tenth exams
-
10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 51 ఏళ్ల మహిళ
అన్నానగర్(చెన్నై): కరూర్లో 41 ఏళ్ల మహిళ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. వివరాలు.. కరూర్ జిల్లా కృష్ణరాయపురం ప్రాంతానికి చెందిన రహీలా భాను (51). ఈమె పూవంబాడి పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో వంటపని చేస్తోంది. 1989లో 9వ తరగతి పూర్తి చేసిన ఈమె కుటుంబ పరిస్థితుల కారణంగా పాఠశాలకు వెళ్లలేదు. ఈ క్రమంలో 10వ తరగతి ఉత్తీర్ణులైతేనే న్యూట్రిషన్ ఆర్గనైజర్ పోస్టుకు అర్హత సాధించే అవకాశం ఉన్నందున 10వ తరగతి పరీక్షలు హాజరు కావాలని నిర్ణయించుకుని గత ఏప్రిల్లో జరిగిన 10వ తరగతి సాధారణ పరీక్షలకు ప్రత్యేక అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంది. ఈమె ఇంగ్లీషు, సోషల్సైన్స్లో ఉత్తీర్ణత సాధించింది. ఆపై తాను ఉత్తీర్ణత సాధించని తమిళం, గణితం, సైన్స్ సబ్జెక్టులకు జూన్లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు చేసిపరీక్ష రాసింది. ఈ క్రమంలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో రహీలా భాను తమిళం, గణితం, సైన్స్ సబ్టెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారు. చదవండి Cockroach Found In IRCTC Meals: వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం.. -
టెన్త్ పేపర్ లీక్ కేసు.. డిబార్ అయిన విద్యార్థికి ఊరట
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పేపర్ లీకేజీ ఆరోపణలతో డిబార్ అయిన టెన్త్ విద్యార్థి హరీష్కు ఊరట లభించింది. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది కాగా హన్మకొండ జిల్లా కమలాపూర్లో హిందీ పేపర్ లీక్ చేసిన ఆరోపణలతో అధికారులు హరీష్ను డిబార్ చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కొడుకు హరీష్ హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్ లాక్కున్నారని తెలిపారు. కమలాపూర్లో నమోదైన ఎఫ్ఐఆర్లో కూడా హరీష్ పేరు ఎక్కడా లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినా అధికారులు శుక్రవారం నాటి పరీక్షను రాసేందుకు అనుమంతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును రాజకీయాలకు బలి చేశారని ఆరోపిస్తూ.. హరీష్ను టెన్త్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. విద్యార్థిని మిగతా పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని అధికారులను ఆదేశించింది. చదవండి: టెన్త్ పేపర్ లీక్ కేసు.. ఎగ్జామ్ సెంటర్లో జరిగింది ఇదేనా..? -
హిందీ‘టెన్’షన్
సాక్షిప్రతినిధి, వరంగల్: టెన్త్ హిందీ ప్రశ్నపత్రం కూడా అవుటైంది. టెన్త్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే తాండూరులో తెలుగు ప్రశ్నపత్రం లీకవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కాగా.. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే, రెండోరోజే హిందీ పేపర్ కూడా బయటకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. మంగళవారం పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాట్సాప్ గ్రూపులలో హిందీ ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టడం ప్రారంభమయ్యింది. ఈ మేరకు అందిన సమాచారంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే ఉమ్మడి వరంగల్ కలెక్టర్లు, పోలీసు కమిషనర్, ఎస్పీలు, డీఈవోలతో మాట్లాడారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు సోషల్ మీడియాలో వైరలైన పోస్టింగ్ల ఆధారంగా దర్యాప్తు జరిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చినట్లు తేల్చారు. ఓ మైనర్ బాలుడితో పాటు నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురుని అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. కమలాపూర్ మండలానికి చెందిన ఓ బాలుడు (16) తన స్నేహితుడికి చిట్టీలు అందించడం కోసం ఈ పని చేశాడని, దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి పరీక్ష రాసే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసేలా ç‘పేపర్ లీక్’ అంటూ ప్రచారం చేశారని చెప్పారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గోడెక్కి ఫొటో తీసి.. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష రాస్తున్న తన మిత్రుడికి సహాయం చేసేందుకు కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రంలోని చెట్టు సహాయంతో గోడెక్కాడు. మొదటి అంతస్తులోని మూడవ సంబర్ గది కిటికి పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకుని తన సెల్ఫోన్లో 9.45కు ఫొటో తీశాడు. 9.46కు మౌటం శివ గణేష్కు వాట్సాప్లో పంపాడు. మౌటం శివ గణేష్ ఉదయం 9.59 గంటలకు తన సెల్ఫోన్ ద్వారా 31 మంది సభ్యులున్న ఎస్సెస్సీ 2019–20 అనే వాట్సాప్ గ్రూపులో ఫార్వర్డు చేశాడు. ఆ గ్రూపులో ఉన్న గుండెబోయిన మహేశ్ అనే మాజీ రిపోర్టర్ (పస్తుతం కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్) దూడం ప్రశాంత్ (మాజీ జర్నలిస్టు)కు పంపించాడు. అతను ‘బ్రేకింగ్ న్యూస్.. రెండోరోజు పదో తరగతి పేపర్ లీక్..’ అంటూ 10.46 కల్లా హిందీ ప్రశ్నపత్రం ఓ జర్నలిస్టుల గ్రూపుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి, మరో 110 మందికి పోస్టు చేశాడు. చివరికిది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఎక్కడినుంచి పేపర్ లీకయ్యిందో స్పష్టత లేకపోవడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. సైబర్క్రైం పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయమై ఆరా తీశారు. తీగలాగితే డొంక కదిలినట్లు ఒకరి తర్వాత మరొకరికి పోస్టయిన విషయం వెలుగులోకి వచ్చింది. అందరికీ నోటీసులు ఇస్తాం: సీపీ బాలుడితో పాటు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని, మైనర్ను జువైనల్ హోంకు, శివ గణేష్, ప్రశాంత్ను రిమాండ్కు పంపినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. మహేశ్ పరారీలో ఉన్నాడని, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తామని తెలిపారు. ఎప్పుడైనా పరీక్షకు ముందే పేపర్ బయటకు వస్తే దాన్ని లీక్ అంటామని.. పరీక్ష కేంద్రంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చాక బయటకు వస్తే కాపీయింగ్ అంటామని కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇలావుండగా పేపర్ అవుట్ కలకలం సృష్టించడంతో స్నేహితుడి కోసం బాలుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. -
టెన్త్ పేపర్ అవుట్
సాక్షి, హైదరాబాద్/ వికారాబాద్/ తాండూరు: టెన్త్ పరీక్షల తొలిరోజు.. పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. ఓ పాఠశాలలోని ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా మరో పాఠశాలలోని టీచర్కు పంపాడు. అతను ఇతర గ్రూపులకు పంపడంతో విషయం వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దరు ఉపాధ్యాయులు సహా నలుగురిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రైవేట్ స్కూళ్ల పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు విద్యాశాఖ ఆదేశించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, వికారాబాద్ కలెక్టర్ వివరాలు వెల్లడించారు. అసలేం జరిగింది? పదవ తరగతి పరీక్షలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు తెలుగు పరీక్ష కోసం విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9.30 నుంచి 12.30 గంటల వరకు జరిగే పరీక్ష కోసం 9.30కి ఇన్విజిలేటర్లు వారికి ప్రశ్నపత్రాలు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల–1లోని 5వ నంబర్ పరీక్ష హాల్లో కూడా అలాగే ఇచ్చారు. ఆ గదిలో శ్రీనివాసులు ఇన్విజిలేటర్గా పనిచేస్తున్నారు. అయితే అదే పాఠశాలలో రిలీవర్గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బందెప్ప రూమ్ నంబర్ ఐదుకు వచ్చాడు. గైరుహాజరైన ఓ విద్యార్థికి చెందిన క్వశ్చన్ పేపర్ తీసుకుని శ్రీనివాసులుకు తెలియకుండా తన సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నాడు. తొలుత పొరపాటున ఓ వాట్సాప్ గ్రూప్కు పంపి వెంటనే డిలిట్ చేశాడు. 9.37 సమయంలో చెంగోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సమ్మప్పకు వాట్సాప్ ద్వారా పంపాడు. అతని ద్వారా ప్రశ్నపత్రం వేరే ఇతర వాట్సాప్ గ్రూపులకు, 11: 30 ప్రాంతంలో ఓ మీడియా వాట్సాప్ గ్రూప్కు వెళ్లింది. విలేకరులు కొందరు మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు అలాంటిదేమీ లేదని అన్నారు. కానీ పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల వద్ద ఉన్న పేపర్తో పోల్చి చూస్తే నిజమేనని తేలింది. దీంతో వారు అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రిమినల్ కేసుల నమోదు ఈ వ్యవహారంలో నలుగురిని సస్పెండ్ చేశామని, వీరిలో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నామని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం సాయంత్రం విలేకరులకు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, విద్యాశాఖ అధికారులు, అదనపు కలెక్టర్ను రంగంలోకి దింపామని తెలిపారు. విచారణలో తాండూరు–1 స్కూల్ నుంచి పేపర్ లీకైనట్లు గుర్తించామన్నారు. పేపర్ ఫోటోలు తీసిన బందెప్పతో పాటు అతను పేపర్ సెండ్ చేసిన సమ్మప్పను విధుల నుంచి తొలగించి, క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించిన సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శివకుమార్ (ముద్దాయిపేట, యాలాల మండలం), చీఫ్ సూపరింటెండెంట్ కె.గోపాల్ (తాండూరు హైస్కూల్–1)ను కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రశ్నపత్రాన్ని ఫొటోలు తీసిన విషయాన్ని గమనించడంలో విఫలమైన శ్రీనివాస్ను ఇన్విజిలేషన్ విధుల నుంచి తొలగించటంతో పాటు అతనిపై కూడా తదుపరి విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు. లీకైన పేపర్ను ఉపయోగించి మాస్ కాపీయింగ్ చేసినట్లుగా ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించలేదని కలెక్టర్ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్ ఫొటోలు తీసి మరో ఉపాధ్యాయుడికి పంపినప్పటికీ.. విద్యార్థులు ఆ పేపర్ ద్వారా కాపీయింగ్కు పాల్పడినట్టు తేలలేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రం బయటకు వాస్తవమే.. టెన్త్ ప్రశ్నపత్రం లీక్పై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన స్పందించారు. తాండూరు హైస్కూల్–1 నుంచి ప్రశ్నపత్రం మరో టీచర్కు వెళ్ళిన మాట వాస్తవమేనని ఆమె తెలిపారు. అయితే పరీక్ష సమయంలో ఇతరులెవరూ లోపలికి రాలేదని, లోపలి నుంచి ఎవరూ బయటకు వెళ్ళలేదని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపారని, బాధ్యులపై చర్యలు తీసుకున్నారని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. మిగతా పరీక్షలన్నీ యధాతథంగా జరుగుతాయని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లతో మిలాఖత్? ప్రశ్నపత్రం బయటకు వెళ్లిన వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు కూడా పరీక్ష హాల్లోకి సెల్ఫోన్ తీసుకెళ్ళడం నిషేధం. అలాంటిది ఓ ఇన్విజిలేటర్ ఎలా తీసుకెళ్ళాడనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అయితే అతని సెల్ఫోన్ ద్వారా వెళ్ళిన ప్రశ్నపత్రం ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులకు కూడా వెళ్ళినట్టు అనుమానిస్తున్న పోలీసు వర్గాలు ఈ దిశగా విచారణ చేపట్టాయి. ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నం టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీపై నిరసన వ్యక్తం చేస్తూ ఎన్ఎస్యూఐ ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి ప్రయత్నించింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్టేషన్కు తరలించారు. విద్యాశాఖ కార్యాలయం ఎదుట కూడా ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లీకేజీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ నేతలు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గతంలోనూ వివాదాస్పదుడే.. తాండూరు నంబర్–1 పాఠశాలలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న బందెప్పకు వివాదాస్పదుడిగా పేరుంది. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలోనే దేహశుద్ధి చేశారు. అప్పట్లో అతనిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. తాజాగా ప్రశ్నప్రతం లీక్ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
Andhra Pradesh: టెన్త్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారు. 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,09,070 మంది కాగా, మిగిలిన వారు ఓఎస్సెస్సీ రెగ్యులర్, సప్లిమెంటరీ అభ్యర్థులు. ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అన్ని కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో ఫర్నీచర్, మంచి నీరు వంటి సదుపాయాలు కల్పించామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా విద్యార్థుల రాకపోకలకు సమస్య లేకుండా ఆర్టీసీ యాజమాన్యం తగినన్ని బస్సులు నడుపుతోందన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో టెన్త్ విద్యార్థులు హాల్ టికెట్ చూపించి, ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఏడు మాధ్యమాల్లో పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ మాధ్యమాల్లో రోజు విడిచి రోజు ఆరు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ► తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మేథ్స్, సోషల్ స్టడీస్ పరీక్షలకు 24 పేజీల బుక్లెట్, ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్, సంస్కృతం, వృత్తి విద్యా కోర్సులకు 12 పేజీల బుక్లెట్లను అందిస్తారు. సైన్స్కు ఒకే ప్రశ్నపత్రం, రెండు ఆన్సర్ షీట్లు ఉంటాయి. ఆయా ప్రశ్నలకు నిర్దేశిత బుక్లెట్లోనే సమాధానాలు రాయాలి. ► పేపర్ లీక్ అనేది లేకుండా పక్కాగా నిఘా ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా, ఏదైనా అవాంఛనీయ ఘటన, లీక్ జరిగితే అది ఎక్కడ జరిగిందో వెంటనే కనిపెట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ► అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణకు 43 వేల సిబ్బందిని నియమించారు. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ తదితర విభాగాల సహకారం తీసుకుంటున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 104 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాలనూ నో ఫోన్ జోన్లుగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు సహా ఏ ఒక్కరూ మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లరాదు. ► విద్యార్థులు కూడా వాచీలు, ఫోన్లు ఇతర డిజిటల్ వస్తువులను తీసుకెళ్లకూడదు. పెన్ను, పెన్సిల్, ఎరేజర్ స్కేలు వంటివి తీసుకెళ్లవచ్చు. విద్యార్థులకు ఇచ్చిన ఓఎమ్మార్ షీట్లో వివరాలు తనవో కాదో సరిచూసుకున్న తర్వాతే సమాధానాలు రాయాలి. ఏదైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్కు చెప్పి సరైనది పొందాలి. ఓఎమ్మార్ షీట్ను సమాధానాల బుక్లెట్కు పిన్ చేయాలి. ► ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. -
టెన్షన్ లేకుండా టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సన్నద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని, వారికి అసౌకర్యం కలగకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చే నెల 3 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పాఠశాల విద్య సంచాలకురాలు దేవసేనతో కలసి మంత్రి సబిత బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షల్లో విద్యార్థులు హాజరవుతున్న పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని, వీరి కోసం 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించే ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్ష పేపర్లను 11 నుంచి 6 కు కుదించామని, సైన్స్ పరీక్ష రోజున భౌతిక శాస్త్రం, జీవ స్త్రాస్తానికి సంబంధించి ప్రశ్న పత్రాలను విడివిడిగా అందిస్తామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం చేసే సౌకర్యం కూడా కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు. -
Telangana: ‘టెన్త్’కు కఠిన పరీక్ష!
‘పరీక్షల’పై ప్రశ్నలు, ఆందోళనలివీ.. ► టెన్త్ పరీక్షల్లో గతంలో ఇచ్చినట్టుగా ఈసారి రెండు, మూడు మార్కుల సూక్ష్మ ప్రశ్నలకు చాయిస్ ఇవ్వలేదు. ఆరు చొప్పున ప్రశ్నలిచ్చి అన్నీ రాయాలన్నారు. ఏ ఒక్క ప్రశ్న తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. అన్ని చాప్టర్లపై పట్టులేనప్పుడు దీనితో చాలా నష్టం. ► వ్యాసరూప ప్రశ్నల తీరును కఠినం చేశారు. సెక్షన్ మాదిరి కాకుండా, గ్రూపు మాదిరి చాయిస్ ఇవ్వడం విద్యార్థులకు ఇబ్బందేనని నిపుణులు చెప్తున్నారు. సెక్షన్ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలి. దీనిలో విద్యార్థులకు చాయిస్ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఒక్కో గ్రూప్లో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి గ్రూప్లోని రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి. ఆ రెండింటికి సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు. ► పరీక్ష సమయం మొత్తం 3 గంటలు.. ఇందులో ఆరు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే రెండు గంటల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముందే మిగతా ప్రశ్నలకు జవాబులు రాస్తే.. వ్యాసరూప ప్రశ్నలకు సమయం సరిపోదని అంటున్నారు. అందువల్ల వ్యాసరూప ప్రశ్నలను నాలుగుకు తగ్గించాలని సూచిస్తున్నారు. ► సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్/కెమిస్ట్రీ ఒకటి.. బయాలజీ మరొకటిగా పేపర్లు ఉంటాయి. రెండింటి ప్రిపరేషన్ వేర్వేరుగా ఉంటుంది. వీటన్నింటినీ ఒకేరోజు, ఒకే సమయంలో పెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రశ్నపత్రంలో చాయిస్ పెంచాలి ప్రశ్నపత్రంలో జవాబుల చాయిస్ పెంచాలి. అన్ని విభాగాల్లో కనీసం 30 శాతమైనా ఇవ్వాలి. విరామం లేకుండా పరీక్షల నిర్వహణ అశాస్త్రీయం. తక్షణమే పరీక్షల తీరుపై అధికారులు సమీక్షించాలి. – రాజా భానుచంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: ఎస్సెస్సీ పరీక్షల చుట్టూ వివాదం ముసురుతోంది. పరీక్ష విధానం, నిర్వహణ, సిలబస్, చాయిస్లలో చేసిన మార్పులపై పునః సమీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పరిశీలించిన ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ అభ్యంతరాలు తెలిపాయి. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకుంటే.. విద్యార్థులకు ఇబ్బంది తప్పదని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుండటంతో.. విద్యాశాఖ ఉన్నతాధికారులు డోలాయమానంలో పడ్డారు. మోడల్ పేపర్లను చూసి.. ఇటీవల టెన్త్ పరీక్షల టైం టేబుల్ విడుదల చేసిన ఎస్సెస్సీ బోర్డు పరీక్షల మోడల్ పేపర్లనూ ఆన్లైన్లో పెట్టింది. ఈ మోడల్ పేపర్లను బట్టి పరీక్ష విధానం కఠినంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు నిర్ధారణకు వచ్చాయి. అసలే కోవిడ్ వల్ల రెండేళ్లుగా అభ్యసన నష్టాలు ఉన్నప్పుడు పరీక్షను కఠినతరం చేస్తే విద్యార్థులకు నష్టమని అంటున్నాయి. టెన్త్ పరీక్షలు రాయబోయే దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల్లో.. 2 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లవారు ఉంటారని.. వీరిలో 1.2 లక్షల మంది కనీస స్థాయిలో, మరో 45 వేల మంది అంతకన్నా తక్కువగా సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నట్టు ఇటీవలి అంచనాల్లో వెల్లడైందని పేర్కొంటున్నాయి. కోవిడ్ పరిణామాలతో ప్రైవేటు విద్యార్థుల్లోనూ ప్రమాణాలు తగ్గాయని.. ఇలాంటప్పుడు క్లిష్టమైన ప్రశ్నలు, సంక్లిష్టమైన సమాధాన రూపం ఉండటం సరికాదని స్పష్టం చేస్తున్నాయి. గ్యాప్ ఇవ్వాల్సిందే.. సీబీఎస్సీ సిలబస్తో కొనసాగే కేంద్ర విద్యాసంస్థల్లో ప్రతీ పరీక్షకు మధ్య సన్నద్ధతకు సెలవు ఉంటుంది. మన రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డ్ మాత్రం ఈ విధానాన్ని పాటించ లేదు. ప్రభుత్వ సెలవు దినాలు మినహా ప్రతీ సబ్జెక్టు పరీక్షల మధ్య విరామం ఇవ్వలేదు. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుగా పరీక్షలు (40 మార్కుల చొప్పున) నిర్వహించినప్పుడు మధ్యలో ఒకరోజు విరామం ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నా మధ్యలో విరామం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ విషయాన్ని విద్యామంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కోవిడ్ నష్టాలున్న కాలం కాబట్టి విరామం, ఇతర వెసులుబాట్లు అమలు చేయాలని కోరినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. చాయిస్ పెంచాలి.. ఒకే పేపర్గా పరీక్ష నిర్వహిస్తుండటం వల్ల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. ప్రశ్నపత్రంలోని ఒకటి, రెండు సెక్షన్లలో కూడా చాయిస్ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 2 మార్కులు, 3 మార్కుల ప్రశ్నలకు కనీసం 30శాతం చాయిస్ ఇవ్వాలని అంటున్నారు. మూడో సెక్షన్లో వ్యాస రూప ప్రశ్నలను తగ్గించాలని.. ఫిజిక్స్/కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలు ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని సూచిస్తున్నారు. ఎస్సెస్సీ బోర్డు ఈ సూచనలు పాటించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ముందుగా బోధన ప్రారంభం కావడం, రివిజన్ రెండు సార్లు చేయడం వల్ల తేలికగా పరీక్షలు రాసే వీలు ఉందని అంటున్నారు. అదే ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికీ సిలబస్ పూర్తి కాలేదని, ఉపాధ్యాయుల కొరత ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. పరీక్షల తీరులో మార్పులు చేయాలి రెండేళ్లుగా కోవిడ్ వల్ల తరగతులే సరిగా జరగలేదు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రశ్నపత్రాలు ఉంటే మంచిది. కానీ మోడల్ పేపర్లు చూస్తే చాలా కఠి నంగా ఉన్నాయి. పరీక్షలపై సంఘాల నేతలతో కలిసి చర్చించి, మార్పులు చేయాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ వ్యాస రూప ప్రశ్నలు తగ్గించాలి మోడల్ పేపర్లను బట్టి చూస్తే వ్యాస రూప ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. వాటిని తగ్గించాలి. భౌతిక, రసాయన శాస్త్రాలు.. జీవశాస్త్రం పేపర్లను ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలి. – బీరెల్లి కమలాకర్రావు, పీఆర్టీయూటీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
టెన్త్లో సైన్స్కు ఒకే పేపర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సైన్సు పరీక్ష ఇకనుంచి ఒకే పేపర్గా జరుగుతుంది. సైన్సులో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రాలను రెండు వేర్వేరు పేపర్లుగా కాకుండా ఒకే ప్రశ్నపత్రంతో నిర్వహించనున్నారు. ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నలను రెండు విభాగాలుగా.. ఒకే ప్రశ్నపత్రంలో ఇస్తారు. ఈ విద్యాసంవత్సరం నుంచి టెన్త్లో 6 పేపర్ల విధానాన్నే అనుసరిస్తున్నట్టు ప్రభుత్వం ఇంతకుముందు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) బ్లూప్రింట్లు, నమూనా ప్రశ్నపత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. బ్లూప్రింట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు గతంలో టెన్త్ పరీక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో 11 పేపర్లలో జరిగేవి. అంతర్గత మార్కులు 20 ఉండగా పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. 2016–17 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలు అంతర్గత మార్కుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో తరువాత టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను రద్దు చేసి 100 మార్కులకు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం కరోనా సమయంలో పరీక్షల నిర్వహణకు తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో 11 పేపర్లకు బదులు పరీక్షను 7 పేపర్లకు ప్రభుత్వం కుదించింది. తెలుగు, ఇంగ్లిష్,, హిందీ, మేథ్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లను 50 మార్కుల చొప్పున రెండురోజుల పాటు నిర్వహించారు. 2022 టెన్త్ పబ్లిక్ పరీక్షలు కూడా ఇదే విధానంలో జరిగాయి. కాగా, సీసీఈ విధానంలో 4 ఫార్మేటివ్, 2 సమ్మేటివ్ పరీక్షలను నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను ఏడాదిలో నిరంతరం మూల్యాంకనం చేస్తున్నందున ఇక నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలను 7 లేదా 6 పేపర్లకు కుదించి నిర్వహించడం మంచిదని ఎస్సీఈఆర్టీ ప్రభుత్వానికి ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదనలు పంపించింది. పరిశీలించిన ప్రభుత్వం 2022–23 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు 6 పేపర్లతోనే నిర్వహించేలా జీవో–136ను ఆగస్టు 22న విడుదల చేసింది. గత ఏడాది ఏడు పేపర్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించిన సమయంలో సైన్సును ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లుగా వేర్వేరుగా నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మొత్తం పేపర్లను ఆరింటికే కుదించినందున సైన్సును రెండు పేపర్లుగా కాకుండా ఒకే పేపర్గా 100 మార్కుల ప్రశ్నపత్రంతో ఒకేరోజు నిర్వహించనున్నారు. పరీక్ష ఒకటే.. సమాధాన పత్రాలు రెండు ఇకనుంచి సైన్సు ఒకే పేపర్గా 33 ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించనున్నారు. మొత్తం 33 ప్రశ్నలను 2 భాగాలుగా చేసి ఫిజికల్ సైన్సులో 16 ప్రశ్నలను, బయోలాజికల్ సైన్సులో 17 ప్రశ్నలను ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలను వేర్వేరు బుక్లెట్లలో రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు సమాధానాలను వేర్వేరు టీచర్లు మూల్యాంకనం చేయాల్సి ఉన్నందున ఇలా రెండు సమాధానాల బుక్లెట్లను ఇవ్వనున్నారు. 25 నుంచి ఫీజుల చెల్లింపు మార్చి–2023లో నిర్వహించే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్య రుసుము రూ.50తో డిసెంబర్ 11 నుంచి 20 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు. -
2025 నుంచి సీబీఎస్ఈ ప్యాట్రన్లో టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2025 విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సమూల మార్పులు రానున్నాయి. ఆ విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానంలో జరగనున్నాయి. రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోపాటు ఈ విద్యాసంవత్సరం 8వ తరగతి నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ తరహాలో పాఠ్యపుస్తకాలను అందించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని ద్విభాషా (బైలింగ్యువల్) విధానంలో ముద్రించి ఇచ్చారు. ఈ విద్యార్థులు 2025లో టెన్త్ పబ్లిక్ పరీక్షలను రాయనున్నారు. వీటిని సీబీఎస్ఈ ప్యాట్రన్లో నిర్వహించనున్నారు. ఆ తరువాత నుంచి వచ్చే బ్యాచ్ల విద్యార్థులు సీబీఎస్ఈ ప్యాట్రన్లోనే అభ్యసనం సాగించనున్నందున వారికి పరీక్షలు కూడా అదే విధానంలో నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2022–23, 2023–24 విద్యాసంవత్సరపు విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహా పరీక్షలు ఉంటాయి. ఆతరువాత నుంచి పూర్తిగా సీబీఎస్ఈ విధానంలోనే పరీక్షలు కొనసాగనున్నాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులు తప్పనిసరి ప్రస్తుతం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్ పరీక్షలను.. అంతర్గత మార్కులు 20 కలపకుండా నేరుగా 100 మార్కులకు నిర్వహిస్తున్నారు. సీబీఎస్ఈ విధానంలో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించి మిగిలిన 20 అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సమగ్ర నిరంతర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్, కంటిన్యూ ఇవాల్యుయేషన్ – సీసీఈ) విధానం ప్రకారం గతంలో ఎస్సెస్సీ పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండేవి. అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు, పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. అయితే అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా వ్యవహరిస్తూ తమ విద్యార్థులకు 20కి 20 మార్కులు వేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గతంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నుంచి అంతర్గత మార్కులను తొలగించింది. పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తోంది. సీబీఎస్ఈ విధానాన్ని అనుసరించనున్నందున 2025 నుంచి జరిగే టెన్త్ పరీక్షల్లో ఎస్సెస్సీ బోర్డు కూడా ఆ తరహాలోనే అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2022–23)లో కూడా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. తొలివిడతగా 1,092 స్కూళ్లకు రానున్న సీబీఎస్ఈ గుర్తింపు రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ హైస్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపునకోసం విద్యాశాఖ ఇప్పటికే ఆ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1,092 స్కూళ్లకు తొలివిడతగా ఈ గుర్తింపు రానుంది. ఈ స్కూళ్ల విద్యార్థులకు సీబీఎస్ఈ విధానాలను అనుసరించి పరీక్షలు ఉంటాయి. నేరుగా ఆ బోర్డే ఈ స్కూళ్ల విద్యార్థులకు పరీక్షలు పెడుతుంది. సీబీఎస్ఈ గుర్తింపులేకున్నా దాని సిలబస్, ప్యాట్రన్ను మిగిలిన స్కూళ్లలో అనుసరించనున్నందున ఆ స్కూళ్ల పదోతరగతి విద్యార్థులకు మాత్రం ఎస్సెస్సీ బోర్డు ద్వారా.. సీబీఎస్ఈ ప్యాట్రన్లోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. -
ఏపీ: పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు
-
పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: పదో తరగతి పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్ఈ సిలబస్ నేపథ్యంలో 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. చదవండి: సాఫ్ట్వేర్ లవ్స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ.. -
పదిలో ఆరు.. ఇంటర్లో ఏడు
సాక్షి,శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) ఆధ్వర్యంలో అభ్యసిస్తున్న పది, ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరుగైన ఉత్తీర్ణతను సాధించారు. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాను టెన్త్లో ఆరోస్థానం, ఇంటర్లో ఏడో స్థానంలో నిలిపారు. జిల్లా ఫలితాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ గార పగడాలమ్మ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ డి.సూరపునాయుడు విడుదల చేశారు. పదో తరగతిలో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు 41.82 శాతం ఉత్తీర్ణతను సాధించి రాష్ట్రంలో ఆరోస్థానంలో నిలిచారు. అలాగే ఇంటర్మీడియెట్ విద్యార్థులు 56.37 శాతం ఉత్తీర్ణతను సాధించి ఏడో స్థానంలో నిలి,చారు. జిల్లా నుంచి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలకు 1277 మంది విద్యార్థులు హాజరుకాగా 534 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ పరీక్షలకు 1350 మంది హాజరుకాగా 761 మంది ఉత్తీర్ణత పొందారు. చదవండి: Maharashtra Crisis: జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు -
తొలిరోజు కోదాడలో గడబిడ
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. తొలిరోజున అన్నిచోట్లా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ప్రకటించారు. ఎస్సెస్సీ పరీక్షలకు మొత్తం 5,08,143 మంది దరఖాస్తు చేసుకోగా.. సోమవారం జరిగిన మొదటి భాష పరీక్షను 5,03,041 (99 శాతం) మంది రాశారని, 5,102 మంది గైర్హాజరయ్యారని ఎస్సెస్సీ బోర్డ్ తెలిపింది. ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ కేసులు నమోదు కాలేదని ప్రకటించింది. పూర్తి నిఘా నీడలో పరీక్ష జరిగిందని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా పరీక్షలు రాశారని పేర్కొంది. అంతటా కోవిడ్ నిబంధనలు అమలు చేశామని తెలిపింది. వేసవి తీవ్రత తగ్గడంతో ఎక్కడా అసౌకర్యం కలగలేదని, అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించింది. జనరల్ తెలుగుకు బదులు... కాంపోజిట్ తెలుగు సూర్యాపేట జిల్లా కోదాడలో మాత్రం పరీక్షల్లో గందరగోళం నెలకొంది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు జనరల్ తెలుగు (1టి, 2టి)కు బదులు కాంపోజిట్ తెలుగు (3టి, 4ఎస్) ప్రశ్నపత్రాలు ఇచ్చారు. ఇది చూసి కంగుతిన్న విద్యార్థులు.. పరీక్షా కేంద్రం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాము చదివినది తెలుగు భాష సబ్జెక్టు అని.. వేరే పేపర్లు వచ్చాయని చెప్పారు. దీనితో అధికారులు సదరు విద్యార్థుల నుంచి డిక్లరేషన్ తీసుకుని వారికి జనరల్ తెలుగు ప్రశ్నపత్రాలను ఇచ్చారు. ప్రైవేటు స్కూళ్ల నిర్వాకంతో.. కోదాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పరిమితికి మించి విద్యార్థులు ఉండటంతో వారిని పట్టణంలోని మరో కార్పొరేట్ స్కూల్ తరఫున పరీక్ష రాయించినట్టు తెలిసింది. సదరు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు జనరల్ తెలుగు సబ్జెక్టు చదవగా.. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులు కాంపోజిట్ తెలుగు సబ్జెక్టు చదివారు. పరీక్ష ఫీజు కట్టే సమయంలో కార్పొరేట్ స్కూల్ అందరు విద్యార్థుల సబ్జెక్టును కాంపోజిట్ తెలుగుగా నమోదు చేసిందని.. దీనిప్రకారమే విద్యార్థులకు కాంపోజిట్ తెలుగు పేపర్లను ఇచ్చారని తెలిసింది. పరీక్ష కేంద్రంలో పాము కలకలం ఖమ్మం జిల్లా ముత్తగూడెం పరీక్షా కేంద్రంలోని 7వ నంబర్ గదిలో పాము కలకలం రేపింది. ఆ గదిలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా పాము వచ్చి దూరింది. విద్యార్థులు భయంతో బయటికి పరుగెత్తేందుకు ప్రయత్నించగా.. ఇన్విజిలేటర్ వారికి సర్దిచెప్పి బెంచీలపై నిల్చోబెట్టారు. ఓ విద్యార్థి ధైర్యం చేసి కర్రతో పామును చంపడంతో అంతా ప్రశాంతంగా పరీక్ష రాశారు. పుట్టెడు దుఃఖంలోనూ నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన ఇడికోజు లలిత కొండమల్లేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. లలిత తండ్రి పురుషోత్తమాచారి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. లలిత పుట్టెడు దుఃఖంలోనూ బంధువులు, స్నేహితుల సాయంతో పరీక్షకు హాజరైంది. -
TS SSC Exams 2022 : పదో తరగతి పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)
-
Telangana: 23 నుంచి పది పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు ఏర్పా ట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యా శాఖ ఏర్పాటు చేసింది. ఈ నెల 23 నుంచి జూన్ ఒకటి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 5,09,275 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థుల హాల్టికెట్లను విద్యా శాఖ ఇప్పటికే వెబ్సైట్లో అందుబా టులో ఉంచడంతో పాటు పాఠశాలలకు చేరవేసింది. ప్రింటెడ్ నామినల్ రోల్స్ కూడా సంబంధిత పా ఠశాలలకు పంపామని స్పష్టం చేసింది. కరోనా వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవడంతో సిలబస్ను 70 శాతానికి కుదించి ప్రశ్నపత్రాలను తయారు చేశామని తెలిపింది. పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించామంది. జనరల్ సైన్స్ కేటగిరీలో మాత్రం ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ప్రశ్నాపత్రాలను వేరుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈసారి ప్రశ్నపత్రంలో చాయిస్లను ఎక్కువగా ఇచ్చామని వివరించింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు చేరువలో ఉన్న పరీక్ష కేంద్రాలనే విద్యా శాఖ కేటాయించింది. పరీక్షల నిర్వహణకు 2,861 మంది చీఫ్ సూపరింటెండెంట్లు.. 2,861 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 33 వేల మంది ఇన్విజిలేటర్లను విధుల్లోకి తీసుకుంది. రాష్ట్ర కార్యాలయం నుంచి 4 ప్రత్యేక ఫ్లైయింగ్ స్వా్కడ్ బృందాలు, 144 ఫ్లైయింగ్ స్వా్కడ్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి పరీక్ష తీరును పరిశీలిస్తాయి. పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అదనంగా నడపాలని ఆర్టీసీ అధికారులను విద్యా శాఖ కోరింది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తారు. పరీక్ష కేంద్రంలో సంబంధిత జి ల్లా, మండల విద్యాధికారుల ఫోన్ నంబర్లను ప్రద ర్శించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఉదయం 9.35 తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు. -
టెన్త్ పరీక్షలు రాస్తున్నారా? సక్సెస్బాట పట్టించే సూచనలు తెలుసుకోండి
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ఓ వైపు ఒత్తిడి, మరోవైపు వారిలో ఆందోళనను నివృత్తి చేసేందుకు వారికి ఉపాధ్యాయులు, అధికారులు పలు సూచనలు చేశారు. మైలార్దేవ్పల్లి (హైదరాబాద్): ఏకాగ్రత, ప్రణాళిక బద్ధంగా చదివితేనే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. పలు సూచనలు.. ► పరీక్షా సమయంలో సెల్ఫోన్, టీవీ, కంప్యూటర్ల వైపు దృష్టి మరలకుండా చూసుకోవాలి. ప్రతి రోజు విద్యార్థి నిర్ధేశించుకున్న టైమ్ టేబుల్ ప్రకారం చదువుకోవాల్సి ఉంటుంది. ► ఉపాధ్యాయులు, స్నేహితులు, సీనియర్ల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సిద్ధమైతేనే విజయం మరింత సులభమవుతుంది. ► ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ముఖ్యంగా విద్యార్థులకు పరీక్ష సమాయాల్లో ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి. ► విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు అవసరమైన ధైర్యాన్ని అందించాలి. ► ఒత్తిడిని తగ్గించేందుకు వారికి సహకారం అందిస్తే అధిక సమయం చదువుకే కేటాయిస్తారు. ► తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన ఆహారం అందించాలి. ► విద్యార్థులు సమయానికి తగినట్లుగా నిద్రపోయేలా కుటుంబసభ్యులు చూసుకోవాలి. రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు పూర్తి సన్నద్ధం చేశాం. ఇప్పటికే రెండు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి వారికి మనోధైర్యాన్ని కల్పించాం. గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చేలా ఎప్పటికప్పుడు తరగతులు నిర్వహిస్తున్నాం. మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నాం. –రామిరెడ్డి, ఎంఈఓ రాజేంద్రనగర్ సొంతంగా రాసిన జవాబులకే అధిక మార్కులు ఉపాధ్యాయులు ఇచ్చిన మెటీరియల్ను విద్యార్థులు చదువుకుని పాఠ్య పుస్తకాలపైనే దృష్టిసారించాలి. సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. సొంతంగా రా సిన జవాబులకే అధిక మార్కులు వేసే అవకాశం ఉంటుంది. –ఎన్.మాణిక్యంరెడ్డి, ఉపాధ్యాయుడు ఖాళీ కడుపుతో వెళ్లకూడదు విద్యార్థులు పరీక్షలకు వెళ్లే సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పరీక్షలకు వెళ్లే ముందు తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ప్రశ్నా పత్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే జవాబులు రాయాలి. –డాక్టర్ సుభాష్, మైలార్దేవ్పల్లి 10 జీపీ సాధిస్తామనే నమ్మకం ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేదు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ ఉపాధ్యాయులు ఇచ్చిన నోట్స్ను ఇప్పటికే చదివేశాం. పదికి పది జీపీ సాధిస్తామన్న విశ్వాసం ఉంది. –స్వాతి, పదో తరగతి విద్యార్థిని -
విద్యార్థులకు నిజంగా ‘పరీక్షే’..!
సాక్షి, హైదరాబాద్: మండు వేసవిలో గొంతు తడుపుకొనే అవకాశం లేదు. ముక్కు మూసుకుంటే తప్ప మరుగుదొడ్లకు వెళ్లలేని పరిస్థితి. ఎప్పుడు ఊడిపడుతుందోనన్నట్టుగా ఉన్న భవనాల పైకప్పులు. కరెంటు సౌకర్యం ఉన్నా ఫ్యాన్లు లేవు. ఉన్నా పనిచేయడం లేదు. ఇదీ ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్న అనేక కేంద్రాల దుస్థితి. ముఖ్యంగా మారుమూల పల్లెల్లో, ఓ మాదిరి పట్టణ కేంద్రాల్లో ఈ తరహా దయనీయ పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 5,09,275 మంది టెన్త్ విద్యార్థులు 2,861 కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంది. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. ప్రైవేటు స్కూల్స్ పరీక్షా కేంద్రాలు కావడంతో సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కానీ జిల్లాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 పరీక్ష కేంద్రాల్లో ఏదో ఒక సమస్య కన్పిస్తోందని క్షేత్రస్థాయి అధికారులు ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నివేదికలు కూడా పంపారు. వీటి ప్రకారం.. దాదాపు 500 పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు వాడుకలోనే లేవని తెలిసింది. 400 పాఠశాలల్లో శుద్ధమైన తాగునీటి సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించారు. 145 పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడ..ఎలా? ♦కరీంనగర్ పట్టణం సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్వోఆర్ ప్లాంట్ కొన్ని నెలలుగా వాడుకలో లేదు. దీన్ని మరమ్మతు చేయించకపోవడంతో మంచినీళ్లు అందే అవకాశం కన్పించడం లేదు. ఇదే స్కూల్లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని అధ్వానంగా ఉన్నాయి. ♦ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 5 పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయడం లేదు. నల్లబెల్లి మండలంలో మంచినీటి కొరత ఉంది. శౌచాలయాలు ఉపయోగంలో లేవు. ఖానాపురం పాఠశాల పరీక్ష కేంద్రంలో పైకప్పు పెచ్చులూడి మీద పడే పరిస్థితి ఉంది. ఈ పరీక్ష కేంద్రాన్ని చూసి ఉపాధ్యాయులే భయపడుతున్నారు. సంగెం మండల కేంద్రంలోని పాఠశాలలో ఎనిమిది గదులుంటే నాలుగింటికి విద్యుత్ సరఫరా లేదు. ఈదుల పూసపల్లి ఒకటో వార్డులో ప్రభుత్వ పాఠశాలకు మంచినీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గతంలో కూడా ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడినా, మరోసారి కేంద్రంగా ఎంపిక చేయడం గమనార్హం. ఈ స్కూల్కు చెందిన పాత భవనంలో నాలుగు గదులు శిథిలావస్థలో ఉన్నాయి. ♦ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఉన్నత పాఠశాలలో 13 తరగతి గదులుంటే 8 గదులకే విద్యుత్ సౌకర్యం ఉంది. సూర్యాపేటలోని నంబర్ 2 జెడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. దేవరకొండ జిల్లా పరి«షత్ బాలికల ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ♦ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రం దారుణంగా ఉంది. ఫ్లోరింగ్ పగిలిపోయి అస్తవ్యస్తంగా తయారైంది. ఫ్యాన్ల రెక్కలు వంకర తిరిగి ఉన్నాయి. బెంచీలు విరిగిపోయి ఉన్నాయి. సమస్యలుంటే డీఈవో దృష్టికి తెండి సమస్యలు లేని స్కూళ్లనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయమని క్షేత్రస్థాయి సిబ్బందికి మొదట్లోనే ఆదేశాలిచ్చాం. అయినా అక్కడక్కడ ఏమైనా సమస్యలుంటే డీఈవోల దృష్టికి తీసుకెళ్లాలి. సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నదే మా లక్ష్యం. – కృష్ణారావు (పరీక్షల విభాగం అదనపు డైరెక్టర్) -
అద్దెకు దొరకవు... అధిక కిరాయిలు!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23 నుంచి మొదలయ్యే టెన్త్ పరీక్షలకు సీసీ కెమెరాల ఏర్పాటు సమస్యగా మారింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఈసారి సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల బండిల్ను తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. పరీక్ష కేంద్రం నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆన్లైన్ లింక్ ఉండాలని, అన్ని స్థాయిల్లోనూ పర్యవేక్షణ ఉండాలని స్పష్టంచేసింది. అయితే, ఇందుకోసం వాడే సీసీ కెమెరాలను అద్దెకు మాత్రమే తీసుకోవాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. హైదరాబాద్లో పెద్ద ఇబ్బందులు లేనప్పటికీ.. జిల్లా కేంద్రాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఇదో సమస్యగానే అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,400 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతీ కేంద్రంలో చీఫ్ ఎగ్జామినర్ వద్ద సీసీ కెమెరా ఉండాలి. అక్కడి నుంచి ఇంటర్నెట్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి లింక్ ఉంటుంది. అయితే, ప్రతీ జిల్లాలోనూ కనీసం 200 పరీక్ష కేంద్రాలుంటే, అన్ని సీసీ కెమెరాలు అద్దెకు లభించడం కష్టంగా ఉంది. జిల్లా కేంద్రాల్లో కొద్ది మొత్తంలో ఉన్నా, రోజుకు కనీసం రూ.1,500 వరకూ అద్దె అడుగుతున్నారు. వైఫై, ఇతర ఇన్స్టలేషన్ చార్జీలు అదనం. కనీసం పది రోజులు ఒక కెమెరా పరీక్ష కేంద్రంలో ఉంచినా, రూ.15 వేల వరకూ చెల్లించాలి. అయితే, మార్కెట్లో ఒక్కో కెమెరా కొనుగోలు చేసినా ఇంతకంటే తక్కువగా దొరుకుతుందని అంటున్నారు. పెద్ద మొత్తంలో సమకూర్చుకోవడం కష్టమైనప్పుడు వేరే ప్రాంతాల నుంచి ఇంత తక్కువ సమయంలో తెప్పించడం ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేటు వ్యక్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎక్కువ మొత్తాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉంటే, జిల్లా కలెక్టరేట్ అధికారులు మాత్రం తక్కువ రేటుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది కలెక్టర్లు మాత్రం ఈ బాధ్యతను రాష్ట్రస్థాయిలోనే ఏదైనా సంస్థకు ఇస్తే బాగుంటుందని, జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయలేమని విద్యాశాఖకు చెప్పినట్లు తెలిసింది. అయితే, పాఠశాల విద్య డైరెక్టర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాగు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మాకు మిగిలేదేంటి కొద్దిరోజుల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా, బిగింపునకు అయ్యే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. వీటన్నింటినీ కలుపుకొనే మేం రోజుకు రూ.1,500 అద్దెతో ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్షల తర్వాత వాటిని తొలగించినా, వాడిన వైరు, ఇతర ఉపకరణాలను ఏమీ చేసుకోలేం. అదీగాక నెట్ సౌకర్యం లేని ప్రాంతంలో తాత్కాలిక నెట్ సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ కలుపుకొంటే మాకు మిగిలేది పెద్దగా ఏమీ ఉండదు. – డి.వేణు (సీసీ కెమెరాల నిర్వాహకుడు) -
టెన్షన్ వీడితే పాస్ ఈజీనే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమై ఈనెల 23 వరకు జరగనున్నాయి. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, 25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్ను సిద్ధం చేశా రు. ఆర్టీసీ సౌజన్యంతో పరీక్ష కేంద్రాలకు ప్రత్యేకం గా బస్సులు నడుపుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని అధికారులు పరీక్ష కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ‘ఈసారి కూడా 70% సిలబస్తోనే పరీక్షలుంటాయి. ఎవరూ ఎలాంటి భయం పెట్టుకోవద్దు. టెన్షన్కు దూరంగా ఉండి, ఇంటర్ బోర్డు అందించిన స్టడీ మెటీరియల్ను ఫాలో అయితే పరీక్షల్లో తేలికగా విజయం సాధించే వీలుంది..’అని ఇంటర్ విద్య కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,07,394 మంది ఇంటర్ పరీక్షలు రాయబోతు న్నారు. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 4,64,626 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. కోవిడ్ వల్ల గత రెండేళ్లుగా పరీక్షలు సజావుగా సాగలేదు. దీంతో విద్యార్థుల్లో పరీక్షల అలవాటు కాస్త తగ్గినట్టు కన్పిస్తోం దని నిపుణులు అంటున్నారు. ఈ కింది విషయా లను గమనంలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. గంట ముందే చేరుకోవాలి.. హాల్ టికెట్లు కాలేజీ నుంచే తీసుకోవాలనే రూల్ ఎక్కడా లేదు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. ప్రతీ విద్యార్థి పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. కోవిడ్ నిబంధనలు పాటించాలి. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశారు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించరు. వాటర్ బాటిల్ అనుమతిస్తారు. పరీక్షల వేళ ఏం చేయాలంటే... ఇంటర్ విద్యార్థుల నుంచి రోజూ పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. ఆందోళనగా ఉందని, భయమేస్తోందని చెబుతున్నారు. అందువల్ల విద్యార్థులు కొన్నింటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రోజూ కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. టీవీ, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు నిద్రను పాడు చేస్తాయి. ఫలితంగా పరీక్షలపై దృష్టి తగ్గుతుంది. ఇంటర్ సిలబస్ మినహా అనవసరమైన ఇతర విషయాలపై మాట్లాడకూడదు. చర్చించకూడదు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడొద్దు. ఇతరులతో కొద్దిపాటి ఘర్షణలకు కూడా ఆస్కారం ఇవ్వొద్దు. దీనివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. పరీక్ష కేంద్రానికి కనీసం ఒక గంట ముందే చేరుకుని, పుస్తకాలు పక్కనబెట్టి వీలున్నంత వరకూ ప్రశాంతంగా ఉండాలి. కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. – డాక్టర్ ఎ.అనిత (ఇంటర్ బోర్డు నియమించిన క్లినికల్ సైకాలజిస్ట్) టెన్త్ రాయలేదు.. ఫస్టియర్లో టెన్షన్ టెన్త్ పరీక్షలు రాయలేదు. ఇంటర్ ఫస్టియర్లోనూ టెన్షన్ పడ్డాం. కానీ ఇప్పుడు కాస్త అవగాహన వచ్చింది. కాలేజీలో అధ్యాపకుల గైడెన్స్, చివరి నెలలో ప్రిపరేషన్ నమ్మకం పెంచింది. – చేతమోని రజిత (ఇంటర్ విద్యార్థి, జడ్చర్ల, మహబూబ్నగర్ జిల్లా) స్టడీ మెటీరియల్ ఫాలో అయ్యాం కరోనా తగ్గడం, ఈసారి క్లాసులు బాగా జరగడంతో పరీక్షలకు బాగా సన్నద్ధమయ్యాం. ఇంటర్ బోర్డ్ స్టడీ మెటీరియల్ను ఒకటికి రెండుసార్లు చదివాం. మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాం. – ఎం.నూతన్ ప్రసాద్ (ఇంటర్ విద్యార్థి, గార్ల ప్రభుత్వ కాలేజీ, ఖమ్మం) -
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న... పరిశుభ్రత ప్రశ్నార్థకం
సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలకు తోడు కోవిడ్ ఫోర్తు వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ నెల 23 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలను కూడా పరీక్ష కేంద్రాలుగా గుర్తించడంతో ఏర్పాట్లు సమస్యగా మారాయి. సర్కారు బడుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల కొరత వెంటాడుతుంటంతో ఇప్పటి వరకు ప్రైవేటు సిబ్బందితో పనులు కొనసాగిస్తూ వచ్చారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు రానప్పటికీ టీచర్లందరు కలిసి సిబ్బంది వేతనాలను భరిస్తూ వచ్చారు. ఇక పరీక్షలు కేంద్రాల్లో సదుపాయాలను సమకూర్చేందుకు నిధుల కొరతతోపాటు ప్రైవేట్ సిబ్బంది విధులకు హాజరయ్యే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి సెలవుల సందర్భంగా ఇప్పటివరకు పాఠశాలల్లో పనిచేసిన స్వీ పర్లు, స్కావెంజర్లు డ్యూటీకి రాకుంటే పరిస్థితి ఏమిట ని ప్రధానోపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 62 మంది సిబ్బందే.. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 690 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నా యి. ఆయా స్కూళ్లలో ప్రస్తుతం 1,06,635 మంది చదువుతుండగా, 6,200 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు నాలుగో తరగతికి చెందిన సుమారు 62 మంది పర్మనెంట్ అటెండర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఇతర పాఠశాలల్లో ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని తరగతి గదులు, నీటి ట్యాంకులు, మరుగుదొడ్లను శుభ్రం చేయడంతోపాటు విద్యార్థులకు తాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్ధితేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెండేళ్ల నుంచి.. కరోనాకు ముందు పాఠశాల నిధులు (స్కూల్ గ్రాంట్) నుంచి కొంత డబ్బులు తీసి ఒక్కొక్కరికి నెలకు రూ.2500 వేతనం కింద ఇచ్చేవారు. సర్వశిక్ష అభియాన్ కింద కేటాయించే నిధులను కోవిడ్ కాలం నుంచి రద్దు కావడంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై భారం పడినట్లయింది. తాము పని చేస్తున్న స్కూల్లో మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు, తరగతి గదులను శుభ్రం చేయించేందుకు సొంతంగా డబ్బులు సమకూర్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూల్లో ఒక్కొక్కరు రూ.300 నుంచి 500 ఇస్తుండగా, ఎక్కువ ఉన్న చోట్ల రూ.500–1000 వరకు వేసుకొని వారికి వేతనాలుగా అందిస్తున్నారు. పరీక్షల సమయంలో ఎలా? వాస్తవంగా ప్రతి ఏటా పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ రెండో వారంలోగా పూర్తవుతుంటాయి. అప్పుడు అటెండర్లు, స్వీపర్లు, స్కావెంజర్ల సమస్య ఎదురయ్యేది కాదు. ప్రస్తుతం వేసవి సెలవుల సమయంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనుండడంతో ఏర్పాట్లు సమస్యగా తయారైంది. వేసవి సెలవుల్లో ప్రైవేట్ స్వీపర్లు, స్కావెంజర్లు విధులకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదని కొందరు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరీక్షలు జరుగుతున్నప్పుడు రోజువారీగా తరగతి గదులను శుభ్రం చేయడంతోపాటు తాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది, ఎండాకాలం సెలవుల్లో వేతనం ఇచ్చే పరిస్థితి ఉండకపోవడంతో మెజారిటీ సిబ్బంది విధులకు హాజరుపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రంజాన్కు భారీ బందోబస్తు) -
టీడీపీకి పరీక్షలపై మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పరీక్షలపై ప్రభుత్వం, అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉంటూ, కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ పేపర్ల లీకేజి, కాపీయింగ్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ఎస్సై నిర్వాకం: ప్రేమించి, పెళ్లి చేసుకుని.. నా జీవితాన్ని నాశనం చేశాడు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించి అరెస్టు చేశామన్నారు. చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల సిబ్బందితో సహా మాల్ ప్రాక్టీసుకు ప్రయత్నించిన 7 మందితో పాటు, నంద్యాలలో కూడా పలువురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పరీక్షా పత్రాలు బయట మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రశ్న ప్రత్రాలు లీకవుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నిస్తూ దొరికిపోయిన తమ సొంత పార్టీకే చెందిన నారాయణ, తదితర విద్యా సంస్థల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తమ పార్టీకి (టీడీపీకి) చెందిన వారే అక్రమాలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తూ, ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. ఒకట్రెండు చోట్ల తమ స్వార్థ ప్రయోజనాల కోసం పరీక్షలు ప్రారంభమైన తరువాత కుట్రపూరితంగా విద్యార్ధులకు సమాధానాలు చేరేలా పథకం ప్రకారం యత్నిస్తూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అరెస్టైన వారి ద్వారా ఈ విషయం ఇప్పటికే వెల్లడైందని మంత్రి పేర్కొన్నారు. ఆరు లక్షలకు పైగా విద్యార్థులకు సంబంధించిన అంశంలో రాజకీయాలను చొప్పించవద్దని, పరీక్షలను పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని, ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పూర్తిగా పరీక్షలపైనే దృష్టి సారించాలని ఆయన సూచించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఏపీలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ( ఫొటోలు)
-
Andhra Pradesh: పదో తరగతి పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి (ఏప్రిల్ 27, బుధవారం) నుంచి మే 9 వరకు జరగనున్న ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,20,063 మంది బాలురు కాగా 3,02,474 మంది బాలికలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పదో తరగతి పరీక్షలు నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి 9.30 గంటల వరకు అనుమతిస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలకు అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నందున పూర్వపు 13 జిల్లాల విద్యాధికారులే కొత్త జిల్లాలకూ నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. 24 పేజీల బుక్లెట్లోనే సమాధానాలు పదో తరగతి పరీక్షల చరిత్రలో తొలిసారిగా విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ను పంపిణీ చేయనున్నారు. వీటిలోనే సమాధానాలు రాయాలి. ఇందులో పార్టు–1లోని ఓఎమ్మార్ షీట్లో పేర్కొన్న వివరాలను హాల్టికెట్లలోని సమాచారంతో సరిచూసుకోవాలి. 24 పేజీల బుక్లెట్లో విద్యార్థులు రోల్ నంబర్లను, తమ పేర్లను, స్కూల్ పేర్లను రాయకూడదు. అలాగే గ్రాఫ్స్లో, మ్యాప్ పాయింట్లలో కూడా రోల్ నంబర్ వేయకూడదు. రోల్ నంబర్ వేసి ఉన్న ఆన్సర్ షీట్లను మూల్యాంకనం చేయరు. అలాంటివారిని మాల్ప్రాక్టీస్కు పాల్పడ్డవారిగా పరిగణిస్తారు. 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 292 సిట్టింగ్ స్క్వాడ్లు పదో తరగతి పరీక్షల్లో మాల్ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 292 సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన సామగ్రి మొత్తాన్ని అన్ని జిల్లాల కేంద్రాలకు తరలించారు. విద్యార్థులకు ఏప్రిల్ 18 నుంచే హాల్టికెట్లను అందుబాటులో ఉంచారు. కోవిడ్ ప్రొటోకాల్ను అనుసరించి పరీక్షలకు ఏర్పాట్లు చేపట్టారు. రూముకు 16 మంది చొప్పున ఉంచడంతోపాటు భౌతికదూరం పాటించేలా, మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి సదుపాయం, ఏఎన్ఎంల నియామకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రత వంటి చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో ఫోన్లు, డిజిటల్ పరికరాలకు నో ఎంట్రీ పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్లు తప్ప ఇతరులెవరూ ఫోన్లను తీసుకువెళ్లడానికి వీలులేదు. అలాగే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇతర డిజిటల్ పరికరాలను కూడా అనుమతించరు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో విద్యాశాఖతోపాటు ట్రెజరీ, రెవెన్యూ, పోలీసు, పోస్టల్, ఏపీఎస్ఆర్టీసీ, ట్రాన్స్కో, వైద్య, ఆరోగ్య శాఖ, తదితర అన్ని విభాగాలను సమన్వయం చేసి ఎక్కడా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ సంఘవిద్రోహ శక్తులు పుకార్లను వ్యాపింప చేయకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. ఫేక్, గాసిప్ ప్రశ్నపత్రాలను కూడా ప్రచారంలోకి తేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వాటిని వ్యాపింపచేసే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతారు. -
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే పరీక్షా సమయం పొడిగించారు. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్ష సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 70 శాతం సిలబస్నే అమలు చేస్తున్నామన్నారు. ప్రశ్నపత్రంలో అధిక చాయిస్ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. చదవండి: గ్రూప్–1, 2 ఇంటర్వ్యూలకు గుడ్బై? -
మే 23 నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త టైం టేబుల్ను పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం బుధవారం విడుదల చేసింది. వాస్తవానికి టెన్త్ పరీక్షలు మే 11 నుంచి 20వ తేదీ మధ్య నిర్వహించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినందున ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఇదే సమయంలో టెన్త్ పరీక్షలు నిర్వహించడం సమస్యగా ఉంటుందని భావించారు. దీంతో టెన్త్ పరీక్షలను మే 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష ఉంటుందని ఎస్సెస్సీ పరీక్షల విభాగం తెలిపింది. అయితే, మండు వేసవిలో పరీక్షల నిర్వహణపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. మార్పు అనివార్యమని భావిస్తే ఏప్రిల్లో పరీక్షలు పెడితే బాగుండేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. -
10, 12వ తరగతుల ఆఫ్లైన్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర బోర్డులు నిర్వహించనున్న 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించి అంతర్గత మూల్యాంకనం చేపట్టాలా, భౌతికంగా పరీక్షలు నిర్వహించాలా అనే అంశంపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ‘కరోనా కేసులు తగ్గినప్పటికీ గడిచిన రెండేళ్లుగా సమస్య తొలగలేదు. ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించడం లేదు. పరీక్షలు భౌతికంగా నిర్వహించడానికి బదులు ప్రత్యామ్నాయ మార్గం చూడాలి’ అని న్యాయవాది ప్రశాంత్ పద్మనాభన్ కోరారు. ‘బుధవారం విచారణ ప్రారంభిస్తాం’ అని జస్టిస్ ఖన్వీల్కర్ సూచించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డులు 10, 12వ తరగతుల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. టర్మ్–2 పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. తమ విద్యార్థుల మార్కులను అంతర్గత మూల్యాంకన విధానం ద్వారా నిర్ణయించుకునేందుకు గత ఏడాది సుప్రీంకోర్టు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ), సీబీఎస్ఈలకు అనుమతినిచ్చింది. ఇదే విధానం ఈసారీ అమలుకానుందో లేదో సుప్రీంకోర్టు విచారణలో తేలనుంది. -
ఏప్రిల్ 8 నుంచి ఇంటర్.. మే 2 నుంచి టెన్త్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూళ్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలను, మే 2 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ థియరీ పరీక్షల కోసం 1,456, పదో తరగతి పరీక్షల కోసం 4,200 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూళ్లను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం కర్నూలులో ప్రకటించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ప్రకటిస్తున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చిత్రంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలో విద్యా శాఖ మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రోజూ పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేసేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. 3,30,376 మంది బాలురు, 3,09,429 మంది బాలికలు కలిపి మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని వివరించారు. అలాగే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,05,052 (బాలికలు 2,53,406, బాలురు 2,51,646) మంది, ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,81,481 (బాలికలు 2,39,160, బాలురు 2,42,321) మంది హాజరవుతారని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను మార్చి 11 నుంచి 31 వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం 1,757 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 7న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, మార్చి 9న ఎన్విరాన్మెంట్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. -
ఏపీ, టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
హైపవర్ కమిటీ నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
-
పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాం..
సాక్షి, అమరావతి: కోవిడ్ తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) చింతల సుమన్ బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ పరీక్షల రద్దు కోసం దాఖలైన వ్యాజ్యాన్ని మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. -
‘లోకేశ్.. మీరు పరీక్షలు కరెక్టుగా రాసి పాసయ్యారా?’
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): పరీక్షలు రద్దయ్యాయని ఆనంద పడటం తప్ప టీడీపీ నేత లోకేశ్కు మరొకటి తెలియదని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు విమర్శించారు. పెద్ద పెద్ద పదజాలలు వాడి పరీక్షలకే మీరు పరీక్ష కాకండి అంటూ ఎద్దేవా చేశారు. కోవిడ్ వంకతో విద్యార్థుల పరీక్షలపై రాజకీయాలు మాట్లాడటం లోకేశ్కు తగదని హితవు పలికారు. శుక్రవారం పండుల రవీంద్ర బాబు మాట్లాడుతూ.. ‘‘పరీక్షలంటే లోకేశ్కు అర్థం తెలుసా? మీరు పరీక్షలు కరెక్టుగా రాసి పాసయ్యారా? చదువుకున్న వారికే పరీక్షల నిర్వహణ వెనుక అర్థం తెలుస్తుంది. పరీక్షలు రద్దయ్యాయని సంతోషించడం తప్ప ఇంకేమైనా తెలుసా మీకు. కరోనా పేరిట పరీక్షల గురించి రాజకీయాలు చేయడం సరికాదు. పరీక్షల నిర్వహణ అనేది విద్యార్ధుల చదువుకు ఒక అర్థాన్నిస్తుంది. చదువుకున్న విద్యార్ధులకు పరీక్షలంటే ఒక కిక్కు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, చదువుకున్న వ్యక్తిగా.. పరీక్షలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన గొప్పది. కానీ కోవిడ్ వల్ల పరీక్షలు రద్దు చేయాల్సిరావడం చాలా దురదృష్టకరం’’ అని పేర్కొన్నారు. కాగా సుప్రీంకోర్టు నిర్దేశించిన జూలై 31 లోగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి సాధ్యం కాదని, అందుకని పరీక్షలను రద్దుచేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశంసించింది. సీబీఎస్ఈ పరీక్షల రద్దు అంశంపై విచారణ సందర్భంగా.. ఏపీ పరీక్షల రద్దు విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాది దవే మాట్లాడుతూ..''ఎన్నికల ర్యాలీలు, సభలు జరిగాయని సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. గురువారం సుప్రీం విచారణ అనంతరం ముఖ్యమంత్రి వెంటనే పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణకు సిద్ధమైనప్పటికి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేశాము. పది రోజుల్లో హైపవర్ కమిటీ అసెస్మెంట్ స్కీమ్ను రూపొందించి జూలై 31 లోపు ఫలితాలను ప్రకటిస్తుంది. దేశం మొత్తం ఒక వైపు ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక మార్గంలో వెళ్ళలనుకోవడం లేదని తాము భావించాము.. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కుంభ మేళాలో జరిగిన దానికి ఎవరూ బాధ్యత తీసుకోలేదంటూ'' ఆయన తెలిపారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
ఏపీ: టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
-
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు నిర్వహించడానికే ముందు నుంచి ప్రయత్నిస్తున్నాం. ఇదే మా మొదటి ప్రాధాన్యం. ఈ విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్ధత లేదు. కానీ సుప్రీంకోర్టు పేర్కొన్న టైమ్ షెడ్యూల్లో పరీక్షలు, ఫలితాల ప్రకటన వీలుకాదు. అందుకే పరీక్షలను రద్దు చేస్తున్నాం. విద్యార్థులకు మార్కులను నిర్ణయించడానికి ఏ విధానాలను అనుసరించాలో సూచనలు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేస్తున్నాం. – మంత్రి ఆదిమూలపు సురేష్ సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు నిర్దేశించిన జూలై 31 లోగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి సాధ్యం కాదని, అందుకని పరీక్షలను రద్దుచేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. విజయవాడలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘పదిరోజుల్లో మార్కుల ఎవాల్యుయేషన్ స్కీమ్ను రూపొందించి జూలై 31లోగా ఫలితాలు ప్రకటించేలా గురువారం సుప్రీంకోర్టు ప్రకటించిన టైమ్ షెడ్యూల్లో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాలకు కామన్గా ఇదే టైమ్ షెడ్యూల్ ఉంది. పైగా జూలై 31 తరువాత ఉన్నతవిద్య ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేలా యూజీసీని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ తరుణంలో ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల అవకాశాలను మన విద్యార్థులు నష్టపోరాదు. అందుకే రెండో ఆప్షన్గా పరీక్షల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నాం..’ అని మంత్రి వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు టెన్త్ పరీక్షలను కూడా రద్దుచేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మార్కులను నిర్ణయించడం సహా ఇతర అంశాలకు సంబంధించి ఏ విధానాలను అనుసరించాలో సూచనలు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్ధత లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల నిర్వహణే మొదటి ప్రాధాన్యమని, కానీ కోర్టు పేర్కొన్న టైమ్ షెడ్యూల్లో పరీక్షలు, ఫలితాల ప్రకటన సాధ్యంకాదు కనుకనే రెండో ఆప్షన్గా పరీక్షలను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. పరీక్షలు, ఫలితాల వెల్లడికి కనీసం 45 రోజులు పడుతుంది ‘12వ తరగతి (ఇంటర్మీడియట్)కు సంబంధించి మార్కులు పదిరోజుల్లోపల ఫైనలైజ్ చేయాలని, మొత్తం ఫలితాలు జూలై 31 లోపల ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాఠశాలవిద్య ముఖ్య కార్యదర్శి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఇచ్చిన సమాచారం మేరకు పరీక్షల నిర్వహణ మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు కనీసం 40 రోజుల సమయం అవసరం. దీనికి అదనంగా 15 రోజులు ముందుగా విద్యార్థులకు టైమ్టేబుల్ సమాచారం ఇవ్వాలి. మొత్తం ప్రక్రియ పూర్తిచేయడానికి కనీసం 45 రోజులు పడుతుందని గతంలో కూడా పలుమార్లు చెబుతూ వచ్చాం. ఆ మేరకు సమయం ఉంటేనే ప్రాసెస్ అంతా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించేందుకు వెసులుబాటు ఉంటుంది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని ఆదేశాల ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలో అనగా జూలై 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తిచేయడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రికి తెలియచేశాం. ఈ విషయంపై పూర్తిగా చర్చించాం. సుప్రీంకోర్టు గడువు తేదీలను పేర్కొంటూ చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పింది. అంతకు ముందు ఉన్నతవిద్య ప్రవేశాలకు సంబంధించి యూజీసీకి కొన్ని ఆదేశాలు, సూచనలు ఇచ్చింది. సీబీఎస్ఈ, ఐసీఎస్సీ, స్టేట్బోర్డులు ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉన్నతవిద్య కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లోకి ప్రవేశాలను చేపట్టాలని యూజీసీకి ఆదేశాలు ఇచ్చి ఉంది. యూజీసీ కూడా ఉన్నతవిద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను జూలై 31 తరువాత చేపడతామని ప్రకటించింది. కనుక దేశమంతా ఒకే పద్ధతి వస్తున్న పరిస్థితుల్లో మన విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల్లో, వేరే సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులో ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వీలుకాదు. ఈ పరిస్థితుల్లో ఇంటర్ థియరీ పరీక్షలు 2020–21ని రద్దుచేస్తున్నాం. అదేవిధంగా ఇవే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షలను కూడా రద్దుచేస్తున్నాం..’ అని మంత్రి సురేష్ చెప్పారు. పరీక్షల నిర్వహణే మా మొదటి ఆప్షన్ ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పరీక్షల విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్థావస్థ లేనేలేదని స్పష్టం చేశారు. ‘ప్రారంభం నుంచి ఈరోజు (గురువారం) ఉదయం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసేవరకు కూడా కోవిడ్–19 ప్రొటోకాల్ నిబంధనలన్నిటినీ పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామనే మేం చెబుతూ వచ్చాం. ప్రతి గదికి 15 మంది విద్యార్థులుండేలా చూడడం, భౌతికదూరం పాటించడం, కోవిడ్–19 ప్రొటోకాల్లోని చివరి అంశం వరకు అన్నిటినీ పాటిస్తూ పరీక్షలు నిర్వహించే ఉద్దేశంతోనే ఉన్నాం. పరీక్షల నిర్వహణ అనేదే మా మొదటి ప్రాధాన్యం. పరీక్షల రద్దు అనేది రెండో ఆప్షన్ మాత్రమే. మా ముఖ్యమంత్రి మొదటినుంచి విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని పలుసార్లు చెబుతూ వస్తున్నారు. పరీక్షలు నిర్వహించడానికే మేము ముందునుంచి ప్రయత్నిస్తున్నాం.అదే విషయాన్ని అఫిడవిట్లో కూడా స్పష్టంగా చెప్పాం. పరీక్షల విషయంలో ప్రభుత్వంలో కన్ఫ్యూజన్ అనేది ఎక్కడా లేదు. అఫిడవిట్లో కూడా పరీక్షలు ఎలా నిర్వహిస్తామో అన్న అంశాలను కూడా స్పష్టంగా పేర్కొన్నాం. మొదటి నుంచి కూడా పరీక్షల నిర్వహణకు ఎన్నిరోజులు ఉండాలో చెబుతూ వస్తున్నాం. పరీక్షల నోటిఫికేషన్ నుంచి విద్యార్థులు సన్నద్ధం అవ్వడానికి తగినంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులకు కనీసం 15 రోజులైనా సమయం ఇచ్చి తరువాత పరీక్షలు నిర్వహించాలి. ఇంటర్లో 7 పేపర్లున్నాయి. రోజువిడిచి రోజు పరీక్షలు నిర్వహించేలా ఇంతకుముందే షెడ్యూల్ కూడా ఇచ్చాం. జూలై 27లోగా పూర్తిచేయాలనుకున్నాం. ఆ తరువాత ఎవాల్యుయేషన్కు 15 రోజులు. అనంతరం ఇతర ప్రక్రియలను పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలనుకున్నాం. గౌరవ న్యాయస్థానం గడువులను నిర్దేశిస్తూ వాటిని అనుసరించి ముందుకెళ్లాలని ఆదేశించినందున మాకు మరో ఆప్షన్ లేదు. కోర్టు ఆదేశించిన టైమ్ షెడ్యూల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందున విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రెండో ఆప్షన్గా పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చింది’ అని వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను నెలరోజుల కిందటే తాము ప్రకటించామని గుర్తుచేస్తూ ఆ షెడ్యూల్ ప్రతిని చూపారు. ‘పరీక్షలను జూలై 7 నుంచి ప్రారంభిస్తామని షెడ్యూల్లో పేర్కొన్నాం. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడు నిర్వహిస్తారని అడగలేదు. ఎలా నిర్వహిస్తారని మాత్రమే అడిగింది. అదే విషయం చెప్పాం. ఏయే ప్రక్రియలను దశలవారీగా ఎలా నిర్వహిస్తామో కూడా కోర్టుకు చెప్పాం. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వంలో తొలినుంచి ఎలాంటి సందిగ్ధతా లేదు..’ అని మంత్రి స్పష్టం చేశారు. హైపవర్ కమిటీ సూచనల మేరకు మార్కుల కేటాయింపు ‘ఆయా తరగతులకు సంబంధించిన మార్కులను ఏ పద్ధతుల్లో కేటాయించాలన్న దానిపై త్వరలోనే విధానాన్ని ప్రకటిస్తాం. మార్కులు ఎలా తీసుకోవాలన్న దానిపై సీబీఎస్ఈ సవివర గైడ్లైన్స్ ఇచ్చింది. ఎలా అసెస్మెంటు చేయాలి? ఏయే పరీక్షలను పరిగణనలోకి తీసుకోవాలి? అన్న అంశాలను అందులో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర కేవలం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల మార్కులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఏవిధంగా అసెస్మెంటు చేయాలి? ఎలా మార్కులు తీసుకోవాలో ఆ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం’ అని మంత్రి తెలిపారు. చదవండి: ఏపీ: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్తో మంత్రి బుగ్గన భేటీ -
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
ఢిల్లీ: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. కోవిడ్ నివారణ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కోర్టు ఆదేశాలకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. వేర్వేరు రోజుల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష గదిలో 15 నుంచి 18 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ప్రతి విద్యార్థికి 5 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని, భౌతిక దూరం, శానిటేషన్ తదితర అంశాలను కచ్చితంగా అమలు చేస్తామని అఫిడవిట్లో పేర్కొంది. విద్యార్థుల ఎంట్రీ, ఎగ్జిట్ వేర్వేరుగా ఉంటాయని అఫిడవిట్లో పేర్కొన్న ప్రభుత్వం .. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నట్లు సుప్రీంకు స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహణకు కోర్టు అనుమతి ఇవ్వాలని అఫిడవిట్లో పేర్కొంది. కాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఏపీలో టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అనుమతి: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం -
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తూ నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఈ పరీక్షలపై మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో పరీక్షల అవసరం, వాటి నిర్వహణ కోసం చేపట్టబోయే చర్యల గురించి తెలియచేశామన్నారు. ఈమేరకు మంత్రి ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘çసుప్రీంకోర్టులో ఈరోజు కేరళ, ఆంధ్రప్రదేశ్లలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విచారణ జరిగింది. సుప్రీంకోర్టు రాష్ట్రాల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అది నిజం కాదు. పరీక్షలు ఎందుకు నిర్వహించాలి? నిర్వహించాల్సిన అవసరమేముంది? అనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం అడిగింది. దానికి సమాధానమిస్తూ పరీక్షలు ఎలా నిర్వహిస్తాం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి సుప్రీంకోర్టుకు వివరించాం. ప్రధానంగా ఒక్కో రూములో 15కి మించి విద్యార్థులు లేకుండా, అలాగే ప్రతి విద్యార్థికీ అయిదడుగుల భౌతికదూరం ఉండేలా చూస్తూ, కోవిడ్–19 ప్రొటోకాల్ నియమ, నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు తెలియచేశాం. అంతేకాకుండా పరీక్షల ఆవశ్యకతను ముఖ్యంగా ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్న అంశాన్ని వివరించాం. పదో తరగతిలో కూడా మార్కులు కాకుండా గ్రేడ్లు మాత్రమే ఇస్తామని చెప్పాం. కోర్టు వాటన్నిటినీ అఫిడవిట్ ద్వారా తెలియచేయాలని రెండురోజుల గడువు ఇచ్చింది. కేసును గురువారానికి వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితులన్నిటినీ అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు వివరించనున్నాం. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటాం. వారు ఏ నిర్ణయం చెప్పినా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
టెన్త్ మరియు ఇంటర్ పరీక్షల పై నేడు సీఎం జగన్ కీలక నిర్ణయం
-
టెన్త్ పరీక్షలు రద్దు చేయం: మంత్రి ఆదిమూలపు సురేష్
-
ఉన్నత చదువులు, ఉద్యోగాలకు టెన్త్ ప్రామానికం: మంత్రి ఆదిమూలపు సురేష్
-
టెన్త్ పరీక్షలు రద్దు చేయం: మంత్రి సురేష్
సాక్షి, తూర్పుగోదావరి: టెన్త్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితులు అనుకూలిస్తే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు టెన్త్ ప్రామాణికమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. చదవండి: చిన్నారి సింధుశ్రీ హత్య కేసు: వీడిన మిస్టరీ విషాదం: నాన్నా... ఇది తగునా !.. -
పరిస్థితులు అనుకూలించాక పరీక్షలు నిర్వహిస్తాం: ఆదిమూలపు సురేష్
-
విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం: ఆదిమూలపు సురేష్
-
ఏపీలో టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ
-
ఏపీలో టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ
సాక్షి, అమరావతి: ఏపీలో టెన్త్ పరీక్షలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. టీచర్లకు వ్యాక్సిన్ పూర్తయ్యాకే పరీక్షలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టింది. టెన్త్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. లిఖిత పూర్వకంగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 18కి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జులైలో మరోసారి సమీక్షించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. చదవండి: పోలవరం ప్రాజెక్ట్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అర్చకులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. -
విద్యార్థుల భవిష్యత్తును చెడగొడతారా?: బాంబే హైకోర్ట్
ముంబై: పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వం ఏప్రిల్లో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ధనంజయ్ కులకర్ణి అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ‘మీరు విద్యావ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. పాఠశాల విద్యలో ఆఖరుదైన పదో తరగతి చాలా ముఖ్యమైంది. పరీక్షలు కూడా అంతే. మహమ్మారి వంకతో పరీక్షలు లేకుండా విద్యార్థులను పై తరగతులకు పంపిస్తారా? విద్యార్థుల భవిష్యత్తును చెడగొడతారా? అలా అయితే, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దేవుడే కాపాడాలి’అని వ్యాఖ్యానించింది. ‘12వ తరగతి పరీక్షలను నిర్వహిస్తూ 10వ తరగతికే ఎందుకు రద్దు చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది. -
మునిసిపల్ స్కూళ్లలో 'ఇ–లెర్నింగ్'
సాక్షి, అమరావతి: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలో మునిసిపల్ పాఠశాలలు ముందడుగు వేస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పదోతరగతి విద్యార్థులను పూర్తిస్థాయిలో పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఇ–లెర్నింగ్ బాట పట్టాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు చేపట్టడం ఇదే తొలిసారి. ముందుగా 5 మునిసిపాలిటీల్లో పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు బుధవారం ప్రారంభించారు. వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 125 మునిసిపాలిటీల్లోనూ అమలు చేయనున్నారు. తద్వారా 32 వేలమంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. అత్యుత్తమ ఫలితాలే లక్ష్యంగా.. మరో నెలరోజుల్లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా పరిస్థితులతో పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సి వచ్చింది. కానీ మునిసిపల్ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులు నష్టపోకుండా ఉండాలని పురపాలకశాఖ భావించింది. అందుకే ఇ–లెర్నింగ్ విధానంలో వారిని పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం నెలరోజులపాటు ఆన్లైన్ క్లాసుల నిర్వహణ ప్రణాళికను రూపొందించింది. ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం అన్ని సబ్జెక్ట్ నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు ముందుగా తయారుచేసిన టీఎల్ఎం వీడియోలు, పీపీటీలను ఆన్లైన్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచి బోధిస్తారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రం మోడల్లోనే విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం విజయవాడ, ఒంగోలు, శ్రీకాళహస్తి, తిరుపతి, నరసాపూర్ నగరాలు, పట్టణాల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు. సబ్జెక్టులవారీగా నిపుణులు ఆన్లైన్ క్లాసులు నిర్వహించి విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. వారికి ప్రేరణనివ్వడం, చేతిరాత పరిశీలించడం, పరీక్షల్లో వివిధ అంశాలపై సకాలంలో సమాధానాలను రాసే విధానాన్ని పర్యవేక్షించారు. తొలిరోజు సమస్యలేమీ ఎదురుకాలేదు. మరో నాలుగు రోజులపాటు వీరికి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని 125 మునిసిపాలిటీల్లోని 32 వేలమంది పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. సందేహాలు నివృత్తి అవుతున్నాయి పదోతరగతి పరీక్షలు నెలరోజులు ఉన్నాయి. స్కూల్కు వెళ్లలేకపోతున్నామని ఎంతో కంగారుపడ్డాను. ఇప్పుడా ఆందోళన తీరింది. ఆన్లైన్ క్లాసులు మాకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. పదోతరగతి పరీక్షలకు సంబంధించిన సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. – మురపాక జ్యోత్స్న, పదోతరగతి విద్యార్థిని, నరసాపురం మునిసిపల్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా.. ఆన్లైన్ క్లాసులు అంటే కార్పొరేట్ పాఠశాలలకే పరిమితం అన్న భావనను తొలగిస్తున్నాం. మునిసిపల్ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాం. – డి.కృష్ణవేణి, స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్), విజయవాడ. ఇప్పుడు ధైర్యంగా ఉంది మా పిల్లలు పదోతరగతి పరీక్షల కోసం ఎలా చదువుతారో అనే భయం ఉండేది. కానీ ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టడంతో మా భయం పోయింది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలన్న నిర్ణయం ఎంతో ఊరటనిస్తోంది. – ఎస్.మాధురి, విద్యార్థిని తల్లి, తిరుపతి అత్యుత్తమ ఫలితాలే ధ్యేయం కరోనా పరిస్థితులతో మా విద్యార్థులు నష్టపోకూడదు. అందుకే మునిసిపల్ విద్యాశాఖ ఆన్లైన్ తరగతుల ప్రణాళిక రూపొందించింది. పదోతరగతి పరీక్షలకు మా విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తాం. – మిద్దే శ్రీనివాసరావు, స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక్స్), గుడివాడ. -
ఇంటర్ పరీక్షలు వాయిదా వేశాం
సాక్షి అమరావతి: కరోనా నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. హైకోర్టు సూచనలను, పిటిషనర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం వ్యవహారంపై సమీక్షించి ఈ నెల 5 నుంచి జరపాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ సోమవారం హైకోర్టుకు తెలిపారు. పదోతరగతి పరీక్షల వాయిదా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వచ్చే మూడు వారాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. పదోతరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గత వారం విచారణ జరిపిన ధర్మాసనం.. పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి పరీక్షల తేదీలను ఖరారు చేశారా? అని ధర్మాసనం అడిగింది. కరోనా, ఇతర పరిస్థితులను బట్టి తదుపరి తేదీలను ప్రకటిస్తామని శ్రీరామ్ చెప్పారు. షెడ్యూల్ ఈ రోజు ఇచ్చి రెండు మూడురోజుల్లో పరీక్షలు ఉంటాయని చెప్పారు కదా.. అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేయగా, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులకు తగిన సమయం ఇస్తామని ఏజీ తెలిపారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో తదుపరి విచారణను జూన్ 2కి వాయిదా వేసింది. -
పది, ఇంటర్ పరీక్షలపై పునరాలోచించండి
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచించాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనలను, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అధికారులతో మాట్లాడి ఏ విషయం తమకు చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్కు సూచించింది. ప్రభుత్వం తెలియచేసే వైఖరిని బట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. తదుపరి విచారణను మే 3కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ బోర్డులను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ విజయవాడకు చెందిన ఇంటర్ విద్యార్థి పి.దర్శత్, పదో తరగతి విద్యార్థులు వేణు మాధవ్, రమేష్ చౌదరిలు హైకోర్టు లో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాం: ఏజీ శ్రీరామ్ ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది బసవ ప్రభుపాటిల్ వాదనలు వినిపిస్తూ.. ‘ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మంది, పదో తరగతి పరీక్షలకు 5 నుంచి 6 లక్షల మంది హాజరు కానున్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. పరీక్షల ప్రక్రియలో టీచర్లు, అధికారులు, సిబ్బందికి కూడా కోవిడ్ ప్రమాదం పొంచి ఉంటుంది. పరీక్షలు రద్దు చేయాలని మేము కోరడం లేదు.. కేవలం వాయిదా కోరుతున్నాం అంతే’ అని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం పలు రాష్ట్రాలు నిర్వహించే జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై ఆరా తీసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా వేయకుండా ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. పలు రాష్ట్రాలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిసిందని ప్రభు పాటిల్ చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? అని ప్రశ్నించింది. పెరుగుతున్నాయని శ్రీరామ్ చెప్పగా, కాబట్టే పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచన చేయాలని కోరుతున్నామని ధర్మాసనం తెలిపింది. విద్యార్థులంతా ఒకే చోట ఉండరని, వేర్వేరుగా పరీక్ష కేంద్రాలు ఉంటాయని శ్రీరామ్ తెలిపారు. కోవిడ్ సోకినవారు కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం ఐసోలేషన్లో ఉండి తీరాలని ధర్మాసనం గుర్తుచేసింది. దీనికి శ్రీరామ్ స్పందిస్తూ.. కరోనా వల్ల, ఒత్తిడి వల్ల ఏదయినా కారణం వల్ల పరీక్ష రాయని వారికి మళ్లీ పరీక్ష పెడతామన్నారు. పరీక్ష రాయడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుందన్నారు. -
Manabadi Nadu Nedu: నాణ్యతలో రాజీవద్దు
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ పనిలో నాణ్యత (క్వాలిటీ)తో కూడిన ఆడిటింగ్ జరగాలని, అన్ని స్కూళ్లలో పనుల్లో నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశించారు. మే, జూన్ రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా సూచించారు. మే చివరి నాటికి ‘మన బడి నాడు–నేడు’ మొదటి దశ పనులు పూర్తవ్వాలని ఆదేశించారు. జూలైలో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక కిట్లు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకుసూచించారు. ‘మనబడి నాడు–నేడు’ మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిపై సీఎం జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరిస్తూ వాటిని ప్రజెంటేషన్ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సమీక్షలో పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. బిల్డింగ్స్పై కూడా పెయింటింగ్స్ వేయండి ‘‘స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్పై కూడా పెయింటింగ్స్ వేయండి. మన బడి నాడు–నేడు పనులు పూర్తయ్యాక, ప్రతి స్కూల్లో నాడు ఆ స్కూల్ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అన్న ఫొటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అప్పుడే ఇప్పుడు చేసిన పనులకు మరింత విలువ వస్తుంది. వాటి ప్రాధాన్యత తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్ను ఎలా నిర్వహించాలన్న దానిపైనా వారికి అవగాహన కలుగుతుంది. స్కూళ్లలో పెయింటింగ్ పనులు, స్మార్ట్ టీవీలు, వాల్ ఆర్ట్తో సహా అన్ని పనులు తప్పనిసరిగా మే చివరి నాటికి పూర్తి కావాలి. పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదు. అందుకే పేరెంట్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాడు–నేడులో ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా పనులు జరగాలి. వాటిలో ఎక్కడా తేడా ఉండకూడదు. అలాగే మే, జూన్ నెలల్లో పూర్తిగా పనుల నాణ్యతను చూడాలి. ప్రతి స్కూల్ సందర్శించాలి. అన్నీ నోట్ చేయాలి. క్వాలిటీ ఆడిట్ పూర్తి కావాలి. టాయిలెట్ నిర్వహణ వ్యవస్థ కూడా స్కూళ్లు తెరిచే నాటికి పూర్తి కావాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన సజావుగా జరిగేలా టీచర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే వారు ఏ ఇబ్బందీ లేకుండా ఇంగ్లీష్లో పాఠాలు చెప్పగలుగుతారు. పిల్లలు స్కూళ్లకు వచ్చే నాటికే విద్యా కానుక కూడా సిద్ధం కావాలి. ఈసారి కిట్లలో ఇంగ్లీష్ డిక్షనరీ కూడా తప్పనిసరిగా ఉండాలి. విద్యా కానుక కింద ఇస్తున్న కిట్లలో ప్రతి ఒక్కటీ పూర్తి నాణ్యత కలిగి ఉండాలి. జూలైలో స్కూళ్లు తెరవగానే మనబడి నాడు–నేడు రెండో దశ పనులు మొదలు కావాలి. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ విద్యార్థుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు విద్యార్దుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఏ పరిస్థితిలో ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది చెప్పాలి. నిన్న కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్నీ ప్రకటించలేదు. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. అలాంటప్పుడు మంచి కాలేజీల్లో వారికి సీట్లు వస్తాయి? పరీక్ష రాసిన వారికి 70 శాతం పైగా మార్కులు వస్తే, సీట్లు వారికే వస్తాయి కదా? కేవలం పాస్ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏమిటి? విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.నిజానికి పరీక్షలు రద్దు చేయడం చాలా సులభం. పరీక్షల నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నది. కేవలం విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్ గుర్తించాలి. ఇందులో అందరి సహాయ సహకారాలు కావాలని, తోడ్పాటు కావాలన్న విషయాన్ని వారందరికీ బలంగా చెప్పండి. అలాగే పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఏ మాత్రం అలక్ష్యం చూపొద్దు. అన్ని కోవిడ్ జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహించాలి.’’ అని సీఎం పేర్కొన్నారు. ఇంకా ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసమే..
ప్రతి విద్యార్ధి కోసమే నేను ఆలోచిస్తున్నా... టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుంటే వారి భవిష్యత్తుకే నష్టం. పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పడం చాలా సులభం. అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించడం కష్టమే అయినా పిల్లల కోసం కష్టతరమైన మార్గాన్ని ఎంచుకున్నాం. అన్ని జాగ్రత్తలతో బాధ్యతగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రతి తల్లికీ భరోసా ఇస్తున్నా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గి రాజేయడానికి, వక్రీకరించేందుకు ప్రయత్నాలు చేయడం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పాస్ మార్కుల సర్టిఫికెట్తో ఓ విద్యార్థి బయటపడితే తరువాత వారి భవిష్యత్తు సంగతి ఏమిటని ప్రశ్నించారు. బొటాబొటి మార్కులతో పాసైన వారికి మంచి కాలేజీల్లో సీట్లు ఎలా వస్తాయని, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మన విద్యార్థులు ఎలా నెగ్గుకు రాగలుగుతారో ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. వరుసగా రెండో ఏడాది ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద తొలివిడతగా 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.1,048.94 కోట్లను సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని తల్లులు, విద్యార్థులు, అధికారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రసంగం వివరాలు ఇవీ... ఒక్కసారి ఆలోచన చేయండి.. పిల్లలు, తల్లిదండ్రులు అంతా ఆలోచించాల్సిన విషయాలు చెబుతా. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేస్తున్న వారికి కూడా చెబుతున్నా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లవాడి భవిష్యత్తు కోసం నాకన్నా ఎక్కువగా ఆలోచించేవారు ఎవరూ ఉండరని చెబుతున్నా. అంతగా మన పిల్లల కోసం నేను ఆలోచిస్తున్నా, తపిస్తున్నా. వారి కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇవాళ మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గి పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాలదే ఆ నిర్ణయం.. ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన పాలసీ లేదు. కేంద్రం కొన్ని నిర్ణయాల బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తున్నాయి. కేవలం పాస్ సర్టిఫికెట్లతో ఏం ఉపయోగం? ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి నుంచి ఓ విద్యార్థి పాస్ సర్టిఫికెట్తో బయటపడితే.. లేదా కేవలం పాస్ మార్కులతో బయటకు వస్తే ఆ విద్యార్థికి మరో 50 ఏళ్ల పాటు భవిష్యత్తు ఏమిటి? పరీక్షలు నిర్వహించే రాష్ట్రాల విద్యార్థుల మార్కులు గొప్పగా ఉంటే, పరీక్షలు జరపకుండా కేవలం పాస్ మార్కులతో, ఆ సర్టిఫికెట్లతో మన పిల్లలు ఉంటే వారికి గొప్ప కాలేజీలలో సీట్లు ఎలా వస్తాయన్నది ఒక్కసారి ఆలోచించండి. పరీక్షలు నిర్వహించకపోతే ఉత్తీర్ణులైనట్లు కేవలం పాస్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తారు. మరి అలాంటప్పుడు పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకున్న వారితో ఈ విద్యార్థులు ఎలా పోటీ పడతారు? ఈ పిల్లలకు మంచి కాలేజీలలో సీట్లు ఎలా వస్తాయి? రద్దు చాలా సులభం అయినా.. పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పడం చాలా సులభం. ప్రతి అడుగులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించడం చాలా కష్టం. పిల్లల కోసం కష్టతరమైన మార్గం అయినా కూడా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఆ పిల్లలకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం. పిల్లలకు మంచి చేయాలన్నదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని మరోసారి తెలియజేస్తున్నా. అన్ని జాగ్రత్తలతో బాధ్యతగా తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని ప్రతీ తల్లికీ భరోసా ఇస్తున్నా. – ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆర్ అండ్ బీ మంత్రి ఎం.శంకరనారాయణ, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా చదువుకుంటున్నారు ఫీజులు కట్టలేక ఆపేద్దామనుకున్నా.. అమ్మ, అన్నయ్య కూలి పనులు చేసి నన్ను చదివిస్తున్నారు. జేఎన్టీయూ అనంతపురంలో సీటు వచ్చింది. ఫీజులు కట్టలేక చదువు ఆపేద్దామనుకున్నా. మీరు నాకు రూ.20 వేలిచ్చారు. వచ్చే ఏడాదికల్లా ల్యాప్టాప్ కూడా అందుతుంది. నాకు నాన్న లేకపోయినా మేనమామలా అన్నీ చేస్తున్నారు. ఆడపిల్లలు మీవల్ల ధైర్యంగా చదువుకుంటున్నారు. – హారిక, బీటెక్, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు అన్నలా.. మేనమామలా.. నేను కూలికి వెళతా. ఇంటర్ తర్వాత పెద్దమ్మాయి చదువు ఆపేద్దామనుకునే సమయంలో మీ పథకాలు ఆదుకున్నాయి. నా భర్త ఆటో డ్రైవర్. వాహనమిత్ర ద్వారా లబ్ధి పొందారు. ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ కూడా చేశారు. నాకు డ్వాక్రా రుణమాఫీ వచ్చింది. మా పిన్ని భర్త చనిపోతే పింఛన్ అందుతోంది. మాకు అన్నలా, మా పిల్లలకు మేనమామలా అన్నీ చేస్తున్నారు. – రమణమ్మ, విద్యార్థిని తల్లి, పేర్నమిట్ట, ప్రకాశం జిల్లా మాకు ఎంతో చేస్తున్నారు.. నా తమ్ముడు, నేను చదువుతున్నామంటే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలే కారణం. గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్, స్కాలర్షిప్ డబ్బులు హాస్టల్ ఖర్చులకు కూడా సరిపోయేవి కాదు. పక్క రాష్ట్రాల విద్యార్ధులు కూడా మీలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నారు. మీరు దేశంలోనే బెస్ట్ సీఎం. –గుత్తావుల తేజేశ్వరరావు, విద్యార్థి, ఆగూరు గ్రామం, శ్రీకాకుళం -
Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్లో జరగనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్యాట్రన్లో మార్పులు, గ్రూప్ కాంబినేషన్లు, నామినల్ రోల్స్, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు సవివర సూచనలను చేస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం సర్క్యులర్ విడుదల చేశారు. పరీక్ష పేపర్లు, సమయం, మార్కులు తదితర అంశాలను అందులో వివరించారు. ఈ సర్క్యులర్ ప్రకారం.. ► ఈ పరీక్షలకు తొలిసారి హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులంతా తెలుగు భాషను ఫస్ట్ లాంగ్వేజ్ లేదా సెకండ్ లాంగ్వేజ్ కిందS తప్పనిసరిగా రాయాలి.► తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్గా ఉన్న విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ తప్పనిసరిగా రాయాలి.► ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగును ఎంచుకుంటే సెకండ్ లాంగ్వేజ్ పేపర్గా హిందీని మాత్రమే ఎంపిక చేసుకోవాలి.►తమిళం, కన్నడ, ఒరియా తదితర మాతృభాషలను ఫస్ట్ లాంగ్వేజ్గా ఎంచుకున్న విద్యార్థులు రెండో పేపర్గా తెలుగును తప్పనిసరిగా రాయాలి. పబ్లిక్ పరీక్షల్లో.. ఇంటర్నల్ మార్కులకు వెయిటేజీ ఉండదు.►ఏడు పేపర్లలో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు ఒక్కొక్కటి 100 మార్కులకు ఉంటాయి. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పరీక్షలు 50 మార్కుల చొప్పున వేర్వేరుగా ఉంటాయి.► ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ పేపర్–1.. 70 మార్కులకు, పేపర్–2.. 30 మార్కులకు ఉంటాయి.► లాంగ్వేజ్ పరీక్షలు, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు రాసేందుకు ఒక్కో పేపర్కు 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాల (మొత్తం 3 గంటల 15 నిమిషాలు) సమయం ఇస్తారు. ►ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పరీక్షలు రాసేందుకు 2.30 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాలు (మొత్తం 2 గంటల 45 నిమిషాలు) ఇస్తారు.► 2017 మార్చిలో మొదటిసారి టెన్త్ పరీక్షలకు హాజరై 2019 జూన్ వరకు ఆ పరీక్షలను పూర్తిచేయనివారు కొత్త స్కీమ్లో ప్రస్తుతం నిర్వహించే పరీక్షలకు రిజిష్టర్ కావచ్చు.► ఇంటిపేరుతో సహా అభ్యర్థి పూర్తిపేరు, తండ్రి, తల్లి పూర్తి పేర్లు నమోదు చేయాలి. అనాథలకు సంరక్షకుల పేరు నమోదు చేయాలి.► స్కూలు రికార్డుల్లో నమోదైన వారిని మాత్రమే రెగ్యులర్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. ► గుర్తింపు ఉన్న స్కూలు నామినల్ రోల్స్ మాత్రమే రెగ్యులర్ అభ్యర్థులుగా అప్లోడ్ చేయాలి.► చెవిటి, మూగ, అంధత్వం తదితర బహుళ దివ్యాంగులకు రెండు లాంగ్వేజ్లకు బదులు ఒక్కటే ఎంచుకోవచ్చు. వీరికి ప్రతి సబ్జెక్టులో పాస్ మార్కులు 20 మాత్రమే. -
కొత్త నమూనాలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కొత్త నమూనాలో నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లిష్, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్సు, బయోలజీ పేపర్లను 50 మార్కులకు వేర్వేరుగా నిర్వహించనున్నారు. ఇంతకు ముందు సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో ఒక్కోసబ్జెక్ట్లో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించి, మిగిలిన 20 మార్కులను అంతర్గత (ఇంటర్నల్) మార్కుల నుంచి తీసుకొని కలిపేవారు. 2021 మార్చి పరీక్షలకు ఈ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా 100 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ మేరకు ప్రశ్నపత్రం నమూనాలో స్వల్ప మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం జీవో విడుదల చేసింది. దీని ప్రకారం ప్రశ్నపత్రాల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, అతి స్వల్ప సమాధానాల ప్రశ్నలు, స్వల్ప సమాధానాల ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలను అడగనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 2.30 గంటల సమయం కేటాయిస్తున్నారు. ప్రశ్నపత్రం చదివేందుకు 15 నిమిషాల పాటు అదనపు సమయం ఇస్తారు. చదవండి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల నిర్మాణం కూలిన ‘దేశం’ కంచు కోటలు -
ఏపీ: టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్( ఏడు పేపర్లు) : జూన్ 7(సోమవారం) : ఫస్ట్ లాంగ్వేజ్ జూన్ 8( మంగళవారం) : సెకండ్ లాంగ్వేజ్ జూన్ 9(బుధవారం) : ఇంగ్లీష్ జూన్ 10(గురువారం) : గణితం జూన్ 11 (శుక్రవారం) : ఫిజికల్ సైన్స్ జూన్ 12 (శనివారం) : బయోలాజికల్ సైన్స్ జూన్ 14( సోమవారం) : సోషల్ స్టడీస్ జూన్ 15 ( మంగళవారం) : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 ఓఎస్ఎస్సీ మేయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్) జూన్ 16 ( బుధవారం ) ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు(థియరీ) -
ఊరంతా తీపి
రవంత పిల్ల ర్యాంకర్ అయింది! ఆ సైకిల్ మీద వెళ్లొచ్చే అమ్మాయేనా! మన పురుషోత్తం కూతురు కదా. ప్రెస్సోళ్లు కూడా వచ్చిపోతున్నారు. ఊరికి ఎప్పుడూ ఇంత పేరు లేదు. ఊళ్లోవాళ్లంతా కూడలికి చేరారు. ఊరి నోరంతా తీపి చేశారు. ఒక తునక రోష్నీ నోటికీ అందించారు. మధ్యప్రదేశ్, భింద్ జిల్లాలోని అజ్నోల్ గ్రామంలో అంతా కలిపి 1200 మంది వరకు ఉంటారు. శనివారం సాయంత్రం ఆ ఊరికి ఉన్న ఒకే ఒక కూడలిలో గ్రామస్థులలోని కొందరు.. పనుల మధ్యలో తమ దుకాణాల బయటికి వచ్చి, ఒక కుర్రాడి చేతిలో ఉన్న స్వీట్ బాక్సులోని తమ వంతు లడ్డూలు తీసుకున్నారు. అందరికి కన్నా ఎక్కువ లడ్డూలు తిన్నది రోష్నీ. తీసుకున్న లడ్డూలోంచి ప్రతి ఒక్కరూ చిన్న తునక తీసి మొదట రోష్నీకి పెట్టి తర్వాత తాము తిన్నారు మరి. ఆమె ఇక చాలంటున్నా, గ్రామానికి ఆమె సాధించిన పెట్టిన గొప్ప ప్రతిష్టను వారంతా దాదాపు ఒక ఉత్సవంగా జరుపుకున్నారు. ఆ మధ్యాహ్నమే వచ్చిన టెన్త్ ఫలితాలలో 98.5 శాతం మార్కులు సంపాదించి, స్టేట్లోనే 8 వ ర్యాంకులో నిలబడింది రోష్నీ. ఆమె నిలబడటం కాదు. ఊరిని నిలబెట్టింది. అజ్నోల్లోనే కాదు, భింద్ జిల్లాలో కూడా ఏ ఆడపిల్లా ఇప్పటి వరకు ఇంతటి ఘనతను స్కూల్ నుంచి మోసుకురాలేదు. రోష్నీకి మేథ్స్లో, సైన్స్లో వందకు వంద మార్కులు వచ్చాయి! స్వీట్లు పంచిన కుర్రాడు రోష్నీ అన్న. ఇంటర్ చదువుతున్నాడు. పక్కనే రోష్నీ తమ్ముడూ ఉన్నాడు. అతడు నాలుగో తరగతి. గ్రామస్థులంతా మెచ్చుకుంటూ ఉంటే తమ ముగ్గురు పిల్లల్ని చూసుకుని మురిసిపోయారు రోష్నీ తండ్రి పురుషోత్తం, తల్లి సరితాదేవి. నిజానికిది భింద్ జిల్లా మొత్తం మురిసిపోవలసిన సందర్భం. ఆ జిల్లాలో ఒక్కేడాదైనా ‘బాలికలే ముందంజ’ అనే మాట వినిపించలేదు. జనాభా నిష్పత్తిలోనూ ఆడవాళ్లు తక్కువ ఉన్న జిల్లా భింద్. 2011 లెక్కల ప్రకారం బాలురు వెయ్యిమంది ఉంటే బాలికలు 837 మందే ఉన్నారు. మహిళల్లో అక్షరాస్యత 64 శాతం మాత్రమే. రోష్ని తల్లి సరితాదేవి ఇంటర్ వరకు చదివారు. ఆమె చదువుకునే రోజుల్లోనైతే ఈ శాతం 55 మాత్రమే. ఆడపిల్లలు మధ్యలోనే బడి మానవలసిన పరిస్థితులు అత్యధికంగా ఉన్న భింద్ జిల్లాలో రోష్నీ విజయం ఇక ముందు స్ఫూర్తిగా పనిచేయవచ్చు. అయితే రోష్నీని మరొకందుకు కూడా.. ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం కూడా ప్రేరణగా తీసుకోవాలి. ఆ అమ్మాయి చదువు అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. రోష్నీ వాళ్లండే అజ్నోల్ గ్రామం నుంచి ఆమె స్కూల్ ఉన్న మెగావ్ గ్రామం 12 కి.మీ.లు. రానూపోను 24 కి.మీ. రోజూ సైకిల్ మీద స్కూల్కి వెళ్లొచ్చేది. ఎర్రటి ఎండల్లో, ఎడతెరిపి లేని వానల్లో కూడా ఏ రోజూ రోష్నీ స్కూలు మానలేదు. వరదల్లో దారి మూసుకుపోయినప్పుడు మోగావ్లోని చుట్టాల ఇంట్లో ఉండి స్కూలుకు వెళ్లొచ్చింది. ఇంటికి రాకుండా మెగావ్లోనే ఉండిపోయిన రోజులూ ఉన్నాయి. గ్రామాల్లో ఇది మామూలే అయినా.. ఎండకు, వానకు, గడువు తేదీలోపు ఫీజు కట్టలేని పరిస్థితులకు, స్కూలుకు వెళ్లలేని శారీరక అననుకూలతలకు చదువును వదిలేయకపోవడం మామూలు సంగతైతే కాదు. రాక్షసిలా చదువును పట్టేసుకుంది రోష్నీ. ఆ రాక్షసి ఇప్పుడు రోష్నీని పట్టేసుకుంది. ఐ.ఎ.ఎస్. చదువుతాను అంటోంది రోష్నీ. కలెక్టర్ అవాలని తను చిన్నప్పుడే నిర్ణయించుకుంది. ఎవరో చెప్పారట.. కలెక్టర్ అయితే పేద వాళ్లందరికీ మంచి చెయ్యొచ్చని. ఇంటర్లో మేథ్స్ తీసుకోబోతోంది. మెగావ్లో కాలేజ్ కూడా ఉంది. రోష్నీని రోజూ మేమే కాలేజ్ దగ్గర దింపి వస్తాం అని బంధువులు ఇప్పటినుంచే పోటీలు పడి మాట ఇస్తున్నారు. రోష్నీ తండ్రి రైతు. నాలుగెకరాల పొలం ఉంది. పొలంతోనే కుటుంబ పోషణ. రోష్నీకి ర్యాంకు రావడంతో ఆయనకు పట్టలేనంత సంతోషంగా ఉంది. ఊరి మొత్తం మీద ఇప్పుడాయన ప్రయోజకుడైన తండ్రి! ‘‘నా ముగ్గురు పిల్లల చదువుల గురించి గర్వంగా చెప్పుకోగలను. రోష్నీ ఇప్పుడు ఊరికే గర్వ కారణం అయింది’’ అంటున్నారు ఆయన. ‘‘నా కూతురు పెద్ద డిగ్రీలు చదవాలి. పెద్ద కంపెనీల్లో పని చేయాలి. పెద్ద నగరాలలో తిరగాలి’’ అని కూడా. -
ప్రారంభమైన టెన్త్ పరీక్షలు
బెంగళూరు : కర్ణాటక వ్యాప్తంగా గురువారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద తగినన్ని జాగ్రత్తలు చేపట్టారు. పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి లోపలికి అనుమతించారు. అనంతరం వారికి శానిటైజర్, మాస్కులు అందించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పూర్తిగా శానిటైజ్ చేశామని, విద్యార్థులు ధైర్యంగా పరీక్ష రాయవచ్చని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. పరీక్షా కేంద్రంలో ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక ఆరోగ్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కర్ణాటకలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 10వేల కరోనా కేసులు దాటాయి. (కర్ణాటక ప్రభుత్వానికి సూచించిన మాజీ సీఎమ్) -
టెన్త్ పరీక్షల రద్దు సరైన నిర్ణయం: పవన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రద్దు నిర్ణయం సరైనదని జనసేన పార్టీ పేర్కొంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ప్రకటించారు. దీనిపై స్పందించిన పవన్.. ‘ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్, సప్లిమెంటరీ రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించడం సరైన నిర్ణయమని పవన్ కల్యాణ్ కొనియాడారు. (కరోనా: ఏపీలో 8 వేలు దాటిన కేసులు) పదో తరగతి పరీక్షల రద్దు సముచిత నిర్ణయం. - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/POGimecY5n — JanaSena Party (@JanaSenaParty) June 20, 2020 -
ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ప్రకటించారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్లో ఫెయిల్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులంతా పాస్ అయినట్టు మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా, తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఇప్పట్లో విద్యార్థులకు పరీక్షలు వద్దు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్’ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రారంభమైన పది, పన్నెండో తరగతి పరీక్షలు అర్ధాంతరంగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. కరోనా వైరస్ భారత్లో బయట పడిన తర్వాతనే ఈ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ పరీక్షలు పూర్తికాగా, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పరీక్షలే జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు మొదలే కాలేదు. మొత్తానికి చూస్తే ఎక్కువ పరీక్షలేమిగిలిపోయాయి. జూన్ 14వ తేదీ నాటికి దేశంలో రోజుకు నమోదవుతున్న కరోనా కేసులు 12 వేలకు చేరుకోగా, దేశంలో మొత్తం కేసులు మూడు లక్షల ముప్పై వేలకు చేరుకుంది. జూలై చివరి నాటికి ఒక్క ఢిల్లీలోనే కరోనా కేసులు ఐదున్నర లక్షలకు చేరుకుంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఇప్పట్లో విద్యార్థులకు పది, పన్నెండవ తరగతులకు పరీక్షలే నిర్వహించరాదని, నిర్వహించకుండా పాస్ చేసినప్పటికీ విద్యాలయాలను ఇప్పట్లో ప్రారంభించరాదని విద్యావేత్తలు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరెంట్స్ కమిటీలు హైకోర్టులను ఆశ్రయించాయి. థర్మో అనలైజర్లు, శానిటైజర్లు, సామాజిక దూరం నిబంధనలు విద్యార్థినీ విద్యార్థుల విషయంలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేవని వారంటున్నారు. ఓ తరగతి గదిలో ఒక్కరికి వైరస్ సోకినా దాని ప్రభావం ఊహించలేనంతా ప్రమాదకరంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. -
ఏపీలో టెన్త్ పరీక్షలు యథాతథం
-
షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ.. తెలంగాణలో పరిస్థితులకు మనకు తేడా ఉంది. కరోనా వైరస్ నియంత్రణలో దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా ఉంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత విషయంలో రాజీపడం. టెన్త్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయి’ అని స్పష్టం చేశారు. కాగా మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కరోనా, లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్కు 100 మార్కులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (ఆ మూడింటి ఆధారంగా టెన్త్ అప్గ్రేడ్!) కాగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు అయిన విషయం విదితమే. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ విద్యార్థులను పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఫలితాల వెల్లడిపై ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టి పెట్టింది. తమ వద్ద ఉన్న విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ప్రాసెస్ చేసే ప్రక్రియను 10–12 రోజుల్లో పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. (తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు) -
టెన్త్ పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం
-
టెన్త్ పరీక్షలపై కేసీఆర్ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమీక్ష ఏర్పాటు చేశారు. సోమవారం ప్రగతి భవన్లో పలువురు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కరోనా కేసుల వల్ల రెండోసారి పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. వాటిని తిరిగి నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ( తెలంగాణ: టెన్త్ పరీక్షలు రద్దు?) ఆ మూడింటి ఆధారంగా టెన్త్ అప్గ్రేడ్! టెన్త్ విద్యార్థుల ఎస్ఏ-1, ప్రీ ఫైనల్, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఎస్ఎస్సీ అప్గ్రేడ్ చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఈ మేరకు అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది. ఇప్పటికే అన్ని పాఠశాలలు విద్యార్ధుల ఇంటర్నల్ మార్కులను ఎస్ఎస్సీ బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేసేశాయి. -
‘టెన్త్’ కొత్త కేంద్రాలపై మెసేజ్లు
సాక్షి, హైదరాబాద్ : కరోనా జాగ్రత్తల్లో భాగంగా పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కొత్త పరీక్ష కేంద్రాల సమాచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్ల రూపంలో పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభా గం డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి తెలిపారు. సెల్ఫోన్లు లేని, ఫోన్ల ద్వారా సమాచారం అందని వారి కోసం పాత పరీక్ష కేంద్రాల వద్ద సహాయకులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, విద్యార్థుల కోసం చేపడుతున్న చర్యలపై సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన వెల్లడించిన వివిధ అంశాలు... విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు పరీక్షల ముందు రోజు విద్యార్థులు, తల్లి దండ్రులు పాత పరీక్ష కేంద్రానికి వెళ్లి వివరాలను చూసుకుంటే పరీక్ష ప్రారంభం రోజున ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. పాత కేంద్రాల్లో ఏ హాల్టికెట్ నంబర్ నుంచి ఏ హాల్టికెట్ నంబర్ వారికి సెంటర్ ఉంది.. మిగతా వారికి సమీపంలోని ఏ భవనంలో అదనంగా కొత్త సెంటర్ను ఏర్పాటు చేశామన్న వివరాలు తెలుసుకోవచ్చు. జూన్ 7నే ఆ వివరాలను పాత కేంద్రాల వద్ద నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచుతాం. గంట ముందే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తాం కాబట్టి విద్యార్థులు అదే రోజు వెళ్లినా సమీపంలోని (కిలోమీటర్ పరిధిలోపే) కొత్త కేంద్రం వివరాలు పొందవచ్చు. ఆ వివరాలను తెలియజేసేందుకు సహాయకులను నియమిస్తాం. పాత కేంద్రం నుంచి కొత్త కేంద్రానికి వెళ్లే క్రమంలో మొదటిరోజు కొద్దిగా ఆలస్యమైనా అనుమతిస్తాం. విద్యార్థుల ప్రత్యక్ష తనిఖీ (ఫ్రిస్కింగ్) ఉండదు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు శానిటైజర్లు, మాస్క్లు అందజేస్తాం. విద్యార్థులూ వాటిని తెచ్చుకోవచ్చు. మంచినీళ్ల బాటిళ్లను కూడా అనుమతిస్తాం. పరీక్ష కేంద్రాలన్నింటినీ కెమికల్తో శానిటైజ్ చేస్తాం. పక్కాగా జాగ్రత్తలు.. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే 5,34,903 మంది విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు పక్కా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు ఏ దశలోనూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశాం. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించేలా ఒక బెంచీపై ఒకరే కూర్చొని పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను పెంచాం. పాత కేంద్రాలు 2,530 ఉండగా మరో 2,005 కేంద్రాలను గుర్తించాం. అవసరమైతే ఇంకా కేంద్రాలను పెంచాలని డీఈవోలను ఆదేశించాం. స్కూళ్లల్లోని అదనపు గదులను వినియోగించుకోవడంతోపాటు కాలేజీల భవనాలు, ఫంక్షన్ హాళ్లు, ఆడిటోరియాలను తీసుకొని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. భౌతికదూరం పాటించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి 20 స్కూళ్లకు కలిపి ఒక జోన్గా చేశాం. అందులో నాలుగు సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయా జోన్లలో వాటికి సమీపంలోని (కిలోమీటర్ లోపే) భవనాల్లోనే అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కంటైన్మెంట్ జోన్లలో ఎక్కువ మంది ఉంటే ప్రత్యేక కేంద్రం.. ప్రస్తుతం రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు తక్కువే ఉన్నాయి. హోం క్వారంటైన్లో సంబంధిత ఇళ్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. జూన్ ఒకటో తేదీ వరకు చూస్తాం. ఆలోగా హోం క్వారంటైన్లో ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోని పిల్లలు ఎవరైనా ఉన్నారా? కంటైన్మెంట్ జోన్లలో విద్యార్థులు ఎంత మంది ఉంటారన్న లెక్కలు తీస్తున్నాం. కంటైన్మెంట్ జోన్ నుంచి వచ్చే విద్యార్థులు తక్కువ మంది ఉంటే వారికి ప్రత్యేక గదులను కేటాయించి పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తాం. ఒకవేళ కంటైన్మెంట్ జోన్లలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే అక్కడే ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షలకు వచ్చే వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఉంటే వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తాం. -
జూన్ 8 నుంచి టెన్త్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసింది. ఒక పరీక్ష నిర్వహించిన తర్వాత మరో పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలంది. పరీక్ష నిర్వహించిన తర్వాత పరీక్ష కేంద్రాలను, భవనాలను క్రిమి సంహారకాలతో శుభ్రం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను, పరీక్షలు నిర్వహించే స్థితిలోని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులను పెద్ద ప్రాంగణాలున్న పాఠశాలలకు, కాలేజీలకు తరలించాలని సూచించింది. పరీక్ష కేంద్రం మార్పు గురించి విద్యార్థులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని పేర్కొంది. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల వద్ద తగినన్ని కిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశిం చింది. విద్యార్థుల వైద్య అవసరాలను చూసేం దుకు తగిన సంఖ్యలో వైద్య సిబ్బం దిని అందుబాటులో ఉంచా లని పేర్కొంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. రెడ్జోన్, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థులను సురక్షితంగా కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పింది. జూన్ 3 నాటికి రాష్ట్రంలోకరోనా తీరుపై సమీక్ష జరపాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అప్పటి పరిస్థితుల ఆధారంగా పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం అనుకుంటే, ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. జూన్ 8 నుంచి పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయిస్తే, ఆ విషయాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్యార్థులకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ కుమార్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాని చెప్పింది. తదుపరి విచారణను జూన్ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బొల్లంపల్లి విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కతనిశ్చయంతో ఉన్నాం.. ప్రస్తుతం 5.34 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉందని అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. పరీక్షల వాయిదా వల్ల విద్యార్థుల్లో ఆందోళన, భయం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేయగానే వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రం లాక్డౌన్ పరిమితులను సడలించిందని, దీంతో పరిమిత రాకపోకలకు ఆస్కారం ఏర్పడిందని వివరించారు. ఒక్కో పరీక్ష కేంద్రానికి గతంలో 200 నుంచి 240 మంది విద్యార్థులను కేటాయించగా, ఇప్పుడు గరిష్టంగా 120కి పరిమితం చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో విద్యార్థికి మధ్య 5 నుంచి 6 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఈ నేపథ్యంలో 2,005 అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో పరీక్ష కేంద్రాలు 2,530 నుంచి 4,535 కేంద్రాలకు పెరిగాయని వివరించారు. ఇన్విజిలేటర్ల సంఖ్యను కూడా పెంచామని, ఒక్కో ఇన్విజిలేటర్ 10 నుంచి 12 మంది విద్యార్థులను మాత్రమే పర్యవేక్షిస్తారన్నారు. 26,422 మంది అదనపు సిబ్బంది సేవలను వాడుకుంటామని స్పష్టం చేశారు. వారికి ప్రత్యేక గదులు.. పరీక్ష కేంద్రాల వద్ద పాటించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించి ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను కచ్చితంగా అమలు చేస్తామని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. విద్యార్థుల కోసం బస్సులు ఏర్పాటు చేస్తామని, బస్సుల్లో కూడా భౌతిక దూరం పాటించేలా చూస్తామని చెప్పారు. కేంద్రం వద్దకు విద్యార్థితో పాటు ఓ సహాయకుడిని మాత్రమే అనుమతిస్తామని, పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు హాల్టికెట్ను ప్రయాణ పాస్గా పరిగణిస్తామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుందన్నారు. హాలులోకి వెళ్లేటప్పుడు, పరీక్ష సమయంలో, బయటకు వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. విద్యార్థులకు ధర్మల్ పరీక్షలు చేసి, జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారిని ప్రత్యేక గదుల్లో కూర్చోబెడతామని చెప్పారు. గదుల వద్ద శానిటైజర్లు, మరుగుదొడ్ల వద్ద సబ్బులు, శానిటైజర్లును అందుబాటులో ఉంచుతామని వివరించారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడే టీచర్లు, ఇతర సిబ్బందిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. పిల్లల భవిష్యత్తు ముఖ్యం.. కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది కౌటూరు పవన్కుమార్ వాదనలు వినిపిస్తూ, ఏపీలో మాదిరిగా పరీక్ష పేపర్ల సంఖ్యను తగ్గించాలని, తెలంగాణలో 8 పేపర్లను నాలుగు చేయాలని సూచించారు. అయితే ఈ ప్రతిపాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈనెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించినా ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం సబబు కాదన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. తెలంగాణ అంతటా గ్రీన్జోన్గా సీఎం ప్రకటించారని, పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచన చేయాలి కదా అని వ్యాఖ్యానించింది. కరోనా ఇప్పట్లో అంతమవుతుందని ఎవరైనా చెబుతున్నారా, మందు కూడా లేదనే విషయాన్ని గుర్తించాలని, కరోనా సమస్య కొలిక్కి వచ్చేలా లేదని, అందరూ కరోనాతో సహజీవనం చేస్తూనే అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేయాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి.. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విద్యార్థుల భవిష్యత్ బాధ్యత మనందరిపైనా ఉందని, వారు కరోనా బారిన పడకుండా రక్షించే విషయంలో ప్రభుత్వం మరింత జాగరుకతతో ఉండాలని పేర్కొంది. 5.34 లక్షల మంది పదో తరగతి విద్యార్థుల పరీక్షలను వాయిదా వేసుకుంటూ పోతే వారి మెడపై కత్తి వేలాడుతున్నంత టెన్షన్ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పరీక్షలకు అనుమతి ఇవ్వకపోతే విద్యా సంవత్సరం నష్టపోతారని చెప్పింది. అందుకే ప్రభుత్వం వైద్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని షరతులు విధిస్తూ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు ధర్మాసనం తీర్పునిచ్చింది. కంటైన్మెంట్, రెడ్ జోన్లలోని విద్యార్థులను సురక్షితంగా పరీక్ష కేంద్రాలకు తరలించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఆదేశించింది. -
టెన్త్ పరీక్షలు రద్దు.. సీఎం కీలక నిర్ణయం
భోపాల్ : పదో తరగతి పరీక్షలకు సంబంధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇదివరకు నిర్వహించిన పరీక్షల ఆధారంగా పదో తరగతి మెరిట్ జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. రద్దైన పరీక్షలకు సంబంధించి ‘పాస్’ రిమార్క్తో విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్టు చెప్పారు.(చదవండి : భిన్నంగా లాక్డౌన్ 4.0) మార్చి 19 నుంచి లాక్డౌన్ ముగిసేవరకు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. మరోవైపు మిగిలిపోయిన ఇంటర్ పరీక్షలను మాత్రం జూన్ 8 నుంచి జూన్ 16 మధ్యలో నిర్వహించాలని మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసకుంది. కాగా, మధ్యప్రదేశ్లో మార్చి 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత.. కరోనా లాక్డౌన్తో మరికొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. (చదవండి : 60 మంది తబ్లిగీ సభ్యుల అరెస్ట్) -
టెన్త్ మోడల్ పేపర్ల విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను జూలై 10 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన విద్యా శాఖ.. కరోనా నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. 11 పేపర్లను ఆరుకు కుదించిన ఎస్ఎస్సీ బోర్డు అందుకు సంబంధించిన సెక్షన్లు, ప్రశ్నల తీరు, మార్కులు ఎలా ఉంటాయో పేర్కొంటూ ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ మాదిరి పత్రాలను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. శనివారం తెలుగు, హిందీ మార్కుల మాదిరి పత్రాలతో పాటు ఆయా పేపర్లకు సంబంధించిన మాదిరి ప్రశ్నపత్రాలను కూడా విడుదల చేసినట్లు బోర్డు డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఆ వివరాలివీ.. ► తెలుగు పేపర్ సమయం 3.15 గంటలు. గతంలోని రెండు పేపర్లను కలిపి 100 మార్కులకు ఒకే పేపర్గా ఉంటుంది. విభాగం–1లో అవగాహన, ప్రతిస్పందన కింద 32 మార్కులకు ప్రశ్నలుంటాయి. వీటిలో 4 వ్యాసరూప ప్రశ్నలు కాగా.. ఒక్కో దానికి 8 మార్కులు ఇస్తారు. పేపర్–1 నుంచి 16 మార్కులకు, పేపర్–2 నుంచి 16 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ► విభాగం–2లో వ్యక్తీకరణ, సృజనాత్మకత కింద 36 మార్కులకు ప్రశ్నలుంటాయి. వీటిలో లఘు సమాధాన ప్రశ్నలు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 3 ఉంటాయి. ఇదే విభాగంలో ఒక్కొక్కటి 8 మార్కుల చొప్పున 3 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఇందులోనూ పేపర్–1 నుంచి 16 మార్కులకు, పేపర్–2 నుంచి 20 మార్కులకు ప్రశ్నలుంటాయి. ► విభాగం–3లో 36 మార్కులకు పలు భాషాంశాల ప్రశ్నలను అడుగుతారు. అతి లఘు, లక్ష్యాత్మక ప్రశ్నలుగా ఇవి ఉంటాయి. పేపర్–1 మార్కులకు, పేపర్–2 నుంచి 14 మార్కులకు ప్రశ్నలుంటాయి. ► హిందీ పేపర్లోని మార్కుల మాదిరి ప్రశ్నపత్రాన్ని బోర్డు విడుదల చేసింది. ఇందులో 4 నిబంధనాత్మక ప్రశ్నలు 36 మార్కులకు ఉంటాయి. లఘు ఉత్తరాత్మక ప్రశ్నలు 28 మార్కులకు 6 ఉంటాయి. అతి లఘు ఉత్తరాత్మక ప్రశ్నలు 8 ఉప విభాగాలుగా 24 మార్కులకు ఉంటాయి. లక్ష్యాత్మక ప్రశ్నలు 12 మార్కులకు ఉంటాయి. ఇవీ మార్గదర్శకాలు ► టెన్త్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఎస్సీ బోర్డు అన్ని జిల్లాల డీఈవోలకు మార్గదర్శకాలు పంపింది. ► కోవిడ్–19 నేపథ్యంలో అదనంగా పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు వీలుగా అనువైన పాఠశాలలతోపాటుజూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలను కూడా గుర్తించాలని పేర్కొంది. ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని సంస్థలను కూడా గుర్తించాలని స్పష్టం చేసింది. ► డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెడ్మాస్టర్లతో కూడిన బృందం కోవిడ్–19 ప్రోటోకాల్కు అనుగుణంగా ఆయా సంస్థలను గుర్తించాలని, ఒక్కో బృందం 20 సెంటర్లను సందర్శించాలి. ► కోవిడ్–19 కోసం క్వారంటైన్ కేంద్రాలుగా ఉన్న వాటిని మినహాయించాలి. ► ఈనెల 18వ తేదీ నాటికి ఆయా కేంద్రాల సమాచారాన్ని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్కు సమర్పించాలి. -
టెన్త్ పరీక్షల మార్కుల నమూనా పత్రాలు ఇవే
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విభాగాల వారీగా ప్రశ్నల సంఖ్య, మార్కుల విధానాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి నమూనా పత్రాలను విడుదల చేశారు. నాలుగు పేపర్ల నమూనా పత్రాలను బోర్డు వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. గతంలో 11 పేపర్లకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించగా ఈసారి 6కి కుదించిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు పేపర్ల మార్కుల నమూనా పత్రాలను విభాగాల వారీగా ప్రకటిస్తున్నామని డైరెక్టర్ పేర్కొన్నారు. మిగతావి కూడా త్వరలోనే వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. -
కరోనా ఎఫెక్ట్: పది, ఇంటర్ పరీక్షలు రద్దు
రాయ్పూర్ : దేశంలో కరోనా వైరస్ విభృంభిస్తున్న తరుణంలో మధ్యలో ఆగిన (పది, ఇంటర్) పరీక్షల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల పరీక్షలపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది, ఇంటర్ పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. విద్యార్థులు పరీక్షలు రాయకుండానే అందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. (జూలైలో పది పరీక్షలు) ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా.. విద్యార్థులకు మార్కులు కేటాయించనున్నారు. దీని ఆధారంగానే పై చదువులకు ప్రమోట్ చేయనున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావించింది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షులు నిర్వహించిన ఫలితాలు విడుల చేసేలోపు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా శాఖ అభిప్రాయపడింది. ఈనేపథ్యంలో విద్యార్థులందరనీ పాస్ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థులు, తల్లీదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే దారిలో పంజాబ్ ప్రభుత్వం కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. (ఏపీలో మరో 36 పాజిటివ్ కేసులు) ఇక తెలంగాణలోనూ పది పరీక్షలు మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. వీటిని జూన్ మొదటి వారంలో తిరిగి ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ చెబుతోంది. అప్పటిలోపు పరిస్థితి అదుపులోకే వస్తే పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు, సలహాలు చేసింది. (దూరం 250 కిమీ.. టికెట్ ధర 12వేలు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1411285105.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జూలైలో పది పరీక్షలు
ఒంగోలు: జూలైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. సంతపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేలో పరీక్షలు నిర్వహిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. -
టెన్త్ ఎగ్జామ్స్ : ఆ వదంతులు నమ్మొద్దు!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పదోవ తరగతి పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో వస్తున్న వదంతులు నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు విజ్ఞప్తి చేశారు. రోజుకు ఒకరకంగా పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫేక్ న్యూస్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. మొన్న టైమ్ టేబుల్ విషయంలో వదంతులు సృష్టించగా, నేడు ఏకంగా తన పేరును ఫోర్జరీ చేసి పరీక్ష తేదీలను ఆన్లైన్లో పెట్టారని తెలిపారు. (‘అప్పుడే పదో తరగతి పరీక్షల నిర్వహణ’) పదవ తరగతి పరీక్షలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇలాంటి వదంతులు సృష్టించడం సైబర్ నేరాల కిందకి వస్తోందని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని వారిని ఇలా గందరగోళానికి గురిచేయడం సమంజసం కాదన్నారు. ప్రజలెవరు ఈ వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని వీరభద్రుడు కోరారు. (పరీక్షలు జరుగుతాయి.. చదువుకోండి) -
టెన్త్ విద్యార్థులకు సప్తగిరి చానల్లో బోధన
సాక్షి, అమరావతి: లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు ప్రస్తుతం నిర్వహించలేకపోతున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా పాఠాలు బోధించనున్నామని తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మంగళవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సప్తగిరి చానల్లో టెన్త్ పాఠ్యాంశాల బోధన ప్రసారం అవుతాయి. ► పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి. ఆయా సబ్జెక్టులను ఎలా అర్థం చేసుకోవాలో తెలిపేలా ప్రసారాలను రూపొందించాం. ► రాష్ట్రంలో దాదాపు 5లక్షల మంది విద్యార్థులు వీటిని వీక్షిస్తున్నారు. అవే బోధనాంశాలను యూట్యూబ్లో సప్తగిరి చానల్ అందుబాటులో ఉంచుతోంది. ► ఆన్లైన్ పాఠాలు బోధించడానికి ఉత్సాహం గల ఉపాధ్యాయులు కూడా ముందుకు రావచ్చు. ► 1 లేదా 2 నిమిషాల నిడివితో వీడియోలను తయారుచేసి పంపిస్తే పరిశీలించి వారిని సైతం ఆన్లైన్ క్లాస్ వర్క్లో ఉపయోగించుకుంటాం. ► లాక్ డౌన్ కాలంలో ఉన్నత విద్యకు సంబంధించి తరగతులు నిర్వహించేలా అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలిచ్చాం. -
'టెన్త్ పరీక్షలు ఇప్పట్లో నిర్వహించలేం'
సాక్షి, అమరావతి : లాక్డౌన్ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు ఇప్పుడు నిర్వహించలేమంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు మరింత పెరగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెన్త్ పరీక్షలు ముగిసేవరకు విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల బోధన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారన్నారు. ఇందుకోసం విద్యామృతం పేరుతో కార్యక్రమాన్ని రూపొందించి ఉదయం 10 నుంచి 11వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సప్తగిరి చానెల్ ద్వారా పాఠాలు ప్రసారం అవుతాయని తెలిపారు. టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సురేశ్ వెల్లడించారు. కాగా ఆన్లైన్ పాఠాలు బోధించేందుకు అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి టీచర్ల ఎంపిక చేస్తున్నామని, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉత్సాహం ఉన్న టీచర్స్ ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ పొడిగింపుపై తీసుకున్న నిర్ణయం తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం పకడ్బందీ చర్యలు అవసరమన్నారు. ప్రధాని మోదీ తెలిపినట్లుగా ఏప్రిల్ 20 తర్వాత ఆంక్షల సడలింపులో రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మా ప్రభుత్వ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారని శంకర్ నారాయణ వెల్లడించారు. -
గంట ముందే రండి
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం పూర్తి చేసింది. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్ష సమయం కంటే కనీసం గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆలస్యంగా వెళ్లి నష్టపోవద్దని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు మాస్క్లు ధరించాలని, వాటర్ బాటిళ్లను అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సబ్బులు, లిక్విడ్ సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్న వారు ప్రత్యేక గదుల్లో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ఎవరి సంతకం అవసరం లేకుండానే అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సమస్యలు ఉంటే తమ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్కు (040–23230942) ఫోన్ చేయవచ్చని సూచించారు. అవిభక్త కవలలు వీణావాణీలకు స్టేట్ హోం సమీపంలోని పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, వారు సొంతంగా పరీక్ష రాస్తామని మొదట్లో చెప్పినా అది సాధ్యమయ్యే పరిస్థితి లేదన్నారు. అందుకే వారి విజ్ఞప్తి మేరకు సహాయకులను (స్క్రైబ్స్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణ పరీక్ష సమయం కంటే వారికి అదనంగా అరగంట సమయం ఇస్తామని తెలిపారు. -
టెన్త్ ఎగ్జామ్స్: నిమిషం నిబంధనలేదు కానీ,..
సాక్షి, హైదరాబాద్ : రేపటినుంచి జరగబోతున్న పదవ తరగతి పరీక్షలకు ఒక నిమిషం నిబంధన ఏమీ ఉండదని, కానీ.. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిదని ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఎస్సీ పరీక్షల కోసం మొత్తం 5 లక్షల 34 వేల మంది విద్యార్థులు హాజరవుతారని వెల్లడించారు. 2530 పరీక్ష కేంద్రాలు పరీక్షలకు సిద్ధం చేశామని చెప్పారు. మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలల్లో లిక్విడ్ హ్యాండ్ వాష్ లాంటివి సిద్ధం చేశామని చెప్పారు. చదవండి : రేపటి నుంచే టెన్త్ పరీక్షలు -
రేపటి నుంచే టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,530 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు అంతా ఒకేసారి రాకుండా, ఒకేచోట గుంపులుగా ఉండకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎంత మందుగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడమే కాకుండా పరీక్ష హాల్లోకి పంపించేలా చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించినట్లు చెప్పారు. బాలురే అధికం.. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 11,045 పాఠశాలలకు చెందిన 5,34,903 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో 2,73,971 మంది బాలురు కాగా, 2,60,932 మంది బాలికలున్నారు. మొత్తం విద్యార్థులు 5,09,079 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 25,824 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. పరీక్షల నిర్వహణలో 30,500 మంది టీచర్లు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మాల్ ప్రాక్టీస్ను నిరోధించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి 144 సిట్టింగ్ స్క్వాడ్స్, 4 ఫ్ల్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేశారు. అధికారులతో మంత్రి సబిత సమీక్ష విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు బాగా రాయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం ఆమె అధికారులతో సమీక్షించారు. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎవరైనా విద్యార్థులు జలుబు, దగ్గుతో బాధపడుతూ అనారోగ్యంగా ఉంటే వారి కోసం ప్రత్యేక గదుల్లో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి పరీక్షా కేంద్రంలోనూ శానిటైజర్లు, లిక్విడ్ సోప్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. విద్యార్థులు మాస్కులు ధరించినా, వాటర్ బాటిళ్లు తెచ్చినా అనుమతిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లను రిజర్వులో ఉంచుతున్నామని, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి స్థానంలో ఇతరులను నియమిస్తామని చెప్పారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. గ్రేస్ పీరియడ్ ఉండదు.. గతంలో మాదిరిగా గ్రేస్ పీరియడ్ అంటూ ఏమీ ఉండదని, ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమయ్యాక విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు వీలైనంత ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చి నష్టపోవద్దని చెప్పారు. కనీసం గంట ముందుగానే (ఉదయం 8:30 గంటలకల్లా) వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. ముందురోజే ఓ సారి పరీక్ష కేంద్రాన్ని చూసుకుంటే మంచిదని సూచించారు. ఇప్పటికే హాల్టికెట్లను పంపిణీ చేశామని, అందని వారు తమ వెబ్సైట్ నుంచి (www.bse. telangana.gov.in) డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షలకు హాజరు కావచ్చని వెల్లడించారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లపై ఎవరి సంతకం అక్కర్లేదని స్పష్టంచేశారు. వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బంది.. ఇప్పటివరకు వెబ్సైట్ నుంచి 4.05 లక్షల మంది విద్యార్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు సబిత వెల్లడించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో ఇద్దరు చొప్పున వైద్య సిబ్బందిని, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలోనూ (040–23230942), జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూం లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 31 నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి/మార్కాపురం: స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలను వాయిదా వేసినట్టు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ పరీక్షలను ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహిస్తామన్నారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని తన స్వగృహంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 638 సీ (పోలీస్స్టేషన్లకు దూరంగా ఉండేవి) కేంద్రాల్లో సీసీ కెమెరాలను పెడుతున్నామన్నారు. అలాగే 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మార్చి 14 నుంచి విద్యార్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. -
టెన్త్ ఎగ్జామ్స్.. గోడలెక్కి మరీ..
-
టెన్త్ ఎగ్జామ్స్.. వీళ్లు మామూలోళ్లు కాదు!..
ముంబై : పరీక్షలు రాస్తున్న టెన్త్ క్లాస్ విద్యార్థులకు చీటీలు అందించడానికి అత్యుత్సాహం చూపించారు కొందరు యువకులు. పరీక్ష హాలు దగ్గరి ప్రహారీ గోడ ఎక్కి మరీ పరీక్ష రాస్తున్న తమ వారికి సహాయం చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని యావాత్ మాల్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యావాత్మాల్ జిల్లాలోని ‘మహాగావ్ జిల్లా పరిషత్ స్కూల్’లో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న తమ వారికి చీటీలు అందించడానికి కొందరు యువకులు ఎగబడ్డారు. హాలు దగ్గర ఉన్న ఎత్తైన అడ్డుగోడని ఎక్కి మరీ కాపీ కొట్టడానికి చీటీలు అందించారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ.. కిటికీల దగ్గర చేరి చీటీలు అందించారు. 2015లో బిహార్లోని ఓ పరీక్ష సెంటర్ వద్ద కాపీలు అందిస్తున్న జనం అంత జరుగుతున్నా ఇన్విజిలేటర్లు, అక్కడి అధికారులు పట్టించుకోకపోవటం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, 2015లోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. బిహార్లోని వైశాలిలో టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న తమ పిల్లలకు.. 6 అంతస్తుల భవనాన్ని తాళ్లతో ఎక్కి మరీ చీటీలు అందించారు కొందరు. ఆ సంవత్సరం బిహార్ వ్యాప్తంగా కాపీ చేయటానికి సహకరిస్తున్న 1000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఇంటర్, టెన్త్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగనున్న ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల సౌకర్యాలు మొదలుకొని మాస్ కాపీయింగ్ నిరోధం వరకు ప్రతి విషయంలోనూ ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మార్చి 4వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 1,411 పరీక్ష కేంద్రాల్లో జరిగే ఇంటర్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 2,900 కేంద్రాల్లో జరిగే పదోతరగతి పరీక్షలు 6.30 లక్షల మంది రాయనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఆ సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయిస్తామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అక్రమాల నిరోధానికి జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్లను కేటాయించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎక్కడా విద్యార్థులు కింద కూర్చుని పరీక్ష రాసే అవస్థలు లేకుండా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు చేసిన నేపథ్యంలో విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాపీయింగ్ నిరోధానికి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. పరీక్ష పత్రాలు లీక్ సమస్యను నివారించేందుకు చీఫ్ సూపర్ వైజర్ మినహా ఎవరి వద్దా మొబైల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి పరీక్షల్లో చేసిన మార్పు ప్రకారం జవాబు పత్రం కేవలం 24 పేజీలతో ఉంటుంది. అడిషనల్ తీసుకునే అవకాశం ఉండదు. అలాగే ఈ సారి హాల్టికెట్లు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ఓ యాప్ ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి సురేష్ పరీక్షల నిర్వాహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏర్పాట్లను వివరించారు. ఇంటర్లో గ్రేడింగ్ తో పాటు మార్కులు కూడా ఇస్తామన్నారు. కాగా ఇన్విజిలేటర్లుగా సచివాలయ ఉద్యోగుల సేవలు తీసుకుంటామని చెప్పారు. నూజివీడు ఐఐఐటీ ఘటనపై కమిటీ వేశామని, నివేదిక వచ్చాక చర్చలు తీసుకుంటామని ఓ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. -
టెన్త్ విద్యార్థులకు వయసు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులకు తెలియకో, టీచర్ల అలసత్వమో.. నిర్ధేశిత వయసు రాకముందే బడిలో చేర్పించే ఆతృత వల్లనో... వెరసి పదో తరగతి పరీక్షల సమయం వచ్చేసరికి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. టెన్త్ పరీక్షలకు హాజరయ్యేందుకు అవసరమైన నిర్ధేశిత వయసు లేకపోవడంతో వారిని పరీక్షలకు అనుమతించలేని పరిస్థితి వస్తోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ప్రధానోపాధ్యాయులు, డీఈవో కార్యాలయాలు, ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్సెస్సీ బోర్డు) చుట్టూ తిరిగి అనుమతులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఏటా ఇలాంటి వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. ఈసారి మాత్రం ఆ సంఖ్య 1,394 ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. వారందరికి అనుమతులు లభించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వేయి మందికిపైగా 6రోజులు తక్కువున్న వారే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2019 ఆగస్టు 30వ తేదీ నాటికి 14 ఏళ్లు పూర్తయితేనే ఆ విద్యార్థి 2020 మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు అర్హులు. ఆ నిబంధనల ప్రకారం వయసు తక్కువ ఉన్న పిల్లలు రాష్ట్రంలో 1,394 మంది ఉన్నారు. వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏడాదిన్నర వరకు ప్రధానోపాధ్యాయుడు, రెండేళ్లు తక్కువగా ఉంటే ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అనుమతి పొందాల్సి ఉంటుంది. అదే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఏడాదిన్నర తక్కువగా ఉంటే డీఈవో, రెండేళ్లు తక్కువగా ఉంటే ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ నుంచి అనుమతి పొందాలి. రెండేళ్లకంటే ఎక్కువ మినహాయింపు పొందాలంటే విద్యాశాఖ కార్యదర్శి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఇలా ప్రత్యేక అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికంగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. అందులోనూ గరిష్టంగా 24 రోజులు మాత్రమే తక్కువ ఉన్న వారు ఉన్నారు. అందులో 1 నుంచి 6 రోజులు తక్కువ ఉన్న వారు 1000 మందికిపైగా ఉండగా, మిగతా వారు 7 నుంచి 27 రోజులు తక్కువ ఉన్నవారు ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం లెక్కలు వేసింది. వారందరిని కూడా పరీక్షలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. -
పకడ్బందీగా పరీక్షలు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గతేడాది జరిగిన తప్పులు పునరావృతం కావద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ స్పష్టంచేశారు. మార్చి, ఏప్రిల్ల్లో జరగనున్న ఇంటర్, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. సోమవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొనే ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమైన శిక్షణను ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల కోసం ఆన్లైన్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 వరకు, టెన్త్ పరీక్షలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు జరుగుతాయన్నారు. ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు, పదో తరగతి పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని, సెంటర్ల ఏర్పాటు, జంబ్లింగ్ పద్ధతి, హాల్ టికెట్ల జారీ, ఫలితాల వెల్లడి ప్రక్రియలను అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. -
టెన్త్ పరీక్షలు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : పదో తరగతి పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను రద్దు చేసింది. గురువారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ పదో తరగతి పరీక్షల్లో వినూత్న మార్పులు తీసుకొస్తున్నాం. పదో తరగతి ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను తొలగించాము. గతంలో 20 మార్కులను కార్పొరేట్ కాలేజీల కోసం ఏర్పాటు చేశారు. అందుకే ఇప్పుడు రద్దు చేశాం. బిట్ పేపర్ని కూడా ప్రశ్న పత్రంలో అంతర్భాగం చేసేసాం. ప్రశ్న పత్రాల్లో సబ్జెక్టుల వారీగా పాస్ మార్కులు ఇస్తాం. 2.30 గంటల పరీక్షకు అదనంగా 15 నిమిషాలు ప్రశ్న పత్రం చదువుకోవడం కోసం కేటాయిస్తున్నాం. మార్కుల షీట్ని కూడా నాణ్యంగా తయారుచేస్తాం. పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తాం. పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించాం. 45,390 పాఠశాలల్లో ఎన్నికలు పూర్తి చేశాం. పాఠశాలల్లో విద్యాశాఖ అమలుచేసే పథకాలపై కమిటీలకు అవగాహన కల్పిస్తాం. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల కమిటీలను భాగస్వాములను చేస్తాం. మన బడి.. మన బాధ్యత పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేపడతా’’మన్నారు. -
టెన్త్ పరీక్షల్లో సమూల మార్పులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. రానున్న పరీక్షల్లో విద్యార్థులు 100 మార్కులకు (50 మార్కుల చొప్పున రెండేసి పేపర్లు) పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ప్రతి పేపర్లో పది మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో బిట్ పేపర్ ఉండగా దాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. 20 శాతం అంతర్గత మార్కుల రద్దు నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ద్వారా పాఠశాల విద్యా శాఖ ఈ ప్రతిపాదనలు రూపొందించింది. అంతర్గత మార్కులను రద్దు చేస్తూ ప్రభుత్వం జూలై 16న జీవో 41 ఇచ్చిన సంగతి తెలిసిందే. బిట్ పేపర్ రద్దు బిట్ పేపర్ వల్ల మాస్ కాపీయింగ్ జరుగుతోందని, కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. బిట్ పేపర్ స్థానంలో ఏకవాక్య సమాధానాలు రాసే విధంగా ప్రశ్నలు ఇవ్వనున్నారు. వీటిని విడిగా కాకుండా ప్రధాన ప్రశ్నపత్రంలోనే ఇస్తారు. ఇప్పటివరకు హిందీ (100 మార్కులు) మినహాయించి ఆయా సబ్జెక్టుల్లో 40 చొప్పున 80 మార్కులకు రెండు పేపర్లు ఉండేవి. సబ్జెక్టుకు 20 చొప్పున అంతర్గత మార్కులుండేవి. ఇక నుంచి హిందీ/సంస్కృతం మినహాయించి ప్రతి సబ్జెక్టులోనూ ఒక్కో పేపర్ను 40 మార్కులకు బదులు 50 మార్కులకు ఇవ్వనున్నారు. మార్కులు, ప్రశ్నలు పెరుగుతున్నందున కొన్ని పేపర్ల పరీక్ష సమయాన్ని కూడా మార్పు చేయనున్నారు. హిందీ/సంస్కృతం మినహాయించి మిగిలిన సబ్జెక్టుల్లో ప్రతి పేపర్కు 2.30 గంటలు పరీక్ష రాయడానికి, 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి ఉంటుంది. హిందీ/సంస్కృతం 100 మార్కులకు ఉండనున్నందున పరీక్ష రాయడానికి 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు ఇవ్వనున్నారు. నాలుగు భాగాలుగా ప్రశ్నపత్రం పదో తరగతి ప్రశ్నపత్రాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. ఒక్కో విభాగంలో ఎన్ని ప్రశ్నలు ఇవ్వనున్నారో ప్రశ్నపత్రం, బ్లూప్రింట్ను కూడా రూపొందించారు. ఈపాటికే దీన్ని విడుదల చేయాల్సి ఉన్నా అనుమతి రానందున పాఠశాలలకు పంపలేదు. ఒక్కో పేపర్ 50 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు బట్టీ పట్టి రాయకుండా సొంతంగా రాయగలిగేలా, ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా ప్రశ్నలు ఇస్తారు. అర మార్కు ప్రశ్నలు 12 ఉంటాయి. వీటికి ఆరు మార్కులు కేటాయించారు. వీటికి ఒకే వాక్యం/పదంతో జవాబు రాయాలి. బిట్ పేపర్కు బదులుగా దీన్ని పెడుతున్నారు. ఒక మార్కు ప్రశ్నలు 8 ఉంటాయి. వీటికి ఒకటి లేదా రెండు వాక్యాల్లో జవాబు రాయాలి. వీటికి 8 మార్కులు ఉంటాయి. రెండు మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయి. మూడు లేదా నాలుగు వాక్యాల్లో జవాబు రాయాలి. వీటికి 16 మార్కులు కేటాయించారు. పెద్ద ప్రశ్నలు 5 ఉంటాయి. వీటికి ఎనిమిది నుంచి పది వాక్యాల్లో జవాబు రాయాలి. ఒక్కో దానికి నాలుగు మార్కుల చొప్పున 20 మార్కులు కేటాయించారు. సమాధానాలు రాసేందుకు 12 నుంచి 16 పేజీలుండే బుక్లెట్ను రూపొందించి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు. దీని ద్వారా మాస్ కాపీయింగ్ను నివారించొచ్చని భావిస్తున్నారు. పేపర్ల వారీగా పాస్ మార్కులు ఇప్పటివరకు పదో తరగతిలో ఆయా సబ్జెక్టుల్లోని రెండు పేపర్లు కలిపి 35 మార్కులు వచ్చినా ఉత్తీర్ణులైనట్లుగా పరిగణించేవారు. ఇక నుంచి సబ్జెక్టుల్లోని రెండు పేపర్లలో ప్రతిదానిలోనూ ఉత్తీర్ణులవ్వాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం.. ప్రతి పేపర్లోనూ 17.5 చొప్పున మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇలా రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు వస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. పాత విధానంలో ఒక పేపర్లో 35 మార్కులు వచ్చి, రెండో దానిలో సున్నా వచ్చినా పాసవుతున్నారు. దీనివల్ల విద్యార్థులు ఎందులో వెనుకంజలో ఉన్నారు.. ఏ సబ్జెక్టుల్లో ప్రమాణాలు ఉన్నాయి.. టీచర్లలో ఎవరు బాగా పాఠాలు చెబుతున్నారు.. ఎవరు చెప్పడం లేదు అనే విషయాలు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన చేశారు. -
ఒకటికి రెండు, మూడుసార్లు పునఃపరిశీలన..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పుల కారణంగా తలెత్తిన వివాదాల నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. త్వరలో విడుదల కానున్న పదోతరగతి పరీక్షల ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా పక్కా చర్యలు చేపడుతోంది. తొందరపడి ఫలితాలు ప్రకటించి 5.5 లక్షల మంది విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టకుండా.. ఒకటికి రెండు, మూడుసార్లు పునఃపరిశీలన జరిపాకే ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించింది. పదో తరగతి పరీక్ష ఫలితాల ప్రాసెస్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి.. శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ విజయ్కుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్, ఇతర అధికారులు, సాంకేతిక సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పదోతరగతి పరీక్షల ఫలితాల విషయంలో ఒక్క పొరపాటు కూడా జరక్కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. స్కానింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఫలితాల ప్రాసెస్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో తప్పులు దొర్లకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. తప్పులు దొర్లకుండా పక్కాగా పరిశీలన జరపడంతోపాటు ఒకవేళ విద్యార్థులకు అనుమానాలున్నా, ఫిర్యాదు చేయాలన్నా ఆన్లైన్లోనే చేసేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా, తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుని లాగిన్ నుంచి, లేదా ఇంటర్నెట్ సెంటర్ నుంచి ఫిర్యాదు చేసేలా, దానికి మెసేజ్ రూపంలో రెస్పాన్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా రీ–వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. శనివారం నుంచి వచ్చే నాలుగైదు రోజులు పునఃపరిశీలన జరుపనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక వీలైతే వచ్చే 10వ తేదీన ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. పరిశీలన ప్రక్రియ కనుక సవ్యంగా పూర్తికాకపోతే 15వ తేదీలోగా పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మొత్తానికి 10–15 తేదీల మధ్య ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పరీక్షల విషయంలో తీసుకోనున్న జాగ్రత్తలివే! ఒక సబ్జెక్టు మినహా మిగతా సబ్జెక్టుల్లో పాస్ అయిన విద్యార్థులు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా, ఆబ్సెంట్ పడినా ఆ జవాబు పత్రాలను రీ–వెరిఫికేషన్ చేస్తారు. సున్నా మార్కులు వచ్చినా వారి జవాబు పత్రాలను పునఃపరిశీలిస్తారు. సబ్జెక్టుల వారీగా మార్కుల వ్యత్యాసాన్ని సరిపోల్చి చూస్తారు. సైన్స్లో అత్యధిక మార్కులు వచ్చి, మ్యాథ్స్లో తక్కువ మార్కులు వస్తే మళ్లీ పరిశీలన జరుపుతారు. అన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే ఆ విద్యార్థి జవాబు పత్రాన్ని రీ–చెక్ చేస్తారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు పాఠశాలలకు ప్రత్యేక లింకు ఇస్తారు. పాఠశాలల వారీగా విద్యార్థుల మార్కులను కూడా ఆయా పాఠశాలలకు పంపిస్తారు. అందులో ఏమైనా అనుమానాలు ఉన్నా, తక్కువ మార్కులు వచ్చినట్లు గుర్తించినా విద్యార్థులు సంబంధిత ప్రిన్సిపాల్ దగ్గర్నుంచే ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు తలెత్తే అనుమానాలను నివృత్తి చేసేందుకు, ఫిర్యాదులను స్వీకరించేందుకు ఆన్లైన్ విధానం ప్రవేశ పెడతారు. విద్యార్థులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ లింక్ ఇస్తారు. అవసరమైతే మొబైల్ యాప్ను అందుబాటులోకి తెస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సర్వర్ను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులెవరూ హైదరాబాద్కు రావాల్సిన అవసరమే లేకుండా ఆన్లైన్ ద్వారానే వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడతారు. ఈ క్రమంలో విద్యార్థి ఫిర్యాదు చేసిన వెంటనే అతని మొబైల్ నంబరుకు మెసేజ్ పంపిస్తారు. అది పరిష్కారం అయ్యాక కూడా మెసేజ్ పంపిస్తారు. ఈ–మెయిల్ ఐడీకి కూడా ఆ వివరాలను పంపిస్తారు. వీటికి సంబంధించిన వెబ్సైట్/వెబ్లింక్/మొబైల్ యాప్ను నాలుగైదు రోజుల్లో సిద్ధం చేయాలని నిర్ణయించారు. -
వారెవ్వా.. గుర్రపు స్వారీ చేస్తూ.. పరీక్ష కేంద్రానికి!
తిరువనంతపురం: ఒకప్పుడు ఆడవారు ఇంటినుంచి అడుగు బయట పెట్టడమే పాపంగా భావించేది సమాజం. కాని ప్రస్తుతం.. కాలం మారింది. తాము ఏ విషయంలోనూ పురుషులకంటే తక్కువ కాదని.. అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపిస్తూనే ఉన్నారు నేటితరం మహిళలు. పరీక్షకు ఆలస్యమవుతుండటంతో.. పరీక్ష రాయకుంటే సంవత్సరమంతా పడ్డ కష్టం వృథా అవుతుందని భావించిన ఓ బాలిక ఏకంగా గుర్రపు స్వారీ చేసుకుంటూ పరీక్ష కేంద్రానికి వెళ్లింది. కేరళలోని త్రిశూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్రిశూరు జిల్లాలో పదవ తరగతి పరీక్ష కేంద్రానికి ఒక బాలిక స్కూలు బ్యాగును భుజాన వేసుకుని గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్లడం చూపరులను ఆశ్చర్యపరిచింది. గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలికను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఈ వీడియోను వాట్సాప్ గ్రూప్లో చూసిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్ర ట్విటర్ వేదికగా బాలికపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘త్రిశూర్లో ఆమె ఎవరికన్న తెలుసా? నాకు ఆమె ఫోటో కావాలి. నా మోబైల్ స్క్రీన్ సేవర్గా ఆమె స్వారీ చేసిన గుర్రం ఫోటోను పెట్టుకుంటా. ఆమె నా దృష్టిలో హీరో. ఆమెను చూస్తే బాలికల విద్య మరింత దూసుకెళుతుందన్న ఆశ కలుగుతోంది’ అని ట్వీట్ చేశాడు. ‘బాలికల విద్య అద్భుతంగా ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమైన ఈ వీడియో వైరల్ కావల్సిన అవసరం ఉంది’ అని మరో ట్వీట్లో ఆనంద్ మహింద్ర పేర్కొన్నారు. -
గుర్రపు స్వారీ చేస్తూ.. పరీక్ష కేంద్రానికి..
-
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం నుంచి వచ్చే నెల 3 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 11,023 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 5,52,302 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. వారిలో 5,07,810 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా 44,492 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 2,55,318 మంది బాలురు, 2,52,492 మంది బాలికలు ఉన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,563 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ తర్వాత నో ఎంట్రీ... పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటలకు వరకు జరుగుతాయి. విద్యార్థులను పరీక్ష సమయం ప్రారంభం (ఉదయం 9:30 గంటలకు) కంటే 45 నిమిషాల ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. పరీక్ష సమయం మొదలైన 5 నిమిషాల వరకే (ఉదయం 9:35 గంటల వరకు) పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. ఆ తరువాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. కాంపొజిట్ కోర్సు పేపర్–1, పేపర్–2, ద్వితీయ భాష, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1, పేపర్–2 పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధాహ్నం 12:45 గంటల వరకు కొనసాగుతాయి. ఎస్సెస్సీ కాంపొజిట్ పేపర్–2 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 10:45 గంటల వరకు, వొకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. హాల్టికెట్లు అందకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు... పరీక్షల ఏర్పాట్లపై గురువారం పాఠశాల విద్య డైరెక్టరేట్లో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్తో కలసి పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్టికెట్లు పంపించామని, అందని వారు లేదా పొగొట్టుకున్న వారు తమ వెబ్సైట్ (https://www. bsetelangana.org/) నుంచి డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరుకావచ్చని వెల్లడించారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 24 గంటలు పని చేసేలా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు (040–23230942) ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. పెరిగిన కేంద్రాలు.. తగ్గిన స్కూళ్లు గతేడాది కంటే ఈసారి 21 పరీక్ష కేంద్రాలు పెరిగాయి. గతేడాది 2,542 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పాఠశాలలు మాత్రం 80 తగ్గిపోయాయి. గతేడాది 11,103 స్కూళ్లు మాత్రమే ఉన్నాయి. ఇక విద్యార్థుల సంఖ్య కూడా ఈసారి తగ్గింది. గతేడాది 5,34,726 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థుల్లో 64.57 శాతం మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులే ఉన్నారు. 116 కేంద్రాల్లో సీసీ కెమెరాలు... ఈసారి మొత్తంగా రెగ్యులర్ విద్యార్థులకు 2,374, ప్రైవేటు విద్యార్థులకు 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 116 కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. ఆకస్మిక తనిఖీల కోసం 4 స్పెషల్ ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 144 ఫ్లైయింగ్ స్క్వాడ్లను పంపనున్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలి. పరీక్ష సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక ఎంఈవో, డీఈవోల ఫోన్ నంబర్లు పరీక్ష కేంద్రంలో ఉంటాయి. వాటికి ఫోన్ చేసి తెలియజేయాలి. లేదంటే హైదరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పవచ్చు. -
పరీక్షల వేళ.. ఎన్నికల గోల
అడుగడుగునా అవాంతరాలు.. ఆరంభంలోనే ఉపాధ్యాయుల బదిలీలు.. అసెంబ్లీ ఎన్నికలు.. తిరిగి పంచాయతీ ఎన్నికల కోసం ప్రారంభమైన సన్నాహాలు.. ఆపై ముంచుకొస్తున్న పదో తరగతి పరీక్షలు వెAరసి .. విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. మరోవైపు అడ్డంకులను అధిగమించి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. అయితే ఇది ఏ మేరకు ఆశించిన ఫలితాలు ఇస్తుందో చూడాల్సిందే. మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రత్యేక కథనం. పాపన్నపేట(మెదక్): జిల్లాలో 145 ఉన్నత పాఠశాలలు, 55 వరకు ప్రైవేట్ ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం సుమారు 11 వేల మంది విద్యార్థులు ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. అయితే గత సంవత్సరం కన్నా మెరుగైన రీతిలో ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. పెద్ద ఎత్తున బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ పాఠశాల ప్రారంభం సమయానికి చాలా పాఠశాలల్లో కేవలం 65 శాతం మాత్రమే పాఠ్యపుస్తకాలు చేరాయి. అదే సమయంలో ఉపాధ్యాయుల బదిలీల పర్వం ప్రారంభమైంది. జూన్ చివరి నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ జూలై మూడో వారం వరకు కొనసాగింది. ఆపై బదిలీలలో పొరపాట్లు జరిగాయంటూ, జూలై చివరి వారం వరకు కొన్ని బదిలీ ఉత్తర్వులు విడుదల అవుతూనే వచ్చాయి. ఆపై అసెంబ్లీ రద్దు, ఆపై దసరా సెలవులు, అసెంబ్లీ ఎన్నికల శిక్షణ, నిర్వహణ. ఫలితాల విడుదల తదితర పరిణామాలతో డిసెంబర్ నెల రానే వచ్చింది. కనీసం ఇప్పుడైనా చదువులు పట్టా లెక్కుతాయనుకుంటే పంచాయతీ ఎన్నికల సన్నాహాలు జిల్లాలో మొదలయ్యాయి. మరో వైపు మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు, ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వాహణ కోసం విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మళ్లీ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయులు పని చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థుల చదువులు ఎలా గాడిన పెట్టాలో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఎంటని తల్లిదండ్రులు కూడా ఆవేదనకు లోనవుతున్నారు. ఇప్పటివరకు ఏ ఆటంకం లేకుండా పాఠశాల జరిగిన దాఖలాలు లేవు. పదోతరగతిలో ఫలితాలు రాకపోతే అధికారుల చర్యలుంటాయని ఉపాధ్యాయులు భయపడుతున్నారు. ఇంత ఎన్నికల నడుమ ఈ సంవత్సరం పది విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఏ విధంగా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. యాక్షన్ ప్లాన్ అమలు పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కలెక్టర్ ధర్మారెడ్డి, విద్యాశాఖ అధికారి రవికాంత్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. నవంబర్ 1 నుంచి అన్ని పాఠశాలల్లో పదో తరగతికి ఉదయం, సాయంత్రం వేళలల్లో ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం స్పెషల్ క్లాస్లు నడుపుతున్నారు. ప్రతీ రోజు ఒక పాఠ్యాంశాన్ని చదువుకొని, దానిపై విద్యార్థులను గ్రూపులుగా విభజించి, చర్చ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం ఆ ఆంశంపై టెస్ట్ నిర్వహిస్తూ శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాగా బోధనేతర విధులు, ఈ ప్రక్రియకు అవరోధంగా మారుతున్నాయని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.. పదో తరగతి విద్యార్థుల కో సం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాం. ఈ విద్యాసంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ప్రతి రోజును విలువైనదిగా భావిస్తున్నాం. దాదాపు అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. మార్చి మొదటి వారంలో ప్రాక్టీస్ టెస్టులు కూడా నిర్వహిస్తాం. తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. –మధుమోహన్, నోడల్ అధికారి, మెదక్ అడుగడుగునా ఆటంకాలే: ఈ విద్యా సంవత్సరంలో మా విద్యాబోధనకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్తవారు రాక పోవడంతో విద్యా వలంటీర్లతోనే బోధన కొనసాగిస్తున్నారు. ఎన్నికల నిర్వాహణ విధుల్లోకి టీచర్లు వెళ్తుండటంతో తరగతులు జరగక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. –వినయ్, పదో తరగతి విద్యార్థి, పాపన్నపేట -
మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ లాంగ్వేజి కాంపోజిట్ కోర్సు పేపర్–1 పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, పేపర్–2 పరీక్ష ఉదయం 9.30 నుంచి 10.45 వరకు జరగనుంది. ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సోమవారం ప్రకటన విడుదల చేసింది. -
పదిలో మెరిసిన ప్రకాశం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రకాశం జిల్లా మొదటి స్థానం సాధించింది. రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ప్రకాశం జిల్లా 97.93 శాతం ఉత్తీర్ణతలో మొదటి స్థానం సాధించినట్లు ప్రకటించారు. పది ఉత్తీర్ణతలో జిల్లాకు మొదటి స్థానం దక్కడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, అటు విద్యాసంస్థలు, ఉపాధ్యాయ వర్గాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. 2007లో 10వ తరగతి ఉత్తీర్ణతలో ప్రకాశం జిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఆ తర్వాత పది సంవత్సరాలకు మరోమారు జిల్లా మొదటి స్థానం దక్కించుకుంది. జిల్లా వ్యాప్తంగా 180 పరీక్ష కేంద్రాల పరిధిలో 38,642 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 37,841 మంది ఉత్తీర్ణత సాధించారు. 19,780 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 19,361 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక 18,862 మంది బాలికలు పరీక్షలు రాయగా 18,480 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురలో 419 మంది, బాలికల్లో 382 మంది మాత్రమే ఫెయిలయ్యారు. 2,087 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించారు. 2017 విద్యా సంవత్సరంలో 1060 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించగా ఈ ఏడాది సంఖ్య రెట్టింపయింది. గతంతో పోలిస్తే 8 శాతంకుపైగా పాస్ పర్సంటేజీ పెరిగినట్లు విద్యాశాఖాధికారులు ప్రకటించారు. 2016 ఏడాదిలో 90.50 శాతం ఉత్తీర్ణత సాధించగా 2017లో 91.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది అది ఏకంగా 97.93 శాతానికి పెరిగింది. నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పొతకమూరు జడ్పీ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో దర్శి మండలం పొతకమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది. 38 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 38 మంది పాసయ్యారు. చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన ఝాన్సీ అత్యధికంగా 9.7 పాయింట్లు సాధించారు. మిగిలిన వారిలో ఇద్దరు విద్యార్థులు 9.5, ముగ్గురు 9.3, ఒక విద్యార్థి 9.2, ఒక విద్యార్థి 9.0 పాయింట్లు సాధించటం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలో నూరు శాతం ఉత్తీర్ణతను సాధించటం పట్ల విద్యాశాఖ వారిని అభినందించింది. ఇది ప్రభుత్వ పాఠశాలలకు, ఉపాధ్యాయులకు మరింత స్ఫూర్తిగా నిలుస్తుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందరి కృషితోనే జిల్లాకు ప్రథమస్థానం ఒంగోలు టూటౌన్: అందరి కృషితోనే పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపామని జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావు తెలిపారు. పదవ తరగతి ఫలితాలు విడుదలైన సందర్భంగా తన ఛాంబర్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి మొత్తం 38,642 మంది విద్యార్థులు హాజరుకాగా 37,841 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. వీరిలో బాలురు 97.88 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 97.97 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. 2,087 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారన్నారు. గత ఏడాది 91.78 శాతం ఉత్తీర్ణత సాధించి 10వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 97.93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు. విద్యలో వెనకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ అవర్లు ఏర్పాటు చేసి చదివించామన్నారు. ప్రతి హాస్టల్ను రాత్రిళ్లు తనిఖీ చేసి వార్డెన్ల చేత చదివించామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు, టీచర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు. అందరి కృషితోనే పదేళ్ల తరువాత జిల్లా ప్రథమస్థానంలో నిలిచినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్వశిక్షఅభియాన్ పీఓ ఎం. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా బాణసంచా కాల్చారు. తరువాత వివిధ పాఠశాలల హెచ్ఎంలు, టీచర్లు, ఉపాధ్యాయల సంఘాల నాయకులు విద్యాశాఖాధికారిని అభినందించారు. -
మరక మిగిలింది..!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. అయితే, జిల్లా స్థాయిలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మొదటి నుంచి చెబుతున్నా మరికల్లో ఇంగ్లిష్–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వారికి మరక మిగిల్చింది. ప్రారంభం నుండి అంతా సాఫీగానే సాగుతోందని భావిస్తుండగా పేపర్ లీక్ కావడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు.. అన్ని శాఖల అధికారులను రంగంలోకి దించారు. మరికల్ వ్యవహారంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల పాత్ర ఉన్నట్లు తేలగా.. 13 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఒక ఇన్విజిలేటర్ కూడా ఉండడం గమనార్హం. కాగా, ఎస్సెస్సీ పరీక్షల్లో మొత్తం నలుగురు విద్యార్థులను డిబార్ చేశారు. లీక్ వ్యవహారంలో 13 మంది సస్పెన్షన్ మరికల్లోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో 19వ తేదీ సోమవారం ఇంగ్లిష్–1 పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే నవీన్ అనే యువకుడు కేంద్రం గోడ దూకి ఓ విద్యార్థి ని ప్రశ్నపత్రాన్ని కిటికీ నుంచి ఫొటో తీసుకుని బయట ఉన్న రెండు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు మోహన్ రాజేందర్, ప్రవీణ్కు అందజేశారు. ఆ తర్వాత వారు సమాధానాలు తయారు చేయించి తమ విద్యార్థులకు పంపించారు. ఈ ఘటనలో ఇన్విజిలేటర్ సహా 13 మందిని సస్పెండ్ చేయడంతో పాటు ఓ ఇన్విజిలేటర్పై కేసు నమోదు చేసి, వ్యవహారంతో సంబంధం ఉన్న మొత్తం 11 మంది రిమాండ్కు తరలించారు. ఇదే ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ముగ్గురు కానిస్టేబుళ్లను కూడా ఎస్పీ అనురాధ సస్పెండ్ చేశారు. ఇది జరిగాక కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్ని శాఖల ఉన్నతాధికారులు రంగంలోకి జిల్లాను జల్లెడ పట్టారు. దాదాపు అన్ని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి లోపాలను గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు. ఇక ధన్వాడ మండలం కొండాపూర్ పాఠశాలలో తనిఖీకి వెళ్లిన ఆర్జేడీ వియజలక్ష్మికి కేంద్రం ఆవరణలో చీటీలు ఎక్కువ కనిపించడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. అలాగే, అక్కడ 11 మంది ఇన్విజిలేటర్లను పరీక్ష విధుల నుండి తప్పించారు. భూత్పూర్లో ఉపాధ్యాయుడు.. భూత్పూర్లోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో తనిఖీ సందర్భంగా విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ గుర్తించారు. ఒక గది కిటీకి పక్కన చీటీలు ఎక్కువగా ఉండడంతో ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలగా సస్పెండ్ చేశారు. అంతేకాకుండా అదే పరీక్ష కేంద్రం వద్ద ఫిజిక్స్ పేపర్ పరీక్ష రోజు పాత మొల్గర పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయుడు కనిపించగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఉపాధ్యాయుల సస్పెన్షన్పై ఉపాద్యాయ సంఘాల నాయకులు కలెక్టర్ను కలవగా.. ఆ సమావేశంలో జీహెచ్ఎం సంఘం నాయకుడు, పాత మొల్గర పాఠశాల హెచ్ఎంను కలెక్టర్ మందలించారు. భూత్పూర్ పరీక్ష కేంద్రంలో ఎక్కువగా పాతమొల్గర విద్యార్థులే పరీక్షలు రాస్తున్నారని, అక్కడకు పాఠశాల చెందిన ఉపాధ్యాయులు ప్రతిరోజు ఎందుకు వెళ్తున్నారు, ఏం పని అంటూ ప్రశ్నించారు. చివరి రోజు 20,126 మంది విద్యార్థుల హాజరు ఎస్సెస్సీ పరీక్షల చివరి రోజైన బుధవారం మొత్తం 20,126 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 20,188 మంది విద్యార్థులకు 64 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. చివరి రోజు డీఎల్ఓ ఐదు కేంద్రాల్లో, డీఈఓ ఆరు, ఫ్లయింగ్ స్వా్కడడ్లు 28 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. -
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
కెరమెరి : ఈ నెల 15 నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. మండలంలోని కెరమెరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడి ఆశ్రమ ఉ న్నత పాఠశాలల్లో మొత్తం 302 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి అటుపోట్లకు తావు లేకుండా నిర్వహించారు. రెబ్బెన : మండలంలో గత 15వ తేదీన ప్రారంభం అయిన పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు గంగాపూర్ జెడ్పీ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మండలంలో 418 మంది విద్యార్థులు పరీక్షలకు హాజర య్యారు. తిర్యాణి: పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పరీక్ష కేంద్రంలో 234 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. బుధవారం పరీక్ష కేంద్రాన్ని స్క్వాడ్ జబ్బార్ ఖాన్ తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు ముగియడంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఇళ్లకు తరలివెళ్లారు. దీంతో విద్యార్థులు హుషారుగా తమ ఇళ్లకు పయనమయ్యారు. -
రెండు చేతి వేళ్లతోనే పది పరీక్ష రాసిన విద్యార్థి
చిట్టమూరు: మండల పరిధిలోని ఈశ్వరవాక గ్రామ ఉన్నత పాఠశాల్లో పది విద్యార్థి రెండు చేతి వేళ్లతోనే పది పరీక్షలు రాశాడు. గ్రామానికి చెందిన కూర పాటి మునిరత్నం, రాజమ్మల కుమారుడు కూరపాటి నాగ మురళీ కొత్తగుంట గ్రామంలోని టీఎమ్మార్ స్కూల్లో పది పరీక్షలు రాశా డు. పుట్టుకతోనే వికలాంగుడైన మురళీకి ఒక్కో చేతికి ఒక్క వేలు మాత్రమే ఉంది. దీంతో పెన్ను పట్టుకుని పరీక్ష రాయాలంటే చాలా కష్టం. తన పని తాను చేసుకోలేని మురళీ చదవాలనే తపనతో కష్టమైనా బడికి వెలుతూ పరీక్షలకు హాజరయ్యాడు. తాను కష్టపడి చదివి కలెక్టర్ కావాలని సంకల్పంతో ఉన్నానని చెప్పాడు. పది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తానని , చదువు విషయంలో పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తనకు సహా య సహకారాలు అందించారన్నాడు. నాగ మురళీ సాహసం చూసి ఉపాధ్యాయులు మెచ్చుకున్నారు. -
సంచలనం సృష్టిస్తున్న టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ
-
వాట్సాప్లో టెన్త్ పేపర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్వర్క్: పదో తరగతి పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ఇంగ్లిష్ పేప ర్–1 లీక్ వార్తలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. 2 జిల్లాల్లో పరీక్ష మొదలైన గంటకే ప్రశ్నపత్రం వాట్సాప్లో చక్కర్లు కొట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇన్విజిలేటరే ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్లో బయటకు పంపగా, మహబూబ్నగర్లో బయటి వ్యక్తి గోడ దూకి వచ్చి కిటికి పక్క నుంచి ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసుకొని వాట్సాప్లో బయటకు పంపారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో, మహబూబ్నగర్ జిల్లా మరికల్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొనడంతో అక్కడున్న పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. పరీక్షలు పూర్తయ్యేలోపు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. శాఖాపరంగా కూడా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఎలాంటి జవాబులు పరీక్షల హాల్లోకి వెళ్లలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందని, వారితోపాటు వారి పాఠశాలలపైనా చర్యలు చేపడతామన్నారు. గుర్తించిందిలా.. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలపాలని ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, డీఈవో జనార్దన్రావులను ఆదేశించారు. దీంతో అక్కడికి వెళ్లిన అధికారులు పరీక్ష కేంద్రంలో పేపర్ లీకైనట్లు నిర్ధారించారు. ప్రశ్నపత్రం కింద విద్యార్థి హాల్టికెట్ నంబర్తో పాటు ఫొటోలో ఇన్విజిలేటర్ చీరను బట్టి అదే గదిలో పేపర్ లీకైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఆదిలాబాద్లో నలుగురి సస్పెన్షన్ ప్రశ్నపత్రం బయటకు పంపిన వ్యవహారంలో ఆదిలాబాద్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్, సదరు ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేసినట్లు కిషన్ తెలిపారు. మహబూబ్నగర్లోని పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న అందరినీ పరీక్ష విధుల నుంచి రిలీవ్ చేసినట్లు వెల్లడించారు. రెండు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. మరికల్ లోని ప్రైవేట్ పాఠశాలలైన గౌతమి పాఠశాల, ప్రతిభ పాఠశాల బాధ్యులు కాపీయింగ్ను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు డీఈఓ సోమిరెడ్డి వెల్లడించారు. అలాగే పరీక్ష విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సూర్యాపేట జిల్లా నూతన్కల్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఒక ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పరీక్ష రద్దు కాదు.. పరీక్ష ప్రారంభానికి ముందు బయటకొస్తే లీక్ అంటామని, 2 జిల్లాల్లో జరిగిన ఘటనలు మాల్ప్రాక్టీస్ కిందకే వస్తాయని తెలిపారు. మాల్ప్రాక్టీస్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం 407 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, రానున్న సంవత్సరాల్లో అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం జవాబులేవీ పరీక్ష హాల్లోని విద్యార్థులకు చేరలేదని, 2 కేంద్రాలకు సంబంధిం చిన సంఘటనలు మాత్రమే కావడంతో ఈ పరీక్షను రద్దు చేసేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కంటే ముందుగా లీక్ అయితే ఆ పరిస్థితి ఉండేదన్నారు. ఇక 20న జరగాల్సిన ఇంగ్లిష్ పేపర్–2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని వివరించారు. -
టెన్త్ ఇంగ్లీష్ పేపర్ లీక్..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ సంచలనం సృష్టిస్తోంది. సోమవారం ఉదయం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం... పరీక్షకు అరగంట ముందే ఆదిలాబాద్, వనపర్తి జిల్లాలలో లీకైంది. ఓ టీచర్ ప్రశ్నాపత్రాన్ని సెల్ఫోన్లో ఫోటో తీసి సర్క్యులేట్ చేసినట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకేజీతో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తం అయింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నాలుగు పోలీసు బృందాలు విచారణ జరుపుతున్నాయి. మరోవైపు రెండు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఫోన్లో మాట్లాడారు. లీకైన సెంటర్ల సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇక ప్రశ్నాపత్రం లీకేజీపై ఆదిలాబాద్ డీఈవో మాట్లాడుతూ.. వాట్సప్ ద్వారా క్వశ్చన్ పేపర్ను లీక్ చేసినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. నలుగురు అధికారులపై వేటు టెన్త్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి నలుగురు అధికారులపై వేటు పడింది. ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఇద్దరు సూపర్ వైజర్లతో పాటు విద్యార్థులుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. -
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈనెల 29 వరకు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థుల హాల్టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపించడంతో పాటు వాటిని వెబ్సైట్లో (www.bseap.org) కూడా పొందుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 11,356 పాఠశాలలకు చెందిన 6,17,484 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,834 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలోనూ పదోతరగతి పరీక్షలకు మొదలయ్యాయి. గురువారం నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు (కొన్ని సబ్జెక్టులు 12:45 గంటల వరకు) జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం 9:30 గంటల తర్వాత ఐదు నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 కేంద్రాల్లో 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులందరికీ ఇప్పటికే హాల్టికెట్లు జారీ చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. హాల్టికెట్లు అందని వారు www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. పరీక్ష హాల్లోకి సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరు. హాల్టిక్కెట్లు తప్ప ఇతర పేపర్లను తీసుకుపోరాదు. హాల్టిక్కెట్ల రోల్ నెంబర్లను, మెయిన్ ఆన్షర్ షీట్లు, అడిషనల్, బిట్, మ్యాప్, గ్రాఫ్ షీట్లతో సహ ఎక్కడా రాయరాదు. ఊరు, పేరు, సంతకం వంటి ఇతర చిహ్నాలు పెట్టరాదని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులను తొలి రెండు రోజులు మాత్రమే పరీక్ష ప్రారంభమైన అరగంటవరకు అనుమతిస్తామని, తరువాత నుంచి అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు (కొన్ని సబ్జెక్టులు 12:45 గంటల వరకు) జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం 9:30 గంటల తర్వాత ఐదు నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 కేంద్రాల్లో 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులందరికీ ఇప్పటికే హాల్టికెట్లు జారీ చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. హాల్టికెట్లు అందని వారు www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు.. రాష్ట్రవ్యాప్తంగా 26 సమస్యాత్మక కేంద్రాలతో పాటు మరో 405 పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లపైనా చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అదేవిధంగా ఎంఈవో, డీఈవోలు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. పరీక్షలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. సమస్యలు, సందేహాల నివృత్తికి 1800–4257462కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. -
ఇన్విజిలేటర్ల జంబ్లింగ్
సాక్షి ప్రతినిధి, కడప : పకడ్బందీ ఏర్పాట్ల నడుమ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించబోయే వార్షిక పరీక్షలకు అధికా రులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొదటిసారిగా ఈ పరీక్షల పర్యవేక్షించే ఇన్విజిలేటర్లు జంబ్లింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తించనున్నారు. ముఖ్యంగా చూసిరాతల నిరోధానికి అన్ని పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. అదేవిధంగా ఎనిమిది సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు పహారా మధ్య జిల్లావ్యాప్తంగా 53 స్టోరేజీ పాయింట్లలో ప్రశ్నపత్రాలను భద్రపరిచారు. చూచిరాతల నిరోధానికి చర్యలు జిల్లాలో టెన్త్ వార్షిక పరీక్షల నిర్వహణకు 164 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో జంబ్లింగ్ విధానంలో విద్యార్థులను కేటాయించారు. చూచిరాతల నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం విద్యాశాఖ సిబ్బందితోపాటు రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బందిని అన్ని కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్లుగా నియమించనున్నారు. ప్రతి జోన్లోని ఒక కేంద్రంలో రెగ్యులర్ విద్యార్థులతోపాటు ప్రైవేటు విద్యార్థులు పరీ క్షలు రాసేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో టెన్త్ పరీక్షలకు మొత్తం 35,737 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 18,513మంది, బాలికలు 17,224 మంది ఉన్నారు. 15నుంచి 29 వరకు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం జిల్లావ్యాప్తంగా 1,640 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉండనున్నారు. వీరిని పరీక్ష కేంద్రాలకు జంబ్లింగ్ విధానంలో నియమిస్తారు. ప్రతి మూడు రోజులకోసారి ఇన్విజిలేటర్లను మారుస్తుంటారు. ఇన్విజిలేటర్లెవరైనా విద్యార్థులను చూచిరాతలకు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై విమర్శలు జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రాలను వదలేసి సీగ్రేడ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు స్కూల్ విద్యార్థులు పరీక్ష రాస్తున్న కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందనే ఆరోపణలు గతంలో ఉన్నాయి. వాటిపై దృష్టిపెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెల్ఫోన్లు నిషిద్ధం: పరీక్ష కేంద్రాల్లోపలికి సెల్ఫోన్లను నిషేధించారు. చీఫ్ సూపరింటెండెంట్ వద్ద మినహా ఎవరి వద్దా సెల్ఫోన్లు ఉండడానికి వీల్లేదు. ఆయన కూడా ఫోన్ను సైలెంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఉన్నతాధికారులు తెలిపే సూచనలను వినేందుకు మాత్రమే సెల్ఫోన్ను ముఖ్య పర్యవేక్షకులు వినియోగించాలి తప్ప ఇతర కాల్స్ మాట్లాడకూడదనే నిబంధన విధించారు. పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకోవాలి విద్యార్థులు హాల్టిక్కెట్, పరీక్షలు రాసేందుకు అవసరమైన సామగ్రి తప్ప సెల్ఫోన్లుకానీ, ఎలక్ట్రానిక్ వస్తువులుకానీ వెంట తీసుకురాకూడదు. పరీక్ష ప్రారంభ సమయానికి కనీసం 30 నిమిషాల ముందుగా కేంద్రాలకు చేరుకోవడం అన్నివిధాలా మంచిది. అనుకోని పరిస్థితుల్లో విద్యార్థులెవరైనా నిర్ణీత సమాయానికి కేంద్రానికి చేరుకోకపోయినా.. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల వరకు కేంద్రంలోనికి అనుమతిస్తాం. –పి.శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి -
పది ఫలితాలపై నజర్
విద్యారణ్యపురి: ఈ ఏడాది పదో తరగతి ఫలితాలపై జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. పదిలో ‘ఫస్ట్’ వచ్చేలా ప్రయత్నం చేయాలని ఇప్పటికే రెండు జిల్లాల ఎంఈఓ, హెచ్ఎంలను ఆదేశించారు. మార్చి 15 నుంచి 30 వరకు టెన్త్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లోనూ ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాల విధులకు ముందు ఒక గంట, సాయంత్రం పాఠశాల విధులు ముగిసాక మరొక గంట ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయి. ఈ ప్రత్యేక తరగతుల్లో ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. నూరుశాతం ఫలితాలు సాధించడంతోపాటు 10/10 జీపీఏ కూడా విద్యార్థులు సాధించేలా వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా ఇప్పటికే 40 రోజుల ప్రణాళికను రూపొందించి అమలుచేస్తున్నారు. ప్రత్యేక తరగతులపై అబ్జర్వేషన్ కమిటీలు వరంగల్ అర్బన్ జిల్లాలో 149 ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో 5,436మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనునున్నారు. వీరికి ప్రత్యేక తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించేందుకు తాజాగా అబ్జర్వేషన్ కమిటీలను నియమించారు. హన్మకొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలనుంచి ముగ్గురు లెక్చరర్లు, డీఈఓ కార్యాలయంలోని ఇద్దరు సెక్టోరియల్ ఆఫీసర్లతో కమిటీలను ఏర్పాటు చేశారు. రూరల్ జిల్లాలోనూ 131ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో కలిపి 5,036మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలను రాయబోతున్నారు. ఇక్కడ కూడా ఐదుగురు సీనియర్ హెచ్ఎంలు, ఒక సెక్టోరియల్ ఆఫీసర్తో కలిపి ఆరు బృందాలుగా ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ఎంఈఓలు, స్కూల్కాంప్లెక్స్ హెచ్ఎంలు కూడా పర్యవేక్షించనున్నారు. కమిటీల పని ఇదే.. కమిటీలు జనవరి నెల 27 నుంచి ఉన్నత పాఠశాలలను రోజువారిగా సందర్శిస్తున్నాయి. సిలబస్ను సబ్జెక్టులవారీగా పూర్తి చేశారా.. లేదా ఇటీవల జరిగిన సమ్మీటివ్–1 పరీక్ష జవాబు పత్రాలు వాల్యుయేషన్ చేశారా లేదా అనేది పరిశీలిస్తున్నారు. విద్యార్థుల ఫలితాలను బట్టి వెనుకబడిన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. క్లాస్ టీచర్లు, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ఏమైనా లోటుపాటు ఉంటే సరిదిద్దుతున్నారు. ఇలా తదితర అంశాలను పరిశీలించి ఓ ప్రొఫార్మా తయారు చేసి డీఈఓకు సమర్పించబోతున్నారు. స్నాక్స్ నిధులకోసం ప్రతిపాదనలు పదో తరగతి విద్యార్థులకు ఉదయం 8.30గంటల నుంచి 9.30 గంటలవరకు, సాయంత్రం 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో విద్యార్థులు నీరసించకుండా ఉండేందుకు స్నాక్స్ అందజేస్తే బాగుంటుందని హెచ్ఎంలు విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. డీఈఓ జిల్లా కలెక్టర్ అమ్రపాలి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. నిధులు ఎన్ని వెచ్చించాలో ప్రతిపాదించాలని ఆదేశించారు. ఈ మేరకు డీఈఓ నారాయణరెడ్డి రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.5 చొప్పున వెచ్చించేలా 38 రోజులు(జనవరి 27 నుంచి మార్చి 14 వరకు) నిధులు కావాలని ప్రతిపాదించారు. అర్బన్ జిల్లాలో 5436 విద్యార్థులకు గాను రూ.10.32లక్షల నిధులు అవసరమని, రూరల్ జిల్లాలో 5,036 విద్యార్థులకు రూ 9.56 లక్షల నిధులు అవసరమని డీఈఓ కలెక్టర్కు ప్రతిపాదించారు. స్నాక్స్ కోసం నిధులు మంజూరవుతాయో.. లేదనేది రెండు మూడురోజుల్లో తెలిసిపోనుంది. -
టెన్త్ పరీక్షలకు 5.6 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్: మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వేగవంతం చేసింది. పరీక్ష రాసేందుకు 5,60,395 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వీరి కోసం 2,500కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. కేంద్రాల్లో అవసరమైన బెంచీలు, సదుపాయాల, ఇతర ఏర్పాట్లపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ అధికారులతో సమీక్షించారు. అన్ని సదుపాయాలుండేలా చూడాలని, లోపాలేమైనా ఉంటే తెలపాలని ఆదేశించారు. ఫర్నీచర్ అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని విద్యా శాఖ సూచించింది. సీసీ కెమెరాల ఏర్పాటు..: పరీక్షల ఏర్పాట్లలో భాగంగా సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనిపై పాఠశాల విద్య కమిషనర్ కిషన్ ఉన్నతాధికారులతో చర్చించారు. గతేడాది మాల్ ప్రాక్టీస్ ఆరోపణలున్న జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలకు హాజరయ్యేందు కు 11,109 ఉన్నత పాఠశాలలకు చెందిన 5,04,545 మంది రెగ్యులర్ విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఒకసారి ఫెయిలైన ప్రైవేటు విద్యార్థులు 35,864 మంది హాజరుకానుండగా, వొకేషనల్ విద్యార్థులు 19,986 మంది హాజరయ్యేందుకు ఫీజు చెల్లించారు. తత్కాల్ కింద ఫీజు చెల్లించేందుకు ఇంకా సమయం ఉన్నందున సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశముంది. పరీక్ష కేంద్రాలుగా ప్రైవేటు విద్యా సంస్థల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్, రంగారెడ్డిపై ప్రత్యేక దృష్టి.. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధిక సంఖ్యలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారు. దీంతో ఈ 2 జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిం చింది. రెగ్యులర్ విద్యార్థుల్లో హైదరాబాద్ జిల్లా నుంచి 69,871, రంగారెడ్డి జిల్లా నుంచి 43,427 మంది హాజరుకానున్నారు. నిజామాబాద్ జిల్లాలో 24,200, సంగారెడ్డిలో 20,807, నల్లగొండలో 20,512, మహబూబ్నగర్లో 20,063 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించారు. -
మే మొదటివారంలో ‘పది’ ఫలితాలు
- రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ భార్గవ చిత్తూరు: ఈ నెల 16వ తేదీతో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం పూర్తవుతుందని, ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ భార్గవ తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్లో జరుగుతున్న మూల్యాంకనాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఏడు జిల్లాల్లో తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. కాపీకొట్టే పద్ధతిని అరికట్టి పకడ్బందీగా పదో తరగతి పరీక్షలను నిర్వహించే పద్ధతిని తీసుకొస్తామన్నారు. బట్టీ విధానాన్ని తొలగించేందుకు, విద్యార్థి తెలివితేటలను కనిపెట్టేలా సీసీఈ పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు. ఈ విధానంలో విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో ప్రతి సబ్జెక్ట్లో ఎక్స్టర్నల్ మార్కులను కలిపే ప్రక్రియ జరుగుతోందన్నారు. -
3 నుంచి పది మూల్యాంకనం
- సెల్ఫోన్లు తేవొద్దు - పేపర్ లీక్ కాలేదు.. అది మాల్ప్రాక్టీస్ - యాజమాన్యం పాత్ర ఉందని తేలితే స్కూల్ను బ్లాక్లిస్టులో పెడతాం - డీఈఓ రామలింగం నెల్లూరు(టౌన్) : పదో జవాబుపత్రాల మూల్యాం కనం వచ్చే నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం తెలిపారు. నెల్లూరులోని పొదలకూరురోడ్డులోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెయింట్ జోసెఫ్ స్కూల్లో మూల్యాంకనం చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాకు సుమారు 5 లక్షలకు పైగా జవాబుపత్రాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం డీకోడ్ జరుగుతోందన్నారు. మూల్యాంకనంలో 3,700 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొననున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సెల్ఫోన్లు అనుమతించమని చెప్పారు. కుటుంబసభ్యులతో మాట్లాడాలనుకుంటే డీఈఓ సెల్ఫోన్ నుంచి చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంగా ఉండటంతో.. పది పరీక్షలు జరిగే సమయంలో సెల్ఫోన్ అనుమతించలేదన్నారు. నారాయణ స్కూల్లో వాటర్ బాయ్ ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్ ద్వారా పంపించడం మాల్ప్రాక్టీస్ కిందకు వస్తుందన్నారు. ఆ గదిలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే సెల్ఫోన్తో ఫొటో తీశారని చెప్పారు. ప్రాథమిక విచారణ అనంతరం అనుమానంతో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విచారణలో టీచర్ పాత్ర ఉందని తేలితే సర్వీసు నుంచి తొలగిస్తామన్నారు. ఈ వ్యవహారంలో స్కూల్ యాజమాన్యం హస్తం ఉన్నట్లు విచారణలో తేలితే ఆస్కూల్ను బ్లాక్లిస్టులో పెట్టనున్నుట్లు తెలిపారు. -
ముగిసిన ‘పది’ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. మడకశిర, కదిరి ఘటనలతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురైనా తర్వాత పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 17న పరీక్షలు ప్రారంభమయ్యాయి. చివరి రోజు జరిగిన సోషియల్ పేపర్–2 పరీక్షకు 48,978 మంది విద్యార్థులకు గాను 48,744 మంది విద్యార్థులు హాజరయ్యారు. 235 మంది గైర్హాజరయ్యారు. ఆర్జేడీ ప్రతాప్రెడ్డి, డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, స్క్వాడ్ బృందాలు కలిపి మొత్తం 85 కేంద్రాలను పరిశీలించారు. మడకశిర, కదిరి ఘటనలతో ఆందోళన పరీక్ష ప్రారంభమైన తొలిరోజే మడకశిర ప్రభుత్వ పాఠశాల ‘బీ’ కేంద్రం నుంచి తెలుగు పేపర్–1 ప్రశ్నపత్రం లీక్ కావడం దుమారం రేపింది. ఈ ఘటన రాష్ట్రమంతా ‘అనంత’ వైపు చూసేలా చేసింది. అప్రమత్తమైన అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయితే రెండు రోజులకే హిందీ పరీక్ష మళ్లీ అలజడి రేపింది. ఇప్పుడే ఏకంగా మంత్రి నారాయణకు చెందిన పాఠశాలలో సిబ్బంది జవాబుపత్రాలు సిద్ధం చేస్తూ మీడియా కంటపడ్డారు. కదిరిలో జరిగిన ఈ ఘటన అ«ధికారులకు ఊపిరాడకుండా చేసింది. ప్రశ్నపత్రం ఇక్కడ లీకు కాలేదని ఎక్కడో బయట నుంచి తెప్పించుకుని ఇక్కడి మంత్రి పాఠశాలలో జవాబుపత్రాలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నారాయణ పాఠశాల విద్యార్థులు ఏయే కేంద్రాల్లో ఉన్నారో వారికి చేరవేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. విద్యార్థులతో కిటకిటలాడిన బస్టాండు, రైల్వేస్టేషన్ పరీక్షలు ముగియడంతో హాస్టళ్లు, బంధువుల ఇళ్లలో ఉంటూ చదుకుంటున్న విద్యార్థులు సొంతూళ్లకు బయలుదేరారు. పరీక్ష ముగియగానే ఆనందంతో ఎగిరి గంతులేశారు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల సాయంతో ఊరికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్కు రావడంతో కిటకిటలాడాయి. -
పదో తరగతి ప్రశ్నపత్రాల కారు బోల్తా..
ఖమ్మం: పదో తరగతి పరీక్షా పత్రాలు తీసుకెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బాణాపురంలో గురువారం చోటుచేసుకుంది. బాణాపురం పరీక్షా కేంద్రానికి ప్రశ్నపత్రాలు తీసుకెళ్తున్న కారు బోల్తా కొట్టడంతో కారులో ఉన్న కానిస్టేబుల్తో పాటు ప్రధానోపాధ్యాయుడికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రశ్నపత్రాలను మరో వాహనంలో కేంద్రానికి తరలించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. -
‘అనంత’పై ప్రత్యేక నిఘా!
– విద్యాశాఖకు ముచ్చెమటలు పట్టించిన పేపర్ లీక్ – రెండో రోజు టీ, కాఫీకి కూడా అటెండర్ను బయటకు పంపని వైనం – మడకశిర ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై ఎస్పీకి విద్యాశాఖ లేఖ అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి తెలుగు పేపర్–1 లీకు ఘటనతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర అధికారులు ‘అనంత’పై ప్రత్యేక నిఘా ఉంచారు. మడకశిర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో ఓ విద్యార్థిని నుంచి కిటికీలో ప్రశ్నపత్రం తీసుకుని సెల్ఫోన్లో ఫొటోలు తీసి బయటకు తీసుకొచ్చిన యువకులు సామాజిక మాధ్యమాల్లో ఉంచిన సంగతి తెలిసిందే. తొలుత ఈ ఘటన మన జిల్లాకు సంబంధం లేదంటూ కొట్టిపారేసిన అధికారులు... సదరు విద్యార్థిని హాల్టికెట్ నంబరు ప్రశ్నపత్రం మీద ఉండడంతో అది మడకశిర కేంద్రం నుంచి అని తేలడంతో ఖంగుతిన్నారు. ఈ ఘటనతో జిల్లా అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ఈ తరహా ఘటన ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం జరిగిన తెలుగు పేపర్–2 పరీక్షలో ప్రత్యేక నిఘా ఉంచారు. చాలా కేంద్రాల్లో చివరకు అటెండర్లను సైతం టీ, కాపీల కోసం బయటకు పంపలేదు. పోలీసులు కాపలా ఉండి పరీక్ష ప్రారంభానికి కేంద్రంలోకి వెళ్లినవారిని తిరిగి పరీక్ష ముగిసేదాకా బయటకు రాకుండా, బయటివారు లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. నిఘా పెంచిన అధికారులు పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు నిఘా పెంచారు. ఉదయం పోలీస్ స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలు తీసుకెళ్లి...పరీక్ష పూర్తయ్యేదాకా అడుగడుగునా నిఘా ఉంచారు. ప్రాంతీయ ఉప సంచాలకులు ప్రతాప్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడంతో పాటు పర్యవేక్షించారు. ఆర్జేడీ అనంతపురం, కదిరి, కొత్తచెరువు ప్రాంతాల్లో ఏడు కేంద్రాలు, డీఈఓ తొమ్మిది కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 78 కేంద్రాలు తనిఖీలు చేశాయి. తెలుగు పేపర్–2 పరీక్షకు జిల్లాలో మొత్తం 49,278 మంది విద్యార్థులకు గాను 49,025 మంది హాజరయ్యారు. 253 మంది గైర్హాజరయ్యారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఎస్పీకి విద్యాశాఖ లేఖ మడకశిర పేపరు లీకు ఘటనలో స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై విద్యాశాఖ అధికారులు ఎస్పీ రాజశేఖర్బాబుకు లేఖ రాశారు. చుట్టూ కాంపౌండ్ ఉన్నా...అదికూడా పరీక్ష ప్రారంభమైన తర్వాత నలుగురు యువకులు కేంద్రంలోకి ఎలా వెళ్లారు..పోలీçసులు ఏం చేస్తున్నారు సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఇదిలాఉండగా పేపరు లీక్ ఘటనలో మరింత మంది మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు. సదరు విద్యార్థినిని డీబార్ చేశారు. పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. నివేదిక రాగానే సంబంధిత చీప్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిసింది. ఏది ఏమైనా మడకశిర ఘటనతో అధికారుల్లో చలనం వచ్చింది. -
సమస్యలు ‘పది’లం
– జిల్లాలో ఓ విద్యార్థి డిబార్... ఇన్విజిలేటర్పై వేటు – తల్లి మృతిచెందినా కన్నీటితో పరీక్షకు హాజరైన విద్యార్థిని – పరీక్ష కేంద్రాల్లో అరకొర బెంచీలపైనే పరీక్షలు రాసిన విద్యార్థులు – అంకిరెడ్డిపల్లె సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై తల్లిదండ్రుల ఆందోళన – 66 కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు – మొదటి రోజు 249 మంది గైర్హాజరు కర్నూలు(సిటీ): ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలు అసౌకర్యాలతోనే శుక్రవారం ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల విద్యార్థులు.. పాత బెంచీల మీదనే పరీక్షలు రాశారు. మొదటిరోజు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి కేంద్రాల వద్దకు వచ్చారు. అయితే 144 సెక్షన్ అమలు చేస్తుండడంతో పోలీసులు..వారిని కేంద్రాల దగ్గరికి రానివ్వలేదు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు అరగంటకు ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కొంత ఆలస్యమైంది. మొదటిరోజు కావడంతో పరీక్షా సమయానికి 5, 10 నిముషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించారు. కేంద్రంలోకి విద్యార్థులను పంపించేటప్పుడే ప్రతిచోటా అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరుగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అరకొర బెంచీలతోనే పరీక్షలు... జిల్లాలో 240 కేంద్రాల్లో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు మొదటిరోజున 50,198 మంది విద్యార్థులకు గాను 49,948 మంది విద్యార్థులు హాజరయ్యారు. 249 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అధికారుల గణాంకాల ప్రకారం పది సెంటర్లలో మాత్రమే పూర్తిస్థాయిలో బెంచీలు లేవు. అయితే సగానికి సగం కేంద్రాల్లో అద్దె తీసుకుని ఏర్పాటు చేసిన బెంచీలపైనే విద్యార్థులు పరీక్షలు రాయడం గమనార్హం. సప్లయర్ దుకాణాల్లోని బెంచీలు ఏర్పాటు చేశారు. అయితే కొంత మంది విద్యార్థులు ఆ బెంచీలపై కుర్చునేందుకు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు ప్రభుత్వ స్కూళ్ళు కేంద్రాలుగా ఉన్న చోట గదుల్లో ఫ్యాన్లు లేకపోవడంతో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు అవస్థలు పడ్డారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల్లో తాగు నీటి సదుపాయం పూర్తి ఏర్పాటు చేయలేదు. గార్గేయపురం హైస్కూల్లో ఏర్పాటు చేసిన పాత బెంచీలను మార్పులు చేయాలని డీఈఓ ఆదేశాలు ఇచ్చారు. పాత బెంచీల స్థానంలో ఓ దాత స్కూల్కు బెంచీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఓ విద్యార్థి డిబార్...ఇన్విజిలేటర్లపై వేటు ఈ ఏడాది పది పరీక్షల్లో మాస్ కాపింగ్ను నియంత్రించేందుకు చట్టం 25/97ను పగడ్బందీగా అమలు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు ఇచ్చింది. మొదటి రోజునే సప్లమెంటరీ పరీక్ష రాస్తున్న విద్యార్థి కాపీయింగ్ పాల్పడుతూ ఫ్లయింగ్స్క్వాడ్ తనిఖీలో పట్టుబడ్డాడు. ఆ విద్యార్థిని డిబార్ చేశారు. ఇన్విజిలేటర్పై కూడా వేటు వేసినట్లు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆందోళన పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే సీ క్యాటగిరి(22), సమస్యాత్మకమైన కేంద్రాల్లో(18) కూడా కేవలం 5 చోట్ల మాత్రమే ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటులోను ఓ హెచ్ఎం తన స్కూల్కు కాకుండా మరో స్కూల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చేయడంతో కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె కేంద్రంలో పరీక్షలకు హాజరు అయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అన్ని చోట్ల చేయాలని, కొన్ని చోట్ల మాత్రమే ఏర్పాటు చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్ది సేపు అక్కడి వారితో వాదనకు దిగారు. పోలీసులు కల్పించుకోని సర్ది చెప్పడంతో ఆందోళన విరిమించుకున్నట్లు తెలిసింది. 66 కేంద్రాల్లో తనిఖీలు డీఈఓ తాహెరా సుల్తానా... కర్నూలు నగరంలోని మాంటిస్సోరి స్కూల్, గార్గేయపురం, బ్రాహ్మాణకొట్కూరులలో ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు. ఎస్సీఈఆర్టీ నుంచి జిల్లా పరిశీలకులుగా వచ్చిన లక్ష్మీవాట్స్..గడివేముల, మిడ్తూరు మండలాల్లో 4 కేంద్రాలను, ఫ్లయింగ్స్క్వాడ్ టీంలు కలిసి మొత్తం 66 కేంద్రాలను తనిఖీ చేశారు. పుట్టెడు దుఃఖంతో పరీక్షకు తల్లి చనిపోవడంతో పుట్టెడు దుఃఖంతో ఓ విద్యార్థిని పదోతరగతి పరీక్ష రాసింది. నంద్యాల పట్టణం ఎన్జీఓ కాలనీకి చెందిన మద్దిలేటి, కళావతిల పెద్ద కుమార్తె బిందుమాధవి..కేశవ రెడ్డి పాఠశాలలో పదో తరగతి చదివింది. పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా తల్లి కళావతి గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్నేహితులు విద్యార్థిని వద్దకు వెళ్లి ఓదార్చారు. పరీక్షలు రాసి తల్లి ఆశయాన్ని నెరవేర్చాలని ఉపాధ్యాయులు సూచించడంతో శుక్రవారం ఆ విద్యార్థిని శ్రీ గురురాజా పాఠశాలలో పరీక్ష రాసింది. -
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
-
ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
-
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. మొత్తం 6,28,081 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 2,931 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిసారి సీసీఈ విధానం అమలు చేస్తున్నారు. పావు గంట అదనపు సమయం ఇచ్చారు. కాగా, ఈ సందర్భంగా 144వ సెక్షన్ అమలు చేస్తున్నామని, ఆలస్యంగా వస్తే అనుమతించబోమని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం 5,38,226 మంది విద్యార్థులకు 2,556 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఉదయం 9.30కి ప్రారంభం అయ్యే పరీక్షలకు విద్యార్థులను 8.45 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి ఇచ్చారు. ఈ నెల 14 నుంచే టెన్త్ పరీక్షలు ప్రారంభమైనా 14, 15, 16న ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్ ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించారు. కాగా పరీక్ష కేంద్రాల్లోకి వాటర్ బాయ్ని కూడా అనుమతించడానికి వీల్లేదని పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో కరస్పాండెంట్లను కూడా రానీయొద్దని స్పష్టం చేశారు. పరీక్ష సిబ్బంది సహా ఎవరూ సెంటర్లలోకి మొబైల్స ఫోన్లు తీసుకెళ్ల రాదని బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
నేల‘రాత’లకు స్వస్తి
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు అన్ని కేంద్రాల్లోనూ ఫర్నీచరు ఏర్పాటు అక్రమాలకు పాల్పడితే జైలుకే 25 యాక్ట్ పక్కాగా అమలు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నాం.. ఇకపై నేల ‘రాత’లకు స్వస్తి పలకనున్నాం. ఈ ఏడాది విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం. ఫర్నీచరు సదుపాయంపై ప్రత్యేక ప్రాధాన్యత తీసుకున్నాం.. ఇప్పటికే విద్యాశాఖ కమిషనరు, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ తదితర అధికారులు పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని జిల్లా విద్యాశాఖాధికారి పగడాల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క పరీక్ష కేంద్రంలోనూ విద్యార్థులు కింద కూర్చొని పరీక్ష రాయకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేసినట్లు ఆయన ‘సాక్షి’ కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 193 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 49,555 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సాక్షి : చాలా కేంద్రాల్లో ఫర్నీచర్ సమస్య ఉంది. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? డీఈఓ : ఫర్నీచరు కొరత వాస్తవమే కొన్ని కేంద్రాల్లో ఫర్నీచర్ అసలే లేదు. అలాంటి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల నుంచి సర్దుబాటు చేస్తున్నాం. పరీక్ష ప్రారంభమయ్యే నాటికి ఏ ఒక్క కేంద్రంలోనూ సమస్య ఉత్పన్నం కాదు. సాక్షి : దూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు చేరుకోవాలంటే రవాణా సౌకర్యం సరిగా లేదు. విద్యార్థుల సమస్యలపై మీరేమంటారు? డీఈఓ : ఈ విషయంలో ఆర్టీసీ అధికారులకు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏ కేంద్రానికి ఏఏ గ్రామాల నుంచి విద్యార్థులు వస్తారనే వివరాలు ఆర్టీసీ అధికారులు తీసుకున్నారు. విద్యార్థులకు అనుకూలంగా ఆయా రూట్లలో బస్సులు నడుపుతారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాక్షి : సీఓలు, డీఓలు, ఇన్విజిలేషన్ డ్యూటీలు పూర్తయ్యాయా? డీఈఓ : చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాం. అవసరం కంటే కూడా పది శాతం అదనంగా నియమించాం. వివరాలను హైదరాబాద్కు పంపాం. ఇన్విజిలేటర్ల నియామకాలు పూర్తయ్యాయి. సెంటర్ కాపీలు, వ్యక్తిగత కాపీలు ఆయా ఎంఈఓలకు అందజేశాం. పరీక్ష ముందురోజు వారికి అందజేస్తారు. విధులకు నియమించిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా పని చేయాల్సిందే. నియామక ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయం. సాక్షి : మాస్ కాపీయింగ్, చూచిరాతను నియంత్రిస్తారా? డీఈఓ : ఈ విషయంలో ప్రభుత్వం ఈసారి చాలా సీరియస్గా ఉంది. పరీక్షల విధుల్లో ఉన్న ఏ స్థాయివారైనా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే జైలుకు పంపడం ఖాయం. ఇంతకాలమూ పరీక్షల విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిని సస్పెండ్ చేయడం.. లేదంటే పరీక్షల విధుల నుంచి తప్పించడం.. మహా అయితే ఇంక్రిమెంట్లలో కోత విధించడం వంటి చర్యలు ఉండేవి. ఈసారి అలాకాదు..1997 నాటి యాక్ట్ 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేయనున్నాం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు ఆర్నెళ్ల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.5 వేలు నుంచి రూ. లక్ష వరకు జరిమానా ఉంటుంది. సాక్షి : డీఈఓ స్థాయిలో తొలిసారి ‘పది’ పరీక్షలు నిర్వహిస్తున్నారు కదా? ఎలాంటి అనుభూతి ఉంది? డీఈఓ : డిప్యూటీ డీఈఓగా, అసిస్టెంట్ డైరెక్టర్గా అనేకమార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణలో పాలుపంచుకున్నాను. ఆ అనుభవం చాలా ఉపయోగపడుతోంది. అందరి సహకారంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూస్తాననే నమ్మకం ఉంది. సాక్షి : గతేడాది జిల్లాలో మంచి ఫలితాలొచ్చాయి. ఈసారి ఎలా ఎలాంటి ఫలితాలు వస్తాయి? డీఈఓ : గతేడాదికంటే ఈసారి మెరుగైనా ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది. ఎందుకంటే తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమలవుతోంది. దీనిపై విషయ నిపుణులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు విస్త్రత అవగాహన కల్పించారు. అది చాలా ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
5 నిమిషాలు దాటితే అనుమతించరు.. సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు నిర్వహిస్తారు. ద్వితీయ భాష, ఓరియంటల్ ఎస్సెస్సీ, కాంపొజిట్ కోర్సు పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. షెడ్యూల్ సమయానికి 5 నిమిషాలు దాటితే (9.35 వరకు) పరీక్షహాల్లోకి అనుమతించరు. హాల్టికెట్ పోగొట్టుకున్న వారు bsetelangana.org నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిపై ప్రధానోపాధ్యాయుడి సంతకం అవసరం లేదు. వాటితో నేరుగా పరీక్షకు హాజరు కావచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 5,38,226 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 5,09,831 మంది, వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు 28,395 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,556 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేడు ఓరియంటల్ ఎస్సెస్సీ పేపరు–1 పరీక్ష జరగనుంది. -
టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్
సిటీబ్యూరో: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఈ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధిస్తూన్నట్లు కొత్వాల్ ఎం.మహేందర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 నుంచి 30 వరకు అమలులో ఉండే వీటి ప్రకారం ఆ ప్రాంతాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడ కూడదు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి భవనాలకు రెండు కిమీ పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు. ఈ నెల 10 నుంచి 16 వరకు ఇవి అమలులో ఉంటాయని కొత్వాల్ తెలిపారు. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి గురువారం పోలింగ్ జరుగనుంది. దీంతో పోలింగ్ స్టేషన్ల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాల వద్ద పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఓటరూ విధిగా క్యూలోనే రావాలని, ఒకరికి కేటాయించిన క్యూలోకి మరొకరిని అనుమతించమని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. -
నేడు ‘పది’ పరీక్షల ఏర్పాట్లపై సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని డ్రామా హాలులో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. నియమించబడిన సీఎస్లు, డీఓలు అందరూ హాజరుకావాలన్నారు. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
- అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశం అనంతపురం అర్బన్ : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. కాపీయింగ్కు తావివ్వకుండా 20 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను కంప్యూటర్ ర్యాండమైజేషన్ పద్ధతిలో నియమించాలన్నారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆయన విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంత మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని ప్రశ్నించారు. ఇన్చార్జి డీఈఓ లక్ష్మీనారాయణ సమాధానమిస్తూ 49,576 మంది విద్యార్థులు 193 కేంద్రాల్లో పరీక్ష రాస్తున్నారని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు. ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చుని పరీక్ష రాసే పరిస్థితి ఉండకూడదని, అన్ని కేంద్రాల్లోనూ బెంచీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. బాత్రూములు బాలురకు, బాలికలకు వేరుగా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికన్నా ముందే చేరుకునేలా మండలాల పరిధిలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్కో ఎస్ఈ ప్రసాద్రెడ్డికి చెప్పారు. కేంద్రాల వద్ద ఏఎన్ఎంలను నియమించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ వెంకటరమణను ఆదేశించారు. సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను పరీక్షకు గంట ముందుగా మూసేయించి పరీక్ష ముగిసిన తర్వాత గంట వరకు తెరవకుండా చూడాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డీఈఓను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఇన్చార్జి జేసీ-2 రఘునాథ్, డీఆర్వో మల్లీశ్వరిదేవి తదితరులు పాల్గొన్నారు. -
పది పరీక్షలపై నేడు వీడియో కాన్ఫరెన్స్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి ప్రిన్సిపల్ కార్యదర్శి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో కలెక్టర్తో పాటు డీఈఓ, పోలీసు, వైద్యం, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. పెన్నార్ భవనంలోని వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు పాల్గొంటారు. -
ఇంటర్తోపాటే టెన్త్ పరీక్షలు
ఉదయం ఇంటర్, మధ్యాహ్నం టెన్త్ ఎగ్జామ్స్ కసర త్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులు {పభుత్వ విద్యాసంస్థల్లోనే పరీక్ష కేంద్రాలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై ఇంటర్మీడియెట్తోపాటే పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 15 ఏళ్ల కిందట అమలు చేసిన ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం పరీక్షల నుంచి మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులు దృష్టిసారించారు. ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షలతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇకపై ఏటా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే ఇంటర్, టెన్త్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. విజిలెన్స్ తనిఖీలను వ్యతిరేకిస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు తమ స్కూళ్లు, కాలేజీల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు సహకరించబోమని ప్రకటించిన నేపథ్యంలో వాటిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే పరీక్ష కేంద్రాల సమస్య తలెత్తే అవకాశం ఉంది. మార్చి మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక, పదో తరగతి పరీక్షలు నిర్వహించాలంటే ఆలస్యం అవుతోంది. అందుకే ఉదయం ఇంటర్ పరీక్షలు, మధ్యాహ్నం పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. టెన్త్ అడ్వాన్స్డ్ విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా.. ఏటా దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు, 5.65 లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్ పరీక్షలు ముగిశాక పదో తరగతి పరీక్షల ప్రారంభం కావడం వల్ల అవి ఏప్రిల్ వరకు కొనసాగుతున్నాయి. దీనివల్ల ఫలితాల వెల్లడి ప్రక్రియలో ఆలస్యం అవుతుండటంతోపాటు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసి ఫలితాలు వచ్చేసరికి జూలై వస్తోంది. ఇంటర్ తరగతులు మాత్రం మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులతో జూన్ 1 నుంచే ప్రారంభం అవుతున్నాయి. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఇంటర్లో చేరి తరగతులకు హాజరయ్యే సరికి 30 నుంచి 45 రోజులు పడుతోంది. ఫలితంగా ఆయా పనిదినాల్లో జరిగే తరగతులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ విద్యార్థులు న ష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ వార్షిక పరీక్షలతోపాటే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించడం ద్వారా త్వరగా ఫలితాలు ఇవ్వొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలనూ త్వరగా పూర్తి చేసి ఆ విద్యార్థులు కూడా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చదువుకునేలా చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే (2017 మార్చిలో పరీక్షలకు) అమలు చేయనున్నారు. -
విద్యార్థులకు ‘పరీక్ష’..
చొప్పదండి/పెద్దపల్లి రూరల్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన సాయిని రాజయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్దకుమార్తె లావణ్య రుక్మాపూర్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. రాజయ్య మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేకున్నా బంధువుల ఓదార్పులతో గురువారం హిందీ పరీక్షకు హాజరైంది. అలాగే, గో దావరిఖని ఫైవ్ ఇంక్లయిన్కు చెందిన జొన్నాల సాయి ఆదిత్య పెద్దపల్లిలోని కృష్ణవేణి టాలెం ట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. కూలీ పని చేసుకునే అతడి తండ్రి అశోక్ అనారోగ్యంతో బుధవారం రాత్రి మరణించాడు. దుఃఖంలో ఉన్న ఆదిత్యకు బంధువులు ధైర్యం చెప్పి గురువారం హిందీ పరీక్షకు పంపించారు. పెద్దపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో పరీక్ష రాసిన అనంతరం ఇంటికి వెళ్లి తం డ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. -
విధులు నిర్వర్తిస్తూ.. నేలకొరిగాడు!
నర్సింహులపేట(వరంగల్ జిల్లా): పదోతరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా దంతాలపల్లి హైస్కూల్లో గురువారం చోటుచేసుకుంది. నర్సింహులపేట మండలం ఆగపేట యూపీఎస్ ఉపాధ్యాయుడు లేగల(నెలకుర్తి) రాంరెడ్డి(52) దంతాలపల్లి ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రానికి ఇన్విజిలేటర్గా వెళ్లారు. పరీక్ష హాల్లోనే గుండెపోటుకు గురై పడిపోయూడు. వెంటనే ఎంఈఓ కొండ్రెడ్డి సోమిరెడ్డి కారులో చికిత్స నిమిత్తం తొర్రూర్కు తరలిస్తుండగానే మృతిచెందారు. మృతుడికి భార్య ఉమ, కుమార్తెలు మౌనిఖ, రవళి ఉన్నారు. రాంరెడ్డి 22 ఏళ్లుగా ఈ ప్రాంతంలోనే పని చేస్తుండడంతో అందరికీ సుపరిచితులు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. -
జంబ్లింగ్లో ‘నారాయణ’ మాయాజాలం
ఒక కేంద్రానికి 220 మంది విద్యార్థులు వారిలో 140 మంది నారాయణ విద్యార్థులే నేటి నుంచి పదోతరగతి పరీక్షలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నారాయణ పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖాధికారులు కలిసి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జంబ్లింగ్ స్వరూపాన్నే మార్చేశారు. కర్నూలు జిల్లాలో ఒకే కేంద్రానికి 140 మంది నారాయణ పాఠశాల విద్యార్థులను కేటాయించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మాస్ కాపియింగ్కు తెరలేపి ర్యాంకులు సాధన కోసమే యాజమాన్యం ఈ తతంగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు నగరం బళ్లారి చౌరస్తాలోని నారాయణ రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాలలో 161 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో 46 మంది బాలికలు, 115 మంది బాలురు ఉన్నారు. వీరిని నగరంలోని వివిధ కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు రాసేందుకు కేటాయించారు. అయితే ఒక్క సెయింట్ క్లారెట్ పాఠశాలలోని కేంద్రానికే 140 మందికిపైగా కేటాయించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ కేంద్రానికి మొత్తం 220 మంది విద్యార్థులను కేటాయించగా వారిలో 140మంది నారాయణ విద్యార్థులే. మిగిలిన 80లో నాలుగు పాఠశాల విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమల్లో ఉంది. ఈ విధానం మొత్తం హైదరాబాద్లోని డైర్టరేట్లో జరుగుతుంది. అందుకోసం ఓ ప్రత్యేక సాఫ్ట్వేరు ఉంటుంది. ఓ కేంద్రానికి దాదాపు 10-15 పాఠశాలలను కేటాయించాల్సి ఉంది. అయితే జిల్లాల నుంచి విద్యార్థుల సంఖ్య, పాఠశాలల సంఖ్య, కేంద్రాల సంఖ్య తదితర విషయాలను మాత్రమే పంపాలి. అలా పంపడంలో జిల్లా విద్యాశాఖాధికారులు చేతివాటం ప్రదర్శించడంతోనే నారాయణ విద్యార్థులు మొత్తం ఒకే కేంద్రానికి కేటాయించారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉంది. ఈ విషయమై డీఈవో రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ.. నారాయణ పాఠశాలకు చెందిన 140 మంది విద్యార్థులు ఒకే కేంద్రానికి ఎలా కేటాయించారో తనకు తెలియదన్నారు. ఆ కేంద్రంలో మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్తో పర్యవేక్షిస్తామని చెప్పారు. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
హాజరుకానున్న 5.67 లక్షల మంది విద్యార్థులు ♦ ఉదయం 9:30 నుంచి పరీక్షలు ప్రారంభం ♦ గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారుల సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. 2,615 కేంద్రాల్లో ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒక్క ద్వితీయ భాష పేపర్ మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతుంది. మొత్తంగా ఈ పరీక్షలకు 5,67,478 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైందని, విద్యార్థులు నిర్ణీత సమయానికన్నా గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయని, ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యాన్ని అంగీకరిస్తారని... అంతకుమించి ఆలస్యమైతే పరీక్ష హాల్లోకి అనుమతించబోరని స్పష్టం చేశారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ► స్కూల్ యూనిఫారంతో రావద్దు. ఇతర సాధారణ దుస్తులు ధరించాలి. ► ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్లు, పుస్తకాలను అనుమతించరు. ► బ్లాక్ లేదా బ్లూ పెన్నుతోనే పరీక్షలు రాయాలి. ► జవాబు పత్రాల లోపల ఎలాంటి గుర్తులు పెట్టవద్దు. హాల్టికెట్ నంబర్, ఫోన్ నంబర్ వంటివి రాయవద్దు. ► ఏదైనా సహాయం అవసరమైతే హెల్ప్లైన్ కేంద్రానికి (040-23230942) ఫోన్ చేయవచ్చు. -
అప్పుడు.. ఇప్పుడూ వరంగల్ ఫస్ట్
విద్యారణ్యపురి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 2002, 2003, 2004 విద్యా సంవత్సరాల్లో ఎస్సెస్సీ ఫలితాల్లో వరంగల్ జిల్లా వరుసగా మూడు సార్లు మొదటిస్థానం సాధించింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ, భారీ నీటిపారుదలశాఖమంత్రిగా పనిచేశారు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యాశాఖమంత్రిగా కడియం శ్రీహరి ఉండడం... ఎస్సెస్సీ ఫలితాల్లో రాష్ట్రంలో వరంగల్ జిల్లా మొదటిస్థానం సాధించడం విశేషం. -
ఇంగ్లిష్ మీడియంలో ఇరగదీశారు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సగటుతో పోల్చితే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా ఉంది. మొత్తం 77.56 శాతం మంది ఉత్తీర్ణులు కాగా అందులో ఇంగ్లిష్ మీడియంలో 82.41 శాతం, తెలుగు మీడియంలో 73.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. ఇదిలా ఉండగా ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రైవేటు స్కూళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియం ఉండటమే ఇందుకు కారణం. గతేడాది తెలుగు మీడియం విద్యార్థులు 2,50,073 మంది పరీక్షలకు హాజరు కాగా 2,08,023 మంది (83.18) ఉత్తీర్ణులయ్యారు. 2,36,998 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 2,11,723 మంది (89.34 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మీడియం హాజరు ఉత్తీర్ణులు శాతం తెలుగు 2,44,448 1,79,221 73.32 ఇంగ్లిష్ 2,56,363 2,11,281 82.41 ఉర్దూ 11,713 7034 60.05 ఇతర 949 731 77.03 మొత్తం 5,13,473 3,98,267 77.56 -
కృష్ణవేణికి కన్నీటి పరీక్ష
జగదేవ్పూర్ (మెదక్) : కన్నతండ్రి శవం ఇంట్లో ఉండగానే ఓ విద్యార్థిని తన దుఃఖాన్ని దిగమింగి పదోతరగతి పరీక్ష రాసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం అంతాయిగూడలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని అంతాయిగూడ గ్రామానికి చెందిన తిగుల్ల నర్సయ్యది వ్యవసాయం కుటుంబం. మంగళవారం ఇంట్లో చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నర్సయ్య అదే రోజు రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. నర్సయ్య కూతురు కృష్ణవేణి చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. బుధవారం నుంచే పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం తండ్రి శవం ఇంట్లోనే ఉంది. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ కృష్ణవేణి కొండపాక మండలం కుకునూర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పరీక్ష రాసింది. మధ్యాహ్నం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంది. కృష్ణవేణికి వచ్చిన కష్టాన్ని చూసి పలువురు జాలిపడ్డారు. -
రెండు కాళ్ళు విరిగినా...
అనంతపురం(లేపాక్షి): ధృడ సంకల్పం ముందు విధి చిన్నబోయింది. ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం అవిటిదయింది. నడవలేని స్థితిలో ఉండికూడా పరిక్షలు రాయడానికి ప్రాధాన్యత ఇచ్చిన బాలిరెండు కాళ్ళు విరిగినా...కను చూసి చదువుల తల్లే గర్వించిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కొల్లురు గ్రామానికి చెందిన శ్రావణి కొండూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆరు నెలల కింద జరిగిన ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు విరిగాయి. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో తన చదువు కొనసాగిస్తూనే ఉంది. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రారంభమవడంతో శ్రావణి కాళ్లు సహక రించకున్నా పరీక్షలకు హాజరుకావాలని నిర్ణయించుకుంది. శ్రావణి పట్టుదలను గమనించిన పరీక్ష కేంద్రం యాజమాన్యం ఆమె పరీక్ష రాయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. కచ్చితంగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తానని ఆత్మస్థైర్యంతో చెప్తున్న శ్రావణిని చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బెస్టాఫ్ లక్
నేటి నుంచి టెన్త్ పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో గురువారం నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 287 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 60,926 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రెగ్యులర్ విద్యార్థులు 56,179 మంది, ప్రైవేటుగా 4,747 మంది ఉన్నారు. వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాల్లో మంచినీటిని అందుబాటులో ఉంచారు. ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చుని పరీక్ష రాసే పరిస్థితి లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవడం ద్వారా చివరి నిమిషంలో ఆలస్యంగా వచ్చి ఆందోళన చెందే పరిస్థితిని అధిగమించవచ్చని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతించడం ప్రారంభిస్తారు. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. పరీక్షకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. గుంటూరు బ్రాడీపేటలోని బీహెచ్ ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లను గుంటూరు డీవైఈవో పి. రమేష్ బుధవారం పరిశీలించారు. -
కాపీరైట్?
‘పెట్టరా సులువైనా దారిలోనా..’ అన్న శివ సినిమాలోని పాట బీహార్కు కూడా పాకినట్టుంది. ఏకంగా తల్లిదండ్రులే మా దారి రహదారి అంటూ టెన్త్ పరీక్షలు రాస్తున్న తమ పిల్లల కోసం చిట్టీలు మోసుకొచ్చారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ దృశ్యంపై.. క్యాంపస్ కబుర్లలో మాదాపూర్లో వెంకటేశ్వర ఫైనార్ట్స్ కాలేజ్ విద్యార్ధులు స్పందించారు. కాపీ రైటింగ్ రాంగ్ అన్న స్టూడెంట్స్.. కాపీ రాస్తున్న విద్యార్థులది కాదు.. అందుకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులదే అసలు తప్పని అంటున్నారు. బీహార్ ఒక్కచోటే కాదు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ మాస్కాపీయింగ్ జోరుగా సాగుతోందని చెబుతున్నారు. మణిదీప్: ఈ మధ్యనే యూట్యూబ్లో బీహార్ ఎగ్జామ్ సెంటర్ ఫొటో చూసి చాలా షాకయ్యా. సోషల్ మీడియాలో ఈ ఫొటో చాలా హల్చల్ చేస్తోందని తెలిసాక కొంచెం సిగ్గు పడ్డా. మన సంగతి పక్కనపెడితే పొరుగు దేశాల వాళ్లు ఈ చిత్రం చూసి ఓహో... ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంటుందా? అని అనుకుంటారు. చందు: మాది కూడా సేమ్ ఫీలింగ్. మరీ ఘోరంగా పేరెంట్స్ చీటీలు ఇవ్వడమేమిటో? తాడు సాయంతో ఐదంతస్తులు ఎక్కి మరీ! నందు: అలాంటి సాహసకృత్యాలు పిల్లలు చేస్తే క్రీడల్లో కప్పులు కొట్టుకోవచ్చు. అనన్య: ఇట్స్ టూ బ్యాడ్. బేసిక్గా బీహార్లో ఎడ్యుకేషన్ తక్కువ. అక్కడ చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక ఎగ్జామ్ సెంటర్కి అంతమంది పేరెంట్స్ వచ్చి, పిల్లలకి కాపీలు అందివ్వడమంటే ఇది అక్కడి ప్రభుత్వం ఫెయిల్యూర్. దీనికి ఉపాధ్యాయులు కూడా బాధ్యత వహించాలి. టీనా: పిల్లలతోనైనా, పేరెంట్స్తోనైనా ఇలాంటి తప్పు పని చేయించడం వెనుక ఉన్నది ‘ప్రెజర్’. మా బాబుకి 90 మార్కులు రావాలి, మా బాబుకి 98 మార్కులు రావాలని కోరుకునే పేరెంట్స్ ఉన్నారు అందులో. ఏదో నాలుగు మార్కులు వచ్చి పాసైతే చాలనే పేరెంట్సూ ఉన్నారు. కానీ మనిషిని బతికించేది మార్కులు కాదు, మంచి ప్రవర్తనేనని తెలుసుకోకపోవడం వల్లే ఇలాంటి తప్పులన్నీ జరుగుతాయి. అక్కడ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మనోజ్: స్టూడెంట్స్ కాపీ కొట్టడం సాధారణ విషయమే. కానీ తల్లిదండ్రులే కాపీలకు సహకరించడమంటే... పిల్లల జీవితాలు మొగ్గలోనే తుంచేయడమే. వంశీ: మాస్ కాపీయింగ్ కచ్చితంగా తప్పే. పేరెంట్స్, కొన్ని చోట్ల కాలేజీల సహకారం ఉందన్నది అందరూ నమ్మాల్సిన విషయం. మార్కులు కోసం పేరెంట్స్... ర్యాంకుల కోసం కాలేజ్ యాజమాన్యాలు ఇలా తప్పుదోవలో ప్రయాణించడం మన దేశంలో చాలా సాధారణ విషయం. స్నేహ: ఒక్క బీహార్లోనే కాదు, చాలా చోట్ల నిర్లక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. దానికి మంచి మార్గాలని ఎంచుకుంటున్నారు. చెడు మార్గాలనూ ఎంచుకుంటున్నారు. బీహార్లో మనం చూసిన తల్లిదండ్రులు రెండో మార్గంలో వెళుతున్నారు. ప్రకాష్: స్కూల్ డేస్లో స్టూడెంట్స్ కాపీ కొట్టడం చాలా సహజం. కానీ నాకు తెలిసి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు లెక్చరర్స్ దగ్గరుండి చీటీలు అందిస్తున్న సందర్భాల గురించి విన్నాను. దీనంతటికీ కారణం... టార్గెట్లు. మహమ్మద్ షకీర్: బీహార్లో ఎగ్జామ్ సెంటర్ పిక్చర్ చూసి ‘ఇండియా పరువు పోయిందిరా బాబూ’ అనుకున్నాను. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. అయినా ఆ సీన్ని టీవీలో చూపించడం.. ఇంకా బాధాకరం. ఎదురుగుండా స్టూడెంట్స్, పేరెంట్స్ అలాంటి పనులు చేస్తుంటే టీచర్లు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. కుంజిన్: బీహార్లో మనం చూసిన పిక్చర్... దేశంలోని ప్రతి ప్రాంతంలో కనిపిస్తుంది. కాకపోతే వాటి న్యూస్ బయటకు రాలేదు. బీహార్ న్యూస్ బయటకు వచ్చింది. అదే తేడా. రూప: సర్లేండి... జరిగిందేదో జరిగిపోయింది. ఈ న్యూస్కి వచ్చిన స్పందనను బట్టి అయినా స్టూడెంట్స్, పేరెంట్స్ ఆలోచించే విధానంలో మార్పు రావాలని కోరుకుందాం. అన్నిటికీ మార్కులు ఒక్కటే కాదు. మంచి బిహేవియర్ అలవర్చడంలో పేరెంట్స్ ఇంట్రస్ట్ చూపిస్తే బాగుంటుంది. మన్విత: మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నా, నాకు ఆ పిక్చర్ చూసినప్పుడు నాలుగో అంతస్తు కిటికీ ఊచలు పట్టుకుని వేలాడుతున్న పేరెంట్ గనక కింద పడిపోతే అతని పిల్లల పరిస్థితి ఏంటని పించింది. మనోజ్: అవును నిజమే. పిల్లల కోసం చాలా పెద్ద పెద్ద ఫీట్స్ చేశారు. ఒక తాడు సాయంతో పై అంతస్తు వరకు ఎక్కిన సీన్ చూస్తే నాకు చాలా భయం వేసింది. గోవింద: ఆ కష్టమేదో పిల్లల్ని రోజూ సాయంత్రంపూట ఒక అరగంట చదివించడంపై పెడితే సరిపోయేది కదా. ఇకపై అయినా ఇలాంటి చిత్రాలు మనకంట పడే పరిస్థితి రాకూడదని కోరుకుందాం. భువనేశ్వరి -
హాల్ టికెట్ చూపిస్తే.. ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు. ఈ పరీక్షలకు 6,52,692 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించి సూచనలు అందించాలని చీఫ్సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు సూచిస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవడానికి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. హాల్టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఈమేరకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారని తెలిపారు. శుక్రవారం సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సమావేశంలో జాయింట్ డైరక్టర్ భార్గవ, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ సురేందర్రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యాంశాలు.. * పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు ఉదయం 9 నుంచి 12 వరకు జరుగుతాయి. విద్యార్థుల హాల్ టికెట్లు, నామినల్రోల్స్ను స్కూళ్లకు పంపించారు. * ఏ పాఠశాలకైనా హాల్టికెట్లు అందకుంటే ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈఏపీ.ఓఆర్జీ’ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని హెడ్మాస్టర్ల సంతకం, స్టాంపులతో విద్యార్థులకు జారీచేయాలి. అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, స్క్వాడ్ల నియామకం పూర్తయ్యింది. హైదరాబాద్ కేంద్రంగానే పరీక్షలు పర్యవేక్షిస్తారు. * డైరక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా అవసరమైతే 040-23237343, 040-23237344 నంబర్లను సంప్రదించాలి. * అంధ, మూగ, బధిర తదితర అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు పరీక్షల్లో పాస్మార్కులు 35 నుంచి 20కి తగ్గించారు. జంబ్లింగ్ విధానం వీరికి ఉండదు. పరీక్షరాసేందుకు వీరికి అదనంగా అరగంట సమయం ఇస్తారు. డెస్లైక్జియా వ్యాధిగ్రస్థులు తృతీయ భాష పరీక్ష రాయనక్కర్లేదు. వారికి స్క్రైబ్ సదుపాయం. గంట అదనపు సమయం. విద్యార్థులు చేయాల్సిన పనులు.. పరీక్షకేంద్రం ఎక్కడున్నదో ఒకరోజు ముందు గా చూసుకోవాలి. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షరాసేందుకు ప్యాడ్ను తీసుకువెళ్లాలి. సరిపడ పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేళ్లు తీసుకువెళ్లాలి. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్కు జతచేసి ఇచ్చిన ఓఎమ్మార్ షీట్ తమదేనని ధ్రువీకరించుకున్నాకనే పరీక్ష రాయడం ప్రారంభించాలి. అడిషనల్ ఆన్సర్షీట్లు, గ్రాఫ్, బిట్పేపర్లను మెయిన్ ఆన్సర్ షీట్తో దారంతో గట్టిగా కట్టాలి. మెయిన్ ఆన్సర్షీట్పై ఉన్న సీరియల్ నంబర్ను అడిషనల్ షీట్లు, గ్రాఫ్, మ్యాప్, బిట్పేపర్లపై తప్పనిసరిగా రాయాలి. స్కూలు యూనిఫారాలతో కాకుండా సాధారణ దుస్తులతో పరీక్షలకు రావాలి. చేయకూడనివి సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకుపోరాదు. హాల్ టికెట్ తప్ప ఇతర పత్రాలు కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్ టికెట్ రోల్ నంబర్లను మెయిన్ ఆన్సర్ షీట్లో కానీ, అడిషనల్, బిట్, మ్యాప్, గ్రాఫ్ షీట్లతో సహ ఎక్కడా రాయకూడదు. పేరు, సంతకం, ఏ విధమైన గుర్తింపు చిహ్నాలు ఆన్సర్ షీట్లలో రాయకూడదు. -
‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు
కరీంనగర్ఎడ్యుకేషన్: జిల్లాలో పదోతరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటు్ల్లు డీఈవో కె.లింగయ్య తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈనెల 25 నుంచి ఏప్రిల్ 11 వరకు పరీక్షలు ఉంటాయని అన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ జిల్లాకు చెరిందని తెలిపారు. విద్యార్థులకు హాల్టిక్కెట్ల పంపిణీ పూర్తి అరుునట్లు వివరించారు. ప్రశ్నాపత్రాలను మూడు నాలుగు రోజుల నుంచి ఆయా డివిజన్ ఉప విద్యాధికారుల ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. మూడు విడతలుగా మూడు సెట్లను పోలీస్ స్టేషన్లలో భద్రపర్చనున్నామని, పరీక్షల నిర్వహణకు సంబంధించి డీఈవో కార్యాలయంతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయంతో పాటు ఆయా డివిజన్లలో సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, కస్టోడియన్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా తగిన సూచనలు ఇవ్వడం జరిగిందని పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యూయని తెలిపారు. 274 పరీక్షకేంద్రాలు.. పదోతరగతి వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 63,319 మంది విద్యార్థులు హాజరవుతున్నారని.. అందుకోసం 274 కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు డీఈవో తెలిపారు. 58,558 మంది రెగ్యూలర్, 4761 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హిందీ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుందన్నారు. విద్యార్థి మాల్ప్రాక్టీస్ చేస్తే అయితే మరుసటి రోజు నుంచి పరీక్షకు అనుమతి లభించబోదని స్పష్టం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్కు మాత్రమే సెల్ఫోన్ వాడేందుకు అవకాశం ఉంటుందని, మిగతా వారు పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్ వాడరాదని వెల్లడించారు. ఇన్విజిలేటర్లుగా విధుల నిర్వహణకు వచ్చే ఉపాధ్యాయులను సంబంధిత ఎంఈవోలు ఒకరోజు ముందుగానే విడుదల చేయాలని సూచించారు. పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు దాదాపు 4500 మంది ఉపాధ్యాయులకు విధులు అప్పగిస్తున్నట్లు డీఈవో వెల్లడించారు. 274 మందిని చీఫ్ సూపరింటెండెంట్లు, 274 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 17 మంది అదనపు డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. పోలీసు, రెవెన్యూ, రవాణా, ఆర్టీసీ, ఆరోగ్యశాఖ, ట్రాన్స్కోతో పాటు సంబంధిత అధికారులతో ఇటీవలే సమీక్ష నిర్వహించామన్నారు. ఇన్విజిలేటర్ల నియామకములో టీఏ, డీఏల భారం పడకుండా పకడ్బందీగా నియమిస్తున్నామని, పరీక్ష విధులు నిర్వహించే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, ఇన్విజిలేటర్ల నియామకాలను పరీక్ష కేంద్రానికి 8 కిలో మీటర్ల పరిధిలో గల ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకే విధులు కల్పించనున్నట్లు తెలిపారు. సిబ్బంది సరిపోకపోతే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. మాస్కాపీయింగ్ను నిరోధించడానికి 14 స్క్యాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఒక రాష్ట్ర పరిశీలికుడిని నియమించిందని వెల్లడించారు. సిట్టింగ్స్క్యాడ్ బృందాలతో పాటు ఒక రెవెన్యూ, పోలీసు అధికారి విధుల్లో ఉంటారని అన్నారు. ప్రతి పరీక్షకేంద్రానికి ఒక సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారినిని నియమించడం జరిగిందని, అలాగే 300 మంది విద్యార్థులు దాటినప్రతి పరీక్ష కేంద్రానికి ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపేందుకు ఆదేశించారని, హాల్టిక్కెట్లు చూపితే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పారు. -
'టెన్'షన్
మారిన సిలబస్తో ‘పది’ విద్యార్థుల కుస్తీ తదనుగుణంగా బోధన కరువు తూ..తూ మంత్రంగా ప్రాజెక్టు వర్క్ వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత సాక్షి విజిట్లో వెల్లడైన పలు అంశాలు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: చూస్తుండగానే జనవరి వెళ్లిపోయింది. ఫిబ్రవరి కూడా సగం గడుస్తోంది. మార్చి 25వ తేదీ దగ్గరకు వస్తోందంటేనే జిల్లాలోని పదో తరగతి విద్యార్థులు భయంతో వణికి పోతున్నారు. బట్టీ విధానానికి స్వస్తి చెప్పి, సామర్థ్యాల ఆధారంగా, విషయ అవగాహనతో విద్యార్థులు పరీక్షలు రాయాలని ప్రవేశపెట్టిన నూతన సిలబస్తో విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులు కుస్తీ పడుతున్నారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం ఆశాజనకంగా ఉన్నా... మారుమూల గిరిజన ప్రాంతాల్లో మాత్రం తూతూ మంత్రంగానే బోధన జరగుతోందనే విమర్శలు వస్తున్నాయి. నూతన సిలబస్కు అనుగుణంగా బోధించడం, ప్రాజెక్టుల నిర్వహణ, విద్యార్థులకు ప్రాజెక్టు పనులు అప్పగించడంలో పలువురు ఉపాధ్యాయులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పరీక్షలు ఎలా రాయాలోనని విద్యార్థులు, తమ బిడ్డల భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ‘సాక్షి’ విజిట్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ప్రతిభ, వారికి జరుగుతున్న బోధనను పరిశీలించింది. పూర్తికాని సిలబస్తో కష్టాలు... జిల్లాలో 341 ప్రభుత్వ, 384 ప్రైవేట్ ఉన్నత పాఠశాలలకు చెందిన 37,127 మంది విద్యార్థులు వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. గతంలో ఉన్న సిలబస్ ప్రకారం డిసెంబర్ చివరి వరకు పూర్తి చేయాలి. ఆ తర్వాత ప్రతి పాఠ్యాంశాల్లో ఉన్న కీలక అంశాలు, ప్రశ్నలు, ఖాళీలు పూరించడం మొదలైన అంశాలపై పునశ్చరణ నిర్వహించే వారు. ప్రతి విద్యార్థి ప్రతిభను అంచనా వేసి వెనకబడిన వారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసేవారు. ఈ క్రమంలోనే డీ- గ్రేడ్ విద్యార్థులను గుర్తించి వారికి కనీస ఉత్తీర్ణతా స్థాయికి తీసుకొచ్చేవారు. ఇదంతా డిసెంబర్ నుంచి మార్చి వరకు పూర్తి చేసేవారు. అయితే మారిన సిలబస్ ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికి కూడా పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏ నెల సిలబస్ ఆ నెల పూర్తి చేస్తే అనుకూలంగా ఉండేది. కానీ వైరా, కారేపల్లి, కొణిజర్ల, ఏన్కూరు మండలాలతోపాటు పలు పాఠశాలల్లో ఇప్పటి వరకు జనవరి సిలబస్ కూడా పూర్తికాలేదు. దీంతో పరీక్షలు ముంచుకొస్తుంటే తూతూ మంత్రంగానే బోధించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో కొత్త సిలబస్ ప్రకారం విద్యార్థులు పరీక్షలు రాయడం కష్టమే. ప్రాజెక్టు పనుల కోసం పరుగులు.. మారిన సిలబస్ ప్రకారం పాఠ్యాంశం పూర్తి కాగానే విద్యార్థికి ప్రాజెక్టు వర్క్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పనిని విద్యార్థి చేయాలంటే ప్రముఖల జీవిత చరిత్ర, శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, ఇతర ముఖ్య అంశాలను జోడించి రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం పట్టణంలోని విద్యార్థులు సమీపంలోని నెట్ సెంటర్లకు వెళ్లి సంబంధిత అంశాలను డౌన్లోడ్ చేసుకుంటుండగా.. మారుమూల ప్రాంతాల విద్యార్థులు నెట్ సౌకర్యం అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలల్లో కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు బోధకులు లేక మూలన వేశారు. దీంతో నూతన విధానానికి అనుగుణంగా విద్యార్థులు చదువుకోవడం కష్టంగా మారింది. దీంతో ప్రాజెక్టు వర్క్ చేయలేని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు వర్క్కు వేసే 20 మార్కులను కూడా ఉపాధ్యాయులు సుమారుగా విద్యార్థి తెలివి అంచనాను బట్టే వేయాల్సిన పరిస్థితి నెలకొంది. వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొతర వెంటాడుతోంది. పదవ తరగతికి బోధించి అన్ని సబ్జెక్టులకు కలిపి స్కూల్ అసిసెంట్లు మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం ఐదు వందల మేరకు ఖాళీలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు. ఇవి కూడా మారుమూల ప్రాంతాల్లోనే అధికంగా ఉండటం విశేషం. దీంతో పదో తరగతి బోధన ఇబ్బందిగా మారుతోంది. ఈ విషయంపై గతంలో 60 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్ వేసినా వారు సక్రమంగా వెళ్లడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పాలేరు నియోజకవర్గంలో కామంచికల్లో లెక్కల పోస్టు, గుదిమళ్లలో సైన్స్, సోషల్ పోస్టులు, గోళ్లపాడు పాఠశాలలో సోషల్ సబ్జెక్ట్కు అసలు ఉపాధ్యాయులే లేరు. ఏదో సిలబస్ పూర్తి కావడం కోసం హడావుడిగా వేరే ఉపాధ్యాయులతో బోధింపచేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలున్నాయి. వైరా జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు, హిందీ సబ్జెక్టులకు పూర్తి స్థాయిలో ఉపాద్యాయులు లేకపోవడంతో విద్యార్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకే పరీక్షా విధానంతో తంటాలే.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం విద్యార్థులే ఎక్కువ. అందులోనూ గ్రామీణ ప్రాంతాల వారే ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్ మీడియాలకు ఒకే పరీక్షా విధానం అమలు చేస్తోంది. దీనివల్ల ఇంగ్లిష్ మీడియంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సొంతంగా ఆలోచించి రాయటం కష్టంగా మారింది. సాంఘికశాస్త్రంలో సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన విద్యార్థులకు మాత్రమే గరిష్ట మార్కులు వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. గణితంలో కొన్ని అభ్యాసాలు, లెక్కలు చే స్తే పరీక్షల్లో గతంలో అవే తరచుగా వచ్చేవి. ప్రస్తుత విధానంలో మాదిరి లెక్కలను సాధించటం ద్వారా మార్కులు పొందాల్సి ఉంది. ప్రాజెక్టులు ఇవ్వటం, నూతన సమస్యలను తయారు చేయటం ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించవచ్చని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. నూతన సిలబస్పై కుస్తీ పడుతూనే.. మొదటి సారిగా కొత్త పరీక్షా విధానానికి విద్యార్థులు సిద్ధమవుతున్నారు. -
హాస్టల్లో కలెక్టర్ బస
జిల్లా వ్యాప్తంగా హాస్టళ్లలో నిద్రించిన అధికారులు సాక్షి, సంగారెడ్డి: కలెక్టర్ రాహుల్ బొజ్జా సోమవారం రాత్రి సంగారెడ్డిలోని బాలుర హాస్టల్లో విద్యార్థులతో కలిసి నిద్రించారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించేందుకు కలెక్టర్ హాస్టల్ నిద్రకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్తోపాటు జిల్లాలో ఉన్న హాస్టళ్లలో ప్రత్యేకాధికారులు 260 మంది సోమవారం రాత్రి విద్యార్థులతో కలిసి నిద్రించారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని మౌలిక వసతుల కొరత, విద్యార్థుల సమస్యలు, టెన్త పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధమవుతున్న తీరు తదితర అంశాలను పరిశీలించారు. ప్రత్యేకాధికారులంతా తమ దృష్టికి వచ్చిన వివరాలను మంగళవారం కలెక్టర్కు తెలియజేయస్తారు. ఈ సందర్భగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ హాస్టళ్లలోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కరించేందుకు వీలుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. హాస్టళ్లలో ప్రత్యేకాధికారులు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడాలని సూచించినట్లు తెలిపారు. హాస్టల్ విద్యార్థుల పరీక్షల సన్నద్ధతపై మంగళవారం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించనున్న సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుకర్రెడ్డి, తహశీల్దార్ గోవర్ధన్ ఉన్నారు. బట్టీ వద్దు.. ఒకటికి రెండుసార్లు చదవండి హాస్టల్ నిద్రలో భాగంగా కలెక్టర్ మొదట మహిళ డిగ్రీ కళాశాల సమీపంలోని బాలికల సమీకృత హాస్టల్ను సందర్శించారు. అక్కడ ఉన్న హాస్టల్ గదులను పరిశీలించి ప్రత్యేక అధికారులు వరలక్ష్మి, మీనాతో మాట్లాడి హాస్టళ్లలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పదవతరగతి విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. విద్యార్థులతో పాటు కలెక్టర్ నేలపైనే కూర్చున్నారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ‘ఏమ్మా పదవతరగతి పరీక్షలకు అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారా..అర్ధవార్షిక పరీక్షలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి.. అంటూ’ ఆరా తీశారు. బట్టీ వేసే పద్ధతి మానుకోవాలని పాఠ్యపుస్తకాలను మొత్తం చదవి అర్థం చేసుకోవాలని సూచించారు. గణితం, ఇంగ్లిషు పరీక్షలకు బాగా సన్నద్ధం కావాలని మంచి మార్కులు సాధించాలని.. ఏవైనా సమస్యలుంటే తనకు వివరించాలని తెలిపారు. పరీక్షలకు బాగా సన్నద్ధమవుతున్నామని మంచి మార్కులు సాధిస్తామని విద్యార్థులు కలెక్టర్కు తెలియజేశారు. హాస్టల్లో తాగునీటి సమస్య ఉందని, కరెంటు సమస్య పరిష్కరించాలని కోరారు. రెండు సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ పట్టణంలోని ఎస్సీ డీ హాస్టల్ను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎస్సీ బాలుర హాస్టల్స్ చేరుకుని అక్కడి విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత వారితో కలిసి కలిసి నిద్రపోయారు. -
100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ఈ ఏడాది సరికొత్త విధానంలో టెన్త పరీక్షలు జరుగనున్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిలో 80శాతం పబ్లిక్ పరీక్షల ద్వారా, 20 శాతం అంతర్గత పరీక్షల ద్వారా విద్యార్థి ప్రతిభను గుర్తిస్తున్నాం. జిల్లాలో వందశాతం ఫలితాలు సాధించేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: మార్చి 25 నుంచి జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నామని డీఈఓ రమేష్ స్పష్టం చేశారు. విద్యాశాఖ రూపొం దించిన ప్రణాళిక అంశాలను ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకు సరికొత్త ప్రణాళికను అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి పదో తేదీ వరకు అన్ని పాఠశాలల్లో పాఠ్యాంశ బోధన పూర్తవుతుంది. ఆ తర్వాత 45 రోజుల సమయంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశ పునఃశ్చరణ చేపడుతున్నాం. రెండో శనివారం, ఆదివారాల్లోనూ ఈ తరగతులు కొనసాగిస్తాం. ప్రతి పాఠశాలలో ప్రత్యేకం.. ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెకులో ప్రతి యూనిట్ నుంచి ఇరవై అంశాలతో కూడిన ప్రశ్ననిధిని తయారు చేసుకోవాలని ఆదేశించాం. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా తన సబ్జెకుపై ఇలాంటి ప్రశ్నానిధిని తయారు చేస్తూ.. ఉపాధ్యాయులు తయారుచేసిన ప్రశ్నావళిని పర్యవేక్షించాలి. ఒక పాఠశాలలో తయారుచేసిన వాటికి, మరో పాఠశాలలో తయారుచేసిన ప్రశ్నానిధికి సంబంధం లేకుండా పకడ్బందీగా తయారయ్యేలా చూస్తున్నాం. వీటిని ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు బోధించాలి. కానీ బట్టీ విధానాన్ని మాత్రం ప్రోత్సహించకూడదు. గ్రేడ్ తగ్గినా.. ఉత్తీర్ణత పెరిగేలా.. కొత్త విధానంతో విద్యార్థులు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ పద్ధతితో విద్యార్థి పాఠ్యాంశంపై మంచి పట్టు సాధించవచ్చు. దీంతో భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ తొలిఏడాది గ్రేడ్లలో కొంత వెనకబడొచ్చు. కానీ ఉత్తీర్ణత శాతం మాత్రం గతేడాది కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాం. బోధనలో ప్రత్యేక చొరవ చూపి ఉత్తమ ఫలితాలు సాధించిన టీచర్లను ప్రత్యేకంగా అభినందిస్తాం. అదేవిధంగా పనితీరు అధ్వాన్నంగా ఉన్న వారిపై నిర్మొహమాటంగా చర్యలు తీసుకుంటాం. సహకారమే ముఖ్యం పాఠశాలలో ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. ఇదే తరహాల్లో ఇంటివద్ద కూడా తల్లిదండ్రులు చదివించాలి. ఎలాంటి పనులు చెప్పకుండా వారికి స్వేచ్ఛ ఇస్తే మంచింది. ఈ అంశాన్ని వారికి వివరించేందుకు ఈనెల పదో తేదీలోగా అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాల్సిందిగా ఆదేశించాం. ప్రతి పాఠశాలలో ప్రతిభలో వెనకబడిఉన్న విద్యార్థులను అడాప్ట్ (దత్తత) చేసుకుని బోధన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాం. పలుపాఠశాలల్లో ఈ పద్ధతి కొనసాగిస్తున్నారు. వెనకబడిన విద్యార్థుల తల్లిదండ్రులతోనూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. పక్కాగా పరీక్షలు.. ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు మరింత పకడ్బందీగా నిర్వహిస్తాం. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తాం. మాస్ కాపీయింగ్కు పాల్పడితే విద్యార్థితోపాటు సంబంధిత ఇన్విజిలేటర్పైనా కఠిన చర్యలు తీసుకుంటాం. మార్చి రెండో తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్ష ముగిసిన తర్వాత యధావిధిగా ప్రత్యేక తరగతులు, రివిజన్ ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 24 వరకు తప్పకుండా విద్యార్థులు బడికి హాజరు కావాల్సిందే. విద్యార్థుల కోసమే.. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలలో గడపాల్సి వస్తోంది. మధ్యాహ్నం భోజనం చేసినప్పటికీ ఎదిగే పిల్లలు కావడంతో సాయంత్రానికి ఆకలి వేస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు స్థానికంగా ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల సహకారం కోసం లేఖలు రాశాం. వారు స్పందిస్తూ విద్యార్థులకు స్నాక్స్ అందించేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లాలోని 437 ఉన్నత పాఠశాలలకు ఈ లేఖలు అందించా. జిల్లా విద్యాశాఖ తరఫున ఇచ్చే ఈ లేఖల్లో వారి పేర్లు, చిరునామా రాస్తున్నాం. కొత్త విధానమిదే.. పదో తరగతి పరీక్షల విధానంలో భారీ మార్పులు జరిగాయి. గతంలో వందమార్కులకు పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాదినుంచి కేవలం 80 మార్కులకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్నాం. మిగతా 20మార్కులు విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి నిర్వహించిన ఫార్మెటీవ్ 1,2,3,4ల ఆధారంగా మార్కులు వేస్తాం. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ప్రశ్నాపత్రాన్ని చదువుకునేందుకు ప్రత్యేకంగా 15నిమిషాల సమయాన్ని కేటాయించారు. హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుంటాయి. ఈ క్రమంలో ఒక పేపర్కు 40 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నాలుగు పెద్ద ప్రశ్నలు (4మార్కుల చొప్పున), ఆరు చిన్న ప్రశ్నలు (రెండు మార్కులు), ఏడు వ్యాఖ్య ప్రశ్నలు(ఒక మార్కు) చొప్పున 35 మార్కులు, మరో ఐదు మార్కులు ఆబ్జెక్టీవ్ పద్ధతిలో ఉంటాయి. -
‘పది’లమేనా!
ఉత్తమ ఫలితాల కోసం కసరత్తు సన్నాహాలు చేస్తున్న విద్యాశాఖ ప్రత్యేక బృందాల ఏర్పాటు వేధిస్తున్న ఖాళీల కొరత చాలా వరకు ఇన్చార్జి అధికారులే నిజామాబాద్ అర్బన్ : పదవ తరగతిలో మెరుగైన ఫలితాల కోసం విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల కు ఓ ప్రణాళికను రూపొందించింది. వచ్చేనెలలో పరీక్షలు ప్రారంభం కానున్నందున ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉం డాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాసాచారి అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. గత ఏడాది ఆశించినంతగా ఫలితాలు సాధించలేకపోయారు. అయినా, వందకు పైగా పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించా యి. ఈ క్రమంలో ఈ ఏడు మరింతగా మంచి ఫలితాలు సాధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో 465 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 530 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది 36,615 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఇందులో బాలురు 18,323, బాలికలు 18,292 మంది ఉన్నారు. ప్రయివేటుగా 1642 మంది బాలురు, 671 మంది బాలికలు పరీక్షలను రాయబోతున్నా రు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 194, ప్రయివే టు విద్యార్థుల కోసం 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఆరు కేంద్రాలను తగ్గించారు. మార్చి 25 నుం చి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంది. ప్రత్యేక పరీక్షలను నిర్వహించింది. పాఠశాలలలో సాయంత్రం వరకు అదనపు తరగతులను ఏర్పా టు చేసింది. విద్యార్థులు ప్రతిభను పరిశీలిస్తూ వారి నిపుణులచే తగు సూచనలు ఇప్పించింది. ప్రభుత్వ పాఠశాలల లో విద్యాబోధనను, విద్యార్థుల ప్రతిభను పరిశీలించేందు కు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఓ భాషా పండితుడు, ఒక ఉ పాధ్యాయుడు, సంబంధిత సబ్జెక్టు టీచర్ ఉంటారు. ఒక్కో బృందానికి ఐదు పాఠశాలలను కేటాయించారు. వీరు సం బంధిత పాఠశాలలను పరిశీలన చేసి విద్యాబోధన, విద్యా ర్థుల ప్రతిభను పరిశీలిస్తారు. వెనుకబడిన విద్యార్థుల కో సం సలహాలు, సూచనలు అందిస్తారు. విద్యాబోధనకు సంబంధించి టీచర్లను అ ప్రమత్తం చే స్తారు. సన్నాహక పరీక్షల లో వీరి ప్రతి భను మెరుగు పరిచి వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తారు. కలవరపెడుతున్న ఖాళీల కొరత జిల్లా విద్యా శాఖను ఖాళీల కొరత వేధిస్తోంది. 36 మండలాలకు ఒక్కరు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓ ఉన్నారు. 35 మంది ఎంఈఓలు ఇన్చార్జులుగా ఉన్నారు. కామారెడ్డి, నిజామాబాద్, బోధన్ ఉప విద్యాధికారులు ఇన్చార్జిగానే కొనసాగుతున్నారు. దీంతో పాఠశాలల పరిశీలన సక్రమం గా జరుగడం లేదు. సీనియర్ ప్రధానోపాధ్యా యులనే ఎం ఈవోలుగా నియమించడంతో చాలా చోట్ల వారి ఆజామాయిషీ చెల్లడం లేదు. ఫలితంగా కొన్ని పాఠశాలలలో టీచర్ల పనితీరు బాగా లేదు. జుక్కల్, బాన్సువాడ ప్రాంతాల పా ఠశాలలకు నేటికి టీచర్ల గైర్హాజరు కొనసాగుతోంది. కొం దరు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో విద్యాశాఖ అధికారులపై ఓత్తిడి తీసుకరాగా మరికొందరు ఏలాంటి సమాచారం లేకుండా గైర్హాజరవుతున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.... ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అందుకోసం సిద్ధం చేస్తున్నాం. టీచర్లను కూడా అప్రమత్తం చేశాం. మె రుగైన ఫలితాలు తీసుకు రావడం మా లక్ష్యం. అందుకు తగ్గట్లుగానే ప్రయత్నాలు చేస్తున్నాం. - శ్రీనివాసాచారి, డీఈఓ -
టెన్త్ ‘ప్రైవేటు’కు నో
* పదో తరగతి పరీక్షల్లో సర్కారు సంస్కరణలు * ప్రైవేటుగా పరీక్ష రాసే విధానానికి స్వస్తి * గుర్తింపు లేని స్కూళ్ల విద్యార్థులకు నో చాన్స్ * ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం * పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఖరారు * అపరాధ రుసుం లేకుండా వచ్చే నెల 5 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. స్కూలుకు వెళ్లి చదువుకోకపోయినా.. ప్రైవేటుగా ఫీజు కట్టి పరీక్ష రాసే విధానానికి స్వస్తి చెప్పింది. దీంతో గుర్తింపు లేని పాఠశాలల విద్యార్థులకు ప్రైవేటు అభ్యర్థులుగా పదో తరగతి బోర్డు పరీక్ష రాసే అవకాశం ఉండదు. అలాగే గుర్తింపు లేని పాఠశాలలకు చెక్ పెట్టేందుకు పదో తరగతి పరీక్షల దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో స్వీకరించాలని సర్కారు నిర్ణయించింది. ఈ విధానంలో షెడ్యూల్ను శుక్రవారం ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. దీని ప్రకారం విద్యార్థులు వచ్చే నెల 5లోగా అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. కాగా, ఇప్పటివరకు ఆఫ్లైన్(ఐసీఆర్ షీట్) పద్ధతిలో దరఖాస్తులను స్వీకరించిన అధికారులు.. ఈ ఏడాది ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ పద్ధతిలోనూ దరఖాస్తులను తీసుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముందుగా http://bsetelangana.org వెబ్సైట్లో ఎస్ఎస్సీ పరీక్షల లింక్ను తెరిచి.. తమ పాఠశాల కోడ్ను నమోదు చేయగానే లాగిన్ కాగలుగుతారు. ఆ తర్వాత తమ పాఠశాల విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో సమర్పించవచ్చు. అయితే, ప్రైవేటు పాఠశాలల విషయంలో మాత్రం విద్యాశాఖ కట్టుదిట్టంగా వ్యవహరించనుంది. ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్లు తొలుత స్థానిక ఉప విద్యాశాఖాధికారి(డీఈవో)ని సంప్రదించి తమ పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. పాఠశాలకు గుర్తింపు ఉందా లేదా, స్కూళ్లు నడుస్తున్నాయా లేదా వంటి విషయాలను డీఈవోలు పరిశీలిస్తారు. అంతా సవ్యంగా ఉంటే, సంబంధిత ప్రైవేటు పాఠశాల గుర్తింపు సంఖ్య, పదో తరగతి సెక్షన్ల సంఖ్య, విద్యార్థుల సంఖ్యను వెబ్సైట్లో డీఈవో నమోదు చేస్తారు. తర్వాతే ఆ పాఠశాల పేరుతో పరీక్షల దరఖాస్తులను సమర్పించేందుకు లాగిన్ అకౌంట్ తెరుచుకుంటుంది. దీని కోసం ఎస్ఎస్సీ బోర్డు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. ఈ ఆన్లైన్ విధానంపై అవగాహన కల్పించేందుకు వెబ్సైట్లో ‘డెమో’(దరఖాస్తులను నింపే విధానం నమూనా)ను చూసే వీలు కల్పించింది. రెగ్యులర్ వితౌట్ వొకేషనల్, ఫెయిల్డ్ ఇన్ జూన్ 2014, రెగ్యులర్ విత్ వొకేషనల్, ఓఎస్ఎస్సీ రెగ్యులర్, ఓఎస్ఎస్సీ ప్రైవేటు, ఫెయిల్డ్ ప్రియర్ టు 2014 పేర్లతో ఆరు వేర్వేరు కేటగిరీల కింద సంబంధిత విద్యార్థుల దరఖాస్తులను సమర్పించేలా ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లింక్ను క్లిక్ చేయగానే ఈ ఆప్షన్లు కంప్యూటర్ తెరపై ప్రత్యక్షం కానున్నాయి. ఇక ఓపెన్ స్కూల్ పరీక్షలే దిక్కు గుర్తింపు లేని పాఠశాలల విద్యార్థులు, బడికి వెళ్లని పిల్లలకు ప్రైవేట్గా బోర్డు పరీక్షలు రాసే అవకాశం లేకపోవడంతో ఇకపై అలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఓపెన్ స్కూల్ విధానమే దిక్కు కానుంది. గుర్తింపు లేని, ఇతర స్కూళ్లకు అనుబంధంగా మారి తమ విద్యార్థులతో పరీక్షలు రాయించేందుకు ఇకపై అవకాశం ఉండదు. దరఖాస్తుల పరిశీలనలోనే అలాంటి వాటిని గుర్తించి ఏరివేస్తారు. ప్రైవేట్ స్కూళ్ల ప్రవేశాల రిజిస్టర్, హాజరు పట్టికలో విద్యార్థుల పేర్లను పరిశీలించిన తర్వాతే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని శుక్రవారం జిల్లా విద్యా శాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి.మన్మథరెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అయితే, గతంలో ప్రైవేటుగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మాత్రమే ఈసారి మళ్లీ ప్రైవేటుగా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. -
పది ఫలితాల్లో అ‘ద్వితీయం’
వైవీయూ, న్యూస్లైన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తీర్ణతా శాతంలో రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచారు. గురువారం విడుదలైన ఫలితాల్లో జిల్లా 95.14 శాతం ఫలితాలతో రాష్ట్రంలో రెం డోస్థానం, రాయలసీమలో ప్రథమస్థా నం కైవసం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలకు 32,898 మంది హాజరుకాగా 31,300 మంది ఉత్తీర్ణులై 95.14 శా తం ఫలితాలు సాధించారు. బాలుర విభాగంలో 16,893 మందికి గాను 15, 941 మంది ఉత్తీర్ణులై 94.36 శాతం ఫలి తాలు సాధించారు. అలాగే బాలికల విభాగంలో 16,005 మందికి గాను 15,359 మంది ఉత్తీర్ణత సాధించి 95.96 శాతం ఫలితాలతో బాలుర కంటే పైచే యి సాధించారు. అయితే గత సంవత్స రం రాష్ట్రస్థాయిలో 3వ స్థానం పొందిన జిల్లా ఈ సారి ఒక మెట్టుపెకైక్కి రెండో స్థానంలో నిలిచింది. అదే విధంగా ఉత్తీర్ణతా శాతంలో సైతం గతంలో కంటే రెం డు శాతం మెరుగుదల సాధించడం విశే షం. కాగా రాయలసీమలో కర్నూలు జి ల్లా 93.23 శాతం (5వ స్థానం), చిత్తూరు జిల్లా 92.8 శాతం (7వ స్థానం), అనంతపురం జిల్లా 87.62 (17వ స్థానం) శాతం ఫలితాలతో తర్వాత స్థానంలో నిలిచా యి. ఫలితాల కోసం ఇంటర్నెట్ కేంద్రాల వద్ద గురువారం ఉదయం నుంచి విద్యార్థుల కోలాహలం కనిపించింది. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. వీటితో పాటు జిల్లాలోని 23 కస్తూర్బా పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించడం గమనార్హం. అలా గే సీమాంధ్రలో ఉన్న ఒకే ఒక్క వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ సైతం 100 శాతం ఫలితాలు సాధించి అటు క్రీడల్లోనూ, ఇటు చదువులోనూ తమకు తిరుగులేదని చాటిచెప్పింది. కడపలో రీవెరిఫికేషన్ సౌకర్యం.. పదో తరగతి పరీక్షలకు సంబంధించిన రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకునే వారు 500 రూపాయల డీడీ తీసి హైదరాబాద్ డీజీ ఆఫీసుకు, రీవెరిఫికేషన్ కోసం వెయ్యి రూపాయల డీడీ తీసి కడప డీఈఓ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 16 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే వెలువడిన ఫలితాలకు సంబంధించిన మార్కుల జాబితాలు పది రోజుల్లో రానున్నట్లు అధికారులు తెలిపారు. డీఈఓ అంజయ్య ఏమంటున్నారంటే... సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగిన సమయంలోనూ పదోతరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చూపిన ఆదరణ, ప్రత్యేక తరగతుల నిర్వహణే నేటి ఫలితాలకు నాంది. జిల్లా వ్యాప్తంగా ఏడాది పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పడ్డ కష్టానికి ఫలితం లభించిం ది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్తో పాటు సందేహాలు నివృత్తి చేశాం. కలెక్టర్ కోన శశిధర్ సూచనలు, సలహాలు పాటించాం. మానిటరింగ్ టీంలను ఏర్పాటు చేసి పర్యవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు నిర్వహిస్తూ వచ్చాం. వీటితో పాటు డీసీఈబీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేసిన నిపుణులతో రూపొందించిన స్టడీమెటీరియల్ ఉపయోగపడింది. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులందరికీ ప్రత్యేక అభినందనలు. -
చాలా 'ఓపెన్' టెన్త్ ఎగ్జామ్స్
-
నేటి నుంచి టెన్త్ పరీక్షల వేళల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 7 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షల వేళలను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇది వరకే మార్పు చేసింది. కొత్త వేళలు నేటి నుంచి జరిగే పరీక్షలకు వర్తిస్తాయి. సోమవారం నుంచి ఈనెల 17 వరకు జరిగే అన్ని పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతాయి. మొదట 7, 12 తేదీల్లో నిర్వహించే పరీక్షలను మాత్రమే ఉదయం 11 గంటలకు ప్రారంభించాలని, మిగతా పరీక్షలు ఉదయం 9:30 గంటలకే ప్రారంభించాలని భావించింది. అయితే విద్యార్థులు అనవసరంగా గందరగోళానికి గురవుతారనే ఉద్దేశంతో 7వ తేదీ నుంచి జరిగే అన్ని పరీక్షల వేళలను మార్పు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. -
అన్నా.. పోతివా!
దేవరకద్ర, న్యూస్లైన్ : ఆ చెల్లి పదో తరగతి పరీక్షలు రాస్తోంది.. తిరిగి ఇంటికి క్షేమంగా తీసుకొద్దామని బైక్పై బయలుదేరిన ఆ అన్నను మృత్యువు కబళించింది.. విషయం తెలిసిన చెల్లీ తన వేదనను దిగమింగుకుని అలాగే పరీక్ష రాసిం ది.. ‘అన్నా.. ఇక నన్ను చూడకుండా నే తిరిగిరాని లోకాలకు చేరుకుంటివా..’ అని సోదరి గుక్కతీసుకోకుండా రోదించింది. దీంతో ఆ కుటుంబంలో విషా దం అలుముకుంది.. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెద్దరాజమూర్కు చెందిన కృష్ణయ్య, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్కుమార్ (17) దేవరకద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాడు. ప్రస్తుతం కూతురు అఖిల మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తోంది. ఎప్పటిలాగే గురువారం ఉద యం తొమ్మిది గంటలకు పరీక్ష రాయడానికి ముందుగానే బస్సులో వెళ్లింది. అనంతరం ఇంటికి తిరిగి తీసుకొద్దామని బైక్పై అన్న దేవరకద్రకు చేరుకున్నాడు. అంతలోనే స్నేహితులు మైబు, మోహన్ కనిపించడంతో వారిని బైకుపై ఎక్కించుకుని పట్టణంలోకి వచ్చాడు. తరువాత తిరిగి పరీక్ష కేంద్రానికి వెళుతుండగా పాఠశాలకు కొద్దిదూరంలో ఎదురుగా వచ్చిన హైదరాబాద్ డిపో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతనితో పాటు మైబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థాని కులు వెంటనే క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలి స్తుండగా మార్గమధ్యంలోనే అనిల్కుమార్ మృతి చెందా డు. ఈ సంఘటన జరిగినప్పుడు చెల్లెలు అఖిల పరీక్ష రాస్తోది. మధ్యాహ్నం విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరయింది. ‘నీకోసం వస్తూ అన్నయ్య.. మనకు కనిపించని లోకాలకు వెళ్లాడు..’ అని తల్లి చేసిన రోదనలు అక్కడివారిని కంటతడి పెట్టించాయి. ఈ విషయమై పోలీసులకు సమాచారమివ్వడంతో ఎస్ఐ రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం అనిల్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. -
నేటి నుంచి ‘పది’ పరీక్షలు
నల్లగొండ అర్బన్, న్యూస్లైన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 250 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెంటర్లలో నంబర్లు వేయడం, ఇతర ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో పరీ క్షలకు హాజరవుతున్న 53,044 మంది విద్యార్థుల్లో రెగ్యులర్ విద్యార్థులు 48562 మంది ఉండగా 4482 మంది ప్రైవేట్ అభ్యర్థులున్నారు. అరగంట ముందే సెంటర్కు చేరుకోవాలి రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు నిర్ణీత సమయానికంటే అర్ధగంట ముందే సెంట ర్కు చేరుకోవాలి. పరీక్షల షెడ్యూల్ ప్రకారం ఒకేషనల్, తరగతి స్పెషల్ సబ్జెక్టుల వారికోసం ఏప్రిల్ 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కానీ జిల్లా నుంచి హాజరయ్యే విద్యార్థులంతా సాధారణ సబ్జెక్టుల వారే కావడం వల్ల ఏప్రిల్ 11వ తేదీన జరిగే సోషల్ పేపర్-2తో పరీక్షలు పూర్తవుతాయి. 14 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 14 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. 250 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 250 మంది డిపార్టుమెంటల్ అధికారులు, ఐదుగురు అదనపు డీఈఓలు, 118 మంది స్టోరేజీ పాయింట్ కస్టోడియన్లు, 28 మంది పేపర్ కస్టోడియన్లు, 4600 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణలో భాగస్వాములవుతున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా, ఫిర్యాదులు, సలహాల కోసం 08682-244208కు ఫోన్ చేయవచ్చు. సహాయకుల ఏర్పాటు జిల్లాకేంద్రంలో అంధులు, శారీరక వైకల్యంతో రాయలేని వారి కోసం 20 మంది స్క్రైబ్స్ (సహాయకులు)ను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇతర చోట్ల ఎవరైనా అంధులు, శారీరక వికలాం గులు ఉన్నట్లయితే సంబంధిత కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లను సంప్రదించి సహాయకులను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సహాయకులుగా తొమ్మిదో తరగతి వారిని మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. -
విజయీభవ..
నేటి నుంచి టెన్త్ పరీక్షలు వైవీయూ, న్యూస్లైన్: జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 156 పరీక్షా కేంద్రాల్లో 33,232 మంది రెగ్యులర్ 1769 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను పర్యవేక్షించడానికి స్టేట్ అబ్జర్వర్, జిల్లా అధికారులు, స్క్వాడ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మంచినీరుతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. పరీక్ష కేంద్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పరీక్ష సమయం ఉదయం 9.30 గంటలకు కాగా అర్ధగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఓఎంఆర్ షీట్ను జాగ్రత్తగా నింపాలి. ఇన్విజిలేటర్ బుక్లెట్ ఇచ్చిన వెంటనే బోర్డు వారిచ్చే స్టిక్కర్, పిన్నులు, ఇన్విజిలేటర్ సంతకం ఉండేలా సరిచూసుకోవాలి. చేతిరాత ఆకట్టుకునేలా ఉంటే మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. చేతిరాత బాగుండేలా దృష్టిసారించాలి. ప్రశ్నపత్రంలో తొలుత బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధానం తెలియని ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందవద్దు. పది నిమిషాలు ముందే పరీక్ష పూర్తి చేసి సమాధాన పత్రాన్ని సరిచూసుకోవాలి. పరీక్ష పూర్తయిన తర్వాత హాల్టికెట్ మరిచిపోకుండా వెంట తీసుకెళ్లాలి. -
ఏమి చేయాలో ఎలా
‘నా కుమార్తె ఇంటర్, కుమారుడు పదోతరగతి పరీక్షలు రాయాలి. నేను తహశీల్దార్గా పనిచేస్తున్నాను. మా ఆయన పీఆర్ ఏఈ. ఇద్దరం పొద్దున డ్యూటీకి వెళితే సాయంత్రం వస్తాం. కేవలం రాత్రి వేళ ల్లో పిల్లలకు తోడుగా ఉండి, పరీక్షల వేళల్లో సూచనలు చేస్తుంటాం. వరుస ఎన్నికలతో ఎన్నిగంటలకు ఇంటికి వెళతామో.. ఏమో తెలీదు. పిల్లల పరీక్ష టైంలో మేం ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. -ఓ మహిళా తహశీల్దార్ ఆవేదన సాక్షి, కడప: ఉరుమొచ్చి మంగళం మీద పడినట్లుంది ఎన్నికల నిర్వహణ పరిస్థితి. మునిసిపల్, సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక పోరుకు సైరన్ మోగే పరిస్థితి ఉండటంతో రాజకీయవర్గాలతో పాటు అధికార యంత్రాంగంలోనూ ఆందోళన కన్పిస్తోంది. స్థానికసంస్థల పాలకవర్గాలు పూర్తయి నాలుగేళ్లయినా ప్రత్యేకాధికారుల పాలనతో నెట్టుకొచ్చిన ప్రభుత్వ నేతలు బాగానే ఉన్నారని, వారి రాజకీయ ఎత్తుగడల కారణంగా తాము భారం మోయాల్సి వస్తోందని అధికారవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 60రోజుల వ్యవధిలో మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, శాసనసభ, లోక్సభలకు ప్రత్యక్ష ఎన్నికలు, ఎంపీపీ, జెడ్పీచైర్మన్, మునిసిపల్ చైర్మన్కు పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి. రిజర్వేషన్ల ఖరారు నుంచే అధికారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆఘమేఘాలపై ఆదేశాలు రావడంతో రిజర్వేషన్ల నిష్పత్తి, రొటేషన్ విధానంలో ఏమాత్రం తప్పులు దొర్లకుండా చూసేందుకు పదిరోజులుగా తలమునకలవుతున్నారు. ఎన్నికల విధుల్లో 3547 మంది పోలీసులు: ఎన్నికల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఎస్పీ అశోక్తో పాటు 3547 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. వీరిలో 3067 మంది జిల్లాపోలీసులు ఉన్నారు. అలాగే నాలుగు కంపెనీలకు చెందిన 480 మంది కేంద్ర పోలీసులు ఉన్నారు. వీరంతా మూన్నెళ్లపాటు అవిశ్రాంతంగా భద్రతను పర్యవేక్షించనున్నారు. బెటాలియన్లోని పోలీసులైతే ఇతర ప్రాంతాలకు వెళ్లి రోజులతరబడి భార్యాపిల్లలకు దూరంగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. ఇంట్లో తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంకేదైనా ఇతర కారణాలు ఉన్నా నామినేషన్ దాఖలు చేసేరోజు నుంచి ఫలితాలు ప్రకటించేంత వరకూ...ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికలకోడ్ అమల్లో ఉన్నంత వరకూ డ్యూటీకే అంకితం కావాల్సిన అనివార్యపరిస్థితి. ఇప్పటికే నెలరోజులు సెలవులు బంద్: ఎన్నికల ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతున్నదో...రాష్ట్ర విభజన ప్రక్రియ అంతే వేగంగా జరుగుతోంది. శాఖలకు సంబంధించిన విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇప్పటికే అధికారులకు నెలరోజులపాటు సెలవులను బంద్ చేసినట్లు సీఎస్ మహంతి ప్రకటించారు. దీంతో పాటు ఎన్నికల సంఘం ఆదేశాల అమలుపై రోజువారీ సమీక్షలు, కోడ్పర్యవేక్షణ, నిబంధనలు పాటించేలా అభ్యర్థుల్లో అవగాహన పెంచడం, ఓటర్లజాబితా పునఃప్రచురణ, పోలీస్బందోబస్తు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ లాంటి విధుల్లో నిమగ్నం కావాలి. దాదాపు మే ఆఖరు వరకూ సాగే ఈ క్రతువులో అధికారయంత్రాంగం రోజూ పరీక్ష ఎదుర్కోవాలి. తప్పని సరి తద్దినంలా ఎన్నికలు: 2010 సెప్టెంబరు 29తో మునిసిపల్ పాలకవర్గాల గడువు ముగిసింది. తర్వాత పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్ల గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం వీటి ఎన్నికలు వాయిదా వేస్తోంది. వైఎస్సార్కాంగ్రెస్పార్టీని ఎదుర్కోలేకే అన్నిరకాల ఎన్నికలను వాయిదా వేసిందనేది బహిరంగ రహస్యం. రిజర్వేషన్ల అంశంలో వివాదాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం వాయిదా పర్వాన్ని కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికలు సంబంధించి ప్రభుత్వమూ పరోక్షంగా స్టేకు కారణమైంది. గతేడాది కాలంగా ఉద్యమాలు, రాష్ట్ర విభజన వ్యవహారం తెరపైకి వచ్చింది. కారణాలు ఏదైనా అధికారపార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నందునే ఎన్నికలు వాయిదాపడ్డాయనేది నిర్వివాదాంశం. ఎప్పటికప్పుడు తాము ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతూనే ఉన్నా ప్రభుత్వమే లోపాయికారిగా వాయిదా మంత్రాన్ని పఠించింది. ఎట్టకేలకు న్యాయస్థానాల జోక్యంతో తప్పనిసరి తద్దినంలా ముహూర్తం నిర్ణయించింది. అన్నీ కలిపి స్వల్ప వ్యవధిలో నిర్వహించాల్సి రావడంతో యంత్రాంగం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. -
‘టెన్త్’ ఫీజు గడువు వచ్చే నెల 21
ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 వరకు చెల్లించొచ్చు సాక్షి, హైదరాబాద్: మార్చి 2014లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వచ్చే నెల 21లోగా పరీక్ష ఫీజును సంబంధిత ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ. 125.. మూడు అంతకంటే తక్కువ సబ్జెక్టుల్లో పరీక్షలు రాయాలనుకునేవారు రూ. 110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో పరీక్ష రాయాలనుకునే వారు రూ. 125 ఫీజును చెల్లించాలన్నారు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు, ఇతర రాష్ట్ర, ఇతర దేశ విద్యార్థులు నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించవచ్చన్నారు. ఇక రూ. 50 ఆలస్య రుసుముతో నవంబర్ 4 వరకు.. రూ. 200 ఆలస్య రుసుముతో నవంబర్ 18 వరకు.. రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ప్రైవేటుగా పరీక్షలు రాసే వారు హాజరు మినహాయింపు ఫీజుగా రూ. 650 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు రూ. 650 స్పెషల్ ఫీజు చెల్లించాలని, వారు కచ్చితంగా ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో (www.bseap.org)డీఈవో కార్యాలయాల్లో పొందవచ్చని పేర్కొన్నారు. కాగా.. వొకేషనల్ అభ్యర్థులు రెగ్యులర్ ఫీజుకు అదనంగా రూ. 60 చెల్లించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెగ్యులర్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ. 24 వేలు, గ్రామాల్లో రూ.20 వేలలోపు ఉంటే ఫీజు మినహాయింపు పొందవచ్చని తెలిపారు.