Q1 results
-
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు నిరాశ
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మొదటి త్రైమాసికంలో నిరాశజనక ఫలితాలను నమోదు చేసింది. 2024 జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికం ఫలితాలను కంపెనీ సోమవారం (జూలై 15) వెల్లడించింది.గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 6% క్షీణించి రూ.312.63 కోట్లకు చేరుకుంది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని రూ.414 కోట్లతో పోలిస్తే కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 9% పెరిగి రూ.417.8 కోట్లకు చేరుకుంది.మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈలో రూ.4.90 లేదా 1.40% పెరిగి రూ.355.25 వద్ద ముగిశాయి. -
దశ తిరిగిన కాఫీడే! ఎట్టకేలకు లాభాల్లోకి..
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కాఫీడే (కేఫ్ కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్- సీడీజీఎల్) దశ తిరిగిట్టు కనిపిస్తోంది. నష్టాల ఊబి నుంచి బయటపడి ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.24.57 కోట్ల నికర లాభం వచ్చినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.11.73 కోట్ల నష్టాన్ని కాఫీడే చవిచూసింది. మొత్తంగా ఏడాది క్రితం తొలి త్రైమాసికంలో రూ.189.63 కోట్లుగా ఉన్న కంపెనీ ఆపరేషన్స్ ఆదాయం ఈ ఏడాది రూ.223.20 కోట్లకు చేరుకున్నట్లు క్యూ1 ఫలితాల వెల్లడి సందర్భంగా కాఫీ డే పేర్కొంది. సీడీజీఎల్ అన్లిస్టెడ్ కంపెనీ కావడంతో దాని మాతృ సంస్థ కాఫీడే ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ (సీడీఈఎల్) ప్రతి త్రైమాసికం ఫలితాలను వెల్లడిస్తుంది. కాగా ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 250 కోట్లు. మరోవైపు ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో కాఫీ డే దేశవ్యాప్తంగా ఉన్న తమ అవుట్లెట్ల సంఖ్యను సీక్వెన్షియల్ ప్రాతిపదికన 467కి తగ్గించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 493 అవుట్లెట్లు ఉండేవి. కానీ, వెండింగ్ యంత్రాలను మాత్రం 46,603 నుంచి 50,870కి పెంచుకుంది. ఒక్కో అవుట్లెట్లో సరాసరి రోజువారీ ఆదాయం రూ.19,537 నుంచి రూ.20,824కి పెరిగినట్లు కాఫీడే కంపెనీ వెల్లడించింది. క్యూ1 ఫలితాల నేపథ్యంలో కాఫీడే షేర్లు ఆగస్ట్ 16న లాభాల బాటలో పయనించాయి. ఇదీ చదవండి: Vietnam Richest man: అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద.. -
అయ్యో వొడాఫోన్ ఐడియా! పాపం భారీ నష్టాలు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,296 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,656 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 10,407 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 128 నుంచి రూ. 139కు మెరుగుపడింది. -
లాభాల్లోకి స్పైస్జెట్.. నష్టాలను వీడిన తక్కువ ధరల ఎయిర్లైన్స్!
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 205 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరగడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 789 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 2,457 కోట్ల నుంచి రూ. 2,002 కోట్లకు నీరసించింది. నిర్వహణ వ్యయాలు సైతం రూ. 2,072 కోట్ల నుంచి రూ. 1,291 కోట్లకు భారీగా తగ్గాయి. పలు సవాళ్ల నేపథ్యంలోనూ లాభాలు ఆర్జించగలిగినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాము చేపట్టిన రూ. 500 కోట్ల పెట్టుబడులు కంపెనీ వృద్ధికి తోడ్పాటునిచ్చినట్లు తెలియజేశారు. ఈ కాలంలో లాజిస్టిక్స్ సంస్థ స్పైస్ఎక్స్ప్రెస్ అండ్ లాజిస్టిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ను విడదీయడంతో స్పైస్జెట్ నెట్వర్త్ మెరుగుపడినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో స్పైస్జెట్ షేరు బీఎస్ఈలో 7% జంప్చేసి దాదాపు రూ. 34 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ రికార్డ్లు.. నికర లాభం 178 శాతం దూసుకెళ్లి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 178 శాతం దూసుకెళ్లి రూ. 16,884 కోట్లను తాకింది. ఒక త్రైమాసికంలో ఇది అత్యధికంకాగా.. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 6,068 కోట్లు ఆర్జించింది. ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం దోహదపడ్డాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 7,325 కోట్ల నుంచి రూ. 18,537 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 94,524 కోట్ల నుంచి రూ. 1,32,333 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.91 శాతం నుంచి 2.76 శాతానికి, ఎన్పీఏలు 1 శాతం నుంచి 0.71 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.24 శాతం మెరుగై 3.47 శాతంగా నమోదయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 1.13 శాతం పుంజుకుని 14.56 శాతాన్ని తాకింది. వడ్డీ ఆదాయం ప్లస్ క్యూ1లో ఎస్బీఐ మొత్తం ఆదాయం(స్టాండెలోన్) సైతం రూ. 74,989 కోట్ల నుంచి రూ. 1,08,039 కోట్లకు జంప్ చేసింది. వడ్డీ ఆదాయం రూ. 72,676 కోట్ల నుంచి రూ. 95,975 కోట్లకు బలపడింది. అయితే నికర వడ్డీ ఆదాయం 25 శాతం ఎగసి రూ. 38,905 కోట్లను తాకింది. పొదుపు ఖాతాల్లో 63 శాతం, రిటైల్ ఆస్తులలో 35 శాతం యోనో(డిజిటల్) ద్వారా పొందినట్లు బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో దాదాపు రూ. 490 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే సంస్థ ఐపీవో ప్రణాళికలను పునరుద్ధరించే యోచనలో లేనట్లు స్పష్టం చేశారు. రుణ నష్టాలకు ప్రొవిజన్లు 38 శాతం తగ్గి రూ. 2,652 కోట్లకు చేరాయి. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 1,278 కోట్లతో పోలిస్తే 107 శాతం అధికమయ్యాయి. -
ఎయిర్టెల్ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 1,612 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,607 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటుకు ముందు నికర లాభం 91 శాతం జంప్చేసి రూ. 2,902 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 37,440 కోట్లకు చేరింది. దేశీ మొబైల్ సరీ్వసుల ఆదాయం 13 శాతంపైగా పుంజుకుని రూ. 26,375 కోట్లను తాకినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 183 నుంచి రూ. 200కు బలపడింది. రూ. 19,746 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించగా.. 52.7 శాతం ఇబిటా మార్జిన్లను సాధించింది. 4జీ యూజర్లు అప్ తాజా సమీక్షా కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 56 లక్షల మంది 4జీ వినియోగదారులను జత చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించడం ద్వారా 0.8 మిలియన్ పోస్ట్పెయిడ్ వినియోగదారులను జత కలుపుకున్నట్లు తెలియజేశారు. దీంతో వీరి సంఖ్య దాదాపు 2.05 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఇక మొబైల్ డేటా వినియోగం 22 శాతం ఎగసి ఒక్కో కస్టమర్పై నెలకు 21.1 జీబీకి చేరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 872 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన ఎస్బీఐ: లాభాలు హై జంప్
State Bank of India Q1 results: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త క్యూ1 ఫలితాల్లో అదరగొట్టింది. శుక్రవారం ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాలలో అంచనాలకు మించి రాణించింది. అంతేకాదు వరుసగా నాలుగో త్రైమాసికంలో రికార్డు లాభాలను నమోదు చేయడం విశేషం.ఆస్తుల నాణ్యత మెరుగుదల నికర వడ్డీ ఆదాయం వృద్ధి, లాభాలకు దారి తీసింది. (యాపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్...ఇక పండగే!) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ.16,884.29 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లోని రూ.6,068.08 కోట్ల లాభాలతో పోలిస్తే ఇది ఏకంగా 178.24 శాతం అధికం. మార్కెట్ విశ్లేషకులు అంచనా 12.-160 శాతం కంటే ఎక్కువ. నికర వడ్డీ ఆదాయం 24.71 శాతం ఎగిసి రూ.38,905 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లు, ఇతర హైలైట్స్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం డిపాజిట్లు ఏడాదికి 12 శాతం పెరిగి రూ.45.31 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.40.46 లక్షల కోట్లుగా ఉంది. విదేశీ కార్యాలయాల డిపాజిట్లు ఏడాదికి 22.74 శాతం పెరిగి రూ.1.79 లక్షల కోట్లకు చేరుకోగా, దేశీయ డిపాజిట్లు 11.60 శాతం పెరిగి రూ.43.52 లక్షల కోట్లకు చేరుకున్నాయి. CASA డిపాజిట్ సంవత్సరానికి 5.57 శాతం పెరిగింది. అయితే CASA నిష్పత్తి జూన్ 30 నాటికి 42.88 శాతంగా ఉంది. నికర వడ్డీ మార్జిన్లు గత ఏడాది త్రైమాసికంలో 3.23 శాతం నుంచి జూన్ త్రైమాసికంలో 24 బేసిస్ పాయింట్లు పెరిగి 3.47 శాతానికి ఎగిసింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.76 శాతంగా ఉంది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకు ఈ త్రైమాసికానికి రూ.2,501.31 కోట్ల విలువైన కేటాయింపులు చేసింది. జూన్ 30, 2022 నాటికి రూ.29,00,636 కోట్లతో పోలిస్తే స్థూల అడ్వాన్సులు 13.90 శాతం పెరిగి రూ.33,03,731 కోట్లకు చేరాయని బ్యాంక్ నివేదించింది. అలాగే డిపాజిట్లు రూ.45,31,237 కోట్ల నుంచి రూ.45,31,237 కోట్లకు పెరిగాయి. క్రెడిట్ ఖర్చు 0.32 శాతం ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో 0.61 శాతంగా నమోదైంది. -
అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 44 శాతంపైగా జంప్చేసింది. రూ. 677 కోట్లను తాకింది. వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 469 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 41,066 కోట్ల నుంచి రూ. 25,810 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 40,434 కోట్ల నుంచి రూ. 24,731 కోట్లకు వెనకడుగు వేశాయి. ఈ కాలంలో అదానీ ఎయిర్పోర్ట్స్ 2.13 కోట్లమంది ప్రయాణికులను హ్యాండిల్ చేసింది. 27 శాతం వృద్ధి ఇది. అదానీ న్యూ ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ నుంచి మాడ్యూల్స్ విక్రయాలు 87 శాతం జంప్చేసి 614 మెగావాట్లకు చేరాయి. డేటా సెంటర్ పనులు.. విభిన్న బిజినెస్లు పటిష్ట వృద్ధిని సాధించడంతోపాటు కొత్త విభాగాలు సైతం పురోగతిలో ఉన్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. అదానీ కానెక్స్(చెన్నై డేటా సెంటర్ రెండో దశ) పనులు 74 శాతం పూర్తికాగా.. నోయిడా సెంటర్లో 51 శాతం, హైదరాబాద్లో 46 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. కచ్ కాపర్, నవీ ముంబై ఎయిర్పోర్ట్, 5 మెగావాట్ల ఆన్షోర్ విండ్ టర్బయిన్ సరి్టఫికేషన్ తదితర భారీస్థాయి ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా మౌలిక రంగంలో కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్స్, న్యూ ఇండస్ట్రీస్, డేటా సెంటర్, రోడ్స్ తదితర కొత్త బిజినెస్లను పటిష్టరీతిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు బీఎస్ఈలో 2.4 శాతం ఎగసి రూ. 2,532 వద్ద ముగిసింది. -
పీవీఆర్ ఐనాక్స్కు నష్టాలు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 82 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ. 981 కోట్ల నుంచి రూ. 1,305 కోట్లకు ఎగసింది. మొత్తం టర్నోవర్ రూ. 1,330 కోట్లను తాకగా.. మొత్తం వ్యయాలు రూ. 1,438 కోట్లకు చేరాయి. అయితే పీవీఆర్, ఐనాక్స్ విలీనం నేపథ్యంలో గతేడాది క్యూ1తో ఫలితాలను పోల్చతగదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత సమీక్షా కాలంలో 3.39 కోట్లమంది సినిమా హాళ్లను సందర్శించగా.. సగటు టికెట్ ధర రూ. 246గా నమోదైంది. సగటున ఆహారం, పానీయాలపై రూ. 130 చొప్పున వెచి్చంచినట్లు కంపెనీ వెల్లడించింది. కొత్తగా 31 స్క్రీన్లను ప్రారంభించడంతో వీటి సంఖ్య 1,707కు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం లాభపడి రూ. 1,566 వద్ద ముగిసింది. -
ఎన్టీపీసీ లాభం రూ.4,907 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ.4,907 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,978 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390 కోట్లకు తగ్గింది. జూన్ క్వార్టర్లో 103.98 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 104.42 బిలియన్ యూనిట్లుగా ఉంది. కోల్ ప్లాంట్లలో లోడ్ ఫ్యాక్టర్ 77.43 శాతంగా ఉంది. -
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టర్న్అరౌండ్.. దశాబ్ద కాలంలోనే అత్యధిక లాభం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 13,750 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యధికంకాగా.. పెట్రోల్, డీజిల్పై లాభదాయకత(మార్జిన్లు) మెరుగుపడటం లాభాలకు కారణమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో నమోదైన రూ. 10,059 కోట్లతో పోల్చినా తాజా లాభం 37 శాతం జంప్చేసింది. వెరసి ఇంతక్రితం 2021–22లో ఆర్జించిన రికార్డ్ వార్షిక లాభం రూ. 24,184 కోట్లలో సగానికిపైగా క్యూ1లో సాధించింది. కాగా.. గతంలో అంటే 2012–13 క్యూ4లో అధిక ఇంధన సబ్సిడీని అందుకోవడం ద్వారా రూ. 14,153 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది క్యూ1లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను నిలిపిఉంచడంతో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సైతం నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 2 శాతం నీరసించి రూ. 2.21 లక్షల కోట్లకు పరిమితమైంది. ప్రతీ బ్యారల్ చమురుపై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 8.34 డాలర్లకు చేరాయి. ఇంధన అమ్మకాలు 0.6 మిలియన్ టన్నులు పెరిగి 21.8 ఎంటీని తాకాయి. ఈ కాలంలో 18.26 ఎంటీ చమురును ప్రాసెస్ చేసింది. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 95 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా మెరుగైన పనితీరు.. భారీగా పెరిగిన లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్తో ముగిసిన త్రైమాసికంలో తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం భారీగా పెరిగి రూ.1,551 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.561 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం సైతం రూ.11,124 కోట్ల నుంచి రూ.15,821 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.14,359 కోట్లుగా ఉంది. స్థూల మొండి బకాయిలు జూన్ చివరికి 6.67%కి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.65%కి తగ్గాయి. ఎన్పీఏలకు కేటాయింపులు తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఇవి రూ.777 కోట్లకు పరిమితమయ్యాయి. -
లాభాల్లోకి టాటా మోటార్స్.. షేర్ల ధరకు రెక్కలు
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 3,301 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,951 కోట్ల నికర నష్టం ప్రకటించింది. లగ్జరీకార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్రోవర్(జేఎల్ఆర్)తోపాటు వాణిజ్య వాహన బిజినెస్ పుంజుకోవడం కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదపడ్డాయి. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 71,228 కోట్ల నుంచి రూ. 1,01,528 కోట్లకు జంప్చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 77,784 కోట్ల నుంచి రూ. 98,267 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో టాటా మోటార్స్ స్టాండెలోన్ నష్టం రూ. 181 కోట్ల నుంచి రూ. 64 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ. 14,793 కోట్ల నుంచి రూ. 15,733 కోట్లకు బలపడింది. జేఎల్ఆర్ జూమ్... ప్రస్తుత సమీక్షా కాలంలో జేఎల్ఆర్ ఆదాయం 57 శాతం జంప్చేసి 6.9 బిలియన్ పౌండ్లను తాకగా.. 43.5 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. కొత్త ఏడాదిని పటిష్టంగా ప్రారంభించినట్లు జేఎల్ఆర్ కొత్త సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. క్యూ1లో రికార్డ్ క్యాష్ఫ్లోను సాధించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం క్యూ1 స్థాయి పనితీరు చూపగలమని విశ్వసిస్తున్నట్లు గ్రూప్ సీఎఫ్వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ SEBI Notices To Yes Bank Ex CEO: యస్ బ్యాంక్ రాణా కపూర్కు సెబీ నోటీసు.. రూ. 2.22 కోట్లు కట్టాలి కాగా.. వాణిజ్య వాహన విభాగం ఆదాయం 4.4 శాతం పుంజుకుని రూ. 17,000 కోట్లను తాకింది. దేశీయంగా హోల్సేల్ అమ్మకాలు 14 శాతం క్షీణించి 82,400 యూనిట్లకు చేరగా.. రిటైల్ విక్రయాలు ఇదే స్థాయిలో నీరసించి 77,600 యూనిట్లకు పరిమితమయ్యాయి. ప్రయాణికుల వాహన విభాగం ఆదాయం 11 శాతం ఎగసి రూ. 12,800 కోట్లను తాకినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ తెలియజేశారు. అమ్మకాలు 8 శాతం వృద్ధితో 1,40,400 యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు. బలమైన జూన్ త్రైమాసిక ఆదాయాలతో బుధవారం (జులై 26) ట్రేడింగ్లో ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్ షేర్లు 4 శాతానికి పైగా జంప్ చేసి 52 వారాల గరిష్ట స్థాయి రూ.665.40కి చేరుకున్నాయి. -
Infosys Q1 Results: అంచనాలు మిస్, రెవెన్యూ గైడెన్స్ కోత
Infosys Q1 results: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసికం ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. జూన్ 30తో ముగిసిన క్వార్టర్లో నికర లాభం 11 శాతం పెరిగి రూ.5,945 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,360 కోట్లతో పోలిస్తే లాభాలు 10.9 ఎగిసాయి. అయితే, రూ. 6,141 కోట్ల లాభం సాధిస్తుందన్న ఎనలిస్టుల అంచనాలనుమిస్ చేసింది. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో) స్థిరమైన కరెన్సీ (CC) పరంగా, కంపెనీ ఆదాయం సంవత్సరానికి 4.2 శాతం పెరిగి రూ. 37,933 కోట్లకు చేరుకుంది. అయితే ఈ త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్ 20.8 శాతం వద్ద స్థిరంగా ఉంది. త్రైమాసికంలో దీని అట్రిషన్ 17.3 శాతానికి తగ్గింది. ప్రస్తుత ఏడాది కంపెనీ ఆదాయ మార్గదర్శకాన్ని 1 శాతం- 3.5 శాతానికి సవరించింది. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 20-22 శాతంగా ఉంచింది. (మరో వివాదంలో ఓలా ఎలక్ట్రిక్: సోషల్ మీడియాలో ఫోటో వైరల్) క్యాస్ట్ ఆప్టిమైజేషన్పై తమ దృష్టి నేపథ్యంలో అనిశ్చిత స్థూల వాతావరణంలో క్యూ1లో ఆపరేటింగ్ మార్జిన్లు నిలకడగా ఉన్నాయని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ అన్నారు. 4.2 శాతం పటిష్టమైన Q1 వృద్ధిపట్ట ఇన్ఫోసిస్ సీఎండీ సలీల్ పరేఖ్ సంతృప్తిని వ్యక్తం చేశారు . భారీ ఒప్పందాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ ఇదే భవిష్యత్ వృద్ధికి బలమైన పునాదిని వేస్తుందన్నారు. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) ఇదీ చదవండి: సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా? -
ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం జూమ్.. భారీగా పెరిగిన ఆదాయం
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్చేసి రూ. 2,124 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,631 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం సహకరించాయి. మొత్తం ఆదాయం రూ. 10,113 కోట్ల నుంచి రూ. 12,939 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 4,867 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా మెరుగుపడి 4.29 శాతానికి చేరాయి. ఇతర ఆదాయం 14 శాతం వృద్ధితో రూ. 2,210 కోట్లుగా నమోదైంది. ప్రొవిజన్లు రూ. 1,251 కోట్ల నుంచి రూ. 991 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.35 శాతం నుంచి 1.94 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.67 శాతం నుంచి 0.58 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు నామ మాత్రంగా తగ్గి రూ. 1,390 వద్ద క్లోజైంది. -
క్యూ1లో పేటీఎమ్ జోరు: జీఎంవీ 37 శాతం జూమ్
న్యూఢిల్లీ: పేటీఎమ్ బ్రాండు ఫిన్టెక్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహక పనితీరు ప్రదర్శించింది. ఏప్రిల్-జూన్(క్యూ1)లో స్థూల వాణిజ్య విలువ(జీఎంవీ) 37 శాతం జంప్చేసి రూ. 4.05 లక్షల కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది (2022-23) క్యూ1లో రూ. 2.96 లక్షల కోట్లుగా నమోదైంది. కంపెనీ ప్లాట్ఫామ్ ద్వారా వ్యాపారస్తుల(మర్చంట్స్)కు జరిగిన చెల్లింపుల విలువను జీఎంవీగా పేర్కొనే సంగతి తెలిసిందే. (రియల్ ఎస్టేట్ దిగ్గజం రామ్కీ దూకుడు: ఈసారి రూ. 2 వేల కోట్ల బుకింగ్స్) కాగా.. పేటీఎమ్ ద్వారా పంపిణీ అయిన రుణాలు 2.5 రెట్లు ఎగసి రూ. 14,845 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది క్యూ1లో రూ. 5,554 కోట్ల రుణాలు పంపిణీకాగా.. వీటి పరిమాణం సైతం 85 లక్షల నుంచి 51 శాతం జంప్చేసి 1.28 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. మరిన్ని బిజినెస్ వార్తలు అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఓయోకు నిర్వహణ లాభాలు
న్యూఢిల్లీ: ఆతిథ్యం, ప్రయాణ సేవల(ట్రావెల్ టెక్) కంపెనీ ఓయో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో మొత్తం ఆదాయం రూ. 1,459 కోట్లను అధిగమించింది. రూ. 7.27 కోట్ల సర్దుబాటు తదుపరి నిర్వహణా(ఇబిటా) లాభం ఆర్జించింది. మార్చితో ముగిసిన గతేడాది (2021–22) ఆదాయం రూ. 4,781 కోట్లను తాకగా.. అంతక్రితం ఏడాది(2020–21) దాదాపు రూ. 3,962 కోట్ల టర్నోవర్ సాధించింది. గతేడాది దాదాపు రూ. 472 కోట్ల నిర్వహణా(ఇబిటా) నష్టం ప్రకటించింది. ఇక తాజా క్యూ1లో రూ. 414 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది రూ. 1,940 కోట్లమేర నికర నష్టం నమోదైంది. కాగా.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా కంపెనీ గతేడాది అక్టోబర్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆర్థిక ఫలితాలను సెబీకి దాఖలు చేసింది. చదవండి: అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
క్యూ1లో ముడివ్యయాల ఎఫెక్ట్
ముంబై: దేశీ కార్పొరేట్లకు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ముడివ్యయాలు భారంగా పరిణమించినట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక పేర్కొంది. దీంతో ఏప్రిల్–జూన్(క్యూ1)లో నిర్వహణా లాభ మార్జిన్లు సగటున 2.13 శాతంమేర క్షీణించినట్లు తెలియజేసింది. వెరసి క్యూ1లో ఆదాయం 39 శాతం జంప్చేసినప్పటికీ ముడివ్యయాల ద్రవ్యోల్బణ ప్రభావంతో ఇబిటా మార్జిన్లు 17.7 శాతానికి పరిమితమైనట్లు వివరించింది. కమోడిటీ, ఇంధన ధరల పెరుగుదలను కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయడంతో ఆదాయంలో వృద్ధి నమోదైనట్లు తెలియజేసింది. అయితే వీటి కారణంగా లాభదాయకత నీరసించినట్లు తెలియజేసింది. ఫైనాన్షియల్ రంగ సంస్థలను మినహాయించి 620 లిస్టెడ్ కంపెనీలను నివేదికకు ఇక్రా పరిగణించింది. నివేదిక ప్రకారం..యుద్ధం ప్రభావం రష్యా– ఉక్రెయిన్ యుద్ధంతో ఎదురైన సరఫరా సవాళ్లు సైతం మార్జిన్లు మందగించేందుకు కారణమయ్యాయి. అయితే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మార్జిన్లు పుంజుకునే వీలుంది. గతేడాది(2021–22) తొలి క్వార్టర్లో కరోనా మహామ్మారి రెండో వేవ్ కారణంగా అమ్మకాలు దెబ్బతినడం.. ఈ ఏడాది క్యూ1 అమ్మకాల్లో వృద్ధికి దోహదం చేసింది. పలు రంగాలలో ప్రొడక్టుల ధరల పెంపు సైతం దీనికి జత కలిసింది. కాగా.. గ్రామీణ ప్రాంతాల నుంచి కొన్ని రంగాలకు డిమాండ్ తగ్గింది. ఇది ఇటు అమ్మకాలు, అటు లాభదాయకతకు కొంతమేర చెక్ పెట్టాయి. ఇక రంగాలవారీగా చూస్తే.. హోటళ్లు, విద్యుత్, రిటైల్, చమురు– గ్యాస్ విభాగాలు క్యూ1లో ఊపందుకోగా.. ఎయిర్లైన్స్, నిర్మాణం, క్యాపిటల్ గూడ్స్, ఐరన్ అండ్ స్టీల్ వెనకడుగు వేశాయి. పలు ప్రొడక్టులకు ధరల పెంపు చేపట్టిన ఎఫ్ఎంసీజీ రంగంలో ఓ మాదిరి వృద్ధి నమోదైంది. -
విప్రో ఉద్యోగులకు శుభవార్త!
సెప్టెంబర్ 1నుంచి ఉద్యోగుల జీతాల పెంపు, హైక్స్పై ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో స్పందించింది. ఉద్యోగుల జీత భత్యాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇప్పటికే తాము తీసుకున్న నిర్ణయంపైనే కట్టుబడి ఉన్నామని తెలిపింది. దేశంలో ఐటీ రంగం రోజురోజుకి వృద్ధి చెందుతుంది. దీంతో అవకాశాలు పెరిగిపోయాయి. అందుకే అట్రిషన్ రేటును నియంత్రించడం, కొత్త టాలెంట్ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేలా విప్రో తన ఉద్యోగులకు బోనస్లు, ఇంక్రిమెంట్లు భారీగా పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగుల జీతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ మరికొన్ని నివేదికలు హైలెట్ చేశారు. ఈ నేపథ్యంలో జీతాల పెంపులో ఎలాంటి మార్పులు లేవని, సెప్టెంబర్ నుంచి శాలరీ హైక్ అమల్లోకి వస్తాయని విప్రో ప్రకటించింది. జూలై నుండి విప్రో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీ తన టాప్ పెర్ఫార్మర్లకు, మిడ్ నేజ్మెంట్ స్థాయి వరకు ప్రమోషన్లను అందించాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్లో ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది' అని విప్రో తెలిపింది. -
2022-23 క్యూ1 ఫలితాలు: టాటా కన్జూమర్ లాభం, ఎంతంటే?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 38 శాతం జంప్చేసి రూ. 277 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 200 కోట్లు మాత్రమే ఆర్జించింది. వ్యయ నియంత్రణలు, ధరల పెంపు లాభాలు పుంజుకునేందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం ఎగసి రూ. 3,327 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 3,008 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఆదాయంలో దేశీ వాటా 9 శాతం వృద్ధితో రూ. 2,145 కోట్లను తాకగా.. అంతర్జాతీయ బిజినెస్ సైతం 9 శాతం పుంజుకుని రూ. 837 కోట్లకు చేరింది. నాన్బ్రాండెడ్ బిజినెస్ రూ. 278 కోట్ల నుంచి రూ. 352 కోట్లకు బలపడింది. ఈ ఫలితాల నేపథ్యంలో టాటా కన్జూమర్షేరు బీఎస్ఈలో 0.25 శాతం లాభపడి రూ. 790 వద్ద ముగిసింది. -
అంచనాలకు మించి.. భారీ లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థ!
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం కోల్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెండు రెట్లుపైగా ఎగసి రూ. 8,834 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 3,174 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం ఎగసి రూ. 32,498 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 23,293 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఇక మొత్తం వ్యయాలు రూ. 21,626 కోట్ల నుంచి రూ. 23,985 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 124 మిలియన్ టన్నుల నుంచి దాదాపు 160 ఎంటీకి పెరిగింది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో కంపెనీ 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న విషయం విదితమే. థర్మల్ విద్యుత్ రంగం నుంచి భారీ డిమాండ్ నెలకొనడంతో 15.4 కోట్ల టన్నుల బొగ్గును విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం 17.75 ఎంటీ బొగ్గును విక్రయించినట్లు తెలియజేసింది. ఇంధన సరఫరా కాంట్రాక్టుల(ఎఫ్ఎస్ఏ) మార్గంలో టన్నుకి రూ. 1,442 చొప్పున ధర లభించినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది(2023–24)కల్లా బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది 70 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 2% వృద్ధితో రూ. 220 వద్ద ముగిసింది. -
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాల బాట
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. ఇందుకు సంబంధించి గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. ఈ రుణదాతల లాభాల క్షీణతకు బాండ్ ఈల్డ్, మార్క్–టు–మార్కెట్ (ఎంటీఎం) నష్టాల కారణం. కొనుగోలు ధర కంటే తక్కువ ధరకు మార్కెట్ ద్వారా ఆర్థిక ఆస్తుల విలువను నిర్ణయించినప్పుడు (లెక్కగట్టినప్పుడు) ఎంటీఎం నష్టాలు సంభవిస్తాయి. ► పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. ► పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ► తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. ► లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
పేటీఎం నష్టాలు పెరిగాయ్! కానీ..
సాక్షి ముంబై: డిజిటల్ పేమెంట్స్ సంస్థ, వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) కన్సాలిడేటెడ్ నష్టాలు జూన్ త్రైమాసికంలో మరింత పెరిగి రూ.644 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ నష్టాలు రూ.380 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం 89 శాతం పెరిగి రూ.1,680 కోట్లుగా నమోదైంది. గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ రెట్టింపై రూ.3లక్షలకు చేరింది. నెలవారీ లావాదేవీలు నిర్వహించే యాక్టివ్ యూజర్ల సంఖ్య 49 శాతం పెరిగి 7.48 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. (ఇది చదవండి: ఝన్ఝన్వాలా జాక్పాట్:టైటన్ మెరిసెన్) పోస్ట్పెయిడ్ లోన్లు సంవత్సరానికి 486 శాతం పెరిగగా, పంపిణీ చేసిన రుణాల విలువ ఏడాది క్రితం రూ.447 కోట్లతో పోలిస్తే 656 శాతం పెరిగి రూ.3,383 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాల వ్యాపారం బాగా పెరిగిందని Paytm తెలిపింది. జూన్ త్రైమాసికంలో పేటీఎం రూ.5,554 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ పంపిణీ చేసిన రుణాలు రూ.632 కోట్లతో పోలిస్తే రుణ వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగింది. వార్షికంగా చూస్తే రుణాల పంపిణీ రూ.24,000 కోట్లుగా ఉంటుందని పేటీఎం పేర్కొంది. చదవండి: కోవిడ్సెగ: రోడ్డెక్కని 2 లక్షల బస్సులు -
గెయిల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యుటిలిటీ దిగ్గజం గెయిల్ ఇండియా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం 51 శాతం జంప్చేసి రూ. 3,251 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో కేవలం రూ. 2,157 కోట్లు ఆర్జించింది. నేచురల్ గ్యాస్ మార్కెటింగ్ మార్జిన్లు భారీగా మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 38,033 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 17,702 కోట్ల టర్నోవర్ అందుకుంది. పన్నుకుముందు లాభం ఐదు రెట్లు ఎగసి రూ. 2,318 కోట్లకు చేరింది. గత క్యూ1లో ఇది రూ. 450 కోట్లు మాత్రమే. ప్రస్తుత సమీక్షా కాలంలో గెయిల్ స్టాండెలోన్ నికర లాభం 91 శాతం దూసుకెళ్లి రూ. 2,915 కోట్లయ్యింది. ఈ కాలంలో పైపులైన్లు, పెట్రోకెమికల్స్, భాగస్వామ్య సంస్థ ఈక్విటీ పెట్టుబడులకుగాను రూ. 1,975 కోట్లు వెచ్చించింది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ షేరు గురువారం 0.6 శాతం నీరసించింది. శుక్రవారం కూడా అదే ట్రెండ్ను కొనసాగిస్తూ ఏకంగా 4 శాతం పతనమైంది. -
అదానీ టోటల్: ఆసక్తికర ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 138 కోట్లకు చేరింది. ఆటోమొబైల్స్కు సీఎన్జీ విక్రయాలు 61 శాతం జంప్చేసి 109 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లను తాకాయి. పైప్డ్ వంట గ్యాస్ అమ్మకాలు 3 శాతం పుంజుకుని 74 ఎంఎంఎస్సీఎంకు చేరాయి. అయితే సీఎన్జీ, వంటగ్యాస్ తయారీకి కొనుగోలు చేసిన సహజవాయు ధరలు మూడు రెట్లు ఎగసి రూ. 785 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. ఈ కాలంలో మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 1,110 కోట్లను తాకింది. నిర్వహణా లాభం 6 శాతం బలపడి రూ. 228 కోట్లుగా నమోదైంది. చదవండి : OnePlus10T 5G: వన్ప్లస్ 10 టీ వచ్చేసింది..ఆఫర్ అదిరింది! -
ఏబీ క్యాపిటల్ రికార్డు లాభం.. కంపెనీ చరిత్రలోనే అత్యధికం
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ రంగ దిగ్గజం ఆదిత్య బిర్లా(ఏబీ) క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 42 శాతం జంప్చేసి రూ. 429 కోట్లకు చేరింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 302 కోట్లు ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం 26 శాతం ఎగసి రూ. 5,859 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 4,632 కోట్ల టర్నోవర్ నమోదైంది. జూన్కల్లా నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్, గృహ రుణాల బుక్ 22 శాతం బలపడి రూ. 69,887 కోట్లకు చేరింది. జీవిత, ఆరోగ్య బీమా విభాగం స్థూల ప్రీమియం 53 శాతం జంప్చేసి రూ. 3,250 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఏబీ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 106 వద్ద ముగిసింది. -
వోల్టాస్.. తగ్గింది!
న్యూఢిల్లీ: ఏసీలు, ఇంజినీరింగ్ సర్వీసుల దిగ్గజం వోల్టాస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతంపైగా నీరసించి రూ. 110 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 122 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 55 శాతం జంప్చేసి రూ. 2,768 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 57 శాతం పెరిగి రూ. 2,603 కోట్లను దాటాయి. యూనిటరీ కూలింగ్ ప్రొడక్టుల నుంచి ఆదాయంలో రూ. 2,162 కోట్లు సమకూరింది. ఇది రెట్టింపునకుపైగా వృద్ధికాగా.. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టులు, సర్వీసుల నుంచి 34 శాతం తక్కువగా రూ. 455 కోట్లు లభించింది. ఇక ఇంజినీరింగ్ సరీ్వసుల నుంచి 8 శాతం అధికంగా రూ. 124 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఫలితాల నేపథ్యంలో వోల్టాస్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 1,000 వద్ద ముగిసింది. చదవండి: Adani: అదానీ దూకుడికి బ్రేక్.. గ్రీన్ డీలా! -
అదానీ దూకుడికి బ్రేక్.. గ్రీన్ డీలా!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం తగ్గి రూ. 214 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 219 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,079 కోట్ల నుంచి రూ. 1,701 కోట్లకు జంప్చేసింది. అయితే గత రెండు సంవత్సరాలుగా అదానీ వ్యాపారాలు జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాయి. ఈక్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ తొలి త్రైమాసిక ఫలితాలలో నికర లాభం స్వల్పంగా తగ్గడం గమనార్హం. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 898 కోట్ల నుంచి రూ. 1,425 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో దేశీయంగా తొలి 390 మెగావాట్ల సౌర, పవన హైబ్రిడ్ యూనిట్ను ప్రారంభించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో వినీత్ ఎస్.జైన్ పేర్కొన్నారు. ఈ బాటలో సౌర విద్యుత్ సామర్థ్యం 58 శాతం జంప్చేసి 4,763 మె.వా.కు చేరగా.. పవన విద్యుత్ సామర్థ్యం 30 శాతం ఎగసి 647 మె.వా.కు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో అదానీ గ్రీన్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం పుంజుకున రూ. 2,285 వద్ద ముగిసింది. చదవండి: Banks Privatisation: బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లుపై కేంద్రం క్లారిటీ -
హమ్మయ్యా.. జొమాటో నష్టాలు తగ్గాయి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర నష్టాలు దాదాపు సగానికి తగ్గి రూ. 186 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 361 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 917 కోట్ల నుంచి రూ. 1,582 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,260 కోట్ల నుంచి రూ. 1,768 కోట్లకు పెరిగాయి. బ్లింకిట్ కొనుగోలు ప్రతిపాదనకు వాటాదారుల నుంచి 97 శాతం ఓట్లు లభించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో దీపీందర్ గోయల్ వెల్లడించారు. స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి అనుమతి రావలసి ఉన్నదని సీఎఫ్వో అక్షంత్ గోయల్ పేర్కొన్నారు. బ్లింకిట్ కొనుగోలుకి సాధ్యాసాధ్యాల పరిశీలన చేపట్టడంతోపాటు విలువ విషయంలో తీవ్రస్థాయిలో చర్చలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 46.50 వద్ద ముగిసింది. చదవండి: భారత్కు ఉబర్ గుడ్బై, స్పందించిన ఈవోసీ -
ఐటీసీ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికంలో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 33 శాతం ఎగసి రూ. 4,462 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 3,343 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం జంప్చేసి రూ. 19,831 కోట్లను దాటింది. గత క్యూ1లో రూ. 14,241 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 1,213 కోట్లను అధిగమించింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 1,182 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,444 కోట్ల నుంచి రూ. 11,758 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం 5.5 శాతం పురోగమించి రూ. 10,154 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం 12 శాతం క్షీణించి రూ. 1,605 కోట్లకు పరిమితమైంది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,559 కోట్ల నుంచి రూ. 2,219 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 9.69 8 శాతం నుంచి 8.13 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు సైతం 3.47 శాతం నుంచి 2.12 శాతానికి బలహీనపడ్డాయి. కనీ స మూలధన నిష్పత్తి 16.51 శాతంగా నమోదైంది. -
ఐడీఎఫ్సీ బ్యాంక్ లాభం రికార్డ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ బ్యాంక్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 474 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 630 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ.4,932 కోట్ల నుంచి రూ. 5,777 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం మరింత అధికంగా 20 శాతం ఎగసి రూ. 4,922 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 855 కోట్లను తాకింది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 1,872 కోట్ల నుంచి రూ. 308 కోట్లకు భారీగా తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.61 శాతం నుంచి 3.36 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు సైతం 2.32 శాతం నుంచి 1.30 శాతానికి బలహీనపడ్డాయి. నికర వడ్డీ మార్జిన్లు 5.5 శాతం నుంచి 5.89 శాతానికి మెరుగుపడ్డాయి. కనీస మూలధన నిష్పత్తి 15.77 శాతంగా నమోదైంది. -
'జీతం తక్కువైతే పిల్లను కూడా ఇవ్వరు!'
మీకు తెలుసా? పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ శాలరీ ఎంతుంటుందో. 44 ఏళ్ల ఎంటర్ ప్రెన్యూర్ జీతం ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022లో అక్షరాల రూ.4కోట్లు. ఇందులో రూ .3.714 కోట్ల జీతం, ఇతర బెన్ఫిట్స్ రూ .28.7 లక్షలు. మొత్తం కలుపుకొని రూ .4 కోట్లని పేటీఎం వార్షిక నివేదిక తెలిపింది. 27 ఏళ్ల వయసులో నా జీతం నెలకు రూ.10వేలు ఉంది. "నేను నెలకు రూ.10వేలు సంపాదిస్తున్నాని తెలిస్తే నాకు పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అప్పట్లో నాకు పదివేల జీతమని తెలిసి పిల్లని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. చాలీచాలని జీతంతో నేను నా కుటుంబానికి అనర్హుడైన బ్రహ్మచారిని అయ్యాను" అంటూ నవ్వులు పూయించారు. కానీ కొసమెరుపు ఏంటంటే 2005లో విజయ్ శేఖర్ శర్మ మిృదులను వివాహం చేసుకున్నారు. ఇక పేటీఎం వార్షిక నివేదిక విడుదల సందర్భంగా వాటాదారులకు విజయ్ శేఖర్ శర్మ లేఖ రాశారు. పేటీఎం 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.4 లక్షల కోట్ల నుండి 2022 ఆర్థిక సంవత్సరం పూర్తి సంవత్సరానికి రూ.8.5 లక్షల కోట్లతో Gross merchandise volume (జీఎంవీ)లో వృద్ధిని సాధించినట్లు తెలిపారు. మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పేటీఎం రూ.2,396.4 కోట్ల ఏకీకృత నష్టాన్ని నివేదించింది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.3,186.8 కోట్ల నుంచి 65 శాతం పెరిగి రూ.5,264.3 కోట్లకు చేరుకుందని పేటీఎం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 78 శాతం పెరిగి రూ.4,974.2 కోట్లకు చేరుకుందని పేటీఎం నివేదికలో పేర్కొంది. వేల కోట్లతో సరికొత్త రికార్డ్లు విజయ్ శేఖర్ శర్మ టెలికాం ఆపరేటర్లకు కంటెంట్ అందించేలా 2000లో వన్97 కమ్యూనికేషన్ (పేటీఎం పేరెంట్ కంపెనీ) పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. రానురాను వన్97.. 2010లో పేటీఎంగా మారింది.అలాంటి కుటుంబ పరిస్థితులను అధిగమించి ఇప్పుడు రూ.18వేల కోట్ల ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చి సరికొత్త రికార్డ్ సృష్టించారు. -
అదర గొట్టిన టీవీఎస్ మోటార్, షేరు జూమ్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ కన్సాలిడేటెడ్గా జూన్ త్రైమాసికానికి రూ.297 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం రూ.7,348 కోట్లకు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ షేరు శుక్రవారం నాటి మార్కెట్లో 5 శాతం ఎగిసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో టీవీఎస్ మోటార్ రూ.15 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం రూ.4,692 కోట్లుగా ఉంది. గతేడాది మొదటి త్రైమాసికంలో లాక్డౌన్లు అమల్లో ఉన్నందున, నాటి ఫలితాలను తాజాగా ముగిసిన త్రైమాసికంతో పోల్చి చూడకూడదని సంస్థ పేర్కొంది. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల విక్రయాలు (ఎగుమతులు సహా) 9.07 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి విక్రయాలు 6.58 లక్షల యూనిట్లుగా ఉండడం గమనించాలి. మోటారు సైకిళ్ల విక్రయాలు 3.06 లక్షల యూనిట్ల నుంచి 4.34 లక్షల యూనిట్లకు పెరిగాయి. స్కూటర్ల విక్రయాలు 1.38 లక్షల నుంచి 3.06 లక్షల యూనిట్లకు చేరాయి. 2.96 లక్షల యూనిట్ల ద్వచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. రూ.125 కోట్ల విలువైన ఎన్సీడీలను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయాలని సంస్థ నిర్ణయించింది. -
అయ్యో! ఆదాయం పెరిగినా.. నెస్లే ఇండియా నేల చూపులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ2)లో నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 515 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 539 కోట్లు ఆర్జించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు లాభాలను ప్రభావితం చేశాయి. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం 16 శాతం ఎగసి రూ. 4,007 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 3,462 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 21 శాతం పెరిగి రూ. 3,356 కోట్లకు చేరాయి. గత క్యూ1లో రూ. 2,776 కోట్లుగా నమోదయ్యాయి. పెట్ బిజినెస్ అమ్మకాల్లో వృద్ధి కొనసాగడంతో క్యూ2లో తొలిసారి రూ. 4,000 కోట్ల మార్క్ను దాటినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. దేశీ అమ్మకాలు 16 శాతం బలపడి రూ. 3,848 కోట్లకు చేరగా.. ఎగుమతులు నామమాత్ర వృద్ధితో రూ. 158 కోట్లుగా నమోదయ్యాయి. స్విస్ మాతృ సంస్థ నుంచి పురీనా పెట్కేర్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా పెట్ ఫుడ్ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకు రూ. 123 కోట్లకుపైగా వెచ్చించింది. చదవండి: సంచలనం : ప్రపంచంలో తొలి 200 మెగాపిక్సెల్ ఫోన్.. ధర ఎంతంటే! -
డా.రెడ్డీస్ లాభం 108 శాతం అప్: అయినా షేరు ఢమాల్
హైదరాబాద్: ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభాల్లో భారీ పురోగతి సాధించినప్పటికీ శుక్రవారం నాటి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 4 శాతం కుప్పకూలి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. క్యూ1లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) రూ. 1,188 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 571 కోట్లతో పోలిస్తే ఇది 108 శాతం అధికం. సమీక్షాకాలంలో ఆదాయం ఆరు శాతం పెరిగి రూ. 4,919 కోట్ల నుంచి రూ. 5,215 కోట్లకు ఎగిసింది. ప్రధానంగా ఇండివియర్, అక్వెస్టివ్ థెరాప్యూటిక్స్లతో సుబాక్సోన్ ఔషధ వివాద సెటిల్మెంట్తో వచ్చిన నిధులు, అలాగే కొన్ని బ్రాండ్ల విక్రయాలు తదితర అంశాలు ఇతర ఆదాయం పెరగడానికి కారణమని ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ తెలిపారు. ఉత్పాదకతను పెంచుకోవడం, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తదితర చర్యలతో వ్యాపారాన్ని మరింత మెరుగుపర్చుకోనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ కో-చైర్మన్, ఎండీ జి.వి. ప్రసాద్ తెలిపారు. బూస్టర్ డోస్గా స్పుత్నిక్ లైట్.. కోవిడ్కి సంబంధించి స్పుత్నిక్ లైట్ను దేశీయంగా ఇతర టీకాలకు యూనివర్సల్ బూస్టర్ డోస్గా ఉపయోగించే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు డీఆర్ఎల్ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ వెల్లడించారు. -
వేదాంతా లాభం అప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 4,421 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,224 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 29,151 కోట్ల నుంచి రూ. 39,355 కోట్లకు జంప్చేసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 21,751 కోట్ల నుంచి రూ. 32,095 కోట్లకు ఎగశాయి. ఫైనాన్స్ వ్యయాలు స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 1,206 కోట్లకు చేరగా.. రూ. 8,031 కోట్లమేర స్థూల రుణాలు జత కలిశాయి. దీంతో మొత్తం రుణ భారం రూ. 61,140 కోట్లను తాకింది. కాగా, భాగస్వామ్య నియంత్రణా సంస్థలను కూడా కలుపుకుంటే ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం నికర లాభం 6 శాతం మెరుగుపడి రూ. 5,592 కోట్లుగా నమోదైంది. స్టెరిలైట్ యూనిట్కు బిడ్స్ తమిళనాడులోని తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ యూనిట్ కొనుగోలుకి పలు సంస్థల నుంచి బిడ్స్ దాఖలైనట్లు వేదాంతా రీసోర్సెస్ తాజాగా వెల్లడించింది. తమిళనాడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో 2018 నుంచి మూతపడిన స్టెరిలైట్ కాపర్ స్మెల్టింగ్ ప్లాంటును వేదాంతా అమ్మకానికి పెట్టింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 245 వద్ద ముగిసింది. -
దూసుకుపోయిన బజాజ్ ఫైనాన్స్.. డబుల్ జోరు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,596 కోట్లకు చేరింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 1,002 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 38 శాతం వృద్ధితో రూ. 9,283 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 6,743 కోట్ల ఆదాయం సాధించింది. నికర వడ్డీ ఆదాయం 33 శాతం పుంజుకుని రూ. 7,920 కోట్లుకాగా.. కొత్త రుణాల సంఖ్య 60 శాతం ఎగసి 74.2 లక్షలకు చేరింది. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 30 శాతం మెరుగై రూ. 2,04,018 కోట్లను తాకాయి. రుణ నష్టాలు, కేటాయింపులు సగానికిపైగా తగ్గి రూ. 755 కోట్లకు పరిమితమయ్యాయి. గత క్యూ1లో ఇవి రూ. 1,750 కోట్లుగా నమోదయ్యాయి. కాగా.. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 2.96 శాతం నుంచి 1.25 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 1.46 శాతం నుంచి 0.51 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 26.16 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 6,408 వద్ద ముగిసింది. -
టాటా పవర్.. డబుల్ ధమాకా!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 90 శాతం జంప్చేసి రూ. రూ. 884 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 466 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,310 కోట్ల నుంచి రూ. 14,639 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 9,480 కోట్ల నుంచి రూ. 14,660 కోట్లకు భారీగా పెరిగాయి. ఈ ఏడాది రూ. 14,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. వీటిలో రూ. 10,000 కోట్లను పునరుత్పాదక ఇంధన విభాగంపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. సోలార్ సెల్ ప్లాంట్ 4 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంటు ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు టాటా పవర్ తాజాగా తెలియజేసింది. ఇందుకు రూ. 3,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 5,524 మెగావాట్లుకాగా.. దీనిలో స్థాపిత సామర్థ్యం 3,634 మెగావాట్లు. మరో 1,890 మెగావాట్ల యూనిట్లు వివిధ అభివృద్ధి దశలలో ఉన్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాలలో 75,000 సోలార్ పంపులను ఏర్పాటు చేసింది. విద్యుత్ ప్రసారం, పంపిణీ విభాగంలో ఎన్ఆర్ఎస్ఎస్ ట్రాన్స్మిషన్ను(100 శాతం వాటా) సొంతం చేసుకుంది. ఫలితాల నేపథ్యంలో టాటా పవర్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం నష్టంతోరూ. 226 దిగువన ముగిసింది. చదవండి: అక్రమ నిర్మాణం..వందల కోట్లకు ఇంటిని అమ్మేసిన మార్క్ జుకర్ బర్గ్! -
ఎంఎఫ్ఐల సెక్యూరిటైజేషన్ రూ.3,500 కోట్లు
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) సెక్యూరిటైజేషన్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,500 కోట్లుగా ఉందని ఇక్రా రేటింగ్స్ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎంఎఫ్ఐల సెక్యూరిటైజేషన్ పరిమాణం రూ.1,460 కోట్లుగానే ఉంది. ఎంఎఫ్ఐలు తమ రుణాలను కొంత మేర సెక్యూరిటీలుగా (బాండ్లు, తదితర) మార్చి నిధుల అవసరాలను తీర్చుకోవడమే సెక్యూరిటైజేషన్. 2022 మొదటి ఆరు నెలల్లో ఎంఎఫ్ఐల రుణ ఆస్తుల సెక్యూరిటైజేషన్ బలంగా పుంజుకున్నట్ట ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. సెక్యూరిటీటైజేషన్ అన్నది ఎంఎఫ్ఐల నిధుల మార్గాల్లో ఒకటి. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలకు ఇది కీలక నిధుల మార్గంగా ఉండడం గమనార్హం. చదవండి: 5G Spectrum Auction: కంపెనీలు తగ్గేదేలే.. రికార్డ్ బ్రేక్, తొలి రోజు రూ.1.45లక్షల కోట్లు! -
చిప్ కొరత.. బజాజ్ ఆటో లాభం డౌన్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం నామమాత్ర క్షీణతతో రూ. రూ. 1,163 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,170 కోట్లు ఆర్జించింది. చిప్ కొరత అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం రూ. 7,386 కోట్ల నుంచి రూ. 8,005 కోట్లకు ఎగసింది. ఇందుకు ధరల పెంపు, డాలర్ బలపడటం సహకరించింది. అమ్మకాల పరిమాణం మాత్రం 7 శాతం నీరసించి 9,33,646 యూనిట్లకు చేరింది. గతేడాది క్యూ1లో 10.06 లక్షలకుపైగా వాహనాలు విక్రయించింది. తొలుత సెమీకండక్టర్ల కొరత సమస్యలు సృష్టించినప్పటికీ తదుపరి ఇతర మార్గాలలో సరఫరాలు మెరుగుపడినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ప్రస్తుత సమీక్షా కాలంలో స్టాండెలోన్ నికర లాభం రూ. 1,061 కోట్ల నుంచి రూ. 1,173 కోట్లకు బలపడింది. ఈ కాలంలో దేశీ అమ్మకాలు 1 శాతం తగ్గి 3,52,836 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు మరింత అధికంగా 10 శాతం క్షీణించి 5,80,810 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు ఎన్ఎస్ఈలో 2.25 శాతం బలహీనపడి రూ. 3,932 వద్ద ముగిసింది. -
ఎస్ఐబీకి ఫలితాలు.. గతేడాదితో పోలిస్తే పదింతల లాభాలు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్(ఎస్ఐబీ) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 115 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 10 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే గతేడాది క్యూ4లో నమోదైన రూ. 272 కోట్లతో పోలిస్తే లాభం 57 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ. 2,084 కోట్ల నుంచి రూ. 1,868 కోట్లకు వెనకడుగు వేసింది. ఇందుకు వడ్డీ, ఇతర ఆదాయాలు తగ్గడం కారణమైంది. వడ్డీ ఆదాయం స్వల్పంగా తగ్గి రూ. 1,622 కోట్లకు పరిమితంకాగా.. ఇతర ఆదాయం 45 శాతం పడిపోయి రూ. 246 కోట్లకు చేరింది. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.02 శాతం నుంచి 5.87 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 5.05 శాతం నుంచి 2.87 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు సైతం రూ. 496 కోట్ల నుంచి రూ. 139 కోట్లకు తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.25 శాతం బలపడి రూ. 7.87 వద్ద ముగిసింది. చదవండి: Stock Market: అమెరికా ఫెడ్ రిజర్వ్ అంచనాలు.. రెండో రోజు అదే తీరు! -
ఎల్అండ్టీ లాభం జూమ్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 45 శాతం జంప్చేసి రూ. 1,702 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,174 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 29,335 కోట్ల నుంచి రూ. 35,853 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 57 శాతం అధికంగా రూ. 41,805 కోట్ల విలువైన గ్రూప్ స్థాయి ఆర్డర్లను సాధించింది. వీటిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుంచి 66 శాతం వృద్ధితో రూ. 18,343 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించాయి. ఇంధన ప్రాజెక్టుల విభాగం నుంచి రూ. 4,366 కోట్ల విలువైన ఆర్డర్లు సంపాదించింది. వెరసి జూన్ చివరికల్లా మొత్తం(కన్సాలిడేటెడ్) ఆర్డర్ బుక్ విలువ రూ. 3,63,448 కోట్లకు చేరింది. వీక్ క్వార్టర్లోనూ నిజానికి ఈపీసీ కంపెనీలకు ప్రధానంగా ఎల్అండ్టీకి తొలి త్రైమాసికం బలహీనంగా ఉంటుందని, అయినప్పటికీ పటిష్ట ఫలితాలను సాధించగలిగినట్లు కంపెనీ హోల్టైమ్ డైరెక్టర్, సీఎఫ్వో ఆర్.శంకర్ రామన్ పేర్కొన్నారు. కంపెనీ అంతర్గత పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా తొమ్మిది విభాగాలను ఏడుగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది రోడ్ కన్సెషన్ ప్రాజెక్టుల నుంచి వైదొలగే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఐదేళ్ల లక్ష్యం 2026 ప్రణాళికలో భాగంగా కొత్త విభాగాలలోకి డైవర్సిఫై అవుతున్నట్లు వెల్లడించారు. వీటిలో గ్రీన్ ఎనర్జీ, ఈకామర్స్ ప్లాట్ఫామ్ బిజినెస్లున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు 2% క్షీణించి రూ. 1,751 వద్ద ముగిసింది. చదవండి: RBI Unclaimed Deposits: క్లెయిమ్ చేయని నిధులు రూ.48వేల కోట్లు.. వీటిని ఏం చేస్తారంటే! -
దశాబ్ద కాలంలో ఇదే రికార్డ్.. ఆ వజ్రాలకు భారీ డిమాండ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వజ్రాల పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం తగ్గుతుందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. ‘డిమాండ్ పడిపోవడం, ముడి వజ్రాల ధర అంతర్జాతీయంగా పెరుగుతుండడమే ఇందుకు కారణం. 2022–23లో పరిశ్రమ ఆదాయం రూ.1,52,000–1,60,000 కోట్లు నమోదు కావొచ్చు. సహజ వజ్రాలకు కొరత, అంతకంతకూ ఇవి ప్రియం కావడంతో వినియోగదార్లు 50–60 శాతం తక్కువ ధర కలిగిన కృత్రిమ వజ్రాల వైపు మళ్లుతున్నారు. మొత్తం పరిశ్రమలో కృత్రిమ వజ్రాల వాటా రెండేళ్ల క్రితం 3 శాతం నమోదైంది. ప్రస్తుతం ఇది ఏకంగా 8 శాతానికి చేరింది. 2021–22లో పరిశ్రమ అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఇదే భారీ రికార్డ్. ఇక పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 48 శాతం, ముడి వజ్రాల దిగుమతులు 74 శాతం దూసుకెళ్లాయి. ముడి వజ్రాలకు అనుగుణంగా పాలిష్ చేసిన వజ్రాల ధరలు నిర్ణయిస్తారు. డిమాండ్ తక్కువగా ఉండడంతో పాలిష్ చేసిన వజ్రాల ధరలను పరిశ్రమ పెంచలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ముడి వజ్రాల ధర దాదాపు 30 శాతం అధికమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వజ్రాల పాలిషింగ్ కంపెనీల నిర్వహణ లాభదాయకత 75–100 బేసిస్ పాయింట్లు తగ్గి 4–4.25 శాతానికి చేరవచ్చు. ద్రవ్యోల్బణం, మరోవైపు యాత్రలు, ఆతిథ్యంలో కస్టమర్లు ఖర్చు చేస్తుండడంతో యూఎస్, యూరప్లో సమీప కాలంలో డిమాండ్ తగ్గుతుంది’ అని క్రిసిల్ వివరించింది. చదవండి: ఉక్రెయిన్ వార్.. భారత్కు అలా కలిసోచ్చిందా! -
అదరగొట్టిన కరూర్ వైశ్యా.. డబులైంది!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 229 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) క్యూ1లో కేవలం రూ. 109 కోట్లు ఆర్జించింది. వడ్డీ మార్జిన్లు బలపడటం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 746 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.55 శాతం నుంచి 3.82 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.97 శాతం నుంచి 5.21 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 3.69 శాతం నుంచి 1.91 శాతానికి దిగివచ్చాయి. ఈ బాటలో ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 247 కోట్ల నుంచి రూ. 155 కోట్లకు వెనకడుగు వేశాయి. క్యూ1లో ఆభరణ రుణ పోర్ట్ఫోలియో 13 శాతం పుంజుకుని రూ. 14,873 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 3 శాతం లాభపడి రూ. 55.35 వద్ద ముగిసింది. చదవండి: Canara Bank: వావ్.. అదిరిపోయే లాభాలు అందుకున్న కెనరా బ్యాంక్! -
వ్యయాల సెగ.. అందుకే టాటా స్టీల్ ఫలితాలు ఇలా!
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 7,714 కోట్ల లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 9,768 కోట్లతో పోలిస్తే ఇది 21 శాతం తక్కువ. వ్యయాలు పెరగడమే క్యూ1లో లాభాలు తగ్గడానికి కారణమయ్యాయి. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం రూ. 53,628 కోట్లకు పెరిగింది. ముడి వస్తువుల ఖర్చులతో పాటు వడ్డీలు తదితర వ్యయాలు కూడా కలిపి రూ. 41,491 కోట్ల నుంచి రూ. 51,912 కోట్లకు పెరిగాయి. దేశీయంగా టాప్ 4 ఉక్కు సంస్థల్లో టాటా స్టీల్ కూడా ఒకటి. మొత్తం ఉక్కు ఉత్పత్తిలో కంపెనీ వాటా దాదాపు 18 శాతంగా ఉంటుంది. -
టెక్ మహీంద్రా.. మార్జిన్లు తగ్గాయ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం 16.4 శాతం క్షీణించి రూ. 1,132 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1,353 కోట్లు. పలు అంశాల మూలంగా మార్జిన్లు తగ్గిపోవడమే తాజాగా లాభాల క్షీణతకు కారణం. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం 24.6 శాతం వృద్ధి చెంది రూ. 10,198 కోట్ల నుంచి రూ. 12,708 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15.2 శాతం నుంచి 11 శాతానికి తగ్గగా, నిర్వహణ లాభం 9.2 శాతం క్షీణించి రూ. 1,403.4 కోట్లకు చేరింది. లాభదాయకతను పెంచుకునేందుకు అన్ని అవకాశాలూ వినియోగించుకుంటామని, రాబోయే రోజుల్లో అధిక స్థాయిలో నమోదు చేయగలమని సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాణీ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ కోణంలో కొన్ని పెట్టుబడులు పెట్టడంతో పాటు సరఫరా తరఫు సమస్యలు (అధిక వేతనాలతో ఉద్యోగులను తీసుకోవడం లేదా సబ్–కాంట్రాక్టుకు ఇవ్వడం వంటివి) కూడా మార్జిన్ల తగ్గుదలకు కారణమని తెలిపారు. ఆర్థిక ఫలితాల్లో మరిన్ని విశేషాలు.. ► క్యూ1లో 6,862 మంది ఉద్యోగుల నియామకాలతో సిబ్బంది సంఖ్య 1.58 లక్షలకు పెరిగింది. ► అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) మార్చి త్రైమాసికంలో 24 శాతంగా ఉండగా, జూన్ క్వార్టర్లో 22 శాతానికి తగ్గింది. అయితే, గతేడాది క్యూ1లో నమోదైన 17 శాతంతో పోలిస్తే ఇంకా అధికంగానే ఉంది. ► బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేరు 1.15 శాతం క్షీణించి రూ. 1,016.55 వద్ద క్లోజయ్యింది. చదవండి: 5జీ వేలం.. పోటీపడుతున్న బడా కంపెనీలు -
వావ్.. అదిరిపోయే లాభాలు అందుకున్న కెనరా బ్యాంక్!
ముంబై: మెరుగైన రుణ వృద్ధి, వడ్డీ ఆదాయాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం 72 శాతం ఎగిసి రూ. 2,022 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1,177 కోట్లు. ‘నికర వడ్డీ ఆదాయంతో (ఎన్ఐఐ) పాటు వడ్డీయేతర ఆదాయం కూడా 25 శాతం పెరిగింది. కేటాయింపులు అదుపులోనే ఉన్నాయి. రుణ వృద్ధి కూడా సానుకూలంగా నమోదైంది‘ అని సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో ఎల్వీ ప్రభాకర్ తెలిపారు. సమీక్షాకాలంలో ఎన్ఐఐ 10.15 శాతం పెరిగి రూ. 6,160 కోట్ల నుంచి రూ. 6,785 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 24.55 శాతం వృద్ధితో రూ. 4,155 కోట్ల నుంచి రూ. 5,175 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2.71 శాతం నుంచి 2.78 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.90 శాతం స్థాయికి పెరిగే అవకాశం ఉందని ప్రభాకర్ తెలిపారు. సమీక్షాకాలంలో స్థూల రుణాల వృద్ధి 13.14 శాతంగాను, డిపాజిట్ల వృద్ధి 8.49 శాతంగాను నమోదైంది. తగ్గిన మొండిబాకీలు మరోవైపు, స్థూల మొండిబాకీల (జీఎన్పీఏ) నిష్పత్తి 8.50 శాతం నుంచి 6.98 శాతానికి దిగి రాగా, నికర ఎన్పీఏల నిష్పత్తి కూడా 3.46 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గింది. క్యూ1లో రూ. 1,886 కోట్ల మొత్తం రికవర్ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000 కోట్ల రికవరీలను లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభాకర్ చెప్పారు. అలాగే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి బదిలీ చేసేందుకు రూ. 2,300 కోట్ల విలువ చేసే మొండి పద్దులను గుర్తించినట్లు వివరించారు. చదవండి: Huawei: భారత్కు బైబై..దేశంలో కార్యకలాపాల్ని నిలిపేసిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం -
యస్ బ్యాంక్ జూమ్.. లాభం వచ్చింది కానీ, అవి తగ్గాయి!
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 54 శాతం జంప్చేసి రూ. 314 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 207 కోట్ల నుంచి రూ. 311 కోట్లకు ఎగసింది. గతేడాది(2021–22) క్యూ1తో పోలిస్తే నికర వడ్డీ ఆదాయం 32 శాతం పుంజుకుని రూ. 1,850 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.47 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం మాత్రం 10 శాతం నీరసించి రూ. 781 కోట్లకు పరిమితమైంది. స్లిప్పేజీలు రూ. 2,233 కోట్ల నుంచి రూ. 1,072 కోట్లకు భారీగా తగ్గాయి. ప్రొవిజన్లు 62 శాతం దిగివచ్చి రూ. 175 కోట్లకు పరిమితమయ్యాయి. పునర్వ్యవస్థీకృత రుణాలు రూ. 6,450 కోట్లుకాగా.. 30 రోజులుగా చెల్లించని(ఎన్పీఏలుకాని) రుణాల విలువ రూ. 1,700 కోట్లుగా నమోదయ్యాయి. ఇందుకు భారీ ఇన్ఫ్రా ఖాతా కారణమైనట్లు బ్యాంక్ పేర్కొంది. రికవరీలు, అప్గ్రేడ్స్ ద్వారా రూ. 1,532 కోట్లు జమయ్యాయి. ఈ ఖాతా నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. కనీస మూలధన నిష్పత్తి 17.7 శాతానికి చేరింది. -
ఇన్ఫోసిస్ ఓకే.. 21,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 3.2 శాతం పుంజుకుని రూ. 5,360 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 5,195 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 24 శాతం ఎగసి రూ. 34,470 కోట్లకు చేరింది. కీలక మార్కెట్లలో ప్రధానమైన యూఎస్సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య భయాలు తలెత్తినప్పటికీ ఈ ఏడాది ఆదాయంలో 14–16 శాతం వృద్ధి సాధించగలమని తాజాగా అంచనా(గైడెన్స్) వేయడం గమనార్హం. గతంలో 13–15 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యూ1లో పటిష్ట ఫలితాలు, డిమాండ్ ఔట్లుక్ నేపథ్యంలో గైడెన్స్ను మెరుగుపరచినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. త్రైమాసికవారీగా చూస్తే క్యూ1లో నికర లాభం 5.7 శాతం క్షీణించింది. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో రూ. 5,686 కోట్లు ఆర్జించింది. నిర్వహణా మార్జిన్లు వీక్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఇన్ఫోసిస్ నిర్వహణా మార్జిన్లు 23.7 శాతం నుంచి 20.1 శాతానికి డీలాపడ్డాయి. గతేడాది క్యూ4లోనూ ఇవి 21.5 శాతంగా నమోదయ్యాయి. విక్రయాలు, మార్కెటింగ్ ఖర్చులు పెరగడంతో నిర్వహణా వ్యయాలు 14.4 శాతం హెచ్చాయి. క్యూ1లో రూ. 6,914 కోట్ల నిర్వహణా లాభం ఆర్జించింది. ఈ కాలంలో 21,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించింది. కంపెనీ ఆదాయంలో యూఎస్ నుంచి 17.8 శాతం, యూరప్ నుంచి 21.9 శాతం చొప్పున వార్షిక వృద్ధిని సాధించింది. భారీ డీల్స్తోకూడిన కాంట్రాక్టుల విలువ(టీసీవీ) 1.7 బిలియన్ డాలర్లు(రూ. 13,600 కోట్లు)గా నమోదైంది. వేతన పెంపు, ఉద్యోగ నియామకాల ద్వారా నిపుణుల నియామకాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్వో నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. ఇతర హైలైట్స్ ► జూన్ చివరికల్లా ఇన్ఫోసిస్ మొత్తం సిబ్బంది సంఖ్య 3,35,186కు చేరింది. 2022 మార్చికల్లా ఈ 3,14,015 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ► గత 12 నెలల సగటు ప్రకారం ఉద్యోగ వలస 28.4 శాతానికి ఎగసింది. గతేడాది క్యూ4లో ఇది 27.7 శాతంకాగా.. గత క్యూ1లో 13.9 శాతమే. ► 106 క్లయింట్లను కొత్తగా జమ చేసుకుంది. దీంతో ఇన్ఫోసిస్ మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 1,778ను తాకింది. ► 10 కోట్ల డాలర్ల క్లయింట్లు 38కాగా, 5 కోట్ల డాలర్ల క్లయింట్లు 69కు చేరారు. కోటి డాలర్ల క్లయింట్ల సంఖ్య 278కు చేరింది. చదవండి: Cryonics: మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందా? -
అమెజాన్తో భాగస్వామ్యం.. ఐసీఐసీఐ లాభం హైజంప్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 55% జంప్చేసి రూ. 7,384 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 4,616 కోట్ల నుంచి రూ. 6,905 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 21% పుంజుకుని రూ. 13,210 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.89% నుంచి 4.01 శాతానికి బలపడ్డాయి. మొత్తం ప్రొవిజన్లు సగానికిపైగా తగ్గి రూ. 1,143 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 2,851 కోట్ల కేటాయింపులు చేపట్టింది. ఎన్పీఏలు డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.15 శాతం నుంచి 3.41 శాతానికి తగ్గాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 5,825 కోట్లకు పరిమితంకాగా.. గత క్యూ1లో 7,231 కోట్లుగా నమోదయ్యాయి. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్తో భాగస్వామ్యం ద్వారా 32 లక్షల క్రెడిట్ కార్డులను విక్రయించినట్లు బ్యాంక్ వెల్లడించింది. అనుబంధ సంస్థలలో జీవిత బీమా సంస్థ రూ. 156 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో రూ. 186 కోట్ల నికర నష్టం నమోదైంది. సాధారణ బీమా విభాగం నికర లాభం 79 శాతం ఎగసి రూ. 349 కోట్లను తాకింది. కనీస మూలధన నిష్పత్తి 18.7 శాతానికి చేరింది. చదవండి: Ford: భారీ షాక్.. భారత్ నుంచి వెళ్లిపోతున్న ప్రఖ్యాత కార్ల కంపెనీ! -
జియో లాభం జూమ్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది క్యూ1లో రూ. 4,335 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఏప్రిల్–జూన్(రూ. 3,501 కోట్లు)తో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 21 శాతంపైగా ఎగసి రూ. 21,873 కోట్లను తాకింది. టారిఫ్ల పెంపు మెరుగైన పనితీరుకు సహకరించింది. నికరంగా 9.7 మిలియన్ యూజర్లు జత కలిశారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 41.99 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) త్రైమాసికంగా 5 శాతం బలపడి రూ. 175.7కు చేరింది. అత్యంత వేగవంత సర్వీసులందించగల 5జీ స్పెక్ట్రమ్కు వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో జియో వెల్లడించిన ఫలితాలకు ప్రాధాన్యత ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. టెలికం, డిజిటల్ బిజినెస్లతో కూడిన జియో ప్లాట్ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 24% పుంజుకుని రూ. 4,530 కోట్లయ్యింది. ఆదాయం 24% వృద్ధితో రూ. 27,527 కోట్లకు చేరింది. -
రిలయన్స్ లాభం.. భళా
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ గ్రూప్ ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్ క్యూ1లో రూ. 17,955 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 12,273 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధి. చమురు, టెలికం బిజినెస్లు ఇందుకు దోహదం చేశాయి. నిర్వహణ లాభం 46 శాతం ఎగసి రూ. 40,179 కోట్లయ్యింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. మొత్తం ఆదాయం రూ. 2,42,982 కోట్లను తాకింది. ప్రధానంగా పెట్రోకెమికల్ విభాగం కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 1.6 లక్షల కోట్ల ఆదాయం సాధించింది. ఇది 57 శాతం అధికం. గ్యాస్, రిటైల్ గుడ్.. చమురు, గ్యాస్ బిజినెస్ ఆదాయం 183 శాతం జంప్చేసి రూ. 3,625 కోట్లకు చేరింది. కేజీ డీ6లో 40.6 బిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ ఉత్పత్తయ్యింది. గత క్యూ1లో ఇది 33.1 బీసీఎఫ్గా నమోదైంది. ఒక్కో ఎంబీటీయూకి 9.72 డాలర్లు చొప్పున లభించింది. గతంలో ఇది 3.62 డాలర్లు మాత్రమే. ఇక రిలయన్స్ రిటైల్ అమ్మకాలు 54 శాతం ఎగసి రూ. 51,582 కోట్లను తాకాయి. నిర్వహణా లాభం 180 శాతం పురోగమించి రూ. 3,897 కోట్లకు చేరింది. మార్జిన్లు 7.6 శాతానికి మెరుగుపడ్డాయి. నికర లాభం 114 శాతం వృద్ధితో రూ. 2,061 కోట్లయ్యింది. కొత్తగా 792 స్టోర్లు తెరిచింది. వీటి మొత్తం సంఖ్య 15,866కు చేరాయి. కంపెనీ ప్రధానంగా ఓటూసీ, రిటైల్, ఈకామర్స్, టెలికంతోపాటు న్యూ ఎనర్జీ బిజినెస్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 30కల్లా నగదు(రూ. 2,05,727 కోట్లు) కంటే రుణాలు(రూ. 2,63,382 కోట్లు) అధికంకావడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 2,503 వద్ద ముగిసింది. ఓటూసీ రికార్డ్... అధిక ఇంధన ధరలు, రవాణా వ్యయాల నేపథ్యంలోనూ ఓటూసీ (ఆయిల్ టూ కెమికల్స్) బిజినెస్ రికార్డ్ పనితీరు చూపింది. ఈ విభాగం నిర్వహణా లాభం 63 శాతం దూసుకెళ్లి రూ. 19,888 కోట్లను తాకింది. రిటైల్ విభాగంలో కస్టమర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. డిజిటల్ సర్వీసులు ఇందుకు వినియోగపడుతున్నాయి. దేశ ఇంధన భద్రతపై పెట్టుబడులు కొనసాగిస్తాం. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం డౌన్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో బ్రోకరేజీ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 273 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం పుంజుకుని రూ. 795 కోట్లకు చేరింది. సంస్థాగత ఈక్విటీల విభాగం ఆదాయం 17 శాతం నీరసించి రూ. 49 కోట్లకు చేరింది. మార్కెట్లో పరిమాణం మందగించడం, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు క్షీణించడం ప్రభావం చూపింది. కాగా.. పంపిణీ బిజినెస్ ఊపందుకుంది. 28 శాతం జంప్చేసి రూ.152 కోట్లకు చేరింది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ తదితర ప్రొడక్టులు ఇందుకు సహకరించాయి. మార్జిన్ ఫండింగ్ ద్వారా రూ. 619 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇవి దాదాపు రెట్టింపుకాగా.. 80 లక్షల మంది క్లయింట్ బేస్ను కలిగి ఉంది. క్యూ1లో కొత్తగా 4.4 లక్షల మంది జత కలిశారు. ఇదే కాలంలో ఇతర బ్రోకింగ్ సంస్థలు జిరోధా 62 లక్షలు, అప్స్టాక్స్ 52 లక్షలు, గ్రో 38 లక్షలు, ఏంజెల్ వన్ 36 లక్షల చొప్పున క్లయింట్లను గెలుచుకోవడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం బలపడి రూ. 469 వద్ద ముగిసింది. -
హావెల్స్ లాభం రూ.243 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ గృహోపకరణాల కంపెనీ హావెల్స్ ఇండియా జూన్ త్రైమాసికానికి మిశ్రమ పనితీరు చూపించింది. రూ.243 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. కమోడిటీల ధరలు (ముడి సరుకులు) పెరిగిపోవడంతో మార్జిన్లు గణనీయంగా ప్రభావితమైనట్టు కంపెనీ తెలిపింది. ఫలితంగా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.236 కోట్లతో పోలిస్తే కేవలం 3 శాతం వృద్ధికి పరిమితమైంది. ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.4,244 కోట్లకు చేరింది. స్విచ్గేర్ల విభాగం నుంచి ఆదాయం 37 శాతం పెరిగి రూ.517 కోట్లుగా, కేబుల్స్ విభాగం ఆదాయం 48 శాతం పెరిగి రూ.1,193 కోట్ల చొప్పున నమోదైంది. ఇక లైటింగ్ అండ్ ఫిక్సర్స్ ఆదాయం 74 శాతం వృద్ధితో రూ.374 కోట్లుగా ఉంది. ఎలక్ట్రికల్ కన్జ్యూమర్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగి రూ.839 కోట్లకు చేరింది. లయడ్స్ కన్జ్యూమర్ నుంచి ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ.1,094 కోట్లుగా నమోదైంది. -
డీసీఎం శ్రీరామ్ ఫలితాలు ఆకర్షణీయం
న్యూఢిల్లీ: డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ జూన్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 61 శాతం పెరిగి రూ.254 కోట్లకు చేరింది. ఆదాయం సైతం రూ.3,000 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.158 కోట్లు, ఆదాయం రూ.2,025 కోట్లుగా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన డీసీఎం శ్రీరామ్ క్లోరో వినిల్ కెమికల్, షుగర్, ఫెర్టిలైజర్స్, బయోసీడ్స్ వ్యాపారాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘‘ఎన్నో దశాబ్దాల తర్వాత ప్రపంచం వ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణాన్ని చూస్తున్నాం. సరఫరా వైపు సమస్యలు, కీలక కమోడిటీల ధరలు పెరిగిపోయాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. కరెన్సీలు చారిత్రంగా కనిష్టాలను చూస్తున్నాయి. ఇదంతా అనిశ్చిత వాతావరణానికి దారితీసింది, కంపెనీ బ్యాలన్స్ షీటు బలంగా ఉండడంతో వీటిని మెరుగ్గా అధిగమించింది’’అని సంస్థ చైర్మన్, ఎండీ అజయ్ శ్రీరామ్, వైస్ చైర్మన్, ఎండీ విక్రమ్ శ్రీరామ్ తెలిపారు. కెమికల్స్, షుగర్ వ్యాపారంలో రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే 12 నెలల్లో వీటి నుంచి కార్యకలాపాలు మొదలవుతాయన్నారు. -
అంచనాలు మించిన హెచ్డీఎఫ్సీ లైఫ్ పనితీరు!
ముంబై: జీవిత బీమా రంగంలోని హెచ్డీఎఫ్సీ లైఫ్ పనితీరు జూన్ త్రైమాసికంలో అంచనాలకు అందుకుంది. నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.365 కోట్లకు చేరుకుంది. పాలసీల రెన్యువల్ నిష్పత్తి గరిష్ట స్థాయిలో ఉండడం మార్జిన్లు పెరిగేందుకు దారితీసింది. మొత్తం ప్రీమియం ఆదాయం 23 శాతం పెరిగి రూ.9,396 కోట్లుగా నమోదైంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.7,656 కోట్లుగా ఉంది. దీన్ని మరింత వివరంగా చూస్తే.. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి) 27 శాతం పెరిగి రూ.4,776 కోట్లకు చేరింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.9,579 కోట్లు
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 21 శాతం పెరిగి రూ.9,579 కోట్లుగా నమోదైంది. కానీ, మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.10,055 కోట్లతో పోల్చినప్పుడు (సీక్వెన్షియల్గా) కొంత తగ్గింది. నికర వడ్డీ ఆదాయం 14.5 శాతం వృద్ధితో రూ.19,481 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 4 శాతంగా ఉంది. ఇతర ఆదాయం సైతం 35 శాతం వృద్ధిని చూపించి రూ.7,700 కోట్లకు దూసుకుపోయింది. ఆస్తుల నాణ్యత స్థూల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు/ఎన్పీఏలు) జూన్ చివరికి 1.28 శాతానికి మెరుగుపడ్డాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి 1.47 శాతంగా ఉన్నాయి. రుణాల్లో వృద్ధి కార్పొరేట్, హోల్సేల్ రుణాల్లో వృద్ధి 15.7 శాతానికి పరిమితం కాగా, రిటైల్ రుణాల్లో 21.7% వృద్ధి నమోదైంది. వాణిజ్య, గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా రుణాల్లో 28.9 శాతం వృద్ధి సాధ్యమైంది. చదవండి: Google Play Store: 8 యాప్లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే! -
ఫెడరల్ బ్యాంక్ లాభం జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 64 శాతం జంప్చేసి రూ. 601 కోట్లను తాకింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 367 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 1,605 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 3.22 శాతానికి చేరాయి. అయితే ఇతర ఆదాయం 30 శాతం క్షీణించి రూ. 453 కోట్లకు పరిమితమైంది. మరోవైపు ఫీజు ఆదాయం రూ. 255 కోట్ల నుంచి రూ. 441 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 373 కోట్లకు పరిమితమయ్యాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 444 కోట్లుకాగా.. స్థూల మొండిబకాయిలు 3.5 శాతం నుంచి 2.69 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.57 శాతంగా నమోదైంది. జేఎస్పీఎల్ లాభం హైజంప్ ప్రైవేట్ రంగ దిగ్గజం జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 2,771 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 14.2 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,643 కోట్ల నుంచి రూ. 13,069 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,234 కోట్ల నుంచి రూ. 10,567 కోట్లకు పెరిగాయి. కాగా.. క్యూ1లో స్టీల్ ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 1.99 మిలియన్ టన్నులకు పరిమితంకాగా.. అమ్మకాలు 1.61 ఎంటీ నుంచి 1.74 ఎంటీకి బలపడ్డాయి. పెల్లెట్ ఉత్పత్తి 2.16 ఎంటీ నుంచి 1.92 ఎంటీకి వెనకడుగు వేసింది. వీటి విక్రయాలు భారీగా క్షీణించి 0.03 ఎంటీకి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్పీఎల్ షేరు 4.5 శాతం పతనమై రూ. 345 వద్ద ముగిసింది. -
నష్టాల్లోకి టాటా స్టీల్ లాంగ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ కంపెనీ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 331 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్కు అనుబంధ సంస్థ అయిన కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 332 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు రెట్టింపునకు పెరిగిన వ్యయాలు కారణమయ్యాయి. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,727 కోట్ల నుంచి రూ. 2,155 కోట్లకు జంప్ చేసింది. క్యూ1లో మొత్తం వ్యయాలు రూ. 1,283 కోట్ల నుంచి రూ. 2,490 కోట్లకు ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ లాంగ్ షేరు బీఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 603 వద్ద ముగిసింది. -
విడుదలైన క్యూ1 ఫలితాలు,వేల కోట్ల లాభాలతో పుంజుకున్న హెచ్పీసీఎల్!
న్యూఢిల్లీ: హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (క్యూ1) నికర లాభం 2.4% పుంజుకుని రూ.3,283 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మరింత అధికంగా 17 శాతం ఎగసి రూ. 23,464 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–14 శాతం స్థాయిలో వృద్ధి చూపగలదని కంపెనీ తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. కరెన్సీలో నిలకడ ప్రాతిపదికన గైడెన్స్ ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున మధ్యంతర డివిడెండ్ను బోర్డు సిఫారసు చేసింది. డీల్స్ జోరు: ప్రస్తుత ఏడాదిని పటిష్టంగా ప్రారంభించినట్లు హెచ్సీఎల్ టెక్ సీఈవో, ఎండీ సి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తంగా 2.7 శాతం వృద్ధిని అందుకున్నట్లు తెలియజేశారు. సర్వీసుల బిజినెస్ వార్షికంగా 19 శాతం పురోగతిని సాధించినట్లు వెల్లడించారు. డిజిటల్ ఇంజనీరింగ్, అప్లికేషన్ల సర్వీసులు, క్లౌడ్ వినియోగం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు వివరించారు. భారీ, మధ్యతరహా డీల్స్తో కొత్త బుకింగ్స్ 23.4 శాతం అధికంగా 2.04 బిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొన్నారు. 17 శాతం నిర్వహణా మార్జిన్లను సాధించగా.. 6,023 మంది ఫ్రెషర్స్ను నియమించుకున్నట్లు తెలియజేశారు. గతేడాది క్యూ4లో ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 21.9% కాగా.. తాజాగా 23.8 శాతానికి పెరిగింది. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఎన్ఎస్ఈలో హెచ్సీఎల్ టెక్ షేరు దాదాపు 2% క్షీణించి రూ. 926 వద్ద ముగిసింది. -
చమురు కంపెనీలకు భారీ నష్టాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు (ఓఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసే అవకాశముంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) కలిపి రూ.10,700 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అంచనా వేసింది. తయారీ వ్యయం కన్నా పెట్రోల్, డీజిల్ను తక్కువ రేటుకు విక్రయించాల్సి రావడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ మార్కెట్లో ఈ మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 90 శాతం దాకా వాటా ఉంది. ముడిచమురును ఇంధనాలుగా మార్చే రిఫైనరీలు కూడా వీటికి ఉన్నాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో క్రూడాయిల్ రేట్లు భారీగా ఎగియడంతో ఈ సంస్థల రిఫైనింగ్ మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఆయా సంస్థల మార్కెటింగ్ విభాగాలు మాత్రం నష్టాలు మూటగట్టుకున్నాయి. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ. 12–14 మేర నష్టపోతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. దీంతో రిఫైనింగ్ మార్జిన్లపరంగా వచ్చిన ప్రయోజనం దక్కకుండా పోతోందని వివరించింది. పటిష్టంగా జీఆర్ఎం.. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు (జీఆర్ఎం) పటిష్టంగా బ్యారెల్కు 17–18 డాలర్ల స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. అలాగే రికవరీ, తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా అమ్మకాల పరిమాణం కూడా 17–20 శాతం పెరగవచ్చని తెలిపింది. కానీ పెట్రోల్, డీజిల్పరమైన రిటైల్ నష్టాల వల్ల ఓఎంసీలు క్యూ1లో రూ. 10,700 కోట్ల మేర నికర నష్టం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు వివరించింది. గత 2–3 రోజులుగా క్రూడాయిల్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో మార్జిన్లు దిగిరావచ్చని, అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్పరమైన నష్టాలు కూడా కాస్త తగ్గొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు, క్యూ1లో ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ పటిష్టమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేయొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అత్యధికంగా రూ. 24,400 కోట్ల మేర నికర లాభం (77 శాతం వృద్ధి) ప్రకటించవచ్చని వివరించింది. అయితే, ఇంధనాల ఎగుమతులపై జూలై 1 నుంచి అధిక సుంకాల విధింపుతో మిగతా తొమ్మిది నెలల కాలంలో కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది. -
క్యూ1లో టీసీఎస్ భేష్
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతంపైగా బలపడి రూ. 9,478 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం ఎగసి రూ. 52,758 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఆదాయంలో రిటైల్, సీపీజీ 25 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 19.6 శాతం, తయారీ విభాగం, టెక్నాలజీ సర్వీసులు 16.4 శాతం, బీఎఫ్ఎస్ఐ 13.9 శాతం, లైఫ్సైన్సెస్, హెల్త్కేర్ 11.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ప్రాంతాలవారీగా చూస్తే.. ఉత్తర అమెరికా బిజినెస్ 19.1 శాతం, యూరప్ 12.1 శాతం, యూకే 12.6 పురోగతి సాధించగా.. దేశీయంగా 20.8 శాతం వృద్ధిని అందుకుంది. ఈ బాటలో లాటిన్ అమెరికా బిజినెస్ 21.6 శాతం ఎగసింది. మార్జిన్లు డౌన్ క్యూ1లో ఉద్యోగ వలస(అట్రిషన్) రేటు 19.7 శాతానికి చేరినట్లు టీసీఎస్ సీఎఫ్వో సమీర్ సేక్సారియా వెల్లడించారు. గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో 17.4%తో పోలిస్తే ఇది అధికంకాగా.. వార్షిక వేతన పెంపు, నైపుణ్య గుర్తింపు తదితరాలతో మార్జిన్లపై ప్రభావం పడినట్లు తెలియజేశారు. తాజాగా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 6 లక్షలను మించినట్లు పేర్కొన్నారు. ఈ కాలంలో వ్యయ నిర్వహణ సవాళ్లు విసిరినట్లు తెలియజేశారు. వెరసి నిర్వహణా మార్జిన్లు 23.1%గా నమోదైనట్లు తెలియజేశారు. క్యూ1లో మొత్తం 8.2 బిలియన్ డాలర్ల(రూ. 64,780 కోట్లు) విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వీటిలో 40 కోట్ల డాలర్లకుపైబడిన రెండు భారీ డీల్స్ ఉన్నట్లు తెలిపింది. కీలక మార్కెట్లలో ఆర్థిక మాంద్య ఆందోళనలు కంపెనీపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువేనని సమీర్ పేర్కొన్నారు. ఇతర హైలైట్స్ ► క్యూ1లో కొత్తగా 14,136 మంది ఉద్యోగులను నియమించుకుంది. ► జూన్కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 6,06,331కు చేరుకుంది. ► ఈ ఏడాది కొత్తగా 40,000 మందికి ఉద్యోగాలు ► డివిడెండుకు రికార్డ్ డేట్ జూలై 16కాగా, ఆగస్ట్3కల్లా చెల్లించనుంది. ► 10 కోట్ల డాలర్ల విభాగంలో కొత్తగా 9 క్లయింట్లు జత 5 కోట్ల డాలర్ల విభాగంలో జత కలసిన 19 కొత్త క్లయింట్లు కంపెనీ క్యూ1 ఫలితాలను మార్కెట్లు ముగిశాక విడుదల చేసింది. బీఎస్ఈలో టీసీఎస్ షేరు 0.7% బలపడి రూ. 3,265 వద్ద ముగిసింది. ఆల్రౌండ్ గ్రోత్... కొత్త ఏడాదిని పటిష్టంగా ప్రారంభించాం. అన్ని విభాగాల్లోనూ వృద్ధితోపాటు ప్రోత్సాహకర స్థాయిలో ఆర్డర్లు సంపాదించాం. డీల్స్ కుదుర్చుకోవడంలో వేగాన్ని ప్రదర్శిస్తున్నాం. కొత్త వ్యవస్థాగత నిర్మాణంతో క్లయింట్లకు చేరువవుతున్నాం. ఈ ఏడాది కొత్తగా 40,000 మందిని నియమించుకోనున్నాం. క్లయింట్లతో చర్చల నేపథ్యంలో డిమాండ్ కొనసాగనున్నట్లు భావిస్తున్నాం. హై అట్రిషన్ మరో క్వార్టర్పాటు కొనసాగవచ్చు. ఆపై ద్వితీయార్ధం నుంచి నిలకడకు వీలుంది. –రాజేశ్ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం హైజంప్!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 58 శాతం జంప్చేసి రూ. 7,719 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,886 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇక స్టాండెలోన్ నికర లాభం 59 శాతం ఎగసి రూ. 7,019 కోట్లయ్యింది. మొత్తం ఆదాయం రూ. 23,953 కోట్ల నుంచి రూ. 27,412 కోట్ల కోట్లకు పెరిగింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి 44 శాతం వృద్ధితో రూ. 23,339 కోట్ల నికర లాభం సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 19.16 శాతంగా నమోదైంది. వడ్డీ ఆదాయం అప్ తాజా సమీక్షా కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 21 శాతం పుంజుకుని రూ. 12,605 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.84 శాతం నుంచి 4 శాతానికి బలపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.96 శాతం నుంచి 3.6 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏలు సైతం 1.14 శాతం నుంచి 0.76 శాతానికి తగ్గాయి. రికవరీలు, అప్గ్రేడ్స్ రూ. 493 కోట్లు అధికమై రూ. 4,693 కోట్లను తాకాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 2,883 కోట్ల నుంచి సగానికిపైగా తగ్గి రూ. 1,069 కోట్లకు పరిమితమయ్యాయి. బ్యాంక్ హోల్సేల్ రుణాల చీఫ్ విశాఖ మూల్యే పదవి నుంచి తప్పుకోవడంతో ప్రస్తుత రిటైల్ బిజినెస్ హెడ్ అనుప్ బాగ్చీకి బాధ్యతలు అప్పగించినట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ బాటలో బాగ్చీ బాధ్యతలను ప్రస్తుత సీఎఫ్వో రాకేష్ ఝా చేపట్టనున్నట్లు వెల్లడించింది. -
సప్లయి తగ్గింది.. డిమాండ్ పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అందుబాటు గృహాల సరఫరా తగ్గినప్పటికీ.. డిమాండ్ మాత్రం పుంజుకుంది. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇన్వెంటరీ 21 శాతం క్షీణించాయి. 2020 జనవరి–మార్చి (క్యూ1)లో 2,34,600 అఫర్డబుల్ యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 1,86,150 యూనిట్లకు తగ్గాయని అనరాక్ డేటా వెల్లడించింది. ► రెండేళ్ల కోవిడ్ కాలంలో అఫర్డబుల్ గృహాల సప్లయి తగ్గింది. కరోనా కంటే ముందు 2019 జనవరి–మార్చి (క్యూ1)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 70,480 యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో అందుబాటు గృహాల వాటా 44 శాతంగా ఉంది. కరోనా మొదలైన ఏడాది 2020 క్యూలోని గృహాల సప్లయిలో అఫర్డబుల్ వాటా 38 శాతం, 2021 క్యూ1లో 30 శాతం, ఈ ఏడాది క్యూ1 నాటికి 25 శాతానికి తగ్గింది. సప్లయి తగ్గడం వల్ల డెవలపర్లు అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ)ని విక్రయించడంపై దృష్టిసారించారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. దీంతో గత రెండేళ్లలో ఏడు నగరాల్లోని అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ 21 శాతం, లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం తగ్గుముఖం పట్టాయి. ► ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 6,27,780 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. ఇందులో 1,86,150 యూనిట్లు రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాలే. అదే గతేడాది క్యూ1లో ఇవి 2,17,63, 2020 క్యూ1లో 2,34,600 యూనిట్లున్నాయి. 2021 క్యూ1లో అత్యధికంగా చెన్నైలో 52%, పుణేలో 33 శాతం, ముంబైలో 27% అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. ► ఇదే రెండేళ్ల కరోనా సమయంలో రూ.2.5 కోట్లకు పైగా ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం మేర తగ్గింది. 2020 క్యూ1లో 41,750 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. గతేడాది క్యూ1 నాటికి 42,080కు, ఈ ఏడాది క్యూ1 నాటికి 39,810 యూనిట్లకు క్షీణించాయి. అత్యధికంగా ముంబైలో 16 శాతం, కోల్కతాలో 15 శాతం అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. -
నిరుత్సాహకర ఫలితాలు..ఏసీసీ లాభం 30 శాతం డౌన్
న్యూఢిల్లీ: సిమెంట్ రంగ దిగ్గజం ఏసీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు 30 శాతం క్షీణించింది. రూ. 396.3 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021) ఇదే కాలంలో రూ. 563 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 3 శాతం పుంజుకుని దాదాపు రూ. 4,427 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 4,292 కోట్ల అమ్మకాలు సాధించింది. స్విస్ బిల్డింగ్ మెటీరియల్ దిగ్గజం హోల్సిమ్ గ్రూప్నకు అనుబంధ సంస్థ అయిన ఏసీసీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. కాగా.. ఈ క్యూ1లో మొత్తం వ్యయాలు 10 శాతంపైగా పెరిగి రూ. 3,956 కోట్లను దాటాయి. ఈ కాలంలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన వ్యయాలు పెరిగినట్లు ఏసీసీ ఎండీ, సీఈవో శ్రీధర్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. దీంతో లాభాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేశారు. అయితే సామర్థ్య వినియోగం, వ్యయ నియంత్రణలు కొంతమేర ఆదుకున్నట్లు వెల్లడించారు. రానున్న నెలల్లో సిమెంటుకు డిమాండ్ మరింత పుంజుకోనున్నట్లు శ్రీధర్ అంచనా వేశారు. క్యూ1 ఫలితాల నేపథ్యంలో ఏసీసీ షేరు బీఎస్ఈలో 4.5% పతనమై రూ. 2,058 వద్ద ముగిసింది. చదవండి: అదరగొట్టిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్..మైండ్ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..! -
ఎన్బీఎఫ్సీల ఏయూఎం డౌన్
ముంబై: నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) వెనకడుగు వేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రుణ పంపిణీ తగ్గడం, పోర్ట్ఫోలియో విలువలు క్షీణించడం ప్రభావం చూపినట్లు రేటింగ్స్ సంస్థ ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే గతేడాది(2020–21) ద్వితీయార్థంలో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్ఎఫ్సీ)ల రుణ మంజూరీ పుంజుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అంటే గత క్యూ3(అక్టోబర్–డిసెంబర్), క్యూ4(జనవరి–మార్చి)లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన ఈ క్యూ1లో 55 శాతం తిరోగమించినట్లు తెలియజేసింది. గతేడాది క్యూ1తో పోలిస్తే మారటోరియంలు లేని పరిస్థితుల్లో ఈ క్యూ1లో ఎన్బీఎఫ్సీల ఏయూఎం నీరసించినట్లు నివేదిక వివరించింది. హెచ్ఎఫ్సీల ఏయూఎం మాత్రం దాదాపు యథాతథంగా నమోదైనట్లు పేర్కొంది. పెంటప్ డిమాండ్ .. పెంటప్ డిమాండ్ కారణంగా ఈ జులైలో రుణ విడుదల ఒక్కసారిగా ఊపందుకున్నట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది. ఈ స్పీడ్ కొనసాగేదీ లేనిదీ స్థూల ఆర్థిక సంకేతాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేసింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ ఎన్బీఎఫ్సీ రంగంలో రికవరీని తాత్కాలికంగా దెబ్బతీసినట్లు ఇక్రా వైస్ప్రెసిడెంట్, ఫైనాన్షియల్ రంగ హెడ్ మనుశ్రీ సగ్గర్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలో రుణ మంజూరీ వార్షిక ప్రాతిపదికన 6–8 శాతం పుంజుకోగలదని అంచనా వేశారు. ఇక ఏయూఎం అయితే 8–10 శాతం స్థాయిలో బలపడవచ్చని అభిప్రాయపడ్డారు. గతే డాది లోబేస్ కారణంగా పలు కీలక రంగాల నుంచి డిమాండ్ మెరుగుపడనున్నట్లు తెలియజేశారు. ఆస్తుల నాణ్యతపై.. స్థానిక లాక్డౌన్ల కారణంగా ఈ క్యూ1లో ఎన్బీఎఫ్సీల ఆస్తుల(రుణాల) నాణ్యత భారీగా బలహీనపడినట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే వసూళ్లు ప్రోత్సాహకరంగానే ఉన్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది నికర రికవరీలు, రద్దులతో కూడిన ఓవర్డ్యూస్లో 0.5–1 శాతం పెరుగుదల నమోదుకావచ్చని అంచనా వేసింది. ఇవి ఇకపై లాక్డౌన్లు ఉండబోవన్న అంచనాలుకాగా.. రుణ నాణ్యతపై ఒత్తిళ్లు కొనసాగనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత అనిశి్చతుల నేపథ్యంలో రైటాఫ్లు అధికంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది. -
స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక జోన్ల (ఎస్ఈజడ్) నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎగుమతులు భారీగా 41.5 శాతం పెరిగాయి. విలువలో ఇది 2.15 లక్షల కోట్లు. ఔషధాలు, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశం మొత్తం ఎగుమతుల్లో నాల్గవ వంతు ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి జరుగుతుండడం గమనార్హం. 2019–20లో ఎస్ఈజడ్ల నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల విలువ రూ.7.97 లక్షల కోట్లు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువ 2020–21లో 7.56 లక్షల కోట్లకు తగ్గింది. జోన్ల పరిస్థితి ఇదీ... దేశంలో మొత్తం 427 జోన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర ఉంది. అయితే జూన్ 30వ తేదీ నాటికి వీటిలో 267 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2021 జూన్ 30వ తేదీ నాటికి ప్రత్యేక జోన్లపై రూ.6.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగింది. వీటిలో దాదాపు 24.47 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. జోన్ల నుంచి ఎగుమతుల భారీ పెరుగుదలకు వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి– ఈపీసీఈఎస్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. మండలికి భవనేశ్ సేథ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ వైస్ చైర్మన్గా ఉన్నారు. దేశం ఎగుమతులు ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు దేశం లక్ష్యం. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశ ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఉన్నాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య ఎగుమతులు 74.5 శాతం పెరిగి 130.82 బిలియన్ డాలర్లకు చేరాయి. మరో ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టు–మార్చి 2022) 269.44 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. అంటే నెలకు సగటును 33.68 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాల్సి ఉంది. కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో 2020 మార్చి నుంచి వరుసగా ఆరు నెలలు ఆగస్టు వరకూ ఎగుమతులు క్షీణతను చూశాయి. అయితే సెప్టెంబర్లో వృద్ధిబాటలోకి వచ్చినా, మళ్లీ మరుసటి రెండు నెలలూ (అక్టోబర్–నవంబర్) క్షీణతలోకి జారిపోయాయి. తిరిగి 2020 డిసెంబర్లో స్వల్పంగా 0.14 శాతం వృద్ధి నమోదయ్యింది. అప్పటి నుంచీ వృద్ధి బాటలోనే ఎగుమతులు పయనిస్తున్నాయి. 2020–21 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ చూస్తే, ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, మరింత పెరగనున్న ఇళ్ల కొనుగోళ్లు -
వొడాఫోన్ ఐడియాకు తగ్గిన నష్టాలు!
Voda Idea FY 2021-22 Q1 Result: న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా(వీఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి త్రైమాసికంలో ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 7,319 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 25,460 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. అయితే మొత్తం ఆదాయం 14 శాతం క్షీణించి రూ. 9,152 కోట్లను తాకింది. గత క్యూ1లో వీఐ రూ. 10,659 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇక జూన్కల్లా మొత్తం రుణ భారం రూ. 1,91,590 కోట్లకు చేరింది. దీనిలో వాయిదా పడిన స్పెక్ట్రమ్ చెల్లింపులు రూ. 1,06,010 కోట్లుకాగా.. రూ. 62,180 కోట్లమేర ఏజీఆర్ సంబంధ బకాయిలున్నాయి. అయితే ఇదే సమయంలో FY 2021-22కు గానూ కంపెనీ చేతిలో నగదు, తత్సంబంధ నిల్వలు రూ. 920 కోట్లుగా ఉన్నాయి. తగ్గిన సబ్స్క్రయిబర్లు, పెరిగిన.. ఈ కేలండర్ ఏడాది(2021) ముగిసేలోగా రూ. 4,000 కోట్లమేర వ్యయాల్లో పొదుపును సాధించాలని వొడాఫోన్ ఐడియా లక్ష్యంగా పెట్టుకుంది. విశేషం ఏంటంటే.. జూన్కల్లా దీనిలో 70 శాతాన్ని సాధించినట్లు ప్రకటించింది. గతేడాది క్యూ1లో నమోదైన 27.98 కోట్లమంది సబ్స్క్రయిబర్ల సంఖ్య.. తాజాగా 25.54 కోట్లకు క్షీణించింది. 4జీ వినియోగదారుల సంఖ్య మాత్రం 10.46 కోట్ల మంది 11.29 కోట్లకు బలపడింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU) రూ. 114 నుంచి రూ. 104కు తగ్గినట్లు ప్రకటించుకుంది వీఐ. చదవండి: కళ్లు చెదిరే ఆఫర్.. బైక్పై లక్ష వరకు ప్రైజ్లు -
స్పైస్జెట్కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన కంపెనీ స్పైస్జెట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం పెరిగి రూ. 729 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 593 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 705 కోట్ల నుంచి రూ. 1,266 కోట్లకు జంప్చేసింది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 1,298 కోట్ల నుంచి రూ. 1,995 కోట్లకు ఎగశాయి. కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో గత ఐదు క్వార్టర్లుగా పలు సవాళ్లమధ్య కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్పైస్జెట్ చైర్మన్ అజయ్ సింగ్ పేర్కొన్నారు. -
హీరో మోటోకార్ప్ దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) తొలి త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1 (ఏప్రిల్-జూన్)లో నికర లాభం నాలుగు రెట్లు పైగా ఎగసి రూ. 256 కోట్లను తాకింది. గతేడాది(2020-21) ఇదే కాలంలో రూ.58 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,969 కోట్ల నుంచి రూ.5,508 కోట్లకు జంప్చేసింది. ఇక స్టాండెలోన్ నికర లాభం రూ. 61 కోట్ల నుంచి రూ. 865 కోట్లకు దూసుకెళ్లింది. ఈ కాలంలో 10.25 లక్షల వాహనాలను విక్రయించింది. హీరో మోటో షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథధాతధంగారూ. 2,788 వద్ద ముగిసింది. -
అప్పుడు సూపర్ హిట్, ఇప్పుడు జొమాటోకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో లిమిటెడ్ ఈ ఏడాది(2021–22) తొలి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 100 కోట్ల నష్టం మాత్రమే ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 266 కోట్ల నుంచి రూ. 844 కోట్లకు జంప్చేసింది. ఇక మొత్తం వ్యయాలు సైతం రూ. 383 కోట్ల నుంచి రూ. 1,260 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో గ్రోఫర్స్ ఇండియా లో 9.25%, హ్యాండ్స్ఆన్ ట్రేడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 9.27% చొప్పున వాటాల కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు గ్రోఫర్స్ ఇండియా ప్రయివేట్, హ్యాండ్స్ఆన్ ట్రేడ్స్ ప్రైవేట్, గ్రోఫర్స్ ఇంటర్నేషనల్ తదితరాలతో డీల్ కుదుర్చుకున్నట్లు జొమాటో వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జొమాటో షేరు ఎన్ఎస్ఈలో 4.3 శాతం పతనమై రూ. 125 వద్ద ముగిసింది. కాగా, ఇటీవల ఐపీవో లిస్టింగ్ లో జొమాటో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా జొమాటో ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో .. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును టచ్ చేసి సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేసింది. సబ్స్క్రిప్షన్స్ సైతం గత 13 ఏళ్లల్లో రూ.5,000 కన్నా ఎక్కువగా వచ్చిన ఐపీఓల్లో 38.25 రెట్లు సబ్స్క్రైబ్ అయిన మొదటి ఐపీఓ జొమాటో నిలిచింది. కానీ క్యూ1 ఫలితాల్లో జొమాటో ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టుకోలేకపోయింది. నికర నష్టం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 361 కోట్లకు చేరడంపై ఇన్వెస్టర్లు, అటు మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్, ఆ ఏటీఎంలలో డబ్బులు లేకుంటే ఫైన్ -
కోల్ ఇండియా లాభం రూ. 3,170 కోట్లు
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 52 శాతం జంప్చేసి రూ. 3,170 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,080 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 18,487 కోట్ల నుంచి రూ. 25,282 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 16,471 కోట్ల నుంచి రూ. 21,626 కోట్లకు పెరిగాయి. క్యూ1లో బొగ్గు ఉత్పత్తి 121.04 మిలియన్ టన్నుల నుంచి దాదాపు 124 ఎంటీకి బలపడింది. ముడిబొగ్గు అమ్మకాలు 120.80 ఎంటీ నుంచి 160.44 ఎంటీకి పెరిగాయి. రానున్న మూడేళ్లలో రూ. 1.22 లక్షల కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. బొగ్గు వెలికితీత, తరలింపు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, శుద్ధ ఇంధన సాంకేతికతలు తదితరాలకు ఈ నిధులను వెచ్చించనుంది. తద్వారా 2023–24కల్లా 100 కోట్ల టన్నుల కోల్ ఉత్పత్తిని సాధించాలని ప్రణాళికలు వేసింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 142 వద్ద ముగిసింది. -
పెట్టుబడుల్లో రిటైలర్ల జోరు
న్యూఢిల్లీ: సరికొత్త బుల్ట్రెండ్లో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు దూకుడు చూపుతున్నారు. ఓవైపు సెకండరీ మార్కెట్లో నెలకొన్న రికార్డులకుతోడు.. మరోపక్క ప్రైమరీ మార్కెట్ స్పీడ్ పలువురు చిన్న ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు భారీ సంఖ్యలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో సరికొత్త రికార్డుకు తెరలేచింది. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో తాజాగా రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.18 శాతాన్ని తాకింది. ఇది మార్కెట్ చరిత్రలోనే అత్యధికంకాగా.. మార్చి చివరికల్లా ఎన్ఎస్ఈ కంపెనీలలో 6.96 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. ప్రైమ్ఇన్ఫోబేస్.కామ్ అందించిన వివరాల ప్రకారం విలువరీత్యా రిటైల్ ఇన్వెస్టర్ల వాటాల విలువ 16 శాతం వృద్ధితో రూ. 16.18 లక్షల కోట్లకు చేరింది. క్యూ4(జనవరి–మార్చి)లో ఈ విలువ రూ. 13.94 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే కాలంలో ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్(బీఎస్ఈ) 6 శాతం, నిఫ్టీ(ఎన్ఎస్ఈ) 7 శాతం చొప్పున మాత్రమే పురోగమించడం గమనార్హం! డీఐఐలు డీలా.. క్యూ1లో దశీ మ్యూచువల్ ఫండ్స్ వాటా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో నామమాత్రంగా తగ్గి 7.25 శాతానికి పరిమితమైంది. మార్చి క్వార్టర్(క్యూ4)లో 7.26 శాతంగా నమోదైంది. ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,699 కంపెనీలకుగాను 1,666 కంపెనీలలో వెలువడిన వాటాల వివరాల ప్రకారం రూపొందిన గణాంకాలివి. వెరసి రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ మార్గంకంటే షేర్లలో ప్రత్యక్ష పెట్టుబడులకే ఇటీవల మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి 295 కంపెనీలలో గల వాటా జూన్కల్లా 3.74 శాతానికి నీరసించింది. 2021 మార్చి చివరికల్లా 3.83 శాతంగా నమోదైంది. ఎల్ఐసీకి 1 శాతానికంటే అధికంగా వాటా గల కంపెనీల వివరాలివి! ఎంఎఫ్లు, బీమా కంపెనీలు, బ్యాంకులు తదితరాలతో కూడిన డీఐఐల వాటా జూన్కల్లా 13.19 శాతానికి నీరసించింది. మార్చిలో ఈ వాటా 13.42 శాతంగా నమోదైంది. ఇక ఇదే సమయంలో ఎఫ్పీఐల వాటా 22.46 శాతం నుంచి 21.66 శాతానికి తగ్గడం ప్రస్తావించదగ్గ విషయం! -
క్యూ1 ఫలితాల్లో అదరగొట్టిన ఎస్బీఐ..!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అదరగొట్టింది. ఎస్బీఐ త్రైమాసిక ఫలితాలను బుధవారం రోజున విడుదల చేసింది. మొదటి త్రైమాసికంలో నికరలాభం 55 శాతం పెరిగి రూ. 6,504 కోట్లుగా నమోదైంది. చివరి ఏడాది 2020-21 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ .4,189.34 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్బీఐ స్టాండలోన్ మొత్తం ఆదాయం మొదటి త్రైమాసికంలో రూ .77,347.17 కోట్లకు పెరిగింది. గత ఏడాది త్రైమాసికంలో ఎస్బీఐ రూ .74,457.86 కోట్ల ఆదాయంగా నమోదు చేసింది. నిరర్థక ఆస్తులు (నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్) జూన్ ముగింపులో 5.44 శాతం నుంచి 5.32 శాతానికి తగ్గాయి. అదేవిధంగా, నికర ఎన్పీఎ మొత్తం గత ఏడాది పోలిస్తే 1.8 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎస్బీఐ మొత్తం ఆదాయం రూ .87,984.33 కోట్లతో పోలిస్తే ప్రస్తుత ఆదాయం రూ. 93,266.94 కోట్లకు పెరిగింది. ఎస్బీఐ క్యూ1 ఫలితాలు మెరుగ్గా నమోదవ్వడంతో బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో ఎస్బీఐ షేర్ విలువ 2 శాతం మేర లాభాలను గడించింది. -
లాభాల్లో ఎయిర్టెల్, 15శాతం పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 284 కోట్ల నికర లాభం ఆర్జించింది. దీనిలో గ్రూప్లోని ఒక అనుబంధ సంస్థకు చెందిన టెలికం టవర్ల విక్రయం ద్వారా లభించిన రూ. 30.5 కోట్లు కలసి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 15,933 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత క్యూ1లో ఏజీఆర్ బకాయిల ప్రొవిజనింగ్ చేపట్టడం ప్రభావం చూపింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం సైతం 15 శాతంపైగా ఎగసి రూ. 26,854 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 146కు మెరుగుపడింది. గత క్యూ1లో రూ. 138గా నమోదైంది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 48.9 శాతం నుంచి 49.1 శాతానికి బలపడ్డాయి. దేశీయంగా..: క్యూ1లో భారతీ ఎయిర్టెల్ దేశీ టర్నోవర్ 19 శాతం ఎగసి రూ. 18,828 కోట్లుగా నమోదైంది. మొబైల్ ఆదాయం 22 శాతం పుంజుకున్నట్లు కంపెనీ తెలియజేసింది. 51 లక్షల మంది 4జీ కస్టమర్లు కొత్తగా జత కలసినట్లు వెల్లడించింది. హోమ్ బిజినెస్లో కొత్తగా 2.85 లక్షల మంది కస్టమర్లు జత కలసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తం గా కస్టమర్ల సంఖ్య దాదాపు 47.4 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు 2.3 శాతం లాభపడి రూ. 578 వద్ద ముగిసింది. -
అదానీ పోర్ట్ ఆదాయం పైపైకి, జంప్ చేసిన నికర లాభం
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 77 శాతం జంప్చేసి రూ. 1,342 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 758 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,749 కోట్ల నుంచి రూ. 4,938 కోట్లకు పురోగమించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,805 కోట్ల నుంచి రూ. 3,465 కోట్లకు ఎగశాయి. పోర్టులపై దృష్టి.. ఏపీ సెజ్ గ్రూప్తో గంగవరం పోర్టు(జీపీఎల్) విలీనం తదితర కన్సాలిడేషన్ చర్యలు చేపట్టేందుకు వీలుగా స్వతంత్ర డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు అదానీ పోర్ట్స్ తాజాగా వెల్లడించింది. జీపీఎల్లో ఏపీ ప్రభుత్వ వాటా 10.4 శాతం విక్రయం తదుపరి ఈ చర్యలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలియజేసింది. ఇక కృష్ణపట్నం పోర్టులో మిగిలిన 25 శాతం వాటాను రూ. 2,800 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. తద్వారా కృష్ణపట్నం పోర్టు పూర్తి అనుబంధ సంస్థగా ఆవిర్భవించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు 2.2 శాతం బలపడి రూ. 707 వద్ద ముగిసింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ లాభం రూ.265 కోట్లు న్యూఢిల్లీ: అదానీ ఎంటర్ ప్రైజెస్ (ఏఈఎల్) జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ.12,579 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.265 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.5,265 కోట్లు, నికర నష్టం రూ.66 కోట్లుగా ఉంది. ‘ఏఈఎల్ ఎప్పుడూ అదానీ గ్రూపునకు కొత్త కంపెనీల అంకురార్పణ కేంద్రంగా కొనసాగుతుంది. ఆత్మనిర్భర్ భారత్ను బలోపేతం చేసే కీలక వ్యాపారాల్లో విజయవంతంగా ప్రవేశించాము. వీటిల్లో ఎయిర్పోర్టులు, డేటా కేంద్రాలు, రహదారులు, నీటి వసతులు ఉన్నాయి’ అని అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ సంస్థ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. -
హెచ్డీఎఫ్సీ లాభం రూ.3,001 కోట్లు
ముంబై: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ ఈ ఏడాది (2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 31% జంప్చేసి రూ. 5,311 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,059 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. క్యూ1లో స్టాండెలోన్ నికర లాభం స్వల్పంగా తగ్గి రూ. 3,001 కోట్లకు పరిమితమైంది. గత క్యూ1లో రూ. 3,052 కోట్లు ఆర్జించింది. అయితే గత కాలపు నికర లాభంలో పెట్టుబడుల విక్రయం ద్వారా లభించిన రూ. 1,241 కోట్లు కలసి ఉన్నట్లు కంపెనీ ప్రస్తావించింది. తాజా సమీక్షా కాలంలో ఈ పద్దుకింద రూ. 263 కోట్లు మాత్రమే లభించినట్లు తెలియజేసింది. దీంతో ఫలితాలు పోల్చతగదని వివరించింది. క్యూ1లో హెచ్డీఎఫ్సీ నికర వడ్డీ ఆదాయం 22% పుంజుకుని రూ. 4,147 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.6% బలపడి 3.7%కి చేరాయి. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 5,31,186 కోట్ల నుంచి రూ. 5,74,136 కోట్లకు ఎగశాయి. ఫలితాల విడుదల నేపథ్యంలో షేరు 1 శాతం బలపడి రూ. 2,463 వద్ద ముగిసింది. -
నష్టాల్లోకి ఆర్బీఎల్ బ్యాంక్
ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. వెరసి క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 459 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది (2020–21) ఇదే కాలంలో రూ. 141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు ప్రొవిజన్లు పెరగడం ప్రభావం చూపింది. కోవిడ్–19 నేపథ్యంలో స్థూల స్లిప్పేజెస్ 97 శాతం ఎగసి రూ. 1,342 కోట్లను తాకాయి. గత క్యూ1తో పోలిస్తే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.45 శాతం నుంచి 4.99 శాతానికి పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 500 కోట్ల నుంచి రూ. 1,425 కోట్లకు జంప్చేశాయి. కోవిడ్–19కు రూ. 600 కోట్ల అదనపు కేటాయింపులు చేపట్టకపోతే క్యూ1లో లాభాలు ప్రకటించడం సాధ్యమయ్యేదని ఆర్బీఎల్ బ్యాంక్ ఎండీ, సీఈవో విశ్వవీర్ అహుజా పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరించిన రుణాలు రూ. 933 కోట్ల నుంచి రూ. 1,162 కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 7 శాతం క్షీణించి రూ. 970 కోట్లకు పరిమితంకాగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.9 శాతం నుంచి 4.4 శాతానికి నీరసించాయి. కనీస మూలధన నిష్పత్తి 17.15 శాతానికి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఆర్బీఎల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 195 వద్ద ముగిసింది. -
కొంపముంచే రుణాలు, తగ్గిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభాలు
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లాభాలకు నిరర్థక రుణాలు (ఎన్పీఏలు/వసూలు కాని రుణాలు) గండికొట్టాయి. జూన్తో అంతమైన మొదటి త్రైమాసికంలో లాభం గణనీయంగా తగ్గిపోయి రూ.153 కోట్లకు పరిమితమైంది. ఎన్పీఏలకు రూ.830 కోట్లను పక్కన పెట్టడం ఇందుకు దారితీసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.817 కోట్లుగా ఉండడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 4.5 శాతం పెరిగి రూ.1,275 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.32 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గింది. క్యూ1లో రూ.8,652 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఇందులో రూ.7,650 కోట్లు గృహ రుణాలే ఉన్నాయి. రుణాల మంజూరులో 152 శాతం పురోగతి చూపించింది. ‘‘ఎన్పీఏలకు చేసిన కేటాయింపుల వల్లే మా నికర లాభం తగ్గిపోయింది. దీనికితోడు వేతన వ్యయాలు కూడా ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితిని దాటి వచ్చామన్న బలమైన నమ్మకంతో ఉన్నాం. రానున్న కాలంలో మంచి వృద్ధి పథంలో కొనసాగుతాం’’ అని సంస్థ ఎండీ, సీఈవో వై విశ్వనాథ గౌడ్ తెలిపారు. మూడోదశలోని వసూలు కాని రుణాలు మొత్తం రుణాలో 5.93 శాతానికి పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.83 శాతంగానే ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు బలహీనపడడం వల్ల వసూళ్లు మందగించాయని.. వసూళ్లపై మరింత దృష్టి సారిస్తామని విశ్వనాథగౌడ్ చెప్పారు. -
లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్, కోట్లల్లో నికర లాభం
ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 206 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 135 కోట్లతో పోలిస్తే ఇది 53 శాతం అధికం. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ. 1,349 కోట్ల నష్టం ప్రకటించింది. మరోవైపు, క్యూ1లో ఆదాయం రూ. 6,727 కోట్ల నుంచి రూ. 6,246 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం దాదాపు గత క్యూ1 స్థాయిలో రూ. 2,135 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 18.10 శాతం నుంచి 15.92 శాతానికి, నికర ఎన్పీఏలు 6.76 శాతం నుంచి 5.09 శాతానికి తగ్గాయి. బుధవారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు సుమారు 1.4 శాతం క్షీణించి రూ. 24.45 వద్ద ముగిశాయి. -
టాటా కాఫీ.. బాగోలేదు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాటా కాఫీ (టీసీఎల్) నికర లాభం (కన్సాలిడేటెడ్) రూ.46 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 62 కోట్లతో పోలిస్తే 26 శాతం క్షీణించింది. అటు ఆదాయం రూ. 592 కోట్ల నుంచి 9 శాతం క్షీణించి రూ. 538 కోట్లకు పరిమితమైంది. గడ్డు పరిస్థితులు నెలకొన్నప్పటికీ మొత్తం మీద తాము మెరుగైన పనితీరు కనపర్చగలిగామని కంపెనీ ఎండీ చాకో పి. థామస్ తెలిపారు. నిల్వ.. రవాణాపరంగాను, ముడి వస్తువుల ధరలపరంగానూ సమస్యలు ఎదురైనా తొలి త్రైమాసికంలో ఇన్స్టంట్ కాఫీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని వివరించారు. వియత్నాంలోని తమ కార్యకలాపాలు, ఆర్డర్ల సంఖ్య మెరుగుపడినట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం టీసీఎల్ షేర్లు సుమారు 9 శాతం క్షీణించి రూ. 215 వద్ద క్లోజయ్యాయి. బుధవారం టీసీఎల్ షేర్లు సుమారు 9 శాతం క్షీణించి రూ. 215 వద్ద క్లోజయ్యాయి. -
గ్రాన్యూల్స్ ఇండియా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్కేర్ కంపెనీ గ్రాన్సూల్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 8 శాతం బలపడి రూ. 120 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 111 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు 16 శాతం పుంజుకుని రూ. 850 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 736 కోట్ల టర్నోవర్ నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 0.25 మధ్యంతర డివిడెండును ప్రకటించింది. -
కెనరా బ్యాంక్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: పీఎస్యూ సంస్థ కెనరా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో స్టాండెలోన్ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 1,177 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 406 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం స్వల్పంగా బలపడి రూ. 21,210 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం సైతం నామమాత్ర వృద్ధితో రూ. 6,147 కోట్లయ్యింది. అయితే ఇతర ఆదాయం 67 శాతంపైగా జంప్చేసి రూ. 4,438 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.13 శాతం నీరసించి 2.71 శాతంగా నమోదయ్యాయి. ఎన్పీఏలు తగ్గాయ్: క్యూ1లో కెనరా బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.84% నుంచి 8.5%కి తగ్గాయి. నికర ఎన్పీఏలు 3.95% నుంచి 3.46%కి వెనకడుగు వేశాయి. మొత్తం ప్రొవిజన్లు 18 శాతం పెరిగి రూ. 4,574 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం పుంజుకుని రూ. 149 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 571 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 571 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 579 కోట్లతో పోలిస్తే స్వల్పంగా (సుమారు 1.5%) తగ్గింది. మరోవైపు, ఆదాయం రూ. 4,417 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ. 4,919 కోట్లకు పెరిగింది. ఉత్తర అమెరికా మార్కెట్లో కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గడం, వృద్ధి బాటలో ఉన్న భారత్ సహా వర్ధమాన మార్కెట్లలో బ్రాండ్లు, డిజిటలైజేషన్ మొదలైన వాటిపై పెట్టుబడులు పెట్టడం తదితర అంశాల కారణంగా లాభం స్వల్పంగా తగ్గినట్లు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డీఆర్ఎల్ సీఎఫ్వో పరాగ్ అగర్వాల్ మంగళవారం విలేకరులతో వర్చువల్ సమావేశంలో తెలిపారు. అయితే రాబోయే త్రైమాసికాల్లో ఈ పెట్టుబడుల సానుకూల ప్రభావాలు కనిపించగలవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అమ్మకాల ఊతంతో తొలి త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించగలిగినట్లు సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అటు అమెరికా అవినీతి నిరోధక చట్టాలకు విరుద్ధంగా ఉక్రెయిన్, ఇతర దేశాల్లో హెల్త్కేర్ నిపుణులకు కంపెనీ తరఫున అనుచిత చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని ఎక్సే్చంజీలకు డీఆర్ఎల్ తెలిపింది. కొన్ని దేశాలకు సంబంధించి నిర్దిష్ట పత్రాలు సమర్పించాలంటూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ) నుంచి ఆదేశాలు వచ్చినట్లు పేర్కొంది. దేశీయంగా స్పుత్నిక్ తయారీ.. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నుంచి దేశీయంగా తయారైన కోవిడ్–19 టీకా స్పుత్నిక్–వి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని డీఆర్ఎల్ బ్రాండెడ్ మార్కెట్ల సీఈవో (ఇండియా, వర్ధమాన మార్కెట్లు) ఎంవీ రమణ వెల్లడించారు. తయారీ సన్నద్ధత కోసం దేశీయంగా ఆరు కాంట్రాక్టు తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. రష్యాలో కోవిడ్ కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో స్పుత్నిక్–వి సరఫరాలో జాప్యం జరుగుతోందని, ఆగస్టు ఆఖరికి పరిస్థితి మెరుగుపడగలదని ఆయన తెలిపారు. సరఫరాను పెంచుకునేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో చర్చలు జరుపుతున్నట్లు రమణ పేర్కొన్నారు. భారత్లో తొలి 25 కోట్ల డోసులను విక్రయించేందుకు ఆర్డీఐఎఫ్తో డీఆర్ఎల్తో ఒప్పందం ఉంది. ఉత్తర అమెరికా మార్కెట్ సింగిల్ డిజిట్.. భారత్, వర్ధమాన మార్కెట్లు, యూరప్ మార్కెట్ ఊతంతో క్యూ1లో గ్లోబల్ జనరిక్స్ విభాగం 17 శాతం వృద్ధి నమోదు చేసింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయ వృద్ధి 1%కి పరిమితమైంది. కొన్ని ఉత్పత్తుల రేట్లు తగ్గించాల్సి రావడం, ఫారెక్స్ రేటు అనుకూలంగా లేకపోవడం వంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ పలు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అమ్మకాలు పెరగడం వంటి సానుకూల అంశాలతో డీఆర్ఎల్ వాటిని అధిగమించింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా కోవిడ్ ఔషధాల విక్రయాలు పెరగడంతో భారత మార్కెట్లో ఆదాయం 69% పెరిగి రూ. 1,060 కోట్లుగా నమోదైంది. క్యూ1లో దేశీయంగా డీఆర్ఎల్ ఆరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. షేరు 11% డౌన్..: ఫలితాల నేపథ్యంలో మంగళవారం డీఆర్ఎల్ షేరు 11% పతనమైంది. ఒక దశలో రూ. 4,781కి క్షీణించింది. చివరికి 10.44% క్షీణతతో రూ. 4,844 వద్ద షేరు క్లోజయ్యింది. ఐసీఐసీఐ లాంబార్డ్తో ‘శ్వాస్’ జట్టు ఆరోగ్య బీమా పాలసీదారులకు నగదురహిత అవుట్పేషెంట్ సర్వీసులు అందించే దిశగా డీఆర్ఎల్ అనుబంధ సంస్థ శ్వాస్ వెల్నెస్తో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ జట్టు కట్టింది. డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ’శ్వాస్’ని ముందుగా హైదరాబాద్, వైజాగ్లో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు డీఆర్ఎల్ బ్రాండెడ్ మార్కెట్స్ విభాగం (భారత్, వర్ధమాన మార్కెట్లు) సీఈవో రమణ తెలిపారు. రాబోయే రోజుల్లో కీలక మెట్రో, ప్రథమ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ కన్సల్టేషన్, డయాగ్నస్టిక్ సర్వీసులు, ఫార్మసీ, బీమా మొదలైనవి పొందేలా ’శ్వాస్’ని తీర్చిదిద్దినట్లు రమణ పేర్కొన్నారు. -
కోటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 32 శాతం ఎగసి రూ. 1,642 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,244 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 7,685 కోట్ల నుంచి రూ. 8,063 కోట్లకు పుంజుకుంది. అయితే నికర వడ్డీ ఆదాయం రూ. 6,912 కోట్ల నుంచి రూ. 6,480 కోట్లకు నీరసించింది. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 2.7 శాతం నుంచి 3.56 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు సైతం 0.87% నుంచి 1.28 శాతానికి పెరిగాయి. కాగా.. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 962 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి రూ. 935 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 1% లాభంతో రూ. 1,740 వద్ద ముగిసింది. -
యాక్సిస్ బ్యాంకు లాభంలో 94 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు లాభం జూన్ క్వార్టర్లో రెట్టింపైంది. స్టాండలోన్గా నికర లాభం 94 శాతం పెరిగి రూ.2,160 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం పుంజుకోవడం, మొండి బకాయిలకు (ఎన్పీఏలు) కేటాయింపులు తగ్గడం లాభాల్లో వృద్ధికి దారితీసింది. బ్యాంకు స్టాండలోన్ ఆదాయం రూ.19,592 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో యాక్సిస్ బ్యాంకు రూ.1,112 కోట్ల లాభాన్ని, రూ.19,032 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. 2021 మార్చి త్రైమాసికంలో (సీక్వెన్షియల్గా) ఆదాయం రూ.20,162 కోట్లతో పోలిస్తే తగ్గింది. లాభం కూడా మార్చి త్రైమాసికంలో ఉన్న రూ.2,677 కోట్లతో పోలిస్తే క్షీణించింది. వడ్డీ ఆదాయం జూన్ త్రైమాసికంలో రూ.16,003 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.16,445 కోట్లతో పోలిస్తే క్షీణించింది. బ్యాంకు రుణాలు 12% వృద్ధి చెందాయి. ఆస్తుల నాణ్యత రుణ ఆస్తుల నాణ్యత కాస్త మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 3.85 శాతం, నికర ఎన్పీఏలు 1.20 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ఎన్పీఏలు 4.72%, నికర ఎన్పీఏలు 1.23% చొప్పున ఉండడం గమనార్హం. ఎన్పీఏలకు, కంటింజెన్సీలకు రూ.3,532 కోట్లను పక్కన పెట్టింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.4,416 కోట్లుగా ఉన్నాయి. -
ఐటీసీ ఫలితాలు భేష్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 30 శాతంపైగా ఎగసి రూ. 3,343 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,567 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 36 శాతం జంప్చేసి రూ. 14,241 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు సైతం 28 శాతంపైగా పెరిగి రూ. 10,220 కోట్లను తాకాయి. కోవిడ్–19 సెకండ్ వేవ్లోనూ వివిధ విభాగాలు పటిష్ట పనితీరు చూపినట్లు కంపెనీ పేర్కొంది. విభాగాల వారీగా ఐటీసీ ఎఫ్ఎంసీజీ బిజినెస్ 24 శాతం వృద్ధితో రూ. 9,534 కోట్లను అధిగమించింది. సిగరెట్ల విభాగం 34 శాతం పుంజుకుని రూ. 5,803 కోట్లకు చేరింది. కాగా.. ఎఫ్ఎసీజీ ఇతర విభాగంలో బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్నాక్స్, డైరీ, పానీయాలు, స్టేషనరీ తదితరాల టర్నోవర్ 10 శాతంపైగా బలపడి రూ. 3,731 కోట్లను తాకింది. హోటళ్ల ఆదాయం ఐదు రెట్లు ఎగసి రూ. 134 కోట్లకు చేరింది. -
ఐసీఐసీఐ లాభం హైజంప్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఏడాది(2021–22) తొలి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 52 శాతం జంప్చేసి రూ. 4,747 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 77 శాతం దూసుకెళ్లి రూ. 4,616 కోట్లను అధిగమించింది. మొత్తం ప్రొవిజన్లు 62 శాతం తగ్గి రూ. 2,852 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు(జీఎన్పీఏలు) పెరగనున్న అంచనాలతో గతేడాది క్యూ1లో రూ. 7,594 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. తాజా స్లిప్పేజెస్ రూ. 7,231 కోట్లకు చేరాయి. వీటిలో రిటైల్, బిజినెస్ బ్యాంకింగ్ వాటా రూ. 6,773 కోట్లు. ఎస్ఎంఈ, కార్పొరేట్ విభాగం నుంచి రూ. 458 కోట్లు నమోదైంది. ఎన్పీఏలు ఇలా ఐసీఐసీఐ బ్యాంక్ జీఎన్పీఏలు గతేడాది క్యూ1తో పోలిస్తే 5.46 శాతం నుంచి 5.15 శాతానికి తగ్గాయి. క్యూ4లో ఇవి 4.96 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.14 శాతం నుంచి 1.16 శాతానికి స్వల్పంగా పెరిగాయి. రిటైల్, బ్యాంకింగ్ బిజినెస్ విభాగంలో మరింత ఎక్కువగా 2.04 శాతం నుంచి 3.75 శాతానికి పెరిగాయి. కాగా.. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 10,936 కోట్లను తాకింది. ఇతర ఆదాయం 56 శాతం ఎగసి రూ. 3,706 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు 0.2 శాతం బలపడి 3.89 శాతానికి చేరాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 19.27 శాతంగా నమోదైంది. -
క్యూ1 ఫలితాలు, ప్రపంచ పరిణామాలే కీలకం
ముంబై: కార్పొరేట్ల తొలి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కీలకంగా మారొచ్చని చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికల అంశాలు సైతం ట్రేడింగ్ ప్రభావితం చేయవచ్చని విశ్లేషిస్తున్నారు. అలాగే కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మార్కెట్ సోమవారం ముందుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక గణాంకాలు, రిలయన్స్ – జస్ట్ డయల్ విలీన ప్రక్రియ అంశాలపై స్పందించాల్సి ఉంటుంది. బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. కావున ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ‘‘దేశీయంగా సానుకూల సంకేతాలు నెలకొన్నప్పటికీ.., ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. సూచీల తాజా గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. ఈ అంశాలు ఒడిదుడుకుల ట్రేడింగ్ను ప్రేరేపించవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,600 వద్ద బలమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,950 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది’’ అని ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నిరాలి షా తెలిపారు. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కావడంతో పాటు కంపెనీలు ఆశాజన ఆర్థిక ఫలితాల ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో నెలరోజుల తర్వాత గతవారంలో సూచీలు తిరిగి సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఆర్థిక, బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్, మెటల్స్ షేర్లు రాణిండంతో క్రితం వారంలో సెన్సెక్స్ 754 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లను ఆర్జించగలిగాయి. కీలక దశకు కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సందడి... దేశీయ కార్పొరేట్ల తొలి త్రైమాసికపు ఆర్థిక ఫలితాల ప్రకటన సందడి కీలక దశకు చేరుకుంది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాలకు చెందిన అనేక పెద్ద కంపెనీలు ఈ వారంలో తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఐసీసీఐ బ్యాంకులతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్లోని మొత్తం పది కంపెనీలున్నాయి. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది. నేడు రెండు లిస్టింగ్లు... ఇటీవల ఐపీఓ ఇష్యూలను పూర్తి చేసుకున్న రోడ్ల నిర్మాణ సంస్థ జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ క్లీన్ సైన్స్ టెక్నాలజీ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్కానున్నాయి. గ్రే మార్కెట్లో ఇరు కంపెనీల షేర్లు 55–60 శాతం ప్రీమియం ధర పలుకుతున్నాయి. కావున లాభదాయక లిస్టింగ్కు అవకాశం ఉందని ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై తొలి భాగంలో రూ.4,515 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. సూచీలు రికార్డు గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
డిస్కౌంట్ల డీమార్ట్... లాభాలు ఎంతో తెలుసా ?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 95 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 40 కోట్లు మాత్రమే ఆర్జించింది. గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా అమ్మకాలు ప్రభావితమైన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 3,883 కోట్ల నుంచి రూ. 5,183 కోట్లకు జంప్చేసింది. మొత్తం వ్యయాలు రూ. 3,875 కోట్ల నుంచి రూ. 5,077 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1 ప్రారంభంలోనూ స్థానికంగా కఠిన లాక్డౌన్లు అమలైనప్పటికీ మూడు, నాలుగు వారాల తదుపరి ఆంక్షలు తొలగుతూ వచ్చినట్లు కంపెనీ తెలియజేసింది. -
వినతీ కొత్త రికార్డ్- ఎస్సెల్ ప్రొ పతనం
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఫార్మా రంగ కంపెనీ వినతీ ఆర్గానిక్స్ కౌంటర్కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. అయితే మరోవైపు పీఈ దిగ్గజం బ్లాక్స్టోన్ వాటాను విక్రయించనున్నట్లు వెల్లడికావడంతో ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి వినతీ ఆర్గానిక్స్ షేరు భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ఎస్సెల్ ప్రొప్యాక్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు ఇలా.. వినతీ ఆర్గానిక్స్ లాక్డవున్ల నేపథ్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో జోరందుకున్న వినతీ ఆర్గానిక్స్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత వినతీ షేరు 5 శాతం జంప్చేసి రూ. 1355ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 1325 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లోనే వినతీ షేరు 36 శాతం దూసుకెళ్లడం విశేషం! ఈ ఏడాది క్యూ1లో నికర లాభం 12 శాతమే క్షీణించి రూ. 72 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా తగ్గి రూ. 232 కోట్లకు చేరింది. అయితే ఇబిటా మార్జిన్లు 0.7 శాతం బలపడి 42 శాతంగా నమోదయ్యాయి. క్యూ2 ఫలితాలపై ఆశావహ అంచనాలు ఈ కౌంటర్కు జోష్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎస్సెల్ ప్రొప్యాక్ లామినేటెడ్ ట్యూబ్స్ ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్లో మెజారిటీ వాటా కలిగిన బ్లాక్స్టోన్ సంస్థ ఎప్సిలాన్ బిడ్కో 23 శాతం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సెల్ ప్రొప్యాక్లో ఎప్సిలాన్కు 75 శాతం వాటా ఉంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. బ్లాక్డీల్స్ ద్వారా 7.25 కోట్ల షేర్లను బ్లాక్స్టోన్ సంస్థ విక్రయించనున్నట్లు వివరించాయి. తద్వారా బ్లాక్స్టోన్ రూ. 1850 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఎస్సెల్ ప్రొప్యాక్ షేరు 6.25 శాతం పతనమై రూ. 256 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 252 దిగువకూ చేరింది. కాగా.. నేటి ట్రేడింగ్లో తొలి గంటన్నరలోనే బీఎస్ఈలో 7.68 కోట్లకుపైగా షేర్లు చేతులు మారినట్లు నిపుణులు పేర్కొన్నారు. గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 22,400 షేర్లు మాత్రమేకావడం గమనార్హం. తద్వారా బ్లాక్స్టోన్ గ్రూప్ 23 శాతం వాటాను విక్రయించినట్లు చెబుతున్నారు. -
బజాజ్ హెల్త్కేర్- శ్రేఈ ఇన్ఫ్రా.. జూమ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫార్మా రంగ కంపెనీ బజాజ్ హెల్త్కేర్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో నష్టాల నుంచి బయటపడి లాభాలు ఆర్జించడంతో ఎన్బీఎఫ్సీ.. శ్రేఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. బజాజ్ హెల్త్కేర్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బజాజ్ హెల్త్కేర్ నికర లాభం 5 రెట్లు ఎగసి రూ. 15 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 52 శాతం వృద్ధితో రూ. 140 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 8.5 శాతం మెరుగుపడి 18.76 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో బజాజ్ హెల్త్కేర్ షేరు బీఎస్ఈలో తొలుత 20 శాతం దూసుకెళ్లింది. రూ. 498ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 13 శాతం జంప్చేసి రూ. 469 వద్ద ట్రేడవుతోంది. శ్రేఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో శ్రేఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ రూ. 23 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ1లో రూ. 69 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 1561 కోట్ల నుంచి రూ. 1214 కోట్లకు క్షీణించింది. నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 44,213 కోట్లకు చేరింది. ఫలితాల ప్రభావంతో శ్రేఈ ఇన్ఫ్రా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 10 శాతం దూసుకెళ్లింది. రూ. 7.90ను తాకింది. ప్రస్తుతం 6 శాతం జంప్చేసి రూ. 7.70 వద్ద ట్రేడవుతోంది. -
జేబీ కెమ్- ఏడీఎఫ్ ఫుడ్స్.. హైజంప్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫార్మా రంగ కంపెనీ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడికావడంతో ఫుడ్ ప్రొడక్టుల కంపెనీ ఏడీఎఫ్ ఫుడ్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. జేబీ కెమికల్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో హెల్త్కేర్ కంపెనీ జేబీ కెమికల్స్ రూ. 120 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 92 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ. 522 కోట్లను అధిగమించింది. ఇబిటా 62 శాతం ఎగసి రూ. 155 కోట్లను తాకగా.. మార్జిన్లు 8.25 శాతం మెరుగుపడి 29.76 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో జేబీ కెమ్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 16.5 శాతం దూసుకెళ్లింది. రూ. 965ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 11 శాతం జంప్చేసి రూ. 918 వద్ద ట్రేడవుతోంది. ఏడీఎఫ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ ఏడీఎఫ్ ఫుడ్లో దాదాపు 1.49 లక్షల షేర్లను ఆశిష్ కచోలియా కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. కంపెనీ ఈక్విటీలో 0.74 శాతం వాటాకు సమానమైన వీటిని కచోలియా షేరుకి రూ. 378 సగటు ధరలో సొంతం చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు ఏడీఎఫ్ ఫుడ్స్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. అమ్మకందారులు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 400 సమీపంలో ఫ్రీజయ్యింది. సోమవారం సైతం ఈ షేరు ఇదే స్థాయిలో లాభపడటం గమనార్హం! -
ఆరియన్ప్రొ జూమ్- అదానీ గ్రీన్ రికార్డ్
కొద్ది రోజులుగా నిరంతర ర్యాలీ చేస్తున్న అదానీ గ్రీన్ ఎనర్జీ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఈ ఏడాది(2020-21) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడం ప్రభావం చూపుతోంది. ఇక మరోవైపు సింగపూర్ బ్యాంకింగ్ సంస్థ నుంచి ఆర్డర్ను పొందినట్లు వెల్లడించడంతో టెక్నాలజీ ప్రొడక్టుల కంపెనీ ఆరియన్ప్రొ సొల్యూషన్స్ కౌంటర్కు సైతం డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ 5 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్లను తాకాయి. వివరాలు చూద్దాం.. అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 51 కోట్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 131 కోట్ల ఇబిట్ నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 30 శాతం ఎగసి రూ. 878 కోట్లను తాకింది. కాగా.. సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించనున్న అదానీ గ్రీన్ ఎనర్జీ కౌంటర్ ఇటీవల నిరవధికంగా లాభపడుతూ వస్తున్న విషయం విదితమే. ఈ బాటలో మరోసారి అమ్మేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 639 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) దాదాపు రూ. లక్ష కోట్లకు చేరింది. వెరసి బీపీసీఎల్, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ తదితర పీఎస్యూ దిగ్గజాలను విలువరీత్యా వెనక్కి నెట్టింది. గత ఏడాది కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఏకంగా 1,173 శాతం దూసుకెళ్లడం విశేషం! ఆరియన్ప్రొ సొల్యూషన్స్ అనుబంధ సంస్థ ఇంటెగ్రో టెక్నాలజీస్ ద్వారా సింగపూర్లోని అతిపెద్ద బ్యాంకు నుంచి ఐటీ ప్రొడక్టుల సేవల కోసం ఆర్డర్ను పొందినట్లు ఆరియన్ప్రొ సొల్యూషన్స్ పేర్కొంది. ఆర్డర్లో భాగంగా స్మార్ట్ లెండర్ ప్రొడక్ట్ వెర్షన్4 ద్వారా సింగపూర్ బ్యాంక్ బ్రాంచీలు, అనుబంధ సంస్థలకు సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం లభించిన ఈ ఆర్డర్ విలువను 5.5 మిలియన్ డాలర్లుగా ఆరియన్ప్రొ తెలియజేసింది. 2022 ఫిబ్రవరిలోగా ప్రాజెక్టును అభివృద్ధి చేయవలసి ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆరియన్ప్రొ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 61.4 వద్ద ఫ్రీజయ్యింది. -
ఇన్ఫో ఎడ్జ్- డిక్సన్ టెక్నాలజీస్ భలే జోరు
హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 250 పాయింట్లు జంప్చేసి 38,667ను అధిగమించగా.. నిఫ్టీ 58 పాయింట్లు ఎగసి 11,413 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాలు ప్రకటించడంతో ఇన్ఫో ఎడ్జ్ ఇండియా కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఇటీవల కొద్ది రోజులుగా జోరు చూపుతున్న డిక్సన్ టెక్నాలజీస్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరర్ డిక్సన్ టెక్నాలజీస్ షేరు సరికొత్త గరిష్టాన్ని తాకితే.. నౌకరీ.కామ్, జీవన్సాథీ, 99 ఏకర్స్.కామ్ ద్వారా సేవలందించే ఇన్ఫో ఎడ్జ్ ఇండియా రికార్డ్ గరిష్టానికి చేరువైంది. ఇతర వివరాలు చూద్దాం.. ఇన్ఫో ఎడ్జ్ ఇండియా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఇన్ఫో ఎడ్జ్ ఇండియా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 94 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 191 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే నికర అమ్మకాలు మాత్రం 11 శాతం క్షీణించి రూ. 285 కోట్లను తాకాయి. ప్రస్తుతం రూ. 123 కోట్ల పన్నుకు ముందు లాభం సాధించగా.. గతంలో రూ. 150 కోట్ల నష్టం నమోదైంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు తొలుత 4 శాతం జంప్చేసి రూ. 3,425ను తాకింది. ప్రస్తుతం 2.3 శాతం లాభంతో రూ. 3,369 వద్ద ట్రేడవుతోంది. గత నెల 10న సాధించిన రికార్డ్ గరిష్టం రూ. 3,584కు ఇంట్రాడేలో చేరువకావడం గమనార్హం! డిక్సన్ టెక్నాలజీస్ వరుసగా ఆరో రోజు డిక్సన్ టెక్నాలజీస్ కౌంటర్ దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్చేసి రూ. 9,546 వద్ద ట్రేడవుతోంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత ఆరు రోజుల్లో 17 శాతం బలపడింది. ఈ ఏడాది మార్చి 24న రూ. 2,900 వద్ద కనిష్టాన్ని చవిచూసిన డిక్సన్ టెక్నాలజీస్ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతోంది. వెరసి కనిష్టం నుంచి ఏకంగా 215 శాతం ర్యాలీ చేసింది. దేశీ ఎలక్ట్రానిక్ మార్కెట్లో పలు విభాగాల్లో కంపెనీ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులను అందిస్తోంది. ఎంఎన్సీలు తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను తయారు చేస్తోంది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, మొబైల్ ఫోన్లు, లెడ్ లైటింగ్ తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఈ ఏడాది క్యూ1లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ.. ఇకపై పనితీరు మెరుగుపడగలదన్న అంచనాలు ఈ కౌంటర్కు జోష్నిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
రెప్కో హోమ్ జూమ్- జూబిలెంట్ లైఫ్ స్కిడ్
విదేశీ ప్రతికూలతల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎన్బీఎఫ్సీ రెప్కో హోమ్ ఫైనాన్స్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో అంటే క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఫలితాలు నిరాశపరచడంతో హెల్త్కేర్ కంపెనీ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి రెప్కో హోమ్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. జూబిలెంట్ లైఫ్ కౌంటర్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. రెప్కో హోమ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రెప్కో హోమ్ ఫైనాన్స్ నికర లాభం 3 శాతం బలపడి రూ. 69 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 4 శాతం పెరిగి రూ. 342 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ. 127 కోట్లను తాకగా.. నిర్వహణ లాభం 11 శాతం క్షీణించి రూ. 86 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో రెప్కో హోమ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్చేసింది. అమ్మేవాళ్లు కరువకావడంతో రూ. 182 సమీపంలో ఫ్రీజయ్యింది. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ నికర లాభం 52 శాతం క్షీణించి రూ. 88 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 2182 కోట్ల నుంచి రూ. 1893 కోట్లకు నీరసించింది. ఈ నేపథ్యంలో జూబిలెంట్ లైఫ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 788 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 772 దిగువకు చేరింది. -
ఎన్ఎండీసీ- రెప్కో హోమ్.. జూమ్
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 295 పాయింట్లు జంప్చేసి 39,08కు చేరగా.. నిఫ్టీ 76 పాయింట్లు ఎగసి 11,635 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా పీఎస్యూ దిగ్గజం ఎన్ఎండీసీ లిమిటెడ్, మార్టిగేజ్ సంస్థ రెప్కో హోమ్ ఫైనాన్స్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఎండీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో కోవిడ్-19 నేపథ్యంలో ఎన్ఎండీసీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 55 శాతం క్షీణించి రూ. 533 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 3264 కోట్ల నుంచి రూ. 1938 కోట్లకు పడిపోయింది. అయితే లాక్డవున్ల కాలంలోనూ అంచనాలకు అనుగుణమైన పనితీరు చూపినట్లు ఎన్ఎండీసీ చైర్మన్ సుమీత్ దేవ్ పేర్కొన్నారు. ఇకపై మెరుగైన పనితీరును ప్రదర్శించగలమని అంచనా వేశారు. ఈ నెల మొదట్లో కంపెనీ ముడిఇనుము ధరలను టన్నుకి రూ. 300 చొప్పున పెంచింది. దీంతో టన్ను ధర రూ. 2,950కు చేరింది. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎన్ఎండీసీ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 109 వద్ద ట్రేడవుతోంది. రెప్కో హోమ్ ఫైనాన్స్ రెప్కో హోమ్ ఫైనాన్స్ కంపెనీలో వాటాను ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ 4.86 శాతం నుంచి 6.14 శాతానికి పెంచుకున్నట్లు తాజాగా వెల్లడైంది. జూన్ చివరికల్లా రెప్కో హోమ్ ఫైనాన్స్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, డీఎస్పీ, హెచ్డీఎఫ్సీ స్మాల్క్యాప్ ఫండ్స్ వరుసగా 2.36 శాతం, 4.44 శాతం, 5.97 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెప్కో హోమ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 186.5 వద్ద ఫ్రీజయ్యింది. గత 10 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ షేరు 35 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
జేఎంసీ ప్రాజెక్ట్స్- కేన్ ఫిన్ హోమ్ జూమ్
వరుసగా మూడో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్డర్లు పొందిన వార్తలతో మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్ సంస్థ కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. జేఎంసీ ప్రాజెక్ట్స్ దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి తాజాగా రూ. 554 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు వెల్లడించడంతో జేఎంసీ ప్రాజెక్ట్స్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 62ను అధిగమించింది. ప్రస్తుతం 13 శాతం ఎగసి రూ. 60.5 వద్ద ట్రేడవుతోంది. బిల్డింగ్ నిర్మాణాలకు దక్షిణాది నుంచి రూ. 315 కోట్ల కాంట్రాక్టు లభించగా.. మహారాష్ట్ర నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటుకుగాను రూ. 239 కోట్ల ఆర్డర్ దక్కినట్లు జేఎంసీ తెలియజేసింది. ఫలితంగా ఆర్డర్ బుక్ విలువ తాజాగా రూ. 4,000 కోట్లకు చేరినట్లు మౌలిక సదుపాయాల దిగ్గజం కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్కు అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్ట్స్ వెల్లడించింది. కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 93 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 15 శాతం వృద్ధికాగా.. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 522 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 2 చొప్పున డివిడెండ్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలుత కేన్ ఫిన్ హోమ్ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతం జంప్చేసి రూ. 420కు చేరింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 398 వద్ద ట్రేడవుతోంది. -
గ్లోబస్ స్పిరిట్స్- నోసిల్.. లాభాల కిక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో లిక్వర్ కంపెనీ గ్లోబస్ స్పిరిట్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించినప్పటికీ రబ్బర్ కెమికల్స్ కంపెనీ నోసిల్ లిమిటెడ్ కౌంటర్కు సైతం డిమాండ్ కనిపిస్తోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. గ్లోబస్ స్పిరిట్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో గ్లోబస్ స్పిరిట్స్ నికర లాభం 161 శాతం దూసుకెళ్లి రూ. 19 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పన్నుకు ముందు లాభం రెట్టింపై రూ. 25 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం క్షీణించి రూ. 292 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో గ్లోబస్ స్పిరిట్స్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 170 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత ఐదు నెలల్లో ఈ షేరు 90 శాతంపైగా ర్యాలీ చేయడం విశేషం! నోసిల్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో నోసిల్ లిమిటెడ్ నికర లాభం 64 శాతం నీరసించి రూ. 12 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 54 శాతం క్షీణించి రూ. 107 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 81 శాతం పడిపోయి రూ. 9.3 కోట్లను తాకింది. కోవిడ్-19 కట్టడికి లాక్డవున్ అమలు కారణంగా టైర్ల కంపెనీల నుంచి ప్రొడక్టులకు డిమాండ్ పడిపోయినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇకపై రబ్బర్ కెమికల్స్కు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ప్రభుదాస్ లీలాధర్ అంచనా వేసింది. చైనా స్థానే కంపెనీకి మరిన్ని ఆర్డర్లు లభించగలవని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో నోసిల్ షేరు 8 శాతం జంప్చేసి రూ. 131 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 132.5 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది! -
ఆల్కార్గో- ఎల్ఐసీ హౌసింగ్.. యమస్పీడ్
వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి ఖంగుతిన్నాయి. తొలుత 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సెన్సెక్స్ ప్రస్తుతం నష్టాలతో కదులుతోంది. 70 పాయింట్లు క్షీణించి 38,729కు చేరింది. నిఫ్టీ సైతం 18 పాయింట్లు తక్కువగా 11,448 వద్ద ట్రేడవుతోంది. కాగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీని డీలిస్ట్ చేయనున్న వార్తలతో ప్రయివేట్ రంగ కంపెనీ ఆల్కార్గో లాజిస్టిక్స్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్ కంపెనీ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఆటుపోట్ల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఆల్కార్గో లాజిస్టిక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి షేర్లను డీలిస్ట్ చేసేందుకు ప్రమోటర్ గ్రూప్ ప్రణాళికలు వేస్తున్నట్లు ఆల్కార్గో లాజిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. ప్రమోటర్ శశి కిరణ్ శెట్టితోపాటు.. టాలెంటోస్ ఎంటర్టైన్మెంట్ ఇందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు పేర్కొంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి కంపెనీని స్వచ్చందంగా డీలిస్ట్ చేసేందుకు వీలుగా ప్రమోటర్లు పబ్లిక్ వాటాదారుల నుంచి ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్ గ్రూప్నకు 70 శాతంపైగా వాటా ఉంది. దీంతో ఈ కౌంటర్లో కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువయ్యారు. వెరసి ఎన్ఎస్ఈలో ఆల్కార్గో షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 22 ఎగసి రూ. 131 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఎల్ఐసీ హౌసింగ్ నికర లాభం 34 శాతం పెరిగి రూ. 817 కోట్లను తాకింది. ప్రొవిజన్లు రూ. 253 కోట్ల నుంచి రూ. 56 కోట్లకు తగ్గడం ఇందుకు సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్లు 2.41 శాతం నుంచి 2.32 శాతానికి స్వల్పంగా నీరసించాయి. మొత్తం ఆదాయం రూ. 4807 కోట్ల నుంచి రూ. 4977 కోట్లకు బలపడింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ హౌసింగ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 11.5 శాతం దూసుకెళ్లి రూ. 309ను తాకింది. ప్రస్తుతం 8.3 శాతం లాభంతో రూ. 300 వద్ద ట్రేడవుతోంది. -
ఈ ప్యాకేజింగ్ షేర్లు.. పవర్ ప్యాక్డ్ సుమా
ప్యాకేజింగ్ రంగంలోని పలు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో నష్టాల మార్కెట్లోనూ ప్యాకేజింగ్ రంగ కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వెరసి కాస్మో ఫిల్మ్స్(రూ. 491) షేరు సరికొత్త గరిష్టాన్ని అందుకోగా.. ఎస్సెల్ ప్రొప్యాక్(రూ. 300), జిందాల్ పాలీఫిల్మ్(రూ. 524), యూఫ్లెక్స్(రూ. 373), ఈస్టర్ ఇండస్ట్రీస్(రూ. 76.5), హైటెక్ కార్ప్(రూ. 126.5), పాలీప్లెక్స్ కార్పొరేషన్(రూ. 844), యూఫ్లెక్స్(రూ. 373) తాజాగా 52 వారాల గరిష్టాలను తాకాయి. ఇందుకు ప్రధానంగా కాస్మో ఫిల్మ్స్, ఎస్సెల్ ప్రొప్యాక్, యూఫ్లెక్స్ సాధించిన పటిష్ట ఫలితాలు దోహదం చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వెరసి కంట్రోల్ ప్రింట్, హిందుస్తాన్ టిన్వర్క్స్, ఎవరెస్ట్ కాంటో, హటమకీ తదితర కంపెనీల షేర్లు జోరు చూపుతున్నాయి. ఫలితాలు ఇలా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కాస్మో ఫిల్మ్స్ నికర లాభం 69 శాతం జంప్చేసి రూ. 47 కోట్లకు చేరింది. ఇక ఎస్సెల్ ప్రొప్యాక్ నికర లాభం 14 శాతం వృద్ధితో రూ. 46 కోట్లను తాకింది. ఇక యూఫ్లెక్స్ నికర లాభం సైతం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 197 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. షేర్ల స్పీడ్ ఎన్ఎస్ఈలో కంట్రోల్ ప్రింట్ 16 శాతం పురోగమించి రూ. 251కు చేరగా.. జిందాల్ పాలీ 12.4 శాతం దూసుకెళ్లి రూ. 524ను తాకింది. ఈ బాటలో ఎవరెస్ట్ కాంటో షేరు 7.5 శాతం జంప్చేసి రూ. 32 వద్ద, ఎస్సెల్ ప్రొప్యాక్ 5 శాతం ఎగసి రూ. 295 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో హటమకీ పీపీఎల్ 5 శాతం పుంజుకుని రూ. 260 వద్ద, పాలీప్లెక్స్ కార్పొరేషన్ 5.5 శాతం జంప్చేసి రూ. 844 వద్ద కదులుతున్నాయి. ఇదే విధంగా ఈస్టర్ ఇండస్ట్రీస్ 5 శాతం లాభపడి రూ. 76.5ను తాకగా, హైటెక్ కార్ప్ 5 శాతం పెరిగి రూ. 126.5కు చేరింది. యూఫ్లెక్స్ 4 శాతం బలపడి రూ. 373 వద్ద ట్రేడవుతోంది. -
టాటా పవర్.. స్పార్క్- ముత్తూట్ బోర్లా
ప్రపంచ ఆర్థిక రికవరీపై సందేహాలతో దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్లు చొప్పున నష్టపోయి కదులుతున్నాయి. కాగా.. విద్యుత్ రంగంలో కార్యకలాపాలను మరింత భారీగా విస్తరించనున్నట్లు ప్రకటించడంతో టాటా పవర్ కంపెనీ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ గోల్డ్ లోన్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి టాటా పవర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ముత్తూట్ ఫైనాన్స్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం... టాటా పవర్ కంపెనీ ఇప్పటికే విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ బిజినెస్లను నిర్వహిస్తున్న టాటా పవర్ ఇతర విభాగాలవైపు దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడంతోపాటు.. రూఫ్టాప్ సోలార్, సోలార్ పంప్స్, లోకార్బన్ సొల్యూషన్స్, హోమ్ ఆటోమేషన్, ఈవీ చార్జింగ్ తదితరాలలోకి ప్రవేశించనున్నట్లు తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో టాటా పవర్ షేరు 7 శాతం జంప్చేసి రూ. 61 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 62కు చేరింది. ముత్తూట్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం రూ. 858 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 52 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 2604 కోట్లను అధిగమించింది. నిర్వహణలోని ఆస్తుల విలువ 16 శాతం పుంజుకున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ముత్తూట్ ఫైనాన్స్ షేరు 4.2 శాతం పతనమై రూ. 1203 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1185 వరకూ నీరసించింది. ఇటీవల కొంత కాలంగా ఈ కౌంటర్ ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. -
ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ16.5% క్షీణత
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్–జూన్ మధ్య అసలు వృద్ధిలేకపోగా –16.5 శాతం క్షీణిస్తుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదిక ఎక్రోప్ తాజాగా అంచనావేసింది. అయితే మే నెల నివేదికతో పోల్చితే (మైనస్ 20 శాతం కన్నా ఎక్కువ క్షీణత) క్షీణ రేటు అంచనా కొంత తగ్గడం ఊరటనిస్తున్న అంశం. సోమవారం విడుదలైన తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► కొన్ని లిస్టెస్ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కంపెనీల ఫలితాలు ఊహించినదానికన్నా బాగున్నాయి. కార్పొరేట్ గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) గణాంకాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. ఉత్పత్తిదారులు లేదా సరఫరాల వైపు నుంచి ఒక ఆర్థిక సంవత్సరం, లేదా త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత ఎలా ఉందన్న అంశాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేకించి పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు (ఉత్పత్తి స్థాయిలో) ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి జీవీఏ దోహదపడుతుంది. ఏ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి? దేనికి అక్కర్లేదు అన్న విషయాన్ని నిర్దారించుకునే క్రమంలో విధాన నిర్ణేతలకు జీవీఏ దోహదపడుతుంది. ► ఇప్పటి వరకూ దాదాపు 1,000 లిస్టెడ్ కంపెనీల ఫలితాలు తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యాయి. ఇందులో 25 శాతానికిపైగా కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. 55 శాతానికిపైగా సంస్థల లాభాలు క్షీణించాయి. విశేషం ఏమిటంగే, కార్పొరేట్ జీవీఏ మాత్రం కేవలం 14.1 శాతం మాత్రమే క్షీణించింది. ఇది కార్పొరేట్ రంగంలో ఒక సానుకూల సంకేతం. ► లిస్టెడ్ కంపెనీల ఆదాయాలు పడిపోవడం ఆయా సంస్థల వ్యయ హేతుబద్దీకరణలపై ప్రభావం చూపిస్తోంది తప్ప, లాభాలపై కాదు. ► జూలై, ఆగస్టుల్లో కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ► కోవిడ్–19 వల్ల తొలి త్రైమాసికంలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు మొత్తంగా 16.8 శాతం క్షీణంచనున్నాయి. ► కరోనా వైరస్ వల్ల దేశంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.27,000 తలసరి ఆదాయ నష్టం జరగనుంది. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, గోవా రాష్ట్రాల్లో తలసరి ఆదాయ నష్టం రూ.40,000 వరకూ ఉంటుంది. -
ఆర్తి డ్రగ్స్ బోనస్ భళా- బెర్జర్ బోర్లా
ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21 తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన హెల్త్కేర్ రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్ తాజాగా.. బోనస్ షేర్ల ప్రతిపాదనను తీసుకువచ్చింది. దీంతో ఈ కౌంటర్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో బెర్జర్ పెయింట్స్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో ఈ కౌంటర్ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. ఆర్తి డ్రగ్స్ లిమిటెడ్ ఫార్మా రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్ తాజాగా వాటాదారులకు బోనస్ షేర్ల జారీకి ప్రతిపాదించింది. ఈ నెల 20న నిర్వహించనున్న సమావేశంలో బోనస్ షేర్ల అంశంపై కంపెనీ బోర్డు నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆర్తి డ్రగ్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లింది. రూ. 2,399 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 5.3 శాతం జంప్చేసి రూ. 2,227 వద్ద ట్రేడవుతోంది. క్యూ1లో ఆర్తి డ్రగ్స్ నికర లాభం 281 శాతం ఎగసి రూ. 85 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. బెర్జర్ పెయింట్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో బెర్జర్ పెయింట్స్ నికర లాభం 91 శాతం పడిపోయి రూ. 15 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 46 శాతం క్షీణించి రూ. 931 కోట్లకు చేరింది. అధిక ధరల్లో కొనుగోలు చేసిన చమురు నిల్వల కారణంగా ముడివ్యయాలు పెరిగి క్యూ1లో మార్జిన్లు 7.9 శాతంమేర మందగించినట్లు కంపెనీ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఈ నేపథ్యంలో బెర్జర్ పెయింట్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3 శాతం క్షీణించి రూ. 536 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 527 వరకూ వెనకడుగు వేసింది. -
ఎన్టీపీసీ- సన్ టీవీ.. వెలుగులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో అంచనాలకు మించిన ఫలితాలు ప్రకటించడంతో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్ కౌంటర్కు డిమాండ్ పెరిగిది. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు అంచనాలను చేరడంతో ఎంటర్టైన్మెంట్, మీడియా రంగ సంస్థ సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ సైతం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 కట్టడికి లాక్డవున్ల అమలు నేపథ్యంలోనూ ఈ రెండు కంపెనీలూ పటిష్ట ఫలితాలు సాధించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎన్టీపీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఎన్టీపీసీ లిమిటెడ్ నికర లాభం 6 శాతం క్షీణించి రూ. 2,949 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా 3 శాతం నీరసించి రూ. 26,195 కోట్లకు చేరింది. పన్నుకుముందు లాభం 16 శాతం పెరిగి రూ. 4,280 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం జంప్చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. సన్ టీవీ నెట్వర్క్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సన్ టీవీ నెట్వర్క్ నికర లాభం దాదాపు 34 శాతం క్షీణించి రూ. 257 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 37 శాతం నీరసించి రూ. 715 కోట్లకు చేరింది. పన్నుకుముందు లాభం 40 శాతం వెనకడుగుతో రూ. 352 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. అయితే సబ్స్క్రిప్షన్ ఆదాయం 18 శాతం పెరిగి రూ. 442 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో సన్ టీవీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్చేసి రూ. 424 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 10 శాతం దూసుకెళ్లి రూ. 445 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
కరోనా కేసులు, ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: వచ్చేవారంలో స్టాక్ మార్కెట్ గమనానికి కరోనా కేసుల పెరుగుదల, కంపెనీల జూన్ క్వార్టర్(క్యూ1) ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయని స్టాక్మార్కెట్ నిపుణులంటున్నారు. గతవారంలో దేశీయంగా కీలక సూక్ష్మ ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగి 6.93శాతంగా నమోదైంది. ఎగుమతులు మాత్రం 10.21శాతం క్షీణించి 23.64 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాటిని విశ్లేషిస్తే ఆర్థిక మందగమనం కొంత రికవరి సాధించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అధిక ద్రవ్బోల్బణం నెలకొంది. దీంతో సెంటిమెంట్ కొంత బలహీన మార్కెట్లో అస్థిరత కొనసాగవచ్చని వారంటున్నారు. ఆర్థిక వ్యవస్థకు మరింత చేయూతనిచ్చే కార్యక్రమాల్లో భాగంగా కేంద్రం రెండో దఫా చర్యలకు శ్రీకారం చుట్టవచ్చని అంచనాలు దలాల్ స్ట్రీట్ వర్గాల్లో నెలకొన్నాయి. అలాగే ఈ వారంలో 12కి పైగా ప్రధాన కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. డాలర్ మారకంలో రూపాయి ట్రేడింగ్ మార్కెట్కు కీలకం కానుంది. మరో విడత ప్యాకేజీపై ఆశలు... ‘ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం మరోసారి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చు. ఇది మార్కెట్ వర్గాలను కచ్చితంగా ఉత్సాహపరిచే అంశమే. కంపెనీల క్యూ1 ఫలితాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశించగలవు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. క్యూ1 ఫలితాల విడుదల అంతిమ దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు తిరిగి కోవిడ్–19 కేసులు నమోదు, లాక్డౌన్ సడలింపులు తర్వాత ఆర్థిక వ్యవస్థ రికవరి అంశాలు మార్కెట్కు కీలకం కానున్నాయని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్పర్సన్ సంజీవ్ జర్బాదే తెలిపారు. ‘‘అంతర్జాతీయ పరిణామాలతో వచ్చే వారంలో మార్కెట్ ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా కరోనా కేసుల పెరుగుదల అంశం దలాల్ స్ట్రీట్ను గమానికి కీలకం కానుంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. అంతర్జాతీయ అంశాలు... కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు అమెరికా మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే అక్కడి ఆర్థికవేత్తలు అభిప్రాయపడున్నారు. అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. అలాగే క్రూడాయిల్ ధరలు కూడా మార్కెట్కు కీలకం కానున్నాయి. విదేశీ పెట్టుబడుల జోరు! దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా లిక్విడిటీ పెరగడంతో పాటు ఇప్పటివరకు విడుదలైన దేశీయ కార్పోరేట్ కంపెనీల క్వార్టర్ ఫలితాలు అంచనాలకు మించి నమోదుకావడంతో మన మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్పీఐలు ఆసక్తిచూపుతున్నారు. ఈ ఆగస్ట్ ప్రథమార్ధంలో డెట్, ఈక్విటీ మార్కెట్లో ఎఫ్పీఐలు రూ.28,203 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 5నెలల అనంతరం డెట్ మార్కెట్లో ఎఫ్పీఐలు నికర ఇన్వెస్టర్లుగా మారడం విశేషం. ఎఫ్పీఐలు జూన్, జూలైలో వరుసగా రూ.3,301 కోట్లు, రూ.24,053 కోట్ల పెట్టుబడులు పెట్టారు. జాతీయ, అంతర్జాతీయ సానుకూల కారకాల మేళవింపు ఫలితంగా భారత మార్కెట్లోకి అధిక మొత్తంలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని మార్నింగ్స్టార్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ హిమాంశ్ శ్రీవాస్తవ తెలిపారు. కరోనా ఎఫెక్ట్ నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు పలుదేశాల సెంట్రల్ బ్యాంకులు ఉద్దీపన చర్యలు ప్రకటించడమూ దీనికి నేపథ్యం. -
బాలకృష్ణ - గ్రీవ్స్ కాటన్.. రివర్స్ గేర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆఫ్రోడ్ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు నిరాశపరచడంతో ఇంజిన్ల తయారీ దిగ్గజం గ్రీవ్స్ కాటన్ కౌంటర్లో సైతం అమ్మకాలు తలెత్తాయి. దీంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో డీలా పడ్డాయి. వివరాలు చూద్దాం.. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ నికర లాభం 26 శాతం క్షీణించి రూ. 132 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. మొత్తం ఆదాయం సైతం 21 శాతం నీరసించి రూ. 943 కోట్లకు చేరింది. ఇబిటా 10 శాతం వెనకడుగుతో రూ. 240 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 1310 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1306 వరకూ నీరసించింది. గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో గ్రీవ్స్ కాటన్ రూ. 31 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 35 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 68 శాతం క్షీణించి రూ. 158 కోట్లకు పరిమితమైంది. ఈ కాలంలో రూ. 27 కోట్ల నిర్వహణ నష్టం ప్రకటించింది. గత క్యూ1లో రూ. 58 కోట్ల ఇబిటా నమోదైంది. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ కాటన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.2 శాతం పతనమై రూ. 84 దిగువన ట్రేడవుతోంది. -
రెడింగ్టన్- సిటీ యూనియన్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ఐటీ ప్రొడక్టుల పంపిణీ దిగ్గజం రెడింగ్టన్ ఇండియా కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు అంచనాలను చేరడంతో ప్రయివేట్ రంగ సంస్థ సిటీ యూనియన్ బ్యాంక్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. రెడింగ్టన్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో రెడింగ్టన్ ఇండియా నికర లాభం 19 శాతం క్షీణించి రూ. 89 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం నీరసించి రూ. 10,722 కోట్లకు చేరింది. ఇబిటా 6 శాతం వెనకడుగుతో రూ. 230 కోట్లను తాకింది. అయితే కోవిడ్-19 కట్టడికి లాక్డౌన్ల అమలు నేపథ్యంలోనూ కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించగలిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెడింగ్టన్ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 17 శాతం దూసుకెళ్లి రూ. 110 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 112 వరకూ ఎగసింది. సిటీ యూనియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సిటీ యూనియన్ బ్యాంక్ నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 154 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 1210 కోట్లను తాకింది. అయితే స్థూల మొండిబకాయిలు 4.09 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 2.29 శాతం నుంచి 2.11 శాతానికి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో సిటీ యూనియన్ బ్యాంక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్చేసి రూ. 123 వద్ద ట్రేడవుతోంది. -
ఈక్లర్క్స్ హైజంప్- అరబిందో డీలా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఈక్లర్క్స్ సర్వీసెస్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్కు భారీ డిమాండ్ నెలకొంది. మరోపక్క ఇదే కాలంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ హెల్త్కేర్ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా కౌంటర్ బలహీనపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈక్లర్క్స్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. అరబిందో అమ్మకాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం.. ఈక్లర్క్స్ సర్వీసెస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఈక్లర్క్స్ సర్వీసెస్ నికర లాభం 30 శాతం ఎగసి రూ. 52 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం తక్కువగా రూ. 348 కోట్లను తాకింది. డాలర్ల రూపేణా ఆదాయం 12 శాతం నీరసించి దాదాపు 45 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో ఈక్లర్క్స్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 104 జమ చేసుకుని రూ. 623 వద్ద ఫ్రీజయ్యింది. అరబిందో ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అరబిందో ఫార్మా నికర లాభం 23 శాతం వృద్ధితో రూ. 781 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 5925 కోట్లను తాకింది. వాటాదారులకు ఒక్కో షేరుకీ రూ. 1.25 డివిడెండ్ను ప్రకటించింది. మొత్తం ఆదాయంలో యూఎస్ వాటా 16 శాతం ఎగసి రూ. 3107 కోట్లను అధిగమించినట్లు కంపెనీ పేర్కొంది. కోవిడ్-19 కాలంలోనూ ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించగలిగినట్లు తెలియజేసింది. అయితే ఎన్ఎస్ఈలో ప్రస్తుతం అరబిందో షేరు 3.2 శాతం క్షీణించి రూ. 904 వద్ద ట్రేడవుతోంది. తొలుత 4.7 శాతం పతనమై రూ. 890 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చేరింది. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఈ కౌంటర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. -
11,300పైకి నిఫ్టీ
ప్రపంచ మార్కెట్ల లాభాల ప్రభావంతో మన మార్కెట్ కూడా మంగళవారం లాభాల్లోనే ముగిసింది. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న రిలయన్స్, హెచ్డీఎఫ్సీ జోడీల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడం కలసివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, డాలర్తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని 74.78కు చేరడం, కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటం... సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 225 పాయింట్లు ఎగసి 38,407 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 11,323 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజూ, నిఫ్టీ ఆరో రోజూ లాభపడ్డాయి. యాక్టివ్ కరోనా కేసులు తగ్గుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిచ్చింది. జోరుగా విదేశీ పెట్టుబడులు...: కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటంతో మన మార్కెట్ దూసుకుపోతోందని నిపుణులంటున్నారు. మరో దఫా కేంద్రం నుంచి ఉద్దీపన చర్యలు ఉండొచ్చన్న అంచనాలు కూడా తోడయ్యాయని వారంటున్నారు. ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటివరకూ మన మార్కెట్లో రూ.10,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. లాభాల్లో ప్రపంచ మార్కెట్లు...! అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఒక అంగీకారం కుదరొచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం తాజాగా చర్చలు మొదలుకావడం, కరోనా వైరస్ కట్టడికి ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా ఒక వ్యాక్సిన్ను అందుబాటులోకి తేవడం సానుకూల ప్రభావం చూపించాయి. ♦ క్యూఐపీ మార్గంలో రూ.10,000 కోట్లు సమీకరించిన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 4 శాతం లాభంతో రూ. 448 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ♦ దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్టాలకు చేరాయి. భారత్ రసాయన్, ఎస్ఆర్ఎప్, టొరెంట్ ఫార్మా జాబితాలో ఉన్నాయి. ♦ దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, రిలయన్స్ ఇన్ఫ్రా, లెమన్ ట్రీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
త్రివేణీ బైబ్యాక్.. కేఈసీ క్యూ1- షేర్లు జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మౌలిక సదుపాయాల కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించింది. మరోపక్క ఇదే కాలంలో షుగర్ తయారీ కంపెనీ త్రివేణీ ఇంజినీరింగ్ సైతం ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించింది. దీంతో ఈ రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. కేఈసీ ఇంటర్నేషనల్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో కేఈసీ ఇంటర్నేషనల్ నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 21 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం తక్కువగా రూ. 2207 కోట్లను తాకింది. కోవిడ్-19 కారణంగా పనితీరు ప్రభావితమైనప్పటికీ పూర్తిఏడాదిలో మెరుగైన ఫలితాలు సాధించగలమని ఆశిస్తున్నట్లు కేఈసీ యాజమాన్యం పేర్కొంది. ఇబిటా 22 శాతం నీరసించి రూ. 251 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో కేఈసీ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం దూసుకెళ్లి రూ. 293 వద్ద ట్రేడవుతోంది. త్రివేణీ ఇంజినీరింగ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో త్రివేణీ ఇంజినీరింగ్ కన్సాలిడేటెడ్ నికర లాభం 146 శాతం దూసుకెళ్లి రూ. 84 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 921 కోట్ల నుంచి రూ. 1222 కోట్లకు జంప్చేసింది. కాగా.. ఒక్కో షేరుకీ రూ. 105 ధర మించకుండా 2.5 శాతం వాటాకు సమానమైన 61.9 లక్షల షేర్లను బైబ్యాక్ చేసేందుకు బోర్డు ఓకే చెప్పినట్లు త్రివేణీ వెల్లడించింది. ఇందుకు దాదాపు రూ. 65 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో త్రివేణీ ఇంజినీరింగ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్చేసి రూ. 77.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 82 వరకూ ఎగసింది. -
టైటన్- శ్రీ సిమెంట్... ఫలితాల దెబ్బ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో టాటా గ్రూప్ కంపెనీ టైటన్ కంపెనీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే కాలంలో పనితీరు నిరాశపరచడంతో శ్రీ సిమెంట్ లిమిటెడ్ కౌంటర్ సైతం బలహీనపడింది. దీంతో రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ నష్టాల బాటలో సాగుతున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. టైటన్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో డైవర్సిఫైడ్ దిగ్గజం టైటన్ రూ. 297 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 364 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 61 శాతం క్షీణించి రూ. 1979 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు రూ. 361 కోట్ల నష్టం నమోదైంది. గత క్యూ1లో ఈ పద్దుకింద రూ. 520 కోట్ల లాభం సాధించింది. ఈ నేపథ్యంలో టైటన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4 శాతం పతనమై రూ. 1063 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1049 దిగువకు చేరింది. శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ప్రయివేట్ రంగ దిగ్గజం శ్రీ సిమెంట్ 14 శాతం తక్కువగా రూ. 330 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 25 శాతం క్షీణించి రూ. 2480 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 12 శాతం వెనకడుగుతో రూ. 443 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో శ్రీ సిమెంట్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం నష్టపోయింది. ప్రస్తుతం రూ. 21,530 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 21,322 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. -
మూడోరోజూ ముందుకే..!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇంజినీరింగ్,ఆర్థిక, ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్ కళకళలాడింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, డాలర్తో రూపాయి మారకం విలువ 3 పైసలు పుంజుకొని 74.90కు చేరడం, ఫార్మా కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించడం.... సానుకూల ప్రభావం చూపించాయి. వరుసగా మూడో రోజూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఇంట్రాడే లాభాలు సగం మేర తగ్గిపోయాయి. ఇంట్రాడేలో 390 పాయింట్ల వరకూ ఎగిసిన సెన్సెక్స్ చివరకు 142 పాయింట్ల లాభంతో 38,182 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 11,270 పాయింట్ల వద్దకు చేరింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ► లార్సెన్ అండ్ టుబ్రో షేర్ 5 శాతం లాభంతో రూ.960 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ఈ జూన్ క్వార్టర్లో నికర లాభం 81 శాతం ఎగియడంతో దివీస్ ల్యాబ్స్ షేర్ 12 శాతం లాభంతో రూ. 3,117 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఆల్టైమ్ హై, రూ.3,228ను తాకింది. ఈ షేర్తో పాటు పలు ఫార్మా షేర్లు కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అరబిందో ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, ఇప్కా ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, టొరెంట్ ఫార్మా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. ఎస్ఆర్ఎఫ్, వీఎస్టీ టిల్లర్స్, వాబ్కో ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగ షేర్లు రయ్..! వందకు పైగా రక్షణ రంగ పరికరాల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రక్షణ రంగ షేర్లు దూసుకుపోయాయి. ఇంట్రాడేలో ఆల్టైమ్ హై, రూ.465ను తాకిన భారత్ డైనమిక్స్ షేర్ చివరకు శాతం లాభంతో రూ.437 వద్ద ముగిసింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ ఫోర్జ్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. -
అఫ్లే అప్పర్ సర్క్యూట్- కుప్పకూలిన కంకార్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మొబైల్ మార్కెటింగ్ కంపెనీ అఫ్లే ఇండియా లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మరోపక్క ఇదే కాలంలో పీఎస్యూ దిగ్గజం కంటెయినర్ కార్పొరేషన్(కంకార్) లిమిటెడ్ నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించింది. దీంతో అఫ్లే ఇండియా కౌంటర్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు క్యూకట్టగా.. కంకార్ కౌంటర్లో భారీ అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి అఫ్లే ఇండియా అప్పర్ సర్క్యూట్ను తాకగా.. నవరత్న కంపెనీ కంకార్ భారీ నష్టాలతో కుప్పకూలింది. వివరాలు చూద్దాం.. అఫ్లే ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అఫ్లే ఇండియా నికర లాభం 42 శాతం పెరిగి రూ. 19 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం బలపడి రూ. 90 కోట్లను తాకింది. ఇబిటా 20 శాతం వృద్ధితో రూ. 22 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో అఫ్లే ఇండియా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం10 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 2026 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. గత 4 నెలల్లో ఈ షేరు 81 శాతం ర్యాలీ చేయడం విశేషం! కంటెయినర్ కార్పొరేషన్ కార్గొ టెర్మినల్స్ నిర్వాహక దిగ్గజం కంటెయినర్ కార్పొరేషన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో 76 శాతం పడిపోయింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 58 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1723 కోట్ల నుంచి రూ. 1252 కోట్లకు క్షీణించింది. ఇబిటా మార్జిన్లు 24.6 శాతం నుంచి 13.4 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో కంకార్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 15 శాతం కుప్పకూలింది. రూ. 387 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 366 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. -
సిప్లా- తేజస్ నెట్వర్క్స్ .. అదుర్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం సిప్లా లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మరోపక్క డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ లిమిటెడ్ నుంచి ఆర్డర్ను పొందినట్లు బ్రాడ్బ్యాండ్ సేవల కంపెనీ తేజస్ నెట్వర్క్స్ వెల్లడించింది. దీంతో రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఫలితంగా భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. సిప్లా లిమిటెడ్ షేరు 52 వారాల గరిష్టానికి చేరగా.. తేజస్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. సిప్లా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సిప్లా నికర లాభం 27 శాతం పెరిగి రూ. 566 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం బలపడి రూ. 4346 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. దేశీ బిజినెస్ 10 శాతం వృద్ధితో రూ. 1608 కోట్లకు చేరినట్లు సిప్లా పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు మరింత అధికంగా 64 శాతం జంప్చేసి రూ. 457 కోట్లను తాకినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సిప్లా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లింది. రూ. 793కు చేరింది. ఇది 52 వారాల గరిష్టం కాగా.. గత 6 నెలల్లో ఈ షేరు 74 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. తేజస్ నెట్వర్క్స్ మౌలిక సదుపాయాల దిగ్గజం ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ నుంచి GPON ఆధారిత ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్రొడక్టుల సరఫరా కోసం ఆర్డర్ లభించినట్లు తేజస్ నెట్వర్క్స్ తాజాగా పేర్కొంది. రూ. 66 కోట్ల విలువైన ఈ ఆర్డర్లో భాగంగా గరిష్ట పనితీరు చూపగల మెట్రో ఇథర్నెట్ స్విచెస్ను సైతం సరఫరా చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో తేజస్ నెట్వర్క్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 64 సమీపంలో ఫ్రీజయ్యింది. -
వహ్వా.. దివీస్ ల్యాబ్- అబాట్ ఇండియా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్, గ్లోబల్ కంపెనీ అబాట్ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. వారాంతాన ఈ రెండు కంపెనీలూ ఫలితాలు విడుదల చేయడంతో నేటి ట్రేడింగ్లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. దివీస్ ల్యాబ్ 15 శాతం అప్పర్ సర్క్యూట్ను సైతం తాకడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబొరేటరీస్ ఎన్ఎస్ఈలో తొలుత దివీస్ ల్యాబ్ షేరు 15 శాతం దూసుకెళ్లింది. రూ. 3,293ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 14 శాతం జంప్చేసి రూ. 3,170 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో దివీస్ ల్యాబ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 81 శాతం దూసుకెళ్లి రూ. 492 కోట్లను తాకింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 272 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు ఎగసింది. ఇది 46 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కాలంలోనూ దాదాపు సాధారణ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ తెలియజేసింది. అబాట్ ఇండియా ఎన్ఎస్ఈలో తొలుత అబాట్ ఇండియా షేరు 7 శాతం దూసుకెళ్లింది. రూ. 17,350 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4.4 శాతం జంప్చేసి రూ. 16,901 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అబాట్ ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. నికర లాభం 54 శాతం జంప్చేసి రూ. 180 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ1లో ఆర్జన రూ. 117 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం సైతం రూ. 999 కోట్ల నుంచి రూ. 1064 కోట్లకు పెరిగింది. -
దివీస్ ల్యాబ్- అబాట్ ఇండియా- క్యూ1 భళా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్, గ్లోబల్ కంపెనీ అబాట్ ఇండియా ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. ఈ రెండు కంపెనీల ఫలితాలు తాజాగా వెల్లడికావడంతో సోమవారం ట్రేడింగ్లో అటు దివీస్ ల్యాబ్, ఇటు అబాట్ ఇండియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇతర వివరాలు చూద్దాం.. దివీస్ ల్యాబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో దివీస్ ల్యాబ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం దాదాపు 81 శాతం దూసుకెళ్లి రూ. 492 కోట్లను తాకింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 272 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1193 కోట్ల నుంచి రూ. 1748 కోట్లకు ఎగసింది. ఇది 46 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కాలంలోనూ దాదాపు సాధారణ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ తెలియజేసింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్ షేరు 2.3 శాతం బలపడి రూ. 2800 వద్ద ముగిసింది. అబాట్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అబాట్ ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. నికర లాభం 54 శాతం జంప్చేసి రూ. 180 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ1లో ఆర్జన రూ. 117 కోట్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం ఆదాయం సైతం రూ. 999 కోట్ల నుంచి రూ. 1064 కోట్లకు పెరిగింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో అబాట్ ఇండియా షేరు స్వల్పంగా 0.6 శాతం లాభపడి రూ. 16,254 వద్ద ముగిసింది. -
బేయర్ క్రాప్సైన్స్ -టొరంట్.. లాభాల పవర్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో సస్య రక్షణ రంగ దిగ్గజం బేయర్ క్రాప్సైన్స్ కౌంటర్కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఇదే కాలం(ఏప్రిల్-జూన్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ కంపెనీ టొరంట్ పవర్కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. బేయర్ క్రాప్సైన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బేయర్ క్రాప్సైన్స్ నికర లాభం 86 శాతం ఎగసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 252 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 29 శాతం పుంజుకుని రూ. 1,228 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బేయర్ క్రాప్సైన్స్ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 6,174 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతం దూసుకెళ్లి రూ. 6,450కు చేరింది. వెరసి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది! టొరంట్ పవర్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో టొరంట్ పవర్ రూ. 373 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది35 శాతం వృద్ధికాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 19 శాతం నీరసించి రూ. 3,042 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో టొరంట్ పవర్ షేరు 5.2 శాతం జంప్చేసి రూ. 345 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 358 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! -
లుపిన్- దీపక్ నైట్రైట్- క్యూ1 షాక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో హెల్త్కేర్ రంగ దిగ్గజం లుపిన్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే కాలం(ఏప్రిల్-జూన్)లో ఫలితాలు నిరాశ పరచడంతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ దీపక్ నైట్రైట్ కౌంటర్ సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం.. లుపిన్ లిమిటెడ్ ఫార్మా రంగ దిగ్గజం లుపిన్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 107 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది 60 శాతం క్షీణతకాగా.. మొత్తం ఆదాయం సైతం 9 శాతం తక్కువగా రూ. 3878 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో లుపిన్ షేరు 6 శాతం కుప్పకూలి రూ. 882 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 874 వరకూ జారింది. దీపక్ నైట్రైట్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో కెమికల్స్ రంగ కంపెనీ దీపక్ నైట్రైట్ రూ. 64 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1తో పోలిస్తే ఇది 41 శాతం క్షీణతకాగా.. నిర్వహణ లాభం సైతం 45 శాతం తక్కువగా రూ. 102 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో దీపక్ నైట్రైట్ షేరు 5 శాతం పతనమై రూ. 612 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 581 వరకూ తిరోగమించింది. -
వొడా ఐడియా నష్టాలు రూ. 25,460 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం తొలి త్రైమాసికంలో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 25,460 కోట్ల నష్టం ప్రకటించింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలు రూ. 4,874 కోట్లు. మరోవైపు, తాజా క్యూ1లో ఆదాయం రూ. 11,270 కోట్ల నుంచి రూ. 10,659 కోట్లకు క్షీణించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)పరంగా ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలకు సంబంధించి జూన్ క్వార్టర్లో రూ. 19,440 కోట్లు అదనంగా కేటాయించాల్సి వచ్చిందని వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. ‘ తొలి త్రైమాసికంలో లాక్డౌన్ వల్ల స్టోర్లు మూతబడి రీచార్జి సదుపాయాలు లేకుండా పోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావిత కస్టమర్లు రీచార్జి చేసుకోలేకపోవడం తదితర అంశాల కారణంగా క్యూ1 చాలా గడ్డుకాలంగా గడిచింది‘ అని సంస్థ ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. -
బిర్లాసాఫ్ట్- హింద్ జింక్.. రికార్డ్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఐటీ సేవల రంగ కంపెనీ బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇక మరోపక్క విదేశీ రీసెర్చ్ సంస్థ సిటీ బయ్ రేటింగ్ ప్రకటించిన నేపథ్యంలో మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ కౌంటర్కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ దాదాపు రూ. 56 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 35 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 18 శాతం పెరిగి రూ. 915 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత బిర్లాసాఫ్ట్ షేరు 18 శాతం దూసుకెళ్లి రూ. 149ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 16 శాతం జంప్చేసి రూ. 145 వద్ద ట్రేడవుతోంది. హిందుస్తాన్ జింక్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ హిందుస్తాన్ జింక్ కౌంటర్కు విదేశీ దిగ్గజం సిటీ బయ్ రేటింగ్ను ప్రకటించింది. టార్గెట్ ధరను సైతం గతంలో ఇచ్చిన రూ. 205 నుంచి రూ. 240కు పెంచింది. రానున్న రెండేళ్లలో ఈ షేరు 8 శాతం డివిడెండ్ ఈల్డ్ను అందించగలదని సిటీ తాజాగా అంచనా వేసింది. దీనికితోడు ఎల్ఎంఈలో జింక్, సిల్వర్ ధరలు బలపడుతుండటం కంపెనీకి లబ్దిని చేకూర్చగలదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత హిందుస్తాన్ జింక్ షేరు 7 శాతం జంప్చేసి రూ. 236ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.3 శాతం లాభంతో రూ. 230 వద్ద ట్రేడవుతోంది. -
స్పార్క్- పీఐ ఇండస్ట్రీస్.. లాభాల స్పార్క్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో టర్న్ అరౌండ్ ఫలితాలు సాధించడంతో హెల్త్కేర్ రంగ సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ (స్పార్క్) కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇదే కాలంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆగ్రి కెమికల్స్ కంపెనీ పీఐ ఇండస్ట్రీస్ కౌంటర్కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. సన్ ఫార్మా అడ్వాన్స్డ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో సన్ ఫార్మా అడ్వాన్స్డ్ దాదాపు రూ. 57 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 94 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 971 శాతం జంప్చేసి రూ. 185 కోట్లను తాకింది. ఈ కాలంలో గత నష్టాల నుంచి బయటపడుతూ రూ. 61 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఇబిటా మార్జిన్లు 5.8 శాతం ఎగసి 32.8 శాతానికి మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత స్పార్క్ షేరు 14 శాతం దూసుకెళ్లి రూ. 200కు చేరింది. ప్రస్తుతం 8.3 శాతం జంప్చేసి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. పీఐ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో పీఐ ఇండస్ట్రీస్ నికర లాభం 43 శాతం వృద్ధితో రూ. 146 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 41 శాతం పెరిగి రూ. 1060 కోట్లకు చేరింది. ఇబిటా 55 శాతం అధికంగా రూ. 236 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో తొలుత పీఐ ఇండస్ట్రీస్ షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 1,960కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3.5 శాతం జంప్చేసి రూ. 1,900 వద్ద ట్రేడవుతోంది. -
వీఎస్టీ ఇండస్ట్రీస్- కేపీఐటీ.. అదుర్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన నేపథ్యంలో పొగాకు ఉత్పత్తుల దిగ్గజం వీఎస్టీ ఇండస్ట్రీస్, ఐటీ సేవల కంపెనీ కేపీఐటీ టెక్నాలజీస్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్-19 కట్టడికి లాక్డవున్ల అమలు కాలంలోనూ ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. వీఎస్టీ ఇండస్ట్రీస్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో వీఎస్టీ ఇండస్ట్రీస్ నామమాత్ర వృద్ధితో దాదాపు రూ. 76 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు మాత్రం 19 శాతం క్షీణించి రూ. 245 కోట్లకు పరిమితమయ్యాయి. లాక్డవున్ నేపథ్యంలో సప్లై చైన్ అవాంతరాలు, వినియోగ డిమాండ్ నీరసించడం వంటి అంశాలు పనితీరును ప్రభావితం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం తయారీ కార్యకలాపాలు ఊపందుకున్నప్పటికీ అమ్మకాలపై కోవిడ్-19 ప్రభావం ఉండవచ్చని భావిస్తోంది. కాగా.. ఎన్ఎస్ఈలో తొలుత వీఎస్టీ ఇండస్ట్రీస్ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 3,650కు చేరింది. ప్రస్తుతం 8.2 శాతం జంప్చేసి రూ. 3,500 వద్ద ట్రేడవుతోంది. కేపీఐటీ టెక్నాలజీస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కేపీఐటీ టెక్నాలజీస్ నికర లాభం 36 శాతంపైగా క్షీణించింది. రూ. 24 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం వెనకడుగుతో రూ. 493 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 1.2 శాతం తక్కువగా 13.4 శాతంగా నమోదయ్యాయి. కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 432 కోట్లను తాకినట్లు కేపీఐటీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేపీఐటీ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 68 సమీపంలో ఫ్రీజయ్యింది. -
అంచనాలను మించిన ఎస్బీఐ క్యూ1 ఫలితాలు
ప్రభుత్వరంగ బ్యాంక్ దిగ్గజం ఎస్బీఐ శుక్రవారం వెల్లడించిన క్యూ1 ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించాయి. బ్యాంక్ నికరలాభం జోరుగా పెరిగి రూ.4189 కోట్లకు చేరింది. ఈ లాభంలో అనుబంధ కంపెనీ వాటా విక్రయం ద్వారా ఒనకూడిన రూ.1500 కోట్లు కలిసి ఉన్నాయి. మార్కెట్ నికర లాభపు అంచనాలు రూ.3200 కోట్లుకాగా, భారీ స్థాయిలో ఈ అంచనాలను ఎస్బీఐ అధిగమించడం విశేషం. అలాగే బ్యాంక్ తాజా మొండిబకాయిలు ఎన్పీఏలు, కేటాయింపులు వంటి అంశాలన్నింటిలోనూ మెరుగైన పనితీరు కనబరిచింది. జూన్ క్వార్టర్లో బ్యాంక్ మొండి బకాయిల కేటాయింపులు రూ.11వేల కోట్ల నుంచి రూ.8వేల కోట్లకు తగ్గాయి. అలాగే బ్యాంక్ తాజా మొండిబకాయిలు రూ.8101 కోట్ల నుంచి రూ.3008 కోట్లకు తగ్గాయి. స్థూల ఎన్పీలు 6.44శాతం నుంచి 5.శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు కూడా 2.33శాతం నుంచి 1.86శాతానికి తగ్గాయి. బ్యాంక్ ప్రోవిజన్ కవరేజ్ రేషియో 86శాతానికి చేరడం విశేషం. మధ్యాహ్నం 2గంటల సమయంలో బ్యాంక్ ఫలితాల వెల్లడించిన సందర్భంగా షేరు ధర 4శాతం పెరిగి రూ.195 స్థాయికి అటుఇటూ కదులుతుంది. -
జైడస్ వెల్నెస్- ఇప్కా ల్యాబ్స్ భలే జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హెల్త్కేర్ రంగ కంపెనీ జైడస్ వెల్నెస్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో బీమా రంగ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో వాటాలను పెంచుకున్న వార్తలతో ఫార్మా రంగ దిగ్గజం ఇప్కా ల్యాబ్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జైడస్ వెల్నెస్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో జైడస్ వెల్నెస్ నికర లాభం 11 శాతం పెరిగి రూ. 89 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 13 శాతం క్షీణించి రూ. 537 కోట్లకు చేరింది. ఇబిటా దాదాపు యథాతథంగా రూ. 122 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో జైడస్ వెల్నెస్ షేరు 5 శాతం జంప్చేసి రూ. 1640 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1690 వరకూ ఎగసింది. ఇప్కా ల్యాబ్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బీమా రంగ కంపెనీల వాటా ఇప్కా ల్యాబ్స్లో 2.22 శాతం నుంచి 4.23 శాతానికి పెరిగింది. కంపెనీలో హెచ్డీఎఫ్సీ లైఫ్కు 1.82 శాతం, ఎస్బీఐ లైఫ్కు 1.1 శాతం వాటా ఉంది. ఈ బాటలో ఎంఎఫ్లు యాక్సిస్ ట్రస్టీ మిడ్ క్యాప్ ఫండ్ 1.68 శాతం నుంచి 1.9 శాతానికి, ఎల్అండ్టీ ట్రస్టీ మిడ్క్యాప్ ఫండ్ 2.74 శాతం నుంచి 3.34 శాతానికి ఇప్కా ల్యాబ్స్లో వాటా పెంచుకున్నాయి. ఈ నేపథ్యలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇప్కా ల్యాబ్స్ షేరు 8 శాతం దూసుకెళ్లి రూ. 188 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1902 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! -
ఎస్సెల్ ప్రొప్యాక్- టొరంట్ ఫార్మా యమస్పీడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో హెల్త్కేర్ రంగ కంపెనీ టొరంట్ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ప్యాకేజింగ్ దిగ్గజం ఎస్సెల్ ప్రొప్యాక్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎస్సెల్ ప్రొప్యాక్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఎస్సెల్ ప్రొప్యాక్ నికర లాభం 14 శాతం పెరిగి రూ. 46 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 18 శాతం పుంజుకుని రూ. 741 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్సెల్ ప్రొప్యాక్ షేరు 14.5 శాతం దూసుకెళ్లి రూ. 235 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 243 వరకూ ఎగసింది. జూన్ చివరికల్లా కంపెనీ ఆర్వోసీఈ 4.2 శాతం బలపడి 19.9 శాతానికి ఎగసినట్లు ఎడిల్వీజ్ సెక్యూరిటీస్ పేర్కొంది. టొరంట్ ఫార్మాస్యూటికల్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో టొరంట్ ఫార్మా నికర లాభం 49 శాతం జంప్చేసి రూ. 321 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 2060 కోట్లకు చేరింది. దీనిలో దేశీ ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 925 కోట్లకు చేరింది. అయితే యూఎస్ ఆదాయం 1 శాతం క్షీణతతో రూ. 373 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో టొరంట్ ఫార్మా షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 2673 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2681 వరకూ ఎగసింది. -
హెచ్డీఎఫ్సీ నికరలాభం 5శాతం డౌన్
దేశీయ అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ గురువారం తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. కన్సాలిడేటేడ్ నికరలాభం జూన్ కార్వర్ట్లో 15శాతం పెరిగింది.కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం రూ.23,239 కోట్ల నుంచి రూ.29,959 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం 5శాతం క్షీణించి రూ.3052 కోట్లుగా నమోదయ్యాయి. స్టాండ్లోన్ ఆదాయం రూ.12,990 నుంచి రూ.13,017 కోట్లకు పెరిగింది. ఇదే క్యూ1లో నికర వడ్డీ మార్జిన్ 3.3శాతం నుంచి 3.1శాతానికి తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో కోవిడ్-19 సంబంధిత కేటాయింపులు రూ.1199 కోట్ల మేరకు జరిపినట్లు కంపెనీ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,079 కోట్ల నుంచి 10శాతం పెరిగి రూ.3,392 కోట్లకు చేరింది. వ్యక్తిగత రుణఖాతాదారుల్లో 2శాతం మంది, కార్పోరేట్ రుణగ్రస్తుల్లో 2శాతం కంపెనీలు మారిటోరియంను వినియోగించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు శుక్రవారం నష్టంతో 3.50శాతం రూ.1811 వద్ద ముగిసింది. -
మాస్టెక్ జూమ్- ఎస్ఐఎస్ ఇండియా బోర్లా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో సాఫ్ట్వేర్ సేవల రంగ కంపెనీ మాస్టెక్ లిమిటెడ్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇండియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఆటుపోట్ల మార్కెట్లో మాస్టెక్ లాభాలతో జోరు చూపుతుంటే.. ఎస్ఐఎస్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. మాస్టెక్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో మాస్టెక్ నికర లాభం 20 శాతం పెరిగి రూ. 46.5 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 15 శాతం పుంజుకుని రూ. 386 కోట్లను అధిగమించింది. ఇక త్రైమాసిక ప్రాతిపదికన నిర్వహణ లాభం 12 బలపడి రూ. 85 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు యథాతథంగా 21.1 శాతంగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో మాస్టెక్ షేరు 5.3 శాతం జంప్చేసి రూ. 523 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 558 వరకూ ఎగసింది. ఎస్ఐఎస్ ఇండియా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఎస్ఐఎస్ ఇండియా నికర లాభం 24 శాతం క్షీణించి రూ. 57 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం పుంజుకుని రూ. 2167 కోట్లను తాకింది. ఇబిటా 3 శాతం తక్కువగా రూ. 121 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్ఐఎస్ షేరు 4.4 శాతం పతనమై రూ. 344 వద్ద ట్రేడవుతోంది. -
డాక్టర్ రెడ్డీస్- సాగర్ సిమెంట్స్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాల కారణంగా ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్ వరుసగా రెండో రోజు దూకుడు చూపుతోంది. మరోపక్క ఇదే సమయంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సాగర్ సిమెంట్స్ కౌంటర్కు సైతం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కోవిడ్-19 నేపథ్యంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో వరుసగా రెండో రోజు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కౌంటర్ జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.2 శాతం జంప్చేసి రూ. 4481 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4495 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. బుధవారం సైతం ఈ షేరు 6.3 శాతం దూసుకెళ్లిన విషయం విదితమే. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కంపెనీ నికర లాభం దాదాపు 13 శాతం క్షీణించి రూ. 579 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 4417 కోట్లను అధిగమించింది. స్థూల మార్జిన్లు 4.3 శాతం పెరిగి 56 శాతానికి చేరాయి. సమస్యాత్మక వాతావరణంలోనూ సానుకూల పనితీరు చూపగలిగినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కోచైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. పలు విభాగాలలో పటిష్ట పనితీరు చూపినట్లు తెలియజేశారు. దేశీ ఫార్మా కంపెనీ వొకార్డ్ నుంచి సొంతం చేసుకున్న ఫార్మా బిజినెస్ను కంపెనీలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రసాద్ తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం కోవిడ్-19 చికిత్సకు వీలుగా రెండు లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తద్వారా పలు మార్కెట్లలో కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ఔషధాలను అందించనున్నట్లు వివరించారు. సాగర్ సిమెంట్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో దక్షిణాది సంస్థ సాగర్ సిమెంట్స్ నికర లాభం 22 శాతం బలపడి రూ. 36 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 23 శాతం క్షీణించి రూ. 264 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 2.5 డివిడెండ్ను ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో సాగర్ సిమెంట్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 12 శాతం దూసుకెళ్లి రూ. 521 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 528 వరకూ ఎగసింది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్ 50 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! నేటి ట్రేడింగ్లో తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో 12,000 షేర్లు చేతులు మారాయి. గత ఐదు రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,500 షేర్లు మాత్రమే. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 579 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 13 శాతం క్షీణించి రూ. 579 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నికర లాభం రూ. 663 కోట్లు. ఇక ఆదాయం 15 శాతం పెరిగి రూ. 3,843 కోట్ల నుంచి రూ. 4,417 కోట్లకు చేరింది. డీఆర్ఎల్ సీఎఫ్వో సౌమేన్ చక్రవర్తి బుధవారం ఈ విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలోనూ కార్యకలాపాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఉత్పాదకతను పెంచుకునే చర్యలు కొనసాగించడం మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. క్యూ1లో అన్ని అంశాల్లోనూ ఆర్థికంగా పటిష్టమైన పనితీరు కనపర్చగలిగామని డీఆర్ఎల్ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వోక్హార్డ్ నుంచి కొనుగోలు చేసిన వ్యాపారాన్ని డీఆర్ఎల్ వ్యవస్థకు అనుసంధానించే ప్రక్రియ ప్రారంభించినట్లు వివరించారు. ఆగస్టులో రెండు కోవిడ్ ఔషధాలు.. కోవిడ్–19 వ్యాధి చికిత్సలో ఉపయోగించే రెండు యాంటీ వైరల్ ఔషధాలు.. రెమిడెసివిర్, ఫావిపిరావిర్ను ఆగస్టులో ప్రవేశపెట్టేందు కు సన్నాహాలు చేస్తున్నట్లు చక్రవర్తి తెలిపారు. రెమ్డిసివిర్ను వర్ధమా న, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ పేర్కొన్నారు. భారత్ సహా 127 దేశాల్లో రెమ్డిసివిర్ విక్రయానికి సంబంధించి అమెరికన్ సంస్థ గిలీడ్ సైన్సెస్తో డీఆర్ఎల్కు ఒప్పందం ఉంది. అలాగే, అవిగాన్ ట్యాబ్లెట్స్ (ఫావిపిరావిర్) విక్రయానికి సంబంధించి జపాన్కు చెందిన ఫ్యూజి ఫిల్మ్ కార్పొరేషన్తో ఒప్పందం ఉంది. గ్లోబల్ జనరిక్స్కు యూరప్ ఊతం.. యూరప్, వర్ధమాన మార్కెట్ల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు ఆరు శాతం పెరిగి రూ. 3,507 కోట్లకు చేరింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో పాటు అమ్మకాలు పెరగడంతో యూరప్లో ఆదాయం 48 శాతం ఎగిసింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం ఆరు శాతం పెరిగింది. కొత్త ఉత్పత్తులు, సానుకూల ఫారెక్స్ రేటు ఇందుకు తోడ్పడ్డాయని కంపెనీ తెలిపింది. క్యూ1లో ఉత్తర అమెరికా మార్కెట్లో ఆరు కొత్త ఔషధాలు ప్రవేశపెట్టినట్లు వివరించింది. భారత మార్కెట్లో మాత్రం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10 శాతం, సీక్వెన్షియల్గా 8 శాతం క్షీణించింది. కరోనా వైరస్ పరిణామాలతో అమ్మకాలు క్షీణించడమే ఇందుకు కారణం. తొలి త్రైమాసికంలో దేశీ మార్కెట్లో డీఆర్ఎల్ నాలుగు కొత్త బ్రాండ్స్ను ప్రవేశపెట్టింది. పీఎస్ఏఐకి కొత్త ఉత్పత్తుల తోడ్పాటు ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్ఏఐ) విభాగం ఆదాయాలు వార్షికంగా 88 శాతం, సీక్వెన్షియల్గా 19 శాతం పెరిగాయి. కొన్ని ఉత్పత్తుల విక్రయాలు భారీగా పెరగడం, కొత్త ఉత్పత్తుల అమ్మకాలు, సానుకూల ఫారెక్స్ రేటు ఇందుకు తోడ్పడ్డాయి. సమీక్షాకాలంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై కంపెనీ రూ. 400 కోట్లు వెచ్చించింది. ప్రధానంగా సంక్లిష్టమైన జనరిక్స్, బయో–సిమిలర్స్ తదితర ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి పెడుతోంది. కోవిడ్–19 చికిత్స సంబంధ ఔషధాల అభివృద్ధి ప్రాజెక్టులపైనా కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
కరోనా కష్టాలు : మారుతికి నష్టాలు
సాక్షి, ముంబై : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) కరోనా , లాక్డౌన్ సంక్షోభంతో భారీ నష్టాలను నమోదు చేసింది. జూన్ 30తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 249.4 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 1,435.5 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయం 79 శాతం క్షీణించి, 4,106.5 కోట్లకు చేరుకోగా, 2019 జూన్లో 19,720 కోట్ల రూపాయల ఆధాయాన్ని సాధించామని బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎంఎస్ఐ తెలిపింది. జూన్ త్రైమాసికం అపూర్వమైందనీ, మొత్తం త్రైమాసికంలో ఉత్పత్తి కేవలం రెండు వారాల పనికి సమానమని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. అయితే ఎనలిస్టుల అంచనాలను అధిగమించింది. మారుతి నికర అమ్మకాలు రూ .3,677.5 కోట్లకు తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .18,735.2 కోట్లు. మొదటి త్రైమాసికంలో మొత్తం 76,599 వాహనాలను విక్రయించగా, దేశీయ మార్కెట్లో అమ్మకాలు 67,027 యూనిట్లు, ఎగుమతులు 9,572 యూనిట్లు. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 4,02,594 యూనిట్లను విక్రయించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఇది కంపెనీ చరిత్రలో ఇదొక అసాధారణమైన త్రైమాసికమని కంపెనీ పేర్కొంది. లాక్డౌన్ నిబంధనల కారణంగా అమ్మకాలు, ఉత్పత్తి నిలిచిపోయాయని తెలిపింది. మే నెల చివరిలో మాత్రమే చిన్నగా కార్యకలాపాలను ప్రారంభిచినట్టు తెలిపింది. ముఖ్యంగా వినియోగదారులు, సప్లయ్ చెయిన్ అంతటా ఉద్యోగులు, ఇతరుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్టు వెల్లడించింది. మొత్తం త్రైమాసికం కేవలం రెండు వారాల రెగ్యులర్ పనికి సమానమనీ ప్రస్తుత త్రైమాసిక ఫలితాలను ఈ కోణంలో చూడాలని కంపెనీ తెలిపింది. కాగా ఒక దశాబ్దం తరువాత నష్టాలను నమోదు చేయడం ఇదే మొదటిసారి. దీంతో మారుతి సుజుకి దాదాపు 2 శాతం నష్టంతో కొనసాగుతోంది. -
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లాభం రూ. 579 కోట్లు
ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం దాదాపు 13 శాతం క్షీణించి రూ. 579 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 15 శాతం పుంజుకుని రూ. 4417 కోట్లను అధిగమించింది. సమస్యాత్మక వాతావరణంలోనూ సానుకూల పనితీరు చూపగలిగినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కోచైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. పలు విభాగాలలో పటిష్ట పనితీరు చూపినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ షేరు ఎన్ఎస్ఈలో 3.5 శాతం జంప్చేసి రూ. 4189 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో గరిష్టంగా రూ. 4209ను అధిగమించింది. వొకార్డ్ బిజినెస్పై దేశీ ఫార్మా కంపెనీ వొకార్డ్ నుంచి సొంతం చేసుకున్న ఫార్మా బిజినెస్ను కంపెనీలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రసాద్ తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం కోవిడ్-19 చికిత్సకు వీలుగా రెండు లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. తద్వారా పలు మార్కెట్లలో కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ఔషధాలను అందించనున్నట్లు వివరించారు. -
టాటా కాఫీ- ఇండస్ఇండ్.. అదరహో!
విదేశీ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. మరోవైపు ఇదే కాలంలో పటిష్ట పనితీరు చూపడంతో పానీయాల దిగ్గజం టాటా కాఫీ కౌంటర్కు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాండెలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం 68 శాతం క్షీణించింది రూ. 461 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 8681 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 72 శాతం పడిపోయి రూ. 602 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు 2.45 శాతం నుంచి 2.53 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.23 శాతం నుంచి 0.86 శాతానికి తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.2 శాతం జంప్చేసి రూ. 549 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 565 వరకూ ఎగసింది. టాటా కాఫీ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన టాటా కాఫీ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 36 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 26 శాతం పుంజుకుని రూ. 588 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం 65 శాతం వృద్ధితో రూ. 79 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో టాటా కాఫీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11.5 శాతం దూసుకెళ్లి రూ. 93 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 97 వరకూ ఎగసింది. -
టెక్ మహీంద్రా- ఎంఅండ్ఎం ఫైనాన్స్ స్పీడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో సాధించిన ప్రోత్సాహకర ఫలితాలు ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా కౌంటర్కు డిమాండ్ను పెంచాయి. మరోపక్క రైట్స్ ఇష్యూ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టెక్ మహీంద్రా లిమిటెడ్ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం అధికంగా రూ. 972 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ బాటలో త్రైమాసిక ప్రాతిపదికన పన్నుకు ముందు లాభం 33 శాతం వృద్ధి చూపి రూ. 1283 కోట్లను తాకింది. నిర్వహణ లాభ మార్జిన్లు స్వల్పంగా బలపడి 14.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు తొలుత ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్చేసి రూ. 703కు చేరింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 685 వద్ద ట్రేడవుతోంది. తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో 11.3 మిలియన్ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో చేతులు మారడం గమనార్హం! ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 3089 కోట్ల సమీకరణకు నేటి నుంచి రైట్స్ ఇష్యూ చేపట్టిన నేపథ్యంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్చేసి రూ. 135 వద్ద ట్రేడవుతోంది. రైట్స్లో భాగంగా రూ. 2 ముఖ విలువగల 61.78 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వాటాదారుల వద్ద గల ప్రతీ 1 షేరుకీ మరొక షేరుని కేటాయించనుంది. ఆగస్ట్ 11న ముగియనున్న రైట్స్ ఇష్యూకి రూ. 50 ధరను నిర్ణయించిన విషయం విదితమే. -
ఐసీఐసీఐ -యస్ బ్యాంక్ షేర్ల పతనం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.5 శాతం పతనమై రూ. 361 దిగువన ట్రేడవుతోంది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఐసీఐసీఐ నికర లాభం 36 శాతం పెరిగి రూ. 2599 కోట్లను అధిగమించింది. ప్రధానంగా జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థల పనితీరు ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 సంబంధ ప్రొవిజన్లు రూ. 5,550 కోట్లు అదనంగా నమోదుకావడం ప్రతికూల అంశమని తెలియజేశారు. క్యూ1లో నికర వడ్డీ ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9280 కోట్లను తాకింది. యస్ బ్యాంక్ ఈ నెల 15-17 మధ్య ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీవో) చేపట్టిన ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో 10 శాతం డౌన్ సర్క్యూట్ను తాకింది. రూ. 12.30 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా ఎఫ్పీవో ధర రూ. 12 సమీపానికి చేరింది. కాగా.. ఎఫ్పీవో ద్వారా బ్యాంకు రూ. 14,272 కోట్లను సమీకరించింది. ఎఫ్పీవోలో భాగంగా బ్యాంక్ షేర్ల అలాట్మెంట్ను పూర్తిచేయడంతో ఇవి ట్రేడింగ్కు అందుబాటులోకి వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కౌంటర్లో సుమారు 4.2 కోట్ల షేర్ల సెల్ ఆర్డర్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ఎఫ్పీవోకు రూ. 12 ధరను ఖరారు చేశాక యస్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. వెరసి వారాంతానికల్లా యస్ బ్యాంక్ షేరు 55 శాతం దిగజారినట్లు వివరించారు. -
వహ్వా.. పెర్సిస్టెంట్ సిస్టమ్స్- ఆర్తి డ్రగ్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఆటుపోట్ల మార్కెట్లోనూ రెండు మిడ్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఓవైపు ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్, మరోపక్క ఫార్మా రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్ కౌంటర్ జోరందుకున్నాయి. భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ నికర లాభం 7.4 శాతం పెరిగి రూ. 90 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 6 శాతం బలపడి రూ. 1013 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన నిర్వహణ లాభం 15 శాతం పుంజుకుని రూ. 115 కోట్లకు చేరగా.. మార్జిన్లు 14.7 శాతంగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 857 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 919 వరకూ జంప్చేసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! ఆర్తి డ్రగ్స్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఆర్తి డ్రగ్స్ నికర లాభం 281 శాతం జంప్చేసి రూ. 85 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 35 శాతం పెరిగి రూ. 546 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే నికర లాభం 45 శాతం పుంజుకోగా.. ఆదాయం 21 శాతం బలపడింది. ఈ నేపథ్యంలో ఆర్తి డ్రగ్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 1766 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1805 వరకూ జంప్చేసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! -
ఆకర్షణీయంగా ఐసీఐసీఐ బ్యాంకు ఫలితాలు
ముంబై: ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు జూన్ త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు చేసినప్పటికీ.. బ్యాంకు కన్సాలిడేటెడ్ లాభం 24 శాతం వృద్ధి చెంది రూ.3,118 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా కరోనా కారణంగా చెల్లింపులు రాకపోవచ్చన్న అంచనాలతోనే రూ.5,550 కోట్లను పక్కన పెట్టింది (ప్రొవిజనింగ్). స్టాండలోన్గా చూసుకుంటే (అనుబంధ కంపెనీలను మినహాయించి) బ్యాంకు లాభం 36 శాతం వృద్ధితో రూ.2,599 కోట్లుగా నమోదైంది. లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో స్వల్ప వాటాలను విక్రయించడం లాభాల వృద్ధికి దోహదపడింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 10 శాతానికి పైగా పెరిగి రూ.37,939 కోట్లుగా నమోదైంది. మారటోరియం వినియోగించుకున్న రుణ గ్రహీతల శాతం ఏప్రిల్ చివరికి 30 శాతంగా ఉంటే, జూన్ ఆఖరుకు 17.5 శాతానికి తగ్గింది. -
కరోనా : ఐటీసీ లాభాలు 25 శాతం ఢమాల్
సాక్షి,ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం మధ్య ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ జూన్ త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదుచేసింది. జూలై 24 తో ముగిసిన తొలి త్రైమాసికంలో పన్నుల తర్వాత ఏకీకృత లాభంలో 25 శాతం క్షీణించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సాధించిన 3,437 కోట్ల రూపాయల లాభంతో పోలిస్తే 2,567 కోట్లను సాధించింది. ఏకీకృత ఆదాయం 2020 10,478.46 కోట్లుగా ఉందని ఐటీసీ లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపిందిఅంతకుముందు ఏడాది కాలంలో 12,657.90 కోట్ల రూపాయలతో పోలిస్తే ఆదాయం 17 శాతం తగ్గింది. సిగరెట్ల వ్యాపారంఈ త్రైమాసికంలో 4,330.05 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది, ఏడాది క్రితం ఇది 6,141.92 కోట్ల రూపాయలు. అలాగేఅంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో 411.60 కోట్లు సాధించిన హోటళ్ల వ్యాపార ఆదాయం 4.92 కోట్లకు పడిపోయింది. ఇతర ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఆదాయం 3,378.84 కోట్లుగా ఉండగా, ఏడాది క్రితం 3,068.07 కోట్లుగా ఉంది. మరోవైపు, ఈ త్రైమాసికంలో వ్యవసాయ వ్యాపారం లాభపడిందని ఐటీసీ ప్రకటించింది. ఏడాది క్రితం 3,622.40 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 3,764.56 కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపింది. -
ఎంఫసిస్- పీఎన్సీ ఇన్ఫ్రా.. ధూమ్ధామ్
మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎంఫసిస్ లిమిటెడ్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు రెండు ఈపీసీ ప్రాజెక్టులను గెలుచుకున్నట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎంఫసిస్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎంఫసిస్ నికర లాభం 3 శాతం పెరిగి రూ. 275 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 11 శాతం వృద్ధితో రూ. 2,288 కోట్లను తాకింది. విదేశీ మార్కెట్ల నుంచి క్యూ1లో 25.9 కోట్ల డాలర్ల(రూ. 1940 కోట్లు) విలువైన కాంట్రాక్టులను పొందినట్లు కంపెనీ తెలియజేసింది. దీనికితోడు జులైలో తాజాగా 21.6 కోట్ల కొత్త డీల్స్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎంఫసిస్ షేరు 11.4 శాతం దూసుకెళ్లి రూ. 1091 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1098 వరకూ ఎగసింది. గత మూడు నెలల్లో ఈ షేరు 55 శాతం ర్యాలీ చేయడం విశేషం! పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) నుంచి రెండు ఈపీసీ ప్రాజెక్టులను పొందినట్లు పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ తాజాగా పేర్కొంది. భారత్మాల పరియోజనలో భాగంగా వీటి సంయుక్త విలువ రూ. 1548 కోట్లుకాగా.. రెండేళ్లలోగా పూర్తిచేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. గుజరాత్లోని పంచ్మహల్ జిల్లాతోపాటు.. వడోదర జిల్లాలోనూ 8 లైన్ల ఎక్స్ప్రెస్వే నిర్మాణానికిగాను లభించిన ఈ ఆర్డర్ల విలువను రూ. 758.5 కోట్లు, రూ. 789.5 కోట్లుగా వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ షేరు 6 శాతం జంప్చేసి రూ. 149 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 152ను సైతం అధిగమించింది. -
61% పడిపోయిన బజాజ్ ఆటో లాభం
న్యూఢిల్లీ: లాక్డౌన్ ప్రభావం బజాజ్ ఆటో కంపెనీపై గట్టిగానే పడింది. జూన్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.395 కోట్లు.. ఆదాయం రూ.3,079 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే లాభం, ఆదాయం 61 శాతం మేర తగ్గిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.1,012 కోట్ల లాభం, రూ.7,776 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. స్టాండలోన్ లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,126 కోట్ల నుంచి రూ.528 కోట్లకు తగ్గిపోయింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ 4,43,103 వాహనాలను విక్రయించింది. ఇందులో 2,51,000 యూనిట్లు (విలువ పరంగా రూ.1,651 కోట్లు) ఎగుమతి చేసినవే. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 12,47,174 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘కరోనా మహమ్మారి కారణంగా మొదటి త్రైమాసికం పూర్తిగా సవాళ్లతో కొనసాగింది. లాక్డౌన్, వైరస్ నియంత్రణ చర్యలు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించడంతో మొత్తం మీద డిమాండ్ తగ్గింది’’ అని బజాజ్ ఆటో తెలిపింది. ఎగుమతి చేసే మార్కెట్లలో కూడా కరోనా ప్రభావం ఉన్నట్టు కంపెనీ అంగీకరించింది. -
ఎల్అండ్టీ లాభం రూ.537 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని దిగ్గజ కంపెనీ ఎల్అండ్టీ గ్రూపు కార్యకలాపాలు జూన్ త్రైమాసికంలో గణనీయమైన ప్రభావానికి గురయ్యాయి. కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 68 శాతం పడిపోయి రూ.537 కోట్లకు పరిమితమైంది. ఆదాయం సైతం 27 శాతం తగ్గిపోయి రూ.22,037 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,698 కోట్లు, ఆదాయం రూ.30,271 కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు కూడా రూ.27,616 కోట్ల నుంచి రూ.21,368 కోట్లకు పరిమితమయ్యాయి. ‘‘కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ కారణంగా గ్రూపు కార్యకలాపాలు, ఆర్థిక ఫలితాలపై తీవ్రమైన ప్రభావం పడింది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి కార్మికులు, ఉద్యోగులతో కార్యకలాపాలను క్రమంగా, తగిన జాగ్రత్తల మధ్య ఆరంభించాము’’అని ఎల్అండ్టీ తెలిపింది. గ్రూపులో అధిక వ్యాపారాలపై కరోనా ప్రభావం ఉందని.. కస్టమర్లు, ఉద్యోగులు, సబ్ కాంట్రాక్టర్ల పరిధిలో పనిచేసే కార్మికులు, భాగస్వాములు, వెండర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.23,574 కోట్ల విలువ చేసే నూతన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఇందులో రూ.8,872 కోట్ల మేర అంతర్జాతీయ ఆర్డర్లే. గ్రూపు కన్సాలిడేటెడ్ ఆర్డర్ల విలువ జూన్ ఆఖరుకు రూ.3,05,083 కోట్లుగా ఉంది. -
బజాజ్ ఆటో నికర లాభం 53 శాతం డౌన్
ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1లో స్టాండెలోన్ నికర లాభం 53 శాతం క్షీణించి రూ. 528 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 1012 కోట్ల నుంచి రూ. 396 కోట్లకు పడిపోయింది. ఇక మొత్తం ఆదాయం 60 శాతం వెనకడుగుతో రూ. 3079 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 60 శాతం తక్కువగా రూ. 682 కోట్లకు చేరింది. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డవున్లను అమలు చేయడంతో కంపెనీ వాహన విక్రయాలు మందగించినట్లు ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ యాజమాన్యం తెలియజేసింది. క్యూ1లో బజాజ్ ఆటో 4.43 లక్షల వాహనాలను మాత్రమే విక్రయించింది. గతేడాది(2019-20) క్యూ1లో 12.47 లక్షల వాహనాలను అమ్మగలిగింది. ఇబిటా మార్జిన్లు 14.3 శాతంగా నమోదయ్యాయి. రూ. 14,232 కోట్లు జూన్కల్లా కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 14,232 కోట్లుగా నమోదయ్యాయి. ద్విచక్ర వాహన విక్రయాలు 6.11 లక్షల నుంచి రూ. 1.86 లక్షల వాహనాలకు తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ విభాగంలో ఎగుమతులు సైతం 4.72 లక్షల వాహనాల నుంచి 2.14 లక్షలకు నీరసించినట్లు తెలియజేసింది. ఇక వాణిజ్య విభాగంలో వాహన విక్రయాలు 86,000 నుంచి 5,300కు తగ్గాయి. ఎగుమతులు సైతం 78,000 నుంచి తగ్గి 38,000 వాహనాలకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బజాజ్ ఆటో షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం నష్టంతో రూ. 2955 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2907 దిగువకూ పతనమైంది. -
యాక్సిస్ బ్యాంక్ షేరుకు క్యూ1 ఫలితాల జోష్..!
తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించడంతో యాక్సిస్ బ్యాంక్ షేరు బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 8శాతానికి పైగా లాభపడింది. బ్యాంక్ నిన్నటి రోజున క్యూ1 ఫలితాలను ప్రకటించింది. మెరుగైన ఫలితాల వెల్లడితో పలు బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరు టార్గెట్ ధరను పెంచాయి. ఫలితంగా నేడు బీఎస్ఈలో ఈ షేరు 6శాతం లాభంతో రూ.473 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. నికరలాభం, ఆదాయం క్షీణించినప్పటికీ.., మొండిబాకీలు తగ్గుముఖం పట్టాయి. స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) 5.25 శాతం నుంచి 4.72 శాతానికి దిగివచ్చాయి. అలాగే నికర ఎన్పీఏలు 2.04శాతం నుంచి 1.23శాతానికి తగ్గాయి. ఎన్పీలు తగ్గుముఖం పట్టడంతో ఆస్తుల నాణ్యత మెరుగైనట్లు బ్యాంక్ తెలిపింది. అలాగే జూన్ త్రైమాసికంలో మొండిబాకీలకు కేటాయింపులు గతేడాది క్యూ1తో పోలిస్తే రూ. 3,815 కోట్ల నుంచి రూ. 4,416 కోట్లకు పెరిగినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఇక సమీక్షాకాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఎం) 20 శాతం పెరిగి రూ. 5,844 కోట్ల నుంచి రూ. 6,985 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతంగా ఉంది. మెరుగైన క్యూ1 ఫలితాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్ ప్రారంభం నుంచే ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో 8శాతానికి పైగా లాభపడి రూ.482.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు షేరు క్రితం ముగింపు(రూ.446.20)తో పోలిస్తే 4.50శాతం లాభంతో రూ.466.45 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.285.00, రూ.765.90గా ఉన్నాయి. -
బజాజ్ ఫైనాన్స్ లాభాలకు కరోనా షాక్
సాక్షి, ముంబై: కరోనా కల్లోల సమయంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎల్) నికర లాభం భారీగా పడిపోయింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం 19శాతం క్షీణించి 962 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఇది 1,195 కోట్లుగా ఉంది. కోవిడ్-19 సంక్షోభం తమ వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీసిందని ప్రకటించింది. కంపెనీ నికర వడ్డీ ఆదాయం మాత్రం12 శాతం ఎగిసి 3,694 కోట్ల నుంచి 4,152 కోట్లకు పెరిగింది. అలాగే ఆపరేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం 15 శాతం పుంజుకుని 6648 కోట్ల రూపాయలను నమోదు చేసింది. 2020, ఏప్రిల్ 30 నాటికి ఏకీకృత మారటోరియం బుక్ 38,599 కోట్ల రూపాయల నుండి 21,705 కోట్లకు తగ్గిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మరోవైపు బజాజ్ ఫైనాన్స్ కంపనీ ఆరంభం(1987) నుంచి ఛైర్మన్గా కొనసాగుతున్న రాహుల్ బజాజ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మూడు దశాబ్దాలకు పైగా సంస్థను అభివృద్దిపథంలో పరుగులు పెట్టించిన ఆయన జూలై 31 నుంచి తన పదవి నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నారు. అయితే నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా తన సేవలను కొనసాగిస్తారు. కంపెనీ వైస్ ఛైర్మన్, రాహుల్ బజాజ్ కుమారుడు ఛైర్మన్గా సంజీవ్ బజాజ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు 4 శాతం నష్టాలతో ముగిసింది. తండ్రితో సంజీవ్ బజాజ్ (ఫైల్ ఫోటో) -
3వ రోజూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించిన ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్కు డిమాండ్ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వరుసగా మూడో రోజు లాభాల బాటలో సాగుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 4.2 శాతం జంప్చేసి రూ. 1,145 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1,153 వరకూ ఎగసింది. వెరసి మూడు రోజుల్లో 10 శాతం పురోగమించింది. మిడ్సెషన్కల్లా ఈ కౌంటర్లో 2.41 కోట్ల షేర్లు చేతులు మారాయి. గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.62 కోట్ల షేర్లు మాత్రమే. 20 శాతం అప్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ. 6659 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 15,665 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.3 శాతం వద్ద నిలకడను చూపాయి. స్థూల మొండిబకాయిలు నామమాత్రంగా పెరిగి 1.4 శాతంగా నమోదయ్యాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ.6,659 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసిక కాలంలో 20 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.5,568 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.6,659 కోట్లకు పెరిగిందని బ్యాంక్ తెలిపింది. ఆదాయం రూ.32,362 కోట్ల నుంచి రూ.34,453 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు... రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 1.40 శాతం నుంచి 1.36 శాతానికి, నికర మొండి బకాయిలు 0.43 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గాయి. కేటాయింపులు రూ.2,614 కోట్ల నుంచి రూ.3,892 కోట్లకు పెరిగాయి. కాగా ఫలితాలపై సానుకూల అంచనాలతో శుక్రవారం ఈ షేర్ ధర బీఎస్ఈలో 3% లాభంతో రూ.1,099 వద్ద ముగిసింది. వారసుడు సొంత సంస్థ నుంచే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ ఆదిత్య పురి త్వరలో రిటైర్కాబోతున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లోనే 25 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తే తన వారసుడయ్యే అవకాశాలున్నాయని ఆదిత్య పురి పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. శశిధర్ జగదీశన్, కైజాద్ బరూచాలు బ్యాంక్ సీఈఓ రేసులో ఉన్నారని సమాచారం. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 20% అప్
ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బ్యాంక్ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ. 6,659 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) సైతం 18 శాతం పెరిగి రూ. 15,665 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ ఫలితాలివి. ఈ కాలంలో రుణ మంజూరీ 21 శాతం పుంజుకోగా, డిపాజిట్లు 25 శాతం ఎగశాయి. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 49 శాతం పెరిగి రూ. 3891 కోట్లను దాటాయి. కోవిడ్-19 నేపథ్యంలో ఫ్లోటింగ్ ప్రొవిజన్లకు రూ. 1451 కోట్లు, కంటింజెన్సీలకు రూ. 4002 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం 15 శాతం బలపడి రూ. 12,829 కోట్లను తాకింది. నిర్వహణ వ్యయాలు 2.9 శాతం తగ్గి రూ. 7117 కోట్లకు పరిమితమైనట్లు బ్యాంక్ తెలియజేసింది. ఎన్పీఏలు అప్ క్యూ1లో త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.26 శాతం నుంచి 1.36 శాతానికి పెరిగాయి. ఆర్థిక మందగమనం కారణంగా రిటైల్ రుణాలు, థర్డ్పార్టీ ప్రొడక్టుల విక్రయాలు, క్రెడిట్ కార్డుల వినియోగం నీరసించినట్లు బ్యాంక్ పేర్కొంది. దీంతో ఫీజు ఆధారిత ఆదాయం సుమారు రూ. 2000 కోట్లు తగ్గినట్లు తెలియజేసింది. కాగా.. శుక్రవారం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 4 శాతం జంప్చేసి రూ. 1103 వద్ద ముగసింది. ఇంట్రాడేలో రూ. 1104 వద్ద గరిష్టాన్ని తాకగా.. 1058 వద్ద కనిష్టానికీ చేరింది. ఫలితాల ప్రభావం సోమవారం ట్రేడింగ్లో ప్రతిఫలించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
మళ్లీ 10,900 పైకి నిఫ్టీ
కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నా, కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,900 పాయింట్లపైకి ఎగబాకాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 16 పైసలు పుంజుకొని 75.02కు చేరడం, కరోనా వ్యాక్సిన్పై ఆశలు పెరగడం... సానుకూల ప్రభావం చూపించాయి. ప్రపంచ మార్కెట్లు అంతంత మాత్రంగానే ఉన్నా, మన మార్కెట్ దూసుకుపోయింది. సెన్సెక్స్ 548 పాయింట్ల లాభంతో 37,020 పాయింట్ల వద్ద, నిఫ్టీ 162 పాయింట్లు పెరిగి 10,902 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. వరుసగా మూడో రోజూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 426 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో వారమూ పెరిగింది. కరోనా కల్లోలం... ఒక్క శుక్రవారం రోజే కరోనా కేసులు 36 వేలకు పైగా మించాయి. మొత్తం కేసులు పది లక్షలను దాటాయి. కేవలం మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య 9 లక్షల నుంచి పది లక్షలకు చేరడం విశేషం. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే మొదలైంది. చివరి గంట వరకూ పరిమిత శ్రేణిలోనే కదలాడింది. చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ ఉండొచ్చన్న ఆందోళనను మార్కెట్ పట్టించుకోలేదు. ఐటీ కంపెనీలతో పాటు బ్రిటానియాఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం సెంటిమెంట్కు జోష్నిచ్చింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ► ఓఎన్జీసీ 5.5% లాభంతో రూ. 80 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ►30 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–టీసీఎస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 25 షేర్లు పెరిగాయి. ►స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.07 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.07 లక్షల కోట్లు పెరిగి రూ.144.88 లక్షల కోట్లకు చేరింది. ►ప్రైవేటీకరణ వార్తల జోరుతో ప్రభుత్వ రంగ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్ 13 శాతం, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, హెచ్పీసీఎల్, ఐఓసీ షేర్లు 3–12 శాతం రేంజ్లో లాభపడ్డాయి. 95 శాతం సబ్స్క్రైబయిన యస్బ్యాంక్ ఎఫ్పీఓ యస్ బ్యాంక్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీఓ) 95శాతం సబ్స్క్రైబయింది. రూ.12–13 ఫ్లోర్ప్రైస్తో వచ్చిన ఎఫ్పీఓ ద్వారా యస్ బ్యాంక్ రూ.15,000 కోట్లు సమీకరించనున్నది. భారత్ బాండ్ ఈటీఎఫ్... 3 రెట్లకుపైగా సబ్స్క్రిప్షన్ రెండో విడత భారత్ బాండ్ ఈటీఎఫ్ 3 రెట్లకు పైగా సబ్స్క్రైబ్ అయ్యింది. అన్ని వర్గాల నుంచీ విశేష స్పందన లభించడంతో దాదాపు రూ.10,000 కోట్ల సమీకరణ జరిగినట్లు అంచనా. 14వ తేదీన ప్రారంభమైన ఈటీఎఫ్ శుక్రవారంతో ముగిసింది. -
హెచ్సీఎల్ టెక్ లాభం 2,925 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసిక కాలంలో 32 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.2,220 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.2,925 కోట్లకు పెరిగిందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. ఆదాయం రూ.16,425 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.17,841 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్గా చూస్తే, మాత్రం 4 శాతం క్షీణించిందని పేర్కొంది. పటిష్టమైన డీల్స్ సాధించామని రానున్న క్వార్టర్లలో మంచి వృద్ధినే సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు ఎలాంటి వేతన పెంపు లేదని స్పష్టం చేసింది. ఒక్కో ఈక్విటీ షేర్కు రూ.2 డివిడెండ్ ప్రకటించింది. మరిన్ని వివరాలు... ► స్థిర కరెన్సీ ధరల్లో కంపెనీ ఆదాయం క్యూ1లో 1 శాతం మేర వృద్ధి చెందింది. ► రానున్న మూడు క్వార్టర్లలో ఒక్కో క్వార్టర్కు 1.5–2.5 శాతం మేర వృద్ధి సాధిస్తామని కంపెనీ అంచనా వేస్తోంది. ► మార్చి క్వార్టర్తో పోల్చితే డీల్స్ 40 శాతం పెరిగాయి. ► ఈ క్యూ1లో స్థూలంగా 7,005 ఉద్యోగాలిచ్చింది. జూన్ క్వార్టర్ చివరి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,50,287కు పెరిగింది. మొత్తం ఉద్యోగుల్లో 96 శాతం మంది ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఆట్రీషన్ రేటు (ఉద్యోగుల వలస)14.6 శాతంగా ఉంది. ఆర్థిక ఫలితాలు ప్రకటించిన తర్వాత హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్ 3 శాతం లాభంతో రూ.644కు ఎగసింది. చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 1 శాతం నష్టంతో రూ.623 వద్ద ముగిసింది. ఇప్పటి నుంచి అంతా సానుకూల వృద్ధే.... ప్రపంచమంతా తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఈ ఆర్థిక సంవత్సరాన్ని ఆరంభించాం. ఈ క్యూ1లో అంచనాలకనుగుణంగానే ఓ మోస్తరు వృద్ధి మాత్రమే సాధింగలిగాం. అధ్వాన పరిస్థితులను అధిగమించాం. ఇక ఇప్పటి నుంచి అంతా సానుకూల వృద్ధే. హెచ్1 బీ వీసాలపై నిషేధం దురదృష్టకరం. అయితే ఈ ప్రభావం మా కంపెనీపై పెద్దగా ఉండదు. అమెరికాలో 67 శాతం మంది ఉద్యోగులు అక్కడి స్థానికులే. –విజయకుమార్, ప్రెసిడెంట్, సీఈఓ, హెచ్సీఎల్ టెక్