Shoaib Malik
-
క్రికెటర్ షోయబ్ మాలిక్ రెండో పెళ్లి.. మ్యారేజ్ డే పిక్స్ షేర్ చేసిన నటి సనా జావెద్ (ఫోటోలు)
-
PCB: మెంటార్లుగా ఆ ఐదుగురు.. షోయబ్ మాలిక్ సహా..
దేశవాళీ చాంపియన్స్ కప్ టోర్నీలో ఐదుగురు మాజీ క్రికెటర్లకు మెంటార్లుగా అవకాశం ఇచ్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. మిస్బా ఉల్ హక్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్లతో ఇందుకు గానూ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే ఎవరు ఏ జట్టుకు మార్గనిర్దేశకుడిగా ఉంటారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.నవతరం ఆణిముత్యాలను గుర్తించేందుకుతొలుత వీరు చాంపియన్స్ వన్డే కప్ ద్వారా ఆయా జట్లకు మెంటార్లుగా తమ ప్రయాణం మొదలుపెడతారని తెలిపింది. ఈ విషయం గురించి పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్కప్ టీమ్స్ మెంటార్లుగా ఐదుగురు చాంపియన్లను నియమించడం ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం గడించి.. ఆట పట్ల అంకితభావం కలిగి ఉన్న వీరు.. నవతరం ఆణిముత్యాలను గుర్తించడంలో.. వారిని మెరికల్లా తీర్చిదిద్దడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ప్రక్షాళనలో భాగంగా కొత్తగా మూడు టోర్నీలుఅంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు మధ్య వారధులుగా పనిచేస్తారని.. యువ క్రికెటర్ల నైపుణ్యాలకు సానపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించబోతున్నారని నక్వీ వెల్లడించారు. ఆట పరంగానే వ్యక్తిగతంగానూ యువ ఆటగాళ్లకు వీరు దిక్సూచిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. కాగా నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు పాకిస్తాన్లో ఉన్నాయి.వీటికి అదనంగా మూడు కొత్త టోర్నమెంట్లను పీసీబీ ఇటీవల ప్రవేశపెట్టింది. పురుషుల క్రికెట్లో చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్క్లాస్ కప్ పేరిట టోర్నీలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా మొదట సెప్టెంబరు 12- 29 వరకు చాంపియన్స్ వన్డే కప్ నిర్వహించనుంది. ఇందులో టాప్ దేశవాళీ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా పాల్గొనున్నట్లు పీసీబీ తెలిపింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీసి.. వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్ది అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పీసీబీ ఈ టోర్నమెంట్లను ప్రవేశపెట్టింది.ఐదుగురు అనుభవజ్ఞులుపాక్ మాజీ బ్యాటర్, 52 ఏళ్ల వకార్ యూనిస్ ఇటీవల పీసీబీ సలహాదారుగా పనిచేశాడు. మరో మాజీ ఆటగాడు సక్లెయిన్ ముస్తాక్ పాక్ జాతీయ హెడ్కోచ్గా గతంలో సేవలు అందించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్, మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ ఐసీసీ ట్రోఫీలు గెలిచిన పాక్ జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇకపై మెంటార్లుగా వీరు కొత్త అవతారం ఎత్తనున్నారు. చదవండి: రోహిత్ కోసం మేమూ పోటీలో ఉంటాం: పంజాబ్ కింగ్స్ అధికారి -
రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటా.. మళ్లీ పాక్ తరపున ఆడుతా: మాలిక్
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్ చేతిలో ఓడి గ్రూపు స్టేజిలోనే పాక్ నిష్కమ్రించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండింట మాత్రమే విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్ల్లో గెలిచినప్పటకి అవి చెప్పుకోదగ్గ విజయాలు కావు. టీ20 వరల్డ్కప్ చరిత్రలో గ్రూపు స్టేజి నుంచి పాక్ నిష్క్రమించడం ఇదే మొదటి సారి. అంతకుముందు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ది ఇదే పరిస్థితి.దారుణ ప్రదర్శన కనబరిచి వన్డే ప్రపంచకప్లో సైతం గ్రూపు స్టేజిలోనే నిష్క్రమించింది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు పీసీబీపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు వరల్డ్కప్ జట్టులో చోటివ్వడాన్ని తప్పుబడుతున్నారు. వారి స్ధానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది మాజీలు అభిప్రాయపడుతున్నారు.ఇక వరుసగా రెండు వరల్డ్కప్లలో నిరాశపరిచిన పాకిస్తాన్.. వచ్చే ఏడాది తమ స్వదేశంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనైనా సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్కు ప్రాతినిథ్యం వహించాలన్న తన కోరికను మాలిక్ వ్యక్తం చేశాడు. కాగా మాలిక్ 2019 వన్డే వరల్డ్కప్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఆ తర్వాత టీ20ల్లో మాత్రమే 42 ఏళ్ల మాలిక్ కొనసాగాడు. టీ20ల్లో కూడా పెద్దగా పాక్ తరపున ఆడే అవకాశం రాలేదు. పాకిస్తాన్ తరపున మాలిక్ చివరగా 2021లో బంగ్లాదేశ్పై ఆడాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్న మాలిక్.. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లలో మాత్రమే కొనసాగుతున్నాడు."నేను మళ్లీ పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను.రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాను. ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాను. నాలో ఇంకా ఫిట్నెస్ లెవల్స్ ఏ మాత్రం తగ్గలేదు. నా దేశం కోసం ఏమి చేయడానికైనా సిద్దంగా ఉన్నాను.పాకిస్తాన్కు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందించేందుకు నా వంతు కృషి చేయాలని భావిస్తున్నానని" పీఎన్ఎన్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ పేర్కొన్నాడు. -
‘ప్లీజ్.. కెప్టెన్సీ వదిలెయ్.. మంచే జరుగుతుంది’
టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. సారథిగా, బ్యాటర్గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శల పాలవుతున్నాడు.అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో పాక్ జట్టు ఇంత వరకు బోణీ కొట్టకపోవడంతో సూపర్-8 అవకాశాలు కూడా సంక్లిషంగా మారిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో అనూహ్య రీతిలో ఆతిథ్య యూఎస్ఏ చేతిలో ఓటమి పాలైంది పాకిస్తాన్.ఆ తర్వాతి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్లోనూ బాబర్ బృందానికి మరోసారి పరాభవం తప్పలేదు. న్యూయార్క్లో ఆదివారం నాటి ఈ మ్యాచ్లో భారత్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్.. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.యూఎస్ఏతో పోటీపడాల్సిన దుస్థితిసూపర్-8 దశకు అర్హత సాధించాలంటే పసికూన యూఎస్ఏతో పోటీపడాల్సిన స్థితిలో నిలిచింది. ఇక బాబర్ ఆజం వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. ప్రపంచంలోని మేటి బ్యాటర్లలో ఒకడిగా పేరొందిన ఈ రైట్హ్యాండర్ ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు.యూఎస్ఏతో మ్యాచ్లో 44 పరుగులు చేయగా.. భారత్పై కేవలం 13 పరుగులకే బాబర్ పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ, బ్యాటింగ్ తీరుపై మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.ఈ క్రమంలో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ బాబర్ ఆజంను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి చేశాడు.ప్లీజ్ బాబర్.. కెప్టెన్సీ వదిలేసెయ్!‘‘చాలా కాలం నుంచి నేను ఇదే మాట చెప్తున్నా. ప్లీజ్ బాబర్.. కెప్టెన్సీ వదిలేసెయ్! నువ్వొక క్లాస్ ప్లేయర్వి. నీలోని క్లాస్ మాత్రమే చూపించు.అదనపు బాధ్యతలు, భారం నెత్తిన పెట్టుకోనట్లయితే ఇంకా ఎంతో బాగా ఆడగలవు. ఒకవేళ బాబర్ గనుక కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్లయితే కచ్చితంగా అతడికి మంచే జరుగుతుంది’’ అని మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ బాబర్కు సూచించాడు.బ్యాటింగ్, కెప్టెన్సీ మధ్య ఊగిసలాడవద్దని.. ఆటగాడిగా ఉండేందుకే మొగ్గుచూపాలని అతడికి విజ్ఞప్తి చేశాడు షోయబ్ మాలిక్. కాగా వన్డే వరల్డ్కప్-2023లో కనీసం సెమీ ఫైనల్ కూడా చేరకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఇటీవలే కెప్టెన్గా మరోసారి బాధ్యతలుభారత్ వేదికగా ఎదురైన ఈ పరాభవానికి బాధ్యత వహిస్తూ ఈ మెగా టోర్నీ అనంతరం బాబర్ ఆజం కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. అయితే, అనేక పరిణామాల అనంతరం తిరిగి పాక్ వన్డే, టీ20 జట్ల సారథిగా ఇటీవలే పునర్నియమితుడయ్యాడు. ఇక కొత్తగా బాబర్ నాయకత్వంలో ఇంగ్లండ్తో సిరీస్లో 2-0తో ఓటమిపాలైన పాకిస్తాన్.. ప్రపంచకప్-2024 ఈవెంట్లోనూ తన పరాజయాలు కొనసాగిస్తోంది.చదవండి: నువ్వేమీ గిల్క్రిస్ట్ కాదు.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్వి: సెహ్వాగ్ -
ప్రేమించే వ్యక్తి కావాలి కదా: సానియా మీర్జా వ్యాఖ్యలు వైరల్
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం ప్రేమించే వ్యక్తిని వెతుక్కోవాల్సిన స్థితిలో ఉన్నానని పేర్కొన్నారు. కాగా సానియా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైన విషయం తెలిసిందే.ఎంతగానో ప్రేమించి.. ఆటంకాలను ఎదురించి పెళ్లాడిన పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆమెను మోసం చేశాడనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు తలెత్తాయని విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది.అయితే, వీరిద్దరూ ఈ విషయంపై నేరుగా నోరు విప్పలేదు. కానీ.. షోయబ్ మాలిక్ ఏకంగా నటి సనా జావెద్ను పెళ్లాడి.. ఫొటోలతో షాకిచ్చాడు. దీంతో సానియా- షోయబ్ల బంధం ముక్కలైందని అందరికీ తెలిసిపోయింది.ఈ క్రమంలో సానియా మీర్జా కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. సానియా తనంతట తానుగా షోయబ్ నుంచి విడాకులు తీసుకుందని స్పష్టం చేసింది. ఏదేమైనా అతడి జీవితం బాగుండాలని సానియా ఆశిస్తున్నట్లు తెలిపింది.ఇదిలా ఉంటే.. విడాకుల తర్వాత సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్తో కలిసి దుబాయ్లో ఎక్కువగా గడుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గతంలో ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘సానియా బయోపిక్ తీసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అన్నీ కుదిరితే నేనే ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తాను. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే తనకు జంట(ప్రియుడి)గా కూడా నటిస్తాను’’ అని పేర్కొన్నాడు.ఈ క్రమంలో వ్యాఖ్యాత కపిల్ తాజాగా షారుక్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఇందుకు బదులుగా.. ‘‘ముందుగా నేను నా ప్రేమను కనుగొనాలి(ప్రేమించే వ్యక్తి) కదా’’ అని సానియా మీర్జా సమాధానమిచ్చారు.ఈ నేపథ్యంలో సానియా జీవితంతో రెండో అవకాశం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని.. అదే నిజమైతే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రతి ఒక్క స్త్రీకి తన జీవితాన్ని అందంగా మలచుకునే అవకాశం ఉందని.. మోసగాళ్ల కోసం తమ లైఫ్ను పణంగా పెట్టాల్సిన పనిలేదని కామెంట్లు చేస్తున్నారు. -
Shoaib Malik-Sana Celebrate Eid:భార్య సనా జావెద్తో షోయబ్ మాలిక్ రంజాన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
క్రికెటర్ల నుంచి మెసేజ్లు.. ఎవరీ అందాల తార? (ఫోటోలు)
-
ఇటీవలే మూడో పెళ్లి.. అప్పుడే మరో నటిపై కన్నేసిన స్టార్ క్రికెటర్!
పాకిస్తాన్ క్రికెటర్, సానియా మీర్జా మాజీ భర్త ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నారు. పాక్ నటి సనా జావెద్ను ఈ ఏడాది జనవరిలో పెళ్లాడారు. 2010లో సానియా మీర్జాను రెండో పెళ్లి చేసుకున్న షోయబ్ గతేడాది ఆమెతో విడిపోయారు. ఇటీవలే సనా జావెద్ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే అంతలోనే షోయబ్ మరో నటి వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. పాక్కే చెందిన స్టార్ నటి నవల్ సయీద్ ఇటివలే లైఫ్ గ్రీన్ హై అనే ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తనకు పాకిస్థానీ క్రికెటర్ల నుంచి మెసేజ్లు వస్తున్నట్లు తెలిపింది. పెళ్లయిన క్రికెటర్ల నుంచి కూడా మేసేజేస్ వస్తున్నాయని చెప్పడంతో పరోక్షంగా షోయబ్ మాలిక్ గురించి ఆమె ప్రస్తావించినట్లు నెటిజన్స్ భావిస్తున్నారు. మీరు షోయబ్ మాలిక్ గురించే మాట్లాడుతున్నారా అని హోస్ట్ ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ అతని పేరు మరచిపోయినట్లు చెప్పడం గమనార్హం. దీంతో ఆ పెళ్లయిన క్రికెటర్లలో షోయబ్ మాలిక్ కూడా ఉన్నట్లు అభిమానులు ఫిక్సయిపోయారు. అలా చేయడం కరెక్ట్ కాదు.. మరి ఆ క్రికెటర్లు ఎలాంటి మెసేజ్లు పంపిస్తున్నారు అని అడగ్గా..' తాను వాటి గురించి చెప్పదలచుకోలేదని స్పష్టం చేసింది. అయితే క్రికెటర్లు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. యాక్టర్స్ కంటే ఎక్కువగా క్రికెటర్లు, క్రీడాకారులనే చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారని" నవల్ సయీద్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sana Shoaib Malik (@sanajaved.official) -
షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం
పాకిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ భార్య, నటి సనా జావెద్కు చేదు అనుభవం ఎదురైంది. సొంత జట్టు అభిమానులే ఆమెను టీజ్ చేస్తూ అసహనం వెళ్లగక్కారు. కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా నుంచి విడిపోయినట్లు ప్రకటించకముందే షోయబ్ మాలిక్.. సనాను పెళ్లాడిన ఫొటోలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియాతో విడిపోకముందే షోయబ్కు సనాతో రిలేషన్ ఉందంటూ పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరు చేసిన మోసం బయటపడంతో సానియానే స్వయంగా విడాకులకు పూనుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక షోయబ్కు ఇది మూడో వివాహం కాగా.. సనా జావెద్కు రెండో పెళ్లి. అయితే, పెళ్లైన నాటి నుంచే ఈ జంటపై నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జీవిత భాగస్వాములకు ద్రోహం చేసి.. ఆ విషయం బయటపడగానే మళ్లీ నిఖా పేరిట తమ ‘బంధాన్ని’ పవిత్రం చేసుకునేందుకు పెద్ద నాటకమే ఆడారని మండిపడ్డారు. ముఖ్యంగా సానియా మీర్జా షోయబ్ కోసం ఎన్నో అవాంతరాలు దాటుకుని పాకిస్తానీని పెళ్లి చేసుకుందని.. అయినా ఆమె పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జట్టు అభిమానులు సైతం షోయబ్ మాలిక్ను ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సనా జావెద్కు నేరుగానే నిరసన సెగ తగిలింది. కరాచీ కింగ్స్కు ఆడుతున్న తన భర్త షోయబ్ మాలిక్కు మద్దతుగా ఆమె ముల్తాన్ స్టేడియానికి వచ్చింది. ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ సమయంలో డగౌట్ నుంచి సనా వెళ్తున్నపుడు కొంత మంది సానియా మీర్జా అంటూ గట్టిగా అరిచారు. దీంతో వాళ్లవైపు చూసిన సనా.. తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా 42 ఏళ్ల షోయబ్ మాలిక్ తొలుత ఆయేషా సిద్దిఖి(2002)ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి విడిపోయిన తర్వాత 2010లో సానియా మీర్జాను వివాహమాడాడు. ఈ జంటకు కుమారుడు ఇజహాన్ ఉన్నాడు. అయితే, షోయబ్తో విభేదాలు తలెత్తిన కారణంగా సానియానే ఖులా ద్వారా అతడికి విడాకులివ్వడం గమనార్హం. ఈ క్రమంలో తాను సనాను పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్.. మాలిక్ పోరాటం వృథా Pakistan fans teasing Shoaib Malik's 3rd wife 'Sana Javed' by calling her "Sania Mirza"#PSL9 pic.twitter.com/EXr0OQywvQ — Don Cricket 🏏 (@doncricket_) February 20, 2024 -
PSL 2024 తొలిసారిగా అలా షోయబ్ మాలిక్ జంట: సనాపై నెటిజన్ల ట్రోలింగ్
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో భార్య నటి సనా జావేద్ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న మాలిక్, సనా జావేద్ జంటగా కలిసి తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. ముల్తాన్ విమానాశ్రయం హోటల్కు వెళుతున్న దృశ్యాలు హల్చల్ చేశాయి. దీనిపై కొంతమంది ఫ్యాన్స్ సానుకూలంగా స్పందించినప్పటికీ, మరికొందమంది మాత్రం నెగిటివ్గా కమెంట్స్ చేశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) తొమ్మిదో ఎడిషన్లో భాగంగా ఆదివారం జరిగిన ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్ మ్యాచ్కు ఆమె హాజరైంది. ఈ సందర్బంగా కరాచీ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాలిక్ ఇన్నింగ్స్కు ఫిదా అయిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ, ఉత్సాహంగా కనిపించింది. భర్త షోయబ్ను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు వైరల్ గా మారాయి. మాజీ జీవిత భాగస్వాములను మోసం చేసిన ఈ జంటకు సిగ్గూ, శరం లేదంటూ కమెంట్ చేశారు. కొంచెం కూడా పశ్చాత్తాపం లేదంటూ విమర్శలకు దిగారు. అంతేకాదు షోయబ్ త్వరలో తన నాల్గవ భార్యను ఇంటికి తీసుకువస్తాడు, నిన్ను కూడా వదిలివేస్తాడంటూ విరుచుకుపడ్డారు. కాగా భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు విడాకులిచ్చిన షోయబ్ మాలిక్ సనా జావేద్ను పెళ్లాడి అందర్నీ షాక్కు గురి చేశాడు. అలాగే 'ఖులా' ద్వారా విడిపోయారని సానియా మీర్జా తండ్రి స్వయంగా వెల్లడించారు. సనాకు ఇది రెండో పెళ్లికాగా, మాలిక్కు మూడో పెళ్లి. కాగా పాకిస్థాన్ సూపర్ లీగ్లో ముల్తాన్ సుల్తాన్స్తో జరిగిన కరాచీ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ 52 పరుగులు చేయగా, రీజా హెండ్రిక్స్ 54 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఛేజింగ్లో కరాచీ వరుసగా వికెట్లు కోల్పోయింది.అయితే నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన మాలిక్ 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. కానీ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది.మరోవైపు షోయబ్ మాలిక్ స్వార్థపరుడంటూ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఆరోపించడం గమనార్హం.. -
ఆ అవకాశం మనం ఇవ్వకూడదు: సానియా మీర్జా
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. తన ఫొటోషూట్లకు సంబంధించిన ఫొటోలతో పాటు.. కుమారుడు ఇజహాన్తో ఉన్న ఫొటోలను ఇటీవల ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా భర్త షోయబ్ మాలిక్ నుంచి విడిపోయిన తర్వాత.. అతడి పేరును ప్రస్తావించకుండానే తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న తీరును వివరించే క్యాప్షన్లతో కొటేషన్లు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా.. సానియా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ‘‘మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు సోకాల్డ్ కఠిన పరిస్థితులకు మనం అవకాశం ఇవ్వకూడదు’’ అన్న అర్థంలో సానియా మీర్జా తన అందమైన ఫొటోలకు ఇలా మరింత అందమైన క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో ఆమె మల్టీకలర్ మ్యాచింగ్సెట్ ధరించి.. సింపుల్ మేకప్.. స్లీక్ హెయిర్తో తన సౌందర్యాన్ని మరింత ద్విగుణీకృతం చేసేలా కనిపించారు. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘మీరు చెప్పింది నిజం. ప్రతి ఒక్కరు ముందుగా తమను తాము ప్రేమించుకోవడం.. తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం అలవాటు చేసుకోవాలి. మన తర్వాతే మనకు ఎవరైనా..! అన్న సందేశాన్ని ఎంత చక్కగా చెప్పారో’’ అంటూ సానియాను ప్రశంసిస్తున్నారు. కాగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను ప్రేమించి.. 2010లో పెళ్లాడారు సానియా మీర్జా. వీరికి 2018లో కుమారుడు ఇజహాన్కు జన్నించాడు. ఇక దుబాయ్లో కాపురం పెట్టిన ఈ క్రీడాకారుల జంట మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో సానియా తన భర్తకు విడాకులిచ్చారు. షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధాల వల్లే సానియా మీర్జా ఈ నిర్ణయం తీసుకున్నారని పాకిస్తాన్ మీడియా వెల్లడించడం విశేషం. అయితే, షోయబ్ తన మూడో పెళ్లి(నటి సనా జావెద్)కి సంబంధించిన ఫొటోలు విడుదల చేసిన తర్వాతే.. వీరి విడాకుల వ్యవహారం బయటపడటం గమనార్హం. ఇదిలా ఉంటే.. షోయబ్ మాలిక్ ప్రవర్తన అతడి కుమారుడు ఇజహాన్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందంటూ పాక్ జర్నలిస్టు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సామా టీవీకి చెందిన నయీమ్ హనీఫ్ మాట్లాడుతూ.. షోయబ్ వల్ల స్కూళ్లో ఇజహాన్ అవమానాలకు గురికావాల్సి వస్తోందని పేర్కొన్నారు. అయితే, సానియా మాత్రం ఈ పరిణామాలపై ఇప్పటికీ నేరుగా స్పందించలేదు. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
ఆమె పట్ల ఎందుకింత ద్వేషం.. ఇంతకు దిగజారుతారా?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు సంబంధించిన పాత వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైవాహిక బంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ అభిమానులు సానియాకు మద్దతుగా నిలుస్తున్నారు. పనిలో పనిగా సానియా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికి దిమ్మతిరిగేలా కౌంటర్లు ఇస్తున్నారు. కాగా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను సానియా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరగగా.. అప్పటికి ఇద్దరూ కెరీర్లో మంచి స్థాయిలో ఉన్నారు. దుబాయ్లో కాపురం పెట్టిన ఈ జంటకు 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు. అన్యోన్య దంపతులుగా పేరొందిన సానియా- షోయబ్ విడిబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు రాగా.. వాటిని నిజం చేస్తూ షోయబ్ మాలిక్ తన కొత్త భార్యను పరిచయం చేశాడు. నటి సనా జావెద్ను పెళ్లాడినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన సానియా కుటుంబం.. సానియా తనకు తానుగా షోయబ్కు విడాకులు ఇచ్చిందని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సానియా మీర్జాకు షోయబ్ వివాహేతర సంబంధాల గురించి తెలిసిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడి ప్రవర్తన నచ్చక అతడి నుంచి విడిపోయిందని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక షోయబ్ పెళ్లి తర్వాత సానియా మీర్జా వరుస ఫొటోషూట్లు, ప్రొఫెషన్కు సంబంధించిన పనులతో బిజీ అయింది. అయితే, కొంతమంది ఆకతాయిలు మాత్రం.. సానియా రెండో పెళ్లి అంటూ తప్పుడు కథనాలు అల్లుతున్నారు. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ తాను పెళ్లి కొడుకు అవతారంలో ఉన్న ఫొటోను షేర్ చేయగా.. వక్రభాష్యాలు చెబుతూ ఈ టెన్నిస్స్టార్ను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సానియా అభిమానులు.. ‘‘సోషల్ మీడియాలో హైలైట్ కావడానికి ఇంతకు దిగజారుతారా? ఓ మహిళ గురించి ఇంత నీచంగా అబద్దాలు వ్యాప్తి చేస్తారా? ఆమె పట్ల ఎందుకింత ద్వేషం’’ అంటూ మండిపడుతున్నారు. వైవాహిక బంధం గురించి సానియా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. షోయబ్ లాంటి వ్యక్తిని విడిచిపెట్టి ఆమె మంచి పనిచేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. పాత వీడియోలో ఏముంది? కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తులకు మీరిచ్చే సలహా ఏమిటని గతంలో ఓ మహిళ సానియా మీర్జాను ప్రశ్నించింది. ఇందుకు బదులిస్తూ.. ‘‘పెళ్లికి ముందు మీరెలా ఉన్నారో అలాగే ఉండండి. జీవిత భాగస్వామి చెప్పారని మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. మీలో ఉన్న ఆ ప్రత్యేక లక్షణాన్ని చూసే కదా వాళ్లు మీతో ప్రేమలో పడతారు’’ అని సానియా పేర్కొంది. Advice of Sania Mirza for Shoaib Malik ❤️#ShoaibMalik | #SanaJaved #SaniaMirza | #ShoaibMalikMarriage pic.twitter.com/9NxodlKidd — Sehrish Javed (@sehrish_javed18) January 21, 2024 -
సంచలన ఆరోపణలు: షోయబ్ స్పందన.. ముందుగా అనుకున్నట్లే చేశాం
తనపై వస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ స్పందించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ఫార్చ్యూన్ బరిషల్తో తన బంధం ముగిసిపోలేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే తాను బంగ్లాదేశ్ వీడి దుబాయ్కు వెళ్లినట్లు తెలిపాడు. ఏకంగా మూడు నోబాల్స్ కాగా బీపీఎల్-2024 సీజన్లో బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఖుల్నా టైగర్స్తో మ్యాచ్ సందర్భంగా ఒకే ఓవర్లో ఈ స్పిన్ ఆల్రౌండర్ ఏకంగా మూడు నోబాల్స్ వేయడం ఇందుకు కారణం. షోయబ్ మాలిక్ ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బరిషల్ యాజమాన్యం షోయబ్ మాలిక్ కాంట్రాక్టును రద్దు చేసిందని వార్తలు వినిపించాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన షోయబ్ మాలిక్.. ‘‘ఫార్చ్యూన్ బరిషల్తో నా బంధం గురించి ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నా. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేను దుబాయ్లో ఓ మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అందుకే మా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్తో చర్చించిన తర్వాతే బంగ్లాదేశ్ను వీడాను. ఫార్చ్యూన్ బరిషల్ రానున్న మ్యాచ్లలో మరింత గొప్పగా రాణించాలని కోరుకుంటున్నా. ఒకవేళ నా సేవలు అవసరమైతే తప్పకుండా మళ్లీ వాళ్లకు మద్దతుగా బరిలోకి దిగుతాను. క్రికెట్ ఆడటం అంటే నాకు ఇష్టం. ఆటను కొనసాగిస్తూనే ఉంటా’’ అని షోయబ్ మాలిక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. అతడు మాకోసం ఎంతో చేశాడు అదే విధంగా.. ఫార్చ్యూన్ బరిషల్ యజమాని మిజానుర్ రహ్మాన్ సైతం ఈ విషయంపై స్పందించాడు. షోయబ్ మాలిక్పై వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలను అతడు కొట్టిపడేశాడు. ‘‘షోయబ్ మాలిక్ గొప్ప క్రికెటర్. అతడి గురించి వస్తున్న వదంతుల పట్ల నేను చింతిస్తున్నాను. మాకోసం తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అలాంటిది అతడి గురించి మేము ఇలాంటి చెత్త ప్రచారాలు ఎలా చేస్తామనుకున్నారు’’ అని మిజానుర్ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. చదవండి: Shoaib Malik: ‘ఆమెతో మూడేళ్లుగా రిలేషన్లో షోయబ్.. భర్తకు తెలియకుండా..’ Official statement ; I would like to address and dismiss the recent rumors circulating about my playing position with Fortune Barishal. I had a thorough discussion with our captain, Tamim Iqbal, and we mutually planned the way forward. I had to leave Bangladesh for a… pic.twitter.com/kmPqPt1nxv — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 26, 2024 -
‘మూడేళ్లుగా ఆమెతో రిలేషన్లో షోయబ్.. భర్తకు తెలియకుండా అలా’
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. విడాకులు- మూడో పెళ్లి- అద్భుత టీ20 రికార్డు- మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇలా వరుస ఘటనలతో అతడి పేరు పాక్ మీడియాలో మారుమ్రోగి పోతోంది. తాజాగా ఈ ఆల్రౌండర్ గురించి స్థానిక టీవీ చానెల్ సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకీ సంగతేంటి??... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010లో షోయబ్ మాలిక్తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షోయబ్ను ప్రేమించి పెళ్లాడిన సానియా అప్పటికే డివోర్సీ అయిన షోయబ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హైదరాబాదీ 2018లో కుమారుడు ఇజహాన్కు జన్మనిచ్చింది. ఈ జంట దుబాయ్లో నివాసం ఉండేది. ఇక గతేడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కుటుంబానికే సమయం కేటాయించిందట సానియా. ఈ క్రమంలో తన భర్త గురించి కొన్ని చేదు నిజాలు ఆమెకు తెలిశాయని.. అందుకే దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపించాయి. వాటినే నిజం చేస్తూ ఇటీవలే తాను మూడో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు షోయబ్ మాలిక్. తానే విడాకులు ఇచ్చింది పాక్ నటి, మోడల్ సనా జావేద్ను వివాహమాడిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయంపై స్పందించిన సానియా కుటుంబం.. తమ కూతురు ఏకపక్షంగా భర్తకు విడాకులిచ్చిందని ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత సానియా కూడా ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో.. ‘‘తనపై వస్తున్న విమర్శలను లెక్కచేయక షోయబ్ను ప్రేమించి పెళ్లాడిన సానియాకు అతడు ద్రోహం చేసినా.. ఆమె ఎవరిపైనా నిందలు వేయకుండా హుందాగా ప్రవర్తిస్తున్నారు’’ అంటూ పాక్ మీడియా సానియా మీర్జాకు మద్దతుగా నిలవడం విశేషం. భర్తకు తెలియకుండా మూడేళ్లుగా ఈ క్రమంలో సామా టీవీ షోయబ్ మాలిక్- సనా జావేద్ బంధంపై సంచలన ఆరోపణలు చేస్తూ పాడ్కాస్ట్ రిలీజ్ చేసింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘‘గత మూడేళ్లుగా వాళ్లిద్దరు సంబంధం కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల బంధంలో ఎలా ఉంటారో అలాగే ఉంటున్నారు. కానీ ఈ విషయాలు ఉమైర్(సనా మొదటిభర్త)కు తెలియదు. అయితే, సానియా.. ఆమె కుటుంబానికి గతేడాదే షోయబ్- సనాల గురించి తెలిసింది. మాలిక్ ఫ్యామిలీకి కూడా విషయం తెలిసింది. అంతా కలిసి పరిస్థితిని చక్కదిద్ది షోయబ్- సానియాల బంధాన్ని నిలబెట్టాలని ప్రయత్నించారు. కానీ.. షోయబ్ ఎవరి మాటా వినేందుకు ఇష్టపడలేదు’’ అంటూ సామా టీవీ పేర్కొంది. అదే విధంగా.. తనను ఏ టీవీ షోకు ఆహ్వానించినా.. సనాను కూడా పిలవాలని షోయబ్ మాలిక్ కండిషన్లు పెట్టేవాడని ఆరోపించింది. కాగా సనా జావెద్కు గతంలో సింగర్ ఉమైర్తో పెళ్లైంది. అతడితో విడాకులు తీసుకున్న మూడు నెలల్లోపే ఆమె షోయబ్ను రెండో వివాహం చేసుకోవడం గమనార్హం. వరుస సంఘటనలు ఇక వ్యక్తిగతంగా షోయబ్ పరిస్థితి ఇలా ఉంటే.. కెరీర్ పరంగా ఇటీవలే అతడు అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆసియా తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్-2024 లీగ్లో ఫార్చ్యూన్ బరిషల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఈ ఘనత సాధించాడు. అయితే, ఆ మైల్స్టోన్ను ఎంజాయ్ చేసేలోపే షోయబ్ మాలిక్పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే, వీటిని షోయబ్ మాలిక్ ఖండించాడు. చదవండి: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? సానియా హృదయం ముక్కలు -
షోయబ్ మాలిక్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. జట్టు నుంచి ఔట్!?
పాకిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్కు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ ప్రీమీయర్ లీగ్ ఫ్రాంచైజీ ఫార్చూన్ బరిషల్ "ఫిక్సింగ్" అనుమానంతో షోయబ్ మాలిక్ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. కాగా ఇప్పటికే మాలిక్ వ్యక్తిగత కారణాలతో బీపీఎల్-2024 నుంచి స్వదేశానికి వచ్చేశాడు. అంతలోనే మాలిక్కు ఫార్చూన్ బరిషల్ ఈ షాకిచ్చింది. ఈ లీగ్లో కేవలం 3 మ్యాచ్ల మాత్రమే ఆడాడు. అసలేం జరిగిందంటే? జనవరి 22న షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ఫార్చ్యూన్ బరిషల్,ఖుల్నా రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసిన మాలిక్ ఓకే ఓవర్లో ఏకంగా మూడు నో బాల్స్ వేశాడు. ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. సాధరణంగా స్నిన్నర్లు నో బాల్స్ చాలా అరుదుగా వేస్తుంటారు. అటువంటిది మాలిక్ ఏకంగా మూడు నో బాల్స్ వేయడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ మాలిక్పై వేటు వేసింది. కాగా ఇటీవలే మాలిక్ మూడో పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులిచ్చి పాక్ నటి సనా జావేద్ ను మాలిక్ వివాహమాడాడు. చదవండి: IND vs ENG: ఆట మర్చిపోయావా గిల్.. జట్టు నుంచి తీసిపడేయండి! అతడిని తీసుకోండి? -
షోయబ్ మాలిక్తో ఎఫైర్? ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన పాక్ నటి
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి.. రీసెంట్ టైంలో సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే గతకొన్నాళ్ల నుంచి షోయబ్-సానియా విడాకులపై వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన పెళ్లితో అది నిజమేనని తేలిపోయింది. షోయబ్.. పాక్ నటి సనా జావేద్ని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ల ముందు మరో పాక్ నటి.. ఈ ఆటగాడితో ఎఫైర్ నడిపిందని రూమర్స్ వచ్చాయి. ఆ బ్యూటీ సదరు పుకార్లపై ఇన్నాళ్లు ఓ క్లారిటీ ఇచ్చింది. అప్పట్లో తను ఎంతగా బాధపడ్డాననేది బయటపెట్టింది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. చాలా ఏళ్ల నుంచి జట్టులో ఉన్నాడు. 2002లో ఆయేషా సిద్ధిఖీని, 2010లో సానియా మీర్జాని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే 2024లో పాక్ నటి సనా జావేద్తో ఒక్కటయ్యాడు. అయితే కొన్నాళ్లముందు ఆయేషా ఒమర్ అనే నటితో షోయబ్.. ఓ మ్యాగజైన కవర్ పేజీ కోసం ఫొటో షూట్ చేశాడు. ఇందులో వీళ్లిద్దరూ వేరే లెవల్ కెమిస్ట్రీ పండించారు. సరిగ్గా అదే టైంలో సానియా విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ బయటకొచ్చింది. దీంతో ఆయేషా బలైపోయింది. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) షోయబ్.. సానియాకు విడాకులు ఇచ్చేశాడని, దానికి ఆయేషా ఒమర్ కారణమని తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర ఊరికే మాట్లాడుకున్నారు. పాక్ మీడియాలో అయితే ఇష్టమొచ్చినట్లు రాసిపడేశారు. అయితే ఆ సమయంలో తను చాలా ఆందోళనకు గురయ్యానని ఆయేషా చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎఫైర్ రూమర్స్ వల్ల తాను ఎంతలా మానసిక వేదన అనుభవించాననేది బయటపెట్టింది. 'ఆ దశ మొత్తం నాకు ఓ పీడకల లాంటిది. షోయబ్తో నాకు ఎఫైర్ సృష్టించడంతో పాటు పెళ్లి కూడా చేసేశారు. ఇంకా చెప్పాలంటే నాకు అతడితో సీక్రెట్గా పెళ్లయిపోయిందని నా బంధువులే చాలామంది నమ్మేంతలా పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే నాకు ఈ పుకార్లు చదివినప్పుడు.. అలానే నా గురించి జనాలు మాట్లాడుకునేప్పుడు చాలా అంటే చాలా భయమేసేది. తెగ ఆందోళనపడేదాన్ని' అని ఆయేషా ఒమర్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Sana Shoaib Malik (@sanajaved.official) -
'షోయబ్తో విడాకులు తీసుకుని కొన్ని నెలలైంది.. కానీ ఇప్పుడు తప్పట్లేదు'
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు సానియా మీర్జాతో విడాకులపై వదంతులు ప్రచారం అవుతుండగానే.. నటి సనా జావెద్ను పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చాడు. ఎప్పటినుంచో వినిపిస్తున్న రూమర్స్ను షోయబ్ నిజం చేశాడు. సనా జావెద్ను వివాహమాడిన ఫోటోలను మాలికే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇదే విషయం ఇరు దేశాల క్రీడా వర్గాల్లో చర్చానీయంశమైంది. ఇక ఈ విషయంపై సానియా కుటుంబం తాజాగా స్పందించింది. కొన్ని నెలల క్రితమే సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. "సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె స్పందించక తప్పట్లేదు. షోయబ్, ఆమె విడాకులు తీసుకొని కొన్ని నెలలు అవుతోంది. షోయబ్కు తన న్యూ జర్నీ కోసం ఆమె శుభాకాంక్షలు తెలిపింది. ఇక అనవసర చర్చలు ఆపేయండి. ఆమె తన జీవితంలో చాలా కఠినమైన దశను ఎదుర్కొంటుంది. ఇటువంటి సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులందరూ ఆమెకు అండగా నిలవాలి. తన గోప్యతకు ఎటువంటి భంగం కలిగించకుండా గౌరవించాలని" ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 2010లో తన మొదటి భార్య ఆయేషాతో విడాకులు తీసుకున్న షోయబ్ మాలిక్.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ 2018లో ఇజహాన్ పుట్టాడు. చదవండి: #ShoaibMalikSaniamirza: ఎల్లలు లేని ప్రేమ: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? View this post on Instagram A post shared by Imran Mirza (@imranmirza58) -
చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 13,000 పరుగులు మైల రాయిని అందుకున్న తొలి ఏషియన్ క్రికెటర్గా రికార్డులకెక్కాడు. ఓవరాల్గా టీ20 క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో మాలిక్ రెండో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(14562) ఉన్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2024లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్తో జరిగిన మ్యాచ్లో షోయబ్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఈ లీగ్లో రంగాపూర్ రైడర్స్కు మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడోసారి ఓ ఇంటివాడయ్యాడు. పాకిస్తాన్ నటి సనా జావేద్ను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. దీంతో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- మాలిక్ మాలిక్ల 14 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడింది. ఈ విషయాన్ని సానియా- మాలిక్ ఇద్దరూ దృవీకరించారు. కాగా వీరిద్దరికి 2010లో వివాహం జరిగింది. చదవండి: U19 World Cup 2024: వరల్డ్కప్లో బోణీ కొట్టిన టీమిండియా.. 84 పరుగులతో బంగ్లా చిత్తు -
విడిపోయిన సానియా–షోయబ్
కరాచీ/న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ల 14 ఏళ్ల వివాహ బంధానికి విడాకుల కార్డు పడింది. ఇది జరిగి చాన్నాళ్లే అయినా... సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతున్నా... ఇరు వర్గాల నుంచి అధికారికంగా ‘అవును... కాదు’ అనే మాట రాలేదు! ఎలాంటి స్పష్టత లేదు. కానీ షోయబ్ ముచ్చటగా మూడోసారి ఓ ఇంటివాడు కావడంతోనే ఇద్దరి వైవాహిక బంధం ముక్కలైనట్లు అధికారికంగా... ఆలస్యంగా తెలిసింది. పాకిస్తాన్ నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్న షోయబ్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో ఫొటోల్ని పంచుకున్నాడు. 41 ఏళ్ల ఈ పాక్ క్రికెటర్కు ఇది మూడో పెళ్లి. హైదరాబాదీ అమ్మాయి అయేషా సిద్ధిఖికు తలాక్ ఇచ్చాకే సానియా మీర్జాను 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్ వేదికగా షోయబ్ మాలిక్ రెండో వివాహం చేసుకున్నాడు. నటి సనా జావేద్కేమో ఇది రెండో పెళ్లి. ఆమె 2020లో పాకిస్తాన్ సినీ గాయకుడు, రచయిత ఉమైర్ జైస్వాల్ను వివాహమాడింది. అయితే వీరిద్దరి బంధం 2023లో ముగిసింది. తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’లో షోయబ్ మాలిక్–సనా జావేద్ల పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతోనే బయటి ప్రపంచానికి సానియా–షోయబ్ల పెళ్లి పెటాకులైనట్లు తెలిసింది. అంతవరకు గుసగుసలే వినిపించేవి! ఇక ఈ విషయాన్ని టెన్నిస్ స్టార్ కుటుంబ వర్గాలు ధ్రువీకరించక తప్పలేదు. ‘అవును... వాళ్లిద్దరు విడిపోయారు. ఇది ‘తలాక్’ కాదు... ‘ఖులా’ ప్రకారం వారి బంధం రద్దయింది. ఇంతకుమించి చెప్పడానికి మా దగ్గరేమీ లేదు’ అని కుటుంబ వర్గాలు తెలిపాయి. గత ఏడాది అక్టోబర్లో తనయుడు ఇజ్హన్ ఐదో పుట్టిన రోజు వేడుకలకు షోయబ్ హాజరయ్యాడు. అయితే ఈ వేడుకల ఫొటోలను షోయబ్, సానియా వేర్వేరుగా తమ సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకున్నారు. అప్పుడు నిశ్చి తార్థం... ఇప్పుడు వివాహం! 37 ఏళ్ల సానియాకు తన ప్రొఫెషనల్ కెరీర్లో ఒడిదొడుకులు ఎదురైనట్లే వ్యక్తిగత జీవితంలోనూ ఎదురయ్యాయి. ముందుగా కుటుంబ మిత్రులైన సొహ్రాబ్తో సానియాకు నిశ్చి తార్థం కూడా ఘనంగానే జరిగింది. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే పెళ్లిదాకా రాకుండానే ఆ బంధం ముగిసింది. అనంతరం పాకిస్తానీ మాజీ కెపె్టన్ షోయబ్ మాలిక్ను వివాహమాడింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఇజ్హాన్ ఉన్నాడు. ప్రస్తుతం తల్లి సానియా దగ్గరే ఇజ్హాన్ పెరుగుతున్నాడు. తన 20 ఏళ్ల అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్లో సానియా మొత్తం 43 డబుల్స్ టైటిళ్లు సాధించింది. ఇందులో మూడు మహిళల డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిల్స్, మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇది తలాక్ కాదు... ఖులా! సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2010 ఏప్రిల్ 12న టెన్నిస్ స్టార్ సానియా, పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ వివాహం అంగరంగ వైభవంగా హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో జరిగింది. ఈ బంధం 12 ఏళ్ల పాటు 2022 వరకు సజావుగానే సాగింది. ఇరువురు తమ కెరీర్ను కొనసాగిస్తూనే దుబాయ్లో కాపురం పెట్టారు. అన్యోన్యంగా సాగిన వీరి కాపురం రెండేళ్ల క్రితం బీటలు వారింది. కెరీర్కు రిటైర్మెంట్ పలికి వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తున్న సమయంలో పొరపొచ్చలు రావడంతో సానియా మీర్జా నుంచే విడాకుల ప్రతిపాదన వచ్చింది. ఇస్లాం చట్ట ప్రకారం దీన్ని ‘ఖులా’ అంటారు. వివాహ బంధం నుంచి భార్య ఏకపక్షంగా విడిపోవాలనుకుంటే ‘ఖులా’తో రద్దు చేసుకోవచ్చు. దీనికి భర్త నుంచి భరణం, ఇతరత్రా లాంఛనాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. తలాక్ అనేది భర్త రద్దు చేసుకునే విడాకుల ప్రక్రియ. కొంతకాలంగా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండటంతో 2022లోనే వివాహరద్దు తంతు వివాదాస్పదం కాకుండా జరిగిపోయిందని సమాచారం. -
Shoaib Malik-Sana Javed Wedding: షోయబ్ మాలిక్తో పెళ్లి.. పాకిస్తాన్ బ్యూటీకి సైతం ఇది రెండో పెళ్లే (ఫొటోలు)
-
క్రికెటర్తో పెళ్లి.. వెంటనే పేరు మార్చేసుకున్న నటి
ప్రేమ, పెళ్లి, విడాకులు.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదాలు. అయితే సెలబ్రిటీల సినిమాలు, ఈవెంట్లు.. లేదంటే వారి ప్రేమ ముచ్చట్లు, పెళ్లి విశేషాలు, విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తూ, కనిపిస్తూ ఉంటాయి. అలా ఈరోజు పాకిస్తాన్ నటి పెళ్లి చర్చనీయాంశంగా మారింది. క్రికెటర్ షోయబ్ మాలిక్ను రెండో పెళ్లి చేసుకుంది పాక్ నటి సనా జావెద్. గతకొంతకాలంగా షోయబ్తో సన్నిహితంగా మెదులుతున్నా ఇలా సడన్గా నిఖా చేసుకుని షాకిస్తారని ఎవరూ ఊహించలేదు. సానియాకు విడాకులు..! ఎందుకంటే షోయబ్ తన భార్య సానియా మీర్జాకు విడాకులిచ్చినట్లు ఎక్కడా వెల్లడించలేదు. ఏదో చిన్న సమస్యలు అనుకున్నారే తప్ప నిజంగానే విడిపోయి ఇంత త్వరగా మరో అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభిస్తాడని ఎవరూ అనుకోలేదు. చివరకు శనివారం (జనవరి 20)నాడు షోయబ్- సనా జావెద్ షాదీ చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. తాజాగా తన పేరును కూడా మార్చేసుకుంది సనా. ఇన్స్టాగ్రామ్లో ఈ నటి తన పేరును సనా షోయబ్ మాలిక్గా మార్చుకుంది. ఎవరీ సనా జావెద్? కాగా సనా జావెద్.. సుఖూన్, షేర్ ఇ జాత్, ఇంతేజార్ వంటి సీరియల్స్లో నటించి గుర్తింపు పొందింది. ఈమె గతంలో పాకిస్తానీ గాయకుడు ఉమైర్ జస్వాల్ను పెళ్లాడింది. 2020లో నిఖా చేసుకున్న వీరు మొదట్లో బాగానే ఉన్నారు. కానీ తర్వాత ఇద్దరి మధ్య పొరపచ్చాలు మొదలయ్యాయి. గతేడాది ఇద్దరూ తమ పెళ్లి ఫోటోలను తొలగించడంతో విడాకులు తీసుకున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడదే నిజమని నిరూపిస్తూ క్రికెటర్ను పెళ్లాడింది. View this post on Instagram A post shared by Shoaib Malik (@realshoaibmalik) -
Shoaib Malik-Sana Javed: మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. సానియాతో బంధానికి స్వస్తి (ఫొటోలు)
-
షోయబ్ మాలిక్తో విడాకులు: స్పందించిన సానియా తండ్రి
Sania Mirza Takes 'Khula' From Shoaib Malik What It Means: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ల విడాకులు ఇరు దేశాల క్రీడావర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. అన్యోన్యంగా కనిపించే ఈ జంట మధ్య చిచ్చు రేపిందెవరంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాను పాకిస్తానీ నటి సనా జావెద్ను పెళ్లాడినట్లు తెలుపుతూ షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో ప్రకటించడమే ఇందుకు కారణం. సానియా- షోయబ్ విడిపోనున్నానరంటూ గత కొన్నాళ్లుగా వదంతులు వ్యాపించాయి. అవే నిజాలు ఈ క్రమంలో తాజాగా షోయబ్.. సనాతో తన పెళ్లిని ధ్రువీకరిస్తూ అవి రూమర్లుకావు నిజాలని తేల్చాడు. ఈ నేపథ్యంలో సానియాకు విడాకులు ఇచ్చిన తర్వాత.. ఈ వివాహం చేసుకున్నాడా? లేదంటే.. సానియానే షోయబ్తో బంధం తెంచుకుందా? అనే చర్చ మొదలైంది. - Alhamdullilah ♥️ "And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024 నా కూతురే స్వయంగా ఈ నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఈ కూతురి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ మేరకు ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. ఖులా పద్ధతి ప్రకారం సానియా షోయబ్కు విడాకులు ఇచ్చిందని స్పష్టం చేశారు. కాగా 2010లో సానియా- షోయబ్ల వివాహం జరుగగా.. 2018లో ఈ జంటకు కుమారుడు ఇజహాన్ జన్మించాడు. ఖులా అంటే.. ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం.. వివాహిత తన భర్త నుంచి విడిపోవాలనుకుంటే ఖులా పద్ధతి పాటించవచ్చు. ఇందులో ఏకపక్షంగానే స్త్రీ తనంతట తాను నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. వివాహ సమయంలో భర్త తనకు ఇచ్చిన కానుకను తిరిగి పంపడం ద్వారా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేయవచ్చు. -
రెండో పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్
-
స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు?..
ప్రేమకు ఎల్లలు ఉండవు.. మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని ఇష్టపడితే తనతో కలిసి బతికేందుకు సరిహద్దులు కూడా దాటడంలో తప్పు లేదంటుంది మనసు! భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా- పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్లకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయంటారు వాళ్ల సన్నిహితులు. పాకిస్తానీ అయిన షోయబ్ను పెళ్లాడేందుకు హైదరాబాదీ సానియా ఎన్ని అవాంతరాలు ఎదుర్కొందో అందరికీ తెలిసిన విషయమే! ఏది ఏమైనా.. కాబోయే భర్త గురించి వినకూడని మాటలు వినిపించినా లెక్క చేయక అతడిని ధైర్యంగా పెళ్లాడింది సానియా. అయితే.. టెన్నిస్లో సానియా విఫలమైనా.. క్రికెట్ మ్యాచ్లో షోయబ్ ఫెయిలైనా.. రెండు వైపుల నుంచి విమర్శల బాణాలు దూసుకొచ్చేది సానియా మీదకే! టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరిగినా ట్రోలింగ్ బాధితురాలు తనే! అయినా.. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరనీయక సానియా కెరీర్ పరంగా.. వ్యక్తిగతంగా ముందుకు సాగింది. పెళ్లైన ఎనిమిదేళ్లకు మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తూ షోయబ్తో కలిసి తమ కలల పంట ఇజహాన్కు జన్మనిచ్చింది. తల్లైన తర్వాత మళ్లీ ఫిట్నెస్ సాధించి కొడుకుతో పాటు టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టింది. కెరీర్లో ఉన్నత శిఖరాలకు నిజానికి.. ఐదేళ్ల వయసులోనే రాకెట్ సానియా.. ఇరవై ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో గొప్ప ఘనతలు సాధించింది. డబుల్స్లో నంబర్ వన్ స్థాయికి ఎదిగిన ఆమె కెరీర్లో మూడు డబుల్స్ గ్రాండ్స్లామ్, మూడు మిక్స్డ్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచింది. మొత్తంగా తన కెరీర్లో 43 డబుల్స్ ట్రోఫీలు గులిచింది. 91 వారాలు నంబర్ వన్గా కొనసాగిన ఘనత తన ఖాతాలో వేసుకుంది. కెరీర్లో ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలోనే భర్తతో సానియాకు విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చాయి. షోయబ్ మాలిక్ ప్రవర్తన నచ్చక ఆమె అతడికి దూరంగా ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ నటితోనూ సాన్నిహిత్యం నటి అయేషా ఒమర్తో షోయబ్ సన్నిహితంగా మెలగడం వల్లే దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. అందుకు తగ్గట్లుగానే సానియా గురించి ఎదురైన ప్రశ్నలకు షోయబ్ సమాధానాలు దాటవేయటం.. సానియా సైతం హృదయం ముక్కలైదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ వదంతులకు బలం చేకూరింది. వీటిని నిజం చేసే విధంగా.. ‘‘వివాహ బంధం.. విడాకులు రెండూ క్లిష్టమైనవే’’ అంటూ సానియా మీర్జా ఇటీవల మరో పోస్టు షేర్ చేయడంతో అనధికారికంగా విడాకుల విషయాన్ని ధ్రువీకరించినట్లయింది. తాజాగా.. నటి సనా జావెద్ను పెళ్లాడినట్లుగా షోయబ్ మాలిక్ ఫొటోలు షేర్ చేసి అధికారికంగా సానియాతో బంధం తెంచుకున్నట్లు పరోక్షంగా ప్రకటన చేశాడు. అప్పుడు అలా.. నిజానికి సానియా కంటే ముందే షోయబ్ మాలిక్ హైదరాబాద్కు చెందిన అయేషా సిద్ధిఖీని వివాహం చేసుకున్నాడన్న వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే సానియాతో పెళ్లికి సిద్ధపడగా.. మధ్యవర్తుల జోక్యంతో వివాదం సద్దుమణిగినట్లు కథనాలు వెలువడ్డాయి. అయేషాతో విడాకుల నేపథ్యంలో షోయబ్ ఆమెకు రూ. 15 కోట్ల భరణం కూడా ఇచ్చినట్లు సమాచారం. అంగరంగ వైభవంగా పెళ్లి ఈ క్రమంలో ఏప్రిల్ 12, 2010లో షోయబ్ మాలిక్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్లోని తాజ్ క్రిష్ణ హోటళ్లో సంప్రదాయ పద్ధతిలో వీరి నిఖా జరిగింది. భారత్- పాకిస్తాన్ దేశాలకు చెందిన ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారుల పెళ్లి ఇరు దేశాల్లోనూ పెద్ద వార్తగా మారిపోయింది. ఇక పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత సానియా- షోయబ్లకు కుమారుడు ఇజహాన్ జన్మించాడు. అయితే, గత కొన్నేళ్లుగా నటి సనా జావెద్తో షోయబ్ సన్నిహితంగా మెలుగుతున్నాడన్న కారణంగా సానియా అతడికి దూరంగా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ పెళ్లి ఫొటోలతో షోయబ్ మాలిక్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక షోయబ్కు ఇది మూడో పెళ్లి కాగా.. సనా జావెద్కు రెండో పెళ్లి!! స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? ఈ నేపథ్యంలో సానియా- షోయబ్ జోడీ అభిమానులు.. ‘‘ప్రేమకు ఎల్లలు ఉండవని సానియా నిరూపించింది. అందరిని ఎదిరించి షోయబ్ను పెళ్లాడింది. కానీ చివరకు ఏం మిగిలింది. సానియా- షోయబ్ల స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? షోయబ్ మాలిక్ పోస్ట్ మా హృదయాలను ముక్కలు చేసింది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ జంటను ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: IND A Vs Eng Lions: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన -
సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్!
Shoaib Malik marries Pakistani actress Sana Javed:పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తానీ నటి సనా జావెద్ను పెళ్లాడాడు. ఈ విషయాన్ని షోయబ్ మాలిక్ స్వయంగా వెల్లడించాడు. సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ.. ‘‘జంటగా మేము ఇలా’’ అంటూ హార్ట్ ఎమోజీలు జతచేశాడు షోయబ్ మాలిక్. షోయబ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా కాగా భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరుగగా.. 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు. అయితే, సానియా కంటే ముందు షోయబ్ మాలిక్ అయేషా సిద్దిఖీ అనే మహిళను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఆమె నుంచి విడిపోయిన తర్వాత సానియాను పెళ్లాడినట్లు తెలుస్తోంది. హృదయం ముక్కలైందన్న సానియా ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా సానియా- షోయబ్ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. నటి ఆయేషాతో ఓ ఫొటోషూట్లో షోయబ్ మాలిక్ అత్యంత సన్నిహితంగా కనిపించడం.. అదే సమయంలో హృదయం ముక్కలైందంటూ సానియా పోస్టులు పెట్టడం వీటికి ఊతమిచ్చింది. అదే విధంగా కుమారుడి పుట్టినరోజు వేడుకలోనూ సానియా- షోయబ్ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించడంతో విడాకుల వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో సానియా మీర్జా బుధవారం నర్మగర్భ సందేశం పోస్ట్ చేయడంతో వీరు విడిపోయారని నిర్ధారణకు వచ్చారు నెటిజన్లు. వివాహ బంధం.. విడాకులు.. రెండూ క్లిష్టమైనవే: సానియా ‘‘వివాహ బంధం అత్యంత క్లిష్టమైనది. విడాకులు కూడా అంతే కష్టమైనవి. ఇందులో ఏది అత్యంత ఇబ్బందికరమైందో మీరే ఎన్నుకోండి. ఒబేసిటీ హార్డ్.. ఫిట్గా ఉండటం కూడా కష్టమే. మరి ఇందులో ఏది ఎంచుకుంటారు? అప్పుల్లో కూరుకుపోవడం కష్టంగా తోస్తుంది.. అదే సమయంలో ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కూడా అలాగే అనిపిస్తుంది. ఇందులో మీకు ఏం కావాలో ఎంచుకోండి. కమ్యూనికేట్ చేయడం.. కమ్యూనికేట్ చేయకుండా ఉండటం కూడా కష్టమే. ఇందులో ఏది అత్యంత కష్టమో మీరే ఎంచుకోండి. జీవితం నల్లేరు మీద నడకలాంటిది కాదు. తెలివిగా ఎంచుకోవాలి ఎప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుంది. అయితే, అందులో మనకేదీ కావాలో మనం తెలివిగా ఎంచుకోవాలి’’ అని సానియా మీర్జా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. ఇంతలో షోయబ్ మాలిక్ ఇలా శనివారం నటి సనా జావెద్తో పెళ్లి ఫొటోలను షేర్ చేయడం గమనార్హం. సానియా- షోయబ్ జంట అభిమానులు ఈ చేదు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఏదైనా యాడ్ షూట్కు సంబంధించిన ఫొటో అయితే బాగుండని కామెంట్లు చేస్తున్నారు. Confirmation: Our beloved superstar @realshoaibmalik has tied the knot (Nikkah) with #SanaJaved. Wishing the new couple an amazing life ahead filled with happiness and joy! #ShoaibMalik ❤️ pic.twitter.com/l73fQwLmit — Arsalan H. Shah (@arsalanhshah) January 20, 2024 చదవండి: Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్ సింగ్ - Alhamdullilah ♥️ "And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024 -
చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే!
Ind vs Afg 3rd T20- Virat Kohli On Cusp Of Becoming...: సమకాలీన క్రికెటర్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇప్పటికే ఎన్నెన్నో ఘనతలు సాధించాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. అఫ్గనిస్తాన్తో మూడో టీ20 సందర్భంగా ఈ రన్మెషీన్ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. రీఎంట్రీలో దూకుడుగా కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత దాదాపు పద్నాలుగు నెలల విరామం అనంతరం కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా తొలి టీ20తోనే బరిలోకి దిగాల్సి ఉండగా.. కూతురు వామిక పుట్టినరోజు(జనవరి 11) నేపథ్యంలో ఆ మ్యాచ్కు దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇండోర్లో ఆదివారం నాటి రెండో టీ20 సందర్భంగా రంగంలోకి దిగిన విరాట్ కోహ్లి.. 16 బంతుల్లో 29 పరుగులతో ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా దూకుడుగా ఆడుతూ అఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడుతూ అభిమానులకు వినోదాన్ని పంచాడు. ఐపీఎల్ హోం గ్రౌంగ్లో సిక్స్తో ఆరంభిస్తే ఇక ఇప్పటికే ఈ సిరీస్ను టీమిండియా 2-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో బుధవారం నాటి నామమాత్రపు మూడో టీ20కి ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. విరాట్ కోహ్లికి ఐపీఎల్లో హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి ఆరు పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్గా ఈ జాబితాలో క్రిస్ గేల్(14562), షోయబ్ మాలిక్(12993), కీరన్ పొలార్డ్(12430) తర్వాతి స్థానాల్లో నిలుస్తాడు. Indore ✈️ Bengaluru#TeamIndia in town for the 3⃣rd & final T20I 👏 👏#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/xKKRi6yf9W — BCCI (@BCCI) January 15, 2024 పొట్టి ఫార్మాట్లో అన్నీ కలిపి దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ(టీ20) ట్రోఫీలో భాగమైన కోహ్లి.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా టీమిండియాకు ఆడుతూ.. అన్నీ కలిపి పొట్టి ఫార్మాట్లో పదకొండు వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో 4037 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి నంబర్ వన్(అత్యధిక రన్స్) బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అదే విధంగా.. ఐపీఎల్లోనూ 7263 రన్స్తో హయ్యస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. -
ఆస్ట్రేలియాతో ఫైనల్.. వక్ర బుద్ధి చూపించిన పాక్ క్రికెటర్
వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనేందుకు సన్నద్దమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ మరోసారి భారత జట్టుపై తన అక్కసు వెళ్లగక్కాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్ను ఓడించి ఆస్ట్రేలియా ఛాంపియన్స్గా నిలుస్తుందని మాలిక్ జోస్యం చెప్పాడు. ఫైనల్స్లో ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉందని, మరోసారి అదే రిపీట్ అవుతుందని మాలిక్ తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఏ స్పోర్ట్స్ టీవీ షోలో మాలిక్ మాట్లాడుతూ.. "ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకోవడానికి ఆస్ట్రేలియాకు అన్ని రకాల అర్హతలున్నాయి. వసీం(వసీం అక్రమ్) భాయ్ కూడా అదే చెప్పారు . ఆస్ట్రేలియా మరోసారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలుస్తుందని నాకు నమ్మకం ఉందని" అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పగటికలకు కనకు.. అక్కడ ఉంది పాకిస్తాన్ కాదు.. టీమిండియా అంటూ నెటిజన్లు మాలిక్కు కౌంటిరిస్తున్నారు. కాగా ఈ వరల్డ్కప్లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. చదవండి: WC 2023 IND Vs AUS Final: 20 ఏళ్ల తర్వాత ఆసీస్తో ఫైనల్ పోరు.. టీమిండియా బదులు తీర్చుకుంటుందా? -
అప్పుడు ద్రవిడ్ నా కోసం రెండు గంటలు ఎదురుచూశాడు.. ఇప్పుడు: షోయబ్ మాలిక్
Shoaib Malik Comments On Rahul Dravid: పాకిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్పై ప్రశంసలు కురిపించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనదని కొనియాడాడు. తన పట్ల ద్రవిడ్ వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమంటూ గత జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్నాడు. పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 1999లో అడుగుపెట్టిన షోయబ్ మాలిక్ ఇప్పటి వరకు.. 34 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1898.. 7534.. 2435 పరుగులు సాధించడంతో పాటు.. 32.. 158.. 28 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో తన సుదర్ఘీ కెరీర్లో వ్యక్తిగత రికార్డులెన్నో సాధించిన మాలిక్.. ఎత్తుపళ్లాలు కూడా చవిచూశాడు. పాక్ కెప్టెన్గానూ పనిచేసిన అనుభవం ఈ స్పిన్ ఆల్రౌండర్ సొంతం. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన 41 ఏళ్ల షోయబ్ మాలిక్.. పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగమవుతూ తన కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఆరోజు అంతా ఒకే ఫ్లైట్లో ఉన్నాం తాజాగా పాకిస్తాన్ స్పోర్ట్స్-ఏ చానెల్తో మాట్లాడిన షోయబ్ మాలిక్.. వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా జైత్రయాత్ర వెనుక హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర కీలకమని పేర్కొన్నాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడైనప్పటికీ ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో ఉంటాడని.. అదే ఆయనను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టిందంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు పాత సంఘటన గుర్తుచేసుకుంటూ.. ‘‘మేము పాకిస్తాన్ నుంచి న్యూజిలాండ్కు వెళ్తున్నాం. ఆరోజు ఇండియా అండర్-19 క్రికెట్ జట్టు కూడా మాతో పాటే అదే విమానంలో ప్రయాణం చేస్తోంది. అప్పుడు రాహుల్ ద్రవిడ్ అండర్-19 టీమ్కు కోచ్గా ఉన్నాడు. నా కోసం ఆయన రెండు గంటలు ఎదురుచూశాడు విమానంలో నాకు బాగా నిద్రపట్టేసింది. నాతో మాట్లాడేందుకు ద్రవిడ్ దాదాపు రెండు గంటల పాటు ఎదురుచూశాడు. నేను నిద్రలేచిన తర్వాత .. ‘ఎన్నోసార్లు ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత కూడా నువ్వు తిరిగి ఎలా పునరాగమనం చేయగలిగావు. నిన్ను ముందుకు నడిపే స్ఫూర్తి మంత్రం ఏమిటి?’ అని ద్రవిడ్ నన్ను అడగాలనుకున్నానని చెప్పాడు. తాను అప్పుడు అండర్-19 టీమ్ కోచ్గా ఉన్నాను కాబట్టి ఇలాంటివి యువ ప్లేయర్లకు చెప్పడం ఎంతో ముఖ్యమని నాతో అన్నాడు. ద్రవిడ్కు ఈగో అస్సలు ఉండదు నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏమిటంటే.. ద్రవిడ్కు అస్సలు ఈగో ఉండదు. ఎవరి నుంచి ఏదైనా నేర్చుకోవాలని భావిస్తే తప్పక అడిగి తెలుసుకుంటాడు. తన కెరీర్లో ఆయన ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడు. ఆటగాడిగా ఎంతో అనుభవం ఉంది. అయినా, ఎప్పుటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతాడు. అందుకే ఈరోజు టీమిండియా ఈ స్థాయిలో ఉంది’’ అని షోయబ్ మాలిక్.. ద్రవిడ్ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తాడు. కాగా రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో టీమిండియా వన్డే వరల్డ్కప్-2023 ట్రోఫీ గెలిచే దిశగా పయనిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన షాహిన్ ఆఫ్రిది.. తొలి బౌలర్గా రికార్డు WC 2023: గెలుపు జోష్లో ఉన్న టీమిండియాకు మరో గుడ్న్యూస్! -
షోయాబ్ మాలిక్ విధ్వంసం.. 6 సిక్స్లు, 5 ఫోర్లతో! అయినా పాపం..
లంక ప్రీమియర్ లీగ్-2023లో దంబుల్లా ఆరా వరుసగా రెండో విజయం సాధిచింది. పల్లెకెలె వేదికగా జాఫ్నా కింగ్స్ తో జరిగిన స్కోరింగ్ థ్రిల్లర్లో 9 పరుగుల తేడాతో దంబుల్లా విజయం సాధించింది. జాఫ్నా కింగ్స్ బ్యాటర్ షోయాబ్ మాలిక్ ఆఖరి వరకు పోరాడినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జాఫ్నా కింగ్స్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులొకి వచ్చిన మాలిక్.. అచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ.. మాలిక్ మాత్రం పట్టుదలో క్రీజులో నిలిచాడు. 14 ఓవర్ల వరకు నెమ్మదిగా ఆడిన మాలిక్, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవరాల్గా 53 బంతులు ఎదుర్కొన్న మాలిక్.. 5 ఫోర్లు, 6 సిక్స్లతో 74 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. లక్ష్య ఛేదనలో జాఫ్నా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. దంబుల్లా బ్యాటర్లలో కుశాల్ పెరీరా(41) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. జాఫ్నా కింగ్స్ బౌలర్లలో మాలిక్, తుషారా తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో మూడో టీ20.. కిషన్పై వేటు! యువ సంచలనం ఎంట్రీ! అతడికి ఆఖరి ఛాన్స్ -
సానియా–షోయబ్ మధ్య విభేదాలు!
ముంబై: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో విడిపోయిందా! గతంలో కూడా పలుమార్లు వీరి విడాకులపై పుకార్లు రావడం, వాటిని సన్నిహితులు ఖండించడం జరిగాయి. అయితే ఈసారి జరిగిన పరిణామం మరోసారి అదే అనుమానాన్ని రేకెత్తిస్తోంది. షోయబ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి రిలేషన్షిప్ స్టేటస్లో చేసిన మార్పుతో ఈ చర్చ మొదలైంది. ఇప్పటివరకు షోయబ్ ప్రొఫైల్లో ‘సూపర్ ఉమన్ సానియా హజ్బెండ్’ అంటూ ఉండగా, ఇప్పుడు మారి ‘ఫాదర్ టు వన్’ అని వచ్చింది. దీంతో వీరిద్దరు విడిపోయారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది వారి వ్యక్తిగత వ్యవహారమని, దీనిపై ఏ రకంగా వారు స్పందించదల్చుకోలేదని సానియా కుటుంబ వర్గాలు వెల్లడించాయి. సానియా, షోయబ్ మధ్య 2010లో పెళ్లి జరగ్గా... 2018లో కొడుకు ఇజ్హాన్ పుట్టాడు. -
షోయబ్ మాలిక్ తో సానియా విడాకులు..ఇదిగో ప్రూఫ్
-
షోయబ్ మాలిక్తో సానియా విడాకులు?
-
Sania Mirza And Shoaib Divorce Rumours: సానియా, మాలిక్ విడాకుల రూమర్స్.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
-
సానియా, మాలిక్ విడాకులు నిజమేనా..!? మరోసారి తెరపైకి
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా విడాకుల ఆంశం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా షోయబ్ మాలిక్ తన ఇన్స్టాగ్రామ్ బయోలో మార్పు చేయడమే ఇందుకు కారణం. ఇంతకుముందు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయోలో 'సూపర్ ఉమెన్ సానియా మీర్జా' అని ఉండేది. అయితే ఇప్పుడు ఆ వాక్యాన్ని బయో నుంచి తొలగించి.. తన వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరిచాడు. బయోలో ఇతర వివరాలతో పాటు "ఓ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ" మాలిక్ రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మాలిక్, సానియా విడాకులు తీసుకోవడం ఖాయమని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో కూడా.. కాగా కొన్ని నెలల క్రితం కూడా సానియా,షోయబ్ మధ్య విభేదాలు తలెత్తాయనీ, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు తెగ షికార్లు చేశాయి. పాకిస్తానీ నటి అయేషా ఉమర్తో మాలిక్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలను అయేషా కొట్టిపారేసింది. అవన్నీ పుకార్లే అని ఆమె సృష్టం చేసింది. అయితే ఇదే సమయంలో సానియా,షోయబ్ల కొత్త టాక్ షో 'ది మీర్జా మాలిక్ షో'రావడంతో వారి విడాకుల ఊహాగానాలకు తెరపడింది. అయితే తాజాగా మాలిక్ చర్యతో మళ్లీ వారి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు సానియా, షోయబ్ ఎవరూ స్పందించలేదు. కాగా సానియా, షోయబ్ 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఇజహాన్ జన్మించాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్ -
ఫేర్వెల్ ఫంక్షన్లో బిజీబిజీగా సానియా.. భర్త షోయబ్ మాలిక్ ఎక్కడ..?
Sania Mirza-Shoaib Malik: భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (మార్చి 5) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ల్లో పాల్గొన్న సానియా.. చివరిసారిగా రాకెట్ పట్టుకుని అందరినీ అలరించింది. ఫేర్వెల్ మ్యాచ్ల్లో భాగంగా జరిగిన సింగిల్స్ పోటీలో రోహన్ బోపన్నతో తలపడిన సానియా.. ఆ తర్వాత జరిగిన మిక్స్డ్ డబుల్స్లో బోపన్నతో జతకట్టి.. ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీని ఢీకొట్టింది. నామమాత్రంగా జరిగిన ఈ రెండు మ్యాచ్ల్లో సానియానే విజయం సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, హీరో దుల్కర్ సల్మాన్, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తదితరులు సానియాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఫేర్వెల్ మ్యాచ్ల అనంతరం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన రెడ్ ప్రత్యేక కార్పెట్ ఈవెంట్లో పాల్గొన్న సానియా.. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో కలిసి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహ్మాన్, ప్రిన్స్ మహేశ్ బాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. Wasim Akram and Shoaib Malik in an intense discussion after the match 🧐 What could they be discussing? 🤔#IUvKKpic.twitter.com/HHumHfhUnt — Cricket Pakistan (@cricketpakcompk) March 3, 2023 కాగా, సానియా గౌరవార్ధం నిన్న జరిగిన కార్యక్రమాల్లో ఆమె భర్త షోయబ్ మాలిక్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి నుంచి నెటిజన్లు షోయబ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో జనాలకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ప్రస్తుతం షోయబ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. షోయబ్కు సంబంధించిన ఓ వీడియో సానియా ఫేర్వెల్ ఈవెంట్కు కొద్ది రోజుల కిందట నెట్టింట చక్కర్లు కొట్టింది. పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించే షోయబ్.. ఆ ఫ్రాంచైజీ మెంటార్, పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్తో వాదన తరహా డిస్కషన్కు దిగినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. భార్య సానియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో షోయబ్ పాల్గొనకపోవడంతో ఈ వీడియో మరోసారి నెట్టింట ట్రెండింగ్లో నిలిచింది. సానియా-షోయబ్ జంట విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇరువురు మీకు మీరే మాకు మేమే అన్న రీతిలో వ్యవహరించడంతో వీరి మధ్య అంతా అయిపోయిందని, విడాకులే బాకీ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. -
కంటతడి పెట్టిన సానియా మీర్జా
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్కు గుడ్బై చెప్పిన భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ (మార్చి 5) జరిగిన ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్లో పాల్గొంది. సింగిల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో జరిగిన ఈ మ్యాచ్లో సానియా విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన సానియా.. తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టింది. ఈ సందర్భంగా సానియా కొడుకు అమ్మ గ్రేట్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేయడంతో స్టేడియం మొత్తం హర్షద్వానాలు మార్మోగింది. అనంతరం సానియా మిక్సడ్ డబుల్స్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ మ్యాచ్లో రోహన్ బోపన్నతో జతకట్టనున్న సానియా.. ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీతో తలపడనుంది. సానియా ఆడే చివరి మ్యాచ్ చూసేందుకు క్రీడారంగానికి చెందిన వారితో పాటు టాలీవుడ్, బాలీవుడ్, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్, సీతారమం ఫేమ్ దుల్కర్ సల్మాన్ ఈ ఈవెంట్లొ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఇవాళ సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగే రెడ్ కార్పెట్ ఈవెంట్కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఏ ఆర్ రెహమాన్, సురేష్ రైనా, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్తో తోపాటు మరికొందరు స్పోర్ట్స్, సినిమా స్టార్స్ హాజరుకానున్నారని సమాచారం. కాగా, సానియా తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్లో 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 43 WTA టైటిల్స్, ఏసియన్ గేమ్స్ లో 8 పతకాలు, కామన్వెల్త్ గేమ్స్ లో 2 మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ హైదరాబాదీ క్వీన్ డబుల్స్ లో 91 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్లో కొనసాగింది. భారత టెన్నిస్కు సేవలందించినందకు గాను సానియాకు అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న తోపాటు అర్జున, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులు లభించాయి. సానియా ప్రస్తుతం మహిళల ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ టీమ్కు మెంటర్గా వ్యవహరిస్తుంది. -
షంషి, షోయబ్ మాలిక్ మాయాజాలం.. రిజ్వాన్ జట్టుకు ఊహించని షాక్
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని ముల్తాన్ సుల్తాన్స్కు రెండో ఓటమి ఎదురైంది. ప్రస్తుత సీజన్లో తొలి మ్యాచ్లో ఓటమిపాలైన సుల్తాన్స్ ఆ తర్వాత వరుసగా 4 విజయాలు సాధించి, ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన 6వ మ్యాచ్లో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్లో భీకర ఫామ్లో ఉన్న రిజ్వాన్.. ఈ మ్యాచ్లో విఫలం కావడంతో సుల్తాన్స్ ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో వరుసగా 75, 28 నాటౌట్, 66, 50, 110 నాటౌట్, 29 స్కోర్లు చేసిన రిజ్వాన్.. ఈ ఒక్క మ్యాచ్లోనే నిరుత్సాహపరిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ సుల్తాన్స్తో జరిగిన మ్యాచ్లో కరాచీ కింగ్స్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. మాథ్యూ వేడ్ (46), జేమ్స్ విన్స్ (27), తయ్యబ్ తాహిర్ (65) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా, ఛేదనలో సుల్తాన్స్ 101 పరుగులకే చాపచుట్టేయడంతో ఓటమిపాలైంది. సుల్తాన్స్ ఇన్నింగ్స్లో షాన్ మసూద్ (25), మహ్మద్ రిజ్వాన్ (29), అన్వర్ అలీ (12), ఉసామా అలీ (10) మినహా మిగతవారు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తబ్రేజ్ షంషి (3/18), షోయబ్ మాలిక్ (3/18), అకీఫ్ జావిద్ (2/8), ఇమాద్ వసీం (2/34) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు సుల్తాన్స్ను కట్టడి చేయడంలోనూ సఫలమయ్యారు. అంతకుముందు ముల్తాన్స్ బౌలర్లు ఇహసానుల్లా 2 వికెట్లు, అన్వర్ అలీ ఓ వికెట్ పడగొట్టారు. పీఎస్ఎల్లో ఇవాళ రాత్రి లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ తలపడనున్నాయి. -
ఇంగ్లండ్ యువ ఆటగాడి విధ్వంసం.. సరిపోని ఇమాద్ వసీం మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మెరుపులు ప్రారంభమయ్యాయి. ఎనిమిదో సీజన్ తొలి మ్యాచ్లో ఫకర్ జమాన్ బ్లాస్టింగ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. కరాచీ కింగ్స్తో నిన్న (ఫిబ్రవరి 14) జరిగిన మ్యాచ్లో పెషావర్ జల్మీ బ్యాటర్, ఇంగ్లండ్ యువ ఆటగాడు కొహ్లెర్ కాడ్మోర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. కొహ్లెర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (50 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. కొహ్లెర్ మెరుపులకు, కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్యాధ్యతాయుతమైన ఫిఫ్టీ తోడవ్వడంతో పెషావర్ భారీ స్కోర్ సాధించగలిగింది. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, అండ్రూ టై, ఇమ్రాన్ తాహిర్, బెన్ కట్టింగ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీం (47 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చేలరేగినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఇమాద్కు వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ (34 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం తోడైనప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్లో కరాచీ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఇమాద్, బెన్ కట్టింగ్ (9) 13 పరుగులు చేయగలిగారు. ఆఖరి బంతిని ఇమాద్ భారీ సిక్సర్గా మలచినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. పెషావర్ బౌలర్లలో వాహబ్ రియాజ్, జేమ్స్ నీషమ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ ఇర్షాద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. లీగ్లో ఇవాళ (ఫిబ్రవరి 15) ముల్తాన్ సుల్తాన్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
సానియా మీర్జా చెల్లిని చూస్తే మతి పోవాల్సిందే (ఫొటోలు)
-
సానియా- షోయబ్ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్తో విభేదాల కారణంగా విడాకులకు సిద్ధమయ్యారనే వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయో చూసి ఆయన ఇచ్చిన కొత్త ట్విస్ట్కు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన ఇన్స్టా బయోలో తాను సూపర్వుమన్ సానియా మిర్జాకు భర్తను అంటూ రాసుకొచ్చారు షోయబ్. ‘అథ్లెట్, సూపర్వుమన్ సానియామిర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రి’ అని పేర్కొన్నారు. విడాకుల విషయంపై ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో..కొద్ది రోజుల క్రితం పుకార్ల నుంచి తనను, మీర్జాను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు షోయబ్ మాలిక్. ‘ఇది మా వ్యక్తిగతం. ఈ ప్రశ్నకు నేను, నా భార్య సమాధానం ఇవ్వటం లేదు. మమ్మల్ని వదిలేయండి.’ అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. టెన్నిస్ స్టార్ మీర్జా సోలోగా ఫోటోషూట్స్ చేస్తుండటం రూమర్లకు మరింత బలం చేకూర్చుతున్నట్లవుతోంది. ఇది ఇలా ఉండగా.. ఖతర్ వేదికగా మంగళవారం జరిగిన అర్జెంటీనా, క్రొయేషియా మ్యాచ్ మైదానంలో తన సోదరితో పాటు సానియా తళుక్కుమనటం ప్రస్తుతం వైరల్గా మారింది. ఇదీ చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. -
Sania Mirza: సానియా మీర్జా బర్త్డే.. షోయబ్ మాలిక్ పోస్ట్ వైరల్
Sania Mirza- Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుట్టినరోజు నేడు. ఆమె ఈరోజు(నవంబరు 15) 36వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సానియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లవ్ యూ ఫరా ఈ క్రమంలో సానియా మీర్జా బెస్ట్ ఫ్రెండ్, బాలీవుడ్ కొరియోగ్రాఫర్,దర్శకురాలు ఫరా ఖాన్.. సానియా కేక్ కట్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు స్పందించిన సానియా.. ‘‘లవ్ యూ’’ అంటూ బదులిచ్చారు. షోయబ్ విషెస్ ఇదిలా ఉంటే.. సానియా వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల పలు వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. భర్త షోయబ్ మాలిక్కు దూరంగా ఉంటున్న ఆమె విడాకులకు సిద్ధమయ్యారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సానియా బర్త్డే సందర్భంగా షోయబ్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అవన్నీ అబద్ధాలేనా? భార్య కళ్లల్లోకి ఆప్యాయంగా చూస్తూ ఉన్న ఫొటోను పంచుకున్న ఈ వెటరన్ క్రికెటర్.. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సంతోషాలతో నీ జీవితం విలసిల్లాలి. నీదైన ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు’’ అంటూ ఆమెను విష్ చేశాడు. ఈ ఫొటో చూసిన షోయబ్ ఫ్యాన్స్.. ‘‘విడాకుల రూమర్లు అబద్ధమని తేలినట్లేగా! మీది చూడముచ్చటైన జంట. మీరిలా ఎల్లప్పుడూ కలిసే ఉండాలి’’ అంటూ ఆకాంక్షిస్తున్నారు. కొడుకుతో సానియా- షోయబ్ సరిహద్దులు దాటిన ప్రేమ పాకిస్తాన్కు చెందిన ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ను ప్రేమించిన సానియా.. 2010 ఏప్రిల్లో అతడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కుమారుడు ఇజహాన్ సంతానం. ఇక ఓ మోడల్తో షోయబ్ ప్రేమలో పడ్డాడని, అందుకే సానియాను దూరం పెట్టడంతో ఆమెకు విడాకులకు సిద్ధమయ్యారని పాక్ మీడియాలో ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సానియాతో కలిసి మీర్జా మాలిక్ షో చేస్తున్నట్లు ప్రకటించడం సహా ఇలా భార్య పుట్టిన రోజున షోయబ్ విషెస్ తెలపడం గమనార్హం. చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. View this post on Instagram A post shared by Shoaib Malik (@realshoaibmalik) View this post on Instagram A post shared by Farah Khan Kunder (@farahkhankunder) -
Sania-Shoaib Malik: టీవీ షో కోసం విడాకుల డ్రామా.. జనాల్ని ఫూల్స్ చేశారా..?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. తమ దాంపత్య జీవితానికి పుల్స్టాప్ పెట్టనున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. పాక్ మోడల్ అయేషా ఒమర్తో షోయబ్ సీక్రెట్ రిలేషన్ మెయిన్టైన్ చేస్తున్న విషయం సానియాకు తెలిసిపోవడమే, వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణమైందని నెట్టింట రకరకాల కథనాలు ప్రచారమయ్యాయి. View this post on Instagram A post shared by UrduFlix (@urduflixofficial) ఇటీవలి కాలంలో సానియా ఇన్స్టాలో పెట్టిన కొన్ని పోస్ట్లు, షోయబ్ మేనేజర్ విడాకుల విషయాన్ని దృవీకరించాడని వచ్చిన వార్తలు, మీర్జా-మాలిక్ వివాహ బంధానికి తెరపడినట్లు జరిగిన ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. విడాకుల విషయమై మీర్జా-మాలిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదేమోనని ఇప్పుడిప్పుడే వారిరువురి ఫ్యాన్స్ ఓ కన్ఫర్మేషన్కు వస్తున్నారు. View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) అయితే, ఇంతలోనే మీర్జా-మాలిక్ గురించిన ఓ వార్త అభిమానులను కన్ఫ్యూజింగ్ స్టేట్లోకి నెట్టేసింది. మీర్జా-మాలిక్ ఇద్దరూ కలిసి ఓ టీవీ షో చేస్తున్నారని ఊర్దూఫ్లిక్స్ అనే ఓటీటీ ఫ్లాట్ఫామ్ ప్రకటించింది. ఈ షో.. 'ది మీర్జా మాలిక్ షో' గా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఊర్దూఫ్లిక్స్ తమ అధికారిక ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ వార్త తెలిసి అభిమానులు తలలు గోక్కుంటున్నారు. అసలు వీరి విడాకులు వార్త నిజమేనా లేక షో ప్రమోషన్లో భాగంగా జనాలను ఫూల్స్ చేశారా అన్న డైలమాలో ఉన్నారు. కొందరేమో.. ఈ షో వారిద్దరికీ చెడక ముందే ప్లాన్ చేసిందని, మీర్జా-మాలిక్ల వివాహ బంధానికి పుల్స్టాప్ పడిన వార్త నిజమేనని అనుకుంటున్నారు. కాగా, 2010లో ప్రేమ వివాహం చేసుకున్న సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులకు 2018లో ఇజాన్ మీర్జా అనే బిడ్డ పుట్టాడు. ఇద్దరు తమతమ కెరీర్లతో బిజీగా ఉండటంతో సానియా ఇండియాలో, షోయబ్ పాక్లో ఉంటున్నారు. చదవండి: Sania Mirza: సానియా మీర్జాతో విభేదాలు!? నటితో షోయబ్ మాలిక్ ఫొటోలు వైరల్ -
Sania Mirza: సానియా మీర్జాతో విభేదాలు!? నటితో షోయబ్ మాలిక్ ఫొటోలు వైరల్
Sania Mirza- Shoaib Malik- Ayesha Omar: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు అభిమానులకు మరింతగా చేరువయ్యే అవకాశం దొరికింది. తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలు పంచుకునే వెసలుబాటు కలిగింది. అయితే, ఒక్కోసారి నోరు తెరచి స్వయంగా ఏ విషయం చెప్పకపోయినా.. నేరుగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా సరే.. వాళ్లు షేర్ చేసే ఫొటోలు, వాటికి జత చేసే క్యాప్షన్లు చాలు.. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి వదంతులు వ్యాపించడానికి! క్రీడా జంట సానియా మీర్జా- షోయబ్ మాలిక్ విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులకు సిద్ధమయ్యారంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే వీరిద్దరు విడిగా ఉంటున్నారని, విడాకులకు సంబంధించిన ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రకటన చేయనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమే కారణం అంటూ! అంతేకాదు.. ఓ పాకిస్తాన్ మోడల్ ఇందుకు కారణమని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె పేరు తెరపైకి రావడానికి కారణం ఏమిటంటే.. సదరు మోడల్ పేరు ఆయేషా ఒమర్. స్థానిక మ్యాగజీన్ కోసం షోయబ్ ఆమెతో కలిసి 2021లో ఓ బోల్డ్ ఫొటోషూట్ చేశాడు. హెల్త్ అండ్ ఫిట్నెస్పై అవగాహనలో భాగంగా రూపొందించిన వీడియోలో తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వీళ్లు ఆ ఫొటోషూట్లో చాలా సన్నిహితంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయేషా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. షోయబ్ రెండో పెళ్లికి సిద్దమైనట్లుగా కనిపిస్తోంది అంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. స్విమ్మింగ్పూల్లో దిగి ఇలా ఫోజులివ్వడమే ప్రొఫెషనలిజమా అంటూ ప్రశ్నించారు. మీ భర్త కూడా ఇలాగే చేస్తే ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో షోయబ్ మాలిక్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఫొటోషూట్ సమయంలో ఆయేషా తనకు సహకరించారంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఫొటోషూట్ గురించి మీ భార్య సానియా ఎలా స్పందించారని హోస్ట్ ప్రశ్నించగా.. సమాధానం దాటవేసిన షోయబ్.. ‘‘మీ భర్త కూడా ఇలాంటి ఫొటోషూట్లో పాల్గొంటే మీ రియాక్షన్ ఏంటీ’’అంటూ ఎదురు ప్రశ్నించాడు. PC: Ayesha Omar Instagram ఇందుకు వెంటనే స్పందించిన ఆమె..‘‘నాకింకా పెళ్లి కాలేదు’’అని సమాధానమిచ్చింది. అవునా.. మీ లాగే సానియా కూడా రియాక్ట్ అవ్వలేదు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు తోడు ఇటీవల సానియా.. ‘‘హృదయం ముక్కలైందంటూ’’వరుస పోస్ట్లు చేస్తూ ఉండటం ఈ రూమర్లకు ఊతమిచ్చింది. భార్యా కొడుకుతో షోయబ్ మాలిక్ ఆయేషా ఎవరంటే ఆయేషా ఒమర్ నటి, గాయని, యూబ్యూబర్. 1981లో జన్మించిన ఆమె తొలుత వీడియో ఆల్బమ్లతో లైమ్లైట్లోకి వచ్చారు. 2015లో కరాచీ సే లాహోర్ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇక సానియా- షోయబ్ మాలిక్ విడాకుల వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆయేషా- షోయబ్ మాలిక్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా 2010లో పెళ్లి చేసుకున్న సానియా- షోయబ్కు కుమారుడు ఇజహాన్ సంతానం. చదవండి: T20 WC 2022 Final: ఇంగ్లండ్- పాక్ ఫైనల్కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే? IND vs NZ: టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్! View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) -
Sania Mirza: విడాకులకు సిద్ధమైన సానియా? ‘భర్త మోసాన్ని తట్టుకోలేకే’ అంటూ..
Sania Mirza- Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. భర్త షోయబ్ మాలిక్తో విభేదాల కారణంగా ఆమె విడాకులకు సిద్దమయ్యారనేది వాటి సారాంశం. కాగా టెన్నిస్లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా పలు ఘనతలు అందుకున్న సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా 2010 ఏప్రిల్లో ఈ క్రీడా జంట వివాహ బంధంలో అడుగుపెట్టింది. వీరికి కుమారుడు ఇజహాన్ సంతానం. ఇక పెళ్లైన నాటి నుంచి.. ముఖ్యంగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో సానియాను ఉద్దేశించి కొంతమంది ఆకతాయిలు విపరీతమైన ట్రోల్స్ చేసేవారు. అయితే, అవేమీ తమ బంధం మీద ప్రభావం చూపలేవంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ.. ట్రోల్స్కు కౌంటర్ ఇచ్చేవారు సానియా. కానీ గత కొన్ని రోజులుగా ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నట్లు ఇన్సైడ్ స్పోర్ట్ తన కథనంలో పేర్కొంది. అనుమానాలు పెంచిన ఆ కామెంట్! ఇటీవల దుబాయ్లో తమ కుమారుడి పుట్టినరోజు(అక్టోబరు 30) సెలబ్రేట్ చేసింది ఈ జంట. ఈ క్రమంలో షోయబ్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేయగా.. సానియా మాత్రం తాను, తన కొడుకు మాత్రమే కలిసి ఉన్న ఫొటో పంచుకున్నారు. ఇందుకు స్పందించిన సానియా బెస్ట్ ఫ్రెండ్, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్.. ‘‘నీ జీవితంలో ఉన్న ఒకే ఒక, నిజమైన ప్రేమ.. ఇజహాన్తో నిన్ను చూసినప్పుడల్లా నాకిలాగే అనిపిస్తుంది’’ అని కామెంట్ చేశారు. దీనితో పాటు ఇటీవల కొడుకు తనను ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేసిన సానియా.. ‘‘కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చే క్షణాలు’’ అంటూ క్యాప్షన్ జతచేశారు. అంతేకాదు.. ‘ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుంది’ అంటూ ఇన్స్టా స్టోరీలో రాయడం అనుమానాలను మరింత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో భర్తను ఉద్దేశించే సానియా ఇలాంటి పోస్టులు చేస్తున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా షోయబ్ మోసాన్ని తట్టుకోలేక సానియా విడాకులకు సిద్ధమయ్యారని.. గత కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంట.. కొడుకు కోసం మాత్రమే అప్పుడప్పడూ కలుస్తున్నారంటూ పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఇటు సానియా గానీ.. అటు షోయబ్ గానీ ఈ రూమర్లపై నోరు మెదపకపోవడం గమనార్హం. కాగా వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్కు జాతీయ జట్టులో ఇటీవల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2022కు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. చదవండి: WC 2022: ఇంగ్లండ్తో సెమీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ! రోహిత్కు గాయం? Aus Vs Eng: ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ లక్ష్యంగా! View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) Sania Mirza Instagram story. pic.twitter.com/BBKEztyCa6 — Avinash Aryan (@AvinashArya09) November 6, 2022 -
T20 WC: నన్ను సెలక్ట్ చేయమని బాబర్ ఆజంను ఒత్తిడి చేయలేదు!
T20 World Cup 2022: ‘‘నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రమే నా పని. జట్టుకు ఎంపిక చేయాలా వద్దా అన్న విషయం యాజమాన్యం నిర్ణయిస్తుంది’’ అని పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అన్నాడు. టీ20 వరల్డ్కప్-2022కు ఎంపిక కాకపోవడంపై ఈ మేరకు స్పందిస్తూ.. తనకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని, ఈ విషయంలో ఎవరిని నిందించాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు. కాగా పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ తొలి ఎడిషన్(2007)లో పాక్ కెప్టెన్గా వ్యవహరించిన షోయబ్ మాలిక్.. 2009లో ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. అదే విధంగా పలు కీలక మ్యాచ్లలో జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం. అయితే, ఆసియాకప్-2022తో పాటు.. అక్టోబరు 16న ఆస్ట్రేలియా వేదికగా మొదలుకానున్న టీ20 వరల్డ్కప్-2022 ఈవెంట్కు ఎంపిక చేసిన జట్టులో మాత్రం అతడికి చోటుదక్కలేదు. తను ఇప్పుడు కెప్టెన్ కదా! ఈ నేపథ్యంలో సామా టీవీతో మాట్లాడిన షోయబ్ మాలిక్.. తను కెరీర్లో విజయవంతం కావడానికి తన సానకూల దృక్పథమే కారణమని.. ఇప్పుడు కూడా అలాగే ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. ఇక కెప్టెన్ బాబర్ ఆజంతో తనకున్న అనుబంధం గురించి ఈ సందర్భంగా షోయబ్ మాలిక్ ప్రస్తావించాడు. ‘‘మేమిద్దరం కాంటాక్ట్లోనే ఉంటాం. ఇంతకుముందైతే మేము ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు తను కెప్టెన్ కదా! తన స్పేస్ తనకు ఇవ్వాల్సి ఉంటుంది. బాబర్తో ఉన్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని జట్టు సెలక్షన్ సమయంలో నన్ను పరిగణనలోకి తీసుకోవాలని నేనెప్పుడూ ఒత్తిడి చేయలేదు. అసలు అలాంటి ప్రయత్నమే ఎప్పుడూ చేయలేదు’’ అని షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు. కాగా ఇటీవల నేషనల్ టీ20 కప్ 2022 టోర్నీలో ఆడిన 40 ఏళ్ల షోయబ్ మాలిక్.. 9 ఇన్నింగ్స్లో 204 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక గతేడాది ప్రపంచకప్ తర్వాత అతడు ఏ టీ20 సిరీస్కు కూడా ఎంపిక కాలేదు. ఇదిలా ఉంటే ప్రపంచకప్-2022లో టీమిండియాతో అక్టోబరు 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: Asia Cup 2023: మెగా టోర్నీ ఆడేందుకు పాక్కు టీమిండియా? సుదీర్ఘ విరామం తర్వాత..! T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్లో అతడే టీమిండియా టాప్ రన్ స్కోరర్' Ind Vs Pak- Babar Azam: భారత్తో మ్యాచ్ కోసమే ఇదంతా: పాక్ కెప్టెన్ బాబర్ ఆజం -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచంలో తొలి ఆటగాడిగా
టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ధర్మశాల వేదికగా శ్రీలంక జరిగిన మూడో టీ20లో ఆడిన రోహిత్.. తన అంతర్జాతీయ టీ20 కేరిర్లో 125 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక టీ20 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. పాకిస్తాన్ తరపున 124 టీ20 మ్యాచ్లు ఆడి తొలి స్ధానంలో ఉన్న షోయాబ్ మాలిక్ రికార్డును రోహిత్ ఆధిగమించాడు. ఇక 124 మ్యాచ్లతో మాలిక్ రెండో స్ధానంలో ఉండగా, పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ 119 మ్యాచ్లుతో మూడో స్ధానంలో ఉన్నాడు. ఇక 100కు పైగా టీ20లు ఆడిన టీమిండియా ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు శర్మ మాత్రమే. రోహిత్ తరువాత 98 మ్యాచ్లతో భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోని ఉండగా, 97 మ్యాచ్లతో విరాట్ కోహ్లి రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ షనకా(74) తప్ప మిగితా ఎవరూ రాణించలేదు. ఇక 147 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.5 ఓవర్లలోనే చేధించింది. టీమిండయా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మరో సారి చెలరేగి ఆడాడు. 45 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. చదవండి: Women’s World Cup 2022: ఫామ్లో లేదన్నారు... సెంచరీతో చెలరేగింది -
క్యాచ్ డ్రాప్ చేశా.. ఏడ్చాను.. రెండ్రోజులు నిద్రపోలేదు.. నా భార్య కంగారుపడింది..
టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో సూపర్ 12 దశలో అద్భుత విజయాలు సాధించిన పాకిస్తాన్కు ఆస్ట్రేలియా గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఐదింటికి ఐదు మ్యాచ్లు గెలిచి అజేయంగా నిలిచిన బాబర్ ఆజమ్ బృందం... రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటి బాట పట్టింది. 5 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముఖ్యంగా మార్కస్ స్టొయినిస్(40 పరుగులు), మాథ్యూ వేడ్(41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్తో పాకిస్తాన్కు చుక్కలు చూపించారు. ఇక షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో వేడ్ ఇచ్చిన క్యాచ్ను... హసన్ అలీ మిస్ చేయగా.. దొరికిన లైఫ్ను అతడు సద్వినియోగం చేసుకున్నాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే కంగారూలను గెలిపించాడు. దీంతో హసన్ అలీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కు గురయ్యాడు. అతడి భార్యను ఉద్దేశించి కూడా కొంతమంది నీచపు కామెంట్లు చేశారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన హసన్ అలీ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నాడు. క్రికెట్ పాకిస్తాన్తో మాట్లాడిన అతడు... ‘‘నా కెరీర్లో అది అత్యంత కఠిన సమయం. ఆ మ్యాచ్ ఫలితాన్ని అస్సలు మర్చిపోలేకపోయాను. ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోని విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నా. ఆ రోజు మ్యాచ్ తర్వాత రెండు రోజుల పాటు నేను నిద్రపోలేదు. ఏడ్చాను. నా భార్య చాలా కంగారుపడింది. టెన్షన్కు గురైంది. నేను ఏమైపోతానో అని భయపడింది. నేను మాత్రం డ్రాప్ చేసిన ఆ క్యాచ్ గురించే తీవ్రంగా ఆలోచించేవాడిని. ప్రతిసారి ఆ విషయమే గుర్తుకు వచ్చేది. అయితే, బంగ్లాదేశ్ పర్యటనకు పయనమైన తర్వాత నాలో కాస్త మార్పు వచ్చింది. చేదు ఘటనను మర్చిపోయి ముందుకు సాగాలని నాకు నేనే నచ్చజెప్పుకొన్నాను’’ అని భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో సహచర ఆటగాళ్లు ముఖ్యంగా షోయబ్ భాయ్ తనకు అండగా నిలిచాడన్న హసన్ అలీ... నువ్వు టైగర్ అంటూ తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడని గుర్తు చేసుకున్నాడు. తాను ఏడుస్తుంటే షాహిన్ కూడా ఏడ్చాడని అంతా కలిసి తమను ఓదార్చారని పేర్కొన్నాడు. ఇక సోషల్ మీడియాలో అభిమానులు సైతం తనకు మద్దతుగా నిలబడ్డారని, వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక పాకిస్తాన్పై విజయంతో ఫైనల్లో ప్రవేశించిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మీద గెలుపొంది తొలిసారి టీ20 ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: Sourav Ganguly: మొన్న కోహ్లిని అలా.. ఇప్పుడు ఇలా.. మరో వివాదంలో గంగూలీ.. సిగ్గుపడండి.. ఎందుకిలా? పాపం కెప్టెన్, కోచ్! -
29 ఫోర్లు, 7 సిక్సులు.. తొలి వికెట్కు 155 పరుగులు.. అయినా!
పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీ బోణీ కొట్టింది. కరాచీ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో పెషావర్ జల్మీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ధేశించిన 191 పరుగుల భారీ లక్ష్యాన్ని పెషావర్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెషావర్ విజయంలో హుస్సేన్ తలత్(52), షోయాబ్ మాలిక్(48) పరుగులతో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్కు ఓపెనర్లు ఎహ్సాన్ అలీ, విల్ స్మెడ్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా విల్ స్మెడ్ సెంచరీ తృటిలో మిస్సయ్యాడు. స్మెడ్ కేవలం 62 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అదే విధంగా మరో ఓపెనర్ ఎహ్సాన్ అలీ 46 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు కూడా ఉన్నాయి. వీరిద్దిరి తుఫాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో గ్లాడియేటర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. పెషావర్ బౌలింగ్లో ఉస్మాన్ ఖాదిర్ , సామీన్ గుల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 97 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన విల్ స్మెడ్కి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. కరోనా బారిన పడిన స్టార్ ఆటగాడు Will Smeed smashing it on #PSL2022 debut for @TeamQuetta!! Currently 64* from 43 balls including this MONSTER six! 🔥🔥🔥#HBLPSL #HBLPSL7 #WeAreSomerset pic.twitter.com/BTcD7d6KjC — Somerset Cricket 🏏 (@SomersetCCC) January 28, 2022 -
చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. అరుదైన రికార్డు
కరాచీ: పాకిస్థాన్ వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్, భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మేనల్లుడు మహమ్మద్ హురైరా పాకిస్థానీ దేశవాళీ టోర్నీలో ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఖైద్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా నార్తర్న్ జట్టు తరఫున బరిలోకి దిగిన 19 ఏళ్ల హురైరా.. బలూచిస్థాన్పై అజేయ త్రిశతకం(341 బంతుల్లో 311 నాటౌట్; 40 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థానీ క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. హురైరాకు ముందు పాక్ లెజెండరీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఈ ఘనత సాధించాడు. మియాందాద్ 1975లో 17 ఏళ్ల 310 రోజుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. హురైరా 19 ఏళ్ల 239 రోజుల వయసులో ఆ ఘనత సాధించాడు. ఓవరాల్గా పాకిస్థాన్ గడ్డపై ఇది 23వ ట్రిపుల్ సెంచరీ కాగా, ఆ ఘనత సాధించిన 22వ ఆటగాడిగా హురైరా నిలిచాడు. పాక్లో త్రిశకం బాదిన ఆటగాళ్లలో మైక్ బ్రేర్లీ(ఇంగ్లండ్), మార్క్ టేలర్(ఆసీస్), వీరేంద్ర సెహ్వాగ్(భారత్) ఉన్నారు. చదవండి: మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్లోనూ అతడే.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు Northern's Mohammad Huraira who scored his maiden triple-century in the Quaid-e-Azam Trophy 2021-22 final-round clash against Balochistan talks about his heroic effort. #QeAT #HarHaalMainCricket pic.twitter.com/dz7n3MkZN7 — Pakistan Cricket (@TheRealPCB) December 20, 2021 MONUMENTAL EFFORT! 19-year-old Mohammad Huraira becomes the second youngest Pakistan batter to score a first-class triple century! 👏👏#HarHaalMainCricket pic.twitter.com/QtYRKDRCKT — Pakistan Cricket (@TheRealPCB) December 20, 2021 -
ఇది పాక్ క్రికెటర్లకే సాధ్యం.. 13 ఏళ్లకు సేమ్సీన్ రిపీట్
వెస్టిండీస్తో సొంతగడ్డపై జరిగిన టి20 సిరీస్ను పాకిస్తాన్ గెలుచుకుందనే విషయం కంటే మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాఫిక్గా మారింది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్లు చేసిన పని పాక్ జట్టును ట్రోల్స్ బారిన పడేలా చేసింది. ఇద్దరి మధ్య ఏర్పడిన సమన్వయ లోపంతో విండీస్ బ్యాట్స్మన్ బ్రూక్స్ ఇచ్చిన క్యాచ్ను నేలపాలు చేశారు. తప్పు నీదంటే నీది అని కాసేపు వాదోపవాదాలు చేసుకున్నారు. ఆ సమయంలో తమ చెత్త ఫీల్డింగ్తో 13 ఏళ్ల కింద జరిగిన సంఘటనను రీక్రియేట్ చేశామని పాపం వారికి తెలియదు. ఇదే వారి కొంపముంచింది. అసలు విషయం ఏంటంటే.. 2008లో అచ్చం ఇదే తరహాలో షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్లు సమన్వయ లోపంతో ఒక క్యాచ్ను వదిలేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పుడు, ఇప్పుడు ప్రత్యర్థి వెస్టిండీస్ కావడం విశేషం. సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్లను ట్యాగ్ చేస్తూ.. మాలిక్, అజ్మల్ 2.0 అంటూ ట్రోల్ చేశారు. ''ఏదైనా పాక్ క్రికెటర్లకే సాధ్యం.. చరిత్రను తిరగరాశారు''.. '' హస్నేన్ క్యాచ్ వదిలేసి సయీద్ అజ్మల్ గౌరవాన్ని పెంచాడు.''.. ''న్యూ అజ్మల్, మాలిక్లు.. బట్ సేమ్ ఓల్డ్ వెస్టిండీస్'' అంటూ కామెంట్స్ పెట్టారు. Hasnain & ifti 🤝 Malik & ajmal On both occasions opponent was west indies 😂😂❤️ #PAKvWI pic.twitter.com/YQj12liy5P — Saad Irfan 🇵🇰 (@SaadIrfan967) December 16, 2021 -
షోయబ్ మాలిక్.. మరీ ఇంత బద్దకమా
Shoaib Malik Gets Run Out In Bizarre Manner: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టి20లో పాక్ సీనియర్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ విచిత్రరీతిలో రనౌట్ అయ్యాడు. బ్యాట్ను క్రీజులో పెట్టేందుకు బద్దకించిన మాలిక్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. టాపార్డర్ విఫలమైన చోట బాధ్యతగా బ్యాటింగ్ చేయాల్సిన మాలిక్ ఇలా చేయడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది విషయంలోకి వెళితే.. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్, హైదర్ అలీ రూపంలో తొందరగానే వికెట్ కోల్పోయింది. ఈ సందర్భంగా క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో ముస్తాఫిజుర్ బౌలింగ్లో చివరి బంతిని ఫ్లిక్ చేయడంలో విఫలమయ్యాడు. మాలిక్ క్రీజు దాటి బయటికి రావడంతో బంతిని అందుకున్న కీపర్ నురుల్ హసన్ వికెట్ల వైపు విసిరాడు. డైరెక్ట్ హిట్ అవ్వడంతో బెయిల్స్ ఎగిరిపడ్డాయి. అప్పటికే మాలిక్ క్రీజులోకి వచ్చాడని అంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. క్రీజులోకి వచ్చిన మాలిక్ బ్యాట్ను మాత్రం కింద పెట్టలేదు. దీంతో బంగ్లా అప్పీల్కు వెళ్లగా.. థర్డ్అంపైర్ మాలిక్ను ఔట్ అని ప్రకటించడంతో డకౌట్గా రనౌటయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్లో పాకిస్తాన్ 4 వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. ఇరుజట్ల మధ్య రెండో టి20 నవంబర్ 20న జరగనుంది. చదవండి: Syed Mustaq Ali T20 Trophy: ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్.. సూపర్ ఓవర్ ద్వారా సెమీస్కు Shoaib Malik👀pic.twitter.com/MIGoTLXAEn — CricTracker (@Cricketracker) November 19, 2021 -
ఆసీస్తో సెమీస్కు ముందు అనారోగ్యం... అయినా జట్టులోకి వచ్చారు! కానీ ఫైనల్లో నిరాశే
Update: ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్కు పాకిస్తాన్ కీలక ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులోకి వచ్చారు. రిజ్వాన్ 67 పరుగులతో ఆకట్టుకోగా... షోయబ్ మాలిక్ మాత్రం నిరాశపరిచాడు. ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుది. మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. Mohammad Rizwan, Shoaib Malik Doubtful For Semis Against Australia: టీ20 ప్రపంచకప్-2021లో ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్కు ముందు పాకిస్తాన్కు బిగ్ షాక్ తగలనుంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు గత రెండు రోజులు నుంచి ఫ్లూ జ్వరంతో బాధపడతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వీరిద్దరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్గా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ ఇద్దరు ఆటగాళ్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్కు దూరమయ్యారు. దీంతో ఈ మ్యాచ్లో రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉంటారో లేరోనన్న అంశంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్కు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో లేకపోతే వారి స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీకు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు సమాచారం. వీరిద్దరిని మ్యాచ్కు సిద్ధంగా ఉండమని పీసీబీ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ విజయంలో రిజ్వాన్, మాలిక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. నవంబర్ 11న (గురువారం) పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్పై విజయంతో న్యూజిలాండ్ ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2021 NZ Vs ENG: మన క్యూరేటర్కు నివాళిగా... -
T20 WC: స్కాట్లాండ్పై ఘన విజయం.. ఐదుకు ఐదు గెలిచిన పాకిస్తాన్
T20 World Cup 2021: Pakistan Beat Scotland By 72 Runs : టి20 ప్రపంచకప్ సూపర్–12 లీగ్ దశను మాజీ చాంపియన్ పాకిస్తాన్ అజేయంగా ముగించింది. గ్రూప్–2లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 72 పరుగుల తేడాతో స్కాట్లాండ్పై ఘనవిజయం సాధించింది. ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ నెగ్గిన పాక్ 10 పాయింట్లతో గ్రూప్ టాపర్గా నిలిచింది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (47 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్లు) ఈ టోర్నీలో నాలుగో అర్ధ సెంచరీ చేశాడు. చివర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షోయబ్ మాలిక్ (18 బంతుల్లో 54 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్లు) సూపర్ ఫినిష్ ఇచ్చాడు. ఛేదనలో స్కాట్లాండ్ 20 ఓవర్లో 6 వికెట్లకు 117 పరుగులు చేసి ఓడింది. రిచీ బెరింగ్టన్ (37 బంతుల్లో 54 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్కు రెండు వికెట్లు దక్కగా... షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, హసన్ అలీ ఒక్కో వికెట్ తీశారు. ఈనెల 11న జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో పాక్ ఆడుతుంది. ఇక ఈ మెగా టోర్నీలో స్కాట్లాండ్ ఐదింటికి ఐదు మ్యాచ్లు ఓడి అట్టడుగున ఉంది. నెమ్మదిగా ఆరంభం టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. రిజ్వాన్ (15), ఫఖర్ జమాన్ (8) విఫలమయ్యారు. దాంతో పాకిస్తాన్ 10 ఓవర్ల తర్వాత 60/2గా నిలిచింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మొహమ్మద్ హఫీజ్ (19 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆజమ్ పాక్ను ఆదుకున్నాడు. వీరు మూడో వికెట్కు 53 పరుగులు జోడించారు. హఫీజ్ అవుటయ్యాక ఆజమ్ 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. సూపర్ మాలిక్ షోయబ్ మాలిక్ బ్యాటింగ్కు వచ్చే సమయానికి పాక్ స్కోరు 15 ఓవర్లలో 112/3. క్రీజులోకి వచ్చిన షోయబ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్లోకి పంపి విధ్వంసం సృష్టించాడు. 18 బంతులు ఎదుర్కొన్న షోయబ్... ఒక ఫోర్తో పాటు ఆరు సిక్స్లు బాదాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సిక్సర్గా మలిచిన అతడు అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. షోయబ్ దూకుడుతో పాక్ చివరి 5 ఓవర్లలో 77 పరుగులు రాబట్టింది. చదవండి: T20 World Cup 2021: కివీస్ సెమీస్కు.. ప్రాక్టీసు రద్దు చేసుకుని హోటల్లోనే ఉండిపోయిన భారత ఆటగాళ్లు! Abu Dhabi Chief Curator: అబుదాబిలో భారత క్యూరేటర్ ఆత్మహత్య Ruthless Babar and Shoaib confirm Pakistan's seventh showdown with Australia in T20 World Cup More details: https://t.co/eqZ0Bxo5Fq#WeHaveWeWill | #T20WorldCup | #PAKvSCO — PCB Media (@TheRealPCBMedia) November 7, 2021 -
పాక్ తరపున తొలి బ్యాటర్గా.. టి20 ప్రపంచకప్ చరిత్రలో
Shoaib Malik Fastest Fifty In T20 WC 2021: టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్ స్కాట్లాండ్తో మ్యాచ్లో దుమ్మురేపాడు. సిక్సర్ల వర్షం కురిపించిన మాలిక్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఈ ప్రపంచకప్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన జాబితాలో కేఎల్ రాహుల్తో ( 18 బంతుల్లో 50, స్కాట్లాండ్పై ) కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. చదవండి: Mohammad Rizwan: మహ్మద్ రిజ్వాన్ కొత్త చరిత్ర.. గేల్ రికార్డు బద్దలు ఇక ఓవరాల్గా చూస్తే టి20 ప్రపంచకప్ల్లో మాలిక్ది ఐదో వేగవంతమైన అర్థ శతకం. యువరాజ్ సింగ్(12 బంతులు, 2007, ఇంగ్లండ్పై), స్టీఫన్ మైబర్గ్(17 బంతులు, 2014, ఐర్లాండ్పై), గ్లెన్ మ్యాక్స్వెల్(18 బంతులు, 2014, పాకిస్తాన్పై), కేఎల్ రాహుల్(18 బంతులు, 2021, స్కాట్లాండ్పై), షోయబ్ మాలిక్(18 బంతులు, 2021, స్కాట్లాండ్పై) వరుసగా ఉన్నారు . ఇక పాకిస్తాన్ తరపున టి20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న ఆటగాడిగా మాలిక్ తొలి స్థానంలో నిలిచాడు. ఇంతకముందు ఉమర్ అక్మల్( 2010లో ఆస్ట్రేలియాపై 21 బంతుల్లో, 2016లో న్యూజిలాండ్పై 22 బంతుల్లో) రెండోస్థానంలో ఉన్నాడు. -
సెలక్టర్ల నిర్ణయం సరైందేనని షోయబ్ నిరూపించాడు: టీమిండియా మాజీ క్రికెటర్
Zaheer Khan Comments on Shoaib Malik: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్పై టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి.. సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడని కొనియాడాడు. కాగా టీ20 వరల్డ్కప్-2021లో భాగంగా షార్జా వేదికగా మంగళవారం కివీస్తో మ్యాచ్లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాక్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు... కెప్టెన్ బాబర్ ఆజమ్ (9), ఫఖర్ జమాన్ (11) సహా హఫీజ్ (11) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆ తర్వాత రిజ్వాన్ (34 బంతుల్లో 33; 5 ఫోర్లు) కూడా పెవిలియన్ చేరడంతో.. పాక్ ఒక దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్ 20 బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్ల సాయంతో 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతడికి తోడైన ఆసిఫ్ అలీ వరుస షాట్లు కొట్టడంతో మరో 8 బంతులుండగానే పాకిస్తాన్ లక్ష్యం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్ క్రిక్బజ్ లైవ్లో మాట్లాడుతూ షోయబ్ మాలిక్పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘షోయబ్ మాలిక్ లాంటి సీనియర్ ఆటగాళ్లను ఎందుకు జట్టులోకి తీసుకుంటారని అభిమానులు తరచుగా అడుగుతుంటారు కదా. ఇదిగో ఇందుకే వారిని ఆడిస్తారు. ఒత్తిడిని ఎలా జయించాలో వారికి తెలుసు. వాళ్లకు ఓపిక ఎక్కువగా ఉంటుంది. తీవ్ర ఒత్తిడిలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలరు. అన్నింటి కంటే ఈ లక్షణాలే ముఖ్యం. చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన షోయబ్ మాలిక్.. ఈరోజు సెలక్టర్ల నిర్ణయం తప్పుకాదని నిరూపించాడు’’ అని కితాబిచ్చాడు. కాగా సోహైబ్ మక్సూద్ను గాయం కావడంతో చివరి నిమిషంలో షోయబ్ పాక్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో పాకిస్తాన్కు వరుస విజయాలు అందిస్తున్న కెప్టెన్ బాబర్ ఆజంను కూడా జహీర్ ఖాన్ ప్రశంసించాడు. ‘‘ఒకప్పుడు పాకిస్తాన్ జట్టు అంటే ఇదీ అని ఒక అంచనా వేయలేకపోయేవాళ్లం. కానీ... బాబర్ ఆజం చాలా కామ్గా తన పని తాను చేసుకుపోతున్నాడు. పాకిస్తాన్ క్రికెట్కు కొత్త దారి చూపిస్తున్నాడు’’ అని కొనియాడాడు. కాగా టీ20 వరల్డ్కప్ సూపర్-12లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్పై వరుస విజయాలతో పాకిస్తాన్ సెమీ ఫైనల్కు చేరువవుతోంది. చదవండి: T20 World Cup: ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్కు భారీ షాక్.. అతడు టోర్నీ నుంచి అవుట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind vs Pak: బావగారూ.. బావగారూ అంటూ ఫ్యాన్స్ కేకలు.. వీడియో షేర్ చేసిన సానియా
Sania Mirza Reacts After Fans Call Shoaib Malik ‘jeeja ji’: సానియా మీర్జా- షోయబ్ మాలిక్.. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు... దాయాదుల పోరు గురించే కాదు.. ఈ జంట గురించి కూడా నెట్టింట చర్చ జరుగుతుంది... ఒక్కోసారి రచ్చ కూడా అవుతుంది.. అందుకే అక్టోబరు 24 నాటి భారత్- పాక్ పోరుకు ముందు తాను సోషల్ మీడియా నుంచి మాయమైపోతానంటూ సానియా మీర్జా ఓ వీడియో షేర్ చేశారు కూడా. అందుకు గల కారణాల గురించి ఇప్పుడు ప్రస్తావన అనవసరం. అయితే.. సోమవారం ఆమె పంచుకున్న వీడియో మాత్రం ఎంతో హృద్యంగా ఉంది. ఆదివారం పాకిస్తాన్తో మ్యాచ్లో కోహ్లి సేన బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న షోయబ్ మాలిక్ను ఉద్దేశించి... కొంతమంది అభిమానులు.. ‘‘బావగారూ.. బావగారూ..’’ అంటూ సంతోషంతో కేకలు వేశారు. ఈ వీడియోను సానియా మీర్జా రీషేర్ చేయగా... నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. అభిమానులు.. ‘‘ఇది చాలా క్యూట్గా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సానియా మీర్జా సైతం.. స్మైలింగ్ ఎమోజీలతో పాటు రెండు హార్ట్ సింబల్స్ జతచేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా 2010లో పెళ్లి చేసుకున్న సానియా మీర్జా- షోయబ్ మాలిక్ 2018లో కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక మాలిక్ కెరీర్ విషయానికొస్తే చాలా కాలంగా జట్టుకు దూరమైన షోయబ్ మాలిక్కు అనూహ్యంగా టీ20 వరల్డ్కప్ ఆడే జట్టులో ఆఖరి నిమిషంలో చోటు దక్కింది. సోహైబ్ మక్సూద్కు గాయం కావడంతో అతడి స్థానంలో మాలిక్ జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉండగా... ప్రపంచకప్లో టీమిండియా చేతిలో తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేస్తూ.. పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, మెంటార్ ధోని పాక్ ఆటగాళ్లను అభినందిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్న ఫొటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: Rashid Khan: కన్నీటి పర్యంతమైన నబీ.. రషీద్ ఖాన్ భావోద్వేగ పోస్టు.. T20 World Cup 2021 Ind vs Pak: ఓటమి అనంతరం కోహ్లి అలా.. ధోని ఇలా 🤣🤣❤️❤️ https://t.co/NE46xoSKfu — Sania Mirza (@MirzaSania) October 25, 2021 -
MS Dhoni: పాక్ ఆటగాళ్లతో ధోని ముచ్చట.. ఇది కదా.. గొప్పదనం.. వీడియో వైరల్
MS Dhoni joins Pakistan players for a chat after India’s loss in Dubai: ‘‘చాలా మంది ఈ దృశ్యాలు చూడాలి. ఇండియా- పాకిస్తాన్ క్రికెట్ అసలైన స్టోరీ ఇది. మైదానం వెలుపల అంచనాలు, హైప్నకు ఇది అతీతం’’.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షేర్ చేసిన వీడియోలో వినిపించిన మాటలు. నిజమే.. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే భారీ అంచనాలు. భావోద్వేగాలు. కానీ.. మైదానంలో మాత్రం అందరూ ‘ఒక్కటే’.. అంతా క్రికెటర్లే. ప్రత్యర్థి జట్టును అభినందించగల క్రీడా స్ఫూర్తి ప్రదర్శించగల గుణం ఉండాలి. టీమిండియా ఆ స్ఫూర్తిని కనబరిచింది. టీ20 వరల్డ్కప్ టోర్నీలో భాగంగా... ఆదివారం నాటి మ్యాచ్లో చరిత్రను తిరగరాస్తూ భారత్పై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో.. టీమిండియా అభిమానుల హృదయాలు బద్దలయ్యాయి. ఓటమిని జీర్ణించుకోలేకపోయారు చాలా మంది. కానీ... మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలోని కొన్ని దృశ్యాలు ‘క్రీడాభిమానులను’ విపరీతంగా ఆకర్షించాయి. పాక్ ఆటగాళ్లు ఇమాద్ వసీం, షోయబ్ మాలిక్ సహా పలువురు.. టీమిండియా మెంటార్ ఎంఎస్ ధోనితో కాసేపు ముచ్చటించారు. మిస్టర్ కూల్ సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వచ్చి ధోనితో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం చిరునవ్వుతో పాక్ ఆటగాళ్లకు విషెస్ చెబుతూ హుందాగా ప్రవర్తించిన తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. ‘‘ఈరోజు ఆటదే అసలైన విజయం.. ఈ దృశ్యాలు ఎంత అందంగా ఉన్నాయి’’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్ ఏంటి?’ View this post on Instagram A post shared by ICC (@icc) -
IND Vs Pak: ఆ ప్లేయర్స్ ఇద్దరికి కలిపి 80 ఏళ్లు.. ఆడించొద్దు
T20 WC 2021 IND Vs PAK.. టి20 ప్రపంచకప్లో భాగంగా మరికొన్ని గంటల్లో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీమిండియాతో ఆడే జట్టును పాకిస్తాన్ ప్రకటించేసింది. ఆ జట్టులో సీనియర్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్ కూడా ఉన్నారు. కాగా ఈ ఇద్దరికి జట్టులో చోటు కల్పించడంపై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ అజమ్.. మహ్మద్ రిజ్వాన్లు ఓపెనర్లుగా వస్తారు.. ఇక వన్డౌన్లో ఫఖర్ జమాన్ ఉంటాడు. నాలుగు, ఐదు స్థానాల్లో మహ్మద్ హఫీజ్ , హైదర అలీ వస్తే బాగుంటుంది. షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్లు ఒకేసారి ఆడకూడదు. చదవండి: T20 WC 2021: భారత్-పాక్ మ్యాచ్పై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు వయసు రిత్యా మాలిక్కు 39, హఫీజ్కు 41.. ఇద్దరికి కలిపి 80 ఏళ్లు ఉంటాయి. వాళ్లిద్దరు కలిసి ఆడితే నాకు 80 ఏళ్ల ముసలోడు కనిపిస్తాడు. అందుకే షోయబ్ మాలిక్ స్థానంలో హైదర్ అలీని ఆడించాలి. హఫీజ్ ప్రస్తుతం పాక్ మిడిలార్డర్లో బలమైన బ్యాటర్గా ఉన్నాడు. అతనికి జతగా హైదర్ అలీ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. అప్పుడే టీమ్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఇక ఆరు, ఏడు స్థానాల్లో ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీమ్లు.. 8,9,10 స్థానాల్లో షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్.. చివరగా షాహిన్ అఫ్రిది ఉంటారు. అని చెప్పుకొచ్చాడు. ఇక మహ్మద్ హఫీజ్ కొన్నేళ్లుగా పాకిస్తాన్ జట్టులో మిడిలార్డర్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. 116 టి20ల్లో 2429 పరుగులు చేశాడు. ఇక మాలిక్ గత రెండేళ్లుగా పాకిస్తాన్ తరపున ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. ఓవరాల్గా పాక్ తరపున 116 టి20లు ఆడిన మాలిక్ 2335 పరుగులు సాధించాడు. చదవండి: Babar Azam: మా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది.. ఇమ్రాన్తో మాట్లాడాము -
2007 టి20 వరల్డ్కప్ ఫైనల్ గుర్తుందిగా.. తాజాగా ముగ్గురు మాత్రమే
T20 WC 2021... 2007 టి 20 ప్రపంచకప్ జరిగి దాదాపు 14 సంవత్సరాలు కావొస్తుంది. ఆ వరల్డ్కప్లో టీమిండియా ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై చారిత్రక విజయం సాధించి తొలి టి20 వరల్డ్ చాంపియన్గా నిలిచింది. ఇక తాజాగా 2021 టి20 ప్రపంచకప్లో టీమిండియా పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్, టీమిండియా జట్టులో ఉన్న ఆటగాళ్లలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఆడనున్నారు. అందులో టీమిండియా నుంచి రోహిత్ శర్మ ఉంటే.. పాకిస్తాన్ నుంచి మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్లు మాత్రమే ప్రస్తుతం జట్టులో ఉన్నారు. టీమిండియా- పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 24న మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మరోసారి ఈ ముగ్గురి గురించి చర్చించుకుందాం. చదవండి: T20 WC 2021: చరిత్ర సృష్టించిన నమీబియా; ఆటగాళ్ల సంబరం మాములుగా లేదు రోహిత్ శర్మ: 14 సంవత్సరాల తర్వాత రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియాకు వైస్ కెప్టెన్గా.. స్టార్ ఓపెనర్గా ఉన్నాడు. వాస్తవానికి రోహిత్ శర్మ టి20ల్లో అరంగేట్రం చేసింది 2007 టి20 ప్రపంచకప్ ద్వారానే. అప్పటికి రోహిత్కు పెద్దగా అనుభవం లేదు. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో యువరాజ్, ధోనిలు ఔటైన తర్వాత ఆరో స్థానంలో వచ్చిన రోహిత్ 16 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. టీమిండియా 157 పరుగులు చేయడంలో రోహిత్ పాత్ర కూడా ఉంది. అతని ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించడంలో రోహిత్ది కూడా కీలకపాత్ర. మరి ఆదివారం పాక్తో జరగనున్న మ్యాచ్లో రోహిత్ శర్మ మెరుపులు చూస్తామా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మహ్మద్ హఫీజ్: పాకిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఓపెనింగ్ స్థానంలో ఆడాడు. ఆ మ్యాచ్లో ఆర్పీ సింగ్ బౌలింగ్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అంతకముందు బౌలింగ్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు ఓవర్లు వేసిన హఫీజ్ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ 14 సంవత్సరాలు గడిచేసరికి హఫీజ్ పాక్ జట్టులో కీలక బ్యాట్స్మన్గా ఎదిగాడు. మరి ఆదివారం జరగబోయే మ్యాచ్లో హఫీజ్ ప్రభావం చూపిస్తాడా అనేది వేచి చూడాలి. షోయబ్ మాలిక్: 2007 టి20 ప్రపంచకప్కు పాకిస్తాన్ కెప్టెన్గా షోయబ్ మాలిక్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జట్టును విజయవంతంగా ఫైనల్ చేర్చిన అతను టీమిండియాతో జరిగిన ఫైనల్లో మాత్రం విఫలమయ్యాడు. బ్యాటింగ్లో 17 బంతులాడి పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక బౌలింగ్లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. 14 సంవత్సరాలు గడిచేసరికి షోయబ్ మాలిక్ పాక్ టి20 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వాస్తవానికి ముందు ప్రకటించిన జట్టులో షోయబ్ మాలిక్ పేరు లేదు. చివరి నిమిషంలో సోహైబ్ మక్సూద్ గాయంతో వైదొలగొడంతో కెప్టెన్ నిర్ణయం మేరకు షోయబ్ను జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృశ్యా మాలిక్కు చోటు దక్కడం కష్టంగానే ఉన్నప్పటికి కెప్టెన్ బాబర్ మద్దతు ఉండడంతో టీమిండియాతో మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. చదవండి: T20 World Cup 2021: పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ అత్యంత చెత్త రికార్డు -
కెప్టెన్ చెప్పిన వాళ్లను ఎంపిక చేయరు.. మా పద్దతి అదే
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. తాజాగా సౌతాఫ్రికా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సిరీసుల్లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కోరుకున్నట్లుగా జట్టును ఎంపిక చేయలేదని ఆ జట్టు సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు. '' కెప్టెన్ బాబర్ అడిగిన చాలా మంది ఆటగాళ్లను ఇటీవలి దక్షిణాఫ్రికా, జింబాబ్వే సిరీసులకు తీసుకోలేదు. తమ వద్ద నచ్చడం.. నచ్చకపోవడం అనే పద్దతి ఉంది. సెలక్షన్ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాలకు విలువ ఉన్నా తుది నిర్ణయం తీసుకోవాల్సింది కెప్టెనే. ఇంకోవిషయం ఏంటంటే ఆటగాళ్ల ఎంపికలో పక్షపాత ధోరణి నడుస్తుంది. ఇది సరైనది కాదు.. పీఎస్ఎల్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి. కనీసం రెండు సీజన్ల పాటు అందులో ఆడే ఆటగాళ్లను పరిశీలించి అప్పుడు జట్టులోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని ఇలా బయటపెట్టడం వల్ల నాకే నష్టం జరిగినా పరవాలేదు. నన్ను మళ్లీ టీ20ల్లో ఆడనివ్వకపోయినా నేనేమి బాధపడను. నేను ఇప్పటివరకు ఎంతోమంది కెప్టెన్లతో ఆడాను. వకార్ యూనిస్, వసీమ్ అక్రమ్, ఇంజమామ్, అఫ్రిది లాంటి దిగ్గజాలతో ఆడాను. కెప్టెన్గా ఉండాలంటూ ఇతరులను కాకా పట్టడం చేయొద్దు. అలా చేయకుండా ఉంటే తప్పకుండా గొప్ప కెప్టెన్గా మిగిలిపోతారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు' -
పండుగ నాడు ఫొటోల కోసం సానియా మీర్జా తంటాలు
భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్తో కలిసి రంజాన్ పర్వదిన వేడుక చేసుకుంది. ఈ సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంది. ‘ఫొటోలు దిగేప్పుడు ఎన్ని కష్టాలో’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంటూ ఐదు ఫొటోలు పంచుకుంది. ఆ ఫొటోలను చూస్తే మొదటి ఫొటో బాగానే రాగా.. మిగతా నాలుగు ఫొటోలు బ్లర్ కావడం.. షేక్ అవడం వంటివి జరిగాయి. దీంతో ఆ ఫొటోలు సక్రమంగా రాలేదు. ఇదే విషయాన్ని ఆమె ఇన్స్టా వేదికగా చెప్పింది. అనంతరం తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్తో కలిసి సముద్రపు ఒడ్డున సరదాగా నడయాడుతున్న ఫొటోలను కూడా సానియా మీర్జా పంచుకుంది. దీంతో పాటు ట్విటర్లో కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత తక్కువ మంది ప్రార్థనల్లో పాల్గొనండి. ఈ భారం నుంచి అల్లా ఈ భూమిని రక్షిస్తాడు’ అని కరోనా మహమ్మారి విషయమై పేర్కొంది. ప్రస్తుతం టోక్యో ఒలంపిక్స్ కోసం సానియా మీర్జా సిద్ధమవుతోంది. నాలుగేళ్ల తర్వాత ఒలంపిక్స్లో పాల్గొననున్నది. చదవండి: టోక్యో ఒలింపిక్ప్కు సానియా మీర్జా అర్హత View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
భర్తకు సానియా వెరైటీ బర్త్డే విషెస్
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నేడు 39 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, భారత టెన్నిస్ స్టార్ సానీయా మీర్జా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. "ఎవరు లేకపోతే నేను బతకలేనో అతడికి హ్యాప్ బర్త్డే. నీకు రోజులు, నెలలు, ఈ సంవత్సరమంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్య విషయమేంటంటే నువ్వు ప్రాక్టీస్కు వెళ్లి వచ్చిన తర్వాత ఇదంతా చెప్తాను. ఇంతకీ ఇది బర్త్డే విషెసేనా?, కాదంటావా? ఇదంతా పోనీ కానీ, ఐ లవ్ యూ" అని రాసుకొచ్చింది. దీనికి భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. (చదవండి: కరోనా : సానియా మీర్జా భావోద్వేగం) కాగా అభిమానుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010 ఏప్రిల్ 12న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2018లో ఇజ్జాన్ జన్మించాడు. ఇదిలా వుంటే ఈ మధ్యే సానియా కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె జనవరి 19న సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తనకు స్వల్పంగా కోవిడ్-19 లక్షణాలున్నాయని పేర్కొంది. ఈ సమయంలో తన ఫ్యామిలీకి, ముఖ్యంగా తన రెండేళ్ల చిన్నారికి దూరంగా ఉండటం భయంకరంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కరోనాను అసలు జోక్గా తీసుకోవద్దని సూచిస్తూ సుదీర్ఘ పోస్ట్ను షేర్ చేసింది. (చదవండి: భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు మరో గెలుపు) View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
ట్రక్కును ఢీకొట్టిన షోయబ్ మాలిక్ కారు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ కారు అదుపుతప్పింది. లాహోర్లో జాతీయ రహదారికి సమీపంలోని ఓ రెస్టారెంటు వద్ద ఆగి ఉన్న ట్రక్కును ఆదివారం ఢీకొట్టింది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)- 2021 టీర్నీకి సంబంధించిన సన్నాహకాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై తిరిగి వస్తున్న అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో తాను స్వల్ప గాయాలతో బయటపడినట్లు షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు... ‘‘రోడ్డు ప్రమాదం జరిగింది. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. కానీ భగవంతుడి దయ వల్ల అంతా సవ్యంగానే ఉంది. నాకోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ప్రేమకు నేను కృతజ్ఞుడినై ఉంటాను’’ అని షోయబ్ ట్వీట్ చేశారు. కాగా సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ఏప్రిల్ 12, 2008న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు.(చదవండి: 'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం' ) ఇక షోయబ్ కెరీర్ విషయానికొస్తే.. పాకిస్తాన్ తరఫున 35 టెస్టులు, 287 వన్డేలు, 116 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇక ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన తనకు లేదని ఇటీవలే వెల్లడించిన అతడు.. పీఎస్ఎల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 20- మార్చి 22 వరకు కరాచీలో ఈ టోర్నీ నిర్వహించనున్నారు. కరాజీ కింగ్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. - "I am perfectly all right everybody. It was just a happenstance accident and Almighty has been extremely Benevolent. Thank you to each one of you who've reached out. I am deeply grateful for all the love and care..." ~ Shoaib Malik — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 10, 2021 -
షోయబ్ మాలిక్కు ఉద్వాసన
కరాచీ: న్యూజిలాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్తోపాటు పేసర్ మొహమ్మద్ అమీర్కు చోటు దక్కలేదు. కేవలం టి20 క్రికెట్ మాత్రమే ఆడుతోన్న 38 ఏళ్ల మాలిక్ను తాజాగా ముగిసిన జింబాబ్వే సిరీస్కు కూడా పక్కనబెట్టారు. తాజా పరిణామంతో అతను వచ్చే ఏడాది భారత్లో జరుగనున్న టి20 వరల్డ్కప్లో పాల్గొనేది అనుమానంగా మారింది. పాక్, న్యూజిలాండ్ జట్ల మధ్య డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో 3 టి20 మ్యాచ్లు... మౌంట్ మాంగనీ (డిసెంబర్ 26–30), క్రైస్ట్చర్చ్ (జనవరి 3–7) వేదికల్లో రెండు టెస్టులు జరుగుతాయి. -
పాక్ సీనియర్ ఆటగాళ్లపై వేటు
కరాచీ: కొంత కాలంగా పేలవ ఫామ్తో జట్టుకు భారంగా తయారైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథులు షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్లతోపాటు పేసర్ మొహ్మమ్మద్ అమీర్పై వేటు పడింది. జింబాబ్వేతో ఆరంభమయ్యే వన్డే, టి20 సిరీస్ల కోసం 22 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టులో వీరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చోటు కల్పించలేదు. అయితే ఇటీవల ముగిసిన దేశవాళీ టి20 లీగ్ నేషనల్ టి20 కప్లో రాణించిన సెంట్రల్ పంజాబ్ జట్టు యువ ఆటగాడు అబ్దుల్లా షఫీక్కు మొదటిసారి సీనియర్ జట్టులో స్థానం లభించింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోని పేస్ ద్వయం హసన్ అలీ, నసీమ్ షా పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. కెప్టెన్గా బాబర్ ఆజమ్ను నియమించిన పీసీబీ... వైస్ కెప్టెన్గా షాదాబ్ ఖాన్ను నియమించింది. పాక్, జింబాబ్వే మధ్య తొలి వన్డే ఈనెల 30న జరగనుండగా... నవంబర్ 1, 3వ తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం నవంబర్ 7, 8, 10వ తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. మా వీసాల అంశాన్ని ఐసీసీ చూస్తుంది భారత్లో ఆడేందుకు తలెత్తే వీసా ఇబ్బందులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చూసుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. వచ్చే ఏడాది అక్టోబర్లో భారత్లో టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వీసాల బాధ్యత పూర్తిగా ఐసీసీదేనని పీసీబీ సీఈఓ వసీమ్ ఖాన్ తెలిపారు. ఐసీసీ ఈ అంశంపై తమకు హామీ ఇవ్వాలని ఆయన చెప్పారు. అయితే దేనికైనా నిర్దిష్ట గడువు అంటూ ఉండాలని వచ్చే జనవరిదాకా ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు చెప్పారు. చిరకాల ప్రత్యర్థుల మధ్య సమీప భవిష్యత్తులో ముఖాముఖి టోర్నీలు జరుగుతాయన్న ఆశలేవీ లేవని ఆయన చెప్పారు. -
తొలి ఆసియన్ క్రికెటర్గా రికార్డు
కరాచీ: పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అరుదైన మైలురాయిని నమోదు చేశాడు. టీ 20 క్రికెట్లో పదివేల పరుగుల్ని పూర్తి చేసుకున్న క్రికెటర్ల జాబితాలో నిలిచాడు. కాగా, ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్ క్రికెటర్గా మాలిక్ రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ నేషనల్ టీ20 కప్లో భాగంగా కైబర్ పఖ్తున్క్వా జట్టు తరఫున ఆడుతున్న మాలిక్.. శనివారం బాలోచిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. ఆ మ్యాచ్లో 44బంతుల్లో 77 పరుగులు సాధించిన మాలిక్.. పదివేల టీ20 పరుగుల్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మాలిక్ 395 టీ20 మ్యాచ్ల్లో 10,027 పరుగులతో ఉన్నాడు. (ఆ ఇద్దరి కెప్టెన్లకు థాంక్స్: దినేశ్ కార్తీక్) ఇక ఓవరాల్గా ఈ జాబితాలో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ 13, 296 పరుగులతో టాప్లో ఉన్నాడు. 404 టీ20 మ్యాచ్ల్లో గేల్ ఈ రికార్డు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో మరొక వెస్టిండీస్ స్టార్ పొలార్డ్ ఉన్నాడు. 518 టీ20 మ్యాచ్ల్లో 10, 370 పరుగుల్ని నమోదు చేశాడు. ఆ తర్వాత స్థానంలో మాలిక్ నిలిచాడు. కాగా,ఆసియా నుంచి ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్గా మాలిక్ గుర్తింపు పొందాడు. అయితే పాకిస్తాన్ తరఫున 116 టీ20 మ్యాచ్లు ఆడిన మాలిక్.. 2,335 పరుగులు సాధించగా, మిగతా పరుగుల్ని వేర్వేరు ఫ్రాంచైజీలకు క్రికెట్ ఆడుతూ సాధించాడు. -
'స్నేహం పక్కన పెట్టి ఆడితే బాగుంటుంది'
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా పాక్ జట్టు వన్డే కెప్టెన్ బాబర్ అజామ్ తో పాటు టీమ్ మేనేజ్మెంట్ను తప్పుబడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. 40 ఏళ్ల వయసుకు దగ్గర్లో ఉన్న మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్లను టీ20 క్రికెట్లో ఇంకా ఎందుకు ఆడిస్తున్నారంటూ చురకలంటించాడు. అసలు పాక్ సెలెక్షన్ టీమ్కు సరైన ప్రణాళిక లేదని.. అందుకే వయసుమీద పడ్డవారిని ఆడిస్తున్నారని ఎద్దేవా చేశాడు. టీ20 అంటేనే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహించాలి. కానీ కెప్టెన్గా బాబర్తో పాటు టీమ్ మేనేజ్మెంట్ అలా ఆలోచించడం లేదని... స్నేహం పేరుతో యువకులకు అవకాశం ఇవ్వడం లేదంటూ విమర్శించాడు. (చదవండి : పృథ్వీ షా.. నీ ప్రతిభ అమోఘం) 'కెప్టెన్గా బాబర్ అజామ్ తప్పు చేస్తున్నాడు. టీ20 అనేది యువ ఆటగాళ్లను దృష్ఠిలో పెట్టుకొని రూపొందించింది. కానీ బాబార్ జట్టు మేనేజ్మెంట్తో కలిసి 40 ఏళ్లకు దగ్గరలో ఉన్న హఫీజ్, మాలిక్లను ట20 జట్టుకు ఎంపిక చేయించాడు. ఇది కరెక్ట్ కాదు.. హఫీజ్, మాలిక్లు ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లే.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. టీ20 జట్టులో ఈ ఇద్దరు పనికిరారు. రాబోయే రెండేళ్లలో రెంటు టీ20 ప్రపంచకప్లు ఆడనున్న పాక్ జట్టులో కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తే బాగుంటుంది. బాబర్ అజామ్ స్నేహం అనే పదాన్ని పక్కనపెడితే బాగుంటుంది. అయినా కెప్టెన్తో పాటు జట్టును ఎంపిక చేసే సెలక్షన్ టీమ్ ధోరణి సరిగా లేదు.జట్టులో ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తుండాలి. (చదవండి : ‘ఆ బౌలర్తో బ్యాట్స్మెన్కు చుక్కలే’) మా సమయంలో ఇలా ఉండేది కాదు.. ఇమ్రాన్ కొత్తగా కెప్టెన్ అయిన సమయంలో మార్పు పేరుతో ఐదు నుంచి ఆరు మంది సీనియర్ ఆటగాళ్లను వన్డే జట్టులో నుంచి తప్పించాం. కేవలం స్థిరంగా ఆడుతున్న జావేద్ మియాందాద్ లాంటి ఆటగాడిని మాత్రమే కొనసాగించాం. యువ ఆటగాళ్లతో నిండిన పాక్ జట్టు 1992లో ప్రపంచకప్ సాధించేవరకు వెళ్లగలిగింది. ఇప్పుడు మాత్రం జట్టు మేనేజ్మెంట్ అలా కనిపించడం లేదు. ఎప్పుడైనా ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే ఆటగాళ్ల ఎంపిక జరగాలి.. భవిష్యత్తుకు కూడా అదే మంచిది.' అంటూ రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. -
బాబాయ్ ఫోర్ కొడితే.. బాబా సిక్సర్ బాదుతాడు
లాక్డౌన్లో భాగంగా పలువురు క్రీడా ప్రముఖులు ఇంటికే పరిమితమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు చేరువవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సానియా మీర్జా తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా సానియా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్తో కలిసి సరదాగా చేసిన ఓ సంభాషణకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ‘బాబాయ్ (అసద్) 4 బౌండరీ కొడితే.. బాబా (షోయబ్ మాలిక్) సిక్సర్ కొడతారు’ అని సానియా కామెంట్ జతచేశారు. (‘ఆ పది మంది’ లేకుండా...) ఇక ఈ సంభాషణలో.. సానియా తన కుమారుడితో మాట్లాడుతూ.. కుక్క ఎలా అరుస్తుంది బేబీ అని అడిగితే.. చిన్నారి ఇజాన్ బౌబౌ అంటూ డాగ్లా అనుకరిస్తూ సమాధానం ఇస్తాడు. ఇక అసద్ బాబాయ్ (అసద్) ఏం చేస్తారని అడుగుతూనే.. అసద్ ఫోర్ కొడతారని బదులు ఇస్తారు సానియా. అదే విధంగా బాబా (మాలిక్) ఏం చేస్తారని అడుగుతూ.. బాబా సిక్సర్ బాదుతారని తన కూమారుడితో సానియా సరదాగా సంభాషిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లతో పాటు పలువురు క్రీడా ప్రముఖలు లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇప్పటికే 1.7 లక్షల మంది లైక్ చేశారు. అక్టోబర్ 30, 2018న సానియా ఇజాన్ మీర్జా మాలిక్కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram Asad khaalu hits a 4 but Baba hits a 6 😏 he might be a bit biased 💕 🤣@izhaan.mirzamalik #Myizzy A post shared by Sania Mirza (@mirzasaniar) on Jun 27, 2020 at 11:34pm PDT -
పాక్ జట్టులో 10 మందికి కరోనా పాజిటివ్
లాహోర్ : ఎప్పుడు వివాదాలతో సతమతమయ్యే పాక్ క్రికెట్ జట్టుకు కరోనా సెగ తగిలింది. జట్టులోని ఆటగాళ్లంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే జట్టులోని ముగ్గరు ఆటగాళ్లకు కరోనా సోకగా తాజాగా మరో ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్గా తేలింది. సోమవారం పాక్ యువ ఆటగాడు హైదర్ అలీతో పాటు షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్లు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. తాజాగా ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, వహాబ్ రియాజ్లు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. కరోనా సంక్షోభంతో భారీ విరామం తర్వాత మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాక్ క్రికెట్ జట్టుకు పెద్దదెబ్బే తగిలింది. ఈ సిరీస్ కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లకు కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు.(టెన్నిస్ స్టార్ జొకోవిచ్కు కరోనా పాజిటివ్) కాగా పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్తో పాటు పాక్ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనిస్, ఫిజియోథెరపిస్ట్ క్లిఫ్ డెకాన్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. దీంతో పీసీబీలో ఆందోళన నెలకొంది. ఇంగ్లండ్ పర్యటన కోసమే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి రావల్పిండిలో కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఒక్కొక్కరిగా 10 మందికి కరోనా సోకడంతో క్రికెటర్లంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వీరిని పీసీబీ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.('కోచ్ పదవి నాకు సవాల్గా కనిపిస్తుంది') -
సానియాతో పెళ్లి.. మాలిక్ ఏమన్నాడంటే
హైదరాబాద్: అభిమానుల నుంచి ఎంతో వ్యతిరేకత, ఎన్నో వివాదాల సమక్ష్యంలోనే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఏప్రిల్ 12, 2008న వివాహం చేసుకున్నాడు. వీరికి 2018లో ఇజ్జాన్ జన్మించిన విషయం తెలిసిందే. అయితే భారత్ పాకిస్తాన్ల మధ్య ఎలాంటి గొడవలు జరిగినా, క్రికెట్ మ్యాచ్ జరిగినా ఈ జంటను టార్గెట్ చేయడం కొంతమంది నెటిజన్లకు సాధారణంగా మారింది. అయితే తమ పెళ్లై ఏళ్లు గడుస్తున్నప్పటికీ సానియాను తాను పెళ్లి చేసుకోవడంపై వస్తున్న అనేక వార్తలపై మాలిక్ తాజాగా స్పందిస్తూ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (పీసీబీ పర్మిషన్.. భారత్కు షోయబ్!) ‘మీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు.. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేశం, రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలను పట్టించుకోకూడదు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకరికొకరు నచ్చామా? అర్థం చేసుకున్నామా? ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయా? అనే విషయాల గురించి ఆలోచించాలి. భారత్లో నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల గురించి ఆందోళన గాని బాధ గాని పడటం లేదు. ఎందుకుంటే నేను క్రికెటర్ను రాజకీయ నాయకుడిని కాదు’ అంటూ మాలిక్ పేర్కొన్నాడు. (మొర్తజాకు కరోనా పాజిటివ్) దాదాపు ఐదు నెలల తర్వాత భార్యాబిడ్డ దగ్గరికి కరోనా లాక్డౌన్ కారణంగా మాలిక్ పాకిస్తాన్లో ఉండిపోగా సానియా, ఇజ్జాన్లు హైదరాబాద్లో ఉన్నారు. దీంతో గత ఐదు నెలలుగా భార్య, బిడ్డలకు మాలిక్ దూరమయ్యాడు. ఈనేపథ్యంలో రాబోయే ఇంగ్లాండ్ సిరీస్కు షోయబ్ను పాకిస్తాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో మళ్లీ కుటుంబాన్ని కలుసుకోలేనేమోనని బాధపడిన షోయబ్ పీసీబీకి ఓ విజ్ఞప్తి చేశాడు. జట్టుతో ఆలస్యంగా చేరతానని, కొన్ని రోజులు కుటుంబంతో గడిపి వవస్తానని బోర్డును కోరాడు. దీనికి పీసీబీ కూడా అంగీకరించింది. దీంతో ఎట్టకేలకు షోయబ్ తన భార్య, బిడ్డను కలుసుకోనున్నాడు. (‘ఆ విషయంలో జడేజాను మించినోడు లేడు’) -
పీసీబీ పర్మిషన్.. భారత్కు షోయబ్!
ఇస్లామాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా కుటుంబానికి దూరమైన షోయబ్ మాలిక్ విన్నపాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మన్నించింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు హైదరాబాద్లో చిక్కుకుపోయిన భార్య, పిల్లలతో గడిపేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది. మానవతా కోణంలోనే ఈ వెసులుబాటు కల్పించినట్టు పీసీబీ చైర్మన్ వసీం ఖాన్ పేర్కొన్నారు. కాగా, ఐదు నెలల క్రితం భారత్కు వచ్చిన సానియా మీర్జా లాక్డౌన్ విధించడంతో ఇక్కడే చిక్కుకుపోయారు. ఎప్పుడూ బిజీబిజీగా గడిపే తాము లాక్డౌన్ వేళలో కూడా ఒకే దగ్గర ఉండలేక పోయినందుకు ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. (చదవండి: అప్పుడే నా మనసు ఆనందంగా ఉంటుంది: సానియా) బయో సెక్యూర్గా మ్యాచ్లు ఆగస్టు-సెప్టెంబర్లో ఇంగ్లండ్-పాక్ మధ్య మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్లతో సిరీస్లు జరుగనున్నాయి. ఇందుకోసం 28 మంది ఆటగాళ్లతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ జూన్ 28న ఇంగ్లండ్ బయల్దేరనుంది. కోవిడ్ నేపథ్యంలో ఈ మ్యాచ్లన్నీ బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు పీసీబీ తెలిపింది. పాక్ ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఇక జూలై 24న షోయబ్ జట్టుతో కలుస్తాడని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, 38 ఏళ్ల షోయబ్ టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. టీ20లో మాత్రమే అతడు కొనసాగుతున్నాడు. (చదవండి: వీడియో షేర్ చేసిన హర్భజన్.. షాకిస్తున్న ఫ్యాన్స్!) -
అది బాధిస్తుంది... భావోద్యేగంతో సానియా మీర్జా
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా లాక్డౌన్లో తన కుటుంబంతో కలిసి ఒకేదగ్గర లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సానియా తన ముద్దుల తనయుడు ఇజాన్ మిర్జా మాలిక్తో కలిసి హైదరాబాద్లోని తన తల్లిదండ్రుల ఇంట్లొ చిక్కుకుపోయారు. ఇక తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఏమో పాకిస్తాన్లోనే తన తల్లితో ఉంటున్నాడు. ఎప్పుడు బిజీగా ఉండేవారు ఈ లాక్డౌన్ వేళ కూడా ఒకే దగ్గర ఉండలేక పోయినందుకు ఆమె చింతిస్తున్నారు. (క్రికెట్ ప్లేయరా.. టెన్నిస్ ప్లేయరా?) ఈ నేపథ్యంలో ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ.. ‘కరోనా కారణంగా నేను ఇక్కడ హైదరాబాద్లో ఇజాన్తో చిక్కుకుపోయాను. షోయబ్ పాకిస్తాన్లో తన తల్లితో ఉండిపోయారు. మాకు చిన్న పిల్లాడు ఉన్నాడు. ఓ కుటుంబంగా ఈ పరిస్థితిన ఎదుర్కొవడం అంత సులభమైనది కాదు. ఇక ఇజాన్ తన తండ్రిని ఎప్పుడు చుస్తాడో తెలియదు. ఆ క్షణం వచ్చాక షోయబ్ను, ఇజాన్లను ఆపడం కష్టం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎదేమైనా ఈ విపత్కర కాలంలో షోయబ్ తన తల్లితో అక్కడ ఉండటం మంచిదైందని పేర్కొన్నారు. ‘‘షోయబ్ తల్లి 65 ఏళ్ల వృద్దురాలు. కాబట్టి తనకు ప్రస్తుతం ఒకరి సాయం అవసరం. ఎప్పుడూ తనతో ఒకరూ తనతో ఉండటం ముఖ్యం. చివరికి అది జరిగినందుకు ఆనందంగా ఉంది. షోయబ్ తనతోనే ఉన్నాడు సంతోషకరమైన విషయం. కానీ ఎప్పుడు మా కుటుంబం అంతా తిరిగి ఒకే దగ్గరికి చేరుతుందో అని ఎదురుచేస్తున్నాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (వైరల్ ట్వీట్పై సానియా మీర్జా వివరణ) అయితే ‘‘వర్చువల్ వీడియో కాల్స్ దూరాన్ని తగ్గించగలవేమో కానీ వ్యక్తిగతంగా కలవడానికి ప్రత్యామ్నాయం కాదు. నా భర్తకు నేను, ఇజాన్ తన తండ్రికి దూరంగా ఉండటం నిజంగా సులభమైనది కాదు. ఇక ఈ ప్రపంచం మళ్లీ ఎప్పటి లాగే కౌగిలించుకోవడం, కరచాలం చేసే సాధారణ పరిస్థితులకు రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీకు తెలుసా మనం ప్రేమించే వారిని హత్తుకోలేము, కలుసుకోలేము అన్న ఆలోచన ఆ క్షణం మనల్ని చచ్చిపోయేలా చేస్తుంది. ఇక మేము మహమ్మారి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని, త్వరలోనే ఈ కాలం నుంచి బయటపడి మా కుటుంబం అంతా కలుసుకోవాలని ఆశిస్తున్నాను. కుటుంబంమంతా ఒక దగ్గర చెరినప్పుడే నా మనసు ఆనందంగా ఉంటుంది. ఇక దానిని విధికే వదిలేస్తున్న’ అని భావోద్యేగానికి లోనయ్యారు. -
అతని కంటే మాలికే బెటర్: చహల్
న్యూఢిల్లీ: స్పిన్ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ మెరుగైన ఆటగాడు కాదంటూ భారత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో స్మిత్ కంటే పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలికే ఎంతో బెటర్ అని వ్యాఖ్యానించాడు. తన కోణంలో చూస్తే మాలిక్ స్పిన్ను సమర్ధవంతంగా ఎదుర్కొంటాడని చహల్ పేర్కొన్నాడు. దీనిలో భాగంగా 2018 ఆసియాకప్లో మాలిక్ తనను ఎదుర్కొన్న తీరును చహల్ గుర్తు చేసుకున్నాడు. ‘ నేను ఆసియాకప్లో మాలిక్కు బౌలింగ్ చేశా. మంచి బంతులను సైతం మాలిక్ సమర్ధవంతంగా ఆడాడు. సింగిల్స్ తీస్తూ స్టైక్ రొటేట్ చేశాడు. దాంతో నాకు అర్థమైన విషయం ఏమిటంటే మాలిక్కు క్రికెట్లో విశేష అనుభవం ఉందనేది తెలిసింది. స్పిన్ ఆడటంలో స్మిత్ కంటే మాలిక్ ఎంతో బెటర్’ అని తెలిపాడు. (ఏది నమ్మాలో అర్థం కావట్లేదు: డివిలియర్స్) ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు టాప్ ప్లేస్ కట్టబెట్టాడు. వీరిద్దరూ స్పిన్ను ఎదుర్కోవడంలో వారికి వారే సాటి అని చహల్ తెలిపాడు. స్పిన్ను ఆడటంలో కోహ్లి, రోహిత్లు గనాణ్యమైన క్రికెటర్లే అని పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ సైతం స్పిన్ను బాగా ఆడతాడని పేర్కొన్నాడు. స్పిన్ బౌలర్లను ఇరకాటంలోకి నెట్టడంలో విలియమ్సన్కు ప్రత్యేక స్థానం ఉందన్నాడు. బంతిని చాలా ఆలస్యంగా ఆడుతూ స్పిన్ బౌలర్లకు పరీక్షగా నిలుస్తాడన్నాడు. ఇదిలా ఉంచితే, చహల్ చేస్తున్న టిక్టాక్ వీడియోలకు కోహ్లి మురిసిపోతున్న సంగతి తెలిసిందే. చహల్ చేసే వీడియోలో తెగ నవ్వు తెప్పిస్తున్నాయని అన్నాడు. ఇక వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ అయితే చహల్ వీడియోలు విసుగు తెప్పిస్తున్నాయని సరదాగా ట్రోల్ చేశాడు.చహల్ నేను నీతో విసిగిపోతున్నా.. టిక్టాక్ వీడియోలతో విసిగిస్తున్నావు. అందుకే నిన్ను బ్లాక్ చేస్తున్నా.. నిన్ను బ్లాక్ చేయాలని టిక్టాక్కు కూడా చెబుతా. ఇప్పటికిప్పుడు నువ్వు సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చెయ్. ఇక జీవితంలో నిన్ను కలవద్దని, చూడకూడదని అనునుకుంటున్నా' అంటూ గేల్ ఆట పట్టించాడు. (ఆ జాబితాలో ఇండియా ఆటగాళ్లు ఒక్కరు లేరు) -
కోచ్లు వస్తారు..పోతారు: మాలిక్
లాహోర్: బంగ్లాదేశ్తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. దాదాపు ఏడాది తర్వాత తొలి టి20 ఆడుతున్న పాకిస్తాన్ బ్యాట్స్మన్ షోయబ్ మాలిక్ (45 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించడంతో... పాక్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో మాలిక్కు ఎదురైన ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చాడు. ‘ మీరు కోచ్ మిస్బావుల్ హక్ కంటే చాలా సీనియర్ ప్లేయర్ కదా.. జట్టు విజయం సాధించే బాధ్యతను భుజాలపై వేసుకోవడంతో పాటు ఎంపికలో మిస్బాను దాటి ఏమైనా పెద్దన్న పాత్ర పోషించారా? అని రిపోర్టర్ ఇబ్బందికర ప్రశ్న అడిగాడు. దీనికి మాలిక్ సమాధానమిస్తూ.. ‘నేర్చుకునే ప్రాసెస్ అనేది ఎప్పటికీ అంతం కాదు. ఎవరైనా నేర్చుకుంటూనే ముందుకు సాగుతారు. ప్రపంచంలో ఎవరినైనా చూడండి.. అంతా నేర్చుకున్న మనిషి అంటూ ఉండడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాను క్రికెట్లో మొత్తం నేర్చుకున్నానని ఏనాడైనా చెప్పాడా. లేకపోతే ఏ ఒక్కరైనా చెప్పారా.. చెప్పలేరు కదా. అంటే మనం నేర్చుకోవడం అనేది ఎప్పటికీ అంతం కాదు. చాలా మంది క్రికెటర్లు, కోచ్లు వస్తూ పోతూ ఉంటారు. నువ్వు నేర్చుకోవడం అనేది ఎప్పటికీ ఆగదు. ఎప్పుడూ కూడా ఓవర్నైట్ రిజల్ట్స్ అనేవి ఉండవు. ఇప్పుడు మా జట్టు యువ క్రికెటర్లతో నిండి ఉంది. మా వాళ్లు నేర్చుకోవడానికి సమయం పడుతుంది. సత్తాచాటుకోవడానికి కొంత సమయమైనా అవసరం. అందుకు ఓపిక పట్టాలి. మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మసాలా(వార్తలను ఉద్దేశించి) కావాలి. ప్రతీ ఒక్కరూ, ప్రతీదాంట్లో మసాలా కోరుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో దేశం కోసం కూడా ఆలోచించండి’ అని మాలిక్ బదులిచ్చాడు. (ఇక్కడ చదవండి: పాక్ను గెలిపించిన షోయబ్ మాలిక్) -
పాక్ను గెలిపించిన షోయబ్ మాలిక్
లాహోర్: అంతర్జాతీయ టి20ల్లో ఎదురవుతోన్న వరుస పరాజయాలకు పాకిస్తాన్ ఫుల్స్టాప్ పెట్టింది. బంగ్లాదేశ్తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (39; 4 ఫోర్లు, సిక్స్), మొహమ్మద్ నైమ్ (43; 3 ఫోర్లు, 2 సిక్స్లు) తప్ప మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. అనంతరం ఛేదనకు దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. పునరాగమనంలో తొలి టి20 ఆడుతున్న పాకిస్తాన్ బ్యాట్స్మన్ షోయబ్ మాలిక్ (45 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించడంతో... పాక్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. మాలిక్ చివరి టి20ని 2019 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ తరఫున హసన్ అలీ, హరీస్ రౌఫ్లు టి20ల్లో అరంగేట్రం చేశారు. మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా రెండో టి20 ఇక్కడే నేడు జరుగుతుంది. -
వావ్ ఇట్స్ అమేజింగ్.. మాలిక్ వచ్చేశాడు!
పాకిస్తాన్ మాజీ సారథి, ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ అనూహ్యంగా పాకిస్తాన్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో తలపడబోయే పాకిస్తాన్ జట్టును ఆ దేశ సెలక్లర్లు ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన పాక్ జట్టులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. అంతేకాకుండా అన్క్యాప్డ్ ప్లేయర్స్ హారిస్ రౌఫ్, అహ్సన్ అలీలను కూడా ఎంపిక చేశారు. అయితే సీనియర్ బౌలర్లు మహ్మద్ అమిర్, వాహబ్ రియాజ్లను జట్టు నుంచి తప్పించడం గమనార్హం. గత కొంత కాలంగా ఫామ్లో లేక తంటాలు పడుతున్న మాలిక్ పాక్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలోనే వన్డేలకు గుడ్బై చెప్పిన మాలిక్ టీ20ల్లో కొనసాగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ను గాడిన పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని, దీనిలో భాగంగానే జట్టులో మార్పులు చేపట్టామని ఆ దేశ ప్రధాన కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ పేర్కొన్నాడు. తామి ఆడిని చివరి 9 టీ20 సిరీస్ల్లో 8 ఓడిపోయామని గుర్తు చేసిన ఆయన ఇక ఓటముల పరంపరకు చెక్ పెట్టబోతున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆసియా కప్, ప్రపంచకప్ గెలిచే పాక్ జట్టును తయారు చేస్తున్నామన్నాడు. మాలిక్, హపీజ్లు తమ అనుభవంతో పాక్ జట్టుకు పునర్వైభవం తీసుకొస్తారనే ధీమా వ్యక్తం చేశాడు. ఇక మాలిక్ ఎంపిక పట్ల పాక్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురువుతున్నారు. ‘ఏంటి మాలిక్ను ఎంపిక చేశారా?’, ‘వావ్ ఇట్స్ అమేజింగ్.. మాలిక్ పాక్ జట్టులోకి వచ్చాడా!’అంటూ పాక్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ టీ20 జట్టు: బాబర్ అజమ్(సారథి), అహ్సన్ అలీ, అమద్ బట్, హారీస్ రౌఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీమ్, కౌష్దిల్ షా, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, ముసా ఖాన్, షాదాబ్ ఖాన్, షహీన్ షా ఆఫ్రిది, షోయబ్ మాలిక్, ఉస్మాన్ ఖాదిర్. -
పాక్ బుద్ధి చూపించిన సానియా భర్త
హైదరాబాద్: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరోసారి తన బుద్ధి చూపించుకున్నాడు. భారత్ అంటే అక్కసు వెల్లగక్కే పాక్ నేతలు, క్రికెటర్లు మరోసారి తమ దుర్బుద్దిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. తాజాగా మాలిక్ క్రిస్మస్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ‘మేరీ క్రిస్మస్ దోస్తోం.. వెరీ హ్యాపీ డిసెంబర్ 25’ అంటూ ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటోలో మాలిక్ విజయం సాధించిన సంతోషంలో సంకేతాన్నిచ్చాడు. మరోఎండ్లో నిరాశగా వెనుదిరిగుతున్న ధోనీ ఫొటో ఉంది. దీంతో భారత ఫ్యాన్స్కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే మాలిక్ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. 2012, డిసెంబర్ 25న టీమిండియా-పాకిస్తాన్ల మధ్య జరిగిన తొలి టీ20లో పాక్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో మాలిక్ ఆర్ధసెంచరీతో రాణించి పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే విజయానంతరం భారత ఆటగాళ్లను గేలి చేస్తూ మాలిక్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అప్పట్లో మాలిక్ ప్రవర్తనపై బహిరంగ విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ మ్యాచ్కు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ తన అహంకారాన్ని ప్రదర్శించాడు. ఇక మాలిక్ షేర్ చేసిన ఫోటోతో ఆగ్రహించిన నెటిజన్లు ధీటుగా బదులిస్తున్నారు. తాజా ప్రపంచకప్లో మాలిక్ డకౌటైన ఫోటో, రోహిత్ కాళ్ల ముందు మాలిక్ పడిపోయిన ఫోటో, మాలిక్ను ధోని స్టంపౌట్ చేస్తున్న ఫోటోలను రిట్వీట్ చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీటితో పాటు ఆసియా కప్లో పాక్ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించిన విషయాన్ని కూడా కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అసందర్భమైన సమయంలో వేలు పెట్టి కంపు కంపు చేసుకున్నాడని కొందరు, అత్యుత్సాహం అన్ని వేళలా పనికిరాదని మరి కొందరు మాలిక్కు సూచిస్తున్నారు. Merry Christmas dosto 🙏🏼 and a very happy 25th December 💥 pic.twitter.com/imtosyKgJU — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) December 25, 2019 Merry christmas bro pic.twitter.com/4rFISSkdkY — Aryan (@Aryann45_) December 25, 2019 Belated Merry Christmas dosto 🙏🏼 and a very happy 26th December 💥 @realshoaibmalik https://t.co/LyveuUo0GK pic.twitter.com/Ci0CPpS6Eh — Unemployed Marwadi 🇮🇳 (@Muaaaahrwadi) December 26, 2019 చదవండి: మా తొలి పరిచయం అలా: సానియా మీర్జా సానియాతో స్టెప్పులేసిన రామ్చరణ్ -
మా తొలి పరిచయం అలా: సానియా మీర్జా
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లి అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్తో ఆమె ప్రేమ, పెళ్లి అప్పట్లో రెండు దేశాల్లో చర్చనీయాంశమైంది. అయితే తాజాగా శనివారం జరిగిన ఇండియా టుడే ఇన్స్పిరేషన్ కార్యక్రమంలో షోయబ్తో తన తొలి పరిచయం గురించి సానియా మీర్జా గుర్తు చేసుకుంది. ఆ్రస్టేలియాలోని హోబర్ట్లోని ఒక రెస్టారెంట్లో తొలిసారి షోయబ్ను కలిశానని చెప్పుకొచ్చింది. ‘క్రీడాకారులుగా మేమిద్దరం ఒకరికొకరం తెలుసు. కానీ తొలిసారి షోయబ్ను హోబర్ట్లోని ఒక రెస్టారెంట్లో సాయంత్రం 6 గంటల సమయంలో కలిశాను. అప్పుడు అక్కడ ఎవరూ లేరు. మా ఇద్దరినీ విధి కలిపిందని అప్పట్లో నేను గట్టిగా నమ్మేదాన్ని. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే నేను అక్కడ ఉన్నానని తెలుసుకొని షోయబ్ ప్రణాళిక ప్రకారం నా దగ్గరికి వచ్చారు. ఇదంతా అతని ప్లాన్ అని ఆలస్యంగా తెలుసుకున్నా’ అంటూ సానియా నవ్వులు చిందించింది. 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్లో సానియా, షోయబ్ మాలిక్ వివాహం జరిగింది. -
టీ20 చరిత్రలో నాల్గో బ్యాట్స్మన్గా..
గయానా: పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో గయానా అమెజాన్ వారియర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మాలిక్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-1లో అమెజాన్ వారియర్స్.. బార్బోడాస్ ట్రిడెంట్స్పై గెలిచి ఫైనల్కు చేరింది. బ్రాండన్ కింగ్(132 నాటౌట్72 బంతుల్లో 10 ఫోర్లు, 11 సిక్సర్లు) శుభారంభాన్ని ఇవ్వగా, ఆ తర్వాత చంద్రపాల్ మహరాజ్(27) సమయోచితంగా ఆడాడు. ఆపై మాలిక్ 19 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేయడంతో అమెజాన్ వారియర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఇక బార్బోడాస్ 188 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి పాలైంది. కాగా, నిన్నటి మ్యాచ్ ద్వారా షోయబ్ మాలిక్ తొమ్మిది వేల టీ20 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 9,014 పరుగులతో ఉన్న మాలిక్.. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన నాల్గో బ్యాట్స్మన్గా నిలిచాడు. అంతకుముందు తొమ్మిదివేల పరుగుల్ని పూర్తి చేసుకున్న జాబితాలో క్రిస్ గేల్(13,051) అగ్రస్థానంలో ఉండగా మెకల్లమ్(9,922) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పొలార్డ్(9,757) పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో మాలిక్ నిలిచాడు.