వి.వి.ప్రసాద్, రమణజీవి, కొత్తపల్లి శ్రీమన్నారాయణ, యార్లగడ్డ రాఘవేంద్రరావు మొదలైన కవుల కవిత్వాన్ని ప్రేమగా తడిమాడు. సూటిగా, క్లుప్తంగా, అవసరమైన చోటల్లా అవసరమైనంత మేరకు కవితాత్మక ఉదాహరణలతో రసవంతంగా పుస్తకాన్ని తీర్చిదిద్దాడు. ‘ఎందుకు బతకాలి?’ అనే ప్రశ్నకు ఇస్మాయిల్ చెప్పిన సమాధానం ‘ఎండ వెచ్చగా వుంది, పచ్చిక పచ్చిగా వుంది, ఇక్కడింత హాయిగా వుంటే బతకటానికేమయ్యిందయ్యా నీకు?’ లాంటి సమయస్ఫూర్తి సంభాషణలు మరోమారు గుర్తుకు తెచ్చుకోవడానికి ఈ పుస్తకం ఒక మంచి సందర్భం. వ్యాసాల్లో వీలు దొరికినప్పుడల్లా తను రాసిన కవిత్వాన్ని ముందుకు తీసుకురావడానికి కవి రచయిత పడ్డ అదనపు తాపత్రయం కలిగించే కొంత అసౌకర్యం తప్పిస్తే, ఇది మంచి కవిత్వ వ్యాసాల సంకలనం! ఎమ్మార్ ఆనంద్ emmar.anand@gmail.com -
కవిత్వంలో ఉన్నంత సేపూ...
అరణ్యకృష్ణ రెండో కవితాసంకలనం ‘కవిత్వంలో ఉన్నంత సేపూ...’ విడుదలైన సందర్భంగా ఈ ఐదు ప్రశ్నలు... ‘నెత్తురోడుతున్న పదచిత్రం’(1994) తర్వాత, రెండు దశాబ్దాలకు రెండో సంకలనం తెచ్చారు. ఎందుకింత విరామం వచ్చింది? 1994 వరకూ నేను కవిత్వం రాసినప్పటి పరిస్థితులు ఆ తర్వాత లేవు. పౌరహక్కుల ఉద్యమం, వామపక్ష మొగ్గు... వాటి నిమగ్నతలో రాశాను. ఆ తర్వాత వట్టిపోయిన భావనేదో వచ్చింది. అదొక నిర్ణయంగా కాదుగానీ, మనం ఏమీ చేయనప్పుడు ఏమీ చెప్పకూడదు; అది తప్పేమో అనుకోవడం వల్ల రాయలేకపోయాను. మరి అంతకాలం మీలోని కవి ఏం చేశాడు? ముందు నేను యాక్టివిస్టును; యాదృచ్ఛికంగా కవిని. కవిత్వానికి అంతగా అలవాటు పడలేదు. రాసినవి రాయకుండా ఉండలేనప్పుడే రాసినప్ప టికీ, నేను రాయకుండా కూడా ఉండగలను. మళ్లీ ఇప్పుడు రాసేందుకు ప్రేరణ ఏమిటి? భావజాల పరంగానూ, తాత్వికంగానూ అప్పుడు నేను ఏ విలువల్ని వ్యతిరేకించానో అవి అలాగే ఉన్నాయి; వాటి మీద ప్రేమేం కలగలేదు. ఏమీ చేయలేకపోతున్నామే అన్న భావన, లక్ష్యం లేని జీవితం అయిందన్న వేదన, రాయడం కూడా ఒక కార్యాచరణే అనే రియలైజేషన్... మళ్లీ రాసేలా ప్రేరేపించాయి. ‘కవిత్వంలో ఉన్నంత సేపూ...’ అన్నారు? ఉన్నంతసేపు ఏమవుతుంది? కవిత్వం ఒక థాట్ ప్రాసెస్. అందులో ఉన్నప్పుడు నాకు నేను నిజాయితీగా ఉంటాను. నాలోనీ, సమాజంలోనీ వైరుధ్యాలు స్పష్టంగా కనబడతాయి. జర్నీ ఇంటూ ద రియామ్ ఆఫ్ సెల్ఫ్ అనొచ్చు. మీ కవిత్వం మీకు అవసరమా? సమాజానికా? ముందు నాకే అవసరం. రాయడం కమ్యూనికేట్ చేయడం కోసమే రాసినా రాయకపోతే నష్టపోయేది నేనే! బ్రహ్మపదార్థంలా చెబుతున్నాననుకోవద్దు... ప్రతి కవిత ఒక ఎరుక! కాబట్టి నా కవితలకు ప్రధాన లబ్ధిదారుణ్ని నేనే! (కవిత్వంలో ఉన్నంత సేపూ...; కవి: అరణ్యకృష్ణ; ప్రచురణ: నవ్య పబ్లికేషన్స్; కవి ఫోన్: 8978720164) -
కాళిదాసు కవితావైభవం కుమారసంభవం
డాక్టర్ కేసాప్రగడ సత్యనారాయణ రాజమహేంద్రవరం కల్చరల్ : ఉపనిషత్తులు, ఆరణ్యకాలు, వేదవాజ్ఞ్మయానికి మాత్రమే ప్రాథాన్యం ఉన్న రోజుల్లో మహాకవి కాళిదాసు లౌకికమైన కావ్యజగత్తులోకి తన రచనలు తీసుకువచ్చాడు. ఆయన కవితావైభవానికి దర్పణంగా కుమారసంభవం కావ్యాన్ని చెప్పుకోవచ్చునని రామాయణ రత్నాకర డాక్టర్ కేసాప్రగడ సత్యనారాయణ అన్నారు. నన్నయ వాజ్మయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగిన సాహితీ కాళిదాసం సభలో ఆయన కుమార సంభవము– పార్వతీ కల్యాణము అనే అంశంపై ప్రసంగించారు. తొలిరేయి విద్వాంసురాలయిన కాళిదాసు భార్య విద్యాధరి చొరవ తీసుకుని ‘అస్తి కశ్చిత్ వాగ్విశేషః’ మాటలాడుకోవడానికి ప్రత్యేకమైన మాటలే లేవా అని అడిగింది. ఇందులో మొదటిదయిన ‘అస్తి’ కాళిదాసు అనంతర కాలంలో రచించిన కుమారసంభవంలో తొలి పదం, కశ్చిత్ అన్నది మేఘసందేశంలో తొలి పదం, వాగ్విశేషః అన్నది రఘువంశంలో తొలిపదమని కేసాప్రగడ వివరించారు. వేదవ్యాసుని కలం నుంచి జాలువారిన శివపురాణాన్ని స్వీయకపోల కల్పనలతో కుమారసంభవంగా, వాల్మీకి రామాయణాన్ని రఘువంశంగా ఆయన మలిచాడని కేసాప్రగడ వివరించారు. రసికత్వం లేనివారికి నా కవిత్వం వినిపించే దౌర్భాగ్యం తనకు పట్టకూడదని కాళిదాసు కోరుకున్నాడని అన్నారు. దక్షయజ్ఞంలో శివుని అర్ధాంగి నిరాదరణకు గురి అవుతుంది, స్త్రీ అత్తింటిలో నిరాదరణకు గురికావడం మాట ఎలా ఉన్నా, పుట్టింటివారు స్త్రీని నిరాదరిస్తే, ఆ కుటుంబం సర్వనాశనమవుతుందని కేసాప్రగడ అన్నారు. శివుడు తపమాచరించిన ప్రదేశంలోనే పార్వతి తపస్సు చేయడం, శివపార్వతుల కల్యాణం తదతర అంశాలను వివరిస్తూ కేసాప్రగడ ఒక్క కుమారసంభవం నుంచి మాత్రమే కాకుండా బిల్హణుడు, శ్రీనాథుడు, భాష్యకారాచార్యులు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, రచించిన పద్యాలను అలవోకగా ఉట్టంకించారు. సభాధ్యక్షుడు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ ఆదిశంకరులు రచించిన ‘గంగాతరంగ రమణీయజటాకలాపం’ శ్లోకానికి నృత్యాభినయం చేశారు. నన్నయ వాజ్ఞయ వేదిక ప్రధాన కార్యదర్శి చింతలపాటి శర్మ కేసాప్రగడ ప్రసంగాన్ని షడ్రసోపేతమైన విందుగా అభివర్ణించారు. సప్పా దుర్గాప్రసాద్ చేతులమీదుగా ప్రధాన వక్త కేసాప్రగడ సత్యనారాయణను సత్కరించారు. నేడు చింతలపాటి శర్మ ప్రసంగం శనివారం రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ ‘మేఘసందేశము–విప్రలంభము’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. -
‘తెలుగు కవిత్వం’లో జోహార్ వైఎస్సార్!
జాతీయ సదస్సులో వైఎస్సార్పై కవితలు వినిపించిన ఆచార్య హరికృష్ణ కడప కల్చరల్(కడప): తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వం, పాలనకు అద్దం పట్టే కవితలను ద్రవిడ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎం.హరికృష్ణ వినిపించారు. 20 మంది ప్రముఖ కవులు డాక్టర్ వైఎస్సార్పై రాసిన కవితలను ఆయన భావయుక్తంగా, భావోద్వేగంతో వివరించారు. వైఎస్సార్ జిల్లా కడపలో సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, యోగి వేమన వర్సిటీతో కలసి ‘70 ఏళ్ల భారత స్వాతంత్య్రం–తెలుగు కవిత్వం’ అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. శనివారం సదస్సు ముగింపు సందర్భంగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్పై పలువురు రాసిన కవితలను ఆచార్య ఎం.హరికృష్ణ వినిపించారు. ‘ప్రజాకాంక్షలతో నేసిన ఖద్దరు బట్టల్లో నిలువెత్తు పావురంలా మా రాజన్న నడుస్తుంటే.., ప్రముఖ కవి శిఖామణి రాసిన ‘ఒక్క సూర్యుడు’ కవితను ఉటంకిస్తూ ‘ఎవరు అలవోకగా అరచేతిని అలా గాలిలోకి ఎత్తి అటూ, ఇటూ సుతారంగా ఊపితే... కవితలు ఆలపించి అలరించారు. -
కవిత్వం ఉద్దేశం మనుషులందరినీ ఏకం చేయడమే
► ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ► ఘనంగా ప్రారంభమైన జాతీయ సదస్సు కడప: ప్రపంచంలోని మనుషులందరినీ ఏకం చేయడమే కవిత్వం ఉద్దేశమని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం స్థానిక బ్రౌన్ గ్రంథాలయంలో 70 ఏళ్ల భారత స్వాతంత్య్రం–తెలుగు కవిత్వం అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. తొలిరోజు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్రానికి ముందు జాతీయోద్యమ కవిత్వం సాగిందని, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రజలు చేస్తున్న పోరాటానికి ఊతం ఇచ్చిందన్నారు. సబాధ్యక్షుడు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం జరిగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిణామాలను కవిత్వం ప్రతిబింబించిందన్నారు. కవిత్వం కన్నా జీవితం ముఖ్యమైనదని, అణిచివేతకు గురైన వారి జీవితాలను ప్రతిబింబించే దిశగా కవిత్వం నిరంతరాయంగా సాగుతోందన్నారు. సభలో కీలకోపన్యాసం చేసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీ సంచాలకులు ఆచార్య యలవర్తి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ సమస్యలున్నంత వరకు కవిత్వం ఉంటుందని, కాలానికి, అవసరానికి అనుగుణంగా రూపాలు, వాదాలు వేరుగా మారినా లక్ష్యం మాత్రం ప్రజాశ్రేయేస్సుగానే సాగిందన్నారు ‘కవి సంధ్య’ ఆవిష్కరణ: విశిష్ట అతిథిగా హాజరైన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు, ప్రముఖ కవి శిఖామణి (కె.సంజీవరావు) సంపాదకత్వంలో వెలువడుతున్న ‘కవి సంధ్య’ ద్వైమాస పత్రికను అతిథులతో ఆవిష్కరింపజేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన వైవీయూ కుల సచివులు ఆచార్య వై.నజీర్ అహ్మద్ సదస్సు ధ్యేయాన్ని వివరించారు. సదస్సు సంచాలకులు, బ్రౌన్ గ్రంథాలయ బాధ్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర్రెడ్డి రెండు రోజుల సదస్సు గురించి వివరించారు. సదస్సులో కవి కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కవి దుబ్బలదాస్, బుక్కసముద్రానికి చెందిన సమీవుల్లా, అంబేడ్కర్ విశ్వవిద్యాలయ సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్.వెంకట కృష్ణారెడ్డి, డాక్టర్ పీసీ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎం.హరికృష్ణ, ద్రవిడ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, వైవీయూకు ఆచార్యలు తప్పెట రాంప్రసాద్రెడ్డి, డాక్టర్ ఎంఎం వినోదిని, డాక్టర్ రమాదేవి, డాక్టర్ పార్వతి, కె.గంగయ్య, డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, డాక్టర్ సంజీవమ్మ, డాక్టర్ టక్కోలు మాచిరెడ్డి, కవి లోసారి సుధాకర్ (డీఎస్పీ), జానమద్ది విజయభాస్కర్, పాలగిరి విశ్వప్రసాద్, కె.చెంచిరెడ్డి, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కవితలు
కవితవెంకన్న ఒక చెట్టని పునుగుపిల్లి తైలం పాముతూ చెప్పింది కాకపోతే శేషాచలం అడవుల్లో ఏడుకొండలమీద పూలతో ఎందుకు అలంకరిస్తారు. ముడుపులు కట్టి అంతదూరం వెళ్లడం కుదరకపోతే పోనీ ముడుపు సొమ్ముతో కొన్ని మొక్కలు కొని నాటు మళ్లీ మళ్లీ ముడుపులు కట్టు మళ్లీ మళ్లీ మొక్కలు నాటు ఒక వనాన్ని పెంచు చెట్ల మధ్య నీ నిజపాదాలు వెదుకుతూ వెంకన్న దిగి వస్తాడు. అప్పుడు వెంకన్న చేతిలో నీ కోసం ముడుపు కట్టి తెచ్చిన మొక్క ఉంటుంది. వర్మ కలిదిండి 9948943337 ఖైదు విరిసే మల్లియలు గాలి రెక్కలపై ఎగిరి నీ వొడి చేరి మళ్లీ పుష్పిస్తాయి. ఆకాశం ఎందుకో నీ చేతుల్లోకి జారి నా కళ్లపైన మిగిలిపోతాది. నీ కౌగిట్లో చీకటి వీస్తున్నప్పుడు శశి నీ నుదుటన. నా దేహం నుండి నీ దేహం వరకూ నన్ను నువ్వు ప్రవహింపజేసుకున్నాక ప్రేమనో... ఖైదునో... ప్రవాహమూ, సమీరమూ నీ చెక్కిళ్లపై వొలుకుతున్నప్పుడు నన్ను నీ చుట్టూ అల్లుకున్న ప్రేమఖైదీని! గుబ్బల శ్రీనివాస్ 09699856777 -
పాత కొత్తల మేలు కలయిక 'మధుపత్రాలు'
కవి సన్నిధానం నరసింహశర్మ కవితాసంపుటి ఆవిష్కరణ రాజమహేంద్రవరం కల్చరల్ : పాత విలువలను కాపాడుకుంటూ, ఆధునిక భావాలకు స్వాగతం పలికిన ‘మధుపత్రాలు’ కవితా సంపుటిని వెలువరించిన కవయిత్రి ఉప్పలూరి శైలజ అభినందనీయురాలని ప్రాణహిత కవి సన్నిధానం నరసింహశర్మ అన్నారు. ఎన్జీఓ హోమ్లో కళాగౌతమి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మధుపత్రాలు కవితా సంపుటి ఆవిష్కరణ సభలో ఆయన పుస్తక సమీక్ష చేశారు. కవితా సంపుటిలో కవయిత్రి అన్ని అంశాలను స్పృశించారని చెప్పారు. అలతి, అలతి పదాలలో అనల్పమైన భావాన్ని కవయిత్రి చెప్పగలిగారని, భావజాలం వ్యక్తీకరణలో ఎక్కడా గందరగోళం లేదని ఆయన ప్రశంసించారు. బహుభాషావేత్త మహీధర రామశాస్త్రి మాట్లాడుతూ ‘కాగితాలు ఎన్నెన్ని పితికితే–కవిత ఒలికేను చుక్కలా’ అన్న జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి కవితను ఉటంకించారు. ‘క’ అంటే కమనీయం, ‘వి’ అంటే విద్వత్, ‘త’ అంటే తాత్వికతని కవితకు ఆయన అర్థం చెప్పారు. కుటుంబం, సమాజం, ఆధ్యాత్మికం అన్నిటిని కవయిత్రి కవితల రూపంలో స్పృశించారని కొనియాడారు. కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ సమాజాన్ని చైతన్య వంతం చేసే అంశాలను కవయిత్రి అక్షరబద్ధం చేశారని తెలిపారు. డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు (పేరవరం) మాట్లాడుతూ కవులు పరమహంసల వంటివారని, చెడును వదిలి, మంచిని స్వీకరిస్తారని చెప్పారు. సాహితీవేత్త చీకటి దివాకర్ (విజయనగరం) సభకు అధ్యక్షత వహించారు. మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ (కాకినాడ), డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ (వరంగల్), కె.నాగేశ్వర్ (హైదరాబాద్) తదితరులు కవయిత్రని అభినందించారు. కవయిత్రి శైలజను ఘనంగా సత్కరించారు. ముళ్ళపూడి శేషుకుమార్ స్వాగత వచనాలు పలికారు. కవయిత్రి భర్త, బ్యాంకు అధికారి యు.వి.పి.ఆర్.కె.ప్రసాద్ స్వాగత వచనాలు పలికారు. సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
టాపర్ పేపర్నిండా సినిమాలు, కవితలు
పట్నా: బిహార్ బోర్డు ఎగ్జామ్లో ఆర్ట్స్ విభాగంలో టాపర్గా నిలిచి వివాదంలో చిక్కిన రూబీ రాయ్ పరీక్ష పేపర్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆమె పరీక్ష పేపర్ నిండా సినిమా పేర్లు కనిపించాయి. పలు కవితలు రాసి ఉన్నాయి. వందకు పైగా ప్రముఖ కవి తులసీ దాస్ పేర్లు దర్శనమిచ్చాయి. అయితే, ఈ ఆన్సర్ షీట్లను పేపర్ వాల్యుయేషన్ చేసే నిపుణులు మార్చారని పోలీసులు చెప్పారు. వేరే చేతి వ్రాతతో రాసిన పేపర్లను రూబీ ఓఎంఆర్ షీటుకు కట్టారని స్పష్టమైనట్లు తెలిపారు. ఈ ఏడాది వెల్లడైన బిహార్ ఇంటర్ బోర్డు పరీక్ష ఫలితాల్లో 17 ఏళ్ల రూబీ రాయ్ ఆర్ట్స్ విభాగంలో టాపర్ గా వచ్చింది. ఆమెను అనూహ్యంగా ఓ మీడియా ఇంటర్వ్యూ చేయడంతో అసలు ఆమెకు సంబంధిత సబ్జెక్టుపై పూర్తిగా అవగాహన లేదని వెల్లడించింది. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు మొత్తం కూపీలాగగా అసలు విషయం బయటకొచ్చింది. అసలు తనకు టాపర్ గా రావాలన్న ఉద్దేశం లేదని, కేవలం పాసయితే చాలు అనుకున్నానని రూబీ చెప్పింది. అనంతరం ఈ వ్యవహారం అంతా కూడా పెద్ద కుంభకోణం అని పోలీసులు గుర్తించి మొత్తం 40 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. -
గురజాడ కార్పెంటర్ దృష్టిలో స్త్రీ
‘ఎ ఉమన్ వెయిట్స్ ఫర్ మి’ కవితలో విట్మన్ స్వప్నించిన మహిళలా ప్రతిమహిళ క్రీడల్లో, వ్యాయామంలో పాల్గొని ఆరోగ్యం, ఆత్మరక్షణ సామర్థ్యం కలిగి ఉండాలనీ, ఐతే ఇటువంటి భావాలు ఒక బానిసలో-స్త్రీలో ఉండటం పురుషులు అంగీకరించలేరనీ అంటారు ఎడ్వర్డ్. స్త్రీవాద సాహిత్యంలో తరచు కన్పించే ‘వంటిల్లు తగలబెట్టడం’ అనే ప్రతీకకు మూలాలు గురజాడ అసంపూర్ణంగా విడిచిపెట్టిన ఒక రచనలో కన్పిస్తాయి. మెడ్రాస్ రెవ్యూ మాసపత్రికలో Edward Carpenter - His life and times శీర్షికతో గురజాడ రచించిన వ్యాసం చదివిన తర్వాత ఈ విషయం స్ఫురించింది. ఇందులో కార్పెంటర్ను టాల్స్టాయ్, విలియం మోరిస్, జాన్ రస్కిన్, వాల్ట్ విట్మన్, షెల్లి వంటి మానవతావాదులు, యుగకర్తల సరసన పేర్కొని ప్రశంసించారు గురజాడ. 1883లో కార్పెంటర్ రచించిన Towards Democracy కూడా ఈ వ్యాసంలో ప్రస్తావించారు. కార్మిక సంఘాలు శక్తివంతంగా పనిచెయ్యాలనీ, రాజకీయ వ్యవస్థలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలనీ, లాభాల కోసం కాక, మానవుల శ్రమను పొదుపుగా వాడుకొని మానవులు సృజనాత్మకంగా జీవించే అవకాశం రావాలనీ, స్త్రీలు సమానహక్కుల కోసం ఉద్యమించాలనీ కార్పెంటర్ ప్రతిపాదించారు. చరిత్రకారులు కార్పెంటర్ను తొలి పర్యావరణ శాస్త్రవేత్తగా, ఫేబియన్ సోషలిస్టుగా అభివర్ణించారు. గురజాడ ప్రస్తావించిన కార్పెంటర్ మరోరచన Love's Coming of Age. కార్పెంటర్ ఈ రచనలో స్త్రీ పురుషుల శృంగార సంబంధాలు, వివాహ వ్యవస్థ, వైవాహిక జీవితం, భవిష్యత్తరాలతో స్త్రీ పురుషులు నిర్వహించబోయే బాధ్యతలను చర్చించారు. మర్యాదస్తులైన స్త్రీలు, ఇంటి చాకిరికి అంకితమైన స్త్రీలు, వేశ్యలు అని స్త్రీలను కార్పెంటర్ మూడు వర్గాలుగా విభజించారు. యమకూపాల్లో అనామకంగా రాలిపోయే స్త్రీలు, ప్రతిరాత్రి శరీరాన్ని అమ్ముకొని స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవించే స్త్రీలు (Free Women) అని వేశ్యలను మళ్లీ రెండువర్గాలు చేశారు. Woman in freedom ప్రకరణంలో పురుషుడితో సమానంగా అన్ని రంగాల్లో వ్యవహరించే స్త్రీలు తమ ఇచ్ఛానుసారం జీవించగలరనీ, కుటుంబాలు సమూహాలుగా ఏర్పడి శ్రమను పంచుకొన్నట్లయితే స్త్రీ కొంత మటుకైనా చాకిరి నుంచి విముక్తి పొందుతుందనీ, స్త్రీలు పురుషుల నీడలోంచి వెలుపలికి వచ్చి స్వతంత్రంగా వ్యవహరించే రోజు సమీపంలోనే ఉందనీ కార్పెంటర్ భవిష్యద్దర్శనం చేశారు. ‘ఎ ఉమన్ వెయిట్స్ ఫర్ మి’ కవితలో వాల్ట్ విట్మన్ స్వప్నించిన మహిళలా ప్రతిమహిళ క్రీడల్లో, వ్యాయామంలో పాల్గొని ఆరోగ్యం, ఆత్మరక్షణ సామర్థ్యం, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలనీ, ఐతే ఇటువంటి భావాలు ఒక బానిసలో-స్త్రీలో ఉండటం పురుషులు అంగీకరించలేరనీ అంటారు. అసలు ఈ లక్షణాలు తమకు సహజమైనవి కాదని స్త్రీలే భావించేంతగా పురుషులు ప్రవర్తించారంటారు కార్పెంటర్. తనకు లభ్యమైన కార్పెంటర్ రచనలన్నీ గురజాడ చదివినట్లనిపిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య అన్నిరంగాల్లో సమానత్వాన్ని ఇద్దరూ కాంక్షించారు. స్త్రీలు ఆటపాటల్లో పాల్గొని తమను తాము కాపాడుకోగల సామర్థ్యం కలిగి ఉండాలని భావించారు. మొదట Love's Coming of Age లోని కొన్ని వాక్యాల అనువాదం: ‘‘ఇంటిచాకిరితో మురిగిపోయే ఇల్లాలి బ్రతుకు బానిస బ్రతుకు. ఆమె శక్తియుక్తులన్నీ ఇల్లు చక్కబెట్టుకోడానికే సరిపోతాయి. ఈ చాకిరిలో ఆమె మరొక రకంగా జీవించడానికి అవసరమైన జ్ఞానం, కాంతి లభించదు. ఇప్పుడు సమాజంలో వస్తున్న సాధారణమైన మార్పులు, సాంఘికమైన మార్పులు స్త్రీ జాతి విముక్తికి దోహదం చేస్తాయి. అత్యాధునిక సౌకర్యాలతో గృహ నిర్మాణం, భుజించడానికి సిద్ధంగా వండిన ఆహార పదార్థాలను అమ్మే విక్రయశాలలు, లాండ్రీలు, ఇతరేతర సౌకర్యాలు ఏర్పడటం, మనం భుజించే ఆహారాన్ని గురించి, గృహోపకరణాలను గురించి ప్రజల ఆలోచనల్లో వచ్చే విప్లవాత్మకమైన మార్పులు స్త్రీల చాకిరిని తగ్గించి వేస్తాయి. అలవాట్లలో స్త్రీలు సంప్రదాయవాదులైనా మార్పులు వస్తే వాటిని స్వీకరిస్తారు.’’ గురజాడ ‘సౌదామిని’ కథానాయికగా చిత్రించిన నవలలో ఒక పాత్రను ‘నేను’ దృష్టికోణం నుంచి రాశారు. కథాస్థలం ఊటి. ‘నేను’ వెంట అతని కవిమిత్రుడు గూడా ఉంటాడు. ‘నేను’ పాత్రను బాలయ్యనాయుడు తన అతిథిగా ఉండమని ఆహ్వానిస్తాడు. ‘నేను’, అతని కవిమిత్రుడు బాలయ్యనాయుడు బంగళాలో అతిథులుగా ఉంటారు. నాయుడికి సౌదామిని అనే అందమైన పెళ్లీడు కుమార్తె ఉంటుంది. ‘నేను’, కవిమిత్రుడు, బాలయ్య నాయుడు కూలాసాగా కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు కవిమిత్రుడంటాడు: స్త్రీలు మేల్కోనాలి, తిరుగుబాటు చెయ్యాలి. మానవ జాతిలో స్త్రీ ఉత్తమమైనది. స్త్రీ బలహీనురాలని మీరనొచ్చు. అది అందరూ అనే మాటే. మనదేశంలో రైతు కుటుంబాల్లో స్త్రీ చాలా దృఢమైనది, ఆమెకు ఎంతో ఓర్పు ఉంది, పురుషుడి కన్నా ఎక్కువ సహనం కలది, నారేత వేస్తుంది, పొలాల్లో ప్రత్తి తీస్తుంది, చింతపండు వొలుస్తుంది, ధాన్యం దంచుతుంది, అన్ని పనుల్లో దాసీగా వ్యవహరిస్తుంది. పై కులాలకు చెందిన మన ఆడవాళ్ల విషయానికొద్దాం. ఆమె నీళ్లు చేదుతుంది, వంట చేస్తుంది, మరెన్నో పనులు చేస్తుంది. దేవుడు చెక్కిన శిల్పాలు వీళ్లు. సున్నితంగా, నాగరీకంగా ఉండే మన ఆడవాళ్లు శారీరకంగా బలహీనులే అని నేను అంగీకరిస్తాను. మృగప్రాయులను ఎదుర్కొనేందుకు ఒక ఆయుధాన్ని ఆమె చేతులో ఉంచుదాం. కత్తియుద్ధం స్త్రీలు మాత్రమే అభ్యాసం చెయ్యాలి. ‘నేను’ (కథ చెప్పే వ్యక్తి): వాళ్లకు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో బాగా తెలుసులేండి! కవి: ఎప్పుడు చతుర్లాడాలో నీకు తెలీదు. పురుషుడు విచక్షణాశక్తి కోల్పోవడం చేత, పురుషుడి క్రూరత్వం చేత స్త్రీలు కత్తిసాము అభ్యసించవలసి వస్తోంది. ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ సాయుధ కావాలి. ఆమె చాకో, రివాల్వరో దగ్గర ఉంచుకొని బయటకు వెళ్లాలి. నేను: చంపడానికి ఆమె కళ్లు చాలని నా ఉద్దేశం.కవి: అవును, సంస్కారులైన వారిని జయించడానికి. మృగప్రాయులను ఎదుర్కోడానికి కృపాణం కావాలి, బుల్లెట్లు కాదు. అప్పుడే క్రూరాత్ముల నుంచి ఆత్మరక్షణ చేసుకోగలదు. స్త్రీ వంటపని చేయడాన్ని నిషేధించాలి. నీకవసరమైన ఆహారం భోజన పదార్థాలమ్మే షాపులో దొరుకుతుంది. ఆహారాన్ని వేడిచేసుకోవడానికి నీవద్ద ఒక సాధనం ఉంటేచాలు. ప్రతివీధిలో అలాంటి షాపొకటి ఉండాలి. కుటుంబ సభ్యులందరూ ఏ బాదరబందీ లేకుండా అక్కడ భోజనం చేయొచ్చు. పెపైచ్చు మానవ శ్రమ ఎంత పొదుపౌతుంది! నేను: పేదవాళ్లు భోజనం కొనుక్కోలేరు!బాలయ్య నాయుడు: అతని ఆదర్శ లోకంలో పేదలే ఉండరు!కవి: ఆదర్శ లోకమా! నేను నిజమైన ఈ లోకాన్ని గురించే మాట్లాడుతున్నా! కవీ, తత్వవేత్తా తమ కాలం కన్నా చాలా ముందుంటారు. కవి ప్రతిపాదనను బాలయ్య నాయుడు ఆమోదిస్తాడు. సౌదామినికి కవి కత్తియుద్ధం, కవిత్వం నేర్పుతాడు. ఒక జమీందారు సౌదామినిని అపహరించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె జమీందార్ను బాకుతో గాయపరిచి, క్షణాల్లో పావురంలా ఇల్లు చేరుకుంటుంది. తర్వాత వివాహవ్యవస్థ పరిమితులను గురించి హీరో పాత్రద్వారా కొంత చర్చ నడిపారు గురజాడ. భర్తలు విడిచిపెట్టిన భార్యలు, భార్యల చేత విడిచిపెట్టబడ్డ భర్తలు స్వీయపోషణలో అసమర్థులైతే అటువంటి వారికోసం ప్రభుత్వమే అనాథాశ్రమాలు పెట్టి సంరక్షణ చేయాలని. ‘‘ఇప్పుడున్న వివాహ వ్యవస్థలో వెసులుబాటు తక్కువ’’ అనే వాక్యంతో గురజాడ నవలను పూర్తిచేయకుండా విడిచిపెట్టారు. స్త్రీ పురుషుల విషయంలో కార్పెంటర్ అభిప్రాయాలన్నిట్నీ గురజాడ ఆమోదించారని చెప్పడంలేదు. ‘కవి’ పాత్ర ద్వారా వ్యక్తం చేసిన అభిప్రాయాలను ‘నేను’, బాలయ్య నాయుడు పాత్రలు పరిహాసం చేస్తాయి. సౌదామిని పాత్రద్వారా స్త్రీలు ఆత్మరక్షణ పద్ధతులు తెలుసుకొని ఉండాలని మాత్రం సూచించారు. వివాహవ్యవస్థకున్న పరిమితులను మరింత సాకల్యంగా తెలుసుకోడానికి గురజాడ ఒంగోలు మునిసుబ్రహ్మణ్యానికి రాసిన లేఖలు ఉపకరిస్తాయి. (కార్పెంటర్ మీద గురజాడ రాసిన ఇంగ్లీషు వ్యాసం రాజాం వెలుగు సంస్థ ప్రచురించిన ‘గురజాడ నూరవ వర్ధంతి సంచికలో అచ్చయింది.) - డాక్టర్ కాళిదాసు పురుష్తోతం drkpurushotham@yahoo.com -
సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం
ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ సత్యానందం విజయవాడ (గాంధీనగర్) : సమాజంలోని సమస్యలను సాహిత్యం, కవితలు, రచనల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలను చైతన్యపరచాలని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ టి.సత్యానందం చెప్పారు. వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన గురువారం వృద్ధుల సమస్యలపై కవితా గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యానందం మాట్లాడుతూ వృద్ధులు తమ జీవితానుభవాలను నేటి తరాలకు అందించి స్ఫూర్తిగా నిలవాలని కోరారు. జీవన వికాసానికి కవితలు దోహదపడతాయన్నారు. ఎక్స్రే సాహితీ, సాహిత్య సంస్థ అధ్యక్షుడు కొల్లూరి, ప్రముఖ రచయిత కాటూరి త్రివిక్రమ్ మాట్లాడుతూ వృద్ధుల విషయంలో బంధువులే రాబంధులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. విలువలు అంతరించిపోతున్నాయని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమ సంఘ కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు, సింహాద్రి వాణి, కె.రవికిరణ్, మీనాకుమారి, గోవిందరాజులు, గురుప్రసాద్ పాల్గొన్నారు. -
కాలాన్ని జయించిన జాషువా
కొత్త కోణం జాషువా ఛందోబద్ధ కవిత్వాన్ని ఎంచుకోవడంలో అభ్యంతరాలున్నాయి. ఆయన కవిత్వ ఉద్దేశం ఆధిపత్య పండితలోకాన్ని తట్టిలేపడం కూడా. ఏ వర్గమైతే తమ పండిత ప్రగ ల్భంతో ఆధిపత్యం చలాయిస్తున్నదో దానిని సవాల్ చేయదల్చుకున్నాడు. ఏ పాండిత్య మైతే ఆధిపత్య కులాలను సాహిత్యం తమ సొంతమని విర్రవీగేలా చేసిందో, అదే పాండి త్యంతో ప్రతిఘటించదల్చుకున్నాడు. అంబేడ్కర్ ఇంగ్లిష్ చదువుతో సాధించిన డిగ్రీలతో ఆధిపత్య సమాజాన్ని ఎదిరించినట్టే జాషువా ఛందోబద్ధ కవిత్వంతో చెడుగుడాడారు. సమ ధర్మంబు వీడి ధనుంజయుడు పంపె / నతనిచే జచ్చె రాధేయుడనెడు ఏల్కు / పుట్టినను చింతకలదు కాబోలు నీకు / నట్లు కాదయ్య! గెలుపు నీదియె కర్ణ! మహాకవి, కవి చక్రవర్తి గుర్రం జాషువా కావ్య ఖండిక ‘భారత వీరుడు’లోని పద్యపంక్తులివి. జాషువా జీవితం, సాహిత్యంపైన వేల పేజీల వ్యాఖ్యానాలు, ప్రశంసలు అచ్చయినవి. అయినా ఏనాటికానాడు జాషువా కొత్తగానే కనిపిస్తాడు. గతాన్ని జీర్ణించుకొని, వర్తమానంలో జీవించి, భవి ష్యత్కు మార్గమేసిన జాషువా సాహిత్యం ఒక సమగ్ర అవలోకనగా కనిపి స్తున్నది. ఆయన సాహిత్యం ఆద్యంతం ఒక తాత్విక చింతనలోసాగింది. ఆయన గబ్బిలంను ఉద్దేశించిన నాగార్జునసాగర్ గలగలలు, వినిపించిన భరత పురుషుల చరితను విప్పిచెప్పిన ఆయన వాదం వివక్ష, అవమానం అసమానతలు లేని సామ్యవాదం. ఇప్పటికి కూడా చాలా మంది కవులలో లేని చారిత్రక దృష్టి జాషువాలో కనిపిస్తుంది. ఈ వ్యాసం మొదట్లో ప్రస్తావించిన పద్యపాదములే అందుకు సాక్ష్యం. సామాజిక న్యాయం గురించి, సమానత్వం గురించి రాసే వాళ్లలో చాలా మంది ఇప్పటికీ పాండ వులదే న్యాయమని వ్యాఖ్యానిస్తుంటారు. కానీ భారతదేశంలోని కుల వ్యవస్థ పుట్టుకను, పరిణామాలను లోతుగా అర్థం చేసుకొని, నేటి తరానికి ఒక శాస్త్రీయ దృష్టిని ఆనాడే అందించాడు జాషువా. అందుకే తన ఖండ కావ్యంలో కర్ణుడిని భారతవీరుడు అన్నాడు. అర్జునుడిని దోషిగా నిలబెట్టాడు. ఆనాటికే కాదు, ఈనాటికీ ఇది సాహసమే. కులం పునాదులను కొల్లగొట్టాలంటే ధర్మ శాస్త్రాల గుట్టును బట్టబయలు చేయాలన్న డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ తాత్వికతకు జాషువా ఆలోచన సరిగ్గా సరితూగుతుంది. అనేక రకాలుగా అవమానాల పాల్జేసి చివరకు కుతంత్రంతో కర్ణుడిని వధించారని కూడా జాషువా ప్రకటించాడంటే ఆయన ఆ రోజుల్లోనే హిందూ ధర్మశాస్త్రాల మీద యుద్ధం ప్రకటించినట్టు అర్థం చేసుకోవాలి. దారిద్య్రం నేర్పిన ధీరత్వం గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. తండ్రి వీరయ్య, తల్లి లింగమాంబ. తండ్రి యాదవ కులం వారైతే, తల్లి మాదిగ కులం. ఇరు కుటుంబాలు వారిని వెలివే శాయి. వీరయ్య క్రైస్తవంలో చేరి, పాస్టర్గా జీవనం సాగించారు. వీరయ్య జీవితం మాదిగ జీవన విధానంతోనే ముడిపడి ఉన్నది. అందుకే జాషువా తన పుట్టుకను, పెంపకాన్ని కలిపి ఒక చైతన్యాన్ని అందిపుచ్చుకున్నాడు. జాషువా తల్లి దండ్రులే ఈ సమాజం మీద ప్రతిఘటన జెండా ఎత్తారు. సరిగ్గా ఇక్కడే ఇటీవల హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో బలిదానం చేసుకున్న వేముల రోహిత్ గుర్తుకొస్తాడు. గుర్రం జాషువా తండ్రి యాదవ కులానికి చెందిన ప్పటికీ తాను తన తల్లి జీవితాన్నీ, తండ్రి చైతన్యాన్నీ అందిపుచ్చుకొని అంట రానివానిగా ప్రకటించుకున్నారు. రోహిత్ వేముల తండ్రి వడ్డెర కులస్తుడైన ప్పటికీ తాను తన తల్లి కులంలో తన అస్థిత్వాన్ని వెతుక్కొని వివక్షాపూరిత సమాజంపై ధిక్కారస్వరమయ్యాడు. జాషువా ఈ భూమి మీదకి అడుగు పెట్టేనాటికి తన చుట్టూరా ఒక సామాజిక చైతన్య వాతావరణం ఉన్నది. ‘‘తినడానికి పిడికెడు అన్నం లేదు, ఊగడానికి తూగుటుయ్యాల లేదు, నాన్న గారు దారిద్య్రాన్ని, సాంఘిక అసమానతను పట్టుకొని పుట్టారు. దారిద్య్రం లోని రుచిని, సాంఘిక పుటసమానతలోని అవమానాన్నియనుభవిస్తూ వచ్చిన మనిషి, నిరాశతో, నిస్పృహతో కృంగి, కృశించి, నశించి పోగల అవ కాశం ఉంది. కానీ ఇక్కడే మనిషి వ్యక్తిత్వం, ధీరత్వం దాగి ఉంది. నాన్నగారి వ్యక్తిత్వం, ధీరత్వం ఇక్కడే అవగాహన అయింది’’ అంటూ ఆయన కూతురు హేమలతా లవణం అన్న మాటలు జాషువా గుండె ధైర్యాన్ని గుర్తుకు తెప్పిస్తాయి. ఈ చైతన్యం, కసి జీవితానుభవం నుంచే వచ్చాయి. కుల అణచి వేతతోపాటు, పేదరికాన్ని జమిలిగా అనుభవించిన వారు జాషువా. పండుగ నాడు పిండివంటలు తినడం పిల్లలకు గొప్ప అనుభూతి. కానీ ఇంట్లో వాటికి కరువు. ఒక అమ్మాయి తినుబండారాలు తీసుకెళ్తుంటే కిందపడ్డ వాటిని తీసుకొని తన తమ్ముడు ఇస్రాయెల్కు ఇస్తాడు జాషువా. ఆయనే స్వయంగా తాను రాసిన ‘స్వప్న’లో ‘‘పేదరికం పెద్ద వింత విద్యాశాల దానిలోన లజ్జ కనపడదు’’ అని రాయడంలో జాషువా అనుభవించిన ఆకలి బాధ ప్రతిబిం బిస్తుంది. జాషువా ‘‘జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాకు గురువులు ఇద్దరు. పేదరికం, కులభేదం. ఒకటి సహనాన్ని నేర్పితే, మరొకటి నాలో ఎదిరించే శక్తిని పెంచింది, కానీ బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్య్రాన్ని, కుల భేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలిచాను. వాటిపై కత్తిగట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం’’ అంటూ సమాజంలోని అంతరాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. విశ్వనరుడను నేను అంటూ రాసిన పద్యంలో ‘‘నేను కులాల చట్రంలో ఇమడను, అవేవీ నన్ను బంధించలేవు’’ అంటూ తన నిరసనను తెలియజేయడం మాత్రమే కాదు, తాను ఒక ఉన్నతమైన విశ్వ మానవుణ్ణి అని ప్రకటించుకున్నారు. కుల మతాల గీచుకొన్న గీతలజొచ్చు/పంజరాన గట్టుపడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు/తరుగులేదు విశ్వనరుడనేను అని కవితా గర్జన చేశారాయన. కులం అసమానతలపై పోరు గుర్రం జాషువా కుల అసమానతలపై, అంటరానితనంపై విసిరిన పద్యాల ఈటెలు కుల వ్యవస్థ పునాదులను పెకిలించాయి. బ్రహ్మదేవుడికి నలుగురు కుమారులు పుట్టెనని చెప్పిన ధర్మశాస్త్రాన్ని, అయిదో కొడుకు అంటరానివాడై ఎలా పుట్టాడని ప్రశ్నిస్తారు. దేవాలయంలో పూజలు, అర్చనలు చేస్తున్న వాళ్లు సాటి మనిషిని కులం పేరుతో హింసిస్తున్న వైనాన్ని కూడా ప్రశ్నించారు. అదే విధంగా వానినుద్ధరించు భగవంతుడేలేడు./మనుజుడెట్లు వాని కనికరించు వాడుజేసుకొన్న పాపకారణమేమొ/యింతవరకు వాని కెరకలేదు. అంటూ అంటరానితనానికి కారణం ఏమిటో తెలియదంటూ మిలియన్ డాలర్ల ప్రశ్నని సమాజంపై సంధించారు. కనపడలేదు దైవతం కాని పదార్థం భారతంబునన్/గనుపడలేదు వర్ణము కన్న పిశాచము భారతంబునన్ / కనుపడలేదు సత్కులం కన్న మహా కళం కము భారతంబునన్/గనుపడలేదు పంచముని కన్నన్ నీఛపు జంతు వేది యున్ అంటూ అంటరాని కులాలు అనుభవిస్తున్న దీనస్థితిని తెలియజేస్తూ ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అంటూ చేసిన గీతోపదే శాన్ని తన తాత్విక చింతనతో తిప్పి కొట్టారు. ధర్మసంస్థానార్థంబు ధరణి మీద /నవతరించెదననే నబ్సభవుని తండ్రి / మునుపు జన్మించి నెత్తినకెత్తినది లేదు /నేడు జన్మింపకున్న మునిగినదీ లేదు.’ అంటూ గీతాసారాన్ని నిస్సారం చేసి పడేశారు. అదే సమయంలో ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గబళించి దేహమున్ /బిప్పి యొనర్చి నీ భరత వీరుని పాదం కందకుండగా జెప్పులుకుట్టి జీవనం సేయును గాని నిరాకరింపే లే/దెప్పుడు నప్పుపడ్డది సుమీ భారతావని వీని సేవకున్ అంటూ దోపిడీ సమాజంపై కవితా కత్తులు ఝుళిపించాడు. అంటరాని కులాల శ్రమతో వారి నైపుణ్యంతో తయారు చేసిన ఎన్నో వస్తువులను ముఖ్యంగా, కాలికి ముల్లంటకుండా వాడే చెప్పు లను కుట్టించి ఇచ్చిన వాడు కూటికీ కులానికీ తక్కువై మనిషికన్నా హీనంగా బతకడాన్ని జాషువా సవాల్ చేశారు. హిందూమతం స్త్రీలను అణచివేసిన విధానాన్ని కూడా ఆయన సహించలేకపోయాడు. అంటరాని కులాలతోపాటు మహిళలు కూడా ఏవిధంగా హిందూ మతం చట్రంలో బందీలైపోయారో వివరించారు. కొట్టుటకు, తిట్టుటకు నొక /పట్టా జన్మించినట్లు భావించి వెతల్ బెట్టితి నిల్లాలిని నా /పెట్టు శ్రమలనోర్చె సతియు విధియనుకొనుచున్ అంటూ స్త్రీలపై మగవారి అధికారాన్ని నిర్ద్వంద్వంగా నిరసించాడు. అరవై యేండ్లు దాటినా తల్లి ప్రేమ తరగనిదని, తల్లి తన బిడ్డలపైన ఉన్న మమ కారానికి ఈ లోకంలో సాటిలేదని అమ్మ ప్రేమకు అగ్రతాంబూలం ఇచ్చారు. అబలలని పేరుపెట్టి మహిళలను అణచివేస్తున్నారని చెపుతూ ‘అబలయన్న బిరుదమంటించి కాంతల / స్వీయ శక్తులదిమి చిదిమినారు / సబలయన్న బిరుదు సాధించి హక్కులు /గడ న చేసి కొమ్ము కష్ట చరిత.’ అని హక్కుల సాధనకు నారీలోకం నడుం బిగించాలని పిలుపునిచ్చాడు. ఆయన లక్ష్యం సామాన్యుడే గుర్రం జాషువా తన జీవితం మొత్తాన్ని సాహితీ ఉద్యమానికి అంకితం చేశాడు. కొద్దిమందికి కొన్ని సందేహాలున్నాయి. ఆయన ఛందోబద్ధ కవి త్వాన్ని ఎంచుకోవడంలో అభ్యంతరాలున్నాయి. కానీ ఆయన లక్ష్యం సామా న్యుడే. అయితే అంతకుమించి ఆయన తన కవిత్వ ఉద్దేశం ఆధిపత్య పాండి త్యలోకాన్ని తట్టిలేపడం కూడా. ఏ వర్గమైతే తమ పండిత ప్రగల్భంతో ఆధిపత్యం చలాయిస్తున్నదో దానిని సవాల్ చేయదల్చుకున్నాడు. ఏ పాండి త్యమైతే ఆధిపత్య కులాలను సాహిత్యం తమ సొంతమని విర్రవీగేలా చేసిందో, అదే పాండిత్యంతో జాషువా ప్రతిఘటించదల్చుకున్నాడు. బాబా సాహెబ్ అంబేడ్కర్ తన ఇంగ్లిష్ చదువు ద్వారా సాధించిన ఎన్నో డిగ్రీలతో ఆధిపత్య సమాజాన్ని ఎదిరించినట్టే జాషువా ఛందోబద్ధ కవిత్వంతో చెడుగు డాడారు. అందుకే జాషువాను ఆధిపత్య కులాలలోని ప్రజాస్వామికవాదులే ఎక్కువగా గుర్తించి గౌరవించారు. ఒకరకంగా ఆ రోజు జాషువా సాగించిన సాహితీ పోరాటం సరైనదే. కుల సమాజం కొనసాగడానికి, వివక్ష సమసి పోవడానికి, అంటరాని కులాలు కారణం కాదు. అందుకు ఆధిపత్య కులాలదే బాధ్యత. అందుకే జాషువా ఆ మార్గాన్ని ఎన్నుకొని అలుపెరుగని పోరా టాన్ని సాగించారు. అంటరాని కులాల విముక్తి కోసం అహరహం శ్రమించిన జాషువా సాహిత్యం, జీవితం స్ఫూర్తిదాయకాలే. (సెప్టెంబర్ 28న జాషువ జయంతి సందర్భంగా) మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
కవితలు
రాత్రి నేను నా పనిలో నిండా మునిగిపోయి ఉన్నప్పుడు వెలుతురునెవరో దొంగిలించారు పాపం చిల్లుల సంచీతో వచ్చినట్టున్నారు దారంతా నక్షత్రాలు వెంకటేష్ 8121533112 కర్ఫ్యూలోయ మనుషుల జాడ లేక కోయిలలు స్పృహ కోల్పోతున్నాయి ఆకలి తీర్చే చేతుల కోసం పావురాలు ప్రార్థనా మందిరాల్ని వెదుకుతున్నాయి ముఖాల్ని పెద్దవి చేసుకుని కుక్కలు నిర్మానుష్యమైన వీధుల కేసి చూస్తున్నాయి వనాలూ వేదనతో కుమిలిపోతున్నాయి విర పూసేందుకు పూలు మొరాయిస్తున్నాయి కొమ్మల చుట్టూ మృత్యువులాంటి నిరాశ ఆవహించింది మౌనాన్ని మంత్రించేందుకు నిరాకరిస్తూ ఆర్ద్రమైన గాలి వెనుతిరుగుతోంది ఎంత భయంకరంగా వుంది ఈ సమాధి చెంత నిశ్శబ్దం! మూలం: నజ్రత్ బజాజ్ తెలుగు: బొబ్బిలి శ్రీధరరావు 7660001271 గుర్తున్నంత వరకు ముఖానికింత నిమ్మాకు ముద్దని అద్దిన నల్ల జినపరాయి అకస్మాత్తుగా నెత్తుటి వమనంతో తడిసి ఎర్రబడింది ఆ పొద్దున్నే ముదురు వెదురు బద్దలు మందార మొక్కలాంటి పాటని సాగనంపడం ఊహించని వాళ్లొకవైపు సన్నగా పారే ఏరొకవైపు నోరు లేని చోట నిజానిది సుప్తావస్థ కొన్ని చీలికలున్న నాలుకలు తెరచాటు మాటని తలకెత్తుకున్నాయి వీధి ఇప్పుడు ధ్వంసం కాని దృశ్యానికి ముఖద్వారమయింది నిశ్శబ్దం చెరచబడ్డాక చితికిపోయిన అద్దం లాంటి కాలం బోడికొండ మీదకు విసిరి వేయబడింది. పాయల మురళీకృష్ణ 9441026977 -
కవిత్వం సామాజిక అంశాల దర్పణం
విజయవాడ కల్చరల్ : కవిత్వం సామాజిక అంశాల దర్పణమని మంత్రి పల్లెరఘనాథరెడ్డి అన్నారు. పుష్కరాల సందర్భంగా తెలుగు రక్షణ వేదిక , భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఐఎంఏ హాల్లో సోమవారం ఉదయం కవి సమ్మేళనం నిర్వహించింది. వర్ధమాన, ప్రముఖ కవులు కవయిత్రుల కవిత్వ పఠనం అలరించింది. మంత్రి మాట్లాడుతూ కవిత్వంలో సామాజిక అంశాలు కనిపించినప్పుడే అది సజీవంగా ఉంటుందని అన్నారు. ఏ రాష్ట్రంలో కవులకు కళాకారులకు గౌరవం ఉంటుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు పొల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ నూతన రాజధానిలో కవులను ప్రోత్సహించటానికి తెలుగు రక్షణ వేదిక అనేక కార్యక్రమాలు చేపట్టిందని,అందులో భాగంగా కవులకు పుష్కర పురస్కారం అందిస్తున్నామని విరించారు. రంగస్థల నటుడు గుమ్మడి గోపాల తెలుగు రక్షణవేదిక లక్ష్యాలను వివరించారు. డిప్యూటీ కలెక్టర్ సూర్యకళ, లయోల కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గుమ్మా సాంబశివరావు, సీనియర్ జర్నలిస్ట్, రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యుడు సిహెచ్.వి.ఎన్.శర్మ, పాలపర్తి శ్యామలానందప్రసాద్, సుధారాణి, మందారపు హైమావతి, వలివేటి శివరామకృష్ణతో పాటు పలువురు కవులు, కవయిత్రులు కవిసమ్మేళనంలో పాల్గొన్నారు.మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ, రమ్యభారతి సంపాదకుడు చలపాక ప్రకాష్లు పర్యవేక్షించారు. -
‘తొలిపొద్దు’లో జోగు అంజయ్య కవితలు
జనగామ : పట్టణానికి చెందిన కవి, జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు జోగు అంజయ్యకు అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వం భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘తొలిపొద్దు’ శీర్షికన 442 మంది కవుల కవితలను పుస్తకరూపంగా ప్రచురించారు. కాగా, ఇందులో ‘ముఖారవిందం’ పేరిట జోగు అంజయ్య రచించిన కవిత్వానికి సైతం చోటు లభించింది. తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది.. అనే కోణంలో ఆయన ఈ కవిత్వాన్ని రాయడం గమనార్హం. -
తెలంగాణ రత్న అవార్డు గ్రహీతకు సన్మానం
లక్సెట్టిపేట : తెలంగాణ రత్న అవార్డు గ్రహీత రెడ్డిమల్ల ప్రకాశంను పట్టణ మాలమహానాడు సభ్యులు ఆదివారం స్థానిక మహాలక్ష్మివాడలో ఘనంగా సన్మానించారు. సాహిత్యం, సామాజిక సేవలందించినందుకు ప్రకాశంకు తెలంగాణ రత్న ఆవార్డు లభించిందన్నారు. మండలంలోని జెండావెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపా«ధ్యాయుడిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ అవార్డు రావడం పట్ల పలువురు ఆనందం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గరిసె రవీందర్, మల్లేష్, రాజయ్య, పోచమల్లు, సత్తయ్య, బాపు, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
కవిత్వానికి సామాజిక ప్రయోజనం ముఖ్యం
విజయవాడ కల్చరల్ : కవిత్వానికి సామాజిక ప్రయోజనం ముఖ్యమని ప్రజాసాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు పేర్కొన్నారు. మల్లెతీగ, ఆం్ర«ధ ఆర్ట్స్ అకాడమీ సంస్థల సంయుక్తాధ్వర్యంలో స్థానిక శిఖామణి సెంటర్లోని చండ్రరాజేశ్వరరావు గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం ఎరుకలపూడి గోపీనాధరావు రచించిన వచన కవిత జాగృతి, పద్యసంపుటి, నానీల పుస్తకం నానీల వాణి పుస్తకాలను ఆవిష్కరించారు. రవిబాబు మాట్లాడుతూ గోపీనాధరావు కవిత్వం సామాజిక సృహకలిగివుంటుందని అన్నారు. తెలుగు అధ్యాపకుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ, కవిగా గోపీనాథ రావు పూర్తిగా సఫలం అయ్యారని, ఎంచుకున్న అంశాలలో ఏమాత్రం రాజీపడలేదని వివరించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్. స.శ్రీ, సీహెచ్ బృందావనరావు, డాక్టర్ కె.ఎస్.రామారావు, కోటజ్యోతి ప్రసంగించారు. మల్లెతీగ సాహిత్యవేదిక అధ్యక్షుడు కలిమిశ్రీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. -
కవిత
లెక్క కూడికలతో మొదలయినా జమాఖర్చుల తీసివేతలు నిర్దయ రాగానురాగాల భాగహారాలు విజయాల హెచ్చవేతలు పరాజయాల స్క్వేర్ రూట్లు అనుభవాలు జ్ఞాపకాల శేషాలతో అనంతంగా సాగిపోతున్న లెక్కకు డెసిమల్ మిస్టేక్తో శూన్య శేషం. బతుకు మొత్తం ఒక లెక్కే లెక్కచేయలేకపోతే ఎక్కేందుకు శిఖరాలు కూర్చునేందుకు సింహాసనాలు కనపడవేమో... కొడవటి ప్రవీణ్కుమార్ 9000929300 ఆకలి పూటపూటకూ పలకరించే అతిథి! ఆకలి చీకటికి అర్పించిన పరువు! కొత్తపల్లి సురేశ్ (అక్షరమాలి) 9493832470 ఎవరు... ఎవరి యొక్క... కిసుక్కున నవ్వింది చేతులు పిసుక్కునుడు జరుగుతుంది పుసుక్కున స్పర్శ తగిలింది నిష్కర్షగా పెయ్యి మొద్దుబారుతుంది కీసు అన్నది రసం తీసిన చెరుకులా పీసు పీసు అవుతుంది కాలనైతే కాలింది చెయ్యి పట్టుకోను పచ్చనాకు లేదు అయ్యొయ్యో! పసికుక్కకూన కుయ్యోమొర్రో మొత్తుకునుడైతుంది గడుసు పడుచులా సూకగా కాలం నూక్కపోతుంది చీకటిలో దేవులాడుడు వెలుతురులో తరుముడు కలుపు తలుపులు తీయాల్సినప్పుడు తొంగి కిటికిలోంచి లొంగి చూసుడు మంచె కంచె కలగల్సి జంట పంటను మంట పెడుతుంది చూపు రూపు దిద్దుకోకముందే ఆకారాన్ని గద్ద ఎత్తుకపోతుంది పంచుకోను రాదు ఎంచుకునేది లేదు జీవితమో వయస్సో కిసుక్కున నవ్వింది చేతులు పిసుక్కు సచ్చుడవుతుంది నాలికె సందున ముల్లు తియ్యలేము మొయ్యలేము పొందినది అందినది బుగులు జిందగీ అంతా పరుసుకునేంత కప్పుకునేంత దిగులు ఆడికాడికి మొగ్గులేని బతుకు పూర్తి నిమానిమాల్ నివద్దే పొయ్యేంత పొద్దువుంది ఉండమని మోచెయ్యి పట్టు జూకంటి జగన్నాథం -
కవితలు
సెగ పాగా నిప్పుల పరుపు మీద విద్యుద్దిండు వేసుకుని శరీరాగ్ని సేద ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు పగులుతున్న పర్వతాలు దూసుకుపోతున్న బస్సులో పేలుతున్న మందిపాతరలు ఎండిన బావి వద్ద భూమ్యాకాశాల సిగపట్లు గూడులేని వారి రక్తమాంసాల గుడ్డట్టును లొట్టలేసుకుని తింటున్న రోడ్డుపక్క అస్పృశ్యత పాటించని అనలానిలం పక్షులో మనుషులో ఏమైతేనేం, ఎవరైతేనేం ఊపిరాగిన తర్వాత మంటల కొమ్మలతో గాలిని కావలించుకుంటున్న ప్రకృతి సెగపాగా దులిపి ముఖం తుడుచుకుంటున్న బతుకు బాటసారి నిజం 9848351806 అమృతవర్షిణి దుఃఖం ఒక ఉపద్రవం ఆస్వాదించే క్షణం వీణతంత్రుల నిక్వాణం దుఃఖం లిప్తకాల కాలకూట గరళం ఆస్వాదించే క్షణం మృత్యుసౌందర్య వీక్షణం - సూరేపల్లి మనోహర్ జీవన దృశ్యరంగం కనుపాపలపై పరుచుకున్న నిద్రను నోట కరుచుకున్న కల వాస్తవిక జీవన దృశ్యాన్ని ఆవిష్కరించింది హృదయపు గదిలో నింపుకున్న ఊపిరిని సప్తస్వరాలుగా మలుచుకున్న లబ్డబ్ సరికొత్త జీవన రాగాన్ని పలికించింది కలలు కనడం సహజం కన్న కలలోంచి కొత్త ఊపిరి అందుకోవడం అంతే సహజం ఊపిరందుకుని ఉరకలెత్తడం సహజం ఉరకలెత్తే ఊపిరితో సరికొత్త కలలు కనడం అంతే సహజం కోడం పవన్కుమార్, 9848992825 -
దర్పణం
ఒకడు కుంభాకారపుటద్దంలో నిలువునా సాగిపోతాడు ఇంకొకడు పుటాకార దర్పణంలో కుంచించుకు పోతాడు మరొకడు మామూలు అద్దంలో కుడి ఎడమలవుతాడు అసలు సిసలు అంతర్దర్పణమొకటి అందరిలోనూ దాగివుంటుంది అందులో చూస్తేనే అసలు రూపమేదో స్పష్టమవుతుంది - పక్కి రవీంద్రనాథ్ 9440364486 దేహమొకరహస్య బిలం 1 ఏ అపూర్వ రహస్యాన్ని ఛేదించడానికి లోకం కడలిపైన ఈ దేహనావతో యాత్రిస్తున్నావు అంతు చిక్కని ఒక రహస్యమేదో నీ నావ లోలోపలే తిరుగుతున్నదని తెలుసా నీకు 2 ఇవాళ జీవకళతో మెరిసిపోయే ఈ నావని పూల తీగల్లా అల్లుకున్న నీ రక్త సంబంధాలు నీ స్నేహ సంబంధాలు ఎవరికి తెలుసు- కొద్ది ప్రయాణంలోనే ఈ నావ కళ తప్పి ఏ తుఫాను తాకిడికో ఛిద్రమయాక, ఆగంతకుడిలా చొరబడిన అకాల మృత్యువు రహస్యం తెలుసుకుంటావని ప్రతిరోజూ నీ యాత్రను దేహానికి నమస్కరించి ప్రారంభించు లోపలి రహస్యగీతాన్ని ఆలపిస్తూ ప్రారంభించు - కోడూరి విజయకుమార్ 8330954074 చిన్న కవిత తారలు నీలి దుప్పటికి ఒళ్లంతా కళ్లే కన్ను రాలినా కనబడని గాయం నందిరాజు శ్రీనివాస్ 8886663935 -
కవితలు
దుశ్శాసనుడు దొరుకుతాడా ఎన్ని దారుల్ని వడపోసినా మరెన్ని నేలల్ని పొరలు పొరలుగా విప్పి విదిలించినా ఒలి ఒలినీ నువ్వు గాలించినా పేళ్ళు పేళ్ళుగా నరికి చరిత్రను వెతికినా సర్రున ఎగిరి ఏ గువ్వా రాదు. పుస్తకం తన పేజీల్ని తాను చదవదు. బియ్యంలో రాళ్ళేరినట్టు అక్షరాల పుచ్చుల్ని ఏరదు. మిన్ను విరిగి మీద పడినా కన్ను వెనక్కి తిరిగి కనుపాపలోకి నడవదు. చూపునూ వాపునూ తాకదు. నదులయినా కాలవలయినా పాలిపోయిన చర్మం లోతుల్నుంచి పొడుచుకొచ్చే పుళ్ళను కడుక్కోవు. తుప్పు పట్టిన తాళం భళ్ళున తెరుచుకోదు. ఇప్పుడు చెప్పు నీలోనే పదిలంగా నిదురించే దుశ్శాసనుడు ఎప్పటికయినా పట్టుబడతాడా. రాముడికి పడవకట్టే గుహుడు రావణుడి కవాతులో కాలు కలుపుతాడా. ఎక్కడయినా చీకటిని చీకటే తగలబెడుతుందా. నీ కొమ్మల్ని కుంగదీసిన బూజుమబ్బుల్ని ఎవరు దులపాలి. నీ కెరటాల్ని కత్తిరించే చేతుల్ని ఎట్లా పసిగట్టాలి. కొండకివతలే మడుగులో కూరుకుపోయిన నిన్ను బయటికెవరు లాగాలి. జి.లక్ష్మీనరసయ్య 9246572073 నిద్రబోయిన కల! నిర్దేశించిన రంగులతో ప్రపంచాన్ని గీస్తామో రంగులు తీసిన ప్రపంచాన్నే చూస్తామో వాస్తవానికి ఓ ఇష్టపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతాము ఖాళీ అయిన గుండెకి ఘనపరిమాణం పెరిగినట్లుంది ఆకళింపూ, అవలోకనాలలో ఆరితేరినతనాన్ని ఘటనలన్నీ నిరూపిస్తాయి ఏ విశేషమూ జరగని నిన్నటి ఒకరోజు అద్భుతమై ఆశ్చర్యంగా తృప్తిని మిగులుస్తుంది మూసుకున్న కళ్లు తెరవబడి ఓ స్వప్నం మాత్రం నిదురబోతోంది మెలకువలో జీవించడం ఎంత బాగుంటుంది!? అస్పరాగస్ అందమూ కాదు కుదురుగా ఒదిగిన కార్నేషన్ మిస్ట్ అలంకారమూ కాదు గుచ్ఛమై జీవితానికి బహూకరించిన విధం బాగుంటుంది రాళ్ళబండి శశిశ్రీ 7032288256 కితాబు చేనుని తీసుకొచ్చి కాగితమ్మీద పెట్టాను అక్షరాలుగా మొక్కల్ని భగ్నపరచకుండా- ఎవరో ఒకతను ఎక్కడో ఆ అక్షరాల్ని దర్శించి నన్ను మాటల పెట్టెలోంచి అడిగాడు ‘‘మీరు రైతులా?’’ అని- ఆ ప్రశ్నను మించిన ప్రశంస ఇంకేముంటుందని- మట్టికి దండం పెడుతూ నేను చేనులా బదులిచ్చాను దర్భశయనం శ్రీనివాసాచార్య 9440419039 -
కవిత్వంతో తొలి ములాఖాత్
ఒక్క కవితతో, ఒక్క పదబంధంతో, ఒక్క అభివ్యక్తితో నన్ను జీవితాంతం ప్రభావితం చేసిన వాళ్లున్నారు. వందలాది కవితలు రాసీ ప్రభావితం చేయని వాళ్లూ ఉన్నారు. ఒకానొక మానసిక స్థితిలో అత్యద్భుతం అనిపించిన కవితే మరొక మానసిక స్థితిలో ఎందుకూ కొరగానిదనిపించిన సందర్భమూ ఉంది. ఒక వయసులో, ఒక ఉద్వేగంలో అభిమాన కవులైనవాళ్లే ఇతరేతర విషయాల తెలివిడి వల్ల తమ స్థాయిని పోగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. పూర్తిగా ఇటునుంచి అటు అయిన సందర్భాలూ ఉన్నాయి. ‘‘మన కాలపు కవికి ఏకాంతమూ సమూహమూ రెండూ ప్రాథమిక విధులుగానే ఉన్నాయి’’ అని నాకు అత్యంత ఆప్తుడైన చిలీ మహాకవి పాబ్లో నెరూడా అన్న మాటలను అక్షరాలా నమ్ముతాను. ‘‘సామాజిక కవిత్వా’’నికీ, ‘‘ఆత్మాశ్రయ కవిత్వా’’నికీ విభజన రేఖ సున్నితమైనదో, ఊహాత్మకమైనదో అనుకుంటాను. సామూహికతలో భాగం కాని ఏకాంతం లేదనీ, ఏకాంతం లోకి చొచ్చుకురాని సామూహికత లేదనీ కూడా నా విశ్వాసం. కనుక ఆ రెండు ముద్రలు పడిన కవిత్వమూ నాకు నచ్చుతుంది. పన్నెండు సంవత్సరాల కింద వెలువడిన నా కవితా సంపుటం ‘పావురం’కు నేను రాసుకున్న ముందుమాట లోంచి... ‘‘కవిత్వం నా కన్నతల్లి. కవిత్వం నా తొలి పావురం. కవిత్వం అంటే భావప్రకటనో, ఆగ్రహ వ్యక్తీకరణో, పద విన్యాసమో, పశ్చాత్తాపమో, ఉద్వేగ ఉధృతో, ప్రశాంత పునరావలోకనమో, ఒత్తిడి నుంచి ఉపశమనమో, ఆనందోత్సాహమో, వెళ్లగక్కడమో... ఎన్ని నిర్వచనాలున్నాయో, అవి ఎప్పుడెప్పుడు ఎంతెంత నిజమో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా నా పావురాన్నో, పావురం కొరతనో మననం చేసుకున్నప్పుడల్లా అది ఇట్లా వెలువడిందని మాత్రమే... లోకానికీ నాకూ పావురం ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడ కవిత్వానికీ నాకూ పావురం కుదిరింది...’’ మనిషికి మొట్టమొదటి పావురం తల్లి అయితే బహుశా ఆ తర్వాతి పావురం శబ్దం మీద కావచ్చు. తనను ఆడించేవాళ్లు శబ్దం చేస్తారు. తన చుట్టూ ఉన్నవాళ్లు వాళ్లలో వాళ్లు శబ్దాలు చేసుకుంటారు. తనతో శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తారు. తాను శబ్దం చేస్తే తనవైపు చూస్తారు. కవిత్వమూ శబ్దమయ ప్రపంచమే గనుక కవిత్వం బాల్య సహజమైన, మానవ సహజమైన, సహజాతమైన ప్రవృత్తి కావచ్చు. కవిత్వంతో నా తొలి ములాఖాత్ శబ్దమే. మా బాపు గొంతెత్తి మంత్రాలు చదివేవాడు. నాకు ఊహ తెలిసేటప్పటికే ‘నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే’ అని ఆయన చదువుతుండిన విష్ణు సహస్ర నామాల శ్లోకంలోని సహస్ర పాదాక్షి శిరోరు బాహవే అనే మాటల లయ మీద ఆసక్తి కలిగింది. ఆ తర్వాత బహుశా ఐదారేళ్ల వయసులో మేం బమ్మెర పోతన వంశీకులమని చెపుతూ, వంశవృక్షం చూపుతూ పోతన పద్యాల మీద ఆసక్తి కలిగించి, ఆ పద్యాలు చదువుతుంటే, ముఖ్యంగా మమ్మల్ని నిద్ర పుచ్చడానికి ‘నారాయణ కవచం’ చదువుతుంటే ఆ లయకు, ప్రతి పద్యం చివరా ‘గాచు గావుతన్’ లాంటి పునరుక్తికీ ఒక వింతలోకంలోకి ప్రవేశిస్తున్నట్టుండేది. అర్థం తెలియకుండానే కేవలం శబ్దం వల్ల కవిత్వంతో కలిసిన మైత్రి అది. ఇప్పటికీ లయబద్ధమైన కవిత్వం మీద ప్రేమ ఉండడం అందుకే కావచ్చు. వచన కవిత్వంలో కూడా యూఫనీ అవసరమని, చదవడంలో కూడా లయబద్ధమైన తూగు పాటించాలని అనుకోవడం అందుకే కావచ్చు. కవిత్వంలో శబ్దశక్తికి ఒక గీటురాయి ఉంది. పద సంయోజనం సరిగ్గా కుదిరిందా లేదా పైకి గొంతెత్తి చదువుకుంటే తెలుస్తుంది. అది మాత్రాఛందస్సు కూడ కానక్కరలేదు. పూర్తిగా వచన కవిత- వర్స్ లిబర్- స్వచ్ఛంద కవిత కావచ్చు. కాని విభిన్న పర్యాయపదాల నుంచి, వేరు వేరు తూకాల సమానార్థక పదాల నుంచి కవి ఏ పదం ఎందుకు ఎంచుకుంటున్నారు, ఆ పదానికీ ముందు వెనుకల పదాలకూ సంయోజనం సరిగా కుదిరిందా లేదా అనేది గొంతెత్తి చదివినప్పుడు, చదువుకున్నప్పుడు తెలుస్తుంది. శ్లోకాలలోని, గణబద్ధ పద్యాలలోని శబ్దంతో ప్రారంభమైన నా ములాఖాత్ ఆ తర్వాత ‘సృజన’ సాహితీ మిత్రులలో కవిత్వం పైకి చదివి వినిపించే బాధ్యతవల్ల మరింత గాఢమైంది. ప్రతినెలా కనీసం వంద కవితలు చదవవలసి ఉండేది. చాల కవితలు లోపల ఒక్కసారి కూడ గున్గునాయించుకోకుండానే మొదటిసారే పైకి చదవవలసి వచ్చేది. అది ఎంత గొప్ప భావమైనా శబ్ద సంయోజనం సరిగ్గా లేకపోతే ఆ భావం పలుకుతున్నట్టు అనిపించేది కాదు. (వ్యాసకర్త : ఎన్.వేణుగోపాల్) -
బొమ్మలబాయి
ఆ గ్నాపక కతా గానమే ఈ కవిత్వం. ఈ లోకంలో చెట్టూ పుట్టా రాయీ రప్పా వాగూ గుట్టా ఎన్నెన్నో వాటి పనులు నిర్వహిస్తున్నట్టే నేను నా పనిని నిర్వహిస్తున్నాను. ఇది నేను బతికిన ఇరవై సంవత్సరాల కవిత్వం. రాజకీయ, సామాజిక వైయక్తిక ఆధ్యాత్మిక సృజనాత్మక సుడులతో... దిగులుతో, పొగిలిపోతూ ప్రత్యేక అస్తిత్వం కోసం అంగలారుస్తూ పోటెత్తుతూ నన్ను క్షణవరతం ముంచేసిన కవిత్వం. రెండు దశాబ్దాల/ నిద్రపోనివ్వని రాత్రుల/జంగమ జాతరల/ రంది రగడల కవిత్వం. ఈ వాక్యాలతో, ముచ్చట్లతో నాకు నాతో నాలోని మన నేనుతో తొట్టెలూగాను. ఈ తొట్టెలకు భూమి కేంద్రం నా ఊరు నా తెలంగాణ నా హైదరాబాద్. ఈ వాక్యాల కట్టడాల అంతస్సుల్లో మల్లా కొత్త జన్మనెత్తాలన్న ప్రాకృతిక వాంఛను నేను అనుభవిస్తున్నాను. ఔటర్ ఇన్నర్ రింగురోడ్ల కింద కుమిలే/ మసలే పంట పొలాల ఆకుపచ్చని రక్తాల వాసనను నేను అనుభవిస్తున్నాను. పుస్తకాల్లో- నాకు నచ్చిన వాక్యాలు తగిలినపుడు జ్వరమొచ్చి నీరసపడిపోయి వాటి మత్తులో గంటల తరబడి ట్రాన్స్లో ఊగిపోయిన సందర్భాలు చాలా వున్నాయి. నేను ప్రాథమికంగా పాఠకుడిని. పాఠకత్వంలో ఉన్న ఆనందం నాకు దేంట్లోనూ దొరకలేదు. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుడిగా ఊగిపోవడం తప్ప ఏమి చెయ్యలేనివాణ్ని... కవిత్వం పాఠకుడిని మత్తులోకి జీవనలాలసలోకి, దైన్యధైర్యంలోకి, తెగింపులోకి తీసుకుపోతుంది. అదే దాని శక్తి. అది మనలో రేపే తిరుగుబాటు అంతరిక భౌతిక సరిహద్దుల్ని దాటేస్తుంది. కొత్త మరణాల్లోకి అటు నుంచి కొత్త పుట్టుకల్లోకి జీవిని తీసుకుపోతుంది. కవిత్వం ద్వారా నేను చూసిన వాన మబ్బుల సౌందర్యంతో పాటు పంట సాళ్ళ పగుళ్ళ బతుకు భయ బీభత్స సౌందర్యం కూడా వుంది. తెలుపు నలుపులోని వర్ణ సమ్మేళనాల రసాయనిక చిత్చర్య వుంది. శబ్దభూమిలోని నిశ్శబ్ద రుద్రభూమి ఆనవాలు వుంది. కవిత్వం రాసేటోడికి వాని వునికి వానికి తెలిసిరావాలె కదా. మన ఇళ్ళు వాకిలి మన ఇంటోళ్ళ బతుకూ, బరువూ బలుపు, ఎత చిత, కులం/ పొలం జలం/ పొయ్యికాడి దేవతా, తలపోతలోని గ్రామదేవుడూ, దయ్యం దాని శిగమూ తెలిసిరావాలె కదా. మన అమ్మలక్కల చీకటి గదుల అర్రల, చెప్పుకోని చింతల, వారి మాటల పనిముట్ల మూటలు మనం మోయాలె కదా. మనలో ఎప్పటికి పోరగాని తనమే తలనూపాలె కదా... ఆ గ్నాపక కతా గానమే ఈ కవిత్వం. ఈ లోకంలో చెట్టూ పుట్టా రాయీ రప్పా వాగూ గుట్టా ఎన్నెన్నో వాటి పనులు నిర్వహిస్తున్నట్టే నేను నా పనిని నిర్వహిస్తున్నాను. సిద్ధార్థ (బొమ్మలబాయి- సిద్ధార్థ కవిత్వం; ప్రచురణ: మట్టి ముద్రణలు. సిద్ధార్థ ఫోన్: 9603318460) -
ఎందుకా కవిత్వం ఏడవనా?
పుస్తకం లోంచి... మహాకవులు ఎవరయినా తీసుకోండి ఎవరయితే ప్రజల్ని ప్రభావితుల్ని చేశారో నాగరికతల్ని సంస్కృతుల్ని సృష్టించారో అలాంటి కవులు అందరూ వాళ్ళ కవిత్వాన్ని వర్తమాన భాషలోనే రాశారు. వాళ్ళు కవిత్వం కవిత్వం కోసం రాయలేదు, స్వకీర్తి కోసం రాయలేదు, మనుషుల్ని మార్చాలని రాశారు. అది ఒక మహత్తరమైన ద్రష్టృత్వం.కనకనే వాళ్ళ మాటకు మనిషిని మార్చే శక్తి వచ్చింది. ఆ శక్తి ఉన్న మాటే కవిత్వం అనిపించుకుంది అనిపించుకుంటుంది. లేకపోతే ఎందుకా కవిత్వం ఏడవనా? తుపాకి చూపించి ఈ పని చెయ్ అన్న ధర్మశాస్త్రం మనిషిచేత బలాత్కారంగా పని చేయిస్తుంది. కానీ శక్తివంతమైన మాట మనిషిలో ఉన్న నిజపదార్థాన్నే మార్చి వేస్తుంది, తద్వారా ఒక ఐచ్ఛిక ఆంతరిక పరిణామాన్ని తెస్తుంది. తుపాకిశక్తికీ మాటశక్తికీ ఉన్న తేడాయిది. మనుపు ఆపస్తంబుడు చూపించిన తుపాకులు ఈనాడు లేవు మనిషి వాటి బెదురుతో నడవడానికి, కానీ వాల్మీకి మాట ఈనాటికీ ఉంది. మనిషిని నడుపుతూనే ఉంది. అరే పిచ్చోడా! తుపాకి ఎవడైనా పట్టుకుంటాడు; కలం ఎవడైనా పట్టుకునేది కాదు. ఈ రోజు భారతదేశంలో మనుషులు ఒక సామాజిక జీవనం చేస్తున్నారంటే అరణ్యక జంతుజీవనం చెయ్యడం లేదంటే ఈ దేశానికి అది రామాయణ మహాభారతాలు పెట్టిన భిక్షే. అన్య ఆధునిక విలువల చేత రామాయణం ప్రతిపాదించిన కొన్ని విలువల తీరాలు నేడు కోసుకుపోతుంటే పోవచ్చుగాక కాల ప్రవాహ వేగంచేత, దాన్ని ప్రతిఘటించవలసిన అవసరం లేదు. ఏ యుగపు ప్రజలు ఆ యుగం కోసం వాళ్ళ విలువల్నీ వాళ్ళ ప్రపంచాన్నీ వాళ్ళు నూతనంగా సృష్టించుకుంటారు. అది కాలధర్మం. ‘‘ప్రాప్తకాల ముపాస్యతాం’’ అన్నాడు వాల్మీకే- కాని ప్రస్తుత విషయమేమిటంటే ఆ మహాకవులు కొన్ని విలువల్ని ప్రతిపాదించి ఆ విశాల వలలో ప్రజానీకాన్ని పట్టి ఉంచారు గనక గానీ, లేకపోతే ఈ ప్రజలు ఏ క్షణంలోనో మళ్ళీ జాంతవ స్థితికి జారిపడేవారే. - గుంటూరు శేషేంద్ర శర్మ (‘కవిసేన మేనిఫెస్టో’ నుంచి...) -
ఫుట్పాత్ పై కవిత
అది ఒక కదిలే ఇల్లు కవితలు వెదజల్లే ఇల్లు ఆ ఇంటికి అవ్వనే కూరాడు అయ్యనే నిట్టాడు పిల్లలే మూలవాసాలు దూలాలు ఆ ఇంటికి గోడలు లేవు గేట్లు లేవు వాడలు లేవు బోర్డులు లేవు పంచభూతాలే రక్ష ఉదయం పొయ్యి రగులుతుంది పాట రగులుతుంది ఆట రగులుతుంది కబీ కబీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై అది పాట కాదు ఏదో గాంధర్వము ఏదో గేయం ఏదో గాయం ఏదో వేదం ఏదో నాదం ఏదో వాదం హిరామ్! ఆవోరే అంటున్నాడు ఒక పిల్లకాయ వస్తున్నా రహీం ఠైరో అంటున్నాడు మరో పిల్లవాడు గోలీలాట దాగుడుమూత గప్చుప్ ఏక్ దో తీన్ చార్ ఏవేవో ఆటలు కేరింతలు వారింతలు తుళ్లింతలు ఎన్ని మధురిమలు ఎన్ని సరిగమలు గులాబీల మల్లారెడ్డి 9440041351 -
ఏది కవిత అవుతుంది?
కళ్ళు లోతుకు పీక్కు పొయ్యాయని ఎవరన్నా రాస్తే అది కవిత్వం కాదు. ఇదే భావాన్ని ‘కళ్ళకింద బావులేర్పడతాయి’ అనడం ద్వారా కవిత్వం అవుతుంది. ఎర్రటెండలో రైతు దుక్కి దున్నును అన్నప్పుడు మనకి లభించేది ఒక వాస్తవానికి చెందిన స్టేట్మెంట్ మాత్రమే. ‘సూర్యుణ్ణి అరచేత బట్టి రైతు దుక్కి దున్నును’ అన్నప్పుడు అదే వాస్తవం కవిత్వమై మెరిసిపోతుంది. ఊళ్ళో అందరికీ గుడ్డలు నేసిచ్చిన మా తాతకు చచ్చిన రోజున ఎవడూ ఏమీ చేసింది లేదు అన్నప్పుడు కొంత బాధ కనిపించవచ్చు. ఆ బాధ కవిత్వం మాత్రం కాలేదు. ఇదే బాధని ‘మా ఊరి బోసిముడ్డిమీద ఇంత గుడ్డముక్క కప్పిన/ నీ ఔదార్యానికి / నిన్ను దిక్కులేని శవాన్ని చేసి / ఊరు గొప్పగా రుణం తీర్చుకుంది’ అని వ్యక్తం చేసినప్పుడు కవిత్వమయ్యింది. ఒక నిజాన్ని కానీ, కోపాన్ని కానీ, ఆనందాన్ని కానీ, ఉన్నదాన్ని ఉన్నట్టు అంటేనో రాస్తేనో కవిత్వం కావటం లేదు. అవి ప్రత్యేక నిర్మాణ పద్ధతిలోకి మారినప్పుడే కవిత్వం అవుతున్నాయి. కళ్ళు లోతుకి పీక్కుపొయ్యాయి అన్నప్పుడు లేని కవిత్వం కళ్ళకింద బావులేర్పడతాయి అన్నప్పుడు ఎట్లా వచ్చింది! కళ్ళకు ఏమాత్రం సంబంధంలేని బావుల్ని తెచ్చి కళ్ళకింద అమర్చటం వల్లనే ఇది సాధ్యమయ్యింది. అంటే ఆయావస్తువుల్ని వాటి మామూలు స్థానాలనుంచి తప్పించి వేరే వస్తువుల సరసన భిన్నస్థానాల్లో నిలిపితే కవిత్వమవుతుంది. నది వేరూ, చమట వేరూ, మనిషికి చెందిన చెమటను తెచ్చి నదికి ఆపాదిస్తూ ఒక కవి ‘నదికి చమట పోసింది’ అన్నాడు. అది కవిత్వమయ్యింది. ఇట్లా వస్తువుల్ని వాటి మామూలు స్థానాలు కాకుండా వేరేస్థానాల్లో నిలిపే నిర్మాణ పద్ధతిని ‘వస్తుస్థానభ్రంశ పద్ధతి’ అంటున్నారు. ఒక విషయాన్ని కవిత్వం చెయ్యడానికి ఇది ఒక పద్ధతి మాత్రమే. ఇలాంటి నిర్మాణ పద్ధతులు ఎన్నో ఉన్నాయి. కవుల ఆలోచనలూ ఆవేశాలూ కవిత్వం కావడమంటే ఏంటి అనే ప్రశ్నకు అనేకమంది విమర్శకులు అనేక సమాధానాలిచ్చారు. కవి తన ఆలోచనని ఒక హృదయకంపనగా, ఒక సంవేదనగా, ఒక అనుభవంగా, ఒక మానసిక స్థితిగా ప్రవేశ పెట్టినప్పుడు అది కవిత్వమవుతుందని ఎక్కువమంది అంగీకరించారు. అంటే కవిత్వాన్ని చదివినప్పుడు అందులోని ఆలోచన కాక ఆలోచన తాలూకు ఫీలింగో, ఇమోషనో పాఠకుల్ని పట్టుకుంటుందని అర్థం. ఆ క్రమంలోనే కవి ఆలోచన అందుతుంది కానీ నేరుగా ఆలోచన ఆలోచనగా పాఠకుల్ని చేరదు. చేరితే అది కవిత్వం కాదు. చేరితే అది జనరల్ సూత్రీకరణ మాత్రమే! భరతుడి రససిద్ధాంతం, ఆనందవర్ధనుడి ధ్వని సిద్ధాంతం ఈ విషయాన్నే స్పష్టం చేస్తాయి. విభావాలూ, అనుభవాలూ ఆలంబనగా కలిగిన రసం రూపంలో కవి చెప్పాలనుకున్న విషయం పాఠకుల్ని చేరుతుందని భరతుడి అభిప్రాయం. ఆలోచన మనోవైఖరిగా మారడం కవిత్వమన్నాడు హడ్సన్. ఒక థాట్ సెన్సేషన్గా బయటబడితే కవిత్వమంటాడు కీట్సు. అర్థమయ్యే ముందు ఆలోచనకి భిన్నమయిన దేన్నో అందించేదే కవిత్వమంటాడు టి.ఎస్.ఎలియట్. ఈ నిర్వచనాలన్నీ సంపూర్ణ స్థాయిలో సత్యాలనుకోవాల్సిన పనిలేదు. దేని విలువయినా సరయిన పరిశీలనకు నిలబడే వరకే. ఏది ఎట్లా ఉన్నా కవి చెప్పదలుచుకున్న విషయాన్నీ, వ్యక్తం చెయ్యాలనుకున్న ఉద్రేక ఉల్లాసాల్ని, కవిత్వం చెయ్యడానికి ఒక ప్రత్యేక నిర్మాణ పద్ధతిని తెలిసో తెలీకో పాటించాల్సుంటుంది. నిజమయిన బాధతో మాట్లాడే ప్రతి మాటా కవిత్వమే అని అజంతా లాంటి వాళ్ళు అన్నారు. ఇట్లాంటి అభిప్రాయానికి తొలి వ్యక్తీకరణ కీట్సు మాట ల్లో కనబడుతుంది. ‘ఐజ ఞ్ఛ్టౌటడ ఛిౌఝ్ఛట ౌ్ట ్చట ్ఛ్చఠ్ఛిట ౌ్ట ్చ ్టట్ఛ్ఛ, ఛ్ఛ్ట్ట్ఛట ౌ్ట ఛిౌఝ్ఛ ్చ్ట ్చ’. ఈ అభిప్రాయం వినటానికీ చదవటానికీ బాగానే ఉండొచ్చు. ఇందులో పరిశీలనకు నిలబడే గుణం తక్కువ. చెట్టుకు ఆకులొచ్చినంత సహజంగా కవికి కవిత్వం రావడం అంటే ఏంటి? కవి ఏ ప్రయత్నం చేయకుండానే కవి భావాలూ, ఆలోచనలూ కవిత్వంగా మారాలి అనేకదా! ఇదెట్లా సాధ్యపడుతుంది? చిత్రంగా ఇలాంటి అభిప్రాయాల్ని అంగీకరించి ప్రచారం చేసేవాళ్ళే ఎక్కువ. కవులు తమ ఆలోచనావేశాల్ని కవిత్వంగా మలచడానికి గొప్ప ఎఫర్ట్ పెట్టాలనే విషయాన్నీ అట్లా ఎఫర్ట్ పెట్టడం ద్వారా తమ భావోద్వేగాల్ని ఏదో ఒక ప్రత్యేక నిర్మాణ పద్ధతిలోకి ఛానలైజ్ చెయ్యాల్సుంటుందనే విషయాన్నీ విస్మరించటం వల్లే ఇలాంటి అభిప్రాయాలు వస్తూంటాయి. నిజమయిన బాధ నుంచీ, ఆత్మ కంపన నుంచీ పలికే ప్రతి పలుకూ కవిత్వమే అనేదాంట్లో కూడా ఈ రొమాంటిక్ ధోరణి చూడొచ్చు. నిజమయిన బాధలు అనుభవిస్తున్న దళితులూ, స్త్రీలూ, పేదవాళ్ళూ వీరంతా మాట్లాడే మాటలన్నీ కవిత్వమే అని చెప్పగలమా? నిజాయితీగా కోపాన్నీ, ఆవేశాన్నీ వెలిబుచ్చే అందరూ కవిత్వాన్ని చెయ్యగలుగుతున్నారా? నిజమయిన బాధ, నిజాయితీతో కూడిన ఆలోచనోద్వేగాలు కవిత్వానికి ముడిసరుకు మాత్రమేగానీ అవే కవిత్వం కావు. అవి కవిత్వం కావడానికి కళ, నేర్పరితనం కావాల్సుంటుంది. అయితే కవిత్వం నిర్మించటమనేది కేవలం పండితులకో తెలివిగలవారికో మాత్రమే పరిమితం కాదు. రోజు వారీ జీవితంలో మామూలు జనం తమ భావాల్ని కళాత్మకంగా బయటపెడుతూ ఉండటాన్ని తరచుగా గమనిస్తుంటాం. ‘బతుకు బస్టాండయ్యింది’, ‘ఎండ దంచుతుంది’ అని జనం రోజువారీగా మాట్లాడేదాంట్లో కవిత్వం ఉంది. ‘కంచే చేనుని మేస్తే ఇంకేముంది’, ‘పేగుల గోల పున్నీల్ల కెరుక’, ‘పడి లేచే నడక పించిమిప్పద్ది’- ఇలాంటి అసంఖ్యాకమయిన వ్యక్తీకరణల్లో కవిత్వముండటానికి కారణం వాటిలోని కళాత్మక నిర్మాణం అని అర్థంచేసుకుంటే, ఈ వాక్యాల్ని అనటానికి ఆత్మశుద్ధతా, నిజమయాన బాధా ఉండాలనే నియమం అవసరం లేదని తెలుస్తుంది. పామరులయినా పండితులయినా వాళ్ల ఆలోచనోద్వేగాల్ని వ్యక్తం చేసినప్పడు అవి కవిత్వమైనాయంటే వారు తెలిసో తెలియకో కవిత్వ మాధ్యమానికి చెందిన ప్రత్యేక నిర్మాణ పద్ధతుల్ని వాడారని అర్థం చేసుకోవాలి. (‘కవిత్వ నిర్మాణ పద్ధతులు’ లోంచి;వ్యాసకర్త 1995లో త్రిపురనేని శ్రీనివాస్తో కలసి ‘చిక్కనవుతున్న పాట’ దళిత కవితా సంకలనం తెచ్చారు.) -
తెరవే సాహిత్య సదస్సు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటిపోయింది. సాహిత్యరంగంలో రాష్ట్ర సాధనలో తెరవే పాత్ర చాలా కీలకమైనది. ఏ రాజకీయ నాయకుల ప్రమేయం, పార్టీల ఛాయలు పడకుండా కేవలం ప్రజావాంఛకు అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి చరి త్రను సృష్టించింది. ప్రజలను విస్మరించి కేవలం రాజకీయ పంథాయే ప్రధానంగా ఆలోచించే సంస్థల వలె కాకుండా నిత్యం సృజనాత్మకశక్తికి ఊతకర్రగా నిలవాలనేదే తెరవే లక్ష్యం. చరిత్ర, భాష, సంస్కృతి, మాట, రాత సాహిత్యాలు, వివిధ ప్రక్రియలలో ఎం తో కృషి జరగవలసిన తరుణం ఇది. ప్రస్తుతం తెలం గాణలో నెలకొని ఉన్న సాహిత్య సాంస్కృతిక రం గంపై సమీక్షించుకుని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకునే క్రమంలో హైదరాబాద్లో జూలై 12న ఒకరోజు సాహిత్య సదస్సును ఏర్పాటు చేశాం. తెరవే నూతన కార్యవర్గంతో పాటు అన్ని జిల్లాల కార్యవర్గాల కమిటీలను ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఆదివారం ఉదయం 10.30 నుంచి పగలు 1 గంట వరకు ‘వర్త మాన సాహిత్యం ధోరణులు కర్తవ్యాలు’ అనే అం శంపై జరిగే సదస్సులో ప్రముఖ సాహిత్యకారులు అల్లం నారాయణ, ఆచార్య వి.కృష్ణ, అంద్శై గోరటి వెంకన్న, జింబో, ఎం.వేదకుమార్, డా. మధుసూదన్ రెడ్డిలతోపాటు అన్ని జిల్లాల తెరవే అధ్యక్ష కార్యదర్శు లు పాల్గొంటారు. పగలు 2 గంటల నుంచి 5 గంటల వరకు దిశానిర్దేశం-కార్యక్రమాల రూపకల్పనపై జిల్లా కార్యవర్గ సభ్యులతో భేటీ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మీడియాతో సమావేశం జరుగుతుంది. సదస్సు వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఇందిరా పార్క్ సిగ్నల్ దగ్గర, దోమలగూడ. - జయధీర్ తిరుమలరావు రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక, మొబైల్: 99519 42242 -
ఉద్యమ సాహిత్య బాటసారి
చెన్నపట్నం నుంచి బతుకుదారిలో 1937న ‘ఆంధ్రా ప్యారిస్’గా పేరొందిన తెనాలిలో కాలుపెట్టిన తమిళ యువకు డు నటరాజన్... శారద అనే కలం పేరు తో సాహిత్యబాటసారిగా తెలుగు సమా జంలో దాదాపు 18 ఏళ్లపాటు జీవించా డు. ఆ బతుకు రహదారిలో శారదకు తార సపడిన మిత్రుడే ఆలూరి భుజంగరావు. శారద బతికేదారుల వెంట బాటసారిలా తిరిగితే, బతుకుతెరువుకు లోటులేని స్థితి లో ఉద్యమదారుల వెంట తానే కాదు.. తన కుటుంబా న్నంతా వెంటబెట్టుకుని తిరిగినవారు భుజంగరావు. వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టుకోగల అవకాశాలనే కాదు.. సొంత ఆస్తులను కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యారు. శారద వంటి తొలినాటి మిత్రుల సాం గత్యం అనంతరం భుజంగరావుపై స్థిరమైన ముద్ర వేసింది నక్సల్బరీ రాజకీయాలే. వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలంటూ నక్సల్బరీ ఇచ్చిన పిలుపును జీవితానికి అన్వయించుకున్న కొద్దిమంది బుద్ధిజీవుల్లో ఆయన ఒకరు. ఉద్యమ ఆచరణతో ఏమాత్రం సంబంధం లేని సమాజంలో నిలబడి చూస్తే ఆయన ఆదర్శం, ఆశయ జీవితం మొత్తంగా ఒక పలవరింతగా అనిపించవచ్చు. కానీ హిందీ నుంచి తెలుగులోకి అనువాదాలు చేసే ఒక మామూలు హోటల్ కూలీ, ఒక బతకలేని బడిపంతు లు సమాజాన్ని జ్వరపీడనానికి గురిచేశారంటే నమ్మగ లమా? కానీ ఇది నిజం. శక్తివంతమైన పాట, సమ్మో హనశీలమైన నాటకం, ఉపన్యాస కళ చేయగలిగిన పనిని భుజంగరావు అనువాద రచనలు చేశాయి. యశ్ పాల్ సింహావలోకనంకి భుజంగరావు చేసిన తెలుగు అనువాదం చదివి ఒక తరమంతా పోరోటోన్ముఖమ యింది. క్రమంగా సాహిత్య, అనువాద, పత్రికావ సరాలు తీర్చడంలో భాగంగా విస్తరిస్తున్న ఉద్యమంతో పాటు తానూ కొనసాగారు. ఈ నేపథ్యంలో సహచరి లలిత సహా కుటుంబమంతా ఆయన వెంట కరిగిపో యింది. హిందీనుంచి ప్రసిద్ధ అనువాదాలకు అద నంగా ఆయన రాసిన ‘గమనాగమనం’, ‘గమ్యం దిశగా గమనం’ రచనలు... ‘కొండవా గు’, ‘ప్రజలు అజేయులు’, ‘నైనా’, ‘అమరత్వం’, ‘ఎరుపు’ వంటి నవలలు విప్లవోద్యమాచరణకు వెల లేని జ్ఞాపికల య్యాయి. భుజంగరావు జీవితం నక్స ల్బరీ సంకల్పంతో సార్థకమైంది. ఆలూరి భుజంగరావు సుప్రసిద్ధ మార్క్సిస్టు మేధావి, రచయిత రాహుల్ సాంకృత్యాయన్, యశ్పాల్ రచనల అనువాదకుడిగా తెలుగు సాహిత్య లోకానికి చిరపరి చితులే. భారతీయ విప్లవోద్యమంపై చెరగని విశ్వాసం, విప్లవ సాహిత్యంపై చెదరని అంకిత భావం కలిగిన ఆయన జాతీయ విప్లవకారుడు యశ్ పాల్ రచించిన ‘సింహావలోకనం’ని తెలుగులోకి అను వదించారు. ఆ పుస్తకం తెలుగు సమాజంలో ఒక తరం విప్లవకారులపై విశేష ప్రభావం చూపింది. అలాగే రాహుల్ సాంకృత్యాయన్ ప్రత్యేక రచనలను హిందీ నుంచి అనువదించడానికి విశేష కృషి సల్పారు. రాహు ల్ సుప్రసిద్ధ గ్రంథం ‘దర్శన్ దిగ్దర్శన్’ గ్రంథాన్ని గతంలోనే అనువదించిన ఆయన 2003లో ‘వైజ్ఞానిక భౌతికవాదం’ గ్రంథంలో మతాల సారాంశం దాకా అనువాదం చేశారు. మెదడుకు సంబంధించిన అనారో గ్యంతో మిగిలిన భాగాన్ని పూర్తి చేయలేకపోయారు. ఏడేళ్ల తర్వాత తన సలహా మేరకు ఆయన కుమార్తె కవిని ఆలూరి మిగతా భాగాన్ని అనువదించారు. ఇది ఆయన ఆఖరి అనువాద గ్రంథం. ఆయన కన్నుమూ శాక 2015 జనవరిలో నవచేతన పబ్లిషింగ్ హౌస్ (విశాలాంధ్ర) ఈ గ్రంథాన్ని ప్రచురించారు. ప్రాచీన భారతీయ, గ్రీకు దార్శనికులు ప్రతిపాదించిన పలు విషయాలను ఈ గ్రంథం విశదపరచింది. సామాన్యు లకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ గ్రంథంలో గతి తర్కాన్ని ప్రకటించారు రాహుల్జీ. వ్యవస్థ మార్పును కోరే ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయ వలసి ఉంది. (నేడు ఆలూరి భుజంగరావు రెండవ వర్ధంతి) కవిని ఆలూరి సహకారంతో రివేరా -
కవిత
ముసురు సంధ్యవేళ నిదురకొసన నిప్పు రగులుతూనే ఉంది మునుపటి స్వప్నం కోసం ఆన్లైన్ బుకింగ్ అర్జీ కిందటి పిలుపుకోసం డయల్ - రీడయల్ సారీ...: మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం స్పందించుట లేదు లేదా, స్పందించుటకు ఇష్టపడుట లేదు ఎట్లీస్ట్- కవిత్వం కూడా కమ్యూనికేట్ కావడం లేదు గుండెను నెత్తట్లో ముంచి ఫెన్సింగ్పై ఆరేసినట్టుంది వాక్యం శిథిలమై అక్షరాలు అక్షరాలుగా కూలిపోయింది కాన్షియస్ గానో సబ్ కాన్షియస్ గానో ఒక పిచ్చిమొక్క లోకం చూసీ చూడకముందే సామాజిక పదఘట్టనల కింద నలిగిపోయింది ఇక తవ్వినకాడికి చాలుగానీ అటు విను... సిలోన్లో ఓపీ నాయర్ సిగ్నేచర్ ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా ముసురు పట్టింది విస్కీ దట్టించు జహాపనా! ‘హిమజ్వాల’ ఫోన్: 9553955320 ప్రసంగం జూన్ 13న సాయంత్రం 5 గంటలకు ‘బౌద్ధ శిల్పంలో ఆధునికత’ అంశంపై టి.శివాజి ప్రసంగిస్తారు. వేదిక: ప్రెస్ క్లబ్, సోమాజిగూడ, హైదరాబాద్; నిర్వహణ: ‘ఛాయ’ ఆవిష్కరణ ‘కవి సంధ్య’ ఆధ్వర్యంలో శిఖామణి మూడు పుస్తకాలు- పొద్దున్నే కవి గొంతు(కవిత్వం), తెలుగు మరాఠి దళిత కవిత్వం(పరిశోధన), స్మరణిక(సాహిత్య నివాళి)- జూన్ 13న సాయంత్రం 6 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఆవిష్కరణ కానున్నాయి. గుమ్మడి గోపాలకృష్ణ పద్య పఠనంతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సినారె, మండలి బుద్ధప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి, మల్లాడి కృష్ణారావు, ఇనాక్, శివారెడ్డి, ఓల్గా, ఖాదర్ మొహియుద్దీన్, సీతారాం, విజయభాస్కర్, ప్రసాదమూర్తి, దాట్ల దేవదానం పాల్గొంటారు. -
ఇద్దరు మిత్రులు...
నువ్వు రాసిన కవితలు గుబాళిస్తోంటే నువ్వు తాగిన ఖాళీ సీసాల కంపు నాకెందుకు! అన్నాడు కాళోజీ. ఎమర్జెన్సీ టైమ్లో ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని సమర్థిస్తూ శ్రీశ్రీ పాట రాశాడు. ఆ నేరం చాలదా సాహితీ క్రీడాంగణంలో ఫుట్బాల్ అయ్యేందుకు? అందరూ తలో కాలూ వేస్తున్నారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసిన శ్రీశ్రీని నెత్తురు కక్కుకుంటూ నేల రాల్చాలని ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత లోపాలు ఎత్తి చూపుతూ రెండు శ్రీలను ధరించినవాడు మహాకవి అవునోకాదో కాని రెండు పెగ్గులను బిగించినవాడు నిశ్చయంగా తాగుబోతే అని డయాగ్నస్ చేశారు. అటువంటి నిస్సహాయ నిస్త్రాణ పరిస్థితుల్లో ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు’ అన్నట్లుగా శ్రీశ్రీకి తోడున్నవాడు కాళోజీ. వీరిద్దరి అనుబంధం ఇప్పటిదా? కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నేపథ్యంగా ముడిపడినది. ఆ వైనం ఆసక్తికరం. నిజాం స్టేట్లో ఉర్దూ అధికార భాష. తెలుగు బడులను నిరసించారు. మెడ్రాస్ స్టేట్లో తెలుగు బడులపై నిర్బంధం లేదు. ఈ నేపథ్యంలో ఇరుప్రాంతాలకు సాహిత్య వారధులు ఏర్పడ్డాయి. హైద్రాబాద్లో, ఆ తర్వాత కొన్నేళ్లకు హనుమకొండలో, ఆ తర్వాత వరంగల్లులో, ఆపైన కాళోజీ స్వగ్రామం మడికొండలో ఆంధ్రభాషా నిలయాలను స్థాపించుకున్నారు. మహామహుల రాకపోకలు జరుగుతున్నాయి. సురవరం వారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నదిలా రెండు ప్రాంతాల్లో సౌభ్రాతృత్వాన్ని పంచుతోంది. ఈ నేపథ్యంలో విశ్వనాథ వరంగల్ వచ్చేవారు. మడికొండకూ వచ్చేవారు. ‘ఈసారి వరంగల్ పోయినప్పుడు గార్లపాటి రాఘవరెడ్డిగారనే మంచి కవి పరిచయం, కాళోజీగారి ఆతిథ్యం మరచిపోలేని విషయాలు’ అని వానమామలై వరదాచార్యులవారి ‘మణిమాల’ కావ్యానికి రాసిన పీఠికలో విశ్వనాథ అన్నారు. అయితే అదే ముందుమాటలో ‘వానమామలై తెలంగాణకు చెందిన కవులలో ప్రసిద్ధుడు’ అని కూడా అన్నారు. ఈ మాటకు కాళోజీకి కోపం వచ్చింది. నన్నయ నుంచి విశ్వనాథ వరకూ అందరం ఒక్కటే అందరూ మనవాళ్లే అనుకుంటూ ఉంటే తెలుగు ఆణిముత్యమైన వానమామలై వరదాచార్యులను ‘తెలంగాణకు చెందిన’ అని విడదీస్తరా? ‘తెలంగాణ వాదా’నికి బీజం వేసింది తాము మాత్రమే ఆంధ్రులం అనుకుంటున్న ఇలాంటివారు కాదా? అని అప్పట్లోనే ప్రశ్నించారు. మరో సందర్భంలో విశ్వనాథను ఆహ్వానించిన వరంగల్ మిత్రులు రామాయణ కల్పవృక్షాన్ని కవిగారితో చదివిద్దాం అనుకున్నారు. ఏ ఘట్టం? అని చర్చ వచ్చింది. ఏదైనా ఒక్కలాగే ఉంటది, ఆయన్నే ఎంచుకోమందాం అన్నాడు కాళోజీ. ఈ వైనాన్ని విశ్వనాథ చెవిలో వేశారు అభిమానులు. ఏదైనా ఒక్కలాగే ఉంటుందంటాడా అని ఆయన మనసులో పడింది. విశ్వనాథ తన ‘ఆంధ్ర ప్రశస్తి’ని తొలితరం చరిత్రపరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖరశర్మకు అంకితం చేస్తూ ‘డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకురాని ఈ పాడు కాలమున బుట్టినట్టి...’ అని గౌరవాన్ని ప్రకటించుకున్నారు. అయితే అదే విశ్వనాథ ఆ తర్వాత ‘పులుల సత్యాగ్రహం’ రచనలో ‘మాకు తెలిసిన వాడొకడున్నాడు. వాడు మెట్రికో ఇంటరో పాసయ్యాడో, ఫెయిలయ్యాడో. ఆ చదువు చదివే సరికి వానికి అర ఎకరం భూమి పోయింది. తర్వాత ఉద్యోగం లేదు. ఏం చేయాలో తోచక చరిత్ర పరిశోధన మొదలు పెట్టాడు. మహా పండితుడు-చరిత్ర పరిశోధకుడు అని పెద్దపేరు సంపాదించాడు’ అని మల్లంపల్లిని ఉద్దేశించి రాశారు. ఈ వెక్కిరింపుకు ఏమన్న అర్థమున్నదా ? అని విశ్వనాథను కాళోజీ ముఖం మీదనే అడిగాడు. విశ్వనాథ కవిత్వం తనవంటి తెలుగువారిక్కూడా అర్థం కాని సంస్కృతభూయిష్టం అని కాళోజీ అనేవాడు. కాళోజీదీ కవిత్వమా? అనుకునే కొందరు సాంప్రదాయవాదులు విశ్వనాథ అభిమానుల్లో ఉండేవారు. అయితే శ్రీశ్రీ దృష్టిలో కాళోజీకి ఉన్నతమైన స్థానం ఉంది. కాళోజీ ఎవడు? నిజాంను ఎదిరించిన వాడు. వేమనలా అందరికీ అర్థమయ్యే కవిత్వాన్ని రాసినవాడు. ఈ నేపథ్యంలో 1953లో మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లో ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షికోత్సవాలు జరిగాయి. కాళోజీ సహాధ్యాయి దేవులపల్లి రామానుజరావు, మిత్రుడు పులిజాల హనుమంతరావు దీని నిర్వాహకులు. భారత ఉపరాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వనాథ ప్రభృత ప్రముఖులూ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా తొలి తెలంగాణ రచయితల సంఘం (తెరస) సమావేశాలూ జరిగాయి. మహాకవి శ్రీశ్రీ తదితరులు ‘తెరస’ ఆహ్వానంపై వచ్చారు. అయితే కాళోజీ సమావేశాలకు రాలేదు. సాంప్రదాయ-ఆధునిక తరాల మధ్య (కాంగ్రెస్ అనుకూలురు కమ్యూనిస్ట్ అనుకూలురు) వైరుధ్యాలు నెలకొన్న వాతావరణంలో తన మిత్రులయిన నిర్వాహకులకు ఇబ్బంది కలగకూడదని కాళోజీ అభిమతం. ఈ సమావేశాల్లో కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని ఆవిష్కరింపజేయాలని దాశరధి కృష్ణమాచార్య, బిరుదురాజు రామరాజు, డి.రామలింగం వంటి మిత్రులు ప్రయత్నించారు. వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల తరఫున ‘నా గొడవ’ను ప్రచురించారు. అయితే ఆవిష్కరణకు నిర్వాహకులు సహకరించలేదు. ఎవరి వేదికలు, ఎవరి క్యాంపులు వారివి. రాత్రి భోజనాలైన తర్వాత 11 గంటల వేళ యువరచయితలు ఒక క్యాంపులో శ్రీశ్రీతో ‘నా గొడవ’ ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కాళోజీని ఫ్రెంచ్ కవి, నవలాకారుడు లూయీ అరగాన్తో పోల్చాడు. ఆ మరుసటి రోజు ‘కాళోజీ మన లూయీస్ అరగాన్’ అన్న శ్రీశ్రీ వ్యాఖ్యతో వార్తలు వచ్చాయి. ఈ అరగాన్ ఎవడు? కాళోజీ సందేహం! శ్రీశ్రీకి ఉత్తరం రాశాడు కాళోజీ. ‘తక్కిన వాళ్లందరూ యుద్ధంలో పారిపోతున్నపుడు లూయీస్ అరగాన్ ప్రజల తరఫున నిలుచున్నాడు ’ అని శ్రీశ్రీ వివరణ ఇచ్చాడు. గురజాడ వారసుడైన శ్రీశ్రీని రష్యన్ కవి మయకోవిస్కీతో, ఇంగ్లండ్కు చెందిన జేమ్స్జాయిస్తో పోలుస్తారు. అరగాన్తో కూడా! శ్రీశ్రీ పోలికలో ఔచిత్యం ఉంది! కాళోజీతో మమేకత ఉంది! ఈ సందర్భంగా శ్రీశ్రీ కాళోజీని ఫ్రెంచ్ కవి, నవలాకారుడు లూయీ అరగాన్తో పోల్చాడు. ఈ అరగాన్ ఎవడు? కాళోజీ సందేహం! - పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రచయిత, 7680950863 -
‘గాంధీపై అశ్లీల కవిత్వం’ కేసులో తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: మహాత్మునిపై మరాఠీ కవి వసంత్ దత్తాత్రేయ గుర్జర్ రాసిన కవిత్వం అసభ్యకరంగా ఉందంటూ ఓ ఉద్యోగి వేసిన పిటిషన్పై తీర్పును గురువారం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 1984లో రాసిన ఈ కవితను 1994లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్కు చెందిన పత్రికలో ప్రచురించారు. -
తెలంగాణలో రాస్తున్నది శిష్ట వ్యవహారికమే...
సంభాషణ తెలుగు సాహిత్యపు వృత్తలేఖిని డా.కడియాల రామమోహన్రాయ్. కవిత్వం-కథ-నవల-వ్యాసం-నాటకం... ప్రక్రియ ఏదైనా రచన కేంద్రికపై దృష్టినిలిపి వ్యాఖ్య చేయడం ఆయన విమర్శనా స్వభావం. శ్రీశ్రీ, దాశరథి, శేషేంద్ర, కాళోజీ, కొ.కు వంటివారితోనే కాదు ఆర్.కె.నారాయణన్ వంటి అన్యభాషా రచయితలతో కూడా స్నేహం కలిగి, వర్తమాన రచయితల పట్ల వాత్సల్యత ప్రదర్శించే అరుదైన సాహితీశీలి. గుంటూరు జిల్లా సిరిపురంలో 1944లో జన్మించిన డా. కడియాల ఏ.సి.కళాశాలలో ఏ.సి.కళాశాల, జేకేసి కళాశాలల్లో ఆచార్యునిగా పనిచేశారు. ‘తెలుగు సాహిత్యంలో కృషీవల జీవితం’కు అత్యుత్తమ పరిశోధకునిగా తూమాటి దోణప్ప గోల్డ్మెడల్ పొందారు. ఉత్తరాంధ్ర నవలా వికాసం, శేషేంద్ర కవిత్వం, సాహిత్య సంపద తదితర రచనలను విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా గౌరవించాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించిన భారతీయ సాహిత్యపు ఎన్సైక్లోపీడియాలోని ఐదు వాల్యూంలలో 28 వ్యాసాలు కడియాలవే. వందేళ్ల తెలుగు నవలలపై పరిశోధనను అప్పాజోశ్యుల ఫౌండేషన్ ప్రచురించింది. 50 ఏళ్లుగా ఇండియాలో గొప్పనాటకాలు ఏమి వచ్చాయి? తెలుగు నాటకరంగం ఎలా ఉంది? అనే అంశాన్ని యూజీసి ప్రాజెక్ట్ తరఫున విశ్లేషిస్తోన్న డా. కడియాలతో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ సారాంశం: కొత్తగా ఏం చెప్పారు? వాదాలు అనేకాలు. జాతీయవాదం, అంతర్జాతీయవాదం, స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదం ఇలా... వాదం ఏదైనా ఆయా వాదాలు ప్రాంతాలవారికి తమ జీవితాల్లోని అవిస్మరణీయతను పాఠకులకు తెలిపాయి. కాని తెలుగు ప్రజల్లో కొన్నేళ్లుగా బలంగా విన్పించి విజయవంతం అయిన ప్రత్యేక తెలంగాణవాదం సాహితీపరంగా విఫలమైంది. తెలంగాణ జీవితాన్ని, సంస్కృతిని, ఆర్తిని ఇతర ప్రాంతాలవారికి తెలియజేయడంలో విఫలమైంది. తెలంగాణ నుంచి వచ్చిన భారీ పుస్తకాలు కొత్తగా వెలుగులోకి తెచ్చినదేమిటి? సాహిత్యాన్ని పరిపుష్ఠం చేసిన దాఖలా ఏది? తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన రచనలు ఇతర ప్రాంతాలవారిని తిట్టడం లేదా ద్వేషించడమే పనిగా వచ్చాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అభ్యుదయ సాహితీకారులు అనబడే వారు కూడా ఈ తిట్ల దండకంలో చేరడం. తెలంగాణ ముఖ్యమంత్రి యజ్ఞయాగాలు, వాస్తు శాస్త్రం గురించి అధికారికంగా మాట్లాడుతున్నారు. హరగోపాల్, ఘంటాచక్రపాణి, గద్దర్, విమల, వరవరరావు ఎవ్వరూ, ఒక్కళ్లునూ ఈ ధోరణులపై నోరెత్తి మాట్లాడ్డం లేదు. ఎవ్వరూ ప్రొటెస్ట్ చేయరే. ఇదొక చిత్రమైన మహామౌనం. ఇదంతా వారికి తృప్తిగా ఉందని భావించాలి కాబోలు! ఏ మాండలికం రాస్తున్నాం? తెలంగాణ మాండలీకాన్ని రచనల్లో, పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలనే ఉత్సుకత ఇటీవల బాగా వ్యక్తమవుతోంది. మంచిదే! అయితే తెలంగాణ మాండలీకాన్ని రాస్తోన్న తెలంగాణ రచయితలెందరు? తెలంగాణవాళ్లంతా రాస్తోంది కృష్ణాజిల్లా భాషే. ఎన్.వేణుగోపాల్ తదితరులందరూ శిష్టవ్యావహారీకులే. వీరెవరికీ పి.యశోదారెడ్డిగారిలా మాండలీకం రాదు. అప్పటి వరకూ రాస్తోన్న వాక్యాల్లో నాలుగు పదాలు చేర్చినంత మాత్రాన మాండలీకం అవుతుందా? ఆపాదించుకునే మాండలీకం వేరు జీవితంలోంచి వచ్చిన మాండలీకం వేరు. ఇదంతా హడావుడిగా అయ్యేది కాదు. సమిష్టి కషితోనే సాధ్యం. రాష్ట్రం వచ్చింది కాబట్టి అంతా హడావుడిగా మార్చేయాలనే వైఖరి సబబు కాదు. దాశరధి, నారాయణరెడ్డి, కాళోజీలను ఆంధ్రప్రాంతం తలదాల్చలేదా? ‘ఆంధ్ర’ అంటే బూతేనా? ఇదేం సబబు! ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ను తెలంగాణ సాంఘిక చరిత్ర అంటారా? ఉద్వేగాల స్థానంలో సంయమనం ప్రవేశించాల్సిన సమయం ఇది! గొలుసు నవలలు ఒక ప్రత్యామ్నాయం మాండలీకం ప్రస్తావనను కేవలం తెలంగాణ దృష్టితో చెప్పడం లేదు. అన్ని ప్రాంతాల సాహితీ వేత్తలూ ఈ క్రమంలో కృషి చేయాల్సి ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సరైన ఆధునిక నవల లేదు. ఈ ఆవశ్యకతను మాండలిక కోణం నుంచి కూడా తెలుగు సాహితీవేత్తలు గుర్తించాలి. భిన్న ప్రాంతాలనుంచి ప్రముఖ రచయితలను ఎంపిక చేసి వారి వారి ప్రాంతాలలో నిర్ణీత కాలవ్యవధిలోని జీవితాన్ని ఆయా ప్రాంతాల మాండలీకంలో రాసేందుకు సంకల్పించాలి. మూడు ప్రాంతాల మాండలికాన్నీ పాఠకులు గొలుసుకట్టు ఇతివృత్తంతో అవగాహన చేసుకునేందుకు ఉపకరిస్తుంది. చప్పగా ఉంది! మొత్తంగా తెలుగు సాహిత్యం పలుచబడింది. బలహీనమైంది. మీ ప్రాంతం నుంచి మీరు ఇటీవల విన్న సంతృప్తికరమైన కవిత గురించి చెప్పండి అంటే సరైన సమాధానం రావడం లేదు. ఒకటి బాగా రాస్తే పది చప్పగా వస్తున్నాయి అంటున్నారు. ఆంధ్రప్రాంతానికి చెందిన శివారెడ్డి వంటి కవులు తమ రచనల ప్రతిధ్వనులనే విన్పిస్తున్నారు. మానవ సంబంధాలలో ఆర్ధ్రతనే రాస్తున్నారు. శిల్పంమీద దృష్టి పెడుతున్నారు. జీవితాన్ని పట్టుకునే శ్రమకు సాహసించడం లేదు. వేంపల్లి గంగాధర్, షరీఫ్లు ‘ఆమోద యోగ్యత’కోసం తపనపడుతున్నారు. గతంలో కథలు విరివిగా వైవిధ్యంతో వచ్చేవి. ఇటీవలి కాలంలో వార్షిక సంకలనానికి ఎంచుదామంటే కథలు పదీ పరకా మాత్రమే వస్తున్నాయని వింటున్నాను. ఈ వాతావరణంలో పెద్దింటి అశోక్ కుమార్ భిన్నంగా కన్పిస్తున్నారు. ఆయన రచనల్లో స్పార్క్ ఉంది. ‘మాయిముంత’ ఎంత గొప్ప కథ! జీవితంలోకి వెళ్లి వచ్చేవారే అలా రాయగలరు! - పున్నా కృష్ణమూర్తి -
కొత్త పుస్తకాలు
సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్ జీవితం- కవిత్వం రచన: వాహెద్ పేజీలు: 212; వెల: 100 ప్రచురణ: కవిసంగమం బుక్స్ ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు; రచయిత ఫోన్: 7396103556 ఇన్సైడ్ ద ప్రిజన్ (షార్ట్ స్టోరీస్) తెలుగు మూలం: వట్టికోట ఆళ్వారుస్వామి ఇంగ్లిష్: ఎలనాగ పేజీలు: 66; వెల: 100 ప్రతులకు: డా.గంటా జలంధర్ రెడ్డి, 1-4-19/8, ప్లాట్ 11, స్ట్రీట్ 7, హబ్సిగూడ, హైదరాబాద్-7; ఫోన్: 9848292715 తెలంగాణ రైతాంగ పోరాట భూమిక చాకలి ఐలమ్మ రచన: ఎలికట్టె శంకర్రావు పేజీలు: 72; వెల: 50 ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలతోపాటు, ఎన్.ఎస్.అరుణ, నోముల సాహిత్య సమితి, సాయి టవర్స్, నాగార్జున కాలనీ, నల్లగొండ, తెలంగాణ; ఫోన్: 7799114349 రెల్లు (కథలు) రచన: బి.పి.కరుణాకర్ పేజీలు: 128; వెల: 80 ప్రతులకు: బి.కె.ప్రసాద్, డి-304, అనురాధ సదన్, అడిక్మెట్, హైదరాబాద్-44; ఫోన్: 9290828575 గంధ యాజ్ఞవల్క్యశర్మ కథలు పేజీలు: 230; వెల: 175 ప్రతులకు: స్ఫూర్తి పబ్లిషింగ్ హౌస్, 2/2, బ్రాడీపేట, గుంటూరు; ఫోన్: 9246830320 ఏం లేదు! (కథలు) రచన: నాయుని కృష్ణమూర్తి పేజీలు: 160; వెల: 100 ప్రతులకు: వి ఎన్ ఆర్ బుక్ వరల్డ్, చౌడేపల్లె, చిత్తూరు జిల్లా-517257 ఫోన్: 08581-256234 చిగురించే మనుషులు (కథలు) రచన: పలమనేరు బాలాజీ పేజీలు: 168; వెల: 100 ప్రతులకు: కె.ఎన్.జయమ్మ, 6-219, గుడియాత్తం రోడ్డు, పలమనేరు, చిత్తూరు జిల్లా-517408; ఫోన్: 9440995010 -
కవిత - 2014 కోన్ని పద్యాలు వెలిగాయి
తెలుగు కవి ఏమరుపాటుగానే ఉన్నాడు. స్పందించవలసిన సమయంలో స్పందిస్తూనే ఉన్నాడు. ఉద్యమప్పుడు చెలరేగి, ఉద్యమం ముగిశాక కాపలాదారుగా మారి, బయట దారుల్లో తోడు నిలిచి, లోపలి సంఘర్షణలకు దారి కనుక్కొని తెలుగు కవి ఎప్పటిలాగే నిత్య యవ్వనంతో ఉన్నాడు. సీతాకోకచిలుకల్లా ఎగిరిన పద్యాలు, దీపాల్లా వెలిగిన పద్యాలు, కొన్ని సంపుటాలు, అశ్రువులతో కలసి ఉప్పగా మారిన కొన్ని కవితా పాదాలు, ఇక సెలవంటు వీడ్కోలు తీసుకున్న ఆత్మీయకలాలు... వెరసి 2014లో వచ్చిన కవిత్వంపై ఒక విహంగ వీక్షణం ఇది. ఇక్కడ ప్రస్తావించినవి కొన్నే.... ప్రస్తావించదగినవి మరెన్నో.... బహుశా గడచిన రెండు మూడు సంవత్సరాలతో పోల్చి చూసినపుడు తెలుగుభాషలో కవిత్వం అత్యధికంగా వెలుగు చూసిన సంవత్సరం 2014. ఒకవైపు దిన, వారపత్రికలలో, బులెటిన్లలో... మరొకవైపు అంతర్జాల వేదికలపైనా ఎక్కడ చూసినా విరివిగా కవిత్వం. వీటికి తోడు వెలుగు చూసిన అనేక కవితా సంపుటులు, సంకలనాలు! కవిత్వం కళకళలాడిన సంవత్సరం ఇది. ఇంతకీ 2014 నిండా పరుచుకున్న కవిత్వం ఏమిటి? చాలా ఉంది. 2013లో- అంతకుముందూ- తెలంగాణ కవి ఉద్యమ కవిత్వంలో మునిగిపోయాడు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత అతడు సహజంగానే సంబరపడ్డాడు. పన్నెండు వందల ప్రాణాలు ధార వోయంగ దుక్క సముద్రమైన తెలంగానం అమరులకు జోహార్ అనుకుంట రానే వొచ్చింది (అన్నవరం దేవేందర్) అని సంబురపడుతున్నాడు. మరొక వైపు ఈ ఉద్యమాలు మిగిల్చిన గోడును కూడా గుర్తు చేసుకుంటున్నాడు రజాకార్లకు తాత బలైపాయే నక్సలైట్లకు నాయిన బాయె ఉద్దెమంల కొడుకులు ఊడ్సుక పోయే మా బతుకులు కొమ్మాల జాతర్ల ప్రభలాయే... (బండారి రాజ్కుమార్) అంతేకాదు, ఉద్యమం ఉధృతంగా సాగిన రోజులలో కనీసం అటువైపు తొంగి కూడా చూడక ఇవాళ తెలంగాణ రాగానే పదవుల కోసం ప్రభువుల ప్రాపకం కోసం వెంపర్లాడుతున్న వాళ్ళని పిల్లితో పోల్చి పరిహసిస్తున్నాడు. ‘ఇవ్వాళ్ల అందరికన్నా ముందు నేనంటే నేనని నిలబడింది’.... (జూకంటి జగన్నాథం) మరొక అడుగు ముందుకువేసి తెలంగాణవచ్చాక కూడా ఆగని రైతుల ఆత్మహత్యలను చూసి- తెలంగాణకు లోహాల తళతళలు అక్కర్లేదు ఇది మట్టి తెలంగాణ ఇక్కడ మట్టి బతికితే చాలు (దర్భశయనం శ్రీనివాసాచార్య) అని ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇదే సమయంలో అటు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం అక్కడి గ్రామాలు ధ్వంసమైపోవడాన్ని చూసి ఒక నిర్మాణం కోసం సామూహిక జీవన సూత్రం ధ్వంసం కావడం వ్యవస్థీకృత విషాదం (ఏమ్వీ రామిరెడ్డి) అని బాధపడే సీమాంధ్ర కవి కనిపిస్తాడు. ఇంతకూ మనం ఎందుకు యుద్ధం చేస్తున్నామో నీకేమైనా జ్ఞాపకం వున్నదా? నా కోసం కాదు నీ కోసం కాదు మరెందు కోసం మట్టి కోసమా గోడల కోసమా? (హెచ్చార్కే) అని నిరసన తెలిపే తెలుగు కవి కూడా కనిపిస్తాడు. తెలంగాణ వస్తువు కేంద్రంగా వెలువడిన కవిత్వం ఇట్లా వుంటే చుండూరు సంఘటన పైన కోర్టు తీర్పు వెలువడిన అనంతరం తెలుగు కవి అగ్రవర్ణాల కొమ్ము కాసే రాజ్యం ఆగడాలని నిలదీస్తూ అవునొరే ఇక్కడో కోర్టు వున్న జ్ఞాపకం ఇక్కడో ఐ.పి.సి అమ్మోరు వున్న జ్ఞాపకం (పైడి తెరేష్ బాబు) అని వెటకారం చేస్తూ కనిపిస్తాడు. ఈ కాలంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలను హుద్ హుద్ తుఫాను చుట్టుముట్టింది. అది సృష్టించిన విధ్వంసాన్ని చూసి కవి స్పందించకుండా ఉంటాడా? తానిప్పుడు కెరటాల విచ్చుకత్తులతో విరుచుకుపడ్డా సరే నీ మీద ప్రేమ చావదని ఒకసారి చెప్పిరావాలి (ప్రసాదమూర్తి) అని విశాఖలోని సముద్రం పైన తన ప్రేమని చెప్పుకున్నాడు కవి. అయితే, తుఫాను తదనంతర సాయాల గురించి ఎవరెన్ని గంభీరమైన మాటలు చెప్పినా అవి దళితుల దాకా చేరకపోవడాన్ని కవి గమనించాడు. గజం స్థలం మొన మీద అడుగు పెట్టనీయని ఔదార్యం గురించి ఏ గజపతులకు మొరపెట్టుకోవాలి (తుల్లిమల్లి విల్సన్ సుధాకర్) అని గోడు చెప్పుకొన్నాడు. ఒక్క తన నేలపైనే కాదు ఎప్పట్లాగే తెలుగు కవి పరాయి దేశాలలో పెల్లుబికిన విషాదాలను కూడా తన విషాదంగా పలికాడు. గాజాలో దయలేని సైన్యాలు పసిపిల్లల్ని సైతం హతమార్చిన సంఘటనల్ని నిరసిస్తూ వాడు అమ్మతో నాన్నతో అర్ధాంగితో కన్నబిడ్డతో ముచ్చటగా తీసుకున్న అపురూప ఛాయాచిత్రాన్నయినా చూపించండిరా (అరుణ్ సాగర్) అని వేడుకునే కవిత్వంతో మనం కరగకుండా ఉండగలమా? అంతేకాదు, ఎవరి పక్షం వహించాలో గ్రహించకుండా ఉండగలమా? ఆలీవ్ కొమ్మల్నే కాదు ఆయుధాల్ని సైతం పట్టుకోగల పాలస్తీనా మేము నిన్ను ప్రేమిస్తున్నాము (విమల) యుద్ధాలు ఎవరు చేసినా మొదట బలైపోయేది స్త్రీలు, పసిపిల్లలే! పాకిస్తాన్లో ఉగ్రవాదుల దాడులలో స్కూలులోని అమాయక పిల్లలు అసువులు బాయడం చూసిన తెలుగు కవి ‘తుపాకులు తుమ్మెదల మీద ఎక్కుపెట్టరాదు’ (ఎండ్లూరి సుధాకర్) అంటూ ప్రాధేయపడతాడు. ‘మీరు పొరపడ్డారు... శవపేటికలు మొత్తం 786 కాదు’ (అనంతు చింతపల్లి) అని పసిపిల్లల ప్రాణాలను బలిగొన్నవాళ్లకు చాలా తీవ్రంగా చురకలు వేశాడు. ఠి ఠి ఠి 2014 సంవత్సరంలో ‘అరుణతార’, ఇతరేతర పత్రికలలో వొచ్చిన విప్లవ కవిత్వం కొత్త నడకలతో, కొత్త ఇమేజరీలతో వెలువడిన సంగతిని స్పష్టం చేశాయి. ముఖ్యంగా మలయాళ భాషలో వొచ్చిన విప్లవ కవిత్వాన్ని తెలుగులో తీసుకురావడం వంటి ప్రయత్నాలు మరిన్ని జరగవలసిన అవసరాన్ని గుర్తు చేశాయి. మొత్తంగా 2014లోని కవిత్వాన్ని చూసినపుడు తెలుగు కవి కొన్ని సంఘటనలకు స్పందించి రాసిన కవిత్వం కన్నా తన గురించీ, తన సంబంధాల గురించీ, తన విషాదాల గురించీ, తన ఏకాకితనాల గురించీ అర్థం చేసుకునే క్రమంలో రాసిన కవిత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. మనుషులలో క్రమంగా పేరుకుపోతున్న ఈ ఒంటరితనాల గురించి- హరప్పా మొహెంజదారో శిథిలాల్లో నీ చిరునామా దొరికింది నాగరికతా పరిణామంలో ఒంటరితనమే నీకు మిగిలింది (ఎన్.గోపి) అని వాపోయే కవి కనిపిస్తాడు. అంతే కాదు ‘చెంపల మీది బిందువుల్లా రోజులు జారి పడిపోతున్న చప్పుడు’ (మామిడి హరికృష్ణ)ని చూసి గుండెలు బాదుకుంటాడు. కదిలీ కదలని దారొకటి కొండచిలువలా కాళ్ళకు చుట్టుకొని పడుకుంటే తాబేటి చిప్పలలో శరీరాల్ని దాచుకుని పయనిస్తున్నామనే అనుకుంటాము (నరేష్కుమార్) అని ఇంకోకవి మనిషి ప్రయాణంలోని భ్రమలని పటాపంచలు చేస్తాడు. ఇప్పుడు ఒక్కొక్క వాక్యమూ తడిని కోల్పోయే రాతి నాలుకతో పొడిబారిపోతోంది (కేక్యూట్వర్మ) అని ఒక కవి తనను తాను నిందించుకుంటే చీకటి నా మనసెరిగిన ఏకైక చెలికాడు... నా చిరకాల నేస్తం... నా జిగ్రీ దోస్త్ (స్కై బాబా) అనేంత దూరం ఈ నైరాశ్యం పేరుకుపోయింది. మనిషికీ మనిషికీ నడుమ కరువవుతున్న మాటలే మనిషి లోపలి ఈ విషాదానికీ, విధ్వంసానికీ కారణమా? ‘మాటలు లేకపోవడం బాధే...మాటలు వొద్దనుకోవడమే విషాదం’ (బండ్లమూడి స్వాతీకుమారి) అని కవి ఎందుకు అంటున్నాడు? ‘ప్రతి యిద్దరి నిస్తంత్రీ సంభాషణలో వీచే వడగాడ్పుకి చిన్నారి పొన్నారి పిచ్చుకలు కూడా అదృశ్యం’ (నామాడి శ్రీధర్) అనడం ఎంత పెను విషాదం! అందుకే కవి- తాకలేమా మరికాస్త కోమలంగా ఒకరినొకరం చేరలేమా మరికాస్త సమీపంగా ఒకరినొకరం (బి.వి.వి. ప్రసాద్) అని కోరుతున్నాడు. కాని అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలు మనుషుల్ని దాదాపుగా మట్టుపెట్టేశాయి. శబ్ద చలనాలే తప్ప కరచాలనాలూ ఆలింగనాలూ లేని చోట నువ్వెప్పుడూ ఏదో ఒక టవర్ చుట్టూ ప్రవహిస్తుంటావు (బండ్ల మాధవరావు) అనేది కనిపిస్తున్న సత్యం. బహుశా ఇట్లాంటి కాలంలోనే గతం వైపు చూడాలి. జీవితాన్ని గొప్ప ఆశతో, గొప్ప ధైర్యంతో గడిపిన మన అమ్మల వైపు చూడాలి - ఇప్పటికీ ఆ కన్నుల్లో నైరాశ్యపు జాడ లేదు (కె.శ్రీకాంత్) అన్న రహస్యం ఏదో తెలుసుకోవాలి. లౌకిక వేదనాంతరంగాల్ని విస్మృతిలోకి నెట్టుకోవడం (దాట్ల దేవదానంరాజు) సాధన చేయగలమేమో చూడాలి. లేక అమ్మలాంటి ప్రకృతిలో... అమ్మ ఫొటో లాంటి పడవల రేవు అమృత స్మృతిలో (శిఖామణి) లీనమై పోగలమేమో చూడాలి. లేదా ఒక ఆనందాన్ని సముద్రంలా కప్పుకున్నప్పుడు... అలల వలల్లో తుళ్లిపడే ఒంటరి చేపవు (పసునూరి శ్రీధర్ బాబు) ఐనా కావాలి! ఆకాశం చివరంచులదాకా వెళ్లి పైలంగా తిరిగొచ్చిన పతంగి పిల్లోడిచేతిలో మళ్లీ పుట్టి పరవశించినట్టు (రవి వీరెల్లి) పరవశించాలి! అందుకే 2014లో కవి చాలా జాగరూకతతో అన్నాడు- కవిత్వం రాయడమంటే కత్తితో సహజీవనం చేయడం మొద్దుబారడానికి వీల్లేదు మోడుగా మిగలడానికి వీల్లేదు (కె.శివారెడ్డి) 2014వ సంవత్సరంలో విరివిగా కవిత్వం వెలువడడమే కాదు - కవితా సంపుటులు కూడా విరివిగానే వెలువడ్డాయి. మరిక విశేషం ఏమిటంటే 2014లో యువకవుల కవితా సంపుటులతో పాటుగా లబ్ధప్రతిష్టులైన కవుల కవితా సంపుటులు కూడా వెలువడడం! సీనియర్ కవులైన వరవరరావు ‘బీజభూమి’, నిఖిలేశ్వర్ ‘కాలాన్ని అధిగమించి’ కవితా సంపుటులు ఈ సంవత్సరంలోనే వెలువడ్డాయి. ‘ప్రతి జననం భూగోళం మీది తొలి జననంతో సమానం కదా’ అని తన ‘యాబై ఏళ్ల వాన’ సంపుటితో కొప్పర్తి వొస్తే, యాకూబ్ ‘చాలా చోట్లకి వెళ్లలేకపోవడం నేరమే.. ముఖ్యంగా నదీ మూలం లాంటి యింటికి’ అని తన ‘నదీమూలం లాంటి ఇల్లు’ సంపుటిలో పలకరించాడు. చినవీరభద్రుడు ‘స్ఫురించవలసిన శబ్దం కోసం ఒక జాలరి లాగా.. తెప్ప వేసుకుని ప్రతిరోజూ సముద్రాన్ని శోధిస్తూ’ అని తన ‘నీటి రంగుల చిత్రం’ సంపుటి వెలువరించాడు. ఇంకొక వైపు చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెరువులానైన వుండాలె చేపలానైన వుండాలె ప్రొక్లైనర్ వలే ఉండొద్దన్నం అని సిధారెడ్డి తన ‘ఇక్కడి చెట్ల గాలి’ సంపుటిలో స్పష్టంగా చెబితే ‘విప్పారిన కళ్ళతో పూలూ పిల్లలూ ఏమి మాట్లాడుకుంటారో’ అని ముకుంద రామారావు తన ‘ఆకాశయానం’ సంపుటిలో అచ్చెరువొందాడు. ఈ కవితాసంపుటులతో పాటుగా ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’, అన్నవరం దేవేందర్ ‘పొక్కిలి వాకిళ్ళ పులకరింత’, బండ్ల మాధవరావు ‘అనుపమ’, క్రాంతి శ్రీనివాసరావు ‘సిక్స్త్ ఎలిమెంట్’, మోహన్ రుషి ‘జీరో డిగ్రీ’, బాలసుధాకర మౌళి ‘ఎగరాల్సిన సమయం’, మొయిద శ్రీనివాసరావు ‘సముద్రమంత చెమటచుక్క’, కాశీరాజు ‘భూమధ్య రేఖ’, శంషాద్ ‘ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే’, యింద్రవెల్లి రమేష్ ‘వెల్లడి’ తదితర కవితా సంపుటులు కూడా 2014లోనే విడుదలయ్యాయి. అయితే 2014 మురిసిపోయిన ఒక సందర్భం - పదవ తరగతి చదువుతున్న రక్షిత సుమ అనే అమ్మాయి ‘దారిలో లాంతరు’ పేరుతో తన కవితల సంపుటిని వెలువరించడం! ఈ సందర్భంలో గత కొద్దికాలంగా తెలుగు కవిత్వలోకంలో ఒక ఉత్సవ వాతావరణాన్ని నింపేందుకు ప్రయత్నిస్తోన్న ‘కవి సంగమం’ కృషిని కూడా అభినందించాలి! 2014వ సంవత్సరం వెళుతూ వెళుతూ తెలుగు కవిత్వానికి కొన్ని విషాదాలని కూడా మిగిల్చింది. ఆధునిక తెలుగు కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన తూనికరాళ్ళను తెలుగు కవిత్వ విమర్శకు అందించిన ‘చేరాతల’ చేకూరి రామారావు గారు, దళిత కవిత్వానికి పదునైన నిరసన గొంతుకని అందించిన కవి గాయకుడు తెరేష్ బాబు, ‘లాల్ బానోగులామీ ఛోడో- బోలో వందేమాతరం’ కవిత ద్వారా రెండు మూడుతరాల యువకుల్ని ప్రభావితం చేసిన ఎన్కే, ‘తెగిన దారానికి విలవిలలాడే గాలిపటాన్ని... కేరింతలతో వినోదించడం జీవితపరమార్థం అనుకుంటాం’ అని 2014 తొలి రోజుల్లో జీవిత రహస్యాన్ని విప్పి చెప్పిన కవి జాన్హైడ్ తదితరులంతా 2014లోనే తెలుగు సాహిత్య లోకం నుండి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. చివరిగా తెలుగు కవులందరూ 2014లో విమల రాసిన ఈ కవితా వాక్యాలని ఒకసారి చదువుకోవాలి - కవీ! విర్రవీగకు! నీ కొన్ని పద్యాలు మాత్రమే ఎగురుతాయి పక్షుల వలే సీతాకోకచిలుకల వలే కొన్నాళ్ళు రెక్కలు తెగిపోయాక అవి కూడా ఎక్కడో అనామకంగా నేలరాలిపోతాయి ఏవో కొన్ని పద్యాలు మాత్రమే దారిలో చిరుదీపాల్లా వెలుగుతాయి.... - కోడూరి విజయకుమార్ 83309 54074 -
వాన పడతాది జాన... ఎట్ట బొమ్మందునో...
జ్ఞాపకం ‘‘నేను హనుమకొండకు వచ్చిన తర్వాత వెలువడిన ‘సృజన’ సంచిక జూలై 1973. అప్పటికే ఎన్.కె, జనసేన, కానూరి వెంకటేశ్వరరావుల పాటలు విని, వాటిలో కవిత్వం కొంతైనా అనుభవించి ఉన్నానుగాని ఆ సంచికలోనే మొదటిసారిగా వి.బి. గద్దర్ పాటలు చూశాను. అప్పటికే లయ ఉన్న కవిత్వం, గొంతెత్తి చదువుకునే కవిత్వం రుచి దొరికి ఉన్న నాకు ఆ సంచికలో అచ్చయిన నాలుగు గద్దర్ పాటలు కొత్త కవిత్వాన్ని పరిచయం చేశాయి. ‘నీవు నిజం దెలుసుకోవరో కూలన్న నీవు నడుం గట్టి నడవాలి రైతన్నా’... ‘రిక్షాదొక్కేరహీమన్న రాళ్లుగొట్టే రామన్న డ్రైవర్ మల్లన్న హమాలి కొమ్రన్న’... ‘వాన పడతాది జాన ఎట్టబొమ్మందునో’ ‘కల్లుముంతో మాయమ్మ నిన్ను మరువజాలనే’... అనే పాటలు చదువుతుంటే ఒళ్లు పులకించింది. ఇంత మామూలు మాటలతో ఇంతగా ఉద్రేకపరిచే కవిత్వం ఉంటుందా అని ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మూడు నెలలకు ఆ పాటలు గద్దర్ నోటి వెంట విన్నప్పుడు కలిగిన ఉత్తేజం నిజంగా చెప్పడం అసాధ్యం. నిజానికి గద్దర్ పాటలు అచ్చుకెక్కడం అదే మొదటిసారి. అందుకే అవి అచ్చవుతున్నప్పుడు సృజన సంపాదకీయ వ్యాఖ్య కూడా రాసింది. ‘ఈ సంచికలోనూ రాగల వొకటి రెండు సంచికల్లోనూ ఎక్కువ సంఖ్యలో వేయనున్న వి.బి.గద్దర్ పాటలు త్వరలో పుస్తకరూపంలో కూడా వస్తాయి. హైదరాబాద్ జిల్లా మాండలికాలు, అక్కడి ప్రజాజీవితం మాత్రమే కాదు- ఈ పాటలన్నీ ఆ చుట్టుపట్ల పల్లెల్లో ప్రజలు పాడుకునే బాణీల్లో వచ్చినవే. కొన్ని పాటల మకుటాలు చరణాలు కూడా ప్రజలు పడుకునే పాటల నుంచే తీసుకుని విప్లవభావాలకు అనుగుణంగా మలచినవి. ఈనాడివి హైదరాబాద్ చుట్టూ దాదాపు ఇరవై గ్రామాల్లో విరివిగా పాడుకోబడుతున్నాయి’ అని సృజన రాసింది. అప్పటికి ఎంత అర్థమయ్యాయో చెప్పలేనుగాని ఆ తర్వాత నాలుగు నెలలు నిజంగా జీవితం మారిపోయిన రోజులు. ఆ తర్వాత వెలువడిన ఆగస్ట్ 1973 సంచికలో ‘వీడేనమ్మో డబ్బున్న బాడుకావు’, ‘పోదామురో జనసేనలో కలిసి’, సెప్టెంబర్ 1973 సంచికలో ‘రెక్కబొక్క వొయ్యకుండ సుక్కసెమ్ట వొడ్వకుండ బొర్ర బాగా బెంచావురో దొరోడో’, ‘పిల్లో నేనెల్లిపోతా’, ‘నిజం తెలుసుకోవరో కూలన్న’... గద్దర్ పాటల ప్రభంజనం. - ఎన్. వేణుగోపాల్ ఫేస్బుక్ గ్రూప్ ‘కవి సంగమం’లో ‘కవిత్వంతో ములాకాత్’ పేరిట వస్తున్న వ్యాస పరంపర నుంచి -
అక్షర క్షిపణి
మనసొప్పు మాటలు.. చార్మినార్ హైదరాబాద్ ప్రతీక. నాలుగు బాహువులు చాచిన ఆ కట్టడం హైదరాబాద్ను కాపాడుతున్న ఒక చిహ్నం లాంటిది. ‘మత కల్లోలాలెన్ని చెలరేగినా మధ్యన చలించక నిలిచే/యోధానుయోధుడే/చార్మినార్’ అంటాడు అలిశెట్టి. హైదరాబాద్ ఎగ్జిబిషన్ మీద కూడా ఆయన ఒక సిటీలైఫ్ రాశాడు. ‘ఏముందీ ఎగ్జిబిషన్లో/ రేట్లూ ఎక్కువ/ గేట్లూ ఎక్కువ’ అంతేకదా! అట్లాగే సిటీ పోకడలు, ఇక్కడి ఫ్యాషన్లు, సినిమా స్టైళ్లు..వాటిని ఎకసెక్కం చేసే ‘ఎంతటి బాబ్డ్ హెయిరయినా/ మళ్లీ కొప్పు/ మనసొప్పు’ అని ఒక వ్యాఖ్యానంలా ఆయన కవిత్వం ఉండేది. ‘ఎవరీ హైహీల్స్/ బంజారాహిల్స్’ రెండే పదాలు. బంజారాహిల్స్లాంటి సంపన్నులు నివసించే ప్రాంతం మీద ఇంత చిట్టి కవిత్వం. ఇంత సారం ఉన్న కవిత్వం మరొకటి ఉండదేమో. అక్షరాలతో అగ్గిని పుట్టించిన కవుల నేపథ్యం కష్టాలే. సామాన్యుడి జీవనదారులను పెట్టుబడిదారులు కబ్జా చేస్తే.. ఆయుధమై మండే ఆకలికి ఆజ్యం పోసేది ఈ అక్షరాలే. ఈ కవితా కవనంలో క్షిపణులు పూయించిన యోధుడు అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాలలో కవ్వించిన ఈ కవిత.. పట్నం వీధుల్లో స్వైరవిహారం చేసింది. రెండు దశాబ్దాలకుపైగా సిటీలైఫ్తో ముడిపడిన జీవితం నిర్ద్వంద్వంగా, నిర్భయంగా సాగింది. చిక్కడపల్లిలో 21 ఏళ్ల కిందటి దాకా అలిశెట్టి ప్రభాకర్ జీవించి ఉండేవాడు. పతంజలి ఒక గుడ్డివాడి పిల్లనగ్రోవి కథకు మూలమైన మూసీ వంతెన దాటాక, కుడివైపు సందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్లే దారిలో, ఇరువైపులా కంకబొంగుల ఆర్చీల మధ్యన ఒకానొక చిన్న ఇంట్లో మేడ మీద రెండు గదుల్లో ఆయన నివాసం. ప్రభాకర్ కూడా అంతే. నిలువెత్తు శరీరంలో ఛటాక్ మాంసం కూడా లేని కట్టెబద్దలా ఊగులాడుతూ తిరుగాడేవాడు. భాగ్య, ఇద్దరు పిల్లలు, దినాం ఇరవై నాలుగు గంటలూ ప్రవహించే దుమ్ము, గుమ్మం నుంచే పరుచుకుని ఉండే ఆయన చిత్రకళా సౌరభాలు, కవిత ్వం, పాత పుస్తకాలు, చెల్లాచెదురుగా పడి ఉండే బ్రష్షులూ, ఇంకులూ జీవితాంతం ఆయనను అంటిపెట్టుకుని ఉన్న దుమ్ము, ధూళి, దగ్గు, దమ్ము.. చివరి రోజుల్లో ప్రభాకర్ మరీ శిథిలమైన కాలమొకటి ఉండేది. అప్పుడు అక్కడికి కూతవేటు దూరంలో ఉండే (సూర్యానగర్, చిక్కడపల్లి) జయధీర్ తిరుమలరావు, యూనివర్సిటీలో ఉండే ఘంటా చక్రపాణి, శ్రీనగర్ కాలనీలో ఉండే నేనూ.. చివరి రోజుల్లో ఆయనను బతిమాలి బామాలి నిజాం వెంకటే శం నుంచి వరవరరావు దాకా అన్ని ప్రయత్నాలు చేసి ప్రభాకర్ టీబీ మీద యుద్ధం ప్రకటించినా.. ఆయన ఆ జబ్బుకు వెరవలేదు. కవిత్వం మీద తప్ప అన్నింటా నిర్లక్ష్యం, జీవన వైఫల్యం, లోపలి సంక్షోభం, జగిత్యాల వయా కరీంనగర్ హైదరాబాద్ వచ్చి చిక్కుల్లో పడ్డాననే అపరాధ భావన ఆయనను దేనికీ లొంగకుండా చేసింది. మందులు వాడినా, ఆ మందులు పని చేయని కాలంలో కూడా ప్రభాకర్ మొండిగా ఉండేవాడు. అందరూ చేతులు వేలాడేసినపుడు జయధీర్, ఘంటా, నేనూ ఆయన కోసం మళ్లీ ఒక కొత్త ప్రయత్నం చేసి ఓడిపోయాం. ఆ తర్వాత అతనొక చరిత్ర మాత్రమే. కానీ ఇదే నగరాన్ని, దాన్ని ప్లాస్టిక్ మొహాన్ని, దాని కుహనా విలువలనీ ఎండగడ్తూ పత్రికలో రోజూ కవిత్వం రాసి, ఒకదశలో అదే ఆయన జీవితం గడిచే సాధనం కావడం కూడా ఒక చరిత్రే. రోజూ ఈ సిటీ జిలుగువెలుగుల నర్మగర్భాన్ని చిత్రించిన ఆయన కవిత్వమే ‘సిటీలైఫ్’. అందరి అడ్డా.. పుట్టిన గడ్డనుంచి ఇక్కడికి రావడం పొరపాటైందని ప్రభాకర్ స్వీయ ప్రకటనలో రాసుకున్నారు. జగిత్యాలలో బతుకుదెరువు కోసం పెట్టుకున్న పూర్ణిమ ఫొటో స్టూడియో, కరీంనగర్లో ‘శిల్పి’ ఆయింది. జగిత్యాల కల్లోల పరిస్థితులు, కరీంనగర్లో కల్లోలాలతో కరచాలనం, సహవాసం ఆయన ను పుట్టిన గడ్డ మీద నిలువనీయలేదు. అనివార్యంగా హైదరాబాద్కు వచ్చి విద్యానగర్లో ‘చంద్రలేఖ’ అయ్యాడు ప్రభాకర్. యూనివర్సిటీకి వెళ్లే దారిలో, ఆంధ్ర మహిళాసభకు కొంత ముందు ఎదురుగా ప్రభాకర్ స్టూడియో ఉండేది. జిల్లాల నుంచీ, యూనివర్సిటీ నుంచీ వచ్చే పిల్లలకు అది అడ్డా. చాయ్లు, సమోసాలు, అన్నాలు. ప్రభాకర్ది గుంపు స్వభావం. మందిలో బతికాడు. ఇదే ఫొటో స్టూడియోతో అనుబంధం ఉన్న ‘వీరన్న’ ఆ తర్వాత ప్రభాకర్ని మించి క్రాస్రోడ్స్ దగ్గర ఒకానొక ఎదురుకాల్పులకు బలైపోయినవాడు. ప్రభాకర్ చుట్టూ మనుషులు వీళ్లు. నిప్పు కణికలు ‘సిటీలైఫ్’ కోసం ప్రభాకర్ బంజారాహిల్స్కు వచ్చేవాడు. అక్కడ ఆంధ్రజ్యోతి. సన్నగా, గాలిలా ఊగులాడుతూ గంపెడు జుట్టు, హిప్పీ కటింగ్, వంపు తిరిగిన మీసం, ఆయన రాకకోసం ప్రేమగా ఎదురుచూసే వర్ధెల్లి మురళి, వి.శ్రీనివాస్, రాంమోహన్ నాయుడు, సురేంద్రరాజు, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ లాంటి పాత్రికేయులు. జన సంబంధాల్లో ఈ పాత్రికేయులే ప్రభాకర్కు చివరి అండ. ఈనాడు వెంకన్న, ఒక పాత్రికేయ సమూహం ఆయన ‘సిటీలైఫ్’ను మోసుకుని తిరిగేది. ఇదీ ప్రభాకర్ ఆవరణ. ఇదీ ప్రభాకర్ జీవితం. చురకలు, మంటలు, జెండాలు, సిటీలైఫ్.. అసహ్యకరమైన,, బురదమయమైన, జీవితాల నగ్న చిత్రణే సిటీలైఫ్. ఈ జీవితంలో ఉండే కాపట్యం, విలువల పతనం, ధ్వంసమైపోతున్న సమస్త మానవ విలువలు, హింసా రాజకీయాలు, నెత్తురూ, కన్నీరూ కలిపి ప్రవహించే అతి సామాన్యుడి జీవితం, ఎంతకూ వెలగని నిప్పు కణికల గురించిన స్పృహ ఆయన చిట్టి చిట్టి పద్యాల నిండా ఉండేవి. ఏదో ఒక సందర్భమో, ఆ రోజుకి ఆయనను కలచి వేసిన దృశ్యమో, పరిణామమో, మూడు వందల అరవైఐదు రోజులూ క్రమం తప్పకుండా ఆయనతో కవిత్వం రాయించింది. అల్ప పదాల్లో అనంతసారం ‘ఏ దేశం శిరసు మీద/ మోపిన/ పాదాలైనా/ హోదాలైనా/ సామ్రాజ్యవాదాలే’ అంతే కవిత్వం అయిపోయింది. ఇక మీరు ఏమి ఆలోచించాలో ఆలోచించండి. సామ్రాజ్యవాదాన్ని ఇంత సులభంగా కవిత్వంలోకి తేవడం సాధ్యమేనా? ఈ సిటీలైఫ్ ఎప్పటిది? కనీసం రెండున్నర దశాబ్దాల కిందటిది. సామ్రాజ్యవాదం సారాన్ని ఈ నాలుగు మాటలు చెప్పినంత శక్తిమంతంగా మరెవరన్నా చెప్పగలిగారా? అదే అలిశెట్టి ప్రభాకర్ కవిత్వ సారం. కావ్య లక్షణాలూ, ప్రమాణ పాండిత్యాలు, రూపశైలీ విన్యాసాలు జానేదేవ్. ఇంత సులభంగా అల్ప పదాల్లో అనంత సారం. పాట మీద నిర్బంధం సమయంలో ప్రభాకర్ ‘గొంతు కోస్తే/ పాట ఆగిపోదు/ అది ముక్తకంఠం/ గొలుసులేస్తే/ పోరు నిలిచిపోదు/ అది ప్రజాయుద్ధం’ అంటాడు. సామాన్యుడి కవి.. హైదరాబాద్ ఇరవై ఏళ్ల కింద ఇప్పటిలా ఉండేది కాదు. ఇప్పుడు ప్రాభవంతో, మాల్స్తో, మైమరిపించే గాజు అద్దాల ఊదారంగు ఆఫీసుల్తో, నిత్య నరకంలా ఉండే కిక్కిరిసిన రోడ్లతో, కాంక్రీట్ జనారణ్యంలా అప్పటికింకా మారలేదు. కోఠి, సుల్తాన్బజార్, అబిడ్స్ మాత్రమే అప్పుడు పెద్ద వ్యాపార కేంద్రాలు. మంది తిరిగే ప్రాంతాలు. ‘సాయంత్రం/సుల్తాన్బజార్/ స్త్రీల సెలయేరు/ ఆ రంగురంగుల మెరిసే గులకరాళ్లే/ కలవారు’ అని సుల్తాన్ బజార్ను వర్ణిస్తాడు అలిశెట్టి. ‘ఎందుకురా కవీ/ గజిబిజి ఇమేజీ/ అస్పష్ట కవిత్వం కన్నా/ ఆల్జీబ్రా ఈజీ’ అని కవిత్వం సులభంగా, అర్థమయ్యేట్లుగా ఉండాలనే సామాన్యుడి కవి ప్రభాకర్. పదునైన మాట.. పసందైన గీత.. కవిత్వం రాయడమే కాదు. ఆ కవిత్వాన్ని సామాన్యుల చెంతకు, యూనివర్సిటీలకు మోసుకువెళ్లి ప్రజల పరం చేయడానికి ఒంటిచేత్తో సాహసం చేసి గెలిచినవాడు కూడా ప్రభాకర్. అలిశెట్టి చిత్రకారుడు కూడా. తన చిట్టిపొట్టి కవితలకు తనే బొమ్మలేసుకుని, వాటిని ఫొటోస్టాట్ కాపీలు చేసి ఒక తాడుకు కట్టి ఆర్ట్స్ కాలేజీలో వేలాడదీసి కవితా, కళా ప్రదర్శన పెట్టేవాడు. యూనివర్సిటీలు ఆయన కవితానామస్మరణ చేసేవి. ఆర్ట్స్ కాలేజీలో ఒక ప్రదర్శన. అప్పుడు వాతావరణం కూడా అనుకూలమైన ఉద్యమ వాతావరణం. ఏ రాజకీయాలకు సంబంధం లేనివాళ్లు, ఏ అవగాహనలూ, ప్రాపంచిక దృక్పథాలు లేనివాళ్లు కూడా ప్రభాకర్ కవిత్వసారాన్ని మనసున పట్టించుకునే వాళ్లు. కవిత్వమంటేనే జోకులేసే కాలంలో ఆయన కవిత్వాన్ని మౌఖిక సాహిత్యం వలే ఊరూరా తిరిగి ప్రచారం చేయగలిగారు. ‘పేదవాడికి అందనివి/ చెందనివి/ మచ్చుకు రెండు/ జూబ్లీహిల్స్ రాయి/ కృష్ణా ఒబెరాయి’.. శ్రీమంతం కుప్పబోసి, కేంద్రీకృతమైన జూబ్లీహిల్స్, అప్పుడప్పుడే వెలుస్తున్న ఫైవ్స్టార్ సంస్కృతి మీద ఇది ఆయన పదునైన కవిత. సోవియట్ రష్యా పతనం అవుతున్న క్రమంలో గోర్బచెవ్ తెచ్చిన ‘బాహాటత’ మీద ప్రభాకర్ సిటీలైఫ్ ఇది.. ‘ఇప్పుడిప్పుడే సోవియట్ అందాలు/ విరజిమ్ముతోంది/ గ్లాసు కోస్తు/ గోర్బచ్చేవా’అని రాశాడు ఆయన. సమకాలిక స్పృహ, సహజ స్వభావంగా వచ్చిన నగర కృత్రిమతల వ్యతిరేకత, ప్రాపంచిక దృక్పథం వీడని భావజాల ప్రపంచం, సిటీ మర్మాల మీద ఆయన ఝళిపించిన కొరడాయే ఆయన కవిత్వం. మోడర్న్ ఆర్ట్ గ్యాలరీలో కనిపిస్తే ఒక ఖాళీ (ఫ్రేమ్) చిత్రమేముంది మిత్రమా ఊహించుకో అది గాలి (టైటిల్) అని వెక్కిరిస్తాడు. కోట్ల విలువ.. అలిశెట్టి ప్రభాకర్ జీవితమే కవిత్వంగా బతికినవాడు. సిద్ధార్థుడు వదిలివెళ్లిన ఈ రాజ్యం మీద నెత్తుటిధారలు కడిగేందుకు కవిత్వం ఆయనకు అవసరమైన ఆయుధమైంది. సిటీలైఫ్ ప్రభాకర్ సమగ్ర కవితా స్వరూపానికి కొలబద్ద కాదుగానీ, ఆయనను ఆదుకొని అన్నం పెట్టిన కవితారూపమైంది. ఫొటో స్టూడియోలు, చిత్రకళ ఆయనను బతికించలేదు. కవిత్వమే ఊపిరిగా బతికిన అలిశెట్టి ‘కోట్’ లేకుండా వార్తలు లేవు. వ్యాసాలు లేవు. ‘తాను శవమై/ తనువు వశమై/ తాను పుండై/ అందరికీ పండై’ అన్న కవితను ఎందరు ఎన్నిసార్లు వాడుకున్నారో లెక్కలేదు. గోడ మీద ఆయన కవిత్వ నినాదమయ్యాడు. ఒక ప్రవాసిలాగా తప్పిపోయిన పిల్లవానిలాగా ఈ సిటీ వెలుగుల వెనుక చీకట్ల సారాన్ని ఒడిసిపట్టిన ‘సిటీలైఫ్’ కవి పుట్టినరోజు, వ ర్ధంతి రోజు ఇవ్వాళ. జనవరి 12. ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత కూడా ఆయన ప్రాసంగికుడే. ఒక నమూనాయే. తెలంగాణ జీవన నేపథ్యం, కల్లోలాల నుంచి ఎదిగివచ్చిన ప్రభాకర్ చివరిరోజు అదే చిక్కడపల్లి ఇంట్లో తెల్లారింది. ఒకానొక రాత్రిపూట చాపమీద భారంగా పడుకుని ఉన్న ఆయన పార్ధివదేహం ముందు భాగ్య, పద్మ, వి.శ్రీనివాస్, నేనూ నిశ్శబ్దంగా ఆ రాత్రి గడిపిన విషాదక్షణాల యాది. తెల్లవారి ప్రభాకర్ కోసం ఒక జన సమూహం వచ్చింది. ఎర్రజెండా కప్పి చిక్కడపల్లి నుంచి అంబర్పేట దాకా పెద్ద ఊరేగింపు. గుండె ఉండాల్సిన చోట ఉంచుకొని బతికిన ప్రభాకర్ను తలుచుకున్నప్పుడల్లా గుండె తొలగుతున్న వర్తమానంలా మనాది. -
శాఖమూరి కవిత్వం.. భేష్
⇒ మూడో తరం విప్లవ కవులు వస్తున్నారు ⇒విరసం కార్యవర్గ సభ్యుడు కాశీం ⇒పాదముద్రలు కవితా సంకలనం ఆవిష్కరణ హన్మకొండ కల్చరల్ : శాఖమూరి రవి రాసిన కవితలు ప్రజా జీవితంలో నుం చి, మనిషిని నమ్మిన రాజకీయాల్లోంచి వచ్చాయని విరసం కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కాశీం అన్నారు. శాఖమూరి కవిత్వం ప్రతిభావంతంగా ఉందని, విరసం కవుల్లో మూడో తరం అంకురిస్తోందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. హన్మకొండ హంటర్రోడ్డులోని వరంగల్ పబ్లిక్స్కూల్లో విరసం ప్రచురించిన పాదముద్రలు కవితా సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ముఖ్యఅతిథిగా కాశీం పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఒరిగిపోతున్న అమరవీరులు.. బాధ్యతలను, నమ్మిన సిద్ధాంతాలను అప్పగించి వెళ్తారని తెలిపారు. శాఖమూరి రవి అలాంటి పోరాట గమనంలో రాసిన కవి తలు నేటి తరానికి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వెయ్యి సంవత్సరాల దేశ సాహిత్య చరిత్రలో విప్లవ కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. విప్లవ కవి తా ప్రక్రియ క్లిష్టమైందని, కొన్నిసార్లు పద బంధాల్లో పొరపాట్లు దొర్లితే మరో అర్థం వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిని విరసం ఆమోదించినట్లు ప్రజలు భావిస్తారన్న విషయాన్ని రచయితలు గుర్తించాలని సూచించారు. ఆకుల భూమయ్య మర ణం రాజ్యం చేయించిన హత్యగానే భావిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలదో, దొరలదో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. విరసం జిల్లా కన్వీనర్ పి.వీరబ్రహ్మచా రి అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణసభలో మెట్టు రవీందర్ పుస్తకసమీక్షించగా పుట్ట సోంమల్లు ప్రసంగించారు. కార్యక్రమంలో అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నాయకులు భారతక్క, అరుణక్క, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రమాదేవి, తం గెళ్ల సుదర్శన్, లింగారెడ్డి, బాలకుమార్, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, శ్యాంరావు, హుస్సేన్, రామస్వామి, సదయ్య, సురే ష్, రమేష్చందర్ తదితరులు పాల్గొన్నారు. -
షాయరీ షహర్
గుల్జార్.. అక్షరానికి ఆత్మబంధువు! కవిత్వం ఆయన కలానికి క్లోజ్ఫ్రెండ్! మధ్యలో మనసు కొన్నాళ్లు సినిమాలెన్స్ను పెట్టుకున్నా రచనావ్యాసంగం దారిమళ్లలేదు!. రొమాంటిక్ కవితలను రాసి యువతను ఆకట్టుకున్నా చిన్నపిల్లలనెప్పుడూ చిన్నబుచ్చలేదు!. మోగ్లీతో మురిపించారు! ఇప్పటికీ వాళ్లకు ఆత్మీయ రచయితే! ఉర్దూ యూనివర్సిటీకి అతిథిగా.. హైదరాబాద్ యూనివర్సిటీ డాక్టరేట్ను అందుకోవడానికి నగరానికి వచ్చిన గుల్జార్ చెప్పిన సంగతులు కొన్ని.... హైదరాబాద్తో నా అనుబంధం ఈనాటిది కాదు. నేను ఉర్దూ నేర్చుకుంటున్నప్పటిది. ఎన్నిసార్లు వచ్చానో ఈ నగరానికి. ఇది కులీ కుతుబ్షాహీల నగరమైనా నేను మాత్రం కవిత్వానికి చిరునామాగా చూస్తాను. నా దృష్టిలో హైదరాబాద్ ప్రాముఖ్యాన్ని పెంచేది ఇక్కడి ఉర్దూ భాషే! ఆ ప్రేమతో ఎన్నో సార్లు ఈ ఊరికొచ్చాను. చిన్నపిల్లల సాహిత్యమంటే ఉన్న అభిమానంతో చిల్డ్రన్ ఫెస్టివల్ కోసమూ కొంత పనిచేశాను. జయాబచ్చన్ హయాంలో చిన్న పిల్లల సినిమా పండగకు ఓ శాశ్వత వేదికను ఏర్పాటు చేయాలనుకున్నాం. అది హైదరాబాద్ అయితే బాగుంటుందని ఈ ఊరునే ఖాయం చేశాం. అలా కిందటేడు ఈ సినిమా పండుగకు హైదరాబాద్ వచ్చాను. ఈ ఊరుతో నాకున్న అటాచ్మెంట్ అలాంటిది. నడిపించే శక్తి.. ప్రతి కళాకారుడికి, రచయితకు ముఖ్యంగా నాలాంటి వాడికి ప్రశంసల అవసరం ఉంటుంది. ఎందుకంటే మేంవెళ్తున్న దారి సరైనదేననే మా నమ్మకాన్ని మరింత బలపర్చడానికి. ఈ తరానికి నా దరఖాస్తు ఒక్కటే.. మీరు కొత్త కొమ్మలు. కొత్త ఆలోచనల సరికొత్త చిగుర్లు. మాలాంటి వాళ్ల చేయిపట్టుకొని నడిపించే శక్తిమంతులు. అందుకే మా వేలు పట్టుకుని నడిపించండని కోరుతుంటాను. కానీ ఈ తరాన్ని చూస్తే కలవరమూ కలుగుతోంది. ఈ తరానికి ఓపిక తక్కువైంది. పఠనాసక్తి పోయింది. సినిమాల మీదున్న మోజు చదవడం మీద చూపించట్లేదు. నేను తీసిన సినిమాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే టక్కున చెప్తారు కానీ నేను రాసిన పుస్తకాల్లో ఓ అయిదింటి పేర్లు చెప్పమంటే... జవాబు ఉండదు. సాహిత్యానికి దూరమైన ఈ తరాన్ని చూస్తుంటే జాలేస్తోంది. మంచి సినిమా వినోదాన్ని మాత్రమే ఇస్తుంది కానీ పఠనం విజ్ఞానాన్నిస్తుంది. విజ్ఞతను పెంచుతుంది. జీవించే తోవను చూపిస్తుంది. మూసిన అలమార తలుపుల వెనకున్న పుస్తకాలు నెలలకు నెలలుగా నిరీక్షిస్తున్నాయి.. మీ సాంగత్యం కోసం. ఇది వరకు సాయంకాలాలు పుస్తకాల పుటలమీదుగా జారిపోయేవి కానీ ఇప్పుడు మీ కనురెప్పలు కంప్యూటర్ వీక్షణతో బరువెక్కిపోతున్నాయి. అందుకే యువతరానికి నా విన్నపం.. పుస్తకాలు బాగా చదవండి ! ..:: సరస్వతి రమ -
అమ్మదొంగా? ఏకశిలానగరం క్రీ,శ 1300 ( వరంగల్)
పదం నుంచి పథంలోకి 16 గజదొంగ కన్నప్ప రాజమహేంద్రి నుంచి ఓరుగల్లుకు ఆ పూటే వచ్చి దిగబడ్డాడు. ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. దొంగతనం చేస్తే ఓరుగల్లు పడమటి వీధుల్లోనే చేయాలి’ అని తన గురువు మాటవరసకన్న మాటను పట్టుకొని బయలుదేరి అక్కలవీధిలో పూటకూళ్ల సీతక్క ఇంట్లో బసచేసాడు. పొద్దుపోయే వేళకి నిద్రలేచి మండువాలో అడుగుపెట్టాడు. ‘ఏమయ్యా! ఉదయం వచ్చిన కాడ్నించీ పండుకొనే ఉన్నావ్? ఏ ఊరేంటి మనదీ?’ అడిగింది సీతక్క. ‘రాజమహేంద్రి! కంసాలి బిడ్డని’ అంటూ ఒళ్లు విరుచుకొని ‘పక్షంరోజులు బండి ప్రయాణం. అడివిదారి. దేహం పులుసై పోయింది’ అని జవాబిచ్చాడు కన్నప్ప. ‘ఇంకేం మా మంగలి భీముడు ఒక్కసారి వీపు తోమితే చాలు అన్నీ సర్దుకుంటాయి. వేడి పాలిస్తాను తాగి స్నానం చేసిరా అన్నం పెడతాను’ అని కంచు చెంబులో పాలు తెప్పించింది. సీతక్కది ఓరుగల్లు అక్కలవీధిలో అతిపెద్ద పూటకూళ్లిల్లు. రెండంతస్తుల మేడ. లోగిలి చుట్టూ మామిడితోట. రోజూ మార్చే చలువ దుప్పట్లతో నలబై పడకగదులు, ఇక భోజనాల సమయంలో అయితే ఆ ఘుమఘుమలే వేరు. ఒక రూకకి నెల్లూరి సన్న బియ్యం, పెసరపప్పు, నాలుగు కాయగూరలూ, లప్పల కొద్ది పెరుగుతో రుచికరమైన భోజనం. పాండ్యదేశపు నల్ల మిరియాలతో సీతక్క చేసే ధప్పళం కోసం రూక వెచ్చించి విస్తరి కోసం జనం పడిగాపులు పడుతారు. అలాంటి సీతక్క ఇంట దిగి, వేడి పాలు తాగి తోటలోని స్నానమంటపం చేరాడు కన్నప్ప. మామిడితోటలో అరుగులపై చాలామంది కనిపించారు. తాంబూలం సేవిస్తూ భుక్తాయాసంతో అవస్త పడుతూ సాటి వర్తకులతో వ్యాపారం సాగించే కోమట్లు... వెనుకమూలలో చలువపందిరి కింద గొల్లభామలు కాల్చిన వేడివేడి చీకులు, కొబ్బరిపాలలో నాన్చిన చేపముక్కల నంజుడుతో గౌడు కాసిన ఆసవాలు సేవిస్తూ వాగ్యుద్ధాలు చేసే తెలగ ఎక్కట్లు, రెడ్డివీరులు, వెలమనాయకులు.... మండువా అరుగుపై ఆంధ్రదేశం నలుమూలల నుంచి వచ్చి తమ పాండిత్యంతో, కవిత్వంతో రాజాస్థానంలో ప్రవేశం కోసం గాలం వేసే పండిత ప్రకాండులు... స్నానశాల పక్కనే చలువరాతి అరుగుపైన బోర్లా పడుకొని ఒళ్లు పట్టించుకుంటున్నాడు కన్నప్ప. పూటకూళ్లక్క చెప్పినట్లు భీముడి చేతిలో ఏదో మంత్రముంది. సంపెంగ, బాదం నూనెలతో వాడు ఒళ్లు పడుతుంటే బడలిక ఇట్టే మాయమయిది. ‘తమరు ఓరుగల్లుకి కొత్తనుకుంటాను బాబయ్యా. ఎన్నాళ్లుంటారో?’ బొటనవేళ్లతో వెన్నుపూసలని కొలుస్తూ మాట కలిపాడు భీముడు. ‘పనయ్యేదాకా! ఎన్నాళ్ళయితే అన్నాళ్లు!’ మూలిగాడు కన్నప్ప. ‘ఏం పనో’ ‘నగల వ్యాపారం! నీకు తెలిసినంతలో మంచి నగల బేరానికి బాగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారేంట్రా?’ అని అడిగాడు కన్నప్ప. ‘ఎందుకు లేరూ. అడిగో అనుమయ్య. జొన్నల వ్యాపారి. కోటలో ధాన్యం కోష్టం, మైలసంతలో వీధిబారునా అంగళ్ళు. ధనం బాగా మూలుగుతోంది. అందునా వచ్చేనెల బిడ్డ పెళ్ళి’ అంటూ చెట్టు కింద కూర్చొని నెరిసిన బుంగమీసాలు, తలపై సరిగ రుమాలు, చెవులకి బోలుకమ్మలతో, తోటి కోమట్లతో ముచ్చట్లాడుతున్న శెట్టిని చూపాడు. ‘సీతక్కతో కబురుచెయ్యి బాబయ్యా. ఇంట్లో ఆడాళ్లకి నీ నగలు నచ్చితే కొనకచస్తాడా!’ అంటూ నవ్వాడు భీముడు. ************** పడమటివీధి మొదట్లో శివాలయం ముందు దారికి అడ్డంగా భైరవుడి విగ్రహం. వెళ్ళేపని సరిగ్గా సాగితే బూరెల దండ వేయిస్తానని మొక్కుకొని లెంపలు వేసుకుంటూ ముందుకి సాగాడు కన్నప్ప. అనుమయ్య శెట్టిది పడమటి వీధిలో పదడుగుల ప్రహరీ మధ్యలో రెండంతస్తుల మేడ. ఇంటి గోడలు దిట్టంగా కోటగోడల్లా ఉన్నాయి. వీధిలోంచి ప్రహరీగోడ మీదకి వాలిన పొగడచెట్టు కొమ్మని గమనిస్తూ ఇంట్లోకి ప్రవేశించాడు కన్నప్ప. సేవకునికి ఒక కాసు లంచం పడేస్తే శెట్టిసాని దర్శనం సులువుగానే అయ్యింది. ‘నమస్కారం శెట్టిసాని’ అని నమస్కారం పెట్టాడు కన్నప్ప. ఆమె ఎగాదిగా చూసింది. కన్నప్ప తన దగ్గరున్న దంతపు పెట్టెను తెరిచాడు. రత్నాల హారం. ఛక్కున మెరిసింది. దానికి అతడు చెప్పిన వెలకి నిర్ఘాంతపోయింది శెట్టిసాని. అణుచుకోలేని ఆనందంతో అతడిని అక్కడే ఉండమని సంజ్ఞచేస్తూ గబగబా పడమటి గదిలోని పెనిమిటి వద్దకి వెళ్లి- ‘వ్యాపారానికి కొత్తనుకుంటాను. లేకుంటే కనీసం నూరు గద్యాణాలు చేసే హారానికి నూరు మాడలేనా? సగానికి సగం! బంగారం బరువే సరిపోతుంది’ అని మొగుడి చెవిలో గుసగుసలాడింది. ‘ఏమో. కొత్తవాడంటున్నావ్. కాకిబంగారం కాదుకదా?’ అడిగాడు, అనుమయ్య. ‘ఆహా. మన కంసాలికి చూపెట్టాను. మేలిమి బంగారం. రాళ్ళు కూడా జాతి రాత్నాలే. ఏమైనా మన అమ్మాయి అదృష్టవంతురాలు’ ‘అయితే తీసుకో. నూరు మాడలేగా? అతడ్ని పిలువు’ అంటూ పడమటి గది గోడలో అమర్చిన ఇనుపపెట్టె తెరిచాడు. దూరం నుండే ఉత్కంఠతో అంతా గమనిస్తున్న కన్నప్ప తృప్తిగా ఊపిరిపీల్చాడు. ********* అర్ధరాత్రి దాటింది! మరునాటి రాత్రి గడిస్తే మైలసంత. అనుమయ్య శెట్టి పనివాళ్ళంతా కోట బయట దుకాణాలకి కాపలాకి పోయారు. దొంగతనానికి అదే మంచి అదను. నూనె ఖర్చుకి వెరచి చావిట్లో దీపాలు కూడా పెట్టలేదు పిసినిగొట్టు! అందుకే చేసేది జొన్నల వ్యాపారమే అయినా బాగానే కూడబెట్టాడు. నీలిబట్టలలో పొగడ కొమ్మపైన పిల్లిలా పాకుతూ ప్రహరీ దాటాడు. అంతెత్తు నుంచి దూకినా అట్టచెప్పులు ఏమాత్రమూ శబ్దం చేయలేదు. వీపుకి వేలాడుతున్న సంచిలో ముళ్ళబంతి, కొండె, గద్దగోరు, కన్నపుకత్తి తడిమి చూసుకొని మెల్లగా పడమటి గది సమీపించారు. గదిలో దీపాలు వెలుగుతున్నాయి, లోపల్నుంచి సన్నగా ఏవో మాటలు వినవస్తున్నాయి. వాళ్ళు గది వదిలేవరకూ ఇలాగే వేచి ఉండాలా, లేక మరోరోజు పని కానివ్వాలా? పడమటి గది గోడలు పటిష్టంగా పకడ్బందీగా ఉన్నాయి. పది అడుగుల ఎత్తులో గవాక్షం (వెంటిలేటర్) తప్ప గాలి కూడా జొరలేదు. కొండెకి పట్టుగుడ్డ చుట్టి కప్పుమీద విసిరాడు. ఏదో పట్టింది. లాగి బలం చూసుకొని పైకి ఎగబాకాడు. గదిలో అనుమయ్య, ఎవరో శెట్టితో వాదులాడుతున్నాడు! అర్ధరాత్రి. ఏం వ్యాపారమో? చెవిని గోడకి ఆన్చి సంభాషణ వినసాగాడు. అమ్మదొంగా! ఇదా అసలు రహస్యం? నేటితో నా పంట పండింది! శెట్టి ఆయువుపట్టు దొరికింది. ఇక కన్నం దేనికి? రేపు దొరలాగే వచ్చి ఈ శెట్టి చేస్తున్న మోసాన్ని బయటపెడతానని భయపెట్టి కావలసినది పట్టుకెళ్ళవచ్చు, అనుకుంటూ మెల్లగా కిందకి జారి అక్కలవీధి దారి పట్టాడు దొంగకన్నప్ప. ఆ శెట్టి చేస్తున్న నేరం ఏమిటి? సమాధానం తరువాయి భాగం ‘మైలసంత’ కథలో... -
ఒకడు జాషువా
విశేష సంపుటి రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మించింది కాదు. జాషువా సాహిత్యం ఒక్క పూటలో పుట్టింది కాదు. రోమ్ నగరమూ, జాషువా కవిత్వమూ రెండూ ఒక్కటే. శ్రీకృష్ణుడు చిటికెన వేలి మీద గోవర్థన పర్వతం ఎత్తి పట్టినట్లు ఒక్క జాషువా ఒంటి చేత్తో తెలుగు పద్యాన్ని ఎత్తి పట్టాడు. తాజ్మహల్ కట్టడం వెనుక ఎంత కథ ఉందో, ఎంత వెత ఉందో, ఎంత శ్రమ ఉందో, ఎంత సౌందర్యం ఉందో అంతే కృషి జాషువా పద్యనిర్మాణం వెనుక దాగి ఉంది. అనంత పద్మనాభుడి ఆలయంలో అపారమైన నిధులున్నట్లే ‘కవి కోకిల’ జాషువా కవిత్వంలో కూడా అమూల్యమైన కవితా నిధులున్నాయి. వాటిని ఒక చోట చేర్చి గ్రంథరూపం తీసుకువచ్చిన వైనం ‘జాషువా సర్వలభ్య రచనల సంకలనం’. దాదాపు వందేళ్ల నాటి జాషువా తొలికృతి- ‘హిమథామార్కధర పరిణయము’ (1917) నుంచి జీవిత చరమాంకంలోని ‘వీలునామా’ వరకు జాషువా సమగ్ర సాహిత్య సమ్మేళనమే ఈ సర్వలభ్య రచనల సంకలనం. 1654 పేజీల ఈ గ్రంథంలో ఆరువేలకు పైగా పద్యాలున్నాయి. ఇది కేవలం పుస్తకం కాదు. జాషువా ప్రత్యక్షర, ప్రత్యక్ష కవితా సాక్షాత్కార రూపం. ఈ గ్రంథం ప్రచురించడం వెనుక అనితరసాధ్యమైన అమోఘమైన కృషి ఉంది. సాహిత్యమంటే ప్రాణం పెట్టే ‘మనసు ఫౌండేషన్’ రాయుడుగారికే ఇది సాధ్యం అయ్యింది. ఎందుకంటే అవి కాలే చేతులు కావు కనుక. ‘పిరదౌసి’ కావ్యంలో జాషువా చెప్పినట్టు ‘సిరి నిజంబుగ వట్టి టక్కరిది సుమ్ము’. ఆ టక్కరి సిరి మెడలు వంచి ఒడలు పులకరించి పోయేలా ఉత్తమ రచయితల గ్రంథాలు సరసమైన ధరలకు ప్రచురించడం ‘మనసు ఫౌండేషన్’ వారి ప్రచురణ సంస్కారం. ఆ పరంపర నుంచి వచ్చిందే జాషువా సమగ్ర సాహిత్య సంకలనం. వెయ్యేళ్లకు పైబడిన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక్కడే జాషువా. ఇతర కవుల పితరులకు తాగడానికి నేతులున్నాయ్. కమ్మని నూతులున్నాయ్. అక్షరాలు నేర్వడానికి అగ్రహారాలున్నాయ్. తాత ముత్తాతల, జేజి నాయనల జేజేలున్నాయ్. వారసత్వపు భేషజాలున్నాయ్. ఇవ్వేవి లేనివాడు, ఒంటరివాడు, అంటరానివాడు జాషువా ఒక్కడే. ఈ సమాజం వెలి వేసినా, తన భావాలను బలి చేసినా తానే ఒక ఆకాశమై- తానే ఒక సూర్యుడై- తానే ఒక కవి చంద్రుడై- తానే ఒక కవి కోకిలై తానొక్కడే ‘నవయుగ కవి చక్రవర్తి’యై- తెలుగు పద్యానికి అజరామరకీర్తియై- స్ఫూర్తియై నిలిచిన ఏకైక కవి ‘కళాప్రపూర్ణ’ గుఱ్ఱం జాషువా. తెలుగులో వేలాది మంది కవులున్నారు. వాళ్లు రాసిన కొన్ని రచనల్లో కొన్ని ఆశ్వాసాలు బాగుంటాయి. మరికొన్ని ఘట్టాలు కంఠతా పెట్టిస్తాయి. మరికొందరి పద్యాలు కంటతడి పెట్టిస్తాయి. కొన్ని కమ్మగా చదివిస్తాయి. కాని జాషువా ప్రతి పద్యం అమృతమయం. ఆద్యంతం రసమయం. పఠితను వెంటాడుతూ ఉంటుంది. ఏ పద్యాన్నీ పక్కన పెట్టలేము. అది నేరుగా హృదయంలోకి చొచ్చుకుని పోతుంది. వేయిరేకుల కలువగా విచ్చుకుపోతుంది. ఇది జాషువాకు మాత్రమే అబ్బిన పద్య విద్య. ఈ శిల్పం జాషువా సొంతం. జాషువా వస్తురూప పరిణామాలు తెలుసుకోవాలన్నా, ఆయన సాహిత్యంలోని దృక్పథాలను గుర్తించాలన్నా, అమేయమైన ఆయన కవితా మాధుర్యాన్ని ఆస్వాదించాలన్నా రసజ్ఞులైన పాఠకులు ఈ గ్రంథాన్ని చవి చూడవలసిందే. జాషువా తెలుగునాట ఆరాధ్యనీయుడు. అభిమానులకు ప్రాతఃస్మరణీయుడు. ‘మనసు ఫౌండేషన్’ జాషువాకిచ్చిన గొప్ప నివాళి, నిత్య నీరాజనం ఈ సంకలనం. తరతరాలు దాచుకోవలసిన ప్రతినిత్యం చదువుకోవలసిన అపురూపగ్రంథం. వెల: రూ. 400; ప్రతులకు: ఎమెస్కో లేదా అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు; మనసు ఫౌండేషన్: 00089077699 - ఎండ్లూరి సుధాకర్ -
మనుషుల్ని చూడగానే...
కవిత్వం మనుషుల్ని చూడగానే వారి కళ్లలో కొలనులో చలించే ప్రతిబింబాల్లాంటి కలలు కనిపిస్తాయి కలల వెనకాల ఉండీలేనట్లు మెరుస్తూ జీవితం తన పట్ల తాను చూపే లాలస కనిపిస్తుంది వారిని తాకబోయినపుడల్లా వాళ్ల వ్యక్తిత్వాలని పట్టించుకోకుండా వాటి లోపల వెలుగుతున్న జీవన సౌందర్యాన్ని చూస్తావు ‘ఏమిటలా చూస్తున్నావు ఆశ్చర్యంగా’ అని వారు అన్నప్పుడల్లా ‘మన జీవితాలన్నీ ఒకే జీవితమై కనిపిస్తోంది మీరూ ఇలా చూడగలిగితే ఎంత బావుండున’ని జవాబిస్తావు విత్తనాన్ని నీ అరచేతులలోకి తీసుకొన్నపుడే దాని చిటారుకొమ్మన వికసించే పూలపై తేలే పరిమళాలు చిరుగాలితో చెప్పబోయే కబుర్లు నీకు వినిపిస్తాయి సరే కాని కాస్త ఆగు, కాలాన్ని ప్రవహించనీ ప్రతి అలనూ తానుగా సముద్రంలోకి మేలుకోనీ ప్రతి జీవితాన్నీ ఏకైక మసాస్పందనలో కరగనీ అని నీకు నువ్వు బోధించుకొంటూనే ఉంటావు కదూ - బి.వి.వి.ప్రసాద్ 9032075415 -
కొత్త పుస్తకాలు
దుర్వాసమహర్షి ‘ఆర్యాద్విశతి’ టీక: నాగపూడి కుప్పుస్వామి పేజీలు: 172; వెల: 100 ప్రతులకు: పీపీసీ జోషి, ప్రాచీ పబ్లికేషన్స్, సైబర్ ఇ-పార్క్, సెక్టర్ 2ఎ, అలకాపూర్ టౌన్షిప్, పుప్పాలగూడ, హైదరాబాద్-89; ఫోన్: 9346689306 అనుపమ (కవిత్వం) రచన: బండ్ల మాధవరావు పేజీలు: 112; వెల: 100 ప్రతులకు: నవోదయా పబ్లిషర్స్, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ-2; ఫోన్: 0866-2573500 సొనకాలువల అపూర్వ పురాగాథ (గతమూ-వర్తమానమూ- భవిష్యత్తు; వొక వాయుఆధునిక వ్యక్తీకరణ) రచన: డా.లెనిన్ ధనిశెట్టి పేజీలు: 36; వెల: 20; ప్రతులకు: మోత్కూరు శ్రీనివాస్, అనంతుడు ఫౌండేషన్, కొండగడప గ్రామం, మోత్కూరు మండలం, నల్లగొండ జిల్లా; ఫోన్: 9866061350 జీవన నానీలు రచన: భండారి అంకయ్య పేజీలు: 76; వెల: 75 ప్రతులకు: సుశీలాదేవి, ఫ్లాట్ 204, కమలశ్రీ అపార్ట్మెంట్స్, రాజీవ్కాలనీ, మంకమ్మతోట, కరీంనగర్-505001. ఫోన్: 9032742937 చే లాంగ్ లివ్( డాక్యుమెంటరీ స్క్రిప్టు) రచన: అభి, రుషీకృష్ణ పేజీలు: 86; వెల: ఇవ్వలేదు ప్రచురణ: మయూఖ ప్రచురణలు, 2-1-477, గ్రౌండ్ ఫ్లోర్, ప్రతీక్ టవర్స్, నల్లకుంట, హైదరాబాద్-44. మనలో మనం (కొండూరు, చమర్తి వంశావళి; మన సామెతలు) రచన: కొండూరు జనార్దనరాజు పేజీలు: 86; ప్రతులకు: చమర్తి నారాయణరాజు, శంకరాపురం, కడప. ఫోన్: 9440702337 ఏడుమల్లెలు (కవిత్వం) రచన: మంచాల ప్రసాద్ పేజీలు: 92; వెల: 80; ప్రతులకు: మంచాల ప్రచురణలు, కేరాఫ్ మంచాల సావిత్రి, 8-3-828/16/2, ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్-73; ఫోన్: 8341192800 నదీమూలం లాంటి ఆ ఇల్లు (కవిత్వం) రచన: యాకూబ్ పేజీలు: 156; వెల: 100 ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తకకేంద్రాలు; కవి ఫోన్: 9849156588 పువ్వుల మధ్య, పరిమళం మధ్య వినిపించే కవిత్వం! ఒక రోమన్ రచయిత అంటాడు-‘హృదయం ఉండే చోటే ఇల్లు ఉంటుంది’ అని. పుస్తకం తెరవగానే కనిపించిన యాకూబ్ ఇల్లు కేవలం ఇల్లుగా, భౌతిక, భౌగోళిక రూపంగా మాత్రమే కనిపించదు. అది కవి యాకూబ్ హృదయంలా ఉంటుంది. మౌనంగా కూర్చున్న సూఫీ పకీరులా ఉంటుంది. ఒకటికి రెండు సార్లు, పదే పదే ఆ ఛాయాచిత్రాన్ని చూస్తున్నప్పుడు చెట్లతో సహా ఇంటిముందు గంభీరంగా కనిపించే రాళ్లలో చలనం వచ్చి, కవిత్వం చెబుతున్నట్లే అనిపిస్తుంది. ఈ పుస్తకంలో మహానగరం ఉంది. ‘భార్యాపిల్లలూ రోటిన్ పరుగులూ, క్రమం తప్పని బిల్లులూ...తెరలు తెరలుగా దగ్గు’ ఈ పుస్తకంలో కనిపించి వినిపిస్తాయి. ఈ పుస్తకంలో పల్లె ఉంది. అది నల్లవాగై సుమధురశబ్దం వినిపిస్తుంది. చవ్వచవ్వగా ఉప్పుప్పగా మనల్ని పలకరిస్తుంది. ఈ పుస్తకంలో ఆకాశం ఉంది. అందమైన భావుకత ఉంది. ‘రాత్రంతా ఒక్కటే చంద్రుడు-ఒంటరి ఆకాశపు అద్దం ముందు నిల్చొని- మళ్లీ మళ్లీ ముంగురులు చెరుపుకుంటూ- తలదువ్వుకుంటూ అలసిపోయాడేమో-నా తొడ మీద తల పెట్టుకొని గాఢనిద్రలో ఉన్నాడు’. పుస్తకంలో ఇల్లుతో పాటు అమ్మ ఉంది. ఆకలిని గౌరవించే అమ్మ, ఆకలికి అన్నం ముద్దకు ఉన్న అనుబంధాన్ని ప్రేమించే అమ్మ ఉంది. ఇన్నీ ఉన్నా ఇంకా ఏమైనా ఆశిస్తే...‘అపుడపుడూ పువ్వుల మధ్య, పరిమళం మధ్య నిద్రపోవాలి’ కవితను ఒకటికి పదిసార్లు చదువుకుంటే చాలు, మీకు మీరు కొత్తగా పరిచయం అవుతారు. ‘కాలం రచించుకున్న కవి’ పేరుతో సామిడి జగన్రెడ్డి రాసిన విలువైన ముందుమాట పాఠకులను అదనపు కానుక. - పాషా -
కవి గాయక నట వైతాళికుడు
ఆయన కవి గాయక నట వైతాళికుడు. ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్నింటికీ మించి అరుదైన ఆత్మజ్ఞాని. ‘షేపర్ షేప్డ్’ కవితలో ‘ఐ హావ్ సీజ్డ్ టు బి ది పాటర్... అండ్ హావ్ లెర్న్డ్ టు బి ది క్లే’ అనడంలోనే కవి ఆత్మజ్ఞానం తేటతెల్లమవుతుంది. ఇంతకూ ఈ కవిత రాసినదెవరో కాదు, ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ సరోజినీ నాయుడు చిన్న తమ్ముడు, అఘోరనాథ ఛటోపాధ్యాయ ఆఖరి కొడుకు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ. అక్క సరోజినికి దీటైన కవి ఆయన. అంతే కాదు, నటుడు, గాయకుడు, రాజకీయవేత్త, సంస్కరణాభిలాషి కూడా. హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. అఘోరనాథ ఛటోపాధ్యాయ, బరదాసుందరీ దేవి దంపతుల ఆఖరి సంతానంగా 1898 ఏప్రిల్ 2న పుట్టాడు. విదేశీ విద్యాభ్యాసం తర్వాత నిజాం ప్రభువు ఆహ్వానంపై హైదరాబాద్ చేరుకున్న అఘోరనాథ ఛటోపాధ్యాయ, ఇక్కడ నిజాం కాలేజీని స్థాపించారు. అప్పట్లో అఘోరనాథ నివాసం వివిధ రంగాల మేధావులకు ఆలవాలంగా ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన హరీంద్రనాథ్ సహజంగానే కవిగా, మేధావిగా ఎదిగాడు. సన్నిహితులు ఆయనను హరీన్ అని పిలిచేవారు. తనకు ఊహ తెలిసినప్పటికే అక్క సరోజినీ దేవి కవయిత్రిగా ప్రసిద్ధురాలు కావడంతో హరీన్పై ఆమె ప్రభావం కూడా ఉండేది. అయితే, అక్క సరోజిని మాదిరిగా హరీన్ కవిత్వానికి, రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. సంగీతం, రంగస్థలం, సినిమాల్లోనూ తన ప్రతిభా పాటవాలను నిరూపించుకున్నాడు. రంగస్థలం మీదుగా బాలీవుడ్ ప్రస్థానం... చిన్నప్పటి నుంచే రంగస్థల నటుడిగా గుర్తింపు పొందిన హరీన్, బాలీవుడ్లోకి ఆలస్యంగా అడుగుపెట్టాడు. అబు హసన్ (1918), ఫైవ్ ప్లేస్ (1937), సిద్ధార్థ, మ్యాన్ ఆఫ్ పీస్ (1956) నాటకాలను స్వయంగా రచించి ప్రదర్శించాడు. గాయకుడిగా అప్పుడప్పుడు ఆకాశవాణి ద్వారా పాటలు వినిపించేవాడు. షష్టిపూర్తి దాటిన దశలో 1962లో తొలిచిత్రం ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’లో ఘరీబాబు పాత్రలో ఆకట్టుకున్నాడు. 1972లో రాజేశ్ ఖన్నా కథానాయకుడుగా నటించిన ‘బావార్చీ’లో ఉమ్మడి కుటుంబ పెద్ద ‘దాదూజీ’ పాత్ర హరీన్కు బాగా గుర్తింపు తెచ్చింది. మాతృభాష బెంగాలీలో ముచ్చటగా మూడు చిత్రాల్లో మాత్రమే నటించిన హరీన్, మొత్తం పాతిక లోపు చిత్రాల్లోనే నటించాడు. ‘తేరే ఘర్కే సామ్నే’లో సేఠ్ కరమ్చంద్, ‘ఘర్బార్’లో మిస్టర్ ఛద్దా, ‘ఆశీర్వాద్’లో బైజూ ఢోలకియా వంటి పాత్రల్లో హరీన్ విలక్షణ నటనను అప్పటి తరం ప్రేక్షకులు నేటికీ మరువలేరు. తొంభయ్యేళ్ల ముదిమిలో నటించిన మలామల్ (1988) ఆయన చివరి చిత్రం. సంగీతంలోనూ విశేష ప్రావీణ్యం గల హరీన్ ‘సూర్య అస్త్ హోగయా’, ‘తరుణ్ అరుణ్ సే రంజిత్ ధరణీ’ వంటి పాటలను రచించడమే కాకుండా, స్వరకల్పన కూడా చేశారు. ‘ఆకాశవాణి’లో ఆయన తరచూ ‘రైల్ గాడీ’ కవితను వినిపించేవారు. హిందీలో హరీన్ రాసిన పిల్లల పాటలు రవీంద్రనాథ్ టాగోర్ను సైతం మెప్పించాయి. రాజకీయాల్లో స్వతంత్రుడు... అక్క సరోజినీ నాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసినా, హరీన్ మాత్రం రాజకీయాల్లో స్వతంత్రుడిగానే కొనసాగారు. స్వాతంత్య్రం వచ్చాక 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఐదేళ్లు ఎంపీగా కొనసాగిన హరీన్, పార్లమెంటులో ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించేవారు. అప్పట్లో నెహ్రూ ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ‘ఓ.. ది రైల్వే బడ్జెట్ ఈజ్ వెరీ వెరీ ఫెయిర్.. ఇట్ డజ్ నాట్ టచ్ ది మినిస్టర్స్ హూ ఆల్వేస్ గో బై ఎయిర్’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఆయనవి ఇలాంటి చమక్కులెన్నో... పార్టీలకు అతీతంగా సభ్యులందరినీ అలరించేవి, ఆలోచింపజేసేవి. - పన్యాల జగన్నాథదాసు -
కొత్త పుస్తకాలు
సమ్మోహన స్వర విపంచి కవిత్వం కావచ్చు, సాహిత్య విమర్శ కావచ్చు...‘మో’ను చదువుకోవడం అంటే ప్రపంచగ్రంథాలయాన్ని ప్రేమగా ఆలింగనం చేసుకోవడం! ‘మో’ వాదులలో నరేష్ నున్నా కూడా ఒకరే‘మో’ తెలియదుగానీ, ముప్పై పేజీల ఈ చిన్ని పుస్తకంలో ‘మో’ విశాల ప్రపంచాన్ని తనదైన ప్రత్యేక శైలితో మళ్లీ ఒక్కసారి గుర్తుకు తెచ్చారు నున్నా. వివిధ సందర్భాల్లో ‘మో’ మీద గతంలో తాను రాసిన వ్యాసాలను ‘మోహం’ పేరుతో తీసుకువచ్చారు నరేష్. అభిమానం పొంగి పొర్లగా రాసిన భావోద్వేగభరిత వ్యాసాలు కావు ఇవి. అభిమానంతో పాటు అధ్యయన విస్తృతి కూడా నరేష్ కలంలో కనిపిస్తుంది. ‘మోహం’లాంటి నలుపు, తెలుపు పొత్తాన్ని చూసినప్పుడు ఇలాంటి పుస్తకాలు ఇంకా రావాలేమో, ‘మో’కు ఒక వర్గం పాఠకులకు మధ్య ఉన్న ‘గ్యాప్’ పోవాలేమో అనిపిస్తుంది. ‘ఇక నేను గోల చేస్తో బిగ్గరగా మాట్లాడను నా ప్రభువు ఆజ్ఞ అది రహస్యాలలో చెప్తాను పాట గుసగుసల్లోనే నా హృదయభాష పలుకుతుంది’ అని రవీంద్రుడికి తెలుగు గొంతుక ఇచ్చారు అప్పుడెప్పుడో మో. మరి ‘మో’ను ఫ్రభువు ఆజ్ఞాపించాడో లేదో తెలియదు కానీ చాలా నిశ్శబ్దంగానే తన హృదయభాషను పంచారు. ఆ భాష మరింత చేరువ కావడానికి ఇలాంటి పుస్తకం ఎప్పుడూ ఒకటి రావాలి. - యాకూబ్ పాషా -
అనుకున్న తేదీ
అనుకున్న తేదీ మనఃఫలకం మీద ముద్రితమైనప్పుడు ఆ స్థితికి తిరోగతి ఉండదు అది తన కర్తవ్యాన్ని అక్షత స్ఫూర్తితో కొనసాగిస్తుంటుంది. గ్రీష్మంలో ఉడికిపోతున్నా వర్షర్తువులో నిలువెల్లా తడుస్తున్నా ఆ తేదీ గమనంలో తేడా ఉండదు కొన్ని కొన్ని ఊహలు ఉన్మత్త స్థితిలో వచ్చి తన ముందు పొర్లాడుతూ వున్నా ఆ తేదీ స్వేచ్ఛా పూర్వకంగా సాగిపోతుంటుంది. తేదీ అంటే మరేదీ కాదు కాలం గీసుకున్న గీటు. ఆ గీటు మాసిపోకముందే దూరాన వున్న లక్ష్య శిఖరం చేరుకోవాలి. అందుకు ఆ తేదీ తన గమన వేగాన్ని పెంచుతూ పోతుంది అది అవతలి అంచుకు చేరుకునే ముందే గుండె లోతుల్లో వున్న సంకల్పాలను చేదుకుంటూ ఉంటుంది. ఉద్దిష్ట కార్యనిర్వహణ ఫలప్రదం కాగానే ఆ తేదీ అదృశ్యమై మరో తేదీ అవతరిస్తుంది. అది ఏ తేదీయో కాదు కరిగి పోయిన తేదీకి రూపాంతరమే. - సి.నారాయణరెడ్డి -
ఆ ప్రయాణంలో నాతో నేను మాట్లాడుకున్నాను
లైఫ్ బుక్ మా నాన్నగారు బొమ్మలు గీస్తారు. కవితలు రాస్తారు. వంట బాగా చేస్తారు. తోటపని చేస్తారు...ఈ అన్నిట్లోకి నాకు నచ్చిన విషయం ఆయనలోని సున్నితత్వం. సున్నితంగా ఉన్న వాళ్ల దగ్గరికి బొమ్మలైనా, కవిత్వమైనా ఆప్యాయంగా వస్తాయి! వేసవి సెలవుల్లో మా నాన్నమ్మ వాళ్లు ఉండే బారీపడ(ఒడిషా) అనే ఒక మోస్తరు పట్నానికి వెళ్లేవాళ్లం. ఎన్ని నగరాలకు వెళ్లినా... బారీపడ జ్ఞాపకాలు మాత్రం ప్రత్యేకమైనవి. రైలు నుంచి బస్సు, బస్సు నుంచి రిక్షా... ఇలా దీర్ఘ ప్రయాణం చేసిన తరువాతగానీ ఆ పట్నానికి చేరడానికి వీలయ్యేది కాదు. ఇప్పుడు మాత్రం విమానం ఎక్కి ఆ తరువాత కారు ఎక్కితే చాలు అది వస్తుంది. కానీ దీర్ఘమైన ప్రయాణమే నాకు నచ్చుతుంది. ఆ ఊళ్లో ఆలయ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. అవి పేరుకు మత సంబంధమైన ఉత్సవాలుగా అనిపించినా నిజానికవి... సామాజిక, సాంస్కృతిక ఉత్సవాలు. ఆలయ ఉత్సవాల సందర్భంగా ఊరంతా కొత్త కళతో శోభించేది. నేను బాగా ఆలోచించిగానీ నిర్ణయం తీసుకోలేను. ఈ క్రమంలో నెల కావచ్చు...ఆర్నెల్లు కావచ్చు...సంవత్సరం కూడా కావచ్చు. ఉదా: భౌగోళికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత...దేనిలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేయాలో అర్థం కాలేదు. ‘‘ఓ ఏడాది విరామం తీసుకోవాలనుకుంటున్నాను’’ అని నాన్నతో చెప్పి చాలా ప్రాంతాలు ప్రయాణించాను. నాతో నేను మాట్లాడుకున్నాను. నా ఇష్టాన్ని వెతుకున్నాను. ప్రయాణం తరువాత ఒక పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధించాను. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలు తిరిగినా పుట్టి పెరిగిన ప్రాంతం అంటేనే ఎవరికైనా ఇష్టం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే...తల్లి నుంచి దూరమైనట్లు అనిపిస్తుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన నాకు ఆ నగరాన్ని వదలాలంటే ఇబ్బం దిగా ఉంటుంది. ఢిల్లీకీ నాకూ మధ్య బలమైన ఆకర్షణ ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. - నందితా దాస్, ప్రముఖ నటి -
ప్రశంసలు, పురస్కారాలకు... రచనా వ్యాసాంగం
మనసులోని ఆలోచనను, భావావేశాన్ని కాగితంపై పరిస్తే.. అదే కవిత్వం. మనసును ఉల్లాసపరిచే శక్తి కవిత్వానికి ఉంది. అలాగే పాట, పద్యం మనిషికి తరతరాలుగా వారసత్వంగా వస్తున్న విలువైన ఆస్తులు. ఇవి మనిషిని ఉత్తేజపరుస్తాయి, ఆలోచింపజేస్తాయి, కార్యాచరణకు పురికొల్పుతాయి. కవిత్వం, పాట, పద్యం.. వీటికి పుట్టుక తప్ప చావు లేదు. అందుకే వీటి రచనను కెరీర్గా ఎంచుకుంటే అవకాశాలకు కొదవ ఉండదు. మనదేశంలో ఎందరో రచయితలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నేటి సమాచార సాంకేతిక యుగంలో రచనా వ్యాసాంగం ద్వారా ఉపాధి పొందడంతోపాటు సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవచ్చు. రచయితలకు అవకాశాలెన్నెన్నో... మన దేశంలో ప్రసార మాధ్యమాలు విస్తరిస్తుండడంతో ప్రస్తుతం గీత రచయితలకు అవకాశాలు పెరుగుతున్నాయి. సినిమాలతోపాటు టీవీ సీరియళ్లలోనూ పాటలు తప్పనిసరిగా మారాయి. ప్రైవేట్ పాటల ఆల్బమ్లకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. ఈ నేపథ్యంలో రచయితలకు డిమాండ్ విస్తృతమవుతోంది. ఇక కవిత్వం, పద్యాలు రాసేవారికి ఆకర్షణీయమైన వేతనంతోపాటు పత్రికలు, మేగజైన్లలో తమ పేరు చూసుకొనే అవకాశం దక్కుతోంది. పద్యాలు, కవితలను పుస్తకంగా ప్రచురిస్తే పబ్లిషర్స్ నుంచి రాయల్టీ లభిస్తుంది. ఫుల్టైమ్, పార్ట్టైమ్ రచయితలుగా పనిచేసుకోవచ్చు. ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం తమ తీరిక వేళల్లో రచనలు సాగిస్తూ.. మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కవిత్వం, పద్యం, గీత రచయితలుగా మారాలనుకునేవారికి ప్రధానంగా ఊహాశక్తి, సృజనాత్మకత ఉండాలి. సమాజాన్ని కొత్తకోణంలో దర్శించే నేర్పు అవసరం. రచనకు కావాల్సిన వస్తువును చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి, పరిస్థితుల నుంచి గ్రహించే నైపుణ్యం పెంపొందించుకోవాలి. సమకాలీన అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. వివిధ రంగాల పుస్తకాలను విస్తృతంగా చదివే అలవాటు చాలా ముఖ్యం. ఇతర భాషల్లో వస్తున్న రచనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అర్హతలు: రచనా రంగంలోకి అడుగుపెట్టడానికి ప్రత్యేకంగా ఫలానా విద్యార్హతలంటూ లేవు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా రచనలు చేయొచ్చు. పెద్ద చదువులు చదవకపోయినా గొప్ప రచయితలుగా పేరుతెచ్చుకున్నవారెందరో ఉన్నారు. అయితే, ప్రతిభకు సాన పెట్టుకోవడానికి పార్ట్టైమ్, ఫుల్టైమ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. క్రియేటివ్ రైటింగ్లో భాగంగా పోయెట్రీ రైటింగ్పై శిక్షణ ఇస్తున్నారు. ప్రొఫెషనల్ రైటర్స్గా మారాలనుకునేవారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వీటిలో చేరడం మంచిది. ఇప్పటికే వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడినవారు ఇందులో మెళకువలు తెలుసుకోవడానికి, రచనా శక్తిని పెంచుకోవడానికి పార్ట్టైమ్ కోర్సుల్లో చేరొచ్చు. వేతనాలు: గీత రచయితలకు నెలతిరిగేసరికల్లా ఠంచనుగా వేతనం వచ్చే అవకాశం ఉండదు. తమను తాము మార్కెటింగ్ చేసుకొనే తెలివితేటలు ఉన్నవారు ఎంతైనా సంపాదించుకోవచ్చు. సినిమా, టీవీ రంగాల్లో ప్రతిభావంతులకు అధిక వేతనాలు లభిస్తాయి. ఒక్కో పాటకు వేల రూపాయలు అందుకొనే గీత రచయితలు ఉన్నారు. ప్రతిభావంతులకు అభిమానుల ప్రశంసలు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ప్రతిష్టాత్మక పురస్కారాలు వరిస్తాయి. ఈ రంగంలో డబ్బు కంటే వృత్తిపరమైన సంతృప్తి అధికంగా లభిస్తుంది. క్రియేటివ్ రైటింగ్/పోయెట్రీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఏ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వెబ్సైట్: http://teluguuniversity.ac.in/ ఏ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in ఏ బ్రిటిష్ కౌన్సిల్ వెబ్సైట్: www.britishcouncil.in ఏ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్-కర్ణాటక వెబ్సైట్: www.ciil.org అధ్యయనం, అనుశీలన ఉండాలి! శ్రీకవి, రచయిత కెరీర్ ఇతర రంగాల కంటే భిన్నమైంది. ఎందుకంటే ఇతర రంగాల్లో మౌఖిక పరీక్ష లేదా రాత పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది. ఉద్యోగానికి, జీవితానికి భరోసా ఉంటుంది. కానీ రచయిత/కవికి అలాంటి పరిస్థితి ఉండదు. ప్రతి పాటా రాత పరీక్షే. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రతిబింబించేలా రాయాలి. పురాతన, ఆధునిక సాహిత్యం, భాషా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. భాష పట్ల ఆసక్తి, ఇష్టం పెంచుకోవాలి. విస్తృతమైన పద సంపదను సొంతం చేసుకోవాలి. సందర్భానుసారంగా వాటిని ఉపయోగించాలి. కవి ప్రధానంగా అధ్యయనం, అనుశీలన అనే ప్రాథమిక లక్షణాలను అలవర్చుకోవాలి. అధ్యయనం అంటే చదవడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం, అభ్యసించడం. కేవలం పుస్తకాలు మాత్రమే చదివితే సరిపోదు. అందులోని సారాన్ని గ్రహించాలి. పుస్తకాలతోపాటు మనుషుల్ని, మనస్తత్వాన్ని, వివిధ ప్రాంతాల్ని, భాషలను, ఆచారాలను, సంస్కృతులను తెలుసుకోవాలి. అవగాహన పెంచుకోవాలి. అనుశీలన అంటే నిత్యం పరిశీలించడం. సాధార ణ వ్యక్తులతో పోల్చితే కవికి ప్రత్యేక దృష్టి కోణం ఉండాలి. సమాజం పోకడను, విలువలను ప్రత్యేకంగా పరిశీలించాలి. రచనల్లో అవి ప్రతిబింబించాలి. కొత్తగా ఈ కెరీర్ను ఎంచుకునే వారికి అవకాశాలకు కొదవలేదు. భారతీయ సంప్రదాయ మూలాలు విస్మరించకుండా ఎప్పటికప్పుడు తమను తాము కొత్త రకంగా ఆవిష్కరించుకోవాలి. అప్పుడే ఈ కెరీర్లో సుస్థిరంగా కొనసాగుతారు.్ణ - చంద్రబోస్, ప్రముఖ సినీ గేయ రచయిత -
గోవును సేవించినట్టుగా వాక్కును సేవించిన కవిత్వం...
నీటి రంగుల చిత్రం- వాడ్రేవు చినవీరభద్రుడి కవిత్వం వెల: రూ.150 ప్రతులకు: నవోదయ, కాచిగూడ, హైదరాబాద్. ‘గోవును సేవించినట్టుగా వాక్కును సేవించాలి గోచర జీవితానుభవాన్ని క్షీరంగా మార్చుకోవాలి ప్రతి పచ్చిక బయలు వెంటా ఆవు వెనకనే నడవాలి నై విచ్చిన నేలల్లో కూడా ఆకుపచ్చజాడను అన్వేషించాలి’... పరిణితి అనే మాటకు కొలబద్ద లేదు. ఎంచే బిందువు కూడా లేదు. ప్రతి స్థలకాలాల్లోనూ అది మారిపోతూ ఉంటుంది. వాడ్రేవు చినవీరభద్రుడి నుంచి 1995లో ‘నిర్వికల్ప సంగీతం’ కవితా సంపుటి వెలువడినప్పుడు- బహుశా అప్పుడాయన తొలి యవ్వన దారుల్లో ఉండగా- ఈ వయసులో ఇంత పరిణితి ఉన్న కవిత్వమా అని అచ్చెరువొందారు పరిశీలకులు. 2004లో ‘పునర్యానం’ వెలువడినప్పుడు ఇది కదా పరిణితి అని మెచ్చుకోలుగా తలాడించారు. 2009లో ‘కోకిల ప్రవేశించే కాలం’... ఆ శీర్షికతోనే కవి నడిచి వస్తున్న దారిని చూసి మురిసిపోయారు. ఇప్పుడు ‘నీటి రంగుల చిత్రం’. నీటి రంగులంటే వాటర్ కలర్స్. తడి తగిలితే తప్ప పలకని రంగులు. సుకుమారమైనవి. చేయి తిరిగిన చిత్రకారుడు వాటితో రచించిన దృశ్యచిత్రాల్లాంటివి ఈ పుస్తకంలోని పదచిత్రాలు. ‘రాత్రి ఆకాశమంతా పారిజాత తరువులా ఉంది’... అబ్బ... ఎంత బాగుంది. మీకు చిత్రం కనిపించడం లేదూ? ‘ ‘మా ఊళ్లో మా చిన్నప్పటి ఇంటి చుట్టూ వెదురు కంచె, దానికి రెండు తలుపులు, వీధిగుమ్మం దాటితే ఊరు, పెరటి తలుపు తెరిస్తే పాలపూల అడవి, జెండా కొండ’... పాల పూల అడవి అట. బొమ్మ కట్టలేదూ? ఇక ‘మాఘ మాసపు అడవి పొడుగూతా నిశ్శబ్దం’... వాహ్. ఆ నిశ్శబ్దం మనల్ని తాకుతుంది. ఇంతకూ ఈ పుస్తకంలో కవి ఏ నెమలికను నిమిరాడు? ఏ వాక్య సంచయానికి ఆయువు పోశాడు? ఏ పదం తాలుకు పుప్పొడి పసుపును ప్రవాహంలో వదిలిపెట్టి దిగువకు తరలించాడు? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకమంతా ఒక తన్మయత్మపు అనుభవం. కవిదే కాదు. పాఠకుడిది కూడా. నిజంగా కవిత్వంతో దేనిని దర్శించాలి లేదా దేనిని దర్శించేటప్పుడు అది కవిత్వం అవుతుంది అని కవి నమ్మిన రెండు విషయాలకూ ఉదాహరణ ఈ పుస్తకం. వెల్లువలా విరబూసిన మామిడిపూత, దారులంతటా యువతుల తరుణదేహాల మాదక సుగంధం, తెల్లవారుజాముల్లో దిగే కమలాఫలాల గంపలు, ఎర్రగా చిగిర్చిన రావిచెట్టు, మార్గశిర మాసపు చలి, పొద్దున్నే కురుస్తున్న వసంతవాన... ఇవన్నీ ప్రయత్నం వల్ల కాదు కేవలం రెప్పపాటులోని తమ సాక్షాత్కారం వల్ల కవి చేత కలం పట్టిస్తాయి. మనసు నర్తనం ఆడుతుంది. వాక్యం కావ్యం అవుతుంది. చినవీరభద్రుడు ఈ పుస్తకంలోని కవితలను దశలు దశలుగా సంపుటీకరించారు. ‘కవిత్వం’, ‘వ్యక్తులు’, ‘రంగులు’, ‘కాంతి... మంచు... మధురిమ’, ‘పునర్ అనుభవం’... ఈ దశలన్నింటిలోనూ కవి కవిత్వాన్ని కనుగొనడం... తనను తాను కనుగొనడం కనిపిస్తుంది. కవి చెప్పుకున్నట్టుగా- జీవిత సత్యం, సౌందర్యం, జీవితానందం కోసం సాగే అన్వేషణ ఈ కవిత్వం. ‘లేగదూడ తల్లిని గుర్తు పట్టినట్టు నేనిన్నాళ్లకు ఏకాదశిని పోల్చుకున్నాను’ అనడంలోనే తాను కనుగొన్న కొత్త అన్వేషణను మనం పోల్చుకోవచ్చు. ‘ఇన్నాళ్లు తాత తండ్రుల దారి నడిచాను. ఇప్పుడు అమ్మ, అమ్మమ్మల తోవ పట్టుకున్నాను’ అనడంలో- సృష్టికీ సౌందర్య సృష్టికీ మూలమైన స్త్రీ కొనవేలునీ, ప్రకృతి చూపుడు వేలునీ పట్టుకొని ఈ కవి తదుపరి ప్రయాణాన్ని సాగించనున్నానని చెబుతున్నాడు. ఇది ఒక మౌనసరోవర స్థితి. హోరు మాని మౌనంగా పరికించడం కూడా పరిణితిలో ఒక భాగమే. సరళంగా కనిపిస్తూ లోతుగా స్పర్శించే నాలుగు వాక్యాలు రాయడం మాటలు కాదు. కనపడనిది వినపడాలి. వినపడనిది కనపడాలి. దేవుడా నా ప్రతిరోజునీ ఒక పద్యంగా మలుచు అని నివేదించే పరితాపం కావాలి. అప్పుడే సాధ్యం. ఈ పుస్తకం అంతా ముగించేటప్పటికి పాఠకుడికి ఒకటి అనిపిస్తుంది- ఈ కవి ఎప్పుడో ఒకప్పుడు సాహిత్యంలోకి ప్రవేశించడానికి బయలుదేరాడు. సాహిత్యమే ఇతడిగా మారిపోయిన సంయోగ స్థితిలో ఇప్పుడున్నాడు. ఇతడు ధన్యుడు. - లక్ష్మీ మందల -
పుస్తక సమీక్ష: కొత్త పుస్తకాలు
1. సి.పి.బ్రౌన్ (సి.పి.బ్రౌన్పై విమర్శ వ్యాసాలు) పేజీలు: 272; వెల: 300 2. వేమన-2 (వేమనపై విమర్శ వ్యాసాలు) పేజీలు: 232; వెల: 250 ప్రధాన సంపాదకులు: ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ప్రతులకు: సభ్య కార్యదర్శి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, 1-1254, సి.పి.బ్రౌన్ రోడ్, ఎర్రముక్కపల్లి, కడప-516004. ఫోన్: 08562-255517 ఉదయిని (దాట్ల దేవదానం రాజు 60వ జన్మదినోత్సవ ప్రత్యేక సంచిక) సంపాదకుడు: డా. శిఖామణి పేజీలు: 254; వెల: 100 ప్రతులకు: దాట్ల దేవదానం రాజు, 8-1-048, ఉదయిని, జక్రియా నగర్, యానాం-533464. ఫోన్: 9440105987 గోరు ముద్దలు (పిల్లల కథలు) రచన: గీతా సుబ్బారావు పేజీలు: 128; వెల: 125 ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో. శాంతివనం (పిల్లలు అనుభవాలు ప్రయోగాలు) రచన: మంచికంటి పేజీలు: 244; వెల: 200 ప్రతులకు: నవోదయా, విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు. శిథిల స్వర్గం (నవల) రచన: కె.వి.నరేందర్ పేజీలు: 128; వెల: 100 ప్రతులకు: కె.వి.శ్రీదేవి, 7-4-264/బి, బైపాస్ రోడ్ దగ్గర, విద్యానగర్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా-505327. ఫోన్: 9440402871 శాంతికపోతం (కవిత్వం) రచన: బి.భూపతిరావు పేజీలు: 44; వెల: 25 ప్రతులకు: బొడ్డేపల్లి అరుణకుమారి, అచ్చిపోలవలస గ్రామం, పొందూరు మం., శ్రీకాకుళం-532402 -
మా ఇద్దరినీ కలిపింది కవిత్వం కాదు... జీవనోత్సాహం!
తనికెళ్ల భరణి... ఈ ప్రపంచానికి ఒక్కడిగా కనిపించొచ్చు! కానీ ప్రకాశ్రాజ్కి మాత్రం భరణి చుట్టూరానే ప్రపంచం కనిపిస్తుంది! ప్రకాశ్రాజ్ సుదీర్ఘ ప్రయాణంలో ఓ రహదారిలా... ఓ వారధిలా... దొరికిన సాంగత్యం భరణి! వీరిద్దరి స్నేహంలో ఓ ప్యాసా ఉంది... ఓ అంతుచిక్కని మజా ఉంది..! భరణి గురించి ప్రకాశ్రాజ్ హృదయావిష్కరణ... ‘సాక్షి’కి ప్రత్యేకం మనం ప్రేమించిన క్షణం... గడిచిపోయిన క్షణం కాదు. తలచుకొన్నప్పుడల్లా కాలాన్ని గెలిచి, మళ్లీ మళ్లీ బతికే క్షణం! ‘దేవదాసు’ చేసిన 20 ఏళ్ల తర్వాత దిలీప్కుమార్గారు బెంగళూరు వెళ్లారు...ఓ అభిమాని ‘దేవదాసు’ని గుర్తు చేసి‘ఎంత బాగా చేశారండీ’ అని ప్రశంసించాడు.దిలీప్కుమార్ కదిలిపోయారు.నేను వేషం వేస్తున్నప్పుడు బతికింది ఒక్క క్షణమే.తెరపై ఆ పాత్రను చూసి ప్రేక్షకుడు పులకించిందీ ఒక్క క్షణమే! అయితే ఆ పులకింతలన్నీ అనంతవాహినిలా ప్రవహిస్తూ... ఇరవై ఏళ్ల తర్వాత కూడా మళ్లీ నా క్షణాన్ని నాకు గుర్తు చేసింది కదా అనుకున్నారు దిలీప్కుమార్. తనికెళ్ల భరణి పొయిట్రీ చదువుతుంటే కూడా నాకదే ఫీలింగ్... మళ్లీ మళ్లీ బతికే క్షణం! అసలు తనికెళ్ల భరణి ఎవరు? నేను ఎవరు? ఓ రచయితగా, నటునిగా వాడు నాకు తెలియదు... నేనూ వాడికంతే! ఓ జర్నీ చేయడానికి ఇద్దరం దొరికాం.పది పదిహేనేళ్ల నుంచి జరుగుతున్న జర్నీ ఇది. ఒకరికొకరం వెతుక్కుంటూ వెళ్తే దొరికినవాళ్లం కాదు! వాడి ప్రపంచం వేరు... నా ప్రపంచం వేరు.అయినా కలిశాం. ఎందుకు కలిశామంటే... మేం కలవాలంతే! భరణి అంటే ఎందుకిష్టమంటే? ఏమో చెప్పలేను. కొన్నింటిని ఎక్స్ప్రెస్ చేస్తే ఆ మిస్టరీ పోతుంది. మా ఇద్దర్నీ కలిపింది కవిత్వం కాదు.. జీవనోత్సాహం! వాడు చాలా ప్రామాణికుడు... నిజంగా ప్రేమిస్తాడు. ఆత్మబంధువులా ఉంటాడు. కొందరే ఉంటారలా! తన ఆంతర్యాన్ని, ఆత్మను, అభివ్యక్తీకరించే తీరు... అదే నాకు నచ్చుతుందేమో! భరణి రాసిన ‘శృంగార గంగావతరణం’ చదివారా? వెంటనే చదవండి. ‘గంగోత్రి’ షూటింగ్ జరుగుతున్నప్పుడు గంగానది ఒడ్డున కూర్చుని, వినిపించాడు నాకు.శివుడు తన జటాజూటంలో గంగాదేవిని బంధిస్తే..గంగకే చెమట్లు పట్టడం లాంటి ఎక్స్ప్రెషన్స్... ఎన్నెన్నో! కొన్ని నెలల తర్వాత కలిసినా... ‘అరె.. నిన్ననే కలిశాం కదా’ అనిపించడమంటే.. ఆ బంధంలోని గాఢత్వం గురించి ఇంకేం చెప్పాలి? వాడు సంబరం చేసుకుంటుంటే వాడిలో సగమై నేనుంటా! నేను ఉత్సాహంతో ఊరేగుతుంటే వాడు నాలో ఉంటాడు! ఎక్కడో అమలాపురంలో షూటింగంతా కానిచ్చేసి మహ్మద్ రఫీ పాట వింటూ... ఓ తన్మయావస్థలో ఉన్నప్పుడు వాడు గుర్తుకొస్తాడు. చిన్న ఫోన్ కాల్... రెండు నిమిషాల టాక్... ఎందుకో ఆ సఖ్యం ఎప్పుడూ కావాలనిపిస్తుంది. ప్రపంచంలో వాడొక భాగం కాదు... వాడి చుట్టూరా ఉన్నదే ప్రపంచం! అక్కడ్నుంచే అసలు ప్రపంచం మొదలైందనిపిస్తుంది. వాడి అమెరికా వేరు... వాడి పల్లెటూరి వేరు. వాడి శివుడు వేరు.. వాడి ప్రేమ వేరు. నాదీ అదే పరిస్థితి! ఈ తీవ్రతే... ఈ విభిన్నతే... మా ఇద్దరికీ బ్రిడ్జ్ వేసినట్టుంది. ప్రతి మనిషిలోనూ పొయిట్రీ ఉంటుంది. ఆస్వాదించడం తెలియాలి... ఆహ్వానించడం రావాలి. వాడి ఆలోచనలెప్పుడూ ప్రెగ్నెంటే! అదే వాడిలో ఉన్న బ్యూటీ ఏమో!! ఫేమస్ పొయిట్ వర్డ్స్వర్త్ ఏమంటాడంటే... నువ్వో చెట్టు కింద విశ్రమిస్తే- ఎక్కడి నుంచో కోయిల పాట వినిపిస్తుంది.. ఆస్వాదించు. అంతేగానీ... అది ఎక్కడ నుంచి పాడుతుంది? ఎందుకు పాడుతుంది? దాని సైజేంటి? కలరేంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ అవసరమా నీకు? ఎక్కడో పడిన వర్షానికే ఇక్కడ చల్లగాలి వీస్తుంది. ఇదొక జర్నీ. దాన్ని స్వచ్ఛంగా ఆస్వాదించడం తెలియాలి. భరణితో ప్రయణాన్ని కూడా ఎలాంటి ప్రశ్నలూ వేసుకోకుండా సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా! నేను ‘భరణీ’ అని పిలుస్తాను. వాడు నన్ను ‘ప్రకాశ్’ అంటాడు. ఎందుకో ఆ చనువు అలా వచ్చేసింది! నా వయసెంతో తనకు తెలీదు... అతని వయసు గురించి నాకనవసరం. ఎక్కడో నేను చూసిన వింతైన మనుషులు, గమ్మత్తయిన సంఘటనలు, కొన్ని మాటలు, కొంత మౌనం... ఇవన్నీ భరణితో షేర్ చేసుకోవాల్సిందే. బయటకు చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. కానీ, ఎవరో ఒకరితో చెప్పుకోవాల్సిందే. మన దృష్టితో ఆలోచించేవాడయితేనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ కుదురుతుంది. భరణి అలాంటివాడే! గుత్తొంకాయ కూర... తింటే వాడింట్లో తినాల్సిందే! షూటింగ్లో కలుసుకున్నప్పుడు... రేపు లంచ్లో మెనూ ఇదీ అంటాడు. తను రాకపోయినా గుత్తొంకాయ కూర వస్తుంది. ఆ రంగు.. రుచి.. వాసన.. ఆహా.. నోరూరిపోతుంది! ఫోన్ చేసి బావుందిరా అంటే... వాడి మనసు నిండిపోతుంది. అప్పుడప్పుడూ... చెన్నైలో సముద్రపు ఒడ్డున కూర్చుంటాం. ఎదురుగా సముద్రం... మాకిష్టమైన బ్రాండ్... ఇక మాటలే మాటలు..! నేను కర్నాటక పొయిట్రీ గురించి చెబుతాను... వాడు తెలుగు లిటరేచర్లోని అందాలు ఆవిష్కరిస్తాడు! ఇద్దరం అలా అలా... మరాఠీ కవితల్లోకి .. బెంగాలీ కథల్లోకి కొట్టుకెళ్లిపోతాం. జయంత్ కైకిని అని కన్నడంలో గొప్ప కవి. తను రాసిన ‘శబ్ద తీర’ పుస్తకం ఇప్పుడు చదువుతున్నా. ఓసారి అనుకోకుండా ముగ్గురం కలిశాం. జయంత్కి, భరణికి ఒకరికొకరికి ముఖపరిచయం లేదు. కానీ బాగా పరిచయస్తుల్లా కలిసిపోయారు. భరణి పొయిట్రీ గురించి జయంత్ ఆశువుగా చెప్పేస్తున్నాడు... జయంత్ కథల్లోని మెరుపుల గురించి భరణి తన్మయంగా వివరిస్తున్నాడు... వాళ్లిద్దర్నీ అలా చూస్తూ నాలో నేనే మైమరచిపోయా! వారిద్దరికీ బ్రిడ్జ్ని నేనే కదా మరి! ఈ భార్య, పిల్లలు, ప్రియురాలు, స్నేహితుడు... ఇలా కొంతమందికే పరిమితమైన ఆప్తవలయంలో వాడు ఉన్నాడు. మా రిలేషన్షిప్ దేనికీ ఆనదు. దేర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకే నేనెక్కువ మాట్లాడలేకపోతున్నా. అయినా మా జర్నీ ఇంకా ఉంది కదా... మరింకెలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? అందుకే మళ్లీ కలుద్దాం! బై! సంభాషణ: పులగం చిన్నారాయణ -
జీతమడగని కాపలాదారు...
సమగ్ర సంపుటి రాజ్యాంగంలో ఎలుకలు పడ్డయ్ శాసన సభల్లో పందికొక్కులు సొర్రినయ్ నీతికి చెదలు పట్టింది ధర్మాన్ని చీడ ముట్టింది వాళ్లు వీళ్లు అనే భేదం లేదు దేశాన్ని తెగనమ్మడంలో అంతా సమానమే నవ్వుకుంటనే ఇండ్లు ముంచుతరు ఏడ్చుకుంటనే ఊర్లకు అగ్గిపెడుతరు అంతా హర్ ఏక్ మాల్ నదులకు టెండర్లు పిలుస్తారు నీరు అడుగంటుతే ఇసుకకు బ్యారం పెడతరు.... జూకంటి జగన్నాథం దాదాపు తన పాతికేళ్ల సుదీర్ఘ కవి జీవితంలో ఏనాడూ కంటి మీద రెప్ప వేయలేదు. చేతి నుంచి లాఠీ జారవిడువలేదు. ఏమరుపాటు కలిగించే విజిల్ని కూడా. ఆయన ఎవరూ ఇవ్వని కాపలాదారు పోస్టును స్వీకరించారు. ఒక నిజమైన కవి పని అదే. జీతభత్యాలు లేకుండా జనం కోసం ముందుకు నడవడం. తెలంగాణ నుంచి జూకంటి అంత విస్తృతంగా రాసిన కవి లేడు. ఆయనంత విస్తృత వస్తువును స్వీకరించిన కవి కూడా లేడు. ఊరు, వాడ, పట్నం, నగరం, వలస వెళ్లిన ఎడారి ప్రాంతం, డాలర్లకు కొనేసుకున్న స్వర్ణపిశాచినగరం... ఇవన్నీ ఆయన కవితా వస్తువులు. జూకంటి తన కవిత్వం మొత్తంలో రెండు అంశాలను నిశితంగా గమనిస్తూ వచ్చారు. ఒకటి- కొంటున్నది ఎవరు? అమ్ముడుపోతున్నది ఎవరు? ఈ దేశపటం ముందు ‘ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ బోర్డు తగిలించడం వల్ల నలిగి నాశనమైపోతున్నది ఎవరు? జూకంటి కవిత్వంలో పచ్చిపాల వంటి స్వచ్ఛత, ర్యాలాకు మంటల్లో కాల్చిన సీతాఫలం కాయల రుచి ఎలాగూ ఉంటుంది. కాని ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించేది ప్రపంచ పరిణామాల అవగాహన, ఎక్కడో కమ్ముకున్న మేఘానికి ఇక్కడ జరగబోయే విధ్వంసం. దానిని పసిగట్టి, రాసి, పారాహుషార్ పారాహుషార్ అంటూ అరిచి నిద్ర మేల్కొలిపే పనిలో ఉండిపోయిన కవి జూకంటి. చుట్టూ చావువాసన సన్నగా నిశ్శబ్దిస్తున్న శోకం దోషం మనదే రేషం మనదే కొడుకా... అమలవుతున్న ఎజెండా అంతా ఏనుగు మింగిన వెలగపండు.... జూకంటి ఇప్పటికి 12 కవితా సంపుటులు వెలువరించారు. పాతాళ గరిగె (1993) నుంచి చిలుక రహస్యం (2012) వరకు... అన్నీ అలారం మోతలే. కొన్ని టార్చ్లైట్లు. కొన్ని సేదదీర్చే చన్నీటి కుండలు. ఆ కవిత్వమంతా ఇప్పుడు మూడు సంపుటాలుగా వెలువడింది. ఇది తెలుగు కవిత్వానికి మంచి చేర్పు. జూకంటి సృజనను మూల్యాంకనం చేయవలసిన సమయం. ఇంత రాసినందుకు ఆయనకు ఏమి ప్రతిఫలం కావాలి? ఏం లేదు. సమాజం నుంచి కాసింత జాగరూకత. చాలు. జీతం అకౌంట్లో పడిపోయినట్టే. - సాక్షి సాహిత్యం జూకంటి జగన్నాథం కవిత్వం (మూడు సంపుటాలు); నయనం ప్రచురణ; వెల- 300; ప్రతులకు- 9441078095 -
కొత్త పుస్తకాలు: కొర్రాయి (కవిత్వం)
రచన: డా.దామెర రాములు పేజీలు: 192; వెల: 70 ప్రతులకు: దామెర శోభారాణి, కేరాఫ్ నిర్మల్ నర్సింగ్ హోం, వివేక్నగర్, నిర్మల్-504106. ఫోన్: 9866422494 రగిలిన క్షణాలు (కవిత్వం) రచన: డా.సి.భవానీదేవి పేజీలు: 124; వెల: 150 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ; ఫోన్: 040-27636172 పొరుగు వెన్నెల (అనువాద కవిత్వం) అనువాదం: ఎలనాగ పేజీలు: 72; వెల: 50 ప్రతులకు: రచయిత, 73, నక్షత్ర కాలనీ, బాలాపూర్ గ్రామం, వయా కేశవగిరి, హైదరాబాద్-5. ఫోన్: 9866945424 విడనిముడి (కవిత్వం) రచన: ముకుంద రామారావు పేజీలు: 128; వెల: 60 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్పేట, హైదరాబాద్-36. ఫోన్: 040 27678430 ఉగ్గం (కవిత్వం) రచన: కొమ్ము సుధాకర్ పేజీలు: 72; వెల: 25 ప్రతులకు: రచయిత, 3-7-164, లైన్ వాడి స్ట్రీట్, నల్గొండ-508001. ఫోన్: 9959567419 వలపోత (తెలంగాణోద్యమ దీర్ఘ కవిత) రచన: డప్పోల్ల రమేష్ పేజీలు: 72; వెల: 70 ప్రతులకు: ఎన్నార్, 6-69, బ్యాంక్ కాలనీ, పి.ఆర్.పల్లి. సంగారెడ్డి, మెదక్ జిల్లా. ఫోన్: 9550923323 అత్తరు సీసా (కవిత్వం) రచన: డా.పి.సుమతీ నరేంద్ర పేజీలు: 126; వెల: 90 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, ఫ్లాట్ 3, బ్లాక్ 6, ఎంఐజి 2, ఎపిహెచ్బి, బాగ్లింగంపల్లి, హైదరాబాద్. ఫోన్: 9391039119 -
ఏమని చెప్పను!
కాలేజీ రోజుల్లో రవీందర్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. కవిత్వం బాగా రాసేవాడు. అతని కవిత్వాన్ని విని మేమంతా ‘వహ్వా వహ్వా’ అని ఎంజాయ్ చేసేవాళ్లం. మేము మాత్రమే కాకుండా లెక్చరర్లు, కాలేజీ సిబ్బంది కూడా అతని కవిత్వాన్ని ఆస్వాదించేవారు. ఒకరోజు ‘ఆశు కవిత్వం’ పేరుతో ఒక కార్యక్రమం పెట్టాడు. ఎవరు ఏ టాపిక్ చెప్పినా అప్పటికప్పుడు కవిత్వం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రేక్షకుల నుంచి నాగరాజు అనే సీనియర్ లేచి ‘‘ఇలా అప్పటికప్పుడు కవిత్వం చెప్పడం పెద్ద విషయం కాదు.. నేను కూడా చెప్పగలను. కావాలంటే చెక్ చేసుకోండి’’ అని సవాలు విసిరాడు. ‘‘రవి వాన మీద కవిత్వం చెప్పాడు కాబట్టి నువ్వు ఎండ మీద చెప్పు’’ అన్నారు ఎవరో. ‘‘అలాగే’’ అంటూ మొదలు పెట్టాడు నాగరాజు- ‘ఎండ మీద చెప్పమన్నావు... ఏమని చెప్పను! ఏమీ చెప్పకపోతే ఎండలా మండి పడతావు. అందుకే నిండుగా చెబుతున్నా ఎండ అంటే చెమటసముద్రం... అందులో మనం ఈదుతూనే ఉంటాం’ రవీందర్ కవిత్వం విని అందరం నవ్వుకున్నాం. అది ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటుంది. -పి. ప్రశాంత్, విజయనగరం -
పద్యానవనం: పాలకులు పలికి బొంకకూడదు...
‘‘ఒక్కొక పద్దియంబునకు నొక్కొక నెత్తురు బొట్టు మేనిలో తక్కువగా రచించితి, వృధాశ్రమయయ్యె గులీనుడైన రా జిక్కరణిన్ మృషల్వలుకునే? కవితా ఋణమీయకుండునే నిక్కమెరుంగనైతి గజనీ సులతాను మహమ్మదగ్రణీ!’’ సమాజాన్ని లోతుగా పరిశీలించి, స్వీయానుభవంతో..... అందులో మంచి చెడుల్నే కావ్య వస్తువుగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహనీయుడు గుర్రం జాషువా. పారశీక కవి ‘పిరదౌసి’... రాజును నమ్మి, ఎంతో శ్రమించి మోసపోయిన తీరును అత్యద్భుత కావ్యంగా మలిచారు. ప్రతి పద్యం ఆణిముత్యమే! పిరదౌసి కూడా అదే చెబుతున్నాడు. గజనీ సుల్తాను ప్రభువు, తన వంశ చరిత్రను కావ్యంగా రాయమని కోరినపుడు తనకు ఏం మాట ఇచ్చాడు? రేయింబవళ్లు తాను ఎంతో శ్రమకోర్చి కావ్యాన్ని పూర్తి చేశాక రాజు ఎలా మాట తప్పాడు? ఇదే పిరదౌసి కావ్యం. ఒక్కో పద్యానికి ఒక్కో రక్తపు బొట్టు ఖర్చయ్యేలా కష్టించి కావ్య రచన చేశానంటాడు కవి. తన శ్రమంతా వృథా అయింది. రాజు మాట తప్పాడు. ఒక్కో పద్యానికి ఒక్కో బంగారు నాణెమిస్తానని సభాముఖంగా ప్రకటించి, కావ్య రచన పూర్తయ్యాక మాట తప్పి వెండి నాణేలు పంపాడు. రాజులు, అంటే పాలకులే అలా మాట తప్పొచ్చా? పాలకులే మాట తప్పితే ఇక ప్రజల గతి ఏంటి? జాషువా.... కాదు కాదు పిరదౌసి పేర్కొన్నట్టు ‘‘నిక్కమెరుంగనైతి....’’ అని పిదప బాధపడాల్సి వస్తుంది. నిజమే! ఇప్పుడు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల్లోనూ పాలకులు ఆడినమాట తప్పినపుడు సామాన్య ప్రజలు ఏం చేయగలుగుతున్నారు? ఎన్ని ఎన్నికల ప్రణాళికలు గాలి మాటలై, నీటి మూటలై ప్రజానీకాన్ని వెక్కిరించడం లేదు! ‘అయ్యో ఇంతటి పచ్చి అబద్ధాలకోరు అని ఊహించకపోతిమే! తెలియక ఈయన్ని ఎన్నుకుంటిమి, నిజం గ్రహించమైతిమి, ఇప్పుడేం చేయాలి?’ అని వగచడం తప్ప మళ్లీ అయిదేళ్ల దాకా సగటు పౌరులు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. తప్పు చేసిన, మాట తప్పిన ప్రజాప్రతినిధుల్ని వెనక్కి పిలిచే వ్యవస్థా లేదిప్పుడు. ఒక్కసారి చెయిజారిన ఓటు, అయిదేళ్లదాకా వెనక్కి రాని, అంటే, తిరిగి వాడలేని అర్జున నాగాస్త్రమే! స్వల్ప కాలిక జ్ఞాపకం, మరుపు అనే మానవ లక్షణాల్నే తమకు శ్రీరామరక్షగా మలచుకొని రాజకీయ పక్షాలు రాజ్యాలేలుతాయి. అవసరానికి మాయ మాటలు చెప్పి, అటుపై నిస్సిగ్గుగా మాట తప్పి తలలెగరేసుకొని మరీ రాజకీయాలు నెరపుతున్నాయి. ఎన్నికల ముందు మానిఫెస్టోల మయసభా మేడలు కట్టి, జనాల్ని ఆశల పల్లకీలెక్కించి, ఆనక అన్నీ మరచి వంచించడం మామూలయిపోయింది. అయిదేళ్లకు తిరిగి ఎన్నికలు రాగానే, పద పదం, వాక్యాలకు వాక్యాలు, పేరాలకు పేరాలు, పేజీలకు పేజీలు.... యధాతథంగానో, కాస్త అటుఇటుగా మార్పులు చేసో మళ్లీ కొత్త మానిఫెస్టోలు జారీచేయడం రివాజయింది. ఇదంతా మాట తప్పడం కాదా? ఆత్మ వంచన-పర వంచన కాదా? ఆయా నేతలు, రాజకీయ పక్షాల చరిత్రను సరిగా పరిశీలించి, జనం జాగ్రత్తగా కీలెరిగి వాత పెడితే గాని, ఈ మాయా రోగం కుదురుకోదు. సగటు జీవి జీవితం కుదుటపడదు. మాటమీద నిలబడే వారి విశ్వసనీయతే ప్రామాణికంగా ప్రజలు తీర్పిచ్చినపుడే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం. అసలు విలువ తెలిసి ఓటును ఒక అస్త్రంగా వాడితే తప్ప, మనుషుల్ని మనుషులుగా కాకుండా, ఓటర్లుగా మాత్రమే చూసే ఆధునిక అరాచకీయాలకు అంతముండదు. కావ్యం రాయమని ఆనతిచ్చిన రాజు తన కవితా ఋణమీయకుండునే? అని కవి వగచాడు. ‘వచ్చే అయిదేళ్లు నీవు మా పాలకుడివిగా ఉండు’ అని, మహత్తరమైన ‘ఓటు’తో ప్రజాకోర్టులో తీర్పిచ్చిన ఓటరు రుణమీయకుండా ఉండే ఆ రాజు/పాలకుడు ఏమవుతాడు? నామ రూపాల్లేకుండా నాశనమవుతాడు కవి చెప్పినట్టుగా! అప్పటిదాకా ఒక గొప్ప తారగా వెలిగిన రాజు కూడా, మాటపై నిలబడకుండా ప్రజాకంటకుడైతే ఏమవుతాడో కవి చక్కగా చెప్పాడు. ‘.....కవియు చనిపోయె యొక చుక్క గగనమెక్కె, రాజు మరణించె నొక తార రాలిపోయె!’ అదీ తేడా! - దిలీప్రెడ్డి -
అప్పటికప్పుడు కవిత రాసేశాను!
తొలి చూపులోనే ఆకట్టుకునే అందం కృతీ సనన్ సొంతం. ‘1’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీలో ‘హీరో పంతి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్లో తను చేస్తున్న తొలి చిత్రం ఇది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శక, నిర్మాతల దృష్టి కృతిపై పడింది. భవిష్యత్ చాలా ఆశాజనకంగా ఉందంటున్నారామె. నటన మాత్రమే కాదు.. కృతికి ఇతర ప్రతిభలు కూడా ఉన్నాయి. స్కూల్, కాలేజ్ డేస్లో బాగా డాన్స్ చేసేవారట. అలాగే కవితలు కూడా రాసే అలవాటు ఉండేదట. దాని గురించి కృతి చెబుతూ - ‘‘నాకు కవితలు రాయడం చాలా ఇష్టం. సినిమాల్లోకి రాకముందు తెగ రాసేదాన్ని. కానీ, ఇక్కడికొచ్చిన తర్వాత తీరిక చిక్కడంలేదు. మా తాత చనిపోయినప్పుడు ఓ కవిత రాశాను. అల్లారు ముద్దుగా చూసుకున్న తాత ఇక లేరనే బాధలోంచి ఆశువుగా పుట్టుకొచ్చిన కవిత అది. నేను రాసిన చివరి కవిత అదే. హీరోయిన్ అయిన తర్వాత ఏ కాస్త టైమ్ చిక్కినా సినిమాలు చూస్తున్నాను. అలాగే ఢిల్లీలో మా ఇంటికెళ్లి, కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను. అందుకే కవితలు రాయడానికి టైమ్ ఉండటంలేదు’’ అన్నారు -
ప్రేమ శిశువు....
కవిత్వం ప్రేమ ఏకైక శిశువు మనిద్దరికీ జన్మించిన మృదుల శిశువు మనిద్దరినీ జతపరిచిన శాశ్వత శిశువు పడుచుదనము వార్థక్యము ఎరుగని పసికందు మనవేపు నిరంతరం చూస్తోంది మనమే లోకం వలె కళ్లప్పగించి తేరిపార నవ్వు ముఖాలతో వుంటే కిలకిలమంటోంది ముద్దాడుకొంటుంటే కేరింతలు కొడుతోంది నువ్వు చిటికెలు వేస్తే నేను చప్పట్లు చరిస్తే కొత్తగా రెక్కలు విప్పారిన సీతాకోకచిలుక మల్లే తప్పటడుగులతో దగ్గర దగ్గరకొస్తోంది ఆడుతోంది నీ ఒడిలో అమాయక బాల్యం పారాడుతోంది నా గుండెల మీద మువ్వలతో అనంతకాలం ఒకరు కనిపించీ మరొకరం కనిపించని ఏకాకి మేఘావృత గగనం కింద బెంగటిల్లిపోతోంది ఆ తరుణం ఆడిపాడి ఒకింత అలసిన గారాబు పట్టి జోజోమన్న లాలిపాట ఒకటి ఆలపించగా రాత్రిపూట చందమామ నిశ్చింతలో నిద్రిస్తోంది నీకు నాకు మధ్య లిల్లీపువ్వుల వంటి లేలేత వేళ్లతో తట్టి తట్టీ లేపుతోంది దినచర్యకి వేళవుతోందని వేకువజామున నిన్నూ నన్ను ప్రేమ ఒక్కగానొక్క శిశువు మనిద్దరికీ జన్మించిన కాలాతీత శిశువు మనిద్దరినీ జతపరిచిన చిర నూతన శిశువు - నామాడి శ్రీధర్, 9396807070 -
కవిత: పావురం కళ్లు
మెల్లిగా లోకం పై వెలుతురు పరుచుకునేవేళ ఎక్కడి నుంచి వచ్చి వాలుతుందో ఒక తెల్లటి పావురం నా కిటికీ మీద అప్పుడు నేను నా విచారాల్ని, సంతోషాల్నీ తెల్లటి కాగితంపై అక్షరాలుగా చల్లుతూ ఉంటాను అద్దం పై నిలిచిన నీళ్లలా అవి నన్ను ప్రతిబింబిస్తూ కవిత్వంలా రూపుదిద్దుకోవడాన్ని చూస్తుంటాను కిటికీ గాజు తలుపుల్ని ముక్కుతో కొడుతూ పావురం పిలుస్తుంది నన్ను పావురాలు కవిత్వం కన్నా గొప్పవి కావన్న అతిశయంతో దాన్ని ఎన్నడూ పట్టించుకోను ఎన్నో ఏళ్లుగా అది వదలకుండా అట్లా నన్ను పిలుస్తూనే ఉంది చివరకి తలెత్తి చూస్తే దాని చిన్ని నక్షత్రాల్లాంటి కళ్లలో అనిర్వచనీయ జీవ కవిత్వపు జాడలు కదలాడుతూ నన్ను పలకరిస్తాయి అప్పుడు కాగితంపై నేను చల్లిన అక్షరాలన్నీ హటాత్తుగా మాయమై ఎటో ఎగిరిపోయాయి అనాదిగా కవులు రాసిన కవిత్వాలన్నీ పావురాలై ఆకాశంలోకి ఎగిరిపోయాయేమో అందుకేనేమో అవి అట్లా రెక్కల్ని విప్పి రెండు ఆలీవ్ కొమ్మల్ని పట్టుకొని స్వేచ్ఛా కాంక్షని, శాంతి సందేశాన్ని మోస్తూ లోకం అంతటా ఎగురుతున్నాయి పావురం కళ్లలోని దయకన్నా ఎవరి కవిత్వం గొప్పది చెప్పు? - విమల -
కవిత్వం: ఏటి ఒడ్డున...
ఏటి ఒడ్డున ఏం ఉంటుంది? ఎవరో విడిచి వెళ్లిన నాలుగు కన్నీటి చుక్కలు విడిది చేసిన కొన్ని మసక సంభాషణలు విడిచేసిన ఏకాంతపు ముఖాలు ఇసకలో దిగులు గుంతల వలయాలు ఏటి ఒడ్డున ఇంతకన్నా ఏం ఉంటాయి? జలజల పారే ఏటి సవ్వడిలో కలిసి తడిసిపోయిన కొంత పొడి దుఃఖం ఏటి ఒడ్డున అంతకన్నా ఏం ఉంటుంది? ఏటి ఒడ్డున ఇంకా... రంగు రంగుల గులకరాళ్లు పగిలిన నత్త గుల్లలు మువ్వల శబ్దాలు మోసే పాద ముద్రలు పగటి మబ్బుల మీద కొలువు దీరిన వెన్నెల దీపాలు అంతేనా- ఒక పేరు లేని ప్రేయసి ఊరు లేని స్నేహితుడు ఒక అభౌతిక కౌగిలింత ఒక అధిభౌతిక కరచాలనమూ ఉంటాయి ఏటి ఒడ్డున... ఇంకా- ఏటి ఒడ్డున ఇవేవీ పట్టనట్టు తుళ్లుతూ పరవళ్లు తొక్కుతూ పారే ఏరు కూడా ఉంటుంది! - పసునూరు శ్రీధర్ బాబు -
వేదాలలో ఏముంది?
సత్యస్వరూపమైన భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానానికే వేదం అని పేరు. పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాల మాదిరి ఇవి ఒకరు రాసినవి కావు. అందుకే వీటిని అపౌరుషేయాలు అన్నారు. అంటే మానవుడు చెప్పింది కాదు అని అర్థం. అలాగే వీటికి లిపి ఉండదు. అనాదిగా ఒకరి నుంచి మరొకరికి వాక్కు రూపంలో అందుతూ వస్తున్నాయి కాబట్టి శృతులని పేరు. అంటే ఋషులు తీవ్రమైన తపోనిష్ఠలో ఉన్నప్పుడు ఆకాశవాణి రూపంలో వీటిని విని, అక్షరబద్ధం చేశారు. అలా వేదం నిరంతర ప్రవాహంగా, అనంతంగా సాగిపోయింది. ఈ అనంతమైన వేద విజ్ఞానాన్ని వ్యాసుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు భాగాలుగా విభజించాడు. అందుకే ఆయనకు వేదవ్యాసుడని పేరు. ఈ వేదరాశులు అనాగరిక మానవుని కాలం నుంచి నిష్కల్మషంగా, నిర్మలంగా ప్రవహిస్తూ, మానవుని మలిన రహితునిగా చేసి, మేధోవంతునిగా, సంస్కారవంతునిగా తీర్చిదిద్దుతూ వస్తున్నాయి. వేదాలను అర్థం చేసుకోవడానికి మహర్షులు ఆరు వేదాంగాలను, నాలుగు ఉపవేదాలను అందులో భాగం చేశారు. శిక్ష, వ్యాకరణం, నిరుక్తం లేదా నిఘంటు. ఛందస్సు, జ్యోతిషం, కల్పం... ఈ ఆరూ వేదాంగాలు. గాంధర్వవేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్థవేదం అనే నాలుగూ ఉపవేదాలు. వేదార్థాలను తెలుసుకోవడానికి వేదాలు మంత్రభాగం. అంటే వాటిలో మంత్రాలు మాత్రమే ఉంటాయి కాని, క ర్మ విధానం ఉండదు. ఋగ్వేదం వాక్కు ప్రధానంగా కలది. అది ప్రజలకు చేరడానికి సంధానకర్తగా పైలుడనే రుషి వ్యవహరించాడు. అతి ప్రాచీనమైనది ఋగ్వేదమే. ఋగ్వేదంలో ఉండే మంత్రాలకి ఋక్కులని పేరు. ఇవి ఛందోబద్ధంగా ఉంటాయి. రెండవది యజుర్వేదం. ఇంద్రియాలతో కర్మలు చేసే విధానం తెలిపేది. దీనిని మానవులకు అందించింది వైశంపాయన మహర్షి. యజ్ఞయాగాదుల గురించిన వివరణ ఇందులో ఉంటుంది. ఇందులో రెండు భాగాలున్నాయి. అవి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం మూడవది సామవేదం. సామం అంటే గానం అని అర్థం. అంటే సామవేదం సంగీతానికి సంబంధించింది. ఇది అన్ని వేదాలలోకీ చిన్నది. దీనిని జైమిని ముని వ్యాపింపచేశాడు. నాలుగవది అధర్వణ వేదం. దీనిలో యుద్ధవిద్యలు, పౌరధర్మాలు, ఆరోగ్యం, మూలిక చికిత్స, రాజ్యం, రాజ్యాంగం, రాజకీయవ్యవస్థల గురించిన వర్ణనలు, అనేకరకాలైన చికిత్స విధానాలు ఉంటాయి. దీని నిర్వహణ కోసం వేదవ్యాసుడు సుమంతుడనే ఋషిని నియమించాడు. అసలు వేదాలలో ఏమేం ఉంటాయో తెలిపేవే పురాణాలు. వేదాన్ని కథలు కథలుగా వివరిస్తూ, వర్ణనాత్మకంగా చెప్పేవే ఇతిహాసాలు. అనంతమైన విజ్ఞానాన్ని నిబిడీకృతం చేసుకున్న వేదాలు మానవుని ఐహిక, పారమార్థిక, ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ ప్రవచించాయి. సత్యధర్మాలతో గడిపే జీవనమార్గానికి అనేక మంత్రాలు, స్తోత్రాల రూపంలో మనకు అందించాయి. అవే యజ్ఞయాగాదులు, పూజలు, ప్రార్థనలు, వ్రతాలు, మొక్కులుగా మారాయి. వేదాల చివరి భాగాలనే వేదాంతాలని, వేదసూత్రాలని అంటారు. వీటికే ఉపనిషత్తులని కూడా పేరు. ఇవి... వేదాలు, ఉపాంగాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తాయి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్నాయి. - కూర్పు: డి.వి.ఆర్