Sakshi Malik
-
అక్షరాలై వెలిగారు
కాలక్షేప సాహిత్యానికి కాలం చెల్లిన కాలం ఇది. ఈ ఉరుకు పరుగుల కాలంలో పుస్తకం నిలబడాలంటే సత్తా ఉండాలి. సామాజిక అంశాలు ఉండాలి. అలాంటి సత్తా ఉన్న పుస్తకాలతో ఈ సంవత్సరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు మన మహిళా రచయిత్రులు. లింగవివక్ష నుంచి స్త్రీ సాధికారత వరకు... అట్టడుగు శ్రామిక జీవితాలను నుంచి లౌకికవాదం వరకు... ఎన్నో అంశాలపై ప్రామాణికమైన పుస్తకాలు రాశారు...రెజ్లర్ టు రైటర్సాక్షి మాలిక్ (Sakshi Malik) పేరు వినబడగానే ‘స్టార్ రెజ్లర్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. రెజ్లర్ సాక్షి కాస్తా ‘విట్నెస్’తో (Witness) రైటర్గా మారింది. సాక్షి మాలిక్ది నల్లేరు మీద నడక కాదు. ఘర్షణ లేకుండా ఆమె నడక లేదు. ఆ ఘర్షణలో పితృస్వామ్య వ్యవస్థను సవాలు చేయడం కూడా ఒకటి. పేదరికాన్ని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉన్నతస్థాయికి చేరడానికి తాను పడిన కష్టాలకు జోనాథన్ సెల్వరాజ్తో (Jonathan Selvaraj) కలిసి ఈ పుస్తకం ద్వారా అక్షర రూపం ఇచ్చింది సాక్షి మాలిక్. ఆటలో పడి లేవడం సాధారణం. అయితే పడిన ప్రతిసారీ మరింత బలంగా పైకి లేవడం సాక్షి శైలి. ఒలింపిక్స్లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా రెజ్లర్గా ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ‘నేను తల్లి అయిన తరువాత భవిష్యత్తులో ఏదో ఒకరోజు గోడకు వేలాడుతున్న ఒలింపిక్ మెడల్ను చూస్తూ అది ఏమిటి? అని నా బిడ్డ నన్ను అడగవచ్చు. నేను ఆ మెడల్ను బిడ్డ చేతిలో పెట్టి అది ఏమిటో, అది గెలవడానికి ఎంతదూరం ప్రయాణించాల్సి వచ్చిందో వివరంగా చెబుతాను’ అంటుంది సాక్షి మాలిక్.విట్నెస్ – సాక్షి మాలిక్జ్ఞాపకాల జ్ఞాన సముద్రంఇది పుస్తకం అనడం కంటే నాలుగు తరాల జ్ఞాపకాల సంపుటి అనడం సబబుగా ఉంటుంది. ఎంతో పరిశోధిస్తే కాని ఇలాంటి పుస్తకం రాయలేము. పరిశోధనకు తోడు నుస్రత్ ఎఫ్ జాఫ్రీలోని (Nusrat Fatima Jafri) అద్భుత సృజనాత్మకత పుస్తకానికి మంచి పేరు వచ్చేలా చేసింది. తన పూర్వీకుల మతమార్పిడి అనేది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో ఈ పుస్తకంలో వివరిస్తుంది జాఫ్రీ. ‘నా బంధువులు వారి జీవితంలో వివిధ సందర్భాలలో కొత్త మతాలను స్వీకరించాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ కారణాలలో రాజకీయం(Politics) నుంచి సామాజికం వరకు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి మత మార్పిడి ప్రయాణం ప్రత్యేకమైనది’ అంటుంది జాఫ్రీ. అయితే వారి కుటుంబ చరిత్ర అంతా దేశ విస్తృత చరిత్రతో లోతుగా ముడిపడినందు వల్లే పుస్తకం ప్రత్యేకంగా నిలిచింది, వలస పాలన, స్వాతంత్య్రపోరాటం, వలసానంతర రాజకీయాలు... మొదలైనవి ‘దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్’లో కనిపిస్తాయి.దిస్ ల్యాండ్ ఉయ్ కాల్ హోమ్: ది స్టోరీ ఆఫ్ ఏ ఫ్యామిలి, క్యాస్ట్, కన్వర్జేషన్స్ అండ్ మోడర్న్ ఇండియా – నుస్రత్ ఎఫ్.జాఫ్రీఇదేం భాష?!న్యూయార్క్లోని హంటర్ కాలేజిలో ‘ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్’లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న రూపాల్ ఓజా రాసిన పుస్తకం ఎమియోటిక్స్ ఆఫ్ రేప్. బాధితురాలు, సర్వైవర్లాంటి పదాలకు అతీతంగా లైంగిక హింస కేసులకు సంబంధించిన భాషలో మూసధోరణులు, పితృస్వామిక భావజాలాన్ని ఈ పుస్తకంలో విశ్లేషిస్తుంది రూపా ఓజా. ప్రభుత్వ అధికారుల నుంచి గ్రామ వార్డు మెంబర్లు, కుల సంఘాల వరకు అత్యాచార కేసులను లైంగిక విషయాలపై చర్చించే వేదికలుగా ఎలా చూస్తారో ఈ పుస్తకంలో వివరిస్తుంది రుపాల్ ఓజా.ఎమియోటిక్స్ ఆఫ్ రేప్: సెక్సువల్ సబ్జెక్టివిటీ అండ్ వయొలేషన్ ఇన్ రూరల్ ఇండియా– రూపాల్ ఓజాఉద్యమమే జీవితమై..ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అరుణ దిల్లీ సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీకి సెక్రటరీగా ఉన్నతోద్యోగాలు చేసినా ‘ఉద్యమ నాయకురాలు’గానే ఆమె సుపరిచితురాలు. సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్ (బేర్ఫుట్ కాలేజీ)తో మొదలైన ఆమె ప్రయాణం ఎంతోదూరం వెళ్లింది. ఎన్నో మలుపులు తిరిగింది. తన ఉద్యమజీవితాన్ని, ఉద్యమాల బాటలో తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’లో రాసింది అరుణా రాయ్. ఉద్యమం అనే మహా పాఠశాలలో తాను నేర్చుకున్న పాఠాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.ది పర్సనల్ ఈజ్ పొలిటికల్: యాన్ యాక్టివిస్ట్ మెమోయిర్ – అరుణా రాయ్అట్టడుగు కోణం నుంచి...దేశంలోని అత్యంత మారుమూల, అణగారిన వర్గాల గురించి బేలా భాటియా రాసిన పుస్తకం ఇది. మన దేశంలోని నిరుపేద ప్రజలపై జరిగే హింసాకాండపై వెలుగును ప్రసరిస్తుంది. వర్గ, లింగ, భౌగోళిక అంశాలను మేళవించి రాసిన పుస్తకం ఇది.ఇండియాస్ ఫర్గాటెన్ కంట్రీ: ఏ వ్యూ ఫ్రమ్ ది మార్జిన్స్– బేలా భాటియాహింస ధ్వనిమన దేశంలోని తాజా రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రాసిన పుస్తకం ఇది. భీమా– కోరేగావ్ ఘటనలో కొందరిని కేసులో ఎలా ఇరికించారో, సాక్ష్యాధారాలు ఎలా సృష్టించారో, కేసు లేకపోయినా రాజకీయ కారణాలతో ఎలా హింసించారో ఈ పుస్తకంలో అల్పా షా రాసింది.భీమా–కోరేగావ్ అండ్ ది సెర్చ్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇండియా: అల్పా షాఎర్రజెండ నీడలో... 1920 దశకంలో భారత రాజకీయాల్లో కమ్యూనిజం స్పష్టమైన అస్తిత్వంగా మారడం నుంచి కమ్యూనిస్ట్ మహిళల జీవితాలను సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంలో విశ్లేషించడం వరకు ఎంతో సమాచారం ‘రెవల్యూషనరీ డిజైర్స్’లో కనిపిస్తుంది.ఎన్నో జీవితాల గురించిరెవల్యూషనరీ డిజైర్స్: ఉమెన్ కమ్యూనిజం అండ్ ఫెమినిజం ఇన్ ఇండియా – అనియా లూంబాశ్రామిక జనజీవన చిత్రంసాధారణ శ్రామిక వర్గ భారతీయురాలి జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపే ఈ పుస్తకాన్ని జర్నలిస్ట్ నేహా దీక్షిత్ రాసింది. బాబ్రీ మసీదు కూల్చివేతతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి సైదా ఎక్స్ బెనారస్ నుంచి దిల్లీకి వెళుతుంది. దిల్లీలో బతకడానికి రోజుకు ఎన్నో ఉద్యోగాలు చేస్తుంది. ఒక రోజు సెలవు తీసుకుంటే కూడా ‘రేపు బతకడం ఎలా’ అనే భయం నుంచి రాత్రి, పగలు కష్టపడిన సైదా కథ ఈ పుస్తకంలో కనిపిస్తుంది, దిల్లీలోని చాందిని చౌక్లో రిక్షా తొక్కే కార్మికుడు ఉగ్రవాదుల బాంబు పేళుళ్లలో మరణిస్తాడు. ‘ది మెనీ లివ్స్ ఆఫ్...’లో సయిదా, బాంబు పేలుళ్లలో చనిపోయిన అమాయక రిక్షాకార్మికుడిలాంటి ఎంతోమంది సామాన్యుల, శ్రామికుల జీవితాలు కనిపిస్తాయి.ది మెనీ లైవ్స్ ఆఫ్ సైదా ఎక్స్ – నేహా దీక్షిత్స్వతంత్రభారత స్వరంఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పుస్తకం స్వతంత్ర భారత దేశ సంక్షిప్త చరిత్ర. జాతీయవాదంలోని అనేక అంశాల గురించి తన భావాలను వెల్లడి చేస్తుంది నందిత హక్సర్. మన దేశం ఎలా ముందుకు సాగాలనే దాని గురించి కౌమార దశలో తన అమాయక ఆలోచనలు ఈ పుస్తకంలో గుర్తు తెచ్చుకుంది నందిత. అమాయక ఆలోచనల నుంచి వాస్తవికదృష్టితో ఆలోచించడం వరకు తన ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పును గురించి కూడా ‘ది కలర్స్ ఆఫ్ నేషనలిజం’లో రాసింది నందితా హక్సర్ది కలర్స్ ఆఫ్ నేషనలిజం– నందితా హక్సర్‘తమాషా’ వెనుకఎంత విషాదమో!మహారాష్ట్రలోని తమాషా డ్యాన్సర్ల గురించి రాసిన పుస్తకం ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్. ఒక విధంగా చెప్పాలంటే తమాషా కళాకారుల సామాజిక, మేధోచరిత్రను రికార్డ్ చేసిన మొదటి పుసక్తంగా చెప్పుకోవచ్చు. హిస్టరీప్రొఫెసర్ అయిన డా. శైలజ పైక్ తొలి పుస్తకం... దళిత్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడ్రన్ ఇండియా: డబుల్ డిస్క్రిమినేషన్. నలుగురు ఆడపిల్లల్లో ఒకరిగా యెరవాడ మురికి వాడలోని ఒకేగది ఇంట్లో పెరిగిన శైలజకు పేదల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆ అనుభవ జ్ఞానంతోనే మహారాష్ట్రలోని తమాషా కళాకారుల జీవితానికి అద్దం పట్టేలా ‘ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్’ పుస్తకం రాసింది.ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్ – శైలజ పైక్ -
ఆమె నిజాయితీని అమ్ముకుంది: మండిపడ్డ బబిత
ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్పై మాజీ రెజ్లర్, బీజేపీ నేత బబితా ఫొగట్ మండిపడ్డారు. తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం.. సాక్షి తన నిజాయితీని కూడా పూర్తిగా అమ్మేసుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా 2016లో రియో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్.. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించారు.హర్యానాకు చెందిన సాక్షి ఇటీవలే తన ఆత్మకథ ‘విట్నెస్’ను మార్కెట్లో విడుదల చేశారు. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు భారత స్టార్ రెజ్లర్ల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పలువురు రెజ్లర్లు ఢిల్లీ వేదికగా ఉద్యమం నడిపిన విషయం తెలిసిందే.వినేశ్తో సాక్షి మాలిక్స్వార్థంగా ఆలోచించారుఇందులో సాక్షి మాలిక్తో పాటు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తమ గళాన్ని గట్టిగా వినిపించారు. బబితా ఫొగట్ సైతం రెజ్లర్ల నిరసనకు తన మద్దతు ప్రకటించారు. అయితే, ఈ ఉద్యమ సమయంలో ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కావాలని వినేశ్ ఫొగట్, బజరంగ్ కోరడం వల్ల తమకు చెడ్డపేరు వచ్చిందని సాక్షి తన పుస్తకంలో పేర్కొన్నారు.బబిత నటనకు కారణం అదేఎవరో ఉద్దేశపూర్వకంగానే వినేశ్, బజరంగ్లను రెచ్చగొట్టి ఇలా అత్యాశకు పోయేలా.. స్వార్థం నింపి ఉంటారని సాక్షి అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. బబిత ఫొగట్ తమ ఉద్యమానికి మద్దతు తెలపడంలో కూడా స్వార్థమే ఉందని ఆరోపించారు.తాము బ్రిజ్భూషణ్ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడితే.. బబిత మాత్రం రిజ్భూషణ్ స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే.. తమ శ్రేయోభిలాషి తరహాలో బబిత ప్రవర్తించిందని సాక్షి మాలిక్ విమర్శించారు.నీ బాధ నాకు అర్థమవుతుందిలేఈ నేపథ్యంలో సాక్షి ఆరోపణలపై బబితా ఫొగట్ ఘాటుగా స్పందించారు. ‘‘నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. దాని ద్వారానే నువ్వు ప్రకాశించాలి. అంతేగానీ.. ఇతరులను నిందించడం ద్వారా ఇంకెన్నాళ్లు నువ్వు ప్రకాశించగలవు? కొందరికి అసెంబ్లీ సీట్లు వచ్చాయి.కొందరేమో పదవులు పొందారు. కానీ.. నువ్వు మాత్రం ఏదీ పొందలేకపోయావు కదా! నీ బాధ నాకు అర్థమవుతుందిలే!.. ఆమె తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం తన నిజాయితీని కూడా అమ్ముకుంది’’ అని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు బబిత.వినేశ్ స్పందన ఇదేఅంతకు ముందు వినేశ్ ఫొగట్ సైతం సాక్షి మాలిక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘మాది స్వార్థమా? ఇలా ఎందుకు అన్నారో ఆమెనే అడగండి. తోటి అక్కాచెల్లెళ్ల కోసం పోరాడితే దానిని స్వార్థమే అంటారంటే.. అవును ఈ విషయంలో మేము స్వార్థపరులమే. దేశం కోసం ఒలింపిక్ పతకం తేవడం స్వార్థమే అయితే.. అంతకంటే గొప్ప స్వార్థం మరొకటి ఏది ఉంటుంది?నేను, సాక్షి, బజరంగ్ బతికి ఉన్నంతకాలం మా ఉద్యమం సజీవంగానే ఉంటుంది. ఈ ప్రయాణంలో కొన్ని అవాంతరాలు వస్తాయి. అయినా.. సరే మేము గట్టిగా పోరాడతాం’’ అని పేర్కొన్నారు. కాగా బబిత, వినేశ్ కజిన్స్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. బజరంగ్.. బబిత సొంత చెల్లెలు సంగీత భర్త.రాజకీయాల్లో ఫొగట్ కుటుంబంఇదిలా ఉంటే.. బబిత బీజేపీలో చేరగా.. వినేశ్ ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి జులానా ఎమ్మెల్యే అయ్యారు. బజరంగ్ కూడా కాంగ్రెస్ పార్టీ మెంబర్.అయితే, సాక్షి వ్యాఖ్యలపై ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇచ్చిన కౌంటర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.చదవండి: ‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు’ -
ట్రెండింగ్లో సాక్షి మాలిక్: ఆమె భర్త ఎవరో తెలుసా? అతడి బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
‘గదికి పిలిచి.. భుజాలపై చేతులు వేశాడు.. తండ్రిలాంటి వాడినంటూ..’
‘‘ఆరోజు మా అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడిస్తానని నాకు మెసేజ్ వచ్చింది. అందుకే ఆయన గదికి వెళ్లాను. అపుడు సింగ్.. నిజంగానే మా పేరెంట్స్కు కాల్ చేసి.. వాళ్లతో మాట్లాడించాడు. నా మ్యాచ్ గురించి, మెడల్ గురించి నేను నా తల్లిదండ్రులకు చెప్పాను. అక్కడ ఊహించని ఘటన జరుగుతుందని నేను ఏమాత్రం అనుకోలేదు.అంతాబాగానే ఉంది.. ప్రమాదమేమీ లేదనిపించింది. అయితే, ఒక్కసారి కాల్ కట్ చేసిన తర్వాత.. అతడి ప్రవర్తన మారిపోయింది. నేను అతడి బెడ్మీద కూర్చుని ఉన్నపుడు నన్ను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని వెనక్కి తోసి ఏడ్చేశాను. అతడు చేసే పనులకు బదులివ్వడానికి నేను సిద్ధంగా లేనని గ్రహించి ఒక అడుగు వెనక్కి వేశాడు.నా భుజాల చుట్టూ చేతులు వేసి.. ‘తండ్రి లాంటి వాడిని’ అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ అతడి ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. ఏడుస్తూ.. అక్కడి నుంచి బయటకు పరిగెత్తి నా గదికి వెళ్లిపోయాను’’ అంటూ భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. హోటల్ గదిలో లైంగిక వేధింపులుభారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ తనతో ప్రవర్తించిన తీరును.. తన ఆటోబయోగ్రఫీ ‘విట్నెస్’లో ప్రస్తావించింది. కజక్స్తాన్లో 2021 నాటి ఆసియా జూనియర్ చాంపియన్షిప్ సందర్భంగా హోటల్ గదిలో బ్రిజ్భూషణ్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలిపింది.స్పెషల్ క్లాస్ అంటూ పిలిచేవాడుఅంతేకాదు.. బాల్యంలోనూ తనకు ఇలాంటి ఘటన ఎదురైందని సాక్షి మాలిక్ తన పుస్తకంలో పేర్కొంది. ‘‘చాలా ఏళ్ల క్రితం.. నా చిన్నపుడు కూడా ఇలాగే వేధింపుల బారినపడ్డాను. నా ట్యూషన్ టీచర్ నన్ను వేధిస్తూ ఉండేవాడు. వేళ కాని వేళ ఇంటికి ఫోన్ చేసి స్పెషల్ క్లాస్ అంటూ పిలిచేవాడు. అక్కడికి వెళ్లిన కాసేపటి తర్వాత ట్యూషన్ గురించి పక్కనపెట్టి నన్ను తాకాలని చూసేవాడు. అయితే, ఈ విషయాన్ని బయటకు చెబితే.. తప్పు నాదే అంటారేమోనన్న భయంతో మా ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. అమ్మకు కూడా చెప్పే ధైర్యం లేకపోయింది. చాలా ఏళ్లు అతడి వేధింపులను మౌనంగానే భరించాను.కెరీర్ మీద ఫోకస్ పెట్టాలనిఅయితే, అమ్మ విషయం అర్థం చేసుకుంది. నాకు అండగా నిలబడింది. ట్యూషన్ టీచర్, సింగ్ లాంటి వాళ్ల గురించి మర్చిపోయి.. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని.. అలాంటి చెత్త మనుషుల గురించి భయపడాల్సిన పనిలేదని.. ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పింది. ఇలాంటి చేదు అనుభవాల తర్వాత కూడా నా తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు కాబట్టే నేను ఇక్కడిదాకా చేరుకోగలిగాను’’ అని సాక్షి మాలిక్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు రాసుకొచ్చింది. కాగా కొన్నాళ్ల క్రితం.. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే.నాటి రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా సాక్షి మాలిక్ సహా వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తదితరులు ఈ నిరసనల్లో ప్రముఖంగా పాల్గొన్నారు. అయితే, రెజ్లింగ్ సంఘం ఎన్నికల నుంచి బ్రిజ్భూషణ్ తప్పుకొన్నా.. అతడి అనుచరుడు సంజయ్ సింగ్ను గెలిపించుకున్నాడు. దీంతో ఆవేదన చెందిన సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలికింది. కాగా 2016 రియో ఒలింపిక్స్లో సాక్షి కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: ‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది! -
‘వారిద్దరి’ స్వార్థం చెడ్డ పేరు తెచ్చింది!
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో సీనియర్ రెజ్లర్లు పోరాడారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా వీరంతా సమష్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మలిక్ నిరాటంకంగా పాల్గొని పోరాటాన్ని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు సాక్షి మలిక్ నాటి ఘటనపై పలు భిన్నమైన విషయాలు చెప్పింది. తన పుస్తకం ‘విట్నెస్’లో సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్లపై ఆమె విమర్శలు కూడా చేసింది. ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సడలింపు వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అభిప్రాయ పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం తర్వాత బాధ్యతలు తీసుకున్న తాత్కాలిక కమిటీ హాంగ్జౌ ఆసియా క్రీడల సెలక్షన్స్లో పాల్గొనకుండా నేరుగా పాల్గొనే అవకాశం వినేశ్, బజరంగ్లకు కల్పించింది. సాక్షి మాత్రం దీనికి అంగీకరించలేదు. ‘వినేశ్, బజరంగ్ సన్నిహితులు కొందరు వారిలో స్వార్థం నింపారు. వారిద్దరు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించేలా చేయగలిగారు. వినేశ్, బజరంగ్లకు సడలింపు ఇవ్వడం మేలు చేయలేదు. మా నిరసనకు అప్పటి వరకు వచి్చన మంచి పేరును ఇది దెబ్బ తీసింది. ఒకదశలో సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అంతా అనుకునే పరిస్థితి వచి్చంది’ అని సాక్షి వెల్లడించింది. మరోవైపు బబిత ఫొగాట్ తమ నిరసనకు మద్దతు పలకడంలో కూడా స్వార్థమే ఉందని ఆమె పేర్కొంది. ‘మేమందరం బ్రిజ్భూషణ్ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడుతూ వచ్చాం. బబిత ఫొగాట్ మరోలా ఆలోచించింది. బ్రిజ్భూషణ్ను తొలగించడమే కాదు. అతని స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుంది. అందుకే మా శ్రేయోభిలాషి తరహాలో ఆమె ప్రవర్తించింది’ అని సాక్షి వ్యాఖ్యానించింది. 2016 రియో ఒలింపిక్స్లో సాక్షి కాంస్య పతకం గెలుచుకుంది. . -
ఒలింపిక్ పతక విజేతలకు షాకిచ్చిన రెజ్లింగ్ సమాఖ్య!
భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, గీతా ఫొగట్ కొత్త అవతారమెత్తారు. ఏకంగా రెజ్లింగ్ లీగ్ నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నారు. భారత్లో రెజ్లింగ్ చాంపియన్స్ సూపర్ లీగ్ (డబ్ల్యూసీఎస్ఎల్) పేరిట పెద్ద ఎత్తున టోర్నమెంట్ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, ప్రపంచ చాంపియన్ప్ కాంస్య పతక విజేత గీతా ఫొగట్ ఈ మేరకు లీగ్పై ప్రకటన చేశారు.షాకిచ్చిన భారత రెజ్లింగ్ సమాఖ్యఅయితే ‘ఆదిలోనే హంసపాదు’లా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) లీగ్కు మోకాలడ్డుతోంది. రెజ్లర్లు నిర్వహించాలనుకునే ఈ టోర్నీకి ఆమోదం ఇవ్వబోమని ప్రకటించింది. సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కొన్ని నెలల క్రితం సాక్షి... బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్లతో కలిసి ఢిల్లీ రోడ్లపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బజరంగ్, వినేశ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినేశ్ హరియాణా అసెంబ్లీ ఎన్నికలో బరిలో కూడా నిలిచింది.రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్కానీ రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాత్రం రాజకీయాల్లో చేరలేదు. ‘చాలా రోజులుగా ఈ లీగ్ కోసం నేను, సాక్షి సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే లీగ్కు తుదిరూపు తీసుకొస్తాం. అంతా అనుకున్నట్లు జరిగితే అప్పుడు క్రీడాకారులు మాత్రమే నిర్వహించే తొలి లీగ్గా రెజ్లింగ్ లీగ్ ఘనతకెక్కుతుంది. అయితే ఇప్పటివరకు సమాఖ్యతో మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం, సమాఖ్య మాకు మద్దతు ఇస్తే బాగుంటుంది. పూర్తిగా రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్ నిర్వహించబోతున్నాం’ అని గీతా ఫొగట్ తెలిపింది.త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాంఅదే విధంగా... ప్రపంచస్థాయి రెజ్లర్లు, కోచ్లు ఇందులో పాల్గొంటారని, దీని వల్ల దేశీయ రెజ్లర్లకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లతో తలపడే అనుభవం వారికి లభిస్తుందని ఆమె చెప్పింది. ఇదివరకే కెరీర్కు వీడ్కోలు చెప్పిన సాక్షి మలిక్ మళ్లీ ఈ లీగ్తో రెజ్లింగ్కు దగ్గరవడం ఆనందంగా ఉందని చెప్పింది. అంకితభావం, నిబద్ధతతో లీగ్ విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపింది. వేదికలు, ప్రైజ్మనీ, విధివిధానాలు తదితర అంశాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామని గీత పేర్కొంది.లీగ్కు గుర్తింపు లేదు కానీ డబ్ల్యూఎఫ్ఐ వాదన మరోలా ఉంది. ‘సమాఖ్య ఈ లీగ్కు ఆమోదం తెలపడం లేదు. మేం మూలనపడిన ప్రొ రెజ్లింగ్ లీగ్ను పునరుద్ధరించే పనిలో ఉన్నాం. త్వరలోనే పట్టాలెక్కిస్తాం. కావాలంటే రెజ్లర్లు వారి లీగ్ నిర్వహించుకోవచ్చు. క్రీడకు ప్రాచుర్యం తేవొచ్చు. అయితే మా లీగ్ వారి లీగ్తో కలువదు’ అని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు. చదవండి: కొరియాను కొట్టేసి... ఫైనల్లో భారత్ -
కాంగ్రెస్లోకి వినేశ్, బజరంగ్: సాక్షి మాలిక్ వ్యాఖ్యలు వైరల్
భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా రాజకీయ నాయకులుగా తమ ప్రయాణం మొదలుపెట్టనున్నారు. హర్యానాకు చెందిన వీరిరువురు శుక్రవారం హస్తం గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ స్పందించింది.వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా రాజకీయ రంగ ప్రవేశం చేయడం వారి వ్యక్తిగత నిర్ణయమని.. తాను మాత్రం మహిళా రెజ్లర్ల తరఫున పోరాడేందుకు అంకితమవుతానని స్పష్టం చేసింది. తనకూ వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని.. అయితే, బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ఉద్దేశం తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది.ఢిల్లీలో నిద్రాహారాలు మాని నిరసనకాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి హోదాలో నాటి బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సాక్షి మాలిక్తో పాటు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తదితరులు బాధితులకు మద్దతుగా ఢిల్లీలో నిరసనకు దిగారు. నెలలపాటు పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్భూషణ్ను గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం చేశారు.అయితే, ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వం వీరి ఉద్యమంపై స్పందించలేదు. దీంతో పతకాలు, ప్రభుత్వ పురస్కారాలు వెనక్కి ఇచ్చేందుకు రెజ్లర్లు సిద్ధపడిన తరుణంలో ఎట్టకేలకు రెజ్లింగ్ సమాఖ్యకకు ఎన్నికలు నిర్వహించారు. బ్రిజ్భూషణ్ పదవి నుంచి దిగిపోయినప్పటికీ అతడి అనుచరుడు సంజయ్ గద్దెనెక్కాడు.ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. వినేశ్, బజరంగ్ సైతం సంజయ్ ఎన్నికపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే, వీరిద్దరు రెజ్లర్లుగా కొనసాగుతూనే ఉద్యమానికి అండగా ఉండగా.. సాక్షి మాత్రం బ్రిజ్భూషణ్ విషయంలో మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగేంతవరకు తన పోరాటం ఆగదని ప్రకటించింది.త్యాగాలకు సిద్ధపడాలిఈ నేపథ్యంలో వినేశ్, బజరంగ్ రాజకీయాల్లో చేరడంపై సాక్షి మాలిక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘అది వారి వ్యక్తిగత నిర్ణయం. నాకు తెలిసినంత వరకు ఒక లక్ష్యంతో పోరాడే వారు త్యాగాలకు సిద్ధపడాలి. నేను అదే చేస్తున్నా. మహిళా రెజ్లర్లకు మద్దతుగా మేము సాగించిన పోరాటంపై విమర్శలు వచ్చేలా, వక్రభాష్యాలు ఆపాదించేందుకు ఆస్కారమిచ్చేలా నేను ప్రవర్తించాలనుకోవడం లేదు.నిస్వార్థ పోరాటం ఆగదువారికి అండగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నా ఆలోచలన్నీ రెజ్లింగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నాకు కూడా రాజకీయ పార్టీల ఆహ్వానాలు అందాయి. కానీ నేను ఉద్యమ బాటనే ఎంచుకున్నాను. బాధితులకు న్యాయం జరగాలనే సదుద్దేశంతోనే, వారి ప్రయోజనాల కోసమే నేను ఈ పోరాటాన్ని మొదలుపెట్టాను.మహిళా రెజ్లర్లకు భారత రెజ్లింగ్ సమాఖ్యలోని చీడపురుగుల వికృత చేష్టల నుంచి విముక్తి లభించేదాకా నా పోరాటం ఆగదు. మా పోరాటం నిస్వార్థమైనది.. అది కొనసాగుతూనే ఉంటుంది’’ అని సాక్షి మాలిక్ తన మనసులోని అభిప్రాయాలను వెల్లడించింది.సాక్షి మాలిక్ సాధించిన ఘనతలు ఇవీకామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలుఆసియా చాంపియన్షిప్లో నాలుగు పతకాలురియో ఒలింపిక్స్లో కాంస్య పతకం -
Sakshi Malik: నా జీవితాన్ని నిజాయితీగా వివరించాను
కొన్నాళ్ల క్రితం బౌట్లలో... మెడలో పతకాలతో... తదనంతరం ఢిల్లీ రోడ్లపై కనిపించిన భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ ఇప్పుడు అక్షర రూపంలో చదివించనుంది. ఆమె స్వీయచరిత్ర ఇప్పుడు పుస్తకంగా మార్కెట్లోకి రానుంది. ‘విట్నెస్’ పేరుతో ఆమె ఆత్మకథను అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు ప్రచురణకర్తలు వెల్లడించారు. రచయిత జొనాథన్ సెల్వరాజ్ రాసిన ఈ పుస్తకాన్ని జుగ్గర్నాట్ బుక్స్ అనే సంస్థ ప్రచురించింది.బౌట్లో నిబద్ధతను చాటిన ఆమె... పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని నిజాయితీగా, నిక్కచ్చిగా వెలిబుచ్చి నట్లు పబ్లిషర్లు తెలిపారు. ఆమె బాల్యం, రోహ్తక్లోని అఖాడాలో రెజ్లింగ్ నేర్చుకోవడం, దాన్ని కెరీర్గా మలచుకోవడం అక్కడి నుంచి గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల నుంచి ఏకంగా ‘రియో’ ఒలింపిక్స్లో కాంస్య పతకంతో మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయడం దాకా అన్నీ పుస్తకంలో ఉన్నాయి. వెన్నుచూపని తీరుఈ క్రమంలో ఆమె పడిన పాట్లు, ఓడినప్పుడు నేర్చుకున్న గుణపాఠాలు, పోరాటం పెట్టిన పరీక్షలు, భారత రెజ్లింగ్ సమాఖ్యలోని చీడపురుగుల వికృత చేష్టలపై పిడికిలి బిగించిన వైనం, వెన్నుచూపని తీరు ఇవన్నీ కూడా పుస్తక రూపంలో అందుబాటులోకి రానుంది. కొన్ని ఆత్మకథలు ఆసక్తికర, నాటకీయ మలుపులకే పెద్దపీట వేస్తాయి. కానీ సాక్షి స్వీయచరిత్ర మాత్రం మలుపులతో కాదు... ప్రతి అడుగుతో ముడిపడి రాబోతోందని ప్రచురణ సంస్థ వెల్లడించింది. పురుషాధిక్య భారత రెజ్లింగ్ ప్రపంచంలో మహిళలకు ఎదురైన సవాళ్లు, శిక్షణ శిబిరంలో అబలల పాట్లు, బౌట్లలో ప్రత్యర్థులతో కుస్తీ పట్టినట్లే... ఆర్థిక సమస్యలపై పట్టిన కుస్తీ, బాడీ ఇమేజ్, డేటింగ్ ఇలా ఏ ఒక్కటీ వదలకుండా నిగూఢమైన నిజాలన్నీ పుస్తకంలో అక్షర సాక్ష్యాలు కానున్నాయి. ‘నా జీవితాన్ని నిజాయితీగా వివరించాను. ఎదురైన సవాళ్లు, ఎత్తు పల్లాలు ప్రతిఒక్కటి స్పృశించాను’ అని సాక్షి మలిక్ తెలిపింది. -
‘టైమ్’ టాప్–100 జాబితాలో రెజ్లర్ సాక్షి
న్యూఢిల్లీ: ప్రఖ్యాత ‘టైమ్’ మేగజీన్ ప్రకటించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్కు చోటు దక్కింది. 2024 సంవత్సరానికి ‘టైమ్’ ఈ జాబితాను ప్రకటించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో మహిళా రెజ్లర్ల పక్షాన బలంగా నిలబడి ఆమె చేసిన పోరాటానికి ఈ గుర్తింపు లభించింది. ఈ అంశంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్కు ఎదురొడ్డి సాక్షి మలిక్ గట్టిగా తన వాణిని వినిపిస్తూ నిరసనల్లో పాల్గొంది. వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలతో కలిసి ఆమె చేసిన ఈ పోరాటం దేశవిదేశాల్లో వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో బ్రిజ్భూషణ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. -
భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం ఎత్తివేత
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్ను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తివేసింది. మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై న్యాయపోరాటం చేసిన రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్లపై ఎలాంటి వివక్ష చూపరాదని పేర్కొంది. అదే విధంగా.. కక్ష్యసాధింపు చర్యలు చేపట్టకుండా అందరు రెజర్లకు సమాన అవకాశాలు కల్పించాలని డబ్ల్యూఎఫ్ఐకి యూడబ్ల్యూడబ్ల్యూ సూచించింది. సస్పెన్షన్ తొలగిపోవడంతో పారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్లంతా మన జెండా కిందే పోటీపడొచ్చు. పతకం గెలిస్తే పోడియంలో మన పతాకమే రెపరెపలాడతుంది. గడువులోగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్ని నిర్వహించలేకపోవడంతో గత ఆగస్టులో సస్పెన్షన్ వేటు వేసింది. -
సస్పెండ్ చేస్తే సరిపోతుందా?
డిసెంబరు 21న జరిగిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల్లో, మొత్తం పురుషులతో కూడిన 15 మంది సభ్యుల సంఘాన్ని ఎన్నుకున్నారు. వీరిలో 13 మంది సమాఖ్య మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే. ఫలితాలు వెలువడిన తర్వాత విజేత ప్యానెల్ ప్రవర్తించిన తీరు, కొన్ని నెలల క్రితం బ్రిజ్ భూషణ్పై తీవ్రంగా పోరాడిన రెజ్లర్లనే కాకుండా, వారి సాహసోపేత పోరాటానికి మద్దతిచ్చిన వారిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ఈ సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. అయితే, ఈ కొత్త సమాఖ్యను క్రీడా మంత్రిత్వ శాఖ నాటకీయంగా సస్పెండ్ చేసింది. కానీ క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది మాత్రమే సరిపోతుందా? భారత రెజ్లింగ్ సమాఖ్యకు బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే ఎన్నిక కావడం, అనంతరం వారి ప్రవర్తనతో తీవ్ర వేదనకు గురైన ఒలింపి యన్ సాక్షి మాలిక్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది. మరో ఒలింపి యన్ బజరంగ్ పునియా తన ప్రతిష్ఠాత్మక పద్మశ్రీని వెనక్కు ఇచ్చే స్తానని చెబుతూ ప్రధానికి లేఖ రాశాడు. అతని తర్వాత, మూడుసార్లు డెఫ్లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) బంగారు పతక విజేత, ‘గూంగా పహిల్వాన్’గా ప్రసిద్ధి చెందిన రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా సంఘీ భావంగా తన పద్మశ్రీని వెనక్కు ఇచ్చేశాడు. మల్లయోధుల్లో ఈ తీవ్రమైన ప్రతిచర్యలను ప్రేరేపించినది ఫెడరేషన్ ఎన్నికల ఫలితం మాత్రమే కాదు. తన ఆశ్రితుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడు అయిన సంజయ్ సింగ్తో కలిసి నిలబడి... తన మద్దతుదారులతో మెడలో భారీ పూలదండలు వేయించుకుని, విజయ చిహ్నాన్ని రెపరెపలాడించిన బ్రిజ్ భూషణ్ ప్రవర్తన రెజ్లర్లను తీవ్రంగా స్పందించేలా చేసింది. దీనికి తోడుగా, బ్రిజ్ భూషణ్ కుమారుడు ‘దబ్దబా థా... దబ్దబా రహేగా’ (ఆధిపత్యం వహించాం, ఆధిపత్యం వహిస్తాం) అని రాసివున్న ప్లకార్డును పట్టు కోవడం పుండు మీద కారం జల్లింది. ఈ మొత్తం పరిణామాలు, విజేతల అవాంఛనీయ ప్రవర్తన... క్రీడలకు, పౌర సమాజానికి ఇబ్బంది కలిగించే ధోరణిని సూచిస్తున్నాయి. దేశంలో క్రీడాకారిణుల భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఊహించిన ఫలితమే! ఈ ఎన్నికలకు నిజమైన అర్థం ఏమిటి? మహా అయితే 50 మంది ఓటర్లతో కూడిన ఎలక్టోరల్ కాలేజీని నిర్వహించడం బ్రిజ్ భూషణ్కు కష్టమైన పనేం కాదు. పైగా అతను అధికార బీజేపీకి చెందిన శక్తిమంతమైన పార్లమెంటు సభ్యుడు. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు ఊహించనివేం కాదు. కాకపోతే ఈ విజయానికి చెందిన వికార ప్రదర్శన, లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి బ్రిజ్ భూషణ్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మల్లయోధుల ప్రజా ఉద్య మానికి వ్యతిరేక క్లైమాక్స్గా వచ్చింది. జంతర్ మంతర్ వద్ద జరిగిన మల్లయోధుల ప్రత్యేక ఆందోళన చెరగని ముద్ర వేసింది. మహిళలపై లైంగిక వేధింపులు, కుస్తీ పోటీల్లోని ప్రబలమైన అనారోగ్యకర ధోరణి వంటి వాటిని ప్రధాన వేదికపైకి తీసుకురావడంలో ఇది విజయం సాధించింది. మొత్తం జాతి మనస్సాక్షిని కదిలించడంలో 2023లో అత్యంత అద్భుతమైన నిరసన ఉద్యమాలలో ఒకటిగా నిలిచింది. బజరంగ్ పునియాతో పాటు ఇద్దరు మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ చూపిన అద్భుతమైన సంకల్పం, మహిళా సంస్థల నుండి అపూర్వమైన సంఘీభావాన్ని ఆకర్షించింది. రైతు సంఘాలు, క్రీడాకారులు, ఖాప్ పంచాయితీలు, విద్యార్థులు సహా పలు రకాల సామాజిక సంస్థలు సంఘీభావంగా నిలిచాయి. నిరసనను అణచివేసేందుకు పాలక యంత్రాంగం ప్రదర్శించిన మొరటుదనం, పోలీసుల అణచివేత విఫలమవడంతో, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆందోళన చేస్తున్న రెజ్లర్లతో చర్చలు జరపవలసి వచ్చింది. బ్రిజ్ భూషణ్పై కోర్టులో ఛార్జిషీట్ సమర్పిస్తామనీ, అతని సన్నిహితులు రాబోయే ఎన్నికలలో భారత రెజ్లింగ్ సమాఖ్యను స్వాధీనం చేసుకోకుండా చేస్తామనీ హామీ ఇవ్వాల్సి వచ్చింది. కానీ రెండు అంశాలలోనూ మల్లయోధులు మోసపోయారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరాల కింద విచారణ జరిపి దోషిగా తేలేందుకు సరిపడే స్థాయిలో బ్రిజ్భూషణ్సింగ్పై కేసు నమోదైంది. కానీ మైనర్ ఫిర్యాదుదారుల్లో ఒకరిని తన అభియోగాన్ని ఉపసంహరించుకునేలా ప్రభావితం చేశాడని అతడిపై ఆరోపణ వచ్చింది. అలా ఉపసంహరించుకోనట్లయితే పోక్సో చట్టం కింద కచ్చితంగా అతడు అరెస్టు అయ్యే అవకాశం ఉండేది. నిబంధనలను ఉల్లంఘించి... అదేవిధంగా, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత వారి విజయ హాసాలను చూసినప్పుడు, బ్రిజ్ భూషణ్, అతని అనుచరుల ఉడుం పట్టు నుండి రెజ్లింగ్ సమాఖ్యను విడిపిస్తానన్న రెండవ హామీని కూడా ప్రభుత్వం వమ్ము చేసినట్లు తేలింది. జూనియర్ నేషనల్ రెజ్లింగ్ టోర్నమెంట్ వేదికగా ఉత్తరప్రదేశ్లోని గోండాలోని నందిని నగర్ను ఖాయం చేయడం కూడా వారి ఆహంకారానికి నిదర్శనం. ఇది బ్రిజ్ భూషణ్ సొంత నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ప్రదేశం. చాలా మంది అమ్మాయిలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నట్టుగా సాక్షి మాలిక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. బ్రిజ్ భూషణ్ తన సత్తాను బహిరంగంగా ప్రదర్శించడం, జాతీయ టోర్నమెంట్ల వేదికను నిర్ణయించడంలో నియమాలు, నిబంధనలను ఉల్లంఘించడంపై అవార్డులు గెలుచుకున్న క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయాల్సిందిగా ఇది క్రీడా మంత్రిత్వ శాఖపై ఒత్తిడిని పెంచింది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నూతన బాడీ ఆకస్మిక సస్పెన్షన్ కారణంగా, బహుశా తాత్కాలి కంగానైనా విజేతల ఆనందం ఆవిరైపోయినట్లు కనిపిస్తోంది. మరోవైపున బ్రిజ్ భూషణ్ శిబిరం ఈ ఎన్నికల ఫలితాలను కొత్తగా నిర్వచించడానికి ప్రయత్నించింది. తాము అమాయకులమని చేస్తూవచ్చిన వాదనలకు తగిన నిరూపణగా, ఇది కేవలం రాజకీయ ఉద్దేశ్యాలతో ప్రభావిత మైనదిగా చూపేందుకు వాళ్లు ప్రయత్నించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలి ఏమైనా, సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ప్రస్తుత సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. క్రీడల్లో మెరుగైన కెరీర్లు, ఉద్యో గావకాశాలు, వారు గెలిచిన పతకాలతో వచ్చే కీర్తిని చూసిన గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడలను వృత్తిగా స్వీకరించేలా మొగ్గు చూపారు. కానీ ఇటీవలి నెలల్లో జరిగిన సంఘటనలు కచ్చితంగా వారి విశ్వాసాన్ని సడలించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికైన సంఘాన్ని కేవలం సస్పెండ్ చేయడం క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పున రుద్ధరించదు. కొనసాగుతున్న పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. బ్రిజ్ భూషణ్పై బీజేపీ ఎటువంటి క్రమశిక్షణ చర్యా తీసుకోలేదనీ, సుప్రీం కోర్టు ఆదేశించే వరకూ ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదనీ ప్రజలకు స్పష్టమైంది. న్యాయమైన విచారణ జరిగేలా, ఫిర్యాదుదారులపై ప్రభావం చూపకుండా నిరోధించడానికి నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం అవసరం. అన్ని క్రీడా సమాఖ్యలు సమగ్రమైన, సంపూర్ణమైన పరివర్తనల దిశగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం అవశ్యం. మహిళల ప్రవేశాన్ని నిరోధించకుండా ఉండేలా ఒక ప్రత్యేక క్రీడా విధానం కావాలి. ఇటువంటి సమూలమైన మార్పునకు విస్తృత ప్రాతిపదికన ప్రచారం అవసరం. ఇందులో భాగస్వాములందరూ మరింత ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసు కోవాలి. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో మల్లయోధులు ప్రదర్శించిన స్ఫూర్తిని, బలాన్ని ఏకీకృతం చేయడం, మరింతగా విస్తరించడం అవసరం. – జగమతీ సాంగ్వాన్, వాలీబాల్ క్రీడాకారిణి, భీమ్ అవార్డు తొలి మహిళా గ్రహీత, ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు; – ఇంద్రజీత్ సింగ్, ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు -
WFI: మంచో చెడో.. రిటైర్ అయ్యాను! డబ్ల్యూఎఫ్ఐ మంచికి నాంది
Sakshi Malik, Bajrang Punia Reaction On WFI Suspension: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ విధించడాన్ని రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ స్వాగతించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ మంచికి ఇది తొలి అడుగుగా భావిస్తున్నా. మేం ఎందుకిలా పోరాడుతున్నామనే విషయం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి బోధపడుతుందని ఆశిస్తున్నా. మహిళా అధ్యక్షురాలుంటే దేశంలోని అమ్మాయిలకెంతో మేలు జరుగుతుంది’ అని ఆమె అన్నారు. వారి గౌరవం కంటే అవార్డు పెద్దది కాదు ఇక ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చిన టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పూనియా మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నా పురస్కారాన్ని తిరిగిచ్చేశాను. మళ్లీ ఆ అవార్డును స్వీకరించే యోచన లేదు. మాకు న్యాయం జరిగినపుడు ‘పద్మశ్రీ’ని తీసుకుంటా. మన అక్కాచెల్లెళ్లు, కుమార్తెల గౌరవం కంటే ఏ అవార్డు పెద్దది కాదు. ప్రస్తుతం సమాఖ్య వ్యవహారాల్ని అందరు గమనిస్తున్నారు’ అని అన్నారు. సంజయ్ సింగ్కు షాకిచ్చిన క్రీడా శాఖ కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా బజరంగ్ పునియా, జితేందర్ సింగ్ వంటివారు ఆందోళనలో పాల్గొన్నారు. బ్రిజ్భూషణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని నెలరోజులకు పైగా నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం ఇటీవలే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో మాజీ రెజ్లర్ అనిత షెరాన్ ప్యానెల్పై.. బ్రిజ్భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నికను నిరసిస్తూ సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. బజరంగ్ పునియా, బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ ఆమెకు మద్దతుగా పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ఈ పరిణామాల క్రమంలో డబ్ల్యూఎఫ్ఐ రాజ్యాంగాన్ని, నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా సంజయ్ సింగ్ ప్యానెల్పై కేంద్ర క్రీడా శాఖ వేటు వేయడం ఆసక్తికరంగా మారింది. బ్రిజ్ భూషణ్ జోక్యంతోనే సంజయ్ ఎవరినీ సంప్రదించకుండా ఇష్టారీతిన పోటీల నిర్వహణ అంశాన్ని ప్రకటించారని.. అందుకే డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ పడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మంచో.. చెడో.. రిటైర్ అయ్యాను.. నాకేం సంబంధం లేదు ఈ నేపథ్యంలో.. తాను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యానంటూ బ్రిజ్భూషణ్ సింగ్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘నేను 12 ఏళ్ల పాటు సమాఖ్యకు సేవలందించాను. మంచో, చెడో ఏం చేశానో కాలమే సమాధానమిస్తుంది. ఇప్పుడైతే నేను రెజ్లింగ్ నుంచి రిటైర్ అయ్యాను. సమాఖ్యతో సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నాను. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల (లోక్సభ)పైనే దృష్టి పెట్టాను. డబ్ల్యూఎఫ్ఐలో ఏం జరిగినా అది కొత్త కార్యవర్గానికి చెందిన వ్యవహారమే తప్ప నాకు సంబంధించింది కాదు’’ అంటూ బ్రిజ్భూషణ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
నా సోదరి సాక్షిని చూసి గర్విస్తున్నా! చెప్పేదేమీ లేదన్న మంత్రి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై నిరసనగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు స్టార్ రెజ్లర్లు. వీరికి బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా బాసటగా నిలిచాడు. తనకు లభించిన పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ప్రకటించాడు. సాక్షిని చూసి గర్విస్తున్నా డెఫ్ ఒలింపిక్స్ (బధిర ఒలింపిక్స్)లో స్వర్ణ విజేతగా నిలిచిన వీరేందర్ ‘గుంగా పహిల్వాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘భారత మానస పుత్రిక, నా సోదరి సాక్షి మలిక్ కోసం నేను నా ‘పద్మ’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తా. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీజీ... సాక్షిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను. దేశంలోని దిగ్గజ క్రీడాకారులంతా దీనిపై స్పందించాలని నేను కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీరేందర్ ట్వీట్ చేశాడు. స్పందించేందుకు నిరాకరించిన అనురాగ్ ఠాకూర్ మరోవైపు.. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ఫలితాలు, తదుపరి స్టార్ రెజ్లర్ల నిరసన నిర్ణయాలపై స్పందించేందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిరాకరించారు. బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన అథ్లెట్లను అభినందించే కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘దీనిపై నేను ఇదివరకే చెప్పాల్సింది చెప్పా. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను’ అని ఠాకూర్ అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి ఎన్నికకు నిరసనగా కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. అంతేగాక డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ గెలవడం తమపై ప్రభావం చూపుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే.. ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలకగా.. మరో ఒలింపియన్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది? -
WFI: బజరంగ్ పునియా సంచలన ప్రకటన.. ప్రధాని మోదీకి లేఖ
Bajrang Punia Returns Padma Shri: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా కీలక నిర్ణయం తీసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం తనకు అందించిన పద్మ శ్రీ అవార్డుని వెనక్కి ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. మహిళా రెజ్లర్లకు అవమానం జరిగిన దేశంలో తాను ఇలాంటి ‘గౌరవానికి’ అర్హుడిని కాదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్.. తమను లైంగికంగా వేధించాడంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలో.. నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఉద్యమానికి యువత అండగా నిలబడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఆశించిన మేర స్పందన రాలేదు. ఈ క్రమంలో విచారణ కమిటీ నియామకం జరగగా ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. అనేక వాయిదాల అనంతరం గురువారం (డిసెంబరు 21) ఢిల్లీలో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఇందులో కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అనితా షెరాన్పై.. ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. బ్రిజ్ భూషణ్కు ప్రధాన అనుచరుడిగా పేరొందిన అతడు డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ వంటి ఒలింపిక్ విజేతతో పాటు నిరసనలో భాగమైన వినేశ్ ఫొగాట్.. వీరికి మద్దతుగా నిలిచిన బజరంగ్ పునియా తదితరులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. బ్రిజ్ భూషణ్ మళ్లీ డబ్ల్యూఎఫ్ఐలో పెత్తనం చెలాయించడం ఖాయమంటూ సాక్షి.. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఒలింపియన్ బజరంగ్ పునియా సైతం ఓ అడుగు ముందుకు వేశాడు. సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ.. పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి రాసిన లేఖలో.. ‘‘ప్రియమైన ప్రధాన మంత్రి గారు.. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. మీ పనులతో తీరిక లేకుండా ఉంటారని తెలుసు. అయినప్పటికీ.. మీ దృష్టిని ఆకర్షించడం ద్వారా దేశంలో రెజ్లర్ల పరిస్థితి గురించి తెలియజేయడానికి నేను మీకు లేఖ రాస్తున్నాను. బ్రిజ్ భూషణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఈ ఏడాది జనవరిలో మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ నిరసనలో నేను కూడా పాల్గొన్నాను. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే మేము ఆందోళన విరమించాం. కానీ.. ఇంతవరకు బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మూడు నెలలు గడుస్తున్నా అతడిపై ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి మేము మరోసారి వీధుల్లోకి రావాలని భావిస్తున్నాం. ఏప్రిల్ నుంచి మళ్లీ నిరసనకు దిగుతాం. కనీసం అప్పుడైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే ఆశ. జనవరిలో బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా 19 మంది కంప్లైంట్ చేశారు. అయితే, ఏప్రిల్ నాటికి వారి సంఖ్య ఏడుకు తగ్గింది. అంటే పన్నెండు మంది మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ ప్రభావితం చేశారు’’ అంటూ బజరంగ్ పునియా సంచలన విషయాలు వెల్లడించాడు. मैं अपना पद्मश्री पुरस्कार प्रधानमंत्री जी को वापस लौटा रहा हूँ. कहने के लिए बस मेरा यह पत्र है. यही मेरी स्टेटमेंट है। 🙏🏽 pic.twitter.com/PYfA9KhUg9 — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 22, 2023 -
స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్ మెంట్
-
కుస్తీకి సాక్షి స్వస్తి
న్యూఢిల్లీ: సాక్షి మలిక్... మహిళల కుస్తీలో పతకం పట్టుబట్టే స్టార్ రెజ్లర్. కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలు... ఆసియా చాంపియన్íÙప్లో నాలుగు పతకాలు... రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం... ఇవిచాలు సాక్షి ఏస్థాయి రెజ్లరో చెప్పడానికి! దేశానికి పతకాలెన్నో తెచ్చిపెట్టిన ఆమె... గురువారం జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇక చేసేదేమీ లేక బయట పోరాటానికి, బౌట్లో పతకం ఆరాటానికి సెలవిచ్చింది. కన్నీటి చెమ్మతో బరువెక్కిన హృదయంతో రిటైర్మెంట్ ప్రకటించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్భూషణ్ ప్రధాన అనుచరుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బ్రిజ్భూషణ్ పై ఢిల్లీ రోడ్లెక్కి సాక్షి సహా స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ తదితరులు నిరసన తెలిపారు. పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్భూషణ్ను గద్దె దింపాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన గద్దె దిగినప్పటికీ ఆయన నీడ సంజయ్ సింగ్ అధ్యక్షుడు కావడంతో జీర్ణించుకోలేకపోయిన సాక్షి తన ఆటకు టాటా చెప్పేసింది. స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ కూడా సంజయ్ ఎన్నికపై తప్పుబట్టారు. అవును... అందుకే గుడ్బై ‘బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్ల పట్ల ప్రవర్తించిన తీరుపై గళమెత్తాం. కదంతొక్కాం. కేసు నమోదు చేయించాం. కానీ డబ్ల్యూఎఫ్ఐ తాజా ఎన్నికల్లో చివరకు ఆయన వర్గమే గెలిచింది. పదవులన్నీ చేజిక్కించుకుంది. అందుకే కెరీర్కు గుడ్బై చెప్పా. మేం మహిళా అధ్యక్షురాలైతే బాగుంటుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు’ అని మీడియా సమావేశంలో సాక్షి వాపోయింది. 15లో 13 పదవులు బ్రిజ్భూషణ్ వర్గానివే మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ డబ్ల్యూఎఫ్ఐలో తన పట్టు నిరూపించుకున్నాడు. ఆయన బరిలో లేకపోయినా... 15 పదవుల్లో ఆయన వర్గానికి చెందిన 13 మంది పదవుల్ని చేజిక్కించుకున్నారు. అధ్యక్ష పదవి ఎన్నికలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్... 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్పై 40–7 ఓట్ల తేడాతో గెలిచాడు. అనిత వర్గానికి చెందిన ప్రేమ్చంద్ లోచబ్ ప్రధాన కార్యదర్శి పదవి పొందడం... సీనియర్ ఉపాధ్యక్షుడిగా దేవేందర్ సింగ్ కడియాన్ ఎన్నికవడం ఒక్కటే ఊరట. మిగతా 4 ఉపాధ్యక్ష పదవులు బ్రిజ్భూషణ్ క్యాంప్లోని జైప్రకాశ్ (ఢిల్లీ), అశిత్ సాహా (బెంగాల్), కర్తార్ సింగ్ (పంజాబ్), ఫొని (మణిపూర్)లే సొంతం చేసుకున్నారు. ఉపాధ్యక్ష బరిలో దిగిన మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి, మాజీ రెజ్లర్ మోహన్ యాదవ్కు కేవలం ఐదు ఓట్లు లభించడం గమనార్హం. కోశాధికారిగా సత్యపాల్ (ఉత్తరాఖండ్), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ బ్రిజ్భూషణ్ వర్గం వారే ఎన్నికయ్యారు. నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్లపై ఎలాంటి వివక్ష చూపం. ప్రతీకారం తీర్చుకోం. రెజ్లర్లందరిని సమానంగా చూస్తాం. వారికి కావాల్సిన సహకారాలు అందిస్తాం. మేం రెజ్లింగ్ ఆటపైనే దృష్టి పెడతాం. రెజ్లర్ల పొరపాట్లపై కాదు. ఎన్నికైన కొత్త కార్యవర్గమే డబ్ల్యూఎఫ్ఐని నడిపిస్తుంది. రోజువారీ వ్యవహారాల్లో నా ప్రమేయం ఉండదు. వారు కోరితేనే సలహాలిస్తా. –మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ -
40 రోజులు రోడ్లపై నిద్రించాం కానీ.. సాక్షి మాలిక్ సంచలన ప్రకటన
Sakshi Malik Gets Emotional Video Viral: భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ప్రకటన చేసింది. ఆటకు తాను వీడ్కోలు పలుకనున్నట్లు తెలిపింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వంటి వ్యక్తి అనుచరుడి నేతృత్వంలో తాను పోటీల్లో పాల్గొనలేనని.. అంతకంటే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడమే మేలు అని వెల్లడించింది. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి బజరంగ్ పునియా, జితేందర్ వంటి పురుష రెజ్లర్లు మద్దతుగా నిలిచారు. అనితా షెరాన్కు తప్పని ఓటమి ఈ క్రమంలో.. అనేక పరిణామాల అనంతరం బ్రిజ్ భూషణ్ స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఢిల్లీలోని ఒలింపిక్ భవన్ వేదికగా గురువారం జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ వీర విధేయుడిగా పేరొందిన సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన మాజీ రెజ్లర్ అనితా షెరాన్పై విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సాక్షి మాలిక్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘దాదాపు నలభై రోజుల పాటు నిరసన చేస్తూ రోడ్లపై నిద్రించాం. దేశంలోని నలుమూలల నుంచి మాకు మద్దతుగా ఎంతో మంది వచ్చారు. కన్నీటి పర్యంతమైన సాక్షి ఒకవేళ బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి, అతడి అనుంగు అనుచరుడు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు అయితే, నేను రెజ్లింగ్నే వదిలేస్తా’’ అంటూ సాక్షి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక బజరంగ్ పునియా మాట్లాడుతూ.. ‘‘బ్రిజ్ భూషణ్ విశ్వాసపాత్రులెవరూ డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో పాల్గొనరంటూ ప్రభుత్వం మాకిచ్చిన మాటను దురదృష్టవశాత్తూ నిలబెట్టుకోలేకపోయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. బ్రిజ్ భూషణ్కు సన్నిహితుడు కాగా డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన వ్యక్తి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో భాగమైన అతడు బ్రిజ్ భూషణ్కు అత్యంత సన్నిహితుడని సమాచారం. ఈ నేపథ్యంలో ఇకపై రెజ్లింగ్ సమాఖ్యలో విధివిధానాల రూపకల్పనపై అతడు కచ్చితంగా బ్రిజ్ భూషణ్ సూచనలు, సలహాలు తీసుకుంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సాక్షి మాలిక్ వంటి వాళ్లు ఇలాంటి వ్యక్తి నేతృత్వంలో తాము ఆటను కొనసాగించలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Delhi: Wrestler Sakshi Malik says "We slept for 40 days on the roads and a lot of people from several parts of the country came to support us. If Brij Bhushan Singh's business partner and a close aide is elected as the president of WFI, I quit wrestling..." pic.twitter.com/j1ENTRmyUN — ANI (@ANI) December 21, 2023 -
మెల్టింగ్ పోజుల్లో మాళవిక.. వయ్యారంగా హాట్ బ్యూటీ
బ్లాక్ డ్రస్లో మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్ ఒంపుసొంపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న సాక్షి మాలిక్ జిమ్లో హాట్ బ్యూటీ అన్వేషి జైన్ సెల్ఫీ పోజులు దేశీ ఔట్ఫిట్లో బిగ్బాస్ బ్యూటీ సిరి హన్మంతు వింత పోజుల్లో 'ఆదిపురుష్' కృతి సనన్ ఎల్లో డ్రస్లో 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ నుపుర్ నవ్వుతో చంపేస్తున్న 'గుంటూరు కారం' మీనాక్షి View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Gayatri Bhardwaj (@gayatribhardwaj__) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఇకపై రోడ్డెక్కం... కోర్టులోనే తేల్చుకుంటాం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెండుసార్లు నిరసన దీక్ష చేపట్టిన స్టార్ రెజ్లర్ల వైఖరి మారింది. తమకు న్యాయం దక్కేవరకు ఆయనపై పోరాటం కొనసాగుతుందని, అయితే అది కోర్టులోనే తేల్చుకుంటామని... ఇకపై రోడ్డెక్కబోమని రెజ్లర్లు ప్రకటించారు. ‘డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మేం వేచిచూస్తాం. కానీ బ్రిజ్భూషణ్పై మా పోరాటాన్ని మాత్రం విరమించే ప్రసక్తేలేదు’ అని వినేశ్ ఫొగాట్ ట్వీట్ చేసింది. అనంతరం కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటామని వినేశ్తో పాటు సాక్షి మలిక్ తెలిపింది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై స్టే భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. తాజాగా ఇప్పుడు గువాహటి హైకోర్టు స్టేతో మరో వాయిదా తప్పేలాలేదు. అస్సాం సంఘం తమ సభ్యత్వాన్ని గుర్తించకపోవడం, ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టులో పిటీషన్ వేయగా వచ్చే నెల 11న జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై కోర్టు స్టే విధించింది. -
సాక్షి మాలిక్ పై బబితా ఫోగట్ ఫైర్.. ఇదీ మీ అసలు రంగు..
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు చార్జిషీటు నమోదు చేసిన తర్వాత మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, బబితా ఫోగట్ మాటల యుద్ధానికి తెరతీశారు. సాక్షి మాలిక్, సత్యవర్త్ కడియాన్.. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణల కేసులో ఢిల్లీ పోలీసులు చార్జిషీటు నమోదు చేసిన తర్వాత రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ ఆమె భర్త సత్యవర్త్ కడియాన్ తో కలిసి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో వారు మాట్లాడుతూ.. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు గురై చేసింది కాదు. రెజ్లింగ్ సమాఖ్యలో 90 శాతం మందికి 10-12 ఏళ్లుగా ఈ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలుసు. మాలో ఐక్యత లేకపోయినా కొంతమంది మాత్రం నిరసన తెలపడానికి ముందుకు వచ్చారు. దీక్ష చేయడానికి అనుమతి తీసుకుంది కూడా బీజేపీ నాయకులైన బబితా ఫోగట్, తీరథ్ రాణాలేనని తెలిపారు. అనంతరం ఆ అనుమతి లేఖను కూడా చూపించారు. బబితా కౌంటర్.. ఈ వీడియోకు కామన్ వెల్త్ బంగారు పతక విజేత బబితా ఫోగట్ ట్విట్టర్లో కాస్త ఘాటుగానే స్పందించింది. ఈ వీడియో చూశాక మిమ్మల్నిద్దరినీ చూసి నాకు కొంచెం బాధగా అనిపించింది. తర్వాత కాసేపు నవ్వుకున్నాను కూడా. ఇలాంటి ఒక విషయాన్ని చెప్పి దాక్కుంటామంటే సరికాదు మిత్రమా. మీరు చూపించిన లేఖలో నా పేరు గానీ నా సంతకం గానీ లేదు. పరోక్షంగా కూడా నా ప్రస్తావన ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నాకు ప్రధానిపైనా, మన న్యాయ వ్యవస్థపైనా నమ్మకముందని నేను మొదటిరోజు నుంచే చెబుతున్నాను. ఒక మహిళగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నా సహచరులపై నాకు కూడా ప్రేమ, పట్టింపులు ఉన్నాయి. అందుకే ఈ విషయాన్ని మొదట ప్రధాన మంత్రి, హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించాను. కానీ వారు మాత్రం కాంగ్రెస్ లీడర్లు ప్రియాంకా గాంధీ, రేప్ కేసుల్లో నిందితులైన దీపేందర్ హుడాలను ఆశ్రయించారు. ఇప్పుడిప్పుడే ప్రజలు మీ అసలు రూపాన్ని చూస్తున్నారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున మీరు చేసిన హడావుడి, గంగానదిలో పతకాలను విసిరేస్తామని చెప్పడం చూస్తుంటే ఇదంతా కాంగ్రెస్ నాయకులు ఆడిస్తున్న ఆటని అందరికీ అర్ధమవుతోందని తెలిపారు. एक कहावत है कि ज़िंदगी भर के लिये आपके माथे पर कलंक की निशानी पड़ जाए। बात ऐसी ना कहो दोस्त की कह के फिर छिपानी पड़ जाएँ । मुझे कल बड़ा दुःख भी हुआ और हँसी भी आई जब मैं अपनी छोटी बहन और उनके पतिदेव का विडीओ देख रही थी , सबसे पहले तो मैं ये स्पष्ट कर दूँ की जो अनुमति का काग़ज़… https://t.co/UqDMAF0qap — Babita Phogat (@BabitaPhogat) June 18, 2023 దీనికి మళ్ళీ సాక్షి మాలిక్ గట్టిగ కౌంటర్ ఇచ్చింది. సహచరులంతా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మీరు మాత్రం ప్రభుత్వం ఒడిలో చల్లగా సేదదీరుతున్నారు. మీ స్వప్రయోజనాల కోసం సహచరులకు ఎటువంటి సాయం చేయకపోగా ఇలా హేళన చేయడం సరికాదని అన్నారు. वीडियो में हमने तीरथ राणा और बबीता फोगाट पर तंज कसा था कि कैसे वे अपने स्वार्थ के लिए पहलवानों को इस्तेमाल करना चाह रहे थे और कैसे पहलवानों पर जब विपदा पड़ी तो वे जाकर सरकार की गोद में बैठ गये. हम मुसीबत में ज़रूर हैं लेकिन हास्यबोध इतना कमज़ोर नहीं हो जाना चाहिए कि ताकतवर को… https://t.co/xGn81uHyav — Sakshee Malikkh (@SakshiMalik) June 18, 2023 ఇది కూడా చదవండి: రెజ్లర్లకు పోలీసుల నోటీసులు.. వీడియోలు ఫోటోలు ఉన్నాయా? -
'రాజీకి రావాలని మాపై ఒత్తిడి ఉంది'.. రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు..
ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణల కేసులో నిరసనలు కొనసాగిస్తున్న తమపై తీవ్రమైన ఒత్తిడి ఉందని రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పారు. రాజీకి రావాలని నిందితుని మనుషులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదును వెనుకకు తీసుకోవాలని ఒత్తిడి చేసినందునే మైనర్ రెజ్లర్ తండ్రి మాట మార్చారని అన్నారు. 'నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేయించాలని మొదటి నుంచి మేం కోరుతున్నాం.. బయట ఉండడం వల్ల కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు' అని ఆమె ఆరోపించారు. బ్రిజ్ భూషణ్పై చేసింది తప్పుడు ఫిర్యాదని బాధిత మైనర్ రెజ్లర్ తండ్రి మీడియాకు తెలిపడంతో అంతా అవాక్కయ్యారు. 2022లో అండర్-17 ఛాంపియన్షిప్ ట్రయల్స్ ఫైనల్స్లో తన కూతురు ఓడిపోయిందని తెలిపారు. ఆ పోటీలో తన కూతురు ఓటమికి కారణమైన రెఫరీని డబ్ల్యూఎఫ్ డిప్యూటేషన్ మీద పంపించిందని, దాని అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కాబట్టే ఆయనపై కోపంతో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ను ఎలాగైనా ఆ సీటు నుంచి దించే ఉద్దేశంతో నిరసనలు కొనసాగిస్తున్న రెజ్లర్లు.. కేంద్రం నుంచి లభించిన హామీతో ఓ మెట్టు దిగారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్తో సమావేశమైన అనంతరం జూన్ 15వ తేదీ దాకా ఆందోళనలను చేపట్టబోమని ప్రకటించారు. అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. అలా అయితే.. ఆసియా గేమ్స్ ఆడబోము.. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణల కేసులో తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ ఏడాది వచ్చే ఆసియా గేమ్స్ ఆడబోమని రెజ్లర్లు అల్టిమేటం జారీ చేశారు.ప్రతిరోజూ మానసికంగా తాము వేదనను అనుభవిస్తున్నామని తెలిపారు. హరియాణాలోని సోనిపట్లో ఈ రోజు నిర్వహించిన కాప్ పంచాయత్లో టాప్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్తో రెజ్లర్లు సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఐదు డిమాండ్లను వారు కోరారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలను స్వతంత్రగా నిర్వహించాలని, బ్రిజ్ కుటుంబ సభ్యులెవరూ అందులో పాల్గొనకుండా చూడాలని కేంద్రాన్ని రెజ్లర్లు కోరినట్లు తెలుస్తోంది. వీటితో పాటు తమపై పెట్టిన కేసులను సైతం వెనక్కి తీసుకోవాలని మంత్రి అనురాగ్ ఠాకూర్ను వాళ్లు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మహిళా రెజ్లర్ల భద్రతను ప్రధానాంశంగా పరిగణిస్తామని, అలాగే.. వాళ్లపై ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకుంటామని మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం చర్చల సారాంశాన్ని మీడియాకు తెలిపారు. అయితే.. బ్రిజ్ అరెస్ట్పై మాత్రం ఇరువర్గాలు స్పందించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి:రెజ్లర్ల పోరాటానికి ఊహించని షాక్.. అసలు నిజం ఇదేనా? -
నిరసన నుంచి తప్పుకున్నట్లు వార్తలు.. రెజ్లర్ సాక్షి మాలిక్ క్లారిటీ
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు గత రెండు నెలలగా ఆందోళన చేస్తున్న విషయం విధితమే. అయితే ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రెజర్లు కలిసారు. ఈ క్రమంలో అమిత్ షాను కలిసిన తర్వాత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఈ పోరాటం నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపించాయి. ఆమె తిరిగి రైల్వేలో తన విధుల్లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై సాక్షి మాలిక్ స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలే అని ఆమె కొట్టిపారేసింది. "ఇవన్నీ రూమర్స్ మాత్రమే. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. మాలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. వెనక్కి తగ్గే ఆలోచన కూడా మాకు లేదు. మేము ఉద్యోగాల్లో చేరనంత మాత్రాన ఈ ఆందోళన నుంచి తప్పుకున్నట్లు కాదు. మాకు న్యాయం జరిగేంతవరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాము. దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు అని ఆమె ట్విటర్లో పేర్కొంది. కాగా స్టార్ రెజర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నారు. ये खबर बिलकुल ग़लत है। इंसाफ़ की लड़ाई में ना हम में से कोई पीछे हटा है, ना हटेगा। सत्याग्रह के साथ साथ रेलवे में अपनी ज़िम्मेदारी को साथ निभा रही हूँ। इंसाफ़ मिलने तक हमारी लड़ाई जारी है। कृपया कोई ग़लत खबर ना चलाई जाए। pic.twitter.com/FWYhnqlinC — Sakshee Malikkh (@SakshiMalik) June 5, 2023 చదవండి: మనసున్న మారాజు వీరేంద్ర సెహ్వాగ్.. ఒడిశా రైలు ప్రమాద బాధిత పిల్లలకు..! -
Wrestlers Protest: ఆమె మైనర్ కాదంటూ వీడియో! మండిపడ్డ స్వాతి.. వెంటనే
Wrestlers’ protest against Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాజధాని ఢిల్లీ వేదికగా మహిళా రెజ్లర్లు, వారికి మద్దతుగా బజ్రంగ్ పునియా తదితరులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. కాగా బ్రిజ్ భూషణ్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను ఆమె అంకుల్నంటూ వీడియో విడుదల చేశాడు. ఆమె మైనర్ కాదంటూ వీడియో అందరూ అనుకుంటున్నట్లు సదరు రెజ్లర్ మైనర్ కాదని, ఆమె వయసు దాదాపు 20 ఏళ్లకు పైనే అంటూ ఆధారాలుగా కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సదరు వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మండిపడ్డ స్వాతి మలివాల్.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఈ మేరకు.. ‘‘బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా కేసు పెట్టిన మైనర్కు అంకుల్నంటూ ఓ వ్యక్తి మీడియా ముందు ఆమె ఐడెంటీని బయటపెట్టాడు. చట్టవిరుద్ధ చర్యకు పాల్పడిన అతడిపై పోక్సో చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు నేను నోటీస్ జారీ చేస్తున్నాను. ఎందుకంటే.. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. కాబట్టి ఆయన బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని స్వాతి మలివాల్ బుధవారం ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంలో సింగ్ ప్రమేయం కూడా ఉందేమో విచారించి.. ఆయనను అరెస్టు చేయాల్సిందిగా మహిళా కమిషన్ తరఫున డిమాండ్ చేశారు. రెజ్లర్ల పట్ల పోలీసుల చర్యపై ఆగ్రహం కాగా భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా తదితరులు గత కొన్ని రోజులుగా బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలనే డిమాండ్తో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలు సహా కొంతమంది క్రీడాకారులు వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించగా.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కఠినంగా ప్రవర్తించారు. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో తాము సాధించిన పతకాలు గంగలో నిమజ్జనం చేస్తామంటూ వాళ్లు హరిద్వార్ బయల్దేరగా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఆ ప్రయత్నం విరమించారు. ఇదిలా ఉంటే.. భారత రెజ్లర్లపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య విచారం వ్యక్తం చేసింది. భారత్లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ WTC: నెట్స్లో శ్రమిస్తున్న యశస్వి.. దగ్గరకొచ్చి సలహాలు ఇచ్చిన కోహ్లి! వీడియో -
పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్కు చేరుకున్న రెజ్లర్లు
భారత అగ్ర రెజ్లర్ల నిరసన రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్త ఘర్షణలకు దారితీయడంతో వారిలో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుని నిరహారదీక్ష చేపట్టేందుకు దారితీసింది. ఈ మేరకు భారత అగ్ర స్థాయి రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తాం, ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్కు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. #WATCH | Uttarakhand: Wrestlers reach Haridwar to immerse their medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations.#WrestlersProtest pic.twitter.com/WKqSJQyaH0 — ANI (@ANI) May 30, 2023 అంతకుముందు రెజ్లర్ సాకి మాలిక్ ట్విట్టర్ వేదికగా తమ రెజ్లర్లంతా హరిద్వార్ వెళ్లి గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు పతకాలను విసిరేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేయకపోతే బతకడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం అని ట్వీట్ చేశారు. అయిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ మమ్మల్ని వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెల్లటి దుస్తులు ధరించి అక్కడి దృశ్యాలను క్లిక్ మనిపించడం మమ్మల్ని కలిచివేసింది. అతను అలా తెల్లటి దుస్తులు ధరించడంలో అర్థం తానే వ్యవస్థ అని చెప్పకనే చెప్పినట్లు ఉందని ట్విట్టర్లో రెజ్లర్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. అందుకనే మాకు ఈ పతకాలు వద్దు. ఆ వ్యవస్థ మాకు పతకాలు మెడలో వేసి ముసుగు వేసి గొప్ప ప్రచారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కి వ్యతిరేకంగా లైంగిక ఆరోపణల నేపథ్యంలో వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ పునియా తదితర రెజ్లర్లు ఏప్రిల్ 26 నుచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు శరణ్సింగ్పై రెండు కేసులు నమోదు చేశారు. ఐతే రెజ్లర్లు మాత్రం అతన్నిఅరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులతో సహ చాలామంది మద్దతు వారికి లభించడం గమనార్హం. అదీగాక ఇటీవల జరిగిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వెలుపలు రెజ్లర్లు శాంతియుతంగా నిరసనలు చేసేందుకు యత్నించారు. ఐతే ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరవధిక నిరహార దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. "We will throw our medals in river Ganga in Haridwar today at 6pm," say #Wrestlers who are protesting against WFI (Wrestling Federation of India) president Brij Bhushan Sharan Singh over sexual harassment allegations pic.twitter.com/Mj7mDsZYDn — ANI (@ANI) May 30, 2023 (చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన..వృధా చేసిన నీటికి డబ్బు చెల్లించమంటూ లేఖ) -
ఇక నో మోర్ పర్మిషన్.. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనపై పోలీసుల నిర్ణయం
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన సందర్భంగా నిన్న(ఆదివారం) పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ నిరసనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని 12 మందిపై కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు షాక్ ఇచ్చారు. ఇక నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతుల కోసం గనుక వాళ్లు దరఖాస్తు చేసుకుంటే.. జంతర్ మంతర్ కాకుండా వేరే ఎక్కడైనా అనుమతులు ఇస్తామంటూ న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. ‘‘వాళ్లు(రెజ్లర్లు) పోలీసుల అభ్యర్థనను పట్టించుకోకుండా పార్లమెంట్ మార్చ్ను చేపట్టి.. చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. అందుకే జంతర్ మంతర్ వద్ద వాళ్లు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది!. రెజ్లర్లు గనుక భవిష్యత్తులో మళ్లీ నిరసనకు దరఖాస్తు చేస్తే.. జంతర్ మంతర్ కాకుండా అనువైన ప్రదేశంలో వారి నిరసనకు అనుమతిస్తాం అని డీసీపీ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.. कुश्ती पहलवानों का धरना और प्रदर्शन निर्बाध तरीक़े से जंतर मंतर की सूचित जगह पर चल रहा था। कल, प्रदर्शकारियों ने तमाम आग्रह और अनुरोध के बावजूद कानून का उन्मादी रूप से उल्लंघन करा। अतः चल रहे धरने को समाप्त कर दिया गया है। — DCP New Delhi (@DCPNewDelhi) May 29, 2023 ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగాయి. మొత్తం 38 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగింది. భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేదించారని, అతన్ని అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెండు ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. కానీ, రెజ్లర్లు మాత్రం బ్రిజ్ను అరెస్ట్ చేసే దాకా నిరసనలు ఆపమని చెబుతున్నారు. VIDEO | Security heightened at Jantar Mantar in Delhi ahead of the 'Mahila Samman Mahapanchayat' called by protesting wrestlers today. pic.twitter.com/rP0EXvLuwg — Press Trust of India (@PTI_News) May 28, 2023 Video Source: PTI News అవి మార్ఫింగ్ ఫొటోలు ‘‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావడం లేదు. మాకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’’.. అరెస్టు తర్వాత వ్యానులో వినేష్, సంగీత ఫొగాట్లు నవ్వుతున్నట్లు ఉన్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై రెజ్లర్ సాక్షి మాలిక్ పై విధంగా స్పందించారు. ఇదీ చదవండి: రాజదండం ఎవరి కోసం? -
శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు కొన్ని వారాలుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించిన రెజ్లర్ సంఘ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్పై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు గత కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి పలు వర్గాల నుంచి పూర్తి మద్దతు లభించింది. అయితే ఆదివారం రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు ఆదివారం కొత్త పార్లమెంటు వైపు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఇవాళే కొత్తగా ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవనం ముందు బ్రిజ్భూషణ్పై చర్యలకు డిమాండ్ చేస్తూ ''మహిళా మహాపంచాయత్'' నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ఈ మేరకు నూతన పార్లమెంట్ భవనం వైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు జంతర్మంతర్ వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న పలువురు రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, మరో రెజ్లర్ బజరంగ్ పూనియా ఉన్నారు. కాగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజ్లర్లు మండిపడుతున్నారు. మేం బారీకేడ్లు విరగొట్టామా..? ఇంకేమైనా హద్దులు మీరామా..? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. #WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they try to march towards the new Parliament from their site of protest at Jantar Mantar.Wrestlers are trying to march towards the new Parliament as they want to hold a women's Maha Panchayat in front of… pic.twitter.com/3vfTNi0rXl— ANI (@ANI) May 28, 2023 #WATCH | Mahapanchayat will certainly be held today. We're fighting for our self-respect.They're inaugurating the new Parliament building today, but murdering democracy in the country.We appeal to the administration to release our people detained by police: Wrestler Bajrang Punia pic.twitter.com/VI4kGLxGWV— ANI (@ANI) May 28, 2023 To all my international fraternity Our Prime Minister is inaugurating our new parliamentBut on the other hand, Our supporters has been arrested for supporting us.By arresting people how we can call us “mother of democracy”India’s daughters are in pain.— Sakshee Malikkh (@SakshiMalik) May 28, 2023 जंतर मंतर पर सरेआम लोकतंत्र की हत्या हो रही एक तरफ़ लोकतंत्र के नये भवन का उद्घाटन किया है प्रधानमंत्री जी ने दूसरी तरफ़ हमारे लोगों की गिरफ़्तारियाँ चालू हैं. pic.twitter.com/ry5Wv9xn5A— Vinesh Phogat (@Phogat_Vinesh) May 28, 2023 చదవండి: స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్ బలం.. జాగ్రత్త -
ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కేసు ముగిస్తున్నాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్ నెరవేరడంతో కేసును ముగిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆయనను అరెస్టు చేయలేకపోయామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఎదురుదెబ్బ కాదని, బ్రిజ్భూషణ్ను అరెస్టు చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని బజరంగ్, వినేశ్, సాక్షి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించిందని దీనిని కూడా పరిశీలిస్తామని వినేశ్ తెలిపింది. -
వారిని ఉరితీయాలి.. రెజ్లర్లకు సీఎం కేజ్రీవాల్ మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన చేస్తున్న భారత రెజ్లర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. మహిళలను లైంగికంగా వేధించే వారిని ఉరితీయాలని అన్నారు. కాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ లైంగిక వేధింపులపై రెజ్లర్లు మరోసారి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లను కలిసిన సీఎం కేజ్రీవాల్ వారి నిరసనకు సంఘీభావం ప్రకటించారు. దేశం గర్వించేలా చేసిన రెజ్లర్లు గత వారం రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారని తెలిపారు. వారిని అవమానించారని.. మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేసేవారిని ఉరితీయాలని అన్నారు. ఎఫ్ఐఆర్లు నమోదైన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ను కేంద్రం కాపాడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్స్టర్కు పదేళ్ల జైలు.. ‘లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి (బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్) ఎంత శక్తిమంతుడో ఆలోచించాలి. ఆయనపై కేసు నమోదుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. జంతర్మంతర్ వద్ద నిరసన చేపట్టిన అన్నా హజారే దేశ రాజకీయాలను మార్చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రెజ్లర్లు చేస్తున్న నిరసన కూడా క్రీడల్లో మార్పు తీసుకువస్తుందని తెలిపారు. దేశాన్ని ప్రేమించే వారు సెలవు తీసుకుని వారి నిరసనలో పాల్గోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. Delhi CM @ArvindKejriwal पहलवानों से मिलने जंतर-मंतर पहुंचे। BJP के बाहुबली नेता द्वारा महिला खिलाड़ियों के यौन उत्पीड़न के ख़िलाफ़ न्याय की मांग को लेकर सभी Wrestlers 7 दिन से धरने पर बैठे हैं।#KejriwalStandsWithChampions pic.twitter.com/G3Za1u9EqH — Aam Aadmi Party Delhi (@AAPDelhi) April 29, 2023 మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు లైంగిక వేధింపుల కేసునమోదు చేశారు. మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బ్రిజ్ భూషణ్ సింగ్పై కేసు నమోదవ్వడాన్ని స్వాగతించిన రెజ్లర్లు.. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ను అన్ని పదవుల నుంచి తొలగించి అరెస్టు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తాను నేరస్థుడిని కానని, ఏ తప్పు చేయలేదని బ్రిజ్ భూషణ్ సింగ్ చెబుతున్నారు. రాజీనామా చేయడమంటే వారి ఆరోపణలను అంగీకరించడమే అవుతుందని, పదవి నుంచి వైదొలగనని పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. ప్రతి సారి ఆ పార్టీ ఖతమైంది: మోదీ ये Jantar Mantar की पवित्र धरती है — हम यहीं से निकले थे। यहां हुए आंदोलन ने देश की राजनीति बदल दी थी। आज मेरा दिल कहता है कि इन बच्चों, इन पहलवानों का ये आंदोलन खेल व्यवस्था में मूल परिवर्तन करेगा। — CM @ArvindKejriwal #KejriwalStandsWithChampions pic.twitter.com/eN1jFyBUmP — Aam Aadmi Party Delhi (@AAPDelhi) April 29, 2023 -
సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం!
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని... వెంటనే ఆయనను అరెస్టు చేయాలని భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయకపోతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న ఈ స్టార్ రెజ్లర్లు స్పష్టం చేశారు. కొందరు మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించారని తాము చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తేలితే తమపైనే కేసు నమోదు చేయాలని 2016 రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన సాక్షి వ్యాఖ్యానించింది. మూడు నెలల క్రితం చేపట్టిన నిరసనను విరమించి తప్పు చేశామని... ఈ విషయంలో తమను కొందరు తప్పుదోవ పట్టించారని సాక్షి, వినేశ్, బజరంగ్ విచారం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తుల మాటలు వినబోమని, రెజ్లింగ్ శ్రేయోభిలాషుల సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కన్నౌట్ ప్లేస్ పోలీసు స్టేషన్కు తాము వెళ్లినా పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన బజరంగ్ పూనియా తెలిపాడు. ‘అంతర్జాతీయ టోర్నీల్లో దేశం కోసం పతకాలు సాధించినపుడు కేంద్ర ప్రభుత్వం సన్మానిస్తుంది. కానీ మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే మాత్రం ఇదే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని బజరంగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో కేంద్ర క్రీడా శాఖ నియమించిన పర్యవేక్షక కమిటీ మా పట్ల పక్షపాతంగా వ్యవహరించింది. కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే లైంగిక వేధింపులకు గురైన బాధితుల వివరాలు తెలుస్తాయి. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కావడం, ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్లు అనిపిస్తోంది’ అని ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ విజేత వినేశ్ వ్యాఖ్యానించింది. మరోవైపు మే 7వ తేదీన జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలకు గుర్తింపు లేదని... భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటయ్యే అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షక కమిటీ తమ నివేదిక అందించిందని... నివేదికను పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా క్రీడా శాఖ వివరించింది. పర్యవేక్షక కమిటీ నివేదిక ప్రకారం డబ్ల్యూఎఫ్ఐలో పారదర్శకత కొరవడిందని... రెజ్లర్ల సమస్యలు వినేందుకు, పరిష్కరించేందుకు ఎలాంటి వ్యవస్థ లేదని తాము గుర్తించినట్లు తెలిపింది. విచా రణ పూర్తి చేసి నివేదిక అందించడంతో పర్యవేక్షక కమిటీ పని ముగిసిందని క్రీడా శాఖ తెలిపింది. -
ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు పంచాయతీ
ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన మూడోరోజు కొనసాగింది. ఈ వ్యవహారంపై గురువారం కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆందోళనను మరింత ఉదృతం చేసిన రెజ్లర్లు శుక్రవారం భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు లేఖ చేశారు. రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న అవకతకవలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెజ్లర్లు పీటీ ఉషకు రాసిన లేఖలో ప్రధానంగా నాలుగు డిమాండ్లను నివేధించారు. కాగా ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ అంశం తనకు బాధ కలిగించిందని.. బాగా డిస్టర్బ్ చేసిందన్నారు. రెజ్లర్లు రాసిన లేఖ తనకు అందిందని.. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఐవోఏ ముందు రెజ్లర్లు ఉంచిన నాలుగు ప్రధాన డిమాండ్లు ► లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తక్షణమే కమిటీని ఏర్పాటు చేయాలి. ► డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవికి బ్రిజ్భూషణ్ వెంటనే రాజీనామా చేయాలి. ► భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేయాలి ► డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలను కొనసాగించేందుకు రెజ్లర్లను సంప్రదించి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి @PMOIndia @AmitShah @ianuragthakur @PTUshaOfficial pic.twitter.com/PwhJjlawPg — Vinesh Phogat (@Phogat_Vinesh) January 20, 2023 రాజీనామా చేసే ప్రస్తకే లేదు: బ్రిజ్ భూషణ్ అంతకముందు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు.. ఎంపీ బ్రిజ్ భూషణ్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రలో భాగమే అని ఆరోపించిన ఆయన రాజీనామా చేసే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలను బ్రిజ్ భూషణ్ కొట్టిపారేశారు.ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్మీట్లో మాట్లాడనున్నట్లు తెలిపారు. హర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు తమ వద్ద ఉన్నారని బ్రిజ్ మీడియాకు తెలిపారు. చదవండి: ‘సాయ్’ స్పందన సరిగా లేదు రెజ్లర్ల మీటూ ఉద్యమం..చర్చలు విఫలం!.. ఉత్కంఠ -
CWG 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు. బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో భారత రెజ్లర్లు మరోసారి తమ ‘పట్టు’ చాటుకున్నారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు. కేవలం రెండు పాయింట్లు ఇచ్చి... పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. లాచ్లాన్ మౌరిస్ మెక్నీల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 9–2తో గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో లోవీ బింగామ్ (నౌరూ)పై, క్వార్టర్ ఫైనల్లో జీన్ గలియాన్ (మారిషస్)పై, సెమీఫైనల్లో జార్జి రామ్ (ఇంగ్లండ్)పై బజరంగ్ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్న దీపక్ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్ ఇనామ్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్ 3–1తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్)పై, తొలి రౌండ్లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్ (న్యూజిలాండ్)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్ గ్రెవాల్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆరోన్ జాన్సన్ (జమైకా)పై గెలుపొందాడు. సూపర్ సాక్షి... మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మలిక్ ‘బై ఫాల్’ పద్ధతిలో కెనడా రెజ్లర్ అనా పౌలా గోడినెజ్ను ఓడించి తొలిసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో గేమ్స్లో రజతం, 2018 గోల్డ్కోస్ట్ గేమ్స్లో కాంస్యం నెగ్గిన సాక్షి మూడో ప్రయత్నంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఒకదశలో సాక్షి 0–4తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని అనా పౌలా భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్కు అట్టిపెట్టి ‘బై ఫాల్’ పద్ధతిలో విజయాన్ని అందుకుంది. 57 కేజీల ఫైనల్లో అన్షు మలిక్ 3–7తో ఒడునాయో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దివ్య కక్రాన్ కేవలం 20 సెకన్లలో తన ప్రత్యర్థి టైగర్ లిలీ లెమాలి (టోంగా)పై గెలిచింది. -
Sakshi Malik: ఐదేళ్ల తర్వాత మరోసారి పసిడి పతకం!
అల్మాటీ (కజకిస్తాన్): భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బంగారంతో మురిసింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్లో ఆమె 62 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇదే టోర్నీలో భారత రెజ్లర్లు మాన్సి అహ్లావత్ (57 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు) కూడా పసిడి పతకాలు సాధించారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో సాక్షి 7–4తో ఇరినా కుజ్నెత్సొవ (కజకిస్తాన్)ను ఓడించింది. చివరిసారిగా సాక్షి 2017 కామన్వెల్త్ చాంపియన్షిప్లో బంగారం గెలిచింది. తర్వాత రెండు ఆసియా చాంపియన్ షిప్ (2020, 2022)లలో కాంస్యాలతోనే సరిపెట్టుకుంది. 57 కేజీల ఫైనల్లో మాన్సి 3–0తో ఎమ్మా టిసినా (కజకిస్తాన్)పై గెలుపొందింది. నలుగురు రెజ్లర్లు మాత్రమే తలపడిన 68 కేజీల కేటగిరీలో దివ్య రెండు బౌట్లలో అలవోక విజయాలు సాధించింది. కానీ ఆఖరి బౌట్లో 10–14తో బొలొర్తుంగలగ్ జోరిట్ (మంగోలియా) చేతిలో ఓడింది. అయితే జోరిట్ కూడా రెండు బౌట్లలో గెలుపొందడంతో ఆమె, దివ్య సమఉజ్జీలుగా నిలిచారు. ఓవరాల్గా ఎక్కువ పాయింట్లు గెలిచిన దివ్యనే విజేతగా ప్రకటించారు. చదవండి: మన అమ్మాయిలు భేష్: నందినికి స్వర్ణం.. దీప్తికి రజతం.. రజితకు కాంస్యం -
‘కామన్వెల్త్’కు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్
లక్నో: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ భారత జట్టులో పునరాగమనం చేసింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో ఇంగ్లండ్లోని బర్మింగ్హమ్లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే భారత రెజ్లింగ్ జట్టులో వినేశ్ చోటు సంపాదించింది. రియో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన మరో సీనియర్ రెజ్లర్ సాక్షి మలిక్ కూడా జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. సోమవారం జరిగిన సెలెక్షన్ ట్రయల్స్లో వినేశ్ 53 కేజీల విభాగంలో... సాక్షి 62 కేజీల విభాగంలో విజే తగా నిలి చి కామన్వెల్త్ గేమ్స్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. వినేశ్, సాక్షిలతోపాటు పూజా (50 కేజీలు), అన్షు (53 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు), పూజా సిహాగ్ (76 కేజీలు) కూడా ‘కామన్వెల్త్’లో భారత్ తరఫున ఆడతారు. -
Sakshi Malik: 60 లక్షలకుపైగా సబ్స్క్రైబర్స్.. ఇంతకీ ఆమె ఏం చేస్తుంది?
ప్రతికూల పరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగేవారు కొందరైతే, తమ అభిరుచులను కెరియర్గా మలుచుకుని ఉన్నత స్థాయికి చేరి స్ఫూర్తిగా నిలుస్తుంటారు మరికొందరు. ఈ కోవకు చెందిన అమ్మాయే ప్రముఖ మోడల్ సాక్షి మాలిక్. సాంకేతిక విద్యనభ్యసించి, కార్పొరేట్ ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ తనకిష్టమైన ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టి మంచి మోడల్గా రాణిస్తోంది. తన శరీర ఆకతిని ఫిట్గా ఉంచుకోవడమేగాక, అందంగా ఫిట్గా ఉండేందుకు ఏం చేయాలో చెబుతూ లక్షలాది వీక్షకులను ఆకట్టుకోవడమేగాక, తన ప్రతిభతో ఫ్యాషన్ , బ్యూటీ, లైఫ్స్టైల్ ఇన్ ఫ్లుయెన్సర్గా రాణిస్తూ ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది. ఖాన్పూర్లోని మధ్యతరగతి కుటుంబంలో సాక్షి పుట్టింది. ఈమెకు ఒక సోదరి కూడా ఉంది. స్కూలు చదువు పూర్తయ్యాక ఉన్నతవిద్యకోసం న్యూఢిల్లీ వెళ్లింది. అక్కడే బీటెక్ పూర్తిచేసింది. చిన్నప్పటినుంచి మోడలింగ్ అంటే బాగా ఇష్టం. దీంతో స్కూలు, కాలేజీలలో జరిగే వివిధ రకాల ఫ్యాషన్ షోలలో చురుకుగా పాల్గొంటుండేది. బీటెక్ అయ్యాక ఎమ్బీఏ చేద్దామనుకున్నప్పటికీ.. ఫ్యాషన్ పై ఉన్న ఇష్టాన్ని వదులుకోలేక ముంబై వెళ్లి మోడల్గా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆకర్షణీయమైన రూపం, మెరిసిపోయే మేనిఛాయ, తీరైన ఆకృతితో మోడలింగ్ ఏజెన్సీలను సంప్రదించింది. సాక్షి రూపం నచ్చిన వారంతా మోడలింగ్ చేసేందుకు అవకాశాలు ఇవ్వడంతో వాణిజ్య ప్రకటనలు, సౌందర్య ఉత్పత్తుల యాడ్స్లో నటించింది. వీటిలో నైకా, పీసీ జ్యూవెలర్స్, ఫ్రెష్బుక్, అడిడాస్, ఫేసెస్ కెనడా వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే సాక్షి ఆయా భాషల్లో మోడల్గా విజయవంతంగా రాణిస్తోంది. సోనుకీ టిటు.. యాడ్స్లో మంచి గుర్తింపు వచ్చిన తరువాత మ్యూజిక్ వీడియోలలో నటించడం మొదలు పెట్టింది సాక్షి. దీనిలో భాగంగానే పంజాబీ మ్యూజిక్ వీడియో ‘కుడియే స్నాప్చాట్ వాలియే’ నటించింది. ఈ పాటకు ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీని తరువాత 2018లో విడుదలైన బాలీవుడ్ సినిమా ‘‘సోను కీ టిటు కీ స్వీటీ’లో ‘బమ్ డిగి డిగి బమ్ బమ్’ పాటలో నటించింది. దీంతో ద్వారా సాక్షి మరింత పాపులర్ అయ్యింది. ఈ ఏడాది ఎమ్టీవీలో ప్రసారమైన ప్రముఖ డేటింగ్ షో స్ప్లిట్స్ విల్లా13 లో ప్రముఖులతో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. అంతేగాక బిగ్బాస్ ఫేమ్ అసిమ్ రియాజ్తో కలిసి ‘విహం’ పాటలో నటించింది. ఈ పాట కూడా సాక్షికి మంచి పేరు తీసుకువచ్చింది. అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోలలో నటించడంతో సోషల్ మీడియాలో సాక్షికి మంచి గుర్తింపు వచ్చింది. ఫిట్నెస్ ఫ్రీక్.. మ్యూజిక్ వీడియోలు, సినిమాలతోపాటు సాక్షి తన సొంత యూట్యూబ్ చానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియా మోడల్ క్వీన్ గానూ పాపులర్ అయ్యింది. అందమైన శరీర ఆకృతిని కాపాడుకునేందుకు జిమ్లో ఎటువంటి కసరత్తులు చేస్తుంది? తనలా ఫిట్గా అందంగా ఉండేందుకు ఏమేం తినాలి? ఎటువంటి వర్క్వుట్స్ చేయాలి... వంటి విషయాలను తన యూట్యూబ్ చానల్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కు చెబుతుంటుంది సాక్షి. ఆమెకు యూ ట్యూబ్లో యాభైవేలు, ఇన్స్టాగ్రామ్లో అరవై లక్షలకుపైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందమైన రూపం... అంతకు మించిన ఆత్మవిశ్వాసంతో మంచి నటిగా రాణిస్తూ, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గా... మోడల్గా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతిభ, కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా గుర్తింపు తెచ్చుకోవచ్చని ఎందరికో సాక్షి మాలిక్ ఉదాహరణగా నిలుస్తోంది. చదవండి: Nalini Jameela: అందుకే ‘పడుపు వృత్తి’లోకి.. కానీ ఇప్పుడు ఆమె.. Padmini Govind: అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి బెంగుళూరుకు వచ్చి.. -
Tokyo Olympics:: పీవీ సింధుకి అరుదైన గౌరవం..
టోక్యో: తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారత బృందాన్ని నడిపించే అవకాశం దక్కనుంది. ఈ సారి బిన్నంగా పతాకాదారులగా ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. లింగ భేదం లేకుండా పురుషుల నుంచి ఒకరు, పురుషుల నుంచి మరొకర్ని ఎంపిక చేయనున్నారు. ఇద్దరు పతాకధారుల్లో సింధు ఒకరు అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై ఈ నెలాఖారులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశంఉంది. 2016 రియో ఒలింపిక్స్లో పీవీ సింధు రజతం గెలిచింది. వాస్తవానికి ముందు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన వారు భారత పతాకాధారిగా ఉండేవారు. గత రియో ఒలింపిక్ క్రీడల్లో భారత తరుపున బ్యాండ్మింటన్లో పీవీ సింధు, రెజ్లింగ్లో సాక్షి మాలిక్ పతకాలు సాధించారు. ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్ కు సాక్షి మాలిక్ ఆర్హత సాధించలేదు. దీంతో పీవీ సింధు అవకాశం దక్కనుంది. పురుషుల్లో ఎవరనేది మాత్రం తేలలేదు. ముఖ్యంగా కొందరి పేర్లు మాత్రం బయటకు వస్తున్నాయి. వీటిలో బాక్సర్ అమిత్ పంఘాల్, రెజ్లర్ బజరంగ్ పూనియా, టీటీ ప్లేయర్ ఆచంట వరత్ కమల్, అథ్లెట్ నీరజ్ చోప్రా పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, వీరిలో రియోలో ఏ పతకాన్ని సాధించలేదు. మరి ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలంటే ఈ నెలాఖరవరకు ఆగాల్సిందే. చదవండి: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్కు గాయం -
ఫైనల్లో మేరీ కోమ్
దుబాయ్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు మేరీ కోమ్, సాక్షి పసిడి పోరుకు అర్హత సాధించారు. దాంతో వీరిద్దరూ కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకున్నా రు. మహిళల 51 కేజీల విభాగంలో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ 4–1తో లుస్తాయ్ఖాన్ (మంగోలియా)పై, 54 కేజీల విభాగంలో సాక్షి 3–2తో టాప్ సీడ్ దినా జోలామన్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్కు చేరుకున్నారు. మరో భారత బాక్సర్ లాల్ బుత్సహి (64 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఇద్దరు బాక్సర్లు పూజా రాణి (75 కేజీలు), అనుపమ (81+ కేజీలు) కూడా ఫైనల్లోకి అడుగు పెట్టడంతో తుది పోరుకు అర్హత సాధించిన భారత బాక్సర్ల సంఖ్య ఐదుకు చేరింది. అయితే ఇతర భారత బాక్సర్లు మోనిక (48 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సిమ్రన్జిత్ కౌర్ (60 కేజీలు), లవ్లీనా బార్గోహైన్ (69 కేజీలు) తమ సెమీ ఫైనల్ బౌట్ల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మోనిక 0–5తో అలువా బాల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో, జాస్మిన్ 0–5తో వ్లాదిస్లావా కుఖ్తా (కజకిస్తాన్) చేతిలో, సిమ్రన్జిత్ 0–5తో వోలోస్సెన్ (కజకిస్తాన్) చేతిలో, లవ్లీనా 2–3తో నవ్బఖోర్ ఖామ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడారు. -
టోక్యో ఆశలు ఆవిరి!.. సాక్షిపై సోనమ్ పైచేయి
లక్నో: రియో ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత మహిళా స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ టోక్యో ఒలింపిక్స్ ఆశలు ఆవిరయ్యే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 9 నుంచి 11 వరకు జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత మహిళల రెజ్లింగ్ జట్టును సోమవారం ఎంపిక చేశారు. ట్రయల్స్లో సాక్షి మలిక్ 18 ఏళ్ల సోనమ్ చేతిలో ఓడింది. 62 కేజీల బౌట్లో సోనమ్ 8–7తో సాక్షిని ఓడించి భారత జట్టులో చోటు దక్కించుకుంది. క్వాలిఫయింగ్ టోర్నీలో సోనమ్ ఫైనల్కు చేరుకుంటే ‘టోక్యో’ బెర్త్ ఖాయమవుతుంది. ఒకవేళ సోనమ్ ఫైనల్ చేరని పక్షంలో సాక్షికి వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి అవకాశం మిగిలి ఉంటుంది. సోనమ్తోపాటు సీమా (50 కేజీలు), అన్షు (57 కేజీలు), నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) కూడా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో బరిలోకి దిగుతారు. -
నాని ‘వీ’ చిత్రంపై కోర్టుకెక్కిన నటి..
బాలీవుడ్ ‘సోను కే టిటు కీ స్వీటీ’ చిత్రంలోని ‘బామ్ డిగ్గీ డిగ్గీ’ అనే పాటతో సాక్షి ప్రాచుర్యంలోకి వచ్చారు నటి, మోడల్ సాక్షి మాలిక్. ఇటీవల ఆమె టాలీవుడ్ హీరో నాని నటించిన వీ చిత్రంపై కోర్టుకెక్కారు. ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిన ఈ చిత్రంలో అనుమతి లేకుండా తన ఫోటోను ఉపయోగించారని ఆరోపిస్తూ నిర్మాతపై బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి ప్రధాన పాత్రలో నటించిన వీ చిత్రంలో.. మొబైల్ ఫోన్లో కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫొటోను వేరే వ్యక్తికి చూపించే సన్నివేశం ఉంది. అయితే ఆ ఫొటో తనదేనని ఆరోపిస్తూ సాక్షి మాలిక్ కోర్టుకెక్కారు. దీనిపై స్పందించిన బాంబే కోర్టు.. ‘వి’ చిత్రం స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీ ప్లాట్ఫాంకు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా వేరే వ్యక్తుల ఫోటోలను, ముఖ్యంగా ప్రైవేట్ ఇమేజ్ను ఉపయోగించడం చట్ట విరుద్ధమని, ఇలా వాడటం వల్ల తమ పరువుకు నష్టం కలింగించవచ్చని పేర్కొంది. సాక్షి మాలిక్ అభ్యంతరం తెలిపిన సినిమాలోని సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఆదేశించింది, సీన్స్ డిలీట్ చేసిన తర్వాతనే సినిమాను తిరిగి అప్లోడ్ చేయాలని ప్రొడక్షన్ హౌజ్ను ఆదేశించింది. అదే విధంగా తిరిగి అప్లోడ్ చేసేముందు సాక్షికి చూపించాలని పేర్కొంది. దీంతో ఇప్పటికే ‘వి’ సినిమాను ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫాం నుంచి తొలగించారు. కాగా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజ్ నిర్మించిన ఈ చిత్రం గతేడాది సెప్టెంటర్ 5న ఓటీటీలో విడుదలైంది. చదవండి: నాని నో చెప్పాడు.. వైష్ణవ్ ఓకే చేశాడు -
రజతంతో సరిపెట్టుకున్న సాక్షి
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ పతకాల వేటను కొనసాగిస్తోంది. గురువారం మూడు పసిడి, ఒక రజత పతకాలను గెల్చుకున్న భారత్... శుక్రవారం ఒక రజతం, మూడు కాంస్య పతకాలు గెలుచుకుంది. మహిళల 65 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ తుది మెట్టుపై బోల్తా పడి రజతంతో సరిపెట్టుకుంది. ఆమె ఫైనల్ బౌట్లో 0–2తో నయోమి రుకే (జపాన్) చేతిలో ఓడింది. ఇక కాంస్య పతక పోరుల్లో వినేశ్ ఫోగట్ (53 కేజీలు) 10–0తో తి లై కియు (వియత్నాం)పై, అన్షు మాలిక్ (57 కేజీలు) 4–1తో సెవర ఇష్మురతోవ (ఉజ్బెకిస్తాన్)పై, గుర్శరణ్ ప్రీత్ కౌర్ (72 కేజీలు) 5–2తో త్సెవెగ్మెడ్ ఎంక్బయార్ (మంగోలియా)పై గెలుపొందగా... సోనమ్ మాలిక్ (62 కేజీలు) 11–0తో ఐసులూ తైన్బెకోవ (కిర్గిస్తాన్) చేతిలో ఓడింది. -
టాప్స్ నుంచి రెజ్లర్ సాక్షి ఔట్
న్యూఢిల్లీ: తెలుగు తేజం, వెయిట్లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)కు దూరమయ్యాడు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్తో పాటు రాహుల్ని ఆ పథకం నుంచి భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తొలగించింది. రెజ్లర్ సాక్షి గత కొంతకాలంగా నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోంది. గుంటూరుకు చెందిన వెంకట్ కూడా కొంతకాలంగా గాయం కారణంగా అంతర్జాతీయ టోరీ్నలకు దూరంగా ఉన్నాడు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ఒలింపిక్ విజేతలుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని తెచ్చారు. కోచింగ్, ఇతర వసతులతో పాటు టాప్స్లో ఉన్న క్రీడాకారులకు నెలకు రూ. 50 వేల చొప్పున ఆరి్థక సాయం అందజేస్తారు. క్రీడాకారులకు అండదండలు అం దించే ఈ పథకంలో కొత్తగా రెజ్లర్ రవి దహియాకు చోటు దక్కింది. అతను ఇటీవల కజకిస్తాన్లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో 57 కేజీల కేటగిరీలో కాంస్యం గెలిచాడు. ఆ ఈవెంట్లో సాక్షి (62 కేజీలు) కూడా తలపడింది. కానీ... తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. హైదరాబాదీ వెటరన్ షట్లర్ సైనా నెహా్వల్ తనకు వ్యక్తిగత ట్రెయినర్ సేవల్ని పొడిగించాలన్న అభ్యర్థనను ‘సాయ్’ మన్నించింది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు దాకా ఆమె వ్యక్తిగత ఫిట్నెస్ ట్రెయినర్ స్వరూప్ సిన్హా ఏడు అంతర్జాతీయ టోర్నీల్లో ఆమెతో పాటు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల్ని ‘సాయ్’ భరిస్తుంది. -
సాక్షి మాలిక్ను ఏడిపించారు!
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిస ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ మొత్తంగా ఐదు పతకాలు సాధించింది. ఇందులో ఒక రజతం, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ఇది వరల్డ్ రెజ్లింగ్ వేదికపై భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. దీపక్ పూనియా రజతం సాధించగా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్, రవి కుమార్, రాహుల్ అవేర్లు కాంస్యాలు సాధించారు. అయితే ఈ ప్రదర్శన భారత రెజ్లింగ్ సమాఖ్య( డబ్యూఎఫ్ఐ)కు సంతృప్తినివ్వలేదు. ఎంతోమంది భారత స్టార్ రెజర్లు కల్గి ఉన్నప్పటికీ స్వర్ణం సాధించకపోవడంపై డబ్యూఎఫ్ఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానంగా బజరంగ్ పూనియా సెమీ ఫైనల్ పోరు వివాదంగా ముగిసి అతను కాంస్యం సాధించినా దాన్ని పెద్దగా లెక్కల్లోకి తీసుకోలేదు. దీనిపై బజరంగ్ పూనియా కోచ్ షాకో బెన్టినిడిస్ను నిలదీశారు డబ్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ షరాన్ సింగ్. బజరంగ్ పూనియా తన కాలిని సరిగా మూవ్ చేయలేకపోవడాన్ని ప్రశ్నించారు. అతని లెగ్ మూమెంట్స్ అంతంగా మాత్రంగానే ఉన్నాయని, ఇది ప్రత్యర్థికి ఈజీగా పట్టు చిక్కడానికి వీలు కల్పింస్తుందంటూ బ్రిజ్ భూషణ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రతీ ఈవెంట్లోనే ఇదే తరహా తప్పిదాలు చేస్తున్నా కోచ్గా మీరు ఏమీ చేస్తున్నారని నిలదీశారు. ఇక మహిళల విభాగంలో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గ్రీకో రోమన్ కేటగిరీలో ఉన్న సాక్షిని తీర్చిదిద్దడంలో కోచ్ విఫలం కావడాన్ని బ్రిజ్ భూషణ్ నిలదీశారు. సాక్షితో పాటు కోచ్ను ‘మీరు అసలు ఇక్కడకి ఎందుకు వచ్చారు. ఈ విభాగంలో ఇక నుంచి మిమ్మల్ని పంపకూడదనే ఆలోచనలో ఉన్నాం’ అని బ్రిజ్ భూషణ్ హెచ్చరించారు. దాంతో సాక్షి మాలిక్ ఒక్కసారిగా కన్నీట పర్యంతమయ్యారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే సాక్షి మాలిక్ కన్నీళ్లు పెట్టుకోవడంతో డబ్యూఎఫ్ఐ వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. రెజ్లర్లపట్ల ఇలా ప్రవర్తించడం తగదని బ్రిజ్ భూషణ్ వైఖరిని తప్పుబడుతున్నారు. -
సాక్షి మళ్లీ శిబిరానికి....
న్యూఢిల్లీ: జాతీయ శిక్షణ శిబిరంలో తిరిగి చేరేందుకు భారత మహిళా స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అనుమతించింది. సమాచారం ఇవ్వ కుండా శిబిరం నుంచి నిష్క్రమించడంతో మొదట ఆగ్రహించిన సమాఖ్య వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మొత్తం 25 మంది మాట మాత్రమైనా చెప్పకుండా, సంబంధిత వర్గాల అనుమతి లేకుండానే శిబిరం నుంచి జారుకున్నారు. ఇందులో 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి (62 కేజీలు)తో పాటు సీమా (50 కేజీలు), కిరణ్ (76 కేజీలు) ఉన్నారు. ఈ ముగ్గురు ఇటీవలే ప్రపంచ చాంపియన్షిప్కు అర్హత సంపాదించారు. బుధవారం లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐ ఆదేశించగా సాక్షి... రక్షాబంధన్ వేడుకలో పాల్గొనేందుకే శిబిరం నుంచి పయనమైనట్లు వివరించింది. దీనిపై డబ్ల్యూఎఫ్ఐ ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆమె తిరిగి శిబిరంలో కొనసాగేందుకు అనుమతిచ్చారు. -
ప్రపంచ చాంపియన్షిప్కు వినేశ్ ఫొగాట్, సాక్షి
లక్నో: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ ట్రయల్స్లో భారత స్టార్ ప్లేయర్లు వినేశ్ ఫొగాట్ (53 కేజీలు), సాక్షి మలిక్ (62 కేజీలు) సత్తా చాటారు. ఆదివారం జరిగిన ఈ ట్రయల్స్ ఫైనల్ బౌట్లో వినేశ్ ఫొగాట్ 9–0తో పింకీపై గెలుపొందగా... రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ 13–2తో రేష్మా మన్ను అలవోకగా ఓడించి ప్రపంచ చాంపియన్షిప్కు అర్హత సాధించారు. వీరిద్దరితో పాటు సీమా బిస్లా (50 కేజీలు), సరితా మోర్ (57 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు), కిరణ్ గొడారా (76 కేజీలు) వరల్డ్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. దివ్య కక్రాన్ 6–3తో నవ్జోత్ కౌర్పై విజయం సాధించగా... 57 కేజీల విభాగంలో బెర్త్ కోసం పూజ, అన్షు మలిక్, మంజు, సరిత గట్టిగా పోటీపడ్డారు. కానీ ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత పూజ దండాను వెనక్కి నెట్టి సరిత భారత జట్టులోకి ఎంపికైంది. కజకిస్తాన్ వేదికగా సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ జరగనుంది. ఈ చాంపియన్షిప్లో సత్తా చాటిన రెజ్లర్లకు టోక్యో ఒలింపిక్స్ బెర్తు ఖరారు అవుతుంది. ఆదివారం జరిగిన ట్రయల్స్ వెయిట్ కేటగిరీలన్నీ ఒలింపిక్స్లో భాగంగా ఉండగా... ఆగస్టు రెండో వారంలో ఒలింపిక్స్ క్రీడల్లో లేని వెయిట్ కేటగిరీలకు ట్రయల్స్ నిర్వహిస్తారు. -
రజతం నెగ్గిన సాక్షి మలిక్
న్యూఢిల్లీ: డాన్ కొలోవ్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ రజత పతకం సాధించింది. బల్గేరియాలో శుక్రవారం జరిగిన మహిళల 65 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి 3–8 స్కోరుతో హెనా జొహాన్సన్ (స్వీడన్) చేతిలో పరాజయం పాలైంది. సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ పెట్రా ఒలి (ఫిన్లాండ్)ని ఓడించిన సాక్షి ఫైనల్లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోయింది. మరోవైపు ఇదే టోర్నమెంట్ పురుషుల ఫ్రీ స్టయిల్ 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో బజరంగ్ 8–6తో నిర్హున్ స్కారాబిన్ (బెలారస్)పై... సందీప్ క్వార్టర్ ఫైనల్లో 2–0తో ఎడ్వర్డ్ గ్రిగోరెవ్ (రష్యా)పై... ప్రి క్వార్టర్ ఫైనల్లో 13–6తో లులియాన్ జుర్జెనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. -
ప్రపంచ చాంపియన్కు సాక్షి మాలిక్ షాక్
బల్గేరియా: భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్... డాన్ కొలొవ్ రెజ్లింగ్ మీట్లో తుదిపోరుకు అర్హత సాధించింది. 65 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీ సెమీఫైనల్లో సాక్షి 4–1తో ప్రపంచ చాంపియన్ పెట్రా ఒలి (ఫిన్లాండ్)ని కంగుతినిపించింది. దీంతో భారత రెజ్లర్కు కనీసం రజత పతకం ఖాయమైంది. నేడు పసిడి పతకం కోసం సాక్షి... హెన్నా జొహన్సన్ (స్వీడెన్)తో తలపడుతుంది. -
గ్రేడ్ ‘ఎ’లోకి సుశీల్, సాక్షి
ముంబై: స్టార్ రెజ్లర్లు, ఒలింపిక్ పతక విజేతలైన సుశీల్ కుమార్, సాక్షి మలిక్ల కాంట్రాక్టు గ్రేడ్ను ‘బి’ నుంచి ‘ఎ’కు మారుస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టగా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, పూజా ధండాలకు ‘ఎ’ గ్రేడ్ దక్కింది. దీనిపై విమర్శలు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ పొరపాటును సరిదిద్దుకుంది. ‘ఇది మా తప్పే. వారిద్దరూ ‘బి’ గ్రేడ్లో ఉండాల్సిన వారు కాదు. అందుకని ‘ఎ’లోకి మార్చుతున్నాం’ అని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ప్రకటించారు. సుశీల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం నెగ్గాడు. సాక్షి 2016 రియో ఒలింపిక్స్లో కాంస్యం గెలుపొందింది. మరోవైపు డబ్ల్యూఎఫ్ఐ రెజ్లర్లను ‘ఎ’ నుంచి ‘ఎఫ్’ వరకు వర్గీకరించింది. సుశీల్, సాక్షి గ్రేడ్ ‘ఎ’లోకి వెళ్లడంతో ‘బి’లో ఎవరూ లేనట్లైంది. ‘సి’లో ఏడుగురు, ‘డి’లో 9 మంది, ‘ఇ’లో నలుగురున్నారు. అండర్–23 జాతీయ స్వర్ణ పతక విజేతలకు ‘ఎఫ్’లో చోటు దక్కుతుంది. డ్ ‘ఎ’లోకి సుశీల్, సాక్షి -
స్వర్ణంతో సీజన్ ముగించిన రెజ్లర్ వినేశ్
ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలతో మెరిసిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ పొగాట్ సీజన్ను మరో స్వర్ణంతో ముగించింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన జాతీయ చాంపియన్షిప్లో 57 కేజీల విభాగంలో వినేశ్ చాంపియన్గా నిలిచింది. మోచేతి గాయం నుంచి కోలుకొని బరిలో దిగిన వినేశ్ మొత్తం టోర్నీలో ప్రత్యర్థులకు కేవలం 2 పాయింట్లు మాత్రమే సమర్పించుకుంది. ఫైనల్లో వినేశ్ 10–0తో బబితను మట్టి కరిపించింది. ఆమె గతంలో 2012 నుంచి 16 వరకు వరుసగా ఐదుసార్లు ఈ విభాగంలో చాంపియన్గా నిలవడం విశేషం. -
సాక్షికి రజతం
న్యూఢిల్లీ: మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ రజత పతకం సాధించింది. బెలారస్లో ఆదివారం జరిగిన మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి 2–6తో మరియానా సస్తిన్ (హంగేరి) చేతిలో ఓడిపోయింది. 57 కేజీల విభాగంలో పూజ ధండా కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాంస్య పతక పోరులో పూజ 10–0తో కెల్సీ క్యాంప్బెల్ (అమెరికా)ను చిత్తుగా ఓడించింది. -
మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీ ఫైనల్లో సాక్షి
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ మెద్వేద్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బెలారస్లో శనివారం జరిగిన మహిళల 62 కేజీల విభాగం సెమీఫైనల్లో సాక్షి 6–2తో ఎల్మీరా గంబరోవా (అజర్బైజాన్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 7–2తో లైస్ న్యూన్స్ ఒలివీరా (బ్రెజిల్)ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మరియానా సస్తిన్ (హంగేరి)తో సాక్షి తలపడుతుంది. -
స్వర్ణానికి అడుగు దూరంలో..
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ రజత పతకాన్ని ఖాయం చేసుకున్నారు.. సోమవారం జరిగిన మహిళల రెజ్లింగ్ పోరులో భాగంగా 50 కేజీల ఫ్రీస్టైయిల్ విభాగంలో ఫోగట్ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీ ఫైనల్ పోరులో వినేశ్ ఫోగట్ 10-0 తేడాతో యక్షిమురతోవా( ఉజ్బెకిస్తాన్)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. ఫలితంగా రజత పతకాన్ని ఖాయం చేసుకున్న ఫోగట్.. పసిడికి అడుగు దూరంలో నిలిచారు. ఈ రోజు సాయంత్రం జరుగనున్న స్వర్ణ పత పోరులో జపాన్కు చెందిన ఇరి యుకితో ఫోగట్ అమీతుమీ తేల్చుకోనున్నారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో వినేశ్ ఫోగట్ 8-2 తేడాతో చైనా రెజ్లర్ యనన్ సున్పై గెలిచి సెమీస్లోకి ప్రవేశించారు. కాగా, పింకీ(53కేజీలు) తొలి బౌట్లోనే నిష్క్రమించింది. ఇక పూజ దండా( 57 కేజీలు), సాక్షి మాలిక్(62 కేజీల విభాగం) లు సెమీస్లో పరాజయం చెందారు. దాంతో కాంస్య పతక పోరులో తలపడే మరో అవకాశం లభించింది. కాంస్య పతక పోరులో జపాన్ క్రీడాకారిణి సాకగామి కాట్సుకితో పూజా దండా తలపడనుండగా, టినిబెకోవాతో సాక్షి తలపడనుంది. -
ఏషియాఢంకా
భారీ సంఖ్యలో క్రీడాకారులు... దిగ్గజాలనదగ్గ దేశాలు... పెద్దఎత్తున బృందాలు... అందుకు తగ్గట్లు రికార్డులు... బరిలో హేమాహేమీలు... రసవత్తర సమరాలు... పతకాల వేటలో... పతాకస్థాయి పోరాటాలు... ... నేటి నుంచే ఏషియాడ్ సంరంభం ... పదహారు రోజుల పాటు సంగ్రామం సాక్షి క్రీడా విభాగం ఆసియా అతిపెద్ద క్రీడా సమరానికి నేడే శంఖారావం. ఇండోనేసియా వేదికగా... జకార్తా–పాలెంబాంగ్ నగరాల్లో శనివారం నుంచే 18వ ఏషియాడ్ ఆరంభం. 11 వేల మంది అథ్లెట్లు... 45 దేశాల ప్రాతినిధ్యంతో సెప్టెంబర్ 2 వరకు క్రీడలు. పతకాల వేటలో మేటైన చైనా... దీటైన జపాన్... దమ్మున్న దక్షిణ కొరియా... వీటిని తట్టుకుంటూ భారత్! మరి... ఈసారైనా మన భాగ్యరేఖ మెరుగవుతుందా? కామన్వెల్త్ జోరును ఇక్కడా కొనసాగిస్తుందా? పట్టికలో ప్రస్థానం పైకెళ్తుందా? బలాలేమిటి...? బలహీనతలేమిటి? అంశాల వారీగా ఓసారి సమీక్షిస్తే...! నవ యువత... అనుభవజ్ఞులు ఏషియాడ్ భారత బృందంలో పదహారేళ్ల పాఠశాల బాలిక నుంచి ఒలింపిక్ పతకాలు గెలిచిన ఉద్ధండులున్నారు. నాలుగు నెలల క్రితం కామన్వెల్త్ క్రీడల్లో దాదాపు ఇదే బృందం అద్భుత ప్రదర్శనతో అనూహ్యంగా మూడో స్థానం సాధించి సగర్వంగా దేశానికి తిరిగొచ్చింది. అయితే, ఆ పోటీల్లో చైనా, జపాన్, దక్షిణ కొరియాకు ప్రాతినిధ్యం లేదు. ఏషియాడ్లో మాత్రం ఈ దేశాల నుంచి ప్రతి అంశంలో పోటీ తప్పదు. వీటితోపాటు బృందం ఎంపిక, పరిమితిపై వివాదాలతో ముందే కొంత చర్చ రేగింది. ఈ నేపథ్యంలో ఏకాగ్రత చెదరకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతమే స్ఫూర్తి... కొన్నేళ్లుగా మెరుగుపడుతున్న భారత క్రీడా వ్యవస్థకు నిదర్శనంగా 2014 ఏషియాడ్లో మన క్రీడాకారులు విశేషంగా రాణించారు. 11 స్వర్ణాలు సహా మొత్తం 57 పతకాలు నెగ్గి ఈ క్రీడల చరిత్రలో తమ రెండో అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేశారు. సుశీల్ కుమార్, నీరజ్ చోప్రా, మనూ భాకర్లకు తోడు బ్యాడ్మింటన్లో తెలుగు తేజం పీవీ సింధు ఫామ్ను బట్టి చూస్తే ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మరో చరిత్ర సృష్టించినట్లవుతుంది. సింధు, శ్రీకాంత్లపై దృష్టి ప్రపంచ చాంపియన్షిప్లో ఫైనల్ చేరిన పీవీ సింధు అద్భుత ఫామ్లో ఉంది. ఆఖరి పోరాటాల్లో ఓడుతున్నా... ఏ దశలోనైనా పుంజుకోగల సత్తా సింధు సొంతం. చైనా, థాయ్లాండ్, జపాన్ షట్లర్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నా... వాటిని అధిగమించడం ఈ తెలుగమ్మాయికి కష్టమేం కాదు. పూర్వ ఫామ్ను అందుకుంటే పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నుంచి కూడా పతకం ఆశించవచ్చు. హెచ్ఎస్ ప్రణయ్పైనా ఆశలున్నాయి. హిమాదాస్ మెరిసేనా... అసోంకు చెందిన హిమాదాస్పై ఈ ఏషియాడ్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా అండర్–20 ప్రపంచ చాంపియన్షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో హిమాస్వర్ణం నెగ్గడమే దీనికి కారణం. జకార్తాలోనూ ఈమెను ఫేవరెట్గా భావిస్తున్నారు. పతకం సాధిస్తుందని ఆశిస్తున్నారు. వీరేం చేస్తారో... రెజ్లింగ్లో ఒలింపిక్ పతక విజేతలైన సుశీల్ కుమార్, సాక్షి మలిక్లు ఏమేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. తమ గురించి కొత్తగా చాటేందుకు ఏమీ లేకున్నా... కొంతకాలంగా వీరు ఫామ్లో లేరు. సుశీల్ ఇటీవల టిబిలిసి గ్రాండ్ప్రిలో బౌట్ ఓడిపోయాడు. నాలుగేళ్లలో అతడికిదే తొలి పరాజయం కావడం గమనార్హం. టర్కీలో జరిగిన యాసర్ డొగు టోర్నీలో సాక్షి పతకం అందుకోలేకపోయింది. వీరి ప్రతిష్ఠకు ఈ ఏషియాడ్ ఓ సవాలే. స్వర్ణం తప్ప మరేది గెలిచినా వారి స్థాయికి తక్కువే అన్నట్లవుతుంది. ఒలింపిక్స్ టికెట్ కొట్టేస్తారా..? పురుషుల హాకీ జట్టు పూర్వ వైభవం దిశగా అడుగులేస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్గా నిలిచింది. గత ఏషియాడ్లో స్వర్ణంతో మెరిసింది. ఈసారి దానిని నిలబెట్టుకుంటే 2020 ఒలింపిక్స్కు నేరుగా అర్హత పొందుతుంది. పరిస్థితి చూస్తే మళ్లీ స్వర్ణం నెగ్గేలా కనిపిస్తున్నా... పాకిస్తాన్, దక్షిణ కొరియాలను ఎలా ఎదుర్కొంటుందనేదీ కీలకమే. రాణి రాంపాల్ ఆధ్వర్యంలోని మహిళల హాకీ జట్టు సంచలనాలు సృష్టించ గలదు. గత క్రీడల్లో గెలిచిన కాంస్యాన్ని మించి రాణించేందుకు ప్రయత్నించాల్సి ఉంది. ‘కిక్’ ఇస్తారా? బాక్సింగ్లో భారత్కు ఎక్కువ అవకాశాలే కనిపిస్తున్నాయి. అందుకు కారణం... వికాస్ కృషన్, శివ థాపాలతో పాటు వర్థమాన తార గౌరవ్ సోలంకి. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్షిప్ రజతం విజేత సర్జుబాలా దేవి భారత్ ఖాతాలో పతకం చేర్చగలదు. కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా స్వర్ణం ఒడిసిపట్టింది. ఇప్పుడు కనీసం ఒక పతకమైనా తెస్తుందని భావిస్తున్నారు. కొంతకాలంగా సంచలన ప్రదర్శనలతో అదరగొట్టి వార్తల్లో నిలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ గాయం కారణంగా ఇబ్బంది పడింది. దాన్నుంచి కోలుకున్న ఆమె బరిలో దిగనుండటం ఆశలు రేపుతోంది. ► బ్రిడ్జ్ క్రీడలో బరిలో దిగనున్న 81 ఏళ్ల లీహంగ్ ఫాంగ్... ఆసియా క్రీడల చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడు. 11 ఏళ్ల ఇయాన్ నుర్మెన్ అమ్రి (స్కేట్బోర్డర్) అతి చిన్నవయస్కుడు. వీరిద్దరూ మలేసియాకు చెందినవారే కావడం విశేషం. ప్రారంభ వేడుకలు సోనీ టెన్–2, సోనీ ఈఎస్పీఎన్లలో ప్రత్యక్ష ప్రసారం మనోళ్లు 17 మంది... ► ఆర్చరీ– జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్). ► బ్యాడ్మింటన్– కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, చుక్కా సాయి ఉత్తేజిత రావు, సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), సైనా నెహ్వాల్, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి, సాయిప్రణీత్, పుల్లెల గాయత్రి (తెలంగాణ) ► బాక్సింగ్– హుసాముద్దీన్ (తెలంగాణ) ► జిమ్నాస్టిక్స్– అరుణా రెడ్డి (తెలంగాణ) ► మహిళల హాకీ– రజని (ఆంధ్రప్రదేశ్) ► పురుషుల కబడ్డీ– మల్లేశ్ (తెలంగాణ) ► సెపక్తక్రా– తరంగిణి (తెలంగాణ) ► షూటింగ్–రష్మీ రాథోడ్ (తెలంగాణ) ► టెన్నిస్–యడ్లపల్లి ప్రాంజల (తెలంగాణ) -
అథ్లెట్లకు హర్యానా షాక్
చండీగఢ్: హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయంతో క్రీడాకారులు షాక్కు గురయ్యారు. రాష్ట్రంలోని క్రీడాకారులు సంపాదించిన మొత్తంలో మూడో వంతును ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. వృత్తిపరమైన క్రీడలతో పాటు వాణిజ్యపరమైన ఆదాయంతో సహా లెక్కగట్టి.. మొత్తం సంపాదనలో మూడవ వంతు సొమ్మును క్రీడా మండలికి చెల్లించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అథ్లెట్లు ప్రొఫెషనల్ స్పోర్ట్స్, కమర్షియల్ ఎండార్స్మెంట్స్లలో పాల్గొనే సమయంలో సదరు నిబంధనలను అంగీకరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో క్రీడాకారులకు అసాధారణ సెలవును (వేతనం ఇవ్వరు) ఇస్తారు. పోటీల ద్వారా సంపాదించిన మొత్తంలో మూడో వంతును హర్యానా రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి వినియోగిస్తాం అని ఏప్రిల్ 30 న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవుపై వెళ్లి ఈవెంట్ లేదా వాణిజ్య ప్రకటనల షూటింగ్లో పాల్గొంటే.. వాటి ద్వారా వచ్చే సంపాదన మొత్తాన్నీ క్రీడా మండలి దగ్గర డిపాజిట్ చేయాల్సిందేనని కొత్త నిబంధన కూడా విధించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్రీడాకారులు మండిపడుతున్నారు. హర్యానా క్రీడాకారులు రెజ్లింగ్, బాక్సింగ్లలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
నవజ్యోత్ కౌర్ ‘పసిడి’ పట్టు
బిష్కెక్ (కిర్గిస్తాన్): భారత మహిళా రెజ్లర్ నవజ్యోత్ కౌర్ కొత్త చరిత్ర లిఖించింది. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా గుర్తింపు పొందింది. శుక్రవారం జరిగిన మహిళల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో 28 ఏళ్ల నవజ్యోత్ కౌర్ 9–1తో మియు ఇమాయ్ (జపాన్)పై ఘనవిజయం సాధించింది. ఐదోసారి ఆసియా సీనియర్ చాంపియన్షిప్లో పాల్గొన్న నవజ్యోత్ పసిడి పతకం నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో ఆమెకు రజతం (2013లో), కాంస్యం (2011లో) లభించాయి. మరోవైపు సాక్షి మలిక్ 62 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తొలి రౌండ్లో సాక్షి చైనా రెజ్లర్ జియోజువాన్ లువో చేతిలో ఓడిపోయింది. లువో ఫైనల్కు చేరడంతో సాక్షికి కాంస్య పతకం కోసం నిర్వహించే ‘రెప్చేజ్’’ రౌండ్లో పోటీపడే అవకాశం దక్కింది. ‘రెప్చేజ్’ తొలి రౌండ్లో 10–0తో జియె చోయ్ (కొరి యా)ను ఓడించిన సాక్షి... కాంస్య పతక పోరులో 10–7తో కసిమోవా (కజకిస్తాన్)పై గెలిచింది. -
కామన్ వెల్త్ గేమ్స్కు మాలిక్ అర్హత
న్యూఢిల్లీ : ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ 2018లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్(సీడబ్ల్యూజీ)కు అర్హత సాధించారు. వచ్చే ఏడాది కిర్గిస్థాన్లో జరగనున్న సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్కు భారతీయ మహిళా రెజ్లింగ్ టీం ఎంపిక శనివారం లక్నోలో జరిగింది. 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ సీడబ్ల్యూజీకి అర్హత సాధించారు. మాలిక్తో పాటు వినేష్ ఫొగాట్(50 కేజీలు), పూజా ధాండా(57కేజీలు), బబితా కుమారి ఫొగాట్(54 కేజీలు), దివ్య కరణ్(68కేజీలు), కిరణ్(76 కేజీలు) విభాగాల్లో రెండు టోర్నమెంట్లలో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. సీడబ్ల్యూజీ 2018 ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 15 మధ్య ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరగనుంది. -
సుశీల్ పసిడి ‘పట్టు’
న్యూఢిల్లీ: మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించాడు. 74 కేజీల విభాగం ఫైనల్లో ఆకాశ్ ఖుల్లర్ (న్యూజిలాండ్)ను సుశీల్ చిత్తుగా ఓడించాడు. మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ 62 కేజీల విభాగం ఫైనల్లో 13–2తో తైలా తుహినే (న్యూజిలాండ్)ను ఓడించి స్వర్ణం దక్కించుకుంది. -
సాక్షికి టఫ్ ఫైట్!
-
సాక్షికి రజతం
►వినేశ్, దివ్యలకు కూడా ►ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్ న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో మహిళల విభాగంలో భారత్కు మూడు రజతాలు, ఒక కాంస్యం దక్కింది. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్తో పాటు వినేశ్ ఫోగట్, దివ్యా కక్రన్ కూడా రజత పతకాలు సాధించగా, రీతూ ఫోగట్ కాంస్యం గెలుచుకుంది. ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ సర్క్యూట్లో ఫైనల్ చేరిన సాక్షి, తుదిపోరులో నిరాశపరిచింది. శుక్రవారం జరిగిన మహిళల 60 కేజీల కేటగిరీ ఫైనల్లో సాక్షి 0–10తో రియో స్వర్ణ పతక విజేత రిసాకో కవాయి (జపాన్) చేతిలో చిత్తుగా ఓడింది. ‘నాకు ఈ రోజు ఏదీ కలిసిరాలేదు. అయితే తదుపరి టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు కృషి చేస్తా’ అని 24 ఏళ్ల సాక్షి పేర్కొంది. మహిళల 55 కేజీల తుదిపోరులో వినేశ్ 4–8తో నాన్జో సే చేతిలో ఓడింది. ‘గాయం నుంచి కోలుకున్న తర్వాత బరిలోకి దిగిన నేను ఇంత బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది. రజత ప్రదర్శనపై సంతృప్తిగానే ఉంది’ అని వినేశ్ ఫోగట్ తెలిపింది. మరో భారత రెజ్లర్ దివ్య కూడా టైటిల్ పోరులో పరాజయం చవిచూసింది. 69 కేజీ కేటగిరీ ఫైనల్లో దివ్య 0–8తో జపాన్కే చెందిన సారా దొషో చేతిలో చిత్తుగా ఓడింది. 48 కేజీల కేటగిరీలో రీతూ ఫోగట్కు కాంస్యం దక్కింది. గాయం కారణంగా ప్రత్యర్థి యానన్ సన్ (చైనా)నుంచి రీతూకు వాకోవర్ లభించింది. -
సాక్షికి టఫ్ ఫైట్!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ మరో మెడల్ ఖాయం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఆమె పతకం సాధించడం ఖాయమైంది. 60 కేజీల విభాగంలో ఆమె ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో కజక్స్తాన్కు చెందిన అయలిమ్ కాసీమోవాను 15-3తో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జపాన్ రెజ్లర్ రిసాకొ కావావ్తో ఫైనల్లో సాక్షి మలిక్ తలపడనుంది. తుది పోరులో గెలిస్తే ఆమెకు బంగారు పతకం వస్తుంది. ఓడితే వెండి పతకం దక్కించుకుంటుంది. క్వార్టర్ ఫైనల్లో ఉజ్బక్ రెజ్లర్ నబీరా ఎసెన్బెవాను 6-2 తేడాతో ఓడించి సెమీస్ చేరింది. గతవారం జరిగిన సెలెక్షన్స్లో మంజు కుమారిని 10-0తో ఓడించి ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్కు అర్హత సాధించింది. 58 కేజీల విభాగంలో ఆమె పోటీ పడాల్సివుంది. అయితే బరువు పెరగడంతో 60 కేజీల విభాగంలో పోటీకి దిగింది. -
ఫోర్బ్స్ ‘సూపర్ అచీవర్స్’ జాబితాలో దీప, సాక్షి
న్యూయార్క్: రియో ఒలింపిక్స్లో అద్వితీయ ప్రదర్శనతో యావత్ భారతావని మనసులను గెలుచుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లింగ్లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్లకు అంతర్జాతీయస్థాయి గౌరవం లభించింది. ప్రముఖ మేగజైన్ ‘ఫోర్బ్స్’ ప్రకటించిన ఆసియా ‘సూపర్ అచీవర్స్’ జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఆసియాలో 30 ఏళ్లలోపు తమ తమ రంగాల్లో రాణించి గొప్ప విప్లవాత్మక మార్పులకు కారణమైన 300 మంది యంగ్ అచీవర్స్తో ‘ఫోర్బ్స్’ ఈ జాబితాను రూపొందించింది. భారత్ నుంచి మొత్తం 53 మంది ఇందులో చోటు దక్కించుకున్నారు. ‘రియోలో దీపా పతకం గెలవకపోయినా... కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైన ప్రోడునోవా విన్యాసాన్ని విజయవంతంగా చేసింది’ అని ఫోర్బ్స్ పత్రిక ప్రశంసించింది. మరోవైపు ఎన్నో ప్రతికూలతలను అధిగమించి సాక్షి మలిక్ మహిళల రెజ్లింగ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని ఫోర్బ్స్ పత్రిక కొనియాడింది. దీపా, సాక్షిలతోపాటు ఈ జాబితాలో భారత తొలి పారాలింపిక్ స్విమ్మర్ శరత్ గైక్వాడ్కూ స్థానం లభించింది. కేవలం ఒక చేయి సహకారంతో స్విమ్మింగ్ చేసే శరత్ ఇప్పటివరకు పలు ఈవెంట్లలో 96 పతకాలు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. -
సాక్షి, దీప మరో ఘనత
న్యూఢిల్లీ: ఫోర్బ్ష్ సూపర్ ఎచీవర్స్ జాబితా-2017లో ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, నటి అలియా భట్ చోటు దక్కించుకున్నారు. ఆసియా ఖండంలో 30 ఏళ్లలోపు విజేతలతో ఈ జాబితా తయారు చేసింది. 10 విభాగాలకు చెందిన 300 మంది యువ విజేతల పేర్లను ఇందులో పొందుపరిచింది. వినోదం, వాణిజ్యం, వెంచర్ క్యాపిటల్, రిటైల్, సామాజిక వాణిజ్యం, ఎంటర్ ప్రైజ్ టెక్నాలజీ తదితర రంగాల్లో విజేతలుగా నిలిచిన 30 ఏళ్లలోపు వారిని ఈ జాబితాలో చేర్చింది. భారత్ నుంచి 53 మంది విజేతలకు చోటు దక్కింది. చైనా(76) మనకంటే ముందుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న సోదరులు సంజయ్(15), శ్రావణ్ కుమరన్(17) పిన్నయవస్కులుగా నిలిచారు. ఐదేళ్ల క్రితం వీరిద్దరూ గో డైమన్షన్స్ పేరుతో మొబైల్ యాప్ అభివృద్ధి సంస్థను స్థాపించారు. 0.15 పాయింట్లతో పతకం కోల్పోయినప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని దీపా కర్మాకర్ ను ఫోర్బ్స్ ప్రశంసించింది. రియో ఒలింపిక్స్ లో ప్రొడునోవా వాల్ట్ విభాగంలో దీప నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ లోని రొహతక్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన సాక్షి మాలిక్ స్థానిక అవాంతరాలను అధిగమించి రెజ్లింగ్ లో ఒలింపిక్ పతకం సాధించిందని ఫోర్బ్స్ మెచ్చుకుంది. -
రెజ్లర్ను మనువాడిన సాక్షి మాలిక్!
రియో ఒలింపిక్స్లో మొదటి పతకాన్ని సాధించి.. చరిత్ర సృష్టించిన మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఆమె ఆదివారం రోహతక్లో తోటి రెజ్లర్ సత్యవ్రత్ కడియన్ను వివాహం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్లో 58 కిలోల కేటగిరీలో సాక్షి కాంస్యం పతకం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఒలింపిక్స్ రెజ్లింగ్లో పతకం సాధించిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. రోహతక్లో అట్టహాసంగా జరిగిన ఆమె వివాహానికి ప్రముఖ రెజ్లర్ సుశీల్కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రెజ్లింగ్ క్రీడ ద్వారానే సాక్షికి సత్యవ్రత్కు మధ్య పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది. సత్యవ్రత్ 2010 యూత్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్లో అతను పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. Happy married life congratulation @SakshiMalik pic.twitter.com/7X34PS6MMe — Vijender Singh (@boxervijender) 3 April 2017 Time to get colored with Mehendi for the big day #excited pic.twitter.com/BjcBpIyrx3 — Sakshi Malik (@SakshiMalik) 1 April 2017 -
సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు
-
సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు
చండీగఢ్: ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ హరియాణా ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఒలింపిక్స్లో పతకం సాధించిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు అమలు కాలేదని ఆమె ట్వీట్ చేశారు. ప్రకటనలు మీడియాకు మాత్రమే పరిమితమయ్యాయని ఆమె ఆరోపించారు. సాక్షి మాలిక్ ట్వీట్పై హరియాణా మంత్రి అనిల్ విజ్ వెంటనే స్పందించారు. ప్రభుత్వం నుంచి ఆమె రూ. 2.5 కోట్ల చెక్ తీసుకున్నారని అనిల్ విజ్ వెల్లడించారు. సాక్షి మాలిక్ కోరిక మేరకు ఎండీ యూనివర్సిటీలో ఒక పోస్ట్ను కూడా క్రియేట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై మాట్లాడిన సాక్షి మాలిక్ తండ్రి సుదేశ్ మాలిక్.. ప్రభుత్వం 2.5 కోట్ల చెక్ ఇచ్చిన మాట వాస్తవమే అని అన్నారు. అయితే.. ప్రభుత్వం ఇచ్చిన మిగతా హామీల సంగతేంటని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. -
ప్రతిభకు ‘పద్మా’భిషేకం
న్యూఢిల్లీ: చేసింది. సంచలన క్రికెటర్, టీమిండియా సారథి విరాట్ కోహ్లి సహా ఎనిమిది మందికి నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’లను ప్రకటించింది. ఈ జాబితాలో ఒలింపిక్స్, పారాలింపిక్స్ పతక విజేతలు సాక్షి మలిక్, మరియప్పన్ తంగవేలు, దీపా మలిక్తో పాటు శేఖర్ నాయక్, వికాస్ గౌడ, దీపా కర్మాకర్, శ్రీజేశ్ ఉన్నారు. కోహ్లి (క్రికెట్): సంచలనాల క్రికెటర్ విరాట్ కోహ్లి. ఇంటాబయటా... వేదికేదైనా... ఫార్మాట్ ఏదైనా పరుగుల వేటగాడు మాత్రం అతడే. ఛేదనలో కొండంత లక్ష్యాన్ని సైతం పిండిచేయగల ఈ ‘రన్ మెషిన్’ ఇప్పుడు టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సాక్షి (రెజ్లింగ్): రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకాన్ని అందించిన మహిళా రెజ్లర్ సాక్షి మలిక్. హరియాణాకు చెందిన సాక్షి 58 కేజీల బౌట్లో తన అద్వితీయ ప్రదర్శనతో కాంస్యాన్ని సాధించింది. వికాస్ గౌడ (అథ్లెటిక్స్): కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్లో డిస్కస్ త్రో చాంపియన్ వికాస్. కర్ణాటకకు చెందిన వికాస్ రెండు ఒలింపిక్స్లలో పాల్గొన్నాడు. మరియప్పన్ తంగవేలు (పారాథ్లెటిక్స్): ఈ పారాలింపియన్ ప్రతిభకు వైకల్యమే చిన్నబోయింది. తమిళనాడుకు చెందిన తంగవేలు రియో పారాలింపిక్స్లో హైజంప్ టి42 కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. దీపా మలిక్ (పారాథ్లెటిక్స్): హరియాణాకు చెందిన దీపా మలిక్ రియో పారాలింపిక్స్ మహిళల షాట్పుట్ ఎఫ్–53 విభాగంలో అచ్చెరువొందించే ప్రదర్శనతో రజత పతకం గెలిచింది. దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్): ఒలింపిక్స్కు అర్హత పొందిన తొలి మహిళా జిమ్నాస్ట్గా గుర్తింపు పొందిన దీపా కర్మాకర్ రియోలో తృటిలో పతకం కోల్పోయింది. త్రిపురకు చెందిన ఈ మెరుపుతీగ వాల్టింగ్ ఈవెంట్లో తన ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచి భారత అభిమానుల మనసుల్ని గెలుచుకుంది. శ్రీజేశ్ (హాకీ): ప్రత్యర్థులు గోల్స్ చేయకుండా అడ్డుగోడలా నిలబడే గోల్కీపర్ శ్రీజేశ్. కేరళకు చెందిన శ్రీజేశ్ భారత హాకీ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. అతని సారథ్యంలో భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. శేఖర్ నాయక్ (అంధుల క్రికెట్): అంధుల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ (2014)లో భారత్ను విశ్వవిజేతగా నిలిపిన నాయకుడు శేఖర్. కర్ణాటకకు చెందిన శేఖర్ తన ప్రదర్శనతో అలరిస్తున్నా ఇంకా నిరుద్యోగిగానే ఉన్నాడు. -
ఢిల్లీ సుల్తాన్స్కు మరో పరాజయం
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ సారథ్యంలోని ఢిల్లీ సుల్తాన్స్ జట్టు వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిపోయింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఎన్సీఆర్ పంజాబ్ రాయల్స్ జట్టు 5–2 తేడాతో ఢిల్లీ సుల్తాన్స్పై గెలిచి రెండో విజయాన్ని అందుకుంది. రాయల్స్ జట్టు తరఫున వ్లాదిమర్ కిన్చెగశ్విల్ (57 కేజీలు) 8–1తో పంకజ్పై, జితేంద్ర (74 కేజీలు) 5–4తో ప్రవీణ్ రాణాపై, ఒడునాయో (53 కేజీలు) 15–0తో సంగీత ఫోగట్పై, అస్గరోవ్ (65 కేజీలు) 6–0తో సుర్జీత్పై, మర్జలిక్ (75 కేజీలు) 2–1తో అలీనాపై విజయం సాధించారు. ఢిల్లీ జట్టులో సత్యవర్త్ కడియన్ (97 కేజీలు) 14–4తో క్రిషన్ కుమార్పై, సాక్షి (58 కేజీలు) 10–0తో మంజు కుమారిపై గెలుపొందారు. సోమవారం జరిగే మ్యాచ్లో ముంబై మహారథి జట్టు జైపూర్ నింజాస్తో ఆడుతుంది. మరోవైపు యూపీ దంగల్ తరఫున ఆడుతున్న ‘ఫోగట్ సిస్టర్స్’ గీత, బబితా గాయాల కారణంగా ఈ లీగ్ మధ్యలో నుంచి వైదొలిగారు. -
సాక్షి గెలిచినా
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో సాక్షి మలిక్ సారథ్యంలోని కలర్స్ ఢిల్లీ సుల్తాన్స్ జట్టుకు తొలి మ్యాచ్లోనే చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆ జట్టు 3–4 తేడాతో జైపూర్ నింజాస్ చేతిలో పరాజయం పాలైంది. జైపూర్ జట్టుకు ఈ సీజన్లో ఇది వరుసగా రెండో విజయం. టాస్ గెలిచిన జైపూర్ నింజాస్ 65 కేజీల పురుషుల విభాగాన్ని... ఢిల్లీ 53 కేజీల మహిళల విభాగాన్ని బ్లాక్ చేశాయి. నింజాస్ జట్టులో ఎలిజ్బర్ (97 కేజీలు) 8–0తో సత్యవర్త్ కడియన్పై, జాకబ్ మకరష్విలి (74 కేజీలు) 10–7తో ప్రవీణ్ రాణాపై, జెన్నీ ఫ్రాన్సన్ (75 కేజీలు) 5–0తో అలీనాపై, వినోద్ కుమార్ (70 కేజీలు) 2–0తో డేవిడ్పై విజయం సాధించారు. ఢిల్లీ తరఫున మరియా స్టడ్నక్ (48 కేజీలు) 16–0తో రీతూ ఫోగట్పై, సాక్షి మలిక్ (58 కేజీలు) 16–0తో పూజ ధండపై, ఎర్డెన్బాట్ బెక్యార్ (57 కేజీలు) 2–1తో ఉత్కర్‡్ష కాలేపై గెలిచారు. శనివారం జరిగే మ్యాచ్లో ముంబై మహారథితో యూపీ దంగల్ తలపడుతుంది. -
‘దంగల్’ హంగామా...
నేటి నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్–2 అందరి దృష్టి సాక్షి, ఫోగట్ సిస్టర్స్ పైనే బరిలో ఆరు జట్లు తొలి రోజు హరియాణా, ముంబై పోరు న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో దేశానికి తొలి పతకం అందించిన సాక్షి మలిక్తో పాటు ‘ఫోగట్ సిస్టర్స్’ జీవితాలను ప్రతిబింబిస్తూ ఇటీవల విడుదలై దుమ్మురేపుతున్న ‘దంగల్’ చిత్రంతో ఇప్పుడు రెజ్లింగ్ అంటే సర్వత్రా ఆసక్తి రెట్టింపయ్యింది. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో దేశంలోని క్రీడాభిమానులను అలరించేందుకు నేటి (సోమవారం) నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్ రెండో సీజన్ ప్రారంభం కానుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మద్దతుతో 18 రోజుల పాటు జరిగే ఈ లీగ్కు స్థానిక కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. ఇందులో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ గతేడాది చాంపియన్గా నిలిచిన ముంబై మహారథి, రన్నరప్ హరియాణా హ్యామర్స్ మధ్య జరుగనుంది. ఇక ఈ లీగ్కు బజరంగ్ పూనియా, అమిత్ కుమార్, జితేంద్ర, సందీప్ తోమర్, సాక్షి, గీతా ఫోగట్, బబితా కుమారిలే కాకుండా ప్రపంచ చాంపియన్లు, ఒలింపిక్ పతకాలు సాధించిన అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లు స్టార్ అట్రాక్షన్గా మారనున్నారు. అయితే సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ లీగ్కు దూరంగా ఉండటం అభిమానులకు కాస్త నిరాశే. రూ.15 కోట్ల ప్రైజ్మనీతో తొలి సీజన్కు మించి భారీగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇవీ జట్లు... ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో ముంబై మహారథి, హరియాణా హ్యామర్స్, ఢిల్లీ సుల్తాన్స్, జైపూర్ నింజా, యూపీ దంగల్, ఎన్సీఆర్ పంజాబ్ రాయల్స్ పాల్గొంటున్నాయి. ప్రతీ జట్టులో తొమ్మిది మంది రెజ్లర్లుంటారు. ఇందులో భారత్కు చెందిన పురుష రెజ్లర్లు ముగ్గురు, మహిళా రెజ్లర్లు ఇద్దరు ఉంటారు. అలాగే విదేశీ కోటా కింద ఇద్దరేసి పురుషుల, మహిళల రెజ్లర్లు ఉంటారు. ఓవరాల్గా మొత్తం 54 మంది పాల్గొంటున్నారు. లీగ్ ఫార్మాట్... లీగ్ దశలో 15 మ్యాచ్లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈనెల 17, 18న సెమీఫైనల్స్ ఉంటాయి. 19న జరిగే తుదిపోరులో నెగ్గిన విజేత రెండో సీజన్లో చాంపియన్గా అవతరిస్తుంది. ఇక పోటీలు తొమ్మిది విభాగాల్లో జరుగుతాయి. పురుషుల విభాగంలో 57 కేజీలు, 65 కేజీలు, 70 కేజీలు, 74 కేజీలు, 97 కేజీల్లో నిర్వహిస్తుండగా... మహిళా రెజ్లర్లు 48 కేజీలు, 53 కేజీలు, 58 కేజీలు, 69–75 కేజీలలో సత్తా చూపనున్నారు. సూపర్ బౌట్.. ఈ లీగ్లో ఈనెల 15న మహిళల 58 కేజీల విభాగంలో జరిగే బౌట్ అత్యంత ఆసక్తి రేపనుంది. ఎందుకంటే ఈ బౌట్... రియో ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (ఢిల్లీ సుల్తాన్స్)... ‘దంగల్’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ గీత ఫోగట్ (యూపీ దంగల్) మధ్య జరుగనుంది. అయితే వీరిద్దరిపై విపరీతమైన ఒత్తిడి, అంచనాలు ఉండడంతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రొ రెజ్లింగ్లో నేడు ముంబై మహారథి గీ హరియాణా హ్యామర్స్ రాత్రి 7 గంటల నుంచి సోనీ మ్యాక్స్, సోనీ ఈఎస్పీఎన్లలో ప్రత్యక్ష ప్రసారం -
మన ఆటకు మంచిరోజులు!
అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత వెలుగులు కాలగమనంలో మరో ఏడాది గడిచిపోయింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై ఈ సంవత్సరం కూడా భారత క్రీడాకారులు తమదైన ముద్ర వేశారు. మరీ ముఖ్యంగా క్రీడాకారిణులు అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. రియో ఒలింపిక్స్లో పీవీ సింధు, సాక్షి మలిక్, దీపా కర్మాకర్... రియో పారాలింపిక్స్లో దీపా మలిక్... టెన్నిస్లో సానియా మీర్జా తమ ప్రతిభాపాటవాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి విజయాలతోపాటు వివాదాలు, వైఫల్యాలు కూడా భారత క్రీడాభిమానులను పలుకరించాయి. రెజ్లింగ్లో సుశీల్ కుమార్–నర్సింగ్ యాదవ్ వివాదం... ఒలింపిక్స్కు అర్హత పొందిన ఇద్దరు అథ్లెట్స్ డోపింగ్లో పట్టుబడటం... మేటి బాక్సర్ మేరీకోమ్ రియో బెర్త్ పొందకపోవడం...2016లో ఇతర విశేషాలు. – సాక్షి క్రీడావిభాగం ‘సూపర్’ సానియా... మహిళల డబుల్స్ టెన్నిస్లో హైదరాబాద్ ప్లేయర్ సానియా మీర్జా వరుసగా రెండో ఏడాది సీజన్ను టాప్ ర్యాంక్తో ముగించింది. ఈ ఏడాది సానియా ఎనిమిది టైటిల్స్ సాధించింది. హింగిస్తో కలిసి బ్రిస్బేన్, సిడ్నీ, ఆస్ట్రేలియన్ ఓపెన్, రోమ్ ఓపెన్, సెయింట్ పీటర్స్బర్గ్ టోర్నీలలో ఆమె విజేతగా నిలిచింది. ఆ తర్వాత కొత్త భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలసి సిన్సినాటి ఓపెన్, టోక్యో ఓపెన్లలో, మోనికా నికెలెస్కూ (రొమేనియా)తో కలసి న్యూ హవెన్ ఓపెన్లో టైటిల్స్ సాధించింది. రియో ఒలింపిక్స్లో రోహన్ బోపన్నతో కలసి సానియా మీర్జా కాంస్య పతక పోరులో ఓడిపోయింది. లియాండర్ పేస్ ఫ్రెంచ్ ఓపెన్లో హింగిస్తో జతగా టైటిల్ నెగ్గి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ‘కెరీర్ స్లామ్’ పూర్తి చేసుకున్నాడు. రాకెట్ దూసుకెళ్లింది... భారత్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న బ్యాడ్మింటన్ క్రీడలో ఈసారీ మనోళ్లు మెరిశారు. రియో ఒలింపిక్స్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అనంతరం చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో విజేతగా నిలిచి తన ఖాతాలో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్ను హస్తగతం చేసుకుంది. హాంకాంగ్ ఓపెన్లో రన్నరప్గా కూడా నిలిచింది. ఈ ప్రదర్శనతో సింధు సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు అర్హత పొందింది. అంతేకాకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ద్వారా ఈ ఏడాది అత్యంత మెరుగైన క్రీడాకారిణి పురస్కారాన్ని కూడా గెల్చుకుంది. మరోవైపు సైనా నెహ్వాల్కు ఈ ఏడాది తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ను నెగ్గిన సైనా... రియో ఒలింపిక్స్లో మాత్రం గాయం కారణంగా లీగ్ దశలోనే నిష్క్రమించింది. మరో తెలుగు అమ్మాయి రుత్విక శివాని రష్యా గ్రాండ్ప్రిలో, దక్షిణాసియా క్రీడల్లో విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ రియో ఒలింపిక్స్కు అర్హత పొంది క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. ప్రణయ్ స్విస్ ఓపెన్, సాయిప్రణీత్ కెనడా ఓపెన్, సౌరభ్ వర్మ చైనీస్ తైపీ ఓపెన్ టైటిల్స్ సాధించగా... సమీర్ వర్మ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్గా నిలిచాడు. సిక్కి రెడ్డి మిక్స్డ్ డబుల్స్లో రష్యా గ్రాండ్ప్రి, బ్రెజిల్ గ్రాండ్ప్రి టైటిల్స్ను దక్కించుకుంది. సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట కెనడా ఓపెన్ టైటిల్ నెగ్గి ఒలింపిక్స్కు అర్హత పొందిన తొలి భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. జిగేల్మన్న జాతీయ క్రీడ... ఈ యేడు జాతీయ క్రీడ హాకీ మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో రజతం... ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణం... సొంతగడ్డపై జూనియర్ ప్రపంచకప్ను సాధించడంతో మన హాకీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా హాకీ ఇండియా చీఫ్ నరీందర్ బాత్రా ఎన్నికయ్యారు. రియో ఒలింపిక్స్లో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో పాల్గొన్న భారత మహిళల జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. హారిక అదే జోరు... గతేడాది ఆన్లైన్ చెస్లో విశ్వవిజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఈ ఏడాదీ నిలకడగా రాణించింది. జూన్లో వరుసగా రెండు వారాల్లో రెండు అంతర్జాతీయ టోర్నీలు నెగ్గిన హారిక... ఐల్ ఆఫ్ మ్యాన్ టోర్నీలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హూ ఇఫాన్పై సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత చైనాలోని చెంగ్డూలో జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి టోర్నీలో విజేతగా నిలిచి తొలి గ్రాండ్ప్రి టైటిల్ను సొంతం చేసుకుంది. అద్వానీ అదరహో... క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్)లో భారత స్టార్ పంకజ్ అద్వానీ ఈసారి మళ్లీ సత్తా చాటుకున్నాడు. బెంగళూరులో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్) చాంపియన్షిప్లో అద్వానీ విజేతగా నిలిచి తన ఖాతాలో 16వ ప్రపంచ టైటిల్ను జమచేసుకున్నాడు. భారత్కే చెందిన ధ్రువ్ సిత్వాలా ఆసియా బిలియర్డ్స్ టైటిల్ నిలబెట్టుకోగా... ధర్మేందర్ మాస్టర్స్కేటగిరీలో ప్రపంచ చాంపియన్ అయ్యాడు. ఆ నలుగురు... రియో ఒలింపిక్స్లో భారత్కు రజతం, కాంస్యమే లభించినా... అదే వేదికపై జరిగిన పారాలింపిక్స్లో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం దక్కడం విశేషం. మహిళల షాట్పుట్లో దీపా మలిక్ రజతం... పురుషుల హైజంప్లో తంగవేలు మరియప్పన్ స్వర్ణం, వరుణ్ సింగ్ భటి కాంస్యం గెలిచారు. జావెలిన్ త్రోలో దేవేంద్ర జజరియా పసిడి పతకాన్ని సాధించాడు. అజేయ విజేందర్... ప్రొఫెషనల్ బాక్సింగ్లో తనకు ఎదురులేదని భారత స్టార్ విజేందర్ సింగ్ తన పంచ్ పవర్తో నిరూపించుకున్నాడు. జులైలో భారత్లో జరిగిన బౌట్లో కెర్రీ హోప్ (ఆస్ట్రేలియా)పై గెలిచిన విజేందర్ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఈ నెలలో టాంజానియా బాక్సర్ ఫ్రాన్సిస్ చెకాను నాకౌట్ చేసి విజేందర్ ఈ టైటిల్ను నిలబెట్టుకున్నాడు. ఈ ఏడాది విజేందర్ పోటీపడిన ఐదు బౌట్లలో అజేయంగా నిలువడం విశేషం. ఇక రియో ఒలింపిక్స్లో మాత్రం భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. శివ థాపా, మనోజ్ కుమార్, వికాస్ క్రిషన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. ‘పట్టు’ సడలించారు... సాక్షి మలిక్ అద్భుత ప్రదర్శన తప్పిస్తే ఈ ఏడాది భారత రెజ్లింగ్ తమ ‘పట్టు’ను సడలించింది. రియో ఒలింపిక్స్లో సాక్షి మలిక్ మహిళల 58 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న యోగేశ్వర్ దత్ (61 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. 74 కేజీల విభాగంలో తనకూ, నర్సింగ్కు ట్రయల్స్ నిర్వహించి... గెలిచిన వారిని రియో ఒలింపిక్స్కు పంపించాలని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చేసిన అభ్యర్థనను భారత రెజ్లింగ్ సమాఖ్య పట్టించుకోలేదు. అయితే చివరి నిమిషంలో నర్సింగ్ యాదవ్ డోపింగ్లో దొరికిపోవడంతో ఈ విభాగంలో భారత ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ‘కూత’ అదిరింది.... ప్రొ కబడ్డీ లీగ్తో గ్రామీణ క్రీడ కబడ్డీకి ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. ఈసారి రెండుసార్లు ఈ లీగ్ను నిర్వహించారు. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ టైటిల్ను నిలబెట్టుకుంది. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్లో భారత జట్టు చాంపియన్గా నిలిచింది. అనూప్ కుమార్ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో 38–29తో ఇరాన్ను ఓడించింది. ఓవరాల్గా భారత జట్టుకిది వరుసగా మూడో ప్రపంచకప్ టైటిల్ కావడం విశేషం. దీపా త్రుటిలో... రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో దీపా కర్మాకర్ 15.066 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. అంతకుముందు రియోలోనే జరిగిన టెస్ట్ ఈవెంట్లో దీపా రాణించి ఒలింపిక్స్కు అర్హత పొందిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. నీరజ్ సంచలనం అథ్లెటిక్స్లో హరియాణా యువ సంచలనం నీరజ్ చోప్రా అండర్–20 ప్రపంచ చాంపియన్షిప్లో జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జావెలిన్ను అతను 86.48 మీటర్ల దూరం విసిరి ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రదర్శన మినహా అథ్లెటిక్స్లో ఈ ఏడాది మనకు నిరాశే మిగిలింది. రియో బెర్త్ సాధించిన ధరమ్వీర్ సింగ్ (200 మీటర్లు), ఇందర్జీత్ సింగ్ (షాట్పుట్) డోపింగ్లో పట్టుబడి ఈ మెగా ఈవెంట్కు దూరమయ్యారు. అడపాదడపా మెరుపులు... ఫుట్బాల్లో ఈ సంవత్సరం భారత జట్టు అడపాదడపా మెరిపించింది. ఏఎఫ్సీ కప్లో బెంగళూరు ఎఫ్సీ జట్టు రన్నరప్గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్లబ్గా గుర్తింపు పొందింది. సునీల్ చెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఏడోసారి దక్షిణాసియా (శాఫ్) చాంపియన్గా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 135వ స్థానానికి చేరుకొని ఆరేళ్ల తర్వాత తమ అత్యుత్తమ ర్యాంక్ను సాధించింది. -
'నా బయోపిక్ కు సిద్ధంగా ఉన్నా'
న్యూఢిల్లీ:ఇటీవల కాలంలో క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయాల్నినమోదు చేసిన సంగతి తెలిసిందే. క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా వచ్చిన భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్, ఎంఎస్ ధోని తదితర చిత్రాలు కాసుల వర్షాన్ని కురిపించడమే కాకుండా, ఆయా క్రీడాకారుల మంచి కీర్తిని తెచ్చిపెట్టాయి. అయితే ప్రస్తుతం తన బయోపిక్ ను ఎవరైనా నిర్మించడానికి ఆసక్తి కనబరిస్తే తాను కూడా సిద్ధంగా ఉన్నట్లు రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ స్పష్టం చేసింది. 'ఎవరైనా నా బయోపిక్ను నిర్మించడానికి వస్తే నేను అందుకు సిద్ధంగా ఉన్నా. గేమ్ను అభివృద్ధి చేయడానికి నా బయోపిక్ ఉపయోగపడుతుందంటే నేను కాదనే ప్రసక్తే లేదు. స్ఫూర్తిదాయకమైన కథలను తెరకెక్కించేటప్పుడు అభ్యంతరం ఎందుకు చెప్పాలి. దాని వల్ల పలువురు యువకులకు గేమ్పై ఆసక్తి కూడా పెరుగుతుంది' అని మాలిక్ పేర్కొంది. అయితే తనకంటూ ఫేవరెట్ నటీమణులు ఎవ్వరూ లేరని ఒక ప్రశ్నకు సమాధానంగా సాక్షి చెప్పింది. -
క్యాట్వాక్ చేసిన సాక్షిమాలిక్, యోగేశ్వర దత్
-
అట్టహాసంగా ప్రోరెజ్లింగ్ లీగ్ అవిష్కరణ
-
ప్రొ రెజ్లింగ్ లీగ్లో విదేశీ స్టార్స్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్) రెండో సీజన్లో ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్లు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ రెండో సీజన్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాంప్ వాక్లో సాక్షి మలిక్, యోగేశ్వర్ దత్, గీతా ఫోగట్, బబితా కుమారి, సోఫియా మాట్సన్ (స్వీడన్), మరియా స్టాడ్నిక్ (అజర్బైజాన్) డిజైనర్ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ‘గతేడాది ప్రారంభ సీజన్లోనూ టాప్ రెజ్లర్లకు ఆహ్వానం పలికినప్పటికీ ఒలింపిక్కు సన్నద్ధమయ్యేందుకు చాలా మంది రాలేదు. ఈసారి అన్నిదేశాలకు ఆహ్వానం పంపించాం. ముఖ్యంగా ఇరాన్ రెజ్లర్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. భారత యువ ఆటగాళ్లకు ఈ లీగ్ అద్భుతంగా ఉపయోగపడుతుందని సాక్షి మలిక్ అభిప్రాయపడింది. ఈనెల 15 లేక 16న పీడబ్ల్యుఎల్ ఆటగాళ్ల వేలం ఉంటుంది. -
రెజ్లర్ సాక్షి నిశ్చితార్థం
-
రెజ్లర్ సాక్షి నిశ్చితార్థం
రోహ్తక్ (హరియాణా): రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజా మోగనుంది. సహచర రెజ్లర్ సత్యవర్త్ కడియన్తో ఆదివారం ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది. సాక్షి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె సమీప బంధువులు, సన్నిహిత మిత్రులు హాజరయ్యారు. రెజ్లర్ సత్యవర్త్ తన తండ్రికి చెందిన అఖాడాలో శిక్షణ పొందాడు. 97 కేజీల ఫ్రీస్టరుుల్ కేటగిరీలో బరిలోకి దిగిన అతను 2010 యూత్ ఒలింపిక్స్లో కాంస్యం, 2014 కామన్వెల్త్ గేమ్స్లో రజతం నెగ్గాడు. -
సంచలన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సాక్షి మాలిక్ !
⇒ ఆటగాళ్లకు ఏ దేశంలోనైనా ఆడే హక్కు ఉంది రియో ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత, భారత రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన తీవ్ర పరిణామాల దృష్ట్యా.. పాక్ ఆటగాళ్లపై భారత్ లో నిషేధం విధించాలా అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎక్కడైనా, ఏ దేశంలోనైనా పోటీలో పాల్గొనే హక్కు అథ్లెట్లు, ఆటగాళ్లకు ఉంటుందని సాక్షి అభిప్రాయపడింది. దీంతో భారత్ లో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వాలని అర్థం వచ్చేలా కామెంట్ చేసిందని ఆమెపై భిన్న కథనాలు వచ్చాయి. అయితే తాను పాక్ ఆటగాళ్లను అన్ని ఈవెంట్లలోనూ భారత్ లో ఆడనివ్వాలని వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలను ఆమె తోసిపుచ్చింది. తాను ప్రస్తావించిన అంశాలను మీడియాకు మహిళా రెజ్లర్ వెల్లడించింది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ తో పాటు ఇతర దేశాల్లో నిర్వహించే అన్ని ఈవెంట్లలో ఆటగాళ్లు పాల్గొంటారు. అంతేకానీ, పాక్ ప్లేయర్స్ ను భారత్ లో నిషేధించవద్దని తాను ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఇతర ప్లేయర్స్ లా తాను వ్యవరించనని స్పష్టంచేసింది. పతకాలు సాధించడం కంటే దేశం కోసం ఇంకా ఏదైనా మంచిపని చేస్తే ఎక్కువగా సంతోషపడతానని సాక్షి చెప్పింది. ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తర్వాత దేశంలో చాలా మంది తనను గుర్తిస్తున్నారని, దాంతో తన బాధ్యత మరింత పెరిగిందని వివరించింది. -
ఇంతకీ సాక్షి మాలిక్ కోచ్ ఎవరు?
కోల్కతా: రియో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా రెజ్లర్ సాక్షి మాలిక్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ కుల్దీప్ మాలిక్ కు హరియాణా ప్రభుత్వం రూ.10 లక్షల నజరానాను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ఓ సన్మాన కార్యక్రమం ఏర్పాటు అతనికి ఆ చెక్ ఫోటో కాపీని కూడా అందించింది. కాగా, ఆ చెక్ కు సంబంధించి ఇంతవరకూ అసలు చెక్ మాత్రం అందలేదు. ఇదంతా పక్కను పెడితే సాక్షి మాలిక్ 'రియల్'కోచ్ ఎవరు అనే దానిపై ఇప్పడు చర్చ నడుస్తోంది. తన కోచ్లు ఇశ్వర్ దాహియా, మన్ దీప్ సింగ్ లు అంటూ సాక్షి తెలియజేయడమే తాజా వివాదానికి కారణమైంది. మరోవైపు రజ్ బీర్ సింగ్ కూడా తానే సాక్షి కోచ్నంటూ పేర్కొనడంతో అసలు చెక్ ను ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడ్డారు. దీనిపై తన కోచ్ ఎవరో, ఆ ప్రైజ్ మనీ ఎవ్వరికీ ఇవ్వాలో సాక్షినే స్పష్టం చేయాలని ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆ రాష్ట్ర క్రీడామంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. రియోలో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించిన అనంతరం హరియాణా ప్రభుత్వం ఆమెకు రూ.2.5 కోట్ల నజరానా ప్రకటించింది. దానిలో భాగంగా ఆమె కోచ్ మన్ దీప్ కు రూ. 10లక్షలను ఇస్తామని వెల్లడించింది. అయితే సాక్షి కోరిక మేరకు రియోలో సాక్షితో ఆమెతోపాటు ఉన్న కోచ్ కుల్దీప్ కూడా రూ. 10 లక్షల ఇవ్వనున్నట్లు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖతర్ తెలిపారు. అయితే ఇప్పడు మరో ఇద్దరు కోచ్లు కూడా ఆమె విజయంలో ముఖ్య భూమిక పోషించామని, ఆ పది లక్షల రూపాయిలు తమకే ఇవ్వాలనడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. -
అసలు చెక్ ఇంకా అందనే లేదు
సాక్షి మలిక్ కోచ్ పరిస్థితి కోల్కతా: రియో ఒలింపిక్స్లో దేశానికి తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మలిక్కు అభినందనలతో పాటు కనకవర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ కుల్దీప్ మలిక్ పరిస్థితి మాత్రం కాస్త విచిత్రంగా మారింది. సాక్షికి నజరానా అందించినట్టే హరియాణా ప్రభుత్వం కుల్దీప్కు కూడా రూ.10 లక్షలను ప్రకటించింది. రియో నుంచి రాగానే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సభలోనే ఆయనకు ఫొటోకాపీ చెక్ను ప్రభుత్వం అందించింది. అయితే ఇది జరిగి నెల రోజులకు పైగానే గడిచినా ఇప్పటికీ అసలు చెక్ మాత్రం ఆయనకు అందలేదు. అంతేకాకుండా రైల్వే శాఖలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తనకు ప్రమోషన్ కల్పిస్తామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హామీ ఇచ్చారు. అది కూడా నోటిమాటగానే మిగిలిపోయింది. ఈ విషయంపై నెల రోజులుగా హరియాణా ప్రభుత్వం, రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు చుట్టూ కుల్దీప్ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు. -
సరదాగా..సోనాక్షి సిన్హా,సాక్షి మలిక్
-
సాక్షి ఖాతాలో మరో ఘనత
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ సాక్షి మాలిక్ ర్యాంక్ మెరుగుపడింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్లో సాక్షి టాప్-5లో ప్రవేశించింది. మహిళల 58 కిలోల కేటగిరిలో సాక్షి నాలుగో ర్యాంక్ సాధించింది. ఆమెకిదే కెరీర్ బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం. ఒలింపిక్స్లో రెజ్లింగ్ కేటగిరిలో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా సాక్షి ఘనత సాధించిన సంగతి తెలిసిందే. రియో ఈవెంట్లో ఆమె కాంస్యం గెలిచి దేశానికి తొలిపతకం అందించింది. రియో విజయంతో ఆమె ర్యాంక్ మెరుగుపడింది. తాజా ర్యాంకింగ్స్ 48 కిలోల కేటగిరి జాబితాలో మరో భారత రెజ్లర్ వినేష్ పొగట్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇక పురుషుల ఫ్రీస్టయిల్ కేటగిరిలో సందీప్ తోమర్ (15వ ర్యాంక్), బజ్రంగ్ పూనియా (18వ ర్యాంక్) మాత్రమే టాప్-20లో నిలిచారు. -
బర్త్డే కేక్.. రియోకు ముందు... రియో తర్వాత!
రియో ఒలింపిక్స్ లో పతకం కోసం వేచి చూస్తున్న కోట్ల మంది భారతీయుల ఆకాంక్షను నెరవేర్చిన రెజ్లర్ సాక్షి మాలిక్. మన ప్లేయర్స్ పతకంతో ఎప్పుడు, ఎవరు ఖాతా తెరుస్తారా అంటూ యావత్ దేశం ఎంతగానే ఎదురుచూసింది. ప్రతి విభాగంలోనూ మన ఆటగాళ్ల వైఫల్యాలు ఓ వైపు వెంటాడుతున్నా.. తొలి పతకం అందించి సాక్షి మాలిక్ కాస్త ఊరటనిచ్చింది. మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల పుట్టినరోజు(సెప్టెంబర్ 3) జరుపుకున్న రియో పతక విన్నర్ కొన్ని ఆసక్తికర విషయాలను ట్వీట్ చేసింది. రియో ఒలింపిక్స్ కు వెళ్లకముందు, రియో తర్వాత తాను జరుపుకున్న పుట్టినరోజు వేడుకలకు సంబంధించి కేక్ ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రెండు ఫొటోలను పోస్ట్ చేసిన సాక్షి.. టార్గెట్ కంప్లీట్ అంటూ పోస్ట్లో పేర్కొంది. అందరూ ఆశించినట్లుగానే పతకంతో తిరిగొచ్చానన్న విజయగర్వం ఆమెలో కనిపించింది. రియో ఒలింపిక్స్ లో పాల్గొనకముందు కేక్ లో ఒలింపిక్స్ లో విన్నర్ గా చూడాలని ఆశిస్తున్నామని రాశారు. రియో నుంచి పతకం సాధించి వచ్చిన తర్వాత జరుపుకున్న తొలి పుట్టినరోజు కేక్ లో వచ్చే ఒలింపిక్స్ కు సాక్షికి ఆల్ ది బెస్ట్ అని చెబుతున్నట్లు ఉంది. ఈ సంతోషకర విషయాలను రెజ్లర్ సాక్షి మాలిక్ ట్విట్టర్ ద్వారా తన ఫాలోయర్స్, అభిమానులతో పంచుకుంది.